breaking news
Kamareddy
-
పాతాళ గంగమ్మ ౖపైపెకి..
● భారీ వర్షాలతో రికార్డు స్థాయిలో పెరిగిన భూగర్భ జలాలు ● సరాసరిన 7.32 మీటర్ల లోతులో నీరు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పారిన వరదలతో భూగర్భ జలాలు పైకి వచ్చాయి. జిల్లాలో సరాసరిన 7.32 మీటర్ల లోతులోనే నీరుంది. గతంలో ఎత్తిపోయిన బోర్లలోనూ నీటి ఊట వచ్చింది. దీంతో యాసంగిలోనూ సాగునీటికి ఢోకా ఉండకపోవచ్చన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతనెల చివరి వారంలో రికార్డు స్థాయిలో కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. జూలై 26 నాటికి భూగర్భ జలమట్టం 12.90 మీటర్లు కాగా.. ఆగస్టు 26 నాటికి 8.87 మీటర్లుగా ఉంది. ఆగస్టు చివరి వారంలో దంచికొట్టిన వర్షాలతో భూగర్భ జలమట్టం మరింత ఎగబాకి 7.32 మీటర్లకు చేరింది. జిల్లాలో ఏడాది సాధారణ వర్షపాతం 983 మి.మీ. కాగా ఇప్పటికే 1,074 మి.మీటర్ల వర్షం కురిసింది. నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టులన్నీ పొంగి ప్రవహించాయి. గతంలో ఎన్నడూ లేనంత వరద తాకిడితో ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జిల్లాలోని అన్ని చెరువులు, కుంటలు నిండాయి. మంజీర నదితో పాటు వాగులన్నీ ఇప్పటికీ పారుతూనే ఉన్నాయి. ఇంకా వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో భూగర్భ జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈసారి జిల్లాలో కరువు ప్రాంతాలుగా పేర్కొనే చోటా భారీ వర్షాలు కురిశాయి. దోమకొండ, భిక్కనూరు, బీబీపేట, మాచారెడ్డి, పాల్వంచ, రామారెడ్డి తదితర మండలాల్లో ఆగస్టు మూడో వారం వరకు అరకొర వర్షాలే కురిశాయి. ఆయా ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. ఎత్తిపోయిన బోర్లన్నీ పోస్తుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులన్నీ నిండడంతో పాటు భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో రెండు పంటలకు ఢోకా ఉండదని అధికారులు అంటున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. జలాశయాలన్నీ జలకళను సంతరించుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటలతో పాటు యాసంగికీ నీటి ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎర్రాపహాడ్లో 0.29 మీటర్ల లోతులోనే నీరు.. జిల్లాలోని కొన్నిచోట్ల భూగర్భ జలమట్టం మరింత పైకి ఎగబాకింది. తాడ్వాయి మండలం ఎర్రాపహడ్లో 0.29 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలుండడం గమనార్హం. సదాశివనగర్లో 0.80 మీటర్లు, భిక్కనూరులో 0.87 మీటర్లు, మద్నూర్ మండలం మేనూర్లో 1.19 మీటర్లు, నిజాంసాగర్ మండలం బూర్గుల్లో 1.46 మీటర్లు, మద్నూర్ మండల కేంద్రంలో 1.49 మీటర్లు, జుక్కల్ మండలంలోని సావర్గావ్లో 1.75 మీటర్లు, బాన్సువాడలో 2.10 మీటర్లు, లింగంపేట మండలం భవానీపేటలో 2.20 మీటర్లు, మాచారెడ్డిలో 2.70 మీటర్లు, బాన్సువాడ మండలం హన్మాజీపేటలో 2.80 మీటర్లు, సదాశివనగర్ మండలం పద్మాజివాడిలో 2.90 మీటర్లు, దోమకొండ మండలం అంబారీపేటలో 2.95 మీటర్ల లోతులోనే నీరున్నట్లు డిజిటల్ వాటర్ లెవల్ మీటర్లు స్పష్టం చేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అవసరం
ఖలీల్వాడి: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన అవసరమని సీపీ పోతరాజు సాయిచైతన్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం క్రాష్ ఇన్వెస్టిగేషన్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు చాలా కీలకమని, ప్రతి ప్రమాదం వెనక ఉన్న అసలైన కారణాలను వెలికితీసి, భవిష్యత్లో అలాంటి ఘటనలు జరగకుండా చూసేందుకు సహాయపడుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి పోలీస్ సిబ్బంది సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఈధర్ మేనేజర్ వర్షా నిహంత్, సేవ్ లైఫ్ ఫౌండేషన్ ప్రతినిధులు సాహెల్ మోటో, నూర్ ఖాట్టర్ పాల్, చిరాగ్ కాటేగర్, సీటీసీ సర్కిల్ సీఐ శివరాం తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి ప్రతిభకు ప్రోత్సాహం
● ‘ఎన్ఎంఎంఎస్’తో ఉపకారవేతనాల అందజేత ● పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభంసదాశివనగర్(ఎల్లారెడ్డి): విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 నుంచి ఎన్ఎంఎంఎస్(నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్) పేరుతో స్కాలర్ షిప్లను అందజేస్తుంది. దీని కోసం ఆయా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. పరీక్ష విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ఎనిమిదో తరగతి తర్వాత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా ఇంటర్ వరకు కొనసాగించేలా స్కాలర్ షిప్లను అందిస్తోంది. 2025–26 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ● అర్హతలు: ఏడో తరగతిలో కనీసం 55శాతం మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఎనిమిదవ తరగతి చదివేవారు. ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3–5 లక్షల లోపు ఉండాలి. ● కావాల్సిన పత్రాలు: ఆధార్ కార్డు, స్టడీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు ● పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల విద్యార్థులకు రూ. 50 దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 6 ● పరీక్ష తేదీ: నవంబర్ 23న (డివిజన్ కేంద్రాల్లో) -
‘పీజీ కోర్సులకు ప్రతిపాదనలు పంపండి’
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధి, పీజీ కోర్సులకోసం ప్రతిపాదనలు పంపించాలని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరే షన్ చైర్మన్ జి.అమిత్రెడ్డితో కలిసి కళాశాలను సందర్శించారు. డెయిరీ వివిధ వి భాగాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కళాశాలకు ప్రహారీ నిర్మించ డానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. పీజీ కోర్సు ప్రారంభిస్తే ఇక్కడి బీటెక్ వి ద్యార్థులకు సౌకర్యంగా ఉంటుందని కళాశాల అసోసియేట్ డీన్ సురేశ్ రాథోడ్ వి వరించారు. కళాశాల అధ్యాపకులు ఉమాపతి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. పాతరాజంపేట డెయిరీ సందర్శన పాతరాజంపేటలోని విజయ డెయిరీని వాకిటి శ్రీహరి, గుత్తా అమిత్రెడ్డి సందర్శించారు. 45 ఏళ్లుగా సేవలందిస్తున్న డెయిరీని ఆధునికీకరించాల్సి ఉందన్నారు. పాతరాజంపేట డెయిరీ అభివృద్ధి విషయమై మంత్రి కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వరరావు, జీఎం మధుసూదన్, అధికారులు కవిత, ధనరాజ్, లావణ్య, వైష్ణవి, పాల ఉత్పత్తిదారుల సంఘాల అధ్యక్షులు తిరుపతిరెడ్డి, కిష్టారెడ్డి, నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన ఉపాధ్యాయ నేత పుల్గం దామోదర్రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉద్యోగ విరమణ చేయడంతో శుక్రవారం ఆయనను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. -
పంట పొలాల్లో ఇసుక మేటల తొలగింపు
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను శుక్రవారం ఉపాధి హామీ కూలీలతో తొలగిస్తున్నట్లు డీఆర్డీవో సురేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బూరుగిద్ద ఊర చెరువు కట్ట తెగిపోవడంతో ఇసుక మేటలు ఏర్పడ్డాయన్నారు. ఉపాధి హామి కూలీలతో ఇసుక మేటలు తొగించాలని కలెక్టర్ ఆదేశించడడంతో కూలీలను ఏర్పాటు చేసి ఇసుక మేటలను తొలగిస్తున్నామన్నారు. ఇసుక మేటలు తొలగించి తిరిగి పంటలు సాగయ్యేలా చేస్తామన్నారు. ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, ఏపీవో నరేందర్, తదితరులున్నారు. బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డిరూరల్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే దోస్త్కు ఆశించిన స్పందన రాకపోవడంతో స్పాట్ అడ్మిషన్లు చేపడుతున్నారు. బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల, ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి 15, 16 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాళ్లు డాక్టర్ గంగాధర్, లక్ష్మీనారాయణ వేర్వేరుగా తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని వారు కోరారు. ఈ ఏడాది మాత్రమే కల్పించిన స్పాట్ అడ్మిషన్ల విధానాఽన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రామారెడ్డి: ప్రజల్లోకి ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు తీసుకెళ్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన ప్రవీణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ప్రవీణ్గౌడ్ను నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. తనకు మండల అధ్యక్ష పదవి రావడానికి కారణమైన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్కు ప్రవీణ్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. -
స్వేచ్ఛను హరించొద్దు
కామారెడ్డి అర్బన్/బాన్సువాడ రూరల్/ఎల్లారెడ్డి రూరల్ : ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పలువురు మేధావులు పేర్కొన్నారు. పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టడమంటే భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమేనన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్షంతోపాటు పత్రికలపై కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని సూచించారు.బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులకు పత్రికలే గొంతుకలు. ఏదైనా ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి. అంతేగాని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారన్న సాకుతో సాక్షి జర్నలిస్టులపై దాడులు చేయడం, కేసులు పెట్టడం మంచి సంప్రదాయం కాదు. – ముదాం అరుణ్కుమార్, జిల్లా అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకలు పత్రికలే. విమర్శలను ప్రభుత్వాలు సరైన విధంగా తీసుకోవాలి. పత్రికల గొంతునొక్కడం సరికాదు. సాక్షి మీడియాపై ఏపీ సర్కారు వేధింపులు, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. – కొంగల వెంకటి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య నిజాలను నిర్భయంగా రాసే వారికి సంకెళ్లు వేసినట్లుంది. ఇలా చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే అవుతుంది. జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడం సరికాదు. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. – నాగం సాయిబాబా, న్యాయవాది, ఎల్లారెడ్డి ప్రజలు, ప్రజాస్వామికవాదుల పక్షాన నిలబడే పత్రికలపై ప్రభుత్వాల దాడులు సర్వసాధారణమయ్యాయి. ప్రజల గొంతుకగా నిలబడుతున్న సాక్షిపై ఏపీ ప్రభుత్వం ఇలాగే కేసు పెట్టింది. ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. – విజయరామరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తప్పులను ఎత్తిచూపుతున్నారనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్షం గొంతునొక్కాలని చూస్తోంది. ప్రభుత్వాన్ని విమర్శించిన వ్యక్తులపై కాకుండా.. దానిని ప్రచురించిన పత్రిక సంపాదకుడు, జర్నలిస్టులపై కేసులు పెట్టడం అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. – అయ్యాల సంతోష్, ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, బాన్సువాడ ప్రజాసమస్యలను ప్రభుత్వానికి వినిపించే పత్రికలపై అణచివేత ధోరణి సరికాదు. ప్రతిపక్ష పార్టీ చేసిన విమర్శలు అబద్ధమైతే అధికార పక్షం వాస్తవాలను చెప్పి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలి. జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రోద్బలంతో పోలీసులు పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలి. – పి.లక్ష్మీనారాయణ మూర్తి, న్యాయవాది. బాన్సువాడ -
‘విజ్ఞాన ప్రదర్శనలతో కొత్త ఆవిష్కరణలు’
కామారెడ్డి అర్బన్: విద్యార్థులు తరగతిలో నేర్చుకున్న అంశాలతో పాటు తమ సొంత ఆలోచనలను ఆవిష్కరింపజేయడానికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతో తోడ్పడుతాయని విశ్రాంత ఆచార్యులు, శ్రీసరస్వతి విద్యాపీఠం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్వీకే విశ్వేశ్వరరావు అన్నారు. కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో శుక్రవారం 3 రోజులపాటు రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన, సాంస్కృతిక మహోత్సవం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు పైడి ఎల్లారెడ్డితో పాటు ముఖ్యవక్తగా విశ్రాంత ఆచార్యులు విశ్వేశ్వరరావు హాజరై మాట్లాడారు. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ.. శిశుమందిర్ పాఠశాలల్లో ఆధ్యాత్మిక భావనతో పాటు శాసీ్త్రయ దృక్పథం, దేశభక్తి అంశాలతో ఉత్తమ పౌరులుగా తీర్చదిద్దుతారన్నారు. నలంద, తక్షశిల లాంటి ప్రపంచంలోనే ఉత్తమ విశ్వ విద్యాలయాలు ప్రాచీన భారతదేశంలో ఉండేవని, చర్రితకు ఎక్కని ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారన్నారు. ప్రపంచానికి జ్ఞాన భిక్ష పెట్టింది భారతదేశమన్నారు. విద్యార్థులు వివేకానందుడిని ఆదర్శగా తీసుకోవాలని, ఆయన విద్యార్థి దశలో అన్నీ ప్రశ్నలే వేసేవారని, వాటి ద్వారా అనేక జ్ఞానాన్ని సంపాదించి ప్రపంచ ఆధ్యాత్మిక, తత్వవేత్తగా నిలబడ్డారన్నారు. ఉన్నత స్థాయికి ఎదగడానికి విజ్ఞాన ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతాయని శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. శ్రీసరస్వతి విద్యాపీఠం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్యాంసుందర్రావు, ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు. పలు జిల్లాలకు చెందిన 303 మంది విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. -
విమోచన దినోత్సవం రోజున సేవా కార్యక్రమాలు
బాన్సువాడ: తెలంగాణ విమోచన దినోత్సవం రోజు(సెప్టెంబర్ 17)ను పురస్కరించుకుని బాన్సువాడలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం పురస్కరించుకుని పలు సేవ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయ్యప్ప ఆలయంలో మోదీ పేరుపై అర్చన, ఆస్పత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18న స్వచ్ఛ భారత్ పేరిట బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో పరిశుభ్రత కార్యక్రమం ఉంటుందని అన్నారు. కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, శంకర్గౌడ్, మోహన్రెడ్డి, మజ్జిగ శ్రీనివాస్, చిరంజీవి, శంకర్, మహేష్, అనీల్, సాయిబాబా, కొండని తదితరులున్నారు. -
గుండెపోటుతో న్యాయవాది మృతి
నిజామాబాద్ లీగల్: నగరానికి చెందిన న్యాయ వాది పెద్దగాని కిరణ్ కుమార్ గౌడ్ (57) గుండెపోటుతో మృతి చెందాడు. కిరణ్ శుక్రవారం సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్కు చేరుకున్న కొద్దిసేపటికి చాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభిస్తుండగానే గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. 1997లో న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన కిరణ్ కుమార్ గౌడ్, సీనియర్ న్యాయవాది నారాయణరెడ్డి వద్ద జూనియర్గా పనిచేశాడు, న్యాయవాదిగా సివిల్, క్రిమినల్ కేసులు వాదించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. గవర్నమెంట్ ప్లీడర్గా, న్యాయవాదుల సొసైటీ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శిగా పనిచేశాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిరణ్ మృతిపట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం సంతాప సభ నిర్వహించనున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయిరెడ్డి తెలిపారు. చికిత్స పొందుతూ మహిళ ..రుద్రూరు: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు రుద్రూర్ ఎస్సై సాయన్న వెల్లడించారు. వివరాలు ఇలా.. మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సావిత్రి (62) ఈనెల 11న కడుపునొప్పి బాధ భరించలేక యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇసుక మేట.. తొలిగేదెలా?
బీబీపేట : జిల్లావ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పోటెత్తాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. పొలాల్లో భారీ ఎత్తున ఇసుక మేటలు వేశాయి. ప్రాజెక్టులు, చెరువుల కట్టలు దెబ్బతినడంతో వ్యవసాయ క్షేత్రాల్లో రాళ్లు, రప్పలు వచ్చి చేరాయి. ఒకవైపు పంట కొట్టుకుపోయి ఏర్పడిన నష్టం.. మరోవైపు ఇసుక మేటలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రం.. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న అన్నదాతలకు సర్కారు నుంచి సైతం ఊరట లభించడం లేదు. పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకంలో తొలగిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి పలు నిబంధనలు విధిస్తున్నారు. బాధిత రైతుకు ఉపాధి హామీ పథకం జాబ్కార్డ్ ఉండాలంటున్నారు. ఒక్కో రైతుకు రెండెకరాలలోపు విస్తీర్ణంలో ఏర్పడిన మేటలను మాత్రమే తొలగిస్తామంటున్నారు. అదీ గరిష్టంగా 600 క్యూబిక్ మీటర్ల ఇసుక తొలగిస్తామని పేర్కొంటున్నారు. ఈ నిబంధనలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జాబ్కార్డ్ లేని, రెండుకరాలపైన భూమి ఉన్న రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 600 క్యూబిక్ మీటర్ల నిబంధననూ తప్పుపడుతున్నారు. అర ఎకరంలోనే 600 క్యూబిక్ మీటర్లకు మించి ఇసుక పేరుకుపోయిందని పేర్కొంటున్నారు.ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో 586 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయని అధి కారులు గుర్తించారు. ఒక్క బీబీపేట మండలంలోనే 97 ఎకరాల్లో ఇసుకమేటలు వేశాయి. ఇందులో 40 మందికి జాబ్కార్డు ఉండగా పది మందికి జాబ్కార్డు లు లేవు. కొందరి భూమిలో రెండెకరాలకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఇసుక మేటలు వేయడంతో వారికి ఉపాధి హామీ పథకం వర్తించదు. ఈ నిబంధనలను రైతులు తప్పుపడుతున్నారు. ఎన్ని ఎకరాల్లో ఇసుకమేటలు ఉ న్నా ప్రభుత్వమే తొలగించాలని కోరుతున్నారు. పంట పొలాల్లో ఇసుకమేటలు ఉన్నట్లయితే ఉపాధి హామీ పథకం ద్వారా తొలగింపజేస్తాం. దీనికి ఉపాధి హామీ జాబ్కార్డు ఉన్నవారు అర్హులు. జాబ్కార్డు లేనివారికి జాబ్కార్డు అందించడానికి చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే ఇసుక మేటలు తొలగిస్తాం. – సురేందర్, డీఆర్డీవో, కామారెడ్డి ఇటీవలి వరదలతో దెబ్బతిన్న వ్యవసాయ క్షేత్రాలు ఇసుక తొలగింపునకు ఉపాధి హామీ జాబ్కార్డ్తో లింక్ అదీ ఒక రైతుకు 600 క్యూబిక్ మీటర్లకు మాత్రమే వర్తింపు ఆందోళనలో బాధిత రైతులు -
దుబాయ్లో మోపాల్వాసి మృతి
మోపాల్: మండలకేంద్రానికి చెందిన తలారి సవీన్ (35) దుబాయ్లో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. సవీన్ ఆగస్ట్ 16న ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. 21న కంపెనీలో పని ముగించుకుని గదిలోకి వచ్చిన సవీన్.. ఫోన్, పర్సు, గుర్తింపు కార్డులు పెట్టి వెళ్లిపోయాడు. ఈనెల 26న రోడ్డు పక్కన చెట్టు కింద విగతజీవిగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాల కోసం ప్రయత్నించారు. తెలియకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా గల్ఫ్ సంఘాలు, గ్రామస్తులు సవీన్ తప్పిపోయాడని వీడియో రూపొందించి వైరల్ చేశారు. ఆ వీడియోను పరిశీలించిన పోలీసులు.. వివరాలు సేకరించి కంపెనీకి సమాచారమిచ్చారు. సవీన్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గల్ఫ్ సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. త్వరగా మృతదేహాన్ని రప్పించే ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. మృతుడి తండ్రి తలారి చిన్న లక్ష్మణ్ సైతం దుబాయ్లో ఉన్నాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని భార్య కృష్ణవేణి కోరుతున్నారు. వాకింగ్ చేస్తున్న యువకులను ఢీకొన్న లారీ ● ఇద్దరికి గాయాలు కామారెడ్డి క్రైం: వాకింగ్ చేస్తున్న యువకులను ఓ లారీ అదుపుతప్పి, ఢీకొన్న ఘటన కామారెడ్డి మండలం రామేశ్వర్పల్లి సమీ పంలోని జాతీయ రహదారిపై చోటుచేసు కుంది. వివరాలు ఇలా.. శాబ్దిపూర్ రైట్ తండాకు చెందిన శివ కుమార్, రామేశ్వర్పల్లి తండాకు చెందిన బదావత్ సంజీవ్ కలిసి శుక్రవారం ఉదయం వాకింగ్ పూర్తిచేసుకుని తిరిగి తమ ఇళ్లకు బయలుదేరారు. రామేశ్వర్పల్లి సమీపంలోని జాతీయ రహదారిపై వారిని ఓ గుర్తు తెలియని లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంజీవ్కు స్వల్ప గాయాలు కాగా శివ కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తర లించారు. మెరుగైన చికిత్స కోసం శివ కుమార్ను హైదరాబాద్కు రిఫర్ చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టిన కారు బోధన్రూరల్: సాలూర మండలకేంద్రంలోని శివారులో శుక్రవారం ఓ కారు అతివేగం కారణంగా అదుపుతప్పి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు, ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమయ్యాయి. కారులోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో బోధన్ రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. ఇసుక తరలిస్తున్న వాహనం పట్టివేత బాన్సువాడ: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బోలెరో వాహనాన్ని శుక్రవా రం సీఐ అశోక్ పట్టుకున్నారు. బీర్కూర్ నుంచి అక్రమంగా వాహనంలో ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో సోమేశ్వర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు. -
అడుగుకో గుంత.. తీరేనా చింత
భిక్కనూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. భిక్కనూరు–రామేశ్వర్పల్లి, భిక్కనూరు–అంతంపల్లి, పెద్దమల్లారెడ్డి– ఇసన్నపల్లి, మల్లుపల్లి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మార్గాల్లో అడుగుతీసి అడుగేస్తే గుంత ప్రత్యక్షమవుతోంది. ఈ గ్రామాలకు వెళ్లే వారు నరకయాతన అనుభవిస్తున్నారు. వాహనాలపైన కాకుండా నడుచుకుంటూ వెళ్లినప్పటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ మార్గాల్లో వాహనాదారులు కింద పడి గాయాలపాలవుతున్నారు. వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేసి రోడ్లను బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.భిక్కనూరు నుంచి తిప్పాపూర్ గ్రామానికి వెళ్లాలంటే రామేశ్వర్పల్లి మీదుగా వెళ్లాల్సి వస్తోంది. భిక్కనూరు–రామేశ్వర్పల్లి రోడ్డు పూర్తిగా దెబ్బతినింది. ఈ రోడ్డుపై వెళ్తూ నరకం చూస్తున్నాం. గుంతలతో పాటు బురదమయంగా మారింది. నడుచుకుంటూ వెళ్లినా నరకం తప్పడం లేదు. – స్వామి, తిప్పాపూర్ -
వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పీహెచ్సీ వైద్యాధికారిణి ఆస్మా అప్షిన్ అన్నారు. శుక్రవారం కుప్రియాల్, ధర్మారావ్పేట్, భూంపల్లి, లింగంపల్లి తదితర గ్రామాల్లో వైద్య శిబిరం నిర్వహించారు. సీహెచ్వో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. రాజంపేట: రాజంపేట, తలమడ్ల గ్రామాల్లో రాజంపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించినట్లు వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఎంపీడీవో బాలకృష్ణ, ఎంపీవో రఘురాం, డాక్టర్ సంగీత, సూపర్వైజర్ మహమ్మద్ మంజూర్, గంగామణి, జీపీ సెక్రెటరీ అశోక్ కుమార్, వైఆర్జీకేర్ సుధాకర్, క్లస్టర్ లింక్ వర్కర్ శ్వేత, లావణ్య పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మాటూర్, లింగంపల్లికలాన్, ఎర్రకుంటతండాలలో శుక్రవారం వైద్యశిబిరాలను నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి అవసరమైనవారికి మందులను అందజేశారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యదర్శులు రవీందర్, వనజ, అనిత, హెల్త్ సూపర్వైజర్ మణెమ్మ, ఎంఎల్హెచ్పీలు సుజాత, అపర్ణ, అజయ్, ఏఎన్ఎంలు మంగ, సంధ్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు పెద్దపీట వేస్తున్నాం
● రిజర్వేషన్లను అమలు చేస్తాం ● కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో మంత్రి సీతక్క మాచారెడ్డి : బీసీలకు పెద్దపీట వేస్తున్నామని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పేర్కొన్నారు. శుక్రవారం మాచారెడ్డి, పాల్వంచ మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో ఆమె మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. రాష్ట్రం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటూ రాజకీయం చేస్తోందన్నారు. కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించాల్సిన బీసీ డిక్లరేషన్ సభను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. బీసీ డిక్లరేషన్ సభ ఎప్పుడు నిర్వహించినా వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అసత్యపు ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారన్నారు. మహిళలకు రుణాలు ఇవ్వకపోగా, పావలా వడ్డీ ఎగ్గొట్టిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. యూరియా అందించే బాధ్యత కేంద్రానిదని, తాము కూడా యూరియా కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. సోషల్ మీడియాల వేదికగా యూరియా కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత లేకుండా చేస్తాం రైతులకు యూరియా కొరత లేకుండా చేస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. మాచారెడ్డి, ఎల్లంపేట గ్రామాలకు 40 మెట్రిక్ టన్నులు, సోమారంపేట, రత్నగిరిపల్లి గ్రామాలకు 30 మెట్రిక్ టన్నుల యూరియా తెప్పిస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో బీసీ డిక్లరేషన్ సభ తేదీని ప్రకటిస్తామన్నారు. కామారెడ్డి ప్రజలు ఇకముందైనా సరైన నిర్ణయం తీసుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. సమావేశాల్లో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, మాజీ ఎంపీపీ నర్సింగరావు, మాచారెడ్డి, పాల్వంచ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నౌసీలాల్, రమేశ్గౌడ్, నాయకులు పూల్చంద్ నాయక్, సాయిలు, కమలాకర్రెడ్డి, శ్రీనివాస్చారి, బ్రహ్మానందరెడ్డి, శ్యాంసుందర్రెడ్డి, గణేశ్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నిజాంసాగర్ 4 గేట్ల ఎత్తివేత
నిజాంసాగర్ : సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో శుక్రవారం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 15,296 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు వరద గేట్లను ఎత్తి 21,988 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా శుక్రవారం సాయంత్రానికి 1,404.82 అడుగుల(17.542 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ‘ఇళ్లను త్వరగా నిర్మించుకునేలా ప్రోత్సహించాలి’ కామారెడ్డి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణా లు త్వరగా పూర్తి చేసేలా లబ్ధిదారులను ప్రో త్సహించాలని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయపాల్రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కమిటీ సభ్యులతో కలిసి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఇళ్లు నిర్మించుకుంటున్న వారితో మాట్లాడి ఏదైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ (1800 599 5991)కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇందిరమ్మ పథకానికి ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తోందని, ఇందుకోసం రెవెన్యూ అధికారులను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ డీఈఈ సుభాష్, ఏఈ రాము తదితరులు పాల్గొన్నారు. మరమ్మతుల పరిశీలన నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట శివారులోని పోచారం ప్రధాన కాలువకు చేపట్టిన మరమ్మతు పనులను శుక్రవారం ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పనులను జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఏఈ అక్షయ్కుమార్ ఉన్నారు. సీ్త్రనిధి బోర్డు రాష్ట్ర కోశాధికారిగా స్రవంతి బీబీపేట : సీ్త్రనిధి రాష్ట్ర బోర్డు కోశాధికారిగా మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి ఎన్నికయ్యారు. రాష్ట్ర సీ్త్రనిధి బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కోశాధికారిగా తనను ఎన్నుకున్నట్లు స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమెను జిల్లా సమాఖ్య సభ్యులు సన్మానించారు. -
షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలోని మావులీ హోల్సెల్ బేకరి, కిరాణ దుకాణం శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. టీచర్స్ కాలనీలోని కోండవార్ రాకేష్ హోల్సెల్ బేకరి, కిరాణ దుకాణం నడపుతున్నాడు. శుక్రవారం ఆయన వేరే ఊరికి వెళ్లగా అతడి భార్య ఉజ్వల దుకాణంలో ఉంది. దుకాణం వెనకభాగంలోంచి ఒక్కసారిగా దట్టమైన మంటలు, పొగ వ్యాపించడంతో భయంతో ఆమె బయటకు పరుగులు తీసింది. స్థానికులు వెంటనే మద్నూర్ ఫైర్స్టేషన్కు సమాచారం అందించారు. దుకాణం మొత్తం మంటలు వ్యాపించి వస్తువులు మొత్తం కాలిబుడిదయ్యాయని బాధితులు తెలిపారు. దుకాణం మొదటి అంతస్తులో కిరాయికి ఉన్న వారు మంటలను చూసి పక్కన ఉన్న మరో ఇంటిలోంచి బయటకు వచ్చేశారు. ఫైర్సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. మద్నూర్ ఎస్సై విజయ్కొండ, పోలీసు, ఫైర్ సిబ్బంది స్థానికుల సహాయంతో దుకాణం పక్కనే ఉన్న మరో గోడౌన్లోని సామాన్లు బయటకు పడేయడంతో ఆస్తినష్టం తగ్గిందని వారు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకున్న తర్వాత దుకాణం లోపల స్టీల్ డబ్బాలో దాచిన ఉన్న 15 తులాల బంగారం, రూ.3 లక్షల నగదును లీడింగ్ ఫైర్మెన్ నరసింహులు బాధితులకు అప్పగించారు. ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఫైర్ సిబ్బంది హరీష్, రాణాప్రతాప్, రాజు, దిగంబర్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
కొండ చిలువ పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం 9 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు. అయిలాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి గల డ్రెయినేజీలో అలికిడి రావడంతో గ్రామస్తులు చూడగా భారీ పాముగా గుర్తించారు. వెంటనే నందిపేటకు చెందిన పాములు పట్టే సర్వర్కు సమాచారం అందించారు. వెంటనే సర్వర్ అయిలాపూర్కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో డ్రెయినేజీలోని కొండ చిలువను పట్టుకుని రోడ్డుపై పడవేశాడు. కొంతసేపు కొండచిలువ అటుఇటుగా తిరగడంతో గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. చివరికి దానిని అదుపులోకి తీసుకుని సంచిలో వేశాడు. పట్టుకున్న కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు సర్వర్ వివరించాడు. -
యువకుడి అదృశ్యం
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్ నగర్కు చెందిన కాంపెల్లి రాము అదృశ్యం అయినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపారు. వినాయక్ నగర్లోని అంగిటి హోటల్ వద్ద రాము అదృశ్యమయ్యాడని, అతడి మానసిక స్థితి బాగాలేదని సోదరుడు తిరుపతి పేర్కొన్నాడు. తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు, నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా రాము ఆచూకీ తెలిస్తే 8712659840, 8712659836కు సమాచారం అందించాలని ఎస్సై తెలిపారు. అక్రమ మద్యం స్వాధీనం మోర్తాడ్: భీమ్గల్ మండలం బాబాపూర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎస్సై గోవర్ధన్ గురువారం తెలిపారు. బాబాపూర్కు చెందిన జంగిటి నరేష్, సుమలత వద్ద 7.92 లీటర్ల అక్రమ మద్యంను స్వాధీనం చేసుకున్నామని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అక్రమ మద్యం స్వాధీనం ఘటనలో సిబ్బంది దత్తాద్రి, శ్రీనివాస్రెడ్డి, జగదీష్, రాణిలు పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. వ్యభిచార గృహంపై పోలీసుల దాడి నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని పోచమ్మ కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. కాలనీలో ఏడాది కాలంగా వ్యభిచారం చేస్తుండగా బుధవారం రాత్రి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్సై రాఘవేంద్ర సిబ్బందితో కలిసి సదరు గృహంపై దాడి చేశారు. బాన్సువాడ పట్టణానికి చెందిన సంగమిత్ర, బ్రమోత్ జయ, సాయాగౌడ్, బస్వాయిపల్లికి చెందిన హైమద్లను అదుపులోకి తీసుకున్నారు. నస్రుల్లాబాద్లో అసాంఘీక కార్యకలాపాలు జరుపుతున్న ఇంటి యజమానిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. వారి వద్ద నుంచి రెండు ఫోన్లు రూ.500 నగదు స్వాదీనం చేసుకున్నామన్నారు. సంబంధిత వ్యక్తులపైన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బోధన్రూరల్: సాలూర మండలంలోని మందర్న శివారులో గురువారం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను, 2 ఆటోలను సాలూర రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తహసీల్దార్ శశిభూషణ్ తెలిపారు. -
చిరుతపులి సంచారమంటూ వైరల్
● భయాందోళనకు గురైన మద్నూర్వాసులు ● అది చిరుత కాదు.. అడవి పిల్లి అని నిర్ధారించిన అటవీ శాఖాధికారులు మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో చిరుత పులి తిరుగుతుందని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు భయాందోళన చెందారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు మద్నూర్లో చిరుత పులి తిరిగిందని వాటి పాదముద్రలు ఉన్నాయని వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో అధికారులు రంగంలోకి దిగా రు. మద్నూర్ ఎస్సై విజయ్కొండ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంచందర్లు తన సి బ్బందితో మ ద్నూర్ శివారు లో చిరుత అడు గులను పరిశీలించారు. పూర్తి వి చారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారు లు అది చిరుత పులి పాదంకాదని అడవి పిల్లి పాదం అని తెల్చడంతో ప్రజలు ఊపిరిపిల్చుకున్నారు. చిరుత పులి అడుగులు పెద్దగా ఉంటాయని ప్రజలు ఆందోళన చెందవద్దని అటవీశాఖ అధికారులు తెలిపారు. -
ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్య
ఎల్లారెడ్డి: ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సబ్దల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. సబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల సావిత్రి (20) బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి తండ్రి రాంచందర్ ఇంటికి రాగా, ఉరివేసుకున్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. సావిత్రికి లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన మార్గపు ప్రదీప్తో ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నదని, అతడు నిరాకరించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాంచందర్ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గూపన్పల్లిలో ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ ఎస్హెచ్వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గూపన్పల్లికి చెందిన చింతకుంట రాజు(30) ఆటోడ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజులుగా రాజు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యల కారణంగా తాగుడుకు బానిసయ్యాడు. ఈక్రమంలో గురువారం తీవ్ర మనస్తాపానికి గురై, ఇంటిలో ఎవరు లేని సమయంలో రాజు ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వివరించారు. -
సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించండి
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కోరుతూ శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి మాట్లాడుతూ.. పట్టణంలోని పాత అంగడి బజార్, కుమ్మరి గల్లీ, పాత బాన్సువాడ, గౌలీగూడ, ఇస్లాంపూర తదితర కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైయినేజీలు నిర్మించాలని అన్నారు. రోడ్లపై వర్షపు నీరు నిలిచి ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పాడుతుందని అన్నారు. ఇంటి, కుళాయి పన్నులు వసూలు చేస్తున్నారు కానీ ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని అన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు వినతి పత్రం అందజేశారు. నాయకులు సాయిబాబా, చందర్, రమేష్యాదవ్, ఇషాక్, సాయిలు, నాగనాథ్, ఉబేద్, అప్జల్, లతీఫ్ తదితరులు ఉన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు ఇవ్వొద్దు
బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని గృహనిర్మాణశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్రెడ్డి సూచించారు. మండలంలోని కోనాపూర్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో గురువారం పర్యటించిన ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు తమకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో స్వయంగా తెలుసుకోవచ్చన్నారు. సందేహాల నివృత్తికి ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 18005995991ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు బిల్లుల చెల్లింపు, పనులకు సంబంధించిన ఫొటోలను అప్లోడ్ చేసే విధానాన్ని తెలిపారు. అవసరమైన ఇసుకను రెవెన్యూ అధికారి అనుమతితో ఉచితంగా తెచ్చుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఆయన వెంట డిప్యూటీ ఈఈ గోపాల్, ఏఈ వినీత్, పంచాయతీ కార్యదర్శి భరత్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉన్నారు. -
గోడ కూలి వృద్ధ దంపతులకు గాయాలు
మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్లో ఇంట్లోని గోడ కూలడంతో వృద్ధ దంపతులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. హండేకేలూర్ లోని ఇంట్లో తుమ్మల్వార్ హన్మండ్లు, రుక్మిణీబా యి అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. గురువారం ప్రమాదవశాత్తు ఇంట్లోని గోడ కూలి వారిపై పడటంతో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ముజీబ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దరాస్ సాయిలు ఘటన స్థలానికి చేరుకొని, బాధితులను చికిత్స నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొన్ని రోజుల క్రితం భారీ వర్షాలు కురవడంతో హన్మండ్లు ఇంటి గోడ నాని తడిసిపోవడంతో కూలిపోయిందని స్థానికులు తెలిపారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లలో ఉండరాదని, ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని దరాస్ సాయిలు సూచించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను పరిశీలించారు. -
అలుగు పారుతున్న పోచారం ప్రాజెక్టు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని పోచారంప్రాజెక్టు 15 రోజులుగా అలుగు పారుతూనే ఉంది. ప్రాజెక్టుకు వచ్చే వరద తగ్గుముఖం పట్టినప్పటికీ ఇన్ఫ్లోగా వచ్చిన నీరు అలుగుపై నుంచి జాలువారుతూ దిగువకు ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,182 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తుండగా 1,152 క్యూసెక్కుల నీరు అలుగుపై నుంచి దిగువకు ప్రవహిస్తూ అవుట్ఫ్లోగా వెళ్తుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.అవగాహనే ఆయుధంకామారెడ్డి క్రైం: అవగాహన పెంచుకోవడమే సైబర్ నేరాల నియంత్రణకు ప్రధాన ఆయుధమని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పో లీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నియంత్రణపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న సైబర్ వారియర్లకు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో తయారు చేసిన టీషర్టులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో సైబ ర్ నేరాలు వేగంగా విస్తరిస్తున్నాయని అన్నారు. నేరాల నియంత్రణపై పూర్తి అవగాహన కలిగి ఉంటూ సాంకేతిక నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన వారు వెంటనే టోల్ఫ్రీ నంబర్ 1930కి లేదా స్థానిక పోలీసులకు లేదా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేలా ప్రతి పోలీస్ స్టేషనన్్ పరిధిలోనూ నిపుణుల బృందం ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సైబర్ క్రైం జిల్లా నోడల్ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.పరామర్శభిక్కనూరు: ఏఎంసీ మాజీ డైరెక్టర్ బుర్రిగోపాల్ను బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నేత గంప శశాంక్ గురువారం పరామర్శించారు. గోపాల్ తల్లి రాజవ్వ రెండు రోజుల క్రితం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న శశాంక్.. బస్వాపూర్ గ్రామానికి వచ్చి గోపాల్ను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ యువజన విభాగం మండలాధ్యక్షుడు రంజిత్ వర్మ, నేతలు ఉన్నారు. -
పడిగాపులు కాస్తే ఒక్కో బస్తా..
కామారెడ్డి రూరల్: కామారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని కామారెడ్డి పట్టణంలో, గర్గుల్, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లోని యూరియా పంపిణీ కేంద్రాల వద్ద రైతులు బుధవారం రాత్రి నుంచే యూరియా కోసం బారులు తీరారు. క్యూలైన్లో చెప్పులు, బస్తాలు, ఇటుకలు, రాళ్లు పెట్టి గురువారం ఉదయం వరకు వేచి ఉన్నారు. కామారెడ్డి, గర్గుల్, చిన్నమల్లారెడ్డికి 222 బస్తాల చొప్పున రాగా, వాటిని ఒక్కోక్కరికి ఒక్క బస్తా మాత్రమే పంపిణీ చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే రాత్రి మళ్లీ యూరియా లోడ్ వస్తుందని మిగతా రైతులకు మూడో చోట్ల టోకెన్లు పంపిణీ చేశారు. దీంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఒకవైపు వర్షాలతో పొలాల్లో నీళ్లు వచ్చి ఇబ్బంది పడుతున్నామని, అటు పొలాలను చూసుకోవాలా? ఇటు యూరియా కోసం తిరగాలా అని ప్రశ్నించారు. ఎక్కడికక్కడ సొసైటీలకు అవసరమైన యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ విషయమై మండల వ్యవసాయధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ... కామారెడ్డి మండలంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల రైతులు తరలి రావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని. రైతులందరికీ సరిపడా యూరియా అందజేస్తామన్నారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లో.. మాచారెడ్డి: పాల్వంచ మండలం భవానీపేట, మాచారెడ్డి మండలం ఎల్లంపేట, సోమారంపేట గ్రామాల్లో రైతులు యూరియా కోసం బారులు తీరారు. భవానీపేటకు 220, ఎల్లంపేట, సోమారంపేటకు 220 చొప్పున బస్తాలు రాగా రైతులు ఒక్కసారిగా పోటీపడ్డారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ రైతులను సముదాయించి టోకెన్లు ఇప్పించారు. సాయంత్రం వరకు టోకెన్లు తీసుకున్న రైతులు యూరియా తీసుకున్నారు. -
‘కంది’ పంటకు కష్టం.. నష్టం
బిచ్కుంద(జుక్కల్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిచ్కుంద మండలంలో సోయా, పత్తి, కంది, పెసర, మినుము, వరి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంట చేలలో వరద నీరు ఆగి ఉండడంతో సోయా, కంది పంట మొక్కలు కుళ్లిపోయి పూర్తిగా మాడిపోయాయి. దెబ్బతిన్న పంటలను గుర్తించి నివేదిక అందించాలని ప్రభుత్వ ఆదేశంతో బిచ్కుంద మండలంలో వ్యవసాయ అధికారులు సర్వే చేపట్టారు. మండలంలో ఎక్కువ శాతం కందిలో అంతర పంటగా సోయా సాగవుతుంది. ఎకరం భూమిలో అంతర పంటలో సోయా, కంది రెండు పంటలు నష్టపోయినప్పటికి ఆ రెండు పంటను సర్వే నివేదికలో నమోదు చేయాల్సి ఉండగా అధికారులు కేవలం సోయా పంటకు మాత్రమే నష్ట జరిగిందని సర్వే నివేదికలో నమోదు చేయడం గమనర్హం. కంది కుళ్లిపోయి ఎండిపోయింది. కనీసం ఒక ఎకరం కూడా నష్టపోయిందని అధికారులు గుర్తించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టం కింద ఒకే పంట పరిగణనలోకి తీసుకుంటే చాలా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరం కూడా గుర్తించకపోవడంపై ఆగ్రహం.. బిచ్కుంద మండలంలోని సిర్సముందర్, దేవాడ, దడ్గి, తక్కడ్పల్లి, బిచ్కుంద, దౌల్తాపూర్, గుండెకల్లూర్, మిషన్ కల్లాలి గ్రామాలలో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అధికారులు సర్వే చేసి సోయా 2,685 ఎకరాలు, వరి 392 ఎకరాలు, పత్తి 86 ఎకరాలు, మినుము 18, పెసర 12 ఎకరాలు మొత్తం 3,193 ఎకరాలలో పంటలకు నష్టం జరిగిందని లెక్కలు తేల్చారు. వందల ఎకరాలలో కంది పంటకు నష్టం జరిగినప్పటికి ఒక్క ఎకరం కూడా గుర్తించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ స్పందించి నష్టంవాటిల్లిన రెండు పంటల వివరాలు తీసుకొని పరిహారం అందేవిధంగా చూడాలని రైతులు కోరుతున్నారు. దిగుబడిపై వర్ష ప్రభావం... భారీ వర్షాలతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడింది. సాధారణంగా సోయా పంట ఎకరానికి 10 నుంచి 12 క్వింటాలు .. కంది 7 నుంచి 8 క్వింటాలు, పెసర 5 క్వింటాలు దిగుబడి వచ్చేది. పెసర, సోయా పూత దశలో ఉండగా వర్షాలు పడటంతో ఉన్నపూత రాలిపోయి కొన్ని కుళ్లిపోయాయి. దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రస్తుతం సోయా దిగుబడి ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు, కంది ఎకరానికి 4 క్వింటాలు దిగుబడి వస్తుందని రైతులు అంటున్నారు. పెసర పంటకు పూర్తిగా నష్టం జరిగిందంటున్నారు. ఒక ఎకరం భూమిలో అంతర పంటగా సాగవుతున్న రెండు పంటలు దెబ్బతింటే ఎకరం భూమి కింద ఒకే పంటను పరిగణలోకి తీసుకుంటున్నాం. సోయా అంతర పంటలో కంది సాగు అవుతుంది. ఏ పంటకు ఎక్కువ నష్టం ఉందో ఆ పంటను పరిగణలోకి తీసుకొని సర్వే నివేదికలో నమోదు చేస్తున్నాం. రైతులకు నష్టం జరగకుండా చూస్తాం. –అమర్ ప్రసాద్, ఏవో, బిచ్కుంద అంతర పంటలో భాగంగా కంది సాగును నష్టంగా గుర్తించని అధికారులు సోయాను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న అధికారులు రెండు పంటలకు పరిహారం ఇవ్వాలంటున్న రైతులు -
మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు
● అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● అత్యవసరమైతేనే బయటికి రావాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచనకామారెడ్డి క్రైం: జిల్లాలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సమాచారం అందించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని పేర్కొన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలు, వరదకు గురయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, కాలువలు, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, విద్యుత్ స్తంభాలు తదితర అన్నింటినీ ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియపర్చాలని అధికారులకు సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్పష్టం చేశారు. చేపల వేటకు వెళ్లడం, పశువులు, గొర్రెలను నీటి వనరుల వద్దకు తీసుకువెళ్లడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08468–220069కు సమాచారం అందించాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఐదు రోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యయంత్రాంగం అప్రమత్తమైంది. గత నెలలో కురిసిన భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇంకా చాలా రూట్లలో రోడ్లు క్లియర్ కాలేదు. మళ్లీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
‘ఉపాధి’ ద్వారా ఇసుక మేటలు తొలగిస్తాం
బీబీపేట: భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం ద్వారా తొలగిస్తామని డీఆర్డీఏ పీడీ సురేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని వ్యవసాయభూముల్లో ఇసుక మేటలను ఆయన పరిశీలించారు. బాధితులు జాబ్ కార్డు కలిగి ఉండి చిన్న, సన్నకారు రైతులు అయితే ఈజీఎస్ కూలీల ద్వారా పనులు చేయిస్తామన్నారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, ఏపీవో తిరుపతి, సిబ్బంది ఉన్నారు.నేటి నుంచి రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్కామారెడ్డి అర్బన్: తెలంగాణ శ్రీసరస్వతి విద్యాపీఠం (ఎస్ఎస్వీపీ) ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రస్థాయి గణిత విజ్ఞాన, సంస్కృతి మహోత్సవం–2025 (రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్) నిర్వహించనున్నట్టు ఎస్ఎస్వీపీ జిల్లా అధ్యక్షుడు వి శ్యాంసుందర్రావు గురువారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డి శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ యాదగిరి ముఖ్యఅతిథిగా, ఎస్ఎస్వీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్వీకే వెంకటేశ్వరరావు వక్తగా హాజరవుతారని, రాష్ట్రంలోని అన్ని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూళ్ల నుంచి విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు.రిజర్వేషన్ హామీని నిలబెట్టుకున్నాంకామారెడ్డి టౌన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన 42శాతం బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకున్నామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి నాయిని రజిత అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కా మారెడ్డిలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ కై వసం చేసుకునేలా మహిళలు కృషి చేయాలని అన్నారు. సమావేశంలో మహిళా నాయకులు స్వప్న, ఫరీదా, జమున తదితరులు పాల్గొన్నారు. ‘సాగర్’ నుంచి 6 వేల క్యూసెక్కుల నీటి విడుదలనిజాంసాగర్(జుక్కల్): ఎగువ నుంచి వరద వస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి మంజీరలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు గురువారం సాయంత్రం తెలిపారు. ప్రాజెక్టులోకి 6,022 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తుండగా, అదే స్థాయిలో అవుట్ ఫ్లో ఉందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1404.99 అడుగుల (17.788 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసింది
బీబీపేట/దోమకొండ/భిక్కనూరు: తమ ప్రభుత్వం అసాధ్యాలను సుసాధ్యం చేసిందని, రైతులకు మేలు చేకూర్చే ప్రభుత్వం తమదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అన్నారు. ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రంలో బీసీ సభ నిర్వహించనున్న నేపథ్యంలో గురువారం బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండల కేంద్రాల్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించగా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. బీసీలను రాజకీయంగా అగ్రస్థానంలో నిలిపేందుకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును కాంగ్రెస్ ముందుకు తీసుకువచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, బీసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్లు కేవలం ఓట్ల కోసం పథకాలను ప్రవేశపెట్టగా, కాంగ్రెస్ ప్రజల అభ్యున్నతికోసం పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది మహిళలను కించపరచడమే అవుతుందన్నారు. దివగంత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ హయాంలో ఆనాడు విద్యుత్ మంత్రిగా షబ్బీర్అలీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల కారణంగానే నేడు ప్రజలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోందని కొనియాడారు. వరదల కారణంగా బీబీపేట ప్రధాన రహదారిపై దెబ్బతిన్న బ్రిడ్జీని మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అలాగే పెద్ద చెరువు బుంగ పూడ్చిన స్థలాన్ని కూడా వారు పరిశీలించారు.రాష్ట్రంలో రైతులు యూరియా కోసం కష్టాలు పడడానికి కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న సవతి తల్లి ప్రేమే కారణమని మంత్రి సీతక్క విమర్శించారు. సీజన్ ప్రారంబానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎంత మేరకు యూరియా అవసరమో కేంద్ర ప్రభుత్వానికి లేఖల ద్వారా వివరించిందన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, భిక్కనూరు, రాజంపేట, దోమకొండ, బీబీపేట మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు భీంరెడ్డి, యాదవరెడ్డి, అనంతరెడ్డి, సుతారి రమేశ్, మార్కెట్ కమిటీల చైర్మన్లు రాజు, పాత రాజు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.కాంగ్రెస్ అంటనే పేదల సంక్షేమ పార్టీ అని.. నాడు ప్రజాభివృద్ధిలో రాజన్న.. నేడు అదే బాటలో రేవంతన్న ముందుకు దూసుకెళ్తున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. ఆయా మండలాల్లో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. నాడు వెఎస్సాఆర్ రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింపజేయగా.. నేడు రేవంత్రెడ్డి పేదలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ను ఉచితంగా ఇస్తున్నారన్నారు. రాజకీయాల్లో కొత్త తరం రావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఈనెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలను అగ్రస్థానంలో నిలిపేందుకు రిజర్వేషన్లు ప్రజల అభ్యున్నతి కోసం పథకాలు ఉచిత బస్సు ప్రయాణంపై బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పంచాయతీరాజ్శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క -
ముదురుతున్న లొల్లి!
● యూరియా కోసం రైతుల ఆందోళనబాట ● పొలాలను వదిలి రోడ్లపైకి.. ● అవసరమైన సమయంలో దొరక్క ఆందోళనమాచారెడ్డి మండలం సోమారంపేటలో యూరియా కోసం బారులు తీరిన రైతులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : యూరియా సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పొలాల్లో ఉండాల్సిన రైతులు రోజుల తరబడి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. అయినా దొరక్కపోవడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆందోళనకు దిగుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో యూరియా కొరత రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కీలకమైన సమయంలో యూరియా దొరకడం లేదని ఆవేదనకు గురవుతున్నారు. కామారెడ్డి, మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బీబీపేట, పాల్వంచ, భిక్కనూరు మండలాల్లో యూరియా సమస్య తీవ్రంగా ఉంది. అవసరానికి సరిపడా యూరియా సరఫరా కావడం లేదు. దీంతో రైతులు ప్రతిరోజూ యూరియా కోసం పొలాలను వదిలి సొసైటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాలో గతేడాది 48,904 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశారు. ఈ సారి ఇప్పటి వరకు 47 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ఏడాదికేడాది రసాయన ఎరువుల వాడకం పెరుగుతోంది. ఇదే సమయంలో సాగు విస్తీర్ణం కూడా పెరుగుతుండడంతో ఎరువుల అవసరం ఎక్కువైంది. రోడ్డెక్కుతున్న రైతులు ఎరువుల కోసం రోజుల తరబడి తిరిగి వేసారిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో గురువారం రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యూరియా గొడవలపై స్పందించారు. అధికారుల మధ్య సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే సమస్య ఎదురవుతోందని పేర్కొన్నారు. ఒక్కచోటనే పంపిణీ చేయడంతో అన్ని గ్రామాల రైతులు అక్కడకి చేరుకుంటున్నారని, దీంతో అందరికీ సరిపోక గొడవలు జరుగుతున్నాయన్నారు. గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకుని ఎరువులను ఎక్కడికక్కడ పంపిణీ చేయాలని ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు సరైన ప్రణాళికలు లేకుండా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా రైతులు ఇబ్బందులు పడాల్సివస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వ్యవసాయ భూముల్లో తిరగాల్సిన రైతులు యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నారు. సరిపడా యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోడ్ వస్తోందని తెలియగానే ముందు రోజు నుంచే క్యూ కడుతున్నారు. రాత్రిళ్లు పడిగాపులు కాస్తున్నారు. పరిస్థితి ధర్నాలు, నిరసనలకు దారితీస్తోంది. తాజాగా జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు.నాటు వేయకముందు ఎరువు చల్లిన. యూరియా కోసం రామారెడ్డి, సదాశివనగర్కు పలుమార్లు తిరిగిన, వరుసలో నిల్చున్నా దొరకలేదు. అవసరమైన సమయంలో ఎరువు వేయకపోవడంతో వరి గంట పోయడం లేదు. దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎవరూ పట్టించుకుంటలేరు. – రాజిరెడ్డి, రైతు, ఉప్పల్వాయిఆరు ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నా. 24 బస్తాలు అవసరం ఉంది. ఇప్పటి వరకు 10 బస్తాలు దొరికాయి. ఇంకా 14 బస్తాల యూరియా కోసం సొసైటీ చుట్టూ తిరుగుతున్నా. సరిపడా యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు యూరియా చల్లితేనే పంట ఏపుగా పెరిగి దిగుబడి వస్తుంది. – అంజల్రెడ్డి, రైతు, చుక్కాపూర్ -
కలం గొంతు నొక్కడమే..
● ‘సాక్షి’ ఎడిటర్, పాత్రికేయులపై అక్రమ కేసులు ● స్వేచ్ఛను హరించడమే.. ● అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్ : ప్రజల పక్షాన అక్షర సమరం చేస్తున్న ‘సాక్షి’ పై కక్షగట్టి న ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్ర భుత్వం అక్రమ కేసులతో గొంతునొక్కుతూ భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తోందని జర్నలిస్టు, ప్రజాసంఘాల నేతలు విమర్శించారు. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డితో పాటు పలువురు సాక్షి జర్నలిస్టులపై ఏపీ ప్రభుత్వం అక్రమకేసులు బనాయించి వేధించడాన్ని నిరసించారు. పత్రికాస్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని మండిపడ్డారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి, జర్నలిస్టులపై నమోదు చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వ్యక్తిగత కక్ష సాధిస్తోంది. సాక్షి దినపత్రికపై పలుమార్లు దాడులు, అక్రమ కేసులు బనాయించడమే ఇందుకు నిదర్శనం. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి, అన్యాయం, అవినీతిపై వార్తలు రాసే పత్రికా స్వేచ్ఛను హరించడం దారుణం. – రజనీకాంత్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు పత్రికాస్వేచ్ఛపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే చట్టపరంగా పోవాలే తప్పా ఇలా వ్యక్తిగతంగా సాక్షిపై కక్ష గట్టి అక్రమ కేసులు బనాయిండం, దాడులు చేయించడం సరికాదు. పత్రికా స్వేచ్ఛను కూటమిప్రభుత్వం కాపాడాలి. ఇలాంటి దాడుదు సరికాదు. ప్రజలే బుద్ధిచెబుతారు. – లతిఫ్, టీయూడబ్ల్యూజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న భయానక పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పౌరహక్కులు, జర్నలిస్టుల స్వేచ్ఛను హరిస్తోంది. దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటికై నా పత్రికలపై కక్ష మానుకుని రాష్ట్ర అభివృద్ధివైపు అడుగువేయాలని సూచిస్తున్నాం. – జి.జగన్నాథం, జేఏసీ కన్వీనర్, కామారెడ్డిఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక, చానల్పై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. చంద్రబాబు నాయుడు పత్రికా స్వేచ్ఛపై పాల్పడుతున్న కక్ష్య సాధింపు చర్యల్లో కేంద్ర ప్రభుత్వం హస్తం కూడా ఉందని భావిస్తున్నాం. ప్రజా సమస్యలను, అవినీతి, అక్రమాలు బయటపెడుతున్నందుకు కక్ష సాధించడాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. – చంద్రశేఖర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రజల పక్షాన నిలిచే మీడియానే గౌరవించని ప్రభుత్వం ప్రజలను ఏం కాపాడుతుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్రికా స్వేచ్ఛ, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, పోలీసులతో సాక్షి కార్యాలయాలపై భౌతిక దాడులు చేయించడం, అక్రమ కేసులు బనాయిచడం పిరికిపంద చర్య. ప్రజలే బుద్ధి చెబుతారు. – ఎల్ఎన్.ఆజాద్, బీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పూర్తిగా చట్టాలను, న్యాయాన్ని గౌరవిచండం లేదు. కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే సాక్షి దినపత్రిక, చానల్పై, కార్యాలయాలపై తరుచూ దాడులు చేయిస్తోంది. టీడీపీ కార్యకర్తలతో దాడులు చేయించడం చూసి చలించిపోయాం. ఇది ముమ్మాటికీ వ్యక్తిగత దాడిగా భావిస్తున్నాం. – క్యాతం సిద్దిరాములు, బహుజన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్, న్యాయవాది -
అటవీ అమరవీరులకు నివాళులు
కామారెడ్డి క్రైం: జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎఫ్వో నిఖిత, అధికారులు అటవీ అమర వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారులను స్మరిస్తూ అధికారులు, సిబ్బంది రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎఫ్వో మాట్లాడుతూ.. విధుల్లో ఎదురయ్యే సవాళ్లకు భయపడొద్దని, సమష్టిగా ఎదుర్కోవాలని సూచించారు. ప్రతి అధికారికి అండగా ఉంటామన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలో అటవీశాఖ అధికారులు చేపట్టిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎఫ్డీవోలు రామకృష్ణ, సునీత, ఎఫ్ఆర్వోలు హబీబ్, రమేశ్, వాసుదేవ్, చరణ్ తేజ, హేమ చందన, రవికుమార్, సంతో్ష్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్తా కోసం భారంగా..
కామారెడ్డి టౌన్ /కామేపల్లి/అర్వపల్లి/దేవరకద్ర /మఠంపల్లి/కేసముద్రం/ఖానాపురం: యూరియా కోసం రైతుల ఆందోళనలు రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. టోకెన్ల కోసం, యూరియా లారీల కోసం ఎదురుచూపులు నిత్యకృత్యం అయ్యాయి. » కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లోని పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూ లైన్లో నిలుచున్న రైతులు ఒక్కసారిగా సిరిసిల్ల రోడ్లో రోడ్డుపై ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, సీఎంకు, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. » ఖమ్మం జిల్లా కామేపల్లి రైతు వేదికలో కూపన్లు ఇస్తున్నారని తెలిసి రైతులు వెళ్లారు. వారంరోజులుగా తిరుగుతుంటే ఎందుకు ఇవ్వడం లేదని రైతులు ప్రశ్నించగా జాస్తిపల్లి ఏఈఓ రవికుమార్, కామేపల్లి ఏఈఓ శ్రీకన్య తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని రైతులు వాపోయారు. అంతేకాక ఇది తమ ఆఫీస్ అని ఎక్కువ మాట్లాడితే కేసు పెడతామని బెదిరించారన్నారు. » సూర్యాపేట జిల్లా అర్వపల్లి పీఏసీఎస్ వద్ద రైతులు యూరియా కోసం తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. చెప్పులు క్యూలైన్లో పెట్టి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాశారు. యూరియా రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు పీఏసీఎస్ ఎదుట హైవేపై రాస్తారోకో నిర్వహించారు. » మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర పీఏసీఎస్ కేంద్రం వద్ద టోకెన్లు ఉన్న రైతులకు యూరియా పంపిణీ చేస్తుండగా, టోకెన్లు లేని రైతులు పెద్ద ఎత్తున అక్కడకు చేరడంతో పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఒక్కసారిగా రైతులు ఎగబడ్డారు. మహిళా రైతుల అరుపులు, కేకలతో తోసుకున్నారు. ఈ తరుణంలో నార్లోనికుంట్ల సత్యమ్మ, డోకూర్ బాలకిష్టమ్మ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సత్యమ్మ చెవికి తీవ్ర గాయమైంది. » సూర్యాపేట జిల్లా మఠంపల్లి పీఏసీఎస్కు చెందిన నలుగురు డైరెక్టర్లు యూరియా కొరతకు నిరసనగా రాజీనామా చేశారు. తమ గ్రామాల్లోని రైతులకు యూరియా అందజేయలేకపోతున్నామన్న మనస్తాపంతో రాజీనామా చేస్తున్నట్లు డైరెక్టర్లు గోలి చంద్రం, పట్టేటి ఆంథోని, వల్లపుదాస్ చినలింగయ్యగౌడ్, పశ్యా రామనరసమ్మ చెప్పారు. » మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి, కల్వల గ్రామాల్లో సొసైటీ పాయింట్ వద్ద రైతులు గురువారం తెల్లవారుజామునే క్యూలో నిల్చున్నారు. ఉదయం 7 గంటలకే యూరియా లోడ్ లారీ రావాల్సి ఉండగా 11 గంటలైనా రాలేదు. కేసముద్రం విలేజ్ దర్గా వద్ద ఆ డ్రైవర్ యూరియా లోడ్ లారీ తీసుకొచ్చి నిలిపాడని పోలీసులు తెలుసుకున్నారు. దర్గా నుంచి ఉప్పరపల్లి వరకు లారీని తీసుకెళ్లి 220 బస్తాలను సెంటర్లో దింపించారు. ఆ తర్వాత కల్వల సెంటర్కు లారీని తీసుకెళ్లాల్సి ఉండగా, అప్పటికే లారీడ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ ఎండీ అలీమ్ ఆ లారీని తానే డ్రైవింగ్ చేసి కల్వలకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత 220 బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. » వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన తేజావత్ శ్రీను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశాడు. సరిపోను యూరియా లభించకపోవడంతో ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను వదిలేశాడు. దీంతో పంటను గురువారం గొర్రెల కాపరులకు అప్పగించడంతో అవి మేశాయి. -
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు
కామారెడ్డి క్రైం: కామారెడ్డిలో ఈనెల 15 న నిర్వహించే సీఎం సభకు సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులకు సూచించారు. జిల్లాకేంద్రంలో సీఎం సభ నిర్వహించే ప్రాంతం, హెలీప్యాడ్, పార్కింగ్ ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. పార్కింగ్ ప్రాంతాల్లో సూచిక బోర్డులు పెట్టాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, సీఐలు నరహరి, రామన్ తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన ఆదివాసి నాయక్పోడ్లు
● కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం ఆందోళన నిజాంసాగర్(జుక్కల్): ఎస్టీ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కోసం ఆదివాసీనాయక్పోడ్ కులస్తులు కదం తొక్కారు. బుధవారం మహమ్మద్నగర్ మండల కేంద్రానికి నాయక్పోడ్ కులస్తులు ర్యాలీగా తరలి వచ్చారు. బస్టాండ్ ప్రాంతంలో బాన్సువాడ– ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేశారు. ఎస్టీ కులద్రువీకరణ పత్రాలు ఇవ్వని మహమ్మద్నగర్ తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై శివకుమార్ ధర్నా వద్దకు చేరుకొని నాయక్ పోడ్ కులస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుల ద్రువీకరణ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చేంతర వరకు కదిలేది లేదని వారు బీష్మించి కూర్చున్నారు. మహమ్మద్నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి అక్కడి చేరుకొని నాయక్పోడ్కులస్తుల సమస్యను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు ఫోన్ ద్వారా తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో ధర్నాను విరమించుకొని తహసీల్ కార్యాలయం ముట్టడికి వచ్చారు. తహసీల్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నాయక్పోడ్ల సమస్యలను తెలుసుకున్నారు. పదిహేను రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించి వారి గ్రామాలకు వెళ్లారు. నాయక్పోడ్ జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య, నేతలు భూమయ్య, శంకర్, సాయిబాబా, కాశీరాం తదితరులున్నారు. -
‘సమాజాభివృద్ధిలో టీచర్ల పాత్ర కీలకం’
బాన్సువాడ : సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి విద్య హబ్గా మార్చామన్నారు. నియోజకవర్గంలో రూ. 50 కోట్లతో 350 అదనపు తరగతి గదులను నిర్మించామన్నారు. దేశంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలు 13 మంజూరైతే అందులో ఒకటి బాన్సువాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేశామన్నారు. నర్సింగ్ కళాశాలలు జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటు చేస్తారని, కానీ పట్టుబట్టి బాన్సువాడకు మంజురు చేయించానని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తూ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బదిలీల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ గుర్తు చేశారు. ఉపాధ్యాయులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఎంఈవో నాగేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, పీఆర్టీయూ ప్రతినిధులు నరహరి, శ్రీనివాస్, ప్రవీణ్, సంతోష్, రవీందర్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వరద బాధిత విద్యార్థులకు ఏబీవీపీ చేయూత
కామారెడ్డి రూరల్: అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్(ఏబీవీపీ) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ నోట్ బుక్ పోస్టర్ను బుధవారం ఎస్పీ రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. కొద్ది రోజుల క్రితం కామారెడ్డిలో వరదల కారణంగా విద్యార్థుల పుస్తకాలు వాటికి సంబంధించిన స్టేషనరీ వస్తువులు కొట్టుకుపోయాయి. వారికి చేయూతను అందించడానికి ఏబీవీపీ ఆధ్వర్యంలో గిఫ్ట్ ఏ నోట్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలలు ఒక పెన్ను, ఒక నోట్ బుక్, పెన్సిల్, స్టేషనరీ వరద బాధితుల విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు ఏబీవీపీ నేతలు పేర్కొన్నారు. ప్రయివేట్ స్కూళ్లు, కళాశాలల యాజమాన్యాలు ముందుకొచ్చి ఈ పని చేస్తున్నాయని తెలిపారు. ఏబీవీపీ కార్యకర్తలను ఎస్పీ ప్రశంసించి ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఎన్నో చేయాలని వారు సూచించారు. ఇందూర్ విభాగ్ సంఘటన మంత్రి హర్షవర్ధన్ రెడ్డి, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి.శివ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్, కామారెడ్డి నగర కార్యదర్శి సంతోష్, నాయకులు సంజయ్, చరణ్, రాజు నవీన్, తదితరులు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
● రెండు రోజుల్లో పరిహారం అందించాలి ● లేకపోతే బీసీ సభను అడ్డుకుంటాం ● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ఎల్లారెడ్డి: భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రెండు రోజుల్లో నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 15న కామారెడ్డిలో నిర్వహించే బీసీ సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. బుధవారం ఎల్లారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన పర్యటన రైతులను పరామర్శించడానికి వచ్చినట్లుగా కాకుండా విహారయాత్రకు వచ్చివెళ్లినట్లుగా సాగిందని విమర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి మొదటిసారి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. రూ. వంద కోట్లతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తారనుకుంటే పది రూపాయలు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతుకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సంబంధించిన బోర్ మోటార్లు వరదలో కొట్టుకుపోయాయని, వారికి వెంటనే ప్రభుత్వం కొత్త మోటార్లు అందజేయాలని కోరారు. బీసీల విషయంలో చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ పార్టీ.. ఓట్ల కోసమే బీసీ సభ పేరిట కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జలందర్రెడ్డి, సతీష్, ముదాం సాయిలు, కపిల్ రెడ్డి, నర్సింలు, సతీష్, ఇమ్రాన్, అరవింద్ గౌడ్, పృథ్వీరాజ్, గంగారెడ్డి, మనోజ్, బర్కత్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి ఉగ్ర కలకలం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మరోసారి ఉగ్ర మూలాలు కలకలం సృష్టించగా ప్రజలు ఉలి క్కిపడుతున్నారు. తాజాగా బుధవారం బోధన్ పట్టణానికి చెందిన హాజీయమన్ను ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేసి విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లారు. ఐసిస్ ఉగ్రసంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులను జార్ఖండ్ రాజధాని రాంచీలో ఎన్ఐఏ అరెస్టు చేసి విచారణ చేసిన సమయంలో బోధన్కు చెందిన హాజీయమన్ పేరు బయటకు వచ్చింది. హాజీయమన్ గత కొంతకాలంగా అంతర్జాతీయ ఫోన్కాల్స్ ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఇతని ఇంట్లో ఎయిర్గన్ను ఎన్ఐఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బోధన్ కోర్టులో హాజరుపరిచి, విచారణ నిమిత్తం హాజీయమన్ను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఐసిస్తో సైతం లింకులు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. ● బోధన్ పట్టణంలో నకిలీ చిరునామాలతో 2018 లో బంగ్లాదేశీయులకు అక్రమ పద్ధతిలో 74 పాస్పోర్టులు జారీ చేశారు. ఈ విషయమై అప్పటి స్పెష ల్ బ్రాంచ్ ఏఎస్ఐలు మల్లేష్, అనిల్లపై ప్రభు త్వం చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్ నుంచి కోల్కతాకు తరువాత బోధన్కు వచ్చిన వ్యక్తులకు అక్ర మంగా పాస్పోర్టులు జారీ చేసే విషయంలో ఈ ఇద్దరు ఏఎస్ఐలు కీలక పాత్ర పోషించడం గమనార్హం. బోధన్లోని ఒకే ఇంటి నంబర్ మీద 24 పాస్ పోర్టులు ఇవ్వడం అప్పట్లో సంచలనం కలిగించింది. అలాగే ఇతర అద్దె ఇంటి నంబర్లపై సైతం ధ్రువీకరణలు సృష్టించి పాస్పోర్టులు జారీ చేయించారు. తరువాత కాలంలో బోధన్లో రోహింగ్యాలకు ఆధార్ కార్డులు సైతం జారీ చేయడం గమనార్హం. శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్ట్తో.. నిజామాబాద్ ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఆటోనగర్లో 2022 జూలై 4న పీఎఫ్ఐ సభ్యుడు, శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్ట్తో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అబ్దుల్ ఖాదర్ డైరీ, వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్ ఖాదర్ అరెస్ట్ తర్వాత నిజామాబాద్ రూరల్ మండలం గుండారంలో ముగ్గురు పీఎఫ్ఐ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశం సమాచారంతో పోలీసులు పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షేక్ షాదుల్లాను, నగరానికి చెందిన మహ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకుని విచారించారు. శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ వద్ద దొరికిన డైరీలోని వివరాలతో విచారణ చేపట్టారు. జిల్లాలో 200 మందికి పైగా శిక్షణ తీసుకోగా, ఇందులో 23 మంది కీలక సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్లో కడప బేస్ క్యాంపుగా ఏర్పాటు చేసుకుని పీఎఫ్ఐ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. విచారణలో పీఎఫ్ఐ ఒక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు ఎన్ఐఏకు లేఖ రాశారు. ఎన్ఐఏకు చెందిన ఉన్నత స్థాయి అధికారి జిల్లా పోలీసులతో సమావేశమయ్యారు. కేసులో తీవత్రను గుర్తించిన ఎన్ఐఏ 2022 ఆగష్టు 26న పీఎఫ్ఐ కేసును తీసుకుంది. ఎన్ఐఏ అధికారులు నలుగురిని విచారించిన తరువాత సెప్టెంబర్ 18న నిజామాబాద్తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల సోదాలు నిర్వహించారు. సోదాల్లో ల్యాప్ట్యాప్లు, ఎలక్ట్రిక్ వస్తువులు, సెల్ఫోన్లులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు లభించాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నలుగురిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు హాజరు పర్చారు. వారిచ్చిన సమాచారంతో పాటు ఎన్ఐఏ సేకరించిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించారు. 170 మందిని అరెస్ట్ చేయడంతో పాటు విదేశాల నుంచి రూ.120 కోట్లు సేకరించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. సిమి నుంచి పీఎఫ్ఐగా మారిన ఈ సంస్థకు ఐసిస్, లష్కరేతోయిబా సంస్థలతోనూ సంబంధాలు ఉన్నట్లు తేలింది.నిషేధిత సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా) నుంచి పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)గా రూపాంతరం చెందిన ఉగ్ర సంస్థ శిక్షణ కేంద్రాన్ని 2022లో నిజామాబాద్లో కనుగొన్నారు. ఈ శిక్షణ కేంద్రంలో వివిధ రకాలుగా హత్యలు ఎలా చేయడం, మతకలహాలు సృష్టించే విషయాలపై శిక్ష ణ ఇచ్చారు. దక్షిణాదిలో కీలకమైన బేస్క్యాంప్గా నిజామాబాద్ ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. 2022 జూలై 4న నిజామాబాద్లో పీఎఫ్ఐ శిక్షకుడు అబ్దుల్ ఖాదర్ అరెస్టుతో దేశవ్యాప్తంగా డొంక కదిలింది. తరువాత జూలై 6న మరో ముగ్గురిని నిజామాబాద్లో అరెస్టు చేశారు. సెప్టెంబర్ 18న మరో ఇద్దరిని అరెస్టు చేశారు. మొత్తం 23 మందిపై జిల్లాలో కేసులు నమోదు చేశారు. ఆర్మూర్కు చెందిన నవీద్ అనే వ్యక్తిని సైతం ఎన్ఐఏ విచారించింది. అదేక్రమంలో దేశవ్యాప్తంగా 106 చోట్ల వివిధ రాష్ట్రాల్లో సోదాలు చేసిన ఎన్ఐఏ మొత్తం 170 మందిని అరెస్టు చేసింది. పీఎఫ్ఐ, అనుబంధ సంస్థలన్నింటిపైన కేంద్రం యూఏపీఏ చట్టం కింద నిషేధం విధించింది. బోధన్లో హాజీయమన్ను అదుపులోకి తీసుకున్న ఢిల్లీ ఎన్ఐఏ బృందం ఉలిక్కిపడుతున్న జిల్లా ప్రజానీకం గతంలో బంగ్లాదేశీయులకు అక్రమంగా పాస్పోర్టులు జారీ చేసిన వైనం 2022లో జిల్లా కేంద్రంలో ఉగ్ర సంస్థ శిక్షణ శిబిరాన్ని కనుగొన్న ఎన్ఐఏ, పోలీసులు అనంతరం పీఎఫ్ఐపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం -
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ
● మోసాన్ని గుర్తించి పోలీసులకు అప్పగించిన కాలనీ వాసులు సదాశివనగర్: కామారెడ్డికి చెందిన ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి తాము వచ్చామంటూ 25 మందిని బురిడీ కొట్టించి దొరికి పోయిన వారిని పోలీసులకు అప్ప గించిన ఘటన బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ కాలనీలో చోటు చేసుకుంది. రూ.2,500 చెల్లిస్తే రూ.లక్షా50వేలు ఇస్తామని దానికి సంబంధించిన ఫారాలను నింపి బాధితుల నుంచి సంతకాలు సైతం తీసుకున్నారు. మూడు నెలల్లో రూ. 50వేలు చెల్లిస్తే మిగతా రూ. లక్ష చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతో కాలనీకి చెందిన 25 మంది రూ. 2500 చెల్లించారు. కొంత మందికి అనుమానం రావడంతో మీరు కామారెడ్డిలోని ఏ బ్యాంక్ నుంచి వచ్చారని ప్రశ్నించారు. వారు తడబడుతూ ఓ ప్రైవేట్ బ్యాంక్ పేరు చెప్పారు. వెంటనే కాలనీవాసులు ఆ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి మీ బ్యాంక్ పేరు మీద ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు వచ్చారని చెప్పగా వారు మా బ్యాంక్ సిబ్బంది కాదని తెలపడంతో పాటు వారిని కాలనీవాసులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారి నుంచి తీసుకున్న డబ్బులను ఇప్పించారు. -
తైబజార్ కాదు.. హప్తా వసూల్
పిట్లం(జుక్కల్): పిట్లంలో తైబజార్ పేరుతో వసూళ్ల మాఫియా బరితెగించింది. సంతలలో తైబజార్ రసీదులు ఇవ్వకుండానే వ్యాపారస్తులు, దుకాణదారుల నుంచి తైబజార్ నిర్వాహకులు దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరి తీరు సంతలో తైబజార్ వసూల్లా లేదు హప్తా వసూల్లా ఉందని పలువురు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఇలా జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. పిట్లం మేకల సంత, పిట్లం తైబజారు వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్ వసూళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తైబజారు వేలం పాట నిర్వహించే సమమంలో రోజువారీ సంత, పశువుల దాఖాలు, గొర్రెలు, మేకలకు రేట్లను నిర్ణయించి ఇంతే వసూ లు చేయాలని కాంట్రాక్టర్కు అధికారులు సూచించారు. పంచాయతీ అధికారులు నిర్ణయించిన రేట్లనే కాంట్రాక్టర్ వసూలు చేయాలి. కానీ తైబజారు దక్కించుకున్న కాంట్రాక్టర్ మరో కొంత మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని ఇష్టం వచ్చి నట్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. వీరు సంతలో దుకాణదారులు, వ్యాపారులకు తైబజార్ రుసుము రసీదులు ఇవ్వకుండా ఒకటికి రెండింతలు డబ్బు లు వసూలు చేస్తున్నారు. చిన్న చిన్న గ్రామాల నుంచి చిన్నాచితక రైతులు సంతలో కూరగాయలు అమ్ము కోడానికి వస్తుంటారు. అందులో కొంత లా భం రాకున్న వారు నష్టపోయినా సరే వారి వద్ద నిర్ణయించిన దాని కంటే అధికంగా తైబజార్ వసూల్ చేస్తున్నారు. అధికంగా తైబజార్ వసూల్ చేస్తున్న కాంగ్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, అదే విధంగా సంతలో పంచాయతీ అధికారులు నిర్ణయించిన రేట్ల ఫ్లెక్సీల ను ఏర్పాటు చేయాలని వ్యాపారులు కోరుతున్నారు. పిట్లం మేకల సంతలో వసూళ్ల పర్వం రసీదులు ఇవ్వని వైనం ఇబ్బందులకు గురవుతున్న రైతులు, దుకాణదారులు, వ్యాపారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు -
సేవ చేసేందుకు ఇష్టం లేక హత్య
బోధన్రూరల్: వృద్ధురాలికి సేవ చేసేందుకు ఇష్టం లేని కుటుంబీకులు హత్య చేసిన ఘటన సాలూర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి బోధన్రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సాలూర మండల కేంద్రానికి చెందిన కట్టం నాగవ్వ(65) అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు భర్త, కుమారులు లేకపోవడంతో మరిది చిన్న గంగారాం వద్ద ఉంటోంది. ఆమెకు సేవలు చేసేందుకు ఇష్టం లేని గంగారాం, భార్య, కుమారుడు గొంతు నులిమి హత్య చేశారు. వృద్ధురాలి వద్ద ఉన్న డబ్బు, బంగారం కోసమే నిందితులు హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజామాబాద్ రూరల్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరిఫ్ బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ పీఎస్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన సూరజ్రావు(22), అదే కాలనీకి చెందిన ఓ అమ్మాయి గత ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆ అమ్మాయి వేరే యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని మాధవనగర్ రైల్వే గేటును బుధవారం టాటా ఏఎస్ వాహనం ఢీకొనడంతో మధ్యలో విరిగిపోయింది. ఉదయం 11:30 ప్రాంతంలో రైలు వస్తుందని గేట్మన్ గేటు వేస్తుండగా గేటు దాటి త్వరగా వెళ్లాలని నిజామాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం గేటును ఢీకొన్నదని గేట్మన్ తెలిపారు. గేట్ మధ్యలో విరిగిపోవడంతో సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక గేటు వేసి రైలు వచ్చిన ప్రతిసారి ప్రయాణికులను సిబ్బంది ఆపుతున్నారు. మరమ్మతులు ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. -
వేగంగా చలానా!
అతి వేగంగా వాహనాలను నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేగ నియంత్రణకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతోంది. జాతీయ రహదారులతోపాటు రాష్ట్రీయ రహదారిపై స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేసింది. వేగ పరిమితి దాటితే ఈ గన్ పసిగట్టి వెంటనే చలానా జారీ చేస్తుంది. ఈ చర్యతో వాహనాల వేగానికి కళ్లెం పడుతుందని భావిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిప్రధాన రహదారులపై వెళుతున్నపుడు చాలామంది అజాగ్రత్తగా, అతివేగంగా వాహనాలను నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, రాష్ట్రీయ రహదారులపై యూటర్న్ల దగ్గర ముందూ, వెనకా చూసుకోకుండా రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే రాంగ్ రూట్లో వెళ్లి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలామంది హెల్మెట్ ధరించకపోవడం మూలంగా కింద పడినప్పుడు తలకు గాయాలై చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారితో పాటు, తీవ్ర గాయాలతో ఆస్పత్రులపాలైన వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ గట్టి చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి జరిమానాలు విధిస్తోంది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. మద్యం సేవించి వాహనం నడిపితే పోలీసులు పట్టుకుని రిమాండుకు పంపుతున్నారు. ఇటీవలి కాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పలువురికి ఒకటి, రెండు రోజులు జైలు శిక్షలు పడడమే ఇందుకు నిదర్శనం. అలాగే వాహనాల వేగానికి కళ్లెం వేయడానికి స్పీడ్ గన్లను వాడుతోంది. వేగ పరిమితి దాటితే స్పీడ్ గన్ రికార్డు చేసి, చలానా జారీ చేస్తుంది.రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్లాలి. ప్రమాదాల్లో గాయపడి ఆస్పత్రులపాలైనా, ప్రాణాలు కోల్పోయినా కుటుంబం రోడ్డున పడుతుంది. ఈ విషయాన్ని మరచిపోవద్దు. ప్రమాదాల బారిన పడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిమిత వేగంతో వెళ్లడం, హెల్మెట్ ధరించడం ద్వారా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దు. నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేయాలి. – రాజేశ్చంద్ర, ఎస్పీజిల్లాలో మూడు ప్రధాన రహదారులపై స్పీడ్ లేజర్ గన్లు ఏర్పాటు చేశారు. ఈనెల 8న 44వ నంబరు జాతీయ రహదారిపై సదాశివనగర్లోని అయ్యప్ప మందిరం వద్ద ఒక స్పీడ్ లేజర్ గన్ను ప్రారంభించారు. దీనిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పరిశీలించారు. 161వ నంబరు జాతీయ రహదారిపై ఒకటి, 16వ నంబరు రాష్ట్రీయ రహదారి (కేకేవై రోడ్డు)పై మరో స్పీడ్ లేజర్ గన్ను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.జిల్లా ఎస్పీగా రాజేశ్ చంద్ర బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి సారించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి జరిమానాలు, డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చర్యలు తీసుకుంటుండడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఆగస్టు చివరి నాటికి జిల్లాలో 188 రోడ్డు ప్రమాదాలు జరిగితే ఈ ఏడాది ఆగస్టు నాటికి 145 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలు 22.9 శాతం తగ్గాయని చెబుతున్నారు. అలాగే రోడ్డు ప్రమదాలలో మరణాల సంఖ్య గతేడాది 197 ఉండగా, ఈ ఏడాది 153కు తగ్గిందంటున్నారు. మరణాల శాతం 22 శాతం తగ్గిందని పేర్కొంటున్నారు. వాహనాల స్పీడుకు కళ్లెం వేసేందుకు పోలీసుల చర్యలు ప్రధాన రహదారులపై పలుచోట్ల స్పీడ్ లేజర్ గన్ల ఏర్పాటు ప్రమాదాల నివారణ కోసమేనంటున్న అధికారులు -
ఎన్నాళ్లీ పాట్లు..
● యూరియా కోసం తప్పని తిప్పలు ● అరకొరగానే సరఫరా ● పోలీసుల పహారా మధ్య పంపిణీభిక్కనూరు/మాచారెడ్డి/బీబీపేట/రాజంపేట/సదాశివనగర్/రామారెడ్డి: రోజులు గడుస్తున్నా యూరియా సమస్య పరిష్కారం కావడం లేదు. బస్తా ఎరువు కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. బుధవారం భిక్కనూరు, మాచారెడ్డి, బీబీపేట, రాజంపేట, సదాశివనగర్, రామారెడ్డి మండలాల పరిధిలోని సొసైటీలలో యూరియా పంపిణీ చేశారు. బస్తాలు తక్కువగా ఉండడం, రైతులు ఎక్కువగా ఉండడం భారీ బారులు కనిపించాయి. బారెడు లైన్లలో గంటల తరబడి నిలబడే ఓపిక లేక చెప్పులు, చెట్ల కొమ్మలు, రాళ్లు.. ఎలా ఏవి కనిపిస్తే అవి లైన్లలో ఉంచి పక్కన వేచి ఉన్నారు. పోలీసు పహారా మధ్య యూరియాను పంపిణీ చేశారు. బీబీపేటలో రైతుల ఘర్షణ.. బీబీపేట సొసైటీ వద్ద ఉదయంనుంచే రైతులు బారులు తీరారు. గంటల తరబడి నిలబడాల్సి రావడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాచారెడ్డిలో.. మాచారెడ్డి మండల కేంద్రంతో పాటు సోమారంపేట గ్రామంలో, పాల్వంచ మండలం భవానీపేట, ఎల్పుగొండలలో యూరియా పంపిణీ చేశారు. మాచారెడ్డి సింగిల్ విండోకు 450 బస్తాలు రాగా.. రైతులు ఎగబడి బస్తాలు తీసుకువెళ్లారు. చాలామందికి ఎరువు దక్కలేదు. భవానీపేటలో 220 బస్తాలే రావడంతో వందలాది మందికి నిరాశే ఎదురయ్యింది. సోమారంపేటలో ఉదయమే వచ్చి కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. చివరికి యూరియా రాకపోవడంతో నిరసన తెలిపి, నిరాశతో వెళ్లిపోయారు. రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లోనూ తెల్లవారకముందు నుంచే రైతులు యూరియా కోసం లైన్లు కట్టారు.బీబీపేటలో ఘర్షణ పడుతున్న రైతులుమాచారెడ్డి సింగిల్విండో వద్ద క్యూలో రైతులు -
ముదిరాజ్లను బీసీ–ఏలోకి మార్చాలని వినతి
● బాన్సువాడలో రౌండ్ టేబుల్ సమావేశం బాన్సువాడ: ముదిరాజ్ కులస్తులను బీసీ–డి నుంచి బీసీ–ఏలోకి మార్చేందుకు కృషి చేయాలని కోరుతూ బుధవారం బాన్సువాడలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్లకు వినతి పత్రం అందజేశారు. పట్టణంలోని పాత బాన్సువాడ ముదిరాజ్ సంఘ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం జిల్లా అ ధ్యక్షుడు బట్టు విఠల్ మాట్లాడారు. తెలంగాణలో అత్యధిక జనాభా గల ముదిరాజ్ కులస్తులు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ప్రభు త్వం వెంటనే ముదిరాజ్ కులస్తులకు న్యాయం చే యాలని కోరారు. ఈ నెల 15న కామారెడ్డిలో జరిగే బీసీ డిక్లరేషన్లో ముదిరాజ్ కులస్తులను బీసీ–ఏలోకి మార్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వా లని అన్నారు. ముదిరాజ్ కులస్తులు గురువినయ్, జిన్న రఘు, లింగమేశ్వర్, కనుకుట్ల రాజు, డాక య్య, భీమ గంగారం, కొంకి విఠల్, రాజేష్, దత్తు, కొంకి విఠల్, మొగులయ్య తదితరులున్నారు. -
క్రైం కార్నర్
గోడకూలి ఒకరి మృతిభిక్కనూరు: మండల కేంద్రంలో గోడకూలి ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన జాగీర్సింగ్(37) రేకుల షెడ్డుల నిర్మాణంతో పాటు షటర్లను తయారు చేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. గత నెలలో కురిసిన భారీ వర్షానికి జాగీర్సింగ్ ఇల్లు కూలిపోవడంతో పక్కనే ఉన్న బంధువుల ఇంట్లో ఉంటున్నారు. బుధవారం వేకువజామున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తుండగా వర్షానికి కూలిన ఇంటి గోడ జాగీర్సింగ్పై పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు, కుటుంబీకులు వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, నలుగురు కుమార్తెలు, అంధుడైన ఓ కుమారుడు ఉన్నారు.ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ ..రుద్రూర్: మండల కేంద్రంలోని పెద్ద చెరువులో ప్రమాదవశాత్తు గాండ్ల సావిత్రి అలియాస్ సాయమ్మ (52) అనే మహిళ పడి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సాయమ్మ మంగళవారం చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి జారి పడిపోయిందని తెలిపారు. బుధవారం చెరువులో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.వాహనం పైనుంచి పడి యువకుడు.. ఖలీల్వాడి: నగరంలోని జడ్పీ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఖిల్లా రోడ్డుకు చెందిన మహేశ్(32) పని నిమిత్తం అశోక్ లీలాండ్ వెహికల్పై వస్తున్నాడు. డ్రైవర్ గాటే ఖండూ వాహనాన్ని అతివేగంగా నిర్లక్ష్యంగా నడపడంతో వాహనం వెనకాల కూర్చొని ఉన్న మహేశ్ వాహనం పైనుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్రగాయం కావడంతో స్థానికులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.రెండు టన్నుల స్టీల్ చోరీనవీపేట: మండలంలోని యంచ శివారులో జరుగుతున్న జాతీయ రహదారి(బీబీ 161)విస్తరణ పనుల కోసం డంప్ చేసిన స్టీల్ నుంచి పీరాజీ అనే వ్యక్తి 2 టన్నులు దొంగిలించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పనులు నిర్వహిస్తున్న అనూష ప్రాజెక్ట్స్ లిమిటెడ్ మేనేజర్ పార్థసారధి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అంత్యక్రియలు నేనే చేస్తా.. నువ్వెవరో తెలియదు
కామారెడ్డి రూరల్: తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కుమారుడు 20 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. కుమారుడు వెళ్లిపోయాడని ఆ తల్లి కుంగిపోలేదు. కామారెడ్డిలో దొరికిన ఒక అమ్మాయిని పెంచుకుని పెళ్లి చేసి పంపించింది. మంగళవారం ఆ తల్లి మృతి చెందగా చెందగా ‘తానే కొడుకునని అంత్యక్రియలు నేనే చేస్తాను. మా ఊరికి తీసుకెళ్తాను’ అని వచ్చిన కొడుకును నువ్వెవరో తెలియదు అని వెల్లగొట్టారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పాత రాజంపేటలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన సల్మాబేగంను 20 సంవత్సరాల క్రితం కుమారుడు వదిలి వెళ్లిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు తనను వదిలి వెళ్లిపోవడంతో కొద్దిరోజులు బాధపడింది. తన రాత ఇంతే అనుకుని జీవిస్తుండగా కొద్దిరోజులకు కామారెడ్డి పట్టణంలో దొరికిన కరిష్మా బేగం అనే చిన్నారిని పెంచుకుంది. పెద్దయ్యాక సల్మాబేగం.. కరిష్మాకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుంది. పెళ్లయినా పెంచిన తల్లి మంచి చెడులన్నీ కరిష్మానే చూసుకుంది. గ్రామంలో కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే మంగళవారం సల్మాబేగం మృతి చెందింది. 20 ఏళ్లుగా అటువైపు రాని కొడుకు తల్లి చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలు చేస్తానని తల్లి శవాన్ని తీసుకొని వెళ్లేందుకు గ్రామానికి వచ్చాడు. దాంతో కొడుకుతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. 20 ఏళ్ల తర్వాత తల్లి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అంటూ నిలదీశారు. అయితే ఇన్నేళ్ల పాటు సల్మాబేగం మంచి చెడులు చూసిన కరిష్మాయే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. ఇన్నాళ్లుగా లేని ప్రేమ తల్లి చనిపోయాక రావడంతో ఆస్తి కోసమే వచ్చి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో అంత్యక్రియలు నిలిచిపోయాయి. -
తెరపైకి రింగ్ రోడ్డు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాకేంద్రంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలకు తెరదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రింగ్రోడ్డు నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. పట్టణంలోని ట్రాఫిక్ కష్టాలను వివరించి, డీపీఆర్ చూపించి రింగ్ రోడ్డు మంజూరు చేయాలని కోరారు. కామారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఎదిగిన తరువాత మరింతగా విస్తరించింది. దీనికి తోడు పట్టణంలో పలు గ్రామాలను విలీనం చేశారు. అయితే పరిధి పెరిగినా.. పట్టణం విస్తరించినా.. సరైన రోడ్డు, రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ అవసరాల కోసం పట్టణానికి రావడం, పట్టణం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు పడే ఇబ్బందులను తీర్చేందుకు స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ‘రింగ్రోడ్డు’ను తెరపైకి తీసుకువచ్చారు. పట్టణానికి చుట్టూరా రింగ్ రోడ్డు నిర్మిస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయించి మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ముందుంచారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎమ్మెల్యే.. కామారెడ్డి పట్టణానికి ఉన్న ఇబ్బందులను వివరించి, రింగ్ రోడ్డుకు నిధులు ఇవ్వాలని డీపీఆర్తో పాటు వినతిపత్రం అందించారు. కామారెడ్డి పట్టణానికి మరో వందేళ్ల దాకా ట్రాఫిక్ సమస్యలు లేకుండా రింగ్ రోడ్డును నిర్మించాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రికి విన్నవించారు. పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల మీదుగా దాదాపు 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించాలని రూపొందించిన డీపీఆర్ను అప్పగించారు. పట్టణ మ్యాప్ను చూపించి మరీ రోడ్డు నిర్మాణం ఆవశ్యకతను వివరించారు. రోడ్డు నిర్మాణానికి రూ. 510 కోట్లు అవుతాయని అంచనా వేశారు. ఈ రోడ్డు నిర్మిస్తే పట్టణంపై ఒత్తిడి తగ్గుతుందని, అభివృద్ధి పెరుగుతుందని ఆయన పేర్కొంటున్నారు. కేంద్రం కరుణిస్తుందా.. రింగ్ రోడ్డు నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్న పని. 54 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టడానికి మధ్యలో రెండు చోట్ల రైల్వే వంతెనలు, అలాగే వాగులపైన వంతెనాలు నిర్మించాల్సి ఉంటుంది. జాతీయ రహదారిని దాటే క్రమంలోనూ వంతెనలు అవసరం. దీనికి తోడు భూసేకరణ అనేది పెద్ద సవాల్గా ఉంటుంది. రోడ్డు నిర్మాణం చేయాలంటే రూ. 510 కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. కేంద్రం కరుణించి రింగ్రోడ్డు నిర్మించాలని జిల్లావాసులు కోరుతున్నారు.ట్రాఫిక్ కష్టాలు అనేకం.. జిల్లా కేంద్రాన్ని రైల్వే లైన్ రెండుగా విభజిస్తోంది. అయితే పట్టణంలో ఒకే రైల్వే వంతెన ఉంది. వాహనాల రద్దీ పెరిగిన తరువాత వంతెన ఏమాత్రం సరిపోవడం లేదు. రైల్వే వంతెన మీద ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. అశోక్నగర్లో రైల్వే గేటు ఉండగా.. రైళ్ల సంఖ్య పెరిగి ప్రతి పావు గంటకోసారి గేటు వేయాల్సి వస్తోంది. గేటు వేసినపుడల్లా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వంతెన విస్తరించకపోవడం, అశోక్నగర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించకపోవడంతో ప్రజలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఎటు వెళ్లాలన్నా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఎన్హెచ్–44 బైపాస్ రోడ్డు ద్వారా కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్, హైదరాబాద్, నిజామాబాద్ ప్రాంతాల నుంచి ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం ప్రాంతాలకు వెళ్లాలంటే కచ్చితంగా పట్టణంలోకి రావాల్సిందే.. అలాగే అటువైపు నుంచి ఇటు వెళ్లేవారు కూడా పట్టణం మీదుగానే వెళ్లాలి. పట్టణంలో ప్రధాన రోడ్లు ఇరుకుగా ఉండడం, ట్రాఫిక్ సమస్య మూలంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డిలో 54 కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదనలు రూ.510 కోట్లతో అంచనాలు కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే కేవీఆర్ మంజూరు చేయాలని వినతి -
ఆపదలో ఆదుకున్న వారే గొప్పవారు
● ఆర్డీవో పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డి: ఆపదలో ఆదుకున్న వారే గొప్పవారని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయంలో లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎల్లారెడ్డిలో చాలా మంది ఇళ్లు కూలాయని, చెరువు కట్టలు తెగిపోవడంతో పంటలు నీట మునిగిపోవడం, ఇసుక మేటలు వేయడం, పంటలు కొట్టుకుపోయాయన్నారు. ఇలాంటి వారికి ఆపత్కాలంలో లయన్స్ క్లబ్ వారు నిత్యావసర వస్తువులు అందించడం చాలా సంతోషదాయకమన్నారు. లయన్స్క్లబ్ గవర్నర్ అమర్నాథ్రావు, బసవేశ్వర్రావు, సంజీవరెడ్డి, రమేష్, నర్సింహరాజు, నాగరాజు, పద్మావతి, డీటీ శ్రీనివాస్, గిర్దావర్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తదితరులున్నారు. -
‘నగదు రహిత లావాదేవీలు జరపాలి’
దోమకొండలో నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పిస్తున్న డీఆర్డీవో సురేందర్దోమకొండ: నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడం కోసం జిల్లాలో దోమకొండ మండలాన్ని ఎంపిక చేసినట్లు డీఆర్డీవో సురేందర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ఆయన మండలానికి చెందిన గ్రామ సంఘాల సభ్యులు, ఐకేపీ సీసీలు, సీఏలతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామసంఘాల అధ్యక్షులు, సిబ్బంది డిజిటల్ లావాదేవీలు జరిగేలా చూడాలని కోరారు. యూపీఐ ద్వారా రోజూ లక్ష రూపాయల వరకు లావాదేవీలు జరుపవచ్చన్నారు. మహిళలకు డిజిటల్ లావాదేవీలపై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఐకేపీ ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్, కెనరా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
కొరతకు కారణం పోడేనా?
కామారెడ్డి క్రైం : జిల్లాలోని పలు ప్రాంతాలలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజూ ఆందోళనలకు దిగాల్సిన పరిస్థితులున్నాయి. అయి తే అధికారుల అంచనాల మేరకు జిల్లాకు యూరి యా వచ్చినా కొరత ఏర్పడడం గమనార్హం. దీనికి పోడు వ్యవసాయమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు వ్యవసాయ శాఖ అధికారులు సాగులోకి వచ్చే పంటలు, గత సీజన్ను బట్టి అవసరమైన ఎరువులు, విత్తనాల విషయంలో అంచనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిస్తారు. దాని ప్రకారమే అన్ని జిల్లాలకు విత్తనాలు, ఎరువుల సరఫరా జరుగుతోంది. ఈ లెక్కలన్నీ జిల్లావ్యాప్తంగా అధికారికంగా ఉన్న సాగు భూములు, సాగయ్యే పంటలపై ఆధారపడి ఉంటాయి. కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే దాదాపు ప్రతి సీజన్లోనూ ఎరువుల కొరత కనిపిస్తుంది. ఈసారి కూడా ఖరీఫ్ చివరలో కామారెడ్డి డివిజన్ పరిధిలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొంది. రైతులు సింగిల్విండోల ఎదుట బారులు తీరుతున్నారు. బస్తా యూరియా కోసం రోజుల తరబడి సొసైటీల చుట్టూ తిరుగుతున్నారు. లెక్కలోకి రాని సాగు వల్లే.. జిల్లాలో ఒకప్పుడు 84 వేల హెక్టార్ల విస్తీర్ణంలో అట వీ భూమి విస్తరించి ఉండేది. అటవీశాఖ కామారెడ్డి, బాన్సువాడ సబ్డివిజన్ల పరిధిలో 8 రేంజ్లు ఉన్నాయి. గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల పరిధిలో అడవులు ఎక్కువగా ఉన్నా యి. గతంలో భూమి లేని నిరుపేదలు ఎక్కడో ఓ చోట కొద్దిపాటి భూమిలో పోడు వ్యవసాయం చేసేవారు. కానీ ప్రభుత్వాలు పోడు పట్టాలు ఇవ్వ డం మొదలుపెట్టాక చాలామంది అటవీ భూములను కబ్జా చేసి వ్యవసాయం చేస్తున్నారు. దీంతో జిల్లాలో చాలా వరకు అటవీ విస్తీర్ణం తగ్గిపోయింది. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగిన గాంధారి, లింగంపేట, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల పరిధిలో అడవులు, గుట్టలు మాయమ య్యాయి. ఈ భూములలో సాగవుతున్న పంటలు వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల్లోకి రాకపోవడంతో అంచనాలు తలకిందులవుతున్నాయి. దీంతో ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అడవుల ఆక్రమణకు చెక్పెట్టాలని, ఎరువుల కొరత తీర్చాలని రైతులు కోరుతున్నారు.గాంధారి మండలంలో సాగు భూమిగా మారిన గుట్ట (ఫైల్)ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 5.23 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనాలు వేశారు. గత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 49 వేల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులు వినియోగించా రు. ఈసారి(మే నుంచి సెప్టెంబర్ వరకు) 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 18,222 మెట్రిక్ టన్నుల డీఏపీ, 16,926 మెట్రిక్ టన్ను ల ఏంవోపీ, 44,762 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే జిల్లాకు 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాగా.. దానిని రైతులకు పంపిణీ చేశారు. ఇంకా సెప్టెంబర్ కోటా రావాల్సి ఉంది. ఏటా పెరుగుతున్న అటవీ భూముల సాగు విస్తీర్ణం తలకిందులవుతున్న వ్యవసాయ అధికారుల అంచనాలు యూరియా దొరక్క ఇబ్బందిపడుతున్న రైతులు -
కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి
కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లాలో గోసంగి కులం వారు లేరని బేడ బుడగ జంగాలు మాత్రమే ఉన్నారని, బేడ బుడగ జంగాల పేరు మీద కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరుపాటి వేణు అన్నారు. ఈమేరకు కామారెడ్డి కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుశురాం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గిర్ని వెంకటి, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాష, రాష్ట్ర జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, జేఏసీ వైస్ చైర్మన్ తూర్పాటి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. -
బాన్సువాడకు జ్వరమొచ్చింది!
బాన్సువాడ : బాన్సువాడ డివిజన్లో జ్వరాలు వి జృంభిస్తున్నాయి. ప్రజలు చాలామంది కీళ్లు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. మరోవైపు దగ్గు, జలుబు వేధిస్తున్నా యి. దీంతో ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి రోజూ 800 నుంచి 900 వరకు జ్వర పీడితులు వస్తున్నారు. రోగులతో ప్రైవేట్ ఆస్పత్రులూ కిటకిటలాడుతున్నాయి. నెల రోజులుగా.. ప్రజలు నెల రోజులుగా వైరల్ జ్వరాలతో బాధ పడుతున్నారు. డివిజన్లోని బాన్సువాడ, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, బీర్కూ ర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్లతోపాటు పొరుగున ఉన్న కంగ్టి, నారాయణఖేడ్ మండలాలనుంచీ రోగులు బాన్సువాడఆస్పత్రికి వస్తున్నారు. జ్వరం, మలేరియా, డెంగీ, వాంతులు, విరేచనాలు, కాళ్ల వాపులు, కీళ్లు, ఒళ్లు నొప్పులు రోజుల తరబడి తగ్గకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నా రు. నొప్పుల తీవ్రత అధికంగా ఉండడంతో రోజుల తరబడి మంచానికే పరిమితం కావాల్సి వస్తోంది. ఫలితంగా ఏ పని సొంతంగా చేసుకోలేకపోతున్నా మని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బా న్సువాడ ఆస్పత్రికి రోగుల తాకిడి పెరగడంతో ఒ క్కో మంచంపై ఇద్దరు, ముగ్గురికి చికిత్సలు చేస్తు న్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలోనూ రోగుల తాకిడి ఉంది. వ్యాధులతో బాధపడుతున్న డివిజన్ ప్రజలు ఏరియా ఆస్పత్రికి పెరుగుతున్న రోగుల తాకిడి రోజూ 800 పైనే ఓపీ.. ప్రైవేటు ఆస్పత్రులలోనూ రద్దీ -
ఎఫ్సీఎస్లో నాటకీయ పరిణామాలు
కామారెడ్డి అర్బన్: జిల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం(ఎఫ్సీఎస్) అధ్యక్షుడిగా నియమితులైన పెద్ద సాయిలు.. 24 గంటల్లో ఆ పదవిని వీడాల్సి వచ్చింది. గాదం సత్యనారాయణకే మళ్లీ బాధ్యతలు అప్పగించారు. లింగంపేట మండలంలోని మోతె గ్రామానికి చెందిన గాదం సత్యనారాయణ గతంలో జి ల్లా మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఆయన గ్రామంలో నివసించడం లేదన్న కారణంతో అక్కడి సంఘంలో ప్రాథమిక సభ్యత్వం తొలగించారు. దీంతో ఆయన జిల్లా అధ్యక్ష పదవిని కోల్పోయారు. కాగా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉ న్న పసుపుల పెద్ద సాయిలును సోమవారం జి ల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే తన సభ్యత్వం రద్దు విషయంలో సత్యనారాయణ సహకార ట్రిబ్యునల్ నుంచి స్టే ఆర్డర్ తీసుకువచ్చి సోమవారం సాయంత్రం జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీపతికి అందించారు. దీంతో మంగళవారం స్టే ఆర్డర్ను అమలు చేయడంతో పెద్ద సాయిలు పదవిని కోల్పోవాల్సి వచ్చింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్ డోలిసింగ్ మంగళవారం మధ్యాహ్నం సత్యనారాయణను అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ట్రిబ్యునల్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గాదం సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారని డోలిసింగ్ తెలిపారు. 24 గంటల్లోనే పదవిని కోల్పోయిన పెద్దసాయిలు మళ్లీ జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణకే బాధ్యతలు -
రెవెన్యూకు మంచి పేరు తీసుకురావాలి
కామారెడ్డి క్రైం: ఉత్తమ సేవలు అందించి రెవెన్యూ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో 363 గ్రామ పాలనాధికారుల పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వివిధ క్లస్టర్లకు కేటాయించిన గ్రామ పాలన అధికారులకు కలెక్టర్ నియామక ఉత్తర్వులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో ఉన్నవారిని ప్రభుత్వం ఎంతో నమ్మకంతో మళ్లీ రెవెన్యూ శాఖలోకి తీసుకుందన్నారు. ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా కేటాయించిన క్లస్టర్లలో రెవెన్యూ విధులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, భూభారతి చట్టం అమలు, ఇతర రెవెన్యూ విధులను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. కామారెడ్డి క్రైం: కలెక్టరేట్ సమీపంలోని ఈవీ ఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, భద్రత ఏర్పాట్లను పరిశీలించి అధికారులు, భద్రత సిబ్బంది కి పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆ ర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎన్నికల వి భాగం డీటీ అనిల్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కొలువుదీరిన తిరుపతి బాలాజీ జెండా
● 11 రోజుల పాటు పూజలు ● పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలుమద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తిరుమల తిరుపతి శ్రీ బాలాజీ జెండా కొలువుదీరింది. పాత బస్టాండ్ ప్రాంతంలోని హనమాన్ ఆలయం ముందు గ్రామస్తులు, జెండా కమిటీ సభ్యులు బాలాజీ జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. భక్తులు గోవిందా..గోవిందా... వెంకట రమణ గోవిందా అంటూ బాలాజీ జెండాకు స్వాగతం పలికారు. ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జన అనంతరం తిరుమల జెండా వస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. జెండా మద్నూర్లో 11 రోజుల పాటు పూజలు అందుకుంటుందని.. అనంతరం ఈ జెండా తిరుపతి శ్రీవారి ఆలయానికి భయలుదేరుతుందని వారు పేర్కొన్నారు. -
ఊపిరితిత్తుల్లో ఇరుకున్న శనగ గింజ
● చికిత్స చేసి తొలగించిన వైద్యులు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రానికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తుల్లో ఇరుకున్న శనగ గింజను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స చేసి తొలగించి ఆయన ప్రాణాలు కాపాడారు. వివరాలు.. వారం రోజులుగా దగ్గు, దమ్ము, ఛాతినొప్పితో తీవ్ర అవస్థ పడుతున్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పతికి చికిత్స కోసం మంగళవారం వచ్చాడు. వైద్యులు పరీక్షించి, స్కానింగ్ చేయగా ఆయన ఊపిరితిత్తిలో ఒక శనగ గింజ ఉందని గుర్తించారు. పల్మనాలజిస్టు వైద్యుడు సాయికృష్ణారావు తన వైద్య బృందంతో కలిసి అధునాతనమైన బ్రాంకోస్కోపి చికిత్స ద్వారా ఇరుకున్న శనగగింజను తొలగించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని, తినేటప్పుడు శనగ గింజ పొరపాటున ఊపిరితిత్తులలో ఇరుక్కుని ఉంటుందని వైద్యులు తెలిపారు. -
ప్రారంభానికి నోచుకోని పీహెచ్సీ
నస్రుల్లాబాద్: మండలాలు ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా చికిత్స కోసం పాత మండలాలు, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సి రావడం మాత్రం తప్పడం లేదు. గర్భిణులు, చిన్నారులు ప్రతి నెలా టీకాల కోసం బీర్కూర్ వెళ్లి రావాల్సి వస్తుంది. ప్రతి వారం నస్రుల్లాబాద్ మండలంలోని 19 గ్రామ పంచాయతీల నుంచి మహిళలు ఇబ్బందులు పడుతూ పోతున్నారు. నూతన పంచాయతీ ఏర్పాటై తర్వాత కూడా పాత మండలాలకు వెళ్లి చికిత్స చేసుకుంటున్నారు. అలంకారప్రాయంగా.. మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) రూ.1.43 కోట్లతో పూర్తి చేశారు. దీనికి తోడు రూ.12 లక్షలు పెట్టి సీసీ రోడ్లు సైతం పూర్తి చేశారు. కాని అధికారులు సిబ్బంది కేటాయింపులో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో అలంకారప్రాయంగా దర్శనం ఇస్తోంది. వివిధ మండలాల నుంచి ఫర్నిచర్ను తీసుకువచ్చి పెట్టారు. మంత్రులతో ప్రారంభింపజేయాలని స్థానిక నాయకులు ఎదురుచూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదు. అందుబాటులో లేని వాక్సిన్లు నస్రుల్లాబాద్లో కుక్కలు, కోతుల బెడద విపరీతంగా ఉంది. అటవీ ప్రాంతానికి దగ్గరగా మండలం ఉండటంతో పాములు, కుక్కలు, కోతుల కాట్లకు గురవుతున్నారు. అయితే స్థానికంగా వాక్సిన్ నిల్వ చేసే ఏర్పాట్లు లేకపోవడంతో బీర్కూర్, బాన్సువాడ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని పీహెచ్సీ అందుబాటులోకి వస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది.నిర్మాణం పూర్తయినా సేవలు మొదలు కాని నస్రుల్లాబాద్ పీహెచ్సీప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. అధికారులు నాయకులు త్వరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రజల అవసరాలు తీర్చాలి. – నర్సింలు గౌడ్, నస్రుల్లాబాద్మండలంలో సరైన వై ద్య సదుపాయం లేకపోవడంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. పాము కాటు వాక్సిన్ సమయానికి అందక ప్రాణాలు పోతున్నాయి. పీహెచ్సీని ఉపయోగంలోకి తీసుకొస్తే ప్రజలకు మేలవుతుంది. – అల్లం రాములు, మైలారం సిబ్బంది కేటాయింపులో అధికారుల అలసత్వం చికిత్స కోసం బీర్కూర్, బాన్సువాడకు వెళ్లాల్సిన పరిస్థితి ఇబ్బందులు పడుతున్న ప్రజలు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇందల్వాయి: మండల పరిధి లోని 44వ నంబరు జాతీయ ర హదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. అదిలా బాద్ జిల్లాలోని ఇచ్చోడకు చెందిన నరసింహారెడ్డి(21), విశాల్ అనే ఇద్దరు యువకులు హైదరా బాద్లో బీటెక్ చదువుతున్నారు. వారు మంగళవారం వేకువజామున కారులో హైదరాబాద్ నుంచి ఇచ్చోడకు బయలుదేరారు. ఇందల్వాయి మండలంలోని దేవితండా హైవే వద్ద వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, కారు నడుపుతున్న విశాల్కు స్వల్ప గా యాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించా రు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నిర్లక్ష్యంగా కారు నడిపిన విశాల్పై, లారీ పార్క్ చేసిన హర్యానాకు చెందిన లారీ డ్రైవర్ ఆలాంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. చెరువులో పడి వృద్ధుడు.. సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ చెరువులో ఓ వృద్ధుడు పడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. గోప్య తండాకు చెందిన బుక్యా శంకర్(59) అనే వృద్ధుడు సోమవారం చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లాడు. రాత్రి అయిన అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్దకు వెళ్లి చూడగా శంకర్ కనిపించలేదు. చెరువు కట్టపై అతడి బట్టలు ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతకగా చెరువులో శంకర్ మృతదేహం లభ్యమైంది. మృతుడి కొడుకు సుమన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. -
దరఖాస్తు గడువు పెంపు
సదాశినగర్(ఎల్లారెడ్డి): ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువును ఈ నెల 12 వరకు పొడిగించినట్లు ఓపెన్ స్కూల్ కేంద్రం ఇన్చార్జి, కల్వరాల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం విష్ణువర్ధన్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఒకే సంవత్సరం పదో తరగతి పాసైన వారికి ఒకే సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తవుతుందని.. రెగ్యులర్ ఇంటర్తో సమానమైన అవకాశాలుంటాయన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సర్వాపూర్, ముదెల్లి గ్రామాల్లో మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించి వరి పంటలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. ఇటీవల కురిసన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి నష్టం జరిగిన పంటలు, బాధిత రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు ఏవో తెలిపారు. ఏఈవో దీక్షిత్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉత్తునూర్ పీహెచ్సీ వైద్యాధికారి సాయికుమార్ అన్నారు. మంగళవారం ఆశాడే సందర్భంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా వీధులతో పాటు పరిసరాల్లో చెత్తా చెదారం కూరుకుపోయి ఉంటుందన్నారు. ఆశాకార్యకర్తలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్ఎం భాగ్యశ్రీ, హెచ్ఈవో భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో ఇటీవల వరదలకు ధ్వంసమైన హౌసింగ్ బోర్డుకాలనీ వైకుంఠధామానికి వెళ్లే రోడ్డును తక్షణమే బాగు చేయించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఎం నాయకులు రోడ్డును పరిశీలించారు. మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. వారం రోజులుగా అంత్యక్రియలకు వచ్చిన పలువురు శ్మశానవాటికకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారని వివరించారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి రోడ్డు బాగు చేయించాలని డిమాండ్ చేశారు. నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నర్సింలు, అరుణ్కుమార్ తదితరులున్నారు. బాన్సువాడ: బాన్సువాడ కోట దుర్గమ్మ ఆలయ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పద్మ నరేష్, గౌరవ అధ్యక్షుడిగా చిదుర శివకుమార్, ఉపాధ్యక్షుడిగా బుడాల సాయిలు, ప్రధాన కార్యదర్శిగా దాసరి బాలకృష్ణ, సహాయ కార్యదర్శిగా రాగిరి శ్రావణ్ కుమార్, కోశాధికారిగా పత్తి మహేందర్, సహాయ కోశాధికారిగా నవీన్లను ఎన్నుకున్నారు. మాజీ అధ్యక్షుడు పత్తి శ్రీకాంత్, గంగాధర్, ఉప్పరి లింగం తదితరులున్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం ఐకేపీ వీవోఏల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గౌస్ ఖాన్ తెలిపారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ విక్రమ్ గుప్తా, జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్రావు ఆధ్వర్యంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షురాలిగా ప్రభావతి రెడ్డి, ఉపాధ్యక్షురాలిగా లక్ష్మీప్రియ, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీదేవి, సహాయ కార్యదర్శిగా లక్ష్మి, కోశాధికారిగా కవితను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
విద్యుత్ సబ్స్టేషన్లో పగిలిన లింబు
● గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయంనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్లో మంగళవారం లింబు పగిలిపోవడంతో సబ్స్టేషన్న్ పరిధిలోని పలు గ్రామాలకు గంటల తరబడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సబ్స్టేషన్లో 8 మెగావాట్ల ట్రాన్స్ఫార్మర్ నుంచి బయటకు వచ్చే ఎల్వీ బ్రేకర్పై లింబు ఆకస్మికంగా పగిలిపోయింది. కాగా లింబు పగిలిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ల వద్ద సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. కాగా నూతన లింబును తీసుకువచ్చి బిగించేవరకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో మండల కేంద్రం గోపాల్పేటతోపాటు పలుగ్రామాలకు 5 గంటలకుపైగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. -
సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 73 వినతులు కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 73 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పింఛన్ల మంజూరు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి వెంచర్లో గ్రామ పంచాయతీకి వదిలిపెట్టాల్సిన ఓపెన్ ల్యాండ్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని భిక్కనూర్కు చెందిన గంగల రవీందర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. భిక్కనూరు జీపీకి చెందిన ఆ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
పిప్రిలో గౌడ కులస్తుల బహిష్కరణ
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో గౌడ కులస్తులపై గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరణ వేటు వేశారు. కల్లు ధర పెంపు విషయంలో గ్రామానికి చెందిన తమను వీడీసీ బహిష్కరించినట్లు సోమవారం 54 గౌడ కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. ప్రస్తుతం ఉన్న ధర సరిపోవడం లేదని, ధర పెంచుకుంటామని వీడీసీ దృష్టికి తీసుకెళ్లగా, తెల్లకాగితంపై సంతకాలు పెట్టి ఇవ్వాలని లేదంటే తాము చెప్పినట్లు వినాలని హకుం జారీ చేసినట్లు తెలిపారు. తెల్లకాగితంపై సంతకాలు చేయకపోవడంతో తమను బహిష్కరించినట్లు పేర్కొన్నారు. తమకు సంబంఽధించిన హోటళ్లు, దుకాణాలు, ఆటోల్లోకి ఎవరినీ రానివ్వకుండా ఆంక్షలు పెట్టినట్లు గౌడ కులస్తులు తెలిపారు. -
బస్సు ఢీకొని ఒకరు..
ఖలీల్వాడి: నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో సోమ వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. వి వరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రాకు చెందిన సంతోష్(32) సోమవారం బైక్పై ఆర్మూర్ వైపు నుంచి నిజామాబాద్కు వస్తున్నాడు. కంఠేశ్వర్లోని అయ్య ప్ప స్వామి ఆలయ సమీపంలో ముందున్న ఓ స్కూల్ బస్సును బైక్ ఢీకొట్టింది. ఆ వెంటనే వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్పై ఉన్న సంతోష్ తలకు తీవ్రగాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే సంతోష్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ప్రపంచ దేశాలకు మన ఆర్థిక వ్యవస్థ ఆదర్శం
సుభాష్నగర్: ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. దేశ ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చినందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటాలకు నగరంలోని గాంధీచౌక్లో సోమవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారితోకలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడారు. జీఎస్టీపై గగ్గోలు పెట్టిన ప్రతిపక్షాలకు ఇది చెంపపెట్టన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు ఉపయోగించే షాంపు నుంచి లగ్జరీ కార్ల వరకు భారీ ఊరట కల్పించారని హర్షం వ్యక్తంచేశారు. తద్వారా దేశంలో దీపావళి పండుగ సంబరాలు ఇప్పుడే మొదలయ్యాయన్నారు. ప్రధానంగా ఆరోగ్య, జీవిత బీమాలతోపాటు 33 రకాల అత్యవసర మందులపై జీరో జీఎస్టీ ఒక విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగస్వాములవుతూ మన దేశ ఉత్పత్తులు పెంచి, గ్రామీణస్థాయి నుంచి మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలన్న మోదీ సంకల్పానికి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు రాము, నాయకులు జ్యోతి, వనిత, ఇప్పకాయల కిశోర్, తారక్ వేణు, హరీశ్రెడ్డి, పంచరెడ్డి శ్రీధర్, మాస్టర్ శంకర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ చిత్రపటానికి పాలాభిషేకం -
ముంపు బాధ తప్పించండి
డ్రైనేజీలు సక్రమంగా లేక వరదలు వచ్చినప్పుడు తమ కాలనీ ముంపునకు గురవుతున్నదని.. జిల్లా కేంద్రంలోని దేవి విహార్ హౌసింగ్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తమ కాలనీలోకి పై ప్రాంతాల నుంచి భారీ వరద నీరు వచ్చిందన్నారు. వరద నీరు బయటకు వెళ్లే దారి లేక కాలనీలోని ఇళ్లు నీట మునిగాయన్నారు. కాలనీ వద్ద ప్రధాన రహదారి వెంబడి ఉన్న మురికి కాలువలు చిన్నవిగా ఉండటంతో ప్రవాహం తక్కువగా ఉండి ముంపునకు గురవుతున్నామని వాపోయారు. నిజాంసాగర్ రోడ్డుపై రెండు చోట్ల పెద్ద సైజులో కల్వర్టులు, రోడ్డుకు ఇరువైపులా పెద్ద సైజులో డ్రైనేజీ వ్వవస్థను నిర్మించి కాలనీని కాపాడాలని విన్నవించారు. -
జార్ఖండ్లో అబ్బాపూర్తండావాసి మృతి
● మృతుడు పోస్టల్ ఉద్యోగి నవీపేట: మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన సభావాత్ శ్రీహరి(20) సోమవారం జార్ఖండ్లో జరిగిన నీటి ప్రమాదంలో మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. అబ్బాపూర్ తండాకు చెందిన సభావత్ కై లాస్ కుమారుడు జార్ఖండ్ రాష్ట్రంలోని చక్రధర్ఫూల్ పరిధి ఒటాదిరి బ్రాంచ్లో పోస్టల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ఆయన స్నేహితులతో కలిసి సమీపంలోని వాటర్ఫాల్కు వెళ్లాడు. స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగి నీటమునిగాడు. ఊపిరాడకపోవడంతో మృతి చెందాడు. జార్ఖండ్ పోలీసులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీహరి మృతితో అబ్బాపూర్తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. పాము కాటుతో ఒకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని ముదెల్లి గ్రామానికి చెందిన ఒడ్నాల మొగులయ్య(59) పాము కాటుతో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. మొగులయ్య ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఏదో కుట్టినట్లు తెలియడంతో నిద్ర నుంచి మేల్కొని పరిశీలించగా పాము కనిపించింది. కుటుంబసభ్యులకు తెలపడంతో పామును చంపేసి మొగులయ్యను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిశీలించిన వైద్యులు మొగులయ్య మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వస్తూ దారి మరిచి తప్పిపోయిన చిన్నారిని పట్టణ పోలీసులు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీలో సోమవారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన తూర్పాటి లక్ష్మి–చింటులకు 4 ఏళ్ల కుమార్తె సాయిపల్లవి ఉంది. ఆమె ప్రతిరోజు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి ఉదయం 10 గంటలకు వెళ్లి మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి వచ్చేది. సోమవారం ఇంటికి వస్తుండగా దారి తప్పి ఎక్కడికో వెళ్లిపోయింది. బాలిక కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, అంగన్వాడీ కేంద్రం సిబ్బంది గాలించడంతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిరిసిల్లా రోడ్డులోని యూనియన్ బ్యాంకు వద్ద ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ బాలికను చేరదీసి పట్టణ పోలీస్స్టేషన్కు తీసుకువచ్చాడు. పట్టణ ఎస్హెచ్వో నరహరి కుటుంబసభ్యులకు సమాచారం అందించి చిన్నారిని అప్పగించారు. -
వరద బాధితులకు రిలీఫ్ కిట్ల పంపిణీ
కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని వరద బాధిత కుటుంబాలకు సోమవారం కామారెడ్డి పట్టణంలోని ఈఎస్ఆర్ గార్డెన్న్లో రామకృష్ణ మఠ్, ఇన్ఫోసిస్ సహకారంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా 334 రిలీఫ్ కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేని విధంగా వరదలు సంభవించి తీవ్ర నష్టం కలిగిందన్నారు. వరద బాధితుల కుటుంబాలను ఆదుకునేందుకు రామకృష్ణ మఠ్ ముందుకు వచ్చి ఇప్పటికే వైద్య శిబిరాలు నిర్వహిందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 9న మంగళవారం ఎల్లారెడ్డిలో వరద బాధిత కుటుంబాలకు 150 కిట్లను, బాన్సువాడలో 150 కిట్లను ఇన్ఫోసిస్, రామకృష్ణ మఠ్ సహకారంతో అందిస్తామన్నారు. మొత్తం కిట్ల విలువ రూ. 20 లక్షలు. మరింత మంది దాతలు ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు. -
మొరం అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
ఇష్టారాజ్యంగా మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీర్కూర్ మండలం భైరాపూర్ గ్రామస్తులు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని సర్వే నెంబరు 30 లో చిన్న, పెద్ద గుట్టలు ఉన్నాయని తెలిపారు. వాటిలో కొందరు ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతున్నారని తెలిపారు. మరికొందరు తమకు ఈ సర్వే నెంబర్లో పట్టా భుములు ఉన్నాయని చెబుతూ యథేచ్ఛగా మొరం అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఆ స్థలాన్ని క్రమబద్దీకరించి గ్రామస్తులు వడ్లు ఆరబెట్టుకునేందుకు, పశువుల మేతకు కేటాయించాలని కోరారు. ఈ మేరకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
ఎన్నికల హామీలను నెరవేర్చాలి
ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాల ని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరా ట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమితి జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ. 6 వేలు,తీవ్ర వైకల్యం కలిగిన వారికి రూ.15 వేలు పింఛన్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటై 20 నెల లు కావస్తున్నా పింఛన్ను పెంచడం లేదన్నారు. తమ గోడు వినేందుకు కలెక్టర్ రావాలని పట్టుబట్టి దాదాపు గంటపాటు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు.ఆర్డీవో వీణ, డీఆర్డీవో సురేందర్, జిల్లా సంక్షే అధికారిణి ప్రమీల వారి వద్దకు వచ్చి సముదాయించారు. ప్రజావాణి ముగించు కుని బయటకు వస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వారిని చూసి ఆగారు. దివ్యాంగులతో మాట్లాడి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో వారు వెనుదిరిగారు. -
అక్షరాస్యతను పెంచాలి
మాచారెడ్డి: ప్రతి ఒక్కరూ సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేసి అక్షరాస్యత శాతాన్ని పెంచాలని ఎంఈవో దేవేందర్రావు అన్నారు. సోమవారం మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్లో వయోజన విద్య నవభారత్ సాక్షరతలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులు సీఆర్పీ దేవ సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండిమాసానిపేటలో సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు చదువుకోవాల ని వారు ఫ్లకార్డులతో ప్రదర్శన చేశారు. ఎంఈవో రాజులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. విద్య ప్రతి ఒక్కరికి అవసరం బీబీపేట: ప్రస్తుత రోజుల్లో విద్య ప్రతి ఒక్కరికి అవసరమని బీబీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామేశ్వర్రెడ్డి అన్నా రు. సోమవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్స వం పురస్కరించుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. గ్రామ కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వేగ నియంత్రణకు ఏర్పాట్లు
సదాశివనగర్: ప్రజల ప్రాణాలను కాపాడేందుకే వేగ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. సోమవారం మండల కేంద్రం శివారు అయ్యప్ప ఆలయం వద్ద 44వ జాతీయ రహదారిపై స్పీడ్ లేజర్ గన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు తప్పవన్నారు. జిల్లాలో మూడు స్పీడ్ లేజర్ గన్లు వాహనదారుల వేగాన్ని నియంత్రించడానికి ఏర్పాటు చేశామన్నారు. సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. 2024 ఆగస్టు వరకు 188 ప్రమాదాలు చోటు చేసుకోగా, వాటిని 145కి తగ్గించగలిగామన్నారు. అదే విధంగా మరణాలు 197 నుంచి 153కి తగ్గినట్లు తెలిపారు. గాయపడ్డ వారి సంఖ్య 181 నుంచి 173కి తగ్గినట్లు పేర్కొన్నారు. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధించి క్రమంగా వారి వేగ నియంత్రణ చేయడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. లేజర్ గన్స్ను జిల్లాలో పరిధిలో 44వ, 161వ జాతీయ రహదారులపై ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో రోడ్డు భద్రతా చర్యల విజయాన్ని సూచిస్తూ ప్రజల ప్రాణాల రక్షణలో గొప్ప ముందడుగుగా నిలిచామన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సీఐ సంతోష్కుమార్, ఎస్సై పుష్పరాజ్, తదితరులు పాల్గొన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకే స్పీడ్ లేజర్ గన్లు ఈ ఏడాది రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గింది నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు తప్పవు ఎస్పీ రాజేశ్ చంద్ర -
అప్పులబాధతో ఒకరి ఆత్మహత్య
ఖలీల్వాడి: నగరంలోని నాందేవ్వాడకు చెందిన మానేయకుర్ రమేశ్(44) అప్పులబాధతో ఆదివారం గడ్డి మందు తాగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గమనించిన కుటుంబసభ్యులు జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడన్నారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.కామారెడ్డి క్రైం: తండ్రిని చంపిన కేసులో ఓ కుమారుడికి కామారెడ్డి కోర్టు జీవిత ఖైదు విధించింది. వివరాలిలా ఉన్నాయి. నాగిరెడ్డిపేట మండలం జలాల్పూర్ మండలానికి చెందిన జాన్కంపల్లి విఠల్ 2021 మార్చి 16న హత్యకు గురయ్యాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా చిన్న కుమారుడు సంగమేశ్వర్తో తరుచూ గొడవలు జరిగేవి. సంగమేశ్వర్ తన తండ్రిని హత్య చేసి ఉరివేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ అనుమానించిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణలో హత్యగా తేలింది. దీంతో సంగమేశ్వర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితునికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు వెల్లడించారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్గౌడ్, కేసును సరైన పద్ధతిలో విచారణ జరిపిన సీఐలు రాజశేఖర్, రాజారెడ్డి, ఎస్సై రాజయ్య, భార్గవ్ గౌడ్, కోర్టు లైజనింగ్ అధికారి రామేశ్వర్రెడ్డి, సిబ్బంది సాయిలును ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. -
ఇసుక బొలెరో పట్టివేత
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని సిర్పూర్ శివారులో ఉన్న మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న బొలెరో వాహనాన్ని సోమవారం పట్టుకున్నట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు. వాహనాన్ని డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి తరలించినట్లు పేర్కొన్నారు.దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి దేహశుద్ధి రాజంపేట: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నముండ్ల నరేశ్ కొంతకాలంగా దొంగతనాలు చేస్తూ జీవిస్తున్నాడు. ఆదివారం గ్రామానికి చెందిన సావుసాని మహేందర్ రెడ్డి బోరు మోటారును నరేశ్ దొంగలించాడు. అనుమానం వచ్చిన మహేందర్రెడ్డి గ్రామస్తుల సహకారంతో సోమవారం నరేశ్ను ప్రశ్నించాడు. నరేశ్ వద్ద అనుమానాస్పదంగా ఓ బైకు కూడా కనిపించడటంతో గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి స్టేషన్కు తరలించారు.గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్రగాయాలుగాంధారి(ఎల్లారెడ్డి): గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన శంషుద్దీన్కు తీవ్రగాయాలైనట్లు ఎస్సై ఆంజనేయులు సోమవారం తెలిపారు. ఆదివారం పశువులను మేపుకొని రాత్రి ఇంటికి తీసుకెళ్తుండగా గాంధారి–బాన్సువాడ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందన్నారు. దీంతో శంషుద్దీన్కు రెండు కాళ్లు విరగడంతోపాటు వెన్నుపూసకు తీవ్రగాయాలైనట్లు తెలిపారు. బాధితుడి బంధువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్’పై శిక్షణ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): విద్యార్థులు, ఉపాధ్యాయు లలో పర్యావరణహిత ఆలోచనలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యా లయ రేటింగ్(ఎస్హెచ్వీఆర్)’పై నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట హైస్కూల్లో సోమవా రం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ వస్త్రాల రాజశేఖర్ మాట్లాడుతూ.. నూతన విద్యావిధానంలో భాగంగా పాఠశాల స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ పాటించడంతోపాటు హరిత పాఠశాలలు నెలకొల్పేందుకు కేంద్రప్రభుత్వం దేశంలోని అన్ని పాఠశాలల్లో ఎస్హెచ్వీఆర్పై గ్రేడింగ్ ఇవ్వనుందన్నారు. మంచి గ్రేడింగ్ వచ్చిన పాఠశాలలకు రాష్ట్రస్థాయిలో రూ.లక్ష నగదుతోపాటు పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఉచి తంగా విహారయాత్ర కల్పించనున్నట్లు చెప్పారు. సర్వేలో భాగంగా పాఠశాల వివరాలు, ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. సర్వేలో పాల్గొ న్న ప్రతి పాఠశాలను సంబంధిత అధికారి సందర్శించి ఆన్లైన్లో నమోదు చేసిన వివరాలను తనిఖీ చేస్తారని చెప్పారు. మండలానికి ఉత్తమ పుర స్కారం వచ్చేలా ప్రతి ఒక్క హెచ్ఎం కృషి చేయాల ని గోపాల్పేట హైస్కూల్లో హెచ్ఎం వెంకట్రాంరెడ్డి సూచించారు. సీఆర్పీలు రాజయ్య, కృష్ణస్వామి, యంఆర్సీ కంప్యూటర్ ఆపరేటర్ శైలేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పల్వాయిలో ఆందోళన
రామారెడ్డి : యూరియా కోసం రైతులు ఉప్పల్వాయి సొసైటీ భవనం వద్ద ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. సొసైటీకి 440 బస్తాల యూరియా రావడంతో రైతుకు ఒక బస్తా చొప్పున ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే రెండు బస్తాలైనా ఇవ్వాలంటూ రైతులు పట్టుబట్టారు. దీంతో అధికారులు పంపిణీని వాయిదా వేశారు. మరో లోడ్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు ధర్నా చేశారు. పోలీసులు వారిని సముదాయించి ఆందోళన విరమింపజేశారు. మాచారెడ్డి : మండలకేంద్రానికి సోమవారం యూరియా వస్తుందని అధికారులు చెప్పడంతో వేకువజామునే అన్ని గ్రామాల నుంచి సింగిల్విండోకు వచ్చి బారులు తీరారు. యూరియా రాకపోవడంతో విసిగి వేసారిన రైతులు ఇటుకలను క్యూలో ఉంచి ఆందోళనకు దిగారు. మండల కేంద్రంలోని రోడ్డుపై రాస్తారోకో చేశారు. ఎస్సై అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి, టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేశారు. -
రేపు తుది ఓటరు జాబితా
కామారెడ్డి క్రైం : రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈనెల 10న తుది ఓటరు జాబితాను ప్రదర్శించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిషత్ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈనెల 6న జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలు, గ్రామపంచాయతీలలో ముసాయిదా ఓటరు, ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శించామన్నారు. దీనిపై సోమవారం వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించామని తెలిపారు. వచ్చిన అభ్యంతరాలను మంగళవారం పరిశీలించి, పరిష్కరిస్తామని, బుధవారం తుది ఓటరు, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రదర్శిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉత్తమ సేవలతోనే గుర్తింపు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఉత్తమ సేవలు అందించినప్పుడే ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాల్లో భా గంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 41 మందిని సోమవారం కలెక్టరేట్లో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరింత ఆదర్శవంతంగా విద్యాబోధన చేసి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ చందర్నాయక్, డీఈవో రాజు, ఆర్డీవో వీణ, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
యూరియా.. లేదయ!
– 8లో uమంగళవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025మాచారెడ్డిలో వరుసలో ఉన్న రైతులు జిల్లా రైతాంగాన్ని యూరియా కొరత ఇబ్బందిపెడుతోంది. అవసరమైన సమయంలో ఎరువు లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రోజూ సొసైటీల చుట్టూ తిరుగుతున్నా బస్తా కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరత తీర్చాలని అధికారులను కోరుతున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో సాగు చే సిన పంటలకు అవసరమైన మేర యూరియా సర ఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా రైతులు ఎరువుల కోసం సహకార సంఘాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్నిచోట్ల రాత్రి వేళలోనే సొసైటీకి చేరుకుని అక్కడే ఉండి పొద్దున్నే వరుసలో నిల్చుంటున్నారు. మరికొన్ని చోట్ల చెప్పులు, రాళ్లు, చెట్లకొమ్మలు, పాసుపుస్తకాల జిరాక్సులను వరుస లో పెడుతున్నారు. జిల్లాలోని మాచారెడ్డి, రామారె డ్డి, బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి తదితర మండలాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఆయా మండలాల్లో యూరియా కోసం రైతులు పది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో చెరువులు, ప్రాజెక్టు లు నిండాయి. వర్షాలతో కొంత నష్టం జరిగినా, ఉన్న పంటలకు ఎరువులు వేయాలని రైతులు సహ కార సంఘాల చుట్టూ తిరుగుతున్నారు. స్టాక్కు మించి రైతులు వస్తుండడంతో ఒక్కో బస్తా చొప్పు నే పంపిణీ చేస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా చాలామందికి దక్కడం లేదు. ఎరువులు దొరకని రైతులు ఆందోళనకు దిగుతున్నా రు. రామారెడ్డి మండలం ఉప్పల్వాయిలో రైతులు సోమవారం యూరియా కోసం ధర్నా చేశారు. అధికారుల తీరు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచారెడ్డి మండల కేంద్రంలోనూ రైతులు రోడ్డెక్కారు. మరికొన్నిచోట్ల ఇదే పరిస్థితి ఉంది. రోజూ యూరియా కోసం రైతు లు ఊళ్ల నుంచి సొసైటీల వద్దకు చేరుకుంటున్నా రు. ఎరువు లోడ్ వస్తుందని చెబితే చాలు వరుస కడుతున్నారు. తీరా లోడ్ రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. ఒక్క బస్తా కోసం నాలుగైదు రోజులుగా తిరుగుతున్నవారూ ఉన్నారు. పొలం దగ్గరకు వెళ్లాల్సిన రైతులు.. ఎరువుల కోసం సొసైటీల వద్ద పొద్దంతా గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని సహకార సంఘానికి సోమవారం భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కూ పన్లు ఇవ్వడానికి అధికారులు పోలీసుల సాయం తీసుకున్నారు. అక్కడ రైతులు, పోలీసులకు మధ్య న పలుమార్లు వాగ్వాదం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖ, సహకార శాఖ అధికారులతోనూ రైతులు గొడవకు దిగారు. చాలాచోట్ల రోజూ ఇదే పరిస్థితి నెలకొంటోంది. సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారులు సరైన విధంగా స్పందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు వ్యాపారులు ముందుగానే యూరియాను బ్లాక్ చేసి ఉంచారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎ క్కువ డబ్బులు తీసుకుని విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొందరు దళారులు పెద్ద మొత్తంలో ఎరువులు స్టాక్ చేసి ఉంచారన్న ప్రచారం జరుగుతోంది. నిఘా ఉంచి బ్లాక్ దందా ను అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. జిల్లాలో 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవ సరం ఉండగా.. ఇప్పటికే 46 వేల మెట్రిక్ టన్నులు వచ్చింది. దానిని రైతులకు అందించాం. మంగళవా రం మరో 800 మెట్రిక్ టన్నుల యూరియా రానుంది. ఆయా సొసైటీలకు సరఫరా చేసి రైతులకు పంపిణీ చేస్తాం. బ్లాక్ మార్కెట్ విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా బ్లాక్మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిమాచారెడ్డిలో పోలీసుల సహకారంతో రైతులకు టోకెన్లు ఇస్తున్న సొసైటీ అధికారులువేధిస్తున్న కొరత ఇబ్బందిపడుతున్న రైతులు బస్తా కోసం గంటల తరబడి బారులు అయినా దక్కక నిరాశ -
పనులు నాణ్యతతో చేపట్టాలి
● పంట నష్టం సర్వే కొనసాగుతోంది ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం : జిల్లాలో భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పునరుద్ధరణ పనుల కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.10 కోట్లను కేటాయించిందన్నారు. ఇందులో ఇప్పటికే రూ.7.07 కోట్లను ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలకు కేటాయించి పనులను ప్రారంభించామన్నారు. మిగిలిన వాటిని ఇరిగేషన్, ఇతర పనులకు కేటాయించామన్నారు. జిల్లాలో దెబ్బతిన్న 1,574 గృహాలలో 1,566 ఇళ్లకు నష్టపరిహారంగా రూ. 71.95 లక్షలను అందించామన్నారు. వరదలకు జిల్లాలో చనిపోయిన 89 పశువులు, 870 కోళ్లకు నష్టపరిహారం అందించాలని కోరుతూ రూ. 28.78 లక్షలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ఇప్పటివరకు చేసిన సర్వే ద్వారా 17,700 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించామని, 108 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయని పేర్కొన్నారు. సర్వే కొనసాగుతోందని, తుది నివేదికలు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నష్టపరిహారం కోసం నివేదిస్తామని తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు అన్ని శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో ప్రభుత్వ స్థలాలలో ఉన్న అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రానున్న రెండు రోజులు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు వీణ, పార్థసింహారెడ్డి, ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కనువిప్పు కలిగిస్తాం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించే సభను విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్కుమార్గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కన్వెన్షన్ సెంటర్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరుతామన్నారు. బీస్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ల అమలు కోసం తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దానికి చట్టబద్ధత ఇవ్వాల్సిన కేంద్రం మోకాలడ్డుతోందని ఆరోపించారు. బీసీ బిల్లును ఆపుతున్న వారి భరతం పట్టడానికి 15న కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో రెండు లక్షల మందితో సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ రోజు మోదీని పట్టుకుని బీసీ బిల్లును ఆపగలుగుతున్నారని, రాహుల్ గాంధీ ప్రధాని అవగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందరూ కృషి చేయాలి కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలివచ్చేలా పార్టీ నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కులగణన శాసీ్త్రయంగా జరిగిందన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, ఎన్ని కుట్రలు చేసినా చిత్తశుద్ధితో బీసీ బిల్లు తీర్మానం చేశామన్నారు. నిజాయితీగా బిల్లును ఆమోదించాం ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉద్దేశించిన బిల్లును నిజాయితీగా ఆమోదించామని జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి పంపిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.ఇచ్చిన మాట ప్ర కారం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి తీ రుతామని రవాణా, బీసీ వెల్ఫేర్ శాఖల మంత్రి పొ న్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బీసీ బిల్లుకు కేంద్రం చట్టబద్ధత కల్పించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. బీసీలు పెద్ద సంఖ్యలో సభకు తరలివచ్చి ఐ క్యత చాటాల్సిన అవసరం ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కార్పొరేషన్ల చైర్మన్లు మానాల మోహన్రెడ్డి, ఈరవత్రి అనిల్, తాహెర్బిన్ హందాన్, కాసుల బాల్రాజ్, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, ఆకుల లలిత, నాయకులు అరికెల నర్సారెడ్డి, చంద్రకాంత్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఇందుప్రియ, ఇంద్రకరణ్రెడ్డి, నర్సింగరావు, విజయ్కుమార్రెడ్డి, మామిండ్ల అంజయ్య, మోహన్రెడ్డి, అశోక్రెడ్డి, పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.సీఎం రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ పేర్కొన్నారు. కామారెడ్డిలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బీసీ బిల్లును ఆమోదించిన తర్వాత కామారెడ్డిలోనే సభ నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, ఆది శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. కామారెడ్డిలో రెండు లక్షల మందితో సభ నిర్వహిస్తాం కేంద్రంపై సమర శంఖం పూరిస్తాం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించడమే లక్ష్యం మోదీ ఇవ్వకపోతే రాహుల్ ప్రధాని కాగానే అమలు చేస్తాం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ -
ప్రాజెక్టు అద్భుతం
నిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మించి వందేళ్లయినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని, ఇది అద్భుతమని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగువ నుంచి వరద ఉధృతంగా వస్తున్నా, ప్రాజెక్టు నుంచి ఆటోమెటిక్ సిస్టమ్ లేకున్నా, మ్యాన్వల్గా నీటిని విడుదల చేస్తున్న నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బంది పనితీరును ఆయన అభినందించారు. ఎమ్మెల్యే వెంట నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి దంపతులు, నాయకులు ఉన్నారు. -
నిజాంసాగర్లోకి రికార్డు స్థాయి వరదలు
● ఈ సీజన్లో 125 టీఎంసీల ఇన్ఫ్లో ● 111.53 టీఎంసీల అవుట్ఫ్లో ● కొనసాగుతున్న నీటి విడుదలనిజాంసాగర్: నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ఇప్ప టికే 125 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం. ఇంకా వర్షాకాలం మిగిలి ఉన్నందున ఇన్ఫ్లో రికార్డు మరింత మెరుగయ్యే అవకాశాలున్నాయి. 1920 సంవత్సరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కరువు కోరల్లో చిక్కుకుంది. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాగు నీరు లేక పంటలు సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అప్పటి పాలకులు భారీ సాగు నీటి ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించారు. ఏడాది పాటు సర్వే చేసి అచ్చంపేట– బంజపల్లి గ్రామాల మధ్య గోదావరి ఉపనదిపై సాగునీటి ప్రాజెక్టుకు అనువైన స్థలం ఉందని గుర్తించారు. 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో 1923 సంవత్సరంలో చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. డిప్యూటి చీఫ్ ఇంజినీర్ సీసీ పాలె, అసిస్టెంట్ ఇంజినీర్ ఎస్జే తారాపూర్ల పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు సాగాయి. 1931 సంవత్సరంలో నిర్మాణం పూర్తయ్యింది. నిజాంసాగర్ ప్రాజెక్టును ‘ఎన్’ ఆకారంలో 1,405.05 అడుగుల నీటిమట్టం, 30 టీఎంసీల నీరు నిలువ ఉండేలా నిర్మించారు. ఇది రెండోసారి.. నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే రెండోసారి. గతంలో 1998 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టుకు 167 టీఎంసీ ఇన్ప్లోగా వచ్చింది. అప్పట్లో నిజాంసాగర్ వరద గేట్లతో పాటు ప్రధాన కాలువ ద్వారా 157 టీఎంసీల నీటిని మంజీర నదిలోకి వదిలారు. 1998 తర్వాత ఈ ఏడాది మళ్లీ భారీ వరదలు వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ప్రాజెక్టులోకి 125 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు ఎగువన ఉన్న పాత మెదక్ జిల్లాలో వానలు దంచికొట్టడంతో రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. గత నెల 28 న ఒకరోజులో గరిష్టంగా 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. అంతే స్థాయిలో 27 వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఇది ప్రాజెక్టు చరిత్రలో రికార్డుగా నిలిచింది.గత నెల 18 నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. గతనెల 25 ఒక్క రోజు మాత్రమే వరద గేట్లను మూసివేశారు. ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. ఈ మూడు వారాల్లో 111.53 టీఎంసీల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా మంజీర నదిలోకి వదిలారు. ఎగువ ఉన్న సింగూరు ప్రాజెక్టు గేట్ల ద్వారా నీటి విడుదల చేపట్టడంతో పాటు హల్దీవాగు, ఘనపురం ఆనకట్ట ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 23,220 క్యూసెక్కుల వరద నీరు ఇన్ప్లోగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు 3 వరద గేట్ల ద్వారా 17,865 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. -
నాణ్యమైన విద్య అందిస్తూ..
● ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న లాల్సింగ్ నిజాంసాగర్: నాణ్యమైన విద్య అందిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్న అచ్చంపేట ప్రాథమిక పాఠశాల టీచర్ లాల్సింగ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. సోమవారం జిల్లాకేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకోనున్నారు. విద్యార్థుల సంఖ్య డబుల్.. లాల్సింగ్ 2022 సంవత్సరంలో అచ్చంపేట ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. ఆ సమయంలో ఐదు తరగతులలో కలిపి యాభై మంది విద్యార్థులున్నారు. నాణ్యమైన విద్య అందిస్తూ విద్యార్థులలో పఠనాసక్తి పెంపొందించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడి రూపురేఖలు మార్చడానికి కృషి చేస్తున్నారు. పూర్వ విద్యార్థి సహకారంతో తరగతి గదుల్లో పెయింటింగ్ వేయించారు. విద్యార్థులకు ఉపయోగపడే వాల్ పోస్టర్లు అతికించారు. ప్రతినెలా పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నారు. విద్యార్థుల ప్రగతిని వారికి వివరిస్తున్నారు. మంచి విద్య అందిస్తుండడంతో ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు సైతం సర్కారు బడి వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 105 మంది విద్యార్థులున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్లు, బ్యాడ్జీలు అందించారు. పాఠశాలలో అర్ధంతరంగా నిలిచిన తరగతి గదుల నిర్మాణ పనులను ఇటీవల కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన గదుల నిర్మాణ పనులకు రూ. 4 లక్షలు మంజూరు చేశారు. ఇలా విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న లాల్సింగ్ జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.ఎక్కడ పనిచేసినా బడికి వచ్చే పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకుంటాను. వారికి విద్యాబుద్ధులు నేర్పడంతోపాటు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుంటా. అందరి సహకారం వల్లే బడి రూపురేఖలు మార్చగలిగా. – లాల్సింగ్, ప్రధానోపాధ్యాయుడు, అచ్చంపేట -
విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
● చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి ● మంత్రులు పొన్నం, వాకిటిభిక్కనూరు: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంతి పొన్నం ప్రభాకర్, క్రీడలు, పశుసంవర్ధక శాఖల మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. ఆదివారం వారు జంగంపల్లిలోని బీసీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నతనంలోనే లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, విధిగా మెనూ అమలు చేయాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సమస్యలు, విద్యాబోధన గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీలత పాల్గొన్నారు. -
‘నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలి’
కామారెడ్డి రూరల్: హోటల్ వ్యాపార నిర్వాహకులు, దుకాణాల యజమానులు వినియోగదారులకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు అందించాలని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) శిక్షకురాలు భార్గవి కంచాల సూచించారు. మహారాష్ట్ర సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్(ఎంసీఈడీ) ఆధ్వర్యంలో ఆదివారం కామారెడ్డి పట్టణంలోని వశిష్ట డిగ్రీ కాలేజీలో దుకాణదారులు, హోటల్ వ్యాపార నిర్వాహకులకు శిక్షణ ఇచ్చారు. శుచి, శుభ్రత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆహార పదార్థాలలో ఫుడ్ కలర్స్, టెస్టింగ్ సాల్ట్ వినియోగించరాదన్నారు. కార్యక్రమంలో ఎంసీఈడీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కొప్పుల రవి, సిబ్బంది దేవరాజ్, నవీన్, కృష్ణ, అనిల్, సతీష్, అనిల్, పలువురు దుకాణదారులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
మాచారెడ్డి: మండలంలోని సోమారంపేటకు చెందిన ఓ యువకుడు దుబాయిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన గూగులోతు రవి (32) మూడేళ్ల క్రితం బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లాడు. తన గదిలో ఆదివారం అతడు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు ద్వారా తెలిసింది. ప్రభుత్వం స్పందించి రవి మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని గ్రామస్తులు కోరారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కన్కల్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై దాడిచేసి పేకాడుతున్న ముగ్గురిని అరెస్టు చేయగా, ఇద్దరు పరారయ్యారని ఎస్సై మురళి తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో పేకాట స్థావరంపై దాడిచేసినట్లు పేర్కొన్నారు. ఐదుగురు పేకాడుతుండగా పోలీసులు దాడి చేయగా ఇద్దరు పరారయ్యారు. మిగిలిన ముగ్గురిని పోలీసులు పట్టుకొని, వారి వద్ద ఉన్న రూ.2850 నగదు, మూడు బైక్లు, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. బాన్సువాడ: పట్టణంలోని కోనా బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే పురుషోత్తం అనే ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్న తారాచంద్కు పురుషోత్తంకు మధ్య శనివారం గొడవ జరిగింది. తారాచంద్ తలపై పురుషోత్తం వాటర్ బాటిల్తో కొట్టగా ఆయనకు తీవ్ర గాయమైంది. దీంతో తారాచంద్ బాన్సువాడ పోలీస్టేషన్లో పురుషోత్తంపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అలాగే తారాచంద్ తనను ఇష్టం వచ్చినట్లు దూషించడని పురుషోత్తం కూడా ఆయనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
భీమ్గల్లో పోలీస్ వాహనం ధ్వంసం
మోర్తాడ్(భీమ్గల్): భీమ్గల్లో వినాయక నిమజ్జనం సందర్బంగా పోలీసులు బందోబస్తు నిర్వహించగా తమ వినోదానికి అడ్డు చెప్పారనే కక్షతో ముగ్గురు యువకులు పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వి అద్దాలను పగులగొట్టారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకున్న ముగ్గురు యువకులు ఆదివారం ఉదయం భీమ్గల్ పోలీసుల వాహనంపై రాళ్లు రువ్వారు. ఈ విషయమై ఎస్సై సందీప్ మాట్లాడుతూ.. తమ వాహనంపై రాళ్లతో దాడి చేసి తమ విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1996–97 విద్యార్థులు ఆదివారం స్థానిక వీరభద్ర ఫంక్షన్హాల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులంతా 28 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు.ఒకరినొకరు ఆ ప్యాయంగా పలుకరించుకుంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు.అనంతరం తమకు చదువు చెప్పి న ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించి వారి ఆశీ ర్వాదం పొందారు. వచ్చే ఏడాది కుటుంబీకులతో క లిసి సమ్మేళనం నిర్వహించాలని తీర్మానించుకున్నా రు. పాఠశాల అభివృద్ధికి సైతం కృషిచేస్తామన్నారు. జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007–08 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం ‘పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం’ నిర్వహించారు. మిత్రులంతా ఏళ్ల త ర్వాత కలుసుకోవడంతో ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆనందంగా గడిపారు. ఆనాటి ఉపాధ్యాయులను సత్కరించారు. అనంతరం సాంస్కృతిక కార్యకమ్రాలు, వింధులతో ఉత్సాహంగా గడిపారు. -
పశువైద్యశాలలో మందుల కొరత
మద్నూర్(జుక్కల్): మద్నూర్ ఉమ్మడి మండలంలోని పశువైద్యశాలలో మందుల కొరత వేధిస్తోంది.పశువులకు గాయాలైన.. జ్వరం వచ్చిన కనీసం మందులు, టీకాలు లేకుండా పశువైద్యశాలలు కొనసాగుతున్నాయని పశుపోషకులు ఆందోళన చెందుతున్నారు. మద్నూర్, మేనూర్, డోంగ్లీలో పశువైద్యశాలలు ఉన్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు పశువైద్యశాలలను పట్టించుకోకపోవడంతో గ్రామాల్లో మూగజీవాలకు వైద్యం అందడం లేదని పశుపోషకులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం పశువులు వ్యాధుల బారిన పడి మృతిచెందుతున్నాయి. దీంతో పాటు పశువైద్యశాలల్లో పూర్తి స్థాయిలో వైద్యులు, సిబ్బంది లేరు.ఈ ఆస్పత్రులకు ఉన్నతాధికారులు మందులు సక్రమంగా సరఫరా చేయకపోవడం సమస్యగా మారింది. లంపి స్కిన్ వ్యాధితో రైతుల ఆందోళన ప్రస్తుతం దూడలకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో పశుపోషకులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. వైద్య కోసం పశువైద్యశాలకు వెళ్తే అక్కడ మందులు లేవని సిబ్బంది చెబుతున్నారని పశుషోకులు వాపోతున్నారు. దీంతో సరిహద్దున ఉన్న దెగ్లూర్కు దూడలను తరలించి వైద్యం చేయిస్తున్నారు. గొర్రెలు, మేకలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నట్టల నివారణ మందు వేసేవారని గత రెండు సంవత్సరాలుగా వేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువైద్య అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పశువులకు మందులు అందుబాటులో ఉంచాలని, గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు అందించాలని పశుపోషకులు కోరుతున్నారు. ఈ విషయమై మద్నూర్ వెటర్నరీ అసిస్టెంట్ సునీతను వివరణ కోరగా మద్నూర్ పశువైద్యశాలలో మందులు లేక కొంత ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్నతాధికారుల నుంచి పశువులకు మందులు సరఫరా కావడం లేదు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలియజేశాం. లంపి స్కిన్ వ్యాధితో పశువులను పశుపోషకులు తీసుకువస్తున్నారు. గొర్రెలకు, మేకలకు వేసే నట్టల నివారణ మందులు ఇంకా రాలేదు. మద్నూర్లోని పశువైద్యశాల మద్నూర్ పశువైద్యశాలలో పశువులకు మందులు అందుబాటులో ఉండటం లేదు. రెండు దూడలకు లంపి స్కిన్ వ్యాధి సోకడంతో మద్నూర్ పశువైద్యశాలకు తీసుకెళ్లాం. అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పారు. దీంతో చేసేదేమీ లేక దేగ్లూర్ నుంచి మందులు తీసుకొచ్చి వేశాం. – శ్యామ్, పశుపోషకుడు, మద్నూర్ సరఫరా చేయని అధికారులు గొర్రెలు, మేకలు, దూడలకు అందని టీకాలు బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి మద్నూర్ ఉమ్మడి మండలంలో ఇబ్బందులు పడుతున్న పశుపోషకులు -
చంద్రగ్రహణంతో ఆలయాల మూసివేత
ఎల్లారెడ్డిరూరల్/తాడ్వాయి/భిక్కనూరు/మాచారెడ్డి/ దోమకొండ: జిల్లాలోని పలు ఆలయాలను ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మూసివేశారు. ఈసందర్భంగా ఆలయాల కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సోమవారం ఆలయాలను సంప్రోక్షణ చేసిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని పేర్కొన్నారు. భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి, దోమకొండలోని చాముండేశ్వరి, తాడ్వాయిలోని శబరిమాత , ఎల్లారెడ్డిలో సాయిబాబా, నీలకంఠేశ్వరాలయాలను మూసివేశారు. భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం.. -
రహదారికి తాత్కాలిక మరమ్మతులు
నిజాంసాగర్(జుక్కల్): ఎల్లారెడ్డి– బాన్సువాడ ప్రధాన రహదారికి ఆదివారం తాత్కాలిక మరమ్మతు పనులు ప్రారంభించారు. ‘మరమ్మతులకు నోచుకొని రహదారి’ అని ఆదివారం ప్రచురితమైన కథనానికి ఆర్ఆండ్బీ అధికారులు స్పందించారు. తుంకిపల్లితండా వద్ద రహదారి మధ్యలో గుంతను పూడ్చి వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. అలాగే బొగ్గుగుడిసె చౌరస్తా వద్ద వరద ప్రవాహానికి కోతకు గురైన రహదారికి మట్టి, మొరం వేసి తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నారు. ఈమరమ్మతులు పూర్తయితే బస్సు సర్వీసులను పునరుద్ధరించున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మద్నూర్(జుక్కల్): డోంగ్లీ–లింబుర్ ప్రధాన రహదారిపై గల ముళ్లపొదలను ఆర్అండ్బీ అధికారులు ఆదివారం జేసీబీతో తొలగించారు. ఈ నెల 2న ‘రోడ్డును కమ్మేసినా కనపడటం లేదా?’ అని ప్రచురితమైన వార్తకు ఆర్అండ్బీ అధికారులు స్పందించారు. డోంగ్లీ మండల కేంద్రం నుంచి లింబుర్ రహదారిపై ముళ్లపోదలు బాగా పెరిగిపోయి రోడ్డును కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం అధికారులు రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలను తొలగించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పొల్కంపేట గ్రామంలో ఆదివారం రామకృష్ణ మఠం గ్రామశ్రీ సేవా వారి ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి అనూహ్య స్పందన లభించినట్లు మండల వైద్యాధికారి రాంబాయి తెలిపారు. ముందుగా ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి ఆరోగ్య పరీక్షలు చేసుకొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన 252 మందికి పరీక్షలు చేసి మందులు అందజేసినట్లు తెలిపారు. పలువురికి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు.సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, తహసీల్దార్ సురేష్, ఎంపీవో మలహరి, కార్యదర్శి అశ్వక్, వైద్య సిబ్బంది గణేష్, రజినీ, ఆశావర్కర్లు తదితరులున్నారు. -
బిచ్కుందకు 13 మంది జీపీవోలు
బిచ్కుంద(జుక్కల్): రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పాలనాధికారులను నియమించింది. బిచ్కుంద మండలంలో 23 గ్రామ పంచాయతీలు, ఒక మున్సిపాలిటీ ఉంది. 13 నుంచి 15 మంది జీపీవోలు వస్తున్నట్లు తెలిసింది. అన్ని రకాల సర్టిఫికెట్ల దరఖాస్తుల పరిశీలన, రెవెన్యూ రికార్డులు, భూ సమస్యలు, పహాణీలు గతంలోలాగే గ్రామంలో అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరానికి వారు కృషి చేయనున్నారు. తిరిగి జీపీవోలు రాకతో తహసీల్ కార్యాలయం సిబ్బంది, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయం దోమకొండలోని చాముండేశ్వరి ఆలయం -
శాశ్వత పరిష్కారం చూపేదెన్నడో..
● లింగంపేట మండలంలో వరదలు వస్తే రాకపోకలు బంద్ ● ధ్వంసమైన వంతెనలకు పూర్తి స్థాయి మరమ్మతులు చేపట్టాలని వినతి లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలం నాగారం కాసులకత్తె వంతెన గత మూడేళ్లుగా వర్షాకాలంలో కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోతుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. వంతెన, రోడ్డు కొట్టుకుపోవడంతో నాగారం, బాయంపల్లి, కొర్పోల్, బాణాపూర్, కిషన్నాయక్తండా, లక్ష్మన్నాయక్తండా, లింగంపల్లి, లింగంపేట, నల్లమడుగు, ముస్తాపూర్, తదితర గ్రామాలు, తండాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తాత్కాలికంగా మొరం వేసి రాకపోకలు పునరుద్ధరిస్తున్నారు. వంతెనకు ఇరువైపులా రోడ్డు వేసి సపోర్టుగా ప్రహరీ కట్టించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే పొల్కంపేట శివారులో బండ్రేవ్ ఒర్రె వద్ద, బాణాపూర్, గాంధారి రోడ్డులో మెంగారం ఊర చెరువు కింద నిర్మించిన లోలెవల్ బ్రిడ్జ్లు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ధ్వంసమయ్యాయి. దాంతో లింగంపేట పొల్కంపేట, లింగంపేట గాంధారి రూట్లో వర్షాలు వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ బ్రిడ్జ్లు ఎత్తు పెంచాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సదరు వంతెనలకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ప్రమాదకరంగా కల్వర్టు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ఉత్తునూర్ గ్రామ శివారులో ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు పూర్తిగా కొట్టుకు పోవడంతో రోడ్డు కోతకు గురైంది. ప్రతి రోజు ఉత్తునూర్ గ్రామ ప్రజలే కాకుండా యాచారం ప్రజలు, కొందరు నిజామాబాద్ వెళ్లే వారు ఈ రోడ్డు గుండా ప్రయాణం సాగిస్తుంటారు. రాత్రింబవళ్లు ఈ దారి గుండా రాకపోకలు సాగుతుంటాయి. ఈ కల్వర్టు పూర్తి దెబ్బతినడంతో ప్రయాణికులు ఈ దారి గుండా రావాలంటే జంకుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదకరంగా మారిన కల్వర్టు వద్ద సంబంధిత శాఖ అధికారులు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికి దృష్టి సారించలేదు. దీంతో గ్రామస్తులే ఆరెంజ్ కలర్లో ఉన్న దుస్తుల పేలికలను రోడ్డుకు అడ్డంగా కట్టారు. దీంతో ఈ దారి గుండా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికై న సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా మారిన కల్వర్టుకు వెంటనే మరమ్మతులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆపన్నహస్తం అందించండి
దోమకొండ: నిరుపేద కుటుంబానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స కోసం సుమారు రూ.10 లక్షలు వరకు అవుతాయని వైద్యులు పే ర్కొన్నారు. దీంతో బాధిత కుటుంబీకులు దాతల చేయూత కోసం ఎదురుచూస్తున్నా రు. దోమకొండకు చెందిన బలవత్రి శ్రీధర్తోపాటు మరో ఇద్దరు వ్యక్తులు కలిసి శనివారం రాత్రి రామారెడ్డి నుంచి దోమకొండకు ట్రాక్టర్ ట్రాలీని తీసుకువస్తున్నారు. కా మారెడ్డి పట్టణ శివారులోని క్యాసంపల్లి వద్ద ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వ చ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీధర్ తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సురారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. కాగా శ్రీధర్కు బ్రెయిన్ సర్జరీ చేయాలని, ఇందుకు దాదాపు రూ. 10లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో తాము పేద కుటుంబానికి చెందిన వారిమని, తమకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టుకునే స్తోమత లేదని శ్రీధర్ తండ్రి శ్రీనివాస్, తల్లి వెంకటలక్ష్మి ఆవేదన చెందుతున్నారు. తమ కుమారుడికి దాతలు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. సహాయం చేయవలసిన దాతలు శ్రీధర్ అన్న శ్రీకాంత్ ఫోన్నెంబర్ 7013951924కు ఫోన్పే, లేదా గూగుల్ పే చేసి సహాయం అందించాలని కోరారు. ● రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ దోమకొండకు చెందిన శ్రీధర్ ● బ్రెయిన్ సర్జరీ కోసం రూ.10లక్షలు అవసరం ● దాతల కోసం బాధిత కుటుంబీకుల ఎదురుచూపులు -
మరో ఐదేళ్లు అధికారంలో మేమే..
గట్టుమీద పచ్చదనం బాన్సువాడ రూరల్: ఇటీవల కురిసిన భారీవర్షాలతో పంటల చీడపీడలు దూరమయ్యాయి. కొన్నిరోజులుగా ఎండలు కాస్తుండటంతో మండలంలోని గట్టుమీది గ్రామాల్లో ఆరుతడి పంటలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. మండలంలోని కోనాపూర్, హన్మాజీపేట్, సంగోజీపేట్, కాద్లాపూర్ తదితర గ్రామాలు, తండాల్లో సాగవుతున్న కంది, మొక్కజొన్న, సోయా, పత్తిపంటలు ఆశాజనకంగా ఉన్నాయి. గట్టుమీది గ్రామ శివార్లలో కనుచూపు మేరలో పచ్చదనమే కనిపిస్తూ ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. ● టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వర్ని: ప్రస్తుత పదవీకాలంతోపాటు రాబోయే మరో ఐదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలోని సీతారామ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ నెరవేరుస్తున్నామని, రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ దోపిడీ రాజ్యానికి ప్రజలు చరమగీతం పాడారని, రాష్ట్రంలో రేవంత్రెడ్డి ప్రజాపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. అన్నివర్గాల వారికి సమన్యాయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని, ఇదే స్ఫూర్తితో మరో ఐదేళ్లపాటు పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. -
రిజర్వేషన్లకు చట్టబద్ధత తర్వాతే ఎన్నికలకు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించిన తర్వాతే ఎన్నికలకు వెళతామని టీపీ సీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. ఆలస్యమైనా సరే రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధిస్తామన్నారు. బీసీలకు అన్యా యం చేస్తున్న బీజేపీ బండారాన్ని బయటపెట్టి, రిజర్వేషన్లకు అడ్డుతగిలేవారి భరతం పట్టేందుకు ఈనెల 15న కామారెడ్డి లో రెండు లక్షల మందితో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకోసం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి వేదికగా చేసిన డిక్లరేషన్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న వాగ్దానం మేరకు తాము అధికారంలోకి రాగానే శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసి, బీసీల జనాభా లెక్కలు తేల్చామన్నారు. దీని ప్రకారం బీసీలు 56.33 శాతం మంది ఉన్నట్లు తేలిందని, అందుకు అనుగుణంగా స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం సాధించిందని పేర్కొన్నారు. అయితే ఆ బిల్లును గవర్నర్ కేంద్రానికి పంపితే అక్కడ చట్టం చేయడానికి సహకరించాల్సిన బండి సంజయ్, కిషన్రెడ్డి అడ్డు తగులుతున్నారన్నారు. అమలు చేసి తీరుతాం..‘కిషన్రెడ్డి, రాంచందర్రావులు బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడితే అర్థం ఉంటుంది కానీ, బండి సంజయ్ మున్నూ రు కాపు.. అయినా దేశ్ముఖ్లా వ్యవహరిస్తున్నారు’అని మహేశ్గౌడ్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్రెడ్డి.. రెడ్డి అయినా బీసీల కోసం కష్టపడుతున్నారన్నారు. ధర్మపురి అర్వింద్ బీసీ ల గురించి మాట్లాడడం లేదని, ఈటల రాజేందర్ ముఖం చాటేశారని విమ ర్శించారు. బండికి పౌరుషం ఉంటే మోదీ, అమిత్షాలను ఒప్పించి రెండు బిల్లులు, ఒక ఆర్డినెన్స్కు చట్టబద్ధత ఇప్పించాలని డిమాండ్ చేశారు.బండి సంజయ్, కిషన్రెడ్డిలు ఎన్నికల్లో దేవుడి పేరుతో ఓట్లడుక్కునే బిచ్చగాళ్ల ని ఆయన విమర్శించారు.ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎంపీ సురేశ్షెట్కార్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, మదన్ మోహన్రావు, తోట లక్ష్మీకాంతరావు, భూపతిరెడ్డి, ఆది శ్రీని వాస్, వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు. -
‘కామారెడ్డి సభ జనసంద్రం అవుతుంది.. అది కేంద్రం చూస్తుంది’
కామారెడ్డి జిల్లా : ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో నిర్వహించనున్న బీసీ సభను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పిలుపునిచ్చారు. రెండు లక్షల మందితో బీసీ సభను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభను కామారెడ్డిలో నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఆ సభకు పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యలను టీపీసీసీ ఆహ్వానించనుంది. దీనిలో భాగంగా ఈరోజు(ఆదివారం, సెప్టెంబర్ 7వ తేదీ) కామారెడ్డిలో ముఖ్య నాయకులతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, శ్రీహరి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. దీనిలో భాగంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ‘ కామారెడ్డిలో భారీ వర్షం పడి చాలా నష్టం జరిగింది. దేశంలోని ఏ వర్గం వారు ఎంత ఉంటే అంత శాతం ఫలాలు పొందాలి. అదే నినాదంతో సీఎం రేవంత్రెడ్డి పనిచేస్తున్నారు. అందుకే అసెంబ్లీలో బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట అన్ని వర్గాల వారు మద్దతు తెలుపుతున్నారు. బండి సంజయ్, కిషన్రెడ్డిల భరతం పట్టడానికి కామారెడ్డిలో బీసీ సభను పెడుతున్నాం. బండి సంజయ్ లేచిన మొదలు ఆలయాలు చుట్టూ తిరుగుతూ ఓట్లు అడుక్కుంటున్నారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీసీ బిల్లును సాధించుకుంటాం. 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటాం. బండి సంజయ్ ఒక దేశ్ముఖ్ల వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్ సెక్యూరిటీ లేకుండా తిరుగు.. నేను సెక్యూరిటీ లేకుండా తిరిగేందుకు సిద్ధంగా ఉన్నా. ఈనెల 15న జరిగే సభ ద్వారా బీజేపీ దొంగ ఆట కట్టిస్తాం. అరవింద్ ఒక్కసారి అయినా బీసీల గురించి మాట్లాడలేదు. బండి సంజయ్.. బీసీ బిల్లును మోదీ కాళలు పట్టుకుని ఆమోదింపజేసే సత్తా ఉందా?, మోదీ టెక్నికల్గా బీసీ.. కానీ బీసీలపై ప్రేమ లేదు. ఈనెల 15వ తేదీన కామారెడ్డి సభ జనసంద్రం అవుతుంది.. అది కేంద్రం చూస్తుంది. బీసీ జీవితాలను మలుపు తిప్పే సభ కామారెడ్డిలో జరగబోతుంది’ అని పేర్కొన్నారు. -
గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు
●బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి బాన్సువాడ : బాన్సువాడలో శనివారం రాత్రి ప్రారంభమయ్యే గణేశ్ నిమజ్జనానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ పోలీస్ స్టేషన్లో పోలీసు సిబ్బందికి విధులు కేటాయించారు. నిమజ్జనం సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు బాన్సువాడ డివిజన్లో గత ఏడాది 1025 వినాయక మండపాలు ఉంటే ఈ ఏడాది 1382 మండపాలను ఏర్పాటు చేశారని అన్నారు. బాన్సు వాడలో పాత బాన్సువాడ, కొత్త బాన్సువాడలో ఒకే రోజు శోభాయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో తన పర్యవేక్షణలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 60 సిబ్బందికి విధులు కేటాయించామని అన్నారు. వినాయక నిమజ్జనం ప్రశాంత వాతవారణంలో కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ, బిచ్కుంద సీఐలు అశోక్, అనిల్కుమార్లు ఉన్నారు. గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూట్ల పరిశీలన ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర రూట్లను శనివారం అధికారులు పరిశీలించారు. పట్టణంలోని డెయిలీమార్కెట్, గాంధీచౌక్, పెద్దమసీదు ప్రాంతాలలో గణేశ్ నిమజ్జన రూట్లను ఎస్సై మహేష్, విద్యుత్ శాఖ డీఈ విజయసారథిలు పరిశీలించారు. వినాయక విగ్రహాలకు విద్యుత్ తీగలు అడ్డుగా ఉన్న ప్రదేశాలలో నూతనంగా విద్యుత్ స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● మరో ఇద్దరికి గాయాలు బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్ చౌరస్తాలోగల 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మెండోరా ఎస్సై జాదవ్ సుహాసిని తెలిపిన వివరాలు ఇలా.. ని ర్మల్ జిల్లా సోన్ మండలం గాంధీనగర్కు చెందిన సాస్కిన్ అభినాష్(25) శుక్రవారం మధ్యాహ్నం బైక్పై తన బంధువుల పిల్లలైన రుసునకంటే గణేష్, ఆంబ్లే లోకేష్లతో కలిసి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగువన గోదావరిలో చేపలు వేటాడడానికి వచ్చారు. వేట ముగిసిన తర్వాత అర్ధరాత్రి వేళ బైక్పై ఇంటికి బయలుదేరారు. పోచంపాడ్ చౌరస్తాలోగల హైవేపై వీరి బైక్ను ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు కిందపడ్డారు. ఈ ఘటనలో బైక్పై మధ్యలో కుర్చున్న అభినాష్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా నిర్మల్జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. స్వగ్రామం చేరిన అన్వేష్రెడ్డి మృతదేహం బాల్కొండ: మెండోరా మండల కేంద్రానికి చెందిన సామ అన్వేష్రెడ్డి(30) పది రోజుల క్రితం గుండెపోటుతో ఐర్లాండ్లో మృతి చెందాడు. ఆయన మృతదేహం శనివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. కుటుంబసభ్యుల రోదనలు మధ్యే అంత్యక్రియలను నిర్వహించారు. అన్వేష్రెడ్డి నాలుగు నెలల క్రితమే సెలవుపై వచ్చి వివాహం చేసుకుని ఇటీవల వెళ్లాడు. -
గ్రామాల్లో వైద్య శిబిరాలు
భిక్కనూరు/సదాశివనగర్/బాన్సువాడ రూరల్/రాజంపేట : జిల్లాలోని పలు చోట్ల వైద్యశిబిరాలు నిర్వహించారు. భిక్కనూరు మండలకేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో భిక్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను శనివారం నిర్వహించారు. వైద్యురాలు యెమిమా, ఎంపీహెచ్ఈవో వెంకటరమణ పరీక్షలు నిర్వహించారు. సదాశివనగర్ మోడల్ స్కూల్ వసతి గృహంలో నిర్వహించిన వైద్యశిబిరంలో వైద్యాధికారిణి ఆస్మా అప్షిన్ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.బాన్సువాడ మండలం బోర్లంక్యాంపులో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన ఆరోగ్య శిబిరంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఇమ్రాన్ వైద్య సిబ్బందితో కలిసి విద్యార్థులను పరీక్షించారు. చాలామంది విద్యార్థులు జ్వరాల బారిన పడటంతో రక్తపరీక్షలు చేశారు. హన్మాజీపేట్ పీహెచ్సీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కావాల్సిన మందులు అందజేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆహ్వానం మేరకు రాజంపేట మండలం నడిమి తండా, ఎల్లాపూర్ తండాల్లో రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్యశిబిరంలో 293 మంది వైద్యపరీక్షలు చేశారు. వైద్య శిబిరాల్లో వారికి కావాల్సిన మందులు అందజేశారు.రామకృష్ణ మఠం వైద్యులు శుష్మిత్, కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు తేజస్విని, రామకృష్ణ మఠం సభ్యులు ఉన్నారు. -
ట్రాక్టర్ను ఢీకొన్న లారీ
● నలుగురికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: గణేష్ శోభాయాత్ర కోసం తీసుకువెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని లారీ ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద ప్రధా న రోడ్డుపై శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. రామారెడ్డి నుంచి ట్రాక్టర్ ట్రాలీని కొంద రు యువకులు కలిసి దోమకొండకు తీసుకువెళ్తున్నారు. ఈ సమయంలో నలుగురు యువకులు ట్రాక్టర్ ఇంజిన్పై కూర్చుని ప్రయాణిస్తున్నారు. క్యాసంపల్లి వద్ద వారి ట్రాక్టర్ను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దోమకొండ కు చెందిన సాయికుమార్, శ్రీధర్, రాజయ్య, శివకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసు లు వారిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. గా యపడిన వారిలో శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్కు తరలించారు. -
మంత్రి సీతక్కకు సన్మానం
కామారెడ్డి టౌన్: పంచాయతీరాజ్, శిశుసంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి అనసూయ(సీతక్క)ను జిల్లా కాంగ్రెస్, లంబాడా హక్కుల పోరాట సమితి నాయకులు శనివారం ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ నుంచి సీతక్క నాగ్పూర్కు వెళ్తుండగా మార్గమధ్యలో టేక్రియాల్ బైపాస్ వద్ద మంత్రికి స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్, జిల్లా క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ నౌసిలాల్ నాయక్, నాయకులు శంకర్ నాయక్, విజయ్ నాయక్, రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెద్దఎడ్గి లడ్డూ @ రూ.1.51 లక్షలు నిజాంసాగర్(జుక్కల్)/సదాశివనగర్: జుక్కల్ మండలం పెద్దఎడ్గి గ్రామంలో ముదిరాజ్ గణేశ్ మండపం వద్ద వినాయక లడ్డూవేలం పాట శనివారం నిర్వహించారు. రూ.1.51 లక్షలకు లడ్డూను గ్రామానికి చెందిన సుంకరి అశోక్ దక్కించుకున్నారు. అశోక్ ను సన్మానించారు. సదాశివనగర్ మండలం కుప్రియాల్లో శివాజీ యువసేన యూత్ క్లబ్ గణేశ్ లడ్డూను వేలం పాట నిర్వహించగా రూ. 63వేలు పలికిట్లు యూత్ సభ్యులు పేర్కొన్నారు. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం ● ఆలయాల మూసివేత కామారెడ్డి అర్బన్/నస్రుల్లాబాద్/భిక్కనూర్: చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఉద యం నుంచి ఆలయాలను మూసివేయనున్న ట్లు కమిటీల ప్రతినిధులు తెలిపారు. సంప్రోక్ష ణ, దేవతామూర్తులకు అభిషేకం అనంతరం సోమవారం ఉదయం నుంచి భక్తులకు దర్శ నం ఉంటుందని తెలిపారు. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామంలోని షిర్డీ సాయి ఆలయా న్ని మధ్యాహ్నం 12.30 గంటలకు మూసివేస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మూసి వేయనున్నట్లు అర్చకుడు రామగిరిశర్మ తెలిపారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. గ్రహణం నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల వరకు భోజనాలు పూర్తి చేసుకోవాలని శర్మ సూచించారు. ఖలీల్వాడి: నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఓ కిరాణా దుకాణం ముందర ఒక గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు వన్ టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. సదరు కిరాణ దుకాణం వద్ద మృతదేహం పడి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే ఘటన స్థలానికి చేరుకు న్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అతడి వయస్సు సుమారు 50 నుంచి 55 ఏళ్ల మధ్య ఉంటాయని పోలీసులు పేర్కొన్నా రు. గుర్తుతెలియని వ్యక్తులు మృతుడి మెడకు బట్ట, సుతిలితో ఉరి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపినట్టు కనపడుతోందన్నారు. మృతుడు బ్లాక్ కలర్ ఫుల్ షర్ట్, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడని, అతని వద్ద ముస్లింలు ధరించే టోపీ ఉందన్నారు. ఘటనపై భగవాన్కాలనీకి చెందిన వెనిశెట్టి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి సమాచారం తెలిస్తే వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఫోన్ నంబర్ 87126 59714కు సమాచారం అందించాలన్నారు. -
తప్పని యూరియా కష్టాలు
● బారులు తీరుతున్న రైతులు ● టోకెన్లు పంపిణీ చేస్తున్న అధికారులు రామారెడ్డి: రైతుల పరిస్థితి దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా మారింది. యూరియా కొరత రైతులకు నిద్ర లేకుండా చేస్తోంది. యూరియా స్టాక్ వస్తుందనే తెలియగానే పంపిణీ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా రు. రాత్రి వేళ సైతం అక్కడే పడుకుంటున్న రైతుల కు ఓ టోకెన్ ఇచ్చి రెండు లారీల లోడ్లు వచ్చిన త ర్వాత పంపిణీ చేస్తామని చెప్పి పంపుతున్నారు. శనివారం రామారెడ్డి సొసైటీ భవనం వద్ద యూరియా పంపిణీ చేశారు. ఉదయం నుంచి రైతులు యూ రియా కోసం బారులు తీరారు. 880 బస్తాలను పంపిణీ చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. టోకెన్లను అమ్ముకుంటున్నారు పట్టా పాస్పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్ చూపిస్తే ఓ టోకెన్ ఇస్తున్నారు. ఒక్క టోకెన్కు ఒక బస్తా యూరియా ఇస్తున్నారు. కొంతమంది తమకు అవసరం లేకున్నా క్యూ లైన్లో నిల్చుని టోకెన్లు పొంది రూ.100 ఒకటి చొప్పున టోకెన్ను రైతులకు అమ్ముకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో రూ.100 పెట్టడానికి కూడా రైతులు వెనక్కి రావడం లేదు. దీంతో క్యూలైన్లలో దళారుల దందా యథేచ్ఛగా సాగుతోంది. -
కామారెడ్డిలో బీసీ సంబరాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బీసీ డిక్లరేషన్ ప్రకటించి న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలోనే బీసీ రిజర్వేషన్ సంబరాలు నిర్వహించా లని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15న బీసీలతో బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లోని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క చర్చించారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కామారెడ్డిలో ఆదివారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 15న నిర్వహించతలపెట్టిన సభపై చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2023 నవంబర్ 10న కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడి యం వేదికగా బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్రెడ్డి నామినేషన్ వే సిన అనంతరం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పా టు చేసిన సభకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ని ర్వహించిన సభలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరా మయ్యతోపాటు రేవంత్రెడ్డి, ప్రొఫెసర్ కోదండ రాం, సీపీఐ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లతోపాటు పలు హామీలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో బీసీ రిజర్వేషన్లను అమ లు చేయడానికి ఇటీవల అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కు పంపిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు అమలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పేర్కొంటోంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకునేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో బహిరంగ సభ ద్వారా సంబరా లు జరుపుకునేందుకు ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. రిజర్వేషన్ల అంశంతో బీసీలకు దగ్గరయ్యేలా.. బీసీ డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మాణించిన విషయాన్ని అనుకూలంగా మల్చుకుని బీసీ వర్గాల్లో బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీసీ రిజర్వషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వేదికగా కూడా భారీ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. బీసీలను దగ్గర చేసుకునే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మరింతగా ఆ వర్గాల్లోకి తీసుకువెళ్లేందుకు బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. సభకు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ లేదా ప్రియాంక గాంధీని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్తోపాటు రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకత్వమంతా సభకు హాజరుకానున్నారు. నేడు కామారెడ్డిలో సన్నాహక సమావేశం బీసీ రిజర్వేషన్ల సంబరాల సభకు సంబంధించి ఉమ్మడి జిల్లా నేతలతో ఆదివారం కామారెడ్డిలో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్తోపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలంతా హాజరుకానున్నారు. సభ సక్సెస్ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సమావేశంలో చర్చించనున్నారు. సభ ఏర్పాట్లు, జనసమీకరణపై చర్చించి ఎవరు ఏ పని చేయాలన్నదానిపై దిశానిర్దేశం చేస్తారు.కామారెడ్డిలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదిక నుంచి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే వేదికపైనుంచి బీసీ సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఈనెల 15వ తేదీన బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.ఈ నెల 15న కాంగ్రెస్ సభ ! బీసీ డిక్లరేషన్ ప్రకటించిన వేదికపైనే.. జాతీయస్థాయి నాయకులు హాజరయ్యే అవకాశం నేడు ఉమ్మడి జిల్లా నేతలతో సన్నాహక సమావేశం -
కేసీఆర్ అవినీతి బయటపడుతుంది
నిజాంసాగర్(జుక్కల్): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అవినీతి సీబీఐ విచారణతో బయటపడుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే మండల కేంద్రంలో శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలా వాడుకుందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి బయటపడుతుందనే విచారణ వద్దంటూ బీఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, ఉమ్మడి మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, రవీందర్రెడ్డి, నాయకులు ప్రజాపండరి, ఇఫ్తేకర్ దొర, సాయిలు, బాల్సాయిలు తదితరులు పాల్గొన్నారు. లింగంపేట వాసికి ‘గణపతి’ అవార్డు లింగంపేట(ఎల్లారెడ్డి): పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారికి జ్ఞాన వికాస భారతి క్రీడా సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అందించే గణపతి అవార్డు లింగంపేట మండల కేంద్రానికి చెందిన యువ యూత్ అధ్యక్షుడు బొల్లు శ్రీకాంత్కు దక్కింది. హైదరాబాద్లోని ఎల్బీనగర్ రాక్టవర్ కాలనీలో శనివారం అవార్డును అందజేయగా శ్రీకాంత్ అందుకున్నారు. శ్రీకాంత్ గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా మట్టి గణపతులు తయారు చేసి ఇంటింటికి వెళ్లి వితరణ చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే రంగురంగుల గణపతులు వాడడం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిళ్లుతుందని గ్రామాల్లో అవగాహన కల్పి స్తున్న శ్రీకాంత్కు అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డును రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు కేవీఎన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సంస్థ బాధ్యులు గోవర్ధన్చారి, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. -
నష్టాన్ని అంచనా వేయండి
● ఈ నెల 12లోగా నివేదికలు సమర్పించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం కామారెడ్డి క్రైం: భారీ వర్షాల కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ నెల 12వ తేదీలోగా నివేదికలు అందజేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో శనివారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో పలు సూచనలు చేశారు. ఈ నెల 4న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరదల నియంత్రణకు శాశ్వత పరిష్కారాలను చూపాలని ఆదేశించారని తెలిపారు. భారీ వర్షాల కారణంగా భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని ఆదేశించారని అన్నారు. శాశ్వత పరిష్కారం కోసం పట్టణాలు, గ్రామాలు, కాలనీల్లో విచారణ చేపట్టి ఆక్రమణలను తొలగించాలని సూచించారు. చేపట్టాల్సిన పనులకు మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. డివిజన్ స్థాయిలో కమిటీలు డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవోల నేతృత్వంలో పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, మండల స్థాయి అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులతో కూడిన కమిటీలను వేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కమిటీ సభ్యులు అయా డివిజన్లలో పర్యటించి అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్టులు, రహదారులు, పంట పొలాలు, గృహాలు, వరద బాధిత గ్రామాలు, కాలనీలను సందర్శిస్తారని తెలిపారు. అధిక వర్షాలు కురిసిన సమయంలో ముంపు, వనరులు దెబ్బతినడానికి కారణాలను తెలుసుకుంటారని పేర్కొన్నారు. భవిష్యత్లో అధిక వర్షాలు వచ్చినా కూడా తీవ్ర నష్టం సంభవించకుండా శాసీ్త్రయ సలహాలు, సూచనలు అందించాలన్నారు. అదనంగా కల్వర్టులు, చెక్డ్యామ్లు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. ఆక్రమణలను స్వాధీనం చేసుకోవడం, తొలగించడం, నివేదించడం చేయాలన్నారు. జిల్లా స్థాయి ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఎస్పీ, అదనపు కలెక్టర్, నీటిపారుదల శాఖ సీఈ ఉంటారని తెలిపారు. ఇసుక మేటల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను అందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 1,600 ఇళ్లు దెబ్బతిన్నాయని, వాటిని పరిశీలించి అర్హత గలవారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం నివేదించాలని సూచించారు. టెలీ కాన్ఫరెనన్స్లో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు వీణ, పార్థసింహారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
● 300 మందితో పటిష్ట బందోబస్తు ● 120 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ● ఎస్పీ రాజేష్ చంద్రకామారెడ్డి క్రైం : కామారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా, సురక్షితంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో శోభాయాత్ర జరిగే మార్గాన్ని పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. వినాయక ప్రతిమలు వెళ్లే దారి వెంబడి 300 మంది పోలీసు అధికారులు, సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు. 120 సీసీ కెమెరాలు, 2 డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు అధికారులకు సూచించారు. రూట్ మ్యాప్ ప్రకారం శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా చూడాలన్నారు. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా బారికేడింగ్, ట్రాఫిక్ డైవర్షన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలిగే ఘటనలకు చోటు లేకుండా సమన్వయంతో, సహనంతో పనిచేయాలని సూచించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, నిమజ్జన ఘాట్లు, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద అదనపు బందోబస్తు అమలు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ నర్సింహా రెడ్డి, ఏఎస్పీ చైతన్యారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
సీఎం పర్యటనతో ఒరిగిందేమీ లేదు
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాకు సీఎం వస్తున్నాడంటే ఎంతో మేలు జరుగుతుందని భావించామని, కానీ ఒక్క పైసా మంజూరు చేయకుండా సీఎం పర్యటన ముగియడం విచారకరమని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డిలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్బోర్డు, కౌండిన్య కాలనీ, బతుకమ్మ కుంట, టీచర్స్ కాలనీలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వరదలతో సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు నామమాత్రపు పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. సీఎం వచ్చినపుడు తక్షణమే నిధులు మంజూరు చేయకుండా, 15 రోజులకు సమీక్షిస్తానని చెప్పడమంటే ప్రజల్ని వంచించడమేనన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు, ఇసుక మేటలు వేసిన పొలాలకు ఎకరాకు రూ.50 వేలు, దెబ్బతిన్న పంటలకు ఎకరాకు కనీసం రూ.25 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. -
తీరని యూరియా కష్టాలు
● వరుసలో ఉన్నా దొరకని పరిస్థితి ● సొసైటీల వద్ద జాగారం చేస్తున్న రైతులు ● ఎవరికీ పట్టని రైతుల గోడుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అవసరమైన సమయంలో యూరియా కొరత రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఎరువుల కోసం బారులు తీరుతున్న రైతులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల ముందు రోజు రాత్రి నుంచే సొసైటీల వద్దకు చేరుకుని అక్కడే జాగారం చేస్తున్నారు. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్లు కనపడుతున్నాయి. ముందుగా వచ్చి వరుసలో నిల్చున్న వారికి ఎరువుల బస్తాలు దొరుకుతుండగా, వెనకాల ఉన్న వారు ఆఖరుకు స్టాక్ అయిపోయిందనడంతో నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. శుక్రవారం ఎల్లారెడ్డిలో యూరియా కోసం రైతులు పొద్దున్నుంచే వరుస కట్టారు. పాసుపుస్తకాలను వరుసలో పెట్టారు. బుధవారం మహ్మద్నగర్ మండల కేంద్రంలో, అలాగే రాజంపేట మండలం తలమడ్లలో యూరియా కోసం రైతులు వరుసకట్టారు. రామారెడ్డిలో అయితే రాత్రి రైతు వేదిక వద్ద జాగారం చేశారు. వారం రోజులుగా రాజంపేట, మాచారెడ్డి, తాడ్వాయి, భిక్కనూరు, దోమకొండ, బీబీపేట తదితర మండలాల్లో రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు. జిల్లాలో 5.09 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వరి, మక్క, సోయా, పత్తి పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే మక్కకు యూరియా అధిక మోతాదులో వాడుతున్నారు. దీంతో యూరియా అవసరం పెరిగింది. అవసరానికి తగ్గట్టుగా యూరి యా సరఫరా కాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి.. యూరియా సరఫరా విషయంలో అధికారుల మధ్యన సమన్వయం అవసరమని పేర్కొన్నారు. గ్రామాల వారీగా యూరియాను సరఫరా చేయడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. -
గ్యాస్ ట్యాంకర్ను ఢీకొన్న బస్సు
భిక్కనూరు: జంగంపల్లి శివారులో జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, గ్యాస్ ట్యాంకర్ను ఢీకొట్టింది. వివరాలు.. నిజామాబాద్ డిపో–1కు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం సికింద్రాబాద్ నుంచి నిజామా బాద్ వైపు వస్తోంది. జంగంపల్లి శివారులోకి రాగానే ముందున్న గ్యాస్ ట్యాంకర్ను వేగంగా వచ్చి ఢీకొట్టి అనంతరం అదుపుతప్పి రోడ్డు అవతలి వైపునకు దూసుకెళ్లింది.ఈ ఘటనలో బస్సు ముందర భాగం, ప్రవేశ ద్వారం తీవ్రంగా దెబ్బతి న్నాయి. దీంతో ప్రయాణికులు అత్యవసర ద్వారం గుండా బయటకు వచ్చారు. ఈ ప్రమాదంలో గ్యాస్ ట్యాంకర్ నుంచి గ్యాస్ లీకేజీ కాకపోవడంతోపాటు పేలకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకవేళ ట్యాంకర్ పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. -
హాజరు మెరుగు కోసమే ‘ఎఫ్ఆర్ఎస్’
● జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో యాప్ ద్వారా విద్యార్థుల హాజరు నమోదు ● హాజరును యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ఇంటర్ బోర్డు అధికారులు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని మె రుగుపర్చేందుకు అధికారులు ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నిషన్ సిస్టం)ను అమలు చేస్తున్నారు. గతంలో కళాశాలల్లో విద్యార్థుల హాజరును రిజిష్టర్లో నమోదు చేసేవారు. ప్రస్తుతం ప్రత్యేకమైన యాప్ ఎఫ్ఆర్ఎ స్ ద్వారా నమోదు చేస్తున్నారు. కొంతకాలంగా ఇంటర్ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు ఫెయిలవుతున్నారు. తరగతులకు సక్రమంగా హాజరు కాకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని గ్రహించిన ఉ న్నతాధికారులు ప్రతి ప్రభుత్వ కళాశాలలో వి ద్యార్థులకు హాజరు నమోదుకు ఎఫ్ఆర్ఎస్ను ప్రవే శపెట్టారు. ఈ క్రమంలో జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరును గత నెల 26 నుంచి ఎఫ్ఆర్ఎస్లో నమోదు చేస్తున్నారు. భారీ వర్షాలతో ఆటంకం.. ఇటీవల జిల్లాలో కురిసిన భారీవర్షాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్లో హాజరు నమోదు ప్రక్రియకు కొంత ఆటంకం కలిగింది. జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 6 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చాలామంది విద్యార్థులు కళాశాలలకు రాలేకపోతున్నారు. దీనివల్ల విద్యార్థులందరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాలేదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎఫ్ఆర్ఎస్ ప్రక్రియ పకడ్బందీగా అమలు కానుంది. నూతన హాజరు విధానం అమలులో భాగంగా కళాశాలల్లో ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల ఫొటోలను ఎఫ్ఆర్ఎస్ యాప్లో అప్లోడ్ చేసి హాజరును నమోదు చేస్తున్నారు. ఈ హాజరును రాష్ట్ర ఇంటర్బోర్డు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా విద్యార్థులు వరుసగా వారం రోజులపాటు కళాశాలకు గైర్హాజరయితే రాష్ట్ర ఇంటర్బోర్డు అధికారులు జిల్లా ఇంటర్ అధికారుల ద్వారా సంబంధిత కళాశాల అధ్యాపకులను అప్రమత్తం చేస్తారు. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని విద్యార్థుల హాజరును మాత్రమే పర్యవేక్షించడానికి ఎఫ్ఆర్ఎస్ను అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలోని ఎయిడెడ్, ప్రయివేట్ కళాశాలలకు సైతం ఈ విధానాన్ని విస్తరింపజేయనున్నారు. దీంతోపాటు రాబోయే రోజుల్లో కళాశాలల్లోని అధ్యాపకుల హాజరును పర్యవేక్షించడానికి కూడా ఎఫ్ఆర్ఎస్ను అమలు చేయనున్నారు. – షేక్ సలాం, జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి, కామారెడ్డి -
శోభాయాత్ర
ప్రారంభమైన● శోభాయాత్రను ప్రారంభించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర ● నిమజ్జనోత్సవాన్ని వీక్షించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలుకామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవ శోభాయాత్ర శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ధర్శశాల వద్ద యువజన సమాఖ్య వినాయకుడికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్రలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కలెక్టర్, ఎస్పీలు జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. నిమజ్జనోత్సవాన్ని తిలకించడానికి పట్టణవాసులతో పాటు సమీప గ్రామాల నుంచి భక్తజనం భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో సుభాష్ రోడ్, జేపీఎన్ రోడ్, సిరిసిల్ల రోడ్, మాయాబజార్, పాంచ్రస్తా, పెద్దబజార్, పాత పట్టణంలో జనంతో రద్దీగా మారింది. సుమారు 400లకు పైగా విగ్రహాలను జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠించారు. భారీ విగ్రహాలను ట్రాక్టర్లలో ఎక్కించడానికి మున్సిపల్ నుంచి భారీ క్రేన్లను తెప్పించారు. రెండు రోజుల పాటు ఈ శోభాయాత్ర సాగనుంది. టేక్రియాల్లో విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. ఇందిరాచౌక్ వద్ద వీహెచ్పీ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు.శోభాయాత్రలో భారీ విగ్రహాలతో పాటు వివి ధ రూపాల్లో వినాయకులు ఆకట్టుకుంటున్నా యి. వాహనాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. నాసిక్ ఢోల్, డప్పులు, డోలు చప్పుల మధ్య వినాయకులను తరలించారు. రెండు రోజుల పాటు ఘనంగా నిమజ్జనోత్స వం సాగుతుంది.జిల్లా కేంద్రంలో రెండు రోజుల పాటు సాగే వినాయక నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజేష్ చంద్ర పర్యవేక్షణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడి నిమజ్జన శోభాయాత్ర శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. ఈ సందర్భంగా గణేశ్ విగ్రహాల ఊరేగింపు నిర్వహించే వాహనాలను అందంగా అలంకరించారు. డప్పు చప్పుళ్లు, యువకులు, చిన్నారుల నృత్యాల మధ్య శోభాయాత్ర కోలాహలంగా సాగింది. రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శోభాయాత్ర మార్గంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉత్తమ సేవలు అందించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: జిల్లాలోని ఆయా గ్రామాలకు ఎంపికై న గ్రామ పాలనాధికారులు శనివారం హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను పొందనున్నారు. అందుకు గాను గ్రామపాలనాధికారులను హైదరాబాద్ తీసుకువెళ్లేందుకు రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 7 ప్రత్యేక బస్సులను కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జెండా ఊపి ప్రారంభించారు. ఇదివరకు కామారెడ్డి రెవెన్యూ శాఖలో వీఆర్వోలు, వీఆర్ఏలుగా పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఇటీవల ప్రభుత్వం ఎంపిక పరీక్ష నిర్వహించింది. ఎంపికై న 365 మంది నియామక ఉత్తర్వులు పొందనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ శాఖలలో పనిచేస్తూ తిరిగి రెవెన్యూ శాఖలోకి వస్తున్న వారిని అభినందించారు. ఉత్తమ సేవలు అందించి గుర్తింపు పొందాలని సూచించారు. ఈ బస్సులలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహారెడ్డి, కలెక్టరేట్ ఏవో మసూద్ అహ్మద్, సిబ్బంది తరలి వెళ్లారు. -
జోరుగా లడ్డూ వేలంపాటలు
మాచారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్/నాగిరెడ్డిపేట/దోమకొండ : జిల్లాలో గణేశ్ మండపాల వద్ద లడ్డూ వేలం పాటలు శుక్రవారం జోరుగా సాగాయి. మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామంలో హిందూ వాహినీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి సంబంధించిన లడ్డూను వేలంపాటలో గ్రామానికి చెందిన ఏనుగు దయాకర్రావ్, ఉదయ్లు రూ.28 వేలకు దక్కించుకున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని దేవునిపల్లి గణేష్ మండలి వద్ద ఎల్లారెడ్డికి చెందిన సంగయ్య రూ.35 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకోగా, సాతోలి గ్రామంలో నిర్వహించిన వేలంలో లడ్డూను కిషోర్ రూ. 11 వేలకు దక్కించుకున్నారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో శ్రీ సాయినాథ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి సంబంధించిన లడ్డూ వేలంపాటలో గోపాల్పేటకు చెందిన పీకే. సురేశ్ రూ.72వేలకు లడ్డూను దక్కించుకున్నాడు.దోమకొండ మండలం సంఘమేశ్వర్ గ్రామంలో కుర్మ యువజన సంఘం వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించగా, గ్రామానికి చెందిన బోడపట్ల మల్లేశ్ రూ.40,500లకు దక్కించుకున్నారు. నిర్వాహకులు లడ్డూలను దక్కించుకున్నవారికి అందజేశారు. -
ప్రతిభావంతులకు ప్రోత్సాహకం
● దీన్దయాళ్ స్పర్శ్ యోజనకు దరఖాస్తులు ● ఈనెల 13 వరకు చివరి తేదీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించి ఉపకార వేతనాలు అందజేయనున్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో ప్రస్తుతం 6–9 తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులు. విద్యార్థుల్లో పోస్టల్ బిళ్లల సేకరణ(ఫిలాటలీ) అభిరుచిని పెంపొందించేకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. చదువులో ప్రతిభను చాటడంతో పాటు ఫిలాటిలీని అభిరుచిగా కొనసాగిస్తున్న విద్యార్థులకు అర్హత పరీక్ష నిర్వహించి అందులో ప్రతిభను చాటిన వారికి ఉపకార వేతనాలు అందజేయనున్నారు. వీరే అర్హులు... దీన్ దయాళ్ స్పర్శ్ యోజన ఉపకార వేతనాలు పొందడానికి 2024–25 విద్యా సంవత్సరంలో విద్యార్థులు చదివిన తరగతుల్లో వార్షిక పరీక్షల్లో ఎస్సీ,ఎస్టీలు 55శాతం, బీసీ, ఓసీలు 60 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనంతో కలిగే ఉపయోగాలపై పోటీలు నిర్వహించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 13లోగా దరఖాస్తులు పూర్తి చేసి సమీపంలోని పోస్టాఫీసుల్లో అందజేయాలి. విద్యార్థులు పోస్టల్ కార్యాలయాల నుంచి దీన దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీల దరఖాస్తు పత్రాలను పొందొచ్చు. విద్యార్థులు చదువుతున్న పాఠశాల హెచ్ఎం నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకొని పోస్టాపీస్ కార్యాలయానికి వెళ్లి రూ.200 చెల్లించి ఫిలాటలీ డిపాజిట్(పీడీ) ఖాతాను తీసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ పరీక్షను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక్కో తరగతి నుంచి పది మంది చొప్పున 40 మందిని ఎంపిక చేస్తారు. మొదటి విడతలో జనరల్ నాలెడ్జ్కు 5, చరిత్రకు 5, జాగ్రఫీకి 5, సైన్స్లో 5, క్రీడలు, సంస్కృతి, ప ర్సనాలిటీ అంశాలకు 5, లోకల్ ఫిలాటలీకి 10, నేషనల్ ఫిలాటలీకి 15 చొప్పున 50 మార్కులు కేటాయించారు. ఇందులో ఎంపికై న విద్యార్థులను రెండో విడతకు ఎంపిక చేస్తారు. రెండో విడతలో విద్యార్థులు ప్రాజెక్టును తయారు చేయాలి. పోస్టల్ శాఖ ఇచ్చే అంశాలపై ఉత్తమ ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులను ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. -
ఎస్సారెస్పీ వరద గేట్ల మూసివేత
బాల్కొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో శ్రీరాంసాగర్ జలాశయం వరద గేట్ల ద్వారా నీటి విడుదలను అధికారులు శుక్రవారం నిలిపివేశారు. ప్రాజెక్ట్లోకి ప్రస్తుతం 50 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 355 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4500, ఎస్కెప్ గేట్ల ద్వారా 3500, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. 666 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా 1090.10(77.23 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. దిగువకు 240 టీఎంసీలు గత నెలలో ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరదలు రావడంతో ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. మధ్యలో రెండ్రోజులు మాత్రమే నిలిపి వేశారు. తరువాత మళ్లీ వరద పోటెత్తడంతో గత నెల 27 నుంచి ఈనెల 4 వరకు నిరంతరం నీటి విడుదల చేపట్టారు. గరిష్టంగా 5.75 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్ట్ నుంచి 240 టీఎంసీల నీటిని గోదావరిలోకి వదిలారు. ● ఇన్ఫ్లో తగ్గుముఖం ● గోదావరిలోకి నీటి విడుదల నిలిపివేత -
వాడి గ్రామస్తుల ధర్నా
ధర్పల్లి: ముత్యాల చెరువుతో మా గ్రామానికి ముంపు ఉన్నదని, ఆ చెరువు వద్ద మళ్లీ మరమ్మతులు చేపట్టి చెరువు కట్టను నిర్మించవద్దని వాడి గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తెగిపోయిన ముత్యాల చెరువు వద్ద ఇరిగేషన్ అధికారులు చెరువు కట్ట తెగిపోవడానికి గల కారణాలను పరిశీలించడానికి అధికారులు శుక్రవారం వచ్చారు. విషయం తెలుసుకున్న వాడి గ్రామస్తులు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడడానికి ట్రాక్టర్లపై ముత్యాల చెరువు వద్దకు వెళ్లారు. ధర్పల్లి ఎస్సై కళ్యాణి సిబ్బందితో కలిసి గ్రామస్తులను అడ్డుకొని వారిని నివారించారు. దీంతో వాడి రోడ్డు పై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన గ్రామస్తులు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చెరువు తెగి భారీ వరద గ్రామంలోకి రావడంతో ఇళ్లు, పంట భూములు కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డామని గ్రామస్తులు వాపోయారు. విద్యుత్ షాక్తో బాలుడికి గాయాలు వర్ని: మండలంలోని పాత వర్ని గ్రామంలో ఓ బాలుడికి విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. పాత వర్ని గ్రామానికి చెందిన గడ్డం నరేష్ (7) శుక్రవారం గ్రామంలోని వీరభద్ర ఆలయం నుంచి ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి సపోర్టుగా ఉన్న తీగను పట్టుకోవడంతో అతడికి కరెంట్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు గమనించి కర్రతో బాలుడిని కొట్టడంతో కింద పడిపోయాడు. అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్తంభానికి మినీ ట్రాన్స్ఫార్మర్ ఉండడంతోనే సపోర్ట్ వైర్కు విద్యుత్ సరఫరా అయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్శాఖ అధికారులు వెంటనే స్పందించి స్తంభానికి ఉన్న మినీ ట్రాన్స్ఫార్మర్ను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అవార్డులు అందుకున్న ఉత్తమ గురువులు
రాజంపేట/కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో శుక్రవారం రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్లుగా ఎంపికై న వారికి అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితారాణా, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్రెడ్డి చేతుల మీదుగా పలువురు అవార్డులను అందుకున్నారు. రాజంపేట మండలం పొందూర్తి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ముదాం స్వామి రాష్ట్ర ఉత్తమ టీచర్గా ఎంపిక కావడంతో ఆయనకు అవార్డును అందజేశారు. అలాగే కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ సురేష్ రాథోడ్ సైతం రాష్ట్ర ఉత్తమ టీచర్గా ఎంపిక కావడంతో అవార్డును అందుకున్నారు. -
నిందితులను వెంటనే పట్టుకోవాలి
బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే పట్టుకోవాలని బాన్సువాడ డివిజన్ అంబేడ్కర్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శుక్రవారం సీఐ అశోక్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు బంగారు మైసయ్య, ప్రశాంత్, మల్లూర్ సాయిలు,మన్నెచిన్న సాయిలు, సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వివాహిత మృతి రాజంపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై దత్తాద్రి తెలిపారు. వివరాలు ఇలా.. రాజంపేట మండలం గుడితండాకు చెందిన ధారావత్ స్రవంతి–సురేష్ దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. ఈక్రమంలో మంగళవారం ఉదయం సురేష్ తన భార్య స్రవంతి(21)ని మందలించడంతో ఆమె క్షణికావేశంలో గడ్డి మందు తాగింది. దీంతో సురేష్ స్థానికుల సహాయంతో ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. గురువారం మధ్యాహ్నం అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి లాల్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
అండగా ఉంటా
‘‘ఎన్నడూ లేనంత వరదలతో వాటిల్లిన ఇబ్బందులను చూసి ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడిదాకా వచ్చా. మీకు జరిగిన నష్టాన్ని చూశా. మళ్లీ ఇలాంటి సమస్య ఎదురు కావొద్దు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. అందుకోసం అవసరమైన నిధులు ఇస్తా. అధైర్యపడకండి అండగా ఉంటా’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించిన సీఎం.. వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెనలు, ఇళ్లను పరిశీలించారు. బాధితులను కలిసి వారి గోడును విన్నారు. ‘‘మీ కష్టాలు తీర్చడానికే వచ్చా’’నంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి టౌన్/ లింగంపేటజిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు, వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్నుంచి హెలీకాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకున్నారు. లింగంపేట మండలంతోపాటు కామారెడ్డి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అధికారులందరూ సమన్వయంతో ముందుకువెళ్లడంతో ప్రాణనష్టం జరగలేదన్నారు. వరదలు వచ్చిన రోజునే మంత్రి సీతక్క, ఎంపీ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీలకు ఫోన్ చేసి బాధితులకు అండగా ఉండాలని సూచించానన్నారు. వరద సహాయక చర్యల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు కృషి చేశారన్నారు. వరదల్లో పిల్లల పుస్తకాలు తడిచిపోయాయని చెప్పారని, కాంటింజెన్సీ ఫండ్ నుంచి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించారు. అలాగే ఫార్మా కంపెనీలు, బీడీ పరిశ్రమలతో మాట్లాడి వారి సహకారంతో కాలనీవాసులను ఆదుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ‘‘కంపెనీలు ఇచ్చే సాయం తీసుకోండి, ఇంకా ఏది కావాలన్నా నేను ఇస్తా’’ అని సీఎం అన్నారు. భోజన నాణ్యతపై యాప్ను వాడుకోండి పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో పెట్టే భోజనం నాణ్యత తెలుసుకునేందుకు యాప్ ఉందని, దాని ద్వారా ఫొటో తీస్తే అందులో న్యూట్రిషన్ ఏమేరకు ఉందో తెలిసిపోతుందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. క్షేత్ర స్థాయిలో నాణ్యతను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పెట్టే భోజనానికి కూడా యాప్ ను వాడుకోవాలన్నారు. కార్య క్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, ఎంపీ సురేశ్ షెట్కార్, ప్రభు త్వ సలహాదారులు షబ్బీర్అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్రావ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి రాజీవ్గాంధీ హనుమంతు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు చందర్, విక్టర్, నీటి పారుదల శాఖ సీఈ శ్రీనివాస్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు ఇంద్రకరణ్రెడ్డి, గడ్డం చంద్రశేఖర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ పాల్గొన్నారు.కలెక్టరేట్లో అధికారులతో సీఎం దాదాపు గంటన్నర పాటు సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్లో మొదట ఫొటో ప్రదర్శనను తిలకించిన అనంతరం భోజనం చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వరదలతో జరిగిన నష్టం, చేసిన పనిని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్, ఎన్పీడీసీఎల్, ఆర్డబ్ల్యూఎస్, వైద్యారోగ్యశాఖ, వ్యవసాయం, నీటి పారుదల శాఖలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఆయా శాఖల అధికారులు చెప్పిన అంశాలను విని, వాటిపై పలు ప్రశ్నలు అడిగారు. యూరియాకు సంబంధించి అధికారుల మధ్య సమన్వయం అవసరం అన్నారు. ఒకేచోట పంపిణీ చేపట్టడం వల్ల వేలాది మంది రైతులు రావడం, తోపులాటలు, ఇబ్బందులు ఏర్పడి ప్రభుత్వం బద్నాం అవుతోందన్నారు. అలా కాకుండా రెండు మూడు గ్రామాలకు కలిపి ఒకచోట పంపిణీ చేస్తే ఇలాంటి సమస్యలు రావన్నారు.‘‘ఎన్నికల సమయంలో చెప్పినట్లే కొడంగల్తో సమానంగా కామారెడ్డిని చూస్తా.. అభివృద్ధి చేస్తా. ఏ సమస్య ఉన్నా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకురండి. ఆయన సహకారంతో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు ఇస్తా. కామారెడ్డిలో ఏ కష్టమొచ్చినా ఆదుకునే బాధ్యత నాది’’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. జీఆర్ కాలనీ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం నష్టపోయిన రైతులను ఆదుకుంటాం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లింగంపల్లి కుర్దు, బూరుగిద్ద, కామారెడ్డిలలో పర్యటన వరదలతో దెబ్బతిన్న పంటలు, వంతెన, రోడ్ల పరిశీలన బాధితులను ఆదుకుంటామని హామీ -
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక
జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు ఉత్తమ టీచర్లుగా ఎంపికయ్యారు. ఇందులో రాజంపేట మండలం పొందుర్తి యూపీఎస్లో ఎస్జీటీగా పనిచేస్తున్న స్వామి, గాంధారి మండలం ప్రైమరీ స్కూల్ టీచర్ భూంపల్లి భవాని, కామారెడ్డిలోని డెయిరీ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ సురేశ్ రాథోడ్ ఉన్నారు. – కామారెడ్డిటౌన్/గాంధారి గాంధారిలోని బాలికల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు బి.భవాని ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఆమె ఈ పాఠశాలకు 2018 లో టీచర్గా వచ్చారు. అప్పట్లో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా పాఠాలు చెబుతుండడంతో క్రమంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. బొమ్మలు, డ్రాయింగ్, ఆటలు, పాటలతో పాఠాలు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. అబాకస్ కూడా నేర్పిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి కాలంలో భరత నాట్యం, కర్ణాటక సంగీతం నేర్చుకున్న ఆమె.. విద్యార్థులకు నేర్పిస్తున్నా రు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె కృషితో ప్రస్తుతం ఈ స్కూల్లో 140 మంది విద్యార్థులున్నారు. ప్రజాప్రతినిధుల పిల్లలూ ఇక్కడ చదు వుతున్నారు. ప్రభుత్వం బెస్ట్ టీచర్గా ఎంపిక చేసినందుకు ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. -
వందేళ్ల కింద నిర్మించినా..
పోచారం ప్రాజెక్టును 103 ఏళ్ల కింద రూ. 26 లక్షలతో నిర్మించినా అది ఇంతటి వరదలను తట్టుకుని నిలబడడం మజ్బూత్గా ఉందని సీఎం పేర్కొన్నారు. జిల్లాలో వరదలతో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్లకు మరమ్మతులు చేయిస్తానన్నారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ‘‘మంచిగా ఉన్నపుడు కాదు, కష్టం వచ్చినపుడు వెన్నంటి నిలబడేవాడే నాయకుడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వరదల సమయంలో ప్రజలకు అండగా నిలిచారు’’ అంటూ అభి నందించారు. విపత్తులు తలెత్తినపుడు అంద రూ మానవత్వంతో వ్యవహరించాలని సూ చించారు. బాధితులకు భరోసా ఇవ్వడం, వారిని కాపాడుకోవడానికి ఎవరి స్థాయిలో వారు ప్రయత్నించాలన్నారు. -
మూత‘బడి’ని తెరిపించి..
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై న ఎం.స్వామి 2019 నుంచి 2024 వరకు భిక్కనూరు మండలం శివాయిపల్లిలో ఎస్జీటీగా పనిచేశారు. ఆయన ఈ పాఠశాలకు రాకముందు బడి మూతబడింది. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు బడిలో చేర్పించేలా చూశారు. తన ఇద్దరు కూతుళ్లను సైతం ఇదే బడిలో చేర్పించి చదివించారు. కూతురు లాస్యశ్రీ ఐదో తరగతివరకు ఇక్కడే చదివి ఆరో తరగతికి నవోదయ విద్యాలయానికి ఎంపికయ్యింది. కుమారుడు దివిత్ ఐదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ప్రస్తుతం ఏడో తరగతి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. ఆయన పనిచేసిన సమయంలో ఈ పాఠశాల విద్యార్థులు 60 మంది నవోదయకు ఎంపికవడం గమనార్హం. ప్రస్తుతం రాజంపేట మండలంలోని పొందుర్తిలో పనిచేస్తున్న ఆయనను రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నేడే నిమజ్జనోత్సవం ప్రారంభం
● జిల్లా కేంద్రంలో భారీ శోభాయాత్రకు ఏర్పాట్లు ● జిల్లా నలుమూలల నుంచి తరలిరానున్న జనంకామారెడ్డి టౌన్: వినాయక చవితి పండుగతో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. నవరాత్రులు ఘనమైన పూజలందుకున్న గణపయ్య.. శుక్రవారం గంగమ్మ ఒడిని చేరుకునేందుకు పయనమవనున్నాడు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. శనివారం కూడా కొనసాగనుంది. శోభాయాత్రతోపాటు విగ్రహాల నిమజ్జనానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కేంద్రంలో 400లకు పైగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించారు. శోభాయాత్ర ఘనంగా జరుగుతుంది. దీనిని తిలకించడానికి పట్టణవాసులే కాకుండా జిల్లా నలుమూలలనుంచి భక్తులు తరలివస్తారు. టేక్రియాల్ చెరువులో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగుతుందిలా.. సిరిసిల్ల రోడ్లోని ధర్మశాల వద్ద శుక్రవారం సాయంత్రం శోభాయాత్ర ప్రారంభం కానుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొంటారు. శోభాయాత్ర సబంధించిన రూట్ మ్యాప్ను అధికారులు విడుదల చేశారు. రైల్వే స్టేషన్లోని యువజన సమాఖ్య వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ధర్మశాల వద్ద ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి సిరిసిల్లరోడ్ మీదుగా ఇందిరాచౌక్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ వీహెచ్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద మండపాల నిర్వాహకులను సన్మానిస్తారు. అక్కడి నుంచి స్టేషన్రోడ్, సుభాష్రోడ్, తిలక్రోడ్, జేపీఎన్ చౌరస్తా, వీక్లీమార్కెట్ రోడ్, పాంచ్రస్తా, గోపాలస్వామిరోడ్, పెద్దబజార్, రైల్వేబ్రిడ్జి, అంబేడ్కర్ విగ్రహం, నిజాంసాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా టేక్రియాల్ చెరువు వరకు శోభాయాత్ర కొనసాగుతుంది. చెరువుల్లో వినాయకులను నిమజ్జనం చేస్తారు. కొందరు విగ్రహాలను బాసరకు తీసుకెళ్తారు. చెరువు వద్ద.. టేక్రియాల్ చెరువు వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మూడు భారీ క్రెయిన్లు, డోజర్ను ఏర్పాటు చేశారు. విగ్రహాలను ఈ క్రేన్ ద్వారా చెరువుల్లో వేసి నిమజ్జనం చేస్తారు. చెరువులోకి ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. చెరువు వద్ద సహాయక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, ఏఎస్సైలు, సీఆర్పీఎఫ్, హోంగార్డులు, పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నారు. రెవెన్యూ అధికారులు శోభాయాత్రను పర్యవేక్షించనున్నారు. ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం జరుపుకోవాలని అధికారులు మండపాల నిర్వాహకులను కోరారు. -
ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం
నిజామాబాద్ రూరల్: ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యం లభిస్తుందని సీపీ సాయి చైతన్య అన్నారు. మండలంలోని గూపన్పల్లి శివారులో సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేస్తున్న చిన్ని కృష్ణుడి వ్యవసాయ క్షేత్రాన్ని గురువారం సీపీ సందర్శించారు. అనంతరం చిన్ని కృష్ణుడితో మాట్లాడి సేంద్రియ సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 22 వంగడాలతో ఏర్పాటు చేసిన సూచన చక్రాన్ని, 23 వంగడాలతో చిన్ని కృష్ణుడి వివరాలను ఏర్పాటు చేసిన తీరును అభినందించారు. సీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేంద్రియ పద్ధతిలో సాగుచేసిన పంటలను ఆహారంగా తీసుకోవాలని సూచించారు. యువత సైతం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని అన్నారు. పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్ట్లు
తాడ్వాయి: జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో గురువారం రాత్రి బీఆర్ఎస్, బీజేపీ, భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు, రేషన్ డీలర్లను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ కపిల్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నర్సింలులను అరెస్టు చేయడంతో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. బీకేఎస్ నేతల నిరసన.. భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డిని అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న రైతులు శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్కు తరలివచ్చి నిరసన తెలిపారు. భారతీయ కిసాన్ సంఘ్ క్రమశిక్షణ కలిగిన సంఘమని, ఏ నిరసన కార్యక్రమమైనా చట్టబద్ధంగా చేస్తామని పేర్కొన్నారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ పేరుతో వేధించడం రైతులను అవమానించడమేనన్నారు. ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఆయనను విడుదల చేశారు. -
మాది ప్రజా ప్రభుత్వం
కామారెడ్డి టౌన్: మాది ప్రజా ప్రభుత్వమని, వరదల రోజున అనివార్య కారణాలతో సీఎం రాలేకపోయారని, పట్టు వదలకుండా మళ్లీ కామారెడ్డికి వచ్చి నేరుగా ప్రజల బాధలు తెలుసుకుని సహాయం చేయడానికి వచ్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. జిల్లాకేంద్రంలో ఇటీవల వరద ముంపునకు గురైన జీఆర్ కాలనీలో సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఆమె గురువారం పర్యటించారు. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. కాంగ్రెస్ అంటే ప్రజాపాలన ప్రభుత్వం, వరదల్లో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మేమంతా ముందుంటామన్నారు. వరదలు వచ్చిన మరుసటి రోజునే ఎంపీ షెట్కార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీలతో ఇక్కడ బాధితుల బాధలను తెలుసుకుని సీఎం గారికి వివరించామన్నారు. -
రైళ్లను పొడిగించండి
నిజామాబాద్ అర్బన్: పలు రైళ్లను నిజామాబాద్ మీదుగా పొడిగించాలని సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జోనల్ స్థాయి సభ్యులు రావులపల్లి జగదీశ్వరరావు కోరారు. సికింద్రాబాద్లో గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జోనల్ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన హాజరై సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ పలు వినతులు అందించారు. నాందేడ్ వరకు వస్తున్న వందే భారత్ రైలును నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు.తిరుపతికి వందే భారత్ సౌక ర్యం కల్పించాలన్నారు. ఆర్మూర్, డిచ్పల్లి మధ్య ట్రాక్ లింకు కల్పించి రైల్వే బైపాస్ నివారించి భూసేకరణలో ప్లాట్ల యజమాన్లకు న్యాయం చేయాలన్నారు. తపోవన్ ఎక్స్్ప్రెస్, పూణే, ముంబై ఎక్స్్ప్రెస్లను, బెంగుళూరు, ఢిల్లీ రైళ్లను నాందేడ్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించాలన్నారు. ముంబై సికింద్రాబాద్ మధ్య మరొక రైలు నడపాలన్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో లిఫ్ట్, సీసీ కెమెరాలు స్కానింగ్ ప్రయాణికుల వసతులు తదితర వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రయాణికుల భద్రత చర్యలు తీసుకోవాల ని కోరారు. జనరల్ మేనేజర్ వాటిని సానుకూలంగా విని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్నాగారం: నిర్మల్లో ఈ నెల 5 నుంచి 7 వరకు రాష్ట్రస్థాయి సబ్ జూనియర్, జూనియర్ బాలబాలికల యోగాసన పోటీలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో నిజామాబాద్ జిల్లా నుంచి 20 మంది యోగా క్రీడాకారులు గురువారం నిర్మల్ తరలివెళ్లారు. జిల్లా జట్టుకు కోచ్గా ఉమారాణి, శివ కుమార్ వ్యవరిస్తున్నారు. వీరితోపాటు టెక్నికల్ అఫీషియల్స్గా ఎంపికై న ఏడుగురు జిల్లా నుంచి వెళ్లారు. అంతకుముందు క్రీడాకారులను జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు యోగా రాంచందర్, ప్రతినిధులు గంగాధర్, జ్యోతి, రసజ్ఞ అభినందించారు. -
వంతెనలకు పట్టిన గ్రహణం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడి–కల్వరాల్ గ్రామాల మధ్య గతంలో నిర్మించిన వంతెనకు మళ్లీ గ్రహణం పట్టుకుంది. కొన్ని సంవత్సరాలు వంతెన కోసం అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకోగా ఐదేళ్ల క్రితం వంతెన నిర్మాణం జరిగింది. ఇటీవల కురిసిన అకాల వర్షానికి బ్రిడ్జికి ఇరు వైపులా వేసిన మట్టి వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోవడంతో కేవలం వంతెన మిగిలింది. దీంతో ఈ రెండు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మించడం వల్ల రెండు గ్రామాల ప్రజలకు కొంత సౌకర్యంగా ఉండేది. రైతులకు దూర భారం తగ్గింది. కానీ మట్టి పూర్తిగా కొట్టుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే మండల కేంద్రం శివారు– తిర్మన్పల్లి మధ్య గల తుంగాగు వద్ద నిర్మించిన వంతెన వరద ఉధృతికి బుంగ ఏర్పడడంతో బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ రోడ్డు గుండా రామారెడ్డి, మాచారెడ్డి మండలాలకు వాహనాదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రధాన రహదారిపై వంతెన ప్రమాదకరంగా మారినప్పటికి ఇప్పటి వరకు అధికారులు అటు వైపు కన్నెత్తి చూడలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పరిస్థితిని పట్టించుకునే నాథుడు లేకుండా పోయారని వారు వాపోతున్నారు. ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా అని ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారు. ఇరువైపులా కోతకు గురైన రోడ్లు పద్మాజీవాడి–కల్వరాల్ గ్రామాల మధ్య నిలిచిన రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరు గ్రామాల ప్రజలు ప్రమాదకరంగా తిర్మన్పల్లి తుంగాగు బ్రిడ్జి -
శాశ్వత పరిష్కారం చూపాలి
కామారెడ్డిలో వరదలకు లోతట్టు కాలనీలో మునిగిపోయి ఇబ్బందులతో ఉన్నప్పుడు ప్రజలకు ఆదుకునేందుకు రాజకీయాలకు అతీతంగా నేతలు, అన్ని శాఖల అధికారులు వర్షాల్లో తడుస్తూ 48 గంటల పాటు విధులు నిర్వహించి ప్రజలు ఇబ్బందులను తొలగించేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. వారందరికి కృతజ్ఞతలు. కామారెడ్డి ప్రజలకు ఆత్మస్థైర్యం నింపేందుకు వచ్చిన సీఎంకు కృతజ్ఞతలు. మళ్లీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సీఎంను విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైన నిధులు మంజూరు చేయాలి. – వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్యే -
తండ్రి వద్దు.. పింఛన్ కావాలి
● పెన్షన్ డబ్బులను తీసుకొని తండ్రిని వదిలేసిన కూతురు ● కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకెళ్లాలని సూచించిన ఎస్సైనిజాంసాగర్(జుక్కల్): ఓ కూతురు తన తండ్రికి వచ్చే పింఛన్ డబ్బులు తీసుకొని, తండ్రిని వదిలేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన ఎరుకల పోచయ్య, దుర్గవ్వ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. దుర్గవ్వ, ఒక కొడుకు కొన్నెళ్ల కిందట మృతి చెందారు. మరో కొ డుకు నారాయణ పెళ్లి చేసుకొని ఇళ్లరికం వెళ్లాడు. అప్పటి నుంచి వృద్ధుడైన పోచ య్య నిజాంపేటలోని కూతురు నర్సవ్వ వద్ద ఉంటున్నాడు. నాల్గు రోజుల కిందట తండ్రి పింఛన్ కోసం నర్సవ్వ తన తండ్రిని తీసుకొని తుంకిపల్లి గ్రామ పంచాయతీకి వచ్చింది. సిబ్బంది డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రిని అక్కడే వదిలివేసి వెళ్లిపోయింది. దీంతో పోచయ్య గ్రామ పంచాయతీ వద్దనే ఉన్నాడు. బుధవారం జీపీ కా ర్యాలయం వద్ద పోస్టాఫీసు సిబ్బంది పింఛన్ పంపిణీ చేస్తుండటంతో నర్సవ్వ వచ్చి, పింఛన్ డబ్బులను తీసుకొని తండ్రిని అక్కడే వదిలేసి వెళ్లింది. పోచయ్య అనాథగా మారి రోధించడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి ఎస్సై శివకుమార్కు సమాచారం అందించారు. కూతురుకు ఎస్సై ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. కుమారుడికి ఫోన్ చేసి తండ్రిని తీసుకువెళ్లాలని చెప్పారు. -
కళా ఉత్సవ్కి ఎంపికై న విద్యార్థులు
బీబీపేట: కళా ఉత్సవ్– 2025లో భాగంగా గు రువారం జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ సాంస్కృతిక పోటీలలో మండల కేంద్రంలోని టీఎస్ఎన్ఆర్ బాలుర పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికై న అఖిల్, పూర్ణచందన, ఇందు, దయానంద్, శివమణి, హర్షన్,తేజ,అఖిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి లో ఆడుతారని ప్రధానోపాధ్యాయుడు రవీంద్రారెడ్డి తెలిపారు.ఉపాధ్యాయులు విశ్వ మోహన్,నాగరాజు,రాధిక తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: రేషన్ డీలర్లను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు సురేందర్ అన్నారు. గురువారం జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా రేషన్ డీలర్లను ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. రేషన్ డీలర్ల 5 నెలల కమీషన్ను, రూ. 5 వేల గౌరవ వేతనం అందించాలని కోరారు. డీలర్లు చంద్రయ్య, శ్రీనివాస్, ఆగమయ్య, విఠల్ తదితరులున్నారు. ఎల్లారెడ్డిరూరల్: భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డులను పొందాలని జిల్లా సీఎస్సీ హెల్త్ సెంటర్ మేనేజర్ ప్రవీణ్ నాయక్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డిలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డు ఆవశ్యకత గురించి వివరించారు. లేబర్ కార్డు వల్ల ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.10 లక్షల బీమా వర్తిస్తుందన్నారు. నాయకులు రజాక్ తదితరులున్నారు. తాడ్వాయి: సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎర్రాపహాడ్ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద మోతె రోడ్డులో వాహనాలను పోలీసులు నిలిపివేశారు. సీఎం రేవంత్రెడ్డి హెలీకాప్టర్ నుంచి దిగి రోడ్డు మార్గంలో లింగంపేట్ మండలానికి వెళ్లే వరకు వాహనాలను నిలిపివేశారు. అనంతరం లింగంపేట్ మండలం నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం రేవంత్రెడ్డి వెళ్లే వరకు తాడ్వాయి, ఎర్రాపహాడ్, కృష్ణాజీవాడిలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలోనూ వాహనాలను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పీజీ, బీఎడ్, ఎంఎడ్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా కొనసాగినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఇంటిగ్రేటెడ్ పీజీ 8, 10వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు గానూ 44 మంది హాజరు కాగా ఒకరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. బీఎడ్, 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షల్లో 46 మంది విద్యార్థులకు గానూ 33 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అలాగే ఎంఎడ్ 4వ సెమిస్టర్ రెగ్యులర్, 1,2 3, 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో 33 మంది విద్యార్థులకు గానూ 31 మంది హాజరు కాగా ఇద్దరు గైర్హాజరైనట్లు ఆయన తెలిపారు. -
వరద నష్టాలకు శాశ్వత పరిష్కారం: సీఎం రేవంత్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ‘వందేళ్లలో రాని వరదలొచ్చి పెద్ద నష్టమే జరిగింది. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లాలో అమలు చేసే విధానం రాష్ట్రమంతటికీ విస్తరిస్తాం. ఇందుకు ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సమగ్ర నివేదిక రూపొందించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లాలో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించి బాధితులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మీ కష్టాలు చూసి తగిన సాయం అందించాలన్న ఉద్దేశంతోనే తాను వచ్చానని చెప్పారు. మళ్లీ వరదలు వచ్చి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు. జిల్లా అధికారులంతా క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి వాస్తవ నివేదికలు రూపొందించాలని ఆదేశించారు. ఇక్కడ అమలు చేసే ప్రణాళిక రాష్ట్రమంతటికీ విస్తరించేందుకు ఉపయోగపడుతుందని, విపత్తు నిర్వహణలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలని చెప్పారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావ్లతో కలిసి సీఎం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ రివ్యూ చేశారు. రైతులను ఓదార్చిన సీఎం సీఎం రేవంత్రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ప్రత్యేక బస్సులో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. లింగంపేట మండలంలోని లింగంపల్లి కుర్దు వద్ద వరదలతో దెబ్బతిన్న వంతెనను, బూరుగిద్ద వద్ద కొట్టుకుపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలో ముంపునకు గురైన జీఆర్ కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఇప్పటికే ప్రభుత్వపరంగా సాయం అందించామని, ఫార్మా, బీడీ కంపెనీల ద్వారా పిల్లల అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమీకృత కలెక్టరేట్లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ సురేష్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, వెంకటరమణారెడ్డి, మదన్మోహన్రావ్, లక్ష్మీకాంతరావ్, భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్తో వరద నష్టంపై సుదీర్ఘంగా సమీక్షించారు. వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. నివేదికలు మార్గదర్శకాలకు లోబడి ఉంటేనే కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ సాయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. లేకపోతే మన ప్రతిపాదనలు తిరస్కారానికి గురై మొత్తం భారం రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుందన్నారు. వరదలతో మైనర్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని, పోచారం ప్రాజెక్టు వరదలకు తట్టుకుని నిలబడిందని, తక్షణమే మరమ్మతులు చేశామన్నారు. అంతకుముందు తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ శివారులోని హెలిపాడ్ వద్ద దిగిన రేవంత్రెడ్డికి షబ్బీర్అలీ, జిల్లా కలెక్టర్ సంగ్వాన్ స్వాగతం పలికారు. పక్షం రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో రివ్యూ చేస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఈ లోపు అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించాలన్నారు. అలాగే, శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు కూడా తయారు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులతో కలిసి మంత్రి సీతక్క సమీక్ష చేస్తారని, ఆ లోపు నివేదికలు రూపొందించాలన్నారు. ఆ తరువాత తాను అందరితో కలిసి సమీక్ష చేస్తానని తెలిపారు. వరదలతో ఇసుక మేటలు వేసిన పొలాలను సరి చేయడానికి అధికారులంతా సమన్వయం చేసుకుని ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. యూరియా పంపిణీలో మార్పులు చేయాలి సహకార సంఘంలోనే యూరియా పంపిణీ చేయడం వల్ల వేలాది మంది రైతులు రావడం, వారికి సరిపోవడం లేదంటూ నెగెటివ్ ప్రచారం జరుగుతోందని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. అలాకాకుండా రెండు మూడు గ్రామాలకు ఒక కేంద్రాన్ని తెరిచి అక్కడి రైతులకు అక్కడే యూరియా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల మధ్య సరైన సమన్వయం, సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రభుత్వం బద్నాం అవుతోందన్నారు. ఆస్పత్రుల్లో వైద్యుల హాజరుకోసం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం అమలు చేయాలని వైద్యశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. వైద్యులు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. కొడంగల్తో సమానంగా కామారెడ్డి కామారెడ్డి నియోజక వర్గాన్ని కొడంగల్తో సమానంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తాను రాష్ట్రంలోని 119 నియోజక వర్గాలు చూడాలి కాబట్టి ప్రజలు స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి చెబితే తనకు చెప్పినట్టేనని, ఆయన సహకారంతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. జిల్లాలో వరదల కారణంగా దెబ్బతిన్న చెరువులను, రోడ్లను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఇళ్లు కూలిపోయిన పేదలకు ప్రత్యేక కోటా కింద ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిçస్తున్నామని, అలాగే పశువులు చనిపోయిన వారి కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పారు. -
రేవంతన్నా.. ఉద్యోగం రాలేదన్నా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : లింగంపేట మండలం నల్లమడుగు గ్రామంలో నాలుగేళ్ల క్రితం వడ్ల కుప్పకాడ కావలిగా ఉన్న మెట్టు ప్రభాకర్ (28) అనే రైతు పాము కాటుతో చనిపోయాడు. అప్పట్లో పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. రూ.లక్ష సాయం అందించారు. అక్కడి నుంచే ఆర్డీవోకు ఫోన్ చేసి పదో తరగతి చదివిన ప్రభాకర్ భార్య ప్రసన్నకు అంగన్వాడి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. అధికారులు చూస్తామని మాటిచ్చి వదిలేశారు. అప్పడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. గురువారం లింగంపేట మండలానికి వస్తున్నారు. భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లలను పోషించడానికి ప్రసన్న ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. సీఎం రేవంత్రెడ్డి స్పందించి తనకు భరోసా ఇస్తారని ఆమె ఆశిస్తోంది. ఏదైనా ఉపాధి, ఉద్యోగ అవకాశం కల్పించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
మరోసారి ఉపఎన్నిక!
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి ఉప ఎన్నిక అనివార్యం కానుంది! బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తరువాత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించడంతో ‘ఉప ఎన్నిక’ చర్చ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ స్థానానికి 2020లో ఒకసారి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం మరో ఉప ఎన్నికకు దారితీసింది. పార్టీ నుంచి వేటుపడిన వెంటనే ఆమె తన శాసన మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది. 2019లో ఎంపీగా ఓటమిపాలైన కవిత.. 2020లో జరిగిన ఉప ఎన్నికలో స్థానికసంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడడంతో ఉప ఎన్నిక రాగా, కవిత బరిలో నిలిచి గెలిచారు. ఆ స్థానం కాలపరిమితి ముగియడంతో 2022 జనవరిలో నిర్వహించిన ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కాలపరిమితి ఉన్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్కు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల వాతావరణం ఉండగా.. అదే కోటాలో నిర్వహించాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆలస్యం అవడం ఖాయం. ఉప ఎన్నిక నిర్వహించాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. ఉప ఎన్నికలకు ఆస్కారమిచ్చారు.. 2016 జనవరిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే భూపతిరెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో 2020లో అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కవిత, తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఆమోదిస్తే, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత మండలి చైర్మన్ ఆమోదిస్తే ఉప ఎన్నిక పెట్టాల్సిందే 2020 ఉప ఎన్నికలు, 2022 ఎన్నికల్లో కవిత విజయం స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే ఉప ఎన్నికకు అవకాశం తాజా పరిస్థితులపై జోరుగా చర్చలు -
ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఆర్ఐ
● ఆర్మీ జవాన్ నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటూ.. నిజామాబాద్ సిటీ: వీఎల్టీ (వెకెంట్ ల్యాండ్ ట్యాక్స్) సర్టిఫికెట్ కోసం రూ.7 వేలు లంచం తీసుకుంటూ నిజామాబాద్ నగర పాలక సంస్థ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కాడు. వివరాలి లా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్నగర్కు చెందిన ఆర్మీ జవాన్ ఒకరు ఖాళీ స్థలంలో జ్యూస్సెంటర్ కోసం అనుమతులు తీసుకున్నాడు. దీనికి సంబంఽధించిన వీఎల్టీ (వెకెంట్ లాండ్ ట్యాక్స్) సర్టిఫికెట్ కోసం బల్దియాలో దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించాడు. కానీ అనుమతి పత్రం ఇచ్చేందుకు ఆర్ఐ శ్రీనివాస్ రూ.12 వేలు డిమాండ్ చేశారు. తాను ఆర్మీ జవాన్ అని చెప్పినా ససేమిరా అన్నాడు. ఆర్మీ అయితే బోర్డర్ లో.. ఇక్కడ డబ్బులిస్తేనే పనులు అవు తా యి అనడంతో జవాన్ ఆత్మాభిమానం దెబ్బ తింది. చివరకు రూ.10 వేలు ఇస్తానని ఒప్పుకొని ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బల్దియాలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఆర్మీ జవాన్ వద్ద రూ.7 వేల నగదును ఆర్ఐ శ్రీనివాస్ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్కు సమాచారం ఇచ్చి, ఆర్ఐ శ్రీనివాస్ను ఏసీబీ కోర్టుకు తరలించారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని జీఆర్ కాలనీ, హౌసింగ్బోర్డు కౌండిన్య కాలనీలలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ బుధవారం పర్యటించారు. వరద బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులను ప్రభు త్వం ఆదుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి గురువారం జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీలలో పర్యటించి బాధితులతో మాట్లాడతారన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్రావు, నాయకులు పండ్ల రాజు, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని వరద బాధితులకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బుధవారం నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు బాలవికాస అమెజాన్ సంస్థ నిత్యావసర సరుకుల తో కూడిన 400 కిట్లను అందజేసిందన్నారు. కామారెడ్డి అర్బన్: ఒక ఆలోచన జీవితాన్నే మార్చివేస్తుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ పేర్కొన్నారు. కళాశాల టీఎస్కేసీ ఆధ్వర్యంలో బుధవారం ఇన్నోవేషన్ ఐడియాస్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక సృజనాత్మక ఆలోచన దాగి ఉంటుందని, దాన్ని వెలికితీసి కొత్త ఆవిష్కరణలు చేస్తే జీవితం మారిపోతుందన్నారు. టాస్క్ ఐడియాథాన్ ప్రాజెక్ట్ మేనేజర్ బాలు ప్రవరాఖ్య, యంగ్ ఎంటర్ప్రెన్యూర్ ప్రతినిధి సంకీర్త్, సమన్వయకర్త రాజ్గంభీర్రావు, అధ్యాపకులు ఫర్హీన్ ఫాతిమా, మెంటార్ అజారొద్దీన్, టాస్క్ జిల్లా మేనేజర్ రఘుతేజ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సాధారణ ఎన్నికల కోసం పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను ఈనెల 6న ప్రదర్శిస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఒక ప్రకటనలో తెలిపారు. 8న ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలు, సలహాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. 9న అభ్యంతరాలను పరిష్కరించి, 10న ఆయా మండలాల ఎన్నికల అధికారులు పోలింగ్ స్టేషన్లవారీగా తుది జాబితాను ప్రకటిస్తారని తెలిపారు. ఎంపీడీవో కార్యాలయాల్లో సమావేశాలు, జాబితా ల ప్రదర్శన ఉంటాయదని పేర్కొన్నారు. -
హెలీప్యాడ్ స్థల పరిశీలన
లింగంపేట/తాడ్వాయి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం లింగంపేట మండలంలో పర్యటించారు. సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎర్రాపహాడ్ శివారులో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్ను పరిశీలించి అధికా రు లకు సూచనలిచ్చారు. లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెనను ముఖ్యమంత్రి పరిశీలించనున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. వంతెన వద్ద జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రికి వివరించడానికి సిద్ధంగా ఉండాలని ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. బూరుగిద్ద శివారులో పంటలు పరిశీలించే సమయంలో నష్టాన్ని వివరించేందుకు వ్యవసాయాధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ కిరణ్మయి, అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, అడిషనల్ కలెక్టర్ చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కరుణ వర్షం కురిసేనా?
జిల్లాలో గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదలు, వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 118 పశువులు చనిపోగా, 53,270 కోళ్లు మృత్యువాతపడ్డాయి. చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చెరువులు, కుంటలే కాదు ప్రాజెక్టులూ ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. ఇళ్లు నీట మునిగి సర్వస్వం కోల్పోయిన ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 1,454 ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. విద్యుత్ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 పోల్స్, 51.84 కిలోమీటర్ల మేర వైర్లు, 589 విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. వరదలతో జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు తాత్కాలిక మరమ్మతులు చేయించడానికి రూ.38.68 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ.212.68 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. 50 వేల ఎకరాలలో పంట నష్టం.. వరదలతో పొలాలు నీటమునిగి పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పంటలు కొట్టుకుపోయాయి. ఇసుక మేటలు వేయడంతో మరింత నష్టం వాటిల్లింది. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 334 గ్రామాల్లో 37,313 మంది రైతులకు సంబంధించి 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మరో 140 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం జరిగింది. అయితే అంతకు రెట్టింపు విస్తీర్ణంలో పంటలు నాశనమయ్యాయని రైతులు పేర్కొంటున్నారు. నీటిపారుదల రంగానికి రూ. 41 కోట్లు... వర్షాలతో పోచారం ప్రాజెక్టు, కల్యాణి ప్రాజెక్టు, సింగీతం రిజర్వాయర్లతో పాటు 157 చెరువులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టు ఒక దశలో కొట్టుకుపోతుందనే ఆందోళన వ్యక్తమైంది. వందేళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు స్ట్రక్చర్ గట్టిగా ఉండడంతో అంత పెద్ద వరదను తట్టుకుని నిలబడింది. కట్ట కొంత కోతకు గురవగా తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు. కల్యాణి వాగు ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్ల కట్టలు కొట్టుకుపోయాయి. వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాల్సి ఉంది. చెరువులకు చాలాచోట్ల గండ్లు పడ్డాయి. కాలువలు కూడా కొట్టుకుపోయాయి. వాటికి తాత్కాలిక మరమ్మతులకు రూ.5 కోట్లు వెచ్చిస్తుండగా.. పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.36 కోట్లు అవసరమని నీటి పారుదల శాఖ అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్ శాఖ అంచనాలు.. కామారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలో 122 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.8 కోట్లు అవసరం అవుతాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. పూర్తి స్థాయిలో మరమ్మతులకు రూ.37.50 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేశారు.కామారెడ్డి క్రైం: జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం ఆయన ఎస్పీ రాజేశ్ చంద్రతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటించనున్న జిల్లాలోని వివిధ ప్రాంతాలను పరిశీలించారు. పట్టణంలోని జీఆర్ కాలనీలో పర్యటించి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో జరిగే వరదలపై సమీక్ష, ఫొటో ఎగ్జిబిషన్ తదితర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ చందర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జిల్లాలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ)కు సంబంధించి 65 కిలోమీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నాయి. 48 కల్వర్టులు పాడయ్యాయి. చాలాచోట్ల రోడ్లు, కల్వర్టులు దెబ్బతినిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద ఉన్న కల్వర్టు వరదలో కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. అధికారులు కష్టపడి తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ రాకపోకలకు ఇబ్బందిగానే ఉంది. సీఎం రేవంత్రెడ్డి దీనిని పరిశీలించనున్నారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతినడంతో రవాణాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లు, కల్వర్టుల తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5.50 కోట్లు, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.120 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన జిల్లా రూ. వందల కోట్ల మేర నష్టం నేడు జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటున్న జిల్లావాసులు -
ఎరువు కోసం జాగారం
రామారెడ్డి: రామారెడ్డికి గురువారం యూరి యా వస్తుందన్న సమాచారం తెలియడంతో రైతులు బుధవారం రాత్రే రైతు వేదిక వద్దకు చేరుకున్నారు. దుప్పట్లు, చద్దర్లు తెచ్చుకుని వేదిక ఆవరణలో నిరీక్షిస్తున్నారు. రాత్రంతా జాగారం చేసినా ఒక్క బస్తా అయినా దొరుకుతుందో లేదోనని నాగరాజు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులు స్పందించి సరిపడా ఎరువులు పంపించాలని కోరాడు. గతంలో క్యూలైన్లో ఓ రైతు మృతి.. 2011లో యూరియా కొరత ఏర్పడింది. అప్ప ట్లో రైతులు బారులు తీరారు. రామారెడ్డికి చెందిన ఊషయ్య అనే రైతు క్యూలైన్లో అనారోగ్యానికి గురై మరణించాడు. ఆ పరిస్థితి తలెత్తకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
సీఎం ఈసారైనా దయచూపేనా?
బార్ కౌన్సిల్ ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి కామారెడ్డి టౌన్: బార్ కౌన్సిల్ ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంద రమేష్, బండారి నరేందర్లు డిమాండ్ చేశారు. జేఏసీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అసోసియేషన్ భవనంలో న్యాయవాదుల డిమాండ్లతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని కోరారు. పదవీ కాలం ముగిసినా ఆరేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టులో వేసిన కేసుకు జవాబు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ పదవులను పొడిగించుకోవడం సరికాదన్నారు. రెండు నెలలలోపు బార్ కౌన్సిల్ ఎన్నికలను నిర్వహించాలని లేకుంటే న్యాయవాదులు చలో హైదరాబాద్ పిలుపునిచ్చి పోరాటం చేస్తామని తెలిపారు. న్యాయవాదులు శ్యామ్ గోపాల్ రావు, క్యాతం సిద్ధరాములు, జగన్నాథం, దేవరాజ్ గౌడ్, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చింతల గోపి పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లాలో అనేక సమస్యలు వెక్కిరిస్తున్నాయి. సాగునీటి సమస్య, విద్య, వైద్యరంగాలతో పాటు పారిశ్రామికరంగాల్లోనూ వెనుకబడే ఉంది. కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి(కేకేవై) రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలి. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణకు నిధులు ఇవ్వాలి. ఇంకా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. కామారెడ్డి నుంచి రేవంత్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఈ ప్రాంత ప్రజలు గౌరవ ప్రదమైన ఓట్లు వేశారు. ప్రజల ఆశలకు అనుగుణంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కామారెడ్డి నియోజక వర్గంతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాలుగైదు మండలాలకు సాగునీరందించేందుకు రూపొందించిన 22వ ప్యాకేజీ పనులు ఏళ్లుగా ముందుకు కదలడం లేదు. భూసేకరణతో పాటు పనులు చేపట్టేందుకు నిధులు ఇవ్వాల్సి ఉంది. విద్యారంగానికి సంబంధించి కామారెడ్డిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు జరగాలి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఇంజినీరింగ్ కాలేజీ, బీఎడ్, డీఎడ్ కాలేజీలు ఏర్పాటు చేయాలి. కామారెడ్డికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ రావాలి. సౌత్ క్యాంపస్ అభివృద్ధికి చర్యలు చేపట్టాలి. వైద్య రంగానికి సంబంధించి స్థానికంగా వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రులున్నాయి. అయితే ఆస్పత్రిలో స్కానింగ్ మిషన్ లేక బయట చేయించుకునే పరిస్థితి ఉంది. ఆస్పత్రి, మెడికల్ కాలేజీ భవనాల పనులు త్వరగా పూర్తి చేసి సౌకర్యాలు మెరుగుపర్చాలి. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బిచ్కుంద, మద్నూర్, పిట్లం, మద్నూర్ ఆస్పత్రుల్లో వైద్యులను నియమించాలి. జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు నిర్మించాలి. జంక్షన్ల అభివృద్ధి చేపట్టి ఇబ్బందులు తొలగించాలి. విలీన గ్రామాలకు ప్రత్యేక నిధులివ్వాలి. కేకేవై రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి మీదుగా పిట్లం వరకు ఉన్న ఈ రోడ్డు రవాణా రంగంలో కీలకమైనది. మూడు రాష్ట్రాలను కలిపే రహదారిగా దీన్ని అభివృద్ధి చేయాల్సి ఉంది. పారిశ్రామిక ప్రగతిలో వెనుకబడిపోయాం. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి పంట ఉత్పత్తులకు తగిన ప్రాధాన్యతనివ్వాలి. ఇదే సమయంలో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకావాలు కల్పించాలి. జిల్లా కేంద్రాన్ని రెండుగా విభజించే రైల్వే ట్రాక్పై వంతెనలు నిర్మించకపోవడంతో నిత్యం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం 22వ ప్యాకేజీకి నిధులిస్తేనే సాగునీటి కష్టం తీరేది ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేయాలి వెద్య సేవలు మెరుగుపడాలి కేకేవై రోడ్డును హైవేగా అభివృద్ధి చేయాలి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ జరగాలి సమగ్ర అభివృద్ధికి కృషి అవసరం -
సరిపడా యూరియా ఇవ్వాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): రైతులకు సరిపడా యూరియాను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని భారతీయ కిసాన్ సంఘం(బీకేఎస్) గ్రామ అధ్యక్షుడు కుమార్ సింగ్ పేర్కొన్నారు.బుధవారం మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో రోడ్డుపై రైతులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతాంగం చాలా ఇబ్బందిలో ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియాను అందుబాటులో తెచ్చి రైతుల సమస్యను పరిష్కరించాలని కోరారు.అనంతరం నాయబ్ తహసీల్దార్ చంద్రకాంత్కు వినతి పత్రం అందజేశారు. సంఘం నేతలు బోడి రాజు యాదవ్, బోడి మల్లికార్జున్, రైతులు పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాల పరిశీలన
నస్రుల్లాబాద్: సంగం, సంగం(ఏ), మిర్జాపూర్, నాచుపల్లి గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్ పరిశీలించారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం, తాగు నీరు, మరుగు దొడ్ల సదుపాయాలను పరిశీలించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ పాల్య్త విఠల్, పంచాయతీ కార్యదర్శి అనిల్ ,గ్రామస్తులు ఉన్నారు. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని పలు గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో ప్రకాష్ బుధవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఉన్న సమస్యలను ఆయన ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. బీఎల్వోలు తదితరులున్నారు.తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్లో బుధవారం సివిల్ రైట్స్డే కార్యక్రమాన్ని నిర్వహించారు. మూఢనమ్మకాలను వీడాలని, అంటరానితనం ఉండవద్దని, అందరు సమానంగా ఉండాలని సూచించారు. ఆర్ఐ హారిక, రెవిన్యూ, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. -
మున్సిపల్ కార్మికుడిని ఆదుకోవాలి
కామారెడ్డి టౌన్: మున్సిపల్ వాటర్వర్క్స్ విభాగంలో విధులు నిర్వహించి ఇంటికి వెళూ్త్ ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న కార్మికుడు మాసుల లింగంను ఆదుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూని యన్ నాయకుడు నర్సింగ్రావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కుప్రియాల్ వద్ద గు ర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తలకు తీ వ్ర గాయాలై నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిపారు. పోటాపోటీగా రక్తదానం చేయాలి కామారెడ్డి అర్బన్:పోటాపోటీగా వినాయని ఉ త్సవాలు నిర్వహించిన యువకులు అదే స్ఫూ ర్తితో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు,ఆపదలో ఉన్న రోగులకు రక్తదా నం చేయడానికి శిబిరాలు ఏర్పాటు చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేయడానికి యువజన సంఘాలు ముందుకు వస్తే అందుకు ఏర్పాట్లు అన్నీ తాము చూసుకుంటామని బాలు పేర్కొన్నారు. వివరాలకు 94928 74006, 88973 49872 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి పెద్దకొడప్గల్(జుక్కల్): విద్యార్థుఽలకు విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని తహసీల్దార్ అనిల్ కుమార్ సూచించారు. బుధవారం కాటేపల్లి తండాలోని ప్రాథమిక పాఠశాలలో వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకొని తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని సూచించారు. అనంతరం కాటేపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఆర్ఐ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): గణేశ్ శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని ఎస్సై పుష్పరాజ్ సూచించారు. బుధవారం ఆయన డీజే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు డీజే నిర్వాహకులకు ముందస్తుగా డబ్బులు ఇచ్చి ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి పిట్లం: పటాన్చెరు సమీపంలో బొలెరో వాహనం ఢీ కొని పిట్లం మండలం హస్నాపూర్కు చెందిన శివ(28) అనే యువకుడు మృతి చెందిన ఘటన బువారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పటాన్చెరు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న శివను వేగంగా వచ్చిన ఓ బొలెరో వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివ అక్కడికక్కడే మృతి చెందాడు. శివ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి ఖలీల్వాడి: సారంగపూర్ హనుమాన్ ఆలయం గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి(65–70) చెందినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు బుధవారం తెలిపారు. ఈ నెల 1న గోశాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సదరు వ్యక్తిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పాత కలెక్టరేట్లో గంజాయి విక్రయం! ఖలీల్వాడి: నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో గుర్తు తెలియని వ్యక్తులు గంజాయిని విక్రయించేందుకు వచ్చినట్లు ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. పాత కలెక్టరేట్ మైదానంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఒకటో టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పట్టుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వస్తున్నారనే సమాచారంతో గంజాయి విక్రయానికి వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు రావడంతో పరారైన చోట ఉంచిన బైకులో 20 ప్యాకెట్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బైక్ ను సీజ్ చేసినట్లు ఎస్హెచ్వో తెలిపారు. బైక్, చుట్టూ పక్కల ఉండే సీసీటీవీ పుటేజీ ఆధారంగా గంజాయి అమ్మే వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. గేదెలను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి శివారులో బుధవారం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో రెండు గేదెలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గేదెలను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు గేదెలు లేవలేని స్థితిలో ఉన్నాయని వారు పేర్కొన్నారు. ● ముగ్గురు జిల్లావాసులు మృతి ● పాలాజ్ గణేశ్ మందిరానికి వెళ్లి వస్తుండగా ఘటన వర్ని: మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. వర్ని మండలం హుమ్నాపూర్, బోధన్ మండలం బె ల్లాల్కు చెందిన బంధువులు ఐదుగురు బుధవారం ఉదయం కారులో మహారాష్ట్రలోని పా లాజ్ గణేశ్ మందిరానికి వెళ్లారు. దర్శనం అనంతరం రాత్రి తిరిగి వస్తుండగా నాందేడ్ జిల్లా బోకర్ తాలూక ప్రాంతంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న కా రు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న చేకూరి బుల్లి రాజు(50), అతని భార్య సునీత (45), వాణి (38) అక్కడికక్కడే మృతి చెందగా, గున్నం చంద్రశేఖర్ (35), నీలిమా(45)కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నిజామాబాద్, భైంసా ఆస్పత్రులకు తరలించారు. -
హత్య కేసులో నిందితుడి రిమాండ్
ధర్పల్లి: మండల కేంద్రంలో మహిళపై కత్తెరతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ భిక్షపతి తెలిపారు. బుధవారం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఎస్సై కళ్యాణితో కలిసి నిర్వహించిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ధర్పల్లికి చెందిన కోటగిరి దాసుకు గంగామణితో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకొని వేర్వేరుగా ఉంటున్నారు. తన భార్య దూరం కావడానికి ధర్పల్లికి చెందిన మచ్చ లక్ష్మి, భోజేశ్వర్ అని అనుమానం పెంచుకున్న దాసు వారిని చంపేందుకు ఈనెల 2న లక్ష్మి ఇంటికి వెళ్లాడు. కత్తెరతో ఆమైపె, భోజేశ్వర్ పై దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన నాలుగురికి సైతం గాయాలు కావడంతో వారు చికిత్స పొందుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని బుధవారం పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
సహాయక చర్యల్లో ఆర్డీవో వీణ...
బుధవారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో uవానొస్తుందని ఇంట్లోనే ఉండిపోలేదు. ఎదురైన విపత్తును చూసి వెనుకంజ వేయలేదు. ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో.. ప్రమాదకర పరిస్థితుల్లోనూ పర్యటించారు. బాధితులకు మేమున్నామన్న భరోసా ఇచ్చారు. ఆపద నుంచి ప్రజలను కాపాడేందుకు శ్రమించారు. విపత్కర పరిస్థితుల్లోనూ వెన్నుచూపని ఆ ధీర వనితలు.. విధి నిర్వహణలో తమ అంకితభావంతో ఆదర్శంగా నిలిచారు.కామారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్లో ఏఎస్పీ చైతన్యరెడ్డి సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు వణికించాయి. వినాయక చవితి పండుగ రోజున ఒక్కసారిగా దంచికొట్టిన వాన జిల్లాను అతలాకుతలం చేసింది. జిల్లా కేంద్రంతో పాటు పలు ప్రాంతాలను భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. అలాగే వివిధ మండలాల్లో వాగులు పొంగి ప్రవహించి రోడ్లు కొట్టుకుపోయి ఊళ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, నదుల్లో ఎందరో చిక్కుకుపోయారు. అలాంటి సమయంలో ప్రజలను ఆదుకునేందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రలతోపాటు జిల్లాలోని అధికార యంత్రాంగం మొత్తం రంగంలోకి దిగింది. కలెక్టర్, ఎస్పీ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీంతో చాలావరకు వరదల్లో చిక్కుకున్నవారు సురక్షిత ప్రాంతాలకు చేరగలిగారు. ఈ క్రమంలో మహిళా అధికారులు నిర్వహించిన పాత్ర ఎనలేనిది. వారు వారం రోజులుగా రేయింబవళ్లు బాధ్యతగా విధులు నిర్వహించి ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యాధికారులు, పోలీసు అధికారులు, ఆయా శాఖల సిబ్బంది వరదలు సృష్టించిన విపత్తును ఎదుర్కొనడంలో ఎవరి స్థాయిలో వారు శ్రమించారు. పండుగ పూట కూడా విధుల్లో కొనసాగారు. వ్యవసాయ శాఖలోని మహిళా ఉద్యోగులు సైతం వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి, పంటలను పరిశీలించారు. రైతులకు సలహాలు, సూచనలందించారు. వర్షాల అనంతరం పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసిన పారిశుద్ధ్య కార్మికుల సేవలూ వెలకట్టలేనివి.బీబీపేట చెరువు వద్ద రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్న కామారెడ్డి ఆర్డీవో వీణ పాల్వంచ వాగు వద్ద రెస్క్యూ బృందంతో తహసీల్దార్ హిమబిందుగాంధారి చెరువు అలుగు వద్ద రెస్క్యూ బృందంతో తహసీల్దార్ రేణుకా చౌహాన్ పాల్వంచ తహసీల్దార్ హిమబిందు వరద సహాయక చర్యల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. పాల్వంచ వాగులో చిక్కుకుపోయిన ఇద్దరు రైతులను కాపాడడానికి ఆమె వేగంగా స్పందించి రెస్క్యూ టీంను రప్పించారు. సకాలంలో సాయం అందడంతో ఇద్దరు రైతులు సురక్షితంగా బయటకు రాగలిగారు. మండలంలో ఇతర సహాయక చర్యల్లోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ధైర్యంగా విధి నిర్వహణ విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు శ్రమించిన పలువురు మహిళా అధికారుల సేవలను ప్రశంసిస్తున్న ప్రజలుకామారెడ్డి ఆర్డీవో వీణ డివిజన్లోని ఆయా మండలాల్లో వరద సహాయక చర్యల్లో శ్రమించారు. పట్టణ పరిధిలోని పలు కాలనీలతో పాటు వివిధ మండలాల్లో వరదలో చిక్కుకున్న వారిని రెస్క్యూ చేయడంతో పాటు వారికి ఆశ్రయం కల్పించడానికి ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భారీ వరదలతో బీబీపేట పెద్ద చెరువుకు బుంగపడింది. సమాచారం అందిన వెంటనే పరిస్థితిని తెలుసుకునేందుకు నీటి పారుదల శాఖలో బీబీపేట ఏఈగా పనిచేస్తున్న రవళిక వెళ్లారు. రాత్రంతా అక్కడే ఉండి తాత్కాలిక మరమ్మతులను పరిశీలించారు. -
కవిత సస్పెన్షన్పై గులాబీ శ్రేణుల్లో చర్చ
● కొంతకాలంగా ఎమ్మెల్సీకి దూరంగా జిల్లా నేతలు ● సస్పెన్షన్ సరైనదేనంటున్న బీఆర్ఎస్ నేతలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ చర్యతో గులాబీ శ్రేణులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీని కాదని జాగృతి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు చాలామంది ఆమెకు దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం కామారెడ్డిలో నిర్వహించిన బీసీ సదస్సుకు కొందరు నే తలు హాజరైనా.. తర్వాత వారు కూడా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గానికి చెందిన సంపత్గౌడ్ తెలంగాణ జాగృతి జిల్లా బాధ్యతలు చూస్తున్నారు. పార్టీతోపాటు పార్టీ నేతలపై ఎమ్మెల్సీ కవి త చేసిన విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణు లు ఆందోళనకు గురయ్యారు. అసలేం జరుగుతోందంటూ చర్చించుకున్నారు. కాళేశ్వరం ప్రా జెక్టులో అవినీతంటూ ప్రభుత్వం సీబీఐ వి చారణ కోరడం, దీనిపై కవిత స్పందించి హరీష్రావు, సంతోష్రావులను టార్గెట్ చేయడంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. ఈ విషయం రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. సరైన నిర్ణయం : గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్కరి దో కాదని, 60 లక్షల మంది కార్యకర్తల సొంతమని కా మారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. పార్టీకి న ష్టం కలిగిస్తే ఎంతటి వారిౖపైనెనా చర్య లు ఉంటాయన్నారు. మంగళవారం ఆయన కామారెడ్డిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత కొంతకాలంగా పార్టీకి నష్టం కలిగేలా ప్రకటనలు చేస్తున్నారని, ఇది అందరినీ బాధించిందని పేర్కొన్నారు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్కు ప్రజలు, కార్యకర్తలే ముఖ్యమని, పార్టీకి నష్టం కలిగించేవారు ఎంతటివారైనా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని దీనిద్వారా స్పష్టమైందని పేర్కొన్నారు. స్వాగతిస్తున్నాం.. ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ అన్నారు. పార్టీలో పెద్దా, చిన్నా అనేది ఉండదని, తప్పు ఎవరు చేసినా క్రమశిక్షణా చర్యలు ఉంటాయని స్పష్టమైందని పేర్కొన్నారు. -
బాధితులకు భరోసాగా కిరణ్మయి..
యువ ఐఏఎస్ అధికారి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి వరదలు సృష్టించిన విపత్తులో కీలకంగా పనిచేశారు. మంజీరలో చిక్కుకున్న గొర్రెల కాపరులను రక్షించేందుకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బిచ్కుంద మండలంలో మకాం వేసి రెస్క్యూ టీంలకు దిశానిర్దేశం చేశారు. తాను కూడా బోటులో బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించి, ధైర్యం చెప్పారు. వరదల సమయంలో ఆమె రాత్రింబవళ్లు శ్రమించారు. వరదలతో ఇళ్లు మునిగిపోవడంతో నిరాశ్రయులైన పలు గ్రామా ల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి వారికి ఆశ్రయం క ల్పించడంలో సమర్థవంతమైన సేవలను అందించి ప్రజల మన్ననలు పొందారు.