breaking news
Kamareddy
-
వామ్మో పులులు!
● రెడ్డిపేట అడవిలో గాండ్రించిన పులి ● రాజమ్మ తండా ప్రాంతంలో సంచరించిన చిరుత ● అటవీ ప్రాంత గ్రామాల్లో భయాందోళనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఓ వైపు పులి.. మరోవైపు చిరుతలు వణికిస్తున్నాయి. ఆవుపై పులి దాడి చేసిన సంఘటనతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై దాని జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే మరోవైపు చిరుత మరో ఆవుపై దాడి చేసి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో భయాందోళనలు నెలకొన్నాయి.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ అటవీ ప్రాంతంలో ఈనెల 10న పెద్దపులి ఆనవాళ్లు వెలుగు చూశాయి. 12న కామారెడ్డి జిల్లాలోని రెడ్డిపేట స్కూల్ తండా సమీపంలోగల అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసింది. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా అధికారులు పులి జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ఇరవై చోట్ల కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. దాని ఆచూకీ కోసం నాలుగు బృందాలు అన్వేషిస్తున్నా ఫలితం లేదు. పులి తిరిగిన ఆనవాళ్లు దొరికినప్పటికీ పులి ఎక్కడ ఉందన్న దానిపై స్పష్టత రావడం లేదు. మరోవైపు ఈనెల 13న నిజామాబాద్ నగరంలోని నాగారం సమీపంలో చిరుత కనిపించింది. గురువారం రాత్రి రామారెడ్డి మండలంలోని గోకుల్ తండా ప్రాంతంలో ఓ ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. ఇలా అటు పులి, ఇటు చిరుతల సంచారంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మేతకు తీసుకు వెళ్లాలంటేనే వణుకు.. పశువులు, మేకలను పోషిస్తూ జీవించేవారు వాటిని మేత కోసం అటవీ ప్రాంతాలకు తీసుకువెళుతుంటారు. అయితే పులి, చిరుతల సంచారంతో వారు భయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సంఘటనలు జరగడంతో ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని వణుకుతున్నారు. మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, సిరికొండ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో చాలా గ్రామాల ప్రజలు పశువులు, మేకలను అడవులకు తీసుకువెళ్లేవారంతా భయంతోనే వెళుతున్నారు. కొందరు ఇంతకుముందులా అడవి లోపలికి వెళ్లడం లేదని చెబుతున్నారు. అలాగే అడవిని ఆనుకుని ఉన్న పంట చేల వద్దకు వెళ్లడానికి కూడా రైతులు, కూలీలు భయపడాల్సిన పరిస్థితి ఉంది. పొలం పనులకు వెళ్లినవారు చీకటి పడకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. రాత్రి పూట పొలాలవైపే చూడడం లేదు. అటవీ అధికారులకు సవాల్.. అడుగుల ఆనవాళ్లతో పులి వచ్చిందని కచ్చితమైన నిర్ధారణకు వచ్చిన అటవీ అధికారులు.. దాని కదలికలను పసిగట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా దాని జాడ కోసం వెతుకుతున్నారు. పులి ఏదేని పరిస్థితుల్లో వేటగాళ్ల ఉచ్చుకు బలైతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే నాలుగు బృందాలు అడవిలో జల్లెడపడుతున్నాయి. పులి కదలికలను గుర్తించేందుకు కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రెడ్డిపేట అడవిలో పులి తిరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏలు సింగ్ మేరు, జిల్లా అటవీ అధికారి నిఖిత, కామారెడ్డి డీఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు.వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యతరామారెడ్డి: మండలంలోని స్కూల్తండాతోపాటు ఇందల్వాయి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వన్యప్రాణుల సంరక్షణ) ఏలుసింగ్ మేరు తెలిపారు. పులి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నా దాని జాడ కనిపించలేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్కూల్ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆవుపై పెద్దపులి దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో చాటింపు వేయించి పెద్దపులి సంచరిస్తున్న విషయాన్ని తెలియజేశామన్నారు. వారం రోజులుగా అటవీ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. అటవీ జంతువులకు హాని కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని డీఎఫ్వో నిఖిత హెచ్చరించారు. పులిపై విషప్రయోగం జరిపిన ఘటనలో ఇప్పటికే నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన విషయాన్ని తెలిపారు. క్రూరమృగాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తే తొందరగా వాటిని పట్టుకునేందుకు వీలవుతుందన్నారు. వారం రోజులుగా వెతుకుతున్నా పులి కనిపించడం లేదంటే అది వెళ్లిపోయినట్లు కాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.దూడను చంపింది చిరుతే.. రామారెడ్డి: గోకుల్ తండాలో గురువారం రాత్రి పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులు స్పందించారు. ఆవుపై దాడి చేసింది పెద్దపులి కాదని చిరుతపులి అని తేల్చారు. ట్రాక్ కెమెరాలో ఈ దాడి నిక్షిప్తమైందని పేర్కొన్నారు. అలాగే చిరుత దాడి చేసింది ఆవుపై కాదని, లేగ దూడపై అని తెలిపారు. శుక్రవారం లేగ దూడకు పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు.. వైకుంఠధామం పక్కనే దహనం చేశారు. పులి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి
కామారెడ్డి క్రైం : ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ప్రణాళికబద్ధంగా చదవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు శాతం మెరుగయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, హెచ్ఎం కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలి కామారెడ్డి క్రైం: అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న పైప్లైన్ పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, మెగా సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొత్త బస్టాండ్ ప్రాంతంలో డ్రెయినేజీ పూడికతీత పనులను పరిశీలించారు. వ్యర్థాలను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తదితరులున్నారు. -
‘నాగమడుగు పైపులైన్ పనులకు సహకరించాలి’
నిజాంసాగర్: మంజీర నదిపై నిర్మిస్తున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం పైపులైన్ పనులకు రైతులు సహకరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కోరారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నాగమడుగు ఎత్తిపోతల పైపులైన్లో భూములు కోల్పోతున్న రైతులతో సబ్ కలెక్టర్ సమావేశం అయ్యారు. నాగమడుగు పనులు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఫేజ్ వన్లో 9 కిలోమీటర్ల వరకు పైపులైన్లో భూములు కోల్పోతున్న ఒడ్డేపల్లి, జక్కాపూర్ గ్రామాలతో పాటు మల్లూర్ గ్రామ రైతులు సహకరించాలన్నారు. పైపులైన్ ఏర్పాటుకు రైతుల ఆధ్వర్యంలో రెవెన్యూ, నీటి పారుదల శాఖల అధికారులు సర్వే చేశారన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. సమావేశంలో తహసీల్దార్ భిక్షపతి, రైతు నాయకులు సుభాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘ప్రతి విద్యార్థి మొక్కను నాటి సంరక్షించాలి’ కామారెడ్డి అర్బన్ : ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని ప్రిన్సిపల్ చీ ఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వన్యప్రాణుల సంరక్షణ) ఎలుసింగ్ మేరు సూచించారు. శుక్రవారం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన వనమహోత్సవంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. వ న్యప్రాణులుంటేనే అడవుల రక్షణ ఉంటుందన్నారు. విద్యార్థులందరు మొక్కలు నాటాలని, అడవులను సంరక్షించడంగా ద్వారా ప ర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూ చించారు. కార్యక్రమంలో డీఎఫ్వో నిఖిత, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, కామారెడ్డి డి విజన్ అటవీ అధికారి రామకృష్ణ, రేంజ్ అధి కారి రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రా మస్తులు పాల్గొన్నారు. 23న జాబ్ మేళా కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్లోని 121 వ నంబర్ గదిలో ఈనెల 23న జాబ్మేళా నిర్వ హించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్లో పలు ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. 18 నుంచి 30 ఏళ్లలోపు వయసుండి, పదో తరగతి ఫెయిల్ అయినవారూ మేళా లో పాల్గొనవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కు 99856 78292, 76719 74009 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు. మొురాయించిన రైల్వే గేటు నిజామాబాద్ రూరల్: నగర శివారులోని మాధవనగర్ వద్ద రైల్వే గేటు మొరాయించడంతో అరగంటపాటు వాహనదారులు ఇబ్బందిపడ్డారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్ వైపు (అకోలా– కాచిగూడ) రైలు వస్తోంది. దీంతో గేట్మన్ గేటు వేస్తుండగా మధ్యలోనే ఆగిపోయింది. ఒకవైపు రైలు వస్తుండడం, మరోవైపు గేటు పూర్తిగా కిందికి దిగకపోవడంతో వాహనదారులను ఆపేందుకు గేట్మన్ ముప్పుతిప్పలు పడ్డాడు. చివరకు తాత్కాలిక గేటును వేశాడు. కొందరు వాహనదారులు గేట్లకు మధ్యలోనే నిలిచిపోయారు. గమనించిన లోకో పైలట్ రైలును నెమ్మదిగా నడిపాడు. వెంటనే రైల్వే సిబ్బంది గేటుకు మరమ్మతులు చేశారు. పెన్షన్ల హామీ మరిచిన కాంగ్రెస్ సర్కారునిజామాబాద్అర్బన్: అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఆస రా పెన్షన్ల పెంపు హామీని ప్రభుత్వం అమ లు చేయడం లేదని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించా రు. నగరంలోని లక్ష్మి కల్యాణ మండపంలో శుక్రవారం పెన్షన్దారుల, దివ్యాంగుల స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధులు, దివ్యాంగు ల పెన్షన్ను రెట్టింపు చేస్తామని ఇచ్చిన హా మీని నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని డిమాండ్ చేశారు. -
ఎస్సెస్సీలో ప్రథమ స్థానం సాధించాలి
కామారెడ్డి టౌన్ : ఈ విద్యా సంవత్సరంలో ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానం సాధించేలా విద్యాశాఖ అధికారులు, హెచ్ఎంలు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో విద్యాశాఖ మండల అధికారులు, కాంప్లెక్స్ హెచ్ఎంలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల హాజరు వంద శాతం నమోదయ్యేలా చూడాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం, రుచికరమైన మధ్యాహ్నం భోజనం అందించాలన్నారు. భవిత సెంటర్లలో, కేజీబీవీల్లో సివిల్ వర్క్స్ను వెంటనే పూర్తి చేయాలన్నారు. వయోజన విద్య ఓపెన్ స్కూల్, టాస్ అడ్మిషన్లను పెంచాలన్నారు. ఎక్కువ సంఖ్యలో పాఠశాలలను విజిట్ చేయని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఈవో రాజు, అధికారులు పాల్గొన్నారు. -
‘వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి’
విద్యార్థితో మాట్లాడుతున్న అబ్జర్వర్ ఒడ్డెన్న నిజాంసాగర్ : విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ కళాశాలలకు గుర్తింపు వస్తుందని ఇంటర్ బోర్డు అబ్జర్వర్ ఒడ్డెన్న పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సామగ్రి, లెక్చరర్ల వివరాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లను మరింత పెంచాలన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు చేర్చుకోవాలని సూచించారు. అధ్యాపకుల్లో మార్పు వస్తేనే విద్యార్థుల్లో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్ సౌకర్యం లేకపోవడంతోపాటు వసతి గృహ సదుపాయం లేనందన విద్యార్థులు కళాశాలలో చేరడానికి వెనకడుగు వేస్తున్నారని లెక్చరర్లు తెలిపారు. ఆయా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఒడ్డెన్న పేర్కొన్నారు. జూనియర్ కళాశాలకు సొంత భవనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఆయన వెంట ఇన్చార్జి ప్రిన్సిపాల్ అహ్మద్ ఫారుఖ్ తదితరులున్నారు. హాజరు శాతాన్ని పెంచండి పిట్లం: మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఒడ్డెన్న అధ్యాపకులకు సూచించారు. శుక్రవారం ఆయన పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, అధ్యాపకులతో సమావేశమయ్యారు. మండలంలో మొత్తం 569 మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారని, ఇందులో 119 మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారని పేర్కొన్నారు. ఎందుకు విద్యార్థుల జాయినింగ్ శాతాన్ని పెంచలేదని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రతినెల రూ. 12 వేల చొప్పున నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. -
ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖ లు తమకు కావాల్సిన ఇసుక కోసం తెలంగాణ ఖనిజాభివృద్ధి శాఖకు చెందిన ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్ర భుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి ఇసుక అవసరంపై సంబంధిత అధికారులతో సమావే శం నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఇసుక అవసరముంది, జిల్లాలో ఎంత ఇ సుక అందుబాటులో ఉంది అన్న వివరాలు తె లుసుకున్నారు. ఇసుక కోసం పోర్టల్లో నమో దు చేసుకున్న వెంటనే ఆలస్యం చేయకుండా రవాణాకు అనుమతి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి క్టర్, గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నగేశ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ అశిష్ సంగ్వాన్ -
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
మాచారెడ్డి : ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా జడ్జి నాగరాణి సూచించారు. పాల్వంచ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో ఆమె మాట్లాడారు. బాలలు, మహిళల హక్కుల గురించి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హిమబిందు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత, ఎంఈవో రాంమనోహర్రావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్రెడ్డి, లీగల్ అడ్వైజర్ సురేశ్ పాల్గొన్నారు. కోడ్ హోప్ గ్లోబల్ సంస్థ సేవలు ప్రశంసనీయం బాన్సువాడ రూరల్: కోడ్ హోప్ గ్లోబల్ సంస్థ సేవలు ప్రశంసనీయమని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం ఆమె బాన్సువాడ జెడ్పీహెచ్ఎస్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అమెరికాలో విద్యాభ్యాసంతో పాటు పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థినులు ఆలా లిఖిత, అన్యా బులుసు, బొల్లినేని పల్లవి, మీనాక్షి అరసదలు పేద విద్యార్థులకు స్వచ్ఛంద సంస్థ ద్వారా సహాయం అందించడం అభినందనీయమన్నారు. సంస్థ ద్వారా 40 కంప్యూటర్లు, బాన్సువాడ, పాల్వంచ, సదాశివనగర్ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు 2 వేల సానిటరీ నాప్కిన్స్, 15 పాఠశాలలకు ఇన్సినరేటర్లు(భస్మీకరణ పరికరం), మరో 8 పాఠశాలలకు సైన్స్ల్యాబ్ పరికరాలను విద్యార్థులకు అందజేశారు. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు, డీఈవో రాజు, ఎంఈవో నాగేశ్వరరావు, చందర్, తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన పత్రిక అందజేత ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలో ఆదివారం నిర్వహించనున్న బోనాల పండుగకు రావాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు బుధవారం ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ఆహ్వా న పత్రికను అందించారు.మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, నేతలు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సాయిలు, సంతోష్ తదితరులున్నారు. బన్సల్తో మాజీ ఎంపీ భేటీ బాన్సువాడ రూరల్: బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ను బుధవారం జహీరాబాద్ పార్లమెంట్ మాజీ సభ్యులు బీబీపాటిల్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. ఆయన వెంట బాన్సువాడ నియోజకవర్గం ఇన్చార్జి శ్రీనివాస్ గార్గే తదితరులు ఉన్నారు. -
బెటాలియన్ను సందర్శించిన గవర్నర్
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): తెలంగాణ యూ నివర్సిటీ రెండో స్నాతకోత్సవంలో పాల్గొనేందు కు బుధవారం జిల్లాకు వచ్చిన వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా డిచ్పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్ను సందర్శించారు. గవర్నర్కు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, వీసీ యాదగిరి రావు, బెటాలియ న్ కమాండెంట్ పీ సత్యనారాయణ, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, విద్యార్థినులు పు ష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ బెటాలియన్ ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. కాసేపు విశ్రాంతి అనంతరం గవర్నర్ యూనివర్సిటీకి బయలుదేరి వెళ్లారు. కా న్వొకేషన్ ముగిసిన తర్వాత గవర్నర్ తిరిగి బెటాలియన్కు చేరుకొని భోజనం చేసి కొద్దిసేపు వి శ్రాంతి తీసుకున్నారు. అనంతరం నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అసిస్టెంట్ కమాండెంట్లు శరత్కుమార్, కేపీ సత్యనారాయణ, ఆర్ఐలు, ఆర్ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాలు
సాక్షి నెట్వర్క్:తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా బుధవారం గాంధారికి చెందిన పెద్దబూరి సత్యం, కామారెడ్డి మండలం క్యాసంపల్లితండాకు చెందిన వి.రూప్సింగ్, కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సమన్వయకర్త ఎన్.బాలు, ఎల్లారెడ్డికి చెందిన సిద్ధ లక్ష్మికి డాక్టరేట్ పట్టాలు, తాడ్వాయికి చెందిన కొత్తపలి నవీన్ గోల్డ్మెడల్ అందుకున్నారు. బుధవారం డిచ్పల్లిలోని తెలంగాణ యూ నివర్సిటీలో నిర్వహించిన రెండో స్నాతకోత్సవంలో వీటిని అందుకున్నారు. బంజరా సాహిత్యం– జీవన చిత్రం అంశంపై పరిశోధన చేసినందుకు రూప్సింగ్కు, ఎకనామిక్స్లో ప్రతిభ చూపినందుకు బాలుకు, బీడీ వర్కర్ల జీవన శైలిపై పీహెచ్డీ చేసినందుకు సిద్ధ లక్ష్మికి డాక్టరేట్లు అందజేశారు. -
ప్రముఖులతో గవర్నర్ ఇష్టాగోష్టి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం నిజామాబాద్ సమీకృత కలెక్టరేట్లో జిల్లాకు చెందిన ప్రఖ్యాత కవులు, కళాకారులు, రచయితలు, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన క్రీడాకారులు, సామాజిక కార్యకర్తలు, ఆదర్శ రైతులు, ఇతర ప్రముఖులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ స్నాతకోత్సవం అనంతరం కలెక్టరేట్కు వచ్చిన గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యేలు పొద్దుటూరి సుదర్శన్రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ గవర్నర్కు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను గవర్నర్ తిలకించారు. కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి ఫొటో ఎగ్జిబిషన్ ఆధారంగా ఆయా శాఖల కార్యక్రమాల వివరాలను తెలిపారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకు చెందిన ప్రముఖులతో ముచ్చటించారు. ఆయా రంగాల్లో సేవలందిస్తున్న వారి గురించి గవర్నర్ పేరుపేరున వివరాలు తెలుసుకొని అభినందించారు. అనంతరం గవర్నర్ ఆయా రంగాల వారితోపాటు జిల్లా అధికారులతో కలిసి ఫొటో సెషన్లో పాల్గొన్నారు. గవర్నర్తో ఇష్టాగోష్టిలో పాల్గొన్నది వీరే.. పిన్న వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ, అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్, బల్లాష్టు మల్లేశ్ (థియేటర్ ఆర్టిస్ట్), కందకుర్తి యాదవరావు (చరిత్రకారులు), చిన్ని కృష్ణుడు (ఆదర్శ రైతు), అమృతలత (ప్రముఖ రచయిత), నాళేశ్వరం శంకరం (కవి), వీపీ. చందన్ రావు (కవి, రచయిత), అష్ట గంగాధర్ (జానపద కళాకారులు), పాయల్ కోట్గిర్కర్ (ప్రముఖ తబలా వాయిద్యకారులు), పంచరెడ్డి లక్ష్మణ్ (ప్రముఖ కవి), గణపతి అశోక శర్మ (అష్టావధాని), తల్లావజ్జల మహేశ్బాబు (ప్రముఖ కవి), కాసర్ల నరేశ్ రావు ( కవి, రచయిత), ఘనపురం దేవేందర్ (కవి, వ్యాఖ్యాత), డాక్టర్ డి.శారద (ప్రముఖ విద్యావేత్త, రచయిత), గంట్యాల ప్రసాద్ (సాహితీవేత్త), తిరుమల శ్రీనివాస్ ఆర్య (ప్రముఖ కవి), కత్తి గంగాధర్ (సాంస్కృతిక విభాగం విలేకరి), బోచ్కర్ ఓంప్రకాశ్ (కవి, అష్టావధాని), ఆరుట్ల శ్రీదేవి (సాహితీ పరిశోధకులు), శ్రీమన్నారాయణ చారి (కవి, ప్రముఖ వ్యాఖ్యాత), కళా లలిత (ప్రముఖ యాంకర్), బి.కళా గోపాల్ (కవి, రచయిత), మద్దుకూరి సాయిబాబు (సామాజిక సేవా కార్యకర్త, రచయిత), చింతల గంగాదాస్ (కవి, వ్యాఖ్యాత), చింతల శ్రీనివాస్ గుప్తా (ప్రముఖ కవి), డాక్టర్ అన్నందాస్ జ్యోతి (విద్యావేత్త, రచయిత), కై రకొండ బాబు (ప్రముఖ చిత్రకారులు), సిర్ప లింగం (ప్రముఖ కళాకారులు), చిందు బాబయ్య (కళాకారులు), మహమ్మద్ రషీద్ (రేలా రే రేలా ఫేం కళాకారుడు), సాయి లవోలా (జానపద కళాకారులు), జయలక్ష్మి (నాట్య గురువు), గంగాదేవి (జానపద గాయని), పసునూరి వినయ్ కుమార్ (కొరియోగ్రఫర్), టీ స్వప్నరాణి (మ్యూజిక్ అధ్యాపకురాలు), కే సంతోష్ కుమార్ (వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్), అష్ఫాక్ ఆస్పీ (ఉర్దూ కవి, వ్యాఖ్యాత), దారం గంగాధర్ (రచయిత) తదితరులున్నారు. కలెక్టరేట్లో ఫొటో ఎగ్జిబిషన్ తిలకించిన జిష్ణుదేవ్ వర్మ -
క్రైం కార్నర్
రైలు కింద పడి యువకుడి మృతి బోధన్: ఎడపల్లి– జాన్కంపేట రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం గుర్తు తెలియని రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు (25) మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వేస్టేషన్ మేనేజర్ సాయి కిశోర్ తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై సాయిరెడ్డి నంబర్ 87126 58591కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చేపల వేటకు వెళ్లి వ్యక్తి ..బాన్సువాడ రూరల్: తాడ్కోల్ గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లిన దేవాల్ల సాయిలు అనే వ్యక్తి నీట మునిగి మృతి చెందాడు. బాన్సువాడ పట్టణంలోని దాల్మల్గుట్టలో నివాస ముండే దేవాల్ల సాయిలు మేసీ్త్ర పనిచేస్తూ.. పని లేనప్పుడు చేపట వేటకు వెళ్లేవాడు. ఈనెల 15న చేపల వేటకు వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈతరాక మృతిచెందాడు. మృతుని అక్క బషవ్వ ఫిర్యాదు మేరకు బుధవారం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. చికిత్స పొందుతూ వృద్ధురాలు.. రెంజల్(బోధన్): మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన కమ్మరి శాంతమ్మ(76) చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నిజామాబాద్ నుంచి బోర్గాం గ్రామానికి శాంతమ్మ బస్సులో వచ్చింది. బస్సు దిగుతుండగా చీర కొంగు తట్టుకొని బస్సు వెనుక టైరు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు శాంతమ్మను నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
‘ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక’
కామారెడ్డి క్రైం: పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకుంటే ఇందిరమ్మ లబ్ధిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి బుధవారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవో లతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఇసుక రవాణా గురించి ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఇసుక ఉచితంగా ఇస్తామని, రవాణా ఖర్చులు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లభ్యత ఉన్నచోటు నుంచి ఇసుకను పొందవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు మొరం అవసరమైన వారు పంచాయతీ కార్యదర్శి సిఫారసుతో ట్రాక్టరుకు రూ.300, టిప్పర్కు రూ.1,200 చొప్పున డీడీ రూపంలో చెల్లించి మొరం అనుమతులు పొందాలన్నారు. కిష్టాపూర్, హస్గుల్, కుర్ల, ఖద్గావ్, శెట్లూర్ ఇసుక క్వారీ లకు పర్యావరణ అనుమతుల చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణాను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆర్డీవోలు, మైనింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ విక్టర్, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి.రమా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన సేవలు అందించాలని, సరిపడా మందులను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రాలలో వైద్యులను 24 గంటల పాటు అందుబాటులో ఉంచాలన్నారు. రోగ నిర్థారణ చేసే పరీక్షలు చేయించాలని, ల్యాబ్ టెక్నిషియన్ల ఖాళీలను భర్తి చేయాలని కోరారు. నేతలు సత్తెమ్మ, పద్మ, అనిత, పుష్పలత, యాదమ్మ, లక్ష్మి, రూప పాల్గొన్నారు. -
యువకుడి దారుణ హత్య
● ఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ విఠల్రెడ్డి బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుందలోని ఊరడమ్మ గల్లీకి చెందిన అడికె రమేశ్(35)కు పదేళ్ల క్రితం మహాదేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. గత సంవత్సరం నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో మహాదేవి పుట్టింటికి వెళ్లింది. దీంతో అప్పటి నుంచి రమేశ్ మారేడు గుడి వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ జీవిస్తున్నాడు. కాగా, పెద్ద దేవాడకు చెందిన సమీప బంధువు కాశీనాథ్ బుధవారం ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చి రమేశ్ ఇంటి తలుపు కొట్టాడు. రమేశ్ తలుపు తీయడంతో వెంటనే కాశీనాథ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో రమేశ్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐ రవికుమార్, ఎస్సై మోహన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాశీనాథ్ భార్యతో వివాహేతర సంబంధం ఉందనే కారణంతోనే తన కొడుకును హత్య చేసినట్లు రమేశ్ తల్లి గంగామణి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు. -
సమస్యలకు పరిష్కారం దొరికేనా?
కామారెడ్డి టౌన్: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం సమావేశం నిర్వహించనున్నారు. జీజీహెచ్ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఐదేళ్లలో ఆరుసార్లే.. అస్పత్రి అభివృద్ధి, సమస్యలపై చర్చించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి హెచ్డీఎస్ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదేళ్లలో ఆరుసార్లు మాత్రమే సమావేశం నిర్వహించారు. ఏరియా ఆస్పత్రిని జీజీహెచ్గా మార్చి మూడేళ్లవుతోంది. జీజీహెచ్గా మారాక తొలిసారి సమావేశం నిర్వహిస్తుండడం గమనార్హం. కలెక్టర్ అధ్యక్షతన.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి సంబంధించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ(హెచ్డీఎస్) సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నారు. అస్పత్రిలోని మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు మీటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లు తెలిపారు. హెచ్డీఎస్ చైర్మన్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించే సమావేశానికి సభ్యులైన ఎంపీ, జిల్లాలోని ఎమ్మెల్యేలను ఆహ్వానించామని పేర్కొన్నారు.కామారెడ్డి జీజీహెచ్ భవనంఆస్పత్రి నిండా సమస్యలే..నిధులు పక్కదారి..ఆస్పత్రికి సంబంధించి ఆరోగ్యశ్రీ నిధులు రూ. 70 లక్షలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలున్నాయి. ఆరోగ్య బీమా పథకం(ఆబా) నిధులు రూ. 20 లక్షలు, ఏఆర్టీ నిధులు రూ. 10 లక్షలు, డయాలసిస్ నిధులు రూ. 10 లక్షలను హెచ్డీఎస్ అనుమతి లేకుండానే వినియోగించారు. ఇందులో భారీగా అవకతవకలు జరిగాయని తెలుస్తోంది. గతంలో ఇన్చార్జి సూపరింటెండెంట్గా పనిచేసిన అధికారితోపాటు ఆరోగ్యశ్రీ ఇన్చార్జి వైద్యుడు, ఓ సీనియర్ డాటా ఆపరేటర్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ సిబ్బంది జీతాలు చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ నిధులు వినియోగం అక్రమాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో గత ఇన్చార్జి సూపరింటెండెంట్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సంజాయిషీ నోటీసు అందజేసినట్లు తెలిసింది. తాజాగా రెగ్యులర్ సూపరింటెండెంట్గా విధుల్లో చేరిన అధికారి సైతం ఆ నిధుల వివరాలు, వినియోగం చిట్టా చూసి అవాక్కయినట్లు సమాచారం. ఈ అంశంపై సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.కమిటీ ఇలా.. నేడు జీజీహెచ్ అభివృద్ధి కమిటీ సమావేశం ఆస్పత్రి చరిత్రలో తొలిసారి నిర్వహణకు ఏర్పాట్లు పాల్గొననున్న ఎమ్మెల్యేలు నిధుల పక్కదారిపై చర్చించే అవకాశంజీజీహెచ్ హెచ్డీఎస్ చైర్మన్గా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, వైస్ చైర్మన్గా ఆస్పత్రి సూపరింటెండెంట్ పెరుగు వెంకటేశ్వర్లు, సభ్యులుగా ఎంపీ సురేశ్ షెట్కార్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు ఉన్నారు. సభ్యులుగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, సామాజిక కార్యకర్తలు ఉండాలి. వారి పేర్లను ఇంకా కమిటీలో చేర్చలేదు. జిల్లా కేంద్రంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో వంద పడకల ఏరియా ఆస్పత్రిగా ఉన్న భవనాన్ని డీఎంఈ పరిధిలోకి తీసుకుని 330 పడకలతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి(జీజీహెచ్)గా మార్చారు. ఇందులో 32 విభాగాలున్నాయి. అయితే భవనం ఇరుకుగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పార్కింగ్కు సరిపడా స్థలం లేదు. తీవ్రమైన నీటి సమస్య ఉంది. అస్పత్రి మార్చురి రోడ్డు అధ్వానంగా ఉంది. భవనం పాతది కావడంలో వర్షం పడితే నీరు ఊరుస్తోంది. అక్కడక్కడ పీవోపీ ఊడి పడుతోంది. ఓపీ విభాగాల గదులు ఇరుకుగా మారాయి. పాత భవనం పక్కన రేకుల షెడ్డులో చీకటిలో రక్తపరీక్షల నమూనాలను సేకరిస్తున్నారు. గర్భిణులకు వైద్య సేవలను పాత ఆయుష్ భవనం గదుల్లో అందిస్తున్నారు. సరిపడా స్థలం లేకపోవడతో ఆరుబయట గర్భిణులు, మహిళలు నిల్చోవాల్సి వస్తోంది. ఆస్పత్రిలో ఎలక్ట్రికల్ వైరింగ్ వ్యవస్థ సరిగా లేక సామగ్రి చెడిపోతోంది. ప్లంబింగ్ సమస్యలూ ఉన్నాయి. మెటర్నిటీ వార్డులో పైకప్పునుంచి పీవోపీ పడిపోవడంతో ఆ గదిలో పాత సామగ్రిని ఉంచారు. జనరల్ వార్డులో మెటర్నిటీ సేవలు అందిస్తున్నారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన భవన లిఫ్ట్ నెల రోజుల నుంచి పని చేయడం లేదు. -
అక్కడ అంతా ఓపెన్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రవాణా శాఖ(ఆర్టీఏ) కార్యాలయాలతో పాటు చెక్పోస్టులు, చెక్ పాయింట్ల వద్ద వసూళ్ల దందా ఓపెన్గా నడుస్తోంది. ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా చూశారు. ఇటీవల 161 వ నంబరు జాతీయ రహదారిపై సలాబత్పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో ట్రాన్స్పోర్టు వాహనాల డ్రైవర్లు వచ్చి గల్లాపెట్టె(బాక్సు)లో డబ్బులు వేసి వెళుతుండడాన్ని గమనించారు. తాజాగా బుధవారం ఉదయం 44 వ నంబరు జాతీయ రహదారిపై పొందుర్తి వద్ద ఉన్న రవాణాశాఖ చెక్పాయింట్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో అక్కడ ప్రైవేటు వ్యక్తులు దర్జాగా డబ్బులు వసూలు చేస్తుండడాన్ని గుర్తించారు. మొన్న సలాబత్పూర్.. నేడు పొందుర్తి.. రవాణా శాఖ చెక్పోస్టులు, కార్యాలయాల్లో ఏళ్లుగా వసూళ్ల దందా నడుస్తుండగా.. అప్పుడప్పుడు ఏసీబీ దాడులు చేయడం, తరువాత యథావిధిగా దందా నడవడం పరిపాటైంది. గతనెల 26న సలాబత్పూర్ చెక్పోస్టుపై దాడి చేసిన సమయంలో లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చెక్పోస్టు దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళుతుండడాన్ని గమనించారు. ఆ రోజు లభించిన లెక్కకు రాని డబ్బులు రూ. 91 వేలను సీజ్ చేశారు. తాజాగా పొందుర్తి చెక్పాయింట్ వద్ద లెక్కచూపని రూ. 80 వేలను స్వాధీనం చేసుకున్నారు. ఎంతో రద్దీగా ఉండే 44 వ నంబరు జాతీయ రహదారిపైనున్న ఈ చెక్పాయింట్నుంచి నిత్యం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. వాహనాలను ఆపకుండా, ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఉండాలంటే ఈ చెక్ పాయింట్లో మామూళ్లు ఇచ్చుకోవాల్సిందే. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని లారీలు, ట్రక్కులు లాంటి రవాణా వాహనాల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ తనిఖీల్లో వెల్లడైంది. అంతా ‘మామూలే’.. రవాణాశాఖ కార్యాలయాలు, చెక్పోస్టులు, చెక్పాయింట్లపై ఇటీవల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా వసూళ్లు మాత్రం ఆగడం లేదు. సలాబత్పూర్ చెక్పోస్టు వద్ద ఏసీబీ దాడి జరిగిన మరుసటి రోజు నుంచే వసూళ్లు యథావిధిగా కొనసాగాయి. పొందుర్తి చెక్పాయింట్ వద్ద కూడా ఇది ‘మామూలు’గా మారింది. అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ వసూళ్లకు అడ్డుకట్ట పడే అవకాశాలున్నాయన్న అభిప్రాయం ప్రజలనుంచి వ్యక్తమవుతోంది. బహిరంగంగా వసూళ్లు.. ఆర్టీఏ చెక్పోస్టుల్లో ప్రైవేటు సైన్యం ఏసీబీ అధికారుల కళ్ల ముందే వసూళ్ల దందా దాడులు జరుగుతున్నా ఆగని అవినీతిరవాణా శాఖ కార్యాలయాలతో పాటు చెక్పోస్టులు, చెక్ పాయింట్ల వద్ద బహిరంగంగా వసూళ్లు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ, వాహనాల రిజిస్ట్రేషన్లు.. ఇంకా వాహనాలకు సంబంధించిన ప్రతి పనికో రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వారు కార్యాలయానికి వెళితే ఏదో ఒక సాకు చెప్పి పనులు చేయడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ఏజెంట్ల వ్యవస్థ లేదని అధికారులు చెబుతున్నా, అక్కడ ఏజెంట్ల రాజ్యమే కొనసాగుతోంది. సాయంత్రానికి లెక్కగట్టి ఏజెంట్లు అధికారులకు డబ్బులు అప్పజెబుతున్నారు. చెక్పోస్టులు, చెక్పాయింట్ల వద్ద సరుకు రవాణా వాహనాల డ్రైవర్లు డబ్బులు ఇవ్వడం బహిరంగంగానే జరుగుతోంది. అయితే రవాణా శాఖ అధికారులు, సిబ్బంది నేరుగా డబ్బులు తీసుకోకుండా ప్రైవేటు వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తున్నారు. -
ఆందోళన చెందొద్దు.. అవకాశాలను అందిపుచ్చుకోవాలి
కాన్వొకేషన్కు ముఖ్యఅతిథిగా హాజరైన భారత రసాయన శాస్త్ర సాంకేతిక సంస్థ (ఐఐసీటీ) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. యనివర్సిటీ నుంచి బయటకు వెళ్లిన ప్రతి విద్యార్థికి ఆందోళనతో పాటు అవకాశాలు కలిగిన ఎన్నో దారులు కనిపిస్తాయన్నారు. ఆందోళన చెందకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. వారి వారి శక్తి సామర్థ్యాలు, అభిరుచి మేరకు కొందరు పరిశోధకులుగా మరికొందరు పారిశ్రామికవేత్తలుగా, వ్యవస్థాపకులుగా, ప్రజాసేవకులుగా, విద్యావేత్తలుగా ఉన్నతంగా స్థిరపడుతున్నారన్నారు. విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది జీవితమనేది పందెం లాంటిది కాదని ఇది ఒక ప్రయాణం మాత్రమేనని వివరించారు. ప్రయాణానికి సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్ ఆధారపడుతుందన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. -
తెయూ విజయాలు ఆదర్శం
– 8లో uగురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025– 9లో uతెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కాన్వొకేషన్) బుధవారం అట్టహాసంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభాగాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. డిచ్పల్లి మెయి న్ క్యాంపస్తోపాటు కామారెడ్డి జిల్లా భిక్కనూరు సౌత్ క్యాంపస్, సారంగపూర్ ఎడ్యుకేషన్ క్యాంపస్లలో విద్యా వికాసం చెందడం ఆనందంగా ఉందన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు యూనివర్సిటీ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయన్నారు. యూనివర్సిటీ సాధించిన విజయాలు, ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. గత 19 ఏళ్లలో వర్సిటీ అధికారులు అధ్యా పకులు, విద్యార్థులు, పరిశోధకుల ఉమ్మడి కృషి, అంకితభావం అభివృద్ధిలో ప్రతిబింబిస్తోందన్నారు. 2023 – 24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారని గవర్నర్ వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆశాజనకమైన పారిశ్రామిక, విద్యాపరమైన సంబంధాలతో ముందుకు పోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య యొక్క అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవున్ని తయారు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడమని పేర్కొన్నారు. కాన్వొకేషన్కు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముందుగా బెటాలియన్ పోలీసు లు గౌరవ వందనం సమర్పించారు. కాన్వొకేషన్కు రాజ్యసభ సభ్యుడు సురేశ్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎ మ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో తెయూ రిజిస్ట్రార్ ఎం.యాదగిరి, డీన్స్ ఘంటా చంద్రశేఖర్, కే.అపర్ణ, జి.రాంబాబు, కే.లావణ్య, ఎం.శ్రీనివాస్, కే.సంపత్కుమార్, ప్రిన్సిపాల్ ప్రవీ ణ్ మామిడాల, ప్రొఫెసర్లు ఆరతి, కనకయ్య, వి ద్యావర్ధిని, అరుణ, ఆంజనేయులు, నాగరాజు, పీ ఆర్వో పున్నయ్య, ఏపీఆర్వో అబ్దుల్ ఖవి, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు. బంగారు పతకాలు.. డాక్టరేట్ పట్టాలు 2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్ చంద్రశేఖర్ చేతుల మీ దుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. అలాగే 2017 నుంచి 2025 జూన్ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్డీ (డాక్టరేట్) పట్టాలను అందజేశారు. క్షుణ్ణంగా తనిఖీలు తెయూ క్రీడామైదానం లో ఏర్పాటు చేసిన కాన్వొకేషన్ ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సాయిచైతన్య ఆధ్వర్యంలో స్నిఫర్ డాగ్ బృందం, బాంబు డిస్పోజబుల్ టీం, ఇంటిలిజెన్స్ అధికారులు బందోబస్తు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి నిర్వహించిన లోనికి అనుమతించారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి తెయూ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు మాట్లాడుతూ.. వర్సిటీలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతనంగా పరిపాలనా భవనం, 500 మంది విద్యార్థినులకు సరిపడా అన్ని రకాల వసతులు ఉండే బాలికల వసతి గృహం, వేయి మంది సామర్ధ్యం కలిగిన ఆడిటోరియం, క్రీడామైదానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెయూ పరిధిని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు విస్తరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి, జిల్లా ప్రజాప్రతినిధులతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది సమష్టి కృషిపైనే ఆధారపడుతుందని అన్నారు. న్యూస్రీల్ రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు వర్సిటీ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయి రెండో స్నాతకోత్సవంలో వర్సిటీ చాన్స్లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరైన ఐఐసీటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ 113 మందికి గోల్డ్ మెడల్స్.. 157 మందికి డాక్టరేట్లు అందజేత -
ప్రాదేశిక స్థానాల లెక్క తేలింది
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో మండల, జిల్లా పరిషత్ స్థానాల లెక్క తేలింది. 25 మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీలు ఉంటారు. అలాగే 233 మండల ప్రాదేశిక స్థానాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీటి ఆధారంగా ఎన్నికలకు వెళ్లనున్నారు.బాలికల పాఠశాలను దత్తత తీసుకున్న స్వచ్ఛంద సంస్థ పిట్లం: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలిక ల పాఠశాలను బుధవారం హైదరాబాద్కు చెందిన సేవ్ ద గర్ల్ చైల్డ్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు సందర్శించారు. పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ శివకుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తోంది. ఆయన స్వస్థలం పిట్లం. సంస్థ ప్రతినిధులు పాఠశాల సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడి సమస్యల ను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల భవనానికి రంగులు వేయడంతోపాటు విద్యార్థుకలు అవసరమైన వస్తువులను అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు స్రవంతి, శర ణ్య, గీతానంద్, స్వప్న రాగి, రమేశ్ బాబు, హరిప్రకాశ్, ప్రదీప్రెడ్డి, నాగేంద్ర, వంశీకృష్ణ, రాజేంద్ర పల్నాటి, ఎంఈవో దేవ్సింగ్, పాఠశాల హెచ్ఎం రమణారావు పాల్గొన్నారు. ‘ఆర్థిక స్వావలంబన సాధించాలి’ బాన్సువాడ రూరల్: ప్రభుత్వం, బ్యాంకులు అందిస్తున్న సహకారంతో మహిళలు వృత్తి, వ్యాపారాల్లో రాణించి ఆర్థిక స్వావలంబన సాధించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి సూచించారు. బుధవారం బాన్సువాడలోని ఎస్ఎంబీ ఫంక్షన్ హాల్లో ఇందిర మహిళాశక్తి సంబురాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని 3,719 డ్వాక్రా సంఘాలకు సంబంధించిన 2024–25 వడ్డీరాయితీ డబ్బులు రూ.3.76 కోట్ల చెక్కును ఆయా సంఘాలకు అందించారు. మరణించిన ఆరుగురు మహిళా సంఘాల సభ్యుల కుటుంబాలకు మంజూరైన రూ. 60 లక్షల బీమా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ గురుకుల పాఠశాలలకు కిరాణ సరుకులు సరఫరా చేయడానికి డ్వాక్రా సంఘాలు ముందుకు వస్తే అధికారులతో మాట్లాడి ప్రోత్సహిస్తానన్నారు. కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్ బాల్రాజ్, సబ్కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీవో సురేందర్, బీర్కూర్ ఏఎంసీ చైర్పర్సన్ దుర్గం శ్యామల తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి టౌన్: జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల పరిధిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తున్నట్లు డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ిఎల్లారెడ్డి సీహెచ్సీలో సివిల్ అసిస్టెంట్ సర్జన్(గైనిక్) పోస్టులు రెండు, అనస్థీషియా ఒకటి, బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో పీడియాట్రి షియన్ ఒకటి, జనరల్ జీడీఎంవో రెండు, మద్నూర్ సీహెచ్సీలో జనరల్ సర్జన్ ఒకటి, జనరల్ జీడీఎంవో ఒక పోస్టు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. అర్హులైన వైద్యులు ఈనెల 21వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 23న ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు. ‘సర్కారు బడులను బతికించుకోవాలి’ మాచారెడ్డి : సర్కారు బడులను బతికించుకో వాలని డీఈవో రాజు కోరారు. బుధవారం నెమిలిగుట్ట తండాలో నూతనంగా ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరానికిగాను మాచారెడ్డి మండలంలో పాఠశాలల్లో 6 వందలకుపైగా విద్యార్థులు చేరారన్నారు. మండలానికి చెందిన 28 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కావడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో ఎంఈవో దేవేందర్రావ్, ఏఎంవో వేణు శర్మ, హెచ్ఎంలు వెంకటాచారి, భాస్కరశర్మ, ఉపాధ్యాయుడు మాణిక్యం, సీఆర్పీలు సంజీవ్, నరేశ్, శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు నౌసీలాల్, నర్సింలు, రవినాయక్ పాల్గొన్నారు. -
అధికారులెవరూ స్థానికంగా ఉండరు..
జుక్కల్ నియోజకవర్గంలో పోలీసులు తప్ప మరే శాఖల అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉండడం లేదని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. అధికారులు కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల నుంచి వచ్చిపోతున్నారన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. పంచాయతీ కార్యదర్శులు ఏళ్ల తరబడిగా ఒకేచోట ఉన్నా వారిని బదిలీ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఆస్పత్రుల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని, మద్నూర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ యూనిట్కు ట్రాన్స్ఫార్మర్ బిగించాలని కోరారు. ఇంటి స్థలం లేని పేదలకు స్థలాలు కేటాయించి ఇళ్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. -
ఇబ్బంది పెడుతున్నారు
తాగునీటి సమస్య తీవ్రంగా ఉండడంతో ఎమ్మెల్యేగా ఎన్నికై న తొలినాళ్లలో నియోజకవర్గంలో 250కి పైగా బోర్లు తవ్వించానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. వాటికి బిల్లుల చెల్లింపు విషయంలో క్యూసీ పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఏడాదిన్నరగా చెబుతున్నా పరిష్కారం చూపడం లేదన్నారు. ఎల్లారెడ్డి ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ను నియమించాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన ఇసుక ఇబ్బందులు తొలగించాలని అధికారులను కోరారు. -
మహిళా, శిశు సంక్షేమానికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం మహిళా, శిశు సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోందని మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ కమిషనర్ అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంలో భాగంగా మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసిందన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక వేతనం ఇస్తున్న రాష్ట్రం తెలంగాణనే అన్నారు. టీచర్లు ఉద్యోగ విరమణ పొందితే రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష ఇస్తున్నామన్నారు. కేంద్రాలకు వచ్చే చిన్నారులకు యూనిఫాంలు అందించబోతున్నామని తెలిపారు. దివ్యాంగులకు ఉపకరణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించండి
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని డీటీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో డీఈవో ఎస్.రాజుకు వినతిపత్రం అందజేశారు. ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈవోలను నియమించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఈవోకు సన్మానించారు. డీటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్, రాష్ట్ర కార్యదర్శి హరికిషన్, జిల్లా అధ్యక్షుడు ఎల్లగారి శంకర్, ప్రధాన కార్యదర్శి పెద్దొళ్ల సాయిలు, గౌరవ అధ్యక్షుడు శివప్రసాద్, తదితరులున్నారు. -
ఆన్లైన్ సమస్యను పరిష్కరించాలని వినతి
కామారెడ్డి టౌన్: భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించి సంక్షేమ మండలి జారీ చేయనున్న లేబర్ కార్డులకు సంబంధించి మీ–సేవ కేంద్రాలలో ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉప్పు సాయికుమార్ మాట్లాడుతూ.. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.వినతిపత్రం అందజేస్తున్న కార్మికులు -
బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయండి
రామారెడ్డి: గంగమ్మ వాగు బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కాంట్రాక్టరుకు సూచించారు. ఎంతో కాలంగా బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. వర్షాలు కురిసేలోపు బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. కాంగ్రెస్ నాయకులు లక్ష్మా గౌడ్, ప్రవీణ్ గౌడ్, పశుపతి, రవితేజ గౌడ్, బడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో పలు కారణాలతో కుటుంబసభ్యులను కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి బాన్సువాడ రూరల్: విద్యార్థులు, యువకులు నైపుణ్యాలను మెరుగపర్చుకోవాలని ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గంగాధర్ సూచించారు. మంగళవారం కొత్తాబాదిలోని తెలంగాణ మాడల్స్కూల్లో సేవాసంఘం ఫ్రెండ్స్యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మేరా యువ భారత్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. జూలై 15న ప్రపంచ యుజన నైపుణ్యాల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. డాక్టర్ విఠల్, వినయ్కుమార్, సామాజిక కార్యకర్త నరేష్ రాథోడ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బీసీ మహాధర్నాకు తరలిన బీఆర్ఎస్ శ్రేణులుసాక్షి నెట్వర్క్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాధర్నాకు జిల్లా నుంచి ఆ పార్టీ నాయకులు ప్రత్యేక వాహనాలలో తరలివెళ్లారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. -
ఇసుక క్వారీ పనుల అడ్డగింత
రుద్రూర్: పోతంగల్ మండలం సుంకిని శివారులో ని మంజీరా నదిలో ఇసుక క్వారీ ఏర్పాటు పనులను మంగళవారం స్థానిక రైతులు అడ్డుకున్నారు. గత వారం రోజులుగా కొందరు వ్యక్తులు తమకు క్వారీ ఏర్పాటుకు అనుమతి లభించిందని పేర్కొంటూ ర్యాంపు పనులు ప్రారంభించారు. ఇసుక ర్యాంపు ఏర్పాటు పట్ల స్థానిక రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్వారీ ఏర్పాటు చేస్తే మంజీర తీరప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలు వట్టి పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్వారీ నిర్వహణ గూర్చి రెవె న్యూ అధికారులకు, స్థానికులకు కూడా ఎలాంటి సమాచారం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను నిలిపివేయాలని నినాదాలు చేశారు. అ నుమతులు లేకుండా ఇసుక క్వారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ గంగాధర్ ఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. మూడు టిప్పర్లను సీజ్ చేసీ కోటగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. -
బొలెరో వాహనం బోల్తా
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై మంగళవారం సిమెంట్ లోడ్తో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సంగారెడ్డి జిల్లా బాచేపల్లి నుంచి సిమెంట్ లోడ్ వస్తున్న బొలెరో వాహనం మండలంలోని వెల్గనూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై అదుపుతప్పి, రోడ్డు కిందకు వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్తోపాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయని హైవే సిబ్బంది తెలిపారు. సిమెంట్ దుకాణంలో అగ్ని ప్రమాదం బాల్కొండ: మండల కేంద్రంలోని శాంభవి సిమెంట్ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత షార్ట్ సర్క్యుట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి దుకాణం నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్కు సమాచారమందించారు. వెంటనే ఫైర్సిబ్బంది ఫైర్ ఇంజిన్తో వచ్చి మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. చేనులో మూర్చతో రైతు మృతి లింగంపేట(ఎల్లారెడ్డి): పంట చేనులో పనులు చేస్తుండగా ఓ రైతు మూర్ఛ వ్యాధితో మృతిచెందిన ఘటన మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై దీపక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన మార్గ రాజు(38) అనే రైతు సోమవారం తన పంట చేనులో పొలం దున్నడానికి వెళ్లాడు. రాత్రి వరకు అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి, వెతకసాగారు. పొలంలో రాజు మూర్చతో బోర్లా పడిఉన్నట్లు గమనించారు. అతడిని లేపి చూడగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన భర్త మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని అతడి భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీ వర్ని: మండలంలోని శంకోరా గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. వర్ని ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. శంకోరా గ్రామానికి చెందిన పాల్త్య రవీందర్ ఈనెల 13న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఇంటికి రాగా, ఇంటి తాళాలతోపాటు బీరువా తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.18 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఎస్పీ నుంచి సీపీగా జిల్లా పోలీస్ బాస్
మీకు తెలుసా? రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్లో దసరా రోజున ప్రారంభించిన కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలతో పాటు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసింది.●● నిజామాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభాను మెరుగ్గా నిర్వహించడానికి, శాంతిభద్రతల సంక్లిష్టతను పరిష్కరించడానికి నిజామాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP)ను, కమిషనర్ ఆఫ్ పోలీస్ (CP)గా అప్గ్రేడ్ చేశారు. ● సీపీ నేరుగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)కి నివేదిస్తుంది, నిర్ణయం తీసుకోవడాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఒక కమిషనరేట్ నిర్దిష్ట అవసరాలను తీర్చడానికి ట్రాఫిక్, శాంతిభద్రతలు, నేర శాఖలు వంటి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయవచ్చు. ● సీపీ మార్పుతో జిల్లాలోని పోలీసు అధికారుల హోదాల్లో మార్పు వచ్చింది. జిల్లా పోలీస్ బాస్ను సూపరింటెడెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ (సీపీ)గా మార్పు చేశారు. ● జిల్లాలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డీఎస్పీల హోదాల్లో సైతం మార్పు వచ్చింది. నాటి నుంచి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహించే డీఎస్పీలను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పిలవడం ప్రారంభించారు. ● జిల్లాలో అదనంగా మెండోర, ముప్కాల్, ఏర్గట్ల, ఆలూర్, డొంకేశ్వర్ పోలీస్ స్టేషన్లు చేర్చబడ్డాయి. సిరికొండ పోలీస్ స్టేషన్ను ధర్పల్లి సర్కిల్లో విలీనం చేసి నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోకి తీసుకున్నారు. – ఆర్మూర్ -
నీటి స్టోరేజ్ ట్యాంకుల ఏర్పాటు
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో నీటి స్టోరేజ్ ట్యాంకులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో కనీస ఏర్పాట్లు లేవని విద్యార్థినులు ధర్నా చేయడంతో కలెక్టర్ డీఎంఎఫ్టీ నిధులతో పాఠశాలలో నీటి స్టోరేజి ట్యాంకులు, కొత్త బోర్వెల్కు కనెక్షన్, ఫ్యాన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని ఎంఈవో షౌకత్అలీ సూచించారు. మంగళవారం ఆయన శెట్పల్లిసంగారెడ్డి, లొంకల్పల్లి, పర్మళ్ల గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. ఎఫ్ఎల్ఎన్, బేస్లైన్ టెస్టుల రిపోర్టులు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ఫణికుమార్, ఉమామహేశ్వరీ, రాజేందర్, సందీప్, తదితరులున్నారు. మరుగుదొడ్ల నిర్మాణం పరిశీలన నస్రుల్లాబాద్: సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘ఒంటికి రెంటికీ.. బయటకే’ అన్న కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నిలిచిపోయిన మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఎంఈవో చందర్ నాయక్ పరిశీలించారు. త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తయ్యేలా చేస్తామన్నారు. విద్యుత్ స్తంభం సరిచేశారు గాంధారి(ఎల్లారెడ్డి): తుమ్మళ్ల శివారులో ప్రమాదకరంగా మారిన విద్యుత్తు స్తంభాలను ట్రాన్స్కో సిబ్బంది మంగళవారం సరిచేశారు. సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రమాదకరంగా విద్యుత్తు స్తంభం శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో ట్రాన్స్కో సిబ్బంది స్పందించి మరమ్మతులు చేసి స్తంభాన్ని సరిచేశారు. రైతుల సమస్య పరిష్కారం కామారెడ్డి టౌన్: చిన్నమల్లారెడ్డి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యను అధికారులు మంగళవారం పరిష్కరించారు. గ్రామ శివారులోని వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ చెడిపోవడంతో పది రోజులుగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. నారుమడులు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం ఆందోళనకు దిగారు. దీంతో స్పందించిన ట్రాన్స్కో అధికారులు మంగళవారం ఉదయాన్నే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయించారు. సమస్యను పరిష్కరించామని డీఈ చక్రవర్తి తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ను బలోపేతం చేయాలి సదాశివనగర్: అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఎల్లారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య ఫంక్షన్హాల్లో యూత్ కాంగ్రెస్ మండల స్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్యామ్బాబు, భాస్కర్, గంగాధర్, సాయిరెడ్డి, బాల్రాజ్ పాల్గొన్నారు. -
చెట్లే మానవాళికి జీవనాధారం
నస్రుల్లాబాద్/బాన్సువాడరూరల్: చెట్లే మానవాళికి జీవనాధారమని, వాటిని నాటడమే కాకుండా సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం దుర్కిలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల, నర్సింగ్ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రకృతిని కాపాడుకోవాలని, ప్రకృతిని నాశనం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్నారు. గతంలో నాటిని ప్రతి మొక్క ఇప్పుడు చెట్టుగా మారి కళాశాల ప్రాంగణం అడవిని తలపిస్తుందన్నారు. ప్రతి జీవి మనుగడ మొక్కలపైనే: సబ్ కలెక్టర్ ప్రతి జీవి మనుగడ మొక్కలపైనే ఆధారపడి ఉందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఏఎంసీ చైర్మన్ శ్యామల, ప్రిన్సిపాల్ గంగారాం, నాయకులు పెర్క శ్రీనివాస్, వెంకన్న, కృష్ణారెడ్డి, ఎజాస్, పెర్కశ్రీనివాస్, శ్యామల, విఠల్, కంది మల్లేష్, ప్రతాప్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి -
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
● మహిళా శక్తి సంబురాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. పట్టణంలోని వెలమ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మహిళా శక్తి సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సమాఖ్యకు బ్యాంకు లింకేజీ రుణం రూ. 20.56 కోట్ల చెక్కును, కామారెడ్డి నియోజక వర్గంలోని మహిళా సంఘాలకు రూ. 5.28 కోట్ల వడ్డీ రాయితీ చెక్కును, ప్రమాద బీమా కింద ముగ్గురు సభ్యుల కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొపున చెక్కులను అందించారు. మహిళా శక్తి గొప్పదని, మహిళలు అభివృద్ధి చెందినపుడే సమాజం అభివృద్ధి చెందినట్టుగా భావించాలని పేర్కొన్నారు. వనమహోత్సవంలో మంత్రి.. జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ (బాలికల) గురుకుల పాఠశాలలో వనమహోత్సవం నిర్వహించారు. మంత్రి సీతక్క పాల్గొని మొక్కలు నాటారు. మహిళా క్యాంటీన్ను సందర్శించిన మంత్రి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులతో మాట్లాడారు. ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలని సూచించారు.మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అటవీ అధికారి నిఖిత, బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, సెర్ప్ సీఈవో నగేశ్, డీఆర్డీవో సురేందర్ తదితరులున్నారు. -
మొరం ట్రాక్టర్, పొక్లెయిన్ సీజ్
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బాణాపూర్ గ్రామ శివారులోని దండ్ల గుట్టపైన అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నందున సోమవారం రాత్రి మొరం ట్రాక్టర్, పొక్లెయిన్ పట్టుకున్నట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి, వాటిని లింగంపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. గ్రామాల్లో, మండల కేంద్రంలో అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమంగా మొరం తవ్వకాలు చేపడితే చట్టరిత్యా చర్యలు తీసుకుంటామన్నారు. డోంగ్లీ మండలంలో మూడు మొరం ట్రాక్టర్లు.. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని మొగా–డోంగ్లీ ప్రధాన రహదారిపై అక్రమంగా తరులుతున్న మూడు మొరం ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు డోంగ్లీ ఆర్ఐ సాయిబాబా తెలిపారు. సాక్షి దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన ‘మొరం అక్రమ తరలింపుపై చర్యలేవి?’ అనే వార్త కథనానికి డోంగ్లీ రెవెన్యూ అధికారులు స్పందించారు. ఉమ్మడి మండలంలో అక్రమంగా మొరం, మట్టిని తరలిస్తుండటంతో మొగా గ్రామ శివారులో దాడులు నిర్వహించామని ఆయన తెలిపారు. మండలంలో ఎక్కడైన అక్రమంగా మొరం, మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
పెద్దపులి జాడెక్కడ!
● మూడో రోజూ కొనసాగిన గాలింపు చర్యలు ● అడవిని జల్లెడ పడుతున్నా లభించని ఆచూకీ ● నలుగురి అరెస్ట్, రిమాండ్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి జాడ కోసం అధికారులు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ మూడో రోజూ కొనసాగింది. ఎస్ 12 నంబరుగల పులి తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు.. దాని జాడ కనిపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు బృందాలు రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. పులి కదలికలను కనిపెట్టేందుకు ఏర్పాటు చేసిన కెమెరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగే డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడ పడుతున్నారు. కనీసం దాని కదలికలు దొరికినా అటువైపు వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. పులి ఏ ప్రాంతంలో పశువులపై దాడి చేసిందో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల అడవిలో ఉన్న లోయలు, గుట్ట ల్లో గాలింపు కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు ఎప్ప టికప్పుడు తెలుసుకుంటున్నారు. మూడు రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటికై తే సఫలం కాలేదని అటవీ శాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. నలుగురు నిందితుల అరెస్టు అటవీ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడడం, వన్య మృగాలను చంపడానికి ప్రయత్నించిన నేరాలపై రామారెడ్డి మండలంలోని స్కూల్ తండాకు చెందిన నలుగురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బూక్య మహిపాల్, గంగావత్ కన్నీరాం, సలావత్ గోపాల్, పిపావత్ సంజీవ్లను అరెస్టు చేసినట్టు జిల్లా అటవీ అధికారి నిఖిత తెలిపారు. వారికి 14 రోజుల రిమాండు విధించినట్లు వివరించారు. -
స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు
భిక్కనూరు : న్యాయస్థానం ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు చేస్తున్నామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తెలిపారు. ఇన్చార్జి మంత్రిగా నియమితులైన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సీతక్కకు మంగళవారం బస్వాపూర్ గ్రామశివారులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ధ్రువీకరణ పత్రంతో ఇంటికి ఇసుక, మొరం తీసుకోవచ్చన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు మంజూరయ్యేంతవరకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించేందుకు ప్రభుత్వం కోర్టును ఆశ్రయించిందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, నాయకులు కుంట లింగారెడ్డి, భీంరెడ్డి, అనంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సందీప్, శ్రీరాం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క -
డీఎల్పీవో ఎవరో... సెక్రెటరీలు ఎక్కడో..
బాన్సువాడ డీఎల్పీవో ఎవరో కూడా తెలి యని పరిస్థితి ఉందని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. పంచా యతీ కార్యదర్శులు ఏ ఒక్కరూ స్థానికంగా ఉండడం లేదన్నారు. ఉదయం 6 గంటలకు గ్రామాల్లో తిరిగితే సమస్యలు కనబడతాయని, ఎప్పుడో 11 గంటలకు వస్తే ఏం తెలుస్తుందని పేర్కొన్నారు. డీఎల్పీ వోనే పనిచేయకపోతే కార్యదర్శులు ఎక్కడ పనిచేస్తారని ప్రశ్నించా రు. అధికారులు హెడ్ క్వార్టర్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్నవారికి బిల్లులు త్వరగా వచ్చేలా చూడాలన్నారు. -
సమన్వయంతో అభివృద్ధి సాధిద్దాం
బుధవారం శ్రీ 16 శ్రీ జూలై శ్రీ 2025– 10లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మం త్రి సీతక్క సూచించారు. మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వ హించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రెటరీ అనితా రామచంద్రన్, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు తదితరులు పాల్గొన్నారు. పలు శాఖలపై మంత్రి సమీక్షించారు. వివిధ శాఖల అధికారుల పనితీరుపై ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు సమస్యలను పరిష్కరి స్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, మీరు మంచి చేస్తే ప్రభుత్వానికి మంచి పేరొస్తుందని పేర్కొన్నారు. సమస్య ఉందని తెలియగానే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. ఒకవేళ సమస్య తీవ్రమైనదైతే ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకురావడం ద్వారా అది జఠిలం కాకుండా చూడవచ్చన్నారు. అధికారులు బదిలీ అయినపుడు ప్రజలు కంటతడిపెట్టేలా పనితీరు ఉండాలన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేయాలని సూచించారు. సీజనల్ వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని, డ్రెయినేజీల్లో మురికి పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డెంగీ వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెరగాలి.. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను వేగంగా నిర్మించుకునేలా అధికారులు చూడాలని మంత్రి సూచించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సెర్ప్, డ్వాక్రాల ద్వారా రుణాలు ఇప్పించి సహకరించాలన్నారు. ఇసుక ఇబ్బందులను అధిగమించేందుకు లభ్యత ఉన్న ప్రాంతాల నుంచి ఇసుకను తక్కువ ధరలో అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణం పనులు మొదలుపెట్టని వారితో మాట్లాడి వారిని ప్రోత్సహించాలన్నారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన రోడ్ల నిర్మాణాలకు వెంటనే టెండర్లు పిలిచి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మహిళా శక్తి భవనాలను నవంబర్ 19న ప్రారంభించేందుకు సిద్ధం చేయాలన్నారు. అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ భవనాల లెక్కలు తీయాలని, వాటికి సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో 14,500 అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేయడానికి రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో క్రమం తప్పకుండా శానిటేషన్ పనులు చేపడుతున్నామని, వారంలో రెండు రోజులు డ్రైడే నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. నిరుపేదలు ఇళ్లు నిర్మించుకునేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలో జిల్లా నాలుగో స్థానంలో ఉందన్నారు. ఇళ్లు నిర్మించుకోవడం ఇష్టం లేనివారితో మాట్లాడి వారి నుంచి లిఖితపూర్వక పత్రం తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, జిల్లా అటవీ అధికారి నిఖిత, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఏఎస్పీ చైతన్య తదితరులు పాల్గొన్నారు. న్యూస్రీల్బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలు..కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకా రం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకువచ్చామని సీతక్క పేర్కొన్నారు. ఇది అమలు కా కుండా కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు ని ర్వహిస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్ర శ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. కులగణనలో పాల్గొనని కొందరు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుండడం హాస్యాస్పదమన్నారు. మంత్రివర్గంలో నిర్ణయించిన మేరకు ఆర్డినెన్స్ ను గవర్నర్కు పంపామని, ఆయన ఆమోదిస్తా రని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర పెద్దలతోనూ సీఎం మాట్లాడుతారన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెరగాలి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రి సీతక్క వివిధ శాఖల పనితీరుపై ఎమ్మెల్యేల అసహనం -
సర్కారు బడికి ఊపిరి
● తల్లిదండ్రులతో సమావేశమైన కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు ● సొంత డబ్బులతో ఇద్దరు విద్యావలంటీర్ల నియామకం ● పిల్లలను బడికి పంపించేందుకు ఒప్పుకున్న పేరెంట్స్ ● పుష్కరకాలం తర్వాత దగ్గి స్కూల్ పునఃప్రారంభంసదాశివనగర్ : దగ్గిలోని ప్రాథమిక పాఠశాల పుష్కర కాలం క్రితం మూతబడింది. ఆ తర్వాత పట్టించుకున్నవారే లేరు. తాజాగా ఈ పాఠశాలను తెరిపించి ఆదర్శంగా నిలిచారు కల్వరాల్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్రెడ్డి. సిద్దిపేట జిల్లాకు చెందిన విష్ణువర్ధన్రెడ్డి బదిలీపై రెండేళ్ల క్రితం కల్వరాల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా వచ్చారు. ఆయన విధుల్లో చేరిన సమయంలో ఆ హైస్కూల్లో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. మూతబడే స్థితిలో ఉన్న పాఠశాల గతి మార్చేందుకు ఆయన గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో బడి రూపురేఖలు మార్చారు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడికి పంపించడం ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుడి కృషితో ప్రస్తుతం ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 86కు చేరింది. దగ్గి పాఠశాలపై దృష్టి.. కల్వరాల్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో 17 పాఠశాలలున్నాయి. అందులో దగ్గిలోని ప్రైమరీ స్కూల్ విద్యార్థులు లేక 2013లో మూతబడింది. ఆ బడిని తెరిపించేందుకు ప్రయత్నాలు జరగకపోవడంతో అప్పటినుంచి మూసే ఉంటోంది. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిగా విష్ణువర్ధన్రెడ్డి వచ్చాక ఆ బడిపై దృష్టి సారించారు. గ్రామస్తులతో సమావే శమై చర్చించారు. ఇంటింటికి వెళ్లి పిల్లలను సర్కా రు బడికి పంపించాలని కోరారు. ఆయన కృషి ఫలించి 22 మంది విద్యార్థులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్రెడ్డే సొంత డబ్బులతో పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగింపజేశారు. బడికి పెయింటింగ్ వేయించారు. విద్యార్థులకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లతోపాటు ఆటవస్తువు లు కొనుగోలు చేసి అందుబాటులో ఉంచారు. విద్యార్థులకోసం ఇద్దరు విద్యావలంటీర్లను నియ మించారు. వారికి ప్రతినెలా రూ. 5 వేల చొప్పున ఆయనే వేతనాలు ఇస్తున్నారు. ఇలా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు చేస్తున్న కృషితో పన్నెండేళ్ల తర్వాత బడి మళ్లీ తెరచుకుంది. ఇటీవల డీఈవో ఈ స్కూల్ను పునఃప్రారంభించారు. మౌలిక వసతులు కల్పిస్తున్నా.. విద్యార్థులకు నాణ్యమైన వి ద్య అందించడానికి కృషి చే స్తున్నా. సొంత డబ్బులతో వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నా. పిల్లల తల్లిదండ్రులతో మా ట్లాడి దగ్గిలో మూతబడిన ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమయ్యేలా చూశా. – విష్ణువర్ధన్రెడ్డి, హెచ్ఎం, కల్వరాల్ బాగా పాఠాలు చెబుతున్నారు మా గ్రామంలో పన్నెండేళ్ల కింద మూతబడిన ప్రాథమిక పాఠశాలను ఈసారి తిరిగి తెరిచారు. ఇప్పుడు ప్రైవేట్ పాఠశాల కంటే మంచిగా చదువు నేర్పిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. పాఠశాలను తెరిపించిన పెద్ద సార్ విష్ణువర్ధన్రెడ్డికి రుణపడి ఉంటాం. –సౌందర్య, విద్యార్థి తల్లి, దగ్గి -
ఒకటికీ రెంటికీ.. బయటికే..
నస్రుల్లాబాద్: మల మూత్ర విసర్జన చేయాలంటే విద్యార్థులు ఆరు బయటకు కి.మీ.ల దూరం వెళ్లాల్సి వస్తోంది. పాఠశాల ప్రాంగణంలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. నస్రుల్లాబాద్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థుల అవస్థలు అంతా ఇంతా కాదు. పాఠశాల చుట్టూ నివాస గృహాలు ఉండటంతో ఊరి బయటకు , అటవీ ప్రాంతానికి సైతం వెళ్తున్నారు. అర్ధంతరంగా నిలిచిన పనులు పాఠశాల ప్రాంగణంలో రూ.10 లక్షలతో బాల బాలికలకు మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించారు. దీనితో గ్రామానికి చెందిన వ్యక్తి పనులు ప్రారంభించారు. అయితే పిల్లర్ల వరకు పనులు పూర్తయ్యాయి. పనులు జరిగిన వరకు బిల్లులు వస్తే పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ వ్యక్తి చెబుతున్నారు. పాఠశాలలో 114 మంది విద్యార్థులు ఉండగా అందులో బాలికలు పాత మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారు. కాని బాలురు మాత్రం నిత్యం బహిరంగ ప్రదేశాలకు ,ముళ్ల పొదల్లోకి, గుట్ట ప్రాంతాలకు వెళ్తున్నారు. వర్షాకాలం కాలం కావడంతో జరగకూడని ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తల్లిదండ్రులు భయపడుతున్నారు. బిల్లులు రాక మధ్యలో ఆగిపోయిన మరుగుదొడ్ల నిర్మాణం నస్రుల్లాబాద్ జెడ్పీహెచ్ఎస్లో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు కన్నెత్తి చూడని అధికార యంత్రాంగంమూత్రశాలలు పూర్తి చేయాలి పాఠశాలలో మూత్ర శా లలు పనులు ప్రారంభం చూ సి సంతోషపడ్డాం. కాని మా ర్చిలో నిలిచిన పనులు ఇంకా ప్రారంభం కాలేదు. కనీస అ వసరాలకు కూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సంబంధిత అధికారులు స్పందించాలని కోరుతున్నాం. – చరణ్, 10వ తరగతిఅర్జెంటైనా దూరం పోవాల్సిందే.. పాఠశాలలో అర్జెంట్ అవసరం అయినా అంత దూరం పోయే పరిస్థితి ఉంటుంది. కొంత కాలం రోడ్డు ప్రక్కన అవసరం తీర్చుకున్నా నివాస గృహాల వారు అభ్యంతరం తెలపడంతో ఊరి చివరకు వెళ్తున్నాం. – అఖిల్, 10వ తరగతి -
మిషన్ భగీరథ నీళ్ల కోసం ఫిర్యాదు
కామారెడ్డి అర్బన్: మాచారెడ్డి మండలం బంజేపల్లి తండా, సోమారంపేట గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా ఉందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీల మరమ్మతులకు తమ గ్రామ పంచాయతీల్లో నిధులు లేవని బంజేపల్లి, సోమారంపేట గ్రామ పంచాయతీ కార్యదర్శులు అంటుండగా మిషన్ భగీరథ అధికారులు స్పందించడం లేదని బీఎస్సీ జిల్లా అధ్యక్షుడు కలెక్టర్కు వివరించారు. నేతలు దుంప సురే ష్, బొడ్డు సంతోష్, దుబ్బాక నవీన్, తదితరులున్నారు. -
ప్రజాపాలనకు మద్దతుగా కాంగ్రెస్లోకి రండి
భిక్కనూరు: ప్రజాపాలనకు మద్దతుగా ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. సోమవారం తిప్పాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అనుచరులతో కలిసి కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బీంరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికి షబ్బీర్అలీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ.. ప్రజాపాలనతో ఇందిరమ్మ రాజ్యం సాధ్యమవుతుందన్నారు. ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. రైతు భరోసా పథకం డబ్బులను రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం రేవంత్రెడ్ది ప్రభుత్వానిదేనన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, మాజీ ఎంపీపీ గాలిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఇసుక కొరత రాకుండా చూడాలి దోమకొండ: ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సూచించారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన పార్టీ నాయకులు ఆయనను కలిసి ఇందిరమ్మ ఇళ్ల ఇసుక కొరతపై వివరించారు. ఇసుక అనుమతులు ఇవ్వడం లేదని, నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయని వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన వెంటనే ఎంపీడీవో ప్రవీణ్ కుమార్తో పాటు తహసీల్దార్ సుధాకర్కు ఫోన్చేసి మాట్లాడారు. ఇసుక కొరత రాకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ ఐరేని నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, సొసైటీ చైర్మన్ నాగరాజు రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్ ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ -
విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి
బాన్సువాడ రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఎంతగానో కృషి చేస్తోందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రనాథ్ ఆర్య అన్నారు. సోమవారం ఆయన మండలంలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను సందర్శించి తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. ప్రభుత్వం డీఏ, పీఆర్సీ పెండింగ్లో పెట్టడం అన్యాయమని వెంటనే బకాయిలు చెల్లించాలన్నారు. ఎస్జీటీలకు ప్రమోషన్లలో న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలన్నారు. జిల్లా ఉపాద్యక్షులు వేదప్రకాష్, తారాచంద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్తో భేటీ
కామారెడ్డి టౌన్: ఇటీవల ఏజీపీగా నూతనంగా నియమితులైన కె. శ్యామ్గోపాల్రావు సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కను అందజేశారు. కేసుల విషయంలో సానుకూలంగా స్పందించి, కోర్టు వ్యవహారాలు చూసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ను కలిసిన ఎల్లారెడ్డి ఆర్డీవో కామారెడ్డి క్రైం: ఎల్లారెడ్డి ఆర్డీవోగా నియమితులైన పార్థసింహారెడ్డి సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను ఆయన చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. భూ సమస్యల పరిష్కారం, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. సోమవారం కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీగా తరలివచ్చి ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రజనీకాంత్ హాజరై ధర్నానుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్స్, స్కాలర్షిప్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. అనంతరం కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అనుమతించడంలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. లీగల్ సర్వీసెస్ కరపత్రాల ఆవిష్కరణమద్నూర్(జుక్కల్): స్థానిక పోలీస్ స్టేషన్లో సోమవారం లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహణ కరపత్రాలను సోమవారం ఎస్సె విజయ్కొండ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు, సీనియర్ సిటిజన్ తగాదాలు, చిన్న సమస్యలను పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగకుండా మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. మద్నూర్ జీపీ ఆవరణలో గల కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లో వలంటీర్లు ఉడుతావార్ సురేష్, మోరే అశోక్లను సంప్రదించాలని సూచించారు. అలాగే న్యాయ సహాయం కోసం 15100 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి సలహాలు కోరవచ్చన్నారు. -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణి ద్వారా దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన వినతులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు. పెండింగ్ ఫిర్యాదులు లేకుండా చూసుకోవాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 95 ఫిర్యాదులు -
ఆర్ఎంపీ ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన మోరె గణేశ్(38) అనే ఆర్ఎంపీ ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలలో మానసిక వేదనకు గురైన గణేశ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అప్పల బాధతో ఒకరు.. రుద్రూర్: కోటగిరి మండలం వల్లభాపూర్ గ్రామానికి చెందిన మేకల హన్మాండ్లు (30) చికిత్స పొందుతూ జిల్లా ఆస్పత్రిలో మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కూలి పనులు చేస్తూ జీవించే హన్మాండ్లు అప్పులు పెరిగి పోవడంతో ఈ నెల 13న సాయంత్రం గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం నిజామాబాద్లోని జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంఆర్మూర్టౌన్: పట్టణంలోని కెనాల్ కట్ట సమీపంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందని, దేహంపై తెల్లటి రంగు టీషర్టు, కాకి కలర్ ప్యాంట్ ఉందన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచామని, వ్యక్తి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. స్నూకర్ షాపుపై పోలీసుల దాడిఖలీల్వాడి: నగరంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో స్నూకర్ షాపుపై ఆదివారం అర్ధరాత్రి సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. ఈ షాపు లో గత కొన్ని రోజుల నుంచి బెట్టింగ్ దందా సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నట్లు సమాచారం రావడంతో సీసీఎస్ పోలీసులు దాడులు చేశారు. నలుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 2,500 స్వాధీనం చేసుకొని ఒకటో టౌన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో ఒకరికి జైలుబాల్కొండ: మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన మెండోరా మండల కేంద్రానికి చెందిన వేముల సాయిలుకు ఆర్మూర్ కోర్టు మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ సోమవారం రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలెందర్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
అన్నారంలో కారు బోల్తా
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండలం అన్నారం శివారులో ఆదివారం రాత్రి మారుతి స్విఫ్ట్ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. నిజామాబాద్కు చెందిన యువకులు ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వచ్చి ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగంతో కారును నడపడంతో మూలమలుపు వద్ద రోడ్డు కనిపించక కారు వ్యవసాయ పొలంలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. అందులో ఉన్న యువకులకు స్వల్పగాయాలు కాగా, పొక్లెయిన్ సాయంతో కారును బయటికి తీశారు. అన్నారం వద్ద మూల మలుపు కారణంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. టిప్పర్లు, ఆటోలు బోల్తా పడిన ఘటనలున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మరోవైపు పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టకపోవడంతో పలువురు వాహనాలను అతివేగంగా నడుపుతున్నారు. -
పారిశుద్ధ్యం అమలుపై దృష్టి సారించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో పారిశుద్ధ్యం అమలుపై దృష్టి సారించాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు.. గ్రామాల్లో మురికికాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. దీంతోపాటు మురికాలువ వెంట, వర్షపునీరు నిల్వ ఉండేచోట బ్లీచింగ్పౌడర్ చల్లించాలని ఆదేశించారు. గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వివరాలతోపాటు లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఎంపీడీవో ప్రభాకరచారి తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల నుంచి విముక్తి కల్పించండి
కామారెడ్డి టౌన్: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గోదాం నుంచి గ్రామంలోకి లక్క పురుగులు విపరీతంగా వస్తున్నాయని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో పురుగులు అన్నం తినే సమయంలో అన్నం ప్లేట్లలో పడుతున్నాయని, చిన్నపిల్లలపై లక్క పురుగులు వాలి గాయాలు చేస్తున్నాయని, దీంతో ఆస్పత్రుల పాలవుతున్నారని వాపోయారు. అధికారులు విచారణ చేపట్టి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
కామారెడ్డి క్రైం : పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్(ఎన్ఎస్ిపీసీ) 2025 పో స్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులతో కలిగే ప్రభావాల నుంచి రక్షణ విషయంలో విద్యార్థులు పర్యావరణ నైపుణ్యాలను పెంచుకోవడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడం ఎంతో ముఖ్యమన్నారు. మొక్కలు నాటడం, నీటి సంరక్ష ణ, వ్యర్థాలను వేరు చేయడంలాంటి పద్ధతులను ప్రతి విద్యార్థికి అలవాటు చేయాలన్నారు. కేంద్ర విద్య, పర్యావరణ మంత్రిత్వ శాఖల సహకారంతో ఈ పోటీలను ‘హరిత్, ద వే ఆఫ్ లైఫ్’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారన్నారు. 1 నుంచి 5, 6 నుంచి 8, 9 నుంచి 12 వ తరగతి, డిగ్రీ, పీజీ, పరిశోధన విద్యార్థులు, సాధారణ పౌరుల విభాగాల్లో వేర్వేరుగా పోటీలు ఉంటాయన్నారు. రిజిస్ట్రేషన్లకు ఆగస్టు 21 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈకో మిత్ర అనే మొబైల్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. హిందీ, ఇంగ్లిష్ సహా అనేక భాషలలో క్విజ్ పోటీ అందుబాటులో ఉంటుందన్నారు. మొక్క నాటుతు గానీ, సంరక్షిస్తూ గానీ, వ్యర్థాలను వేరు చేస్తున్న ఫొటో గానీ సెల్ఫీ తీసి తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని సూచించారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి ఇ–సర్టిఫికెట్ ఇస్తామన్నారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యాసంస్థలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, డీఈవో రాజు, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఆర్డీవో వీణ, జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలి కామారెడ్డి క్రైం: మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మహిళా సాధికారత కేంద్రం, సోనియా శంకర్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకంలో భాగంగా మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. ఇందులో శిక్షణ పూర్తి చేసుకున్న 60 మందికి సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ప్రమీల, ఐసీడీఎస్ సీడీపీవోలు, సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ్ కాంపిటీషన్ పోస్టర్ల ఆవిష్కరణ -
‘క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి’
లింగంపేట: క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీసు లకు సూచించారు. సోమవారం ఆయన లింగంపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రోల్ కాల్ను పరిశీలించి, హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించే రోల్ కాల్ ప్రాముఖ్యతను వారికి వివరించారు. దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి కేసును సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. బ్లూ కోల్ట్స్, పెట్రోకార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలన్నారు. డయల్ 100 ఫిర్యాదులపై వేగంగా స్పందించి చర్యలు తీసుకుంటూ ప్రజలలో పోలీస్ శాఖపై విశ్వాసం పెరిగేలా చూడాలని సూచించారు. కాయితీ తండా శివారులో చిరుతల సంచారం గాంధారి: కాయితీ తండా శివారులోని అటవీ ప్రాంతంలో వారం రోజులుగా చిరుత సంచరిస్తోందని తండావాసులు తెలిపారు. మూడు రోజుల క్రితం పేట్సంగెం మాజీ సర్పంచ్ జగ్మల్ నాయక్కు చెందిన రెండు గొర్రె పొట్టేళ్లపై దాడిచేసి ఎత్తుకుపోయిందని పేర్కొన్నారు. మరో రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపే ప్రయత్నం చేయగా కాపరులు అరవడంతో చిరుత అడవిలోకి పరుగులు తీసిందని తెలిపారు. ఆవు గొంతుపై తీవ్ర గాయాలయ్యాయన్నారు. అడవిలో రెండు, మూడు చిరుతలు సంచరిస్తున్నాయన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. చిరుతను బంధించాలని కోరుతున్నారు. జిల్లా వ్యవసాయ అధికారిగా మోహన్రెడ్డి కామారెడ్డి క్రైం: జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ నిజామాబాద్ ఆత్మ డైరెక్టర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వి కారాబాద్ డీఏవోగా ఉన్న మోహన్రెడ్డి బదిలీపై వచ్చారు. సోమవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన డీఏవో మోహన్రెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో బదిలీ పై వెళ్తున్న తిరుమల ప్రసాద్ పాల్గొన్నారు. ‘ఇందిరమ్మ’లో రాష్ట్రంలో నాలుగోస్థానం కామారెడ్డి టౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉందని హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి తెలిపారు. జిల్లాకు మొత్తం 11,618 ఇందిరమ్మ ఇళ్లు మంజూరవగా.. ఇప్పటివరకు 5,435 నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. 47 శాతం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉన్నామని తెలిపారు. ప్రారంభమైనవాటిలో 1,013 బేస్మెంట్ లెవల్లో ఉండగా.. 65 రూఫ్ లెవల్, 30 స్లాబ్ లెవల్ వరకు పనులు పూర్తయ్యాయని వివరించారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవాలన్నారు. క్లస్టర్ ఆఫీసర్లు, మండల స్థాయి అధికారులు నిరంతరం నిర్మాణాలను పర్యవేక్షించాలని సూచించారు. ‘దివ్యాంగులకు ఆర్థిక ప్రోత్సాహం’ కామారెడ్డి అర్బన్: దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం (ఎకనమిక్ రిహాబిలిటేషన్ స్కీం) కింద జీవనోపాధి అవకాశాలు కల్పించడానికి రుణాలు ఇప్పించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగానూ జిల్లాకు 31 యూనిట్లు మంజూరు చేశారని, అర్హులైన దివ్యాంగులు అన్లైన్లో ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బ్యాంకు లింకేజీ, బ్యాంకు లింకేజీ లేకుండా రూ. 50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. -
● ఎస్ 12 పులి కోసం కొనసాగుతున్న గాలింపు ● అడవిలో ఆరు ట్రాక్ కెమెరాలు ఏర్పాటు ● రెండు డ్రోన్ కెమెరాలతో కదలికలు కనిపెట్టే ప్రయత్నం ● ఎటువైపు వెళ్లిందన్న దానిపై స్పష్టత కరువు ● పులిపై విష ప్రయోగానికి ప్రయత్నించిన నలుగురిపై కేసు
పులి పాదముద్రలను పరిశీలిస్తున్న అటవీ అధికారులు, సిబ్బందిఉమ్మడి జిల్లా సరిహద్దుల్లో సంచరిస్తున్న పులి జాడ కనుక్కోవడం కోసం అటవీ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. రెండు రోజులైనా పులి ఎక్కడుంది, ఎటు వెళ్లిందన్నదానిపై స్పష్టత లేదు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి కోసం అటవీ శాఖ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లా అటవీ అధికారి నిఖిత ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, సిరికొండ, ఇందల్వాయి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట రేంజ్లకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. మూడు బృందాలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల పరిధిలోని రెడ్డిపేట, అన్నారం, ఎల్లంపేట, సిరికొండ మండలంలోని కొండాపూర్, తూంపలి తదితర గ్రామాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో గాలిస్తున్నారు. రాత్రింబవళ్లు రెస్క్యూ ఆపరేషన్... ఎస్ 12 నంబరుతో పిలవబడే పులి ఇటీవల జిల్లా సరిహద్దుల్లోని సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల సరిహద్దు అటవీ ప్రాంతంలో తిరిగినట్టు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పులి కదలికలను తెలు సుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తు న్నారు. దాని జాడ కనిపెట్టేందుకు మాచా రెడ్డి, ఇందల్వాయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, నా గిరెడ్డిపేట, సిరికొండ రేంజీలకు చెందిన అటవీ అధికారులు, సిబ్బంది రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. పులి కదలికలను గుర్తించే క్రమంలో అడవిని జల్లెడ పడుతున్నారు. సోమవారం జిల్లా అటవీ అధికారి నిఖిత కూడా అటవీ ప్రాంతానికి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ను పరిశీలించారు. డ్రోన్ కెమెరా ల ద్వారా పులి కదలికలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ట్రాక్ కెమెరాల సాయంతో.. పులి కదలికలను కనిపెట్టేందుకు అటవీ ప్రాంతంలో ఆరు ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి తిరిగిన ప్రదేశానికి రెండు కిలోమీటర్ల రేడియస్లో అన్నివైపులా కవరయ్యేలా కెమెరా లు బిగించినట్టు సమాచారం. ఆ ప్రాంతంలో పులి ఉంటే కచ్చితంగా కెమెరాలు ట్రాక్ చే స్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే రెండు డ్రోన్ కెమెరాలతో అడవిలో తిరుగుతూ పులి జాడ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం ఉద యం నుంచి అర్ధరాత్రి దాటే దాకా గాలింపు కొనసాగింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు సిబ్బంది అటవీ ప్రాంతంలోనే ఉండి పులి జాడ కోసం ప్రయత్నించారు. అదుపులో ముగ్గురు! రెడ్డిపేట స్కూల్ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇటీవల ఆవుపై పులి దాడి చేసి చంపేసింది. అయితే ఆవు యజమానితో పాటు మరో ముగ్గురు ఆవుపై పురుగుమందులు చల్లి పులిని మట్టుబెట్టే ప్రయత్నం చేశారని అధికారులు గుర్తించి కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. విష ప్రయోగం నిర్ధారణ కోసం శాంపిళ్లను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్లలోనూ అప్రమత్తండొంకేశ్వర్(ఆర్మూర్) : మాచారెడ్డి రేంజ్ పరిధిలో ఆవుపై దాడిచేసి చంపిన పెద్దపులి మొదటగా నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్కే వచ్చినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే తాటిపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి పాద ముద్రలను గుర్తించిన విషయం తెలిసిందే. తాటిపల్లి అటవీలోనే కొన్ని రోజులు పెద్దపులి సంచరించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొండలు, రాళ్ల గుట్టలు ఎక్కువగా ఉండడంతో మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు భావిస్తున్నారు. అయితే మాచారెడ్డి రేంజ్లో పెద్దపులిపై విష ప్రయోగం జరిగిందన్న వార్తలు రావడం, పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో కూడా హాట్ టాపిక్గా మారింది. పెద్ద పులి మళ్లీ నిజామాబాద్ జిల్లా వైపు రావొచ్చనే సందేహంతో సిరికొండ, ఇందల్వాయి, నిజామాబాద్ సౌత్ రేంజ్లను అప్రమత్తం చేశారు. బీట్ ఆఫీసర్లను టీములుగా విభజించి గస్తీ తిరుగుతున్నారు. అటవీ పరిసర గ్రామాల ప్రజలకు, రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపులి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని, ఉచ్చులు, విద్యుత్ తీగలు పెట్టకూదని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా నిజామాబాద్ నాగారంలో చిరుత సంచారం నేపథ్యంలో అన్ని రేంజ్లలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలిచ్చారు.రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు వర్షాకాలం కావడంతో అడవి పచ్చబడింది. ముళ్ల పొదలు, చెట్లు పెరిగి అడవిలో తిరగడానికి అటవీ అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. పులిని గుర్తించడం కూడా ఇబ్బందికరంగా మారింది. ఎస్ 12 పులిని కాపాడేందుకు ప్రత్యేక బృందాలు అడవుల్లో తిరుగుతూ దాని కదలికలను పసిగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. పులి ఏ వైపు వెళ్లింది అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నాలుగైదు దశాబ్దాలుగా జిల్లాలో పులుల సంచారం లేదు. ఇప్పుడు వచ్చిన పులిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ప్రజలు అటవీ ప్రాంతానికి వెళ్లొద్దు. పులిపై విష ప్రయోగం జరిగిందా లేదా అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వచ్చాకే చెప్పగలం. – నిఖిత, డీఎఫ్వో, కామారెడ్డి -
రేపే స్నాతకోత్సవం
తెయూ(డిచ్పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీలో గత పుష్కర కాలంగా (12 ఏళ్లుగా) విద్యార్థులు, అధ్యాపకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెండో స్నాతకోత్సవాన్ని (కా న్వొకేషన్) బుధవారం నిర్వహించనున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానుండగా, ముఖ్యఅతిథిగా ఐఐసీటీ మాజీ డైరక్టర్ ప్రొఫెసర్ శ్రీవారి చంద్రశేఖర్ పాల్గొంటారు. కాన్వొకేషన్ కోసం వర్సిటీ ఉన్నతాధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఏడాదికోసారి కాన్వొకేషన్ నిర్వహించాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. 2006లో తెలంగాణ యూనివర్సిటీ ఏర్పడగా తొలి కాన్వొకేషన్ను 13 నవంబర్ 2013లో అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ హ యాంలో నిర్వహించారు. ఆ తర్వాత కాన్వొకేషన్ నిర్వహణను మరిచారు. 2018, 2020లో కాన్వొకేషన్ నిర్వహణకు అప్పటి వీసీలు సాంబయ్య, రవీందర్గుప్తా నోటీసులు జారీ చేసినప్పటికీ నిర్వహించలేకపోయారు. అయితే గతేడాది అక్టోబర్లో వీసీగా బాధ్యతలు స్వీకరించిన యాదగిరి రావు కాన్వొకేషన్ నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో నవంబర్లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. హైదరాబాద్ నుంచి జర్మన్ హ్యాంకర్ వర్సిటీ క్రీడామైదానంలో కాన్వొకేషన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వానాకాలం కావడంతో వర్షం, ఈదురు గాలులు వస్తే కార్యక్రమ నిర్వహణకు ఆటంకాలు కలగకుండా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా జర్మన్ హ్యాంకర్ను తెప్పించారు. ఇందులో 500 మంది కూర్చునేందుకు వీలుండగా, రూ.9లక్షలు ఖర్చు చేస్తున్నారు. క్యాంపస్లోని రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. సూచిక బోర్డులతోపాటు పరిపాలనా భవనానికి వేళ్లే దారిలో ‘ఐలవ్ టీయూ’ పేరుతో శాశ్వత సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. అన్ని బోర్డుల వద్ద లాన్స్ ఏర్పాటు చేస్తున్నారు. రాజ్భవన్ కార్యాలయం ప్రోటోకాల్ ప్రకారం స్టేజీపై రాష్ట్ర గవర్నర్, ముఖ్యఅతిథి, వీసీ, రిజిస్ట్రార్తోపాటు ఏడుగురు డీన్స్ మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు, బ్యానర్లు, పేపర్లు తీసుకెళ్లే వీలుండదు. పాస్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. బెటాలియన్లో గార్డ్ ఆఫ్ హానర్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముందుగా డిచ్పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్కు చేరుకుంటారు. గెస్ట్ హౌజ్ వద్ద 104 మంది పోలీసు సిబ్బందితో గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) స్వీకరిస్తారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తెయూకు చేరుకుని వర్సిటీలో సైతం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య కాన్వొకేషన్కు హాజరు కానున్నారు. గవర్నర్ భద్రతా సిబ్బందితోపాటు జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్సిటీ లో జరుగుతున్న ఏర్పాట్లను వీసీ, రిజిస్ట్రార్లతో కలిసి నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్రెడ్డి సోమవారం పరిశీలించారు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు.. తెయూ పరిధిలో 2014 నుంచి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ)లో 15,557 మంది విద్యార్థులు, గ్రాడ్యుయేషన్ (యూజీ) లో 60,660 మంది విద్యార్థులు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) లో 10,079 మంది విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేశారు. పుష్కర కాలం తర్వాత.. తెయూ కాన్వొకేషన్కు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లుఆరు విభాగాలతో ప్రారంభమై.. 2006లో ఆరు విభాగాలతో ప్రారంభమైన వర్సిటీ ప్రస్తుతం 24 విభాగాల్లో 31 కోర్సులకు విస్తరించింది. డిచ్పల్లిలోని ప్రధాన క్యాంపస్తోపాటు కామారెడ్డి జిల్లా భిక్కనూర్లోని సౌత్క్యాంపస్, నిజామాబాద్ నగరంలోని సారంగపూర్లో ఎడ్యుకేషన్ క్యాంపస్ కొ నసాగుతు న్నాయి. తెయూకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో 109 అనుబంధ యూజీ, పీజీ కళాశాలలు ఉండగా, 31కోర్సులకు గాను 19 అ ప్రూవ్డ్ రెగ్యులర్ కోర్సులు, 12 సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, 7 పీహెచ్డీ కోర్సులు ఉన్నాయి. -
సీతక్క చొరవ చూపేనా?
మంత్రి పర్యటన ఇలా.. ● జిల్లాను వేధిస్తున్న సమస్యలు ● ఇన్చార్జి మంత్రి పర్యటనపై ప్రజల్లో ఆశలు ● నేడు జిల్లా కేంద్రానికి రాక సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా ఇన్చార్జి మంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తొలిసారి జిల్లాకు రానున్నారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ అంశాలపై నిర్వహించే సమీక్ష సమావేశాల్లో ఆమె పా ల్గొననున్నారు. ఇన్చార్జి మంత్రిగా తొలిసారి జిల్లా కు వస్తున్న సీతక్కపై జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యల తిష్ట.. జిల్లాలో అనేక సమస్యలు తిష్టవేశాయి. వర్షాకాలం ప్రారంభమైనా సరైన వర్షాలు లేకపోవడంతో పలు ప్రాంతాలలో తాగునీటి నెలకొంది. ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు చాలా ప్రాంతాలకు సరఫరా కావడం లేదు. జిల్లా కేంద్రంలో మూడు, నాలుగు రోజులకోసారి తాగునీరు సరఫరా అవుతోంది. చాలా గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య వేధిస్తోంది. సీజనల్ వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. డెంగీ కేసులు పెరుగుతున్నాయి. చాలా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూరియా కొరతతో చాలాచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని పలు గ్రామాలు, గిరిజన తండాలకు తారు రోడ్లు లేవు. వర్షం కురిస్తే మట్టి రోడ్లు బురదమయంగా మారి నడవడానికీ ఇబ్బందికరంగా మా రుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు అనేక సమస్యలు ఉన్నాయి. నిర్మించుకునేందుకు ఆసక్తి ఉన్న వారి పేర్లు జాబితాల్లో రాకపోవడంతో కొందరు నిరాశకు గురవుతు న్నారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక దొరక్క పనులు ముందుకు సాగడం లేదు. కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణానికి అట వీ చిక్కులు ఉన్నా యి. వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిన అవసరం ఉంది. అద్దె భవనాల్లో కార్యాలయాలు.. జిల్లాలో చాలాచోట్ల అంగన్వాడీ కేంద్రాలు అద్దె భ వనాల్లో కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల నిధులు లే క భవనాల నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలా యి. అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కేంద్రాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో పలు అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసినా వాటికి సొంత భవనాలు నిర్మించలేదు. దీంతో వందకుపైగా పంచాయతీలకు సరైన వసతి లేదు. కొన్నిచోట్ల స్కూల్ భవనాల్లో, మరికొన్ని చోట్ల గుడిసెల్లో, ఇంకొన్ని చోట్ల అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పంచాయతీలుగా ఏర్పడిన తండాలలో దాదాపు ఏ ఒక్క దానికీ సొంత భవనం లేదు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక తాజా మాజీ సర్పంచ్లు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు. స్కూళ్ల పరిస్థితి దయనీయం.. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన స్కూల్ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా మిగిలాయి. బి ల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు ఆపే శారు. దీంతో కొన్నిచోట్ల పాఠశాలలు చెట్ల కింద కొనసాగుతున్నాయి. బిల్లులు చెల్లిస్తే గానీ పనులు ముందుకు సాగే పరిస్థితి లేదు. చాలాచోట్ల సరిపడా తరగతి గదులు లేకపోవడంతో ఇబ్బందుల మధ్య చదువులు కొనసాగుతున్నాయి. ఇన్చార్జి మంత్రిగా జిల్లాలో ఆయా సమస్యలపై అధికారులతో సమీక్షించి వాటికి పరిష్కారం చూపుతారని ప్రజలు ఆశిస్తున్నారు.కామారెడ్డి టౌన్: జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మంగళవారం కామారెడ్డిలో పర్యటిస్తారని జిల్లా అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో వన మహోత్సవంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 10.45 గంటలకు కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతి, భూభారతి సమస్యల పరిష్కారం, విత్తనాలు, ఎరువుల సరఫరా, ఆయిల్ ఫార్మింగ్ పురోగతి, టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్షిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే మహిళా సదస్సులో పాల్గొంటారని, సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారని పేర్కొన్నారు. -
మత్స్యకారుల సమస్యలను పరిష్కరించండి
కామారెడ్డి టౌన్: మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.బాలకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సదస్సుకు అతిథిగా హాజరై మాట్లాడారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికి ప్రభుత్వం ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. జల వనరులకు సరిపడేంత చేప, రొయ్య పిల్లలను కొనుగోలు కోసం ప్రతి మత్స్య సొసైటీల ఖాతాలో నగుదు జమ చేయాలని డిమాండ్ చేశారు. వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ వెంకట్గౌడ్, నాయకులు జగదీష్, బాలమణి, మోతిరాం పాల్గొన్నారు. ‘మొక్కలను దత్తత తీసుకొని రక్షించుకుందాం’బిచ్కుంద(జుక్కల్): నాటిన మొక్కలను ప్రతిఒక్కరు దత్తత తీసుకొని రక్షించుకుందామని ఏఎంసీ చైర్మన్ కవిత పిలుపునిచ్చారు. సోమవారం మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. మనం ప్రకృతిని కాపాడితే అందరు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రైతులు పొలాల గట్లపై మొక్కలు నాటాలని కోరారు. వైస్ ఏఎంసీ చైర్మన్ శంకర్ పటేల్, సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, నాగ్నాథ్, వెంకట్రెడ్డి, భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. -
తుప్పు పడుతున్నా.. వాహనాలపై పట్టింపేది?
నస్రుల్లాబాద్: స్థానిక పోలీసు స్టేషన్లో స్వా ధీనం చేసుకున్న వాహనాలు తుప్పు పడుతున్నాయి. దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, సరైన ధ్రువ పత్రాలు లేని వాహనాలను పోలీసులు సీజ్ చేసి స్థానిక పోలీస్స్టేషన్ ఆవరణలో ఉంచారు. సంబంధిత వ్యక్తులు రాకపోవడంతో ఎండకు ఎండి, వర్షానికి నానుతున్నాయి. వాటిని వేలం వేయాల్సి ఉన్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి వాహనాలపై సరైన నిర్ణయం తీసుకోవాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మొరం అక్రమ తరలింపుపై చర్యలేవి?మద్నూర్(జుక్కల్): మద్నూర్, డోంగ్లీ మండలాల్లో జోరుగా సాగుతున్న మొరం, మట్టిదందా అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. మట్టి, మొరంను గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో, సెలవుదినాల్లో తరలిస్తున్నారు. మండల కేంద్రంలో గుట్టల నుంచి మొరంను యథేచ్ఛగా తోడేస్తున్నారు. తవ్విన మొరంను ఇళ్ల నిర్మాణాలు, వెంచర్లకు తరలిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
బీసీల ధర్నాను జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): రిజర్వేషన్ల పేరిట ఎన్నికలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్త్ సింధే ఆరోపించారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ..ఈ నెల 15న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. బీసీల ధర్నాను జయప్రద చేయాలని కోరారు. జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీల చైర్మన్లు ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు. భక్తిశ్రద్ధలతో పీర్ల పండుగ మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో సోమవారం గ్రామస్తులు పీర్ల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పీర్లకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. జాతర వెలిసింది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పీర్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నకిలీ లేబర్ కార్డులను తొలగించాలి ఎల్లారెడ్డిరూరల్: నకిలీ లేబర్ కార్డులను తొలగించాలని లేబర్ అధికారికి భవన నిర్మాణ కా ర్మిక సంఘం నాయకులు ఎల్లారెడ్డిలో సోమవా రం వినతిపత్రం అందించారు. నకిలీ లేబర్ కార్డులు పొందిన వారి ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందకుండా నష్టపోతున్నారని వారు విన్నవించారు. నకిలీ కార్డులు ఉన్నవారిని తొలగించాలని కోరారు. సాయిబాబా, గగన్ తదితరులున్నారు. -
బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
డిచ్పల్లి: డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ఒడ్డెపల్లి రంజిత్ (29) బైక్పై అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ సోమవారం తెలిపారు. ఒడ్డెపల్లి రాజలింగంకు నలుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. కూతురుతోపాటు ఇద్దరు కొడుకులకు గతంలోనే పెళ్లిళ్లు జరిగాయి. మూడో వాడైన రంజిత్ 5 సంవత్సరాలుగా దుబాయ్కు వెళుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని వారం రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం బైక్పై బయటికి వెళ్లాడు. అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తూ గ్రామంలోని సీసీ రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో కుటుంబీకులు రంజిత్ను డిచ్పల్లిలోని ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజలింగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఒంటి చేత్తో నిర్మించిన నల్లూరి గుమిటి
మీకు తెలుసా? శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాక్షికంగా ముంపునకు గురైన నల్లూర్ గ్రామ శివారులోని నల్లూరి గుమిటి ఒంటో చేత్తో నిర్మించినదిగా ప్రసిద్ధి చెందినది.●● నల్లూర్ గుమిటి, న్యావనంది తూం, కస్పా(బినోలా) నంది, నీల కంఠేశ్వరా ఆలయాన్ని ఒకరే ఒంటి చేత్తో నిర్మించినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ● నల్లూర్ శివారులోని దర్గా నల్లూర్ గుమిటిగా ప్రసిద్ధి చెందినది. ● ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ నిర్మాణం ఈ ప్రాంతం నుంచే చేపట్టేవారని, కానీ గుమిటి ఉండటంతో నిర్మాణం నిలిపివేసినట్లు గ్రామస్తులు చెప్తున్నారు. ● ప్రస్తుతం లక్ష్మి కాలువ నీటి సరఫరా కోసం గుమిటికి ఎదురుగా ప్రాజెక్ట్లో లక్ష్మి ఎత్తిపోతల పథకం నిర్మించారు. ● నల్లూర్ గుమిటి వద్ద ప్రతి శుక్ర, సోమవారాల్లో భక్తులు అత్యధికంగా పూజలు నిర్వహిస్తారు. – బాల్కొండ -
సాగు పనుల్లో భోజన విరామం
భిక్కనూరు: మండలంలో వర్షకాల వ్యవసాయ సాగు పనుల జోరుగా కొనసాగుతున్నాయి. పనుల్లో మహిళ కూలీలు, రైతులు అధికంగా హాజరవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు కొనసాగుతుండటంతో వారు మధ్యాహ్న భోజనాన్ని సద్దులు కట్టుకొని, పని ప్రదేశాల్లోనే భోజనం చేస్తున్నారు. భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో మహిళ వ్యవసాయ కూలీలు వరి నాట్లు వేసి, మధ్యాహ్నం పొలం గట్టు పక్కన ఉన్న రోడ్డుపై కూర్చుండి భోజనం చేశారు. తోటివారితో ముచ్చట్లు పెట్టుకుంటూ పని అలసటను మర్చిపోయారు. ఈ చిత్రాన్ని ‘సాక్షి’ క్లిక్మనిపించింది. -
23 దేశాల కరెన్సీ.. 25 దేశాల స్టాంప్స్ సేకరణ
డిచ్పల్లి: అతడి వృత్తి పోలీసు.. ప్రవృత్తి వివిధ దేశాల నాణేలు.. కరెన్సీ, స్టాంపుల సేకరణ. ఈ సేకరణలో అతడి భార్య సహకారం ఎంతో ఉంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు ఏడో బెటాలియన్లో గుట్ట గంగాధర్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. గంగాధర్ భార్య త్రివేణి గణిత ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఇద్దరికీ స్టాంపులు, నాణేలు, కరెన్సీల సేకరణ అంటే ఇష్టం. ఈ దంపతుల కుటుంబ సభ్యులలో పలువురు విదేశాలకు వలస వెళ్లారు. వారి ద్వారా అక్కడి దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. అలాగే స్నేహితులు, తెలిసిన వారి ద్వారా వివిధ దేశాల స్టాంపులు, నాణేలు, కరెన్సీ సేకరించారు. ఇలా 2003 నుంచి 23 దేశాల నాణేలు, కరెన్సీతో పాటు 25 దేశాలకు చెందిన స్టాంపులు సేకరించారు. సేకరించిన నాణేలలో కాకతీయుల కాలంతో పాటు 1939 సంవత్సరం నిజాం కాలం నాటి నాణేలు, రూపాయలు ఉన్నాయి. వీరు సేకరించిన నాణేలు, కరెన్సీలలో భారతదేశం తో పాటు యూఎస్ఏ, యూకే, మలేషియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, జోర్డాన్, టర్కీ, ఇటలీ, పొలాండ్, ఫిలిఫ్సీన్స్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనే షియా, ఖతర్, బహ్రెయిన్, యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాలకు చెందినవి ఉన్నాయి. స్టాంపులలో ఇండియాతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, యూఎస్ఏ, యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్, టర్కీ, మాల్టా, సింగపూర్, ఈజిఫ్ట్, ఫిలిఫ్పిన్స్, ఇటలీ తదితర దేశాలవి ఉన్నాయి. వీటి సేకరణ కోసం గంగాధర్ దంపతులు చాలా మంది వ్యక్తులను కలిశారు. పోలీసు ఉద్యోగం రాకముందు గంగాధర్ కూడా ఉపాధ్యాయ వృత్తిపై ఇష్టంతో ప్రైవేట్ టీచర్గా పని చేశారు. అప్పుడే ఆయనకు ఈ సేకరణపై ఇష్టం ఏర్పడింది. గత చరిత్ర, పాలకుల వైభవాలకు గుర్తు అయిన కాకతీయ, నిజాం కాలం నాటి నాణేల సేకరణతో మొదలుపెట్టాడు. ప్రస్తుతం తమ ఇంటికి ట్యూషన్కు వచ్చే బాల, బాలికలకు వీటి గురించి వివరిస్తారు. కాకతీయులు, నిజాం కాలం నాటి నాణేలు బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ గుట్ట గంగాధర్ దంపతులు -
సన్నబియ్యంతో పాశం చేసుకున్నం సారూ...
భిక్కనూరు: ‘కంట్రోలు షాపుల నుంచి ఇచ్చిన సన్నబియ్యం పుణ్యాన మొన్న జరిగిన ఏకాశి పండుగకు పాశం చేసుకున్నాం సారూ’.. అంటూ భిక్కనూరు మండలం భాగిర్తిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో అన్నారు. మండలంలోని భాగిర్తిపల్లిలో ఆదివారం జరిగిన ముత్యాలమ్మ పండుగకు షబ్బీర్ అలీ హాజరై, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షబ్బీర్అలీ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళల వద్దకు వెళ్లి సీఎం రేవంత్రెడ్డి సర్కారు అమలు చేస్తున్న పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఉచిత బస్సు, తమ ఇళ్లకు ఉచిత కరంట్, రైతు భరోసా రుణమాఫీ అందాయని పలువురు మహిళలు షబ్బీర్ అలీకి వివరించారు. అలాగే పెద్దోళ్ల పోచవ్వ అనే మహిళ మాట్లాడుతూ.. సన్న బియ్యం వల్ల ఎంతో మేలు కలుగిందని అన్నారు. గతంలో ఇంటికి చుట్టపోళ్లు వస్తే దుకాండ్లకు వెళ్లి సన్న బియ్యం కొనుక్కొని వచ్చి అన్నం వండే వారమని, ఇప్పుడు సన్నబియ్యం కోసం దుకాండ్లకు వెళ్తలేమని షబ్బీర్తో అన్నారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
మాచారెడ్డి : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్ ప్రజ లకు సూచించారు. ఆదివారం పాల్వంచ మండలం భవానీపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కిసాన్నగర్ను సందర్శించారు. గ్రామంలో డెంగీ విజృంభించి 20 మందికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డీఎంహెచ్వో గ్రామాన్ని సందర్శించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. డెంగీ బాధితులు ఆందోళనకు గురికావొద్దన్నారు. ఆయన వెంట మాచారెడ్డి వైద్యాధికారి ఆద ర్శ్, సిబ్బంది ఉన్నారు. నాగారంలో చిరుత సంచారం నిజామాబాద్ సిటీ: నగరంలోని నాగారం శివారులో ఆదివారం చిరుత సంచరించింది. సాయంత్రం 6 గంటల సమయంలో డంపింగ్ యార్డు సమీపంలోని 300 క్వార్టర్స్ కాలనీ వాటర్ ట్యాంక్ వద్ద చిరుతపులిని స్థానికులు గమనించారు. కొందరు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. కాలనీ సమీపంలోకి చిరుత రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేసినా వారు స్పందించడం లేదని తెలిపారు. నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలి ఖలీల్వాడి: ప్రజలకు న్యాయం అందించడంలో కోర్టు డ్యూటీలో ఉండే పోలీసు సిబ్బంది పాత్ర కీలకమని సీపీ సాయి చైతన్య అన్నా రు. కోర్టు సమయానికి హాజరై సాక్షులను సురక్షితంగా హాజరుపర్చి నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. నగరంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో కోర్టు డ్యూటీ కానిస్టేబుళ్లతో ఆదివారం సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. నైతిక విలువలు పోలీసుల క్రమశిక్షణను ప్రతిబింబిస్తాయన్నారు. నిజాయితీ, నిబద్ధతతో సేవలందించాలన్నారు. ప్రధాన కేసులలో ఎస్సై, సీఐ, ఏసీపీలతో బ్రీఫింగ్ చేయించాలన్నారు. సమన్లు, వారెంట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వాలని, కోర్టులో చార్జ్షీట్ వేసే ముందు అన్ని పత్రాలు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వా రెడ్డి, కోర్ట్ లైజన్ ఆఫీసర్ శ్యామ్ కుమార్, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
కదిలొచ్చిన అమ్మ
నిజామాబాద్ రూరల్: గ్రామ దేవతలు కదిలొచ్చిన వేళ ఇందూరు నగరం పులకించింది. తమ తమ ప్రాంతాలను సల్లంగా కాపాడాలని కోరుతూ నగ ర వాసులు అమ్మవార్లను గద్దెలపై ప్రతిష్టించారు. స ర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను న గరంలో ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఖి ల్లా రామాలయం వద్దనున్న శారదాంబ గద్దె నుంచి అమ్మవార్లు బయలెల్లగా.. ముందు వరుసలో ‘సరి’ గుల్ల ముందుకుసాగింది. కదిలొస్తున్న అమ్మవార్ల ను చూస్తూ తన్మయత్వంతో నగరవాసులు ‘పులోరి యా’ అంటూ నినాదాలను హోరెత్తించారు. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, తొట్లెల ఊరే గింపు, శివసత్తుల పూనకాలతో నగరవీధులు హోరెత్తాయి. శారదాంబ గద్దె నుంచి రాట్నం, చక్రం, పెద్దమ్మ, పౌడాలమ్మ, మహాలక్ష్మమ్మ, ఐదు చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, కొండల రాయుడు, భోగస్వామి, సమ్మక్క, సారక్కలు తరలిరాగా.. పెద్దబజార్, ఆర్యసమాజ్, జెండాగల్లి, వినాయక్నగర్, మహాలక్ష్మినగర్, దుబ్బ ప్రాంతాల వైపు శోభాయాత్ర కొనసాగింది. ఊరపండుగలో ప్ర త్యేకమైన సరి(పదార్థం)ని భక్తులు ఇళ్లపై చల్లుకున్నారు. భక్తులు దారి పొడవునా యాటలను బలి స్తూ మొక్కులు చెల్లించుకున్నారు. సకాలంలో వర్షా లు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామదేవతలను పూజించారు. ఊరపండుగను పు రస్కరించుకొని ఇందూరు నగరమంతా జనసంద్రంగా మారింది. శారదాంబ గద్దె వద్ద అర్బన్ ఎ మ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ బ ల్మూరి వెంకట్, సర్వసమాజ్ కమిటీ అధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి బట్టు రాజేశ్వర్, కో కన్వీనర్ ఆదె ప్రవీణ్, నుడా చైర్మన్ కేశ వేణు, పీసీసీ డెలిగేట్ బాడ్సి శేఖర్గౌడ్, ఆయా పార్టీ ల నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రా మదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఇందూరులో ఘనంగా ఊరపండుగ హోరెత్తిన ‘పులోరియా’ నినాదాలు -
అమ్మకు బోనం.. ఆషాఢ వైభవం
కామారెడ్డిటౌన్/దోమకొండ/లింగంపేట: జిల్లా లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలను సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దోమకొండలో ని చాముండేశ్వరి ఆలయంలో మహంకాళి బోనా ల పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం గటం ఊరేగింపు, భవిష్యవాణి నిర్వహించారు. మధ్యాహ్నం బోనాల ఊరేగింపు ప్రారంభమైంది. సుమారు 4 వేల బోనాలను అమ్మవారికి సమర్పించారని ఆలయ ప్రధాన అర్చకులు భావి శరత్చంద్ర శర్మ తెలిపారు. ప్రతి ఇంటినుంచి డప్పుచప్పుళ్లతో బోనాలను ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. దోమకొండ ఎస్సై స్రవంతి, భిక్కనూరు ఎస్సై అంజనేయులు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సిద్దారెడ్డి, ప్రతినిధులు ఉత్సవాలలో పాల్గొన్నారు. దోమకొండలోని మహంకాళి ఆలయం లోపల బోనాలతో మహిళల ప్రదక్షిణ -
చేపల కౌలు చెల్లింపులో జిల్లా టాప్
నిజాంసాగర్:మత్స్యకార్మికులకు జీవనోపాధి కల్పి స్తున్న చేపల చెరువులు, రిజర్వాయర్లు, ప్రధాన జలాశయాల్లో చేపల పెంపకానికి సంబంఽధించిన కౌలు చెల్లింపులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ప్రఽథ మ స్థానంలో నిలిచింది. 2024–25 సంవత్సరంలో 765 చెరువులకుగాను రూ. 13.86 లక్షల కౌలు చెల్లించడం ద్వారా జిల్లా టాప్లో ఉంది. జిల్లాలో 765 చెరువుల్లో చేపల పెంపకం ద్వారా మత్స్యకార్మికులు జీవనోపాఽధి పొందుతున్నారు. ప్రభుత్వం చేప పిల్లలను వందశాతం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. అయితే చెరువుల్లో చేప పిల్లల పెంపకం, చేపల వేటకు సంబంధించి మత్స్యకారులు సర్కారుకు కౌలును చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి 765 చెరువులకుగాను రూ. 13.86 లక్షలు చెల్లించారు. 835 మందికి కొత్త లైసెన్స్లు.. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్తో పాటు ఆయా చెరువుల పరిధిలో 1,600 మంది మత్స్యకారులు కొత్తగా లైసెన్స్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు 835 మందికి లైసెన్స్లు జారీ చేశారు. మత్స్యకార్మికులకు కొత్తగా లైసెన్స్లు ఇవ్వడంతో ప్రభుత్వానికి రూ. 1.71 లక్షల ఆదాయం సమకూరింది. 13,006 మందికి ఉపాధి.. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టు, 765 చెరువుల పరిధిలో 13,006 మంది మత్స్య కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. చెరువు లు, ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో చేపల పెంపకం ద్వారా చేపల వేటతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. 765 చెరువులకుగాను రూ. 13.86 లక్షలు.. రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిన కామారెడ్డిమత్స్యకార్మికుల సహకారంతోనే సాధ్యం జిల్లాలోని మత్స్యకార్మిక సంఘాలు, మత్స్యకార్మికు ల సహకారంతో ఈ ఏడాది వందశాతం కౌలు వసూలయ్యింది. ప్రభుత్వానికి రూ. 13.86 లక్షల కౌలు చెల్లించడం ద్వారా జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. కౌలాస్ ప్రాజెక్టులో చేపల వేటకు సంబంధించి టెండర్ ప్రక్రియ చేపట్టడంతో రూ. 4.45 లక్షలు ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చింది. – శ్రీపతి, ఎఫ్డీవో, కామారెడ్డి -
బోనం ఎత్తిన పోచారం
రుద్రూర్: మండల కేంద్రంలో బోనాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి బోనం ఎత్తుకుని ఊరేగింపు ప్రారంభించారు. కుల సంఘాల ఆధ్వర్యంలో మహిళలు బోనాలను ఊరేగించి గ్రామ దేవతలకు సమర్పించారు.రెండో టౌన్ ఎస్సైగా ముజాహిద్ఖలీల్వాడి: నగరంలో రెండో టౌన్ ఎస్సైగా సయ్యద్ ముజాహిద్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా మావల పీఎస్ నుంచి జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పై మాట్లాడుతూ.. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదివరకు పనిచేసిన ఎస్సై ఇమ్రాన్ బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. జిల్లాలో పౌర సన్మానం పొందిన ‘కోట’నిజామాబాద్ రూరల్: విలక్షణ నటుడిగా పేరు పొందిన కోట శ్రీనివాస్కు ఇందూరు నగరంతో అనుబంధం ఉందని ప్రముఖ నాటక ప్రయోక్త శ్రీపాద కుమార శర్మ అన్నారు. అనారోగ్యంతో కోట శ్రీనివాస్ ఆదివారం మృతి చెందారని, ఆయన మృతి సినీరంగానికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. 2012లో ఇందూరులో శ్రీపాద నాటక కళా పరిషత్ నాటక పోటీలు జరిగాయని వీటికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కోట శ్రీనివాస్రావును పౌర సన్మానం చేసినట్లు తెలిపారు. చిత్రపరిశ్రమ గొప్ప కళాకారుడిని కోల్పోయిందన్నారు విచారం వ్యక్తం చేశారు. చంద్రశేఖర శర్మ, వీపీ చందన్ రావు, సంస్కార భారతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, సముద్రాల మధుసూదన చారి, తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామిడి సతీశ్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ ప్రేమ్లాల్ ఆయన మృతికి సంతాపం తెలిపారు. బోధన్వాసికి స్వర్ణ కంకణ పురస్కారంబోధన్టౌన్: జ్యోతిష్య శాస్త్రంలో విశేష కృషి చేస్తున్న బోధన వాస్తవ్యుడైన యోగిరాజ్ వైద్యకు స్వర్ణ కంకణ పురస్కారం లభించింది. ఆదివారం వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలుగు సంస్కృతి, సాహితి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానసభలో తెలుగు సాహితి బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు యోగిరాజ్కు స్వర్ణ కంకణ పురస్కారం అందించారు. కార్యక్రమంలో వివిధ రంగాల్లోని ప్రముఖులు పాల్గొన్నారు. -
విద్యార్థినులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలి
ఎల్లారెడ్డి: విద్యార్థినులు బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని వంట గదులు, తరగతి గదులు, సామగ్రిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థినులు తమ సమస్యలను తెలియజేయాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. అలాగే కేజీబీవీలో రూ.3.5 కోట్ల నిధులతో చేపట్టిన నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం మినీ ట్యాంక్బండ్ పనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని సిబ్బందికి సూచించారు. ఏఎంసీ చైర్పర్సన్ రజిత, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్లు శ్రీకాంత్, సత్యనారాయణ, నాయకులు సాయిబాబా, వినోద్గౌడ్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, సామెల్, విద్యాసాగర్, అరుణ, వాసవి, వెంకటేశం, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ ప్రమీల, స్పెషల్ ఆఫీసర్ వీణ తదితరులు ఉన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి: ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మురళి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన బీర్ల సిద్ధయ్య(44) కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్లగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పేకాట స్థావరంపై దాడిఎల్లారెడ్డి: మండలంలోని రుద్రారం గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై మహేశ్ ఆదివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రుద్రారం శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.4500 నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతమోపాల్: మండలంలోని కాస్బాగ్ తండాకు చెందిన బాదావత్ పీర్సింగ్ అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై సుస్మిత ఆదివారం తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామన్నారు. ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కంటెయినర్
డిచ్పల్లి: ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటెయినర్ ఢీకొన్న ఘటనలో ఓ డ్రైవర్ మృతి చెందగా మరో డ్రైవర్ స్వల్పగాయాల పాలైయ్యాడు. డిచ్పల్లి మండల కేంద్రంలోని నాగ్పూర్ గేట్ వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డిచ్పల్లి ఎస్సై మహ్మద్ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరు నుంచి మోటారు బైక్ల లోడ్తో మధ్యప్రదేశ్కు కంటెయినర్ వెళ్తోంది. డిచ్పల్లి నాగ్పూర్ గేటు వంతెన మూలమలుపు వద్ద మోటారు బైక్ల లోడ్తో ఉన్న పెద్ద ట్రక్కు క్యాబిన్ ఎడమ వైపు అద్దం పగిలిపోవడంతో డ్రైవర్ రోడ్డుపక్కన నిలిపి ఉంచారు. అదే సమయంలో బెంగుళూరు నుంచి మధ్యప్రదేశ్కు వెళ్తున్న కంటెయినర్ డ్రైవర్ నిద్రమత్తులో నిలిపి ఉన్న ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కంటెయినర్ అదుపుతప్పి డివైడర్ పై నుంచి అవతలి పక్కకు దూసుకెళ్లి పక్కనున్న బారికేడ్ను ఢీకొని నిలిచిపోయింది. కంటెయినర్లో ఇద్దరు డ్రైవర్లు ఉండగా ఆ సమయంలో ఓంప్రకాష్ నడుపుతున్నాడు. ప్రమాదం జరిగినప్పుడు క్యాబిన్ ఎడమవైపు డోర్ ధ్వంసం కావడంతో అటువైపు కూర్చున్న మరో డ్రైవర్ దేవేంద్రసింగ్(45) అందులోంచి కిందపడగా కంటెయినర్ టైర్లు అతడిపై నుంచి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందాడు. ఓంప్రకాశ్, దేవేంద్రసింగ్ ఇద్దరు అన్నదమ్ములు.. రాజస్తాన్ రాష్ట్రంలోని భరత్పూర్ జిల్లాకు చెందిన వారు. ఓంప్రకాశ్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన సమయంలో ఆర్మూర్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రోడ్డుపై వాహనాలు రాకపోవడంతో మరో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. లేదంటే డివైడర్ పై నుంచి అటువైపు దూసుకెళ్లిన కంటెయినర్ కు ఢీకొని మరో ప్రమాదం జరిగి ఉండేది. సమాచారం అందుకున్న ఎస్సై షరీఫ్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దేవేంద్రసింగ్ మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. గాయపడిన డ్రైవర్ ఓంప్రకాశ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆగి ఉన్న ట్రక్కులోని వారికి ఏమీ కాలేదు. ట్రక్కు వెనకభాగంలో కంటెయినర్ ఢీకొట్టడంతో అందులో ఉన్న కొన్ని మోటారు బైకులు దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరు మృతి.. మరొకరికి గాయాలు -
విద్యుదాఘాతంతో రైతు మృతి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో పోకల హన్మాండ్లు(45) అనే రైతు శనివారం మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలి పా రు. హన్మాండ్లు కౌలు చేస్తున్న పొలంలోని బోరుమో టారు స్టార్టర్లో సమస్య రావడంతో మరమ్మతులకు య త్నించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య శకుంతల ఫిర్యాదు మేరకు ఏఎస్సై నర్సయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు సివిల్ ఇంజినీర్ మృతి ● మృతుడు బాపట్ల వాసి నవీపేట: మండలంలోని కోస్లీ గ్రామ సమీపంలోని చెరువులో పడి ప్రైవేట్ సివిల్ ఇంజినీర్ గుత్తి ఉమా గణేశ్(30) మృతి చెందినట్లు ఎస్సై వినయ్ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు .. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం వేటపాలెం మండల కేంద్రానికి చెందిన ఉమా గణేశ్ భైంసా నుంచి బోధన్ వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులలో సివిల్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అనూష ప్రాజెక్ట్లో కొన్నేళ్లుగా విధులు నిర్వహిస్తున్న గణేశ్, నిర్మల్ జిల్లా బాసరలోని కార్యాలయంలో ఉంటూ విధులకు వెళ్లేవాడు. కోస్లీ శివారులో మొరం తవ్వకాలు జరగడంతో పర్యవేక్షణకు శుక్రవారం సాయంత్రం బైక్పై వెళ్లి తిరిగి రాలేదు. శనివారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు. మృతుని తండ్రి మల్లేశ్వర్రావ్కు సమాచారం అందించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీ.. వృద్ధుడికి తీవ్రగాయాలు డిచ్పల్లి: రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలైన ఘటన డిచ్పల్లి మండల కేంద్రంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ రెండో డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు (టీజీ 16టీ 2419) డిచ్పల్లి బస్టాండ్లో ప్రయాణిలను ఎక్కించుకొని నిజామాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపైకి వస్తుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న డిచ్పల్లి ఖిల్లా గ్రామానికి చెందిన మాల గొల్ల కృష్ణయ్యను ఢీకొట్టింది. బస్సు ముందు టైరు కిందపడిన కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరిశీలించిన వైద్యులు పాదం వరకు కాలును తొలగించాల్సిన అవసరం ఉందని, హైదరాబాద్లోని నిమ్స్కు తీసుకెళ్లాలని సూచించినట్లు కృష్ణయ్య కుటుంబీకులు తెలిపారు. డ్రైవర్ అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయమై డిచ్పల్లి ఎస్సైను సంప్రదించగా ప్రమాదం జరిగిన మాట వాస్తవమేనని, ఇంకా ఫిర్యాదు అందలేదన్నారు. -
కూరగాయల సాగుతో నిత్య ఆదాయం
ఎల్లారెడ్డిరూరల్: వ్యవసాయంతో పాటు కూరగాయలను సాగు చేస్తు నిత్యం ఆదాయం పొందుతున్నాడు గిరిజన రైతు పాండు. అర ఎకరం పొలంలో బెండ, వంకాయ, బీరకాయ, పాలకూర, కొత్తిమీర పంటలను సాగు చేస్తు లాభాలను అర్జిస్తూ, ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. సాగుతోపాటు మారెట్లో విక్రయం.. ఎల్లారెడ్డి మండలంలోని జిత్యాతండాకు చెందిన పాండు తనకున్న రెండెకరాల పొలంలో అర ఎకరం కేవలం కూరగాయల సాగుకు మాత్రమే కేటాయించాడు. ఏడాది మొత్తం వివిధ రకాలైన కూరగా యలు, ఆకు కూరలు పంటలను సాగు చేస్తున్నాడు. తక్కువ మోతాదులో ఎరువులను వాడుతూ పంటలను సాగు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉద యం నుంచి మధ్యాహ్నం వరకు కూరగాయలను తెంపడం, కలపు తొలగించడం పనులు పూర్తయిన అనంతరం మార్కెట్కు వెళ్లి, కూరగాయలను విక్ర యిస్తున్నారు. దళారులకు విక్రయించకుండా వారే విక్రయించడంతో అధిక లాభాలను అర్జిస్తున్నారు. అర ఎకరంలో అతడు భార్యతోపాటు కూరగాయల సాగు చేస్తూ ఏటా రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయల ఆదాయాన్ని అర్జిస్తున్నారు. అర ఎకరంలో పలు రకాలను పండిస్తూ లాభాలను ఆర్జిస్తున్న గిరిజన రైతు పాండుకూరగాయల సాగుకే ప్రాధాన్యత ఇస్తా.. వ్యవసాయం కంటే కూరగాయల సాగు అంటేనే నాకు చాలా ఇష్టం. దీంతో నిత్యం పొలంలోకి వెళ్లి కూరగాయలను తెంపడం, వాటికి నీరు అందించడం లాంటి పనులను నా భార్యతో కలిసి చేస్తాం. కూరగాయలను కోసిన అనంతరం సాయంత్రం మార్కెట్కు వెళ్లి విక్రయిస్తాం. – పాండు, రైతు, జిత్యాతండా -
కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
రుద్రూర్ : ఆరుబయట ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసి గాయపర్చిన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉ న్నాయి. మహతాజ్ అనే చిన్నారి ఆరు బయట ఆడుకుంటుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. గాయ పడిన మహతాజ్ను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చోరీ కేసులో ఒకరి అరెస్టు భిక్కనూరు: చోరీ కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు శనివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన దుబ్బాక సుజాత ఇంట్లో బంగారు కమ్మలు, రెండు జతల పట్టగొలుసులు, కర్నాల నర్సవ్వ ఇంట్లో నుంచి ఒక జత వెండి పట్టగొలుసులను శుక్రవారం దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి చోరీకి పాల్పడిన కర్నాల రేణుకను అరెస్టు చేశారు. నిందితురాలి వద్ద బంగారు కమ్మలు, వెండి పట్టగొలుసులు స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. పేకాడుతున్న 8 మంది అరెస్టు తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని శనివారం అరెస్టు చేసినట్లు ఎస్ఐ మురళి తెలిపారు. పేకాట ఆడుతున్న వారి నుంచి రూ. 6450 నగదు, 8 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. గ్రామాలలో పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. పెద్దపులి జాడ కోసం గాలింపు సిరికొండ: పెద్దపులి జాడ కోసం అటవీశాఖ అధికారు లు గాలింపు ముమ్మరం చే శారు. పాదముద్రలు లభ్యమైన చెరువుల పైభాగాన గల జినిగ్యాల అటవీ ప్రాంతంలో యానిమల్ ట్రాకర్స్ బృందం సభ్యులు, సిరికొండ రేంజ్ సిబ్బంది శనివారం గాలించినట్లు ఎఫ్ఆర్వో రవీందర్ తెలిపారు. మరెక్కడా పెద్దపులి అడుగులు కనిపించలేదని పేర్కొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న చీమన్పల్లి, పందిమడుగు, తెల్లపలుగు తండా, జినిగ్యాల తండాలలో అధికారులు అవగాహన కల్పించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీఆర్వో గంగారం, పందిమడుగు సెక్షన్ అధికారి సాయికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. -
జన జీవనానికి పాట ప్రాణం లాంటిది
కామారెడ్డి అర్బన్: తెలంగాణ జన జీవనానికి పాట ప్రాణంలాంటిదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని కర్షక్ బీఎడ్ కళాశాలలో యువ కళాకారులను ప్రోత్సహించడానికి ప్రజాయుద్దనౌక గద్దర్ యాది లో ‘పాటకు సలామ్’ పాటల వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రకాంత్రెడ్డి మాట్లాడుతూ.. పాటకు సలామ్తో యువ గాయకులు వెలుగులోకి వస్తారన్నారు. వర్క్షాప్ కళాకారుల అభివృద్ధికి దోహదం చేస్తుందని తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ అన్నారు. సంగీత దర్శకుడు అష్ట గంగాధర్, గజల్ కవి సురారం శంకర్, అల్లి మోహన్రాజ్, ఎంఏ రషీద్, శ్యాంకుమార్, మౌర్య, జీవన్కుమార్, నాగభూషణం, కాశ నర్సయ్య, కమలకాంత్, రెడ్డి రాజయ్య, కాసర్ల రా మచంద్రం, గంగాప్రసాద్, సంధ్య, సావిత్రి, రస్మి త, అక్షిత, సుజిత పాల్గొన్నారు. పాల్గొన యువ గా యనీగాయకులకు ధ్రువపత్రాలతో పాటు జ్ఞాపిక లు, బహుమతులు అందజేశారు. -
పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలి
గాంధారి(ఎల్లారెడ్డి): పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, పోలీస్టేషన్కు వచ్చిన వారితో స్నేహపూర్వంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. గాంధారి పోలీస్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా మొదట ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది నుంచి పోలీసు వందనం స్వీకరించారు. అనంతరం రికార్డులను పరిశీలించి ఎస్సైకి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సదాశివనగర్ సీఐ సంతోష్కుమార్, సిబ్బంది ఉన్నారు. సీసీ కెమెరాలు ప్రారంభం గాంధారి మండల పరిధిలోని మొండిసడక్ వద్ద ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు సీసీ కెమెరాలను ప్రారంభించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మొండిసడక్ వ్యాపారుల స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సూచించారన్నారు. -
ఆర్మూర్లో అంతర్భాగమైన రాజస్థానీలు
మీకు తెలుసా? మైలు రాళ్లకు రంగులు వేటికి గుర్తులో తెలుసా?సమాచారం..ఆర్మూర్ పట్టణంలో అత్యధిక జనాభా గల ఖత్రి (క్షత్రియ సమాజ్) కులస్తుల ప్రస్థానం ఆసక్తికరంగా ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల సరిహద్దుల్లో గల మండవ్ఘడ్ ఖత్రిల పుట్టినిల్లు. ● పట్టు చేనేత వస్త్రాలను నేస్తూ గుజరాత్, రాజస్థాన్లలో సరఫరా చేసేవారు. అప్పట్లో పట్టు వస్త్రాలకు ఉన్న డిమాండ్ మేరకు ఖత్రిలు ఉపాధి కోసం 500 సంవత్సరాల క్రితం ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలకు వెళ్లారు. ● ఖత్రిలు మాట్లాడే భాషకు లిపి లేదు. ● పట్టు వస్త్రాల నేత పనే జీవనాధారంగా కొనసాగించిన ఖత్రి కులస్తులకు ఉపాధి కరువవడంతో ఇతర వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ● 64 వేల ఆర్మూర్ పట్టణ జనాభాలో 16 వేలకు పైచిలుకు ఖత్రి కులస్థులు ఉన్నారు. ● ఓటర్లు సైతం 10 వేలకు పైగా ఉండటంతో పరిపాలన, రాజకీయ రంగాల్లో సైతం వారికి ప్రత్యేక స్థానం ఉంది. పట్టు నేత ప్రధాన కులవృత్తిగా ఉన్న ఈ ఖత్రి కులస్థులను క్షత్రియులుగా కూడా సంబోధిస్తారు. ● పట్టు నేయడంతో పట్కరీలు అనే మరో పేరు సైతం వీరికి వచ్చింది. ● వీరు శివుడి భక్తుడైన సహస్త్రార్జునుని పూ జిస్తారు. ఆయన వంశీకులుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించారు. – ఆర్మూర్ ఖలీల్వాడి : మనం ప్రయాణించే సమయంలో రోడ్డు పక్కన మైలు రాళ్లు కనిపిస్తుంటాయి. అన్నింటికీ ఒకే రంగు కాకుండా వివిధ రకాల రంగులను చూస్తాం. రోడ్లను బాధ్యతలు చూసే శాఖలను ఈ రంగులు సూచిస్తాయి. పసుపు, తెలుపు రంగులో ఉంటే జాతీయ రహదారి(ఎన్హెచ్), ఆకుపచ్చ, తెలుపు వర్ణంలో ఉంటే స్టేట్ (రాష్ట్ర) రహదారి, నలుపు, తెలుపులో ఉంటే నగర, జిల్లా రహదారి, కాషాయం, తెలుపు రంగు ఉంటే గ్రామీణ రోడ్లుగా గుర్తించాలి. రెండు గ్రామాలను కలుపుతూ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా వేసే రోడ్లకు కూడా కాషాయం, తెలుపు రంగు వేస్తారు. -
వర్షంలో డ్రైవింగ్ జాగ్రత్త!
ఖలీల్వాడి: వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా అవుతుంటాయి. వర్షంకు వాహనాలపై వెళ్లేటప్పుడు స్కిడ్ అయి పడిపోయి మృతి చెందిన ఘటనలు జిల్లాలో ఉన్నాయి. బస్సులు, కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లేటప్పుడు వాహనాదారులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించడానికి అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో వర్షం కురిసే సమయంలో అతివేగంగా వెళ్లడంతో జిల్లాలో ప్రతియేటా పదుల సంఖ్యలో వాహనదారులు మృతి చెందుతున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదాల్లో భారీ వాహనాలు, కార్లు, ద్విచక్రవాహనాలపై వెళ్లే వారు ప్రమాదాలకు గురై, మృతి చెందుతున్నారు. ఎక్కువగా ద్విచక్ర వాహనాదారులే వర్షాకాలంలో ప్రమాదాలకు గురై, మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. వర్షంలో తొందరగా గమ్యస్థానాలకు వెళ్లడానికి స్పీడ్గా వెళ్లిన ద్విచక్ర వాహనదారులు వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు రోడ్డుపై గాని బురదలో గాని బండ్లు స్కిడ్ కావడంతో పడిపోయి ప్రమాదానికి గురవుతున్నారు. రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచిఉండగా అందులోనుంచి వెళ్లకపోవడమే మంచిది. ప్రయాణంలో ఇవి పాటించాలి.. జిల్లాలో ఏటా వర్షాకాలంలో 10 నుంచి 15 మంది మృత్యువాత వాహనాల వేగం తగ్గిస్తేనే ప్రమాదాల నివారణ దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాహనానికి కావాల్సిన పెట్రోల్ ఎంత అవసరం అవుతుందో అంతమేర ముందుగానే పోసుకోవాలి. దీనితోపాటు టైర్లలో గాలిని చెక్ చేసుకోవాలి. వాహనంను బట్టి 30 నుంచి 35 పీఎస్సై వరకు గాలి చూసుకోవాలి. ప్రతి వాహనం 150 నుంచి 200 కిలోమీటర్ల వెళ్లిన తర్వాత వాహనాలను 5 నిమిషాలపాటు ఆపాల్సి ఉంటుంది. దీంతో డ్రైవర్లు కొంత సేదతీరుతుంటారు. వర్షంలో వాహనంతో స్పీడ్గా వెళ్తే ప్రమాదాలు జరుగుతాయి. వర్షాలకు వాహనాలు స్కిడ్ కావడంతోపాటు డ్రైవర్ చేతిలో నుంచి కంట్రోల్ తప్పుతాయి. వర్షకాలంలో ఆర్టీసీ బస్సులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. అలాగే కార్లు, ఇతర వాహనాలు 80 కిలో మీటర్ల కంటే ఎక్కువగా వెళ్లరాదు. ద్విచక్రవాహనదారులు 40 కిలోమీటర్ల వేగం కంటే ఎక్కువగా వెళ్లరాదు. నాలుగు టైర్ల వాహనాదారులు ముందు ఉండే గ్లాస్తోపాటు వైపర్లు మంచిగా ఉంచుకునేలా చూడాలి. వాహనాల అద్దాలు బాగుంటేనే వర్షంలో వెళ్లేటప్పుడు ముందు కనిపించే వాహనాలు, రోడ్డు చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే వాహనం వెనుక, పక్కన వచ్చే వాహనాలను చూడటానికి సైడ్ మిర్రర్స్ బాగుండాలి. దీంతోపాటు డ్రైవర్ తోపాటు అందులో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. నాలుగు టైర్ల వాహనాలకు తప్పనిసరిగా వీల్ అలైట్మెంట్, బ్యాలెన్సింగ్ అనేది చూసుకోవాలి. ఇంజిన్ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఆయిల్ ఎప్పటికప్పడు పరిశీలించుకోవాలి.స్పీడ్గా నడపొద్దు.. వర్షాకాలంలో వాహనాదారులు స్పీడ్గా వెళ్లవద్దు. వర్షం పడినప్పుడు రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ జాగ్రత్త వహించాలి. వాహనాలపై వెళ్లేవారు తమ వాహనాల కండిషన్ను చూసుకోవాలి. కార్లు, ఇతర వాహనాదారులు సీట్బెల్ట్తోతోపాటు బ్రేక్లు, వైపర్లు, ముందు గ్లాస్, సైడ్ మిర్రర్లు, లైట్లు మంచిగా ఉంచుకోవాలి. – ప్రసాద్, ట్రాఫిక్ సీఐ, నిజామాబాద్ -
అటవీ ప్రాంతంలో చెట్ల నరికివేత
ఎల్లారెడ్డి: మండలంలోని రత్నాపూర్ అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు అక్రమంగా చెట్లను నరికి వేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీప్రాంతంలో తరచు చెట్లను నరికి వేయడంతో ఇటీవల అటవీశాఖ అధికారులు వచ్చి, పరిశీలించారని, కానీ చెట్లు నరికిన వారిని గుర్తించ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి అటవీ ప్రాంతంలో చెట్లు నరకకుండా నిఘా పెంచాలని వారు కోరుతున్నారు. మైనర్లు వాహనాలు నడపొద్దు లింగంపేట(ఎల్లారెడ్డి): మైనర్లు వాహనాలను నడపడానికి ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై దీపక్కుమార్ అన్నారు. మండలంలోని లింగంపల్లి చౌరస్తా వద్ద శనివారం ఎస్సై దీపక్కుమార్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా పెండింగ్లో ఉన్న చలాన్లు వసూలు చేసినట్లు తెలిపారు. అలాగే ఒక డ్రంకెన్డ్రైవ్ కేసు నమో దు చేసినట్లు తెలిపారు. ఏఎస్సై మధుసూదన్ కానిస్టేబుల్ రాజు, మురళి, జయ్, లక్ష్మన్, రవి, మదన్లాల్ పాల్గొన్నారు. వామ్మో..146 చక్రాల లారీ మద్నూర్(జుక్కల్): మండల కేంద్రం మీదుగా జాతీయ రహదారిపై శనివారం రెండు భారీ వాహనాలు వెళ్లడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సాధారణంగా లారీకి 12, 14, 16 చక్రా లు ఉండడం చూశాం. కానీ హైదారాబాద్ నుంచి మద్నూర్ మీదుగా మహరాష్ట్రలోని నాందేడ్ పట్టణానికి భారీ ఎలక్ట్రానిక్ మిషన్ లోడ్తో వె ళ్తున్న లారీకి 146 చక్రాలున్నాయి. పది రోజుల క్రితం బయలుదేరామని మరో వారం రోజుల్లో నాందేడ్కు చేరుకుంటామని డ్రైవర్లు తెలిపారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించండి మాచారెడ్డి: ఫరిద్పేట సబ్స్టేషన్ పరిధిలో వి ద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం పాల్వంచ మండల పరిధిలోని ఫరిద్పేట సబ్ స్టేషన్ను రైతులు ముట్టడించారు. అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ.. నాలుగు రో జులుగా విద్యుత్ సమస్యలతో సతమతమవు తున్నా తమను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వరి నాట్లు వేసే సమయంలో విద్యుత్ కోతలను విధించడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. ట్రాన్స్కో ఏఈ జ్యోతి రైతులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. తదుపరి సబ్స్టేషన్ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు. -
ఒడ్డేపల్లి బీపీఎం సస్పెన్షన్
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి బీపీఎం నిఖితను జిల్లా తపాలా అధికారులు సస్పెండ్ చేశారు. పొదుపు డబ్బులు స్వాహా అంటూ శుక్రవారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనానికి జిల్లా పోస్టాఫీస్ అధికారులు స్పందించారు. ఈమేరకు శనివారం ఒడ్డేపల్లి గ్రామంలోని పోస్టాఫీస్లె జిల్లా పోస్టాఫీస్ ఇన్స్పెక్టర్ సుజిత్, మానిటరింగ్ అధికారి వెంకట్రాంరెడ్డి విచారణ చేపట్టారు. ఖాతాదారులను కార్యాలయానికి పిలిపించి విచారణ చేపట్టారు. పొదుపు డబ్బులతో పాటు కొన్ని లావాదేవీలకు సంబందించిన డబ్బులు జమచేయడంలో తేడాలు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది. రెండు, మూడు రోజుల పాటు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా పోస్టాఫీస్ ఇన్స్పెక్టర్ సుజిత్ తెలిపారు. ఇన్చార్జీ బీపీఎం శశికాంత్ తదితరులు ఉన్నారు. -
చదువులు సాగేదెలా?
నస్రుల్లాబాద్: దుర్కిలోని సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల/పాఠశాలలో టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రధానంగా సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో బోధన ముందుకు సాగడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పాఠశాలలో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ప్రథమ, ద్వితీయ సంవత్సరం తరగతులు నిర్వహిస్తున్నారు. గతేడాది వరకు 5, 6, 7 తరగతులు ఉండగా.. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 8వ తరగతికి అప్గ్రేడ్ అయ్యింది. మొత్తం 440 సీట్లు ఉండగా ప్రస్తుతం 348 మంది అడ్మిషన్లు పొందారు. ఇందులో ఇంటర్లో 55 మంది విద్యార్థినులున్నారు. మిగిలినవారు పాఠశాల విద్యార్థులు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు బోధించడానికి 20 మంది టీచర్లు అవసరం. అయితే ప్రస్తుతం 11 మంది మాత్రమే ఉన్నారు. పాఠశాల విద్యలో మాథ్స్, సైన్స్, సోషల్తోపాటు ఇంగ్లిష్ బోధించేవారు లేరు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్ట్లు రెండు ఖాళీగా ఉన్నాయి. కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ పోస్టు సైతం ఖాళీగా ఉంది. ఇక్కడ పనిచేసిన కెమిస్ట్రీ అధ్యాపకురాలు ఇటీవల హాస్టల్లో విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించారు. దీంతో ఈ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. దీంతో విద్యార్థులకు పాఠాలు బోధించేవారు లేక నష్టపోతున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం పాఠశాలలో అధ్యాపకుల కొరత ఉంది. ఈ విషయాన్ని పలుమార్లు ఆర్సీవో దృష్టికి తీసుకువెళ్లాం. వారు నోటిఫికేషన్ వేస్తామంటున్నారు. – శ్యామలాదేవి, ప్రిన్సిపల్, సాంఘిక సంక్షేమ పాఠశాలపనిభారంతో ఒత్తిడి.. చాలా పోస్టులు ఖాళీగా ఉండడంతో పార్ట్టైం ఉద్యోగులపై పనిభారం పడుతోంది. దీంతో ఒత్తిడికి గురవుతున్నారు. ఇటీవల పాఠశాలలో రాత్రి విధులు నిర్వహించిన కెమిస్ట్రీ లెక్చరర్ మరణించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మరణించినప్పటినుంచి రోజూ నలుగురు టీచర్లకు నైట్ డ్యూటీలో ఉంటున్నారు. రోజు విడిచి రోజు నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుండడంతో పని ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్కి సంక్షేమ బాలికల విద్యాలయంలో సగం పోస్టులు ఖాళీ ముందుకు సాగని బోధన నష్టపోతున్న విద్యార్థినులు -
వనంలో కొలువైన అమ్మలు
– 9లో uఆదివారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో అటవీ ప్రాంతాలు, గుట్టలు, చెరువు గట్ల వద్ద గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి. దోమకొండ మండలంలోని అంబారీపేట శివారులో గుట్టపై వెలిసిన గుట్ట మైసమ్మ, నస్రుల్లాబాద్ మండలంలోని మైలారంలో కొచ్చెరు మైసమ్మ, లింగంపేట మండలంలోని కేశాపూర్–కోమట్పల్లిలోని అల్లూరమ్మ, లింగంపేట మండల కేంద్రంలోని మత్తడి పోచమ్మ, జుక్కల్ మండలంలోని కౌలాస్ కోటపై వెలిసిన ఎల్లమ్మ, కామారెడ్డి పట్టణానికి సమీపంలోని ఉగ్రవాయి మైసమ్మతో పాటు ఎన్నో ఆలయాలు ప్రకృతి ఒడిలో భక్తుల నుంచి పూజలందుకుంటున్నాయి. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఈ దేవతామూర్తులను దర్శించుకునేందుకు ఏటా వేలాది మంది భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీరుతాయన్న నమ్మకంతో తమ కష్టాలు తీరాలని ముడుపులు కట్టడం, మొక్కుకోవడం.. అవి తీరిన తర్వాత యాటలు కోసి దేవుళ్లకు పండుగలు చేయడం సంప్రదాయంగా వస్తోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రకృతి ఒడిలో ఉన్న ఆలయాల వద్ద ఆదివారాల్లో పెద్ద ఎత్తున పండుగలు చేస్తుంటారు. మిగతా వారాల్లోనూ సందడి కనబడుతుంది. ఎల్లవేళలా వెన్నంటి వుండే తల్లి ఎల్లమ్మ. ఆపదలనుంచి కాపాడే అమ్మ పోచమ్మ. దుష్టులను దునుమాడి, శిష్టులను కాపాడే శక్తి స్వరూపిణి మైసమ్మ. గ్రామ దేవతలుగా పిలవబడుతున్న ఈ అమ్మలు.. భక్తుల కొంగుబంగారంగానూ పూజలందుకుంటున్నారు. జిల్లాలో పలు గ్రామదేవతల ఆలయాలు ప్రకృతి ఒడిలో ఉన్నాయి. ఆ ఆలయాలలో ఏటా ఆషాఢంలో ఘనంగా జాతరలు జరుగుతాయి. మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు ఏడాదంతా పండుగలు నిర్వహిస్తారు. వనంలో కొలువుదీరిన గ్రామదేవతల ఆలయాలపై సండే స్పెషల్.. న్యూస్రీల్ -
కౌలాస్ కోటలో ఎల్లమ్మ..
జుక్కల్ మండలంలోని కౌలాస్ కోట లో గుట్టపై భాగా న ఉన్న ఎల్లమ్మ ఆలయానికి వంద ల ఏళ్ల చరిత్ర ఉంది. కౌలాస్ కోట ద్వారా పాలన సా గిన కాలం నుంచి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహి స్తున్నారు. ఇప్పటికీ రాజవంశీయులు ఆలయానికి వచ్చి పూజలు చేస్తారు. ప్రతి శుక్ర, మంగళ, ఆదివారాల్లో భక్తులు వచ్చి పండుగలు చేసుకుంటారు. గుట్ట మీద అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి చుట్టుపక్కల మండలాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. హైదరాబాద్ నుంచి కూడా భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చాలా కుటుంబాలకు ఈ ఎల్లమ్మ ఇంటి దేవతగా ఉంది. -
మారనున్న వీధి రాత
మున్సిపాలిటీ వీధి వ్యాపారులు సంఘాలు కామారెడ్డి 5,496 69 బాన్సువాడ 1,402 19 ఎల్లారెడ్డి 1,012 13 మొత్తం 7,910 101బాన్సువాడ : వీధి వ్యాపారులను పొదుపు వైపు మ ళ్లించి వ్యాపార అభివృద్ధికి బ్యాంకుల ద్వారా రుణాలిప్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగానే జిల్లా పరిధిలోని మూడు మున్సిపాలిటీల్లో కామన్ ఇంట్రస్ట్ గ్రూప్(సీఐజీ)లను ఏర్పా టు చేయడానికి మెప్మా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు క్షేత్ర స్థాయిలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా మూడు మున్సిపాలిటీ ల్లో 101 వరకు సంఘాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి గ్రూప్లో 5 నుంచి 10 మంది స భ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మొదటి విడతగా మొత్తం 7,910 మంది వీధి వ్యాపారులను గుర్తించారు. వీరితో ఏర్పాటు చేసే గ్రూపుల్లో ఎంపిక చేసిన సంఘాల్లోని సభ్యులకు ముందుగా శిక్షణ ఇవ్వనున్నారు. వారు బ్యాంకు ఖా తాలు తెరిచిన వెంటనే సంఘాల పొదుపు ప్రక్రియ ను పరిశీలించి బ్యాంకుల ద్వారా రుణం ఇప్పించనున్నారు. ఆరు నెల తర్వాత సంఘాలకు మొదటి విడతగా రూ.లక్ష, తర్వాత రూ.3 లక్షల నుంచి రూ.5 ల క్షలు, సకాలంలో చెల్లిస్తే రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే వీధి వ్యాపారులు ప్రత్యేకంగా వ్యాపారం చేసుకోవడాని కి వీలుగా పీఎంశ్రీ నిధి పథకం కింద దుకాణాలు ని ర్మించనున్నారు. మున్సిపాలిటీల పరిధిలో రేకుల షెడ్లు నిర్మించి వీధి వ్యాపారులకు కేటాయించనున్నారు. ఆరునెలల తర్వాత రుణాలిప్పిస్తాం జిల్లాలో మూడు మున్సిపాలిటీలలో వీధి వ్యాపారులతో పొదుపు సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఏర్పాటయ్యే సంఘాలకు ఆరు నెలల తర్వాత బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పిస్తాం. దీంతో వారికి వెసులుబాటు కలుగుతుంది. కుటుంబాలను పోషించుకోవడానికి అవకాశం ఉంటుంది. –శ్రీధర్రెడ్డి, మెప్మా పీడీ, కామారెడ్డిసభ్యులకు బీమా సదుపాయం.. పొదుపు సంఘంలో సభ్యులుగా చేరిన వ్యాపారులకు రూ. 2లక్షల బీమా సదుపాయం కల్పించనున్నారు. ప్రమాదవశాత్తూ సభ్యులు మృతి చెందితే వారికి బీమా వర్తిస్తుంది. ఈ మేరకు వీ ధి వ్యాపారులకు ఆయా మున్సిపాలిటీల పరిధి లో గుర్తింపు కార్డులు అందజేస్తారు. దుకాణా లు కేటాయించిన అనంతరం వారితో పట్టణ వ్యాపారుల కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ చైర్మన్గా మున్సిపాలిటీ కమిషనర్ ఉంటారు. మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులతో పొదుపు సంఘాల ఏర్పాటు బ్యాంకుల నుంచి రుణం పొందే అవకాశం కల్పించనున్న మెప్మా -
‘భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం’
కామారెడ్డి అర్బన్: భారతీయ సంస్కృతిలో గురువుకు ప్రత్యేక స్థానం ఉందని హైకోర్టు న్యాయవాది విజయ్కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఐఎంఏ భవనంలో సంస్కార భారతి ఆధ్వర్యంలో గురుపూజోత్స వం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ముందుకు తీసుకుపోవాల్సి న బాధ్యత యువతపై ఉందన్నారు. కార్యక్రమంలో శ్రీనటరాజ పూజ నిర్వహించి స్థానిక కూచిపూడి కళాక్షేత్రం కళాకారులతో నృత్యోత్సవం నిర్వహించారు. నాట్య గురువు వంశీ ప్రతాప్గౌడ్, శాసీ్త్రయ సంగీత కళాకారిణి సు హాసిని, జానపద కళాకారుడు రెడ్డి రాజయ్యలను సన్మానించారు. ముగ్గురు కళాకారుల కు సంబంధించిన శిష్యులు ప్రదర్శనలు ఇ చ్చారు. సంస్కార భారతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సమ్మిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పాతూరి సత్యప్రసాద్, ప్రతినిధులు డాక్టర్ ఎన్.రాజు, సాయిబాబా, స్వామిగౌడ్, బసంత్రాజు, ప్రశాంతి, శర్వాణి తదితరులు పాల్గొన్నారు. 14, 15 తేదీల్లో డీసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కామారెడ్డి అర్బన్ : డీఈఈ సెట్లో ఉత్తీర్ణులై గతంలో సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొననివా రు ఈనెల 14, 15 తేదీల్లో నిజామాబాద్ డై ట్ కళాశాలలో నిర్వహించే ధ్రువపత్రాల పరి శీలనలో పాల్గొనాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ నివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకుని సీటు పొందని వారు, సీటు పొంది కళాశాలలో చే రని వారు ఈనెల 16న వెబ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. 19న సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలకు 63039 63931 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ‘బీసీ డిక్లరేషన్ అమలేది’ కామారెడ్డి టౌన్: ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలేది అని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలలో చట్టబద్ధత కల్పించినా రిజర్వేషన్లు అమలు కాని విషయాన్ని గుర్తు చేశారు. బీసీల మీద కాంగ్రెస్కు ప్రేమ ఉంటే డిక్లరేషన్లోని ఇతర అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో స్పష్టం చేయాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్రావు, కపిల్రెడ్డి, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు కామారెడ్డిలో అప్రెంటిస్షిప్ మేళా బిచ్కుంద: ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసినవారికి అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. స్కిల్ ఇండియా మిషన్ కింద ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా(పీఎంఎన్ఏఎం) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం కామారెడ్డిలోని శ్రావణి ఐటీఐ కళాశాలలో అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మేళాలో ఎల్అండ్టీ, ఐటీసీ ఫుడ్ డివిజన్, వరుణ్ మోటార్స్, మహీంద్రా మోటార్స్ ప్రతినిధులు పాల్గొననున్నారు. అప్రెంటిస్షిప్ శిక్షణ అనంతరం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో, వివిధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయని బిచ్కుంద ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ప్రమోద్ కుమార్ తెలిపారు. జిల్లాలో చాలా మంది యువకులు ఐటీఐ, డిప్లొమా చేసి అప్రంటిస్షిప్ చేయడం లేదని, దీంతో వారికి ఉద్యోగావకాశాలు తక్కువగా లభిస్తున్నాయని పేర్కొన్నారు. యువత బంగారు భవిష్యత్తు కోసం కేంద్రం స్కిల్ ఇండియా మిషన్ ద్వారా అప్రెంటిస్షిప్ ఇప్పిస్తోందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు అన్ని సర్టిఫికెట్లతో మేళాకు రావాలని సూచించారు. -
కిసాన్నగర్లో విజృంభించిన డెంగీ
20 మందికి పాజిటివ్ ● గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుమాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట గ్రామపంచాయతీ పరిధిలోని కిసాన్నగర్లో డెంగీ విజృంభిస్తోంది. గ్రామంలో ఇంటికొకరు చొప్పున జ్వరంతో మంచం పట్టారు. వారం రోజుల నుంచి జ్వరాలతో బాధపడుతున్నారు. పలువురికి డెంగీ పాజిటివ్ రావడంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి చికిత్సలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ వైద్య సిబ్బంది శనివారం కిసాన్నగర్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలో చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా జ్వరాలతో బాధపడుతున్నారని మండల వైద్యాధికారి ఆదర్శ్ తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైనవారికి మందులు పంపిణీ చేస్తున్నామని, డెంగీ బాధితులను కామారెడ్డిలోని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామంలో దోమల నివారణ చర్యలు చేపట్టామన్నారు. ఈ శిబిరంలో ఏఎన్ఎం సుమలత పాల్గొన్నారు.ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్న వైద్య సిబ్బంది -
కోరిన కోరికలు తీర్చే అల్లూరమ్మ..
లింగంపేట మండలంలోని కేశాయిపేట –కోమట్పల్లి గ్రామాల శివారులో చెరువుగట్టున ఉన్న అల్లూరమ్మ ఎన్నో కుటుంబాలకు ఇంటిదేవతగా బాసిల్లుతోంది. సంతానం లేని దంపతులు మొక్కుకుంటే సంతానం కలుగుతుందన్న నమ్మకం ఉంది. ఇక్కడకు వచ్చి ముడుపులు కడితే కోరికలు తీరుతాయంటారు. ఆలయానికి ఆది, సోమ, మంగళ, గురు, శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అప్పట్లో చెట్టుకింద ఉన్న అమ్మవారికి భక్తులు దాదాపు రూ. 35 లక్షలు జమ చేసి, ఆలయాన్ని నిర్మించారు. మొక్కులు తీర్చుకునేందుకు మేకలు, గొర్రెలు, కోళ్లు కోస్తారు. ఏటా జూన్ మొదటి వారంలో ఆలయం వద్ద ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహి స్తారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కుస్తీపోటీలు నిర్వహిస్తారు. లింగంపేట మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల మండలాలు, పొరుగున ఉన్న మెదక్ జిల్లాకు చెందిన వారు కూడా తమ సంతానానికి అల్లూరు, అల్లూరయ్య, అల్లూరమ్మ అన్న పేర్లు పెట్టుకుంటారు. -
ఘనంగా మహంకాళి తొట్టెల ఊరేగింపు
బీబీపేట: మండల కేంద్రంలోని మహంకాళి అమ్మ వారి తొట్టెల ఊరేగింపును శనివారం శివశక్తి ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏ టా ఆషాఢంలో బోనాలను సమర్పిస్తారు. ఈసారి ప్రత్యేకంగా తొట్టెల ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా పోతరాజులు తమ విన్యాసాలతో అలరించారు. మండలకేంద్రంలోని అన్ని వీధుల మీదుగా ఈ శోభాయత్ర సాగింది. గ్రామస్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కిక్కిరిసిన మేకల సంత నవీపేట: మండల కేంద్రంలో శనివారం జరిగిన మేకల సంత వ్యాపారులు, వినియోగదారులతో కిక్కిరిసిపోయింది. ఈ ఆదివారం జిల్లా కేంద్రంతోపాటు వివిధ గ్రామాలలో ఊర పండుగలు, బోనాల సంబురాలు నిర్వహిస్తుండడంతో సంత ప్రాంగణం సందడిగా మారింది. ఆషాఢమాసంలో ఆనవాయితీగా సాగే వన భోజనాలు కూడా ఈ ఆదివారం ఉండడంతో వ్యాపారులకు కలిసి వచ్చింది. దీంతో జీవాల రేట్లు ఆమాంతం పెంచేశారు. ఒక్కో మేక ధర రూ. 7 వేల నుంచి రూ. 10 వేలకు విక్రయించారు. అలాగే పొట్టేలు (మేక పోతు) రూ. 12 వేల నుంచి రూ. 15 వేలకు విక్రయించారు. ధరలను లెక్క చేయకుండా వినియోగదారులు పోటాపోటీగా కొనుగోళ్లు చేశారు. సంతలో రూ. 3 నుంచి రూ. 4 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు వ్యాపారులు పేర్కొన్నారు. -
చెరువు గట్టున కొచ్చెరు మైసమ్మ..
నస్రుల్లాబాద్ మండలం మైలారంలోని కొచ్చెరు మైసమ్మకు ఎంతో చరిత్ర ఉంది. రెండు వందల ఏళ్ల కిందట భారీ మర్రి వృక్షం కింద మైసమ్మ వెలిసిందని చెబుతారు. చెరువు గట్టున వెలసిన అమ్మవారిని కొచ్చెరు మైసమ్మగా కొలుస్తారు. మంగళ, శుక్ర, ఆదివారాల్లో బాన్సువాడ, జుక్కల్ ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రతి వారం దాదాపు వందకుపైగా మేకలు, గొర్రెలు కోస్తారు. ఆషాఢ మాసం చివరి శుక్రవారం అమ్మవారికి బోనాలు తీస్తారు. చాలా కుటుంబాలు ఇంటి దేవతగా కొచ్చెరు మైసమ్మను కొలుస్తారు. చెరువు గట్టున ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న ఆలయం వద్దకు బంధువులు, స్నేహితులతో తరలివచ్చి వంటలు వండుకుని విందు భోజనాలు ఆరగిస్తారు. -
గుట్టపై వెలిసిన మైసమ్మ...
దోమకొండ మండలం అంబారీపేట గ్రామ శివార్లలో బండరాళ్ల గుట్టలపై వెలసిన మైసమ్మ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. చాలా కుటుంబాలు ఇంటి దేవతగా కొలుస్తాయి. పిల్లల పుట్టు వెంట్రుకలు తీసి పెద్ద ఎత్తున పండుగలు చేస్తారు. మైసమ్మకు మొక్కితే కోరికలు తీరుతాయని నమ్మిన వాళ్లు.. కోరిక నెరవేరగానే పెద్ద పండుగ చేస్తారు. ఆలయానికి సమీపంలో చెట్ల కింద, షెడ్ల కింద వంటలు చేసుకుంటారు. ఒక్కోసారి ఆదివారం పూట వేలాది మందితో ఆ ప్రాంతం కిటకిటలాడుతుంది. ఏడెనిమిదేళ్లుగా ఆషాఢంలో బోనాలు సమర్పిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి బోనం వెళుతోంది. -
పోలీస్ కావడమే లక్ష్యం
● అరుదైన వ్యాధితో బాధపడుతున్న కార్తికేయ ఆశయం ● రామారెడ్డి భవిత కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుక రామారెడ్డి: తన చిరకాల కోరిక పోలీస్ కావడమేనని ‘మస్కులర్ డిస్ట్రోఫీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కార్తికేయ అనే బాలుడు తెలిపాడు. రామారెడ్డిలోని భవిత కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఫిజియోథెరపీ క్యాంపులో కార్తికేయ జన్మదిన వేడుకను కేంద్రం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్సై లావణ్య ముఖ్య అతిథిగా హాజరుకాగా, బాలుడికి కేక్ తినిపించి, ధైర్యం కల్పించారు. అనంతరం తన జన్మదినం వేళ కార్తికేయ చక్కటి పాటతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇసన్నపల్లి గ్రామానికి చెందిన మాస్టర్ కార్తికేయకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి సోకగా తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి భవిత కేంద్రంలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ వ్యాధి అరుదుగా వస్తుందని, ఆరేళ్లు నిండిన తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడి కండరాలు పట్టివేసి అనేక రకాలుగా ఇబ్బందులు కల్గిస్తాయని, అయినా కార్తికేయ ధైర్యంగా భవిత సెంటర్లో చదువుతూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతున్నాడని డాక్టర్ వెంకటస్వామి తెలిపారు. కాంప్లెక్స్ హెచ్ఎం ఆనంద్, సురేష్, గోపాల్, మండల సిఆర్పిలు మహముద్, యుగంధర్, సురేఖ, వెంకట స్వామి పాల్గొన్నారు. -
తాటిపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం
సిరికొండ: నిజామాబాద్ సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని తాటిపల్లి, జినిగ్యాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాటిపల్లి శివారులోని మల్లం చె రువు, తాంట్ల కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లినవారికి పాద ముద్రలు కనిపించాయి. అనుమానం వ చ్చి సమాచారం ఇచ్చారని రేంజర్ రవీందర్ తెలిపా రు. ఆర్మూర్ ఎఫ్డీవో భవానీశంకర్, రేంజ్ ఆఫీసర్ రవీందర్, యానిమల్ ట్రాకర్స్, ఎన్జీవో వెంకట్, రేంజ్ సిబ్బంది శుక్రవారం ఆయా ప్రాంతాల్లో సంచరించారు. పాదముద్రలను పరిశీలించి మగ పెద్దపులిగా నిర్ధారించారు. గతంలో ఏటీఆర్ ఖానాపూర్ ఏరియా అటవీ ప్రాంతంలో సంచరించిన ఎస్12 పెద్దపులి అని గుర్తించారు. ఐదారు నెలల నుంచి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరిగి ఇటువైపు వచ్చినట్లు రేంజర్ తెలిపారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న తండాలకు చెందిన గిరిజనులు, మేకల, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల వద్ద కరెంటు తీగలను ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు. అటవీ అధికారులు, యానిమల్ ట్రాకర్స్ ప్రతిరోజు గస్తీ తిరుగుతూ పులి కదలికలను పసిగడతామని, సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు రేంజర్ వివరించారు. -
అత్యవసర సేవలు.. అందని ద్రాక్షే
దోమకొండ: దోమకొండలోని క్లస్టర్ ఆస్పత్రిలో 24 గంటల వైద్య సేవలు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు సైతం రాత్రివేళల్లో నిర్వహించకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆదివారం వైద్యులు రావడం కూడా మానేశారు. రాత్రిళ్లు ఆరోగ్య సమస్య తలెత్తితే, అత్యవసర వైద్య చికిత్స కోసం కామారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ కు.ని చికిత్సలు నిర్వహించగా జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడే శస్త్రచికిత్సలు జరిగి ముందంజలో ఉండేది. ప్రస్తుతం సాధారణ వైద్య సేవలు మాత్రమే అందిస్తున్నారు. 2006లో 30 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు... దోమకొండలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 2006లో రూ.1.96 కోట్లతో 30 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు నాలుగు ఉండగా..ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు గాను ఇద్దరు రెగ్యులర్గా ఉండగా, ఆరుగురు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు హెడ్ నర్సులు అవసరం ఉండగా ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆస్పత్రిలో 10 మంది స్టాఫ్ నర్స్ పోస్టులుండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. డార్క్రూం అసిస్టెంట్ పోస్టులు రెండు ఉండగా, ఒకరు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. ముగ్గురు ఎంఎన్వో పోస్టులు ఉండగా మూడు ఖాళీగానే ఉన్నాయి. పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆస్పత్రిలో సరైన సేవలు అందడం లేదు. దీంతో అత్యవసర కేసులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం 50 పడకల ఆస్పత్రిగా మార్చుతూ ఉత్తర్వులు.. దోమకొండలోని క్లస్టర్ ఆస్పత్రి స్థాయిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 పడకల ఆస్పత్రిగా మారితేనైనా వైద్యులు వైద్య సేవలు 24 గంటల పాటు అందుతాయని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దోమకొండ క్లస్టర్ ఆస్పత్రిలో 24 గంటల వైద్య సేవలు కరువు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులువైద్యులను భర్తీ చేయాలి దోమకొండలోని 30 పడకల క్లస్టర్ ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో వైద్యుల సంఖ్య, సిబ్బందిని పెంచి 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్అలీకి, వైద్య విధాన కమిషనర్కు వినతిపత్రం అందించాము. వారు దానికి సానుకూలంగా స్పందించారు. – తిర్మల్గౌడ్, మాజీ జెడ్పీటీసీ, దోమకొండచర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఉన్న సిబ్బందితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులతో నెట్టుకొస్తున్నాం. 24 గంటల పాటు వైద్య సేవలు అందాలి. ప్రతిరోజూ మధ్యాహ్నం తర్వాత రాత్రిళ్లు కూడా అందుబాటులో ఉండేలా డ్యూటీ డాక్టర్కు విధులు వేస్తున్నాను. 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూస్తాను. – వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, దోమకొండ -
నేనేమి చేశాను పాపం.. నాకేమిటీ శిక్ష?
● పుట్టిన ఆడ బిడ్డను వదిలి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ● బాల సంరక్షణ కేంద్రానికి తరలింపు బిచ్కుంద(జుక్కల్) : భూమి మీద పడి ఎన్నో గంటలు గడవనే లేదు. ఒళ్లంతా పురిటి రక్తపు మరకలు..బొడ్డు తాడు సరిగ్గా కోయనేలేదు. అమ్మ ఒడిలో ఉండాల్సిన శిశువు, ఎక్కడో బ్రిడ్జి వద్ద పడేసిన అమానుష ఘటన బిచ్కుంద పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసిన ఆ శిశువును చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాలు.. బిచ్కుంద– బాన్సువాడ రోడ్డులో శుక్రవారం ఉద యం పెద్దదేవాడ వాగు బ్రిడ్జి వద్ద అప్పుడే జన్మించిన నవజాత శిశువును ఓ గుడ్డలో వదిలేసి వెళ్లిపోయారు. అటు నుంచి వెళ్తున్న వాహనదారులు శిశువు ఏడుపును గమనించి పెద్దదేవాడ గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మోహన్రెడ్డి చేరుకొని శిశువును పుల్కల్ పీహెచ్సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వై ద్యం అందించడానికి బాన్సువా డ ఏరి యా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఎస్సై, ఐసీడీఎస్ అధికారులను పిలిపించి కామారెడ్డి బాల రక్షా భవన్ కేంద్రానికి తరలించారు. చికిత్స తర్వాత శిశువు ఆరోగ్యగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఇంకుడు గుంతలో పడి బాలుడి మృతి
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామానికి చెందిన కొత్త కుమ్మరి రాణి కొన్ని రోజులుగా కొండాపూర్లోని తన తల్లిగారింటి వద్ద ఉంటోంది. ఈక్రమంలో రాణి కొడుకు రిత్విక్(3) ఇంటి ముందర చిన్న సైకిల్పై ఆడుకుంటుండగా, ఇంటి పక్కన గల కోటగిరి నారాయణగౌడ్ ఇంటి వద్ద ఉన్న ఇంకుడు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. చాలా సేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిరికొండకు అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలుడి తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జనాభా పెరుగుదలను నియంత్రించాలి
● డీఎంహెచ్వో చంద్రశేఖర్ కామారెడ్డి టౌన్: జనాభా పెరుగుదలను నియంత్రించాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్కాలనీ పీహెచ్సీలో కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జనాభా వల్ల కలిగే సమస్యలపై, గర్భధారణ సమయ నిర్ణయం, సురక్షిత ప్రసవం గురించి చేపట్టవలసిన చర్యలు, కుటుంబ నియంత్రణ శాశ్వత, తాత్కాలిక పద్ధతుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో సూచించారు. ఎన్హెచ్ఎం ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనురాధ, మెడికల్ ఆఫీసర్ సాయి ఈశ్వరి, చలపతి, రమణ, మమత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులు కామారెడ్డి టౌన్ : రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రభుత్వ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులను ప్రకటించింది. జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పతులకు అవార్డులు వచ్చాయి. ఏరియా ఆస్పత్రి విభాగంలో బాన్సువాడ ఆస్పత్రికి రాష్ట్ర స్థాయిలో 84.61 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు దక్కించుకుంది. పీహెచ్సీలలో రాజీవ్నగర్ కాలనీ యూపీహెచ్సీ ఉత్తమ సేవా అవార్డుతో పాటు రూ.13,35,000 దక్కించుకుంది. ఉత్తమ పీహెచ్సీగా లింగంపేట రూ.2 లక్షల నగదు, అలాగే మత్మల్, హన్మాజీపేట్, బీబీపేట, మాచారెడ్డి, దోంగ్ల్లీ, పుల్కల్ పీహెచ్సీలు ప్రంశసా అవార్డులను అందుకోగా ఒక్కో పీహెచ్సీకి రూ. 50 వేల చొప్పున నగదు అవార్డును ప్రకటించారు. ఈ మేరకు డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మిలు అవార్డు అందుకున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రధానమంత్రి జాతీయ శిక్షణ మేళా కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రావణి ఐటీఐలో ఈ నెల 14న ప్రధాన మంత్రి జాతీ య శిక్షణ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ ప్రతులతో జిల్లా కేంద్రంలోని కళాశాలలో హాజరుకావాలని వెల్లడించారు. ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మాంసం దుకాణాలు తొలగించాలని ఆందోళన
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని హైస్కూ ల్, ప్రైమరీ పాఠశాల ప్రహరీ గేటు వద్ద ఉన్న చికెన్, మటన్ మాంసం దుకాణాలను తొలగించాలని కోరుతూ శుక్రవారం విద్యార్థులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాంసం దుకాణాల కారణంగా కుక్కలు విద్యార్థులపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కుక్కల భయంతో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. చీకటిపడితే పాఠశాల ఆవరణలో మద్యం సేవించి గాజు బాటిళ్లు పగలగొడుతున్నారు. కాళ్లకు గుచ్చుకొని గాయాలు అవుతున్నాయని వాపోయారు. వారం రోజుల్లో మాంసం దుకాణాలు తొలగిస్తామని కమిషనర్ ఖయ్యుం విద్యార్థులకు హామీ ఇచ్చారు. మాంసం దుకాణాదారులకు నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మాంసం కోసం కేటాయించిన మార్కెట్లో దుకాణాలు పెట్టుకోవాలని అక్కడ మున్సిపల్ నుంచి నీరు, మురికి కాలువలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని దుకాణదారులకు కమిషనర్ సూచించారు. -
డెయిరీ రంగంలో అనేక అవకాశాలు
కామారెడ్డి అర్బన్: డెయిరీ రంగంలో అనేక ఉపాధి అవకాశాలున్నాయని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎం.జ్ఞానప్రకాష్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి డెయిరీ కళాశాల ‘ఘృత–2025’ వార్షికోత్సవం స్థానిక కళాభారతిలో నిర్వహించగా ప్రిన్సిపాల్ సురేష్ రాథోడ్ అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులుగా హాజరైన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శరత్చంద్ర, దొడ్ల డెయిరీ సీఈవో బుసిరెడ్డి వెంకట్రెడ్డిలు కళాశాల ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికతను వినియోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. కామారెడ్డి డెయిరీ కళాశాల పూర్వ విద్యార్థి, దొడ్ల సీఈవో బుసిరెడ్డి వెంకట్రెడ్డి తన డెయిరీ ద్వారా సామాజిక బాధ్యతగా రూ.4 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. కళాశాలలో పూర్తి సౌకర్యాలు ఏర్పాడిన పిదప డెయిరీ పీజీ కోర్సులు ప్రారంభిస్తామని వైస్ చాన్స్లర్ జ్ఞానప్రకాష్ వెల్లడించారు. దొడ్ల డెయిరీలో దాదాపు 30 మంది కామారెడ్డి డెయిరీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినట్టు వెంకట్రెడ్డి అన్నారు. రిజిస్ట్రార్ శరత్చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు డెయిరీ కంపెనీలు విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తు ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతు..డెయిరీ రంగంలో నెలకు రూ.800లతో జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు కేఎస్ ఉమాపతి, స్వర్ణలత, పీడీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. వైస్ చాన్స్లర్ జ్ఞానప్రకాష్ కామారెడ్డి డెయిరీ కళాశాల ’ఘృత–2025’ వార్షికోత్సవం -
శ్రీ సిద్దరామేశ్వరాలయంలో విచారణ
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరాలయంలో పలు అంశాలపై దేవాదాయశాఖ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు. విచారణ అధికారిగా నీలకంఠేశ్వరాలయం గ్రేడ్ –1 ఈవో గా పనిచేస్తున్న శ్రీరాం రవీందర్ను దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణరావు నియమించారు. దీంతో ఆయన శుక్రవారం ఆలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. ఆలయంలో అటెండర్గా విధులు నిర్వహించిన సత్యనారాయణపై, ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వహించిన బల్యాల లక్ష్మినారాయణపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపారు.ఈనివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని పేర్కొన్నారు. ఈ విచారణలో ఈవో శ్రీధర్తో స్థానికులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన విద్యాశాఖ ఏడీ కామారెడ్డి టౌన్: జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా డి. శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆయన్ని నూతనంగా నియమించింది. మొదటి రోజు దేవునిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ని డీఈవో రాజు, ఉపాధ్యాయులు సన్మానించారు. డీఈవోగా బాధ్యతలు అప్పగించే అవకాశం! ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎస్. రాజు విధులు నిర్వహిస్తున్నారు. అయితే నూతనంగా రెగ్యూలర్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధుల్లో చేరిన డి. శ్రీనివాస్ను జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ త్వరలో రాష్ట్ర విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.నేడు సంస్కార భారతి గురు పూజోత్సవం కామారెడ్డి అర్బన్: సంస్కార భారతి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10గంటలకు నటరాజ పూజ, గురు పూజోత్సవం నిర్వహించనున్నట్టు సంస్కార భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి పాతూరి సత్యప్రసాద్ తెలిపారు.స్థానిక తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సత్యప్రసాద్ కోరారు. -
కుదురుకోని బోర్లు..
● ఒర్రెలు, వాగులు పారలేదు ● చెరువుల్లో చుక్క నీరు చేరలేదు ● భూగర్భ జలం వృద్ధి చెందలేదు ● అయోమయంలో అన్నదాతవరుణుడు కరుణిస్తేనే.. మైదానాన్ని తలపిస్తున్న నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి చెరువుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కార్తెలు కరిగిపోతున్నా జల్లులే తప్ప జడివానలు కురవలేదు. రోహిణీ కార్తెలోనే తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఎంతో సంతోషించారు. ముందస్తు వర్షాలతో కాలం అనుకూలిస్తుందని ఆశించారు. మగశిర, ఆరుద్ర కార్తెలు అనుకూలించలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క చెరువులోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. కనీసం ఒర్రెలలో నీరు నిలిచేంత వాన కూడా కురవలేదు. రికార్డుల ప్రకారం జిల్లాలో ఈ రోజు వరకు సాధారణ వర్షపాతం 219.7 మిల్లీ మీటర్లు కాగా 216.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే జిల్లాలోని పెద్దకొడప్గల్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహమ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో సాధారణం, ఐదు మండలాల్లో కొంచెం ఎక్కువ కురిసింది. అయితే ఎక్కడ కూడా వాగులు పొంగి ప్రవహించేంతగా కురవలేదు. జిల్లాలో చిన్నాపెద్ద అన్నీ కలిపి 2,056 చెరువులు, కుంటలున్నాయి. చెరువుల కింద 96 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నెలన్నర కాలంగా భారీ వర్షాలు కురవకపోవడంతో కుంటలు, చెరువులన్నీ చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. 5.11 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 5.11 లక్షల ఎకరాలలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా ఇప్పటివరకు 2.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు వరి 67 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. వర్షాలు లేకపోవడం వల్లే వరి నాట్లు ఆలస్యమవుతున్నాయి. సోయా పంట 77,124 ఎకరాల్లో, మక్క పంట 43,651 ఎకరాలు, జొన్న 23,214 ఎకరాలు, పత్తి 30,958 ఎకరాల్లో సాగయ్యాయి.ఈ ఏడాది ఎప్పుడూ లేనిది మే నెలలోనే భారీ వర్షం కురియడంతో రైతులు సంతోషించారు. నీటికి కొదవ ఉండదని భావించి అంతా పంటలు వేసుకున్నారు. తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటల్లో కూడా నీరు అడుగంటిపోయి మైదానాలను తలపిస్తున్నాయి. కమ్ముకువస్తున్న మేఘాలను చూసి వరుణుడు కరుణిస్తాడని ఆశ పడడమే తప్ప ఒకటైనా భారీ వర్షం కురవలేదు. దీంతో వానాకాలం సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. అదను దాటిపోతుందేమోనని రైతులు భయపడుతున్నారు. వానాకాలం సీజన్లో భారీ వర్షాలు లేకపోవడంతో బోర్లు ఇప్పటికీ కుదురుకోలేదు. చాలా చోట్ల రైతులు నారుమడులు పోసినా నాట్లు వేయడానికి సరిపడా నీరు అందడం లేదని చెబుతున్నారు. చాలా చోట్ల వేసవిలో ఎత్తిపోయిన బోర్లలో ఇప్పటికీ ఊటలు పెరగలేదు. నిజాంసాగర్ ఆయకట్టు కింద నాట్లు వేశారు. పోచారం ప్రాజెక్ట్లోకి నీరు వచ్చి చేరితేగానీ నాట్లు వేసే పరిస్థితి లేదు. భారీ వర్షాలు లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా వరి సాగు చేయాలంటే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్తెలోనైనా వరుణుడు కరుణిస్తే సాగు ముందుకు నడుస్తుందని అంటున్నారు. ఆరుతడి పంటలకు కొంత అనుకూలంగా ఉంది. వరి నాట్లు వేయడానికి అదను దాటుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు రిజర్వేషన్ల కోసం కృషి
● యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్రెడ్డి బాన్సువాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సభ్యులకు 25 శాతం సీట్లు కేటాయించే విధంగా కృషి చేస్తానని యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్రెడ్డి అన్నారు. స్థానిక శ్రీనివాస గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు పక్కన బెట్టి అందరూ కలిసిమెలిసి పని చేయాలన్నారు. మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలి : పోచారం భాస్కర్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. యూవజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్రెడ్డి, జిల్లా ఇంచార్జి అమృత, యువజన నాయకులు కాసుల రోహిత్, పీసీసీ డెలిగేట్ రాజిరెడ్డి, మన్సుర్, శ్రీనివాస్, సర్ధార్, దుర్గం శ్యామం, అజయ్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి ిసీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజారెడ్డి ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి సీఐగా రాజారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. గతంలో సీఐగా విధులు నిర్వహించిన రవీందర్ నాయక్ ఐజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ రాజారెడ్డి పేర్కొన్నారు. -
ప్రకృతితోనే మానవ మనుగడ
బాన్సువాడ: ప్రకృతితోనే మానవ మనుడగ సాధ్యమని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 2015 కంటే ముందు రాష్ట్రంలో 21 శాతం చెట్లు ఉంటే తర్వాత కాలంలో 26 శాతానికి చేరిందని, భవిష్యత్లో 33 శాతం వరకు చెట్లు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే బాధ్యత అంతే ముఖ్యమన్నారు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కట్టే అవసరం ఉంటుందని అన్నారు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉందని, సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణంలో సమతుల్యం ఉండాలని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, అధికారులు కూడా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి సునీత, ఎఫ్ఆర్వో అబీబ్, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సలాం, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, అధ్యాపకులు, నాయకులున్నారు. విద్యార్థులతో కలిసి ప్రార్థన కళాశాలలో మొక్కలు నాటేందుకు వచ్చిన పోచారం శ్రీనివాస్రెడ్డి విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని, తరగతితో ఫస్ట్ వచ్చేవాడినని గుర్తు చేశారు. కళాశాలకు వస్తున్నానని తాను పంచె కట్టుకుని రాకుండా ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చానని సరదాగా వ్యాఖ్యానించారు.ఏరియా ఆస్పత్రి పనుల పరిశీలనబాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ పనులను శుక్రవారం పోచారం శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. పాత ఆస్పత్రి భవనం శిఽథిలావస్థకు చేరడంతో దాన్ని తొలగించి రూ.37.50 కోట్లతో నూతన ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నారు. పనులు నాణ్యతగా చేయించాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, లింగం, హకీమ్, సాయిలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి -
బోనాల పండుగకు సర్వం సిద్ధం
● గత 51 ఏళ్లుగా నిరాటంకంగా బోనాల ఉత్సవం ● రేపే దోమకొండలో మహంకాళి బోనాల పండుగ ● 18 చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో అమ్మవారు దోమకొండ : దోమకొండలోని దేవి ఆలయాన్ని మహంకాళి, చాముండేశ్వరి ఆలయంగా పిలుస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీ మాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అమ్మవారు కార్యాలను విజయవంతం చేస్తుందని ప్రతీతి. ఆలయ చారిత్రక నేపథ్యం.. దోమకొండ సంస్థానానికి చెందిన కామినేని వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 1943–1946 మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని జైపూర్ నుంచి అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని తెప్పించి 1972 అక్టోబర్ 28న ప్రతిష్ఠాపన చేశారు. ఇక్కడి అమ్మవారు రాక్షసులను సంహరిస్తుందనే రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి 18 చేతుల్లో ప్రతి చేతిలో ఒక ఆయుధం కలిగి ఉండటం విశేషం. కోర్కెలు తీర్చే చాముండేశ్వరి అమ్మవారిగా.. బోనాల పండుగ 51 ఏళ్లుగా నిరాంటంకంగా కొనసాగుతోంది. ఏటా ఆషాఢంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం బోనాలు తీస్తారు. ఆదివారం (13న) ఉదయం భవిష్యవాణి, ఘటం ఊరేగింపు, పోతరాజులు జీవాలను గావు పట్టుట, మధ్యాహ్నం 12 గంటల నుంచి బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకొచ్చి మొక్కులు సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన 12 కిలోల వెండితో ఇటీవల అమ్మవారికి మకరతోరణం చేయించారు. మండల కేంద్రంలో దాదాపు 4,250 కుటుంబాలు నివసిస్తుండగా ప్రతి ఇంటి నుంచి బోనం సమర్పిస్తారు. బోనాల పండుగ రోజు బంధువులు, స్నేహితులను పిలుచుకుంటారు. తెలంగాణలోనే రెండో మహంకాళి అమ్మవారి ఆలయంగా ఇక్కడి దేవాలయం పేరుగాంచింది. బోనాల అనంతరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో దసరా దేవి నవరాత్రి ఉత్సవాలను కూడా ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తారు.బీబీపేటలో బోనాలకు ఏర్పాట్లు బీబీపేట : మండల కేంద్రంలోని మహంకాళి అ మ్మవారి బోనాలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశా రు. పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అలాగే గుంతలు ఉన్న ప్రాంతంలో మొరం పోయించడంతో పాటు విద్యుత్ దీపాలను అమర్చారు. -
శ్రీరాముడు ప్రతిష్టించిన బుగ్గ రామలింగేశ్వరుడు
కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శివలింగాన్ని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్టించి, కొలిచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ● శ్రీరాములు వనవాసంలో ఉండగా లింగంను ప్రతిష్ఠించి, పూజలు చేశాడు. నాటి శివలింగమే నేడు బుగ్గ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ● మాఘ అమావాస్య రోజున ఈ ఆలయం వద్ద పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులు భారీగా తరలివస్తారు. ● మహా శివరాత్రి పర్వదినం నాడు బుగ్గ రామలింగేశ్వరుడిని లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. శివపార్వతుల కల్యాణోత్సవం, రథోత్సవం మర్నాడు అగ్ని గుండాలు నిర్వహిస్తారు. ● బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో 2005 నుంచి నేటి వరకు నిత్యాన్నదానం నిరంతరంగా కొనసాగుతుంది. ● గ్రామస్తులందరు కలిసి స్వయంగా రెండు నెలల రేషన్ బియ్యాన్ని అన్నదానానికి విరాళంగా అందజేస్తారు. ● బుగ్గ రామలింగేశ్వర ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమంలో వందమంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ● 70 ఆవులను ఆలయం ఆధ్వర్యంలో పోషిస్తున్నారు. ● కామారెడ్డి నుంచి నేరుగా బుగ్గ రామలింగేశ్వరుడి ఆలయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. – రామారెడ్డిమీకు తెలుసా? -
కుటుంబ ప్రయోజన పథకాన్ని వినియోగించుకోవాలి
బాన్సువాడ రూరల్/భిక్కనూరు : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాన్సువాడ సబ్ కలెక్టర డాక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ కుటుంబ భద్రత పఽథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ధి చంద్రకాంత్రెడ్డి కోరారు. శుక్రవారం భిక్కనూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.కుటుంబ పెద్ద మృతి చెందినట్లయితే ప్రభుత్వం రూ.20వేలు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. పథకానికి అర్హత పొందాలంటే మృతిని వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మద్య ఉండి 12 ఏప్రిల్ 2017 తర్వాత మృతి చెంది ఉండాలన్నారు. -
పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లాకు 11 పతకాలు
● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: కరీంనగర్లో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లాకు 11 పతకాలు దక్కినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లలో కూడా పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పతకాలు సాధించిన వారికి రివార్డులను అందజేసి అభినందించారు. ఏఆర్ సీఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిభ చూపిన గాంధారి ఎస్సై.. గాంధారి ఎస్సైగా పని చేస్తున్న ఆంజనేయులు పత కాల వేటలో ముందున్నారు. కేసుల విచారణలో శా సీ్త్రయ వినియోగానికి(లిఫ్టింగ్, ప్యాకింగ్, ఫింగర్ ప్రింట్స్ ఫార్వర్డ్, నేర స్థల ఫొటోగ్రఫీ) సంబంధించిన అంశాల్లో 3 బంగారు, 2 వెండి పతకాలు సా ధించారు. మద్నూర్ ఎస్సై విజయ్ ఫోరెన్సిక్, ఫొ టోగ్రఫీ, ఫింగర్ ప్రింట్ సైన్స్లలో 2 వెండి పతకా లు సాధించారు. బిచ్కుంద రైటర్ లక్ష్మీనారాయణ కు ఉత్తమ దర్యాప్తు(రైటర్) పతకం దక్కింది. కంప్యూటర్పై అవగాహన, విధ్వంసకాల విచ్ఛిన్నంపై తనిఖీలు తదితర అంశాల్లో రాజంపేట కానిస్టేబుల్ చిరంజీవికి కాంస్యం, ఏఆర్ కానిస్టేబుళ్లు రామచంద్రం, ఎల్లారెడ్డిలకు వెండి పతకాలు లభించాయి. -
రాజకీయ కుట్రతోనే నా అరెస్టు
కామారెడ్డి టౌన్: పేలుడు పదార్థాల కేసు వ్యవహారంలో రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేయించారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. గురువారం బెయిల్పై వచ్చిన తర్వాత శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక ఓ పెద్దమనిషి హస్తంతో అరెస్టు జరిగిందని ఆరోపించారు. ఈనెల 3న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ లభ్యమైన లింగాపూర్ శివారులోని వెంచర్లో తనకు గజం స్థలం కూడా లేదన్నారు. పేలుడు పదార్థాలకు తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో విచారణకు పిలిచిన డీఎస్పీ, సీఐకి ఆ వెంచర్కు సంబంధించి 1800 ఎకరాల భూమి పత్రాలను, ప్లాట్ల వివరాలను ఇచ్చానని తెలిపారు. ఈనెల 5వ తేదీన రాత్రి రూరల్ సీఐ వచ్చి ఎస్పీతో మాట్లాడుతారట వెళ్దామని చెప్పి ఓ ప్రైవేట్ వాహనంలో ఎస్పీ కార్యాలయం కాకుండా నేరుగా జాతీయ రహదారికి మళ్లీంచి బాన్సువాడకు అర్ధరాత్రి తీసుకెళ్లి ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించారని తెలిపారు. అక్కడి నుంచి తెల్లవారుజామున నిజామాబాద్ జైలుకు తరలించారని వివరించారు. పోలీసుల వద్దకు తానే స్వయంగా వెళ్తే ఎఫ్ఐఆర్లో మాత్రం తప్పించుకుని తిరుగుతున్నానని, అశోక్నగర్కాలనీ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్నారని పొందుపర్చడం సరికాదన్నారు.అరెస్టులో పోలీసుల తీరుపై డీఐజీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై ఓ మాజీ కౌన్సిలర్ తప్పుడు ప్రచారం చేసాడని తెలిపారు.తనపై కుట్ర చేసిన ప్రతి ఒక్కరి బండారం సమయం వచ్చినప్పుడు బయటపెడుతానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో నాయకులు రవి, సలీం, పంపరి శ్రీనివాస్, సాయిబాబా, చాట్ల వంశీ తదితరులున్నారు. పోలీసుల తీరుపై డీఐజీకి ఫిర్యాదు చేస్తా పేలుడు పదార్థాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి -
సన్నం సరే.. దొడ్డు మాటేమిటి?
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 3 నెలల సన్నబి య్యం పంపిణీ విజయవంతంగా పూర్తయింది. కానీ రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బి య్యాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు సివిల్ సప్లయ్ అధికారుల వద్దే సమా ధానం లేదు. జూన్ నెల ఆసాంతం జరిగిన స న్న బియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో 93 శాతం పూర్తయింది. జిల్లాలోని 578 రేషన్ దు కాణాలకు 17,711.470 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం మూడు నెలల కోటా కింద విడుదల చేయగా వీటిలో 16,471.667 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే రేషన్ దు కాణాలలో పంపిణీ జరగకుండా మిగిలిపోయి న దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం పంపిణీ కంటే ముందే స్వాధీనం చేసుకుంటామన్న సివిల్ సప్లయ్ శాఖ ఇప్పటి వరకు బియ్యం వాపస్ వి షయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రేషన్ దుకాణాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు, గోదాముల్లో కలిపి దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు అధి కారుల అంచనా. దీని విలువ దాదాపు రూ. 400 కోట్లపై చిలుకు ఉంటుందని అధికారులే అంటున్నారు. మార్చి నుంచి ఈ నిల్వలు అలా గే ముక్కి పోతున్నాయి. ఎక్కడ నిల్వ చేసుకోవాలి..? జూన్ 1కి ముందున్న దొడ్డు బియ్యం నిల్వలు దుకాణాల్లో అలాగే ఉండటంతో మూడు నెలల సన్న బియ్యం కోటాను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బంది పడ్డారు. మార్చి నుంచి రేషన్ దుకాణాలు, గోదాముల్లో ఉన్న బియ్యం ప్రస్తుతం గడ్డలు కట్టి పురుగులు పట్టి పనికి రాకుండా తయారైంది. ఈ చెడిపోతున్న బియ్యం కారణంగా సన్న బియ్యానికి కూడా పురుగులు పడుతున్నాయి. గతంలో ఇలాగే కందిపప్పును పంపిణీ చేయగా మిగిలిపోయిన పప్పు సివిల్ సప్లయ్ అధికారులు వెనక్కి తీసుకుంటామని తీవ్ర జాప్యం చేశారు. దుకాణాల్లో మిగిలిపోయిన పప్పు పురుగులు పట్టి దుర్వాసన వస్తుండటంతో దుకాణదారులు బయట పారబోయాల్సి వచ్చింది. చెడిపోయిన పప్పును పారబోసిన కొద్ది రోజులకు అధికారులు మిగిలిపోయిన పప్పు నిల్వలను వెనక్కి తీసుకోవడానికి రావడంతో.. పారబోసిన పప్పును మళ్లీ తేలాక మార్కెట్ నుంచి కందిపప్పును కొని అధికారులకు రేషన్ దుకాణ నిర్వాహకులు అప్పగించారు. ఇప్పుడు కూడా గడ్డలు కట్టి పురుగులు పట్టిన బియ్యాన్ని ఏమి చేయాలో తెలియక మదనపడుతున్నారు. దొడ్డు బియ్యం ఎక్కడ ఉంచాలి? రేషన్ దుకాణాల్లో గడ్డలు కట్టి, పురుగులు పట్టి చెడిపోతున్న దొడ్డు బియ్యం నిల్వలను ఎక్కడ ఉంచాలో అర్థం కావడం లేదు. గతంలో ఇలాగే చెడిపోయిన కందిపప్పును బయట పారబోస్తే అధికారులు మిగిలిపోయిన పప్పును తమకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. సొంత ఖర్చుతో కంది పప్పు కొని అధికారులకు అప్పగించాం. ప్రభుత్వం దొడ్డు బియ్యం నిల్వల స్వాధీనం విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. – నాగం సురేందర్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆదేశాలు రావాల్సి ఉంది .. రేషన్ దుకాణాలు, గోదాముల్లో మార్చి నెల నుంచి నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశా లు రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే దొడ్డు బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటాం. – మల్లికార్జున్, జిల్లా పౌర సరఫరాల అధికారి రేషన్ దుకాణాల్లో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం నిల్వలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న రేషన్ డీలర్లు -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి యువతకు విక్రయించే ఓ వ్యక్తిని కామారెడ్డి ఎకై ్సజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు ఇలా.. హైదరాబాద్కు చెందిన అహ్మద్ బిన్ అసద్ అనే వ్యక్తి కొంత కాలంగా కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. అతడు గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తుంటాడని సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. గురువారం సాయంత్రం పట్టణ సమీపంలోని నర్సన్నపల్లి రైల్వే గేటు వద్ద అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 550 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ సుందల్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. -
ఆర్మూర్ బస్టాండ్లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆర్మూర్టౌన్: నిజామాబాద్–2 డిపోకు చెందిన షేక్ హిమాం పాషా (52) అనే డ్రైవర్ ఆర్మూర్ బస్టాండ్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన షేక్హిమాం పాషాను ఖమ్మం జిల్లా నుంచి నిజామాబాద్కు ఆరు నెలల కోసం డిప్యుటేషన్పై బదిలీ చేశారు. ఆయనతో పాటు నిమాజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మొత్తం 63 మంది ఉద్యోగులను ఆరు నెలల కోసం డిప్యుటేషన్పై బదిలీ చేశారు. కానీ తాను వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు తిరిగి స్వస్థలాలకు పంపలేదని, ఈ విషయంలో ఎలాంటి న్యాయం జరగకపోవడంతో నిరాశ చెందానన్నాడు. సెలవులు కూడా ఇవ్వడం లేదని, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో మనస్తాపం చెందిన అతడు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వస్తున్న సమయంలో ఆర్మూర్ బస్టాండ్లో తన బస్సును నిలిపి, ఎలుకల మందు తాగాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్మూర్ డిపో అధికారులకు మరింత సమాచారం కోసం ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేరు. డిప్యుటేషన్ బాధలే కారణం! -
డ్రంకెన్డ్రైవ్లో నలుగురికి జైలు
ఖలీల్వాడి: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికి గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం నగరంలోని కోర్టులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి వారిలో ఏడుగురికి రూ. 11500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురిలో ఒకరికి ఒకరోజు, ఇద్దరికి రెండు రోజులు, ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. న్యూసెన్స్ కేసులో ఒకరికి.. ఖలీల్వాడి: నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి మద్యం అతిగా తాగి న్యూసెనన్స్ చేసిన ఒకరికి జిల్లా కోర్టు ఏడు రోజుల జైలుశిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి మద్యం అతిగా తాగి నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి అతడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడిని జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. తల్లిని హతమార్చిన కొడుకు ● పింఛన్ డబ్బుల కోసం ఘాతుకం వర్ని: పింఛన్ డబ్బుల కోసం తల్లిని కొడుకు హతమార్చిన ఘటన మండలంలోని జలాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన మక్కపల్లి సాయిలుకు గతంలోనే వివాహం జరుగగా భార్య అతడిని వదిలి, పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో సాయిలు అతడి తల్లి సాయవ్వ(60) ఉంటున్నారు. మద్యానికి బానిసైన సాయిలు తరచూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. తల్లికి ఈనెల పింఛన్ డబ్బులు రావడంతో వాటిని తనకు ఇవ్వాలని సాయిలు గురువారం మధ్యాహ్నం ఘర్షణకు దిగాడు. తల్లి ససేమిరా అనడంతో అతడు బండరాయిని తీసుకొని తల్లిపై కొట్టగా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై మహేష్ వెల్లడించారు. బస్వాపూర్లో ఒకరి ఆత్మహత్య భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై దత్తు గురువారం తెలిపారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన కందూరి లింగం(55) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై, తరచు భార్య, పిల్లలతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి అతడు అతిగా మద్యం తాగి, ఇంటికి వచ్చి బోజనం చేసి పడుకున్నాడు. కుటుంబీకులు గురువారం ఉదయం లేచిచూడగా అతడు ఇంటి వెనుక ఉన్న స్లాబ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. పొదుపు డబ్బులు స్వాహా! నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి గ్రామ బీపీఎం నిఖిత పొదుపు డబ్బులను ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా చేసినట్లు తెలిసింది. సదరు బీపీఎం మూడు నెలల పాటు సెలవుపై వెళ్లడంతో ఇటీవల ఇన్చార్జి బీపీఎంగా శశికాంత్ పోస్టాఫీస్కు వచ్చాడు. అయితే ప్రతి నెలా ఆర్డీ డబ్బులు బీపీఎం నిఖితకు ఇవ్వడంతో ఖాతాబుక్కుల్లో వారికి రాసి ఇచ్చింది. డబ్బులు జమ చేసేందుకు ప్రజలు పోస్టాఫీస్కు రావడంతో ఇన్చార్జి బీపీఎం ఆన్లైన్లో తనిఖీ చేయగా తేడాలు కన్పించాయి. ప్రతి నెలా డబ్బులు కట్టినట్లు బుక్కుల్లో రాసి ఉన్నా ఆన్లైన్ నమోదు చేయకుండా స్వాహా చేసిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసం స్థానికులు ఎస్పీఎం, బీపీఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
నికాల్పూర్కు మరో పేరు లక్ష్మీనారాయణపురం
మీకు తెలుసా? మండలంలో ముంపు గ్రామమైన నికాల్పూర్కు లక్ష్మీనారాయణపురం అనే మరో పేరు కూడా ఉంది. మరికొందరు జంగంపల్లి అని కూడా పిలిచేవారట. ●● సుమారు 155 ఏళ్ల క్రితం పంటలకు, పశువులకు నీటి కొరత ఉందనే కారణంతో లక్ష్మీనారాయణపురం గ్రామస్తులందరూ గోదావరి ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్లకు భూములు ముంపునకు గురికావడంతో ఎత్తయిన ప్రాంతానికి వచ్చి ఇళ్లను నిర్మించుకున్నారు. ● ఇలా పలుమార్లు వారి భూములు ముంపునకు గురికావడంతో ప్రతిసారి వారు వేరే ఎత్తయిన ప్రాంతానికి వచ్చి నివాసాలను ఏర్పాటుచేసుకున్నారు. ● మూడుసార్లు గ్రామస్తులు ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవడంతోనే లక్ష్మీనారాయణపురం గ్రామానికి నికాల్పూర్ అనే పేరు వచ్చినట్లు ఊరి పెద్దలు చెప్తున్నారు. నికాల్ అంటే హిందీలో వెళ్లిపోవడం అని అర్థం. ● ప్రస్తుతం గ్రామంలో 534 నివాస గృహాలు, 1200 ఎకరాల సాగుభూమి ఉంది. ● నికాల్పూర్ మొదటి గ్రామ సర్పంచ్గా ఆనంద్రావు 1969లో పని చేశారు. ● గ్రామంలో జంగం చెరువు, ఊర చెరువు, కొత్తకుంట అనే మూడు చెరువులు ఉన్నాయి. పాత గ్రామంలో ఓ కాలనీకి వేంకటేశ్వర పల్లె అనే పేరు ఉండేది. దానికి గుర్తుగా గ్రామస్తులు ఇటీవల ఊరి నడిబొడ్డున వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ● పాత గ్రామంలోని హనుమాన్ ఆలయం ప్రతీ ఏటా వర్షాకాలంలో ముంపునకు గురై వేసవిలో తేలుతుంది. అప్పుడు ఊరంతా వెళ్లి పూజలు నిర్వహిస్తారు. – డొంకేశ్వర్(ఆర్మూర్)సమాచారం..ఆర్మూర్: భారతదేశంలో నేరస్తులకు శిక్షలు విధించడానికి, నేరస్తుల విచారణ కోసం బ్రిటీష్ కాలంలో రూపొందించబడిన చట్టాలే 2024 వరకు కొనసాగాయి. శిక్షలు విధించడానికి 1860లో ఐపీసీ(ఇండియన్ పీనల్ కోడ్), 1973లో సీఆర్పీసీ(క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), 1872లో ఐఈఏ(ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్)లను రూపొందించారు. ● ఈ చట్టాలను సవరిస్తూ 2023 డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం చేసింది. ● ఐపీసీని బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత)గా, సీఆర్పీసీని బీఎన్ఎస్ఎస్ ( భారతీయ నాగరిక్ సురక్షా సంహిత)గా సవరించింది. అలాగే ఐఈఏని బీఎస్ఏ(భారతీయ సాక్ష్య అధినియం)గా మారుస్తూ 2024 జూలై 1నుంచి అమలులోకి తీసుకొచ్చారు. ● ప్రస్తుతం పోలీస్స్టేషన్లలో నమోదు చేయబడ్డ వివిధ కేసులపై నూతన చట్టం ఆధారంగా కోర్టుల్లో విచారణ చేపట్టి సాక్ష్యాల ఆధారంగా న్యాయమూర్తులు నేరస్తులకు శిక్షలను ఖరారు చేస్తున్నారు. ● ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్లో 358 సెక్షన్లకు కుదించారు. ● సీఆర్పీసీలో 484 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్ఎస్లో 531 సెక్షన్లకు పెంచారు. ● ఐఈఏలో 167 సెక్షన్లు ఉండగా బీఎస్ఏలో 170 సెక్షన్లకు పెంచారు. -
ఘనంగా శబరి మాత పాదుకా పూజ మహోత్సవం
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : మండల కేంద్రంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల శబరి మాత ఆశ్రమంలో గురువారం పాదుకా పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం వందలాది భక్తుల మధ్య ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను ప్రారంభించారు. వేద పండితులు పాదుకా మహోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం మహాత్ములు ఉపన్యాసాలు, ప్రవచనాలు చేశారు. భజన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు భారీగా తరలివచ్చారు. అన్నదానం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆత్మకూర్ హైస్కూల్ సందర్శన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మకూర్ హైస్కూల్ను గురువారం ఎంఈవో భాస్కర్రెడ్డి సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న పాముల బెడదపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ‘పాఠశాలలో పాముల బెడద..!’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలను పరిశీలించారు. తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల పాములు, తేళ్లతోపాటు ఇతర కీటకాలు ప్రవేశిస్తున్నాయని ఉపాధ్యాయులు ఎంఈవోతో పేర్కొన్నారు. ప్రహరీతోపాటు అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూడాలని వారు కోరారు. తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి మద్నూర్(జుక్కల్) : ఓటరు జాబితాను బీఎల్వోలు తప్పులు లేకుండా రూపొందించాలని ఈఆర్వో, అదనపు కలెక్టర్ చందర్ అన్నారు. డోంగ్లీలో గురు వారం బీఎల్వోలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో బీఎల్వోల పాత్ర కీలకమని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ ముజీబ్, డీటీ శివరామకృష్ణ, ఆర్ఐ సాయిబాబా పాల్గొన్నారు. -
ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి
ఎల్లారెడి:్డ ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైద్రాబాద్ సెక్రటేరియట్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డికి ఆర్డీవోగా బదిలీపై వచ్చి ఛార్జి తీసుకున్నారు. గత నెలలో ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన మన్నె ప్రభాకర్ పదవీ విరమణ పొందడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొద్ది రోజులు ఆర్డీవోగా వ్యవహరించగా గత నెల 24న కామారెడ్డి ఆర్డీవోకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు.బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోలు బాన్సువాడ రూరల్: బాన్సువాడ ఎంపీడీవోగా ఆనంద్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆనంద్కు ఇన్ఛార్జి ఎంపీడీవో ముజాహిద్ బాధ్యతలు అప్పగించారు. పిట్లంలో రఘు.. పిట్లం(జుక్కల్): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవోగా రఘు బాధ్యతలు స్వీకరించారు. పిట్లం ఎంపీడీవోగా పనిచేసిన కమలాకర్ బదిలీపై రెంజల్కు వెళ్లగా, ఆయన స్థానంలో మెదక్ నుంచి బదిలీపై రఘు పిట్లంకు వచ్చారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవో రఘుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజంపేటలో బాలకృష్ణ.. రాజంపేట: రాజంపేట మండల ఎంపీడీవోగా ఎ.బాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ధర్పల్లి మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన బాలకృష్ణ బదిలీపై రాజంపేట మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీవో రామకృష్ణ, మండల పరిషత్ సిబ్బంది శాలువాతో సత్కరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్సై జగదీశ్ మాట్లాడుతూ...ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న చలాన్లను చెల్లించాలని సూచించారు. హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. -
మత్స్యకారులు లక్షాధికారులు కావాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మత్య్సకారులు లక్షాధికారులు కావడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో మాట్లాడారు. చేపలు పట్టే హక్కు ముదిరాజ్లు, బెస్తవారికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో 6,000 మత్స్య సంఘాల్లో 4,500 మత్య్స సంఘాలు ముదిరాజ్లవే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ముదిరాజ్లు హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం లేని గ్రామాల్లో సభ్యత్వం సాధించుకోవాలన్నారు. మత్య్సకారులు మరింత అభివృద్ధి సాధించాలంటే నేడు ఆవిష్కరించిన పుస్తకం చదవాలన్నారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్, డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సాయిబాబా, మండల అధ్యక్షుడు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతల స్వీకరణ
● మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా వాల్య.. ● జీజీహెచ్ సూపరింటెండెంట్గా వెంకటేశ్వర్లు కామారెడ్డి టౌన్: కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ బి వా ల్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ పెరుగు వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మెడికల్ కళాశాల ఆయా విభాగాల హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, వైద్యులు, ఉద్యోగులు వాల్యకు స్వాగతం ప లికి సన్మానించారు. అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి బాన్సువాడ రూరల్ : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి బీజేపీ సత్తాచాటాలని ఆ పార్టీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. తాడ్కోల్లోని రెడ్డి సంఘంలో బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అ ధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ల క్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచనలు చేశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన తా డ్కోల్ మాజీ సర్పంచ్ సాయిలు, బీరుగొండ, రాములు, రమేశ్కు కాషాయ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకు లు పోశెట్టి, లక్ష్మీనారాయణ, దొరబాబు, శంకర్గౌడ్, కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎంపీడీవోలకు పోస్టింగ్లు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికలకు ముందు నిజామాబాద్, మెదక్ జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలు ఐదుగురిని కామారెడ్డి జిల్లాకు కేటాయించగా వారికి మండలాల్లో పోస్టింగులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో పనిచేసిన బాలకృష్ణకు రాజంపేట, మెదక్ జిల్లా హవేలీఘన్పూర్ నుంచి వ చ్చిన రవీశ్వర్గౌడ్కు పెద్ద కొడప్గల్, శివ్వంపేట నుంచి వచ్చిన నాగేశ్వర్కు రామారెడ్డి, మెదక్ నుంచి వచ్చిన రఘుకు పిట్లం, చిలిపి చేడ్ నుంచి వచ్చిన ఆనంద్కు బాన్సువాడ మండలాలకు పోస్టింగ్లు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పరామర్శ భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాలకు చెందిన పలువురిని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు గంప శశాంక్ గురువారం పరామర్శించారు. పెద్దమల్లారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలు దాచుపల్లి భూమయ్య, మన్నే ప్రమీల, పెద్దోళ్ల దుబ్బవ్వ, కాచాపూర్ గ్రామానికి చెందిన సంతోష్రెడ్డి ఇటీవలి కాలంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గంప శశాంక్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చరు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ కోడూరి సాయాగౌడ్, నాయకులు ఈర స్వామి, వడ్ల బ్రహ్మచారి, వడ్ల శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్, పెద్దోళ్ల అనిల్, ధన్రాజు, స్వామి తదితరులు ఉన్నారు. క్రీడా అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు కామారెడ్డి అర్బన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కొత్తగా ఏ ర్పాటు చేసిన హాకీ, అథ్లెటిక్స్ క్రీడా అకాడమీలలోబాలురు, బాలికల ప్రవేశాలకు ఈ నెల 15, 16 తేదీల్లో హైదరాబా ద్లో ఎంపిక లు నిర్వహించనున్నారని జిల్లా యువజన, క్రీడల అధికారి కేఎస్ జగన్నాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు క్రీడాకారులు వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
ప్రాథమికంలో మెరుగు‘బడి’
నిజామాబాద్అర్బన్: విద్యావ్యవస్థలో మార్పు మొ దలైంది. బోధనాభ్యసన ప్రక్రియలో సత్ఫలితా లు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు(ఎఫ్ఎల్ఎన్), లిప్(లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమాలతో విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతూ అభ్యసన ఫలితాలు మెరుగవుతున్నాయి. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ఫరక్ రాష్ట్రీయ, సర్వేక్షణ(న్యాస్) సర్వే నివేదికలో ఉమ్మడి జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. సర్వే ఇలా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 180 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2024 డిసెంబర్ 4న న్యాస్, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా రాష్ట్రీయ సర్వేక్షణ్–ఫరఖ్ సర్వేను నిర్వహించాయి. ఫలితాలను ఉదిత్, ఉదయ్, ఉన్నత్, ఉద్భవ్ అనే నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. 25 శాతం కంటే తక్కువ అభ్యసన స్థాయిలను కలిగి ఉంటే ఉద్భవ్గా, 25–50 మధ్య ఉంటే ఉన్నతిగా, 50–75 మధ్య ఫలితాలను ఉదయ్, ఆపైన ఫలితాలు వస్తే ఉదిత్గా ప్రకటించారు. కేంద్రం విడుదల చేసిన ఈ ఫలితాలలో ఉమ్మడి జిల్లా ఆశాజనక స్థానం సాధించింది. ● 3వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా 9వ, నిజామాబాద్ 18వ స్థానాన్ని సాధించాయి. గత న్యాస్ సర్వే కంటే పది స్థానాలు మెరుగుపడినాయి. అలాగే ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ బడులలో అభ్యసన సామర్థ్యాలు పెరిగినాయి. 6వ తరగతిలో భాష, గణితంలో ఉన్నతి, ఉద్భవ్ స్థాయిలో ఉండగా, సామర్థ్యాల పరంగా వెనుకబడ్డాయి. 9వ తరగతిలో అభ్యసన ఫలితాలు మెరుగయ్యాయి. తరగతులవారీగా అభ్యసన స్థాయి శాతం ఉన్నతంలో వెనుకడుగు జాతీయ సాధన సర్వేలో ఆశాజనక ఫలితాలు గత సర్వే ఫలితాల కంటే మెరుగు ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలతో సత్ఫలితాలు ప్రభుత్వ బడులు బలోపేతం 2022 ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిన తొలిమెట్టు, లిప్ కార్యక్రమాలతో ప్రభుత్వ బడులలో అభ్యసన ఫలితాలు మెరుగయ్యాయి. అలాగే డీఎస్సీ–2024, డీఎస్సీ–2008 ద్వారా జిల్లాలో నూతనంగా నియామకమైన 650 ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై విద్యార్థులకు గుణాత్మక విద్య అందిస్తున్నాయి. కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించడంతోపాటు తరగతి గది అభ్యసన ఫలితాలను సాధించేందుకు గత విద్యాసంవత్సరం నుంచి పంపిణీ చేసిన వర్క్బుక్లు దోహదపడ్డాయి. ఉపాధ్యాయుల కృషితోనే.. ఇటీవల వెలువడిన జాతీయ సాధన సర్వేలో మంచి ఫలితాలు రావడం శుభ పరిణామం. ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైంది. ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – అంకం నరేశ్, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు -
వేతనం లేని ఉపాధి
ఎల్లారెడ్డిరూరల్: ఉపాఽధిహామీ కూలీలకు ఉపాధి క ల్పించే సిబ్బంది వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపో వడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏలు), ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్ఏలు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2,50,423 జాబ్కార్డులు ఉండగా వీటి పరిధిలో 4,76,500 మంది కూలీలు ఉన్నారు. వీరిలో గత జూన్ వరకు రోజుకు సగటున 42 వేల మంది కూలీలు పనులు చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 85,284 మంది కూలీలు 10 లక్షల 92 వేల పని దినాలను పూర్తి చేశారు. వీరితో జిల్లాలో 65 మంది టీఏలు, 325 మంది ఎఫ్ఏలు పనులను గుర్తించి పనులను చేయించారు. అయితే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబందించిన వేతనాలు రాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని టీఏలు, ఎఫ్ఏలు ఆవేదన చెందుతున్నారు. వీరితోపాటు జిల్లాలో 14 మంది ఏపీవోలు, 9 మంది ఈసీలు, 48 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 22 మంది అటెండర్లు ఉన్నారు. వీరికి సైతం గత రెండు నెలల నుంచి వేతనాలు అందలేదు. అధికారులు స్పందించి సిబ్బంది వేతనాలు అందేలా చర్యలను తీసుకోవాలని వారు కోరుతున్నారు. టీఏలు, ఎఫ్ఏలకు మూడు నెలలుగా అందని జీతాలు ఏపీవో, సీవో సిబ్బందికి రెండు నెలలుగా.. ఇబ్బందులు పడుతున్న సిబ్బంది -
ఆనంద సందర్భాలను బాలసదనంలో గడపాలి
కామారెడ్డి క్రైం : పుట్టినరోజు, పండగలు ఏవైనా ఆనంద సందర్భాలను బాలసదనం చిన్నారులతో కలిసి నిర్వహించుకోవాలని, వారిలో సంతోషాన్ని నింపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను కలెక్టర్ గురువారం సందర్శించి వసతులను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బాగా చదువుకుని భవిష్యత్లో ఉన్నత స్థానంలో నిలవాలని చిన్నారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పిల్లలకు దుప్పట్లను అందజేశారు. నూతన భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సూపరింటెండెంట్ సంగమేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా జనాభా
1991లో మొత్తం 7,64,241 పురుషులు 3,81,924 మహిళలు 3,82,3172001లో మొత్తం 8,79,373 పురుషులు 4,38,634 మహిళలు 4,40,7392011లో మొత్తం 9,74,227 పురుషులు 4,79,192 మహిళలు 4,95,035సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చదువులు ఖరీదైపోవడం ఏడాదికేడాది అన్నింటి ధరలు పెరిగిపోయి కుటుంబ పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో సంతానానికి పరిమితులు విధించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి మంచి చదువు ఇవ్వలేమనే భావన పెరిగింది. దీంతో పరిమిత సంతానమే ముద్దనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఏర్పడింది. దీంతో చాలా మంది సంతానం అంటే.. ఒక్కరే చాలని అంటున్నారు. కాదూ కూడదంటే ఇద్దరితో ఆపేద్దామనే భావన మెజారిటీ ప్రజల్లో ఉంది. చదువుకున్న వారే కాకుండా సామాన్య ప్రజలు కూడా చిన్న కుటుంబానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదల శాతం ఏడాదికేడాది తగ్గిపోతోంది. కుటుంబాల సంఖ్య పెరిగినా, జనాభా పెరుగుదల మాత్రం ఆ స్థాయిలో కనబడడం లేదు. కామారెడ్డి జిల్లాలో 2001 జనాభా గణాంకాల ప్రకారం జనాభా వృద్ది 15 శాతం ఉంటే, 2011 కి వచ్చేసరికి జనాభా వృద్ది 8.8 శాతానికి పడిపోయింది. 2021లో చేపట్టాల్సిన జనాభా గణన కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం గడచిన పద్నాలుగేళ్ల కాలంలో జనాభా వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.● 2021లో జనగణన చేపట్టలేదు. అయితే అంచనాల ప్రకారం 2025లో జిల్లా జనాభా 10,54,520 ఉంటుందని, ఇందులో పురుషులు 5,18,702, మహిళలు 5,35,818 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.ఒక్కరు లేదా ఇద్దరు చాలు ఆర్థికంగా ఉన్న వారు ఎంత మంది పిల్లలు ఉన్నా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కా నీ సామాన్య ప్రజలు ఎవరై నా సరే ఒక్కరు, లేదంటే ఇ ద్దరు సంతానం ఉండడమే మంచిది. పిల్లల చదువుల నుంచి వారి భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉండవు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటేనే మేలు. – ధన్రాజ్ – ప్రత్యూష, ఎల్లారెడ్డి ఉమ్మడి కుటుంబాలు అవసరం తక్కువ మంది సంతానంతో కుటుంబాలు చిన్నగా మారిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నపుడు అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండేది. పాత రోజుల్లో ఒక్కో కుటుంబంలో నలుగురైదుగురు సంతానం ఉండేది. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే అయ్యాయి. దీంతో ఎవరికీ ఏమీ తెలియడం లేదు. – సంతోష్కుమార్, ఎల్లారెడ్డి -
‘ఉపాధి’లో పారదర్శకత కోసం విజిలెన్స్ కమిటీలు
బిచ్కుంద(జుక్కల్): ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకంగా చేపట్టేందుకు విజిలెన్స్ కమిటీలు వేస్తున్నామని, ప్రతి నెలా పనులను కమిటీ తనిఖీ చేస్తుందని ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ నిర్మల, పీడీ సురేందర్ అన్నారు. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో 2024–25 ఈజీఎస్ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో రూ.2 కోట్ల 35 లక్షల విలువైన పనులకు అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారన్నారు. ఈజీఎస్ పనులు పర్యవేక్షణ కోసం త్వరలోనే ప్రభుత్వం విజిలెన్ కమిటీలు ఏర్పాటు చేయనుందని, అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో చేపట్టిన కొన్ని పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, మస్టర్లలో తప్పులున్నాయని సోషల్ ఆడిట్ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బంది నుంచి డబ్బులు రికవరీ చేస్తామని పీడీ స్పష్టం చేశారు. క్వాలిటీ కంట్రోల అధికారులు రాఘవన్, విప్లవకుమార్, ఎంపీడీవో గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
డెంగీకి వ్యాక్సిన్ లేదు.. నివారణ ఒక్కటే మార్గం
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో సాధారణంగా విజృంభించే డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో లేద ని, నివారణ ఒక్కటే మార్గమని బాన్సువాడ సబ్ క లెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా మండల పరిషత్ కార్యా లయంలో గురువారం డివిజన్లోని ఆయాశాఖల మండల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని, నిల్వ ఉన్న నీటిలో ఆయిల్బాల్స్ వే యాలని సూచించారు. డ్రెనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ, చెత్తసేకరణ సమర్థవంతంగా అ మలు చేయాలన్నారు. తాగునీటి ట్యాంకులు శు భ్రం చేయిస్తూ బ్లీచింగ్ పౌడర్తో క్లోరినేషన్ చేయాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చే యించాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ ని ర్వహించా లని అధికారులకు సూచించారు. అనంత రం డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పురోగతిపై డివిజన్లోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. డి ప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విద్య, డీఎల్పీవో సత్యనారాయణరెడ్డి, ఆయా మండలాల వైద్యాధికారు లు, ఎంపీడీవోలు, ఎంఈవో, ఎంపీవోలు పాల్గొన్నారు. -
రౌడీషీటర్ గ్యాంగ్ అరెస్ట్
ఖలీల్వాడి: నగరంలో కత్తులతో బెదిరించి నగదు వసూలు చేస్తున్న ఓ రౌడీషీటర్ గ్యాంగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన బర్సాత్ అమీర్ అనే రౌడీషీటర్ తన సభ్యులతో కలిసి గత నెల 7న ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న షేక్ షారుక్ అనే వ్యక్తి నుంచి డబ్బులు ఇవ్వాలంటు కత్తులతో బెదిరించి దాడి చేసి రూ. 400 నగదును లాక్కున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రౌడీషీటర్ బర్సాత్ అమీర్తో పాటు సభ్యులు మహమ్మద్ షేక్ హసీమ్, ముద్దస్సిర్, షేక్ సుల్తాన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
ఎత్తిపోతలకు మళ్లీ తాళం
● భారంగా పథకం నిర్వహణ ● పేరుకుపోయిన రైతుల పన్ను బకాయిలు ● ప్రధాన పంప్హౌస్లో ప్యానెల్ బోర్డు సామగ్రి చోరి ● ఆయకట్టు రైతుల్లో ఆందోళన బోధన్: సాలూర గ్రామ శివారులోని మంజీర నది పై నిర్మించిన ఎత్తిపోతల పథకానికి మళ్లీ తాళం ప డింది. ఏడాదిన్నర క్రితం దుండగులు ఈ పథకానికి సంబంధించిన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి తీగలు, ఆయిల్ను అపహరించారు. దీంతో పంప్హౌస్కు తాళం వేశారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో రూ.10 లక్షలు మంజూరు చే యించి ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టడంతో పథకం వినియోగంలోకి వచ్చింది. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు ఎత్తిపో తల పథకం ప్రధాన పంప్హౌస్లో కరెంట్ మో టార్ల ప్యానెల్ బోర్డు అపహరణకు గురైంది. దీంతో లిఫ్ట్కు మళ్లీ తాళం పడింది. నిర్వహణ కమిటీ వద్ద డబ్బులు లేకపోవడంతో మరమ్మతులో జాప్యం జరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. 2009లో పథకం ప్రారంభం ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎత్తిపోతల పథకానికి రూ.3.80 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తిచేసి 2009లో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1600 ఎకరాలను స్థిరీకరించారు. వర్షాధార మెట్ట భూములు సస్యశ్యామలమయ్యాయి. ఈ పథకాన్ని రైతులు ఐక్యతతో సద్వినియోగం చేసుకోవడంలో సఫలమై లబ్ధిపొందారు. సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల కోసం రైతులు మాగాణి ఎకరానికి రూ.800, మెట్ట ఎకరానికి రూ.600 చొప్పున పథకం కమిటీకి చెల్లిస్తారు. రైతులు చెల్లించాల్సిన పన్ను బకాయిలు పేరుకుపోయాయి. దిగువకు మంజీర జలాలు ఏటా వర్షాకాలం ప్రారంభంలో మంజీర నదిలో వరద నీరు చేరగానే లిఫ్ట్ మోటార్లు ప్రారంభించి గ్రామ శివారులోని చెరువులను నింపుతారు. ఈసారి నెల క్రితమే మంజీరలో వరద నీరు చేరినా మోటార్లు సిద్ధంగా లేకపోవడంతో దిగువకు కదలిపోతున్నాయి. ప్రస్తుతం గ్రామ శివారులోని ఏడు చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. చెరువుల కింద కరెంట్ బోరుబావులున్న రైతులు మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. ఎత్తిపోతల పథకం కింద ఉన్న వందలాది ఎకరాల వర్షాధార మెట్ట భూముల్లో ప్రధానంగా సోయా మొలకెత్తింది. ఈ విషయమై సంఘం చైర్మన్ అల్లె జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా రైతుల సహకారంతో పథకం ప్రారంభానికి అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. -
కుస్తాపూర్ నంది పోచంపాడ్లో ప్రతిష్ఠాపన
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ముంపునకు గురైన కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి నందిని తీసుకొచ్చి పోచంపాడ్ శివాలయంలో ప్రతిష్ఠించారు. ● పోచంపాడ్లో గోదావరి తీరాన కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 1969వ సంవత్సరంలో పునఃనిర్మాణం చేపట్టారు. ● శ్రీరాముడు వనవాస కాలంలో కుస్తాపూర్ వద్ద బ్రహ్మ హత్య పాపం పోయేందుకు పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ● కుస్తాపూర్ వద్ద శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగంగా ప్రసిద్ధి చెందింది. ● నాడు ఆలయం ముంపునకు గురి కావడంతో పోచంపాడ్ వద్ద తిరిగి పునఃనిర్మించారు. కాగా కుస్తాపూర్ నుంచి నందిని మాత్రమే తీసుకొచ్చి నూతన ఆలయంలో ప్రతిష్ఠించినట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. ● శ్రీరాముడు ఇసుకతో చేసిన శివలింగం ముంపునకు గురైన కుస్తాపూర్ ఆలయంలోనే ఉంది. ● ఎస్సారెస్పీ నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చెరువలో ఉన్నప్పుడు ఆలయం బయల్పడుతుంది. అప్పుడు అక్కడ కూడా భక్తులు పూజలు చేస్తారు. మీకు తెలుసా? -
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
● 1.435 కిలోల ఎండు గంజాయి పట్టివేత ఖలీల్వాడి: నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అర్సపల్లి, ఎల్లమ్మగుట్ట, అసద్ బాలానగర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ దాడిలో నిందితులు షేక్ పర్వేజ్, కసిలేరు మాధవ్, నజయా బేగంల నుంచి 1.435 కిలోల ఎండు గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడిలో ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు రాజు, నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు భోజన్న, షమీన్, శివ, సాయి, విష్ణు, అవినాష్ట మంజుల తదితరులు ఉన్నారు. -
కళాశాల సరే.. భవనమేది.?
బాన్సువాడ: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో సతమతమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో 2021లో ప్రభుత్వం జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల ప్రారంభమైన నాటి నుంచి స్థానిక ఉన్నత పాఠశాలలోనే కళాశాల నిర్వహణ కొనసాగుతోంది. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, డీటీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలో ముగ్గురు రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా ఏడుగురు ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంతో పాటు దామరంచ, నస్రుల్లాబాద్ మండలంలోని మీర్జాపూర్లో మూడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్ కోసం బాన్సువాడ, బోధన్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ బీర్కూర్కు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజురు కావడంతో ఆయా ప్రాంతాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కానీ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో ఉన్నత పాఠశాలలో ఉన్న గదుల్లో తరగతుల నిర్వహణ కొనసాగుతుండడంతో విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలకు రావాలంటే బీర్కూర్కు బస్సు సౌకర్యం లేదు. మిర్జాపూర్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో చేరాలని ఉన్నా బీర్కూర్కు బస్సు సౌకర్యం లేక బాన్సువాడకు వెళ్తున్నారు. బరంగెడ్గి, బైరాపూర్, సంబపూర్ గ్రామాల్లో ఉండే విద్యార్థులు చాలా మంది బీర్కూర్కు రావాలని ఉన్నా సరైన సమయంలో బస్సు సౌకర్యం లేక బాన్సువాడ, బోధన్కు వెళ్తున్నారు. పలుమార్లు ఇక్కడి అధ్యాపకులు, నాయకులు ఆర్టీసీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. కళాశాలకు సొంత భవనం నిర్మాణం చేపట్టి, బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. నాలుగేళ్లుగా ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహణ బస్సు సౌకర్యం లేక కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలని విద్యార్థుల వేడుకోలు ఆర్టీసీ అధికారులకు విన్నవించాం బీర్కూర్ చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. కానీ బస్సు సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించాం. మిర్జాపూర్, తిమ్మాపూర్ గ్రామాల నుంచి సుమారు 20 మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. కానీ బస్సు సమస్యతో కళాశాలలో చేరడం లేదు. అధికారులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. –మోహన్రెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపల్, బీర్కూర్ -
పాఠశాలలో పాముల బెడద..!
కామారెడ్డి: నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్ హైస్కూల్లో కొన్నిరోజులుగా పాముల బెడద నెలకొంది. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడం, చుట్టూ పంటపొలాలు ఉండడంతో తరుచూ పాఠశాలలోకి పాములు వస్తున్నాయి. దీనికితోడు పాఠశాలకు సంబంధించి శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల తలుపులు, కిటికీలలో నుంచి పాములు లోనికి ప్రవేశిస్తున్నాయి. గత మంగళవారం సైతం పాఠశాలలోని ఓ తరగతి గది తలుపు వద్ద పాము కుబుసం ఉండడంతో అనుమానంతో ఉపాధ్యాయులు తలుపు వద్దనున్న చెక్కల మధ్య పరిశీలించి చూడగా రెండు పాములు దర్శనమిచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఉపాధ్యాయులు కర్రలతో రెండుపాములను కొట్టి చంపారు. ఒకవైపు విద్యార్థులకు సరిపడా తరగతిగదులు లేకపోవడంతోపాటు శిథిలావస్థకు చేరిన గదుల్లో దర్శనమిస్తున్న పాములతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాల ఆవరణలో ఉన్న శిథిలమైన తరగతి గదులను కూల్చేసి నూతన గదుల నిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు -
వ్యాధుల నియంత్రణకు ప్రచారం కల్పించాలి
బాన్సువాడ రూరల్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా డెంగీ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. దోమలు వృద్ధి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కరపత్రాల ముద్రణకు సహకరించిన ఇన్సూరెన్స్ చీఫ్ అడ్వైజర్ భాగ్యవతి, బాన్సువాడ డిప్యూటీ డీఎంహెచ్వో విద్య, సీహెచ్వో దయానంద్, డాక్టర్ సమీఉల్లా, ఫార్మసిస్టు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేకుండా చూడాలి
కామారెడ్డి: యూరియా కొరత లేకుండా చూడాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం సదాశివనగర్ రైతు వేదిక భవనంలో మండల స్థాయి భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రబీ సీజన్లో పండించిన సన్న వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం తిర్మన్పల్లి గ్రామానికి చెందిన మార నారాయణరెడ్డిని నూతన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, తదితరులు పాల్గొన్నారు. కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలి రాజంపేట: మహిళా సంఘాలు దివ్యాంగ కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. రాజంపేట మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో ఆదాయాభివృద్ధి కార్యక్రమంలో బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి, గ్రామ సంఘం రుణాల రికవరీలో రాజంపేట మండల మహిళా సంఘం మొదటి స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే కొత్తగా మహిళా సంఘాలు దివ్యాంగ కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమాఖ్య అధ్యక్షులు లక్ష్మి, ఏపీఎం సాయిలు, సీసీ శ్రీనివాస్, వీవోఏలు పాల్గొన్నారు. ఆలయాలకు నూతన కార్యవర్గం ఏర్పాటు నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండాబాలాజీ, శంభులింగేశ్వరాలయం, హమాల్వాడి సాయిబాబా ఆలయాలకు నూతన పాలకవర్గం ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి జెండా బాలాజీ ఆలయానికి డైరెక్టర్లుగా ప్రమోద్కుమార్, నర్సింగ్రావు, కిరణ్కుమార్, వేముల దేవిదాస్, లక్ష్మణ్, విజయ, రాజ్కుమార్లు, హమాల్వాడి సాయిబాబా ఆలయానికి డైరెక్టర్లుగా గంగాకిషన్, శ్రీరాంశ్రీనివాస్, పవన్కుమార్, శివలింగం, శాంతాబాయి నియామకం అయ్యారు. శంభులింగేశ్వరాలయానికి డైరెక్టర్లుగా బి మధు, కిశోర్, సంతోష్కుమార్, కమలకిశోర్, మామిడిశేఖర్, రమేశ్, రేఖలను నియమించినట్లు జిల్లా ఎండోమెంట్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
నిజామాబాద్ సిటీ: డంపింగ్ యార్డులో చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సూచించారు. నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డును కమిషనర్ బుధవారం పరిశీలించారు. సిబ్బందితో పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తడి, పొడిచెత్తను వేర్వేరుగా డంపింగ్ చే యాలని ఆదేశించారు. దుర్వాసన రాకుండా చ ర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రభుదాస్కు సూచించా రు. తడిచెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రి య వేగవంతం చేయాలని, ప్యాకెట్లలో నింపి ఎరువులు సిద్ధం చేసి బయటి వ్యక్తులకు విక్రయించాలన్నారు. ఆయా జోన్ కార్యాలయాల వద్ద సేంద్రియ ఎరువుల బ్యాగ్లు అందుబాటులో ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు కృషి చేయాలి కమ్మర్పల్లి: గ్రామాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం కమ్మర్పల్లి పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్లోని రికార్డులు, కేసు డైరీలు, నిత్య కార్యకలాపాల నమోదులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన పరేడ్లో పాల్గొన్నారు. భీమ్గల్ సీఐ పి సత్యనారాయణ, ఎస్సై జి అనిల్రెడ్డి ఉన్నారు. -
కార్మికులు కలిసి కట్టుగా పోరాటం చేయాలి
సాక్షి నెట్వర్క్:జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు కలిసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలను అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
పంటకు లేదు ‘ధీమా’!
కామారెడ్డి క్రైం: అధిక వర్షాలు, వరదలు, అకాల వర్షాలు, వడగండ్లు.. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో ఏటా పంటలకు నష్టం వాటిల్లుతూనే ఉంది. దీంతో అన్నదాతలు నష్టపోతున్నారు. పంటలకు బీమా లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో 3.28 లక్షల మంది రైతులున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.24 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రధాన పంటగా వరి 3 లక్షలకుపైగా ఎకరాలలో సాగు కానుంది. ఇప్పటివరకు 1.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇందులో 32,552 ఎకరాల్లో మక్క, 51,802 ఎకరాల్లో సోయా, 17,713 ఎకరాల్లో పత్తి, 6,965 ఎకరాల్లో కంది, దాదాపు 35 వేల ఎకరాల్లో వరి వేశారు. 2017–18 వరకు రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలులో ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలును నిలిపివేసింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు బీమా అందకుండాపోయింది. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతేడాది ఫసల్ బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరిపింది. బీమా కంపనీలతో సంప్రదింపుల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈసారి కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పంటల బీమా విషయంలో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది మార్చిలో కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో 18,212 మంది రైతులకు సంబంధించిన 10,328 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రూ. 16 కోట్ల పరిహారం విడుదల చేసింది. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు మరింత మేలు జరిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. బీమా పథకాన్ని విస్మరించిన ప్రభుత్వం అకాల వర్షాలు, వరదలతో ఏటా దెబ్బతింటున్న పంటలు నష్టపోతున్న రైతన్నలుసమాచారం లేదు.. పంట నష్టం జరిగిన ప్రతిసారి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తున్నాం. బీమా పథకాన్ని అమలు చేయడంపై ఇప్పటివరకై తే మాకు ఎలాంటి సమాచారం రాలేదు. దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. – తిరుమల ప్రసాద్, డీఏవో, కామారెడ్డి -
అసంపూర్తిగా సమీకృత మార్కెట్
ఎల్లారెడ్డి: పట్టణ ప్రాంతాలైన కార్పోరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నిత్యావసరాలైన కూరగాయలు, మాంసం ఉత్పత్తులు, పండ్లు ఒకేచోట లభించేందుకు గత ప్రభుత్వం సమీకృత మార్కెట్ల(ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను మంజూరు చేసింది. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం కామారెడ్డికి రూ. 4 కోట్లు, ఎల్లారెడ్డి, బాన్సువాడలకు రూ. 2 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఈ పనులకు 2021–22 ఆర్థిక సంవత్సరంలో టెండర్లు పూర్తి చేశారు. 2022 లో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని నిర్మాణ పనులను ప్రారంభించారు. అగ్రిమెంట్లు చేసుకున్న కామారెడ్డి, బాన్సువాడ కాంట్రాక్టర్లకు టెండర్ మొత్తంలో సగభాగాన్ని అడ్వాన్స్గా ఇచ్చారు. అయితే ఎల్లారెడ్డిలో మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో డీఎస్పీ, నీటిపారుదల, ఆర్అండ్బీ కార్యాలయాలు ఉండడంతో వాటిని ఖాళీ చేయడానికి చాలా కాలం పట్టింది. 2022లో అగ్రిమెంట్ చేసుకున్నా మార్కెట్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో కార్యాలయాలను కూల్చివేసి స్థలం అప్పగించే ప్రక్రియ 2023 డిసెంబర్కు కానీ సాధ్యం కాలేదు. నిర్మాణ పనులు చేపట్టడంలో సుదీర్ఘ జాప్యం జరగడంతో ఎల్లారెడ్డి కాంట్రాక్టర్కు అడ్వాన్స్ అందలేదు. అయినా బిల్లులు వస్తాయన్న ఆశతో సొంత డబ్బులతో పనులు చేశారు. గతేడాది ఆగస్టు వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. చేసిన పనులకు ఇప్పటివరకు నయా పైనా బిల్లు రాలేదని కాంట్రాక్టర్ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 1.60 కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్త్వరలో నిధులు.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ మార్కెట్లో ఎంత వరకు పనులు జరగాయన్న విషయమై ప్రభుత్వం నివేదికలు సేకరిస్తోంది. త్వరలోనే నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి. – మహేశ్కుమార్, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఇంటెలిజెన్స్ ఎస్పీ రంజన్ రతన్ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980–82 బ్యాచ్కు చెందిన ఇంటర్ పూర్వ విద్యార్థులు ఇదే కళాశాలలో గతేడాది టాపర్లుగా నిలిచిన మహాలక్ష్మి, నందినీలకు రూ. 10 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సైతం ఇదే కళాశాలలో ఇంటర్ చదివానన్నారు. చదువుతో పాటు క్రీడలలో రాణించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. వచ్చే ఏడాది ఇంటర్ టాపర్లకు రూ. 25 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ విశాల, లెక్చరర్లు రామచంద్రరావు, రమేష్, పూర్వ విద్యార్థులు ఆంజనేయులు, మూర్తి పాల్గొన్నారు. -
పాఠశాల పునఃప్రారంభం
సదాశివనగర్: దగ్గి గ్రామంలో మూతపడ్డ ప్రాథమిక పాఠశాలను బుధవారం డీఈవో రాజు పునఃప్రారంభించారు. గతంలో విద్యార్థులు లేకపోవడంతో ఈ పాఠశాలను మూసివేశారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్రెడ్డి గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. దీంతో ఈ ఏడాది పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలను పునఃప్రారంభించారు. కార్యక్రమంలో సీఆర్పీ నందురావు, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొత్త సబ్స్టేషన్లతో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా కామారెడ్డి అర్బన్: కొత్త సబ్స్టేషన్లతో మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఎస్ఈ శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి కామారెడ్డి సర్కిల్ పరిధిలో నాలుగు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చిట్యాల, మహ్మద్నగర్ సబ్స్టేషన్ల పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా, బోర్గాం, కామారెడ్డి ఇండోర్ సబ్ స్టేషన్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. కొత్త సబ్స్టేషన్లలో స్కాడా అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికను వినియోగిస్తున్నామని వివరించారు. దీని ద్వారా రియల్ టైం ఫీడర్ మానిటర్ చేయగలమని పేర్కొన్నారు. బోనాల పండుగకు ఆహ్వానం దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు బుధవారం జిల్లాకేంద్రానికి వెళ్లి ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డిలను కలిశారు. ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, అర్చకుడు శరత్ చంద్ర, బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్రెడ్డి పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ తనిఖీ మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను బుధవారం కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కామారెడ్డి రూరల్ సీఐ రామన్, ఎస్సై అనిల్ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసి పదోన్నతిపై వెళ్తున్న కానిస్టేబుళ్లు రామారావు, స్వామిలను ఎస్సై అనిల్ సన్మానించారు. -
హత్య!
వారానికోపిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మి (50) ఈనెల 3న హత్యకు గురైంది. అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగిన లక్ష్మిని.. ఆమె అల్లుడు కమ్మకత్తితో దాడి చేసి చంపాడు. ఈ కేసులో అల్లుడు బాలరాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ ఏడాది జనవరి 19న రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవి (41) అనే వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో సొంత అన్న సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అన్న కిష్టయ్య, అన్న కొడుకుతో పాటు మరో ముగ్గురు జైలు పాలయ్యారు. గతనెల 5న పిట్లం మండలం చిన్నకొడప్గల్ పంచాయతీ కార్యదర్శి ధరావత్ కృష్ణ (28) హత్యకు గురయ్యాడు. కేసును పరిశోధించిన పోలీసులు.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం జరిగిందని తేల్చారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. మే 24న లింగంపేట మండలం అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ ఫకీరా (46) హత్యకు గురయ్యాడు. కుటుంబంలో పెళ్లి విషయంలో తలెత్తిన గొడవల నేపథ్యంలో ఫకీరాను ఆయన కొడుకు ప్రకాశ్ గొడ్డలితో తలపై కొట్టడంతో చనిపోయాడు. కొన్నాళ్ల క్రితం పిట్లం మండల కేంద్రానికి చెందిన సాబేరా బేగం(60)ను ఆమె కొడుకు షాదుల్ రోకలిదుడ్డుతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గతంలో షాదుల్ తన సోదరుడిని హతమార్చాడు. ఆ కేసులో ఫిర్యాదుదారైన తల్లితో కేసు రాజీ కోసం వచ్చి హతమార్చాడు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలకు తోడు కుటుంబ కలహాలు హత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని మనిషి మృగంలా మారుతున్నాడు. మద్యం మత్తు ఆపై కోపోద్రేకంతో విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నాడు. జిల్లాలో వారానికో హత్య కేసు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● జిల్లాలో పెరుగుతున్న నేర సంస్కృతి ● మద్యం మత్తు, క్షణికావేశంతో దారుణాలు ● ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలతోనే ఎక్కువ నేరాలు ● ఆందోళన కలిగిస్తున్న ఘటనలు -
సార్వత్రిక సమ్మె విజయవంతం
కామారెడ్డి టౌన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు పాలడుగు సుధాకర్ పేర్కొన్నారు. సమ్మె నేపథ్యంలో జిల్లాకేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, ఏఐటీయూసీ నేతలు దశరథ్, బాల్రాజ్, ఆయా సంఘాల నాయకులు నర్సింలు, రాజనర్సు, వెంకట్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవా న్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ తీశారు. కొత్త బస్టాండ్ వద్ద పరిషత్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రోహిత్, నాయకులు నరేష్, స్వామి, వెంకటస్వామి, రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో ఏబీవీపీ ఆవిర్భా వ వేడుకలను జరిపారు. అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో భరతమాత చిత్రపటానికి పూల మాలలు వేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ కృషి చేస్తోందన్నారు. నేతలు మహేష్, వినోద్, తులసి, దేవేందర్, రాజేష్, కాశి పాల్గొన్నారు. -
జై అమర్నాథ్..
అమర్నాథ్ యాత్రలో ఇందూరు జిల్లా బృందంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భూతల స్వర్గంగా పేరుపొందిన కళ్మీర్లోని పహల్గామ్లో మన పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రమూకలు దాడికి పాల్పడితే భారత ప్రభుత్వం, సైన్యం స్పందించిన తీరుపై యావత్ దేశం గర్వంతో ఉప్పొంగింది. భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచారు. పహల్గామ్ మారణహోమం తమను ఏమాత్రం భయపెట్టలేదని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటక రంగ అభివృద్ధితో ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్న కశ్మీర్లో ఆధ్యాత్మిక, సాధారణ పర్యాటకానికి దన్నుగా నిలబడుతున్నారు. ఇందూరు జిల్లా వాసులు సైతం కశ్మీర్ పర్యటకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి అమర్నాథ్ యాత్ర, కశ్మీర్ యాత్ర కోసం ఇప్పటి వరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి 124 మంది మెడికల్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇంకా మరికొందరు ఈ సర్టిఫికెట్లు తీసుకునే పనిలో ఉన్నారు. జిల్లా నుంచి పలువురు బృందాలుగా వెళుతున్నారు. మరోవైపు సిద్ధిపేటకు చెందిన అమర్నాథ్ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో యాత్ర మార్గంలో అన్నదానం చేస్తున్నారు. ఈ అమర్నాథ్ సేవాసమితిలో నిజామాబాద్ జిల్లా వాసులు సభ్యులుగా ఉన్నారు. సైన్యం మీద అపారమైన నమ్మకంతో కశ్మీర్ యాత్రకు జిల్లా వాసులు మంచులింగాన్ని దర్శించుకున్న యాత్రికులు పహల్గామ్ ఘటనతో బెదిరేది లేదంటున్న శివయ్య భక్తులు -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కామారెడ్డి టౌన్: పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. మురికి కాలువల ఆక్రమణలను సీరియస్గా తీసుకుంటామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నామని, వర్షాకాలంలో పట్టణవాసులు ఇబ్బందులకు గురికాకుండా రోడ్లపై గుంతల మరమ్మతులకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు. కామారెడ్డి బల్దియా పరిధిలోని సమస్యలపై ‘సాక్షి’ వరుసగా కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ మున్సిపల్ కమిషనర్ను ఇంటర్వ్యూ చేసింది. పట్టణంలోని ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన ‘సాక్షి’కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వ్యూ వివరాలు.. రోడ్ల మరమ్మతులకు నిధులు.. పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు కలెక్టర్ అనుమతితో రూ. 10 లక్షలు కేటాయిస్తున్నాం. ప నులను రెండు రోజు ల్లో ప్రారంభిస్తాం. అ శోక్నగర్ ప్రధాన రో డ్డు నిర్మాణానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. వీధి దీపాల కోసం.. వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టర్ నుంచి సమస్య ఉంది. కాంట్రాక్టర్కు రూ. 4 కోట్ల బకాయిలుంటే ఇటీవల రూ. కోటి చెల్లించాం. వీధి దీపాల కొనుగోలుకు అత్యవసరంగా రూ. 10 లక్షలను కలెక్టర్ ఆదేశాలతో కేటాయించాం. అత్యవసరం అయిన చోట ముందుగా లైట్లను బిగిస్తాం. విద్యుత్ బిల్లులు నెలకు రూ. 40 లక్షలు వస్తుండడంతో బల్దియాకు ఆర్థిక భారమవుతోంది. నీటి సమస్య లేకుండా చూస్తున్నాం పట్టణంలో వేసవి సీజన్లో ప్రణాళికబద్ధంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి సమస్యను అధిగమించాం. ప్రస్తుతం నీటి సమస్య రెండు మూడు కాలనీలలో మాత్రమే ఉంది. అమృత్జల్ పథకంలో రూ. 93 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయితే సమస్య తీరనుంది.2 లక్షల మొక్కలు నాటుతాంవన మహోత్సవంలో భాగంగా పట్టణంలో 2 లక్షల మొక్కలను నాటాలన్నది లక్ష్యం. ప్రతి ఇంటికి మొక్కలను సరఫరా చేస్తాం. మున్సిపల్ ఖాళీ స్థలాలు, ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటుతాం. సీజనల్ వ్యాధుల నివారణ కోసం మురికి కాలువలు, గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయిస్తాం. వార్డులలో ఫాగింగ్ చేస్తున్నాం. ప్రైవేట్ ఓపెన్ స్థలాల శుభ్రత కోసం యజమానులకు నోటీసులను జారీ చేస్తాం. మున్సిపల్ ఓపెన్ స్థలాల పరిరక్షణ కోసం ఎల్ఆర్ఎస్ నిధులు నుంచి హెచ్చరిక బోర్డులు, కంచెలను ఏర్పాటు చేస్తాం.ఆక్రమణలను తొలగిస్తాం..పట్టణంలో మురికి కాలువలపై స్లాబ్ వేయడం, ఆక్రమణలు చేయడాన్ని సీరియస్గా తీసుకున్నాం. ‘సాక్షి’లో కథనం వచ్చిన మరుసటి రోజే టౌన్ప్లానింగ్ అధికారులతో దీనిపై సమీక్షించా. కాలువలపై స్లాబ్లను కూల్చివేయడానికి నూతన బ్రేకర్ను కొనుగోలు చేసాం. కార్మికుడు శుభ్రం చేయకుండా వీలులేకుండా ఉన్న మురికి కాలువలపై ఆక్రమణలను తొలగిస్తాం. వ్యాపారులు, ఇంటి యజమానులు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకుని సహకరించాలి.సానిటేషన్ పనులను పర్యవేక్షిస్తున్నాం..పట్టణంలో జనాభా నిష్పత్తి కంటే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువగానే ఉన్నారు. నిత్యం కొందరు గైర్హాజరవుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. అయినా అన్ని వార్డులో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా పనులు చేయిస్తున్నాం. అక్కడక్కడ పక్కా డ్రెయినేజీలు లేకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్వరలో టెండర్లు నిర్వహించి మురికి కాలువలు, రోడ్ల నిర్మాణాలు చేపడతాం. ఇంటింటా చెత్త సేకరణ చేసే ఆటోలు, చెత్తను డంపింగ్ చేసే ఆటోల మరమ్మతులు, సర్వీసింగ్ కోసం డీఆర్సీ వద్ద ప్రత్యేక షెడ్డు వేశాం. చెడిపోయిన తక్షణమే వాహనాలకు మరమ్మతులు చేయిస్తాం. డంపింగ్ యార్డు వద్ద వర్మికంపోస్టు పనులు ప్రారంభం కాగానే తడి–పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తాం. వార్డుల్లో సానిటేషన్ సమస్యలుంటే నేరుగా నాకు ఫోన్ చేసినా స్పందిస్తా. భారీ కాలువలలోంచి పూడిక తీసేందుకు రూ. 5 లక్షలు కేటాయించాం. వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో ఈ పనులను పూర్తి చేస్తాం.నోటీసులిస్తాం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నాం రోడ్లపై గుంతల మరమ్మతులకు నిధులు కేటాయించాం డ్రెయినేజీలపై ఆక్రమణలను సీరియస్గా తీసుకుంటాం పట్టణ సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు ‘సాక్షి ’ ఇంటర్వ్యూలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిసెల్లార్లను వాహనాల పార్కింగ్కు వినియోగించుకోవాలి. వాటిలో దుకాణాలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. పట్టణంలో వాహనాల పార్కింగ్ సమస్యను అధిగమించాలంటే యజమానులూ సహకరించాలి. నిజాంసాగర్ చౌరస్తాలో జంక్షన్ విస్తరణ ఆటంకాల సమస్య కొలిక్కి వచ్చింది. త్వరలో పనులు చేపడుతాం. -
బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి
కామారెడ్డి అర్బన్: మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన మండల ఇందిర మహిళా శక్తి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హతగల మహిళలందరిని మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చందర్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, డీపీఏం(ఫైన్సాన్స్) రాజయ్య, ఎంపీడీవో ఎఫ్సిబా, ఏపీఎం మోహిజ్, సీసీలు విశ్వనాథం, అంజగౌడ్, స్వరూప, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
బలగాలు గైడ్ చేస్తున్నాయి
అమర్నాథ్ యాత్రలో భారత సైనికులు చక్కగా గైడ్ చేస్తున్నారు. మర్యాద పూర్వకంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్బందులేమైనా ఉంటే అడుగుతున్నారు. కశ్మీర్లో చాలా చోట్ల రోడ్లు, వంతెనల నిర్మాణాలు తుది దశకు వచ్చాయి. టన్నెల్స్ సైతం ప్రారంభమయ్యాయి. తెలుగు వారు చాలామంది ఉన్నారు. మేము పదిమంది బృందంగా నిజామాబాద్ నుంచి వెళ్లాం. శ్రీనగర్లో దాల్ సరస్సు చాలా బాగుంది. వంతెనలు, రోడ్లు పూర్తి అయితే మరింత తక్కువ సమయంలో యాత్ర పూర్తి చేయొచ్చు. – వడ్డి జనార్దన్ రెడ్డి, వరలక్ష్మి, నవీపేట -
మంత్రి ఆదేశాలను అమలు చేయాలి
కామారెడ్డి టౌన్: జుక్కల్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఆయా అంశాలను పక్షం రోజుల్లో కార్యాచరణలోకి తీసుకురావాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో అదనంగా అవసరమైన సబ్ స్టేషన్ల మంజూరు కోసం ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఎస్ఈ శ్రావణ్కుమార్ను ఆదేశించారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి సూచించారు. జుక్కల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు, ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీహెచ్ఎస్ విజయలక్ష్మిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అటవీ భూములలో 159 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఆర్వోఎఫ్ఆర్ చట్టాల ప్రకారం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్కు సూచించారు. పెద్దకొడప్గల్, పిట్లం మండలాలలో అధికారులు జొన్న పంట వివరాలను వాస్తవానికి విరుద్ధంగా నమోదు చేశారని, తద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతాయని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఏవో తిరుమల ప్రసాద్ను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, డీఎంహెచ్వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.పాఠశాల తనిఖీకామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు యూనిఫాంలు పంపిణి చేశారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సబ్స్టేషన్లు, ట్రామాకేర్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపండి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
అమర్నాథ్ యాత్రను ఎప్పటికీ మరిచిపోలేము
అమర్నాథ్ యాత్రలో భాగంగా కశ్మీర్లో వైష్ణోదేవి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం. పహల్గామ్ దాడి తరువాత భారత ప్రజలు భయపడకుండా అమర్నాథ్ యాత్రకు తరలివస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత సైన్యం మీద ఉన్న అపార విశ్వాసానికి ఇది నిదర్శనం. యాత్ర కోసం భారత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, కల్పించిన భద్రత అత్యద్భుతంగా ఉన్నాయి. అమర్నాథ్ యాత్ర పొడవునా సైన్యం అడుగడుగునా పహారా కాస్తోంది. దీంతో ఏమాత్రం భయం లేకుండా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. భయం అనేదే లేకుండా యాత్ర చేమొచ్చు. కశ్మీర్ అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రకృతి కూడా ప్రస్తుతం పూర్తి అనుకూలంగా ఉంది. జూలై, ఆగస్టులో సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. అమర్నాఽథ్ యాత్రలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా అందిస్తున్నారు. దక్షిణ భారత, తెలుగు లంగర్లు చాలా ఉన్నాయి. – కరుటూరి పాపారావు, వెంకట సుబ్బలక్ష్మి, జైతాపూర్ -
వైద్య కళాశాల ప్రిన్సిపల్గా వాల్యా
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా బి.వాల్యా నియమితులయ్యారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్గా పెరుగు వెంకటేశ్వర్లును నియమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంఈ), రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ క్రిస్టీనా జెడ్ చోంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వాల్యా గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ వెంకటేశ్వర్లు మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం ప్రమోషన్ కల్పించి, కామారెడ్డికి బదిలీ చేసింది. ఇప్పటి వరకు కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ శివప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఫరీదా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రారంభం నుంచి ఇన్చార్జీల పాలనే.. కామారెడ్డి మెడికల్ కళాశాల, జీజీహెచ్లు ప్రారంభం అయిన నాటి నుంచి ఇన్చార్జీల పాలనే కొనసాగింది. జీజీహెచ్ ఇన్చార్జీల పాలనలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయి ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ వస్తుండడంతో వైద్యశాల, జీజీహెచ్లలో సమస్యలు పరిష్కారం అవుతాయని, పాలన గాడిలో పడుతుందని భావిస్తున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
జుక్కల్ అభివృద్ధి.. నా బాధ్యత
నిజాంసాగర్/బిచ్కుంద: వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో రెండుమూడేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నిజాంసాగర్ మండలం నర్సింగ్రావ్పల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి వద్ద నాందేడ్ – సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మంత్రి మొక్కలు నాటి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. బిచ్కుంద – డోంగ్లీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం బిచ్కుందలోని బండాయప్ప ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారం అనుభవించిన ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. బిచ్కుంద –కుర్లా వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 13.2 కోట్లు మంజూరు చేశామన్నారు. శాంతాపూర్ నుంచి దడ్గి వరకు రోడ్డుకు రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. మేనూర్ నుంచి డోంగ్లీ వరకు రోడ్డుకు రూ. 7.5 కోట్లు, అన్నాసాగర్ నుంచి జుక్కల్ రోడ్డుకు రూ. 10 కోట్లు, జుక్కల్ నుంచి మద్నూర్ వరకు రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బిచ్కుంద, పిట్లం, జుక్కల్, డోంగ్లీ మండలాల్లో 6 విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేయిస్తానన్నారు. బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయిస్తానన్నారు. త్వరలోనే జుక్కల్కు ముఖ్యమంత్రిని తీసుకువస్తానన్నారు. హైలెవల్ బ్రిడ్జి ప్రారంభంపిట్లం: తిమ్మనగర్ శివారులోని నల్లవాగుపై రూ. 4.86 కోట్లతో నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. పిట్లం మండలానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి స్థానిక నాయకులతో మాట్లాడారు.గత ప్రభుత్వం అన్యాయం చేసింది..గత ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అన్యాయం చేసిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆరోపించారు. నియోజకవర్గానికి అవసరమైన రోడ్లు, ప్రాజెక్టులు, సబ్స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. లెండి ప్రాజెక్టుతోపాటు నాగమడుగు ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, కాంగ్రెస్ నాయకులు విఠల్రెడ్డి, మనోజ్ పటేల్, మల్లికార్జున్, భాస్కర్రెడ్డి, రవీందర్రెడ్డి, రమేశ్ దేశాయ్, మల్లికార్జునప్ప షెట్కార్, వెంకట్రెడ్డి, నాగ్నాథ్ పటేల్, నాగ్నాథ్, షేక్ అజీం లాలా, గంగాధర్, రవి పటేల్, సాహిల్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. రెండుమూడేళ్లలో రూపురేఖలు మారుస్తా ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం -
‘ఆత్మ’కు ఏమయ్యింది!?
ఎల్లారెడ్డి: వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి చైతన్యవంతులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ) పథకం నిర్వీర్యమవుతోంది. నిధులు లేకపోవడంతో ఆత్మ కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. పథకం ఇలా.. ఈ పథకం అమలు కోసం ఏడీఏ పరిధిని ఒక బ్లాక్గా నిర్ణయించారు. ప్రతి బ్లాక్కు ఒక చైర్మన్ ఉండేవారు. జిల్లా కమిటీలో జిల్లా చైర్మన్ను అనుసంధానంగా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉండగా, బ్లాక్ చైర్మన్కు అనుసంధానంగా ఏడీఏ ఉన్నారు. ఏడీఏ పరిధిలోని రైతులకు పలు అంశాలలో అవగాహన కల్పించేందుకు బ్లాక్ లెవల్ ఫార్మర్స్ అడ్వయిజరీ కమిటీలను ఏర్పాటు చేసేవారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని కల్పించేందుకు క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, సదస్సులు, పొలం బడులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల వద్దకు పర్యటనలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాల వల్ల తెలుసుకున్న అంశాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఈ పథకంకోసం కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులను కేటాయించేవి. అయితే దశాబ్ద కాలంగా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. మూస పద్ధతుల్లోనే సాగు.. అన్నదాతలకు ఉపయోగపడని పథకం నిధులు కేటాయించి మనుగడలోకి తేవాలని కోరుతున్న రైతులుజిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 5 లక్షలకు పైచిలుకు ఎకరాలలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో మూడు లక్షలకుపైగా ఎకరాలలో వరి పంటే సాగవనుంది. అది కూడా మూస పద్ధతుల్లోనే.. చాలావరకు రైతులకు అవగాహనలేక ఆధునిక సాగు పద్ధతులు అవలంబించడం లేదు. ఆత్మ పథకం క్రియాశీలకంగా అమలై ఉండి ఉంటే రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన ఏర్పడే అవకాశాలుండేవి. పాడి, కోళ్ల, గొర్రెల పెంపకంపైనా అవగాహన పెరిగేది. దీంతో వ్యవసాయం లాభదాయకంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి ఆత్మలాంటి కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.ప్రభుత్వానికి నివేదించాం.. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే ఆత్మ పథకం నిధులు లేక ఉపయోగపడడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో ఈ పథకాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నారు. – తిరుమల ప్రసాద్, డీఏవో -
ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. లెక్చరర్ల కొరత లేకుండా చూశామని, అడ్మిషన్లపైనా దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇంటర్ ప్రవేశాల గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రవేశాలపెంపు, ఫలితాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. 6 వేల అడ్మిషన్లు లక్ష్యం.. ఈ విద్యాసంవత్సరంలో 6 వేల అడ్మిషన్ల లక్ష్యంతో సాగుతున్నాం. ఇందుకోసం లెక్చరర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో ఎస్సెస్సీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థిని కలిశారు. దీంతో ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 50 శాతం ప్రవేశాలు జరిగాయి. మిగిలిన లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత చదువుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అర్హులైన, అనుభవజ్జులైన అధ్యాపకులున్నారు. అర్హులకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువుంది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోనే చేరాలి. లెక్చరర్ల కొరత లేదు.. జిల్లాలో 242 మంది రెగ్యులర్ లెక్చరర్లతో పాటు 58 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని కళాశాలలకు చేరాయి. మధ్యాహ్న భోజనం పథకం గురించి ఇంకా ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవు. ● ప్రభుత్వం సర్కారు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అవసరమైన మరమ్మతులు, భవనాల నిర్మాణం కోసం రూ. 3.28 కోట్లు మంజూరు చేసింది. ఆయా పనులను త్వరలో ప్రారంభిస్తాం. ఈ నిధులలో కళాశాలు అభివృద్ధి కానున్నాయి. అలాగే విద్యార్థులకు క్రీడల కోసం ప్రతి కళాశాలకు రూ. 10 వేల చొప్పున నిధులు వచ్చాయి.ఫీజుల విషయంలో..ప్రణాళికబద్ధంగా..గత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫలితాలు నిరాశకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో ఈసారి మంచి ఫలితాలను సాధించేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్నాం. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నాం. తరచూ వారితో సమావేశాలు నిర్వహించి, ప్రగతిని తెలుసుకుంటాం. అలాగే పది మంది విద్యార్థుల బాధ్యతను ఒక లెక్చరర్కు అప్పగించి వారిపై దృష్టిపెడతాం. ప్రతినెల ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి, మార్కులు తక్కువ వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఈసారి విద్యార్థులకు ఏప్సెట్, జేఈఈ, ఐఐటీ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి రూ. 3.28 కోట్లతో కళాశాలల అభివృద్ధికి చర్యలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాంప్రైవేట్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు రూపేణ ప్రథమ సంవత్సరానికి రూ. 1,760, ద్వితీయ సంవత్సరానికి రూ. 1,940 ఫీజు మాత్రమే వసూలు చేయాలి. వసతి, ఇతర సదుపాయాలు, ఆయా శిక్షణల కోసం కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ తీర్మానం మేరకు ఫీజులు వసూలు చేస్తే ఆ అంశం మా పరిధిలోకి రాదు. అనుమతులు ఒకచోట తీసుకుని, మరోచోట తరగతులు, కోచింగ్లు నిర్వహిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఈసారి జిల్లాలోని 20 కళాశాలల్లో అన్ని తరగతి గదుల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేశాం. వాటి సాయంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులే తరగతులను మానిటరింగ్ చేస్తారు. జిల్లా కేంద్రం నుంచి నేను కూడా పర్యవేక్షిస్తా. -
‘మహిళలు మరింతగా అభివృద్ధి చెందాలి’
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వం ఇస్తున్న సహకారంలో మరింతగా ఆర్థికావృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు. సోమవారం శ్రీలక్ష్మి నర్సింహ జిల్లా మహిళా సమాఖ్య, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో కామారెడ్డి మండల సమాఖ్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో చందర్ నాయక్ మాట్లాడుతూ మహిళలు పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తుల తయారీ, మహిళా శక్తి క్యాంటిన్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతేడాది జిల్లాలో కొత్తగా 8,800 మంది సభ్యులుగా చేరారన్నారు. స్కూల్ యూనిఫాంలు కుట్టడం, కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం ద్వారా రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప తెలిపారు. 2025–26 ప్రణాళికలో భాగంగా పెట్రోలు బంక్లు, గోదాములు, రైస్ మిల్లులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ ద్వారా ఆదాయం పొందాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. రూ. 5 కోట్లతో చేపట్టిన జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. దివ్యాంగ, వృద్ధ, కిషోర మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని, మహిళలకు రక్త పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, సమాఖ్య జిల్లా కార్యదర్శి రాజమణి, కోశాధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రుద్రూర్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
రుద్రూర్: కాకతీయుల కాలంలో రాణీ రుద్రమదేవి వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినందున గ్రామానికి రుద్రూర్గా పేరు వచ్చింది. ● రాణీ రుద్రమదేవికి సంబంధించిన సైనిక స్థావరం రుద్రూర్లో ఉండేదని గ్రామపెద్దలు చెబుతున్నారు. ● గ్రామానికి మూడు వైపుల బురుజులు (గడి)లు, ఒక వైపు చెరువు ఉంది. కాల క్రమేణ రెండు అంతరించిపోగా రాతితో నిర్మించిన ప్రధాన ద్వారం చెక్కు చెదరకుండా ఉంది. ● గ్రామం మధ్యలో రాతితో కట్టిన పెద్ద పురాతన కోట (బురుజు) ఉంది. ఇందులో కాకతీయుల సైనిక స్థావరం ఉండేది. ఇక్కడి నుంచి సొరంగ మార్గం (బావి) రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వరకు ఉన్నట్టు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ● కాకతీయుల కాలంలో రాతితో నిర్మించిన రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. మీకు తెలుసా? -
మొక్కలు నాటి సంరక్షించాలి
దోమకొండ: మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ అన్నారు. సోమవారం కళాశాల ఆవరణలో ప్లాంటేషన్ డే కార్యక్రమం నిర్వహించి మొక్కలను నాటారు. ఎంపీడీవో ప్రవీన్కుమార్, ఏపీవో రజని, పంచాయితీ కార్యదర్శి యాదగిరిగౌడ్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. అమ్మ పేరు మీద ఒక మొక్క బీబీపేట: వన మహోత్సవంలో భాగంగా సోమవారం ఉప్పర్పల్లిలో ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద అనే పేరుతో ప్రభుత్వం మొక్కలు నాటాలని పిలుపునిచ్చిందని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను సోమవారం ఎంపీడీవో సంతోష్కుమార్ పరిశీలించారు. ఎంపీవో సురేందర్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అచ్చాయపల్లిలో సోమవా రం వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామశివారులోని చెరువుకట్టపై ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరాజు, ఎకై ్సజ్ అధికారులు స్రవంతి, లావణ్య, రజిత, రవి, సంజీవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ అన్నారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఫీల్డు అసిస్టెంటులు, గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో 60 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉందన్నారు. రెండు రోజుల్లో లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. నర్సరీలలో అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంపీవో సవిత, ఏపీవో కృష్ణగౌడ్, తదితరులుపాల్గొన్నారు.