Kamareddy
-
ఇలాంటి టీచర్.. స్కూల్కి ఒక్కరుంటే చాలు..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: బడి ముగిశాక ఏ ఉపాధ్యాయుడైనా ఇంటికి వెళ్తారు.. కానీ ఒక ప్రధానోపాధ్యాయుడు పాఠశాల తనది.. పిల్లలను కుటుంబసభ్యుల్లా భావిస్తున్నారు. పాఠశాలలోనే ఉంటూ.. విద్యార్థుల ఇళ్లకు రోజూ వెళ్తూ.. చదువును పర్యవేక్షిస్తూ.. అనుక్షణం వారి ఉన్నతికి కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే కామారెడ్డి జిల్లా (Kamareddy District) బీబీపేట టీఎస్ఎన్ఆర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ మూల రవీంద్రారెడ్డి. 2023 సెప్టెంబర్ 25న వరంగల్ జిల్లా (Warangal District) నుంచి బదిలీపై రవీంద్రారెడ్డి వచ్చారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అదే బడిలో నివసిస్తున్నారు. రెండు రోజుల సెలవులు (Holidays) వచ్చినప్పుడే.. సొంతూరు వరంగల్కు వెళ్తారు. స్కూళ్లో మొత్తం 610 మంది విద్యార్థులు ఉన్నారు. బడిలోనే ఉంటూ..పాఠశాల నిర్మించిన సమయంలోనే ఉపాధ్యాయుల కోసం పై అంతస్తులో గదులు నిర్మించారు. హెడ్మాస్టర్ (Head Master) రవీంద్రారెడ్డి అందులోనే ఉంటున్నారు. ఆయన రోజూ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్తారు. వారేం చదువుతున్నారో పరిశీలించి.. తల్లిదండ్రులతో మాట్లాడి వస్తారు. పిల్లలు పాఠశాలకు గైర్హాజరైనా, తక్కువ మార్కులు వచ్చినా తల్లిదండ్రులను పిలిచి మాట్లాడతారు.విద్యార్థులను తీర్చిదిద్దాలన్నదే లక్ష్యంకార్పొరేట్ విద్యాసంస్థలో లేని సౌకర్యాలన్నీ మా పాఠశాలలో ఉన్నాయి. మంచి ఉపాధ్యాయుల బృందం ఉంది. ఆధునిక పద్ధతుల్లో బోధన సాగిస్తున్నాం. పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇంకా మెరుగవ్వాలి. విద్యార్థులను తీర్చిదిద్దడానికి మరింతగా ప్రయత్నిస్తాం. – మూల రవీంద్రారెడ్డి, హెడ్మాస్టర్, బీబీపేట, కామారెడ్డి జిల్లాచదవండి: జగిత్యాలకు ఐకాన్ ఈ ఖిల్లా -
అంకోల్ క్యాంపు సందర్శన
నస్రుల్లాబాద్: మండలంలోని అంకోల్ క్యాంపుతోపాటు బీర్కూర్ మండలంలోని రైతు నగర్ గ్రామాలను బుధవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికారుల బృందం సందర్శించింది. జాతీయ ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక కావడానికి గ్రామంలో చేపట్టిన కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. అంకోల్ క్యాంప్ గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను పరిశీలించి, పనితీరు తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సూర్యకాంత్, సెర్ప్ డీపీఎంలు సుధాకర్, సురేష్, సీ్త్రనిధి ఆర్ఎం కిరణ్, మేనేజర్ మహేందర్, ఏపీఎం గంగాధర్,సీసీ సుజాత,నాగరాజ కుమారి, హన్మండ్లు, మాజీ సర్పంచ్ రాము పాల్గొన్నారు.డ్రగ్స్, మత్తు పదార్థాలపై అవగాహన నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండల కేంద్రంలోని హరిజనవాడలో మంగళవారం డ్రగ్స్ వాడకం, మత్తు పదార్థాల వినియోగంతో కలిగే అనర్థాలపై ఏఎస్ఆర్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ మాటాడారు. డ్రగ్స్, సిగరేట్, మద్యం తాగడంతో కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్స్ వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్, మాల సంఘం అధ్యక్షులు ఉల్లెంగ కిరణ్, రాములు,అల్లం చిన్న బందయ్య తదితరులు పాల్గొన్నారు. పేకాడుతున్న నలుగురి అరెస్ట్ మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి బుధవారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. పేకాడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి వారి నుంచి రూ. 16,510లు, మూడు సెల్ఫోన్లు, మూడు బైకులను సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
యథేచ్ఛగా టేకు చెట్ల నరికివేత
మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఎం), సోమారంపేట, ఎల్లంపేట, రత్నగిరిపల్లి తదితర గ్రామాల పరిధిలో అడవి దట్టంగా ఉండేది. కలప స్మగ్లర్ల వేటుకు అడవంతా ఎడారిగా మారింది. అడవిని విచ్చలవిడిగా నరకడం వలన వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకమైంది. అడవిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్న ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా మండలంలోని ఘన్పూర్ అటవీ ప్రాంతంలో దుండగులు టేకు చెట్లను నరికి తరలించుకుపోయిన ఆనవాళ్లున్నాయి. ఫిర్యాదు చేసినా అధికారులు మిన్నకున్నారు కామారెడ్డి–సిరిసిల్లా రహదారికి అనుకున్న ఉన్న ఘన్పూర్(ఎం) అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనే యధేచ్ఛగా టేకు చెట్లను నరికి తరలించుకుపోతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మిన్నకున్నారని విమర్శలున్నాయి. గత కొన్నేళ్లుగా టేకు చెట్లను నరికి తరలిస్తున్న స్మగ్లర్లను పట్టించుకోకుండా, తరతరాలుగా హక్కు పత్రాలు కలిగి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై కేసులు పెడుతూ వేధిస్తున్నారని పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం దహనసంస్కారాలకు అవసరమైన కలపను తీసుకువెళ్లడానికి అనుమతి ఇవ్వడం లేదని ఘన్పూర్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వనసంరక్షణ సమితులను ఏర్పాటు చేసి అటవీ సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. చోద్యం చూస్తున్న అధికారులుపెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం అటవీ ప్రాంతంలో ప్రతి రోజు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. టేకు కలప నరికితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. దహన సంస్కారాల కోసం తీసుకెళ్లిన కలపను తమ సిబ్బంది స్వాధీనం చేసుకోలేదు. – దివ్య, ఎఫ్ఆర్వో, మాచారెడ్డి -
‘కల్తీ కల్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’
బాన్సువాడ : కల్తీ కల్లు విక్రయిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్ డిమాండ్ చేశారు. బుధవారం బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను ఆయన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్కి, అంకోల్, దామరంచ గ్రామాలకు చెందిన పలువురు కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారని, వైద్యులు ఎప్పటికప్పుడు చికిత్సలు అందించడంతో ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపంతోనే కల్లులో ప్రమాదకరమైన ఆల్ప్రాజోలంను అధిక మోతాదులో కలిపి విక్రయిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత శాఖ అధికారులు కల్తీ కల్లు బాధ్యులపై ఏ విధమైన చర్యలు చేపట్టారో తెలపాలన్నారు. భవిష్యత్లో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజు, నాయకులు చీదరి సాయిలు, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, అంకోల్ గ్రామాల్లో కల్తీ కల్లు కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కల్లులో ఆల్ప్రాజోలం అనే మత్తు పదార్థం కలపడం వల్ల 69 మంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. ఈ కల్లు విక్రయించిన కేసులో దుర్కి గ్రామానికి చెందిన లక్ష్మాగౌడ్ను ప్రధాన నిందితుడిగా గుర్తించామన్నారు. నిందితుడిని జుడీషియల్ రిమాండ్కు తరలించామన్నారు. ఆయన వెంట ఎస్సై లావణ్య, కానిస్టేబుల్స్ శ్రీనివాస్, హరిచంద్ పాల్గొన్నారు.ఒకరి రిమాండ్ -
మురికికూపంగా బస్టాండ్
బిచ్కుంద(జుక్కల్) : మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ప్రతిరోజు వేల మంది ప్రయాణిస్తారు. అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారు. బస్టాండ్ ఆవరణలో మురికి నీరు చేరి భరించలేని దుర్గంధం వ్యాపిస్తోంది. మురికిలో పందులు పడుకుంటున్నాయి. బస్టాండ్ పర్యవేక్షణ చూస్తున్న ఆర్టీసీ అధికారులు మురికిని చూస్తున్నప్పటికీ తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మురికితో దుర్వాసన వస్తుందని, ఇబ్బందులు పడుతున్నామని పంచాయతీ, ఆర్టీసీ అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ప్రయాణికులు, చుట్టుపక్కల దుకాణాల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్లోని స్టాల్స్ ద్వారా ఆర్టీసీకి ఆదాయం వస్తున్న కనీస సౌకర్యాల కల్పించడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బస్టాండ్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. పట్టించుకోని ఆర్టీసీ, బిచ్కుంద జీపీ అధికారులు ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -
దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, అధికారులు వెరిఫికేషన్ చేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ధరణి, ఎల్ఆర్ఎస్, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశీలనలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే జిల్లా పౌర సరఫరాల అధికారిని సంప్రదించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఉన్నతాధికారులకు సమర్పించాలన్నారు. అర్హత కలిగిన వారికి మార్క్ అవుట్ ఇవ్వాలన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు స్వయం సహాయక బృందాల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారుల రిమార్కులను నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. పునాది వరకు నిర్మించుకున్న వారి రిపోర్టులు, ఫొటోలు యాప్లో అప్లోడ్ చేస్తే మొదటి విడత నిధులు విడుదల చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రతి మండలంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశామన్నారు. హెల్ప్డెస్క్ సిబ్బంది దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఆన్లైన్ చేసిన అనంతరం దరఖాస్తులను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. 15 వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని అధికారులకు సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆర్డీవో వీణ, డీఎస్వో మల్లికార్జున్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు త్వరగా జారీ చేయాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
మత్తు పదార్థాలపై నిఘాలో నిర్లక్ష్యమేల?
బాన్సువాడ : నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో కల్తీ కల్లు 90 మంది ప్రాణాలపైకి తెచ్చింది.గ్రామానికి చెందిన సురేందర్గౌడ్ అనే వ్యక్తి ఎలాంటి అనుమతి లేకుండా కల్లు డిపో కొనసాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన సురేందర్గౌడ్ అనే వ్యక్తికి హైదరాబాద్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో మత్తు పదార్థాలువిక్రయించే వారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి సారి మత్తు పదార్థాలు ఒకే చోట నుంచి తీసుకొచ్చేవాడని తెలిసింది. ఈ మధ్య తక్కువ ధరకు మత్తు పదార్థాలులభిస్తున్నాయని ఆశపడి మత్తు పదార్థాలను కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు తెలిసింది. సురేందర్గౌడ్ తన కల్లు డిపోలో ఇటీవల తక్కువ ధరకు కొనుగోలు చేసిన మత్తు పదార్థాలను కల్లులో కలిపి టీఎఫ్టీ లైసెన్సులు కలిగిన కల్లు దుకాణాలకు కల్లు సరఫరా చేశాడు. మత్తు మందు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో పాటు మోతాదుకు మించి మత్తు మందును కల్లులో కలిపారు. దీంతో ఆ డిపో పరిధిలో ఏఏ దుకాణాలకు కల్లు సరఫరా చేశారో ఆయా గ్రామాల్లో కల్తీ కల్లు సేవించిన వారందరూ ఆస్పత్రి పాలయ్యారు. సురేందర్గౌడ్ గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన సమీప బంధువైన మరొక వ్యక్తికి ఇదే మందు ఇచ్చాడు. సదరు వ్యక్తి కల్లులో దుర్కి కల్లు డిపోలో కలిపిన తక్కువ ధరకు తెచ్చిన మత్తు మందు కలిపాడు. చుట్టూ పక్కల ప్రజలు గౌరారంలో జాతరకు వచ్చి ఈకల్లు సేవించి అస్వస్థతకు గురయ్యారు. కల్తీ కల్లు సేవించిన బాధితులు బాన్సువాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేందర్గౌడ్ అనే వ్యక్తి మత్తు మందు ఎక్కడ కొనుగోలు చేశాడనే కోణంలో ఆబ్కారీ శాఖ విచారణ చేపట్టింది. స్థానిక అబ్కారీశాఖ అధికారులు ఏంతెలియదన్నట్లు వ్యవహారిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుర్కి కల్లు డిపోలో కలిపిన మతు ్త మందే గౌరారం గ్రామానికి.. -
మద్యం తాగొద్దంటే కత్తితో పొడుచుకున్నాడు
ఖలీల్వాడి: నిత్యం మద్యం తాగివస్తే కుటుంబ పోషణ ఎలా గడుస్తుందని భార్య అడగడంతో భర్త కత్తితో పొడుచుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. రెండో టౌన్ ఎస్సై యాసీన్ ఆరాఫత్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మద్పుర కాలనీకి చెందిన షేక్ రఫత్ (43), రేష్మాబేగం దంపతులు. రఫత్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. నిత్యం మద్యం సేవిస్తే ఆటో ఫైనాన్స్, పిల్లల చదువుతోపాటు కుటుంబం ఎలా గడుస్తుందని రఫత్ను మంగళవారం భార్య ప్రశ్నించింది. దీంతో ఇంట్లో ఉన్న మామిడికాయలు కోసే కత్తితో రఫత్ పొడుచుకున్నాడు. గమనించిన భార్య జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ రఫత్ బుధవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఒంటరి జీవితంపై విరక్తితో మహిళ..దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన కొత్తపల్లి మల్లవ్వ (52) మంగళవారం గ్రామ శివారులోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. మల్లవ్వ భర్త ఎల్లయ్య 2001 నుంచి కనిపించడం లేదు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూతురికి పెళ్లి చేయగా కుమారుడు నరేశ్ ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లాడు. అప్పటి నుంచి మల్లవ్వ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. కుటుంబీకులు ద గ్గర లేకపోవడంతో ఒంటరి జీ వితంపై విరక్తి చెంది మంగళవారం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని బుధవారం చెరువులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్రవంతి వివరించారు. కుటుంబ కలహాలతో ఒకరు.. ఇందల్వాయి: చంద్రాయన్పల్లి గ్రామానికి చెందిన తూర్పు రాజన్న (48) కుటుంబ లహాలతో మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మనోజ్ తెలిపారు. రాజన్న నెల రోజుల క్రితమే గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చాడని, ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు పేర్కొన్నారు. మృతుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని, భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కాంగ్రెస్ పాలనలో దిగజారిన ఆర్థిక స్థితి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయం వృద్ధిరేటులో దేశంలోనే మొదటి స్థానంలో ఉంటే, రేవంత్రెడ్డి పాలనలో 11వ స్థానానికి దిగజారిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. జీఎస్డీపీ వృద్ధి రేటులో మూడో స్థానంనుంచి 14వ స్థానానికి పడిపోయిందన్నారు. బుధవారం సదాశివనగర్ మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఒక్కడిగా బయలుదేరి కోట్లాది మంది ప్రజలను కదిలించి రాష్ట్రాన్ని సాధించడంతో పాటు పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారన్నారు. 24 గంటల కరెంటు, ఇంటింటికీ నల్లా నీళ్లు అందించారన్నారు. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు దళారుల బెడద తప్పించామన్నారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఐదు వందల రోజులైనా అమలు చేయలేదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.జిల్లా నేతలతో సమీక్షవరంగల్ సభను విజయవంతం చేయడానికి ప్రశాంత్రెడ్డి జిల్లాలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కామారెడ్డి నియోజక వర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధేలతోనూ సమావేశమై చర్చించారు.వరంగల్ సభకు భారీగా తరలిరావాలిగులాబీ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తై 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్లో సభ నిర్వహించనున్నట్లు ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఆ సభకు కామారెడి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. సమావేశంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నేతలు రాజేశ్వర్రావ్, నర్సింలు, మహేందర్రెడ్డి, కపిల్రెడ్డి, దశరథ్రెడ్డి, మోయినొద్దీన్ తదితరులు పాల్గొన్నారు. హామీల అమలును విస్మరించారు ప్రభుత్వంపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శలు -
50 పడకల ఆస్పత్రిగా దోమకొండ సీహెచ్సీ
● జీవో జారీ చేసిన ప్రభుత్వం కామారెడ్డి టౌన్: ఎట్టకేలకు దోమకొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అప్గ్రేడ్ అయ్యింది. ఈ ఆస్పత్రిని 30 పడకల నుంచి 50 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూ మంగళవారం జీవో జారీ చేశారు. మొదట వంద పడకల ఆస్పత్రిగా ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే ప్రభుత్వం మాత్రం 50 పడకల ఆస్పత్రినే మంజూరు చేసింది. నూతన ఆస్పత్రి భవనం సివిల్ వర్కులు, పరికరాల కోసం ఆర్థిక శాఖ ఆమోదంతో రూ. 22 కోట్లను మంజూరు చేశారు. ‘ఫిర్యాదుదారులు పూర్తి వివరాలు ఇవ్వాలి’ కామారెడ్డి క్రైం: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు తమ పూర్తి వివరాలు ఇవ్వాలని ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. దరఖాస్తులో తమ పూర్తి చిరునామా, సెల్ఫోన్ నంబర్ తప్పనిసరిగా రాసి ఇవ్వాలని పేర్కొన్నారు. తద్వారా ఇచ్చిన ఫిర్యాదు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నది, ఏ అధికారి విచారణ చేస్తున్నారు అనే విషయాలను మొబైల్ నంబర్ ద్వారా పిటిషన్దారులకు అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఫిర్యాదుల విషయంలో పారదర్శకత కోసం ఇది ఉపయోగపడుతుందని వివరించారు. బయోమైనింగ్ యంత్రం ఏర్పాటు కామారెడ్డి టౌన్: క్యాసంపల్లిలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్లో బుధవారం బయోమైనింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు ఈ యంత్రాన్ని మున్సిపల్ నిధులతో కొనుగోలు చేసి ఏర్పాటు చేశారు. పట్టణంలో ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాక ఈ బయోమైనింగ్ యంత్రం ద్వారా తడి– పొడి చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తారు. పర్యావరణ కాలుష్యాన్ని కాపాడేందుకు ఈ బయోమైనింగ్ యంత్రం ఎంతగానో దోహదపడుతుందని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. కోలుకుంటున్న కల్తీ కల్లు బాధితులు గాంధారి: గౌరారం కలాన్లో మంగళవారం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైనవారు కోలుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. మంగళవారం కల్తీ కల్లు తాగినవారిలో 17 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసింది. వారిని అదేరోజు రాత్రి బాన్సువాడ, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. వారందరూ కోలుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. కల్తీ కల్లుకు బాధ్యులైన గ్రామానికి చెందిన శంకర్ గౌడ్, పాపాగౌడ్లపై కేసులు నమోదు చేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
బాలుడి అదృశ్యం.. అరగంటలో గుర్తించిన పోలీసులు
కామారెడ్డి క్రైం: కామారెడ్డి బస్టాండ్లో నాలుగేళ్ల బాలుడు తప్పిపోగా పోలీసులు అరగంటలో గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన వల్లపు నర్సవ్వ తన నాలుగేళ్ల మనువడు ఈశ్వర్ను వెంట తీసుకొని బుధవారం జిల్లా కేంద్రానికి వచ్చి తిరుగు ప్రయాణంలో కొత్త బస్టాండ్కు చేరుకుంది. జ్యూస్ కొనుక్కుని వస్తానని బస్టాండ్లో మనువడిని కూర్చోబెట్టి పక్కనే ఉన్న స్టాల్కు వెళ్లింది. 5 నిమిషాల తర్వాత వచ్చి చూడగా బాలుడు కనిపించలేదు. ఆందోళనకు గురైన నర్సవ్వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదే ప్రాంతంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ శిరీష, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి బాలుడి ఆచూకీ కోసం గాలించారు. అరగంట తర్వాత అశోక్నగర్ చౌరస్తా వద్ద బాలుడిని గుర్తించారు. పోలీస్స్టేషన్కు తీసుకువచ్చి బాలుడిని తండ్రి అలకుంట ఎల్లయ్య, అమ్మమ్మ నర్సవ్వకు అప్పగించారు. పోలీసు సిబ్బందిని పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి అభినందించారు. గోశాల నుంచి ఆవుల చోరీ మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ గోశాలలోని రెండు ఆవులను గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి అపహరించారని గోశాల కమిటీ ప్రతినిధులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరికి పాల్పడిన వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ అధ్యక్షుడు సంజయ్ ఎస్సై విజయ్ కొండకు వినతిపత్రం అందజేశారు. -
వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
బీబీపేట/లింగంపేట/తాడ్వాయి : వాహనదారులు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలతో పాటు వాహనాల ధ్రువపత్రాలు ఉంచుకోవాలని బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. తాగి వాహనాలు నడిపిన వారికి జరిమానాలు విధించారు. లింగంపేట మండలకేంద్రం సమీపంలోని నల్లమడుగు చౌరస్తాలో ఎస్సై వెంకట్రావు వాహనాల తనిఖీ నిర్వహించారు. హెల్మెట్ ధరించని వాహన చోదకులకు జరిమానా విధించినట్లు తెలిపారు.తాడ్వాయిలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించని పలువురికి జరిమానా విధించినట్లు తెలిపారు. మద్నూర్ మండలం మేనూర్ మోడల్ స్కూల్లో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి పోలీసు కళాబృందం సభ్యులు సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
బస్సులు రావడం లేదని రోడ్డెక్కారు
రామారెడ్డి : మండలంలోని మద్దికుంట గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదని బుధవారం మద్దికుంట మర్రి వద్ద విద్యార్థులు, గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో గ్రామానికి ఆర్టీసీ బస్సులు ఏడు ట్రిప్పులు వచ్చేవని, ప్రస్తుతం ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు రెండు ట్రిప్పులు మాత్రమే వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన విధంగా గ్రామానికి ఏడు ట్రిప్పులు నడిపించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో కామారెడ్డి వైపు వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి. రామారెడ్డి పోలీసులు గ్రామస్తులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. ఈవిషయమై ఆర్టీసీ డీఎం కరుణశ్రీని ‘సాక్షి’ వివరణ కోరగా బస్సులను తిరిగి పునరుద్ధరిస్తామని గ్రామస్తులకు తెలియజేశామని తెలిపారు. ధర్నాకు దిగిన మద్దికుంట గ్రామస్తులు ట్రిప్పులు తగ్గించారని ఆగ్రహం -
కాంట్రాక్టు అధ్యాపకుల నిరసన
భిక్కనూరు: విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు అధ్యాపకులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యునివర్సీటీ సౌత్క్యాంపస్లో కాంట్రాక్టు అధ్యాపకులు మంగళవారం విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలను నిర్వహించారు.జీవో 21 తీసుకవచ్చి కాంట్రాక్టు అధ్యాపకుల పొట్ట కొట్టడం ఎంత వరకు సమంజసమని కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం రాష్ట్ర కో–ఆర్డినేషన్ కమిటి సభ్యుడు డాక్టర్ ఎస్.నారాయణ అన్నారు. సౌత్ క్యాంపస్ భవనం ముందర ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు డాక్టర్ యాలాద్రి, సునీత, రమాదేవి, నర్సయ్య, సరిత, నిరంజన్శర్మ, శ్రీకాంత్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మేడిపల్లి అటవీ శివారులో జరిగిన అమీనాబేగం అనే మహిళ హత్యకేసులో నిందితుడు కేతావత్ పీరాజీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్కుమార్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. పీరాజీ మేడిపల్లి గ్రామ పరిసరాల్లో తిరుగుతుండగా అరెస్టు చేసి పోలీస్టేష్న్కు తీసుకొచ్చామన్నారు. అతడిని విచారించగా అమీనా బేగంపై దాడి చేసినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు. మహిళపై దాడి చేసిన కర్రను స్వాధీనం చేసుకొని పీరాజీని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. గాంధారి ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు. -
అంబేడ్కర్ జయంతి బ్రోచర్ ఆవిష్కరణ
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈనెల 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెయూ వీసీ యాదగిరిరావు అన్నారు. ఈమేరకు మంగళవారం తెయూలో కార్యక్రమ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. కార్యక్రమంలో కీలకోపన్యాసం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ లింబాద్రి హాజరవుతున్నారని తెలిపారు. ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఎస్సీ సెల్ డైరెక్టర్ వాణి, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ పాల్గొన్నారు.ఇంటిని కూల్చిన కేసులో నలుగురి రిమాండ్ వేల్పూర్: మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో గత నెలలో బచ్చు గంగాధర్ అనే వ్యక్తి ఇంటిని అక్రమంగా కూల్చిన కేసులో మంగళవారం నలుగురు గ్రామస్తులను రిమాండ్కు పంపినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. మచ్చర్ల నర్సారెడ్డి, ఏనుగు మోహన్రెడ్డి, రిక్క రాజేశ్వర్, ఏనుగు నర్సారెడ్డి లను రిమాండ్కు తరలించామన్నారు. ఈ కేసులో ఇప్పటికే నిజామాబాద్ జైల్లో కొందరు రిమాండ్లో ఉండగా, మరికొంత మంది పరారీలో ఉన్నారని వెల్లడించారు. వృద్ధుడి అదృశ్యం మాచారెడ్డి: ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలోత్ రాజ్య(60) అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు ఎస్సై అనిల్ మంగళవారం తెలిపారు. మార్చి 31న మహారాష్ట్రలోని పౌరాదేవి దర్శనం కోసం వెళ్లిన రాజ్య ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
చెరువులో పడి ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని గండి తండాలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని గండితండాకు చెందిన విస్లావత్ నరేందర్ (43) సోమవారం రాత్రి తన పొలం వద్ద ఉన్న బర్రెలకు నీరు పెట్టడానికి ఇంటి నుంచి వెళ్లాడు. ఈక్రమంలో పొలం పక్కన ఉన్న చెరువులో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈమేరకు మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బావిలో పడి వృద్ధుడు.. కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి శివారులో ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. లింగాపూర్ గ్రామానికి చెందిన చెట్కూరి ఎల్లయ్య (85) కొద్ది రోజులుగా వృద్ధాప్య కారణాలతో మతిస్థిమితం కోల్పోయాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేడు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల గాలించిన ఆచూకీ దొరకలేదు. దేవునిపల్లి శివారులోని బండారి రాజిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న బావిలో ఎల్లయ్య మృతదేహం మంగళవారం తేలింది. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి భార్య మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి.. డిచ్పల్లి: డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి పట్టాలు దాటుతూ రైలు ఢీకొని మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయారెడ్డి మంగళవారం తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతుడు సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉంటాడన్నారు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ దుర్గాప్రసాద్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే పోలీస్ ఫోన్ నంబర్ 8712652591కు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. చికిత్స పొందుతూ ఒకరు.. రెంజల్(బోధన్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై చంద్రమోహన్ మంగళవారం తెలిపారు. వివరాలు ఇలా.. నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన మద్దెల మదారి(41)అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి అత్తగారి ఊరైన రెంజల్ మండలంలోని నీలా గ్రామానికి బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో తాడ్బిలోలి గ్రామం వద్ద వడ్ల బస్తాలను ఢీకొనడంతో కిందపడి గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి బిచ్కుంద(జుక్కల్): వాహదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. బిచ్కుంద అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించి, ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులకు పలు సూచనలు, సలహాలు చేశారు. తల్లింద్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. -
కల్తీ కల్లుతో ప్రయోగాలు!
నిజామాబాద్నాగారం: సంపాదనే ధ్యేయంగా కల్లు వ్యాపారులు ఇష్టారీతిన కల్తీ కల్లు తయారు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్లీ కల్లు తయారు చేయడంలో ప్రయోగాలు చేస్తూ ఏళ్ల తరబడిగా క్లోరోహైడ్రేట్, అల్ప్రాజోలం, డైజోఫామ్ తదితర మత్తు పదర్థాలు వాడుతున్నారు. దీంతో ఆ కల్తీకల్లు తాగిన ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటీవల నస్రూల్లాబాద్ మండలం దుర్కీలో కల్తీకల్లు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. వారిలో కొంతమందిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా, మరికొంతమందిని నిజామాబాద్ జీజీహెచ్కు తరలించారు. 72గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే.. దుర్కిలో కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన వారిలో శివలక్ష్మి, బుజ్జీ, లక్ష్మణ్, నరేష్, తులసవ్వ, అర్వింద్, లచ్చవ్వ, కాశీరాం, రవి, మారుతి, మోహన్, బాలమణి, మధు, నాగర్జున్లు జీజీహెచ్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. బాధితులను వైద్యులు పరీక్షించగా, కల్లు వ్యాపారులు ప్రయోగాలు చేయడానికి యాంటి సైకియాట్రిక్ గ్రూప్స్కు సంబంధించిన కొత్త మందును కలిపినట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే బాధితులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కోలుకోవడానికి 72గంటల సమయం పడుతుందని మంగళవారం తెలిపారు. ఈ కల్తీ కల్లు తాగడం వల్ల బాధితులకు గంటల వ్యవధిలోనే నాలుక దొడ్డుగా మారడం, సిరలు పడిపోవడం, నొప్పులు తదితర వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు వారిని హుటాహుటిన ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కల్తీ వ్యాపారులకు, అక్రమార్కులకు పేదల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని పలువురు మండిపడుతున్నారు. కల్లులో ప్రయోగాలు చేయడంలో ఎవరైనా చనిపోతే రూ. 20వేల నుంచి రూ. 80వేల వరకు కుటుంబ సభ్యులకు ముట్టజెప్పి చేతులు దులుపుకున్న ఘటనలు కోకొల్లాలుగా ఉన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, కల్తీకల్లు విక్రయాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటం దుర్కిలో కల్తీకల్లు తాగి పలువురికి అస్వస్థత జీజీహెచ్లో చికిత్స అందిస్తున్న వైద్యులుమాట్లాడ రాలేదు.. కల్తీకల్లు తాగిన కొద్దిసేపటికే నాలుక దొడ్డుగా అయ్యింది. మాట్లాడటం రాలే దు. సిరలు మొత్తం పడిపోయాయి. మా నాన్న చూసి వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకవచ్చి చికిత్స అందించారు. – అర్వింద్, కల్తీకల్లు బాధితుడు -
గుండెపోటుతో యువకుడి మృతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలం బిక్కనూర్ గ్రామానికి చెందిన సందీప్రెడ్డి(25) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు మంగళవారం తెలిపారు. గ్రామానికి చెందిన సునీత–మహేశ్వర్రెడ్డి దంపతుల రెండో కుమారుడు సందీప్రెడ్డికి పుట్టుకతోనే గుండెకు రంధ్రం ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 2004లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా గుండెకు సర్జరీ చేశారు. 20 ఏళ్ల తరువాత మళ్లీ ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో నాలుగు రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం సోమవారం రాత్రి గుండె పోటు రావడంతో మృతి చెందాడు. -
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తుల వెల్లువ
కామారెడ్డి టౌన్: రాజీవ్ యువ వికాసం పథకానికి పట్టణంలోని అభ్యర్థులు మీసేవా కేంద్రాలలో భారీగా దరఖాస్తు చేసుకుంటున్నా రు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ద రఖాస్తుల స్వీకరణ కేంద్రం ఏర్పాటు చేశా రు. మీ సేవాకేంద్రాలలో దరఖాస్తు చేసుకు న్న వారు మున్సిపల్ కార్యాలయంలో దర ఖాస్తు ఫారాలను సమర్పిస్తున్నారు. ఇప్పటి వరకు 1,500లకుపైగా దరఖాస్తులు వచ్చా యని సిబ్బంది తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువుంది. కామారెడ్డి బార్ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక కామారెడ్డి టౌన్: కామారెడ్డి బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ప్రక్రియ అసోసియేషన్ భవనంలో ఎన్నికల అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగింది. అధ్యక్షుడిగా నంద రమేశ్, ప్రధాన కార్యదర్శిగా బండారి సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా మురళి, సంయుక్త కార్యదర్శిగా మోహన్రెడ్డి, కోశాధికారిగా వేణు ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా సలీం, అగ్రజ్, విఠల్రావు, అన్సార్, యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి తెలిపారు. రేపు బాన్సువాడకు ఎమ్మెల్సీ కవిత రాక బాన్సువాడ : ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం బాన్సువాడకు రానున్నారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. పట్టణంలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించే బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆర్టీసీ సిబ్బందికి ‘ప్రగతి చక్రం’ పురస్కారాలు ఖలీల్వాడి: నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగు లకు మంగళవారం ‘ప్రగతి చక్రం’ పురస్కారాలను అందించామని ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు. ఉత్తమ సిబ్బందికి త్రైమాసిక పురస్కారాలను అందజేశామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం ఎస్ మధుసూదన్, డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్, సూపర్ వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జిల్లాలో మరో 10 సహకార సంఘాలు..
కామారెడ్డి క్రైం: జిల్లాలో మరో 10 వ్యవసాయ సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సంఘాలను పునర్వ్యవస్థీకరించాలని జిల్లా సహకార అభివృద్ధి కమిటీ నిర్ణయించిందన్నారు. మరో 10 సింగిల్ విండోల ఏర్పాటు ప్రతిపాదనలను రాష్ట్ర స్థాయి కమిటీకి పంపిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీఆర్డీవో సురేందర్, డీసీవో రామ్మోహన్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీఏవో తిరుమల ప్రసాద్, డీఎఫ్వో శ్రీపతి తదితరులు పాల్గొన్నారు. -
కోలుకుంటున్న కల్తీ కల్లు బాధితులు
బాన్సువాడ : కల్తీ కల్లు సేవించి అస్వస్థతకు గురై బాన్సువాడ ఆస్పత్రిలో చేరినవారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్య సేవలు అందడంతో వారంతా కోలుకుంటున్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి కల్లు డిపో పరిధిలో ఉన్న కల్లు దుకాణాల్లో సోమవారం కల్తీ కల్లు తాగి 60 మంది ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. కల్తీ కల్లు సేవించిన అరగంటకు మెడలు వంగిపోవడం, నాలుక దొడ్డుగా మారడం, కళ్లు తేలేయడం వంటి లక్షణాలను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ఆస్పత్రికి తీసుకువచ్చారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారు. మెరుగైన వైద్య సేవలు అవసరం అయిన 12 మందిని నిజామాబాద్ జీజీహెచ్కు తరలించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో వైద్యులు అందించిన సేవలతో బాధితులు కోలుకున్నారు. కాగా రోజూ కల్లు తాగుతామని, ఇలా ఎందుకు అయ్యిందో అర్థం కావడం లేదని బాధితులు పేర్కొన్నారు. కల్లులో మత్తు పదార్థాలు ఎక్కువగా కలపడంతోనే ఆ కల్లు సేవించినవారు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైనట్లు తెలుస్తోంది. 23 మందిపై కేసులుబాన్సువాడ : దుర్కి కల్తీ కల్లు ఘటనలో 23 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. సోమ వారం బాన్సువాడ ఎకై ్సజ్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దుర్కి కల్లు డిపోకు సంబంధించిన కల్లు సేవించి 60 మంది అస్వస్థత కు గురయ్యాయరన్నారు. వారినుంచి నార్కొటిక్ బృందం శాంపిల్స్ సేకరించిందని, రిపోర్టు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటా మని పేర్కొన్నారు. దుర్కిలో అనుమతి లేకుండా ఉడతల సురేందర్గౌడ్ అనే వ్యక్తి కల్లు డిపో కొనసాగిస్తున్నారని, ఈ కల్లు డిపో నుంచి అంకోల్, దుర్కి, బీర్కూర్ మండలం దామరంచ గ్రామాలకు కల్లు సరఫరా చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఆయా గ్రామాల్లో 18 టీఎఫ్టీ లైసెన్సులు కలిగి ఉన్నారన్నారు. ఆ లైసెన్సు కలిగిన కల్లు దుకాణాలకు దుర్కి కల్లు డిపో నుంచి కల్లు సరఫరా చేస్తున్నారన్నారు. 18 టీఎఫ్టీ లైసెన్సులను రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. దుర్కిలో అనుమతి లేకుండా డిపో కొనసాగిస్తు న్న సురేందర్గౌడ్, ఆయన తండ్రి లక్ష్మాగౌడ్, మేనల్లుడు ఆకాష్గౌడ్లతో పాటు మరో 20 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఘటనపై అసిస్టెంట్ కమిషనర్ హన్మంత్రావు పూర్తి వివరాలు సేకరిస్తారని, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నస్రుల్లాబాద్: ఆరోగ్య శాఖ సిబ్బంది మంగళ వారం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, దామరంచ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి సర్వే చేశారు. ఆయా గ్రామాలకు చెందిన పలువురు సోమవా రం కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయిన విష యం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ.. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తోంది. వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని వారు తెలిపారు. మంగళవా రం ఎటువంటి ఘటనలు చోటు చేసుకోలేదని అంకోల్ సబ్సెంటర్ ఎంఎల్హెచ్పీ మనీష తెలిపారు. సోమవారం అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరినవారి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరు డిశ్చార్జి అయ్యారని పేర్కొన్నారు. కా ర్యక్రమంలో ఏఎన్ఎంలు స్రవంతి, వెంకటలక్ష్మి, శ్రావణి, ఉమ, ఆశా కార్యకర్తలు శిరీష తదితరు లు పాల్గొన్నారు. -
సంపన్నులతో సమానంగా పేదింట సన్నన్నం
గాంధారి: సంపన్నులతో సమానంగా పేదలు కూ డా మంచి భోజనం చేయాలనే ఉద్దేశంతో ప్రభు త్వం రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన పెద్ద గుజ్జుల్ తండాను సందర్శించారు. ఈ సందర్భంగా తండాకు చెందిన బా నోత్ వినోద్ అనే గిరిజనుడి ఇంట్లో పలువురు అధికారులతో కలిసి భోజనం చేశారు. కుటుంబ సభ్యు ల వివరాలు, ఆదాయ మార్గాలు, ఆర్థిక పరిస్థితి, పి ల్లల చదువులు తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. వినోద్ తనకు బోర్వెల్ సమస్య ఉందని కలెక్టర్తో తెలుపగా విచారణ చేసి సమస్యను పరిష్కరించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ను ఆదేశించారు. తండాలో ఏమైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. అనంతరం తండావాసులు కలెక్టర్ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీఎస్వో మల్లికార్జున్ బాబు, డీపీవో మురళి, తహసీల్దార్ రేణుక చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. గోదాంకు వేసిన సీల్, గోదాం వద్ద భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల విభాగం అధికారులు సరళ, అనిల్ కుమార్ తదితరులున్నారు. వాల్పోస్టర్ల ఆవిష్కరణ కామారెడ్డి క్రైం: కలెక్టరేట్లో మంగళవారం పోషణ పక్షం పోస్టర్ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 22వ తేదీ వరకు నిర్వహించే పోషణ పక్షోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, కామారెడ్డి సీడీపీవో శ్రీలత, మద్నూర్ సీడీపీవో కళావతి తదితరులు పాల్గొన్నారు. -
గౌరారం కలాన్లో కలకలం
గాంధారి: గౌరారం కలాన్లో మంగళవారం కల్లు తాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గౌరారం కలాన్లో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు మధ్యాహ్నం కల్లు తాగారు. ఆ కల్లు తాగిన కొందరు సాయంత్రం నుంచి నాలుక మొద్దుబారడంతోపాటు మెడనొప్పితో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారులకు తెలపగా.. ఆర్ఐ ప్రదీప్, ఎస్సై ఆంజనేయులు, వైద్యారోగ్య, ఎకై ్సజ్ శాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం 12 మంది బాధితులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కల్లు తాగిన పలువురికి అస్వస్థత బాన్సువాడ ఆస్పత్రికి తరలింపు -
విద్యార్థి కలలను సాకారం చేసుకోవాలి
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్ : ప్రతి విద్యార్థి కన్న కలలను సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థులు అన్ని రంగాలలో ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కథల పుస్తకాలు రాయడం సంతోషాన్ని కలిగించిందన్నారు. టీహబ్ తరహాలో ఎల్లారెడ్డిలో వై హబ్ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని, ఇందుకోసం 50 ఎకరాల స్థలం కేటాయించాలని జిల్లా కలెక్టర్ను కోరానని తెలిపారు. కళాశాలకు ప్రభుత్వం కేటాయించిన 23 ఎకరాల భూమిలో ఒక్క అంగుళం కూడా కబ్జా కాకుండా చూస్తానన్నారు. కబ్జాకు పాల్పడిన వారి నుంచి భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. విద్యార్థులు రాసిన కథల పుస్తకాలు, కళాశాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. డిగ్రీ కళాశాలలో డ్రెయినేజీ నిర్మాణానికి రూ.30 లక్షలు కేటాయిస్తున్నానని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఏఈకి సూచించారు. కళాశాలకు స్వాగత తోరణం నిర్మాణానికి కళాశాల అభివృద్ధి కమిటీ ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో రూ. 5లక్షలతో నిర్మించనున్న టీఎన్జీవో కార్యాలయ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేటలో జరుగుతున్న అమృత్ 2.0 పనులను ఆయన పరిశీలించారు. రూ. 35 కోట్లతో పనులు జరుగుతున్నాయని, నాణ్యతగా చేపట్టాలని సూచించారు.ఎల్లారెడ్డి మండలం మండలం సాతెల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలోని చాకలి సాయిలు అనే లబ్ధిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే భోజనం చేశారు. ఎల్లారెడ్డి మండలం మత్తమాల గ్రామంలో ఎమ్మెల్యే, జైబాపు, జైభీం, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి పాదయాత్ర చేశారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు శంకర్, చంద్రకాాంత్, ప్రభాకర్, సిద్దు, వసంత లక్ష్మి, గంగారెడ్డి, ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ ప్రేమ్కుమార్, డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేష్, సీడీపీసీ సభ్యులు శ్రీనివాస్, కంచర్ల బాలకిషన్, ముత్యపు సుదర్శన్, విద్యాసాగర్, ఏఎంసీ చైర్పర్సన్ రజిత, మున్సిపల్ మాజీ చైర్మన్లు పద్మశ్రీకాంత్, కుడుముల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వినోద్గౌడ్, సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు వెంకట్రెడ్డి, తాలుకా అధ్యక్షులు మహిపాల్, కార్యదర్శి చరణ్ తదితరులు పాల్గొన్నారు. టీహబ్ తరహాలో ఎల్లారెడ్డిలో వై హబ్ ఏర్పాటు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు -
బంగారం దుకాణంలో చోరీ
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఓ బంగారం దుకాణంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రంలోని బంగారు దుకాణాన్ని మంగళవారం ఉదయం నిర్వాహకులు తెరచి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని దుండగుడు సోమవారం అర్ధరాత్రి దుకాణం వెనుక ఉన్న తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడి సొత్తును దొంగలించినట్లు తెలిపారు. సుమారుగా 17కిలోల వెండి, 6తులాల బంగారం చోరీ చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఈమేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినల్లు ఎస్సై రాజు తెలిపారు. ఆలయంలో చోరీకి విఫలయత్నం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేట పోలీస్స్టేషన్ సమీపంలోని రేణుకామాత ఆలయంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి విఫలయత్నం చేశారు. ఆలయంలోని హుండీని పగులగోట్టేందుకు వారు ప్రయత్నించినప్పటికీ హుండీ తలుపు తెరుచుకోకపోవడంతో దుండగులు వెనుదిరిగారు. మంగళవారం ఉదయం ఆలయాన్ని శుభ్రపర్చేందుకు వచ్చినవారు హుండీ తలుపు ధ్వంసమై ఉండడాన్ని గమనించి ఆలయకమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఆలయకమిటీ సభ్యులు అక్కడికి చేరుకొని, నాగిరెడ్డిపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆలయానికి చేరుకొని హుండీని పరిశీలించి, వివరాలు సేకరించారు. -
అక్రమాలకు అడ్డదారి!
దర్జాగా తిరుగుతున్నా..161వ నంబరు జాతీయ రహదారిసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నాందేడ్ నుంచి సంగారెడ్డి మీదుగా హైదరాబాద్కు వెళ్లే వాహనాలు 161వ నంబరు జాతీయ రహదారి మీదుగా వెళ్తాయి. అయితే తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో సలాబత్పూర్ వద్ద ఇరు రాష్ట్రాల చెక్పోస్టులు ఉన్నాయి. వీటిని తప్పించుకునేందుకు అడ్డదారులు ఉపయోగించుకుంటున్నారు. చాలా వ రకు వాహనాలు మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి పె ద్ద శక్కర్గ, నాగ్రాల్ గ్రామాల మీదుగా మద్నూర్ మండల కేంద్రానికి సమీపంలోని 161 వ నంబరు జాతీయ రహదారి బైపాస్ మీదుగా హైదరాబాద్ వైపు వెళ్తున్నాయి. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలతో పాటు సరైన రవాణా పత్రాలు లేని, అక్రమ స రకులు రవాణా చేసే, నిషేధిత మత్తు పదార్థాలు త రలించే వాహనాలన్నీ ఈ అడ్డదారి మీదుగానే వెళ్తున్నాయి. ఉత్తర భారతం నుంచి మహారాష్ట్ర మీదుగా హైదరాబాద్కు వచ్చే సరకు రవాణా వాహనాలు కూడా చెక్పోస్ట్ను తప్పించుకోవడానికి అడ్డదారుల్లోనే పయనిస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు వాహనాలు వరుస కడుతాయని, రాత్రంతా వాహనాల రాకపోకలు సాగిస్తాయని తెలుస్తోంది. దెబ్బతింటున్న రోడ్లు అధిక లోడుతో వెళ్లే వాహనాలతో రోడ్లు దెబ్బతింటున్నాయి. రూ. కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లు కొద్ది కాలానికే పాడవుతున్నాయి. తనిఖీల నుంచి తప్పించుకునేందుకు అడ్డదారిలో వెళ్లే వాహనాలతో ప్రభుత్వాదాయానికి గండి పడుతుండగా, రోడ్లు కూడా దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మంజీర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాలు కూడా మద్నూర్ నుంచి ఇదే అడ్డదారి గుండా మహారాష్ట్రకు తరలుతున్నాయి. అలాగే మరోవైపు ఇసుకను కర్ణాటకకు మద్నూర్ నుంచి జుక్కల్ మీదుగా తరలిస్తున్నారు. మద్నూర్ మండల కేంద్రం నుంచి జుక్కల్కు వెళ్లే ఈ రహదారి అటు కర్ణాటకకు, ఇటు మహారాష్ట్రకు వాహనాలు తరలివెళ్లడానికి అనువుగా ఉంది. దీంతో చాలా మంది ఈ దారిని అక్రమ రవాణాకు ఉపయోగించుకుంటున్నారు. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. జీరో మాల్, అధిక లోడు వాహనాలన్నీ చిన్నరోడ్ల పైనుంచే.. ఎన్హెచ్ 161పై చెక్పోస్టులను తప్పించుకోవడానికి.. మహారాష్ట్ర నుంచి తెలంగాణకు సరుకు రవాణా ప్రభుత్వ ఆదాయానికి గండి మహారాష్ట్ర నుంచి వచ్చే సరుకుల రవాణా వాహనాలు.. అంతర్రాష్ట్ర చెక్పోస్టులను తప్పించుకునేందుకు అడ్డదారిలో వెళ్తున్నాయి. ముఖ్యంగా జీరో మాల్ తీసుకువెళ్లే వారు, అధిక లోడుతో వెళ్లే వాహనాలు, నిషేధిత మత్తు పదార్థాలతో పాటు మహారాష్ట్ర నుంచి దేశీదార్ మద్యం ఈ దారి గుండానే రవాణా చేస్తున్నారు. రవాణా వాహనాలు చాలా వరకు అడ్డదారిలో వెళ్తుండడంతో ప్రభుత్వాల ఆదాయానికీ గండిపడుతోంది. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.చెక్పోస్టులను తప్పించుకునేందుకు సరుకు రవాణా వాహనాలు అడ్డదారిలో దర్జాగా తిరుగుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు ఈ దారి గుండా వెళ్తున్నట్టు తెలుస్తోంది. చెక్పోస్టు కు కూతవేటు దూరం నుంచే వాహనాలు దారి మళ్లుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. మహారాష్ట్రకు చెందిన దేశీదారు (మద్యం) ఈ దారి గుండా వివిధ ప్రాంతాలకు రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా దొరికే మద్యం కన్నా తక్కువ ధరలకు లభిస్తుండడంతో చాలా మంది దేశీదారు తాగడానికే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. -
కల్తీ కల్లుకు కేరాఫ్ దుర్కి
బాన్సువాడ/నస్రుల్లాబాద్ : మత్తెక్కించే కల్లు.. వ్యా పారులకు కాసులు కురిపిస్తుండగా, అమాయకుల ప్రాణాలను తీస్తోంది. కిక్కు కోసం కల్తీ కల్లుకు బానిసవుతున్న పలువురు అనారోగ్యంబారిన పడుతున్నారు. నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో ని డిపో కల్తీకల్లుకు కేరాఫ్ అడ్రస్గా మారింది. రూ. 10కి లభించే సీసాలో ఒకరకంగా, రూ.20కి లభించే కల్లు సీసాలో మరో రకమైన మత్తు ఉంటుందంటా రు మందుబాబులు. ఈ మత్తెక్కించే కల్లు కోసం ని త్యం బాన్సువాడ, కొల్లూర్, సోమేశ్వర్, దేశాయిపేట్తోపాటు పలు గ్రామాలనుంచి నడుచుకుంటూ కొందరు, మోటార్ సైకిళ్లపై మరికొందరు దుర్కికి వస్తుంటారు. తిరిగి వెళ్లేటప్పుడు రెండు, మూడు కల్లు ప్యాకెట్లను వెంట తీసుకువెళ్తారు. పట్టించుకోని అధికారులు దుర్కి కల్లు డిపో నుంచి సుమారు 7 గ్రామాలకు కల్లు సరఫరా చేస్తారు. డివిజన్లో ఎక్కువగా కల్తీకల్లును దుర్కిలోనే అమ్ముతున్నారనే విషయం బహిరంగ రహస్యం. బాన్సువాడకు కూతవేటు దూరంలో ఉన్న దుర్కిలో క్లోరోఫాం, ఇతర మత్తుపదార్థాలు కలుపుతున్నారనే విషయం సంబంధిత శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తాజా ఘటనతోనైనా అధికారులు మేల్కొని కల్తీ కల్లు విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కల్లు సేవించిన పలువురికి అస్వస్థతబలవుతున్న అమాయకులు తాజాగా 60 మందికి అస్వస్థత మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు 12 మంది తరలింపు లైసెన్సులు రద్దు చేయండి కల్తీ కల్లు దుకాణ యజమానుల లైసెన్సులు రద్దు చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. సోమవారం కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన దుర్కి, అంకోల్, అంకోల్ తండా, దామరంచ గ్రామాలకు చెందిన బాధితులను బాన్సువాడ ఆస్పత్రిలో పరామర్శించారు. కల్లు తాగిన తర్వాతే తాము అస్వస్థతకు గురయ్యామని బా ధితులు చెప్పారు. విచారణ జరిపి కల్లు చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హన్మంత్రావుకు సబ్కలెక్టర్ సూచించారు. ఆస్పత్రిలో ఆర్ఎంవో అందుబాటులో లేకపోవడంతో ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి వేళలో సబ్ కలెక్టర్ ఆయా గ్రామాల్లో పర్యటించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.దుర్కి డిపో నుంచి సోమవారం అంకోల్, దుర్కి, దామరంచ గ్రామాల్లోని దుకాణాలకు కల్లు సరఫరా అయ్యింది. ఆ కల్లు తాగిన పలువురు కళ్లు తేలేయడం, మెడలు పడేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స చేస్తున్న సమయంలో ఒక్కొక్కరిగా బాధితులు పెరుగుతుండడంతో అప్రమత్తమైన డిప్యూటీ డీఎంహెచ్వో విద్య వెంటనే అంకోల్ గ్రామానికి వెళ్లారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో మాట్లాడారు. స్థానిక గ్రామ పంచాయతీ వద్ద మందులను అందుబాటులో ఉంచి, ప్రథ మ చికిత్స అనంతరం బాధితులను అంబులెన్సులో బాన్సువాడకు పంపించాలని సూచించారు. సోమవారం రాత్రి వరకు బాధితుల సంఖ్య 60 కు చేరింది. ఇందులో 12 మందిని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్లోని జీజీహెచ్కు తరలించారు. బాధితులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ పరామర్శించారు. పలువురు బాధితులకు ఆర్థిక సాయం అందించారు.నివేదిక పంపిస్తున్నాం అంకోల్ గ్రామ కల్లు దుకాణంపై విచారణ చేపట్టాం. కల్లును పరీక్షించగా సీహెచ్ శాతం లేదు. మరేదైనా మత్తు పదార్థం ఉందేమో అన్న అనుమానంతో శాంపిల్స్ సేకరిస్తున్నాం. కౌంటర్ నెం.5 నాగరాజు గౌడ్ దుకాణంపై చర్యలు తీసుకుంటాం. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తాం. – యాదిరెడ్డి, బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ వివరాలు సేకరించాం కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురైన వారి వివరాలు సేకరించాం. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో ఘటనా స్థలాన్ని పరిశీలించాం. అంకోల్, అంకోల్ తండాకు చెందిన బాధితులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. – సాయిలు, ఆర్ఐ, నస్రుల్లాబాద్ -
అల్మాజీపూర్లో బోనాల పండుగ
ఎల్లారెడ్డి: అల్మాజీపూర్ గ్రామంలో సోమవా రం బోనాల పండుగ నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా గ్రామంలోని ముత్యాల పోచమ్మ, నల్ల పోచమ్మ అమ్మవార్లకు మహిళలు బోనాలతో శోభాయాత్ర నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. అందరూ సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. చిన్నారులకు కంటి పరీక్షలు కామారెడ్డి టౌన్: జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు కంటి పరీక్షల కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. మొదటి రోజు జిల్లాలో 1,077 మందికి కంటి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రెండు దశలలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు. మొదటి దశలో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి రెండో దశలో అవసరమైన చిన్నారులకు కంటి అద్దాల పంపిణీ, శస్త్ర చికిత్సలు చేపడుతామని పేర్కొన్నారు. అలాగే మానసిక పరీక్షలు కూడా చేస్తామన్నారు. జిల్లాలోని 1,205 అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులందరికి పరీక్షలు చేస్తామని, ఇందుకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి కామారెడ్డి రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని డీసీవో రామ్మోహన్ సూచించారు. సోమవారం గర్గుల్, నర్సన్నపల్లి, ఉగ్రవాయి, ఇస్రోజీవాడి, చిన్నమల్లారెడ్డి, అడ్లూర్ ఎస్సీ కాలనీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వం కల్పించే మద్దతు ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, మానిటరింగ్ ఆఫీసర్ షేక్ చాంద్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బొంబొతుల శంకర్గౌడ్, డైరెక్టర్లు గంగాగౌడ్, రాంరెడ్డి, లక్ష్మీనారాయణ, దుబ్బాక పోచయ్య, కల్లూరి భూమయ్య, సీఈవో సతీష్, మాజీ సీఈవో మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి భిక్కనూరు: గ్రామపంచాయతీలు వంద శాతం ఇంటిపన్నులను వసూలు చేస్తే వేగంగా అభివృద్ధి సాధించవచ్చని డీపీవో మురళి పేర్కొన్నారు. సోమవారం ఆయన పెద్దమల్లారెడ్డిని సందర్శించారు. తడి పొడి చెత్తను వేరువేరుగా అందించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పారిశుధ్య సిబ్బందికి సూచించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. కమ్యూనిటీ బోర్ల వద్ద నీరు వృథాగా పోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. డీపీవో వెంట ఈవో లక్ష్మి ఉన్నారు. గిరిజన నాయకుల ముందస్తు అరెస్టు కామారెడ్డి టౌన్ : గిరిజన భవనం ముట్టడి ని అడ్డుకునేందుకు గిరిజన సంఘం జిల్లా నాయకులను సోమవారం పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతీరాం నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వినోద్లను ఉదయం అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. మధ్యాహ్నం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. -
నాసిరకం సరుకులను విక్రయిస్తే చర్యలు తప్పవు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): దుకాణాలలో నాసిరకం సరుకులను విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి సునీత సూచించారు. గోపాల్పేటలోని పలు దుకాణాలను సోమవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాలలోని పలురకాల సరుకులను ఆమె పరిశీలించారు. గోపాల్పేటలోని రాజరాజేశ్వర కిరాణ దుకాణంలో కాలంచెల్లిన సాంబార్పొడి ప్యాకెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించామని ఆమె చెప్పారు. దీంతోపాటు అదే దుకాణంలో నాసిరకం పల్లీలు విక్రయిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి రాజరాజేశ్వర దుకాణంలో శాంపిళ్లను సేకరించామని ఆమె వివరించారు. కాలం చెల్లిన, నాణ్యతలేని సరుకులను విక్రయిస్తే దుకాణాదారులపై చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె తెలిపారు. గతఏడాది జిల్లాలో నాసిరకం సరుకులను విక్రయిస్తున్న దుకాణాల్లో సేకరించిన శాంపిళ్లకు సంబంధించి 6కేసులు నమోదయ్యాయని ఆమె వివరించారు. ఇప్పటివరకు ఒక కేసు నమోదైందని ఆమె చెప్పారు. కాగా మండలకేంద్రం గోపాల్పేటలో ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి ఆకస్మిక తనిఖీల విషయం తెలుసుకున్న కొందరు వ్యాపారులు వారి దుకాణాలను మూసి ఉంచారు. జిల్లా ఫుడ్ సెక్యూరిటీ అధికారిణి సునీత -
రైతులకు ఇబ్బంది కలగనీయొద్దు
కామారెడ్డి క్రైం: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్కు సంబంధించి ఇప్పటివరకు ఐకేపీ ఆధ్వర్యంలో 15, సింగిల్ విండోల ఆధ్వర్యంలో 153 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. మిగిలిన 278 కేంద్రాలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోళ్ల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రాలలో తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు 271 మంది రైతుల నుంచి 2,958 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.45 లక్షలను 31 మంది రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేశామన్నారు. ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు 24 గంటల్లోగా డబ్బులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలను పరిష్కరించడానికి జిల్లా కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ (08468 –220051) ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున బాబు, డీఏవో తిరుమల ప్రసాద్, మార్కెటింగ్ అధికారి రమ్య, డీటీవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.పూలే జయంతిని ఘనంగా నిర్వహించాలి మహాత్మా జ్యోతీబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఎస్సీ, బీసీ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఉత్సవాలకు హాజరై విజయవంతం చేయాలన్నారు. అధికారులు సమన్వయం చేయాలని సూచించారు. అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచండి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
కామారెడ్డిలో ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కాలనీకి చెందిన బోదాసు రాజు (35) కూలీ పని చేసుకుంటూ జీవించేవాడు. అతడికి లక్ష్మీతో 13 ఏళ్ల క్రితం వివాహం జరుగగా, ఇద్దరు సంతానం ఉన్నారు. దంపతుల మధ్య గొడవలు జరుగడంతో లక్ష్మి కొద్దిరోజులుగా తన తల్లిగారింటి వద్దనే ఉంటోంది. దీంతో రాజు మద్యానికి బానిసై, భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందేవాడు. ఈక్రమంలో ఆదివారం అర్ధరాత్రి అతడు ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి అన్న యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి.. కామారెడ్డి క్రైం: రైలు కింద పడి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వడియారం– మిర్జాపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రాంతంలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. పట్టాలపై మృతదేహం పడి ఉందని సమాచారం రావడంతో కామారెడ్డి రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడి ఎడమ చేతికి వెండి కడియం, ఛాతిపై కుడి వైపున పుట్టు మచ్చ ఉన్నాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఆనవాళ్లు తెలిసిన వారు కామారెడ్డి రైల్వే పోలీసులను సంప్రదించాలని, కేసు విచారణ అధికారి హన్మాండ్లు కోరారు. -
● ప్రమాదకరంగా మారిన స్పీడ్ బ్రేకర్లు
మండల కేంద్రంలోని బస్టాండులో ఇటీవల ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదకరంగా మారాయని ప్రయాణికులు,ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కొంచెం ఏటవాలుగా ఏర్పాటు చేస్తే బాగుండేదని పలువురు డ్రైవర్లు అభిప్రాయ పడ్డారు. స్పీడ్ బ్రేకర్ ఎత్తుగా ఉండటంతో తరుచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. శనివారం కరీంనగర్ డిపోనకు చెందిన ఈ ఎక్స్ ప్రెస్ స్పీడ్ బ్రేకర్ వద్ద ఆగిపోయింది. కొంచెం స్పీడ్ గా వెళ్తే ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని, స్లో గా వెళ్తే బస్సులు ఆగిపోతున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజుల క్రితం స్పీడ్ బ్రేకర్ దాటేప్పుడు పలువురు ప్రయాణికులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. వెంటనే అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల ఎత్తు తగ్గించాలని ప్రజలు కోరారు. – మాచారెడ్డి -
రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: వరంగల్ జిల్లా ఎల్కతుర్తి లో ఈనెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి లోని తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ సభకు కామారెడ్డి నియోజకవర్గం నుండి 3 వేల మంది కార్యకర్తలను తరలించాలని నిర్ణయించినట్లు తెలిపారు. పార్టీ సూచించిన దాని కంటే ఎక్కువ మంది కార్యకర్తలను సభకు తరలించాలని ఆయా మండలాల నాయకులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, జెడ్పీ మాజీ సభ్యులు మినుకూరి రాంరెడ్డి, గండ్ర మధుసూదన్, మాజీ ఎంపీపీలు బాలమణి, పిప్పిరి ఆంజనేయులు, పార్టీ అధికార ప్రతినిధులు బల్వంత్ రావు, గైని శ్రీనివాస్ గౌడ్, నాయకులు గోపీ గౌడ్, నల్లవెల్లి అశోక్, మోహన్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, భాను, తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలిరావాలి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ -
‘సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మకం’
మాచారెడ్డి : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని, ఇది చరిత్రాత్మకమైనదని ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. సోమవారం మాచారెడ్డిలో జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాదయాత్ర చేశారు. గ్రామంలో రేష న్ దుకాణం వద్ద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమా న్ని చేపట్టారు. అనంతరం దళితుల ఇంట్లో భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నబియ్యం సరఫరాలో అవకతవకలు జరగనీయవద్దని, ఏమైనా లోటుపాట్లు ఉంటే సవరించాలని అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్కార్డుల పంపిణీ, సభ్యుల నమోదు ప్రక్రియ ప్రారంభమైందన్నారు. అనంతరం సొసైటీలో కొనుగోలు కేంద్రా న్ని ప్రారంభించారు. కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ విక్టర్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో గోపిబాబు, జై బాపు, జై భీం, జై సంవిధాన్ కార్యక్రమ కామారెడ్డి ఇన్చార్జి కత్తి వెంకటస్వామి, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్రావ్, మాజీ ఎంపీపీ నర్సింగరావు, నాయ కులు నౌసీలాల్, ఇలియాస్, ఇంద్రకరణ్రెడ్డి, రమేశ్గౌడ్, రాజమౌళి గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
దౌల్తాపూర్లో వైద్య శిబిరం ఏర్పాటు
కామారెడ్డి జిల్లా కోర్టులో పాల్గొన్న న్యాయమూర్తులుబిచ్కుంద: దౌల్తాపూర్లో వైద్య సిబ్బంది సోమవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న ఎనిమిది మంది నుంచి రక్తనమూనాలు సేకరించారు. గ్రామంలో ప్రజలు విష జ్వరాలతోపాటు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న అంశంపై ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆదివారం వైద్య సిబ్బంది గ్రామానికి వెళ్లి సర్వే చేసి జ్వరంతో బాధపడుతున్నవారికి మాత్రలు అందించారు. అయితే చికున్ గున్యా లక్షణాలతో బాధపడుతున్నా తమకు వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన వైద్యాధికారులు సోమవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. పలువురినుంచి రక్త నమూనాలు సేకరించారు. జ్వరం, నొప్పులకు సంబంధించిన మందులు అందించారు. కొందరికి నొప్పులు, జ్వరం ఎక్కువగా ఉండడంతో బిచ్కుంద ఆస్పత్రిని తరలించారు. కాగా దౌల్తాపూర్లో రక్త నమూనాల సేకరణకు వచ్చిన వైద్య సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజలతో దురుసుగా వ్యవహరించారు. దీనిపై ప్రజలు నిరసన తెలిపారు. వైద్య సిబ్బంది తీరుపై ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. -
కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలి
మద్నూర్/బిచ్కుంద/నిజాంసాగర్ (జుక్కల్): రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధరను పొందాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. డోంగ్లీ మండల కేంద్రంలో, మాగి గ్రామంలో. బిచ్కుందలో సోమవారం వరి, పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. డోంగ్లీ తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. డోంగ్లీ మండలంలోని సిర్పూర్లో ఎమ్మెల్యే సన్న బియ్యం లబ్ధిదారు నామేవార్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. ఆయనతో పాటు సబ్కలెక్టర్ కిరణ్మయి, అధికారులు కూడా భోజనం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బిచ్కుంద మున్సిపాలిటీతో పాటు 30 పడకల ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశామన్నారు. బిచ్కుంద అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులు రానున్నాయన్నారు. డోంగ్లీ, బిచ్కుంద మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదం ప్రతి ఇంటికి చేరే విధంగా చూడాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సన్నబియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే -
నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేటలోని జగ్గనిచెరువు నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం తహసీల్దార్ శ్రీనివాస్రావుకు వినతిపత్రాన్ని అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గోపాల్పేటలోని ప్రధాన రహదారికిరువైపులా ఉన్న ఇళ్ల నుంచి వెలువడే మురుగు, వ్యర్థపదార్థాలు పోచారం ప్రధాన కాలువలో కలపడంతో తమ గ్రామసమీపంలోని జగ్గనిచెరువునీరు కలుషితమవుతుందన్నారు. దీంతో పలువురు జీవనాధారం కోల్పొతారని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం నీరుపారుదలశాఖ ఏఈ శ్రీకాంత్కు సైతం వినపత్రాన్ని సమర్పించారు. -
మహిళపై వ్యక్తి దాడి
గాంధారి(ఎల్లారెడ్డి): తన కొడుకును కిడ్నాప్ చేసి, దాచిందనే అనుమానంతో ఓ మహిళపై నిందితుడు దాడి చేయగా, తీవ్ర గాయాలతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా.. చందానాయక్ తండాకు చెందిన కేతావత్ పిరాజీ గత కొన్నేళ్లుగా హైదరాబాద్ బేగంపేట్లో ఉంటూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో అమీనాబేగం (35) కూడా భిక్షాటన చేస్తూ జీవనం సాగించేది. పిరాజీ కుమారుడు నాలుగేళ్ల వయస్సుగల శ్రీకాంత్ కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అమీనా బేగం తన కుమారుడిని కిడ్నాప్ చేసి దాచిందనే అనుమానంతో పిరాజీ ఆమెను ఇటీవల చందానాయక్ తండాకు తీసుకొచ్చాడు. ఆమెను తన కొడుకును ఎక్కడ దాచావో చెప్పాలని ప్రశ్నించాడు. ఆమె వివరాలు చెప్పలేదు. ఈక్రమంలో తండా సమీపంలోని మేడిపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కర్రలతో కొట్టాడు. అనంతరం అక్కడి నుంచి అతడు వెళ్లిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు గమనించి గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె సోమవారం మృతి చెందింది. మేడిపల్లి మాజీ సర్పంచ్ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ విచారణ చేస్తున్నారని ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి కొడుకును కిడ్నాప్ చేసిందనే అనుమానంతో ఘాతుకానికి పాల్పడిన నిందితుడు చందానాయక్ తండాలో ఘటన -
ఆకట్టుకున్న ఆర్మీ పారా గ్లైడింగ్
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం ఆర్మీ అధికారుల నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. 250వ ఏవోసీ కార్ప్స్ డేను పురస్కరించుకుని సికింద్రాబాద్ ఆర్మీ కంటోన్మెంట్ ఆధ్వర్యంలో పారా మోటార్ ఎక్స్పెడిషన్– 2025 యాత్ర చేపట్టారు. ఢిల్లీ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఆగ్రా, కాన్పూర్, ఝాన్సీ, సాగర్, జబల్పూర్, పుల్గాం మీదుగా సోమవారం సాయంత్రం నిజామాబాద్కు చేరుకుంది. ఈ సందర్భంగా వారికి అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్మీ కంటోన్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అమత్ నేతృత్వంలో నిర్వహించిన పారా గ్లైడింగ్ విన్యాసాలు అలరించాయి. ఎన్సీసీ కెడెట్లు, యువతీయువకులకు పారా గ్లైడింగ్పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డీఎస్వో అరవింద్ రెడ్డి, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్ రెడ్డి, పోలీసు, ఎన్సీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
చేపలవేటకు వెళ్లి ఒకరి మృతి
ఎడపల్లి(బోధన్): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి వలకు చిక్కుకొని, నీటమునిగి మృతి చెందాడు. ఎస్సై వంశీచందర్రెడ్డి సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్కు చెందిన శ్రీనివాస్ (28) బోర్బండి డ్రైవర్గా పని చేస్తున్నాడు. ములుగు జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి 18ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. పనిలేనప్పుడు చేపలు పట్టడానికి వెళుతుండేవాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం చేపల వేటకని స్థానిక చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు వల వేయగా, అదే వలకు చిక్కుకొని నీటమునిగి మృతిచెందాడు. మృతుడి భార్య వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్నానానికి వెళ్లి చెరువులో పడి ఒకరు.. బాల్కొండ: ముప్కాల్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ యువకుడు స్నానం చేయడానికి చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చింతకాయల చరణ్(18)కు మతిస్థిమితం సరిగా ఉండదు. సోమవారం ఉదయం అతడు స్థానిక ఊర చెరువులో స్నానం చేయడానికి వెళ్లి, ఇంటికి తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు చెరువు వద్దకు వెళ్లగా అతడి దుస్తులు ఒడ్డున ఉండటంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న ముప్కాల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పదేళ్ల క్రితం ఇద్దరు కుమారులు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన చింతకాయల రవి, రజిత దంపతులకు మొత్తం నలుగురు కుమారులు. వారిలో ఇద్దరు కుమారులు గత పదేళ్ల క్రితం ఊర చెరువు నుంచి ప్రవహించే కాలువలో పడి మృతి చెందారు. పెద్ద కుమారుడైన చరణ్ చెరువులో పడి మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. నల్లమడుగులో క్షుద్ర పూజల కలకలం లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజల కలకలం రేపింది. పాఠశాలకు శని, ఆదివారాలు సెలవులు రావడంతో గుర్తుతెలియని వ్యక్తులు పాఠశాలలోని ఓ గది వద్ద ముగ్గు వేసి పసుపు, కుంకుమ, అరటిపండ్లు, నిమ్మకాయలతో పట్టు వేసినట్లు బొమ్మలను వేశారు. సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు ఈ దృశ్యాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు, కార్యదర్శి, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలతో చర్చించి లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు హెచ్ఎం కోటేశ్వర్రావు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాటేపల్లి గ్రామ శివారు మీదుగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై మహేందర్ సోమవారం తెలిపారు. కేసు నమోదు చేసి, ట్రాక్టర్లను తహసీల్దార్ దశరథ్కు అప్పగించినట్లు పేర్కొన్నారు. హాస్టల్ నుంచి ఇద్దరు విద్యార్థుల మిస్సింగ్ బాన్సువాడ: బీర్కూర్లోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల– హాస్టల్ నుంచి 8వ తరగతి చదివే ఇద్దరు విద్యార్థులు మిస్సింగ్ అయినట్లు ప్రిన్సిపాల్ శివకుమార్ తెలిపారు. ఈమేరకు అతడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి స్నేహితులను విచారించగా సదరు విద్యార్థులు కిష్టాపూర్లో యూనిఫామ్ మార్చుకుని గౌరారం గ్రామంలోని తోటి స్నేహితుడి దగ్గరకు వెళ్లినట్లు తెలిపారు. ఆ గ్రామం పరిసర ప్రాంతంలో వెతుకగా వారి ఆచూకీ దొరకలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
రామారెడ్డి/దోమకొండ: రామారెడ్డి మండలకేంద్రంలో, దొమకోండ మండలం అంచనూరు, సీతారాంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం జై భీమ్, జై బాబు జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను కాంగ్రెస్ నాయకులు చేపట్టారు.రామారెడ్డిలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు.ఈకార్యక్రమంలో రామారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్, మైనారిటీ మండల అధ్యక్షుడు ఇర్పాన్, దోమకొండ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్రబోయిన స్వామి, నాయకులు రామస్వామి గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజం, నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులకు స్పేస్ ఇంజినీరింగ్పై అవగాహనభిక్కనూరు/మాచారెడ్డి : విద్యార్థులు ఉపగ్రహల పనితీరు, వాటితో కలిగే లాభాలపై అవగాహన పెంచుకోవాలని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిటైర్డ్ ఇంజినీర్ డాక్టర్ రఘువర్మ అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆయన స్పేస్ ఇంజినీరింగ్పై ఆయన అవగాహన కల్పించారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు స్పేస్ ఇంజనీరింగ్పై అవగాహన కల్పిస్తే రాణిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు రాజగంగారెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఎంఈవో రాంమనోహర్ రావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శత శాతానికి అడుగుదూరంలో..
కామారెడ్డి రూరల్: ప్రజలు చెల్లించే పన్నుల ఆధారంగా గ్రామాలు సమగ్రాభివృద్ధి చెందుతాయి. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్ఎఫ్సీ నిధులతోపాటు గ్రామాల్లో ఇంటి పన్నులతోపాటు వాణిజ్య సముదాయాలు చెల్లించే పన్నులు కీలకంగా మారాయి. ప్రజలకు వసతులు కల్పించాలంటే ఇందుకు అవసరమైన నిధుల కోసం గ్రామల్లో ప్రతి సంవత్సరం ఇంటి పన్ను వసూలు చేస్తారు. ఇంటి పన్ను వందశాతం వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని గ్రామాల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో ఇంటింటికి తిరుగుతూ ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 98.06 శాతం పన్ను వసూలైందని అధికారులు తెలిపారు. ఇంటింటికి తిరుగుతూ.. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వ నిధులతోపాటు పన్నులే ప్రధాన ఆదాయ వనరు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాల నిర్వహణకు పన్నుల రూపంలో వచ్చిన నిధులను ఖర్చు చేస్తారు. వందశాతం పన్నుల వసూలుకు జిల్లా స్థాయి అధికారులు తరుచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ కూడా పంచాయతీలు, మున్సిపాలిటిల్లో పన్నుల వసూలుపై దృష్టి సారించారు. సర్పంచులు పదవీకాలం ఉండగా పంచాయతీ కార్యదర్శులతో కలిసి గృహాలవారిగా తిరుగుతూ పన్నులు వసూలుకు చర్యలు చేపట్టేవారు. ప్రత్యేకాధికారుల పాలనలో.... సర్పంచుల పదవీకాలం ముగిసి..ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్న ఈ సమయంలో పంచాయతీల్లో పన్నుల వసూలుకు గడువు ముగిసింది. 2024–2025 ఆర్థిక సంవత్సరం ముగిసి వారం రోజులు గడుస్తుండడంతో అధికారులు వందశాతం లక్ష్యం చేరుకోవడంపై దృష్టి సారించారు. , మరో వారం రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటామని సంబంధిత అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.వందశాతం వసూలు చేస్తాం గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులు వసూలు చేస్తాం. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్నుల రూపంలో వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపట్టవచ్చని గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నాం. అంతేకాకుండా గ్రామ కార్యదర్శులు, సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పన్నుల వసూలుకు కృషి చేస్తున్నారు. వారం రోజుల్లో 100 శాతం పన్నుల వసూలు లక్ష్యాన్ని చేరుకుంటాం. – మురళి, డీపీవో, కామారెడ్డిజీపీలు పన్ను వసూలు లక్ష్యం వసూలైంది శాతం వసూలు కావాల్సింది 536 రూ. 14,67,69,766 రూ.14,49,82,541 98.69 రూ. 17,87,225 98శాతం ఇంటి పన్ను వసూలు లక్ష్యాన్ని పూర్తి చేయడంపై దృష్టి సారించిన అధికారులు -
కల్లుతాగి 100 మందికి పైగా అస్వస్థత.. వింత ప్రవర్తన
కామారెడ్డి జిల్లా: జిల్లాలోని బీర్కూర్, నసురుల్లాబాద్ మండలం అంకోల్, సంగ్యం, దామరాంచ గ్రామాల్లో కల్తీ కల్లు కలకలం రేగింది. కల్లుతాగిన 100 మందికిపైగా అస్వస్తతకు గురయ్యారు. అయితే ఇందులో చాలామంది బాధితులు వింతగా ప్రవర్తిస్తున్నారు.మెడలు వెనక్కి పడిపోయి నడుస్తున్నారు. కొంతమంది నాలుక పెద్దగా కావడం, మాట్లాడలేకపోవడం వంటి విషయాలు వారిలో కనిపించాయి. దాంతో పలువుర్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది వైద్య శాఖ. 20 మంది వరకూ బాధితుల్ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది, కల్లులో డ్రగ్ డోస్ ఎక్కువ కావడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటివి సాధారణంగా వస్తుంటాయి. అలాగే కలుషిత నీరు తాగినపుడు, కలుషిత ఆహారం తీసుకున్నప్పుడు వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. మందులు వాడితే ఆయా సమస్యలు తగ్గిపోతుంటాయి. అయితే కొన్ని వ్యాధులు దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తుంటాయి. వివిధ వ్యాధుల బారిన పడిన వాళ్లలో కొందరు బతికున్నన్ని రోజులూ నరకం అనుభవిస్తూనే ఉంటారు. జి ల్లాలో మధుమేహం(షుగర్) బాధితులు ఏడాదికేడాది పెరుగుతున్నారు. జిల్లాలో 62,354 మంది షుగర్ బారిన పడినట్టు రికార్డు లు చెబుతున్నాయి. ఇదే సమయంలో రక్తపోటు స మస్యతో బాధపడుతున్న వారు 1,00,129 మంది ఉన్నారు. బీపీ, షుగర్ రెండూ కలిసి ఉన్న వారు 44,627 మంది ఉన్నట్లు రికార్డు లు స్పష్టం చేస్తున్నాయి. టీబీ కేసులూ పెరుగుతున్నాయి. జిల్లాలో 1,565 కేసులు రికార్డయ్యాయి. మూత్రపిండాలకు గండం జిల్లాలో మూత్రపిండాల వ్యాధుల గండం భయపెడుతోంది. వందలాది మంది మూత్రపిండాల సమస్యతో సతమతమవుతున్నారు. కిడ్నీలు దెబ్బతిన్న వారు ఓ రకంగా నరకం అనుభవిస్తున్నారు. రెండు కిడ్నీలు పాడైన వారికి కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఒక కిడ్నీ ఇచ్చి ఆదుకుంటున్నా.. ఆపరేషన్ అనంతరం వారిని అనేక సమస్యలు వెన్నాడుతున్నాయి. దుమ్ముధూళితో పాటు, చల్లని వాతావరణం కొందరిని ఇబ్బందికి గురిచేస్తుంటుంది. జిల్లాలో వందలాది అస్తమాతో బాధపడుతున్నారు. ఫైలేరియా బాధితులూ ఎక్కువే... జిల్లాలో ఫైలేరియా బారిన పడిన వారు 573 మంది ఉన్నారు. ఈ వ్యాధి బారినపడినవారు కాలు బ రువుగా తయారై నడవాలన్నా, పడుకోవాలన్నా ఇ బ్బందులు పడుతుంటారు. కొందరు ఫైలేరియా బాధితులు పుండ్లతో నరకం చూస్తున్నారు. ఏటా డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరు గుతోంది. గతేడాది జిల్లాలో 180 డెంగీ కేసులు న మోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అంతకు పది రెట్ల మంది ఈ వ్యాధి బారిన పడి ప్రైవే టు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందినట్లు అంచనా. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై శ్ర ద్ధ వహించాలి. ఆహార ని యమాలు పాటించాలి. ని త్యం వ్యాయామం చేయాలి. ఏదో రకంగా శారీరక శ్ర మ ఉండాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయాలి. అనవసర విషయాలపై దృష్టి పెట్టి ఒత్తిడికి గురికావొద్దు. ఆరో గ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే అవసరమైన పరీక్షలు చేయించుకుని బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి. – శరత్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్య కళాశాల, కామారెడ్డి చాపకింద నీరులా క్యాన్సర్..ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే ఆ భాగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. శారీరక శ్రమ చేయకపోవడం, యోగా, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అనారోగ్యపు ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానా లు పాటిస్తుండడంతో రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నవ యువకులు కూడా బీపీ, షుగర్ బారిన పడుతున్నారు. పలువురు గుండెపోటుతో మృత్యువాతపడిన ఉదంతాలూ ఉన్నాయి. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించడానికి సంకల్పం తీసుకుని ముందుకు సాగాలని వైద్యులు సూచిస్తున్నారు. కాపాడుకునేందుకు కసరత్తు అవసరం నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహిళల్లో ఎక్కువగా గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. పురుషుల్లో లివర్, లంగ్స్, మౌత్ క్యాన్సర్లు ఎ క్కువగా బయటపడుతున్నాయి. క్యాన్సర్తో చా లా మంది మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రాణాలు కోల్పోతున్నా రు. జిల్లాలో అధికారిక లెక్క ల ప్రకారం 415 మంది క్యా న్సర్ బాధితులున్నారు. అయి తే బాధితుల సంఖ్య అంతకన్నా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. -
ఆదాయం ఫుల్.. వసతులు నిల్
బాన్సువాడ : తైబజారు పేరుతో జోరుగా వసూళ్ల దందా సాగుతోంది. వారాంతపు, రోజు వారీ సంతల్లో ఉత్పత్తులను విక్రయించేందుకు వెళ్తే కాంట్రాక్టర్లు రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. సంతల ద్వారా బల్దియాలకు భారీగానే ఆదాయం సమకూరుతోంది. అయితే వసతులు కల్పించే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. రూ. 67 లక్షల ఆదాయం బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి గురువారం పశువులు, గొర్రెలు, మేకలతో పాటు కూరగాయల సంత నిర్వహిస్తారు. ఇటీవల సంతలకు వేలం నిర్వహించారు. కాంట్రాక్టర్లు మేకల సంతను రూ. 46.26 లక్షలకు, కూరగాయల సంతను రూ.12.31 లక్షలకు, రోజువారి సంతను రూ.9.02 లక్షలకు సొంతం చేసుకున్నారు. సంతల వేలం ద్వారా బల్దియాకు రూ. 67 లక్షలకుపైగా ఆదాయం సమకూరింది. ఇంత ఆదాయాన్ని సమకూర్చిన సంతలను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదు. తైబజార్ పేరిట ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారని, కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించడం లేదని వ్యాపారులు, ప్రజలు పేర్కొంటున్నారు. మేకలకు నీటి సౌకర్యం కల్పించినా అది సరిపోవడం లేదని అంటున్నారు. అలాగే మూత్రశాలలు ఉన్నా నిర్వహణ సరిగా లేక దుర్వాసన వస్తున్నాయని పేర్కొంటున్నారు. కూరగాయల సంత నిర్వహణకు సరైన స్థలం లేదు. దీంతో పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ఎదురుగా, పాత బాన్సువాడకు వెళ్లే దారిలో రోడ్లపైనే కూరగాయలు విక్రయించాల్సి వస్తోంది. మున్సిపల్ అధికారులు స్పందించి సంతలో సరైన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. తైబజారు పేరుతో జోరుగా వసూళ్లు కనీస వసతులు కల్పించడంలో విఫలం ఇబ్బందిపడుతున్న వ్యాపారులు, ప్రజలు తాగేందుకు నీళ్లు కూడా లేవు.. రోజు బాన్సువాడకు వచ్చి కూరగాయలు అమ్ముతాం. ఇక్కడ కనీసం తాగేందుకు నీళ్లు కూడా అందుబాటులో ఉంచరు. డబ్బులు మాత్రం వసూలు చేస్తారు. కూరగాయలు అమ్ముడుపోకున్నా డబ్బులు ఇవ్వాల్సిందే. – సుజాత, కూరగాయల విక్రేత, బండాపల్లి మూత్రశాలలు లేవు రోజూ ఉదయమే బాన్సువాడకు కూరగాయలు తీసుకుని వస్తాం. ఎండలో కూర్చొని అమ్ముతాం. ఇక్కడ కనీసం మూత్రశాలలు కూడా లేవు. దీంతో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సంతలో సౌకర్యాలు కల్పించాలి. – బుజ్జమ్మ, కూరగాయల విక్రేత, బండాపల్లి -
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి
మోర్తాడ్(బాల్కొండ): భీమ్గల్ మండలంలో బైక్ అదుపుతప్పడంతో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం కలిగోట్కు చెందిన గండికోట మహేష్(42) కొన్నేళ్ల నుంచి మోర్తాడ్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతడు సొంత పనిపై ఆదివారం భీమ్గల్కు బైక్పై వెళ్లి, తిరిగి వస్తుండగా భీమ్గల్ మండలం జాగిర్యాల్ రోడ్డు మార్గంలో బైక్ అదుపుతప్పింది. దీంతో అతడు బైక్ పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడటంతో మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి.. ఇందల్వాయి: జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి ఎల్లమ్మ గుడి దగ్గర ఆదివారం ఒక గుర్తుతెలియని వ్యక్తి నిస్సహాయస్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని అతడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 నుంచి 70ఏళ్ల లోపు ఉంటుందని, తెలుపు చొక్కా ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా అతడిని గుర్తిస్తే ఇందల్వాయి ఎస్సై ఫోన్ నంబర్ 8712659854, సీఐ ఫోన్నంబర్ 8712659851ను సంప్రదించాలన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రుద్రూర్: పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం అందడంతో సుంకినికి వెళ్లగా రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయన్నారు. వాటిని పోలీస్ స్టేషన్ తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మహిళ అదృశ్యం కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని గొల్లవాడకు చెందిన కొట్టూరి లక్ష్మి అనే మహిళ అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 5న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె ఇప్పటికీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. దీంతో ఆమె భర్త పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: నగరంలో ఆదివారం సంస్కార భారతి ఇందూరు మహానగర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాజ్ కుమార్ సుబేదార్, ఉపాధ్యక్షులుగా సముద్రాల శ్రీనివాసచారి, మోహన్రెడ్డి, బున్ని మల్లేష్, జయప్రద, చిరంజీవాచారి, ప్రధాన కార్యదర్శిగా పెండం కార్తీక్, కార్యదర్శులు వి నోద్గౌడ్, వరలక్ష్మి, రమణాచారి, నితీష్ మలాని, పవన్ కుమార్, కోశాధికారిగా రాధాకృష్ణ, మాతృశక్తి కన్వీనర్గా మాధురి, ప్రచార ప్ర ముఖ్గా బెజుగం శ్రీకాంత్, కళావిభాగ్ కన్వీనర్గా ఎన్. రవికుమార్, దృశ్యకళా విభాగ్ కన్వీనర్గా పాముల నవీన్, లోపు కళా విభాగ్ కన్వీనర్గా తోట ప్రశాంత్, సాహిత్య కళ విభాగ్ కన్వీనర్గా శ్రీమన్నారాయణచారి, విరాట్ కళాధరోహర్ విభాగ్ కన్వీనర్గా పురుషోత్తమాచారి, కార్యవర్గ సభ్యులుగా కళ్యాణి, రచనా, రజిని, సాయిరెడ్డి, శివ, నాగమణి, రాము, శ్రీనివాస్ రెడ్డి, సముద్రాల మధుసూదనాచారి ఎన్నికయ్యారు. ప్రాంత సంఘటన్ మంత్రి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
అసంపూర్తిగా జెడ్పీ పాఠశాల భవన నిర్మాణం
ఎల్లారెడ్డిరూరల్: మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలకు నిధులు మంజూరైన అవి పూర్తి స్థాయిలో పనులు కాక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యా బోధన కొనసాగుతున్నది. పాఠశాలలో 80 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి 5 తరగతి గదులు, ప్రిన్సిపల్ గదితో కలిపి ఆరు గదులు అవసరం ఉంది. పురాతన భవనం శిథిలావస్థకు చేరడంతో దానిని కూల్చి వేశారు. పాఠశాలకు గత రెండేళ్ల క్రితం మన ఊరు మన బడి పథకం కింద రూ. 80 లక్షలతో ఆరు తరగతి గదుల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయి. ఈనిధులతో కాంట్రాక్టర్ జీ ప్లస్ వన్లో భవనం నిర్మాణం చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు తరగతి గదులు, ఫస్ట్ ఫ్లోర్లో రెండు తరగతి గదులు నిర్మించాలి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్కు సంబంధించి స్లాబ్ మాత్రమే వేసి పనులను నిలిపి వేశారు. ప్రాథమిక పాఠశాలకు చెందిన రెండు తరగతి గదులలో జెడ్పీ పాఠశాలకు సంబంధించిన రేకుల షెడ్డులో రెండు తరగతులు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనం కింద ఒక తరగతిని నిర్వహిస్తున్నారు. సరిపడా గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో విద్యార్థులు ఇరుకు గదులలో చదువుకుంటున్నారు. అధికారులు స్పందించి పాఠశాలకు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని విద్యార్థులు, వారి తల్లితండ్రులు కోరుతున్నారు. మాచాపూర్లో సరిపడా లేని తరగతి గదులు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
నవీపేటలో సైబర్ మోసం
నవీపేట: మండల కేంద్రంలో ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా.. నవీపేట శివారులోని సాయికృప పెట్రోల్ బంక్లో ఈనెల 1న ఓ వ్యక్తి డీజిల్ పోయించుకొని, రూ.3370ను ఫోన్పే చేశాడు. కానీ ట్రాన్సక్షన్ ఫెయిల్ అయిందని క్యాషియర్ సైబా వెంకటేశ్వర్ సదరు వ్యక్తికి తెలిపాడు. డబ్బులు కట్ అయ్యాయని, త్వరలో వస్తాయని అతడు క్యాషియర్ను నమ్మించాడు. అనంతరం క్యాషియర్ ఫోన్కు ఓ వ్యక్తి కాల్ చేసి ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. డబ్బుల కోసం ఒక ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించగా, వారు చెప్పిన విధంగా ప్రాసెస్ చేశాడు. కొద్దిసేపటికీ విడతల వారీగా అతడి అకౌంట్ నుంచి రూ.70వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో కాల్ చేసిన వారిని సంప్రదించడానికి ప్రయత్నించగా రిప్లయ్ రాలేదు. వెంటనే మోసపోయానని గుర్తించి, సైబర్క్రైమ్ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆదివారం పోలీసులకు ఫిర్యాద చేయగా వారు కేసు నమోదు చేసుకున్నారు. న్యూసెన్స్ చేసిన యువకులపై కేసు నమోదు ఎల్లారెడ్డి: పట్టణంలోని నడి రోడ్డులో శనివారం రాత్రి బర్త్డే పార్టీ పేరిట కేక్ కట్ చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిన యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. రోడ్డుపై కేక్ కట్ చేసిన వారితోపాటు వారి తల్లిదండ్రులకు ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డుపై న్యూసెన్సు చేస్తే కఠిన చర్యలుంటాయని, కేసులు నమోదు చేస్తామని ఎస్సై అన్నారు. -
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మద్నూర్/బిచ్కుంద(జుక్కల్) : మండలంలోని సలాబత్పూర్ హనుమాన్ ఆలయంలో ఆదివారం నిర్వహించిన సీతారాముల కల్యాణ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. బిచ్కుంద రామాలయంలో ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కోట్ల నిధులు మంజూరు చేస్తోందన్నారు. సలాబత్పూర్ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 70 కోట్లు మంజూరు చేసిందన్నారు. బండయప్ప మఠం పీఠాధిపతి శ్రీ సోమయప్ప స్వామి ఆద్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, అరుణతార పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోమయప్ప స్వామి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే తోట -
హన్మాజీపేట్లో హనుమాన్ విగ్రహం ధ్వంసం
బాన్సువాడ రూరల్: మండలంలోని హన్మాజీపేట్ గ్రామ శివారులోని పురాతన హనుమాన్ విగ్రహాన్ని శనివారం రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసినట్లు గుర్తించిన గ్రామస్తులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ మండల అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్టీంతో పాటు డాగ్స్క్వాడ్ను రప్పించి వివరాలు సేకరించారు. సుమారు 4గంటల పాటు గ్రామంలోనే ఉండి విచారణ చేపట్టారు. దుండగులు గుప్తనిధుల కోసం విగ్రహాన్ని ధ్వంసం చేశారా లేదంటే మరో దురుద్దేశంతో చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. దుండగులను వెంటనే పట్టుకుని శిక్షించాలని హనుమాన్ మాలాధారులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఆదివారం నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. పోటీలకు మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పె ద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరి కుస్తీకి పది తులా ల వెండి కడియం, ద్వితీయ కుస్తీకి ఐదు తుల వెండి కడియాన్ని విజేతలకు అందించారు. మాజీ స ర్పంచ్ ఖలీమ్బేగ్, మాజీ ఉప సర్పంచ్ యోగేష్లు మల్లయోధులకు బహుమతులను అందజేశారు. రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలో మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో కుస్తీపోటీలు నిర్వహించారు. కుస్తీ పోటీలకు వివిధ గ్రామాల నుంచి మల్లయోధులు తరలివచ్చి హోరాహోరీగా తలపడ్డారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. వర్ని: మండలంలోని గోవూరు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీపోటీలను నిర్వహించారు. పోటీలలో పాల్గొనటానికి చుట్టుపక్కల గ్రామాల మల్లయోధులు, మహారాష్ట్రకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు. విజేతలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. -
ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ డీఎం
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కరుణశ్రీ ఆదివారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కామారెడ్డి బస్టాండ్ లో నీటి వసతి లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారని సమస్యను పరిష్కరించాలని డిపో మేనేజర్ ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి, సిబ్బంది జయరాం, ప్రకాష్ రావులు పాల్గొన్నారు. పారిశుధ్యం.. అస్తవ్యస్తంబాన్సువాడ రూరల్: మండలంలోని హన్మాజీపేట్ గ్రామంలో మురికి కాలువలు చెత్తచెదారంతో నిండిపోయాయి. నెలలు గడిచినా మురికి కాలువలు శుభ్రం చేయించకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు బెడద నెలకొందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వెంటనే గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేయించాలని కోరుతున్నారు. -
రాముడి ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎదిగా
రామారెడ్డి/తాడ్వాయి/గాంధారి(ఎల్లారెడ్డి): రామారెడ్డిలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆదివారం సీతారాముల కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఇక్కడే పెరిగానని కాలభైరవుడి, సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతోనే ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. రామారెడ్డి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. తాడ్వాయి శ్రీశబరిమాత ఆశ్రమంలో శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఆయన తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమం, ఎర్రాపహాడ్లోని శ్రీరాజరాజేశ్వరాలయం, కన్కల్లోని రామాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాలలో ఏమైనా సమస్యలను దృష్టికి తీసుకువస్తే పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. గాంధారి మండలం రాంలక్ష్మణ్ పల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే మదన్మోహన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శ్రీరామ నవమి సందర్భంగా పలు చోట్ల ప్రత్యేక పూజలు -
హెచ్సీయూపై మాట్లాడడం విడ్డూరం
ఆర్మూర్టౌన్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విలువైన 20వేల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పజెప్పిందని పీసీసీ అధ్యక్షు డు మహేశ్కుమార్ గౌడ్ ఆరోపించారు. అలాంటివారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)కి సంబంధం లేని భూములపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆదివారం ఆయ న ఆర్మూర్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ హెచ్సీయూ విద్యార్థులు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో చర్చలు జరిపి సముచిత నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆర్మూర్ నవనాథ సిద్దుల గుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డిని గుట్టకు తీసుకొస్తానని తెలిపారు. సమావేశంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్రెడ్డి, మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మార చంద్రమోహన్, ఏఎంసీ చైర్మన్ సాయిబాబాగౌడ్, నాయకులు పాల్గొన్నారు. వేలాది ఎకరాల భూములను బీఆర్ఎస్ ధారాదత్తం చేసింది టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
హనుమాన్ ఆలయంలో ఉత్సవాలు ప్రారంభం
మద్నూర్(జుక్కల్): మడలంలోని సలాబత్పూర్ హనుమాన్ ఆలయం హనుమాన్ జయంతి వేడుకలకు ముస్తాబువుతోంది. ఆదివారం నుంచి వారం రోజుల పాటు ఆలయంలో కీర్తన, భజన, సప్తాహం తదితర కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. హనుమాన్ జయంతి వరకు నిత్యం ఆలయంలో భజనలు, కీర్తనలు నిర్వహిస్తామన్నారు. చివరి మూడు రోజుల పాటు జాతర, కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. మార్మోగ్రిన రామనామస్మరణ నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి అంజనాద్రి ఆలయం వద్ద స్థానిక ఆలయకర్త పట్లోళ్ల కిషోర్ కుమార్ ఆంజనేయస్వామి పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. మల్లూర్ పీఠాధిపతులు రాజేశ్వర శర్మ నేతృత్వంలో పడిపూజ ఉత్సవాలు వైభవంగా జరిపారు. పలు మండలాల నుంచి హనుమాన్ స్వాములు పడిపూజకు తరలి వచ్చారు. ముగిసిన లలితా నవరాత్రి ఉత్సవాలు ఎల్లారెడ్డిరూరల్: బగళాముఖి అమ్మవారి పీఠంలో ఉగాది నుంచి ప్రారంభమైన లలిత నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయని జ్యోతిష్య పండితులు క్రాంతి పటేల్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల ముగింపులో భాగంగా బగళాముఖి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఘనంగా బోనాల పండుగఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని భిక్కనూర్ గ్రామంలో ఆదివారం బోనాల పండుగ నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవంలో భాగంగా గ్రామంలోని పెద్దమ్మ తల్లి, నల్ల పోచమ్మ అమ్మవార్లకు మహిళలు బోనాలతో శోభాయాత్ర నిర్వహించి అమ్మవారికి బోనాలను సమర్పించారు. పిల్లా పాపలు పాడి పంటలు సల్లంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. -
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని మైలారం గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై లావణ్య తెలిపిన వివరాలు ఇలా.. మైలారం గ్రామానికి చెందిన దూళి గంగారాం(73) చాలా రోజులు గా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కొన్ని నెలల క్రితం ఎడమ కాలుకు గాయం కావడంతో షుగర్వ్యాధి కారణంగా నడవలేక పోయేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీబీపేట మండలంలో.. బీబీపేట: మండలంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన కన్న బాల్రాజ్గౌడ్ (54)కు కొద్ది నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నొప్పి తగ్గలేదు. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది ఈనెల 5న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు అతడిని గమనించి, వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు సాయికృష్ణాగౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సలాబత్పూర్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తా
మద్నూర్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయంగా స లాబత్పూర్ హనుమాన్ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారా వు పేర్కొన్నారు. సలాబత్పూర్ హనుమాన్ ఆ లయ అభివృద్ధికి రూ. 70 కోట్లు మంజూర య్యాయన్నారు. సలాబత్పూర్ హనుమాన్ ఆ లయంలో ఆదివారం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నూతన చైర్మన్ రాంపటేల్, స భ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అ నంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ –మహారాష్ట్ర –కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రసిద్ధిచెందిన హనుమాన్ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అంతర్రాష్ట్ర లెండి ప్రా జెక్ట్ పనుల కోసం బడ్జెట్లో రూ. 50 కోట్ల వర కు నిధులు మంజూరు చేశామన్నారు. అనంత రం ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యేను స న్మానించారు. కార్యక్రమంలో ఆలయ అధికా రులు, నాయకులు పాల్గొన్నారు. రూ. 70 కోట్లు మంజూరయ్యాయి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు -
వెదురుబొంగుల షాపులో అగ్నిప్రమాదం
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. వర్ని చౌరస్తా వద్ద ఓ వెదురు బొంగుల షాపులో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. అ క్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సీఐ ప్రసాద్ అక్కడి చేరుకుని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘటన స్థలా నికి చేరుకోగా, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావు ఆఽధ్వర్యంలో సిబ్బంది మంటలను అర్పివేశారు. షార్ట్సర్క్యూట్తో ప్రమాదం జరిగినట్లు, సుమారు రూ.10లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. -
బాల్యం ఎప్పటికీ తిరిగిరానిది
బీబీపేట: పాఠశాల బాల్యం జీవితంలో ఎప్పటికీ తిరిగిరానిదని డీఈవో రాజు అన్నారు. శుక్రవారం మండలంలోని జనగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వార్షికోత్సవానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ పాత రాజు, హెచ్ఎం ప్రవీణ్కుమార్, మాజీ ఎంపీటీసీ రవిందర్రెడ్డి, దోమకొండ ఎంఈవో విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా స్వయంపాలన దినోత్సవం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మేజర్వాడి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం స్వయంపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడో తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటివిద్యార్థులకు పాఠాలను బోధించారు. అనంతరం పాఠశాలలోని ఆరో తరగతి విద్యార్థులు ఏడో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రాజు, ఉపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీలత, మౌనిక తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్య పనుల పరిశీలన బీబీపేట: మండల కేంద్రంలోని పారిశుధ్య పనులను శుక్రవారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. రేషన్ షాపు వద్దకి వెళ్లి సన్నబియ్యం పంపిణీ వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ గడువును ప్రభుత్వం ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు దారులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో అబ్బాగౌడ్, కారోబార్ సిద్దరాములు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. -
చి‘వరి’కి మెడవిరుపు...
మాచారెడ్డి : మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాల్లో ఒక వైపు ఎండిన పంటలు, మరోవైపు మెడవిరుపు తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు మండలాల్లో కలిపి 22 వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. భూగర్భజలాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు బోర్లు ఎత్తిపోయి, దీనికి తోడు ఎండలు పెరిగి పంటలు దెబ్బతిన్నాయి. మెడవిరుపు తెగుళ్లతో మరింత నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఒక వైపు తెగుళ్ల బెడద మరోవైపు ఎండుతున్న వరి ఆందోళనలో రైతులు -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
ఖలీల్వాడి: నిజామాబాద్, ఆర్మూర్లోని బెట్టింగ్ ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా కేంద్రంతోపాటు ఆర్మూర్లో బెట్టింగ్ ముఠాకు చెందిన మొత్తం ఏడుగురిని పట్టుకున్నారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో సీపీ పోతరాజు సాయిచైతన్య శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 3న నగరంలోని ఆటోనగర్ భారతీరాణి కాలనీకి చెందిన షేక్ ముజీబ్ అహ్మద్ ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఐదో టౌన్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ముజీబ్ అహ్మద్తోపాటు బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న షేక్ నదీం, షేక్ జునైద్, షేక్ రహాన్ను అరెస్టు చేశారు. ముజీబ్కు రెండేళ్ల క్రితం సాలూర మండలానికి చెందిన షకీల్ ద్వారా నాందేడ్ జిల్లా ధర్మాబాద్కు చెందిన బెట్టింగ్ మాస్టర్ సచిన్ పరిచయమయ్యాడు. ఈజీ మనీకి ఆశపడి ముజీబ్ సచిన్ ద్వారా ఏజెంట్గా చేరాడు. సచిన్పైన ఉండే సూపర్ మాస్టర్ ద్వారా ఆన్లైన్ యూజర్ ఐడీ, పాస్వర్డ్ పొందాడు. అనంతరం సుమారు 1000 మంది అమాయకులకు ఆశచూపి బెట్టింగ్లోకి దించాడు. యూజర్స్ డిపాజిట్ చేసిన డబ్బు ఏజెంట్ ద్వారా మాస్టర్కు చేరి, అనంతరం మాస్టర్ నుంచి ఏజెంట్కు 7 శాతం కమీషన్ వస్తుంది. ఇందులో 200 మంది బెట్టింగ్కు పాల్పడగా, ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.88 లక్షల లావాదేవీలు జరిగాయన్నారు. ఈ కేసులో సాలూరకు చెందిన షకీల్, ఆటోనగర్కు చెందిన షేక్నజీబ్, నాందేడ్ జిల్లా ధర్మాబాద్కు చెందిన సచిన్, ట్రావెల్స్ యజమాని రమేశ్ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. నిందితుల నుంచి రూ. 50 వేలు, ఐదు సెల్ఫోన్లు, రెండు పాసుబుక్లు, క్రెడిట్, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసును ఛేదించిన నార్త్ సీఐ బూక శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సైలు గంగాధర్, లక్ష్మయ్యను సీపీ అభినందించారు. పరారీలో ఐదుగురు.. ఆర్మూర్ పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఎనిమిది మందిని గుర్తించి, ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. హర్యానా రాష్ట్రం మంగ్కు చెందిన విపుల్, మహారాష్ట్రలోని బోరికి చెందిన బంటు పలాస్ అలియాస్ శేఖర్, యావత్మాల్కు చెందిన బబ్లూ ఠాకూర్, వినాయక్ ఠాకూర్ నిషేధిత బెట్టింగ్ యాప్లను వాట్సాప్ల ద్వారా ఆర్మూర్కు చెందిన గట్టడి గౌతమ్, దయాళ్ సునీల్, జాజు రంజిత్, శ్రీకాంత్ అలియాస్ శ్రీకర్లకు పంపించారు. దీంతో ఈ నలుగురు కొన్ని రోజుల నుంచి క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును సునీల్ అమాయక ప్రజలకు అధిక వడ్డీలకు ఇచ్చి వారి బైక్లను తాకట్టు పెట్టించుకున్నాడు. ఈ నెల 3న సాయంత్రం 4.30 గంటలకు ఆర్మూర్లోని గట్టడి గౌతమ్ ఇంట్లో సునీల్, రంజిత్ బెట్టింగ్ ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 3 సెల్ఫోన్లు, రూ.6 వేలు, తాకట్టు పెట్టుకున్న 34 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. కాగా, ఆర్మూర్లోని హుస్నాబాద్గల్లీకి చెందిన గట్టడి శ్రీకాంత్ అలియాస్ శ్రీకర్తోపాటు విపుల్, బంటు పలాస్ అలియాస్ శేఖర్, బబ్లూ ఠాకూర్, వినాయక్ ఠాకూర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసును చేధించిన ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణ, టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై మహేశ్ను సీపీ అభినందించారు. నిజామాబాద్లో నలుగురు, ఆర్మూర్లో ముగ్గురు ఆర్మూర్లో 34 బైక్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ పోతరాజు సాయిచైతన్య -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
జక్రాన్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామానికి చెందిన బైరం రవీంద్ర వర్మ (37) ఈనెల 3న రాత్రివేళ జక్రాన్పల్లి మండలంలోని బాలనగర్ 44వ నంబర్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ మెంట్రాజ్పల్లికి వస్తున్నాడు. ఈక్రమంలో అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటన స్థలాన్ని ఎస్సై తిరుపతి పరిశీలించి, క్షతగాత్రుడిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గురువారం సాయంత్రం రవీంద్ర వర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో దూడ.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెల్లకుంటతండాలో విద్యుదాఘాతంతో ఆవుదూడ మృతిచెందింది. తండాలోని మూడ లక్ష్మణ్కు చెందిన దూడ శుక్రవారం మేత కోసం వెళ్లి తండాసమీపంలో గల ఎస్ఎస్–2ట్రాన్స్ఫార్మర్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. దీంతో దూడ అక్కడిక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న మండల పశువైద్యాధికారి రవికుమార్ ఘటన స్థలంలోనే పోస్ట్మార్టం నిర్వహించారు. దూడ విలువ సుమారు రూ.30వేల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. బాధిత రైతును ట్రాన్స్కో శాఖ ఆదుకోవాలని తండావాసులు కోరుతున్నారు. ఒకరి మృతి కేసులో 9నెలల జైలు శిక్ష కామారెడ్డి క్రైం: అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితుడికి 9 నెలల జైలు శిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ కామారెడ్డి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. భిక్కనూర్కు చెందిన జమ్మగౌని పోట్ల ముత్తాగౌడ్ కిరాణ దుకాణం నడుపుతూ జీవించేవాడు. గతేడాది ఓ రోజు రాత్రి అతడు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బోయిని స్వామి అనే వ్యక్తి తన ఆటోను అజాగ్రత్తగా నడిపి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ముత్తాగౌడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. భిక్కనూర్ పోలీసులు కేసు నమోదు చేసి స్వామిని రిమాండ్కు తరలించారు. కోర్టులో నేరం రుజువు కావడంతో కామారెడ్డి కోర్టు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ దీక్ష నిందితుడికి జైలుశిక్ష, జరిమానా విధించారు. సీఐ సంపత్ కుమార్, ఎస్సైలు రాజు, ఆంజనేయులు, పీపీ అశోక్ శివరాం నాయక్, కోర్టు లైజనింగ్ అధికారి మురళి, కానిస్టేబుల్రాజశేఖర్ గౌడ్ లను ఎస్పీ రాజేష్ చంద్ర అఽభినందించారు. -
మహిళ హత్యకేసులో ఒకరి అరెస్ట్
ఖలీల్వాడి: ఇటీవల పాంగ్రాలో జరిగిన ఒంటరి మహిళ హత్య ఘటనలో నిందితుడిని పట్టుకొని, అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నగరంలోని పాంగ్రాలో చారుగొండ చంద్రకళ(55) ఒంటరిగా నివసిస్తుండగా, ఆమెకు కల్లు దుకాణంలో కామారెడ్డి జిల్లాలోని హరిజనవాడకు చెందిన శంషాబాద్ విజయ్ ఆలియాస్ విష్ణు ఆలియాస్ చింటూ పరిచయమయ్యాడు. గతనెల 23న ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించడానికి ఇంటికి వెళ్లి కల్లు తాగించాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు చెవికమ్మలు, మాటీలు, వెండి ఆభరణాలతోపాటు సెల్ఫోన్ను నిందితుడు తీసుకొని, వెంటతెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్యచేశాడు. అదే గ్రామంలోని ఓ ఇంటి ఎదుట పార్క్ చేసిన బైక్పై పారిపోయాడు. కేసు నమోదు చేసి, విచారణ చేపట్టగా, నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. అలాగే అతడి వద్ద నుంచి ఏడు గ్రాముల బంగారం, 75 గ్రాముల వెండి, హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును చేధించిన సీఐ శ్రీనివాసరాజు, ఎస్సై శ్రీకాంత్, సిబ్బందిని సీపీ అభినందించారు. -
సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ
ఎల్లారెడ్డిరూరల్ : మండలంలోని అడివిలింగాల గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్కుమార్ రాజస్థాన్లోని మౌంట్ అబుకు సేంద్రియ వ్యవసాయంతో చేసే సాగుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమానికి వెళ్లినట్లు గ్రామస్తులు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యవసాయ శాఖ ద్వారా జిల్లాకు ఒక రైతు చొప్పున రాజస్థాన్కు పంపించారు. గుజరాత్లో రోబో కింగ్, దర్తి కంపెనీలను సందర్శించిన కాసుల బాన్సువాడ : గుజరాత్లోని రాజ్కోట్లో రోబోకింగ్, దర్తి కంపెనీలను శుక్రవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ సందర్శించారు. వ్యవసాయానికి సంబంధించిన పలు యంత్రాలు, రోటవేటర్, స్పిడారు, కట్టర్ తదితర పనిముట్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం నుంచి రైతులు సబ్సిడీలపై వ్యవసాయ యంత్రాలను అందజేయనున్న నేపథ్యంలో గుజరాత్కు వెళ్లినట్లు కాసుల పేర్కొన్నారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ యూనుస్ తదితరులున్నారు. -
చి‘వరి’కి మెడవిరుపు...
మాచారెడ్డి : మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాల్లో ఒక వైపు ఎండిన పంటలు, మరోవైపు మెడవిరుపు తెగుళ్లతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండు మండలాల్లో కలిపి 22 వేల ఎకరాల్లో వరి పంట సాగైంది. భూగర్భజలాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులు బోర్లు ఎత్తిపోయి, దీనికి తోడు ఎండలు పెరిగి పంటలు దెబ్బతిన్నాయి. మెడవిరుపు తెగుళ్లతో మరింత నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఒక వైపు తెగుళ్ల బెడద మరోవైపు ఎండుతున్న వరి ఆందోళనలో రైతులు -
శివాజీ విగ్రహావిష్కరణపై వివాదం
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదానికి దారి తీసింది. ఏర్గట్లకు చెందిన కొన్ని యువజన సంఘాలు ప్రజల నుంచి విరాళాలు సేకరించి శివాజీ విగ్రహాన్ని తయారు చేయించాయి. బస్టాండ్ ప్రాంతంలోని తెలంగాణ తల్లి విగ్రహం పక్కన శివాజీ విగ్రహాన్ని నిలిపిఉంచారు. శుక్రవారం ఉదయం విగ్రహాన్ని ఆవిష్కరించి గద్దె నిర్మాణం పనులు ప్రారంభించారు. కానీ పోలీసులు వచ్చి విగ్రహం ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని పనులను అడ్డుకున్నారు. ఎవరి అభ్యంతరం లేకపోయినా పోలీసులు అడ్డుకోవడంపై స్థానికులు నిరసన తెలిపారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్రెడ్డి, ఇతర పోలీసు అధికారులు స్థానికులతో చర్చలను జరిపారు. 10 రోజుల్లో అనుమతి తీసుకోవాలని సూచించి, విగ్రహానికి ముసుగువేశారు. అనుమతి తీసుకున్న తర్వాతనే విగ్రహానికి ఉన్న ముసుగు తొలగించడానికి యువజన సంఘాల సభ్యులు అంగీకరించడంతో వివాదం ముగిసిపోయింది. ఇదిలా ఉండగా ఆవిష్కరించిన రోజునే శివాజీ విగ్రహాంపై ముసుగు వేయడం కాకతాళీయంగా చోటు చేసుకుంది. -
‘ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలి’
గాంధారి : ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు క లెక్టర్ చందర్ నాయక్ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన గాంధారి మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఎల్ఆర్ఎస్ కాల్ సెంటర్ను పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ ఇచ్చే గడువును ప్రభుత్వం పొడిగించిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అ ధికారులకు సూచించారు. అనంతరం బ్రా హ్మణపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరి శీలించారు. ప్రాథమిక పాఠశాలలో మధ్యా హ్న భోజనాన్ని, అనంతరం రేషన్ దుకాణంలో సన్నబియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వ ర్, ఎంపీవో లక్ష్మీనారాయణ, ఆర్ఐ ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: గ్రామ పరిపాలన అధికారుల నియామకం కోసం అర్హులైన మాజీ వీ ఆర్వో, వీఆర్ఏలు ఈనెల 16వ తేదీవరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టరేట్ పరిపాలనాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థు లు గూగుల్ ఫాం ద్వారా దరఖాస్తు చేసి, దా ని ప్రతిని కలెక్టరేట్లో అందజేయాలని సూ చించారు. సెట్విన్లో శిక్షణకు.. కామారెడ్డి అర్బన్ : సెట్విన్లో వివిధ వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణకోసం దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కామారెడ్డి సెంటర్ సమన్వయకర్త సయ్యద్ మోయిజుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. డీసీఏ, పీజీడీసీఏ, టాలీ, ఫొటోషాప్, జావా, టైలరింగ్, ఫ్యాష న్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, మెహందీ కోర్సుల్లో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 73861 80456, 79891 59121 నంబర్లలో సంప్రదించాల ని సూచించారు. పంటల పరిశీలన బిచ్కుంద: మండలంలో శుక్రవారం జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ పర్యటించారు. వాజిద్నగర్, పుల్కల్, గుండెనెమ్లిలలో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని అన్ని మండలాల వ్యవసాయ అధికారులను ఆదేశించామన్నారు. గుండెనెమ్లిలో 50 ఎకరాలు, బండరెంజల్లో 65, వాజిద్నగర్లో 150, సీతారాంపల్లిలో 30, మానేపూర్లో 150, పుల్కల్లో 135, పెద్దదేవాడలో 40ఎకరాలలో వరి పంట దెబ్బతిన్నట్లు గుర్తించామని, పూర్తి వి వరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. ‘చిన్నారులపై దృష్టి సారించాలి’ నిజాంసాగర్ : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఎదుగుదలపై ప్రత్యేక శ్రద్ద చూ పాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అ ధికారి ప్రమీల సూచించారు. శుక్రవారం ఆ రేడ్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో చిన్నారుల బరువులు, ఎత్తులకు సంబంధించిన రికార్డుల నిర్వహణను గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలతో పాటు చి న్నారులకు సక్రమంగా అందించాలని సూ చించారు. ఆమె వెంట ఈజీఎస్ ఏపీవో శివకుమార్, పంచాయతీ కార్యదర్శులు అంజ య్య, తుకారాం, అంగన్వాడీ టీచర్లు ప్రమీ ల, విజయలక్ష్మి తదితరులున్నారు. -
కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి
కామారెడ్డి క్రైం : యాసంగి సీజన్కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకోసం 446 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటి వరకు 33 కేంద్రాలను ప్రారంభించామని, ధాన్యం సేకరణ మొదలుపెట్టి 686 టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. మిగతా కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలన్నారు. అవసరమైన టార్పాలిన్లు, తూకం మిషన్లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, క్యాలీపర్స్లను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించాలి పట్టణ ప్రాంతాల్లో రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలనను వార్డు అధికారులు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన దరఖాస్తులను జీపీ కార్యదర్శులు పరిశీలించాలన్నారు. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన వాటిని రెవెన్యూ సిబ్బంది పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సరిచూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ ఆఫీసర్స్ పరిశీలించాలన్నారు. సమావేశంలో కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్లు రాజేందర్రెడ్డి, శ్రీహరి, మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు.జొన్న కొనుగోలు కేంద్రాలకోసం.. జిల్లాలో 15 జొన్నల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వంనుంచి అనుమతులు రాగానే జొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మార్కెటింగ్ అధికారి రమ్య, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
దొడ్డు బియ్యం.. ఏం చేయాలి?
ఎల్లారెడ్డి : ప్రభుత్వం ఈనెలనుంచి రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. అయితే నిల్వ ఉన్న దొడ్డు బియ్యం ఏం చేయాలన్న విషయమై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాటిని ఏం చేయాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బందిపడుతున్నారు. జిల్లాలోని 578 రేషన్ దుకాణాలున్నాయి. వీటి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి రేషన్ దుకాణాలకు 5,571 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయాల్సి ఉండగా.. ఇప్పటికే దాదాపుగా మొత్తం బియ్యాన్ని సరఫరా చేసింది. పంపిణీ ప్రారంభించిన నాలుగు రోజుల్లోనే 55 శాతం లబ్ధిదారులు బియ్యం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సన్నబియ్యం పంపిణీ జోరుగా సాగుతున్నా.. తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యం నిల్వలను ఏం చేయాలన్న విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో రేషన్ డీలర్లు అయోమయంలో ఉన్నారు. జిల్లాలోని రేషన్ షాప్లలో గతనెలకు సంబంధించి సుమారు 500 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వ ఉన్నట్లు తెలుస్తోంది. తమ వద్ద ఉన్న దొడ్డు బియ్యం స్టాక్ వివరాలను రేషన్ డీలర్లు గతనెల 20వ తేదీలోగానే పౌర సరఫరాల శాఖ అధికారులకు అందించారు. ఎల్లారెడ్డి మండలంలోని 29 రేషన్ షాపుల్లో 337.22 క్వింటాళ్ల దొ డ్డు బియ్యం నిల్వ ఉన్నాయి. ఈ కోటా ఖాళీ కాకముందే రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కా ర్యక్రమాన్ని ప్రారంభించింది. ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ భారీగా దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. తమ దుకాణాలలో పాత స్టాకు ఖాళీ కాకముందే సన్న బియ్యం స్టాకు రావడంతో పాత స్టాకును ఎక్కడ పెట్టాలో తెలియక డీలర్లు ఇబ్బంది పడ్డారు. అంతేగాక దుకాణంలో దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నందున సన్నబియ్యంలో దొడ్డు బియ్యా న్ని కలిపి ఇస్తున్నారా అని లబ్ధిదారులు అనుమానిస్తున్నారని రేషన్ డీలర్లు పేర్కొంటున్నారు. రేషన్ దుకాణాలలో మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిల్వలను సాధ్యమైనంత తొందరగా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.ఎల్లారెడ్డిలోని ఓ రేషన్ దుకాణంలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం రేషన్ షాపుల్లో భారీగా నిల్వలు తరలింపు విషయంలో స్పష్టత కరువు నిల్వ చేయడానికి ఇబ్బంది పడుతున్న రేషన్ డీలర్లుఆదేశాలు రావాల్సి ఉంది జిల్లాలోని రేషన్ దుకాణాలు, ఎంఎల్ఎస్ పా యింట్లలో దొడ్డు బియ్యం నిల్వలున్నాయి. వా టి విషయంలో ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. – మల్లికార్జున్ బాబు, జిల్లా పౌర సరఫరాల అధికారి -
రుణమాఫీ అంతేనా..!?
కామారెడ్డి క్రైం: కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో రైతు రుణమాఫీ ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నిధుల కొరత ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలు చేయాలనే సంకల్పంతో చర్యలు మొదలుపెట్టింది. ఏకకాలంలో కాకపోయినా విడతల వారీగా నాలుగుసార్లు రుణమాఫీ నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఇదిలా ఉండగా అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు రుణమాఫీపై చేసిన ప్రకటన రైతులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. కుటుంబం యూనిట్గా రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వారికి మాఫీ వర్తిస్తుందో లేదో స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. స్పష్టత లేని ప్రకటనలు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటనతో కుటుంబం యూనిట్గా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. కుటుంబం యూనిట్గా రూ.2 లక్షల వరకు మాఫీ ఇస్తామని గతంలో అనేక సార్లు ప్రభుత్వం ప్రకటించి అర్హుల జాబితాను సైతం సేకరించింది. రూ.2 లక్షల పైబడి మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాలని కూడా సూచించింది. చాలా మంది రైతులు రూ.2 లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని చెల్లించి ఎదురు చూస్తున్నారు. కుటుంబం యూనిట్గా తీసుకున్నా రూ.2 లక్షల వరకు మాఫీ చేయాల్సి ఉంది. తాజాగా వ్యవసాయ మంత్రి మాటల్లో కూడా స్పష్టత లేదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.దాదాపు లక్ష మంది రైతులకు..‘రైతు రుణమాఫీపై ప్రభుత్వ నిర్ణయం రూ.2లక్షల వరకు ఉన్న రుణం మాఫీ. రూ.2లక్షలకు పైన మాఫీ లేదు. కుటుంబానికి రూ.2లక్షలలోపు రుణం వాటిని మాఫీ చేస్తామన్నాం. ఇలాంటి కుటుంబాలకు మాఫీ చేశాం. రుణమాఫీ విషయంలో ప్రతిపక్షాలు గందరగోళపడి రైతులను గందరగోళం చేయొద్దు’ – అసెంబ్లీ సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపక్షాలను పక్కనపెడితే మంత్రి వ్యాఖ్యలపై రైతుల్లో మాత్రం గందరగోళం నెలకొంది. కుటుంబం యూనిట్గా రూ.2లక్షలకుపైగా రుణం ఉన్న వారి సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు.రుణమాఫీ పథకం ప్రారంభానికి ముందు జిల్లాలో మొత్తం 1,98,374 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారు. ఎన్నికల హామీ ప్రకారం రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేసేందుకు జిల్లాకు రూ.1,283.14 కోట్లు అవసరం ఉండేవి. కానీ అర్హుల జాబితా నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను మినహాయించారు. రూ.లక్ష లోపు రుణాలు ఉన్న 49,540 మంది రైతులకు మొదటి విడతలో రూ.231 కోట్లు, రెండో విడతలో 24,816 మంది రైతులకు రూ.212 కోట్లు, మూడో విడతలో 16,903 మంది రైతులకు రూ.203 కోట్ల రుణమాఫీ వర్తించింది. రేషన్ కార్డులు లేక, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో, పట్టాపాస్ పుస్తకాల్లో తప్పిదాల కారణంగా రుణమాఫీ వర్తించని వారి సమస్యలను పరిష్కరించి నాలుగో విడతలో రూ.2 లక్షలలోపు రుణాలున్న మరో 8,942 మంది రైతులకు రుణమాఫీ నిధులు జమ చేశారు. అక్కడితో రైతు రుణమాఫీ పథకం అమలు నిలిచిపోయింది. మొత్తం మీద జిల్లాకు సంబంధించి 1,00,201 మంది రైతులకు గాను నాలుగు విడతల్లో కలిపి రూ.717 కోట్లు లబ్ది చేకూరింది. కుటుంబం యూనిట్గా రూ.2 లక్షలకు పైగా రుణాలు కలిగిన మొత్తం రైతులు మరో 98 వేల మంది వరకు ఉన్నారు. రూ.2 లక్షల లోపు రుణాలు మాత్రమే మాఫీ వ్యవసాయ మంత్రి ప్రకటనతో రైతుల్లో నైరాశ్యం చేతులెత్తేసినట్లేనా అని రైతుల్లో సందేహాలు కుటుంబం యూనిట్గా రూ.2 లక్షలకు పైగా రుణం ఉన్న వారి సంగతేమిటో.. స్పష్టత ఇవ్వాలంటున్న రైతులుఉత్తర్వులు రాలేదు రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలతో జాబితాను ఇదివరకే పంపించాం. రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు దాదాపుగా మాఫీ అయ్యాయి. సాంకేతిక సమస్యలు ఎదురైన చోట పరిష్కరించి రుణమాఫీ అందరికీ అందేలా చూస్తున్నాం. రూ.2 లక్షలకు పైగా ఉన్న రుణాల మాఫీపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటివరకు మాకు ఎలాంటి సమాచారం, ఉత్తర్వులు రాలేదు. – తిరుమల ప్రసాద్, డీఏవో, కామారెడ్డి -
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
కామారెడ్డి క్రైం: రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. గడిచిన మూడు నెలల కాలంలో జిల్లాలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల వివరాలు తెలుసుకుని కారణాలపై ఆయా అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై పరిమితికి లోబడి వాహనాల వేగం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పీడ్ గన్ల ద్వారా వేగాన్ని గుర్తించి జరిమానాలు విధించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై దృష్టి సారించాలని, అతి వేగం కారణంగా జరిగే ప్రమాదాలు, కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.జిల్లాలో 28 బ్లాక్ స్పాట్లు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై ప్రత్యేక దృష్టి సారించాలి హైవేలపై వాహనాలు పార్కింగ్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్జిల్లాలో తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న 28 బ్లాక్ స్పాట్లను గుర్తించామమని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. ఎక్కువగా రాత్రి 8 గంటల తర్వాత, వేకువజామున సమయాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీటీవో శ్రీనివాస్రెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంత్రావు, వైద్య ఆరోగ్య, జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పీఆర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): దేశ ఔన్నత్యాన్ని చాటిన మహనీయులను స్మరిస్తూ వారిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం సూచించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బుద్ద విగ్రహం, జ్యోతి బాపూలే, సావిత్రీబాయి పూలే, రమాబాయి విగ్రహాలను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్తో కలిసి ఎమ్మెల్యే గురువారం ఆవిష్కరించారు. అంతకు ముందు నంది విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం భారీ ర్యాలీ నిర్వహించి అంబేడ్కర్కు నివాళులు అర్పించారు. విగ్రహాల ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహనీయుల ఆశయ సాధనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం ప్రీతమ్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ వక్త, ఉస్మానియా యూనివర్సిటి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాశీం, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల భాగయ్య, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సంగారెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, యూత్కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు సంపత్గౌడ్, మాజీ వైస్ చైర్మన్ గాదారి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ రాజేందర్, గ్రామ అధ్యక్షుడు రాజయ్య, అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు జగ్గ బాల్రాజు, విండో చైర్మన్లు సదాశివరెడ్డి, గంగాధర్, ఆయా మండలాల ఎస్సీ సెల్ బాధ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
కామారెడ్డి టౌన్: సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టీ నాగరాణి సూచించారు. జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ను న్యాయమూర్తి గురువారం సందర్శించి ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడారు. ఫిర్యాదుల బాక్స్, వంట గది, పరిసర ప్రాంతాలు తనిఖీ చేశారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ న్యాయ వాది మాయ సురేశ్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్న్స్ కౌన్సెల్ శ్రీనివాస్రావు, సబ్ జైలు సూపరింటెండెంట్ సంజీవరెడ్డి, సిబ్బంది ఖాజా, సమీ ఉల్లాహ్ ఖాన్, సా యికృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి కామారెడ్డి టౌన్: భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు అన్నారు. ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్‘ కార్యక్రమంలో గురువా రం జిల్లా కేంద్రంలోని 4, 26వ వార్డులలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు. రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రధాన చౌరస్తాలో కాలనీవాసులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గొడు గుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు పిడుగు మమత, కన్నయ్య, నాయకులు సాయిబాబా, ప్రసన్న, చందు, సాయిలు, కిరణ్, సత్యం, జాకీర్, లక్కపదిని గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బయటపడిన రాతి విగ్రహం నస్రుల్లాబాద్(బాన్సువాడ) : మండలంలోని మిర్జాపూర్లో గతనెల 28వ తేదీన కొందరు వ్యక్తులు భూమిని చదును చేస్తుండగా ఓ పురాతన రాత్రి విగ్రహం బయటపడింది. ఆరు రోజుల తరువాత సమాచారం అందడంతో తహసీల్దార్ ప్రవీణ్కుమార్, బాన్సువాడ రూరల్ సీఐ రాజేశ్ దానిని పరిశీలించి హనుమాన్ ఆలయం వద్దకు చేర్చారు. విగ్రహం సైనికుడి ఆకారంలో ఉందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని అధికా రులు తెలిపారు. విగ్రహాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి హనుమాన్ మాలధారులు, ప్రజలు తరలివచ్చారు. -
ఆగం చేసిన అకాలవర్షం
● జిల్లాలోని పలు చోట్ల ఈదురుగాలులు, వడగళ్ల వాన ● నేలవాలిన మక్క, రాలిన వడ్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: సాగునీటి సమస్యతో ఇప్పటికే పంటలు దెబ్బతిని రైతులు ఇబ్బందులు పడుతుండగా, గురువారం ఈదురుగాలులు వీస్తూ వర్షం కురవడంతో జిల్లాలోని పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. పెద్దకొడప్గల్, నస్రుల్లాబాద్, బిచ్కుంద, నిజాంసాగర్, బాన్సువాడ, రామారెడ్డి, దోమకొండ, మాచారెడ్డి తదితర మండలాల్లోని కొన్ని చోట్ల రాళ్ల వర్షం కురిిసి వడ్లు నేలరాలాయి. ఈదురుగాల కారణంగా మక్క నేలవాలింది. పంటలకు ఏమేరకు దెబ్బతిన్నాయనేది తెలియాల్సి ఉంది. కాగా గడిచిన పక్షం రోజులుగా ఎండ కారణంగా ఇబ్బందులు పడిన ప్రజలు వాతావరణం చల్లబడడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. -
మహిళల చేతికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తోంది. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా సంఘాలకు ఇప్పటికే సోలార్ పవర్ యూనిట్లను, ఆర్టీసీ హైర్ బస్సులు, పెట్రోల్ బంకులు, క్యాంటీన్లతోపాటు మరెన్నో భారీ అవకాశాలు కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల్లో 99శాతం మంది సభ్యులు వ్యవసాయ కుటుంబాలకు చెందిన మహిళలే ఉంటారు. వారికి వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉంటుంది. ఈ కారణంగా కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నారు. గతంలో జిల్లాలో కేవలం 27 కేంద్రాలు మాత్రమే మహిళలకు కేటాయించగా, ఇప్పుడు ఏకంగా 180 కొనుగోలు కేంద్రాలను అప్పగించారు. జిల్లాలో 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా అందులో 180 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో మహిళా సంఘాలకు కేంద్రాలను అప్పగించారు. ఈ సారి కొనుగోలు కేంద్రాల నిర్వహణలో మహిళల పాత్ర భారీగా పెరిగింది. మహిళా సంఘాలు అన్నింటా సక్సెస్ అవుతున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలోనూ విజయం సాధిస్తారని అధికారులు అంటున్నారు. మహిళా సంఘాల ప్రతినిధులకు శిక్షణ కామారెడ్డి క్రైం: యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కామారెడ్డి మండల సమాఖ్య కార్యాలయంలో మహిళా సంఘాల ప్రతినిధులకు గురువారం శిక్షణ ఇచ్చారు. మండలంలోని తిమ్మక్పల్లి(కె), కోటాల్పల్లి, క్యాసంపల్లి తండా, రాఘవపూర్, గూడెం గ్రామాల్లో మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో డీపీఎం రమేశ్బాబు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను అప్పగించాలని నిర్ణయం తీసుకుందన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ఐకేపీ ఏపీఎంలు మోయిజ్, శ్రీనివాస్, వ్యవసాయ విస్తీర్ణాధికారులు, మహిళా సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 180 కేంద్రాలు అప్పగింత -
నాణ్యత, తూకంలో తేడా ఉండొద్దు
రామారెడ్డి: రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న సన్న బియ్యం నాణ్యత, తూకంలో వ్యత్యాసం లేకుండా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని రేషన్ షాపులో లబ్ధిదారులకు కలెక్టర్ గురువారం సన్నబియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 47శాతం సన్నబియ్యాన్ని పంపిణీ చేశామని, రామారెడ్డిలో 70శాతం పంపిణీ పూర్తయ్యిందని తెలిపారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడామని, సన్న బియ్యం పంపిణీపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రేషన్షాపులో నాణ్యత, తూకంలో వ్యత్యాసం ఉంటే వెంటనే సివిల్ సప్లయీస్ అధికారులను సంప్రదించాలని కార్డుదారులకు ఆయన సూచించారు. -
ఒక్కో బస్తాలో 6 కిలోలు తక్కువ..
● రేషన్ బియ్యం తూకంలో మోసం ● లబోదిబోమంటున్న రేషన్ డీలర్లు ● అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదనకామారెడ్డి రూరల్: సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ గోదాం నుంచి రేషన్ షాపులకు సరఫరా అవుతున్న బియ్యం బస్తాల్లో బియ్యం తక్కువగా వస్తోందని రైషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50 కిలోల బస్తాలో దాదాపు 4 నుంచి 6 కిలోల వరకు తక్కువగా బియ్యం వస్తున్నాయని అంటున్నారు. ప్రతి 50 కిలోల బస్తాకు బ్యాగు బరువుతో 5.80 గ్రాములు కలిపి ఖచ్చితంగా తూకం వేసి రేషన్ షాపులకు సరఫరా చేయాలి. తాము మాత్రం లబ్ధిదారులకు సరైన తూకంతో బియ్యం పంపిణీ చేస్తుండగా, తమకు సరఫరా అవుతున్న సంచుల్లో బియ్యం తక్కువగా వస్తోందని డీలర్లు వాపోతున్నారు. దీనిని ఎవరు భరించాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే గోదాం నిర్వహకులు బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిలో జిల్లాలోని ఏడు ఎంఎల్ఎస్ పాయింట్ల పరిధిలో ఉందని అంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. -
అన్నదాతకు అకాల దెబ్బ
బాన్సువాడ/నిజాంసాగర్/బిచ్కుంద/నస్రుల్లాబాద్/పెద్దకొడప్గల్/బాన్సువాడ రూరల్ : ఆరుగాలం రైతులు కష్టపడి పండించిన పంట గురువారం కురిసిన వర్షానికి నేలవాలింది. బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో, జుక్కల్, మండడంలోని జుక్కల్ చౌరస్తా, కౌలాస్, శాంతాపూర్, గ్రామాల్లో, బిచ్కుంద మండలం వాజిద్నగర్, సీతారాంపల్లి, మనేపూర్ గ్రామాలలో, పెద్దకొడప్గల్ మండలంలో, బాన్సువాడ మండలం కొల్లూర్, సుల్తాన్పూర్ శివార్లలో చేతికొచ్చిన వరిపైరు నేలకొరిగింది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్ క్యాంపు గ్రామానికి చెందిన నర్సింలు అనే రైతు మొక్క జొన్న పంట 5 ఎకరాల మేర వర్షానికి నేల కొరిగింది. కొన్ని చోట్ల వడగండ్లు పడటంతో ధాన్యం నేలరాలగా వరిఫైర్లు చీపురు కట్టలుగా మారాయి. బలమైన గాలులు, భారీ వర్షం దాటికి కొన్ని చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పొట్టదశ నుంచి కొతకు సిద్ధంగా ఉన్న వరి పంటపై వడగండ్ల వాన పడటంతో గింజలు పూర్తిగా రాలిపోయాయి. అలాగే రోడ్లపై, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. అధికారులు పంటలను పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం నేలవాలిన పంటలు -
సబ్స్టేషన్లో బ్రేకర్ ప్రారంభం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి సబ్ స్టేషన్ ఉప కేంద్రంలో గురువారం నూతన బ్రేకర్ను ట్రాన్స్ కో ఎస్ఈ శ్రావణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గతంలో ఒకటే బ్రేకర్ ఉండడంతో కొన్ని సమస్యలు తలెత్తాయన్నారు. ఆ సమస్యలు పునరావృతం కా కుండా ఉండడానికే నూతన బ్రేకర్ను ఏర్పాటు చేశామన్నారు. డీఈ కళ్యాణ్ చక్రవర్తి, ఏడీ నరేశ్, ఏఈ గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ను కలిసిన ఆర్టీసీ డీఎం కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ నూతన డిపో మేనేజర్గా కరుణాశ్రీ గురువారం బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను ఆమె మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. గతంలో పరిగి ఆర్టీసీ డీఎంగా పనిచేసిన ఆమె బదిలీపై వచ్చారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన డీఎం ఇందిర హైదరాబాద్కు బదిలీపై వెళ్లారు. నేడు కలెక్టరేట్ ముందు ధర్నా కామారెడ్డి టౌన్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఔట్ సోర్సింగ్ నియామకాల్లో జరిగిన అక్రమాలపై టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్యాయానికి గురైన అభ్యర్థులు ఈ ధర్నాకు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
వక్ఫ్ బిల్లుపై అనవసర రాద్ధ్దాంతం
కామారెడ్డి టౌన్: దేశంలోఅన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు బిల్లుపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధ్దాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన పార్టీ పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వక్ఫ్ బిల్లు కారణంగా ముస్లిములకు ఎటువంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ఈనెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలోని ప్రతి బూత్లో ఘనంగా నిర్వహించాలని, ప్రతి కార్యకర్త ఇంటిపై బీజేపీ జెండా ఎగరవేయాలని సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎమ్మెల్యే అరుణతార, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, నాయకులు సంతోష్ రెడ్డి, రవీందర్, బాల్ రాజు, శ్రీధర్, సంపత్, భూపాల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య
బీబీపేట: కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తితో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఇస్సానగర్ గ్రామానికి చెందిన చెవుల లక్ష్మి(60) గత మూడేళ్లుగా కిడ్నీల సమస్యతో బాధపడుతోంది. ఈ నెల 2న తన తల్లిగారింటికి వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్లింది. భర్త ఎల్లయ్య గురువారం సాయంత్రం అత్తగారింటికి ఫక్షన్ చేసి ఆరా తీయగా ఇంకా రాలేదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఉదయం పెద్ద చెరువులో మృతదేహం లభ్యమైంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. స్నేహితురాలి మృతి తట్టుకోలేక యువకుడు..ఖలీల్వాడి: స్నేహితురాలి మృతి తట్టుకోలేక ఓ యువకుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలోని గాయత్రినగర్లో గురువారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రినగర్కు చెందిన పవన్రాజు స్థానికంగా ఉండే ఓ షాప్లో పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతని స్నేహితురాలు మృతి చెందింది. దీంతో నాటి నుంచి ఎవరితో మాట్లాడకుండా పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
కారులో నిద్రిస్తున్న వారిపై దాడి
కామారెడ్డి క్రైం: రోడ్డు పక్కన కారు నిలిపి విశ్రాంతి తీసు కుంటున్న వారిపై దుండగు లు దాడి చేసి దోపిడీకి పాల్పడిన ఘటన కామారెడ్డి మున్సి పల్ పరిధిలోని టేక్రియాల్లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వీరరాఘవయ్య కుమారుడు నాగమణిదీప్ హైదరాబాద్లో పదో తరగతి చదువుకుంటున్నాడు. పరీక్షలు పూర్తి కావడంతో వీరరాఘవయ్య కుమారుడిని స్వగ్రామానికి కారులో తీసుకొస్తున్నాడు. వీరి వెంట వీరరాఘవయ్య స్నేహితుడైన మరో వ్యక్తి కూడా ఉన్నారు. గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో టేక్రియాల్ వద్ద పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఓ హోటల్ ఎదుట రోడ్డు పక్కన కారు నిలిపి అందులో నిద్రించారు. ఇది గమనించిన నలుగురు దుండగులు కారు అద్దాలను పగలగొట్టి దాడి చేశారు. కారులోని ఓ బ్యాగు, ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో వీర రాఘవయ్యకు గాయాలయ్యాయి. దాడి జరిగిన వెంటనే భయంతో రాఘవయ్య కారు స్టార్ట్ చేసి దాదాపు ఆరు కిలో మీటర్ల దూరంలోని సదాశివనగర్ వరకు తీసుకెళ్లారు. అక్కడ కారును నిలిపి డయల్ 100 కు సమాచారం ఇచ్చాడు. ఎస్పీ రాజేశ్ చంద్ర, దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్టాప్, బ్యాగు అపహరణ టేక్రియాల్లో రెచ్చిపోయిన దుండగులు -
కారు బోల్తా.. పలువురికి స్వల్ప గాయాలు
ఇందల్వాయి: చంద్రాయన్పల్లి శివారులో గురువారం ఉదయం కారు బోల్తా పడ్డ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. టోల్ప్లాజా సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కి చెందిన ప్రహానంద రామేశ్వరి దంపతులు వారి కుమారుడు రఘుతో పాటు పదేళ్ల వయసున్న మనవరాలితో కలిసి కారులో బాసరకు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. స్థానికులు గుర్తించి టోల్ప్లాజా సిబ్బందికి సమాచారం అందించారు. వారిని టోల్ప్లాజా అంబులెన్స్లో నిజామాబాద్కి తరలించారు. ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా చిన్న పాప కాలుకి తీవ్ర గాయమైనట్లు తెలిపారు. -
వేర్వేరు చోట్ల్ల ముగ్గురి మృతి
ఉమ్మడి నిజామాబాద్లో జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల ముగ్గురు మృతి చెందారు. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు, గోదావరిలో పడి మరొకరు మృతి చెందగా పోలీసులు కేసు నమోదు చేశారు. నస్రుల్లాబాద్: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై లావణ్య తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన జరపాటి అశోక్(19) అనే యువకుడు నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో ఉన్న రెడ్డి చెరువులో చేపలు పడుతుండగా బుధవారం ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గురువారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. మృతుడి అన్న సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి: చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం జాన్కంపల్లి ఖుర్దు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జన్పుల నారాయణ (56) గురువారం సాయంత్రం గ్రామ శివారులోని తాటివాని మత్తడి చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో ఉన్న వల కాలికి తట్టడంతో నీట మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికులు అతడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గోదావరిలో పడి కూలీ..నవీపేట: మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన గోనెవార్ గంగాధర్(49) కాలుజారి గోదావరి నదిలో పడి గురువారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. వ్యవసాయ కూలీ పనులకు వెళ్లిన గంగాధర్ బోరు మోటారు పని చేయకపోవడంతో గోదావరి నది ఒడ్డున ఉన్న మోటారు వద్దకు వెళ్లాడని పేర్కొన్నారు. మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరి నదిలో పడి మృతి చెందాడు. భార్య చాయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.అనుమానాస్పద స్థితిలో మహిళ..ఎడపల్లి: అనుమానాస్పద స్థి తిలో మహిళ మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలం జైతాపూర్లో గురువారం చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పురిమేటి లక్ష్మి(35) అనే మహిళ ఈ నెల 1న నిజామాబాద్కు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. కుటుంబీకులు ఆమె కోసం వెతుకుతుండగా గ్రామ సమీపంలోని పంట కాలువలో ఆమె విగతజీవిగా కనిపించింది. మృతురాలి అన్న నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
కామారెడ్డి టౌన్/తాడ్వాయి : ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ వృత్తి నైపుణ్యాలను నిరంతరం మెరుగుపర్చుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. రాజు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నూతనంగా పదోన్నతి పొందిన ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులకు నిర్వహించిన వృత్యంతర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాడ్వాయి మండలంలోని కృష్ణాజీవాడి ఉన్నత పాఠశాలలో జిల్లాలో పదోన్నతి పొందిన భాష ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యాక్రమానికి హాజరయ్యారు. భాషోపాధ్యాయులు విద్యార్థులను మాతృ భాషలో తీర్చిదిద్దాలన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాఠశాల నిర్వహణ, బోధన పద్ధతులు మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అకడమిక్ జిల్లా సమన్వయ కర్త వేణుగోపాల్, డీసీఈబీ కార్యదర్శి లింగం, ఎంఈవో రామస్వామి, నోడల్ అధికారులు శ్రీ నాథ్, సాయిరెడ్డి, రిసోర్స్ పర్సన్ వెంకట రమణ, వెంకటేశం, విజయ్ కుమార్, లోకేశ్వర్ రావు, పవన్ కుమార్, ప్రసాద్, బసంత్ రాజు, కృష్ణ, శ్రీశైలం,రమేష్ , ప్రధానోపాధ్యాయులు, తెలుగు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భాషోపాధ్యాయులు విద్యార్థులను మాతృ భాషలో తీర్చిదిద్దాలి డీఈవో రాజు -
ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి
రామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రామారెడ్డి లోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిర్మిస్తున్న మోడల్ హౌస్ను ఆయన పరిశీలించారు. కన్నాపూర్ తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ముగ్గుపోశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డులో ఎరువుల తయారీని, పారిశుధ్య పనులను సక్రమంగా చేపట్టాలని సూచించారు. కలెక్టర్ వెంట డీపీవో మురళి, డీఎల్పీవో శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి సంజయ్కుమార్, హౌసింగ్ పీడీ విజయ్పాల్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ సురేందర్, తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో తిరుపతి, ఎంఈవో ఆనంద్రావు, ఆర్ఐ రవికాంత్, ఏపీవో ధర్మారెడ్డి, వ్యవసాయ అధికారిణి భాను శ్రీ, ఏపీవో ప్రసన్నకుమార్ తదితరులు ఉన్నారు. రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: జిల్లాలో రాజీవ్ యువ వికాసం పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గురువారం పలు శాఖల అధికారులు, మండల అధికారులతో రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్, ధరణి, సన్న బియ్యం, గ్రామ పాలన అధికారుల ఎంపిక, తదితర అంశాలపై అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాసం కోసం మండల స్థాయిలో కమిటీలను రూపొందించాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు చేకూర్చాలన్నారు. దరఖాస్తుదారుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ వీసీలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, చందర్, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై జాగ్రత్త వహించాలి రాజంపేట: వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై పుష్పరాజ్ గురువారం తెలిపారు. సెలవుల్లో చెరువులు, బావులలో ఈతకు వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉందన్నారు. స్మార్టు ఫోన్లకు దూరంగా ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బైక్ తాళాలు ధ్వంసం భిక్కనూరు: మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద నిలిపి ఉంచిన ఐదు బైక్ల తాళాలను దుండగులు గురువారం వేకువ జామున ధ్వంసం చేశారు. బైక్ల తాళాలను ధ్వంసం చేసిన వ్యక్తుల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. -
ప్రజలను ఏకం చేయడమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్
ఎల్లారెడ్డిరూరల్: దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలను ఏకతాటిపై తీసుకువచ్చే కార్యక్రమమే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తోటగాంధీ అన్నారు. గురువారం మోడల్ స్కూల్లో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలను, వంటకాలను చేసుకోవడం, ఒకరితో ఒకరు కలుసుకోవడం భాష నేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అనంతరం చిన్నారులు చేసిన హర్యానా డ్యాన్సులు, వంటకాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యారమణ, బల్వంత్రావు, శిల్ప, శివకుమార్, అనిల్, ప్రభాకర్, ప్రదీప్ తదితరులున్నారు. -
వర్షంతో నిలిచిన మురుగు
● బిచ్కుందలో దుకాణాల్లోకి చేరిన నీరు ● పూడుకుపోయిన కాలువలు బిచ్కుంద/దోమకొండ: : బిచ్కుందలో రోడ్డు వెడల్పు పనులలో భాగంగా రెండు వైపుల మురికి కాలువల నిర్మాణ పనులు పూర్తి చేయకుండా వదిలేయడంతో వర్షం నీరు రోడ్డుపై నిలిచింది. దీంతో మురుగు నీరు దుకాణాల్లోకి చేరింది. మోకాళ్ల వరకు నీరు నిలవడంతో ప్రజలు, వాహదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవడంతో కాలువల పనులు ముందుకు సాగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దోమకొండ మండల కేంద్రంతో పాటు ముత్యంపేట, చింతమాన్పల్లి, సంఘమేశ్వర్, లింగుపల్లి, అంబారిపేట, అంచనూరు, సీతారంపల్లి గ్రామాల్లో వర్షం కురిసింది. మండల కేంద్రంలోని శివరాంమందిర్ ఆలయ ప్రాంగణం వర్షపునీటితో నిండిపొయింది. బీబీపేట రోడ్డులో వర్షపునీరు రోడ్డుపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
‘రాజీవ్ వికాసం’పై విస్తృతంగా ప్రచారం చేయాలి
భిక్కనూరు: రాజీవ్ యువ వికాసం పథకం కింద రాష్ట్రంలో ఐదులక్షల మందికి మేలు కలుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన రాజీవ్ యువ వికాసం పథకం ధరఖాస్తుల స్వీకరణ సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజీవ్ యువవికాసం పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఆరు వందల ఐదు కోట్ల రూపాయాలను కేటాయించందన్నారు. 60 ఏళ్ల లోపు వారందరూ ఈ పథకం కింద లబ్ది పొందేందుకు ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను దళిత సంఘం నేతలు ద్యాగల కిరణ్, తుడుం జీవన్,బాబు, అశోక్, లింగం మైపాల్, సంజీవులు దుర్గయ్య, లింగం, ప్రదీప్లు సన్మానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి చేయూత ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం -
న్యాయం కోసం..
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.ఎన్నో కేసులు...→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. → ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారుచైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. – స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి
బాన్సువాడ రూరల్: విద్యార్థులు, యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి అన్నారు. బుధవారం కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన కరపత్రాలు, వాల్పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు పోకుండా ఉన్నత లక్ష్యాల వైపు అడుగు వేయాలని సూచించారు. కామారెడ్డి అర్బన్: యువత మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్కుమార్ అన్నారు. బుధవారం కళాశాలలో నార్కోటిక్స్ డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. సమన్వయకర్తలు విశ్వప్రసాద్, అంకం జయప్రకాష్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘జన్యుపరమైన కారణాలతోనే ఆటిజం’
కామారెడ్డి టౌన్: జన్యుపరమైన కారణాలతో ఆటిజం వ్యాధి వస్తుందని ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అరవింద్కుమార్ అన్నారు. ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఆధ్వర్యంలో వైద్యులు బుధవారం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఐఎంఏ హాల్ నుంచి ప్లకార్డులతో నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ అరవింద్కుమార్ మాట్లాడుతూ..మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు.. అందులో స్రవించే సెరోటోనిన్, డోపమిన్న్వంటి రసాయనాలు తగినంత విడుదల కాకపోవడం, నెలలు నిండకుండా శిశువు పుడితే కూడా ఆటిజానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయని వివరించారు. -
అలరించిన కుస్తీ పోటీలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బుధవారం నిర్వహించిన కుస్తీ పోటీలు హోరాహోరీగా సాగాయి. కొబ్బరికాయ కుస్తీ నుంచి మూడు తులాల వెండి కడెం వరకు పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మల్లయోధులకు నగదు బహుమతులు అందజేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ మహిళ మగవారితో సమానంగా కుస్తీ పోటీల్లో పాల్గొని గెలుపొందడం విశేషం. కోనాపూర్లో.. బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో బుధవారం ఉగాది ఉత్సవాల్లో భాగంగా కుస్తీపోటీలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన మల్లయోధులు కుస్తీపోటీల్లో తలపడ్డారు. విజేతలకు వీడీసీ సభ్యులు నగదు బహుమతులతోపాటు వెండి కడియాలు బహూకరించారు. పెద్ద సంఖ్యలో కుస్తీ పోటీలను తిలకించడానికి ప్రజలు వచ్చారు. -
అనారోగ్యంతో మహిళా మోర్చా అధ్యక్షురాలి మృతి
బీబీపేట: మల్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా మండలాధ్యక్షురాలు సన్నిధి అలియాస్ అష్షుని (25) బుధవారం మృతి చెందారు. ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో హైదరాబాద్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా, చికిత్స పొందుతూ తెల్లవారుజామున మరణించారు. మృతురాలికి భర్త స్వామిగౌడ్, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఆమె అంత్యక్రియల్లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని సంతాపం తెలిపారు. గుడి గంట చోరీభిక్కనూరు: బస్వాపూర్లో పెద్దమ్మ ఆలయం వద్ద ఉన్న ఇత్తడి గంట చోరికి గురైందని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు బుధవారం తెలిపారు. గంటను చోరీ చేసిన యువకుడి చిత్రం సీసీ ఫుటీజీల్లో రికార్డయ్యిందని, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సర్టిఫికెట్ల జారీకి ఆన్లైన్ కష్టాలు
కామారెడ్డి టౌన్: మున్సిపల్కు సంబంధించి ధ్రువపత్రాలు జారీ చేసే వెబ్సైట్ సాంకేతికపరమైన లోపాలతో ఓపెన్ కావడం లేదు. దీంతో ఆయా సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. బల్దియా కార్యాలయం చుట్టూ దరఖాస్తుదారులు నిత్యం చక్కర్లు కొడుతున్నారు. 10 రోజులుగా ఎదురవుతున్న ఈ సమస్యతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వెబ్సైట్ లాగిన్ చేయగానే ఎర్రర్ అని చూపుతోంది. సుమారు 600లకు పైగా ధ్రువపత్రాలు బల్దియా లాగిన్లో పెండింగ్లో ఉన్నాయి. నిత్యం దరఖాస్తుదారులు వారి సర్టిఫికెట్ల కోసం మున్సిపల్ అధికారులను, సిబ్బందిని నిలదీస్తున్నారు. ఈ విషయమై కమిషనర్ రాజేందర్రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఉన్నతాధికారులకు నివేదించామని చెప్పారు. పనిచేయని మున్సిపల్ వెబ్సైట్ పెండింగ్లో 600లకుపైగా జనన, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్లు పది రోజులుగా ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు -
అక్రమంగా పట్టా చేశారని ఆందోళన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): తమకు తెలియకుండా అక్రమంగా పట్టా ఎలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం మోడెగాంకు చెందిన రెడ్డి సంఘం ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు. గ్రామంలోని జౌడి రాధవ్వకు జ్యోతి, స్వప్న, నవిత అనే ముగ్గురు కుమార్తెలున్నారు. నవితను గంగారెడ్డితో పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా నవిత మాట్లాడుతూ.. మోడెగాం శివారులోని సర్వేనంబర్ 159/2/1/1లో 2 ఎకరాల 14 గుంట భూమిని చెల్లెలు అయిన స్వప్న భర్త పాటిమీది కరుణాకర్రెడ్డికి మార్చి 2025, 11న సేల్డీడ్ చేసి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకం మా సంఘంలో ఉండగా మాకు తెలియకుండా సేల్ డీడ్ ఎలా చేస్తారని తహసీల్దార్ను నిలదీశారు. కుటుంబ సభ్యులు అనుమతి లేకుండా ఆ భూమిపై క్రాప్ లోన్ ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఎలా చేసి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధవ్వ పేరు మీద ఉన్న ఆ భూమి కేవలం ఇల్లరికం పెట్టుకున్న నవిత–గంగారెడ్డిలకు మాత్రమే చెందాలే తప్ప ఆ భూమిపై ఎవరికి హక్కు లేదన్నారు. తహసీల్దార్ డబ్బులకు కక్కుర్తి పడి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు వారు పేర్కొన్నారు.గ్రామ రెడ్డి సంఘం సభ్యులున్నారు. బాధితులకు అండగా తహసీల్ కార్యాలయాన్ని ముట్టడించిన మోడెగాం గ్రామస్తులు తహసీల్దార్ నిలదీత -
జడ్జిని నియమించండి
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టులో జడ్జిని నియమించాలని కోరుతూ బుధవారం బిచ్కుంద బార్ అసోసియేషన్ నాయకులు.. తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి పోర్టు ఫోలియో చూసే జడ్జి పుల్లా కార్తీక్ను హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం బార్ అధ్యక్షుడు ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ.. బిచ్కుంద కోర్టులో మూడేళ్ల క్రితం బదిలీపై వెళ్లిన న్యాయమూర్తి స్థానంలో కొత్తగా న్యాయమూర్తిని నియమించలేదని, కక్షిదారులు, న్యాయవాదులు చాలా అవస్థలు పడాల్సి వస్తుందని విన్నవించినట్లు తెలిపారు. త్వరలో శాశ్వత న్యాయమూర్తిని నియమించాలని జస్టిస్ పుల్లా కార్తీక్ను కోరినట్లు తెలిపారు. న్యాయవాదులు లక్ష్మణ్రావు, మల్లేశ్వర్, శివాజీ, విఠల్, విఠల్రావు, షేక్ మహ్మద్, శంకర్రావు, రాజ్ దేశ్ముఖ్, పురుషోత్తం, శ్రీనివాస్ పాల్గొన్నారు.గ్రూప్–1 విజేతకు సన్మానంకామారెడ్డి క్రైం/కామారెడ్డిఅర్బన్: జిల్లా బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కొండపల్లి గాయత్రి ఇటీవల వెలువడిన టీజీపీఎస్సీ గ్రూప్–1 ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఉద్యోగం సాధించి సత్తా చాటింది. బుధవారం ఆమెను కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, అధికారులు ఘనంగా సన్మానించారు. డీఈవో రాజు, పీఆర్టీయూ తెలంగాణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంబీర్ మనోహర్రావు, జె.లక్ష్మీరాజ్యంలు కూడా ప్రత్యేకంగా ఆమెను అభినందించారు.మహనీయుడు సర్వాయి పాపన్నకామారెడ్డి క్రైం: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాటం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.విద్యార్థులు భావి భారత పౌరులుఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు భావి భారత పౌరులని ఆర్డీవో మన్నె ప్రభాకర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని జీవదాన్ పాఠశాలలో నిర్వహించిన ఇన్ఫాన్షియా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో సీఎంఐ సంస్థ ద్వారా జీవదాన్ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్యను అందించడం సంతోషకరమన్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సీఐఎం ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ అలెక్స్, కౌన్సిల్ సభ్యులు ఽథామస్, ప్రిన్సిపల్ బాబు, ఏఎంసీ చైర్ పర్సన్ రజిత, తదితరులున్నారు. -
నగరంలో కత్తిపోట్ల కలకలం
ఖలీల్వాడి: నగరంలోని ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ రోడ్డులోని నిజాంసాగర్ కెనాల్ కట్ట ప్రాంతానికి చెందిన షేక్ గౌస్పై ముగ్గురు యువకులు బుధవారం సాయంత్రం కత్తులతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ షేక్ గౌస్ను జీజీహెచ్కు తరలించారు. పాతకక్షల నేపథ్యంలోనే గౌస్పై యువకులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కత్తితో బెదిరించిన యువకుడి అరెస్టు.. ఖలీల్వాడి: డబ్బుల కోసం కత్తితో బెదిరించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. నగరంలోని అహ్మద్పురా కాలనీకి చెందిన షేక్ అల్తాఫ్ గత నెల 31న బోధన్ రోడ్లోని దుర్గా వైన్స్ వద్ద సతీశ్ రెడ్డి, కోలం నాగరాజును కత్తితో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. వైన్స్ యజమాని పసునూరి విశ్వాక్కాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అల్తాఫ్పై గతంలో మహారాష్ట్రలోని ముథ్కేడ్ పోలీస్స్టేషన్లో హత్యానేరం కేసు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కత్తితో దాడి చేసిన వ్యక్తి.. ఖలీల్వాడి: నగరంలోని నాల్గో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. గత నెల 31న రాత్రి 11:30 గంటలకు పాటిగల్లీకి చెందిన మహమ్మద్ ఖలీమ్ అదే కాలనీకి చెందిన అబ్బాస్ అలీ బేగ్ను గాయపరిచాడన్నారు. అబ్బాస్ అలీ బేగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
బస్పాసుల రెన్యువల్కు కష్టాలు !
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి ఆర్టీసీ డిపో అధికారుల తీరే వేరు. ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో బస్పాసుల జారీ విషయంలోనూ అదే నిర్లక్ష్యం కనపడుతోంది. ఆర్టీసీ బస్సుల్లో వివిధ రాయితీలపై ప్రయాణించే వారికి ఇచ్చే బస్పాసుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బస్పాసుల జారీ కేంద్రంలో ప్రింటర్లు సరిగా పనిచేయవు. బస్పాసును లామినేషన్ చేసి ఇవ్వాల్సి ఉండగా, మిషన్ మూలన పడిందని తప్పించుకుంటున్నారు. ప్రింటింగ్, లామినేషన్ కోసమే ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు చేస్తారు. కానీ లామినేషన్ చేసి ఇవ్వడం లేదు. విద్యార్థులు, జర్నలిస్టులకు సంబంధించి బస్పాసులను లామినేషన్ చేసి ఇవ్వకుండా బయట చేయించుకోమని చెబుతున్నారు. కొందరు ఇదేమని ప్రశ్నిస్తే మిషన్ లేదని అంటున్నారు. డబ్బులు తీసుకుంటున్నపుడు చేసి ఇవ్వాలి కదా అంటే నోరు మెదపడం లేదు. ప్రింటర్లు సరిగా పనిచేయవు ఒక్కొక్కరి నుంచి రూ.50 వసూలు లామినేషన్ చేసి ఇవ్వరు... -
పైకి వచ్చేదెలా?
అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం మూలంగా ప్ర‘జల’ కష్టాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. పాతాళంలోంచి నీళ్లను తోడడమే తప్ప.. భూగర్భ జలాలను వృద్ధి చేసేందుకు సరైన ప్రయత్నాలు జరగడం లేదు. దీంతో ఏటా వేసవిలో బోరుబావులు ఎత్తిపోతుండడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డికామారెడ్డి పట్టణం వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరుగడించింది. విద్య, వైద్య రంగంలోనూ ముందుకు వెళుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇరుగు పొరుగు జిల్లాల నుంచి కూడా చాలా మంది కామారెడ్డి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. దీంతో పట్టణం నలువైపులా విస్తరించింది. మున్సిపాలిటీ పరిధిలో 30 వేల ఇళ్లు ఉన్నాయి. అద్దెకు ఉన్న కుటుంబాలతో కలిపి పట్టణ జనాభా లక్షా ఇరవై వేలకు చేరింది. కాగా కామారెడ్డి పట్టణంలో ఇళ్లు నిర్మాణం మొదలు పెట్టాలంటే ముందు బోరు తవ్వాల్సిందే. పట్టణంలోని అశోక్నగర్, శ్రీనివాస్నగర్, స్నేహపురికాలనీ, శ్రీరాంనగర్, విద్యానగర్, కాకతీయనగర్, ఎన్జీవోస్ కాలనీ, వివేకానంద కాలనీ తదితర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల నుంచి 1,500 అడుగుల దాకా బోర్లు తవ్వుతున్నారు. కొత్తగా ఇల్లు కట్టేవారు వెయ్యి ఫీట్లు తవ్వితే ఇరుగు పొరుగు ఇళ్లలో అప్పటికే తక్కువ లోతు తవ్విన బోర్లు ఎత్తిపోతున్నాయి. వర్షాకాలం ఎలాగోలా గడిచిపోతున్నా వేసవి సీజన్ ప్రారంభం కాగానే బోర్లు ఎతిపోయి నీటి కష్టాలు మొదలవుతున్నాయి.ఇంకుడు గుంతలు లేని కాలనీ జిల్లాకేంద్రంలో వెయ్యి అడుగుల లోతు వరకు బోర్ల తవ్వకాలు కొన్నిచోట్ల 1,500 అడుగుల లోతు వరకు తవ్వినా ఫలితం శూన్యం రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలు ఇంకుడు గుంతలపై దృష్టి సారించని సర్కారు, ప్రజలు ఫలితంగా ఏటా వేసవిలో తప్పని నీటి కష్టాలుఇంటికో ఇంకుడు గుంత ఉండాలి సాధారణంగా నీరు ఉన్నప్పుడు ఎవరూ నీటి విలువను గుర్తించడం లేదు. సమస్య తలెత్తినప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నారు. పట్టణమైనా, పల్లెల్లోనైనా నీటి వృథాను అరికట్టాలి. అలాగే ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. వర్షపునీరు, ఇంట్లో వదిలేసిన నీరు ఇంకుడు గుంతల ద్వారా భూగర్భంలోకి ఇంకి బోర్లలో నీటి ఊటలు పెరుగుతాయి. ఇంకుడు గుంత ఉంటే నీటిని నిల్వ చేసుకున్నట్లే.. – సతీశ్ యాదవ్, జిల్లా భూగర్భజల శాఖ అధికారి -
సబ్సిడీ మంజూరు చేస్తూ తీర్మానం
కామారెడ్డి క్రైం: జిల్లా పరిశ్రమల శాఖకు సంబంధించిన వివిధ పథకాలకు రూ.51.10 లక్షల సబ్సిడీని మంజూరు చేస్తూ డీఐపీసీ తీర్మానం చేసింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లో డీఐపీసీ(డిస్ట్రిక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ) సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల యూనిట్ల ఏర్పాటు కోసం ఆన్లైన్ ద్వారా ఇప్పటివరకు 1,385 దరఖాస్తులు రాగా వాటిలో 189 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించామని కలెక్టర్ పేర్కొన్నారు. 17 యూనిట్లకు సంబంధించిన రూ. 51.10 లక్షల సబ్సిడీని మంజూరు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమవేశంలో పరిశ్రమల శాఖ జీఎం లాలూ నాయక్, డీటీవో శ్రీనివాస్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం డిస్ట్రిక్ట్ లెవల్ సాండ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలోని 1, 2, 3 ఆర్డర్ కాలువలలో ఇసుక లభ్యతపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక లభ్యత ఉన్నచోట్ల నుంచి అక్కడి తహసీల్దార్లు నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని స్థానిక అవసరాలకు ఇసుక సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇప్పటికే ఉన్న ఇసుక క్వారీల వద్ద రెవెన్యూ సిబ్బందికి సహకారంగా ఉండేందుకు తగిన పోలీస్ సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖకు సూచించారు. మట్టి అక్రమ తవ్వకాలను నిరోధించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అధికారులు పాల్గొన్నారు. రేషన్ షాప్ తనిఖీ కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలోని 14 వ నంబరు రేషన్ దుకాణాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం తనిఖీ చేశారు. సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం దుకాణంలో బియ్యం తూకం వేస్తున్న తీరును, బియ్యం నాణ్యతను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సన్నబియ్యం పంపిణీపై అభిప్రాయం తెలుసుకున్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, సివిల్ సప్లయ్ అధికారులతో అన్ని రేషన్ దుకాణాలను తనిఖీ చేయిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. సన్నబియ్యం పంపిణీపై లబ్ధిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఘనంగా నిర్వహించాలి బాబూ జగ్జీవన్ రాం, అంబేడ్కర్ జయంతులను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం జయంతి ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
నిరంతరం ప్రజల్లోనే ఉండండి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. మీరంతా ప్రజల్లోనే ఉండండి. భవిష్యత్తు మనదే’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతలకు సూచించారు. బుధవారం ఎర్రవెల్లి ఫాంహౌస్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నియోజక వర్గాల ఇన్చార్జీలు, పార్టీ జిల్లా అధ్యక్షులతో బీఆర్ఎస్ రజతోత్సవాల గురించి సమీక్షించారు. ఈనెల 27న వరంగల్లో జరిగే సభను విజయవంతం చేయడానికి చేయాల్సిన ఏర్పాట్ల గురించి వారికి వివరించారు. సమావేశం వివరాలను బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. తెలంగాణపై మనకున్న అవగాహన మరెవరికీ ఉండదని, ప్రజలకు మేలు చేయాలన్న ఆర్తి మనకే ఉంటుందన్న విషయాన్ని కేసీఆర్ నొక్కిచెప్పారని జిల్లా నేతలు పేర్కొన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉండాలని సూచించాన్నారు. కేసీఆర్తో సమావేశమైన వారిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ సింధే, జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, పార్టీ నాయకురాలు అయేషా ఫాతిమా తదితరులున్నారు. బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్ పార్టీ రజతోత్సవాలపై ఉమ్మడి జిల్లా నేతలతో సమీక్ష -
రవాణా శాఖ ఆదాయం అదిరింది
కేక్ కట్ చేస్తున్న డీటీవో శ్రీనివాస్రెడ్డికామారెడ్డి క్రైం: ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయాన్ని రాబట్టడంలో జిల్లా రవాణా శాఖ అద్భుత పనితీరును ప్రదర్శించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా రవాణా శాఖకు రూ. 68.19 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం రూ. 73 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 92.04 శాతం పూర్తి చేశామని జిల్లా రవాణాశాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించడంలో కృషి చేసిన తమ శాఖ సిబ్బందిని అభినందించారు. బుధవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదాయం ఇలా.. 2023–24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ. 63 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రభుత్వం ఏటా 16 శాతం లక్ష్యాన్ని పెంచుతుంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికిగాను జిల్లాకు రూ. 73 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించింది. అన్ని రకాల ట్యాక్సులు, ఫీజుల రూపంలో గతేడాదితో పోలిస్తే ఈసారి రూ. 68.19 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో ప్రధానంగా ప్రత్యేక తనిఖీల ద్వారా 9.64 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ రూపంలో రూ. 79.83 లక్షలు, సర్వీస్ చార్జీల రూపంలో రూ. 2.17 కోట్లు, ఫీజుల రూపంలో రూ. 7.35 కోట్లు, లైఫ్ ట్యాక్సుల రూపంలో రూ. 38.35 కోట్లు, త్రైమాసిక ట్యాక్స్ల రూపంలో రూ. 9.89 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదికంటే రూ. 5 కోట్లు అదనంగా.. గతేడాదికంటే ఈసారి రూ. 5.06 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. ప్రత్యేక తనిఖీల ద్వారా రూ. 3.69 కోట్లు, గ్రీన్ ట్యాక్స్ రూపంలో రూ. 6.26 లక్షలు, సర్వీస్ చార్జీలు రూ. 6.92 లక్షలు, ఫీజుల రూపంలో రూ. 25.05 లక్షలు, లైఫ్ ట్యాక్సుల రూపంలో రూ. 71.12 లక్షలు, త్రైమాసిక ట్యాక్స్ల రూపంలో రూ. 23.39 లక్షల అదనపు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరంలో రూ. 68.19 కోట్ల ఆదాయం రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో జిల్లా రవాణా శాఖ వాహనదారులకు అవగాహన కల్పిస్తూ.. వాహనాలకు సంబంధించిన ట్యాక్సులను సకాలంలో చెల్లించకపోతే ఎలాంటి నష్టా లు ఉంటాయో వాహన దారులకు వివరించడానికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాం. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో కూడా ప్రతి ఒక్కరికీ రోడ్డు భద్రతతో పాటు, ఫీజులు, ట్యాక్సుల విసయమై అవగాహన కల్పించాం. దీంతో సత్ఫలితాలు వచ్చాయి. ఆదాయం విషయంలో జిల్లా రవాణా శాఖ ద్వితీయ స్థానంలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. – శ్రీనివాస్రెడ్డి, డీటీవో, కామారెడ్డి -
ఇన్చార్జి అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా జెడ్పీ సీఈవో బి.చందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే. దీంతో జెడ్పీ సీఈవోకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ అదనపు కలెక్టర్ వచ్చే వరకు జెడ్పీ సీఈవో చందర్ ఇన్చార్జి అదనపు కలెక్టర్ బాధ్యతలు నిర్వహించనున్నారు.ముగిసిన ఎస్సెస్సీ పరీక్షలు కామారెడ్డి టౌన్: ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు జిల్లాలో ప్రశాతంగా ముగిశాయి. బుధవారం జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు గాను 12,550 మంది హాజరయ్యారు. 29 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈవో రాజు పర్యవేక్షించారు. జుక్కల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలో గణితం పరీక్షకు సంబంధించి చీటీపై రాసిన ప్రశ్నలు బయట వచ్చిన వ్యవహారంలో బాధ్యులపై కేసుల నమోదు ఘటన తప్ప అన్ని కేంద్రాలలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఎక్కడా మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదు. నిజాంసాగర్ నీటి విడుదల నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఆయకట్టు అవసరాలకోసం బుధవారం ఆరో విడత నీటి విడుదల ప్రారంభించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువకు 1,600 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 1,394 అడుగుల(6.556 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పొడిగింపు కామారెడ్డి టౌన్: అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరు వరకు అవకాశం ఇస్తూ మున్సిపల్ శాఖ జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో మరో నెల పాటు 25 శాతం రాయితీ వర్తించనుంది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో వచ్చిన దరఖాస్తుల్లో 21.50 శాతం మాత్రమే ఫీజు చెల్లించారు. మండలాల వారీగా కూడా 20 శాతమే స్పందించారు. ప్రజలనుంచి అనుకున్న మేర స్పందన రాకపోవడంతో ప్రభుత్వం గడువు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దరఖాస్తు చేసుకోవాలి కామారెడ్డి అర్బన్: జిల్లాలోని మైనారిటీలు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.దయానంద్ ఒక ప్రకటనలో సూచించారు. ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన, బౌద్ధ, పార్శి మతస్తులు ఈనెల 14 వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 80969 73346 నంబర్లో సంప్రదించాలని సూచించారు.నేడు పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రం ప్రారంభం మద్నూర్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పొద్దుతిరుగుడు పంట కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు మద్నూర్ సింగిల్ విండో కార్యదర్శి బాబూరావ్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్క్ఫెడ్, నాఫెడ్ ఆధ్వర్యంలో పంటను కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రేపు వర్క్షాప్ కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం ‘త్రో ద లెన్స్ ఆఫ్ లిటరేచర్ –ఏ విజనరీ జర్నీ ఇన్ రీడింగ్’ అంశంపై వర్క్షాప్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వర్క్షాప్ పోస్టర్లను ఆవిష్కరించారు. సాహిత్య పఠనం, భాషా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి వర్క్షాప్ ఉపయుక్తంగా ఉంటుందని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. -
ఎన్డీసీసీబీ చరిత్రలో ఘన విజయం
ఎల్ఆర్ఎస్కు నామమాత్రపు స్పందన● మూడు బల్దియాలలో కలిపి 17,293 దరఖాస్తులు ● ఫీజు చెల్లించినవారు 3,719 మంది ● ముగిసిన 25 శాతం రాయితీ గడువుకామారెడ్డి టౌన్ : అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడం కోసం ప్రభుత్వం 25 శాతం రాయితీతో ఇచ్చిన అవకాశానికి దరఖాస్తుదారులనుంచి స్పందన కరువయ్యింది. గత నెలాఖరుతో ఈ గడువు ముగియగా.. జిల్లా లోని మూడు మున్సిపాలిటీల పరిధిలో 21.50 శాతం దరఖాస్తుదారులు మాత్రమే పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మూడు మున్సిపాలిటీలలో కలిపి 17,293 దరఖాస్తులు రాగా.. 3,719 మంది ఫీజు చెల్లించి రాయితీని వినియోగించుకున్నారు. వీరి దరఖాస్తులను టౌన్ప్లానింగ్ అధికారులు బుధవారంనుంచి క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం క్రమబద్ధీకరణ ప్రక్రియ ను పూర్తి చేస్తారు. దరఖాస్తు తిరస్కరణకు గురై తే చెల్లించిన ఫీజులో 90 శాతం తిరిగి దరఖాస్తుదారుడి ఖాతాలో జమచేస్తారు. మండలాల్లో 20 శాతమే.. ఎల్ఆర్ఎస్ –2020 కి సంబంధించి మండలాల్లోనూ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలు మినహా 22 మండలాలలో 2020లో ఎల్ఆర్ఎస్కు 14,012 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 12,357 దరఖాస్తులను ఆమోదించారు. గతనెలాఖరులోగా 2,472 మంది దరఖాస్తుదారులు మాత్రమే స్పందించి ఫీజు చెల్లించారు. ఇంకా 9,885 మంది దరఖాస్తుదారులు స్పందించలేదు.మున్సిపాలిటీలవారీగా దరఖాస్తుల వివరాలు.. -
సన్న బియ్యం.. నూకలే అధికం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో 578 రేషన్ దుకాణాలున్నాయి. ఆయా దుకాణాల పరిధిలో ప్రతినెలా 2,53,303 కుటుంబాలకు 5,571 మెట్రి క్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. గత నెల వరకు దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి. ఈనెలనుంచి సన్నబియ్యం పంపిణీ చే యాలని సర్కారు నిర్ణయించి, ఇప్పటికే జిల్లాలోని ఆయా స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సన్న బియ్యాన్ని పంపించింది. ఇంకా కొన్ని దుకా ణాలకు బియ్యం సరఫరా కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం అన్ని గ్రామాలు, పట్టణాల్లో అధికార పార్టీ నేతలు దగ్గరుండి ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. నాణ్యత తక్కువ.. రేషన్ షాప్ల ద్వారా సరఫరా చేస్తున్న సన్న బి య్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యమైనవి ఇస్తే బా గుండేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొ న్ని రేషన్ దుకాణాలకు నూకలు తక్కువగా ఉన్న బి య్యం సరఫరా అవగా, చాలా దుకాణాలకు సరఫ రా అయిన బియ్యంలో నూక 20 శాతానికి మించి ఉ న్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మార్కెట్లో ఏ ర కం బియ్యం కొనుగోలు చేసినా నూకలు కనిపించ వు. రేషన్ బియ్యంలో కూడా నూకలు తక్కువగా ఉండేవి. సన్న బియ్యం వచ్చేసరికి నూకల శాతం పె రగడంతో లబ్ధిదారులు కొంత ఇబ్బంది పడుతున్నా రు. వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యం కావడంతో వండితే అన్నం మెత్తగా అవుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇక నుంచి ప్రతినెలా ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో నా ణ్యతపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.రేషన్ బియ్యంలో నూకలురాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా సన్నబియ్యం పంపిణీకి మంగళవారం శ్రీకారం చుట్టింది. సన్న బియ్యం అనేసరికి లబ్ధిదారులు మొదటి రోజునే రేషన్ దుకాణాలకు తరలివచ్చారు. అయితే 20 శాతానికిపైగా నూకలు ఉండడం, దానికితోడు వండితే అన్నం ముద్దగా అవుతుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇరవై శాతానికి పైగానే నూకలు వండితే ముద్దగా మారుతున్న అన్నం పెదవి విరుస్తున్న లబ్ధిదారులు -
సన్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకం
బాన్సువాడ : రేషన్ షాప్ల ద్వారా ఉచితంగా స న్న బియ్యం పంపిణీ చరిత్రాత్మకమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బాన్సువాడ స హకార సంఘంలోని రేషన్ దుకాణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ పట్టణంలోని పేదలకు 1,400 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజురు చేశా మని, వెయ్యి ఇళ్లు కట్టించి ఇచ్చామని పేర్కొ న్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైంద ని, ఇంకా పేదలు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో డీఎస్వో మల్లికార్జున్, సహకార సంఘం అ ధ్యక్షులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొల్లూర్లో.. బాన్సువాడ రూరల్ : కొల్లూర్లో మంగళవారం సన్నబియ్యం పంపిణీని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో కొత్త రేషన్కార్డులు మంజూరు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ ఎర్వల కృష్ణారెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ కిరణ్మయి, డీఎస్వో మల్లికార్జున్, తహసీల్దార్ వరప్రసాద్, నాయకులు పోతారెడ్డి, రెంజర్ల సాయిలు, జనార్దన్రెడ్డి, రాచప్ప, మొగులయ్య, దుర్గారెడ్డి, సాయిలు పాల్గొన్నారు. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి -
బాన్సువాడలోనూ బ్రేక్
బాన్సువాడ పట్టణంలోనూ సమీకృత మా ర్కెట్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. 2022 ఫిబ్రవరి 5న రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులకు అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి శంకుస్థాపన చే శారు. పనులు మొదట్లో చురుగ్గా సాగాయి. స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయాయి. ప నులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి. బిల్లుల సమస్యలతోనే సదరు కాంట్రాక్టరు పనులు ఆ పేసినట్టు తెలుస్తోంది.బాన్సువాడలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులుబాన్సువాడలో రోడ్డు మీద కూర గాయల దుకాణాలు -
వట్టిపోతున్న బోర్లు.. ఎండుతున్న పంటలు
నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లోని వెల్గనూర్, నర్సింగ్రావ్పల్లి, మంగ్లూర్, మల్లూర్ తండా, మల్లూర్, ఒడ్డేపల్లి, జక్కాపూర్, నర్వ, శేర్ఖాన్ పల్లి, సింగితం గ్రామాల పరిధిలో వ్యవసాయ బోరుబావుల కింద సాగు చేసిన పంట పొలాలు ఎండుతున్నాయి. భూగర్భ జలాలు పడిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి. బోరుబావుల నుంచి నీరు రాకపోవడంతో పంటలకు సాగునీరు అందడంలేదు. ప్రధానంగా వరి పంటపొలాలకు తీవ్రమైన నీటి కష్టాలు ఎదురవుతున్నాయి. జొన్న, మొక్కజొన్న పంటలకు నీటి కొరత ఏర్పడినా పంట నష్టం తక్కువగా ఉంది. వరి పంట సాగు కోసం ఎకరానికి రూ. 25 వేల వరకు రైతులు పెట్టుబడి ఖర్చులు చేశారు. పంట సాగు కోసం చేసిన పెట్టుబడి ఖర్చులతో పాటు ఆరుగాలం కష్టపడిన శ్రమ వృథా అవుతుందని రైతులు వాపోతున్నారు. వేల రూపాయలు ఖర్చు పెట్టినా పంటలు పశువులకు మేతపాలవుతుండటంతో కర్షకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. నిజాంసాగర్ ఉమ్మడి మండలంలో పడిపోయిన భూగర్భజలాలు ఆందోళనలో రైతులుపంట ఎండుతోంది యాసంగి సీజన్లో నాలుగు బోర్ల కాడ ఆరు ఎకరాల్లో వరి, 1.5 ఎకరాల్లో జొన్న పంట వేశాను. బోర్లు ఎత్తిపోవడంతో పంట మొత్తం ఎండిపోతుంది. దోపుల్ పోసిన బోర్లు దోసేడన్ని కూడా పోస్తలేవు. పంట సాగు కోసం తెచ్చిన అప్పులు కుప్పగా మారాయి. ప్రభుత్వం స్పందించి పంట నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలి. – ఏముల కాశీరాం, శేర్ఖాన్పల్లి, రైతు -
అలరించిన కుస్తీ పోటీలు
నిజాంసాగర్/ఎల్లారెడ్డిరూరల్ : మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో, ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన కుస్తీ పోటీలు అలరించాయి. నల్లపోచమ్మ, ఉగాది ఉత్సవాల్లో భాగంగా మల్లయోధులకు కుస్తీపోటీలు నిర్వహించారు. కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వహకులు నగదును బహుమానంగా అందజేశారు. కార్యక్రమంలో కుస్తీపోటీల నిర్వహకులు గంగారెడ్డి, నాగభూషణం గౌడ్, సాదులసత్యనారాయణ, పోతాగౌడ్, సిద్దు ఉన్నారు. నేడు కోనాపూర్ గ్రామంలో కుస్తీపోటీలు బాన్సువాడ రూరల్: ఉగాది ఉత్సవాల్లో భాగంగా బుధవారం మండలంలోని కోనాపూర్ గ్రామంలో కుస్తీపోటీలు నిర్వహించనున్నారు. మొదటి బహుమతి 5తులాల వెండి కడియం,ద్వితియ బహుమతి 3తులాల వెండికడియం, తృతియ బహుమతి 2తులాల వెండికడియం బహుకరించనున్నారు. -
ఆన్లైన్ గేమింగ్కు మరో యువకుడు బలి
● రూ.5 లక్షలకుపైగా పోగొట్టుకుని ఆత్మహత్యాయత్నం ● ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి ● మృతుడిది రూరల్ మండలం ఆకులకొండూర్ నిజామాబాద్ రూరల్: ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారిన ఓ యువకుడు లక్షల రూపాయా లు పోగొట్టుకుని చివర కు తన ప్రాణాలను తీసుకున్నాడు. సుమారు రూ.5లక్షలకు పైగా పోగొట్టుకోవడంతో ఆత్మహత్యకు యత్నించిన సదరు యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందా డు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూర్ గ్రామానికి చెందిన ఆకాశ్(24) ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారాడు. ఇటీవల లక్షల రూపాయలను గేమ్స్లో పెట్టి పోగొట్టుకున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే ఏమంటారోనని భయపడి ఐదారు రోజులక్రితం గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ విషయమై రూరల్ సీఐ సురేశ్ను వివరణ కోరగా బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
నందిపేట్: మండలంలోని ఉమ్మెడ శివారులోని గోదావరి నది బ్యాక్ వాటర్లో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు నందిపేట ఎస్సై చిరంజీవి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గోదావరి నదిలో మృతదేహం ఉందన్న సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి జాలర్ల ద్వారా మృతదేహాన్ని బయటకు తీశామన్నారు. మృతుడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల వరకు ఉంటుందని అన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తించడానికి వీలు లేకుండా ఉందన్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. డ్రంకన్ డ్రైవ్, న్యూసెన్స్ కేసుల్లో పలువురికి శిక్షఆర్మూర్టౌన్: ఆర్మూర్ పీఎస్ పరిధిలో స్పెషల్ డ్రైవ్, డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఆర్మూర్ పట్టణం అశోక్నగర్కు చెందిన దేవరాజుకు మూడు రోజుల సాధారణ జైలు శిక్షను ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ పేర్కొన్నారు. అలాగే కమ్మర్పల్లికి చెందిన షేక్ మునీర్ బైక్ను అత్యంత ధ్వనితో ఆర్మూర్ నగరంలో నడుపుతూ న్యూసెన్స్ సృష్టించడంతో అతనికి రెండు రోజుల సాధారణ జైలు శిక్షను జడ్జి విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. బోధన్లో ఒకరికి రెండు రోజుల జైలుబోధన్టౌన్: బోధన్ పట్టణ పీఎస్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడుపుతన్న వ్యక్తికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి రెండు రోజుల జైలు శిక్షను విధించారని పట్టణ సీఐ వెంకట నారాయణ మంగళవారం తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని సీఐ సూచించారు.యువకుడి అదృశ్యంరుద్రూర్: మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల విజయ్కుమార్ అనే యువకుడు అదృశ్యమైనట్టు ఎస్సై సాయన్న తెలిపారు. గతేడాది ఇంటి నిర్మాణానికి తెచ్చిన అప్పులు ఎక్కువ కావడంతో మద్యానికి బానిసయ్యాడు. నాటి నుంచి మతిస్థిమితం సరిగా లేదు. గత నెల 11న ఇంట్లోంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో విజయ్కుమార్ భార్య ప్రియాంక పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విజయ్ ఆచూకీ తెలిసిన వారు నంబర్ 87126 59876 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య రుద్రూర్: కోటగిరి మండల కేంద్రానికి చెందిన వన్నె సుభాష్(42) మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరికి చెందిన సుభాష్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని భార్య కుమారుడిని తీసుకుని పుట్టింటికి వెళ్లి పోయింది. నాటి నుంచి సుభాష్ ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం ఇంటి నుంచి సుభాష్ బయటకు రాకపోవడంతో చుట్టు పక్కల వారు ఆయన తమ్ముడికి సమాచారం అందించారు. రాత్రి స్థానికులతో కలిసి తలుపులు తీసి చూడగా ఉరేసుకొని ఉన్నాడు. మృతుడి తమ్ముడు సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. తాడ్కోల్ చౌరస్తాలో చైన్స్నాచింగ్బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో మంగళవారం చైన్స్నాచింగ్ జరిగినట్లు సీఐ అశోక్ తెలిపారు. పిట్లం మండలం సిద్ధాపూర్ గ్రామానికి చెందిన బాల పోచవ్వ చౌరస్తాలో బస్సు ఎక్కుతుండగా దుండగులు ఆమె మెడలోని గుండ్లను అపహరించారు. సుమారు ఏడు గ్రాముల బంగారు గుండ్లు అపహరణకు గురయ్యాయని బాధితురాలు గుర్తించి బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
నెత్తిన బోనమెత్తి.. మోకాళ్లపై నడిచి వెళ్లి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో జరుగుతున్న ఉగాది ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఓ భక్తురాలు నెత్తిన బోనమెత్తుకొని మోకాళ్లపై నడుచుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించింది. మెదక్ పట్టణానికి చెందిన కొంగరి బాలమణి అనే భక్తురాలు మంగళవారం మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి శ్రీ నల్లపోచమ్మ ఆలయం వరకు బోనమెత్తుకొని, మోకాళ్లపై నడుస్తూ..మధ్య మధ్యలో నృత్యాలు చేస్తూ వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించింది. దీంతో జాతరకు వచ్చిన భక్తులు బాలమణి బోనమెత్తుకొని ఆలయానికి చేరుకున్న తీరును ఆసక్తిగా తిలకించారు. కాగా బాలమణి గత 40 ఏళ్లుగా ఉగాది జాతర ఉత్సవాలలో ఇదే తీరుగా అమ్మవారికి బోనం సమర్పిస్తుంది. గోపాల్పేటలో జరిగే నల్లపోచమ్మ జాతరకు బాలమణి బోనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. జాతర ఉత్సవాల్లో అమ్మవారికి బోనం సమర్పించిన బాలమణి గత 40 ఏళ్లుగా కొనసాగిస్తున్న ఆనవాయితీ -
ఎండల్లో.. కూడెల్లి పరవళ్లు
బీబీపేట : భూగర్భ జలాలు అడుగంటిపోతూ బో రుబావులు ఎత్తిపోతున్నాయి. నీరందక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరును నింపడానికి కొండ పోచమ్మ సాగర్ ద్వారా వస్తున్న నీరు అన్నదాతల ఆశలను సజీవంగా నిలుపుతోంది. కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టు ద్వారా ఆరు రోజుల క్రితం నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి కొండ పోచమ్మ కెనాల్ ద్వారా కూడెల్లి వాగుకు నీటిని వదులుతున్నారు. ఈ నీరు గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గాల మీదుగా ప్రవహించి జిల్లాలోని బీబీపేట మండలంలోని తుజాల్పూర్ గ్రామంలోని చెక్డ్యాంలోకి చేరుతోంది. దాని నుంచి దిగువన ఉన్న చెక్డ్యాం నిండి ఎగువ మానేరులోకి ప్రవహిస్తోంది. జిల్లాలో రెండు చెక్డ్యాంలు నిండిన తర్వాత ఎగువ మానేరువైపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఎండాకాలంలో వాగు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. నీరందక ఎండుముఖం పట్టిన పంటలకు గోదావరి జలాలు ఊపిరి పోశాయని రైతులు పేర్కొంటున్నారు. పంటలకు జీవం పోసినట్టయ్యింది రెండెకరాలలో వరి సాగు చేస్తున్నాను. ఎండలు రోజురోజుకు మండుతుండడంతో పంటలు ఎండిపోయే స్థితికి వచ్చాయి. ప్రభుత్వం కూడెల్లి వాగులోకి నీళ్లను వదలడంతో ఎండుతున్న పంటలకు జీవం పోసినట్టయ్యింది. పంట చేతికి వస్తుందన్న నమ్మకం వచ్చింది. – ప్రభాకర్, రైతు, మల్కాపూర్ కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల రాక చెక్డ్యాంలు నింపుతూ ఎగువ మానేరులోకి చేరుతున్న నీరు -
అవగాహనతోనే ఆటిజం దూరం
నిజామాబాద్నాగారం: కొంతమంది ఏ సమస్య వచ్చినా వెంటనే గూగుల్ శోధించి ఉన్నవీ లేనివి తమకు ఆపాదించుకుంటారు. అనవసరమైన భయాందోళనలకు గురవుతుంటారు. తమ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ క్రమంలో ఆటిజం సమస్య ఉన్న పిల్లల విషయంలో సైతం తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేసే అవకాశం ఉంది. నేడు ‘ప్రపంచ ఆటిజం దినోత్సవం’ సందర్భంగా పిల్లలకు ఆటిజం ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.. పేరు పెట్టి పిలిచినా పలకకపోవడం, ఐ కాంటాక్ట్ సరిగా లేకపోవడం, వారి వంక చూసి నవ్వినప్పుడు తిరిగి నవ్వకపోవడం.. వంటి లక్షణాలు ఆటిజం సమస్య ఉన్న పిల్లల్లో కనిపిస్తుంటాయి. జన్యుపరమైన, ఇతరత్రా వివిధ కారణాల వల్ల మన దేశంలో ప్రతి వంద మంది చిన్నారుల్లో ఇద్దరు ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వాటిని నమ్మడం ఆపేయండి ఇంటర్నెట్ వ్యాప్తి పెరిగిన తర్వాత ఏ సమస్య వచ్చినా గూగుల్ చేస్తున్నారు. అందులో చెప్పిన విషయాలను ఆచరించడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని రకాల సమస్యల విషయంలో ఇది సరైన మార్గం కాదంటున్నారు నిపుణులు. ఇంటర్నెట్లో ఎంతో సమాచారం ఉంటుంది. ఇందులో సంబంధం లేని సమాచారం కూడా ఉంటుంది. దీనివల్ల మరికొన్ని అనుమానాలు పుట్టుకొస్తుంటాయి. ఇది పిల్లల ఆరోగ్యంపై పడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి, ఇంటర్నెట్లో ఉండే సమాచారాన్ని నమ్మకుండా మీకు అనుమానం వచ్చిన వెంటనే సంబంధిత నిపుణుల అభిప్రాయం తీసుకోవడం ఉత్తమం. సొంత చికిత్స వద్దు.. ఈ రోజుల్లో ఏదైనా తెలియకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకోవడం సాధారణంగా మారిపోయింది. కొంతమంది తల్లిదండ్రులు ఆటిజం సమస్య గురించి యూట్యూబ్లో వెతికి ఇంట్లోనే వారికి శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఆటిజం లక్షణాలు అందరిలో ఒకేరకంగా ఉండకపోవచ్చు. దీనికి స్పష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. లక్షణాలను బట్టి ఆక్యుపేషనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ.. వంటివి ఇస్తుంటారు. కాబట్టి, సంబంధిత నిపుణులను సంప్రదించి వారు చెప్పే జాగ్రత్తలు పాటించడం మంచిది. బలవంతం చేయొద్దుఆటిజం ఉన్నవారిలో కొంతమంది తమ కంటే తక్కువ వయసున్న పిల్లల్లాగా ప్రవర్తిస్తుంటారు. అయితే తల్లిదండ్రులు మాత్రం పిల్లలు ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయకపోతే కంగారుపడుతుంటారు. కొంతమంది బలవంతం కూడా చేస్తుంటారు. ఉదాహరణకు ఓ ఏడేళ్ల అమ్మాయి ఇంకా నర్సరీ రైమ్స్ చూస్తుంటే కొంతమంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. ఇవి వారి కంటే చిన్న పిల్లలు చూడాల్సినవని.. వారి వయసులో చూడాల్సిన ప్రోగ్రామ్స్ను బలవంతంగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల వారు వాటిని చూడకపోగా మరింత కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, వారికి నచ్చని విషయాల్లో బలవంతం చేయకపోవడమే మంచిది. బాల్యంలో వేధిస్తున్న మందబుద్ధి సమస్య ప్రతి వంద మంది పిల్లల్లో ఇద్దరికి వచ్చే అవకాశం నేడు ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవంఅవగాహన.. మద్దతు అవసరం ఆటిజం ఉన్న పిల్లలకు సమాజం, ఉపాధ్యాయులు, వైద్య నిపుణులు కలిసికట్టుగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు సమయానికి వైద్య సలహా తీసుకోవడం, సమగ్ర విద్య విధానాలను అమలు చేస్తే బాగుంటుంది. – ప్రొఫెసర్ విశాల్, న్యూరోసైకియాట్రిస్ట్ -
చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి
సిరికొండ: మండలంలోని తూంపల్లికి చెందిన దాసరి రజనీశ్(38) కొబ్బరి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ మంగళవారం తెలిపారు. రజనీశ్ కొబ్బరికాయలు తెంపడానికి సోమవారం కొబ్బరి చెట్టు పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడి గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అక్బర్నగర్ శివారులో కారు బోల్తారుద్రూర్: మండలంలోని అక్బర్నగర్ శివారులో మంగళవారం కారు బోల్తా పడింది. కాగా కారులో ఉన్న వ్యక్తి పారిపోయినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రుద్రూర్ పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి స్థానికుల ద్వారా ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. ఓ పోలీసు వాహనం వెంబడిస్తున్న సమయంలో కారు బోల్తా పడినట్టు తెలిసింది. కారును పోలీసులు ఎందుకు వెంబడించారు. కారు బోల్తాపడగానే అందులో ఉన్న వ్యక్తి ఎందుకు పారిపోయాడనేది వివరాలు తెలియరాలేదు. ఈ విషయమై స్థానిక ఎస్సై సాయన్న ను వివరణ కోరగా ప్రమాదానికి గురైన కారును రుద్రూర్ పోలీస్స్టేషన్కు తరలించామని, వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. పేకాట స్థావరంపై దాడిబాన్సువాడ రూరల్: మండలంలోని కొయ్యగుట్ట శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఎల్లారెడ్డిలో పిల్లర్లకే పరిమితం
ఎల్లారెడ్డి పట్టణంలోనూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి అలాగే ఉంది. రూ. 2 కోట్ల అంచనా వ్యయంతో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశా రు. బిల్లుల సమస్యతో పిల్లర్లు, బీమ్లు వేసి వదిలేశారు. పనులు తిరిగి ఎ ప్పుడు మొదలుపెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ నడిబొడ్డున నిర్మాణాలు చేపట్టినా.. అవి పూర్తి కాకపోవడంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.ఎల్లారెడ్డిలో నిలిచిపోయిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు -
జాతరలో తప్పిపోయిన పాప
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో జరుగుతన్న నల్లపోచమ్మ జాతర ఉత్సవాల్లో మంగళవారంరాత్రి మూడేళ్ల పాప తప్పిపోయింది. ఆలయ పరిసరాలలో ఒంటరిగా ఏడుస్తూ నిలబడ్డ పాపను గమనించిన నాగిరెడ్డిపేట పోలీసులు అక్కున చేరుకొని తల్లిదండ్రుల వివరాలను రాబట్టారు. తన తండ్రి పేరు సురేందర్ అని, తల్లి పేరు సౌజన్య అని, తమ ఊరు గాజిరెడ్డిపల్లి అని మాత్రమే పాప తెలిపింది. దీంతో పాప తప్పిపోయిన విషయాన్ని, ఈమె కుటుంబసభ్యుల వివరాలను వారు సోషల్మీడియాలో వైరల్ చేశారు. కొద్దిసేపటికీ పాప సంబందీకులు ఆలయం వద్ద పోలీసుల వద్దకు చేరుకొని జాతరలో తప్పిపోయిన పాప తమ పాపేనని చెప్పారు. దీంతో పూర్తి విచారణ చేపట్టిన కానిస్టేబుల్ గంగారాం పాపను కుటుంబసభ్యులకు అప్పగించారు. జీజీహెచ్లో బాలుడు.. ఖలీల్వాడి: నగరంలోని జీజీహెచ్ నుంచి తప్పిపోయిన బాలుడిని తల్లికి అప్పగించినట్లు ఎస్హెచ్వో రఘుపతి మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గౌతంనగర్కు చెందిన కేషిరెడ్డి లత తన రెండున్నరేళ్ల బాబును తీసుకుని గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చింది. ఈ క్రమంలో బాబు ఆడుకుంటూ రోడ్డుపైకి వచ్చాడు. బస్టాండ్ ఏరియాలో డ్యూటీలో ఉన్న మహిళా హెడ్ కానిస్టేబుల్ బాబును చేరదీసి తన తల్లికి అప్పగించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకొని బయటకు వచ్చినప్పుడు వారిపై దృష్టి పెట్టాలని ఎస్హెచ్వో కోరారు. అక్కున చేర్చుకొని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు -
పెరిగిన టోల్ చార్జీలు
● నేటి నుంచి అమలులోకి ఇందల్వాయి: టోల్ప్లాజా చార్జీలు ఎప్పటిలాగే ఈ ఏడాది సైతం పెరిగాయి. గతంతో పోలిస్తే 3.5 శాతం పెరిగిన చార్జీలు మంగళవారం నుంచి అమ లులోకి వస్తాయని ఇందల్వాయి టోల్ప్లాజా మేనే జర్ చలపతిరావు తెలిపారు. పెరిగినచార్జీలు ఇలా..ఇందల్వాయి టోల్ప్లాజా వాహనం సింగిల్ రిటర్న్ నెలవారీ పాస్ జర్నీ (రూ.లలో) జర్నీతో (రూ.లలో) (రూ.లలో) కారు, జీప్, వ్యాన్, లైట్ మోటార్ వెహికిల్స్ 90 135 3,035 లైట్ కమర్షియల్ వెహికిల్, మినీ బస్ 145 220 4,905 బస్సు, ట్రక్ 310 465 10,280 నిర్మాణ రంగ వాహనాలు, ఎర్త్ మూవర్స్ 485 725 16,120 భారీ వాహనాలు 590 885 19,625 (ఏడు లేదా అంతకు ఎక్కువ చక్రాలు) (టోల్ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాహనాలకు నెలవారీ పాస్ రూ.350) -
చెరువులో జారిపడి ఒకరి మృతి
జక్రాన్పల్లి: ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన జక్రాన్పల్లి మండల కేంద్రంలో మార్చి 30న చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మచ్చ మహేందర్(48) ఉగాది రోజున మామిడి, వేప ఆకుల కోసం ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రమైనా తిరిగి రాకపోవడం, సెల్ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉండడంతో కుటుంబసభ్యులు ఆచూకీ కోసం వెతికారు. కాగా, మహేందర్ 31న(సోమవారం) చెరువులో మృతదేహమై కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మహేందర్ ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో చెరువు వద్ద కాలకృత్యాలకు వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య మచ్చ రజిని ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహేందర్ ఆర్మూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి మెడికల్లో పనిచేసేవాడని, భార్యతోపాటు కుమారుడు, కూతురు ఉన్నట్లు తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. బోధన్ రూరల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. మండలంలోని పెగడపల్లి నుంచి బోధన్ వైపు మార్చి 29న ఉదయం కాలినడక వస్తున్న గుర్తు తెలియని వ్యక్తిని బర్దీపూర్ గ్రామానికి చెందిన సంజీవ్ బైక్తో ఢీకొట్టాడు. దీంతో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆ వ్యక్తి సోమవారం ఉదయం మృతి చెందాడని, దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయసు 30 నుంచి 35ఏళ్లు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పేర్కొన్నారు. -
తీగలాగితే కదిలిన డొంక
మత్తు దందాపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నా అక్రమార్కులు ఆగడం లేదు. గతంలో క్లోరోహైడ్రేట్ అక్రమ వ్యాపారం నిర్వహించగా.. ఇప్పుడు అల్ప్రాజోలంతో దందా నడిపిస్తున్నారు. సులువుగా డబ్బులు సంపాదించాలన్న ఆరాటంతో కొందరు కేసులకూ భయపడడం లేదు. దీంతో జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలకు అడ్డుకట్ట పడడం లేదు. ● గతంలో క్లోరోహైడ్రేట్.. ఇప్పుడు అల్ప్రాజోలం ● కేసులకూ జడవని అక్రమార్కులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతంలో కల్లు తయారీలో క్లోరోహైడ్రేట్ వినియోగించేవారు. దీనిని ఇతర రాష్ట్రాలనుంచి తీసుకుని వచ్చేవారు. అయితే ఎక్కవ మొత్తంలో క్లోరోహైడ్రేట్ కలపాల్సి వచ్చేది. దీంతో క్వింటాళ్ల కొద్దీ ఈ మత్తు పదార్థం అవసరం అయ్యేది. దానిని రవాణా చేయడం రిస్క్తో కూడుకున్న పని. రవాణా కోసం ప్రత్యేక వాహనాలను వాడేవారు. పోలీసుల తనిఖీలనుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు తీసుకునేవారు. మరోవైపు కల్తీ కల్లు తయారీలో అల్ప్రాజోలం కూడా వినియోగిస్తారు. క్లోరోహైడ్రేట్తో పోల్చితే ఇది చాలా తక్కువ పరిమాణంలో అవసరం ఉంటుంది. దీనిని రవాణా చేయడం కూడా సులువే.. ఈ నేపథ్యంలో వ్యాపారులు, కల్తీ కల్లు తయారీదారులు క్లోరోహైడ్రేట్ను కాకుండా అల్ప్రాజోలం వినియోగానికే మొగ్గుచూపుతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా.. మత్తు దందాలో చిక్కితే జైలుపాలవుతామని తెలిసినప్పటికీ, సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో కొందరు అల్ప్రాజోలం దందాలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. గతంలో కొందరు మత్తు పదార్థాల దందాలో పెద్ద ఎత్తున సంపాదించి ఆస్తులు కూడబెట్టుకున్నారు. వాళ్లను చూసి మరికొందరు ఈ దందాలోకి దిగారు. దొరకనంత వరకు డబ్బులు సంపాదించవచ్చని, ఒకవేళ దొరికినా నాలుగు రోజులు జైల్లో ఉండి వస్తామన్న ధోరణితో ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. కఠిన చర్యలు తప్పవు నిషేధిత మత్తు పదార్థాలు క లిగి ఉన్నా, సరఫరా చేసినా, అమ్మినా, తయారు చేసినా చట్టప్రకారం శిక్షార్హులవుతా రు. అలాంటివారిపై కఠిన చర్యలుంటాయి. మత్తు దందాతో డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే జైలుపాలుకాక తప్పదు. ఎంతటివారైనా ఉపేక్షించేది లే దు. యువత మాదకద్రవ్యాలు, గంజాయి వంటి వాటికి దూరంగా ఉండాలి. – రాజేశ్ చంద్ర, ఎస్పీపోలీసులకు చిక్కుతున్నా..జిల్లాలో మత్తు దందాపై ఐదారు నెలల కాలంలో పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు నిర్వహించిన దాడుల్లో పదిమందికిపైగా చిక్కారు. వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు పెట్టారు. ఈ యాక్ట్ కింద కేసులు పెడితే శిక్షలు కఠినంగా ఉంటాయి. కనీసం రెండుమూడు నెలల వరకు బెయిల్ కూడా దొరకదు. నేరం నిరూపితమైతే కనీసం ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయినప్పటికీ సులువుగా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడినవారిలో మార్పు రావడం లేదు. పైపెచ్చు ఈ మత్తు దందా చేసేవారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల అక్రమ ఫైనాన్స్ దందాపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మద్నూర్ మండల కేంద్రంలో అప్పులు ఇచ్చే ఓ వ్యక్తి ఇంటికి పోలీసులు వెళ్లినపుడు.. సదరు వ్యాపారి పోలీసుల రాకను గమనించి అల్ప్రాజోలంను దాచిపెట్టడానికి యత్నించాడు. దీనిని గమనించిన పోలీసులు.. అతడిని పట్టుకుని విచారించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తీగలాగితే డొంక కదిలినట్టుగా హైదరాబాద్లో అమ్మిన వ్యక్తితో పాటు, తయారు చేయిస్తున్న వ్యక్తీ పోలీసులకు చిక్కాడు. మద్నూర్కు చెందిన మరో వ్యక్తికి సైతం అల్ప్రాజోలం సరఫరా చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీంతో నలుగురిపై కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులను పోలీసులు రిమాండ్కు పంపారు. మద్నూర్కు చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. -
మోడల్ ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యేదెన్నడు?
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్మించనున్న మోడల్ ఇందిరమ్మ ఇల్లు పనులు అర్ధంతరంగా నిలిచాయి. ప్రభుత్వం మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇల్లును నిర్మించడానికి రూ.5లక్షలు మంజూరు చేసింది. ఇల్లు నిర్మించడానికి కేటాయించిన స్థలంలో హౌజింగ్ అధికారులు కొలతలు చేసి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేసిన నెలకు పనులు ప్రారంభించారు. సిమెంటు, కంకర వేసి 12రోజుల గడుస్తున్నా ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మోడల్ ఇల్లు నిర్మాణం పూర్తయితే ఈ ఇల్లును చూసి తమ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో తెలుస్తుందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తొందరగా మోడల్ ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
‘విద్యార్థులపై దాడి సిగ్గుచేటు’
తెయూ(డిచ్పల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు బీ శివ తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రతిష్టాత్మక హెచ్సీయూకి సంబంధించిన 400ల ఎకరాల భూమిని అమ్మేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాత్రివేళలో వర్సిటీ భూములను పొక్లెయిన్లతో చదును చేసే ప్రయత్నంపై ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపగా, ప్రభుత్వం పోలీసుల ద్వారా వారిపై లాఠీచార్జి చేయించడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులపై దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ వర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్, ఉపాధ్యక్షులు తరుణ్, సమీర్, రాము, అశోక్, శివ తదితరులు పాల్గొన్నారు. -
చేసిన తప్పు ఊరకే పోదు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రజల పన్నులతో జీతాలు తీ సుకుంటున్న ఉన్నతాధికారులు ప్రజలకు సేవ చేయడంతో పాటు ప్రజల ఆస్తులను రక్షించడం, బా ధితులకు న్యాయం చేసేందుకు పనిచేయాలి. అయితే ఇందుకు విరుద్ధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యవహారంలో అధికారులు తగిన ఫలితం చవిచూడాల్సి వస్తోంది. బాధితుడి పోరాటంతో కోర్టు ఆదేశాల మే రకు ఐఏఎస్ అధికారితో పాటు మరో ఇద్దరు ఉ న్నతాధికారులపై కేసు నమోదైంది. తప్పుడు మా ర్గంలో వెళ్లేందుకు అధికారులను ప్రోత్సహించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ మాత్రం దుబాయ్ వెళ్లి వ్యా పారాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్వో చంద్రప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్రాజ్లపై వర్ని పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. 2022–23 సీజన్లో వర్ని మండలంలోని కిషోర్ అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస రైస్మిల్లుకు కేటాయించిన ధాన్యం పంపించకుండానే పంపించినట్లు ఉన్నతాధికారులు చూపించారు. మ రింత ముందుకెళ్లి సదరు రైస్మిల్లు యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేసేలా కథ నడిపించారు. కథ ఇంతటితో ఆగలేదు. ధాన్యం షకీల్ మిల్లుకు పంపించి, కస్టమ్ మిల్లింగ్ రైస్ను కిషోర్కు చెందిన శ్రీనివాస రైస్ మిల్లు నుంచి ఇవ్వాలని ఒత్తిడి తేవడం గమనార్హం. ఈ విషయమై కిషోర్ నెలల తరబడి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరకు కోర్టు ఆదేశాలతో ఉన్నతాధికారులపై కేసు నమోదైంది. ● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబయి, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. ఓ 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఆర్కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్ధుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానుల తో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ లవంతంగా ధా న్యం తీసుకున్న ట్లు లేఖలు ఇప్పించాడు. షకీ ల్ ఒత్తిడితోనే లేఖలు ఇ చ్చిన ట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభు త్వం షకీల్కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలే దు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు. మరోవైపు కిషోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసే కథ నడిపిన అధికారులే సీఎంఆర్ కిషోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తూ రావడం విశేషం. ఈ విషయంలో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని షకీల్ దండుకున్న ధాన్యం డబ్బులను రికవరీ చేసేందుకు కృషి చేస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే అదనపు కలెక్ట ర్, మాజీ డీసీవో, డీటీలపై కేసులు నమోదయ్యాయి.అదనపు కలెక్టర్ చంద్రశేఖర్అధికారంలో ఉన్న సమయంలో..బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బో ధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కోట్లాది రూపాయల విలువజేసే ధాన్యాన్ని ప్రభుత్వం వద్ద తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారీతిన దందా చేశా డు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిషోర్ మిల్లు నుంచి సీ ఎంఆర్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించాడు. అయితే అధికారం పోవడంతో షకీల్ తక్షణమే దుబాయ్ వెళ్లిపోయాడు. జిల్లాలో మొత్తం 41 మంది మిల్లర్లను ప్రభుత్వం డిఫాల్టర్లుగా ప్రకటించింది. ఈ మిల్లర్లు రూ.417 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ను ప్రభుత్వానికి ఇవ్వా ల్సి ఉంది. అయితే ఇందులో ఒక్క షకీల్ నుంచి రావాల్సిన బియ్యం విలువే రూ.60 కోట్ల మేర ఉండడం విశేషం. కలకలం రేపిన అదనపు కలెక్టర్, ఇద్దరు ఉన్నతాధికారులపై కేసు ధాన్యం ఒకరికి ఇచ్చి.. సీఎంఆర్ మరొకరిని అడిగిన వైనం దుబాయ్కు చెక్కేసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ -
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించండి
కామారెడ్డి క్రైం : రాజీవ్ యువ వికాసం పథకంపై అ వగాహన కల్పించి, వీలైనంత ఎక్కువమంది దర ఖాస్తు చేసుకునేలా చూడాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి వీడియో కాన్ఫరె న్స్ ద్వారా మాట్లాడారు. అర్హులైన వారు 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా చూడాలన్నారు. ఈ ప థకంలో లబ్ధిదారులకు రూ. 50 వేలలోపు రుణాల కు 100 శాతం, రూ.లక్షలోపు రుణాలకు 90శాతం, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం, రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు 70 శాతం రా యితీ లభిస్తుందని తెలిపారు. కుటుంబంలో ఒక్కరి కే ఈ పథకం వర్తిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో వార్షికాదాయం రూ.1.50 లక్షలలోపు, పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షలలోపు ఉ న్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖా స్తు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలను ము న్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాల న్నారు. వీడియో కాన్ఫరెన్స్లో కామారెడ్డి నుంచి క లెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో సురేందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దేవేందర్, ప రిశ్రమల శాఖ జీఎం లాలూనాయక్ పాల్గొన్నారు. గడువులోగా దరఖాస్తు చేసుకునేలా చూడండి వీడియో కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క -
సర్కార్ బడిని బతికించండి
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు గ్రామంలో తిరుగుతూ సర్కార్ బ డిలో మీ పిల్లలను చదివించి బడిని బతికించండి అంటూ వేడుకున్నారు. సోమ వారం గ్రామంలో వీడీసీ, వివిధ సంఘాల సభ్యులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పాఠశాలలు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించి బడిని కాపాడుకోవాలని కోరారు. ఎంఈవో శ్రీనివాస్, హెచ్ఎంలు మంత్రి రమేశ్, ఓటర్కర్ రమేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
65.54 శాతం ఆస్తి పన్ను వసూలు
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి బల్దియా పరిధిలో సోమవారం నాటికి 65.54 శాతం ఆస్తిపన్నులు వసూలయ్యాయి. బల్దియాలో రూ.13.56 కోట్ల పనులు వసూలు చేయాల్సి ఉండగా.. ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ. 8.89 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగారు. ఇంకా రూ. 4.67 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉంది. మొండి బకాయిలనూ వసూలు చేస్తామని మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ రవిగోపాల్రెడ్డి తెలిపారు.వాటర్ ప్లాంట్ ప్రారంభంబీబీపేట : శివారు రాంరెడ్డిపల్లి గ్రామంలో ఏ ర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను సోమవారం ఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ప్రారంభించారు. గ్రామస్తులకు శుద్ధమైన తాగునీటిని అందించడం కోసం సుభాష్రెడ్డి రూ. 3 లక్షలతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చే యించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేష న్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.రేషన్ షాపులకు చేరిన సన్నబియ్యంబాన్సువాడ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం అమలుకోసం సోమవారం బాన్సువాడ మండలానికి సన్న బియ్యం చేరాయి. బాన్సువాడ ఎంఎల్ఎస్ పాయింట్ పరిధిలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో ఉన్న 59 రేషన్ దుకాణాలకుగాను 650 టన్నుల బియ్యం పంపిణీ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యం సంచుల్లో రెండు, మూడు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారులందరూ సన్న బియ్యం తీసుకెళ్తారని, బియ్యం తక్కువగా రావడంతో వాటిని ఎలా భర్తీ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉచితంగా పాలిసెట్ కోచింగ్నిజామాబాద్అర్బన్: పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశిధర్ తెలిపారు. సోమవారం ఆయన నిజామాబా ద్లో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని, నగరంలోని ఎస్ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఉచిత తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు పేర్లను ఏబీవీపీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో పరిషత్ నగర కార్యదర్శి బాలకృష్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేందర్, దుర్గాదాస్, రంజిత, వినోద్, ఇంద్రసేన, జయేంద్రవర్ధన్ అలంకార్ పాల్గొన్నారు. -
మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్రూం ఇళ్లు
రాజంపేట: మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయం మందుబాబులకు అడ్డాగా మారింది. గత ప్రభుత్వం 2020 డిసెంబర్లో ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేయగా, ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. దీంతో ఇళ్లను పంపిణీ చేయకపోవడంతో మందుబాబులు అడ్డాగా చేసుకున్నారు. మద్యం తాగుతూ సీసాలను ఇళ్లలోనే పడేస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు రోడ్డు, నీటి వసతి, విద్యుత్ వంటి మౌలిక వసతుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు అయినట్లు సమాచారం. కానీ అధికారికంగా అక్కడా ఎలాంటి పనులు చేపట్టక పోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనులను పూర్తిచేసి, లబ్ధిదారులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉపాధ్యాయుడిగా నాడు తండ్రి.. నేడు కొడుకు
ఒకే పాఠశాలలో విద్యాబోధన..మాచారెడ్డి: తండ్రీకొడుకులు ఒకే పాఠశాలలో విద్యా బోధన చేసి ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. రాజన్న–సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన వేషాల బాలయ్య లచ్చపేట ఉన్నత పాఠశాలో 1993–1995వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆయన పని చేసిన సమయంలో ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దాడు. తదుపరి బాలయ్య అనారోగ్యానికి గురికావడంతో బాలయ్య కుమారుడు శ్రీనివాస్ విద్యావలంటీర్గా ఇదే పాఠశాలలో 1995–1996 వరకు పనిచేశాడు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి గంభీరావుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరాడు. 2023 నవంబర్లో డిప్యుటేషన్పై వచ్చి విద్యార్థులకు పాఠాలు బోఽధించాడు. 2024 అక్టోబర్లో రెగ్యులర్ ఉపాధ్యాయుడిగా ఇదే పాఠశాలకు బదిలీపై వచ్చాడు. అప్పటి నుంచి ఇదే పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నాడు. నాడు తండ్రి, నేడు తనయుడు ఒకే పాఠశాలలో పనిచేయడం ఆసక్తికర విశేషం.ఆనందగా ఉంది మా నాన్న పనిచేసిన పాఠశాలలో నేను ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించడం సంతోషంగా ఉంది. మానాన్న చదువు చెప్పిన నాటి విద్యార్థుల కుమారులకు, కుమార్తెలకు నేను విద్యాబోధన చేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. – శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, లచ్చాపేట -
ఘనంగా ఈద్ ఉల్ ఫితర్
కామారెడ్డి టౌన్ : జిల్లాలో ముస్లింలు సోమవారం రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు, పెద్దబజార్, బతుకమ్మకుంట, గొల్లవాడ, అశోక్నగర్ కాలనీ, పాతబస్టాండ్ప్రాంతాలలోని ఈద్గాల వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రార్థనల్లో పాల్గొన్నారు. పట్టణంలోని షాహి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయాలను గుర్తుచేసుకోవడం, చరిత్ర గతి మార్చిన వీరులను స్మరించు కోవడం పర్వదినాల్లో సర్వసామాన్య అంశం అన్నా రు. వీటితో పాటు మనిషికి క్రమశిక్షణ నేర్పి, ధర్మా న్ని, దయాగుణాన్ని ప్రబోధించే పండుగలలో రంజాన్ ఒకటి అన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, జిల్లా అధికారులు షబ్బీర్ అలీని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.మాట్లాడుతున్న షబ్బీర్ అలీ -
ప్రజా మరుగుదొడ్లేవి?
● బిచ్కుందలో సులభ్ కాంప్లెక్స్ లేక మండల ప్రజల ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులుబిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వివిధ గ్రామాల నుంచి వచ్చేవారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతున్న వ్యాపారం, జనాభాకు అనుగుణంగా మండల కేంద్రంలో అధికారులు సరైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మండల కేంద్రంలో ఎక్కడ ప్రజా మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు. గ్రామ స్వచ్ఛతకు అందరు సహకారం అందించాలి, బహిరంగ ప్రదేశాల్లో మూత్రవిసర్జన చేయవద్దని పంచాయతీ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలను మాత్రం కల్పించడం లేదు. ఇతర గ్రామస్తులు, దుకాణాల్లోని సిబ్బందికి ఎవరికై నా ఒంటికి, రెంటికీ వస్తే ఆర్టీసీ బస్టాండ్కు రావాల్సిందే. వ్యాపారులు దుకాణాలను వదిలి ఇంటికి వెళ్లాల్సి వస్తుందని అంటున్నారు. పలువురు ఖాళీ స్థలాల్లో మూత్రవిసర్జన చేపట్టడంతో పరిసరాలు దుర్గంధంగా మారుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండల కేంద్రంలో కనీసం రెండు సులభ్ కాంప్లెక్స్ నిర్మించి, ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.ప్రతిపాదనలు పంపించాం.. మండల కేంద్రంలో పలువురు బహిరంగ ప్రదేశాల్లోనే మూత్ర విసర్జన చేస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం బిచ్కుందలో సులభ్ కాంప్లెక్స్ కావాలని ఉన్నతాధికారులకు గతంలో ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం రెండు సులభ్ కాంప్లెక్స్ల అవసరం ఉంది. సమస్యను మరోసారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా. – శ్రీనివాస్గౌడ్, జీపీ కార్యదర్శి, బిచ్కుంద -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
నస్రుల్లాబాద్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డిరూరల్/లింగంపేట: జిల్లాలోని పలు గ్రామాల్లో ఉగాది ఉత్సవాల్లో భాగంగా సోమవారం వీడీసీల ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో జరిగిన పోటీల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల మల్లయోధులు పాల్గొన్నారు. గెలుపొందిన వారికి గ్రామ కమిటీ సభ్యులు నగదు బహుమతి అందించారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి మొదలుకొని రూ.2000 వరకు పోటీలు జరిగాయి. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామంలో నిర్వహించిన కుస్తీ పోటీలకు ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్ మండలాలకు చెందిన మల్లయోధులు హాజరయ్యారు. కొబ్బరికాయ కుస్తీ నుంచి 3 తులాల వెండి చైన్ వరకు పోటీలను నిర్వహించారు. లింగంపేట మండలం ముంబోజిపేట గ్రామంలో టెంకాయ కుస్తీ నుంచి వెండి కడెం వరకు కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు గ్రామ పెద్దలు నగదు బహుమతులు అందజేశారు. నేడు కోమలంచ గ్రామంలో.. నిజాంసాగర్ (జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం కొమలంచ గ్రామంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కుస్తీ పోటీలకు మల్ల యోధులు తరలివచ్చి జయప్రదం చేయాలని గ్రామస్తులు కోరారు. రేపు లింగంపేటలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని మత్తడి పోచమ్మ ఆలయం వద్ద బుధవారం కుస్తీ పోటీ లు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం రథోత్సవం, సాయంత్రం కుస్తీపోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలకు కుస్తీ వీరులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. -
త్రిభువన్ బిల్లు చరిత్రాత్మక ముందడుగు
బోధన్: లోక్సభలో త్రిభువన్ సహకార విశ్వ విద్యాలయం బిల్లు–2025 ఆమోదం పొందడం చరిత్రాత్మక ముందడుగని క్రిబ్ కో(క్రిషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్) జిల్లా మేనేజర్ సీహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి అన్నారు. సాలూర మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ మహాజన సభలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లు ద్వారా గుజరాత్లోని ఐఆర్ఎంఏ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్) సంస్థ త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయంగా మారనున్నట్లు తెలిపారు. ఇది తొలి జాతీయ సహకార విశ్వవిదాలయంగా ఆవిర్భావించనున్నదని పేర్కొన్నారు. సహకార రంగానికి నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేసి అందించడమే ఈ విశ్వవిద్యాలయ లక్ష్యమని వివరించారు. సహకార మార్కెటింగ్, గ్రామీణ క్రెడిట్, పాడి, మత్స్య పరిశ్రమలపై డిగ్రీ, డిప్లొమాలు, శిక్షణ, పరిశోధనలు అందిస్తుందని తెలిపారు. -
శభాష్.. మల్లేశ్
కామారెడ్డి అర్బన్: ఈయన బుల్లె మల్లేశ్.. కామారెడ్డి పట్టణం దేవునిపల్లికి చెందిన మల్లేశ్ 67 ఏళ్ల వయసులోనూ నిత్యం తన కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. పనిలేదు.. ఏం పని చేయాలి.. అంటూ దిక్కులు చూసే వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. 9వ తరగతి వరకు చదువుకున్న మల్లేశ్ 18 ఏళ్ల వయసు నుంచే సైకిల్పై తన వ్యాపారం ప్రారంభించారు. తన జీవన ప్రస్థానంలో ప్లాస్టిక్ వస్తువులు, ప్రెషర్కుక్కర్లు, స్టీల్ సామగ్రి, కుర్చీలు, రెడీమేడ్ దుస్తులు, గోడ గడియారాలు, ఇలా ఎన్నో వస్తువులు ప్రతీరోజు 10 నుంచి 30 కిలోమీటర్ల దూరం సైకిల్పై వెళ్లి విక్రయించేవారు. ప్రస్తుతం పట్టణంలో చాయ్ అమ్ముతూ రోజు రూ.500 వరకు సంపాదిస్తున్నారు. తన సంపాదనతో దేవునిపల్లిలో 500 గజాల ప్లాటు కొని, ఇల్లు నిర్మించారు. ఇద్దరు కొడుకులు, బిడ్డ పెళ్లిళ్లు చేశాడు. తన ఆరోగ్యం బాగున్నంత వరకు టీలు అమ్ముతానన్నారు. -
హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
బాన్సువాడ: మండలంలోని కొల్లూర్ సమీపంలో ఇటీవల జరిగిన అమృతం విఠల్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. ఈమేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆయన వివరాలు వెల్లడించారు. బాన్సువాడ మండలం నాగారం గ్రామానికి చెందిన అమృతం విఠల్(34) అనే వ్యక్తిని ఈ నెల 29న కొల్లూర్ సబ్ స్టేషన్ సమీపంలో దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లారు. పోలీసులు గ్రామంలో విచారించగా మృతుడి భార్య కాశవ్వ గ్రామానికి చెందిన అమృతం విఠల్ అనే వ్యక్తితో ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. దీంతో భర్తకు దీర్ఘకాలిక వ్యాధి ఉండటంతో అతడి అడ్డు తొలగించుకోవాలని కాశవ్వ నిర్ణయించుకుంది. తన భర్తను చంపితే డబ్బులు ఇస్తానని చెప్పి కాశవ్వ తన బంగారాన్ని తనఖా పెట్టి ఈ నెల 28న రూ.18 వేలు తెచ్చి నిందితుడు విఠల్కు ఇచ్చింది. అదేరోజు నిందితుడు విఠల్ను మోటార్ సైకిల్పై ఎక్కించుకుని దుర్కికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి కల్లు తాగించి, అనంతరం పుల్కంటి విఠల్, అమృతం విఠల్ కలిసి గొంతుకు టవల్ బిగించి పైపులతో కొట్టి చంపారు. మృతి దేహాన్ని కొల్లూర్ సబ్ స్టేషన్ సమీపంలోని బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. విచారణ అనంతరం కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్ను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
బాన్సువాడ/ గాంధారి: ఉగాది పండగను పురస్కరించుకుని పలు గ్రామాల్లో నిర్వహించిన కుస్తీ పోటీలు రసవత్తరంగా మారాయి. బాన్సువాడ మండలంలోని పోలీస్టేషన్ సమీపంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మల్లయోధులు పోటీల్లో తలపడ్డారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు యామ రాములు, అవారి గంగారాం, యాట వీరేశం, పోగు నారాయణ, శశికాంత్, పర్తు నారాయణ తదితరులు ఉన్నారు. గాంధారి మండలం నేరల్ గ్రామంలో ఉగాది సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించారు. విజేతలకు గ్రామ కమిటీ, గ్రామస్తులు నగదు బహుమతులు అందజేశారు. -
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్
ఎల్లారెడ్డిరూరల్: మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని ఉస్మానియా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఇఫ్తార్ విందులో ముస్లిములకు ఎమ్మెల్యే పండ్లు తినిపించారు. కార్యక్రమంలో గఫార్, ఆరీఫ్, గయాజుద్దీన్, పద్మశ్రీకాంత్, కుడుముల సత్యనారాయణ, ప్రశాంత్గౌడ్, సాయిబాబా, వినోద్గౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సామెల్ తదితరులు పాల్గొన్నారు. చలివేంద్రం ప్రారంభం నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్పేట ఆర్టీసీ బస్టాండ్లో కంట్రోలర్ మోహన్రావు సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్, నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూముల కౌలు వేలం మద్నూర్: మండల కేంద్రంలో లక్ష్మీనారాయణ ఆలయ భూములకు కౌలు వేలం నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. ఆలయానికి చెందిన ఏడు ఎకరాల 26 గుంటల భూమి మద్నూర్ శివారులో మూడు చోట్ల ఉందన్నారు. ఆలయ భూములను నాగంవార్ వెంకన్న, వట్నాల్వార్ సాయన్న, వంకాయల్వార్ నాగన్న ముగ్గురు వేలంలో పాల్గొని ఆలయ భూములను కౌలు చేయడానికి ముందుకు వచ్చినట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. -
పలువురికి సన్మానం
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలో మన ఊరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీచర్, ఆర్మీ ఉద్యోగం సాధించిన దివ్య, కె అజయ్ను ఆదివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు సున్నపు సత్యనారాయణ, కొల్మి సురేశ్రెడ్డి, యూనుస్, కొలిమి భీంరెడ్డి, కె రాజ్కుమార్రెడ్డి, సీహెచ్ రాజేందర్రెడ్డి, కె ప్రభాకర్, ఆర్ స్వామి, జి లింగారెడ్డి, బి శ్యాంరావు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఘనంగా మల్లన్న జాతరభిక్కనూరు: మండల కేంద్రంలో మల్లన్న జాతర ఆదివారం జరిగింది. అతిపురాతనమైన మల్లన్న ఆలయంలో భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాంపూర్ తండాలో పౌరాదేవి పీఠాధిపతి పర్యటనబాన్సువాడ రూరల్: మండలంలోని రాంపూర్ తండాలో ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన దేశాయిపేట్ సొసైటీ వైస్ చైర్మన్ అంబర్సింగ్ కుటుంబాన్ని ఆదివారం మహారాష్ట్రలోని పౌరాదేవి పీఠాధిపతి, ఎమ్మెల్సీ శ్రీబాబుసింగ్ పరామర్శించారు. అంబర్సింగ్ గిరిజన సమస్యలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని గుర్తు చేశారు. ఆయన వెంట బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు నేనావత్ బద్యానాయక్, రణజ్యనాయక్, ప్రకాశ్, ఫకీరా నాయక్, చాజ్యనాయక్, చందర్, రామురాథోడ్ తదితరులు ఉన్నారు. -
బండెనక బండికట్టి..
● జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఎడ్లబండ్ల ప్రదర్శన ● భారీగా తరలివచ్చిన జనం కామారెడ్డి టౌన్ : ఉగాది పర్వదినం సంద ర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. వీక్లీమార్కెట్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు విజయాలతో ముందుకుసాగాలని ఆకాంక్షించారు. ఆయా కుల సంఘాలు, యువజన సంఘాల ప్రతినిధు లు ఎడ్లబండ్లను అందంగా ముస్తాబు చేసి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆలయాలచుట్టూ ప్రదక్షిణల అనంతరం పాంచ్ రస్తా, గర్ల్స్ హై స్కూల్, హరిజనవాడ మీదుగా పెద్దమ్మ ఆలయానికి చేరుకుని అక్కడ అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో 50కి పైగా ఎడ్లబండ్లు పాల్గొన్నాయి. ప్రదర్శనను వీక్షించడానికి చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివా స్, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.జిల్లా కేంద్రంలో ఎడ్లబండ్ల ప్రదర్శనను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కేవీఆర్ -
కాడెద్దులు @ రూ.3వేలు
● కనుమరుగవుతున్న ఎడ్లబండ్లు ● ఉగాది ఎడ్లబండ్ల ప్రదర్శన కోసం అద్దెకు తీసుకుంటున్న భక్తులు నాగిరెడ్డిపేట: అన్నదాతకు తోడుగా ఉండే కాడెద్దులు కాలక్రమేణా కనుమరుగవుతున్నాయి. యాంత్రీకరణ అందుబాటులోకి రావడంతో రైతులు సైతం కాడెద్దులను వీడి ట్రాక్టర్ల బాటపట్టారు. ఫలితంగా కాడెద్దుల బండ్లు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఒకరిద్దరి వద్ద మాత్రమే ఎడ్లు, బండ్లు ఉంటున్నాయి. ఇదిలా ఉండగా గ్రామాల్లో జరిగే జాతరల్లో ఎడ్లబండ్ల ప్రదర్శనే ప్రధానం. ప్రస్తుతం ఎడ్లబండ్ల ఉనికి లేకపోవడంతో ఉత్సవాల కోసం వేల రూపాయలు వెచ్చించి ఇతర గ్రామాల నుంచి ఎడ్లబండ్లను అద్దెకు తీసుకొస్తున్నారు. మరికొందరు లక్షలు పెట్టి కొనుగోలు చేసి ఎడ్లబండ్ల ప్రదర్శన ముగిసిన తర్వాత వాటిని అమ్మేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట్లో ఉగాది వేడుకలను ఏటా వైభవంగా నిర్వహిస్తారు. నాగిరెడ్డిపేట, గోపాల్పేట, చీనూర్, వాడి, లింగంపల్లి, మాల్తుమ్మెద, గోలిలింగాల, వదల్పర్తి, బంజర తదితర గ్రామాలకు చెందిన భక్తులు గోపాల్పేటకు వచ్చి శ్రీ నల్లపోచమ్మ ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహిస్తారు. ఒక్కో జత ఎడ్లకు రూ.3వేలు నుంచి రూ.5వేలు చెల్లించి, ఒక్కో బండికి నాలుగైదు జతల ఎడ్లను కట్టి ప్రదర్శనలో తిప్పుతారు. ఇలా ఉత్సవాల్లో ఎడ్లబండిని తిప్పడానికి సుమారు రూ.50 వేల వరకు ఖర్చు చేస్తుండడం విశేషం.లింగంపల్లికలాన్ గ్రామానికి చెందిన కలాలి గోపాల్గౌడ్ గోపాల్పేటలో జరిగే ఉగాది ఉత్సవాలకు రూ.1.85 లక్షలు వెచ్చించి రెండు జతల ఎడ్లను కొనుగోలు చేశాడు. ప్రదర్శన అనంతరం ఎడ్లను తిరిగి అమ్మేస్తానని గోపాల్గౌడ్ తెలిపారు. -
ఎన్యుమరేటర్లకు పైసలెప్పుడిస్తరో?
● ఇంకా అందని సమగ్ర కుటుంబ సర్వే పారితోషికం ● నాలుగు నెలలు గడిచినా విడుదల కాని నిధులుబీబీపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎన్యుమరేటర్లకు ఇప్పటికీ పారితోషికాలు అందించలేదు. నెలలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబర్లో సమగ్ర సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 2,97,300 కుటుంబాలను 2,366 మంది ఎన్యుమరేటర్లు, 237 మంది సూపర్వైజర్లు సర్వే చేశారు. ఈ వివరాలను సుమారు 800 మంది డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఆన్లైన్లో నమోదు చేశారు. కాగా సర్వే నిర్వహించినందుకు ఎన్యుమరేటర్లకు రూ. 10 వేలు, సూపర్వైజర్లకు రూ.12 వేల చొప్పున పారితో షికం ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.30 చొప్పున చెల్లిస్తామని పేర్కొంది. కానీ సర్వే పూర్తై నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ ఒక్కపైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పారితోషికానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలని ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు కోరుతున్నారు.ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం సమగ్ర సర్వేలో పాల్గొన్న ఎన్యుమరేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సంబంధించిన పారితోషికం ఇంకా విడుదల కాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రభుత్వం నిధులివ్వ గానే అందిస్తాం. – పూర్ణచంద్రోదయకుమార్, ఎంపీడీవో, బీబీపేట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సర్వేకు సంబంధించిన డాటా ఎంట్రీ చేశాను. నాలు గు నెలలు దాటినా ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. ప్రభుత్వం ఇప్పటికై నా మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. – రాజు, డాటా ఎంట్రీ ఆపరేటర్, తుజాల్పూర్ -
అల్ప్రాజోలం సరఫరా ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం : కల్తీ కల్లులో వినియోగించే నిషేధిత మత్తు పదార్థం అల్ప్రాజోలంను సరఫరా చేస్తున్న ఓ ముఠా సభ్యులను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని మద్నూర్ గ్రామా నికి చెందిన ఉదాలత్వర్ సురేశ్గౌడ్ ఇంటిపై ఆది వారం పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీ ల్లో 110 గ్రాముల అల్ప్రాజోలం పట్టుబడింది. సురేశ్గౌడ్ను అదుపులోకి తీసుకుని విచారించగా నిషేధిత అల్ప్రాజోలంను హైదరాబాద్ శివారు ప్రాంతంలోని నాచారంలో ఉండే వ్యాపారి దినేష్కుమార్ మొహంతి వద్ద నుంచి కొనుగోలు చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు సురేశ్ను వెంట తీసు కుని నాచారంలోని దినేష్ కుమార్ వద్దకు వెళ్లి విచా రించారు. నాచారంలోని టెంపుల్ ఆర్గానిక్ ల్యాబ్ లో ఉండే కృష్ణ అనే వ్యక్తి వద్ద నుంచి వారు అల్ప్రా జోలం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కృష్ణ అ ల్ప్రాజోలంను ఇతర ముడి సరుకులతో కలిపి త యారు చేసి సురేశ్గౌడ్తోపాటు మద్నూర్కు చెంది న శ్రీనివాస్గౌడ్కు చాలాసార్లు విక్రయించినట్లు పో లీసుల విచారణలో వెల్లడైంది. కృష్ణ వద్ద 153 గ్రా ముల అల్ప్రాజోలం, 4 సెల్ఫోన్లు, 8 రకాల ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు సురేశ్గౌడ్, దినేష్ కుమార్ మొహంతి, కృష్ణలను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించామని ఎస్పీ తెలిపారు. శ్రీనివాస్గౌడ్ పరారీ లో ఉన్నాడని పేర్కొన్నారు. ముగ్గురు నిందితుల రిమాండ్.. పరారీలో మరొకరు.. వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
ఐక్యమత్యంతో ముందుకు సాగాలి
బాన్సువాడ రూరల్: ముదిరాజ్లు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని బోర్లం గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కాదిరెడ్డి రమేశ్ అన్నారు. ఉగాదిని పురస్కరించుకుని ఆదివారం గ్రామంలోని ముదిరాజ్ సంఘ భవనం వద్ద ముదిరాజ్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బొంబాయి హన్మాండ్లు, టేకుల రమేశ్, గంగాధర్, సింగరి సాయిలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ధర్మారెడ్డిలో.. నాగిరెడ్డిపేట: మండలంలోని ధర్మారెడ్డిలో ముదిరాజ్ కులస్తులు సంఘం జెండాను ఆవిష్కరించారు. ఉగాదిని పురస్కరించుకొని జెండాను ఎగురవేశారు. సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సెలవులే.. మృత్యు శరములై..
ఎల్లారెడ్డిరూరల్ : వెంకటాపూర్ అగ్రహారం గ్రామానికి చెందిన బొమ్మర్తి లింగయ్య అలియాస్ ఏసుకు గతంలో ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి గ్రామానికి చెందిన శ్యామలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు మైథిలి, అక్షర, కుమారుడు వినయ్ ఉన్నారు. శ్యామల అనారోగ్యంతో కొన్నేళ్ల క్రితం చనిపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన మరొకరిని వివాహం చేసుకున్నాడు. అయితే వారి మధ్య మనస్పర్థలు రావడంతో నెలరోజలకే విడిపోయారు. అనంతరం లింగయ్య లింగంపేట మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన మౌనికను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక కూతురు జన్మించింది. ఆమె ఆరునెలల వయసులో అనారోగ్యానికి గురై మృతిచెందింది. సవతి పిల్లలైన మైథిలి, అక్షర, వినయ్లను సొంత పిల్లలుగా చూసుకుంటూ కాలం గడుపుతోంది. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని పేర్కొన్నారు. సెలవులకు ఇంటికి రావడంతో.. వరుస సెలవుల నేపథ్యంతో ఇంటికి వచ్చిన పిల్లలు చెరువు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదం నీటమునిగి మృత్యువాత ఒకే కుటుంబంలోని నలుగురి మృతితో తీవ్ర విషాదంవరుస సెలవులు ఆ పిల్లల పాలిట మృత్యుశరాలయ్యాయి. సెలవుల సందర్భంగా ఇంటికి వచ్చిన ముగ్గురు పిల్లలు చెరువు వద్దకు వెళ్లి ఆడుకుంటూ నీట మునిగారు. వారిని కాపాడే క్రమంలో పినతల్లి సైతం మృత్యువాతపడింది. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ అగ్రహారంలో తీవ్ర విషాదాన్ని నింపింది.మెదక్లోని వెస్లీ పాఠశాలలో మైథిలి ఆరో తరగతి, అక్షర ఐదో తరగతి చదువుతున్నారు. వీరు అ క్కడే హాస్టల్లో ఉండేవారు. కుమారుడు వినయ్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడో తర గతి చదువుతున్నాడు. రెండు రోజులు సెలవులు రావడంతో ఈనెల 26న లింగయ్య ఇద్దరు కూతుళ్లను ఇంటికి తీసుకునివచ్చాడు. శనివారం మౌనిక బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తూ పిల్లలను వెంట తీసుకువెళ్లింది. మౌనిక బట్టలు ఉతుకుతుండగా ముగ్గురు పిల్లలు చెరువులో దిగి స్నానాలు చేశారు. ఈ క్రమంలో విషాదం చోటు చేసుకుంది. పిల్లలు గుంతలో మునిగిపోతుండడాన్ని గమనించిన మౌనిక వారిని కాపాడేందుకు చెరువులో దిగి ఆమె సైతం నీటమునిగి చనిపో యి ఉంటుందని భావిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు కూతుళ్లను సెలవులలో ఇంటికి తీసుకుని రాకపోయి ఉంటే వారు బతికే వారేమోనని గ్రామస్తులు, బంధువులు చర్చించుకున్నారు. -
వృద్ధురాలి మృతదేహం లభ్యం
రుద్రూర్: మండలంలోని లింగంపల్లి శివారులో ఓ వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. స్థానిక రైతులు ఆదివారం మధ్యాహ్నం మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతురాలు కోటగిరి మండలం ఎత్తోండా గ్రామానికి చెందిన దేగావత్ లక్ష్మీబాయి (62)గా గుర్తించారు. ఈనెల 26 నుంచి లక్ష్మీబాయి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు కోటగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మతిస్థిమితం లేకపోవడం, గత నాలుగు రోజులుగా ఆహారం లేనందున ఆరోగ్యం క్షిణించి మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు మృతురాలి భర్త లింబ్యా నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు. -
ఎడ్లబండ్ల ప్రదర్శనలో అపశృతి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేటలో ఆదివారం జరిగిన ఉగాది ఉత్సవాలలో అపశృతి చోటుచేసుకుంది. ఎడ్లబండ్ల ప్రదర్శన కొనసాగుతుండగా బండి నుంచి తాడును తెంపుకున్న ఎద్దు బెదిరిపోయి జనాలపైకి దూసుకెళ్లింది. కాగా ఉత్సవాలను తిలకించేందుకు మెదక్ జిల్లా తిమ్మాయిపల్లి నుంచి వచ్చిన కర్రోల నాగమణి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే గోపాల్పేటకు చెందిన రాజ్పేట మాధవి అనే మహిళ తలకు తీవ్రగాయమైంది. వీరితోపాటు మరికొంతమంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఘటనలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. రోగులకు పండ్ల పంపిణీ బాన్సువాడ: వారధి స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ సభ్యులు ఆదివారం ప్రభుత్వం ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, సభ్యులు మహేందర్, సుధాకర్, వేణుగోపాల్, గోపాల్సింగ్ ఠాకూర్, కృష్ణ, కోటయ్య, శ్రీనివాస్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు అద్భుత విజయాలు అందుకోవాలి
బాన్సువాడ: ప్రజలు అద్భుత విజయాలు అందుకోవాలని వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం ఉగాదిని పురస్కరించుకుని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పోచారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి శ్రీలక్ష్మీగోదా సమేత వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రావణం వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఆనందంగా ఉండాలని భగవంతుడిని వేడుకున్నట్లు చెప్పారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో రూ.50.50 లక్షల నిధులతో నూతనంగా నిర్మించే గ్రంథాలయ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యుడు పోచారం శంభూరెడ్డి తదితరులు ఉన్నారు. కాలభైరవుడి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం రామారెడ్డి: కాలభైరవుడి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్రావు అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలో కాలభైరవుడి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాను కాలభైరవ ఆలయ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి రూ. కోటి నిధులను మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ కమిటీని నియమిస్తామని అన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఆయన పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోపు బ్రిడ్జిని అందుబాటులోకి తెస్తామని అన్నారు. అనంతరం రామారెడ్డిలోని మసీదును సందర్శించారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మా గౌడ్, ప్రవీణ్ గౌడ్, తూర్పు రాజు, రవూఫ్, నామాల రవి, రంగు రవీందర్ గౌడ్, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది వేడుకల్లో ఎమ్మెల్యేలు పోచారం, మదన్మోహన్రావు ఆలయాల్లో ప్రత్యేక పూజలు