Kamareddy
-
ఆన్లైన్ బెట్టింగ్లో రూ.కోటి రూపాయలు పోగొట్టుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి!
కామారెడ్డి క్రైం: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ యువకుడు.. అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి మున్సిపా లిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవుల సంజయ్ (28)సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొద్ది రోజులుగా ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ కోసం అప్పులు చేశాడు. ఆరు నెలల కిందట అప్పుల విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపో యింది. అప్పులు సుమారు రూ. కోటి వరకు చేరుకోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక, జీవితంపై విరక్తి చెంది సోమవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య శ్రీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని దేవుని పల్లి ఎస్సై రాజు తెలిపారు. -
కుటుంబ కలహాలతో ఒకరి ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్కు చెందని తూర్పటి మోహన్(28) నిత్యం మద్యం తాగి వస్తుండటంతో భార్య కాశవ్వ మందలించేది. అలాగే తరుచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. సోమవారం రాత్రి మద్యం తాగివచ్చిన మోహన్, భార్యతో గొడవపడి, అర్ధరాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మనస్తాపం చెంది గ్రామశివారులోని తన తల్లి సమాధి వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఇందల్వాయి మండలంలో ఒకరు.. ఇందల్వాయి: మండలంలోని ఓ వ్యక్తి మానసికంగా సరిగా లేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన గాండ్ల శ్యామ్(24) గతంలో గల్ఫ్కి వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం ఇంటివద్దనే వ్యవసాయ పనులతోపాటు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈమధ్య అతను మానసికంగా ఆరోగ్యంగా లేకపోవడంతోపాటు మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి ఇంకా పెళ్లి కాలేదని, మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మనోజ్ తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి
బాల్కొండ: పంటభూమిని దుక్కి దున్నుటకు ఓ వ్యక్తి ట్రాక్టర్పై వెళుతుండగా ప్రమాదవశాత్తు వాహనం బోల్తాపడి మృతిచెందాడు. మెండోరా ఎస్సై నారాయణ తెలిపిన వివరాలు ఇలా.. కర్నేబోయిన శ్రీనివాస్(27) అనే వ్యక్తి బతుకు దెరువు కోసం మెదక్ నుంచి వెల్కటూర్కు కొన్నేళ్ల క్రితం వలస వచ్చాడు. గ్రామంలో ఇతరుల భూములను కౌలుపై సాగు చేసేవాడు. ఈక్రమంలో గ్రామానికి చెందిన గంగాధర్ ట్రాక్టర్ను మంగళవారం అతడు తీసుకుని తాను కౌలు చేస్తున్న పంట భూమిని దుక్కి దున్నుటకు బయలుదేరాడు. మార్గమధ్యలో ట్రాక్టర్ బోల్తాపడటంతో శ్రీనివాస్ ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయి అక్కడిక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాలువలో పడి ఒకరు.. నిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రధాన కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రానికి చెందిన జగ్గంపల్లి సాయిలు(55) అనే వ్యక్తి ఈ నెల 14న ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగిరాలేడు. దీంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. మంగళవారం సింగితం శివారులోని నిజాంసాగర్ ప్రధాన కాలువ అతడి మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మృతుడి భార్య సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
లైంగిక దాడులు జరగకుండా చూడాలి
● సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి కామారెడ్డి క్రైం : పాఠశాలల్లో విద్యార్థులపై లైంగిక దాడులు జరగకుండా చూడాలని సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కా మారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపిక చేసి న ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు పో క్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఏవైనా పోక్సో సంబంధిత ఘటనలు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతారన్నారు. పిల్లల విష యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులకు బ్యాడ్జీలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, యునిసెఫ్కు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ సోని కుట్టి, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత, బాల రక్షక్ భవన్ సిబ్బంది పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై దృష్టి సారించండి కామారెడ్డి క్రైం: వేసవి కాలంలో జిల్లాలో తా గునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్ర ణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.శరత్ సూచించారు. మంగళవా రం జిల్లాకు విచ్చేసిన ఆయన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో సమావేశమై పలు అంశాలపై చ ర్చించారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉ న్న చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చే యాలన్నారు. అవసరమైతే బోరుబావులను అద్దెకు తీసుకోవాలని సూచించారు. ‘మహిళల భద్రతకు ప్రాధాన్యత’ కామారెడ్డి క్రైం: మహిళలు, బాలికల భద్రతకు భరోసా కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఏఎస్పీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో భరోసా కేంద్రం ప్రారంభమై ఏడాది గడుస్తున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోక్సో, మహిళలపై అత్యాచారాల కేసులను నియంత్రించడానికి భరోసా కేంద్రం ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. బాధితులకు అండగా ఉంటున్నామని, న్యాయ సలహాలు, వైద్యం తదితర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 72 కేసులలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. ఆర్థికంగా వెనకబడిన 45 కుటుంబాలకు రూ. 10.12 లక్షలు సహాయం అందించామన్నారు. పోక్సో, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, బాలికలకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తున్న భరోసా కేంద్రం సిబ్బందిని అభినందించారు. ‘మర్యాదపూర్వకంగా మెలగాలి’ కామారెడ్డి టౌన్ : ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని కరీంనగర్ జోన్ ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషా ఖాన్ సూచించా రు. మంగళవారం కామారెడ్డి ఆర్టీసీ డిపోలో సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో ఈడీ పాల్గొన్నారు. సంస్థ ఆ దాయాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నా రు. ప్రమాద రహిత డిపోగా పేరు తేవాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ఇందిర, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. -
సరికొత్త పోలీసు!
కామారెడ్డి క్రైం: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ సరికొత్తగా ముందుకు సాగుతోంది. అత్యవసర విభాగాల్లో పని చేసే సిబ్బందికి డ్రైవింగ్ నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే తొలిసారిగా జిల్లాలో మహిళా కానిస్టేబుళ్లతో క్యూఆర్టీ(క్విక్ రియాక్షన్ టీం)లను ఏర్పాటు చేశారు. ఆందోళన కార్యక్రమాలు, శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉన్న సమయాల్లో ఆయా బృందాలు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కబెట్టేందుకు అవకాశాలుంటాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. 189 మంది కొత్త కానిస్టేబుళ్లు.. కొత్తగా ఉద్యోగాలు సాధించిన 189 మంది కానిస్టేబుళ్లు 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని గతేడాది నవంబర్లో విధుల్లో చేరారు. ఇందులో సివిల్ కానిస్టేబుళ్లు 115 మంది, ఏఆర్ కానిస్టేబుళ్లు 74 మంది ఉన్నారు. సివిల్లో 75 మంది పురుషులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండగా.. ఆర్మ్డ్ రిజర్వ్లో 58 మంది పురుషులు, 16 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరికి విధుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలు, వ్యవహరించాల్సిన తీరు, అప్రమత్తత, బందోబస్తు తదితర అంశాలపై ఇప్పటికే జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్లతో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఆయా అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర విభాగాల్లో పని చేసే సిబ్బందికి వాహనాలను నడపడంలో నైపుణ్యాలు ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో కొత్త కానిస్టేబుళ్లందరికీ డ్రైవింగ్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ సూచనల మేరకు సబ్ డివిజన్ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పటికే పలు విడతలలో 75 మందికి డ్రైవింగ్లో శిక్షణ పూర్తయ్యింది. మిగిలినవారికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.క్విక్ రియాక్షన్ టీంలు.. ఇప్పటివరకు పురుష కానిస్టేబుళ్లతో కూడిన క్విక్ రియాక్షన్ టీంలు ఉన్నాయి. ప్రస్తుతం తొలిసారిగా మహిళా కానిస్టేబుళ్లతో డివిజన్ల వారీగా క్యూఆర్టీలు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే ఘటనలు జరిగితే క్యూఆర్టీ బృందాలు వెంటనే అక్కడకు చేరుకుంటాయి. పరిస్థితిని అదుపు చేయడానికి వారు కృషి చేస్తారు. క్యూఆర్టీ సభ్యులు నిత్యం వాహనాల తనిఖీలు, బందోబస్తు చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీగా ఉండే ప్రదేశాల్లో తనిఖీ చేపట్టడంలాంటి విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి కానిస్టేబుల్కు డ్రైవింగ్లో శిక్షణ తొలిసారిగా మహిళా కానిస్టేబుళ్లతో క్యూఆర్టీ ఏర్పాటు -
మొక్కలు ఎండిపోకుండా చూడాలి
గాంధారి: నర్సరీల్లోని మొక్కలు ఎండిపోకుండా షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పేట్సంగెం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ కంపోస్టు ఎరువులను తయారు చేయాలని ఆదేశించారు. వేసవిలో మారుమూల గ్రామాలు, తండాల్లో తాగు నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నలు సంధించి వారి సామర్థ్యాలను పరీక్షించారు. అర్థం కాని విషయాలుంటే టీచర్లను అడిగి తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పదో తరగతి తరువాత ఐఐఐటీల్లో చేరాలని సూచించారు. విద్యార్థులను పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనాన్ని, వంటశాలను పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు. ఆయనవెంట డీఆర్డీవో సురేందర్, డీపీవో శ్రీనివాస్రావు, మండల ప్రత్యేకాధికారి లక్ష్మీప్రసన్న, డీఎల్పీవో సురేందర్, తహసీల్దార్ సతీష్ రెడ్డి, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణ తదితరులున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
నిరంతరం పర్యవేక్షించాలి
కామారెడ్డి క్రైం: రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫ రా, రైతు భరోసా, యూరియా కొరత, రేషన్ కార్డు ల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన తది తర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. రబీ సీజన్కు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువుల పై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. వేసవి లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలన్నారు. ప్ర జాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చే యాలన్నారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి17 ప్రాంతాల్లో సమస్య.. జిల్లాలో 860 ఆవాస ప్రాంతాలు ఉండగా 17 చోట్ల తాగునీటి సమస్య ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అ నంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. బోర్ వెల్స్కు అవసరమైన మర మ్మతులు చేయించాలన్నారు. రేషన్ కార్డుల వెరి ఫికేషన్కు సంబంధించి రోజువారీ రిపోర్టులు స మర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సీఈ రవి, మిష న్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, విద్యుత్ శా ఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, డీఏవో తిరుమల ప్ర సాద్, ఆర్డీవో ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్రావు, డీఎస్వో మల్లికార్జున్ బాబు పాల్గొన్నారు. -
డీసీసీబీని అగ్రస్థానంలో నిలపాలి
సుభాష్నగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (ఎన్డీసీసీబీ) ద్వారా రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందించి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. డీసీసీబీ పాలకవర్గం, సహకార సంఘాల కాల పరిమితిని ఆరు నెలలు పొడిగించినందుకు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. రైతుల సంక్షేమానికి కృషి చేయడంతోపాటు అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం బాధ్యతతో పని చేయాలని సీఎం సూచించారని రమేశ్రెడ్డి తెలిపారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పట్టభద్రుల శాసన మండలి స్థానంపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా బుధవారం కామారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో కేడర్తో సమావేశాలు నిర్వహించనున్నారు. శాసన మండలి ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానీ, ముఖ్య నేతలు గానీ ప్రచారం నిర్వహించలేదు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీ ముఖ్య నేతలంతా రంగంలో దిగుతున్నారు. ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా జిల్లాలో రెండు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం 10 గంటలకు కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్లో, మధ్యాహ్నం 1.30 గంటలకు బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎంబీ గార్డెన్లో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆయా సమావేశాలకు పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు హాజరుకానున్నారు. సన్నాహక సమావేశానికి తరలిరావాలిబాన్సువాడ : బాన్సువాడలో బుధవారం నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి కార్యకర్తలు తరలిరావాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ కోరారు. మంగళవారం నియోజకవర్గంలోని పొతంగల్, బీర్కూర్, వర్ని, కోటగిరి, నస్రుల్లాబాద్ మండలాల్లో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం మధ్యాహ్నం బాన్సువాడలో నిర్వహించే సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారన్నారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు పవన్, బోయిని శంకర్, యామ రాములు, కాశీరాం, విజయ్ప్రకాష్, దాసరి శ్రీనివాస్, ప్రసాద్, ప్రశాంత్, గౌస్ తదితరులు ఉన్నారు. నేడు కామారెడ్డి, బాన్సువాడలలో సమావేశాలు హాజరుకానున్న పీసీసీ చీఫ్, జిల్లా మంత్రి -
రెండు బైకులు ఢీ: ఇద్దరికి గాయాలు
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ శివారులోగల 44వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఓ బైక్ ముందున్న బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు, అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాలు ఇలా.. చంద్రాయన్పల్లి విద్యుత్ సబ్ స్టేషన్లో ఆపరేటర్గా పని చేస్తున్న అశోక్ కామారెడ్డి నుంచి బైక్పై వస్తున్నాడు. కామారెడ్డికి చెందిన భరత్ అదేమార్గంలో కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు బైక్పై వెళ్తుండగా వెనుక నుంచి అతడిని ఢీకొన్నాడు. ఈప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఇరువురిని టోల్ప్లాజా అంబులెన్స్లో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. పేకాడుతున్న ఆరుగురి అరెస్టు ఖలీల్వాడి: రెంజల్ పోలీస్స్టేషన్ పరిధిలోని తాడ్బిలోలి గ్రామశివారులోగల పేకాట స్థావరంపై దాడి చేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది మంగళవారం తెలిపారు. పేకాడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వారి వద్ద నుంచి ఐదు బైక్లు, నాలుగు సెల్ఫోన్లు, రూ. 31,100 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. తదుపరి చర్య నిమిత్తం రెంజల్ ఎస్సై సాయన్నకు అప్పగించినట్లు తెలిపారు. అటవీ భూమిని చదును చేసిన ట్రాక్టర్లు స్వాధీనం సిరికొండ: మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలోగల అటవీభూమిని చదును చేసిన రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఇన్చార్జి ఎఫ్ఆర్వో రవీంధర్ మంగళవారం తెలిపారు. ట్రాక్టర్లను స్వాధీనపర్చుకునే సమయంలో అటవీశాఖ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన మాలావత్ మదన్లాల్, సావిత్రి, నందిలాల్, మాలావత్ భూపతి అనే వ్యక్తులపై సిరికొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామన్నారు. న్యాల్కల్లో ఒకరిపై దాడి మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని న్యాల్కల్ గ్రామంలో సోమారపు గంగాధర్పై అదే గ్రామానికి చెందిన ముగ్గురు దాడి చేసి గాయపర్చిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గంగాధర్కు రమణ రావు, లక్ష్మణ్, మరో వ్యక్తి ఆదివారం ఫోన్ చేసి పేకాట ఆడుదామని పిలిపించారు. అక్కడికి వెళ్లిన గంగాధర్ తాను పేకాట ఆడబోనని చెప్పడంతో తాగిన మైనంలో ముగ్గురు కలిసి దాడికి పాల్పడ్డారు. గంగాధర్కు తీవ్ర గాయాలు కావడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బైక్ చోరీ కేసులో నిందితుల అరెస్టు భిక్కనూరు: బైక్ చోరీ నిందితులిద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు భిక్కనూరు సీఐ సంపత్కుమార్, ఎస్సై ఆంజనేయులు మంగళవారం తెలిపారు. భిక్కనూరు టోల్ప్లాజా వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా కామారెడ్డిలోని రాజీవ్నగర్కు చెందిన సోదరులు షేక్ తోఫిక్, షేక్ ఆఫ్రోజ్లను అనుమానంతో పట్టుకుని విచారించారు. దీంతో వారు జంగంపల్లి గ్రామంలో, భిక్కనూరులో బైక్లను చోరీ చేసినట్టు అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు వివరించారు. ఐదుగురికి 14రోజుల రిమాండ్ ఖలీల్వాడి: పోలీసుల వాహనం అద్దాలు ధ్వంసం చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులకు జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు మూడోటౌన్ ఎస్సై హరిబాబు మంగళవారం తెలిపారు. నగరంలోని శ్రద్ధానంజ్ గంజ్లో ఈనెల 15న సెక్యూరిటీ గార్డుపై కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నారనే సమాచారం మేరకు పెట్రో కారులో పోలీసులు ఘటన స్థలానికి వెళ్లారు. ఈక్రమంలో కొంత మంది వ్యక్తులు పెట్రోకారు అద్దాలు పగలగొట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి, ఐదుగురు వ్యక్తులను కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఎస్సైని ఢీకొట్టిన కారు ఖలీల్వాడి: నగరంలోని నాలుగో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎస్సై–2 ఉదయ్కుమార్ మంగళవారం ఆర్ఆర్చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో ఓ కారును అపే సమయంలో ఎస్సైని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు గాయాలు కాగా, వెంటనే సిబ్బంది, స్థానికులు ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. టౌన్ సీఐ శ్రీనివాస్రాజు, ఎస్సై శ్రీకాంత్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం ఎస్సై ఆరోగ్యం కుదుటపడిందని వైద్యులు తెలిపారు. -
బైక్ను ఢీకొన్న బొలెరో వాహనం
పిట్లం(జుక్కల్): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రం శివారులోని జాతీయ రహదారిపై మంగళవారం సంగారెడ్డి జిల్లాకు చెందిన దంపతులిద్దరూ బైక్పై వెళుతుండగా బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలోని అంతర్గామ గ్రామానికి చెందిన శకుంతల, సంగయ్య దంపతులు బైక్పై చిన్నకొడప్గల్ వైపు బయలుదేరారు. పిట్లం శివారులో వారి బైక్ను బొలెరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈఘటనలో శకుంతల (45) మృతి చెందగా, సంగయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని పిట్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు నమోదు చేశారు. ప్రమాదంలో భార్య మృతి, భర్తకు గాయాలు -
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి
రాజంపేట: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని రాజంపేట్ మండల వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 76 మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. హెల్త్ సూపర్వైజర్ మంజూర్ తదితరులు పాల్గొన్నారు. లింగంపేట పీహెచ్సీలో అమ్మ ఒడి లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్సీలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్ హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీ్త్రలు, గర్భిణులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పలువురికి రక్త పరీక్షలు చేసి నమూనాలను టి–హబ్కు పంపినట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. -
నిరంతరం పర్యవేక్షించాలి
కామారెడ్డి క్రైం: రానున్న వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫ రా, రైతు భరోసా, యూరియా కొరత, రేషన్ కార్డు ల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన తది తర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ తాగునీటి సమస్య ఏర్పడకుండా తగిన కార్యాచరణ రూపొందించాలన్నారు. రబీ సీజన్కు సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువుల పై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. యూరియా కొరత లేకుండా చూడాలన్నారు. వేసవి లో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చ ర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందేలా చూడాలన్నారు. ప్ర జాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చే యాలన్నారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి, సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 17 ప్రాంతాల్లో సమస్య.. జిల్లాలో 860 ఆవాస ప్రాంతాలు ఉండగా 17 చోట్ల తాగునీటి సమస్య ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అ నంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. సమస్య ఉన్న గ్రామాలకు ట్యాంకర్ల ద్వా రా నీటిని సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. బోర్ వెల్స్కు అవసరమైన మర మ్మతులు చేయించాలన్నారు. రేషన్ కార్డుల వెరి ఫికేషన్కు సంబంధించి రోజువారీ రిపోర్టులు స మర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అ దనపు కలెక్టర్లు విక్టర్, శ్రీనివాస్రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, నీటిపారుదల శాఖ సీఈ రవి, మిష న్ భగీరథ ఎస్ఈ రాజేంద్ర కుమార్, విద్యుత్ శా ఖ ఎస్ఈ శ్రావణ్ కుమార్, డీఏవో తిరుమల ప్ర సాద్, ఆర్డీవో ప్రభాకర్, డీపీవో శ్రీనివాస్రావు, డీఎస్వో మల్లికార్జున్ బాబు పాల్గొన్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా కార్యాచరణ రూపొందించాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ శాంతికుమారి -
బైక్ల చోరీ కేసులో ఇద్దరికి ఏడాది జైలు శిక్ష
కమ్మర్పల్లి: మండల కేంద్రంలో బైక్లను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది సాధారణ జైలు శిక్ష పడినట్లు ఎస్సై అనిల్రెడ్డి సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. గత ఏడాది వరంగంటి మోహన్, తెడ్డు నరేష్లు తమ ఇంటి ముందర నిలిపిన బైక్లను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మోహన్ బైక్ను బోధన్కు చెందిన మాలవత్ తులసీరాం, నరేష్ బైక్ను బోధన్కు చెందిన అబ్దుల్ ఆయాజ్ఖాన్ చోరీ చేసినట్లు గుర్తించి, అరెస్టు చేశారు. వారిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, విచారణ అనంతరం జడ్జి నిందితులిద్దరికి ఏడాది సాధారణ జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. మట్కా నిర్వాహకుడికి రెండు రోజులు.. బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని ఆచన్పల్లికి చెందిన షేక్ గఫార్ బోధన్లో మట్కా నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బోధన్ కోర్టులోని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట అతడిని హాజరుపరుచగా జడ్జి రెండు రోజుల జైలుశిక్షను విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. డ్రంకన్డ్రైవ్ కేసులో.. ధర్పల్లి: ధర్పల్లి శివారులోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఇందిరానగర్ తండాకు చెందిన సీతారాం మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దీంతో సీతారాంను మంగళవారం నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. నవీపేట మండలంలో.. నవీపేట: నవీపేట్ గ్రామానికి చెందిన మహమ్మద్ నబీసాబ్, అబ్బాపూర్ (బి) గ్రామానికి చెందిన బాబు, నిర్మల్ జిల్లా కుబీర్కు చెందిన ఇసాల రాకేష్ ఇటీవల మద్యం తాగి వాహనాలు నడుపుతూ నవీపేట పోలీసులకు పట్టుబడ్డారు. మంగళవారం వారిని నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా స్పెషల్ జ్యుడీ షియల్ సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ 2 రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
యువకుడి అదృశ్యం
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన సురిసాని రాజశేఖర్రెడ్డి అనే యువకుడు రెండు రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్ మంగళవారం తెలిపారు. రాజశేఖర్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ నెల 17న ఉదయం కళాశాలకు వెళ్లిన అతడు ఇంటికి తిరిగిరాలేడు. అతడి తండ్రి హన్మంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దోమకొండలో తల్లీ కూతురు.. దోమకొండ: మండల కేంద్రానికి చెందిన నర్రాగుల కళావతి ఆమె కూతురు భవానీ అదృశ్యమైనట్లు దోమకొండ ఎస్సై స్రవంతి మంగళవారం తెలిపారు. కళావతి సోమవారం భర్త నరసింహులుతో గొడవపడింది. అనంతరం కూతురు భవానీని తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో కళావతి పెద్ద కూతురు నికిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్ట్ ● 445 గ్రాముల గంజాయి స్వాధీనం కామారెడ్డి క్రైం: గంజాయి రవాణా చేస్తున్న ఓ ముఠాను కామారెడ్డి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి 445 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రామన్ వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణాపై విశ్వసనీయ సమాచారం రావడంతో దేవునిపల్లి ఎస్సై రాజు ఆధ్వర్యంలో రామారెడ్డి బ్రిడ్జి వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ కారు, బైక్లపై గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని నిజామాబాద్కు చెందిన రాథోడ్ రవి, సయ్యద్ సాజిద్, కామారెడ్డికి చెందిన దేవుని పృఽథ్వీ, నిట్టూరి సిద్దార్థరావు, పసులోటి భానుచందర్గా గుర్తించారు. గంజాయిని, వాహనాలను సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. నగరంలో పోలీసు కవాతు ఖలీల్వాడి: నగరంలోని రెండో పోలీస్స్టేషన్ పరిధిలోని పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ఫోర్స్ మంగళవారం కవాతు నిర్వహించారు. రానున్న రంజాన్, హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో స్టేషన్ పరిధిలోని గోల్హనుమాన్ నుంచి కసాబ్గల్లీ, గాజులపేట్ తోపాటు హైమద్బజార్, నెహ్రూపార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏసీపీ రాజావెంకట్రెడ్డి, టౌన్ సీఐ శ్రీనివాసురాజు, ఎస్సై యాసీన్ఆరాఫత్ తదితరులు పాల్గొన్నారు. -
తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండల కేంద్రాన్ని సందర్శించారు. అధికారులు గ్రామాలలో తిరుగుతూ తాగునీటి సమస్యలు ఉన్న గ్రామాలను గుర్తించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేసి సమగ్ర కుటుంబసర్వేకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాలలో పెండింగ్లో ఉన్న ఇంటి పన్నులను 100 శాతం వసూలు చేయాలని సూచించారు. అనంతరం తాడ్వాయి శివారులోని నర్సరీని పరిశీలించారు. ప్రతిరోజు మొక్కలకు నీటిని పోసి మొక్కలు ఏపుగా పెరిగేలా చూడాలన్నారు. మండల ప్రత్యేక అధికారి రాజారాం, ఎంపీడీవో సయ్యద్ సాజిద్, ఎంపీవో సవితారెడ్డి, గ్రామ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘నిరుపేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి’
భిక్కనూరు: నిరుపేద ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషిచేస్తానని భిక్కనూరు ఆర్యవైశ్యసంఘం నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పురాం రాజమౌళి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా చల్ల లక్ష్మణ్, కోశాధికారిగా కోడిప్యాక వెంకటేశంలతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పురాం రాజమౌళి మాట్లాడుతూ.. వైశ్య సంఘం అభివృద్ధితో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతానన్నారు. అలాగే విద్యలో ప్రతిభ చూపుతున్న నిరుపేదల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందజేస్తానన్నారు. ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు పబ్బ నాగరాజు, శ్రీరాం చంద్రశేఖర్, గంగెళ్లి మధుసూదన్, అతిమాముల శ్రీధర్, చీకోటి నాగభూషణం, అతిమాముల రమేష్, బంక్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. -
పాత కక్షలతో ఒకరి హత్య!
లింగంపేట(ఎల్లారెడ్డి): పాత కక్షలతో ఒకరిని హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిట్లం మండలం బొల్లక్పల్లి, లింగంపేట మండలం బాణాపూర్ గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. పిట్లం మండలం బొల్లక్పల్లి గ్రామానికి చెందిన ఉప్పరి పోచయ్య(70) ఈనెల 1న తన ఇంటి ఆరుబయట నిద్రించాడు. మరుసటి రోజు నుంచి అతడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా బొల్లక్పల్లి గ్రామానికి చెందిన అనుమానితుడిని విచారించారు. అనుమానితుడికి, మృతుడికి మధ్య భూ వివాదంతోపాటు పలు విషయాలపై పాత కక్షలు ఉండగా, తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో హత్య చేసిన ప్రదేశమైన లింగంపేట మండలం బాణాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోకి పోలీసులు అనుమానితుడిని తీసుకెళ్లి ఆధారాలు సేకరించారు. పోచయ్యను ఒక్కడే హత్య చేశాడా..? మరెవరైనా సహకరించారా..? అనే కోణంలో విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ విషయమై పిట్లం ఎస్సై రాజును వివరణ కోరగా విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతిభిక్కనూరు: మండలంలోని అంతంపల్లి గ్రామ శివారులో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. భిక్కనూరులో హేయిర్ కటింగ్ షాపు నిర్వహిస్తున్న కొత్తపల్లి అఖిల్ (30) మంగళవారం వేములవాడకు స్నేహితులతో కలిసి వెళ్తున్నా అని ఇంట్లో వారికి చెప్పి, బైక్పై బయలుదేరి వెళ్లాడు. అంతంపల్లి–బీటీఎస్ మధ్యలో జాతీయ రహదారిపై రాత్రివేళ అఖిల్ అపస్మారక స్థితిలో కనిపించాడు. స్థానికులు గమనించి నేషనల్ హైవే అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది వెంటనే అక్కడికి అఖిల్ను కామారెడ్డికి ఆస్పత్రికి తరలించారు. కానీ వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించాడని నిర్ధారించారు. మృతుడికి భార్య సింధు, రెండేళ్ల కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. అఖిల్ బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడా? లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అన్న విషయాలు తెలియరాలేదు. -
నేడు పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం
కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు హాజరవుతున్నారని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, నాయకులు సందీప్, చందు, కిరణ్, గంగాధర్ తదితరులున్నారు. -
కలుషిత నీరు తాగి తొమ్మిది మేకలు మృతి
మాచారెడ్డి: కలుషిత నీటిని తాగి తొమ్మిది మేకలు మృతిచెందిన ఘటన సోమవారం మండలంలోని లచ్చాపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుల్లె దేవయ్యకు చెందిన మేకలు గ్రామ శివారులోని రైస్మిల్లు సమీపంలో మేస్తుండగా, రైస్మిల్లు నుంచి వెలువడిన కలు షిత నీటిని తాగాయి. దీంతో మేకలు అక్కడికక్కడే మృతిచెందినట్టు బాధితుడు తెలిపారు. ఈమేరకు పశువైద్యాధికారితో పోస్టుమార్టం చేయించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితుడు తెలిపారు. చనిపోయిన మేకల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
కాలువలో పడి రైతు మృతి
బాల్కొండ: కాకతీయ కాలువలోని పంపుసెట్లో చెత్తను తొలగించడానికి నీటిలోకి దిగిన ఓ రైతు ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన రైతు కోమటిశెట్టి చిన్నయ్య(46) కాకతీయ కాలువ నీటి ఆధారంగా పంపుసెట్ ఏర్పాటు చేసుకొని, ఆ నీటితో పొలం సాగుచేసేవాడు. పంపుసెట్లో చెత్త పేరుకుపోవడంతో తొలగించడానికి ఆదివారం సాయంత్రం అతడు ఇంటినుంచి బైక్పై బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం అతడి కుటుంబ సభ్యులు కాలువ వద్దకు వెళ్లారు. అక్కడ అతడి బైక్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు కాలువలో ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా సాయంత్రం చిన్నయ్య మృతదేహం లభ్యమైంది. చిన్నయ్య పంపుసెట్లోని చెత్తను తొలగించడానికి కాలువలోకి దిగి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చికిత్సపొందుతూ ఒకరు.. నిజాంసాగర్(జుక్కల్): చెట్టు పైనుంచి పడి గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బేగరి లింగయ్య (31) ఆదివారం మేకలను మేత కోసం పంటపొలాల వైపు తీసుకువెళ్లాడు. ఈక్రమంలో అతడె పొలాల గట్టుపైన ఉన్న చింతచెట్టు ఎక్కి కొమ్మలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి హైద్రాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఐశ్వర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.తలమడ్లలో ఒకరు..రాజంపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని తలమడ్ల గ్రామానికి చెందిన కోదండమ్ సాయికుమార్(18) తూప్రాన్లో ఐటీఐ చదువుతున్నాడు. ఇటీవల తలమడ్ల గ్రామానికి వచ్చిన సాయికుమార్ శనివారం అకస్మాత్తుగా గడ్డిమందు తాగి, ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్కు తరలించారు. సోమవారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతికి గల కారణాలు తెలియలేదని విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు. -
విషాదాన్ని మిగిల్చిన రోడ్డు ప్రమాదం
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బైక్పై వెళ్లిన ఇద్దరు స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. వివరాలిలా ఉన్నాయి. తిమ్మాపూర్కు చెందిన సోహెల్(26) బతుకుదెరువు కోసం బహ్రెయిన్ వెళ్లి, రెండు రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. అతడిని, కుటుంబ సభ్యులను కలవడంకోసం సమీప బంధువు జగిత్యాల జిల్లా యూసుఫ్నగర్కు చెందిన మహమ్మద్ సుమేర్(21) తన బైక్పై తిమ్మాపూర్కు వచ్చాడు. ఈ క్రమంలో సోమవారం సోహెల్, సుమేర్ ఇద్దరు కలిసి బైక్పై పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు స్తంభాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న భీమ్గల్ సీఐ సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కూతురును చూడకుండానే.. సోహెల్ భార్య ఆర్మూర్ మండలం మామిడిపల్లిలోగల తన తల్లి వద్ద ఉంటోంది. నాలుగు రోజుల క్రితమే కూతురు మొదటి పుట్టిన రోజు జరిగింది. రెండు రోజుల క్రితం బహ్రెయిన్నుంచి వచ్చిన సోహెల్.. త్వరలోనే భార్య, కూతురును ఇంటికి తీసుకువెళ్లాలనుకున్నాడు. అంతలోనే రోడ్డు ప్రమాదం జరిగి భార్య, కూతురును చూడకుండానే సోహెల్ మృతిచెందాడు. స్తంభాన్ని ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతిగుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు..ఇందల్వాయి: మండల కేంద్రంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన వేముల గంగాధర్(55) మృతి చెందినట్లు ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని ఓ వాటర్ ప్లాంట్లో పని చేస్తున్న గంగాధర్ పని ముగించుకొని హోటల్కి వెళుతుండగా ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించామని, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యుత్ అధికారుల పొలంబాట
లింగంపేట(ఎల్లారెడ్డి): వ్యవసాయ బోరుబావుల వద్ద కెపాసిటర్లు బిగించుకోవాలని శెట్పల్లిసంగారెడ్డి ఏఈ హరీష్రావు సూచించారు. సోమవారం బోనాల గ్రామంలో విద్యుత్ అధికారులు పొలం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కెపాసిటర్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల కలిగే లాభాలు, విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో వంగిన స్తంభాలను సరిచేశారు. లైన్ఇన్స్పెక్టర్ కిష్టయ్య, లైన్మెన్లు అంబ్రియా, గంగాధర్, ఏఎల్ఎం రవీందర్, రాజు, జహీర్, నరేశ్, రైతులు పాల్గొన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 58 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు భరోసా, వ్యక్తిగత సమస్యలకు సంబంధించిన వినతులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన వినతులను పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వి.విక్టర్, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలి.. జిల్లా, మండల స్థాయి అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. ప్రజావాణి అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. అధికారులు తమ శాఖలకు సంబంధించిన పనులను పర్యవేక్షించాలన్నారు. అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ఎల్ఆర్ఎస్, ధరణి ఫిర్యాదులపై తహసీల్దార్లు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆస్తి పన్నుల వసూళ్లు, పారిశుధ్యం, నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం లాంటి పనులను ఎంపీడీవోలు నిరంతరంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనని కుటుంబాల వివరాలు ఈ నెల 28 వరకు ఎంట్రీ చేసుకునేలా ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించిందని తెలిపారు. ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రాల్లో పూర్తి వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 040 21111111 కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోగా ఫోన్ చేసి కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 58 వినతులు -
విద్యార్థులకు ప్రజ్ఞోత్సవ పోటీలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేట కాంప్లెక్స్ స్కూల్లో సోమవారం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రజ్ఞోత్సవ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కథలు చెప్పడం, చదవడం, రాయడం, పద్యాలు చెప్పడం, చతుర్విద ప్రక్రియలపై విద్యార్థులకు పోటీలు పెట్టారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కాంప్లెక్స్ హెచ్ఎం వెంకట్రాంరెడ్డి చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కాంప్లెక్స్స్కూల్ సెక్రెటరీ మాణిక్యమ్మ, రిసోర్స్ పర్సన్ కిష్టయ్య, సీఆర్పీ రాజయ్య పాల్గొన్నారు. -
కోళ్లకు వైరస్.. సజీవంగా పూడ్చివేత
బాన్సువాడ రూరల్ (బాన్సువాడ): బాన్సువాడ మండలం బోర్లం గ్రామానికి చెందిన దామరంచ సాయిలు అనే వ్యక్తికి చెందిన కోళ్లఫారంలో 6వేల బ్రాయిలర్ కోళ్లను సజీవంగానే పూడ్చిపెట్టారు. గత మూడు రోజులుగా కోళ్లు అస్వస్థతకు గురికావడంతో కోళ్ల కంపెనీ ప్రతినిధులను సంప్రదించగా వారు వైద్య పరీక్షలు జరిపి, కోళ్లకు వైరస్ సోకిందని నిర్ధారించారు. దీంతో వారి సూచనల మేరకు కోళ్లను సజీవంగా పూడ్చి వేశారు. కోళ్లకు వైరస్ సోకడంతో తాను తీవ్రంగా నష్టపోయినట్లు, సుమారు లక్షల నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నాడు. తప్పిపోయిన వ్యక్తి.. వెతికి, పట్టుకున్న రైల్వేపోలీసులు ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో తప్పిపోయిన షేక్బాబా అనే వ్యక్తిని, పట్టుకొని అతడి బంధువులకు అప్పగించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. నాందేడ్లోని శివాజీనగర్కు చెందిన షేక్ బాబా(58) ఈనెల 14న తన చిన్న కూతురు ఉంటున్న కరీంనగర్కు వెళ్లినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో కరీంనగర్ నుంచి నాందేడ్కు వెళుతున్న క్రమంలో నిజామాబాద్ రైల్వేస్టేషన్లో దిగి ఇక్కడ నుంచి బయటకు వెళ్లి కనిపించకుండాపోయాడు. దీనిపై అతడి కూతురు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా షేక్బాబా ముత్ఖేడ్ రైల్వేస్టేషన్లో దిగి అక్కడే ఉండిపోయినట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి పట్టుకొని బంధువులకు అప్పగించారు. -
చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
బోధన్టౌన్(బోధన్): చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. బోధన్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాజస్థాన్కు చెందిన బచ్చుసింగ్ బాగ్రియా కుటుంబంతో కలిసి బతుకు దెరువు కోసం 15 రోజుల క్రితం బోధన్కు వచ్చాడు. స్థానికంగా బొమ్మలు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవల బాగ్రియా తన వద్ద ఉన్న రూ. 40వేల నగదును సమీప బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. బ్యాంక్ బంద్ ఉండటంతో అతడు తిరిగి తన ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో సాత్పూల్ కల్లుబట్టి వద్ద ముగ్గురు వ్యక్తులు కలిసి, కల్లుబట్టిలోకి తీసుకువెళ్లారు. కల్లు తాగిన అనంతరం బాగ్రియాను సదరు వ్యక్తులు బెదిరించి రూ. 40వేల నగదును తీసుకొని పారిపోయారు. మరుసటి రోజు బాగ్రియా పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా కొత్త బస్టాండ్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో పట్టుకున్నారు. పట్టణానికి చెందిన షేక్ మహ్మద్, వసీం, సయ్యద్ సజ్జన్లను అదుపులోకి తీసుకొని విచారించగా బాగ్రియా వద్ద తామే డబ్బులు తీసుకున్నామని అంగీకరించారు. అనంతరం వారి వద్ద నుంచి రూ. 10,500 నగదును స్వాధీనం చేసుకొని, అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు సీఐ వెల్లడించారు. పొక్లెయిన్, ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో కప్పలవాగులో నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న పొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై రామ్ తెలిపారు. పొక్లెయిన్, ట్రాక్టర్లు తాళ్లపల్లి వెంకగౌడ్కు చెందినవని ఆయన తెలిపారు. వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశామన్నారు. తదుపరి విచారణ కోసం వాహనాలను మైనింగ్ శాఖకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మోపాల్ మండలంలో.. మోపాల్: మండలంలోని కాస్బాగ్తండాకు చెందిన హరిసింగ్ అనుమతులు లేకుండా ఆదివారం అర్ధరాత్రి ట్రాక్టర్లో ఇసుకను తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై యాదగిరి తెలిపారు. ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించారు. పోతంగల్ మండలంలో.. రుద్రూర్: పోతంగల్ మండలం కారేగాం శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకున్నట్టు ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. ట్రాక్టర్లను కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరికి రెండు రోజుల జైలు బోధన్టౌన్(బోధన్): వేర్వేరు కేసుల్లో ఇద్దరికి రెండు రోజులు జైలు శిక్షను బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్లు పట్టణ సీఐ నారాయణ సోమవారం తెలిపారు. ఇటీవల పట్టణానికి చెందిన షేక్ జలాల్ మద్యం తాగి వాహనం నడుపగా పోలీసులకు పట్టుబడ్డాడు. అలాగే మరోవ్యక్తి బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతుండగా అతడిని పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఇద్దరిని బోధన్ కోర్టులోని సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా జైలుశిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. -
పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించుకోవాలి
భిక్కనూరు: విద్యార్థులు మారుతున్న కాలానికనుగుణంగా నూతన పరిశోధనలపై ఆసక్తిని పెంపొందిచుకోవాలని జేఎన్యూ ప్రొఫెసర్ రాజు చౌహాన్ అన్నారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘స్పెక్ట్రోస్కోపి– దాని అనువర్తనాలు’ అనే అంశంపై నిర్వహించిన ఒక రోజు సెమినార్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశోధన విద్యార్థులకు స్పెక్ట్రోస్కోపి అంశంపై అవగాహన కల్పించారు. భవిష్యత్తులో పరిశోధన రంగంలో వేలాది ఉద్యోగాలు ఉంటాయని, విద్యార్థులు ఆ వైపు మొగ్గు చూపాలన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, అధ్యాపకులు సునీత, నిరంజన్శర్మ, శ్రీకాంత్, రసాయనశాస్త్ర విద్యార్థులు పాల్గొన్నారు. జేఎన్యూ ప్రొఫెసర్ రాజు చౌహాన్ -
జీవావరణ వ్యవస్థను కాపాడుకోవాలి
కామారెడ్డి అర్బన్: వ్యనప్రాణులతో జీవావరణ వ్యవస్థను కాపాడుకోవాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కె.విజయ్ కుమార్ అన్నారు. ఎలక్ట్రానిక్స్ పరికరాల ద్వారా అడవుల్లో వ్యనప్రాణుల కదలికలు, ఉనికి గుర్తించి వాటిని లెక్కించే విధానం, సాంకేతిక పద్ధతులపై సోమవారం కళాశాల వృక్ష, అటవీ శాస్త్ర విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వు రీజినల్ కో–ఆర్డినేటర్ బాపురెడ్డి, ఏవో అఖిల్గౌడ్లు రిసోర్స్ పర్సన్గా వివిధ అంశాలపై విద్యార్థులకు వివరించారు. పులులు, పక్షులు, పాములు, ఇతర వన్యప్రాణుల కదలికలతో పాటు వాటి సంఖ్యను సాంకేతికంగా ఎలా లెక్కించవచ్చో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపల్ కె.కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రం శివారులోని చెరువులో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ కేసు నమోదు చేసుకుని శవాన్ని చెరువులో నుంచి బయటకు తీయించారు. మృతుడి వయస్సు సుమారు 30–35ఏళ్లు ఉంటుందని, బూడిద కలర్ చొక్కా, గోధుమ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. సగం కాలినస్థితిలో ఒకరి మృతదేహం.. ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి శివారులోగల అటవీప్రాంతంలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహం సగం కాలిన స్థితిలో లభ్యమైంది. మృతుడు జిల్లాకేంద్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని నాగారం 300 క్వార్టర్స్లోని బీడీ కాలనీకి చెందిన సందీప్(28) ఈనెల 15న అదృశ్యమయ్యాడు. 5వ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందల్వాయి పోలీసులకు సగం కాలిన స్థితిలో ఉన్న మృతదేహం లభించగా, దుస్తులు, ఇతర ఆనవాళ్ల ఆధారంగా సందీప్గా 5వ టౌన్ పోలీసులు గుర్తించారు. కేబుల్ ఆపరేటర్గా పని చేస్తున్న అతడిని అతని స్నేహితులే శనివారం ఆటోలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆస్పత్రికి తరలించి విచారణ చేస్తున్నట్లు ఇందల్వాయి ఎస్సై మనోజ్ తెలిపారు. త్వరలో వివరాలు వెళ్లడిస్తామని ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. భిక్కనూరులో బైక్ చోరీ భిక్కనూరు: మండల కేంద్రంలో ఇటీవల ఓ బైక్ చోరీకి గురైందని భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బండి సిద్దగిరి ఈనెల 14న తన ఇంటి ముందర బైక్ పెట్టి, ఇంట్లోకి వెళ్లాడు. గంటన్నర తర్వాత బయటకు వచ్చి చూడగా బైక్ కనిపించలేదు. ఈ విషయమై బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. నిజామాబాద్ రైల్వేస్టేషన్లో.. ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్ ఎదుట నిలిపిన ఓ బైక్ చోరీకి గురైనట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సోమవారం తెలిపారు. నగరానికి చెందిన రాజ్కుమార్ అనే వ్యక్తి జనవరి 31న తన బైకును రైల్వేస్టేషన్ ముందు పార్క్ చేసి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి ఈనెల 2న అతడు వచ్చేసరికి రైల్వేస్టేషన్లో పార్క్ చేసిన బైక్ కనబడలేదు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జగదాంబ ఆలయంలో.. నిజామాబాద్ రూరల్: మండలంలోని గొల్లగొట్టతండాలోగల సేవాలాల్ జగదాంబ ఆలయంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని దుండగులు ఆదివారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి అమ్మవారి ముక్కుపుడుక, పుస్తెలు ఎత్తుకువెళ్లారని రూరల్ ఎస్సై–2 ఆనంద్ సాగర్ తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నమ్మకంగా ఉంటూనే దోచేశారు ఖలీల్వాడీ: నగరంలోని ఓ వైద్యురాలి వద్ద ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా పనులు చేస్తూ, నమ్మకంగా ఉంటూ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా.. ఖలీల్వాడిలోని భాగ్య అనే వైద్యురాలి వద్ద రాజు, పవన్ అనే ఇద్దరు వ్యక్తులు కొన్ని నెలలుగా పనిచేస్తుండేవారు. నమ్మకంగా ఉండటంతో వైద్యురాలు వారికి ఇంటి తాళాలను ఇచ్చింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఆరు నెలలుగా విడతల వారీగా 35 తులాల బంగారం, నగదు ఎత్తుకెళ్లారు. విషయం తెలిసిన వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. టీచర్పై పోక్సో కేసు గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడు రమేష్పై సోమవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు ఓ విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా విద్యార్థిని తల్లిదండ్రుల సెల్ఫోన్కు అసభ్యకర మెసేజ్లు పంపాడు. దీంతో విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మేకను గావుపట్టిన వారిపై కేసు.. బాల్కొండ: మండల కేంద్రంలో ఈ నెల 12న మల్లన్న ఆలయ ఉత్సవాల్లో మేక పిల్లను గావుపట్టిన వారిపై బాల్కొండ పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. జంతు సంరక్షణ సమితికి చెందిన గౌతమ్, శ్రీవిద్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. -
ఆ రోజు ఇల్లు కదలరు.. ముద్ద ముట్టరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: తెలవారకముందే ఊళ్ల వెంట తిరుగుతూ పాత ఇనుప సామాగ్రి కొనుగోలు చేసి, వాటిని అమ్ముకుని పొట్టపోసుకునే ఆ కుటుంబాలు.. వారంలో ఒక రోజు మాత్రం ఇల్లు వదిలి బయటకు వెళ్లరు. ఆ రోజు ఇల్లు, వాకిలి కూడా ఊడ్చరు. పొయ్యి వెలిగించేది అసలే లేదు. రోజంతా వాళ్లు ఆధ్యాత్మిక చింతనలోనే గడుపుతారు. వాళ్లే లహరి కృష్ణ భక్తులు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రమన్నుకుచ్చ ప్రాంతంలో బుడగ జంగాల కులానికి చెందిన 110 కుటుంబాలున్నాయి. వారు దశాబ్దాలుగా శ్రీ లహరి కృష్ణ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నారు. ప్రతి ఇంటి ముందు లహరి కృష్ణకు సంబంధించిన జెండా ఒకటి రెపరెపలాడుతూ ఉంటుంది. ఈ సంప్రదాయంలో కొబ్బరికాయ (Coconut) కొట్టడం, అగరొత్తులు వెలిగించడం ఉండవు. ఏటా అక్టోబర్ 3న జెండా పండుగ నిర్వహిస్తారు. పండుగపూట శాకాహార భోజనం.. అదీ అందరూ ఒకే చోట చేస్తారు. ఆ 24 గంటలు ప్రత్యేకంవీరు శుక్రవారం (Friday) సాయంత్రం 6 గంటల నుంచి శనివారం (Saturday) సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక దినచర్యను పాటిస్తారు. ఆ సమయంలో ఇంట్లో పొయ్యి వెలిగించరు. పిల్లల కోసం ముందు రోజు వండిన ఆహారంలో కొంత మిగిలించి శనివారం తినిపిస్తారు. పెద్దవాళ్లయితే ఆ రోజంతా ఏమీ తినరు. సిగరెట్, బీడీలు, మద్యం ముట్టరు. శనివారం కనీసం ఇళ్లు, వాకిళ్లు కూడా ఊడవరు. అందరూ శనివారం ఇంటి వద్దే ఉంటారు. చదవండి: ‘చెప్పు’కోలేని బాధలు.. అన్నదాత అవస్థలుఎంత పని ఉన్నా శనివారం సాయంత్రం 6 గంటల తర్వాతే బయటకు వెళతారు. శనివారం ఎవరైనా చనిపోయినా అంత్యక్రియలు కూడా చేయరు. గ్రామంలోని శ్రీ లహరి కృష్ణ స్తుతి ధ్యాన మందిరంలో శనివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ప్రార్థనలు చేస్తారు. ఆ తర్వాతే బయటకు వెళతారు. భగవద్గీత, బైబిల్, ఖురాన్.. ఇలా అన్నింటినీ పాటిస్తామని వీరు చెబుతున్నారు. అందరం నియమాలు పాటిస్తాంఇక్కడ ఉన్న వాళ్లందరూ పేద, మధ్య తరగతివారే. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు ఇంట్లో పొయ్యి వెలిగించరు. లహరి కృష్ణ సమాజంలోని అన్ని కుటుంబాలు ఈ ఆచారాన్ని పాటిస్తాయి. – దాసరి శ్రీనివాస్, ధ్యానమందిరం నిర్వాహకుడు -
స్థలం విషయంలో వివాదం
తాడ్వాయి (ఎల్లారెడ్డి): దేమికలాన్లో రెండు ఇళ్ల మధ్య స్థలం విషయంలో వివాదం చెలరేగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. వివరాలు.. దేమికలాన్ గ్రామానికి చెందిన పురం లక్ష్మీపతి(42), మంగళి రాజయ్యలకు మధ్య స్థలంలో విషయంలో ఆదివారం మాటామాట పెరిగి గొడవ పెద్దగా తయారైంది. దీంతో రాజయ్య కోపంతో కర్రతో లక్ష్మీపతిని కొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో లక్ష్మీపతికి అకస్మాత్తుగా గుండెనొప్పి వచ్చి కిందపడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మీపతిని కామారెడ్డిలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లక్ష్మీపతి మృతికి కారకుడైన రాజయ్యపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయంచేయాలని కోరుతూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తాడ్వాయి పోలీసుస్టేషన్కు తరలి వచ్చారు. లీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెనుగులాటలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి న్యాయం చేయాలని కోరుతున్న దేమికలాన్ గ్రామస్తులు -
క్రైం కార్నర్
అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య నిజాంసాగర్(జుక్కల్): జు క్కల్ మండలకేంద్రానికి చెందిన బెజ్జవార్ చంద్రమోహన్(34) అనే వ్యక్తి ఆదివారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. వివరాలు ఇలా.. జుక్కల్కు చెందిన చంద్రమోహన్కు అప్పులు ఎక్కువవడంతో మద్యానికి బానిసయ్యాడు. శనివారం తాను అప్పులు తీర్చేది ఎట్లా అంటూ ఇంటి వద్ద రోధించి బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. ఆదివారం తెల్లవారుజామున ఉప్పలంచవార్ లక్ష్మణ్ ఇంటి వద్ద ఉన్న పాడుబడ్డ బావిలో చంద్రమోహన్ శవమై కన్పించాడని ఎస్సై తెలిపారు. అప్పుల బాధతో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఈమేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో ఒకరు.. ఖలీల్వాడి: నగరంలోని సంజీవ్నగర్ కాలనీకి చెందిన వర్షపల్లి మల్లేష్(64) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై హరిబాబు ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. మల్లేష్ గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది శనివారం బాత్రూంలో ఉన్న ఫినాయిల్ తాగి, ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని గమనించి, ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్లు తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని దుర్కి గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రేఖవార్ రాజు తన భార్య స్వరూపారాణితో కలిసి ఈ నెల 9న ఇంటికి తాళం వేసి మహా కుంభమేళ కోసం ప్రయాగ్ రాజ్కు వెళ్లారు. ఈనెల 15న పక్కింటి వారు వాళ్లకి ఫోన్ చేసి, మీ ఇంటి తలుపులు తెరచి ఉన్నాయంటూ సమాచారం అందించారు. వారు ఆదివారం ఇంటికి వచ్చి చూడగా, చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. తాళం పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోని సుమారు 3తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. -
పేకాడుతున్న ఆరుగురి అరెస్టు
బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.11,600లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత బోధన్రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామం నుంచి అక్రమంగా బోధన్కు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. మాజీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు రుద్రూర్: మండలంలోని సులేమాన్నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గౌస్పై అతడి వదిన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈసందర్భంగా ఆమె ఆదివారం మాట్లాడుతూ.. తాను గ్రామంలో లేనిసమయంలో సదరు మాజీ ప్రజాప్రతినిధి తన ఏటీఎం తీసుకుని రెండు పెట్రోల్ బంకుల్లో స్వైప్ చేసి రూ. లక్షా9వేలు తీసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై పోలీస్ష్టేషన్లో సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మద్నూర్లో పెంటకుప్ప దగ్ధం మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని గాంధీచౌక్లో ఆదివారం ప్రమాదవశాత్తు పెంటకుప్ప దగ్ధమయినట్లు బాధితుడు హుల్లాజీ తెలిపారు. తన ఇంటికి సమీపంలో గల పెంటకుప్పకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. ఈ విషయమై ఫైర్స్టేషన్కు స మాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.పదివేల నష్టం జరిగిందని వారు తెలిపారు. -
గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
బాన్సువాడ రూరల్: బోర్లంక్యాంపులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల ఎదుట ఆదివారం పలువురు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇటీవల పాఠశాల నుంచి ఓ విద్యార్థినిని వరుసకు అన్న అయ్యే యువకుడు బలవంతంగా తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లిపోతామని హెచ్చరించారు. ప్రిన్సిపల్ రమాదేవి తల్లిదండ్రులను సముదాయించారు. పిల్లల చదువు, ఆరోగ్యం, భద్రత విషయంలో రాజీ పడబోమన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పొరపాటుకు తమను నిందించడం తగదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని, తల్లిదండ్రులు సహకరించాలని కోరగా వారు శాంతించి ఆందోళన విరమించారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని సింగితం గ్రామ ప్రభుత్వ ఉన్నత పా ఠశాలలో ఆదివారం 2005–06 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులందరూ ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో ఆప్యాయంగా మాట్లాడి, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకొని, చదువులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు కలకొండ. నారాయ ణ, లతీఫ్, దమ్ము వెంకటేశ్వర్లు, విజయ్ కుమా ర్, పాపారావు,శంకర్, రమేష్ కృష్ణప్రసాద్, పూ ర్వ విద్యార్థులు రవీ, సందీప్గౌడ్, వీరేశం, మ హందర్గౌడ్, రఫీ, దుర్గయ్య, శివకుమార్, కిర ణ్, శ్రీకాంత్, చిరంజీవి, నగేష్, అభిలేష్గౌడ్, దత్తయ్య, స్వరూప, శ్రీలత ఉన్నారు. 25 ఏళ్ల తర్వాత.. రామారెడ్డి: మండలంలోని రెడ్డిపేట గ్రామంలోగల మున్నూరుకాపు సంఘంలో ఆదివారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ 1998–99 ఎస్సెస్సీ బ్యాచ్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా వారంతా ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి, సన్మానించారు. ఆనాటి హెచ్ఎం వెంకట్ గౌడ్, ఉపాధ్యాయులు దత్తాద్రి, శంకరయ్య మాట్లాడుతూ.. అప్పటి చదువుకు, ఇప్పటి చదువుకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. రెడ్డిపేట పాఠశాల చరిత్రలో మొట్టమొదటి ఆత్మీయ సమ్మేళనం అని ఆనందం వ్యక్తం చేశారు. -
కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం జరిగిన పరీక్షకు 581 మందికిగాను 570 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 160 మందికిగాను 154 ప్రాక్టికల్స్ పరీక్షలో పాల్గొన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 362 విద్యార్థులకుగాను 333 మంది, వొకేషనల్ విభాగంలో 240 కిగాను 227 హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తనిఖీ చేశారు. బెంగళూరు ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బెంగళూరుకు వెళ్లే ఆర్టీసీ ఏసీ బస్సుల్లో 10 శాతం రాయితీ ఇస్తున్నట్టు సంస్థ రీజినల్ మేనేజర్ టి.జోత్స్న ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీ స్లీపర్, ఏసీ సీటర్, రాజధాని బస్సులకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఉన్నత స్థాయి ప్రయాణాన్ని మరింత అందుబాటులో ఉంచడం, సౌకర్యవంతం చేయడం లక్ష్యంగా ఈ ఆఫర్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం www.tgsrtcbus.in వెబ్సైట్లోగాని, సమీప బస్సు రిజర్వేషన్ కౌంటర్లలోగాని సంప్రదించాలని సూచించారు. గురుకులంలో సబ్ కలెక్టర్ బసబాన్సువాడ రూరల్: బోర్లం క్యాంపులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను ఆదివారం రాత్రి సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. క్రషింగ్ గడువు పొడిగింపునిజాంసాగర్: మాగిలోని గాయత్రి కర్మాగారంలో చెరుకు క్రషింగ్ గడువును ఈనెల 20 వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కర్మాగారం కేన్ మేనేజర్ వెంగళ్రెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం కర్మాగారంలో 4 లక్షల మెట్రిక్ టన్ను ల చెరుకు గానుగ ఆడించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 3.53 లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు క్రషింగ్ జరిగిందన్నారు. క్రషింగ్ గడువు 15 వరకు ఉండగా వారం రోజుల పాటు పొడిగించామన్నారు. పొదుపుగా వాడుకోవాలి సుభాష్నగర్: ఇంధనాన్ని పొదుపుగా వాడు కొని భవిష్యత్ తరాలకు అందించాలని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ఆర్ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని న్యూ కలెక్టరేట్ రోడ్డులో ఆదివారం హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో ‘సాక్షం–2025’ కార్యక్రమాన్ని నిర్వహించి ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రత్యామ్నాయ వనరులైన సీఎన్జీ, ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపాలన్నారు. -
సంరక్షణ చర్యలేవి?
● గతనెలలో మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రంలో అగ్నిప్రమాదం ● పాక్షికంగా కాలిపోయిన చెట్లు.. నీరందక ఎండుతున్న వైనంనాగిరెడ్డిపేట: అగ్నిప్రమాదంలో పాక్షికంగా దెబ్బతిన్న చెట్లను సంరక్షించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో చెట్టు పూర్తిగా ఎండుముఖం పడుతున్నాయి. మాల్తుమ్మెద ఉద్యాన క్షేత్రంలో గతనెల 20న అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఉద్యానక్షేత్రం బయటవైపు గుర్తుతెలియని వ్యక్తులు పెట్టిన నిప్పు గాలికి వ్యాపించి క్షేత్రంలోకి ప్రవేశించింది. క్షేత్రంలో గడ్డి దట్టంగా పెరగడం వల్ల ఉద్యానక్షేత్రాన్ని మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఉద్యాన క్షేత్రంలోని ఆయిల్పాం చెట్లు పూర్తిగా దగ్ధమవ్వగా 35 మామిడి చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి ఉద్యాన క్షేత్రాన్ని పరిశీలించి, పాక్షికంగా కాలిపోయిన చెట్లను సంరక్షించడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగి నెల కావస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా క్షేత్రంలోని మామిడి చెట్లు ఎండుముఖం పడుతున్నాయి. బోరుమోటారుకు మరమ్మతులు చేయిస్తాం గత నెలలో ఉద్యాన క్షేత్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొన్ని మామిడి చెట్లు దెబ్బతిన్నాయి. వాటికి నీరందించి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ క్షేత్రంలో బోరు మోటారు చెడిపోయింది. దానికి మరమ్మతులు చేయించి చెట్లను సంరక్షిస్తాం. – కమలాకర్రెడ్డి, హార్టికల్చర్ అధికారి, మాల్తుమ్మెద -
కులగణనలో వివరాలు నమోదు చేసుకోవాలి
బాన్సువాడ రూరల్/నస్రుల్లాబాద్: ఇటీవల చేపట్టిన కులగణనలో వివరాలు నమోదు చేయించుకోలేని వారు ఈనెల 16 నుంచి 28 వరకు నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్, నస్రుల్లాబాద్ ఎంపీడీవో సూర్యకాంత్లు వేర్వేరు ప్రకటల్లో తెలిపారు. ప్రజాపాలన కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ ద్వారా వివరాలు నమోదు చేయించుకోవాలన్నారు. గతంలో వివరాలు అందించని వారు మాత్రమే దరాఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రారంభమైన రెండో విడత కులగణన లింగంపేట(ఎల్లారెడ్డి): స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కులగణన రెండో విడత సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు ఎంపీడీవో నరేష్ తెలిపారు. గత సర్వేలో పాల్గొనని వారి కోసం ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామాల్లోకి వచ్చే ఎన్యూమరేటర్లకు తమ కుటుంబ వివరాలు తెలియజేయాలని కోరారు. వాహనాల తనిఖీ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం ఏఎస్సై ప్రకాశ్ నాయక్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. 20 మందికి జరిమానాలు విధించారు. వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. అలాగే ప్రతీ ఒక్కరూ వాహన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకు పంపుతామన్నారు. ప్రయోగ పరీక్ష కేంద్రాల తనిఖీ నిజామాబాద్అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్ర యివేటు జూనియర్ కళాశాలల్లో మూడో స్పెల్ ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.ఆదివారం పలు ప్రయోగ పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ తనిఖీ చేశారు.ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పనిచేస్తున్న విషయాన్ని స్వయంగా ఇంటర్ విద్యాశాఖ అధికారి, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు పరిశీలించి సమీక్షించారు. -
దోమకొండలో 50 పడకల ఆస్పత్రి!
కామారెడ్డి టౌన్: దోమకొండలో 50 పడకలతో నూతన ఆస్పత్రి భవనాన్ని నిర్మించేందుకు తెలంగాణ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీఎంఎస్ఐడీసీ) రూ. 22 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిధులు, అనుమతి కోసం తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్కు, ప్రభుత్వానికి నివేదించింది. ఆస్పతి భవన నిర్మాణం కోసం ముత్యంపేట రోడ్లోని సర్వే నంబర్ 1796, 1797లలో 4.03 ఎకరాల స్థలాన్ని గతంలోనే కేటాయించిన విషయం తెలిసిందే. ఈ స్థలంలో సివిల్ వర్క్స్, అస్పత్రి భవనం, మార్చురీ గది నిర్మాణం కోసం రూ. 11.22 కోట్లు, కాంపౌండ్ వాల్కోసం రూ. 10 లక్షలు, సీసీ రోడ్డుకోసం రూ. 7 లక్షలు, మెడికల్ గ్యాస్ పైప్లైన్ కోసం రూ. 25 లక్షలు అవసరం అవుతాయని అంచనాలు వేశారు. ఫైర్ ఫిటింగ్ సిస్టంకోసం రూ. 20 లక్షలు, నీటి సరఫరా, సానిటరీ ఏర్పాట్లకు రూ. 1.14 కోట్లు, విద్యుత్ సరఫరా, ఇతర ఏర్పాట్లకు రూ. 1.71 కోట్లు, మెడికల్ పరికరాలకు రూ. 1.25 కోట్లు, ఇంజినీరింగ్, ఇతర అభివృద్ధి పనులకు రూ. 6 కోట్ల వరకు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే పనుల చేపట్టనున్నారు. రూ. 22 కోట్లతో ప్రతిపాదనలు -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని దుర్కి గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రేఖవార్ రాజు తన భార్య స్వరూపారాణితో కలిసి ఈ నెల 9న ఇంటికి తాళం వేసి మహా కుంభమేళ కోసం ప్రయాగ్ రాజ్కు వెళ్లారు. ఈనెల 15న పక్కింటి వారు వాళ్లకి ఫోన్ చేసి, మీ ఇంటి తలుపులు తెరచి ఉన్నాయంటూ సమాచారం అందించారు. వారు ఆదివారం ఇంటికి వచ్చి చూడగా, చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు వివరాలు సేకరించారు. తాళం పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోని సుమారు 3తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈమేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లావణ్య తెలిపారు. -
పేకాడుతున్న ఆరుగురి అరెస్టు
బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.11,600లు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత బోధన్రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామం నుంచి అక్రమంగా బోధన్కు ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి ఆదివారం తెలిపారు. పట్టుబడిన ట్రాక్టర్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. మాజీ ప్రజాప్రతినిధిపై ఫిర్యాదు రుద్రూర్: మండలంలోని సులేమాన్నగర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గౌస్పై అతడి వదిన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈసందర్భంగా ఆమె ఆదివారం మాట్లాడుతూ.. తాను గ్రామంలో లేనిసమయంలో సదరు మాజీ ప్రజాప్రతినిధి తన ఏటీఎం తీసుకుని రెండు పెట్రోల్ బంకుల్లో స్వైప్ చేసి రూ. లక్షా9వేలు తీసుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేసింది. విచారణ జరిపి న్యాయం చేయాలని మహిళ విజ్ఞప్తి చేసింది. ఈ విషయమై పోలీస్ష్టేషన్లో సంప్రదించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మద్నూర్లో పెంటకుప్ప దగ్ధం మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని గాంధీచౌక్లో ఆదివారం ప్రమాదవశాత్తు పెంటకుప్ప దగ్ధమయినట్లు బాధితుడు హుల్లాజీ తెలిపారు. తన ఇంటికి సమీపంలో గల పెంటకుప్పకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయని ఆయన తెలిపారు. ఈ విషయమై ఫైర్స్టేషన్కు స మాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.పదివేల నష్టం జరిగిందని వారు తెలిపారు. -
కుళ్లిపోయిన మటన్ అమ్ముతున్నారని ఫిర్యాదు
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని మటన్ షాపుల్లో కుళ్లిపోయిన మేక మాంసం అమ్ముతున్నారని ఆదివారం పంచాయతీ, వెటర్నరీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేశారు. దీంతో పంచాయతీ సిబ్బంది మటన్ విక్రయించే షాపులకు వెళ్లి తనిఖీ చేశారు. రెండు రోజు క్రితం కోసిన మేక మాంసం ఫ్రిజ్లో పెట్టి అమ్ముతున్నారని, వాసన వస్తుందని అధికారులు తెలిపారు. ఇలాంటి మాంసం అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాంసం కోసం కోస్తున్న మేకలు, గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా వెటర్నరీ అధికారులు పరిశీలించకుండానే కోస్తున్నారు. అలాగే చాలా మంది చికెన్, మటన్ షాపుల లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మాంసంప్రియులు కోరుతున్నారు. -
‘పిగ్మి’ పేరుతో కుచ్చుటోపి
బిచ్కుంద: బ్యాంక్ ఉద్యోగినని నమ్మించి, పిగ్మీ పేరుతో డిపాజిట్లు సేకరించి అమాయకులకు కుచ్చుటోపీ పెట్టాడో మోసగాడు.. పలువురిని ముంచి, రూ. 60 లక్షలతో ఉడాయించాడు. వివరాలిలా ఉన్నాయి. బిచ్కుందకు చెందిన జంగం రాజు కెనరా బ్యాంక్లో ఉంటూ ఖాతాదారులకు దరఖాస్తులు, ఓచర్లు నింపడం, డీడీలు తీయడంలో సహకరించేవాడు. తనను బ్యాంకు సిబ్బందిగా పరిచయం చేసుకుంటూ మహిళలు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులను టార్గెట్ చేసుకుని బ్యాంక్ పిగ్మీ డిపాజిట్ స్కీం గురించి వివరించేవాడు. రోజూ కొంత మొత్తాన్ని జమ చేస్తే ఆకర్షణీయమైన వడ్డీ వస్తుందని నమ్మించాడు. అతడిని నమ్మిన వందలాది మంది డబ్బులు డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేసినవారికి అప్పుడప్పుడు వడ్డీ ఇచ్చేవాడు. కొందరికి చెక్కులు రాసి ఇచ్చాడు. నాలుగేళ్లనుంచి డిపాజిట్లు సేకరిస్తూ వస్తున్న రాజు.. సుమారు రూ. 60 లక్షలతో వారం క్రితం కుటుంబంతో సహా పరారయ్యాడు. రాజు కనిపించకపోవడంతో అనుమానించిన డిపాజిట్దారులు.. బ్యాంకు అధికారులను ప్రశ్నించగా అతడు తమ సిబ్బంది కాదని తెలిపారు. అతడితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో ఖాతాదారులు అవాక్కయ్యారు.తండ్రి ఏజెంట్ కావడంతో..చిరు వ్యాపారులు ఆదాయంలో కొంత నగదును ప్రతిరోజు తమ బ్యాంక్ ఖతాలో జమ చేసుకోవడానికి కెనరా బ్యాంక్(సిండికెట్ బ్యాంక్) అవకాశం కల్పించింది. వీటిని పిగ్మీ డిపాజిట్లుగా పేర్కొంటారు. రాజు తండ్రి బస్వంత్ గతంలో బ్యాంక్ ఏజెంట్గా పనిచేశాడు. ఆయన పిగ్మీ డిపాజిట్లను వసూలు చేసి బ్యాంకులో జమ చేసేవాడు. దీంతో రాజు కూడా బ్యాంకు సిబ్బంది అని ఖాతాదారులు నమ్మారు. వారి నమ్మకాన్ని రాజు సొమ్ము చేసుకుని డిపాజిట్లతో ఉడాయించాడు. రూ. 60 లక్షలతో వ్యక్తి పరారు ఆందోళనలో బాధితులు -
వృక్షార్చనను విజయవంతం చేయండి
బాన్సువాడ రూరల్: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం నిర్వహించే వృక్షార్చన కార్యక్రమంలో ప్రజలు, పార్టీ నాయకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు షేఖ్ జుబేర్ కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కేసీఆర్ పుట్టిన రోజున ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటి సెల్ఫీని 9177916838 నెంబర్కు వాట్సాప్ చేయాలని కోరారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా ముందస్తుగా ఆదివారం బాన్సువాడలో ఆపార్టీ నేతలు షేఖ్ జుబేర్.. చర్చిలో కేక్ కట్ చేశారు. క్రైస్తవ సోదరులతోకలిసి చర్చి ప్రాంగణంలో మొక్కలు నాటారు. కామారెడ్డిలో.. కామారెడ్డి క్రైం: కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను కామారెడ్డిలో సోమవారం ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పట్టణ అద్యక్షుడు జూకంటి ప్రభాకర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు ఆయన నివాసం వద్ద ఈ వేడుకులు ఉంటాయన్నారు. తాడ్వాయిలో.. తాడ్వాయి/ఎల్లారెడ్డిరూరల్: కేసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తాడ్వాయి పల్లెప్రకృతి వనంలో ఆదివారం మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచన వల్లనే తాడ్వాయి గుట్టపైన పల్లెప్రకృతి వనం ఒక అడవిలా రూపు దిద్దుకుందన్నారు. ఆయన వెంట సింగిల్ విండో చైర్మన్ కపిల్రెడ్డి, మాజీ వైస్ఎంపీపీ నర్సిములు, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో నిర్వహించే కేసీఆర్ జన్మదిన వేడుకలలో పాల్గొనేందుకు మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రానున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఆదివారం తెలిపారు. -
చలానా సొమ్ము తిరిగిచ్చేదెప్పుడో?
దోమకొండ: ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం చలానాల రూపంలో డబ్బులు వసూలు చేస్తుంది. అయితే అనివార్య కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దయితే దరఖాస్తుదారుకు చలానాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే సుమారు ఐదేళ్లుగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నిజామాబాద్ అర్బన్, రూరల్తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, దోమకొండలలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ రద్దయినవారికి ఐదేళ్లుగా చలానాలు వాపస్ రావడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 600 మందికి సంబంధించి రూ. 15 కోట్ల రూపాయల రావాల్సి ఉందని తెలుస్తోంది. చలానాలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోనివారు తమ డబ్బుల కోసం దరఖాస్తు చేసుకుంటే వారి వివరాలను తీసుకుని బిల్లులు చేసి కోశాగార కార్యాలయానికి పంపిస్తున్నామని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా ఇటీవల కోశాగార కార్యాలయానికి పంపిన బిల్లులు తిరస్కరణకు గురైనట్లు తెలిసింది. మళ్లీ బిల్లులు చేయడానికి ఉన్నతాధికారుల అనుమతికోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే డబ్బులు విడుదల చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ రద్దయితే చలానాలు తిరిగి చెల్లించని సర్కారు ఐదేళ్లుగా పెండింగ్లోనే.. ఉమ్మడి జిల్లాలో రూ. 15 కోట్లకుపైనే బకాయిలు -
బండరాళ్లు పెట్టి బలిచేయొద్దు
బాల్కొండ: రైతులు తమ పంట దిగుబడులను తారు రోడ్లపై ఆరబెడుతూ, రక్షణగా బండరాళ్లును ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రోడ్లపై రాళ్లతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు. ప్రస్తుతం జొన్న కోతలు జోరందుకోవడంతో రైతులు నూర్పిళ్లు చేసిన పంట దిగుబడులను తారు రోడ్లపై ఆరబెడుతున్నారు. అలా ఆరబెట్టిన జొన్నల పక్కన బండరాళ్లను, కర్రలను పెడుతున్నారు. దీంతో రోడ్డుపై ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది ముప్కాల్ మండలం రెంజర్ల శివారులో ఎర్ర జొన్నల పంటలకు అడ్డుగా పెట్టిన రాళ్ల కారణంగా ప్రమాదం సంభవించి అదే గ్రామానికి చెందిన యువకుడు మృత్యువాత పడ్డాడు. అంతేకాకుండ వేర్వేరు ఘటనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయినా పాలకులు, అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలేదు. ఇదీ పరిస్థితి.. రోడ్లపై పంటల పక్కన ఏర్పాటు చేసిన రాళ్లను రా త్రివేళల్లో వాహనదారులు గుర్తించక ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొంతమది రైతులు పంట దిగుబడులను తరలించిన కూడా రోడ్లపై బండరాళ్లను అలానే వదిలి వెళ్తున్నారు. అన్నదాతలు తారు రోడ్లపై పంట దిగుబడులను ఆరబెట్టినా, వారి పా ట్లను గమనించి ప్రజలు ఎలాంటి ఫిర్యాదులు చే యడం లేదు. కాని బండరాళ్లను పెట్టడం వల్ల ప్రా ణాలు పోతున్నాయని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. తారు రోడ్లపై ఇప్పటి నుంచి మే వరకు ఏదో ఒక పంట దిగుబడి వస్తూనే ఉంటుంది. జొన్నలు పూర్తయ్యేలోపు వరి పంటలు చేతికి వ స్తాయి. దీంతో వరి ధాన్యం రోడ్లపై ఆరబెడుతారు. తర్వాత సజ్జ పంటలు చేతికి రాగానే వాటిని ఆరబెడుతారు. ఇలా ఏడాదిలో జూన్, జూలై, ఆగష్టు మా సాల్లోనే రోడ్లు ఖాళీగా ఉంటాయి. సెప్టెంబర్లో మ క్కలు, నవంబర్, డిసెంబర్లో వానాకాలం వరి పంటలు, జనవరి, ఫిబ్రవరి, మార్చిలో జొన్న పంటలు ఇలా ఎప్పుడు రోడ్లు పంట దిగుబడులతోనే దర్శనమిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి రైతులకు ఇతర ప్రాంతాల్లో సిమెంట్ కళ్లాలను నిర్మించాలని, ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బాల్కొండ మండలంలో జొన్న పంటను రోడ్లపై ఆరబెడుతున్న రైతులు రక్షణగా పక్కన రాళ్లు పెడుతున్న వైనం ప్రమాదం పొంచి ఉందంటున్న వాహనదారులు కేసులు నమోదు చేస్తాం.. రోడ్లపై పంట దిగుబడులను ఆరబెడుతూ పక్కన రాళ్లు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తాం. రాళ్ల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రైతులు ప్రయాణికుల ఇబ్బందులను కూడా అర్థం చేసుకోవాలి. – రజనీకాంత్, ఎస్సై, ముప్కాల్ -
జానకంపేట రైల్వేస్టేషన్లో చైన్ స్నాచింగ్
ఖలీల్వాడి: జానకంపేట రైల్వేస్టేషన్లో ఓ మహిళ మెడలోనుంచి రెండు తులాల బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. వివరాలు ఇలా.. హైదరాబాద్కు చెందిన కుమారిరెడ్డి రేణుక( 23) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం బాసరకు వెళ్లింది. తిరిగి సాయంత్రం రైలులో ఆమె హైదరాబాద్ వెళుతుండగా జానకంపేట రైల్వేస్టేషన్లో క్రాసింగ్ ఉండటంతో ఆగింది. కొద్దిసేపటికి రైలు బ యలుదేరగా ప్లాట్ఫామ్పైన గుర్తు తెలియని ఒక వ్యక్తి తన వద్దకు వ చ్చి కిటికీలోంచి తన మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లాడు. వెంటనే ఆమె నిజామాబాద్ రైల్వేస్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. మైలారం గ్రామంలో..నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని మైలారం గ్రామంలో గల కొచ్చెరి మైసమ్మ ఆలయం వద్ద చైన్ స్నాచింగ్ జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి చెందిన లక్ష్మి తన బంధువుల శుభకార్యం నిమిత్తం ఆదివారం కొచ్చెరి మైసమ్మ ఆలయానికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో ఆమె ఆలయం నుంచి వెళ్తుండగా వెనుకనుంచి బైక్పై గుర్తుతెలియని వ్యక్తి వచ్చి మెడలోని పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. వెంటనే ఆమె పోలీసులను ఆశ్రయించగా, విషయం తెలుసుకున్న బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ నస్రుల్లాబాద్ పోలీస్స్టేషన్కు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. వెంటనే దర్యాప్తు చేయాలని ఎస్సై లావణ్యను ఆదేశించారు. -
హిందీ బోధించడంలో దిట్ట
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులకు హిందీ బోధనతో పాటు ఎన్సీసీ ద్వారా మార్చ్ ఫాస్ట్ నేర్పుతున్నారు హిందీ ఉపాధ్యాయులు బల్వంత్రావు. అలాగే సరళంగా అర్థమయ్యే రీతిలో హిందీ వ్యాకరణ పుస్తకాన్ని రచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని మోడల్ స్కూల్లో హిందీ ఉపాధ్యాయుడిగా కంఠా లే బల్వంత్రావు ప్రస్తుతం విధులు నిర్వహిస్తు న్నారు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని సుక్క ల్ తీర్థం గ్రామానికి చెందిన బల్వంత్రావు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కొన్ని సంవత్సరాలు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేశా రు. అనంతరం 2011లో సంగారెడ్డి జిల్లాలోని పెద్ద శంకరంపేట మోడల్స్కూల్లో ఉపాధ్యాయుడిగా నియమితులయ్యారు. హిందీ బోధన చేయడంతో పాటు విద్యార్థులకు తన వంతుగా ఏదైనా నేర్పించాలనే ఉద్దేశంతో ఎన్సీసీ శిక్షణ పొంది బల్వంత్రావు విద్యార్థులకు సైతం మార్చ్ఫాస్ట్ నేర్పించారు. ఆయన సేవలను గుర్తించిన అధికారులు 2016లో మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2019లో సంగారెడ్డి జిల్లా ఉత్తమ హిందీ ఉపాధ్యాయుడిగా అవార్డులను అందుకున్నారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకలలో విద్యార్థులతో మార్చ్ఫాస్ట్ చేయించి అందరి మన్ననలు పొందారు. తనలో ఉన్న కళను విద్యార్థులకు నేర్పించి సంతృప్తి చెందుతున్నారు బల్వంత్రావు. అందరి మన్ననలు పొందుతున్న ఉపాధ్యాయులు బల్వంత్రావు విద్యార్థులకు హిందీ బోధనతో పాటు ఎన్సీసీ ద్వారా మార్చ్ఫాస్ట్ నిర్వహణ సరళంగా హిందీ వ్యాకరణం అర్థమయ్యేలా పుస్తక రచనగుర్తింపు ఉండాలన్నదే నా తపన పాఠశాలలో ప్రత్యేక గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో విద్యార్థులకు చదువుతో పాటు మార్చ్ఫాస్ట్ నేర్పుతున్నాను. తాను ఎన్సీసీలో పొందిన శిక్షణను విద్యార్థులకు అందిస్తున్నాను. విద్యార్థులు వ్యాకరణంలో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సరళ వ్యాకరణ పుస్తకాన్ని రచించి విద్యార్థులకు అందించి 14 సంవత్సరాలుగా పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతను సాధించేలా కృషి చేస్తున్నాను. – బల్వంత్రావు, హిందీ ఉపాధ్యాయుడు, మోడల్స్కూల్, ఎల్లారెడ్డి -
సాంకేతిక లోపంతో టోల్ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్
భిక్కనూరు: మండల కేంద్ర సమీపంలోని టోల్ప్లాజా వద్ద సాంకేతిక లోపం ఏర్పడడంతో ఆదివారం సుమారు అరగంట పాటు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. మూడు రోజుల క్రితం టోల్ ప్లాజాకు కొత్త కాంట్రాక్టర్ వచ్చారు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినప్పటికీ మొరాయించడంతో పలుమార్లు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి వైపు వెళ్తున్న అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకోవడంతో పోలీసులు శ్రమించి ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించారు. -
సమయానికి వైద్యం అందక..
జీజీహెచ్లో వాస్తవానికి డ్యూటీ షెడ్యూల్ ప్రకారం 24 గంటల పాటు ఒక్కరైనా గైనకాలజిస్ట్ అందుబాటులో ఉండాలి. అయితే వైద్యుల కొరతతో వారంలో రెండు, మూడు రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. దీంతో ఆస్పత్రికి వచ్చేవారికి సరైన సేవలు అందడం లేదు. ప్రధానంగా ప్రసవం కోసం వచ్చే గర్భిణులు ఇబ్బందిపడుతున్నారు. వైద్యులు లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో సీజేరియన్లు చేయకపోవడంతో ఉమ్మనీరు మింగి, గర్భంలో నీరంతా పోయి, శ్వాస ఆడక, ఇతర కారణాలతో గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ప్రతినెలా మూడుకుపైనే శిశుమరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి, వైద్యుల పోస్టులను భర్తీ చేసి, వైద్య సేవలు మెరుగుపడేలా చూడాలని, శిశుమరణాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.గైనకాలజిస్ట్లు లేక ఇబ్బందులు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో గైనకాలజిస్ట్లు లేరు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖాళీల ను భర్తీ చేయాలని ఉన్నతాధికారులను కోరారు. కొరత ఉన్నా సేవల కు ఇబ్బంది కలగకుండా వైద్యులు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎమర్జెన్సీ ఉంటే రిఫర్ చేస్తున్నాం. – ఫరీదా, ఇన్చార్జి సూపరింటెండెంట్, జీజీహెచ్, కామారెడ్డిజిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో చాలా వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా గైనకాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉండడంతో గర్భిణులకు సరైన సేవలు అందడం లేదు. సమయానికి ప్రసవాలు జరక్కపోవడంతో గర్భంలోనే శిశువులు మృతిచెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులూ చర్యలు తీసుకోకపోవడంతో జిల్లాలో శిశు మరణాలు ఆగడం లేదు. జీజీహెచ్లో గైనిక్ విభాగంలో ఇద్దరు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. మిగతా ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ముగ్గురూ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు టీచింగ్తో పాటు, జీజీహెచ్లో మహిళలకు, గర్భిణులకు వైద్య సేవలు అందించాల్సి ఉంది. పోస్టులు ఖాళీగా ఉండడంతో జీజీహెచ్లో 24/7 గంటల పాటు సేవలందించలేకపోతున్నారు. అర్ధరాత్రి వేళలో, సెలవు రోజుల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. డ్యూటీలో ఉన్న ఇతర విభాగాల వైద్యులు ప్రసవాలు, ఆపరేషన్ చేయలేక నిజామాబాద్, హైదరాబాద్లకు రిఫర్ చేస్తున్నారు. -
సలాబత్పూర్ వద్ద చెక్పోస్ట్ ఏర్పాటు
మద్నూర్: కోళ్లలో వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు కోళ్ల రవాణాను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు. శనివారం తెలంగాణ –మహారాష్ట్ర సరిహద్దులోని సలాబత్పూర్ వద్ద పశుసంవర్ధక శాఖ అధికారులు చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. కోళ్ల వాహనాలు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి రాకుండా చెక్పోస్ట్లోని పశుసంవర్ధక శాఖ, పోలీసు అధికారులు అడ్డుకుంటున్నారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ నుంచి మోపెడ్పై అహ్మద్ మియా అనే వ్యాపారి కోళ్లను జుక్కల్ మండలానికి తీసుకెళ్తుండగా సలాబత్పూర్ వద్ద అడ్డుకుని తిప్పి పంపించామని పశువైద్య అధికారి వినీత్ తెలిపారు. -
పది పరీక్షల్లో నూతన విధానం
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణలో పలు మార్పులు చేసింది. గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసి, పూర్వ పద్ధతిలో మార్కుల విధానాన్ని అమలులోకి తెచ్చింది. అడిషనల్ అవసరం లేకుండా 24 పేజీల బుక్లెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాకు సరిపడా బుక్లెట్లు చేరుకున్నాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వచ్చేనెల 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,011 ఉండగా 12,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రశ్నపత్రంతో పాటు ఓఎంఆర్ షీట్, జవాబులు రాసేందుకు 4 పేజీలు ఇవ్వడం, అందులో జవాబులు రాయడం పూర్తయ్యాక అడిషనల్ షీట్లు ఇవ్వడం చేసేవారు. కానీ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం లేకుండా ఈసారి 24 పేజీలతో బుక్లెట్ను తీసుకువస్తున్నారు. అన్ని జవాబులు బుక్లెట్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. నాలుగు చోట్ల..జిల్లాకు 24 పేజీలతో కూడిన బుక్లెట్లు ఇప్పటికే చేరుకున్నాయి. వాటిని భద్రపరిచేందుకు జిల్లాలో నాలుగు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణ కేంద్రాలతో పాటు పిట్లం మండల కేంద్రంలో ఇవి ఉన్నాయి. పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో ఈ సెంటర్ల నుంచి పరీక్షా కేంద్రాలకు బుక్లెట్లను తీసుకువెళ్లనున్నారు. అడిషనల్ పేపర్లకు బదులు 24 పేజీల బుక్లెట్ జిల్లాలో నాలుగు స్టేషనరీ రిసీవింగ్ సెంటర్ల ఏర్పాటు విద్యార్థులకు ఇబ్బందులు ఉండవు పదోతరగతి వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను స న్నద్ధం చేస్తున్నాం. ఈసారి విద్యార్థులు జవాబులు రా సేందుకు బుక్లెట్లను ఇవ్వనున్నాం. దీని ద్వారా తర చూ అడిషనల్ షీట్లు అడగాల్సిన అవసరం ఉండదు. – ఎస్.రాజు, డీఈవో, కామారెడ్డి -
లైంగిక దాడులను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: పాఠశాలల్లో పిల్లలపై లైంగిక దాడులను అరికట్టాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా ఎంపిక చేసిన ఉపాధ్యాయులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి శనివారం కలెక్టరేట్లో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి అధికారి చట్టాలపై అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సీడబ్ల్యూసీ మెంబర్ స్వర్ణలత, అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ -
‘రైతులకు పరిహారం అందుతుంది’
నిజాంసాగర్: ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు 51.66 కిలోమీటర్ల ఎన్హెచ్ 765 డి రహదారి విస్తరణ పనులకోసం 30.59 హెక్టార్ల భూములను సేకరించామని ఎన్హెచ్ ఏఈఈ శ్రీధర్ కుమార్ తెలిపారు. ఆ భూములకు సంబంధించి రైతులకు నష్ట పరిహారం అందుతుందన్నారు. శనివారం మహమ్మద్నగర్ మండలం నర్వ శివారులో జాతీయ ర హదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎల్లారెడ్డి– రుద్రూర్ మధ్యలో రహదారి విస్తరణ కోసం 10.41 కిలోమీట ర్ల భూమికి అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందన్నారు. రూ. 313 కోట్ల పనులకుగాను ఇప్పటి వ రకు రూ. 82 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని, వాటికి బిల్లులు చెల్లించామని తెలిపారు. కామారె డ్డి– ఎల్లారెడ్డి– పిట్లం నాలుగు లేన్ల రహదారి విస్తర ణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. -
షబ్బీర్ అలీకి సీఎం శుభాకాంక్షలు
కామారెడ్డి టౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి ఫోన్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చేనెల 2న మారథాన్ రన్ కామారెడ్డి టౌన్: క్యాన్సర్ వ్యాధిపై ప్రజల లో అవగాహన పెంచడానికి వచ్చేనెల 2న మారథాన్ రన్ పోటీలు నిర్వహించనున్నా రు. ఈ విషయాన్ని పద్మపాణి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ సత్యనారాయణ తెలిపారు. శనివా రం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. మొదట చిన్నారులకు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి కొ త్త బస్టాండ్ వరకు 3కే రన్ నిర్వహిస్తామని, ఆ తర్వాత వివిధ కేటగిరీలవారీగా 5కే, 10 కే, 21 కిలోమీటర్ల రన్ పోటీలు ఉంటాయని వివరించారు. వివరాలకు 85209 70785, 91605 85578 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. సమావేశంలో అథ్లెటిక్ కోచ్ శివ, ప్రతినిధులు పాల్గొన్నారు. చేతితో ఎత్తే మరుగుదొడ్లు లేని జిల్లాగా కామారెడ్డి కామారెడ్డి అర్బన్: చేతితో మలం ఎత్తే మరుగుదొడ్లు, మ్యాన్వల్ స్కావెంజర్లు లేని జిల్లా గా కామారెడ్డిని ప్రకటించారు. ఈ మేరకు జి ల్లా ఎస్సీ సంక్షేమాధికారి రజిత ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర కారం గ్రామాలతో పాటు పురపాలక సంఘాల్లో సర్వే చేయగా చేతితో ఎత్తే మరుగు దొడ్లు లేవని తేలిందని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని కోర గా ప్రజలు, సంస్థల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపారు. కొనసాగుతున్న ఇంటర్ ప్రాక్టికల్స్ కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం జరిగిన ఇంటర్ పరీక్షలకు 782 మందికిగాను 767 మంది హాజరయ్యారు. వొకేషనల్ విభాగంలో 160 మందికిగాను 153 మంది ప్రాక్టికల్స్లో పాల్గొన్నారు. మధాహ్నం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్కు 396 మంది విద్యార్థులకుగాను 375 మంది, వొకేషనల్లో 240 మందికిగాను 227 మంది హాజరయ్యారు. పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తనిఖీ చేశారు. డెయిరీ, లైఫ్సైన్స్ పూర్వ విద్యార్థులతో ముఖాముఖి కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సై న్స్ కళాశాలలో శనివారం పూర్వ విద్యార్థుల తో ముఖాముఖి నిర్వహించారు. పూర్వ వి ద్యార్థులు అల్పేస్ పటేల్, లక్ష్మారెడ్డి కార్యక్ర మంలో పాల్గొని తమ అనుభవాలను పంచు కున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిప ల్ విజయ్కుమార్ మాట్లాడుతూ అల్పేస్ ప టేల్ లండన్లో సొంత కంపెనీ ప్రారంభించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారన్నారు. పటేల్, లక్ష్మారెడ్డిలను ప్రిన్సిపల్ సన్మానించా రు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అకడమిక్ కోఆర్డినేటర్లు విశ్వప్రసాద్, జయప్రకాష్, శ్రీనివాస్రావు, రాజ్గంభీర్రావు త దితరులు పాల్గొన్నారు. బిచ్కుంద ఎస్సైపై ఫిర్యాదు కామారెడ్డి క్రైం: భూమిని వదులుకోకపోతే చంపుతామని ఎస్సైతోపాటు మరికొందరు బెదిరిస్తున్నారని బిచ్కుందకు చెందిన మక్క య్య లలిత, గంగారాం ఆరోపించారు. శని వారం జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ బిచ్కుంద శివారు లో ఉన్న తమ భూమిని వదులుకోవాలని కొద్దిరోజులుగా బిచ్కుంద, చిన్న దడ్గి గ్రామాలకు చెందిన సాలె హన్మండ్లు, అతడి కుమారుడు అంజయ్య, విఠల్రెడ్డి, హన్మండ్లు బెదిరిస్తున్నారన్నారు. వారికి బిచ్కుంద ఎస్సై మోహన్రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. వారంతా కలిసి పలుమార్లు దాడికి వచ్చారని, కులం పేరుతో దుర్భషలాడారని, చంపేస్తామని, కేసుల్లో ఇరికిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్
నిజాంసాగర్: మహమ్మద్నగర్ మండల కేంద్రంలోని మంజీరా పాఠశాలలో శనివారం నిర్వహించిన చిన్నారుల ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం ఆకట్టుకుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న చిన్నారులు తమ ఇళ్ల నుంచి తీసుకొచ్చిన వంటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కీర్తిరమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ముమ్మరంగా చెరుకు క్రషింగ్ సదాశివనగర్: మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో చెరుకు క్రషింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 3లక్షల437 టన్నుల క్రషింగ్ జరిగినట్లు ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్రావు తెలిపారు. ఎల్లారెడ్డికి నలుగురు ఉపాధ్యాయుల కేటాయింపు ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలానికి నలుగురు ఉపాధ్యాయులు నియామకమైనట్లు ఎంఈవో వెంకటేశం శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలో డీఈవో రాజు ఉపాధ్యాయులకు నియామకపత్రాలు అందించినట్లు పేర్కొన్నారు. మండలంలోని సాతెల్లి పాఠశాలకు ప్రవీణ్, జంగమాయిపల్లి పాఠశాలకు భాగ్యలక్ష్మి, కట్టకిందితండాకు కళ్యాణి, వెల్లుట్ల ప్రాథమిక పాఠశాలకు సత్తయ్యకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిపారు. వీరు సోమవారం విధుల్లో చేరనున్నట్లు పేర్కొన్నారు. 18న క్రీడాకారుల ఎంపిక తాడ్వాయి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీస్టేడియంలో ఈనెల 18న అండర్16 విభాగంలో జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక ఉంటుందని తెలంగాణ క్రికెట్ అసోసిసేషన్ జి ల్లా కార్యదర్శి కుమ్మరి ధన్రాజ్ తెలిపారు. ఆ యన శనివారం తాడ్వాయిలో మాట్లాడారు. ఇందులో ఎంపికై న వారు ఈ నెల 28 నుంచి మార్చి2 వరకు నిర్వహించే టోర్నమెంట్లో పా ల్గొంటారన్నారు.ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాఠశాల తనిఖీ ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెంకటాపూర్లో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎంపీవో ప్రకాశ్ శనివారం తనిఖీ చేసి విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగారు. ఆయన వెంట ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. -
కూతురిని ఇంటికి తీసుకువస్తుండగా రోడ్డు ప్రమాదం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): గల్ఫ్ నుంచి ఇంటికి వచ్చిన తండ్రి, హైదరాబాద్లోని హాస్టల్లో ఉంటున్న కూతురును ఇంటికి తీసుకువస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరింది. సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి హైవే 44పై ఈఘటన జరుగగా తండ్రి మృతిచెందాడు. కుమార్తెకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూర్ గ్రామానికి చెందిన ర్యాడ గంగాధర్(45), ఈనెల 14న దుబాయ్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. అతడి కూతురు లహరి హైదరాబాద్లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటుండగా, ఇంటికి తీసుకురావడానికి శుక్రవారం ఆయన కారులో వెళ్లారు. కూతురుతో కలిసి కారులో స్వగ్రామానికి వస్తుండగా శనివారం తెల్లవారుజామున అడ్లూర్ ఎల్లారెడ్డి బ్రిడ్జి వద్దకు రాగానే ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. దీంతో కారు అదుపుతప్పి డివైడర్ ఎక్కి ముందున్న లారీని ఢీకొట్టడంతో గంగాధర్కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కూతురు గాయపడగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రంజీత్ తెలిపారు. అదుపుతప్పి బస్సు, లారీని ఢీకొన్న కారు తండ్రి మృతి, కుమార్తెకు తీవ్ర గాయాలు -
నాగమడుగు పేరుతో ఇసుక అక్రమ దందా
బిచ్కుంద: నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ అభివృద్ధి పనుల సాకుతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను దేవాడ వద్ద శనివారం రాత్రి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉదయం 11 గంటలకు లారీకి నాగమడుగు ఫ్లెక్సీలు పెట్టి హైదరాబాద్, జహీరాబాద్కు ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు గుర్తించి పట్టుకున్నారు. అనుమతి పత్రాలు చూయించాలని వారు కోరగా కాంట్రాక్టర్ టిప్పర్లను అక్కడే వదిలేసి బాన్సువాడ సబ్ కలెక్టర్ నుంచి అనుమతి తీసుకొచ్చారు. ఇందులో పుల్కల్ క్వారీ నుంచి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే ఇసుక తీసుకెళ్లాలని అధికారులు అనుమతి పత్రం ఇచ్చారు. కానీ కాంట్రాక్టర్ నిబంధనలు పాటించడం లేదు. హజ్గుల్ మంజీరా నుంచి ట్రాక్టర్లలో సిర్సముందర్ శివారులో రెండు చోట్ల ఇసుక డంపులు వేసి లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. వాహనాలను అడ్డుకున్నట్లు సమాచారం తెలుసుకున్న ఆర్ఐ రవీందర్ ఘటన స్థలానికి చేరుకొని కాంట్రాక్టర్కు అనుమతి పత్రం ఇచ్చారు. ఇసుకను ఎందుకు అక్రమంగా తరలిస్తున్నారని ప్రశ్నించాల్సిన అధికారులు అక్రమదారులకు వత్తాసు పలకడం గమనార్హం. బాన్సువాడ సబ్ కలెక్టర్, జిల్లా అధికారుల అనుమతి లేకుండానే హజ్గుల్, ఖద్గాం, పుల్కల్ క్వారీ నుంచి ఇసుక అక్రమ దందా జోరుగా సాగుతోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. హజ్గుల్ క్వారీ నుంచి శివారులో డంపులు అనుమతి లేని టిప్పర్లను పట్టుకున్న గ్రామస్తులు -
పిచ్చెక్కిస్తున్న కల్తీ కల్లు
విచ్చలవిడిగా..కామారెడ్డి క్రైం: ప్రజల జీవితాలను కల్తీ కల్లు చిత్తు చేస్తోంది. కల్లు లభించకపోతే పిచ్చివారిగా మారిపో తున్నారు. కల్తీ కల్లు కారణంగా కొందరు ఆస్పత్రుల పాలవుతుండగా చాలామంది వింతగా ప్రవర్తించడంతోపాటు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఒక్కసారి అలవాటు పడితే కల్తీ కల్లు లేనిదే ఉండలేరు. మందు కల్లు తాగేవారికి అది లభించకపోతే కాళ్లు, చేతులు పని చేయవు. ఈ నేపథ్యంలో ఏదైనా ఊరికి వెళ్లేవారు బట్టలు సర్దుకోవడంతో పాటు కల్లు ప్యాకెట్లను కూడా వెంట తీసుకువెళ్తారు. పోటీ పడి మరీ... కల్తీ కల్లు తయారీలో ప్రమాదకరమైన మత్తు మందులను వాడుతున్నారు. పొద్దంతా శ్రమించి వచ్చే వారు అలసటను మర్చిపోవడం కోసం కల్లు సేవిస్తుంటారు. గతంలో ఎకై ్సజ్ శాఖ దాడులు పెరగడంతో మత్తు పదార్థాల వినియోగం తగ్గినప్పుడు వాటి ప్రభావం బయటపడింది. డైజోఫాం, అల్ఫ్రాజోలం లేకుండా కల్లు విక్రయించినప్పుడు మత్తు దొరక్క వందల సంఖ్యలో కల్లు ప్రియులు వింతగా ప్రవర్తించారు. కొందరు మతిస్థిమితం కోల్పోయా రు. పలు కల్లు డిపోలలో ప్రమాదకరమైన మత్తు మందులను పోటీపడి మరీ కలుపుతున్నారనే ఆరోపణలున్నాయి. తమ వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం డోసు పెంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఎంతో మంది మందుకల్లు మత్తులో విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అన్నీ తెలిసి కూడా ఎ ౖక్సైజ్ శాఖ ఈ అక్రమ దందాను అడ్డుకునే ప్ర యత్నం చేయడం లేదన్న విమర్శలున్నాయి. ఎకై ్సజ్ అధికారులు మామూళ్ల మత్తులో కల్తీని పట్టించుకో వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకుంటాం స్వచ్ఛమైన కల్లును మాత్రమే విక్రయించాలి. కల్తీ కల్లును విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వచ్చిన అన్ని ఫిర్యాదులపైన విచారణ జరిపించాం. ఇటీవల మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఎక్కడైనా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లయితే సమాచారం ఇవ్వాలి. తగిన చర్యలు తీసుకుంటాం. – హన్మంత్రావు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి జిల్లాకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చించారు. అయితే అతడు కల్తీ కల్లుకు బానిస. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మూడు రోజులపాటు కల్లుకు దూరంగా ఉండడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. చేసేది లేక ఆస్పత్రి సిబ్బంది కాళ్లు, చేతులు కట్టేసి వైద్యం అందించారు. అయినా కట్లు తెంచుకుని నానా హంగామా సృష్టించాడు. కల్తీ కల్లు దొరక్కే ఇలా ప్రవర్తించాడని వైద్యులు చెప్పారు. పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు రెండు నెలల క్రితం కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు ఉత్తరాదికి వెళ్లాడు. అతడికి మందు కలిపిన కల్లు అలవాటు ఉంది. తీర్థ యాత్రలో మందు కల్లు లభించకపోవడంతో వింతగా ప్రవర్తించాడు. ఓ పుణ్యక్షేత్రం వద్ద కుటుంబాన్ని వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు నాలుగు గంటల పాటు శ్రమించి అతడిని పట్టుకుని అద్దె కారులో కామారెడ్డికి తరలించారు. జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు అనారోగ్యం పాలవుతున్న కల్లు ప్రియులు మామూళ్ల మత్తులో ఎకై ్సజ్శాఖ యంత్రాంగం జిల్లాలో 22 కల్లు డిపోలున్నాయి. వీటిలో కల్లును తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. జిల్లా కేంద్రంలో రెండు డిపోలు, ఇవేకాకుండా మండల కేంద్రాలతో పాటు ప్రధాన గ్రామాల్లో డిపోలు, వ్యక్తిగత లైసెన్సులు కలిగిన కల్లు తయారీ కేంద్రాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా కల్లు డిపోలలో స్వచ్ఛమైన కల్లుకు బదులుగా కల్తీకల్లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈత చెట్ల నుంచి సేకరించే స్వచ్ఛమైన కల్లు చుక్క కూడా ఉండడం లేదు. నీళ్లలో రంగు రుచి కోసం పౌడర్లు కలిపి తయారు చేస్తూ, డైజోఫాం, అల్ఫ్రాజోలం లాంటి మత్తు మందులను, నిద్ర మాత్రల పొడిని కలుపుతున్నట్లు తెలుస్తోంది. -
ఆరాంఘర్ టు ఆర్మూర్
బయటపడిందిలా.. ● బయటపడ్డ బైక్ స్కాం ● ఆరాంఘర్లో సూత్రధారులు ● కామారెడ్డిలో మధ్యవర్తి.. సబ్ ఏజెంట్లతో దందా ● బైక్ పోయిందని ఇన్సూరెన్స్ క్లెయిమ్.. ఆ తర్వాత సగం రేటుకే విక్రయం ● ఆర్మూర్ పోలీసుల తనిఖీల్లో వ్యవహారం గుట్టురట్టు ● ఇప్పటి వరకు 34 బైక్లు స్వాధీనంఖలీల్వాడి: సాధారణ వ్యక్తుల్లా షోరూమ్కు వస్తారు.. ఫైనాన్స్లో కొత్త బైక్ను కొని.. రెండు, మూడు నెలలపాటు ఈఎంఐలు చెల్లిస్తారు. ఆ తర్వాత బైక్ పోయిందంటూ బీమా క్లెయిమ్ చేసుకుంటారు. తీరా అదే బైక్ను సగం రేటుకే ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటూ మోసాలకు పాల్పడుతోంది ఓ ముఠా. తీగ లాగితే డొంక కదిలినట్లు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో వ్యవహారం మొత్తం బయటపడింది.ఒకటి,రెండూ కాదు..ఇప్పటి వరకుఏకంగా 35 బైక్లను పోలీసులు ఈ స్కామ్లో గుర్తించారు. బైక్ స్కామ్ జరిగింది ఇలా హైదరాబాద్లోని ఆరాంఘర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యాపారులు బైక్ స్కామ్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ముగ్గురికి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ బ్రోకర్తో పరిచయం ఏర్పడింది. ఆ బ్రో కర్ పలువురు సబ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారికి తెలిసిన వారి ఆధార్కార్డు, ఒక సిమ్ తీసుకుంటారు. ఆధార్లో చిరునామా, వివరాలను మా ర్ఫింగ్ చేస్తారు. ఆ తర్వాత ఆరాంఘర్ వ్యాపారులు బైక్కు కావాల్సిన డౌన్పేమెంట్ను బ్రోకర్కు పంపిస్తారు. ఆ బ్రోకర్ డబ్బులను సబ్ ఏజెంట్లతో పాటు ఇతరులకు అందజేస్తాడు. వాళ్లు బై క్ షో రూంకు వెళ్లి నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మొదటి, రెండు వాయిదాలను సక్రమంగా చెల్లించిన తర్వాత బైక్ను ఎత్తుకెళ్లారని సమీప పోలీ స్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తారు. అలా బైక్కు ఉన్న ఇన్సూరెన్స్ డబ్బులను తీసుకుంటారు. ఇదంతా చే సినందుకు బ్రోకర్, సబ్ ఏజెంట్లు, బైక్ తీసుకున్న వ్యక్తులు ఒక్కొక్కరికి రూ. 5వేల వరకు ఆరాంఘర్ వ్యాపారులు ఇస్తారు. మిగితా డబ్బులను ఆ బ్రోకర్ ఆరాంఘర్ వ్యాపారులకు పంపిస్తారు. కొనుగోలు చేసిన బైక్లను కొన్ని నెలలపాటు దాచి ఉంచి.. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, యువకులకు ఒక్కో బైక్ను సుమారు రూ.50వేల నుంచి 70 వేల వరకు విక్రయిస్తారు. అనంతరం ఆ డబ్బులను సైతం తిరిగి ఆరాంఘర్ వ్యాపారులకు పంపిస్తారు. ఆర్మూర్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా ఓ బైక్ పట్టుబడింది. సంబంధిత పత్రాలు సమర్పించాలని, లేదంటే పోలీస్స్టేషన్కు తరలిస్తామని వాహనదారుడికి పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో భయపడ్డ వాహనాదారుడు జరిగిన వ్యవహారాన్ని పోలీసులకు స్పష్టంగా వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఒక్క బైక్ తీగలాగితే..హైదరాబాద్లోని ఆరాంఘర్ లింక్ దొరికింది. పెద్ద మొత్తంలో బైక్స్కామ్ జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. మరిన్ని బైక్లు దొరికే అవకాశం.. ఆరాంఘర్ వ్యాపారులు చెప్పిన ప్రకారం బ్రోకర్తోపాటు సబ్ ఏజెంట్లు విక్రయించిన బైక్లన్నీ ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. పోలీసులు శనివారం వరకు 34 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మున్ముందు మరిన్ని బైక్లు దొరికే అవకాశాలున్నట్లు తెలిసింది. బ్రోకర్తోపాటు సబ్ ఏజెంట్లను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆరాంఘర్కు చెందిన ముగ్గురితో ఉన్న సంబంధాలు, వ్యాపారాలపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాగా, తక్కువ ధరకే బైక్ కొనుగోలు చేసిన వారు కంగుతిన్నారు. వాహనాలతోపాటు డబ్బులు నష్టపోయామంటూ లబోదిబోమంటున్నారు. -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి చేపలవేటకు వెళ్లిన ఓ జాలరి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాలు ఇలా.. మండ ల కేంద్రానికి చెందిన బ ట్టుబుద్ది నారాయణ(50) శనివారం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి చేపలవేటకు వెళ్లాడు. వల వేసుకుంటూ నీటిలోపలికి వెళ్లి, తిరిగి బయటకు రాలేడు. స్థానిక మత్స్యకారులు గమనించి అతడు నీటిలో మునిగిపోయాడని గుర్తించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా నీటిలో మృతదేహం లభ్యమైందన్నారు. బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కరెంట్ షాక్తో ఒకరు.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని దేవాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్షాక్తో మృతిచెందినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చిందం మల్లయ్య(48), మరో వ్యక్తితో కలిసి ఈనెల 14న రాత్రి పెళ్లి పందిరికి కావాల్సిన అల్లనేరడు చెట్టకొమ్మలు తేవడానికి బ్రహ్మాజివాడి గ్రామశివారులోకి వెళ్లారు. ఈక్రమంలో ఓ చెట్టుపైకి ఎక్కి అతడు కొమ్మలు కొట్టివేస్తుండగా అక్కడే ఉన్న కరెంట్ తీగలపై పడ్డాయి. కొమ్మలు పచ్చిగా ఉండటంతో విద్యుత్ సరఫరా జరిగి మల్లయ్య కరెంట్షాక్తో కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య కిష్టవ్వ, కుమారుడు మల్లేష్, ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుక్క దాడిలో పలువురికి గాయాలు పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో శుక్రవారం ఒక పిచ్చి కుక్క వేర్వేరుగా దాడి చేసిన ఘటనలో వృద్ధురాలితోపాటు మరో ఆరుగురికి గాయాలయ్యాయి. గ్రామంలో ఇంటి బయట పనుల్లో నిమగ్నమైన వారిపై కుక్క దాడి చేసి గాయపరిచినట్లు స్థానికులు తెలిపారు. కాగా క్షతగాత్రులను కుటుంబ సభ్యులు ఆర్మూర్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించి చికిత్సలు చేయించారు. -
కొబ్బరి బొండాల పేరిట బురిడీ
ఖలీల్వాడి: కొబ్బరి బొండాలు తక్కువ ధరకు పంపిస్తామంటూ ఆన్లైన్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.1.68లక్షలకు టోకరా వేశారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.3లక్షల విలువచేసే కొబ్బరి బొండాలను రూ.1.68 లక్షలకు పంపిస్తామంటూ మొబైల్ ఫోన్లో ప్రకటన కనిపించడంతో కోజాకాలనీకి చెందిన షబానాజ్ ఆన్లైన్లో డబ్బులు చెల్లించాడు. కొబ్బరి బొండాలు రాకపోగా, ఆన్లైన్లో సంప్రదించినా సరైన స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
ఎడపల్లి(బోధన్): మండలంలోని జాన్కంపేట్ గ్రా మంలో తాళం వేసిన ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలోని ప్రధాన ర హదారి పక్కనే ఉన్న రెండంతస్తుల భవనంలో మొ దటి అంతస్తులో కిరాణ దుకాణం ఉండగా, రెండవ అంతస్తులో నీలా భాస్కర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. శుభకార్యం నిమిత్తం వారు శుక్రవారం ఇంటికి తాళం వేసి జిల్లాకేంద్రానికి వెళ్లారు. తిరిగి శనివారం ఉదయం ఇంటికి వ చ్చేసరికి తలుపులు తెరిచి ఉండటంతో చోరీ జరిగిన ట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ విజయ్ బాబు, ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణష్ణారెడ్డిలు ఘటనా స్థలానికి చే రుకుని పరిశీలించారు. దుండగులు ఇంట్లోకి చొరబ డి బీరువాలో దాచిన సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులతోపాటు, రూ.3లక్షల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఇద్దరు వ్యక్తు లు దొంగతనానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితుడు నీలా భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొబ్బరి బొండాల పేరిట బురిడీ
ఖలీల్వాడి: కొబ్బరి బొండాలు తక్కువ ధరకు పంపిస్తామంటూ ఆన్లైన్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూ.1.68లక్షలకు టోకరా వేశారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.3లక్షల విలువచేసే కొబ్బరి బొండాలను రూ.1.68 లక్షలకు పంపిస్తామంటూ మొబైల్ ఫోన్లో ప్రకటన కనిపించడంతో కోజాకాలనీకి చెందిన షబానాజ్ ఆన్లైన్లో డబ్బులు చెల్లించాడు. కొబ్బరి బొండాలు రాకపోగా, ఆన్లైన్లో సంప్రదించినా సరైన స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. -
బైండోవర్ నిబంధనల ఉల్లంఘన
● ఒకరికి రూ.15వేల జరిమానా భిక్కనూరు: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ముందు బైండోవర్ చేయడంతో ఆయన జరిమానా విధించినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు శనివారం తెలిపారు. మండలంలోని రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన పెరుక శ్రీనివాస్ గతంలో ఒక కేసులో తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. అట్టి బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించి అతడు ఒక ఆర్టీసీ బస్ డ్రైవర్పై అకారణంగా చేయిచేసుకున్నాడు. దీంతో శ్రీనివాస్పై కేసు నమోదు చేసుకుని భిక్కనూరు తహసీల్దార్ శివప్రసాద్ ఎదుట బైండోవర్ చేయగా రూ.15వేల జరిమానా విధించారన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శనివారం పట్టుకున్నారు. వీరి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేనందున కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. పోతంగల్ మండలంలోని మంజీరా పరివాహక ప్రాంతాల్లో, గుట్టల్లో, ఇటుక బట్టిల్లో అక్రమార్కులు ఇసుక డంప్లు ఏర్పాటు రాత్రి వేళ టిప్పర్లలో నింపి పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై దృష్టిసారించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పేకాడుతున్న 11మంది అరెస్టు రుద్రూర్: కోటగిరి మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న 11మందిని శనివారం పోలీసులు పట్టుకున్నారు. పేకాట స్థావరంపై విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 11మందిని పట్టుకోగా, వారి వద్దనుంచి రూ. 23,440 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై సందీప్ తెలిపారు. బోధన్ మండలంలో.. బోధన్ రూరల్: మండలంలోని పెగడపల్లి గ్రామ శివారులో పేకాడుతున్న ఐదుగురిని పట్టుకుని, అరెస్ట్ చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు. అలాగే వారివద్ద నుంచి రూ.16,390లు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
అడ్లూర్ పాఠశాలలో అన్నదానం
కామారెడ్డి రూరల్: మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు కోమటిపల్లి రాజు ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రం చిన్నారులకు, గర్భిణులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీపుల్ హార్ట్బీట్ ఫౌండేషన్కు విరాళం నాగిరెడ్డిపేట: గోపాల్పేటలోని కేరళ స్కూల్కు చెందిన విద్యార్థులు శనివారం అంధుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పీపుల్ హార్ట్బీట్ ఫౌండేషన్కు రూ.37,729 విరాళం అందజేశారు. విద్యార్థులు అందించిన విరాళాన్ని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు. -
సీఐపై చర్యలు తీసుకోవాలి
● ‘ఎక్స్’ వేదికగా ఎమ్మెల్సీ కవిత డిమాండ్ ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గురువారం మహిళపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని ‘ఎక్స్’ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం డిమాండ్ చేశారు. బాధిత మహిళ భాగ్యకు సత్వరం న్యాయం చేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారి మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుషమన్నారు. రేవంత్రెడ్డి ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
● భర్త చంపాడని కుటుంబ సభ్యుల ఆరోపణ ● న్యాయం చేయాలని ఆందోళన ధర్పల్లి: మండలకేంద్రంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్పల్లికి చెందిన లోలం అనూష (26), వేల్పూర్ మండలం జాన్కంపేటకు చెందిన వినోద్ కొన్నేళ్ల క్రితం ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నా రు. గత కొద్దిరోజులుగా భార్యభర్తలు పిల్లలతో కలిసి ధర్పల్లిలోనే ఉంటున్నారు. ఈక్రమంలో శుక్రవారం దంపతుల మధ్య గొడవలు జరుగ గా వినోద్ ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. అనంతరం అనూష మృతిచెంది ఉండగా, కుటుంబసభ్యులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు లు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చే శారు. అనూషను భర్తే చంపాడని, వెంటనే అత డిని పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, మృతురాలి బంధువులు శనివారం రాత్రి మండలకేంద్రంలో ఆందోళన చేపట్టారు. కాగా వినోద్ పరారీలో ఉన్నాడని, పోలీసులు అతని కోసం గాలిస్తున్నట్లు సమాచారం. తక్షణమే అనూష కుటుంబానికి న్యాయం చేయాలని, లేకపోతే ఆందోళన కార్యక్రమం చేపడతామని ఐద్వా సంఘం జిల్లా కార్యదర్శి సుజాత అన్నారు. -
అప్పులు తీర్చలేక ఒకరి ఆత్మహత్య
రామారెడ్డి: ఇంటి నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చలేక తను నిర్మించిన ఇంట్లోనే ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ధరణీ నర్సింలు(44) ఇంటికి 3రోజులుగా ఒక వైపు తాళం ఇంకో వైపు గడియా పెట్టి ఉండడంతో స్థానికులు శనివారం పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు వెళ్లి చూడగా అతడు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడాడు. నర్సింలు మూడేళ్ల క్రితం కొత్త ఇల్లు నిర్మించుకున్నాడు. ఇల్లు నిర్మాణానికి చేసిన అప్పులు తీరకపోవడంతో అతడు బాధపడుతుండేవాడు. ఈక్రమంలో భార్య లక్ష్మి పుట్టింటికి వెళ్లగా, ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై రవీందర్రావు తెలిపారు. నిజాంసాగర్లో ఒకరు.. నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ వ్యక్తి అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ శనివారం తెలిపారు. వివరాలు ఇలా.. బాన్సువాడ మండలం బుడ్మి గ్రామానికి చెందిన జీవన్(38), భార్య పిల్లలతో కలిసి నిజాంసాగర్ మండల కేంద్రానికి 8ఏళ్ల కిందట వలస వచ్చాడు. దంపతులు ఇద్దరు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. 2021లో అతడు పెద్ద కూతురు పెళ్లి కోసం రూ. 3లక్షలు అప్పు చేశారు. అప్పటి నుంచి అప్పులు పెరిగిపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో అతడి భార్య కొన్నిరోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జీవన్ ఒక్కడే ఇంట్లో ఉంటుండగా, జీవితంపై విరక్తి చెంది ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రం తనిఖీ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాన్ని శనివారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటని, ప్రాక్టికల్స్ జరిగినట్లు తెలిపారు. 63 మంది విద్యార్థులకు 61 మంది హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో జనరల్ ప్రాక్టికల్స్లో 4781 మందికి 4731 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ ప్రాక్టికల్స్లో 3152 మందికి 3046 మంది హాజరైనట్లు తెలిపారు. ప్రిన్సిపాల్ నరేందర్, తదితరులున్నారు. 28 నుంచి ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంఈడీ మూడవ సెమిస్టర్ రెగ్యులర్ థీయరీ పరీక్షలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 4వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని కంట్రోలర్ కోరారు. -
ఒకరి అదృశ్యం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన నార్ల శంకర్ (40) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మహేష్ శనివారం తెలిపారు. శంకర్ కొన్నిరోజుల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లగా, అతడి తల్లి మృతి చెందడంతో ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. హైదరాబాద్లో ఉన్న భార్యను ఈనెల 12న స్వగ్రామానికి రావాలని సూచించగా ఆమె రాలేదు. అప్పటినుంచి అతడు అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పోస్టర్ల ఆవిష్కరణ
నిజాంసాగర్: మహమ్మద్నగర్ మండల కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఉమ్మడి జెడ్పీ మాజీ చైర్మన్ దపేదార్ రాజు వృక్షార్చన హరిత సేవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 17న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొక్కలు నాటి హరితసేన కార్యక్రమానికి జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గునుకుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, పార్టీ నాయకులు రామాగౌడ్, విజయ్ కుమార్, మనీష్ రెడ్డి, మిడత సాయిలు, గజ్జల జీవన్, మల్లారెడ్డి, మైత్రి సాయాగౌడ్, నరేశ్, ఆరేటి రవి, మంగ జీవన్, మొకిరె నవీన్, పడమటి కాశీరాం తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డిలో వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో తానోబ ఆనంద్ రావు, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రమేశ్, రాజాగౌడ్, గంగాధర్రావు, సంజీవ్ పాటిల్, ప్రశాంత్ గౌడ్, గని, నాగరాజు, శంకర్, నర్సింలు, కృష్ణ, సాయిలు, రాజేశ్, అనిల్, రాజు, ప్రవీణ్, సుధాకర్, దేవరాజు, వెంకటగౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం నిజాంసాగర్: మండలంలోని బ్రాహ్మణపల్లిలో శనివారం సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బండారి చిరంజీవులు, వెంకటేశం, చంద్రకాంత్, సాయిలు, సంగయ్య, సాయిలు, దస్తయ్య, మచ్చేందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పాముల కలకలం
ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలికామారెడ్డి క్రైం: వేసవిలో ఎండల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జాతీయ వాతావరణ మార్పులు –ఆరోగ్య సమస్యల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలు, వాల్పోస్టర్లను శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి శిరీష, వ్యాధి నిరోధక టీకాల అధికారి విద్య, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుదయాకిరణ్, డీపీఆర్వో భీంకుమార్ తదితరులు పాల్గొన్నారు.రక్తదాన శిబిరానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం(నేడు) కామారెడ్డి సిరిసిల్లరోడ్డులోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం నిర్వహించే రక్తదాన శిబిరానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి పిలుపు నిచ్చారు. రక్తం చేసిన ప్రతి ఒక్కరికి హెల్మ్ట్ బహుమతిగా అందజేస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే రక్తదాన శిబిరానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై కళా ప్రదర్శన మాచారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు మూఢనమ్మకాలపై శుక్రవారం మండల కేంద్రంలో కళా ప్రదర్శ న నిర్వహించారు. మిమిక్రీ కళాకారుడు సుధాకర్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన ప్రదర్శ న అందరిని అలరించింది. అలాగే డ్రగ్స్కు అలవాటు పడ్డ యువకులు ఎలా మారిపోతారో మిమి క్రీ ద్వారా వివరించారు. ఎస్సై అనిల్ ఉన్నారు.ఎల్లారెడ్డి: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తరచూ పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలోని టైల్స్ పగిలిపోవడంతో వాటి మధ్యలోంచి పాములు వచ్చి జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వారు వాపోతున్నారు. కార్యాలయం కట్టిన ఏడాదికే టైల్స్ పగిలిపోవడంతో ఒకవైపు వాటిపై నుంచి నడవడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, మరోవైపు ఏ సందులో నుంచి ఏ పాము వస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి టైల్స్కు మరమ్మతులు చేసి, పాములు రాకుండా చర్యలు చేపట్టాలని జనాలు కోరుతున్నారు. పగిలిన టైల్స్ మధ్యలోంచి వస్తున్న పాములు ఇబ్బందులు పడుతున్న జనాలునిధులు రాగానే మరమ్మతులు ఎల్లారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో టైల్స్ పగిలిపోవడంతో ఇబ్బందిగా ఉంది. వీటి మరమ్మతుల కోసం ఉన్నతాధికారులకు రూ.4 లక్షల ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే మరమ్మతులు చేయిస్తాం. – సురేందర్బాబు, సబ్ రిజిస్ట్రార్, ఎల్లారెడ్డి -
చెట్టును ఢీకొన్న వ్యాన్
బాల్కొండ: ముప్కాల్ మండలం కొత్తపల్లి శివారులో శుక్రవారం ఒమ్ని వ్యాన్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఎవరికీ కూడా గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ముప్కాల్ మండల కేంద్రం నుంచి ప్రయాణికులతో వస్తున్న ఒమ్ని వాహనం కొత్తపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి లక్ష్మికాలువ పక్కన గల చెట్టుకు ఢీకొంది. చెట్టు లేకుంటే నేరుగా వాహనం కాలువలో పడిపోయేదని, దీంతో పెద్ద ప్రమాదం సంభవించేదని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ కామారెడ్డి క్రైం: పట్టణంలోని కాకతీయనగర్ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. కాలనీలో నివాసం ఉండే జ్ఞానబాయి ప్రయివేటు టీచర్గా పని చేస్తున్నారు. గురువారం ఆమె ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి స్వగ్రామమైన గాంధారి మండలం కరక్వాడికి వెళ్లారు. శుక్రవారం ఉద యం ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. ఇంట్లోని బీరువాలో దాచి న 10 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. -
అథ్లెటిక్స్లో మెరిసిన విద్యార్థిని
మాచారెడ్డి: జిల్లా స్థాయి 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిౖకైన విద్యార్థినిని శుక్రవారం అధ్యాపకులు అభినందించారు. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామానికి చెందిన తగిరంచ శ్రావ్య, మాచారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి 400 మీటర్ల పరుగు పందెంలో సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు కళాశాల క్రీడల ఇన్ఛార్జి నర్సింలు తెలిపారు. ప్రిన్సిపాల్ యాఖినొద్దీన్, అధ్యాపకులు శ్రావ్యను అభినందించారు. -
వాటరింగ్ డే నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: అధికారులు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా వాటరింగ్ డే నిర్వహించాలని కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఆయన కళాభారతి ఆడిటోరియం ఎదురుగా ఉన్న మొక్కలకు నీళ్లు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణంలోని పార్క్లు, రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీళ్లు పట్టాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఏఈ శంకర్, తదితరులు పాల్గొన్నారు. పార్క్లను అభివృద్ధి చేయాలి పట్టణంలో పార్క్లను అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీనికి సీనియర్ సిటిజన్లు, ఆయా వార్డుల్లోని వెల్ఫేర్ అసోసియేషన్ల సహకారం తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఆయన పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలోగల పార్క్ను కలెక్టర్ పరిశీలించారు. పిల్లలు ఆడుకునేందుకు పరికరాలు, ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పార్క్లలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. శానిటేషన్ పనులు, వాటరింగ్, పార్కుల అభివృద్ధి పనుల వివరాలను రోజు వారీగా సమర్పించాలని ఆదేశించారు.మొక్కలకు నీళ్లు పోస్తున్న కలెక్టర్ సంగ్వాన్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
కోటగిరి జీపీ కార్యదర్శికి ఏడాది జైలు
ఖలీల్వాడి/రుద్రూర్: లంచం తీసుకున్న కేసులో కోటగిరి జీపీ కార్యదర్శి జీఎం సుదర్శన్కు శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ ఆఫ్రోజ్ అక్తర్ ఏడాది కఠిన జైలు శిక్షతోపాటు రూ.40వేల జరిమానా విధించినట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. కోటగిరికి చెందిన వడ్డే నర్సింహులు తన తండ్రి లింగయ్య పేరు మీద ఉన్న ఇళ్లను అతడి సోదరుడి పేరు మీద బదిలీ చేయాలని గ్రామ కార్యదర్శి సుదర్శన్కు 2014లో విన్నవించాడు. కానీ అతడు రూ. 10వేలు లంచం డిమాండ్ చేయగా, నర్సింహులు రూ.8వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని నర్సింహులు ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించాడు. ఈక్రమంలో ఫిబ్రవరి 21, 2024న సెక్రటరీ సుదర్శన్కు రూ.8వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏసీబీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యుటర్ మనోజ్ఞ వాదనలు వినిపించగా, ఇరువర్గాల వాదనలు విన్న నాంపల్లి ఏసీబీ కోర్టు జడ్జి ఏడాది కఠిన జైలు శిక్షతోపాటు రూ.40వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు తెలిపారు. జరిమానా చెల్లించని యెడల ఒకనెల అదనపు సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించినారు. డ్రంకన్డ్రైవ్ కేసులో ఒకరికి రెండురోజుల జైలు ఖలీల్వాడి: మద్యం తాగి వాహనం నడిపిన ఒకరికి జైలుశిక్ష పడ్డట్లు ట్రాఫిక్ ఏసీపీ నారాయణ శుక్రవారం తెలిపారు. ఇటీవల డ్రంకన్డ్రైవ్ తనిఖీల్లో 13మంది పట్టుబడగా ట్రాఫిక్ ఎస్సై చంద్రమోహన్ వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా 12మందికి రూ.17వేలు జరిమానా విధించగా, ఒకరికి రెండు రోజుల జైలుశిక్ష విధించినట్లు తెలిపారు. వివాహిత అదృశ్యం మాచారెడ్డి: పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన దాసరి మమత అనే గృహిణి అదృశ్యమైనట్లు మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఇసాయిపేటలో ఆమె కామారెడ్డి వైపునకు వెళ్లే బస్సు ఎక్కి వెళ్లగా, ఇప్పటికీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో భర్త మహి పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ‘అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు’ ఖలీల్వాడి: జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, సహకరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి పోలీస్ కమిషనర్ సిహెచ్ సింధుశర్మ ఒక ప్రకటనలో హెచ్చరించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి, ఫిబ్రవరి నెలలో ఇసుక అక్రమ రవాణా చేసిన వారిపై 31కేసులు, నిజామాబాద్ డివిజన్లో 13కేసులు, ఆర్మూర్ డివిజన్లో 13కేసులు, బోధన్ డివిజన్లో 5కేసులు నమోదు చేశామన్నారు. ఎవరైనా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 08462–226090, డయల్ 100కు ఫోన్ చేసి, సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఒకరిపై కత్తితో దాడి ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్లో యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై మొగులయ్య తెలిపిన వివరాలు ఇలా.. ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు చెందిన బాబు కూలీ పనులు చేస్తూ జీవిస్తుండేవాడు. ఈనెల 12న రాత్రి అతడు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న సమయంలో పక్కన మరో యువకుడు వచ్చి పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత అతడు బాబు జేబులో నుంచి డబ్బులు తీస్తుండగా, మెలుకువ వచ్చి, రైల్వే పోలీసులకు తెలిపాడు. వారు సదరు యువకుడిని అక్కడి నుంచి పంపించారు. కొంతసేపు తర్వాత మళ్లీ అతడు బాబు వద్దకు వచ్చి, కత్తితో దాడి చేశారు. వెంటనే స్థానికులు గాయపడిన బాబును జీజీహెచ్కు తరలించారు. చికిత్స అనంతరం శుక్రవారం అతడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ కేసును ఒకటో టౌన్ పోలీసులు రైల్వే పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయనున్నారు. -
పెళ్లి మెనూలో చికెన్ బంద్
రామారెడ్డి: ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. పెళ్లి భోజనాలపై కోళ్ల మృత్యువాత ప్రభావం పడింది. ఎక్కువగా పెళ్లిళ్లలో మాంసాహారంతో భోజనం పెట్టడం సర్వసాధారణం. ఇందులో మొదటి ప్రాధాన్యతగా మటన్, తర్వాత చికెన్, చేపలు, గుడ్లతో విందు భోజనాలు కొనసాగుతాయి. వేల సంఖ్యలో కోళ్లు చనిపోతుండటంతో పెళ్లి విందు మెనూలో చికెన్ తొలగించేస్తున్నారు. దీంతో మటన్కు ప్రాధాన్యత భారీగా పెరిగింది. మరోవైపు మటన్ రేటు కూడా కిలో రూ.800 వరకు పలుకుతుండడంతో పెళ్లిళ్లు చేసే వారిపై ఆర్థిక భారం మరింతగా పెరిగింది. గతంలోనైతే మటన్ వడ్డించిన తర్వాత చికెన్ వడ్డించేవారు. ఇప్పుడు రెండుసార్లు కూడా మటన్ పెట్టడంతో శుభకార్యాల విందులు భారంగా మారాయి. అయితే కొంతమంది పెళ్లిళ్లలో చికెన్ పెడుతున్నప్పటికీ తినడానికి చాలామంది ఇష్టపడటం లేదని తెలుస్తోంది. వైరస్లతో కోళ్లు మృతి చెందడమే కారణం మటన్ పెట్టడానికే ప్రాధాన్యత