breaking news
Kamareddy
-
మోడల్ స్కూల్ విద్యార్థినులకు అస్వస్థత
రుద్రూర్: మండలంలోని అంబం(ఆర్) శివారులోగల ఆదర్శ కళాశాల (మోడల్ స్కూల్/కళాశాల)లో పలువురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారంతా రాత్రివేళ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురికావడంతో కేర్ టేకర్ సుజాత రుద్రూర్ పీహెచ్సీ సమాచారం అందించారు. మండల వైద్యాధికారిణి అయేషా సిద్ధికా, ఆరోగ్య సిబ్బంది హాస్టల్కు చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. సుమారు 95మంది విద్యార్థినులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. తీవ్ర అస్వస్థతతకు గురైన 8మంది విద్యార్థినులను వర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. శనివారం సాయంత్రం నలుగురిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యాధికారిణి వెల్లడించారు. ఆరోగ్య సిబ్బంది ఇచ్చిన ఐరన్ మాత్రలను తినకముందు వేసుకోవడం వల్ల అస్వస్థత గురైనట్లు ఆమె వివరించారు. -
కనిపించని డ్రెయినేజీలు
కామారెడ్డి టౌన్ : చిన్నపాటి వర్షం కురిస్తే కామారెడ్డి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే రాకపో కలు నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. దీని కి కారణం పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న మురికి కాలువలను ఆక్రమణలకు గురి కావడమే.. పలు ప్రాంతాల్లో అస లు నాలాల జాడ కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఇళ్ల యజమానులు డ్రెయినేజీలపై స్లాబ్ లు వే సుకోగా.. మరికొన్ని చోట్ల వ్యాపారులు నాలాలను కబ్జా చేసి వ్యాపారాలు సాగిస్తు న్నారు. వర్షపు, మురుగునీరు ప్రవహించేందు కు దారి లేకుండాపోయింది. బల్దియా పారిశుద్ధ్య కార్మికులు కాలువలను శుభ్రం చేద్దామ న్నా చేసే పరిస్థితి లేదు. దీంతో డ్రెయినేజీలు వ్యర్థాలు, పూడికతో నిండిపోవడంతో మురు గు నీరు ముందుకు ప్రవహించడం లేదు. డ్రెయినేజీలను దాటి శాశ్వత నిర్మాణాలు చేపట్టినా అడిగేవారు లేకుండా పోయారు. బల్దియా అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఎక్కడ చూసినా.. కొత్తబస్టాండ్ నుంచి మున్సిపల్కార్యాలయం, నిజాంసాగర్ చౌరస్తా నుంచి హౌజింగ్బోర్డు వైపు వరకు ఇరువైపులా పూర్తిగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్నాయి. ఈ రోడ్ల వెంబడి మురికి కాలువల ఆనవాళ్లు లేకుండా స్లాబులు వేసి వాటిపై వ్యాపారాలు సాగిస్తున్నారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు ఇరు వైపులా ఇదే పరిస్థితి. ఇక స్టేషన్రోడ్, సిరిసిల్ల రోడ్, సుభాష్రోడ్, మాయాబజార్, నాజ్ టాకీస్రోడ్, గంజ్రోడ్, వీక్లీ మార్కెట్రోడ్, జన్మభూమిరోడ్, ఆర్కే లాడ్జ్ రోడ్, అశోక్నగర్ కాలనీ, పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీల ఆనవాళ్లు కనిపించడం లేదు. వానాకాలంలో అటువైపు వెళ్లలేం.. మురికి కాలువల ఆక్రమణలు, వాటిపై స్లాబ్ లు వేయడంతో విద్యానగర్కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ ముందు, పాత బస్టాండ్, సిరిసిల్లారోడ్, దేవునిపల్లిరోడ్, రామారెడ్డిరోడ్, అడ్లూర్రోడ్ తదితర ప్రధాన రహదారులపై రోడ్లు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. వాహనదారులు, పాదచారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి ఉంది. యథేచ్ఛగా ఆక్రమణలు.. వాటిపై నిర్మాణాలు జిల్లా కేంద్రంలో నాలాలపై పర్యవేక్షణ కరువు వానాకాలంలో రోడ్లను ముంచెత్తుతున్న వరద నీరు పట్టించుకోని బల్దియా అధికారులు చర్యలు చేపడుతాం.. పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మురికి కాలువలపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలిగించాలి. కాలువలపై స్లాబ్లు వేసుకుంటే తీసివేయాలి. మున్సిపల్ కార్మికులు డ్రెయినేజీలను శుభ్రం చేసేలా ఉండాలి. లేకుంటే ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటాం. మురికి కాలువలపై ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపడతాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి -
గ్రామ కంఠం అంటే..
బాల్కొండ: గ్రామ కంఠం అనేది ఒక గ్రామంలో నివాసాల కోసం కేటాయించిన భూమిని తెలియజేస్తుంది. గ్రామంలోని ఉమ్మడి స్థలం. ఈ స్థలంలో ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించబడుతాయి. ● గ్రామ కంఠం భూమిని వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, లేదా బదలయించడం కుదరదు. ● భూమిలో నివసించే ప్రజలకు ఆ భూమిపై పూర్తి హక్కులు ఉండవు. కాని వారు దానిని అనుభవించవచ్చు. ●గ్రామ కంఠం భూమిని ప్రభుత్వం అవసరమై తే స్వాధీనం చేసుకుంటుంది. లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటుంది. ●గ్రామ కంఠం భూములను రెవెన్యూ శాఖ నిర్వహిస్తుంది. అవసరమైన పత్రాలను జారీ చేస్తుంది.మీకు తెలుసా? -
క్రైం కార్నర్
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రం సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపైగల రామారెడ్డి బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి ఓ లారీ సర్వీస్ రోడ్డులోకి వెళ్లి రివర్స్ తీసుకుంటుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన ఓంకారం పార్తీ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిలేష్, మహేష్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గాయపడిన వారిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.ట్రాక్టర్ కింద పడి యువకుడు.. నందిపేట్/డొంకేశ్వర్: పొలం దమ్ము చేస్తుండగా కేజ్వీల్స్ ట్రాక్టర్ కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలం శాపూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామానికి చెందిన అవుట్ల నరేశ్(36) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఈ నెల 4న సాయంత్రం అతడు శాపూర్ శివారులోని అల్లూరి ప్రదీప్ రెడ్డికి చెందిన పొలాన్ని దమ్ము చేయడానికి వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్పై ఉన్న నరేశ్ బురదలో పడిపోగా కేజ్వీల్ అతని పైనుంచి వెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి వచ్చి చూసేసరికి నరేశ్ మృతిచెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నరేశ్ భార్య పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్నామని ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. చికిత్స పొందుతూ ఒకరు.. ఖలీల్వాడి: నగరంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నగరంలోని పూలాంగ్కు చెందిన మల్లెపూల సందీప్(36), రవికుమార్ కలిసి కార్పెంట్ షాపు నిర్వహించగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో సందీప్ మనస్తాపం చెంది శుక్రవారం సాయంత్రం చెదల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడు భార్యకు సమాచారం అందించడంతో వెంటనే కుటుంబసభ్యులు అతడిని గుర్తించి, చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
స్పీడ్ బ్రేకర్లతో దెబ్బతిన్న బస్సు
మాచారెడ్డి: మండల కేంద్రంలోని బస్టాండ్లోకి వెళ్లే రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా.. కరీంనగర్ నుంచి కామారెడ్డికి శనివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్లోకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల మూలంగా బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు లగేజీ బాక్సుల డోర్లు ఊడి కిందపడ్డాయి. అలాగే పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయలైనట్టు స్థానికులు తెలిపారు. గతంలో కూడా రెండుసార్లు ఇదే స్పీడ్ బ్రేకర్ల వద్ద ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. ఆర్టీసీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల ఎత్తు తగ్గించాలని పలువురు కోరుతున్నారు. -
భూభారతి దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నెలరోజులలోపు పరిష్కరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సిబ్బందిని ఆదేశించారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి.. రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో 499 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 152 మందికి నోటీసులు అందజేశామని, మిగిలిన వాటీలో చాలావరకు అటవీశాఖకు చెందిన దరఖాస్తులే వచ్చాయని తెలిపారు. నూతనంగా మండలంలో విలీనమైన బాబుల్ గావ్ గ్రామస్తులు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని గ్రామస్తులకు హమీ ఇచ్చారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో సబ్కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవికాంత్,ఆర్ఐ అంజయ్య రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కేవీ కోసం స్థల పరిశీలన మద్నూర్: మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటకు అధికారులు ఎంపిక చేసిన స్థలాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్ మంజూనాథ్ శనివారం పరిశీలించారు. మద్నూర్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు తాత్కాలిక భవనంతోపాటు శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. వారివెంట డీఈవో రాజు, తహసీల్దార్ ముజీబ్, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: గ్రామాల్లో ‘సివిల్ రైట్స్ డే’ కార్య క్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎస్సీ, ఎ స్టీల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శని వారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ ఆ శిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, అధికారులు పు ష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ పాల్గొన్నారు. జిల్లా అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ భూములు, అట్రాసిటీ కేసులపై కమిషన్ సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకట య్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కోసం ఉన్న చ ట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతినెల చివరి వారంలో సివిల్ రై ట్స్డే ను, ప్రతి మూడు నెలలకోసారి డీవీఎంసీ స మావేశాన్ని నిర్వహించి సమస్యలను పరిష్కరించా లన్నారు. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమి టీని ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి 30 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశానికి హాజరై న పలువురు జిల్లా వాసులు తమకు సంబంధించిన కేసులు, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సభ్యులు నీలాదేవి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కల్పించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
స్పెషల్ డ్రైవ్లో 130 సెల్ఫోన్ల రికవరీ
కామారెడ్డి క్రైం: స్పెషల్ డ్రైవ్ ద్వారా 15 రోజుల వ్యవధిలో జిల్లాలో 130 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను రికవరీ చేశామని, వాటి విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని తెలిపారు. సెల్ఫోన్లు చోరీకి గురైనా, పోగొట్టుకున్నా ఆందోళనకు గురికావొద్దని, సీఈఐఆర్ విధానంలో రికవరీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రం లోని కమిషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. ఆలస్యం చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. సెల్ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. రికవరీ అయిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలుపుతామని, జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (87126 86114)ను సంప్రదించి తీపసుకువెళ్లాలని ఎస్పీ సూచించారు. -
ఆదర్శం.. చిన్నకొడప్గల్ సొసైటీ
పిట్లం(జుక్కల్): దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో 2024–25 సంవత్సరంలో చిన్నకొడప్గల్ సొసైటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో సొసైటీ 45 శాతం రుణాలు వసూళ్లు చేసింది. నిజామాబాద్ లోని ఎన్డీసీసీ సెంట్రల్ బ్యాంక్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు చిన్నకొడప్గల్ సొసైటీ కార్యదర్శి హన్మాండ్లును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. చిన్నకొడప్గల్ సహకార సంఘం పరిధిలో 8 గ్రామాలు ఉన్నాయి.సహకార సంఘంలో మొత్తం 4,300 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.ఇందులో 3,476 మంది రైతులకు సభ్యత్వం ఉండగా,ఇందులో 3, 195 మంది రైతులు స్వల్పకాలిక, 281 మంది రైతు లు దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్నారు. దీర్ఘకాలికరుణాలు తీసుకున్న రైతులకు రుణం వడ్డీలో 40 శాతం రాయితీ వస్తుందని బ్యాంక్ సిబ్బంది ద్వా రా,మహజన సభలలో సొసైటీ సిబ్బంది అవగాహన కల్పించడంతో రైతులు రుణాలు చెల్లించడాని కి ముందుకు వచ్చారు.సొసైటీ పరిధిలో 281 మంది రైతులకు రూ.8 కోట్ల దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్నారు. ఇందులో 2024– 25 సంవత్సరంలో 180 మంది రైతుల వద్ద నుంచి రూ. 3 కోట్ల 80 ల క్షల రుణాలు వసూళ్లు చేసి ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆదర్శంగా నిలిచింది. సొసైటీ సిబ్బంది రైతులకు సకాలంలో పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. సి బ్బంది రుణగ్రహీతలకు అవగాహన కల్పించి సమయానికి అప్పులు చెల్లించేలా కృషి చేస్తున్నారు. దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రథమ స్థానం అప్పులు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్న సొసైటీ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాం రుణాల వసూళ్ల కోసం జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారుల సహాయంతో సంఘం పరిధిలోని గ్రామాలలో రుణాలు చెల్లిస్తే వడ్డీలో 40 శాతం రాయితీ వస్తుందని రైతులకు అవగాహన కల్పించాం. రుణాల రికవరీలో సహకరించిన సిబ్బందికి, జిల్లా అధికారులకు కృత్ఞతలు. – హన్మాండ్లు, సొసైటీ కార్యదర్శి, చిన్నకొడప్గల్ కర్షక మిత్ర రుణాలు ఇప్పించాం దీర్ఘ కాలిక రుణాల వసూళ్లలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సొసైటీ మొదటి స్థానంలో నిలవడంతో సంతోషంగా ఉంది. దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి రుణాలు చెల్లించాలని అవగాహ కల్పించా. సంఘంలోని 20 మందికి కర్షక మిత్ర రుణాలు ఇప్పించా. – నాగిరెడ్డి, సొసైటీ చైర్మన్, చిన్నకొడప్గల్ -
పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పదోన్నతి పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. జిల్లా లోని ఆయా పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 13 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వారందరూ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పదోన్నతి చిహ్నాలను ఎస్పీ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్ లభిస్తుందన్నారు. విల్లింగ్ స్టేషన్లు, సీనియారిటీ, దంపతుల సేవలు, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుపుతామన్నారు. పదోన్నతి పొందిన అధికారుల వివరాలు.. కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న రామేశ్వర్ రెడ్డి (లింగంపేట్) మధుకర్ (ఎల్లారెడ్డి), దేవేందర్ (లింగంపేట్), బిఎం.రాజు (దేవునిపల్లి), సిహెచ్. సాయిలు (బిచ్కుంద), జి. రాజు కుమార్ (బిచ్కుంద) ప్రిన్స్ బాబు (వీఆర్), అనిల్ కుమార్ (రాజంపేట), రామారావు (మాచారెడ్డి), సీహెచ్ స్వామి (మాచారెడ్డి), సీహెచ్ శ్రీనివాస్ (నాగిరెడ్డిపేట్), సీహెచ్ మహేందర్ (వీఆర్) సంజీవులు (దేవునిపల్లి) లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించినట్లు ఎస్పీ తెలిపారు. నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి ఎస్పీ రాజేశ్ చంద్ర -
అమ్మాబాపు.. ఎట్లున్నరే..
ఎల్లారెడ్డి: హలో.. అమ్మాబాపు ఎట్లున్నరే.. అంటూ గురుకుల విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఫోన్లో మాట్లాడారు. ‘ఫోన్ మిత్ర‘ కార్యక్రమంలో భాగంగా గురుకుల విద్యార్థులకు ఫో న్ సౌకర్యం శనివారం నుంచి అందుబాటు లోకి వచ్చింది. హాస్టల్ విద్యార్థుల కోసం వి ద్యాశాఖ ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. నలుగురు హాస్టల్ విద్యార్థులకు కలిపి ఒక స్మార్ట్ కార్డు ఇచ్చి వారి తల్లిదండ్రుల, సంరక్షకుల నంబర్లు ఫీడ్ చేశారు. ఈ కార్డు ద్వారా విద్యార్థి తమ కుటుంబసభ్యులతో ప్రతి రోజు 25 నిమిషాలపాటు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫోన్లో 5 నంబర్ డయల్ చేస్తే గురుకుల సొసైటీ కార్యదర్శికి వెళ్తుంది. హాస్టళ్లు, పాఠశాలల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు ఫోన్లో వివరించవచ్చు. ఎల్లారెడ్డి గురుకులంలో 8 ఫోన్లను వేసవి సెలవులల్లో ఏర్పాటు చేసినా శనివారం వాటికి కనెక్షన్ ఇచ్చారు. ‘ఫోన్ మిత్ర’కు అపూర్వ స్పందన గురుకుల పాఠశాలల్లో ప్రారంభం -
నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తాం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులను విక్రయించినా, వినియోగించినా దుకాణాలను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలో కొత్తబస్టాండ్, సుభాష్రోడ్, సిరిసిల్లారోడ్లలో వ్యాపారదుకాణాలు, హోటళ్లను తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో నిషేధిత కవర్లు వినియోగించడంతో యజమానులకు జరిమానాలు విధించారు. విక్రయిస్తున్న కవర్లు, క్యారీబ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సానిటరీ ఎస్ఐ పర్వేజ్, జవాన్లు పాల్గొన్నారు. బీసీలకు యూపీఎస్సీ లాంగ్టర్మ్ ఉచిత కోచింగ్ కామారెడ్డి అర్బన్: యూపీఎస్సీ సివిల్స్కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్ కోసం అర్హులై బీసీ అభ్యర్థుల నుంచి ఈనెల 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖా స్తు చేసిన వారికి ఈనెల 12న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, ఎంపికై న వారికి 25 నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 వరకు హైదరాబాద్లోని సైదాబాద్ లక్ష్మినగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నమ్మించి మోసం చేసిన యువకుడిపై కేసు మోపాల్: మండలంలోని ముదక్పల్లికి చెందిన ఓ మహిళను మోసం చేసిన అస్మత్ ఖాన్ అనే యువ కుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ శనివారం తెలిపారు. అస్మత్ ఖాన్, గ్రామానికి చెందిన సదరు యువతి గత కొంతకాలంగా ప్రే మించుకుంటున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని తెలపడంతో శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో మాటమార్చాడు. దీంతో బాధిత మహిళ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
నేటి ర్యాలీని జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రం నుంచి పిట్లం వరకు చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పుట్టిన రోజును పురస్కరించుకొని ర్యాలీ, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు లోక్యానాయక్, రమేష్యాదవ్, తోట. రాజు, సాయాగౌడ్, శంకర్ తదితరులున్నారు. వాహనాల తనిఖీ పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని అంజనీ చౌరస్తా జాతీయ రహదారి 161పై శనివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పార్థి గ్యాంగ్పై పీడీ యాక్టు నమోదు కామారెడ్డి క్రైం: తరచుగా దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి దొంగల ముఠాపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం జారీ చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాకు చెందిన చోండా అలియాస్ కూలీ పవార్, జాకీ గుజ్జియా భోంస్లే, హరీష్ పవార్ అలియాస్ హర్ష, అనురాగ్ రత్నప్ప భోంస్లే పార్థి తెగకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు. ఈ ముఠా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోగల జాతీయ రహదారుల వెంబడి 9చోట్ల దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. మారణాయుధాలతో రోడ్ల వెంబడి ఆగి ఉన్న వాహనాలను, అందులోని వ్యక్తులను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతుండేవారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా వారిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్ శనివారం నిజామాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడి జైలు అధికారులకు పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు. -
భర్తపై భార్య దాడి
● చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి బోధన్రూరల్: భర్తపై భార్య దాడి చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బోధన్ మండలంలో చోటుచేసుకుంది. బోధన్ రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని మినార్పల్లి గ్రామానికి చెందిన దారావత్ దేశ్య నాయక్ (57) కొంతకాలంగా వ్యసనాలకు బానిసై ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఈ విషయంలో అతడి భార్య సాలు బాయి, కొడుకు వసంత్ల మధ్య తరచూ గొడవలు వస్తుండేవి. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ్యనాయక్పై భార్య సాలు బాయి బలమైన ఇనుప రాడుతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దేశ్య నాయక్ తీవ్రంగా గాయపడగా స్థానికులు, కొడుకు అతడిని చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రి తరలించగా, రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి అన్న కొడుకు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హత్యలో మృతుడి భార్యతోపాటు కొడుకు హస్తం కూడ ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొనగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు. -
సంక్షిప్తం
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి దోమకొండ: తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం దోమకొండ దేశాయి బీడీ కంపెనీ మేనేజర్కు సమ్మె నోటీసును అందజేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు తెలిపారు. బహుజన వామపక్ష కార్మిక సంఘాల భాగస్వామ్య కార్మిక సంఘాలు జేఏసీల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య, ప్రతినిధులు శంకర్,మారుతి,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు, గిరిజన మండల కార్యవర్గం ఎన్నిక లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని బంజారా సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా జాదవ్ దేవీదాస్, గౌరవ అధ్యక్షుడి మెగావత్ గోపాల్, ఉపాధ్యక్షులు మాలోత్ భద్రు, మాలోత్ భీమా, దేవసోత్ దేవిసింగ్, ప్రధాన కార్యదర్శి దేవసోత్ సర్వన్, సహయ కార్యదర్శులుగా బదావత్ నౌషా, బదావత బలరాం, రమావత్ విజయ్, రమావత్ పాండు, కోశాధికారి బానోత్ మోతీరాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బనావత్ శ్రీనివాస్, మోతీసింగ్, ఆయా తండాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు. విఠలేశ్వరాలయంలో ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి విఠలేశ్వరుడి ఆలయంలో శనివారం ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాలలో భాగంగా విఠలేశ్వరుడు, రుక్మిణి పాండురంగనికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి భక్తులు కాకడ హారతి, పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నాగభూషణం, ప్రణయ్కుమార్ శర్మ తదితరులున్నారు. ముస్తాబైన బైరాపూర్ విఠలేశ్వర ఆలయం బాన్సువాడ : తొలి ఏకాదశి పురస్కరించుకుని రుక్మిణి విఠలేశ్వర ఆలయాలు ముస్తాబయ్యాయి. బీర్కూర్ మండలం బైరాపూర్ రుక్మిణి విఠలేశ్వర మందిరానికి శనివారం నుంచే భక్తుల తాకిడి ప్రారంభమైంది. ఆలయ కమిటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ధర్మకర్త ద్రోణవల్లి సతీష్ తెలిపారు. -
విఠల విఠల
స్వామికి ఇంట్లోనే ఆలయంమద్నూర్ మండల కేంద్రానికి చెందిన వట్నల్వార్ కృష్ణ, రుక్మిణీ దంపతులు పండరీపూర్ విఠలేశ్వరుని భక్తులు. ఏడాది క్రితం నూతన ఇంటిని నిర్మించుకున్న సమయంలో ఇంట్లో విఠలేశ్వరునికి గుడి కట్టించుకున్నారు. మూడు అడుగుల ఎత్తుతో ఉన్న విఠలేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లోని గుడిలో ప్రతిష్టించారు. నిత్యం స్వామివారికి వస్త్రాలంకరణసేవ, నైవేద్యం, అర్చనలు చేస్తారు. తొలి ఏకాదశి రోజున పె ద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. పండరిపూర్ ఆలయంలో కొనసాగే పూజావిధానా న్నే తన ఇంట్లోని ఆలయంలో పాటిస్తారు. ● పాండురంగని దర్శనం కోసం పండరీపూర్కు.. ● జిల్లా నుంచి ‘దిండి’ పాదయాత్ర ● తొలిఏకాదశి రోజున దర్శనంతో పులకించనున్న భక్తులుఉత్తమ సొసైటీగా ఉత్తునూర్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ఉ త్తునూర్ సొసైటీ ఉత్తమ సొసైటీగా ఎంపికై ంది. గత పది సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక రుణాలు రూ.3 కోట్ల 5 లక్షలు వసూలయ్యా యి. విండో చైర్మన్ కాట్మండి ప్రభాకర్రావు, సీఈవో నహీంను గ్రామస్తులు, రైతులు అభినందించారు. 2024–2025 ఆర్థిక సంవ్సరంలో కామారెడ్డి జిల్లాలో ఐదో స్థానంలో ఉన్న ట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. సొసైటీల ద్వారా రైతులు పొందిన రుణాలు సకాలంలో తిరిగి చెల్లించి రైతు సహకార సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాంచందర్రావు, నిట్టూరి వెంకట్ రావు, డీకే రావు, శి వాజీరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సాహిత్యం ఎంతో గొప్పది కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి జిల్లా సాహి త్యం ఎంతో గొప్పదని, సాహితీవేత్తల కృషి అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి అన్నారు. తె లంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అ ధ్యక్షుడు గఫూర్ శిక్షక్, ప్రతినిధులు శనివా రం చంద్రకాత్రెడ్డిని సన్మానించి తెరవే జిల్లా కవులు, రచయితల పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాట్లాడుతూ.. జిల్లా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలకు గ్రంథాలయాల్లో ప్ర త్యేక చోటు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు మంద పీ తాంబర్, బి నాగభూషణం, కాసర్ల రామ చంద్రం, కౌడి రవీందర్, తిరుపతిరావు, గా యని సంధ్య, బానోత్ సురేశ్, లక్కీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలి కామారెడ్డి టౌన్: పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రజలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్ అన్నారు. మున్సిపల్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో శనివారం చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రజలు, వ్యాపారులు చెత్త ను రోడ్లపై, మురికి కాలువల్లో వేయకుండా చెత్తసేకరణ ఆటోలకు ఇవ్వాలని కోరారు. సకాలంలో ఆస్తి, కులాయి పన్ను చెల్లించాలన్నారు. శానిటేషన్, తాగునీరు, తదితర సమస్యలుంటే నేరుగా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, శానిటరీ ఎస్సై ఫర్వేజ్, జవాన్లు ఉన్నారు. ● దశాబ్దాలుగా వెళ్తున్న భక్తులు ఎందరో.. ● అక్కడికి వెళ్లలేనివారు జిల్లాలోని బైరాపూర్ గుడికి..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో విఠలేశ్వరుడిని వేలాది కుటుంబాలు పూజిస్తాయి. వారంతా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున విఠలేశ్వరుడిని దర్శించుకుంటారు. మహారాష్ట్రలోని పండరీపూర్లో కొలువైన విఠలేశ్వరుడు, రుక్మిణీదేవి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తారు. ఉమ్మడి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ, పెద్ద కొడప్గల్, నిజాంసాగర్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, గాంధారి, కోటగిరి, రుద్రూ ర్, వర్ని, పొతంగల్, బోధన్ తదితర మండలాల నుంచి ఏటా తొలి ఏకాదశికి పక్షం రోజుల ముందుగానే వేలాది మంది ‘దిండి’పేరుతో పాదయాత్రగా బయలుదేరి వెళ్తా రు. 320 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి దర్శనం చేసుకుంటారు. వేలాది మంది రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లి తొలి ఏకా దశి రోజు పండరీపూర్కు చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. దారి పొడవునా స్థానికులు ‘దిండి’గా వెళ్తున్న భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తారు. మరికొందరు వాహనాల్లో వెళ్తారు. పండరీపూర్కు పాదయాత్రగా వెళ్తున్న భక్తులు హిప్పర్గ నుంచి పాదయాత్రగా బైరాపూర్ విఠలేశ్వర ఆలయానికి వెళ్తున్న భక్తులుఇరవై ఏళ్లుగా వెళ్తున్నా.. ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది పండరిపూర్ కు పాదయాత్రగా వె ళ్తున్నా. విఠలేశ్వరుని అనుగ్రహంతో శక్తి ఉన్నన్ని రోజులు ఏటా తొలి ఏకాదశికి చేరుకునేలా పాదయాత్రగా వెళ్లి వస్తూనే ఉంటా. వేలాది మంది మా ప్రాంతం వాళ్లు పండరిపూర్కు వస్తారు. – కొనింటి విఠల్, బిచ్కుందవిఠలేశ్వరుడి అనుగ్రహంతోనే.. ప్రతి ఏడాది పండరిపూర్లోని విఠలేశ్వరుడిని దర్శించుకుంటా. కొన్నేళ్లుగా విఠలేశ్వర స్వామి వద్దకు వెళ్లి రావడం జరుగుతోంది. మాకు విఠలేశ్వరుడే అన్నీ. స్వామిని నమ్ముకున్నోళ్లకు ఏలోటు ఉండదు. అంతా స్వామిదయ. ఇరవై ఐదేళ్లుగా వెళ్తున్నా. – సంగాయప్ప స్వామి, మద్నూర్ దైవచింతనలో ఉంటాం విఠలేశ్వరుడిని నమ్ముకున్నం. నిత్యం దైవ చింతనలో ఉంటాం. పదిహేనేళ్లుగా క్రమం తప్పకుండా పండరిపూర్కు వెళ్లి దర్శనం చేసుకుని వస్తున్నాను. అంతా స్వామి నడిపిస్తున్నాడు. చేతనైనన్ని రోజులు వెళ్లి వస్తూనే ఉంటా. – వెంకట్ మహారాజ్, మద్నూర్ నాలుగు దశాబ్దాలుగా వెళ్తున్నా నేను సుమారు 41 ఏళ్లుగా పండరిపూర్కు వెళ్తున్నాను. విఠలేశ్వరుడి అనుగ్రహంతో ఇప్పటికీ క్రమం తప్పకుండా వెళ్లి వస్తున్నాను. అంతా స్వామి దయ. ప్రతి ఏడాది వెళ్లి వస్తాను. నాతోపాటు మా ఊరి వాళ్లు చాలా మంది వస్తారు. – దార్పల్ సాయిలు, బిచ్కుంద న్యూస్రీల్బైరాపూర్లో విఠలేశ్వరుడు నస్రుల్లాబాద్ మండలం బైరాపూర్లో కొలువైన విఠలేశ్వరస్వామి ఆలయానికి కూడా తొలి ఏకాదశి రోజున వేలాది మంది భక్తులు తరలివస్తారు. పండరిపూర్కు వెళ్లలేని వాళ్లంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనానికి వచ్చిన భక్తులకు స్థానిక ఆలయ నిర్వాహకులు అన్నదానం చేస్తారు. బైరాపూర్ ఆలయానికి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలి ఏకాదశి రోజున బైరాపూర్ ఆలయం జనంతో కిక్కిరిస్తోంది. పుండరీకుడు తన తల్లిదండ్రులకు చేస్తున్న సేవను చూస్తూ ముగ్ధుడైన ఆ మహావిష్ణువు (పాండురంగడు) రెండు చేతులు నడుముకు పెట్టుకుని ఇటుకపై అలానే నిల్చుండిపోయాడు. విఠోబ.. విఠలేశ్వరుడు.. పాండురంగడు ఏ పేరుతో పిలిచినా స్వామి పలుకుతాడని భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ప్రతి ఏడాది భక్తులను పండరీపురానికి నడిపిస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ‘దిండి’గా తరలివెళ్లారు. -
ధర్మాబాద్ కారం పొడి : రూ.లక్షల్లో వ్యాపారం..!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ అనే చిన్న పట్టణం కారంపొడికి చిరునామాగా నిలుస్తోంది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రైళ్లన్నీ ధర్మాబాద్ మీదుగానే నడుస్తాయి. బాసర దాటగానే ధర్మాబాద్ వస్తుంది. అక్కడ లభించే మిరపకాయల నాణ్యత బాగుంటుందన్న పేరు రావడంతో.. చాలామంది రైళ్లలో ధర్మాబాద్ వెళ్లి కిలోల కొద్దీ తెచ్చుకునేవారు. నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, నిర్మల్ తదితర జిల్లాల నుంచి చాలామంది మహిళలు వెళ్లేవారు. నాణ్యమైన మిరపకాయలు కొనుగోలు చేసి, అక్కడే గిర్నీ పట్టించుకుని కారంపొడి ముల్లెలతో తిరిగి వచ్చేవారు. కాగా, మూడు నాలుగేళ్లుగా కొందరు ధర్మాబాద్ కారంపొడి పేరుతో తెలంగాణ ప్రాంతంలోని వివిధ పట్టణాలు, మండలాల్లో దుకాణాలను తెరిచారు. పట్టణ శివార్లలో ప్రధాన రహదారుల పక్కన షెడ్లను నిర్మించి గిర్నీలు ఏర్పాటు చేసుకుని అక్కడే విక్రయిస్తున్నారు. మిర్చి ధర్మాబాద్ నుంచే వస్తుందని చెబుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. ధర్మాబాద్ కారంపొడికి డిమాండ్ కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, నిర్మల్ తదితర పట్టణాల్లో ధర్మాబాద్ కారం పొడి దుకాణాలు వెలిశాయి. పలు మండల కేంద్రాలలోనూ దుకాణాలను ఏర్పాటు చేసి మిరపపొడి అమ్ముతున్నారు. కారంపొడి గిర్నీలు, దుకాణాలన్నింటికీ ధర్మాబాద్ కారంపొడి అన్న బోర్డే ఉంటోంది. ప్రజలు కూడా ధర్మాబాద్ అన్న పేరుంటే చాలు వెళ్లి తెచ్చుకుంటున్నారు. ధరల వివరాలు నాణ్యమైన రకం కిలో కారం పొడిని రూ.300కు విక్రయిస్తున్నారు. రెండో రకం రూ.280, మామూలు రకం, ఉప్పు కలిపిన కారంపొడి కిలో రూ.250కు అమ్ముతున్నారు. దుకాణాలు, గిర్నీలు ఏర్పాటు చేసిన వారిలో.. కొందరు ధర్మాబాద్ నుంచి వచి్చన వ్యాపారులు ఉండగా, మరికొందరు స్థానిక వ్యాపారులు ఉన్నారు. రూ.లక్షల్లో వ్యాపారం.. కారంపొడి అమ్మకాలు పెద్దఎత్తున నడుస్తున్నాయి. మొన్నటి వరకు మామిడి తొక్కుల సీజన్ నడిచింది. ఆ సీజన్లో టన్నుల కొద్దీ కారంపొడి అమ్మకాలు సాగాయి. ధర్మాబాద్ కారంపొడి అనగానే జనం ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. మిర్చి ఎక్కడి నుంచి వస్తుందో తెలియకున్నా.. ధర్మాబాద్ బ్రాండ్తో అమ్మకాలు భారీ ఎత్తున నడుస్తున్నాయి. సీజన్లో అయితే ఒక్కొక్క దుకాణంలో రూ.లక్షల్లో వ్యాపారం నడుస్తోందని సమాచారం. -
పార్కింగ్కు చోటేది?
● కొంచెం స్థలం కూడా వదలకుండా నిర్మాణాలు ● సెల్లార్లలోనూ దుకాణాల ఏర్పాటు ● రోడ్లపైనే వాహనాలను నిలపాల్సిన పరిస్థితి ● ఇబ్బందిపడుతున్న వాహనదారులు, పాదచారులు ● పట్టించుకోని అధికారులుకామారెడ్డి టౌన్ : నాలుగు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జిల్లా కేంద్రం అయ్యాక రాకపోకలు మరింత పెరిగాయి. అయితే వాహనాలను నిలిపేందుకు స్థలం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. రోడ్లపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది. నిబంధనలప్రకారం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేప్పుడు సెల్లార్ను పార్కింగ్కోసం వదలాల్సి ఉంటుంది. కానీ సెల్లార్లను నిర్మించినా.. వాటిలోనూ దుకాణాలను ఏర్పాటు చేశారు. కొందరు డ్రెయినేజీలు, రోడ్లను ఆనుకొని నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లతో పాటు వ్యాపార సముదాయాల ఏరియాల్లో పార్కింగ్ స్థలాలు లేక వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. రద్దీ సమయాల్లో ఆయా రోడ్లపై నడవడం కూడా ఇబ్బందిగా ఉంటోంది. ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా బల్దియా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనుమతులు ఒకలా.. నిర్మాణం మరోలా.. జిల్లా కేంద్రంలో 25 వేల వరకు గృహాలున్నాయి. ప్రధాన రోడ్లపై వ్యాపార దుకాణాలు 5,500 లకుపైగా ఉన్నాయి. సెల్లార్లతో కూడిన భవనాలు 50 కిపైగా ఉంటాయి. కొన్ని సెల్లార్లలో వ్యాపార దుకాణాలను నిర్మించుకుని యజమానులు యథేచ్ఛగా అద్దెలకు ఇచ్చుకున్నారు. చాలా భవనాలు సెట్ బ్యాక్ లేకుండా రోడ్లు, మురికి కాలువలపైనే నిర్మించారు. వీరంతా మున్సిపాలిటీ అనుమతుల ఒకలాగా ప్లానింగ్ తీసుకుని, నిర్మాణాలు మాత్రం మరొకలా చేపట్టారు. ఓపెన్ స్థలాలలో ఏర్పాట్లు చేస్తే.. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే చోట మున్సిపాలిటీకి సంబంధించిన ఓపెన్ స్థలాలున్నాయి. వీటిలో వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే సుభాష్రోడ్, మాయాబజార్, వీక్లీమార్కెట్రోడ్, నాజ్టాకీస్ రోడ్ల పార్కింగ్ సమస్య తీర్చేందుకు గాంధీగంజ్లో, పొట్టిశ్రీరాములు విగ్రహం పక్కన, గంజ్ ప్రభుత్వ స్కూల్ ముందు, లయన్స్ క్లబ్ సమీపంలోని మున్సిపల్ స్థలాలను పార్కింగ్ కోసం వినియోగించుకుంటే ట్రాఫిక్ సమస్య కొంత తీరే అవకాశాలున్నాయి. చర్యలు తీసుకుంటాం పట్టణంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అనుమతి లేని సెల్లార్ల యజమానులకు, రోడ్లపై ఆక్రమణదారులకు నోటీసులను జారీ చేస్తాం. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి నిర్వాహకులకు సూచిస్తాం. పోలీసు శాఖ సమస్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రోడ్లు, చౌరస్తాలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు అలా నిలపకూడదు. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి అంతటా ట్రాఫికర్..జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లు, కూడళ్లతో పా టు, గల్లీల్లోనూ పార్కింగ్ సమస్య నెలకొంది. సుభాష్రోడ్, మాయాబజార్, నాజ్టాకీస్రోడ్, సిరిసిల్లరోడ్, వీక్లీమార్కెట్రోడ్, స్టేషన్రోడ్, పోలీస్స్టేషన్రోడ్, నిజాంసాగర్చౌరస్తా, జాతీ య రహదారి, కొత్తబస్టాండ్, దేవునిపల్లిరోడ్, జన్మభూమిరోడ్, అశోక్నగర్ కాలనీ, పాతబస్టాండ్, అడ్లూర్రోడ్లలో పార్కింగ్ సమస్య తీ వ్రంగా ఉంది. కొత్తబస్టాండ్, నిజాంసాగర్ చౌర స్తా ముందు హోటళ్లు, బార్లు, వ్యాపార దుకాణాల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు. అలాగే పాతబస్టాండ్, సిరిసిల్లరోడ్లో బ్యాంకుల ముందు కూడా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. గల్లీల లో కూడా డ్రెయినేజీ వరకు నిర్మాణాలతో పా ర్కింగ్కు సమస్యలు ఏర్పడుతున్నాయి. -
పేలుడు పదార్థాల కలకలం
కామారెడ్డి క్రైం : పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల నిల్వలు బయటపడడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. ఓ ఇంటి నిర్మాణం కోసం బండరాళ్ల బ్లాస్టింగ్కు ఈ సామగ్రిని వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పీఎంహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న చింతల శ్రీధర్కు కేపీఆర్ కాలనీలో ఓ ప్లా టు ఉంది. దాంట్లో ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించాడు. గుంతలు తీయగా వచ్చిన బండరాళ్లను పేల్చివేసి తొలగించడానికి బొంత సంపత్, లక్ష్మీనారాయణ, రాజులతో రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమ పద్ధతిలో సేకరించిన జిలెటిన్ స్టిక్స్, డి టోనేటర్లు, కార్డెక్స్ వైరు, బ్యాటరీలతో బండరాళ్లను పేల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు దీనిని గమనించి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరోచోట పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం బయటపడింది. పట్టణానికి సమీపంలోని లింగాపూర్ శివారులో ఇటీవలే వెలసిన శ్రీవారి వెంచర్లోని రేకుల షెడ్డులో 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 16 బెండల్స్(సుమారు 4,300 మీటర్లు) కార్డెక్స్ వైరు, బ్యాటరీ, ఒక చెక్ మీటర్, ఇతర సామగ్రిని అక్రమంగా నిల్వ చే సినట్లు గుర్తించారు. వాటన్నింటినీ స్వాధీనం చేసు కున్నారు. శంకర్, స్వామి అనే వ్యక్తుల ద్వారా పేలు డు పదార్థాలను తెప్పించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతానికి చింతల శ్రీధర్, సంపత్, లక్ష్మీ నారాయణ, రాజులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. విచారణ కొనసాగుతుందన్నారు. విచారణలో చాకచక్యం గా వ్యవహరించిన ఎస్హెచ్వో నరహరి, ఎస్సై శ్రీ రాం, కానిస్టేబుళ్లు నరేష్, విశ్వనాథ్, అనిల్, విజయ్ గౌడ్, వినయ్, సంపత్, నర్సారెడ్డిలను అభినందించారు.వెంచర్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలుజిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల పేల్చివేత..కేపీఆర్ కాలనీలోని శ్రీధర్ ప్లాట్లో బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను సిద్ధం చేసి ఉంచినట్లు గుర్తించిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించారు. శుక్రవారం సాయంత్రం కాలనీలో ప్రజల రాకపోకలను నిలిపివేసి ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటిపై మట్టి కుప్పలు పోయించి, జాగ్రత్తలు తీసుకుంటూ పేల్చివేశారు. జిల్లాకేంద్రంలో 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు స్వాధీనం 16 బెండళ్ల కార్డెక్స్ వైరు, ఇతర సామగ్రి సైతం.. రాళ్ల బ్లాస్టింగ్కు ఉపయోగిస్తుండగా పోలీసులకు సమాచారం నలుగురిపై కేసు నమోదు, నిందితుల రిమాండ్ -
ఎరువుల కొరత లేకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కల్తీ విత్తనాలు, ఎరువులను విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఖరీఫ్లో రైతులకు పంపిణీ చేయడానికి ఇప్పటికే జిల్లాకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇంకా ఎంత అవసరం ఉంటుందో నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. జిల్లాకు నిర్దేశించిన 2,500 ఎకరాలలో పామాయిల్ తోటల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి 200 ఎకరాలను టార్గెట్గా నిర్దేశించుకుని తోటల పెంపకం లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, డీఏవో తిరుమల ప్రసాద్, ఏఎస్పీ నర్సింహారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఏడీఏలు పాల్గొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కేసులు పెట్టండి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
గాంధారి : ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖాధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శుక్రవారం జిల్లాలోని వ్యవసాయ శాఖాధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు ఆయిల్పాం తోటలు, ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించారు. ఆయిల్పాం మొక్కలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తుందన్నారు. ఇందులో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏడీఏలు అపర్ణ, సుధా మాధురి, మండల ఏవో రాజలింగం తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల తనిఖీ నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం డీఈవో రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ గతేడాది పదో తరగతి, ఇంటర్లలో ఉత్తీర్ణత శాతం బాగుందన్నారు. పాఠశాల నిర్వహణ, మెనూ అందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ మాధవరావు, సిబ్బంది చరణ్ కుమార్ ఉన్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం రాక కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఐదుగురు సభ్యుల బృందం శనివారం జిల్లాకు రానుంది. ఈ విషయాన్ని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ పీడన నిరోధక చట్టం(పీసీఆర్ యాక్ట్), అట్టడుగు వర్గాలపై దాడులను నిరోధించే ప్రత్యేక చట్టం (పీవోఏ యాక్ట్), ల్యాండ్, సర్వీస్ విషయాలపై ఆయన సమీక్షిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి బాధితులు హాజరవ్వాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు వేరొక ప్రకటనలో కోరారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వినతి పత్రాలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. -
ప్రమాదవశాత్తు కంటైనర్ దగ్ధం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని దగ్గి గ్రామ శివారులోగల 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ కంటైనర్ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ దగ్గి శివారులోకి రాగానే వాహనం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. లారీలో ఉన్న వివిధ రకాల పార్సిళ్లు, కొరియర్ వస్తువులు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సదాశివనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఒకరి రిమాండ్ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామానికి చెందిన లెగ్గల రాజు అనే వ్యక్తిని రిమాండుకు తరలించినట్లు ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. లింగంపేటకు చెందిన చాకలి రాకేష్ను ఏప్రిల్ 14న రాత్రి సమయంలో రాజు చంపడానికి ఇనుప రాడ్తో దాడి చేసి గాయపరిచాడన్నారు. ఈ ఘటనపై రాకేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రాజును గురువారం రాత్రి అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు తెలిపారు. గంజాయి విక్రేత పట్టివేత ఖలీల్వాడి: నగర శివారులోని దుబ్బ బైపాస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎకై ్సజ్ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం సాయంత్రం బైపాస్ రోడ్డులో నిఘా ఉంచగా, రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన పుల్లె లక్ష్మీనర్సింహ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై నర్సింహచారీ, హెడ్ కానిస్టేబుళ్లు భూమన్న, రాజన్న, కానిస్టేబుళ్లు భోజన్న, విష్ణు, అవినాష్, సాయి కుమార్, రాంబచ్చన్ ఉన్నారు. డ్రంకెన్డ్రైవ్ కేసులో ఒకరికి జైలుబోధన్: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా రాకాసీపేటకు చెందిన అర్షద్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి శుక్రవారం బోధన్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి శేషతల్ప సాయి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. చెరువులో పడి ఒకరి మృతి బోధన్: ఎడపల్లి మండలం ధర్మారం గ్రామ శివారులోని సిద్ధ చెరువులో ఓ వ్యక్తి చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ధర్మారం గ్రామానికి చెందిన మేకల ప్రశాంత్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అక్రమ నిర్మాణం తొలగింపుబీబీపేట: మండల కేంద్రంలోని స్థానిక వారాంతపు సంత వద్ద అక్రమంగా నిర్మించిన దుకాణం డబ్బాను శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తొలగించారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం అందించకుండా రాత్రి వేళలో నిర్మించడంతో ఉదయాన్నే అధికారులు తొలగించారు. నిర్మించిన వారిని పిలిపించి మందలించారు. -
రోశయ్య సేవలు మరువలేనివి
కామారెడ్డి క్రైం: దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రోశయ్య జయంతిని కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్గా రోశయ్య అందించిన సేవలు విలువైనవని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సాయిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
అనుమతి లేని పాఠశాల సీజ్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో గల మార్కెట్ రోడ్డులో శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్న పాఠశాలను ఎంఈవో నాగేశ్వరావు సీజ్ చేశారు. శుక్రవారం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనితో ఎంఈవో పాఠశాల అనుమతి పత్రాలను తనిఖీ చేసి చూడగా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించవద్దని సూచించారు. నేతలు రాథోడ్ జీవన్, వంశీ నాయక్ ఉన్నారు. అటవీభూములను ఆక్రమిస్తే కఠిన చర్యలునాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పరిధిలోని అటవీ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక ఎఫ్ఆర్వో వాసుదేవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా అటవీ భూమిలోకి ప్రవేశించి చెట్లను, వాటి కొమ్మలను నరికినా, అటవీ భూమిని చదునుచేసినా, దున్నినా, అడవిలో దారులు ఏర్పాటు చేసినా, అటవీభూముల సరిహద్దులను చెరిపేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతోపాటు అటవీభూముల నుంచి ఇసుక, మొరం, రాళ్లు తరలించినా, వన్యప్రాణులను వేటాడినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఉపయోగించిన జేసీబీ, ట్రాక్టర్, లారీ, ఆటో, బైక్ వంటి వాహనాలను సైతం సీజ్ చేస్తామని చెప్పారు. -
కొబ్బరి కొండెక్కింది!
బొండం నుంచి నూనె వరకు.. ● భారీగా పెరిగిన ధరలుభిక్కనూరు : ఆషాఢ మాసం అయినప్పటికీ కొబ్బరి కాయల ధరలు కొండెక్కాయి. పక్షం రోజుల్లోనే 20 శాతం పెరిగాయి. పదిహేను రోజుల క్రితం ఒ క్కో ఎండు కొబ్బరికాయ ధర రూ. 25 ఉండేది. ప్రస్తుతం రూ. 30కి చేరింది. కొబ్బరి బొండం కూడా రూ. 50 నుంచి రూ. 80 వరకు వి క్రయిస్తున్నారు. కుడుకల ధరల కూ రెక్కలొ చ్చాయి. పక్షం రో జుల్లోనే కిలో కుడుకల ధర రూ. 280 నుంచి రూ. 400లకు చేర డం గమనార్హం. కొబ్బరి నూనె ధర కూడా పెరిగింది. 175 ఎంఎల్ కొబ్బరి నూనె ధర గతంలో రూ. 70 ఉండగా ప్రస్తుతం రూ. 125 కు విక్రయిస్తున్నారు. కొబ్బరి ధరలు ఇలా భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట తక్కువగా ఉండడంతోనే ధరలు పెరుగుతు న్నాయని వ్యాపారులంటున్నారు. -
పూడికతీతకు మోక్షం
● పోచారం ప్రధానకాలువలో పనులకు రూ.40 లక్షల నిధులు మంజూరు ● పూర్తయిన టెండర్ ప్రక్రియనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధానకాలువలో పూడికతీత, పొదల తొలగింపుతోపాటు కాలువకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు, పొదల తొలగింపునకు మోక్షం లభించనుంది. చాలాకాలంగా ప్రధాన కాలువలో పెరిగిన చెట్లతోపాటు పూడిక వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలిగి చివరి ఆయకట్టుకు నీరు చేరేందుకు ఎన్నో ఇబ్బందులు కలిగేవి. దట్టంగా పెరిగిన చెట్లతోపాటు పూడికను, కాలువకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలను తొలగించాలని స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో అధికారులు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కింద రూ.40 లక్షల నిధులను మంజూరు చేశారు. పనులకు సంబంధించి ఇటీవల అధికారులు టెండర్ ప్రక్రియను పూర్తిచేశారు. త్వరలోనే కాలువలో పూడికతీత పనులు చేపట్టనున్నారు. నిధుల మంజూరులో ఆలస్యం.. పోచారం ప్రధాన కాలువలో పూడికతీత, చెట్ల తొలగింపు పనులకు నిధుల మంజూరులో ఆలస్యమయింది. ఇటీవల రబీ పంటలసాగు పూర్తయ్యేనాటికి నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయ్యుంటే వేసవిలో కాలువ మరమ్మతు పనులు చేపట్టేందుకు వీలుగా ఉండేది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవడంతోపాటు ప్రాజెక్టు నిండితే వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల కాలువ మరమ్మతు పనులకు ఆటంకం కలుగనుంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.నీరందేలా చేయాలి పోచారం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టుకు అందడంలేదు. ప్రధానకాలువలో దట్టంగా పెరిగిన చెట్లతోపాటు పూడిక వల్ల నీరు చివరి ఆయకట్టు వరకు చేరడానికి చాలా సమయం పడుతోంది. ప్రధానకాలువలో పెరిగిన చెట్లను, పూడికను తీసేస్తే నీరు సకాలంలో చేరుతుంది. కాలువలో పెరిగిన చెట్లకొమ్మలను తొలగించడంపై అధికారులు దృష్టి సారించాలి. – పట్లోళ్ల భాగయ్య, రైతు, ఆజామాబాద్, ఎల్లారెడ్డిచాలా ఇబ్బందవుతుంది పోచారం గ్రామశివారులో ప్రధానకాలువ పక్కన ఉన్న నా పొలానికి వెళ్లాలంటే కాలువ కట్ట వెంట పోవాలి. కాలువ కట్టకు ఇరువైపులా దట్టంగా తుమ్మ చెట్లు పెరిగాయి. పొలానికి వెళ్తుంటే చెట్ల కొమ్మలు కళ్లకు తగులుతున్నాయి. వాటిని తొలగించాలని అధికారులకు విన్నవించాం. నిధులు మంజూరయ్యాయని తెలిసింది. అధికారులు స్పందించి చెట్లకొమ్మలను తొలగించాలి. – రాజు, రైతు, పోచారం, నాగిరెడ్డిపేట -
పురుగు మందుల దుకాణాల తనిఖీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పురుగు మందుల దుకాణాలను గాంధారి ఏవో రాజలింగం, ఎల్లారెడ్డి ఏవో నదీమ్, ఎస్సై ఆంజనేయులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. పురుగు మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన వ్యవసాయశాఖాధికారులు పోలీసులతో కలిసి తనిఖీలు చేసి దుకాణాల్లో విక్రయించే మందులు, రికార్డులు పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలి పిట్లం(జుక్కల్): నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే అరుణతార డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడంతో ఆమె నాయకులతో కలిసి శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. అనంతరం అరుణతార మాట్లాడుతూ.. రోడ్లను అస్తవ్యస్తంగా తవ్వేసి పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. దీంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాయకలు అశోక్ రాజ్, రవి చంద్ర, మండల పార్టీ అధ్యక్షులు గుండా సాయిరెడ్డి, మాజీ అధ్యక్షుడు అభినయ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఉపాధ్యక్షులు సాయి గొండ, తదితరులు పాల్గొన్నారు. -
మల్కాపూర్లో ఉద్రిక్తత
● అక్రమ ఇంటి నిర్మాణాన్ని తొలగించిన అధికారులు ● ఆత్మహత్యకు యత్నించిన కుటుంబీకులుఎల్లారెడ్డి: మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఇంటి నిర్మాణం కూల్చివేతతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెద్దెడ్ల నర్సింలు (బీజేపీ మండల అధ్యక్షుడు) ప్రభుత్వ స్థలంలో రెండు గజాల, ఆరు అంగులాల స్థలం ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో సదరు ఇంటి యజమానికి నిర్మాణం నిలిపివేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా ఇంటి నిర్మాణం చేపట్టడంతో డీఎల్పీవో సురేందర్ శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయించారు. అంతకుముందు కూల్చివేతకు వచ్చిన అధికారులను ఇంటి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కుటుంబసభ్యులు అశోక్, రాకేష్, కృష్ణలు ఒంటిపై పెట్రోలు పోసుకోవడంతో పోలీసులు స్పందించి వారిపై నీరు పోసి, ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్కు తరలించారు. గ్రామంలోకి ఎవరు రాకుండా డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేష్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుడు నర్సింలు మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఇంటి నిర్మాణం కూల్చివేయించారని ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమ నిర్మాణం చేయలేదని తన సొంత స్థలంలోనే నిర్మించుకున్నట్లు తెలిపారు. -
రామారెడ్డిని రక్షించే అష్ట భైరవులు
మీకు తెలుసా? రామారెడ్డి గ్రామా న్ని పురాతన కాలం నుంచి ఊరు చుట్టూ ఉన్న అష్ట భైరవులు రక్షిస్తుంటారని గ్రామస్తుల ప్రగాడ విశ్వాసం. అష్ట భైరవు లు స్వయంభుగా వెలియగా, కాలక్రమేణ రెండు విగ్రహాలు మాత్రమే పూజలందుకుంటున్నాయి. ● గ్రామంలోని 12ఫీట్ల దిగంబర కాలభైరవుడి విగ్రహానికి ఆలయంతోపాటు నిత్య పూజలందుకుంటుండగా, మరో విగ్రహం కాశిపల్లి కా లభైరవుడిగా పూజలు అందుకుంటున్నాడు. మిగతా విగ్రహాలు కనుమరుగయ్యాయి. ● దేశంలోని కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కాలభైరవుడి ఆలయాలు ఉన్నా, ప్రత్యేకంగా ఆలయం ఉన్నది మాత్రం ఇక్కడే. ● స్వామివారికి వైశాఖమాసంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. ● ప్రతి యేటా కార్తీక బహుళ పంచమి నుంచి నవమి వరకు కాలభైరవుడి జన్మదిన ఉత్సవాలు నిర్వహిస్తారు. ● గతంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కాలభైరవుడి భయంకర విగ్రహానికి ఆవు పేడ పూసి కానరాకుండా చేయడంతో రెండు మూడు రోజులకే సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవి. ● గ్రామాన్ని కాలభైరవుడు రక్షిస్తుండటంతో ప్రజలు భక్తితో పూజలు నిర్వహిస్తూ, అభివృద్ధిలోకి తెచ్చారు. ● స్వామివారికి వామాచార, దక్షిణాచార పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తారు. ● ఈ ఆలయం 1978 నుంచి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉంది. – రామారెడ్డిఅత్యవసరంలో డయల్ 112 ఖలీల్వాడి: రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలన్నింటి కోసం డయల్ 112ను అమలులోకి తీసుకువచ్చింది. డయల్ 100, 108, 101 స్థానంలో 112 సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటాయి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఈ సేవలను ఆపరేట్ చేస్తారు. సెల్ఫోన్ లేదా ఫోన్ నుంచి 112కు కాల్ చేస్తే పోలీస్, ఫైర్ర్, మెడికల్, చిల్డ్రన్, ఉమెన్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అత్యవసర సేవలను ఈ ఒక్క నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.సమాచారం -
అత్తను హత్యచేసిన అల్లుడి అరెస్టు
పిట్లం(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అత్తను హత్య చేసిన అల్లుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు బాన్సువాడ సీఐ రాజేష్ తెలిపారు. బాన్సువాడ రూరల్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మీ (50) మూడేళ్ల క్రితం అల్లుడైన జిన్న బాగరాజుకు రూ.లక్ష అప్పుగా ఇచ్చింది. డబ్బులు ఇవ్వమని అల్లుడిని ఎన్నిసార్లు అడిగిన ఇవ్వలేడు. ఇటీవల బాగరాజు తను పండించిన జొన్నలను విక్రయించగా వచ్చిన డబ్బులను అత్త అకౌంట్లో వేయించాడు. ఆ డబ్బుల కోసం అతడు అత్తను అడిగాడు. తనకు ఇవ్వాల్సిన బాకీ కింద ఆ డబ్బులు జమచేసుకుంటానని అత్త అతడికి తెలిపింది. దీంతో పగ పెంచుకున్న బాగరాజు తన అత్తను చంపాలని పథకం పన్ని గురువారం మధ్యాహ్నం ఆమైపె కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజే నిందితుడు తన బైక్పై హత్యకు ఉపయోగించిన కమ్మ కత్తితో పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
టీచర్గా మారిన కలెక్టర్
రాజంపేట: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ టీచర్గా మారి తలమడ్ల పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు బోధించారు. మండలంలోని తలమడ్ల, ఆరేపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించారు. తలమడ్ల జెడ్పీహెచ్ఎస్, మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తలమడ్ల ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి గణిత సమస్యలను పరిష్కరించేందుకు పలు సూచనలిచ్చారు. 9, 7వ తరగతి గదులలో విద్యార్థులతో ఇంగ్లీష్ రీడింగ్ చేయించారు. అనంతరం ప్రైమరీ స్కూల్ , జెడ్పీ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రైమరీ స్కూల్ కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో రూ.50 వేలు మంజూరు చేస్తూ మరమ్మతులు చేయించాలని ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రమేష్ కుమార్ను ఆదేశించారు. అనంతరం ఆరేపల్లిలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై చర్చించారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ జానకిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ ద్వారా ఇచ్చే రుణాల గురించి అవగాహన కల్పించాలని ఎంపీడీవో రఘురాంను ఆదేశించారు. ఆర్డీవో జ్యోతి, ఎంఈవో పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు. -
ఏళ్ల నాటి సమస్య తీరేనా?
కామారెడ్డి క్రైం: రైతుల భూ సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో చాలా మంది రైతులు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ని తీసుకువచ్చింది. ఇటీవలే అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు సైతం నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా గత నెల ప్రారంభం నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 32,592 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో దాదాపు 32,015 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. పరిష్కారాల కోసం దాదాపు 13,338 మందికి నోటీసులు జారీ చేశారు. అసైన్మెంట్ భూముల క్రయ, విక్రయాలకు సంబంధించిన రికార్డుల అప్డేషన్ కోసం 7,932, సాదాబైనామా కోసం 3,452 దరఖాస్తులు వచ్చాయి. పీవోటీపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సాదాబైనామాలకు సంబంధించిన అంశం హైకోర్టు పరిశీలనలో ఉంది. దీంతో ఈ రెండు రకాల దరఖాస్తులకు ఇప్పట్లో పరిష్కారాలు లభించే అవకాశాలు లేవు. కొందరు కోర్టులో కేసు నడుస్తున్నా రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు ఇచ్చారు. మరోవైపు వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించలేనివి మొత్తం ఎన్ని ఉంటాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పరిష్కారాలు అంతంత మాత్రమే.. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై అన్ని గ్రామాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,078 దరఖాస్తులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవి కాకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట మండలంలో చేపట్టిన భూభారతి సదస్సుల్లో 4,225 దరఖాస్తులు వచ్చాయి. రెండు నెలలు గడుస్తున్నా వాటిలో ఇంకా వెయ్యి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. దీంతో భూసమస్యల పరిష్కారం వంద శాతం పూర్తి కావాలంటే ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి డిజిటల్ పాస్పుస్తకాల్లో పేరు, అడ్రస్, భూమి రకం, విస్తీర్ణం, సర్వే నంబర్ తప్పులు, ఆన్లైన్లో రికార్డులు లాంటి చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా అధికారుల లాగిన్లలో పెండింగ్లో ఉన్నాయి. అధికార యంత్రాంగం చొరవ తీసుకొని వేగవంతంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు రెవెన్యూ సదస్సులలో 32,592 దరఖాస్తులు ‘భూభారతి’తోనూ తొలగని ఇబ్బందులుపరిష్కరించాలి నాకు గ్రామ శివారులో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. ధరణిలో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. 2019 నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా పరిష్కారం కాలేదు. – కుంట ఎల్లయ్య, రైతు, బాయంపల్లి, లింగంపేట మండలంఇంకెంత టైం పడుతుందో.. నాకు గ్రామ శివారులో 2 ఎకరాల భూమి ఉంది. ధరణి వచ్చిన తర్వాత డిజిటల్ పాసుపుస్తకం వచ్చింది. కానీ, ఆన్లైన్లో నా భూమి చూపించడం లేదు. మొన్న జరిగిన రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసిన. అధికారులు విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. – కుమ్మరి బాల్రాజు, రైతు, భవానీపేట్, లింగంపేట మండలం -
బల్దియాలో దారిద్య్రం!
అశోక్నగర్ కాలనీలో గుంతలలో నిలిచిన వర్షపు నీరుజిల్లాకేంద్రంలోని అన్ని రోడ్లపైనా భారీ గుంతలు ఏర్పడ్డాయి. అశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డుగుండా వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పలుచోట్ల వర్షంతో బురదమయంగా మారింది. గుంతలనిండా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ రోడ్డు దుస్థితిపై ఇటీవల స్థానికులు అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో స్థానికులే మట్టిని పోసి గుంతలను పూడ్చారు. కొత్తబస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు రోడ్డు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. విద్యానగర్కాలనీలో సాయిబాబా ఆలయం పక్కన చౌరస్తాలో పెద్ద గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా పూడ్చేవారు లేరు. జన్మభూమిరోడ్లో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. సైలానీబాబా కాలనీ, రామారెడ్డి చౌరస్తా నుంచి రాజీవ్నగర్కాలనీ వరకు, పాతబస్టాండ్ నుంచి పంచముఖి హనుమాన్ కాలనీ, అడ్లూర్ వరకు, పెద్దబజార్, భవానీరోడ్, వీక్లీ మార్కెట్రోడ్, గోపాలస్వామిరోడ్, భవానీనగర్, సుభాష్రోడ్, సిరిసిల్లరోడ్, గాంధీనగర్ లాంటి ప్రధాన రోడ్లపైనా భారీగా గుంతలున్నాయి. ప్రధాన రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక అంతర్గత రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్ల పరిస్థితిపై మున్సిపల్ అధికారులతో పాటు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, మరమ్మతులు చేయించి గుంతల చింత తీర్చాలని కోరుతున్నారు.మరమ్మతులు చేయిస్తాం బల్దియాలో నిధులు లేక నూతన రోడ్ల పనులకు టెండర్లు నిర్వహించడం లేదు. అయితే పట్టణంలో ఎక్కువగా గుంతలున్న రోడ్లను గుర్తించి మరమ్మతులు చేయిస్తాం. అశోక్నగర్ కాలనీలో నూతన రోడ్డు వేయడానికి కృషి చేస్తాం. ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి అన్ని కాలనీలలో రోడ్లపై గుంతలను పూడ్చివేయిస్తాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డికామారెడ్డి బల్దియా పరిధిలోని అంతర్గత రోడ్లతోపాటు ప్రధాన రోడ్లూ అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో వరద నీరు చేరి మరింత ప్రమాదకరంగా మారాయి. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. – కామారెడ్డి టౌన్ కామారెడ్డి పట్టణంలో ఛిద్రమైన రోడ్లు వర్షపు నీటితో ప్రమాదకరంగా మారిన గుంతలు ఇబ్బందిపడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
‘బడికి అండగా నిలుస్తా’
రామారెడ్డి: చిన్నతనంలో తాను చదివిన రామారెడ్డి సర్కార్ బడి అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. గురువారం రామారెడ్డి, గోకుల్ తండా, గిద్ద గ్రామాలలో పర్యటించారు. రామారెడ్డి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. తను చిన్నతనంలో ఇదే మైదానంలో ఆడుకున్నానని, ఇక్కడే చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. రామారెడ్డి సర్కారు బడికి కావలసిన అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లను వెంటనే నిర్మిస్తానన్నారు. అనంతరం రామారెడ్డి మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నిర్మాణంలో ఆగిపోయిన గంగమ్మ వాగు బ్రిడ్జిని పరిశీలించి పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, నాయకులు అరవింద్ గౌడ్, బీపేట నర్సింలు, అంబానీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్మూర్లో జూనియర్ కళాశాల సీజ్
ఆర్మూర్: నిబంధనలకు విరుద్ధంగా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న ఓ భవనంలో కొనసాగుతున్న క్షత్రియ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) రవికుమార్ గురువారం సీజ్ చేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ భవనంలో కళాశాలను నిర్వహణకు మూడేళ్ల క్రితం ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులను నిరాకరించింది. దీంతో క్షత్రియ జూనియర్ కళాశాల యాజమాన్యం ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాల నిర్వహణకు అనుమతులు తీ సుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న భవనంలోనే తరగతులను ని ర్వహిస్తూ వస్తున్నారు. సుమారు 500 మంది బాలబా లికలు ఇదే భవనంలోని పై అంతస్తుల్లో హాస్టల్లో ఉంటుండగా, మరో 300 మంది విద్యార్థులు డే స్కాలర్స్గా చదువుకుంటున్నారు. మరో ప్రైవేట్ కళా శాల యజమాని క్షత్రియ జూనియర్ కళాశాలపై అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించి నిబంధనల ను అతిక్రమించిన తీరును వివరించారు. స్పందించిన అధికారులు కళాశాలను సందర్శించి సీజ్ చేసి దిద్దుబా టు చర్యలు చేపట్టారు. అడ్మిషన్ తీసుకున్న సుమారు 800 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురవుతున్నారు. మూడేళ్లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నా తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించిన అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అనుమతులు ఒకచోట.. నిర్వహణ మరోచోట అయోమయంలో 800 మంది విద్యార్థులు -
పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు
కామారెడ్డి టౌన్: పట్టణంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తెలిపారు. ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘పురం.. స్వచ్ఛతకు దూరం’ కథనంపై ఆయన స్పందించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల తీరుపై సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులను పరిశీలించారు. టీచర్స్కాలనీ, రాజీవ్నగర్, సైలానీబాబా తదితర కాలనీలలో మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు. రోడ్ల పక్కన పేరకుపోయిన చెత్త కుప్పలను డపింగ్ యార్డుకు తరలించారు. మురికి కాలువలు లేని చోట నూతన సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి -
ముహూర్తమెప్పుడో?
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయి న్ క్యాంపస్లో బాలికల నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ముహూర్తం కుదరడం లేదు. నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మాణం కోసం రూ.7కోట్ల రూసా నిధులు అందుబాటులో ఉన్నా, నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. తెయూ మెయిన్ క్యాంపస్లో బాలురకు రెండు హాస్టల్స్ ఉండగా, బాలికలకు మాత్రం ఒకే హాస్టల్ ఉంది. బాలుర రెండు హాస్టల్స్లో కలిపి 447 మంది ఉండగా, బాలికలకు ఉన్న ఒక్క హాస్టల్లోనే 440 మంది బాలికలు ఉంటున్నారు. దీంతో బాలికలు ఒకే గదిలో 6నుంచి 8మంది ఉండాల్సి రావడంతో బాలికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2022లో యూజీసీ ఆదేశం వర్సిటీ క్యాంపస్లో బాలురు, బాలికలకు సరిపడా నూతన హాస్టల్స్ నిర్మించాలని యూజీసీ 2022 నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. రెండున్నరేళ్లు కావొస్తున్నా హాస్టల్ నిర్మాణానికి ఇప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. గత విద్యాసంవత్సరం మేలో తెలంగాణ యూనివర్సిటీకి రూ.8.60 కోట్ల రూసా నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.7కోట్లు నూతన బాలికల హాస్టల్ నిర్మాణానికి, ఫుట్పాత్ నిర్మాణానికి రూ.కోటి, కంప్యూటర్ సైన్స్ కాలేజీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు వెచ్చించాల్సి ఉంది. టెండర్ పూర్తయినప్పటికీ సదరు కాంట్రాక్టర్ టీఎస్ఈడబ్య్లూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)తో అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికై నా వర్సిటీ వీసీ, ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ నిర్మాణం వెంటనే చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు. తెయూలో బాలికల నూతన హాస్టల్ భవనానికి రూ.7 కోట్లు మంజూరు పూర్తయిన టెండర్ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాని పనులు త్వరలో పనులను ప్రారంభించేందుకు కృషి తెయూలో బాలికల నూతన హాస్టల్ భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ టీఎస్ఈడబ్ల్యూఐడీసీతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. కానీ అగ్రిమెంట్ కాకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయమై సదరు కాంట్రాక్టర్తో వీసీ యాదగిరిరావు మాట్లాడారు. వీలైనంత త్వరగా హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. – యాదగిరి, రిజిస్ట్రార్, తెలంగాణ యూనివర్సిటీ -
పోగొట్టుకున్న సెల్ఫోన్ అప్పగింత
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు జూబ్లీ బస్ స్టేషన్కు వెళ్లింది. అక్కడ పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎక్కారు. బస్సులో ఒక సెల్ఫోన్ కింద పడిపోవడంతో ప్రయాణికులు కండక్టర్కు అప్పగించారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఫోన్ ఎవరిదని ప్రశించినా ఎవరు సమాధానం చెప్పలేరు. దీంతో సెల్ఫోన్ కండక్టర్ వద్దనే ఉంచుకున్నారు. బస్సు మేడ్చల్ ప్రాంతానికి రాగానే ఒక మహిళ లేచి తన ఫోను కనిపించడం లేదని గట్టిగా అరిచింది. దీంతో కండక్టర్ ఆమెను పిలిచి సెల్ ఫోన్ తన వద్ద ఉందని చెప్పి ఆమెకు సెల్ ఫోన్ను అప్పగించారు. -
ఎకరానికి ఎంత భూమి..
మీకు తెలుసా? బాల్కొండ: వ్యవసాయ భూములను ఎకరాల్లో(బిగాల్లో) రైతులు తెలుపుతుంటారు. ఎకరానికి ఎంత భూమి అనే విషయాన్ని కింద తెలుసుకుందాం.. ● 40 గుంటలకు ఎకరం అవుతుంది. ● రెండు గుంటలకు ఇసా భూమి అవుతుంది ● 20 ఇసాలకు ఎకరం అవుతుంది ● ఎకరానికి 4840 గజాలు అవుతుంది. ● ఎకరానికి 100 సెంట్లు.. గుంటకు 2.5 సెంట్లు ● గుంటకు 121 గజాలు ● ఒక సెంటు భూమికి 48.4 గజాలు ● ఇంటి నిర్మాణాల స్థలాలను ప్లాట్లు అంటారు. ప్లాట్లను గజాల చొప్పున కొనుగోలు చేస్తారు. -
మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు
గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయా శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు ఆరోపిస్తున్నారు. కలుపు మొక్కల నివారణకు వాడే ఒకే కంపెనీకి చెందిన లాడీస్ అనే మందును వ్యాపారులు వేర్వేరు ధరలకు విక్రయిస్తున్నారు. మండల పరిధిలోని చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు లాడీస్ మందును వేర్వేరు దుకాణాల్లో కొనుగోలు చేసి రసీదులు తీసుకున్నారు. రసీదులు చూసిన రైతులు ధరలో తేడా ఉండడంతో అవాక్కయ్యారు. ఓ దుకాణంలో లాడీస్ మందు లీటరుకు రూ.1,600 చొప్పున రెండు లీటర్లు కొనుగోలు చేశాడు. అదే మందును మరో దుకాణంలో లీటరుకు రూ.1,350 చొప్పున కొనుగోలు చేశాడు. ధరలో తేడాను గమనించిన రైతులు గురువారం భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు శంకర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. శంకర్రావు బాధిత రైతులతో పాటు మరికొందరి రైతులతో కలిసి అధిక ధరకు విక్రయించిన దుకాణానికి వెళ్లి యజమానిని ప్రశ్నించారు. ఒకే మందుకు ఇంత తేడా ఎలా ఉంటుందని రైతులను ఎందుకు దోచుకుంటున్నారని ప్రశ్నించారు. ఆ మందును రూ.1,600 కే విక్రయిస్తామని లేదంటే తాము నష్టపోతామని తెలిపారు. మరో దుకాణంలో రూ.1,350 కే విక్రయించాడు కదా ఆయన ఎందుకు నష్టపోడని ప్రశ్నించారు. లేదు మేవు ఎమ్మార్పీ ధక కంటే తక్కువకే విక్రయించాం.. ఆ మందు ఎమ్మార్పీ ధర రూ.2,200 ఉంటుందని సమాధానం ఇచ్చినట్లు భారతీయ కిసాన్సంఘ్ నాయకులు తెలిపారు. పురుగు మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు ఎమ్మార్పీ ధరలను అధికంగా అచ్చు వేసి వ్యాపారులకు రైతులను దోచుకునే అవకాశం కల్పిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేసి ఎమ్మార్పీ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరికి నచ్చిన ధరలకు వారు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్న వ్యాపారులు కంపెనీల అచ్చు వేసి ఇష్టం వచ్చిన ఎమ్మార్పీ ధరలతో దోచుకునే అవకాశం -
రోడ్లపై కేజ్వీల్స్తో నడిపితే రూ.25 వేల జరిమానా
భిక్కనూరు: ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి బీటీ రోడ్లను నిర్మింపజేస్తుంటే కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు కేజ్వీల్స్ వాహనాలను నడిపిస్తూ రోడ్లను నాశనం చేయడం తగదంటూ భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. గురువారం వీడీసీ అధ్యక్షుడు కొండ సిద్దరాములు ఆధ్వర్యంలో సమావేశమైన గ్రామస్తులు కేజీవీల్స్తో ఎవరైనా ట్రాక్టర్ను రోడ్డుపై నడిపితే రూ.25 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. ట్రాక్టర్ కేజ్వీల్స్తో రోడ్డుపై నడిపించినట్టు సరైన రుజువులతో నిరూపిస్తే వారికి రూ.2 వేల నగదు బహుమతి అందించాలని తీర్మానించారు. నేతలు హరిశ్చంద్రారెడ్డి, భీంరెడ్డి, కుంట లింగారెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్, రాజు, రాజయ్య, ధర్మయ్య, రవి, నర్సయ్య, భూమాగౌడ్, సిద్దరాములు, సంజీవ్, శ్రీకాంత్, కుమార్, తదితరులు పాల్గొన్నారు. సమావేశమైన గ్రామస్తులు -
మృత్యువులోనూ వీడని స్నేహం
నిజాంసాగర్: ముగ్గురు స్నేహితులు ఒక బైక్పై కలిసి వెళ్లగా, ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాతచెందారు. పెద్దకొడప్గల్ మండలం జగన్నాథ్పల్లి వద్ద గల సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై జరిగిన ఘటన వివరాలు ఇలా.. జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకటి(22), మంగళి గణేశ్(18), బిచ్కుందకు చెందిన దొడ్లవార్ నవీన్(24) ముగ్గురు స్నేహితులు. గణేశ్ మూడు నెలల కిందట పల్సర్ బైక్ కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం వారు ముగ్గురు కలిసి బైక్పై పిట్లంకు వెళ్లారు. రాత్రి వేళ ముగ్గురు స్నేహితులు బైక్పై నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురై, నిలిచి ఉన్న కంటెయినర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరుగగా, ఇద్దరు ఘటన స్థలంలో మృతిచెందారు. ఒకరు మార్గమధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న జాతీయరహదారి సిబ్బంది,పోలీసులు మృతదేహాలను అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జుక్కల్ మండలం మహమ్మదబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయవ్వ–గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారు డైన వెంకటి ఇంటర్ వరకు విద్యను అభ్యసించాడు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు, వాదో డుగా ఉన్నాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మంగళి హన్మండ్లు–లక్ష్మీబాయి దంపతుల పెద్ద కుమారుడు గణేశ్ నిజామాబాద్లో ఇంటర్ చదువుతున్నాడు. బిచ్కుంద పట్టణానికి చెందిన దొడ్లవార్ నాందేవ్–శోభ దంపతుల కుమారుడు నవీన్. వీరు ముగ్గురు స్నేహితులు కాగా, చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి మూడు కుటుంబాల్లో తీరని విషాదం -
డంపింగ్యార్డులున్నా.. నిరుపయోగమే
మద్నూర్(జుక్కల్): ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి వంద శాతం పారిశుధ్యం సాధించాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఆరు బయట, ప్రధాన రహదార్ల పక్కన పడేయటంతో డంపింగ్ యార్డులు ఉన్నా లేనట్టుగా ఉన్నాయి. అదే విధంగా పడేసిన చెత్తకు నిప్పు పెడుతుండడంతో దుర్గంధం వెదజల్లుతుండడంతో పాటు పొగతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా రోడ్ల పక్కన చెత్తను వేస్తూ నిప్పుపెడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. పలు గ్రామాల్లో చెత్త నిర్వహణ ఇంకా చెత్తగా మారింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు లేక పారిశుధ్య పనులను పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినప్పటికి గ్రామాలపై వారి పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పొగతో తప్పని తిప్పలు వర్మి కంపోస్ట్ షెడ్లలో చెత్తను వేరు చేయడం, ఎరువులు తయారు చేయడం వంటి పనులు చేపట్టడం లేదు. పంచాయతీల్లో సేకరించిన చెత్తతో పాటు ప్లాస్టిక్ వస్తువులు, తదితర వ్యర్థాలను అన్నింటినీ ఆరుబయటే తగలబెడుతున్నారు. వచ్చే పొగతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కుళ్లిన వ్యర్థాలతో వచ్చే వాసనను భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. నీరుగారుతున్న లక్ష్యం పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీల ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఒక్కోదానికి రూ.2.50 లక్షల చొప్పున ఏర్పాటు చేసిన వర్మి కంపోస్ట్ సెగ్రిగేషన్ షెడ్లు ఉమ్మడి మండలంలో నిరుపయోగంగా మారాయి. సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లలో వేరు చేసి ఎరువు తయారు చేసి అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించగా అవకాశాలున్నప్పటికీ వాటిని వినియోగించకపోవడంతో ప్రభుత్వానికి వీటి ద్వారా వచ్చే ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఎరువుల తయారీకి సంబంధించి వ్యవసాయ, పంచాయతీ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అవి నిరాదరణకు గురై లక్ష్యం నీరుగారిపోతోంది. ఎక్కడ పడితే అక్కడే చెత్త వేస్తున్న ప్రజలు స్పష్టంగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపం మరుగున పడిన కంపోస్ట్ ఎరువు తయారీ పట్టించుకోని అధికారులు వినియోగంలోకి తీసుకురావాలి రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్, వర్మి కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. చెత్త వేసేందుకు షెడ్లు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. – రవీందర్, మద్నూర్ నిప్పు పెట్టకుండా చూడాలి చెత్తను రోడ్ల పక్కన వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. రోడ్ల పక్కన చెత్త వేయడంతో అది కుళ్లి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఆయా మార్గాల గుండా వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. –పండరి, హండెకేలూర్ -
కలుపు నివారణకు మందులు పిచికారీ చేయాలి
మద్నూర్: సోయా పంటలో గడ్డి జాతి కలుపు నివారణకు రైతులు రసాయన మందులు పిచి కారీ చేయాలని ఏవో రాజు అన్నారు. గురు వారం ఆయన వాడి, ఫతేపూర్, మద్నూర్ తదితర గ్రామాల్లో సాగవుతున్న సోయా పంటల ను పరిశీలించి పలు సూచనలు చేశారు. గడ్డిజాతి కలుపు నివారణకు క్విజాలాఫాఫ్ ఈథైల్ 40 ఎంఎల్ లేదంటే ప్రాపాకై ్వజాపాప్ 250ఎంఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వెడల్పాటి ఆకు ఉన్నట్లయితే ఇమజిత్పైర్ 400 ఎంల్ పిచికారీ చేయాలన్నారు.అలాగే గడ్డిజాతి,వెడల్పాటి ఆ కు ఉన్నట్లయితే క్విజాలోపాప్ పిఈథైల్,ఇమా జిత్పైర్ 200 ఎంల్ మందును ఉదయం పూట గాలి వర్షం లేని సమయంలో భూమిలో తేమ ఉన్న సమయంలో పిచికారీ చేయాలన్నారు. హెల్మెట్ లేకుండా నడిపితే వాహనాలు సీజ్ చేస్తాం నిజాంసాగర్(జుక్కల్): హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పెద్దకొడప్గల్ ఎస్సై మహేందర్ వాహనదారులకు హెచ్చరించారు. గురువారం పెద్దకొడప్గల్ మండలంలోని అంజనీ చౌరస్తా జాతీయ రహదారి–161పై వాహనాల తనిఖీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ.. రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతుందని,మద్యం తాగి,అతివేగంగా వాహనా లు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తు న్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడకం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్లు తెలిస్తే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ చలాన్లు వసూలు లింగంపేట(ఎల్లారెడ్డి): ముస్తాపూర్లో గురువారం ఎస్సై వెంకట్రావు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న చలాన్లు రూ.92 వేలు వసూలు చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే ఒక డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 300 వాహనాలు తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు, హెల్మెట్ ధరించని 25 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. కృష్ణాజీవాడీలో అదనపు కలెక్టర్ పర్యటన తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడీలో గురువారం అదనపు కలెక్టర్ చందర్ నాయక్ పర్యటించారు. మూడు రోజుల క్రితం గ్రామ కార్యదర్శి చంద్రకళ ప్రజల నుంచి ఇంటి పన్నులతో పాటు మిషన్ భగీరథ బిల్లులను వసూల్ చేశారు. దీంతో గ్రామస్తులు కొన్ని సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ బిల్లలను చెల్లించలేదని, ఇప్పుడు ఎందుకు వసూల్ చేస్తున్నారని కార్యదర్శిని అడుగడమే కాకుండా పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అదనపుకలెక్టర్ చందర్ నాయక్ గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. గ్రామకార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులు, గ్రామప్రజలు చెప్పిన విషయాలను అదనపు కలెక్టర్ విన్నారు. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. అప్పటి వరకు మిషన్ భగీరథకు బిల్లులను వసూల్ చేయవద్దని అధికారులకు సూచించారు. డీపీవో మురళీ, ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, ఏఈలు ప్రశాంత్, శిరీష, ఎంపీవో సవిత, గ్రామకార్యదర్శులు చంద్రకళ, బాలు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
చాముండేశ్వరి ఆలయ బోనాల ఆహ్వాన పత్రిక అందజేత
దోమకొండ: దోమకొండలోని మహంకాళి ఆలయంలో ఈనెల 13న జరిగే మహంకాళి బోనాల పండుగకు రావాలని కోరుతూ గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు ఆలయ అర్చకులు భావి శరత్చంద్రశర్మ తెలిపారు. ఆయన వెంట ఆలయ ఈవో ప్రభు ఉన్నారు. సొసైటీ సీఈవోకు సన్మానంలింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డి సొసైటీ సీఈవో శ్రీనివాస్ను ఉమ్మడి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం ఘనంగా సన్మానించారు. సొసైటీ పరిధిలోని రైతులకు దీర్ఘకాలిక రుణాలు రూ.7 కోట్లు అందజేశారు. ఇచ్చిన రుణాల రికవరీ 2023–24 సంవత్సరంలో రూ. 2 కోట్లు ఉండగా.. 2024–25లో రూ. 2.50 కోట్లు దీర్ఘకాలిక రుణాలు వసూలు చేసి జిల్లాలో 10వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. మారుమూల గ్రామం శెట్పల్లిసంగారెడ్డి సొసైటీలో రుణాల రికవరీ చేయడంతో పాటు రైతులకు సొసైటీ నుంచి అందిస్తున్న సేవలను గుర్తించి గురువారం నిజామాబాదులోని సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఈవో శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. డీసీవో శ్రీనివాస్రావు, జనరల్ మేనేజర్ అన్నపూర్ణ, సొసైటీల కార్యదర్శులు పాల్గొన్నారు. ఉద్యోగిపై దాడి సరికాదు బిచ్కుంద(జుక్కల్): మహబూబ్నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై ఏఎంసీ వైస్ చైర్మన్ దాడి సరికాదని టీఎన్జీవో కామారెడ్డి జిల్లా ఫోరం అధ్యక్షుడు రాజ్కుమార్ అన్నారు. బిచ్కుంద ఏఎంసీ కార్యాలయంలో గురువారం ఆయన సిబ్బందితో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందిపై దాడి చేస్తే పాలక వర్గానికే అవమానంగా ఉంటుందన్నారు. సిబ్బంది రవికిరణ్, లాలయ్య, సందీప్, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పిట్లంలో.. పిట్లం(జుక్కల్): పిట్లం ఏఎంసీ కార్యాలయం వద్ద సిబ్బంది గురువారం లంచ్ టైంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరనస చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఏఎంసీ కార్యదర్శి భాస్కర్పై దాడి చేసిన వైస్ చైర్మన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. గత నెల 25న నగరంలోని బింగి ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడిఉండగా, పోలీసులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో గురువారం అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు షర్ట్, లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్లో గాని, 87126 59840, 87126 59719ను సంప్రదించాలన్నారు. చికిత్సపొందుతూ ఒకరు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన బైండ్ల అనిల్కుమార్(16) అనే బాలుడు కొంతకాలంగా కల్లుకు బానిసయ్యాడు. ఈక్రమంలో బుధవారం గ్రామశివారులోకి వెళ్లి గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం అతడు మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్హెచ్వో మనోహర్రావు తెలిపారు. -
అత్తను హతమార్చిన అల్లుడు
పిట్లం(జుక్కల్): రూ.1లక్ష కోసం అత్తను అల్లుడు హతమార్చిన ఘటన పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి(43)కి భర్త, కుమారుడు, కూతురు స్వప్న ఉన్నారు. స్వప్నకు అదే గ్రామానికి చెందిన బాగరాజుతో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. ఈక్రమంలో లక్ష్మి కొన్ని నెలల క్రితం అల్లుడు అయిన బాగరాజుకు లక్ష రూపాయలను ఇచ్చింది. బాగరాజు ఇటీవల సాగు చేసిన జొన్న పంటను తన పేరుపై కొద్దిగా, అత్త లక్ష్మి పేరున కొద్దిగా విక్రయించాడు. దీంతో ఇద్దరి బ్యాంకు ఖాతాలలో జొన్నలు విక్రయించిన డబ్బులు పడ్డాయి. దీంతో లక్ష్మి అల్లుడికి గతంలో ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగింది. ఈ విషయంపై గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగగా, గ్రామస్తులు సర్ది చెప్పారు. అనంతరం లక్ష్మి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమెను బాగరాజు అడ్డగించి కమ్మకత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. బాగరాజు తన అత్తను చంపేశాను పోలీసులకు లొంగిపోతున్న అని గ్రామ మాజీ సర్పంచ్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే మాజీ సర్పంచ్, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని చూడగా ఆమె అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇచ్చిన రూ.లక్ష తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఘాతుకం -
ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
రాజంపేట: ప్రతి విద్యార్థిని బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాఽయికి చేరుకోవాలని మహిళా సాధికారత సిబ్బంది సౌందర్య అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం రాజంపేట బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత సిబ్బంది సౌందర్య మాట్లాడుతూ.. బేటీ బచావో బేటీ పడావో అనే విధానంలో ప్రతి ఆడపిల్ల చదువుకొని స్వతహా గా తనకు తాను నిర్ణయాలు తీసుకునే దశకి వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్స్ 1098, 100, 1930 ,181లపై అవగాహన ఉండాలన్నారు. హెచ్ఎం విజయలక్ష్మి, సఖి సెంటర్ సిబ్బంది లావణ్య పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న రోడ్డు రోలర్
నస్రుల్లాబాద్: మండలంలో కొద్దిరోజులుగా 765 డి జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో గురువారం దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై రోడ్డు రోలర్తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయింది. విద్యుత్ తీగలు తెగిపడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యుత్ తీగలు తెగి వాహనంపై పడినా.. లేదా రోడ్డుపై వెళుతున్న వాహనదారులపై పడిన ప్రాణాపాయం జరిగేదని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్తంభం విరిగినా కూడా తృటిలో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు కొత్త స్తంభం వేయించి సరిచేసి ఇస్తానని అధికారులు తెలపడంతో గ్రామానికి ప్రత్యమ్నాయం మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. స్తంభం విరిగినా వైర్లు తెగకపోవడంతో తప్పిన ప్రమాదం -
మంచి పథకం.. మరుగున పడింది
ఎల్లారెడ్డి: పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) గురించి ఇప్పటికీ ఎవరికీ అవగాహన లేకపోవడం విడ్డూరం. అకస్మాత్తుగా ఇంటి పెద్ద లేదా కుటుంబ ముఖ్య సంపాదన పరుడు మరణిస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ఈ ఎన్ఎఫ్బీఎస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కొన్నేళ్లుగా ఈ పథకం మరుగున పడింది. ఇంటి పెద్ద మరణించిన దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేసే ఈ పథకం గురించి కొన్నేళ్లుగా అవగాహన కల్పించే వారు లేకుండా పోయారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు నామమాత్రంగా మాత్రమే ఈ పథకానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి ఇప్పటివరకు 19 దరఖాస్తులు మాత్రమే రావడం గమనర్హం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని 18–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముఖ్య సంపాదనపరుడు(పురుషుడు లేదా సీ్త్ర) అకస్మాతుగా మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఇందుకు మరణించిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్) కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలను జతచేసి మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును అధికారులు పరిశీలించి అర్హులైన కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. మరణించిన వ్యక్తి కుటుంబంలోని వితంతు భార్యకు గాని, అవివాహిత కుమార్తెలకు గాని ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఆపద్బంధు పథకం కింద కాని, ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద గాని లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాల గురించి నిత్యం ప్రచారం చేసే అధికార గణం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడే ఈ పథకం గురించి కొన్నేళ్లుగా ఊసే ఎత్తడం లేదు. పేదలకు ఎంతో కొంత ఉపయోగపడే ఈ పథకం గురించి జిల్లాలో ప్రచారం చేసేందుకు అదనపు కలెక్టర్ విక్టర్ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకం కింద అర్హులైన బాధిత కుటుంబాలు దరఖాస్తులు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఎన్ఎఫ్బీఎస్ గురించి అవగాహన కరువు ఆర్థిక సాయానికి దూరంగా నిరుపేదలు ఏళ్ల తరబడి ఉనికే లేని పథకం అవగాహన కల్పిస్తున్నాం ఎన్ఎఫ్బీఎస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నాము. వితంతు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న మహిళలతో, రైతు బీమా పథకం కింద లబ్ధిపొందిన కుటుంబాల సభ్యులతో మాట్లాడి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేలా మండల స్థాయి అధికారులకు ఆదేశించాం. అవగాహన లోపం కారణంగా పేదలకు ఈ పథకం దూరమైంది. పూర్తిస్థాయి ప్రచారంతో ఈ పథకం ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేస్తున్నాం. – విక్టర్, అదనపు కలెక్టర్ -
ఫిలిప్పీన్స్లో వైద్య విద్యార్థి మృతి
మద్నూర్(జుక్కల్): కుర్లా గ్రామానికి చెందిన వడ్ల యోగేశ్(23) బుధవారం ఫిలిప్పీన్స్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పుట్టిన రోజు నాడే యోగేశ్ మృతి చెందడంతో ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుర్లా గ్రామంలో ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తున్న రాజేందర్కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రెండో కూమారుడు యోగేశ్ ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. యోగేశ్ పది రోజుల క్రితమే కుర్లాకు వచ్చి వెళ్లాడు. బుధవారం ఫిలిప్పీన్స్లో కళాశాలకు వెళ్దామని బయలుదేరే సమయంలో యోగేశ్కు ఛాతీలో నొప్పి వచ్చిందని తండ్రికి తెలపగా దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితులు సాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యోగేశ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో అకాల మరణం పుట్టిన రోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరైన కుటుంబీకులు -
పహాణి అంటే..?
పహాణి అంటే భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల ముఖ్యమైన పత్రం. దీనిని అడంగళ్ అని కూడా అంటారు. ● పహాణిలో భూమి యజమాని, సాగు చేస్తున్న వారి పేరు, సర్వే నంబర్, ఖాతా నంబర్, భూమి యొక్క విస్తీర్ణం, కొలతలు ఉంటాయి. ● భూమికి నీటి సదుపాయం(బావి, కాలువ, చెరువు), నేల రకం(సారవంతమైన, రాతి నేల) అనే స్వభావం పేర్కొనబడి ఉంటుంది. ● పహాణిలో భూమిలో సాగు చేస్తున్న పంటల వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ● పహాణి భూమి యజమానికి చట్టపరమైన హక్కులను కల్పిస్తుంది. భూమి కొనుగోలు, అమ్మకం లేదా బదిలీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ● భూమికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే సమయంలో ఉపయోగ పడుతుంది. ● బ్యాంకు నుంచి పంట రుణం, ఇతర రుణాలు తీసుకోడానికి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోడానికి పహాణి ఉపయోగ పడుతుంది. – బాల్కొండమీకు తెలుసా? -
పసుపు రైతులకు క్షమాపణలు చెప్పాలి
సుభాష్నగర్: పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్, 18 నెలలుగా కాంగ్రెస్ పసుపు రైతులకు ఏం చేయలేదని, వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో పుట్టి పదేళ్లు అధికారంలో ఉండి కూడా పసుపు రైతులకు ఏం చేయలేదని విమర్శించారు. జీవన్రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పసుపు రైతులు నామినేషన్ వేసి ఓడించిన విషయాన్ని కవిత మర్చిపోయిందా అని ప్రశ్నించారు. 18 నెలలు గడిచినా సుదర్శన్రెడ్డికి లెటర్ ప్యాడ్ లేదని, మరో ఎమ్మెల్యే భూపతిరెడ్డికి క్యాంపు కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుతో ప్రయోజనాలేంటో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వివరించారని, పక్కనే ఉన్న భూపతిరెడ్డికి అర్థం కాలేదా అని ప్రశ్నించారు. బోర్డుకు శాశ్వత కార్యాలయం కోసం జెడ్పీ ఆవరణలో 2 ఎకరాల స్థలం కావాలని కలెక్టర్కు లేఖ రాశామన్నారు. పసుపు బోర్డు క్రెడిట్ అర్వింద్కే దక్కుతుందని, విమర్శలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, గంగోనె సంతోష్, అనంత్రెడ్డి, నారాయణ యాదవ్, బద్దం కిషన్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అక్కసు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి -
రెవెన్యూ దరఖాస్తుల పరిశీలన
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ తహసీల్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ విక్టర్ సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డోంగ్లీలో మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయని అధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఆర్ఐ సాయిబాబా, సిబ్బంది ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా వాసి మృతి
క్రైం కార్నర్భిక్కనూరు: మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కన్నపేటకు చెందిన కొత్తిన్న లక్ష్మీనారాయణ(54) జంగంపల్లి గ్రామశివారులోని విజయ సాయి ల్యాబొరెటరీలో ఫిట్టర్గా పనిచేస్తూ అదే గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం అక్కన్నపేట గ్రామానికి బైక్పై ఉదయం వెళ్లి మధ్యాహ్నం తిరిగి జంగంపల్లికి వస్తున్నాడు. భిక్కనూరు చర్చి సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
పౌష్టికాహారాన్ని అందించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని మాత్రమే అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మహిళ, శిశు అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పౌష్టికాహార లోపం గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నా రు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలందరూ తప్పనిసరిగా వచ్చేలా పర్యవేక్షించాలని సీడీపీవోలు, సూపర్వైజర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు, విద్యుత్ తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం.. పోడు పట్టాలున్న గిరిజన రైతులకు లాభసాటి వ్యవసాయం జరిగేలా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ఎంతగానో తోడ్పడుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకంపై ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడారు. ఈ పథకం ద్వారా పోడు పట్టాలు పొందిన లబ్ధిదారులకు బోరు మోటర్, సోలార్ పంప్సెట్లు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. డీఎఫ్వో నిఖిత, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళి, డీఏవో తిరుమల ప్రసాద్, ఉద్యానవన అధికారిణి జ్యోతి, డీటీవో శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం
డ్రైవర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పక్కన మురికి కాలువకామారెడ్డి మున్సిపాలిటీలో 25 వేలకుపైగా గృహాలున్నాయి. పట్టణ జనాభా లక్ష దాటింది. పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. అయితే అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోంది. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలతో పట్టణం చెత్త కుప్పలా కనిపిస్తోంది. శివారు కాలనీలతోపాటు గోదాంరోడ్, రాజీవ్నగర్, ఇందిరానగర్, డ్రైవర్స్కాలనీ, డబుల్బెడ్రూం, టీచర్స్కాలనీ, గాంధీనగర్, బతుకమ్మకుంట, రుక్మిణికుంట, శ్రీరాంనగర్కాలనీ, వికాస్నగర్, గొల్లవాడ, కిష్టమ్మగుడి, పెద్ద కాలనీ, వీక్లీమార్కెట్, అయ్యప్పనగర్, హరిజనవాడ, గ్రీన్ సిటీ తదితర కాలనీలలో కూడళ్లు, ఖాళీ స్థలాలలో చెత్త పడేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. ఓపెన్ స్థలాలైతే డంపింగ్ యార్డులుగా మారాయి. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీ సమస్య.. పట్టణంలో చాలా కాలనీలలో ఇంకా పక్కా సీసీ డ్రెయినేజేలు లేవు. రోడ్లపైనే మురుగు నీరు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు లేకపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డ్రెయినేజీలు ఉన్న చోట కూడా సమస్యలున్నాయి. కొన్నిచోట్ల నెలల తరబడి డ్రెయినేజీలను శుభ్రం చేయడం లేదు. దీంతో మురుగు నిండి రోడ్లపైకి వస్తోంది. వర్షాకాలం కావడంతో మురికి నీటి ప్రవాహం ఎక్కువై రోడ్లపైకి వస్తుండడంతో కాలనీలు కంపు కొడుతున్నాయి. దోమలతోపాటు కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రోడ్ల శుభ్రత పైనే అధికారులు దృష్టి సారించడంతో కాలనీలు ‘స్వచ్ఛ’తకు దూరమయ్యాయి. ‘తడి–పొడి’.. అంతా భ్రమ బల్దియా సానిటేషన్ విభాగంలో 19 ఆటోలు, 5 ట్రాక్టర్లు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉంటుంది. కానీ పట్టణంలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. తడి, పొడి చెత్తను కలిపే సేకరిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, బయోవేస్టేజ్, మాంసపు వర్థాలు, వంటింటి తడి చెత్త వ్యర్థాలు ఇలా అన్నీ కలిపి సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించడంతో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. డంపింగ్ యార్డు వద్ద కూడా తడి పొడి చెత్తను వేరు చేయడం లేదు.ఏళ్లుగా ఇదే పరిస్థితి.. మా ఇళ్ల పక్కన మురికి కాలువ అధ్వానంగా ఉంది. రోడ్లపైకి మురుగు నీరు వస్తోంది. దీంతో దోమలు, ఈగలు విపరీతంగా ఉంటున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు. డ్రెయినేజీ నిర్మించాలి. – ఎండీ. మక్బూల్, టీచర్స్ కాలనీవాసిశుభ్రం చేయడం లేదు రోడ్లను నెలల తరబడి శుభ్రం చేయడం లేదు. మురికి కాలువలను సైతం శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగి విషప్రాణులు సంచరిస్తున్నాయి. మోరీల్లోంచి చెత్తను తీసి రోడ్లపై వేస్తారు. వారం రోజులైనా తీయరు. – నర్సింలు, వీక్లీ మార్కెట్వాసిస్పెషల్ డ్రైవ్ చేపడతాం.. అన్ని వార్డులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సానిటేషన్ సమస్యలుంటే ప్రజలు నేరుగా మాకు ఫిర్యాదు చేయాలి. తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సానిటేషన్ సమస్యలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆయా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డిముక్కు మూసుకుంటున్నాం సిరిసిల్ల రోడ్లో ఉన్న మురికి కాలువల్లో మాంసం వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో దుర్గధం వ్యాపిస్తోంది. ముక్కు మూసుకుని వెళ్లాల్సి న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి మురికి కాలువల్లో మాసం వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలి. – మల్లేశ్, సిరిసిల్ల రోడ్వాసి బల్దియాలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం తడి, పొడి.. కలిపే సేకరణ పలు కాలనీలలో కానరాని పక్కా డ్రైయినేజీలు పూడుకుపోయిన మోరీలు.. రోడ్లపైకి మురుగు పరుగు కొరవడిన అధికారుల పర్యవేక్షణ -
‘ఇందిరమ్మ’కు ధరాఘాతం
● జిల్లాకు 11,489 ఇళ్లు మంజూరు ● 5,246 ఇళ్లకు మార్కింగ్ పూర్తి ● స్లాబ్ లెవల్కు చేరింది 17 ఇళ్లే.. ● రూఫ్ లెవల్కు 69.. ● బేస్మెంట్ లెవల్లో మరో 449 నిర్మాణాలు.. ● పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక ధరలతో ముందుకు రాని లబ్ధిదారులుసదాశివనగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ధరాఘాతం తగిలింది. పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక ధరల కారణంగా ఇళ్ల నిర్మాణానికి చాలా మంది లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో నిర్మాణాలు వేగం పుంజుకోవడం లేదు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లను మంజూరు చేస్తోంది. తొలి విడతలో జిల్లాకు 11,489 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 5,246 గృహాలకు మార్కింగ్ పూర్తయ్యింది. ఇప్పటివరకు 17 ఇళ్లు మాత్రమే స్లాబ్ లెవల్కు చేరాయి. 69 గృహాలు రూఫ్ లెవల్లో ఉండగా 449 నిర్మాణాలు బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. మిగతావాటి పనులు ముందుకు సాగడం లేదు. అప్పుల పాలవుతున్న నిర్మాణదారులు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వివిధ దశలలో బిల్లులు చెల్లిస్తుంది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు ఇస్తుంది. రూఫ్ లెవల్ వరకు పూర్తయితే రూ. 1.25 లక్షలు, స్లాబ్ వేస్తే రూ. 1.75 లక్షలు, రంగులు వేసిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు అందిస్తుంది. అయితే పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో నిర్మాణదారులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పులు తేవాల్సి వస్తోంది. ఇది వారికి మరింత భారంగా మారుతోంది. దీంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.ధరలు ౖపైపెకి...ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఐరన్ ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్లో సిమెంట్ బస్తా ధర రూ. 250 నుంచి రూ. 300 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 330 నుంచి రూ. 360కి విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 2 వేలనుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇటుక, స్టీల్, కలప ధరలూ గణనీయంగా పెరిగాయి. విపరీతంగా ధరలు పెరిగాయి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యిందని మురిసినం. ఇంటి నిర్మాణం చేపట్టినం. సి మెంట్, ఇసుక, సలాక ధర లు మస్తు పెరిగినయి. ఒక సలాక కోసమే రూ. లక్ష అ యినయి. సిమెంట్ కూడా మస్తు పెరిగింది. ఇబ్బందిగా ఉంది. – సాకలి సాయిలు, లబ్ధిదారు, ధర్మారావ్పేట్ప్రోత్సహిస్తున్నాం.. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులను గుర్తించాం. కొన్నిచోట్ల పనులు ప్రారంభించాం. ఇప్పటికీ ఇంకా మార్కింగ్ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇల్లు మంజూరైనవారు నిర్మాణాలు చేపట్టుకునేలా ప్రోత్సహిస్తున్నాం. పనులు ప్రారంభించిన వారికి నిబంధనల ప్రకారం బిల్లులు మంజూరు చేస్తున్నాం. – విజయపాల్రెడ్డి, హౌసింగ్ పీడీ, కామారెడ్డి -
కనుల పండువగా రథయాత్ర
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీజగన్నాథ రథయాత్రను కనుల పండువగా నిర్వహించారు. విద్యానగర్ సాయిబాబా ఆలయం చౌరస్తా వద్ద రథయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సిరిసిల్ల రోడ్డులోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం వరకు రథయాత్ర సాగింది. వడోదర ఇస్కాన్ ప్రతినిధులు వాసుగోష్ ప్రభు, వెంకటదాసు ప్రభు, పట్టణ ఎస్హెచ్వో నరహరి, వీహెచ్పీ ప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో రథయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరేకృష్ణ, జై జగన్నాథ నామస్మరణతో పుర వీధులు మారుమోగాయి. నవీపేటకు చెందిన చందు సాయన్న చిందు కళాకారుల బృందం దేవతామూర్తుల వేషధారణతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
‘సహకారం’తో రైతులు, కార్మికులకు ప్రయోజనం
సుభాష్నగర్: సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యాపారులు లాభపడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ అలయెన్స్ (ఐసీఏ) ఆధ్వర్యంలో లండన్లోని మాంచెస్టర్ నగరంలో కో ఆపరేటీవ్ యాక్టివిటీస్ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటీవ్ బ్యాంక్స్ లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఎస్సీఓబీ) తరఫున కుంట రమేశ్రెడ్డి సదస్సుకు హాజరై ప్రసంగించారు. యూఎన్వో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకార సంస్థలు రైతులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయని, గ్రామీణ వ్యవస్థకు మూలాధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తున్న సౌకర్యాలను రమేశ్రెడ్డి వివరించారు. -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా ని ర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కామరెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్లో ఇద్దరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లను అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిరుపేదలు సైతం గౌరవంగా సొంత ఇంటిలో నివసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్, హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
కమ్మర్పల్లి: ఒమన్ దేశంలో ఆత్మహత్యకు పాల్పడిన కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామానికి చెందిన జుంబరాత్ అన్వేశ్(27) మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 15 రోజుల క్రితం అన్వేశ్ ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహం తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ నేత సునీల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారు గల్ఫ్ కన్వీనర్ భీమ్రెడ్డితో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహం స్వగ్రామానికి రావడానికి కృషి చేశారు. -
ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతతో నిర్మించుకోవాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇళ్లను నాణ్యతతో సకాలంలో నిర్మించుకోవాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆయన డీపీవో మురళి, ఎంపీడీవో రాజేశ్వర్తో కలిసి మండల పరిదిలోని పోతంగల్ కలాన్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోయించారు. మహిళా సంఘాల్లో కుడుతున్న విద్యార్థుల దుస్తులను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి కేంద్రాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎంపీవో లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి నస్రుల్లాబాద్: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేక అధికారి దయానంద్ అన్నారు. సోమవారం బొమ్మన్దేవ్పల్లిలో నూతనంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో సూర్యకాంత్, జీపీ సిబ్బంది ఉన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఎంపీడీవో ప్రకాష్ అన్నారు. మంగళవారం తిమ్మాపూర్లో పనులను పరిశీలించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బొల్లారంలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మంగళవారం స్థానిక ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాల్లో ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పంచాయతీ కార్యదర్శి సంతోష్ ఉన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్): త్వరగా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని మండల ప్రత్యేక అధికారి కిషన్ సూచించారు. మంగళవారం వడ్లం, కాస్లాబాద్ గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ చందర్ నాయక్ -
డబుల్ ఇంజిన్ సర్కార్తో లాభం లేదు
నిజామాబాద్ సిటీ: ఇటీవల జిల్లాకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్షా డబుల్ ఇంజిన్ సర్కార్ వ స్తుందని మాట్లాడుతున్నారని, డబుల్ ఇంజిన్ స ర్కార్తో ఏమీ లాభం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. నగరంలో మంగళవారం ని ర్వహించిన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ వి స్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బీ జేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి లేదన్నా రు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఎందు కు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రేషన్ దు కాణాల్లో మోదీ బొమ్మ పెట్టాలనడం అర్థరహితమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకా లు అమలుచేస్తున్నా, వాటిని క్షేత్రస్థాయిలో ప్రచా రం చేయడంలో మాత్రం వెనుకబడి ఉన్నామన్నా రు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. రా బోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చా టాలన్నారు. విభేదాలు పక్కనపెట్టి అంతా కలిసి మెలిసి పనిచేయాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మా ట్లాడుతూ.. పాత, కొత్త తేడా లేకుండా కార్యర్తలు, నాయకులు కలిసిమెలిసి పనిచేయాలన్నారు. బోధ న్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రే వంత్రెడ్డి అమలుచేస్తున్న పథకాలు చూసి బీఆర్ఎ స్ నాయకులు అసూయపడుతున్నారన్నారు. రూర ల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ.. పసుపు బోర్డుతో కాకుండా, మద్దతు ధర లభించినప్పుడే పసుపు రైతుల కళ్లల్లో ఆనందం వస్తుందన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నగరంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం -
ఒకరి ఆత్మహత్య
వర్ని: మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ నాంపల్లి రాములు(53) మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వర్ని ఎస్ఐ మహేష్ వెల్లడించారు. రాములు మృతికి గల కారణాలు తెలియరాలేదని అతడి తల్లి పోశవ్వ ఫిర్యాదులో పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్వాడి: నగరంలోని పులాంగ్ వాగు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించారు. మృతుడు చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తిగా కనిపిస్తున్నట్లు తెలిపారు. గత కొద్దిరోజులుగా ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. అతడు బ్రౌన్ కలర్ నైట్ ప్యాంట్ ధరించాడని, ఎవరికై నా తెలిసినట్లయితే పోలీస్ స్టేషన్లో గాని, 8712659840, 8712659719ను సంప్రదించాలని సూచించారు.గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కామారెడ్డి క్రైం: కామారెడ్డి రైల్వే స్టేషన్ మూడో ప్లాట్ఫాం పక్కనే ఉన్న ఓ గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు మంగళవారం మృతదేహాన్ని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించగా, పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతడి వయస్సు 30–40 ఏళ్ల మధ్య ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడు నలుపు, తెలుపు రంగుల పూల షర్టును ధరించాడన్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు పట్టణ పోలీసులను సంప్రదించాలని ఎస్హెచ్వో నరహరి కోరారు. డ్రంకన్డ్రైవ్ కేసులో పలువురికి జైలు ఖలీల్వాడి: నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధుల్లో ఇటీవల డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, 17మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డట్లు ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. వారికి మంగళవారం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించి, జిల్లా కోర్టులో హాజరుపరిచినట్లు పేర్కొన్నారు. మేజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం వారిలో ఆరుగురికి జరిమానా వేయగా, ఆరుగురికి ఒక రోజు, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. నవీపేట: నవీపేట శివారులో పోలీసులు ఇటీవల డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, మంగళవారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి అతడికి 7రోజుల జైలుశిక్ష విధించారు. మోత్కూర్ పోలీసుల అదుపులో జిల్లా వృద్ధుడు ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లాకు చెందిన వృద్ధుడు యాద్రాది జిల్లా మోత్కూర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. నిజామాబాద్కు చెందిన దండు గోవర్ధన్(60) అనే వృద్ధుడు మోత్కూర్లో సంచరిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇతని వివరా లు తెలిసినవారు మోత్కూర్ పీఎస్ 70970 52763 లేదా నాలుగో టౌన్ పోలీసులు 87126 59840, 8712659719ను సంప్రదించాలన్నారు. -
వర్షాకాలం.. పాములతో పైలం
రాజంపేట: వర్షాకాలం బీడుభూములు, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, గడ్డితో ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. మురికి నీటి గుంతలు, మడుగుల్లో నీరు నిలవడంతో కప్పలు, పాములు, విష పురుగులు బయటకొచ్చి సంచరిస్తుంటాయి. ఈ క్రమంలో రైతులు వ్యవసాయ కూలీలు, అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండేవాళ్లు, పంట పొలాలకు దగ్గరగా నివాస ప్రాంతాలున్న వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణా ప్రాంతాల్లో పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. గత సంవత్సరం వర్షాకాలంలో రాజంపేట మండలంలోని శేర్శంకర్ తండాకు చెందిన తండ్రి కొడుకులైన రవి, వినోద్లు ఇంట్లో పాముల కాటుకు గురై కాలయాపన కారణంగా చనిపోయారు. ఇంటి సరిసరాలు సరిగా లేకపోయినా, రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు పాముకాటుకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. పాముకాటుకు గురైనప్పుడు ప్రాణాపాయం నుంచి బయట పడాలంటే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.. పాములు ఎక్కువగా ఉండే ప్రాంతాలు.. పొలం, కాల్వ గట్లు, వాగులు, పశువుల పాకలు, పిచ్చి మొక్కలతో నిండి పొదలు, గడ్డి వాములు, పాడుబడ్డ ఇళ్లు, ఇళ్ల ముందు పేర్చిన కట్టెలు, పెంటకుప్పల్లో పాములు ఎక్కువగా తిరుగుతుంటాయి. ఆహారం కోసం బయటకు వచ్చి ఎలుకలు, బల్లులు, తొండలు, పక్షులను తింటాయి. ఇలాంటి ప్రాణులు ఎక్కడ ఎక్కువగా సంచరిస్తాయో పాములు అక్కడ తిష్ట వేస్తాయి. నాగు పాము, కట్ల పాము, రక్తపింజర తదితర పాములు విషపూరితమైనవి. వీటికాటుకు గురైన బాధితులకు వెంటనే వైద్యం అందకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు. తాచు, కట్ల పాము వంటి 15 శాతం పాములే విషపూరితమైనవి ఉంటాయి. మిగతా పాములు కరిచినా సాధారణ చికిత్సతో నయమవుతాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. రాత్రి వేళల్లో తిరిగే వాళ్లు, అక్కడే నిద్రించే వాళ్లు టార్చ్ లైట్ వెంట తీసుకుపోవాలి. పాములు చేరడానికి అవకాశం లేకుండా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. పెట్రోల్, కిరోసిన్, వెల్లుల్లి, ఇంగువ వాసనలను పాములు భరించలేవు. పాములు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే సమయానుకూలంగా వీటిని ఉపయోగించుకోవాలి. రాత్రి వేళల్లో పొలాల గట్లపై, గడ్డివాముల్లో తిరిగే రైతులు, కూలీలు మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు, చేతులకు రబ్బరు తొడుగులు వేసుకోవడం ఉత్తమం.ప్రథమ చికిత్స ఇలా.. ముఖ్యంగా పంట పొలాల్లో పొంచి ఉన్న ప్రమాదం గతేడాది పాముకాటుతో తండ్రీకొడుకుల మరణం నాటు వైద్యంతో కాలయాపన చేయొద్దు జాగ్రత్తలు పాటించడమే నివారణకు మార్గంనాటు వైద్యం వద్దు ఎవరైనా పాము కాటు ప్రమాదం బారిన పడిన వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కొందరు నాటు వైద్యం పేరిట కాలయాపన చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఇలాంటి పొరపాట్లు చేయవద్దు. ఇళ్ల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పంట పొలాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. – విజయమహాలక్ష్మి, వైద్యులు, రాజంపేట పాముకాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందొద్దు. పక్కవారు బాధితుడికి ధైర్యం చెప్పాలి. పాముకాటేసిన పై భాగంలో వెంటనే తాడు, గుడ్డతో బిగుతుగా కట్టాలి. కాటు వద్ద పదునైన బ్లేడు గాయం చేసి రక్తం కారనివ్వాలి. పాముకాటుకు గురైన వ్యక్తిని నడిపించడం, పరిగెత్తించడం చేయొద్దు. నాటువైద్యం పేరిట పసర్లు, వేర్లు, మంత్రాలు అంటూ కాలయాపన చేయకుండా వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలి. కాటేసిన పాము అంతకు ముందు ఆహారం తీసుకున్నా.. అంతకు ముందు వేరే జీవిని కాటేసినా విష ప్రభావం తక్కువగా ఉంటుంది. -
యూరియా కోసం ఆందోళన
గాంధారి: సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండల కేంద్రంలో రైతులు సింగిల్ విండో కార్యాలయం వద్ద గాంధారి–కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోఖో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కోసం వ్యవసాయ పనులు వదిలి వచ్చి క్యూలో నిల్చుంటున్నామని, అయినా అందరికీ దొరకడం లేదని పేర్కొన్నారు. ప్రైవేట్ దుకాణాలలో వారిచ్చే ఇతర రసాయనాలను కొనుగోలు చేస్తేనే యూరియా అమ్ముతున్నారని ఆరోపించారు. యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు శంకర్రావు, రావు సాహెబ్రావు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
షార్ట్ ఫిలిమ్స్తో బడివైపు విద్యార్థులు
లింగంపేట: షార్ట్ ఫిలిమ్స్తో విద్యార్థులు బడివైపు ఆకర్షితులవుతారని డీఈవో రాజు అన్నారు. మంగళవారం శెట్పల్లి ఉన్నత పాఠశాలలో షార్ట్ ఫిల్మ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏఎక్స్ల్–ఎఫ్ఎల్ఎన్ (అసిస్టెడ్ లాంగ్వేజ్ అండ్ మాథ్స్ లర్నింగ్– ఫండమెంటల్ లిటరసీ అండ్ న్యూమరసీ)లో భాగంగా ఏఐపైన ష్టార్ట్ ఫిలిమ్ తీసినట్లు తెలిపారు. డిజిటల్ విద్యపై విద్యార్థులకు అవగాహన వస్తుందన్నారు. విద్యార్థులకు డిజిటల్ విద్యపై ఆసక్తి పెరిగి బడికి క్రమం తప్పకుండా వస్తారన్నారు. ఉపాధ్యాయులు షార్ట్ ఫిలిమ్స్ ఎక్కువగా రూపొందించి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ అన్ని పాఠశాలల్లో ప్రదర్శించాలని సూచించారు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ స్టేట్ రిసోర్స్ పర్సన్ అఖిల్ను డీఈవో అభినందించారు. నిర్మించడానికి ఆర్థిక సహకారం అందజేసిన శెట్పల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వసుధను అభినందించారు. జిల్లా సెక్టోరల్ అధికారి వేణుశర్మ, ఎంఈవోలు శౌకత్అలీ, రామస్వామి, సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
దోమకొండ: గ్రామాల్లో మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత పంచాయితీ కార్యదర్శులదేనని మండల ప్రత్యేకాధికారి, జిల్లా హార్టికల్చర్ అఽధికారి జ్యోతి అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలానికి చెందిన పంచాయితీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. అంటు వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా పన్ను వసూలు చేసిన రసీదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఈజీఎస్ ఏపీవో రజని పాల్గొన్నారు. -
‘సరిపడా ఎరువులున్నాయి’
సదాశివనగర్ : జిల్లాలో సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసా య అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. మంగళవారం ఆయన అడ్లూరు ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్, విండో కార్యాలయం, స దాశివనగర్, పద్మజీవాడి, ఉత్తనూర్ సొసైటీలను తనిఖీ చేశారు. ఎరువుల పంపిణీపై ఆ రా తీశారు. జిల్లాలో ఎరువుల కొరతలేదని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించా రు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అ ధికారి ప్రజాపతి, ఏఈవోలు పాల్గొన్నారు. డీపీఎంల బదిలీ కామారెడ్డి క్రైం : జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ లో ముగ్గురు డీపీఎంలు బదిలీపై ఇతర జి ల్లాలకు వెళ్లారు. ఇతర జిల్లాలనుంచి నలుగు రు జిల్లాకు వచ్చారు. ఇక్కడ డీపీఎంలుగా ప నిచేసిన సుధాకర్, రమేశ్బాబు, రవీందర్ బ దిలీపై ఇతర జిల్లాలకు వెళ్లారు. నిజామాబా ద్ జిల్లా నుంచి డీపీఎంలు శ్రీనివాస్, సాయి లు, నిర్మల్ నుంచి శోభారాణి, సిద్దిపేట నుంచి రాజయ్య కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ప్ర స్తుతం డీఆర్డీఏ పింఛన్ల విభాగం డీపీఎంగా ఉన్న సురేష్ కుమార్ను వ్యవసాయ ఆ ధారిత జీవనోపాదుల డీపీఎంగా మార్చా రు. నూతన డీపీఎంలు మంగళవారం కలెక్ట ర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా క లిశారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేంద ర్, అధికారులు పాల్గొన్నారు. ‘కాంగ్రెస్ సభకు తరలిరావాలి’ కామారెడ్డి టౌన్: హైదరాబాద్లోని లాల్ బ హదూర్ స్టేడియంలో ఈనెల 4న నిర్వహించే కాంగ్రెస్ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు తరలిరావాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఏఐసీ సీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొనే ఈ స భకు ప్రతి నియోజకవర్గం నుంచి గ్రామ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయ కులు, కార్యకర్తలు పాల్గొనాలన్నారు. సమా వేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీని వాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, నాయకులు పంపరి లక్ష్మణ్, రాజాగౌడ్, లక్కపత్రి గంగాధర్, కిరణ్ కు మార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపిక కామారెడ్డి అర్బన్: గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థులు వీణ, భవానీ జాతీయ స్థాయి హాకీ పోటీల కు ఎంపికయ్యారు. తెలంగాణ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపడంతో రా ష్ట్ర జట్టుకు ఎంపిక చేశారని పాఠశాల వ్యా యామ ఉపాధ్యాయుడు మధుసూదన్రెడ్డి తెలిపారు. ఈనెల 3 నుంచి 8వ తేదీ వరకు జార్ఖండ్ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ స్థా యి సబ్ జూనియర్ బాలికల హాకీ పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. పాఠశాల హెడ్మాస్టర్ ఎల్లయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు క్రీడాకారులు వీణ, భవానీలను అభినందించారు. ప్రారంభమైన ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలన కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంసెట్ మొదటి విడత ధ్రువపత్రాల పరిశీలన మంగళవారం ప్రారంభమైంది. ధ్రువపత్రాల పరిశీలనకు 823 మంది కామారెడ్డి కేంద్రాన్ని ఎంచుకున్నారని కౌన్సెలింగ్ సమన్వయకర్త, కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. ఈనెల 4వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుందన్నారు. పరిశీలనలో అధికారులు అజారుద్దీన్, ఫర్హీన్ ఫాతిమా, అఫ్రీన్ ఫాతిమా, శ్రీలత, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలు తగ్గాయి
కామారెడ్డి క్రైం : ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టడం, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయడంతో జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. మంగళవారం ఆయన 2024–25 అర్ధ వార్షిక నేర సమీక్షను విడుదల చేశారు. గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈసారి జిల్లాలో నేరాలు, కేసులు తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 28 బ్లాక్స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నివారణ చర్యలు తీసుకుంటున్నామన్నారు. సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోని కమిషనరేట్లు మినహా జిల్లాలలో కామారెడ్డి అగ్రస్థానంలో ఉందన్నారు. హోంగార్డు నుంచి ఏఎస్సై స్థాయి వరకు 192 మంది సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహించి స్పౌస్, సీనియారిటీ, హెల్త్ గ్రౌండ్స్ పరిగణనలోకి తీసుకొని బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామన్నారు. జిల్లాలో ఇద్దరు కానిస్టేబుళ్లు చనిపోగా వారి కుటుంబ సభ్యులకు 2 నెలల్లోనే కారుణ్య నియామకాలను పూర్తి చేశామని పేర్కొన్నారు. డయల్ 100 కు సమాచారం అందిన నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ సిబ్బంది చేరుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. కేసుల సంఖ్యను మరింతగా తగ్గించే విధంగా, జిలాల్లో నేరాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నేర సమీక్ష నివేదికలోని వివరాలు.. ● 2024లో జూన్ నెలాఖరు వరకు జిల్లాలో 317 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. వాటిలో 152 కేసుల్లో 160 మంది చనిపోయారు. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 282 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 120 ప్రమాదాల్లో 125 మంది మరణించారు. గతేడాదితో పోలిస్తే 22 శాతం మరణాలు తగ్గాయి. ● గతేడాది తొలి ఆరు నెలల్లో లైసెన్స్ లేని 75,179 మందికి చలానాలు విధించారు. అతివేగంగా వాహనాలు నడిపినందుకు 43,348, హెల్మెట్ లేనందుకు 16,340, డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి 5,942 చలాన్లను విధించారు. ● దొంగతనం కేసులు గతేడాది జూన్ ఆఖరువరకు 259 నమోదయ్యాయి. ఈసారి 214 కు తగ్గాయి. రాత్రి సమయాల్లో జాతీయ రహదారుల వెంట ఆగి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న 11 మంది సభ్యుల ముఠా(పార్థి గ్యాంగ్)ను అరెస్ట్ చేశారు. ● గతేడాది తొలి అర్ధ భాగంలో మహిళలపై దాడులు, వేధింపులు, వరకట్నం కేసులు 174 నమోదు కాగా ఈసారి 167 కు తగ్గాయి. ● జిల్లాలో ఈ ఏడాది జూన్ చివరి వరకల్లా ఆరుగురు నిందితులకు యావజ్జీవ శిక్ష, 12 మందికి ఏడేళ్లలోపు శిక్షలు పడ్డాయి. ● డయల్ 100కు 22,102 ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలో 137 కేసులు నమోదయ్యాయి. మిగతా వాటిని సామరస్యంగా పరిష్కరించారు. ● సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3,265 సెల్ఫోన్లను రికవరీ చేశారు. వాటి విలువ దాదాపు రూ.7 కోట్లు. ఈ ఏడాదిలోనే 452 సెల్ఫోన్లు రికవరీ చేశారు. నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం ఎస్పీ రాజేశ్ చంద్ర అర్ధ వార్షిక నేర సమీక్ష విడుదల -
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కార్యకర్తలు తెలుసుకోవాలి ● క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి ● జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కనిజామాబాద్ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలను కచ్చితంగా తెలసుకుని ముందుకు వెళ్లాలని జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) సూచించారు. మంగళవారం నిజామాబా ద్లో ఈవీఎం గార్డెన్స్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కోరుట్ల, జగిత్యాల, జుక్కల్ల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా బాధ్యులు, పలు విభాగాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వాటిని ప్రజలకు చేరవేయడంలో కార్యకర్తలు వెనకబడి ఉన్నారన్నా రు. ఈనెల 4న హైదరాబాద్లో నిర్వహించే కార్యకర్తల సదస్సుకు వేల సంఖ్యలో కార్యకర్తలు హాజరు కావాలని, ప్రతి గ్రామం నుంచి 500 మందిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా జిల్లాకువచ్చి డ బుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని మాట్లాడారని, డ బుల్ ఇంజిన్ సర్కార్తో ఏమీ లాభం లేదని ప్రభు త్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ పేర్కొన్నా రు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి లేదన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రే షన్ దుకాణాల్లో మోదీ బొమ్మ పెట్టాలనడం అర్ధరహితమన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, మాజీ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు మదన్మోహన్ రావు, లక్ష్మీకాంతారావు, సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, సంజయ్, వెడ్మ బొజ్జు, కార్పొరేషన్ల చైర్మన్ లు ఈరవత్రి అనిల్, తాహెర్బిన్ హందాన్, మా నాల మోహన్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారె డ్డి, నేతలు ఏనుగు రవీందర్రెడ్డి, సునీల్రెడ్డి, విన య్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలి
కామారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫైనాన్షియల్ ఇంక్లూషన్ క్యాంపెయిన్ ప్రోగ్రాంకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 30వ తేదీ వరకు మూడు నెలలపాటు ప్రజలకు ఇన్సూరెన్స్పై అవగాహన కల్పించాలని సూచించారు. అందరితో బ్యాంక్ ఖాతాలు తెరిపించడం, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి, అటల్ పెన్షన్ యోజన తదితర స్కీంలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరితో మినిమం ఇన్సూరెన్స్ చేయించాలని అదనపు కలెక్టర్ చందర్నాయక్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు, బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. -
విద్యార్థులను తీర్చిదిద్దాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తాడ్వాయి : విద్యార్థులను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులే తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఆయన మంగళవారం తాడ్వాయితో పాటు దేవాయిపల్లి గ్రామంలో పర్యటించారు. ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో అంగన్వాడీ కేంద్ర భవనం, వంటగది, ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కుండీలలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగానే ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. మొదటి విడత బిల్లులు త్వరలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయన్నారు. అనంతరం ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటి, నీళ్లు పోశారు. దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఆయన వెంట డీఈవో రాజు, హౌజింగ్ డీఈ సుభాష్, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవిత, ఏపీవో కృష్ణగౌడ్, ఏపీఎం మనోహర్, ఎంఈవో రామస్వామి, హెచ్ఎం కళ్యాణి, కార్యదర్శి బాలు తదితరులు ఉన్నారు. -
ఖాళీ స్థలాలు.. అపరిశుభ్ర నిలయాలు
కామారెడ్డి టౌన్: పట్టణంలోని ఖాళీ స్థలాలు అపరిశుభ్ర వాతావరణానికి నిలయాలుగా మారాయి. ఈ పాట్లను శుభ్రం చేసుకోవాల్సిన బాధ్యత వాటి యజమానులదే. కానీ వారు ఏళ్ల తరబడిగా పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, మురుగు నీటితో నిండిపోతున్నాయి. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. వర్షాలకు వా టిలో నీరు నిలిచి మురికి కూపంలా తయారవుతున్నాయి. నిల్వ నీటిలో దోమలు, ఈగలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. సీజన ల్ వ్యాధులు ప్రబలకుండా మందస్తు చర్యల్లో భా గంగా ఇటువంటి స్థలాలపై దృష్టి పెట్టి, అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూడాలని కోరుతున్నారు. ప్రతి వార్డులో వందల సంఖ్యలో.. కామారెడ్డి పట్టణంలో 49 వార్డులున్నాయి. ప్రతి వా ర్డులో వందకు పైగా ఖాళీ స్థలాలున్నాయి. విలీన గ్రామాలతో పాటు, శివారు కాలనీలలో అంతకుమించి ఖాళీ స్థలాలు ఉన్నాయి. సమీపంలోని ఇళ్లవాసులు చెత్తాచెదారాన్ని ఈ ఖాళీ ప్రదేశాల్లో పడేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఖాళీ స్థలాలు దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. అశోక్నగర్, స్నేహపురి కాలనీ, శ్రీరాంనగర్, బతుకమ్మకుంట, విద్యానగర్, ఎన్జీవోస్ కాలనీ, దేవునిపల్లి, వికాస్నగర్, గాంధీనగర్, టీచర్స్కాలనీ, ఇందిరానగర్, రాజానగర్, అయ్యప్పనగర్, భవానీనగర్, హౌసింగ్బోర్డు, బడాకసాబ్గల్లి, సైలానీబాబా కాలనీ, పంచముఖి హనుమాన్, రుక్మిణీకుంట, ఒడ్డెరకాలనీ, వాంబేకాలనీ, గ్రీన్సీటి తదితర కాలనీలతో పాటు విలీన గ్రామాలైన అడ్లూర్, రామేశ్వరపల్లి, పాతరాజంపేట, సరంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, టేక్రియాల్లలో ఇళ్ల పక్కన ఖాళీ స్థలాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి ఖాళీ ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇచ్చి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. నోటీసులు జారీ చేస్తాం పట్టణంలో అధ్వానంగా ఉన్న ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేస్తాం. ముందస్తుగా ఖాళీ స్థలాల యజమానులు స్పందించి వారి ప్లాట్లను శుభ్రం చేసుకోవాలి. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి ఏళ్ల తరబడి తమ ప్లాట్లవైపు కన్నెత్తి చూడని స్థలాల యజమానులు పిచ్చి మొక్కలు, మురుగుకు నిలయాలు, దోమలు, ఈగలు, పాములకు ఆవాసాలు.. వ్యాధుల బారిన పడుతున్న పట్టణవాసులు -
ఒకటే గది.. తరగతులు ఐదు
పెద్దకొడప్గల్ : కుబ్యానాయక్ తండాలోని ప్రాథమి క పాఠశాలలో ఐదు తరగతులు నిర్వహిస్తున్నారు. బడిలో ఒకటే గది ఉంది. ఈ భవనం కూడా శిథిలా వస్థకు చేరింది. ఆఫీస్ రూంతోపాటు ఐదు తరగతు లకు ఇదే గది దిక్కు. కాగా గతేడాది వరకు ఈ బడి లో 39 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. ఉ పాధ్యాయులు బడిబాటలో భాగంగా ఇంటింటికి వె ళ్లారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధిస్తామని, విద్యార్థుల్లో మార్పు రాకపోతే మళ్లీ ప్రైవేట్ పాఠశాలకే పంపించుకోండని చెప్పారు. దీంతో తండావాసులు తమ పిల్లలను సర్కారు బడికి పంపిస్తుండడంతో ఈసారి విద్యార్థుల సంఖ్య 70కి చేరింది. ప్ర స్తుతం మొదటి తరగతిలో 15 మంది విద్యార్థులుండగా.. రెండో తరగతిలో 19 మంది, మూడో తరగతిలో 14 మంది, నాలుగో తరగతిలో 8 మంది, ఐ దో తరగతిలో 14 మంది విద్యార్థులున్నారు. గదుల కొరతతో ఇబ్బంది.. పాఠశాలలో 70 మంది విద్యార్థులుండగా.. ఒక్క గది మాత్రమే ఉంది. దీంతో ఆ గదిలోనే ఐదు తరగతుల పిల్లలకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి. దీంతో కొంతమందిని చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. అలాగే బడిలో ఉపాధ్యాయుల కొరత ఉంది. 60 మందికన్నా ఎక్కువ విద్యార్థులుంటే నిబంధనల ప్రకారం ముగ్గురు టీచర్లు ఉండాలి. విద్యార్థులకు సరిపడా తరగది గదులు నిర్మించాలని, మరో టీచర్ను కేటాయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు నివేదిస్తాం కుబ్యానాయక్ తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటే గది ఉంది. అది కూడా శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించి, తరగతి గదుల మంజూరు కోసం కృషి చేస్తాం. ఈసారి విద్యార్థుల సంఖ్య పెరిగినందున మరో టీచర్ను కేటాయించే ఏర్పాట్లు చేస్తాం. – ప్రవీణ్ కుమార్, ఎంఈవోపాఠశాల ఆవరణలో చదువుకుంటున్న విద్యార్థులు ఆ తండాలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఐదు తరగతుల్లో 70 మంది విద్యార్థులున్నారు. వీరికి పాఠాలు బోధించడానికి ఉన్నది ఇద్దరు టీచర్లే.. చదువుకోవడానికి ఉన్నది ఒకే ఒక్కగది. దీంతో కొంతమందిని గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతుండగా.. మరికొందరికి చెట్టు కింద బోధిస్తున్నారు. 70 మంది విద్యార్థులకు ఇద్దరే టీచర్లు చెట్ల కింద బోధన.. కుబ్యానాయక్ తండా బడిలో ఇదీ పరిస్థితి అదనపు గదులు నిర్మించాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు -
వసతుల కల్పన నా బాధ్యత
నస్రుల్లాబాద్: పాఠశాలలో వసతులను కల్పించడం నా బాధ్యత .. చదువు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యతని రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నెమ్లి గ్రామంలో సోమవారం పీఎంశ్రీ పాఠశాలలో రూ.40.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్, అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాన్సువాడ ప్రజలకు విద్య, వైద్యం చేరువ అవ్వాలనే పని చేస్తున్నానన్నారు. ప్రత విద్యార్థి ఉన్నతంగా చదవాలంటే సౌకర్యాలు ఉండాలన్నారు. అందులో భాగంగానే విద్యార్థులు చదవడానికి అదనపు గదులను నిర్మించామన్నారు. ఎడ్యుకేషన్ అనేది గేమ్ చేంజర్: సబ్ కలెక్టర్ కిరణ్మయి ఎడ్యుకేషన్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో గేమ్ చేంజర్ అని బాన్సువాడ సబ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. ఉన్నతంగా చదివుతేనే జీవితంలో విజయం సాధిస్తామన్నారు. అరకొర వసతుల మధ్య విద్యను చదువుకున్న రోజుల్లోనే ఎంతో మంది తమ జీవితాలను మార్చుకున్నారని కాని ప్రభుత్వం ప్రస్తుతం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వాటిని ఉపయోగించుని ఉత్తమ ఫలితాలను సాధించాలన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తహసీల్దార్ సువర్ణ, ఎంఈవో చందర్ నాయక్, ఎంపీడీవో సూర్యకాంత్, ఏఎంసీ చైర్మన్ శ్యామల, తదితరులు పాల్గొన్నారు. చదువు చెప్పడం ఉపాధ్యాయుల బాధ్యత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అదనపు తరగతి గదుల ప్రారంభం -
సభను విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్/రాజంపేట: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నేడు నిర్వహించే లంబాడ హక్కుల పోరాట సమితి(ఎల్హెచ్పీఎస్) విజయోత్సవ సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి గుగ్లోత్ వినోద్ కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడారు. ఎల్హెచ్పీఎస్ 28 ఏళ్లు పూర్తి చేసుకుని 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రి నాయక్, నేతలు శంకర్, రూప్సింగ్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ తదితరులున్నారు. -
అంధకారంలో పట్టణం
సిరిసిల్లరోడ్లో వెలగని లైట్లుకామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణంలో వీధీ దీపాలు, ప్రధాన రోడ్లపై సెంట్రల్ లైటింగ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. దీంతో కొన్ని కాలనీల్లో సాయంత్రం కాగానే చీకట్లు అలుమకుంటున్నాయి. కాలనీలతో పాటు ప్రధాన రోడ్లపైనా పలుచోట్ల వీధిదీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్టర్కు బకాయిలను చెల్లించకపోవడంతో నిర్వహణను గాలికి వదిలేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఏడాది దాటినా.. కామారెడ్డి బల్దియాలో 500లకుపైగా కాలనీలున్నా యి. లక్షకుపైగా జనం నివసిస్తున్నారు. పట్టణంలో ప్రధాన రోడ్లపై డివైడర్లలో ఏర్పాటు చేసిన 890 విద్యుత్ దీపాల నిర్వహణ బల్దియానే చూసుకుంటుంది. కాలనీలలో 12,434 వీధి దీపాలు ఉండగా వీటి నిర్వహణ బాధ్యతను ఈఎస్ఎన్ అనే కంపెనీ కి టెండర్ ద్వారా అప్పగించారు. ప్రతినెలా వీటి ని ర్వహణకు రూ. 10 లక్షలకుపైగా కంపెనీకి చెల్లించా ల్సి ఉంటుంది. అయితే మూడేళ్లుగా బిల్లులు చెల్లించడం లేదు. దీంతో బకాయిలు రూ. 3.40 కోట్లకు చేరాయి. బకాయిల భారం పెరగడంతో కాంట్రాక్ట్ పొందిన సంస్థ వీధిదీపాల నిర్వహణను గాలికి వదిలేసింది. పాడైపోయినవాటి స్థానంలో నూతన దీ పాలను కొనుగోలు చేయకపోవడంతో చాలా కాలనీలలో వీధిదీపాలు వెలగక రాత్రి వేళలో అంధకా రం అలుముకుంటోంది. శివారు కాలనీలలో పరిస్థి తి మరింత దారుణంగా ఉంది.సమస్య పరిష్కరిస్తాం పట్టణంలో వీధి దీపాల నిర్వహణ కంపెనీకి బకాయిలు ఉన్నాయి. వాటిని త్వరలో చెల్లిస్తాం. ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమస్యను నివేదిస్తున్నాం. త్వరలో నూతన విద్యుత్ దీపాలను కొనుగోలు చేస్తాం. సమస్య ఉన్న కాలనీలలో వాటిని బిగిస్తాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి సెంట్రల్ డివైడర్లలోనూ.. ప్రధాన రోడ్లపై సెంట్రల్ డివైడర్లలో వీధి దీపాల నిర్వహణ బాధ్యతను బల్దియా చూసుకుంటోంది. అయితే నిర్వహణను బల్దియా అధికారులు పట్టించుకోకపోవడంతో హౌజింగ్బోర్డు, మున్సిపల్ కార్యాలయం ముందు, రైల్వే బ్రిడ్జి, సిరిసిల్లరోడ్, స్టేషన్రోడ్, టేక్రియాల్ రోడ్, దేవునిపల్లి రోడ్లలో చాలావరకు లైట్లు వెలగడం లేదు. దీంతో పట్టణంలోని చాలాచోట్ల రాత్రి వేళలో చీకట్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. అధ్వానంగా వీధి దీపాల నిర్వహణ ఏడాదినుంచి బల్బుల కొరత.. కాలనీల్లో వెలగని లైట్లు పట్టించుకోని అధికారులు -
సీసీ కెమెరాలుంటే పోలీసులున్నట్టే
మాచారెడ్డి: గ్రామాల్లో సీసీ కెమెరాలుంటే పోలీసులున్నట్టేనని మాచారెడ్డి ఎస్సై అనిల్ అన్నారు. సోమవారం పాల్వంచ మండలం వాడిలో ముదిరాజ్ సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అంతర్జిల్లా దొంగల ముఠా రిమాండ్● 12 తులాల బంగారం, బైక్ స్వాధీనం వేములవాడ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగల ముఠాను రిమాండ్కు తరలించినట్లు వేములవాడ పోలీసులు సోమవారం తెలిపారు. వేములవాడ టౌన్ పీఎస్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్ బీ గీతే వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేశ్ నిజామాబాద్ జిల్లాకు చెందిన గద్దల స్వప్న, విశాల్సింగ్, జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్, నేరెళ్ల రాణి, గోత్రాల బాలమణి ముఠాగా ఏర్పడి ఆర్మూర్, నిజామాబాద్, వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడ్డారు. టెక్నాలజీ సాయంతో వీరు వేములవాడ సమీపంలో తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, ఒక బైక్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. దొంగలను పట్టుకున్న వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు అనిల్కుమార్, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్, పంతులు, లత, సాహెబ్ హుస్సేన్, దేవేందర్, సమియుద్దీన్ను అభినందించారు. -
పట్టు సాగుకు ముందుకు రావాలి
బీబీపేట: పట్టు పరిశ్రమ ఏర్పాటుకు రైతులు ముందుకు రావాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల అధికారి జ్యోతి సూచించారు. సోమవారం యాడారంలో మల్బరీ మొక్కల మెగా వనమహోత్సవం నిర్వహించారు. గ్రామానికి చెందిన నవీన్రావు పది ఎకరాల్లో మల్బరీ సాగుకు ముందుకు రావడంతో ఆయన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది 120 ఎకరాలలో మల్బరీ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన అధికారి సంతోషిరాణి, సెరికల్చర్ అధికారి అయిలయ్య, అసిస్టెంట్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బోధన్రూరల్: మండలంలోని బండార్పల్లికి చెందిన సాయికుమార్(28) చేపల వేటకు వెళ్లి ప్రవమాదవశాత్తు వల చుట్టుకుని నీటి మునిగి మృతిచెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మృతుడి భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. అర్గుల్లో ఒకరి అదృశ్యంజక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్లో నివాసముంటున్న లింగంపేట గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. ఈ నెల 28న రాత్రి 9 గంటలకు జక్రాన్పల్లిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్పై వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. అశోక్ తండ్రి ప్రభురాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోచంపాడ్లో పిచ్చికుక్కల స్వైర విహారం బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్లో సోమవారం ఉదయం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో వీధుల గుండా కనిపించిన వారిపై దాడి చేశాయి. దీంతో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రజిత చేతిపై, విఠల్, విష్ణులకు కంటి, కాలి భాగాలపై దాడి చేసి గాయపర్చాయి. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోచంపాడ్లో వీధి కుక్కులు ఎక్కువ కావడంతో కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ విగ్రహావిష్కరణలో దొంగల చేతివాటంనిజామాబాద్ రూరల్: కంఠేశ్వర్ బైపాస్ సిగ్నల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్ విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి అమిత్షా చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణలో మారుతినగర్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కాసుల రఘు, అలాగే బాశెట్టి గంగాధర్కు చెందిన బంగారు గొలుసులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరిఫ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నీవు లేని జీవితం నాకొద్దని..
వర్ని: ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలని భావించారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె మృతుని తట్టుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్ని మండలం వడ్డేపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఎరుకల పోశెట్టి(25) వడ్డేపల్లిలో ఉండే తన బంధువుల ఇంట్లో చిన్న నాటి నుంచి ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అనితను ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరి జీవితం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో ఇటీవల ఆమె అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మృతిని తట్టుకోలేని పోశెట్టి తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య -
‘అప్పు తీరినా.. సబ్సిడీ మంజూరు కాలేదు’
కామారెడ్డి అర్బన్: మూడేళ్ల క్రితం బ్యాంకు రుణం ద్వారా ట్రాక్టర్ను కొనుగోలు చేయగా పరిశ్రమల శాఖ ద్వారా రావాల్సిన సబ్సిడీ ఇంకా విడుదల కాలేదని కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామస్తుడు కుర్మకులానికి చెందిన దివ్యాంగుడు దొంతల శివరాజు వాపోయారు. 2022లో దాదాపు రూ.12 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీ, భూమి దున్నడానికి అవసరమయ్యే నాగళ్లు, ఇతర సామగ్రి కొనుగోలు చేయగా.. పరిశ్రమల శాఖ ద్వారా రూ.3లక్షల 9వేల 750 లు సబ్సిడీ విడుదల కావాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ వి.లాలు.. 2022లో సబ్సిడీ ఉత్తర్వులు ఇచ్చారు. ట్రాక్టర్పై కామారెడ్డి హెచ్డీఎఫ్సీ బ్యాంకు ద్వారా తీసుకున్న రుణం వాయిదాలు చెల్లించినప్పటికి పరిశ్రమల శాఖ సబ్సిడీ ఇంకా విడుదల కాలేదు. సబ్సిడీ కోసం రూ.30 వేలు మధ్యవర్తులకు ఖర్చు చేశానని దొంతల శివరాజు వాపోయాడు. -
దరఖాస్తుల గడువు పొడగింపు
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించడానికి ఈనెల 5వరకు గడువు పొడిగించినట్టు జిల్లా సంక్షేమాధికారి ఏ.ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ సహాయం పొందాలని సూచించారు. ఆర్అండ్బీ ఈఈగా మోహన్ కామారెడ్డి క్రైం: రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పి.మోహన్ నియమితులయ్యారు. ఇదివరకు ఇక్కడ ఈఈగా పని చేసిన రవిశంకర్ పదోన్నతిపై రంగారెడ్డి జిల్లాకు వెళ్లారు. బాన్సువాడ డిప్యూటీ ఈఈగా పనిచేసిన మోహన్.. కామారెడ్డి ఈఈగా పదోన్నతిపై వచ్చారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. -
జుక్కల్ అభివృద్ధే నా మొదటి ధ్యేయం
మద్నూర్(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధే నా మొదటి ధ్యేయమని దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. డోంగ్లీ మండలంలోని ఇలేగావ్ నుంచి మదన్హిప్పర్గా వరకు నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నాయకులు చాంద్ పటేల్, నాగేశ్ పటేల్, యూనుస్ పటేల్, బండు పటేల్, నాయకులు, కార్యకర్తలున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం బిచ్కుంద(జుక్కల్): ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండి ఒకొక్క హామీ నెరవేర్చుతున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం మెక్కా గ్రామంలో బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దశాబ్దాల నుంచి బీటీ రోడ్డు కోసం మెక్కా ప్రజలు ఎదురుచూస్తున్నారు నేటితో వారి కల నెరవేరిందన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు శంకర్ పటేల్, విఠల్రెడ్డి, నాగ్నాథ్, వెంకట్రెడ్డి, సయ్యద్ మసూద్, గోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ లైటింగ్ పనుల పరిశీలన బిచ్కుందలో కొనసాగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రెండు వైపులా డ్రైనేజి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను సూచించారు. చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ నిజాంసాగర్(జుక్కల్): చెట్లతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం జుక్కల్లో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఇంటా మొక్కలు నాటి కాపాడాలన్నారు. కాంగ్రెస్ నేతలు రమేష్ దేశాయ్, సాయాగౌడ్, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు -
ధరణి నిండా సమస్యలే!
● సర్కారు టౌన్షిప్లో ప్లాట్లు విక్రయించి రెండున్నరేళ్లు ● ఇప్పటికీ మౌలిక వసతులు కల్పించని ప్రభుత్వం ● మోసపోయామంటున్న ప్లాట్లు కొనుగోలు చేసినవారు ● సౌకర్యాలు కల్పించాలని వినతి కామారెడ్డి అర్బన్ : ధరణి టౌన్షిప్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి, జనాలను ఆకర్షించి ప్లాట్లు విక్రయించిన పాలకులు.. ఆ తర్వాత దాని ఊసే మరిచిపోయాయి. కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినవారు మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2009 సంవత్సరంలో కామారెడ్డిలోని44న నంబర్ జాతీయ రహదారి పక్కన రాజీవ్ స్వగృహ ఏర్పాటు చేశారు. ప్రస్తుత కలెక్టరేట్ సమీపంలో అడ్లూర్ శివారు 501/3 సర్వే నంబర్లో 50.29 ఎకరాల విస్తీర్ణంలో 40 అడుగుల ప్రధాన రోడ్లు, 30 అడుగుల అంతర్గత రోడ్లతో వివిధ పరిమాణాల్లో మొత్తం 543 ప్లాట్లు చేశారు. 313 ప్లాట్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మరో 230 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ఇళ్ల కోసం అప్పట్లో అసక్తిగలవారినుంచి డీడీలు తీసుకున్నారు. అయితే రాజశేఖరరెడ్డి మరణానంతరం ఇళ్ల నిర్మాణం మరుగున పడింది. ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అప్పట్లో రాజీవ్ స్వగృహలో ఇళ్ల కోసం డీడీలు చెల్లించినవారికి మూడేళ్ల క్రితం డబ్బులు వాపస్ ఇచ్చారు. రాజీవ్ స్వగృహను పట్టించుకునేవారు లేకపోవడంతో ప్లాట్ల చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి, అడవిలా మారింది. అందమైన బ్రోచర్లు ముద్రించి.. గత ప్రభుత్వం వృథాగా ఉన్న రాజీవ్ స్వగృహను 2022లో కాస్త అభివృద్ధి చేసి ధరణి టౌన్షిప్గా పేరు మార్చింది. అందమైన బ్రోచర్ ముద్రించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఐదు విడతల్లో ప్లాట్లను విక్రయించింది. సర్కారే ఎలాంటి హామీ లేకుండా ప్లాట్ల మార్టిగేజ్తో కెనరా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించింది. టౌన్షిప్లోని ప్లాట్లను వేలం వేయడం ద్వారా సర్కారుకు సుమారు రూ. 50 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. వేలం వేసిన తర్వాత టౌన్షిప్ను నిర్లక్ష్యం చేసింది. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం, కనీస మౌలిక వసతులు కూడా కల్పించకపోవడంతో ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆవేదన చెందుతున్నారు. అందమైన బ్రోచర్లు, హామీలతో సర్కారు మోసం చేసిందని ఆరోపిస్తున్నారు. ధరణి టౌన్షిప్లో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఇటీవల టౌన్షిప్ బాధితులు సమావేశమై వెంచర్ వరకు ర్యాలీ తీశారు. సౌకర్యాలు కల్పించకపోతే ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టౌన్షిప్ అభివృద్ధికి దాదాపు రూ. 14 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారని, సర్కారు వెంటనే నిధులు మంజూరు చేయాలని ‘ధరణి’ బాధితుల సంఘం ప్రతినిధి రాజనర్సింహరెడ్డి డిమాండ్ చేశారు. టౌన్షిఫ్లో ఇంకా 14 ఎకరాలు ఖాళీగా ఉందని, అభివృద్ధి చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి మరో రూ. 50 కోట్ల ఆదాయం సమకూరే అవకాశాలున్నాయని, దీనిని పరిశీలించాలని కోరారు. -
‘యూరియా కొరత పేరుతో దోచుకుంటున్నారు’
గాంధారి: యూరియా కొరత పేరుతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డి ఆరోపించారు. సోమవారం బీకేఎస్ నాయకులు మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలను సందర్శించారు. వ్యాపారులు, రైతులతో మాట్లాడారు. ఎరువుల నిల్వల గురించి తెలుసుకున్నారు. యూరియా బస్తాతోపాటు ఇతర రసాయనాలను అంటగడుతున్నారని రైతులు ఆరోపించారు. లేదంటే యూరియా లేదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీకేఎస్ కార్యదర్శులు శంకర్రావు, రావుసాహెబ్రావు పాల్గొన్నారు. యూరియా కొరత లేదు రైతులు ఆందోళన చెందవద్దని, మండలంలో యూ రియా కొరత లేదని ఏవో రాజలింగం తెలిపారు. యూరియా వాడకం తగ్గించాలని సూచించారు. నా నో యూరియా పిచికారి చేస్తే ఖర్చు తగ్గడమే కాకుండా భూమి సారవంతం అవుతుందన్నారు. వ్యాపారులు యూరియా బస్తాలతో పాటు ఇతర రసాయనాలు ఇస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని, తని ఖీలు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 141 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సంబంధిత సమస్యలు, ఇబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరులకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. సమస్యల పరిష్కారం విషయంలో తీసుకున్న చర్యల సమాచారాన్ని దరఖాస్తుదారునికి తెలియపరచాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
పల్లెల్లో సందడి
రిజర్వేషన్లపై ఉత్కంఠమంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025– 8లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లెల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను మూ డు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆశావహులు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయ త్నాలు చేస్తున్నారు. జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు, 4,656 వార్డులు ఉన్నాయి. పంచాయతీల్లో 6,51,422 మంది ఓటర్లు ఉండగా ఇందులో 3,13,280 మంది పురుషులు, 3,38,126 మంది మహిళలు, 16 మంది ఇతరులు ఉన్నారు. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం గతేడాది ఫిబ్రవరి ఒకటో తేదీతో ముగిసింది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలోకి వెళ్లిపోయాయి. అప్పట్లోనే ఎన్నికలు నిర్వహిస్తారని ఆశించినవారు.. ప్రభుత్వం ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తుండడంతో నీరుగారిపోయా రు. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల్లో పంచాయ తీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించడంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ప్ర భుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం అవుతుండడంతో ఈసారి ఎన్నికలు జరుగుతాయన్న భావనలో ఉన్నారు. దీంతో చాలా గ్రామాల్లో ఆశావహులు బలాన్ని, బలగాన్ని పెంచుకునే పనిలో పడ్డా రు. ముఖ్యంగా ఆదాయ వనరులు ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈసారి ఎక్కువ మంది పోటీపడే అవకాశాలున్నాయి. పాత వారే కాకుండా కొత్త తరం కూడా ఎన్నికల బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఆర్థికంగా ఉన్న వారు కొందరు అప్పుడే ఖర్చులూ మొదలుపెట్టారు. కుల సంఘాలు, యువజన సంఘాల మ ద్దతు కూడగట్టుకుంటున్నారు. మహిళల ఓట్లపైనా కన్నేసి వారి మద్దతు సంపాదించే ప్రయత్నాలు చే స్తున్నారు. ఇప్పటి నుంచే అందరినీ మేనేజ్ చేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో భూముల క్రయవిక్రయాల తో నాలుగు డబ్బులు సంపాదించిన వారే ఎక్కువ గా ఎన్నికల బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల ఖర్చు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. న్యూస్రీల్ త్వరలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావహులు వేడెక్కుతున్న రాజకీయాలు పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం కీలకంగా మారింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రప్రభుత్వం కులగణన కూడా నిర్వహించింది. అయితే దీనికి సంబంధించి న బిల్లుపై స్పష్టత లేదు. ఎ న్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కో ర్టు ఆదేశాల నేపథ్యంలో గ తంలో ఉన్న రిజర్వేషన్ల ప్రకా రమే ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.యంత్రాంగం రెడీ.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను గతంలోనే పూర్తి చేశారు. బ్యాలెట్ బాక్సులకు మరమ్మతులు చేయించడంతో పాటు రంగులు వేయించారు. ఓటరు తుది జాబితాలు రెడీ చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియామక ప్రక్రియ కూడా పూర్తి చేశారు. షెడ్యూల్ ఎప్పుడు వెలువడినా ఎన్నికలు వెంటనే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేసి ఉంచారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రక్రియ షురూ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. -
‘బాల్య వివాహాలు చేయొద్దు’
మాచారెడ్డి : బాల్య వివాహాలు చేయొద్దని జి ల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి టి. నాగరాణి సూచించారు. సోమవారం గజ్యానాయక్ తండా చౌరస్తాలో న్యాయసేవాధికా రి సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం, పోక్సో చట్టం, పిల్లల సంరక్షణ, బ్యాంకు రుణాలు, ఉచిత న్యాయ సలహాలపై అవగాహన క ల్పించారు. కార్యక్రమంలో మాచారెడ్డి, గ జ్యానాయక్ తండా పంచాయతీ కార్యదర్శు లు ఆస్మా బేగం, జీవన్, న్యాయసేవాధికార సంస్థ సభ్యుడు ఖాన్ ఉన్నారు. జిల్లాలో 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలు కామారెడ్డి క్రైం: శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని నెలాఖరు వరకు జిల్లాలో 30, 30 (ఏ) పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ రాజేశ్ చంద్ర సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు శాఖ అనుమతి లే కుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ధ ర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ని బంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చే స్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ పోలీసుశాఖకు సహకరించాలని ఎస్పీ కోరారు. రేపు జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో బుధవా రం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఇస్కా న్ కామారెడ్డి ఇన్చార్జి వెంకటదాస్ తెలిపా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇస్కాన్ ఆలయంలో రథయాత్ర వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ యాత్ర విద్యానగర్ కాలనీ లోని పాత సాయిబాబా ఆలయం నుంచి ప్రారంభమై సిరిసిల్ల రోడ్లోని శ్రీ కన్యకా ప రమేశ్వరి ఆలయం వద్ద ముగుస్తుందని పే ర్కొన్నారు. యాత్రలో భక్తులు అధిక సంఖ్య లో పాల్గొనాలని కోరారు. పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి కామారెడ్డి టౌన్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని డీఈవో రాజు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక ఉర్దూ మీడియం పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. స్థానిక కాంగ్రెస్ నేత ప్రసాద్ రూ. 25వేల విలువైన 56 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని అందించారు. అనంతరం దాతను సన్మానించారు. చేపల వేట నిషిద్ధం నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో రెండు నెలల పాటు చేపల వేటను నిషేధిస్తున్నా మని ఎఫ్డీవో డోలిసింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై, ఆగస్టు నెలల్లో చేపల ప్రసవ కాలం కావడంతో మత్స్యకారు లు చేపలను వేటాడవద్దని సూచించారు. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దరఖాస్తుల ఆహ్వానంకామారెడ్డి టౌన్: నిజాంసాగర్లోని నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో రాజు సోమవారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 29లోపు http://navodaya.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
కారులో వచ్చి.. హిజ్రాల ఇంట్లో చోరీ
కామారెడ్డి క్రైం: కారులో వచ్చిన దుండగులు తాళం వేసి ఉన్న హిజ్రాల ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీలోని ఓ ఇంట్లో కొందరు హిజ్రాలు నివాసం ఉంటున్నారు. వారు శనివారం రాత్రి సెకండ్షో సినిమాకు వెళ్లారు. 10.45 గంటల ప్రాంతంలో హిజ్రాల ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. హిజ్రాలు తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ జరిపారు. చోరీకి పాల్పడిన దుండగులు ఓ కారులో వచ్చినట్లు తెలుస్తుంది. పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంట్లో దాచి ఉంచిన 7 తులాల బంగారం, 40 తులాల వెండి చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. -
మన విశ్వాసం.. సంప్రదాయం.. పసుపు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారతీయులకు శుభప్రదమైన పసుపు మసాలా కాదని.. మన విశ్వాసం, సంప్రదాయమని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్షా అన్నారు. ఆదివారం నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ఆదివారం ప్రారభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందూరు రైతుల పోరాటం గుర్తించి, రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. ఇదే జిల్లాకు చెందిన రైతుబిడ్డ పల్లె గంగారెడ్డికి చైర్మన్ పీఠం ఇచ్చామన్నారు. ఇందూరులో పసుపు బోర్డు ఏర్పాటుతో నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు. మంగళదాయకమైన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్గా పనిచేసే పసుపును భారతీయులు వేల ఏళ్లుగా వంటల్లో వాడుతున్నారన్నారు. పాశ్చాత్యులు మాత్రం క్యాప్సుల్స్ రూపంలో తీసుకుంటున్నారన్నారు. బోర్డు ద్వారా రైతులే అంతర్జాతీయ ఎగుమతులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం భారత్ కోఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, ఆర్గానిక్ పంటను ప్రోత్సహించేందుకు భారత్ ఆర్గానిక్ కో ఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ సంస్థలను నెలకొల్పిందని, నిజామాబాద్లో ఈ సంస్థల శాఖలను ఏర్పాటు చేస్తామన్నారు. 2030కల్లా అంతర్జాతీయ స్థాయిలో బిలియన్ డాలర్ల విలువ చేసే పసుపు ఉత్పత్తులను ఎగు మతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి అనసూయ (సీతక్క), ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానిశ్రీ, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర కోఆపరేటీవ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, బాస మేణుగోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇందూర్లో భారత్ ఆర్గానిక్ కో ఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ బ్రాంచ్ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం.. లోగో ఆవిష్కరణ సమావేశంలో అమిత్షా -
ముగిసిన తొలివిడత పాలిసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మూడు రోజులుగా కొనసాగుతున్న పాలిసెట్ తొలిదశ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఆదివారం ముగిసింది. ఈ విషయాన్ని పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. మూడు రోజుల్లో 416 మంది అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరైన విద్యార్థులు ఒకటో తేదీలోగా వెబ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. నాలుగో తేదీన తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్లో అజారుద్దీన్, ఫర్హీన్ ఫాతిమా, శ్రీలత, అఫ్రీన్ ఫాతిమా, పవన్కుమార్, నాగరాజు, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జీగా ఐకే రెడ్డి భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జీగా పీసీసీ ప్రధాన కార్యదర్శి, రామేశ్వర్పల్లికి చెందిన బద్దం ఇంద్రకరణ్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ఆధిష్టానం ఆదివారం నియామకపు ఉత్తర్వులను జారీచేసింది. ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తానన్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించడానికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. 3న గురు పూజోత్సవం కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని సత్య కన్వెన్షన్లో మూడో తేదీన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ కొత్తోల్ల శివరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. మొలకలతో కళకళ మద్నూర్: మండలంలో ముందస్తుగా కురిసిన వర్షాలతో ఆయా పంటల విత్తనాలు వేశారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలతో మొలకలు వస్తున్నాయి. దీంతో భూమి పచ్చగా కళకళలాడుతోంది. ఆదివారం పలుచోట్ల వర్షం కురిసింది. ఈ వర్షంతో సోయాబీన్, పత్తి, కంది, పెసర, మినుము పంటలకు ఎంతో మేలు జరిగిందని రైతులు పేర్కొంటున్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తాం దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయంలో ఆషాఢమాసం సంద ర్భంగా మహంకాళి అమ్మవారి బోనాల పండుగను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆల య కమిటీ చైర్మన్ సిద్దారెడ్డి తెలిపారు. ఆలయంలో ఆదివారం గ్రామస్తులతో ఆయన సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఏటా నిర్వహించినట్లుగానే ఈసారి కూడా వైభవంగా బోనాల జాతర నిర్వహించాలని తీర్మానించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి రాజకీయ, వ్యాపార సంబంధిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని నిర్ణయించారు. సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రభు, ఆలయ ప్రధాన అర్చకులు శరత్ శర్మ, ధర్మకర్తలు ఎల్లం, రమేష్, బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్.. ఒకరి మృతి
భిక్కనూరు/సదాశివనగర్: సదాశివనగర్ మండలం కల్వరాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బత్తుల రాంచంద్రం (48) మృతి చెందాడు. రాంచంద్రం నిజామాబాద్లోని తన కుమార్తె ఇంటికి బోనాల పండుగకు వెళ్లి తిరిగి భిక్కనూరుకు వస్తుండగా కల్వరాల వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో రాంచంద్రం అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రంజిత్ తెలిపారు.పశువుల కాపరి మృతదేహం లభ్యంమాక్లూర్: చెరువులోకి చొరబడిన గేదెలను బయటకు తీసే క్రమంలో శనివారం సాయంత్రం గుత్ప చెరువులో ప్రమాదవశాత్తు మునిగి గల్లంతైన పశువుల కాపరి బాబన్న (60) మృతదేహాం ఆదివారం లభించింది. మాక్లూర్ పోలీసుల కఽథనం మేరకు వివరాలు ఇలా.. గుత్ప గ్రామానికి చెందిన బాబన్న అతని భార్య కలిసి గ్రామస్తులందరి గేదెలను కూలీ లెక్కన మేపుతారు. రోజూ మాదిరిగానే శనివారం సాయంత్రం గేదెలను గ్రామంలోనికి తెచ్చే ముందు నీరు తాగించేందుకు సమీపంలో ఉన్న చెరువులోనికి దించాడు. అవి ఎంతకూ బయటికి రాకపోవటంతో బాబన్న చెరువులోనికి దిగి వాటిని బయటకు తీసే క్రమంలో మునిగిపోయాడు. సమాచారం తెలుసుకున్న మాక్లూర్ పోలీసులు శనివారం సాయంత్రం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం సాయంత్రం బాబన్న శవం లభ్యమైంది. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. లైన్మన్పై దాడి.. పోలీసులకు ఫిర్యాదురెంజల్(బోధన్): విద్యుత్ బిల్లుల వసూళ్లకు వెళ్లిన తనపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని రెంజల్ లైన్మన్ శ్రీనివాస్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆదేశాల మేరకు సాటాపూర్ గ్రామంలో కరెంట్ బిల్లులను వసూలు చేసేందుకు వెళ్లగా గ్రామానికి చెందిన మన్మథ స్వామి, మన్మథ మహేశ్ అనే వ్యక్తులు దురుసుగా మాట్లాడుతూ చేయి చేసుకున్నారని పేర్కొన్నారు. రెంజల్ శివారులోని వారి పొలంలో అక్రమంగా స్తంభాలు ఏర్పాటు చేసుకొని విద్యుత్ను వినియోగిస్తుండటంతో ఏఈ ఆదేశాల మేరకు కరెంట్ కనెక్షన్ తొలగించినట్లు తెలిపారు. దానిని దృష్టిలో పెట్టుకొని తనపై దాడి చేసి గాయపర్చారని పేర్కొన్నారు. పొలంలోకి దూసుకెళ్లిన కారుబోధన్: పట్టణ శివారు నుంచి రాయ్కూ ర్ గ్రామానికి వెళ్లే మార్గంలో ఆదివారం స్థానిక కర్నె రాజశేఖర్ అనే రైతు వరి నాటు వేసిన పొలంలోకి కారు దూసుకెళ్లిందని పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. ఏడుగురు వ్యక్తులు ఆకతాయి చేష్టలు చేస్తూ అతివేగంగా, అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడంతో కారు పంట పొలంలోకి దూసుకెళ్లిందని పేర్కొన్నారు. వరి పంటకు నష్టం జరిగిందని రైతు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించి వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
రైతులంతా బీజేపీ వెంటే
తెలంగాణ రైతులంతా బీజేపీ వెంటే ఉన్నారు. పసుపు ప్రతిఒక్కరి జీవితంలో భాగమైంది. అలాంటి పసుపు పంటపై ఇక్కడి ప్రాంత రైతులు ఆధారపడి ఉన్నారు. కశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు నుంచి నక్సల్ ముక్త్ భారత్ వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. తాజాగా ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ చూపిన తెగువను ప్రపంచ దేశా లు అభినందిస్తున్నాయి. ఉగ్ర వాదుల అంతం కోసం కేంద్రం చేస్తున్న కృషి ఎనలేనిది. పసు పు రైతులపై ప్రేమతోనే జిల్లా రైతు బిడ్డను జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఎంపిక చేశారు. – అర్వింద్ ధర్మపురి, ఎంపీ -
దశాబ్దాల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
సాక్షి నెట్వర్క్: చిన్ననాటి మిత్రులందరూ దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పది, ఏడో తరగతుల పూర్వ విద్యా ర్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించా రు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. పాల్వంచ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు బడి అభివృద్ధి కోసం సుమారు రూ.77వేలు అందజేశారు. జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురైన స్నేహితులు -
పసుపు రాజధాని
నిజామాబాద్ ఇక ప్రపంచదేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతిబీజేపీకి అధికారం ఇవ్వండి రాష్ట్రంలో అందరికీ అవకాశం ఇచ్చారు.. బీజేపీకి ఒకసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. జిల్లా ప్రజలు గొప్ప వారు.. కొట్లాడి పసుపు బోర్డును సాధించుకున్నారు. ఇందూరు రైతుల పోరాటం మామూలుది కాదు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో ధర్మపురి అర్వింద్ కాస్త పసుపు అర్వింద్ అయ్యారు. రైతును రాజు చేయాలనేది గత నినాదం.. కానీ రైతును రారాజు, మహారాజు చేయాలనేది మోదీ సర్కారు నినాదం. పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేసిన అమిత్ షాకు అందరం నిల్చొని చప్పట్లతో అభినందనలు తెలుపుతున్నాం. (సభాప్రాంగణంలోని వారంతా నిల్చుని చప్పట్లు కొట్టారు.) – బండి సంజయ్, కేంద్ర సహాయమంత్రి ● పంటకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ● పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడం నా అదృష్టం ● రైతులకు ఇచ్చిన హామీని మోదీ నెరవేర్చారు ● జిల్లాలో రీసెర్చ్ సెంటర్లు.. ● ఆర్గానిక్ పసుపు ఉత్పత్తి, మార్కెటింగ్కు ప్రభుత్వ కృషి ● రైతు సమ్మేళనంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సుభాష్నగర్: నిజామాబాద్ పసుపు రాజధానిగా కాబోతోందని, ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే పసుపు ఎగుమతి అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా అన్నారు. జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించిన రైతు సమ్మేళనం బహిరంగ సభకు అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. అంతకుముందు కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో మాజీమంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడని, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. రైతు సమ్మేళనంలో షా ప్రసంగం సాగిందిలా.. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అమిత్ షా అన్నారు. ఇందూరు రైతుల పోరాటం, ఎంపీ అర్వింద్ రైతులకు ఇచ్చిన హామీమేరకు మోదీ ప్రభుత్వం పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని తెలిపారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. బోర్డు ఏర్పాటుతో రాబోయే రెండుమూడేళ్లలో ఇందూరు పసుపునకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. ఏళ్లుగా రైతులు పసుపు సాగు చేస్తున్నా.. మార్కెట్లో అనుకున్న ధర, గుర్తింపు రాలేదని.. ఇక నుంచి ధర పెరుగుతూనే ఉంటుందన్నారు. జిల్లాలో పసుపు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, బోర్డు ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపరుస్తామని అమిత్ షా పేర్కొన్నారు. భారత్ ఆర్గానిక్ కో ఆపరేటీవ్ బ్రాంచ్ను, భారత్ కో ఆపరేటీవ్ ఎక్స్పోర్ట్ బ్రాంచీలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితోపాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఈ ఏడాది క్వింటాల్ పసుపు ధర రూ.19వే లు పలికిందని.. రానున్న మూడేళ్లలో రూ.7వేలు అదనం అవుతుందని పేర్కొన్నారు. రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ చేసి ఇక్కడి ప్రజలకు గుర్తింపు ఇచ్చామని అన్నారు. సభలో ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి తదితరులు పాల్గొన్నారు.రైతు పక్షపాతి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు కోసం ఏళ్లుగా పోరాటం చేస్తున్నా రు. రైతు ఉద్యమాన్ని గుర్తించిన కేంద్ర ప్రభు త్వం పసుపు బోర్డును ప్రకటించి వారి కలను సా కారం చేసింది. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పసుపు సాగవు తున్నా.. ఈ ప్రాంతంపై ఉన్న మమకారంతో ప్ర ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా నిజామా బాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ఏ ర్పాటు చేశారు. కేంద్రంరై తు పక్షపాతి. గతంలో వి ద్యుత్ కోతలతో పంటలు ఎండు ముఖం పట్టేవి. ప దేళ్ల బీజేపీ పాలనలో వి ద్యుత్ కోతలు లేని భారత్ ను నిర్మించాం. సబ్సిడీపై ఎరువులు అందిస్తున్నాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ ప్రారంభించారు. కిసాన్ సమ్మాన్ డబ్బులు ఇస్తు న్నారు. అయినా రైతాంగానికి మోదీ ఏం చేస్తున్నారని రేవంత్రెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీ ఆర్ ఇలాగే ప్రశ్నించారు. యూపీఏ ప్రభుత్వం పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు. – కిషన్రెడ్డి, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు -
డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అమిత్షా
నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా ఆదివారం ఆవిష్కరించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ రూ.44 లక్షల వ్యయంతో 14 అడుగుల డీఎస్ కాంస్య వి గ్రహాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీ అర్వింద్తోపాటు కుటుంబ సభ్యులు, రాజ్య సభ్యుడు లక్ష్మణ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రతినిధుల నివాళులు డీఎస్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నుడా చై ర్మన్ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, డీఎస్ సోదరుడు ధర్మపురి సురేందర్, మా జీ జెడ్పీటీసీ పుప్పాల శోభ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. డీఎస్ అభిమానులు, నాయకులు విగ్రహం వద్ద సెల్ఫీలు తీసుకున్నారు. -
స్నేహానికి షష్టి పూర్తి
నార్కట్పల్లి: స్నేహానికి షష్టి పూర్తి.. మరువలేని అనుభూతి అని శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం గోపాలయపల్లి గ్రామ సమీపాన గల శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయ చైర్మన్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పెద్దన్న కోమటిరెడ్డి మోహన్రెడ్డి 1965లో నిజామాబాద్లోని జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఆయన క్లాస్మెట్. పదో తరగతి పూర్తి చేసి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు పోచారం శ్రీనివాస్రెడ్డి, మరికొందరు మిత్రులు ఆదివారం శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించా రు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పోచారం శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ పెళ్లికి షష్టి పూర్తి, వయసుకు షష్టిపూర్తి ఉంటాయని, స్నేహానికి షష్టి పూర్తి చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. -
స్థానిక సమరానికి సిద్ధం కావాలి
మాచారెడ్డి: బీఆర్ఎస్ యూత్ సభ్యులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధ కావాలని బీఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకుడు గంప శశాంక్ అన్నారు. పాల్వంచ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ సోషల్ మీడియా, యూత్ వింగ్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై, మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. నాయకులు రామ్మూర్తిగౌడ్, లస్కర్నాయక్, దేవరాజు తదితరులున్నారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మాచారెడ్డి: పాల్వంచ, మాచారెడ్డి మండలాల్లోని అన్ని గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై అనిల్ సూచించారు. పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లి గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఉంటే పోలీసులు ఉన్నట్టేనన్నారు. గ్రామస్తులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. కాంట్రాక్టర్పై ఫిర్యాదు బాన్సువాడ రూరల్: కాంట్రాక్టర్ చిన్న రాంపూర్ మజీద్లో అభివృద్ధి పనులు పూర్తి చేయడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆదివారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మజీద్ వద్ద షట్టర్ల నిర్మాణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రూ.15 లక్షలు మంజూరు చేశారని, కాంట్రాక్టర్ సగం పనులు చేసి వదిలేశారని ఆరోపించారు. మిగిలిన పనులను పూర్తి చేయించాలని కోరారు. కార్యక్రమంలో మజీద్ సదర్ షేక్ అక్బర్, గ్రామస్తులు షేక్ అజీమ్, అజీజ్, మహిమూద్, నజీర్, అస్లాం, అఫ్రోజ్, ఇల్యాస్, సజ్జద్, మంజూర్, ఇర్షాద్ జావిద్ తదితరులు పాల్గొన్నారు. హద్దు స్తంభాల ధ్వంసం భిక్కనూరు: మండల కేంద్రంలోని వీడీసీకి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన హద్దు స్తంభాలను గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం వేకువజామున ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అఖిల పక్షం నేతలు ఘటన స్థలానికి చేరుకొని, పరిశీలించారు. మాజీ సర్పంచ్ తున్కి వేణు, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు తదితరులు ఉన్నారు. -
ముందుకు సాగని ఫార్మర్ రిజిస్ట్రీ
● అవగాహన లోపంతో ముందుకురాని రైతులు ● ఆపై సాంకేతిక సమస్యలు.. ● జిల్లాలో ఇప్పటి వరకు 35 శాతమే నమోదుత్వరలో పూర్తి చేస్తాం.. జిల్లాలోని అన్ని మండలాల్లో ఫార్మర్ రిజిస్ట్రీ న మోదు జరుగుతోంది. రైతులకు దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. త్వ రలోనే ప్రక్రియ పూర్తయ్యేలా చూస్తాం. రైతులు స్థానికంగా ఉండే వ్యవసాయ అధికారులను నేరుగా సంప్రదించి కూడా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. – తిరుమల ప్రసాద్, డీఏవోకామారెడ్డి క్రైం : వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ జిల్లాలో నెమ్మదిగా సాగుతోంది. రెండునెలలు కావస్తున్నా జిల్లాలో 35 శాతం మాత్రమే నమోదు పూర్తయ్యింది. రైతుల గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ పథకాలకు అర్హత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మ ర్ రిజిస్ట్రీని తీసుకువచ్చింది. గతనెల 5వ తేదీన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రతి రైతు నుంచి వివ రాలు సేకరించి ఆన్లైన్లో నమోదు చేయడం ద్వా రా ఆధార్ కార్డు తరహాలో రైతులకు 11 నంబర్లతో కూడిన ప్రత్యేక డిజిటల్ కార్డులను జారీ చేస్తారు. జి ల్లాలో 3.28 లక్షల మంది రైతులున్నారు. 23 మండలాల పరిధిలో 104 వ్యవసాయ క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్కు ఒక ఏఈవో ఉన్నారు. మే 5 న జిల్లావ్యాప్తంగా అన్ని క్లస్టర్ల పరిధిలో ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు ల పంట పొలాలకు వెళ్లి ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, భూమి విస్తీర్ణం, భూమి రకం, పండిస్తున్న పంటలు, ఆధార్ నంబర్తో లింక్ అయిన రై తు మొబైల్ నంబరు తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత రైతుకు 11 నంబర్లు గల డిజిటల్ ఫార్మర్ ఐడీ జారీ అవుతుంది. భవిష్యత్తులో రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలకు ఈ ఫార్మర్ ఐడీ కీలకం కానుందని భావిస్తున్నారు. అ యితే ఫార్మర్ రిజిస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అమలు చే స్తున్న రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలకు ఎలాంటి సంబంధం ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. పని ఒత్తిడిలో అధికారులు రైతు భరోసా, పంటల నమోదు, విత్తనాలు, ఎరువుల సరఫరా తదితర పనుల్లో ఇప్పటికే వ్యవసాయ అధికారులు బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో క్షేత్ర స్ధాయిలో పర్యటించి ఫార్మర్ రిజిస్ట్రీ చేయాల్సి రావడంతో పని ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లోని పంట పొలాలకు వెళ్లిన సమయాల్లో నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం, ఆన్లైన్ మొరాయించడం లాంటివి జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పలువురు రైతుల వద్ద ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నంబర్ లేకపోవడంతో ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోతున్నారు. రైతులు నేరుగా వ్యవసాయ శాఖ కార్యాలయాలను సంప్రదించి తమ వివరాలు ఇవ్వడం ద్వారా కూడా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన సైడ్లైట్స్..
సుభాష్నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు బోర్డు ప్రారంభోత్సవం, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ, కిసాన్ సమ్మేళనం బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ఆయన పర్యటన సైడ్లైట్స్.. ● 2.30 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం. ● 2.45 గంటలకు బోర్డు కార్యాలయంలో ప సుపు రైతులతో ముఖాముఖి, పసుపు పంట ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. ● 3.28 నగరంలోని కంఠేశ్వర్ బైపాస్లో మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ విగ్రహావిష్కరణ. ● 3.35 గంటలకు పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో బహిరంగ సభ వేదికపైకి చేరుకున్నారు. వేదికపైకి రాగానే పసుపు రైతులు, ప్రజలకు అభివాదం చేశారు. ● 3.50 గంటలకు అమిత్ షా ప్రసంగం ప్రా రంభించి, 18 నిమిషాల్లో ముగించారు. ● ప్రసంగం మధ్యలో పసుపు బోర్డు ప్రకటన, జిల్లా కేంద్రంలో జాతీయ కార్యాలయం ఏర్పాటుపై ప్రజలందరూ నిల్చొని కరతాళధ్వనులతో ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలపాలని కోరడంతో.. ప్రజలు, రైతులు ఆయనను అనుకరించారు. ● భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరాం అంటూ అమిత్ షా తన ప్రసంగాన్ని ముగించారు. ● అనంతరం ఎంపీ అర్వింద్ ధర్మపురి శాలువా, జ్ఞాపికతో అమిత్ షాను సత్కరించారు. ● కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ పేరు ప్రస్తావించినప్పుడల్లా ప్రజలు, రైతులు ఈలలు, కేకలు వేశారు. -
కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలం లింబూర్ గ్రామానికి చెందిన కిస్వే సంజయ్(45) శనివారం కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింబూర్కు చెందిన సంజయ్ మహారాష్ట్రలోని పుణె నగరంలో కుటుంబసభ్యులతో కలిసి కూలీ పని చేసేవాడు. గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న సంజయ్.. చికిత్స కోసం చాలా ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదని కుటుంబసభ్యులు చెప్పారు. దీంతో 15 రోజుల క్రితం సొంతూరికి వచ్చి కూలీ పని చేసుకుంటున్నాడు. కడుపునొప్పి తీవ్రం కావడంతో శనివారం లింబూర్ శివారులో రోడ్డు పక్కన చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. జీవితంపై విరక్తితో రైలుకు ఎదురెళ్లి ..ఖలీల్వాడి: జీవితంపై విరక్తితో ఓ యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ఎస్సై చెప్పిన ప్రకారం.. నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన జాదవ్ శివతేజ(19) శనివారం ఉదయం 8.50 గంటల సమయంలో జీవితంపై విరక్తి చెంది రైలుకు అడ్డుగా వెళ్లి బలవన్మరణం చెందాడు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ చందన్ కుమార్ సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని సందర్శించి, మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. మృతుడు నగరంలోని తిలక్గార్డెన్ వద్ద ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్లోని అశోక్ టీ పాయింట్లో పని చేసేవాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వర్షాకాలం వచ్చినా జాడలేని వానలు
రామారెడ్డి: వర్షాకాలం వచ్చినా వానదేవుడు కరుణించడం లేదు. దీంతో చెరువులు, కుంటలు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీంతోపాటు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయి, బోరుబావులు ఎత్తిపోతున్నాయి. నారుమడికి నీళ్లు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. కొందరు రైతులు ట్యాంకర్తో నారుమడిని తడుపుతుంటే, మరికొందరు నీటి బిందలు చేతపట్టి నారు మడిని కాపాడుకునే యత్నం చేస్తున్నారు. వానదేవుడు కనికరించి సకాలంలో వర్షాలు కురిస్తేనే వ్యవసాయ పనులు ముందుకు సాగుతాయని రైతులు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు. అధికారులను సంప్రదించేదెలా? నస్రుల్లాబాద్: మండలంలోని విద్యుత్ శాఖ అధికారుల ఫోన్ నంబర్లు మారి నెల రోజులు గడుస్తున్నా, సంబంధిత కార్యాలయంలోని బోర్డుపై ఇంకా పాత నంబర్లే దర్శనమిస్తున్నాయి. దీంతో కార్యాలయనికి వచ్చిన ప్రజలు అధికారుల పాత నంబర్లకు కాల్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు నంబర్లను మార్చకుండా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మండల కేంద్రంలోని సెక్షన్ కార్యాలయంలో అధికారుల నూతన నంబర్లను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. రేషన్షాపుల తనిఖీ తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు చిట్యాల గ్రామంలోని రేషన్ దుకాణా లను శనివారం సివిల్ సప్లయ్ డీసీఎస్వో మల్లికార్జున బాబు తనిఖీ చేశారు. షాపులకు సంబందించిన స్టాక్ బియ్యం, రికార్డులను పరిశీలించారు. ఇతర జిల్లాల నుంచి ఇంకొక జిల్లాకు ఆధార్ కార్డుల చిరునామాలు మారినట్లయితే ఒక్క దగ్గరనే బియ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండు ప్రాంతాలలో రెండు ఆధార్ కార్డులు ఉన్న వాటిని గుర్తించి, వాటిని సంబంధిత శాఖ అధికారులకు పంపించినట్లు తెలిపారు. డీటీ సురేష్కుమార్, రేషన్ షాపుల డీలర్లు ప్రమీల, సవిత, లబ్ధిదారులు ఉన్నారు. నూతన కార్యవర్గం ఎన్నిక మాచారెడ్డి: మండలంలోని గజ్యా నాయక్ తండా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గోనె శ్రీహరి, ఉపాధ్యక్షుడిగా గుడ్ల నరేష్, కోశాధికారిగా అల్లె బ్రహ్మం, ప్రధాన కార్యదర్శిగా గోనె చంద్రమౌళి, కార్యదర్శిగా గోనె ఆంజనేయులు, సలహాదారులుగా గాజుల శ్రీధర్, గోనె సత్యనారాయణ, తుమ్మ రాజేశం, అల్లె రాజేశం, ఇప్పలపల్లి శ్యామ్, ఈరబత్తిని ప్రసాద్, గుండ్లపల్లి నరేష్, గోనె సురేష్ ఎన్నికయ్యారు. -
నేడు ఇందూరుకు అమిత్ షా
సుభాష్నగర్: జిల్లా కేంద్రానికి నేడు (ఆదివారం) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రానున్నారు. పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా ఏర్పాట్లు, ఇతర అంశాలపై కలెక్టర్, సీపీ సహా పసుపు బోర్డు అధికారులతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. మరోవైపు ఎంపీ అర్వింద్ ధర్మపురి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి సైతం బీజేపీ శ్రేణులు, రైతు సంఘాలతో చర్చిస్తున్నారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. నగరంలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. డీఎస్ ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని కంఠేశ్వర్ బైపాస్ చౌరస్తాలో కాంస్య విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. కేంద్ర హోంమంత్రి పర్యటనను బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలతోపాటు నిర్మల్, కామారెడ్డి తదితర జిల్లాల నుంచి రైతులు, పార్టీ శ్రేణులను తరలించేలా ఏర్పాట్లు పూర్తిచేశారు. ముఖ్యంగా పసుపు రైతులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతు సమ్మేళన కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఒకవేళ వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి బైపాస్ చౌరస్తాలో పీసీసీ మాజీ చీఫ్ డీఎస్ విగ్రహావిష్కరణ.. పాలిటెక్నిక్ మైదానంలో కిసాన్ సమ్మేళన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎంపీ అర్వింద్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి పర్యటన షెడ్యూల్.. అహ్మదాబాద్(గుజరాత్) ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం బయల్దేరి హైదరాబాద్లోని బేగంపేట్కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీక్యాప్టర్ ద్వారా జిల్లాకేంద్రానికి మధ్యాహ్నం 1.30 గంటలకు చేరుకుంటారు. 2 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభించిన అనంతరం బస్వాగార్డెన్లో పసుపు బోర్డు అధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 3.30 గంటలకు డీఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళనంలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు బహిరంగ సభాప్రాంగణం నుంచి హెలీప్యాడ్ వద్దకు బయల్దేరుతారు. -
అంగన్వాడీలకు ఫోన్లు అందేదెప్పుడు?
ఎల్లారెడ్డి: అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఆన్లైన్లో నమోదు చేసేందుకు కార్యకర్తలకు అధునాతనమైన ఆండ్రాయిడ్ ఫోన్లను 5జీ సౌకర్యంతో అందజేస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గతంలో ప్రకటించింది. ఈక్రమంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును పైఅధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు యాప్లను ప్రవేశ పెట్టారు. అంగన్వాడీ కేంద్రాల వివరాలు ఆన్లైన్ నమోదుతో ఇబ్బందులు పడుతున్న సిబ్బందికి, నూతన ఫోన్లను అందిస్తామని మంత్రి ప్రకటన చేయడంతో ఇక్కట్లు తీరుతాయని భావించారు. కానీ ఇంతవరకు ఆండ్రాయిడ్ ఫోన్లను అందజేయక పోవడంతో సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 1193 అంగన్వాడీ కేంద్రాలు.. కామారెడ్డి జిల్లాలో 1193 అంగన్వాడి కేంద్రాలు ప నిచేస్తున్నాయి. వీటి పరిధిలో ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల చిన్నారులు 30,846, 3నుంచి 6ఏళ్ల వయస్సు గల చిన్నారులు 20,502 మంది ఉన్నా రు. అంతేగాక ఈ కేంద్రాల పరిధిలో 6,388 గర్భిణులు, 5,957 మంది బాలింతలకు పలు రకాల సే వలు అందజేస్తున్నారు. పూర్వ ప్రాథమిక కేంద్రాలు గా ఆధునీకరించిన ఈ అంగన్వాడీ కేంద్రాల సేవ లను డిజిటలైజేషన్ చేసి అనుక్షణం పైఅధికారుల పర్యవేక్షణ చేసేందుకు పలు యాప్లను ప్రభుత్వం ఏర్పరిచింది. కానీ అంగన్వాడీ సిబ్బందిలో చాలామంది పాత ఫోన్లను వాడటంతో అప్డేట్ కాకపోవడంతో యాప్లో వివరాల నమోదు కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఐదేళ్ల క్రితం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదని పలువురు కార్యకర్తలు అంటున్నారు. ఎవరో కొద్దిమంది వద్ద తప్ప మిగితా అందరి వద్ద అధునాతన ఫోన్లు లేకపోవడంతో నమోదు ప్రక్రి య ఇబ్బందిగా మారిందని వారు తెలిపారు. చాలీచాలని జీతాన్ని పొందుతున్న తమకు వేలకు వేలుపోసి అధునాతన ఫోన్లను కొనడం ఎలా సాధ్యపడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ప్రకటించినట్లు నూతన ఆండ్రాయిడ్ ఫోన్లను అందజేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంగన్వాడీలు కోరుతున్నారు. వివరాల నమోదు కోసం ఆండ్రాయిడ్ ఫోన్లను అందిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం నెలలు గడుస్తున్నా జాడలేని ప్రభుత్వ హామీ పాత ఫోన్లతో ఇబ్బందులు పడుతున్న సిబ్బంది -
క్యూసెక్కు, టీఎంసీ అంటే..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి క్యూసెక్కుల వరద నీరు, టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొంటారు. అసలు క్యూసెక్కు, టీఎంసీ అనే పదాల పూర్తి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. ● క్యూసెక్కు అనేది నీటి ప్రవాహ వేగాన్ని కొలిచే ప్రమాణం. క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్(క్యూసెక్). ఒక సెకను కాలంలో 28 లీటర్లు నీరు వచ్చి చేరడం, లేదా విడుదలవ్వడం. ● క్యూసెక్కును ప్రాజెక్ట్లోకి వచ్చే ఇన్ఫ్లో, అవుట్ఫ్లోలో వినియోగిస్తారు. ● టీఎంసీ అంటే థౌసండ్ మిలియన్ క్యూబిక్ ఫీట్ (శత కోటి ఘనపుటడుగులు) అని అర్థం. ● ఒక్క టీఎంసీకి 2831 కోట్ల లీటర్ల నీరు. ● ప్రాజెక్ట్లోకి వచ్చే నీటిని, వదిలిన నీటికి క్యూసెక్కుల్లో తెలుపుతారు. పూర్తి నీటి నిల్వ, నీటి విడుదలను టీఎంసీల్లో చూపుతారు. ● వెయ్యి అడుగుల వెడల్పు, వెయ్యి అడుగుల పొడవు, వెయ్యి అడుగుల ఎత్తులో ఉండే నీరు ఒక టీఎంసీ అవుతుంది. ● 2300 ఎకరాల్లో ఒక్క అడుగు నీరు నిల్వ ఉంటే టీఎంసీకీ సమానం. – బాల్కొండ మీకు తెలుసా? -
సర్టిఫికెట్లు సకాలంలో అందించాలి
భిక్కనూరు: విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను సకాలంలో అందజేయాలని టీజీవీపీ నేతలు కోరారు. ఈమేరకు వారు శనివారం భిక్కనూరు తహసీల్దార్ సునితకు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్, నేతలు సమీర్, యోగేష్, నరేందర్ పాల్గొన్నారు. జిల్లా కోర్టు జీపీగా శ్యామ్గోపాల్రావు కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: కామారెడ్డి జిల్లా కోర్టులకు గవర్నమెంట్ ప్లీడర్(జీపీ)గా సీనియర్ న్యాయవాది కావేటి శ్యామ్గోపాల్రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. పట్టణానికి చెందిన ఆయన 1994 నుంచి న్యాయవాదిగా, సివిల్, క్రిమినల్ కేసులను వాధిస్తూ ఇక్కడ పని చేస్తున్నాడు. ఆయన నియామకంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్లో నాలుగు కేసుల పరిష్కారం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన ఫ్యామిలీ కౌన్సెలింగ్ కార్యక్రమంలో నాలుగు కేసులు పరిష్కారమైనట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. పలు కారణాల వల్ల విడాకులకు సిద్ధమైన జంటలకు డీఎస్పీ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో నాలుగు కేసులు పరిష్కారమైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. యువత పెడదారి పట్టొద్దు రామారెడ్డి: యువత డ్రగ్స్, గంజాయి వంటివి సేవించి పెడదారి పట్టొద్దని ఎస్సై రాజారాం అన్నారు. రామారెడ్డి హైస్కూల్లో శనివారం పోలీస్ కళాబృందం సైబర్ క్రైం షీటీమ్స్ పని తీరుపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. షీటీమ్స్ సహాయం కోసం 8712686094ను సంప్రదించాలని విద్యార్థినులు, ఉపాధ్యాయినులకు సూచించారు. హెచ్ఎం ఆనంద్, ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామచంద్రం, తిరుపతి, శేషారావు పాల్గొన్నారు. -
పాఠశాలల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): పాఠశాలల పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఎంఈవో షౌకత్అలీ అన్నారు. లింగంపేట బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన మండలంలోని ప్రభుత్వ బడుల హెచ్ఎంలకు ఒకరోజు వర్క్షాపు నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్య యూడైస్ ప్లస్లో నమోదు చేయాలన్నారు. అలాగే విద్యార్థులకు అందజేసిన పాఠ్య పుస్తకాలు, నోటు బుక్కులు, ఏకరూప దుస్తువులు, మధ్యాహ్న భోజనం బిల్స్, పాఠశాలల నిధులు, ఉపాధ్యాయుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఐఎస్ఎంఎస్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. -
పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదు
లింగంపేట: పర్మళ్ల తండాలో డెంగీ కేసు నమోదైంది. ఈ విషయాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు రాంబాయి తెలిపారు. దీంతో శనివారం తండాలో వైద్య శిబిరం నిర్వహించి, తండావాసులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు అందించారు. ఇంటింటికి వెళ్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూ చించారు. తండాలో పిచ్చిమొక్కలు, గుంతల్లో నిలిచిన నీటిని తొలగించారు. జ్వరాలు ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను వివరించారు. డెంగీ బాధితురాలికి లింగంపేట ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో వైద్య చికిత్సలు అందిస్తున్న ట్లు వైద్యురాలు తెలిపారు. వైద్య శిబిరంలో ఎంపీవో మలహరి, కార్యదర్శి రాజ్యలక్ష్మి, వైద్య సిబ్బంది యాదగిరి, ఫరీదా, రాధిక, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. ‘విద్యుత్ సమస్యలుంటే తెలపండి’ కామారెడ్డి టౌన్ : జిల్లాలో పంట పొలాల ప రిధిలో విద్యుత్ సమస్యలపై రైతులు విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేయాలని జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రవణ్ కుమార్ శనివా రం ఒక ప్రకటనలో సూచించారు. వదులు గా, తక్కువ ఎత్తులో విద్యుత్ తీగలు ఉన్నా, ట్రాన్స్ఫార్మర్ల గద్దెలు తక్కువ ఎత్తులో ఉ న్నా, స్తంభాలు వంగిపోయినా తక్షణమే సె క్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్ ఆపరేషన్, గ్రామ స్థాయిలో ఉండే లైన్మన్లకు తెలియజేయాలని కోరారు. భారీ వర్షాలు, గాలి దు మారాల వల్ల విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే స్థానిక ఏఈలకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంటిలోకి వచ్చే స ర్వీస్ వైర్ ఎటువంటి అతుకులు లేకుండా, ఇనుప రేకుల మీదుగా వెళ్లకుండ చూసూకోవాలని పేర్కొన్నారు. రెతులు స్విచ్ బోర్డు, మోటార్ స్టార్టర్ల వద్ద భద్రత ప్రమాణాలు పాటించాలని, ఏ సమస్య తలెత్తినా టోల్ ఫ్రీ నంబర్ 1912కు సమాచారం ఇవ్వాలన్నారు. ఎలుగుబంట్ల సంచారంతో గాలింపు చర్యలు ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం సోమరేగడి తండా శివారులో ఎలుగుబంట్లు సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ శివారులోని పొలాల వద్ద రెండు ఎలుగుబంటి పిల్లలు తరచూ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది గ్రామానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడా ఎలుగుబంట్లు కనిపించలేదని అటవీ అధికారులు తెలిపారు. గ్రామ శివారులో బోన్లను ఏర్పాటు చేసి ఎలుగుబంట్లను పట్టుకోవాలని గ్రామస్తులు కోరారు. ‘అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలి’ భిక్కనూరు: యువత దేశం గర్వించేలా అన్ని రంగాల్లో ప్రతిభ చూపాలని ఎస్సై ఆంజనేయులు సూచించారు. శనివారం భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువ ఉత్సవ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ముందుకు సాగితే భవిష్యత్తు బంగారుమయం అవుతుందన్నారు. యువ ఉత్సవ్లో భాగంగా నిర్వహించిన పెయింటింగ్, కవిత్వం, మొబైల్ ఫొటోగ్రఫీ పోటీల విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో వర్సిటీ ప్రిన్సిపల్ సుధాకర్గౌడ్, ఎన్వైకే ఉమ్మడి జిల్లా అధికారి శైలి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు అంజయ్య, హరిత, అధ్యాపకులు రాజేశ్వరి, లలిత, సబిత, మోహన్బాబు, యాలాద్రి, నరసయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
గుంతల రోడ్డుకు మరమ్మతులు చేపట్టండి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ శనివారం వారు అదనపు కలెక్టర్ విక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ రోడ్డుపై చాలా ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఇప్పటికై న అధికారులు స్పందించి నూతన రోడ్డు వేయాలని కోరారు. మాజీ కౌన్సిలర్ అర్కల ప్రభాకర్యాదవ్, జగదీష్యాదవ్, శ్రీనివాస్, రాజే్ష్, మల్లేష్ తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి ట్రయథ్లాన్ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ట్రయథ్లాన్ అండర్–14, 12, 10 బాలబాలికలకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఇందులో 250 మందికిపైగా ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 19 మందిని ఆయా అంశాల్లో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జైపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్ తెలిపారు. వీరు వచ్చేనెల 6న హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి ట్రయథ్లాన్ పోటీలలో పాల్గొననున్నారు. ఎంపికై ంది వీరే.. డి.యోగి, ఎన్.శాన్విత్రెడ్డి, బి.శ్రీవల్లిక, జె.ఈశ్వర్, పి.అశ్విని, ఎ.అర్చన, ఎం.రాణాప్రతాప్, సీహెచ్.నిహారిక, ఎన్.దేవీదాస్, ఎం.కృష్ణమూర్తి, ఎం.రాంచరణ్, ఎన్.పండరి, ఎస్కె.జోయ, డి.గీతమ్, కె.సింధు, వి.శ్రీగణేష్, కె.కార్తికేయ, డి.విహాన్రెడ్డి, డి.ధనశ్రీ. -
● భిన్న సంస్కృతుల నిలయం జుక్కల్ ప్రాంతం ● పండుగలు, శుభకార్యాలలో టోపీ తప్పనిసరి
బిచ్కుంద వర్షాల కోసం భజన చేస్తున్న భక్తులు(ఫైల్)సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జుక్కల్ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంది. దీంతో జుక్కల్, పెద్దకొడప్గల్, మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని చాలా గ్రామాల ప్రజలు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక సంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ ప్రాంతం భిన్న సంస్కృతుల నిలయం. చాలా మంది తెలుగుతో పాటు కన్నడ, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడతారు. ఈ ప్రాంత ప్రజలు సంప్రదాయాలకు విలువ ఇస్తారు. కట్టు, బొట్టు ఆకట్టుకునేలా ఉంటాయి. మహిళలు చీర గోచీ కట్టుకుని, కొంగును తలపై కప్పుకుంటారు. పురుషులు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. అలాగే టోపీలు పెట్టుకుంటారు. వాటిని వార్కారీ టోపీలని, గాంధీ టోపీలని వ్యవహరిస్తారు. జుక్కల్ ప్రాంతంలో చాలా గ్రామాల్లో విఠలేశ్వర స్వామి భక్తులు ఉంటారు. ఏటా పండరిపూర్కు పాదయాత్రగా వెళుతుంటారు. అందరూ టోపీ ధరించి ఆలయాల దర్శనానికి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ సప్తాహాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. వారం రోజులపాటు భజనలు సాగుతుంటాయి. ఆయా కార్యక్రమాలలో తప్పనిసరిగా వార్కారీ టోపీ ఉంటుంది. శాకాహార భోజనానికే ప్రాధాన్యం.. చాలా ప్రాంతాల్లో పండుగల సందర్భంగా మాంసాహారానికి ప్రాధాన్యతనిస్తుంటారు. కానీ జుక్కల్ ప్రాంతం అందుకు భిన్నం. ఇక్కడ పండుగల సందర్భంగా శాకాహార భోజనాలే ఉంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలోనూ శాకాహారమే వడ్డిస్తారు. కొద్ది మంది మాత్రమే మాంసాహారానికి ప్రాధాన్యతనిస్తారు. ఇళ్లల్లో కూడా చాలామంది మాంసాహారం వండుకోరు. పాత తరం వారైతే మాంసం ముట్టరు.నిత్యం ధరించే వారెందరో.. జుక్కల్ ప్రాంతంలో కొంతమంది నిత్యం టోపీ ధరిస్తారు. పొద్దున స్నానం చేయగానే సంప్రదాయంగా పూజలు చేస్తారు. నుదుట బొట్టు తప్పనిసరి పెట్టుకుంటారు. బయటకు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా టోపీ ధరించి వెళ్లేవారు చాలా మంది కనిపిస్తారు. పండుగల సందర్భంగా దాదాపు అందరూ టోపీ ధరించి కనబడుతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లలోనూ టోపీలు పెట్టుకుంటారు. క్వాలిటీని బట్టి రూ. 10 నుంచి రూ. వంద వరకు వివిధ ధరల్లో ఈ టోపీలు లభిస్తాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లలో బంధుమితులను టోపీలతో సత్కరించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గం విభిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ కట్టు, బొట్టు, ఆహార్యం అన్నీ భిన్నమే.. ప్రత్యేక రోజులలో మహిళలు చాలా వరకు చీర గోచీతో దర్శనమిస్తారు. కొంగును తలపై కప్పుకుంటారు. నుదుట పెద్ద బొట్టు ధరిస్తారు. పురుషులు తెల్లని ధోతీ, తెల్లటి చొక్కాతోపాటు తలపై టోపీ పెట్టుకుని కనిపిస్తారు. నిత్యం టోపీ ధరించడం ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. జుక్కల్ ప్రాంతంలో టోపీ ధారణపై సండే స్పెషల్.. -
‘రాజ్యాంగమే బీఎస్పీ ఎన్నికల మేనిఫెస్టో’
కామారెడ్డి అర్బన్: భారత రాజ్యాంగమే ఎన్నికల మేనిఫెస్టోగా కలిగిన ఏకై క పార్టీ బీఎస్పీ అని పార్టీ అధ్యక్షుడు మంద ప్రభాకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఎస్పీ జిల్లా కార్యాలయలో శనివారం ఏర్పాటు చేసిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ హాజరయ్యారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం కోసం బీఎస్పీ కృషి చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శిగా పరుశరామ్ను నియమించారు. జిల్లా అధ్యక్షుడు మా లోత్ హరిలాల్ నాయక్, ఉపాధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి దుంపల సురేష్, రోహిత్దాస్, నత్తి జీవన్, ప్రవీణ్, ప్రభాకర్ దాస్, సంతోష్, మనోహర్ పాల్గొన్నారు. -
నియోజకవర్గ అభివృద్ధికి కృషి
మాచారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. మండలంలోని మాచారెడ్డి, చుక్కాపూర్, ఎల్లంపేట, సోమారంపేట, గజ్యానాయక్ తండా గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తానన్నారు. తన సొంత నిధులతో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. నాయకులు బూస సురేష్, పొన్నాల వెంకట్ రెడ్డి, పుట్టకొక్కుల నర్సింలు, పండ్ల ప్రవీణ్, భరత్, కృష్ణగౌడ్, కళ్యాణ్, రవి పాల్గొన్నారు. -
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు
నిజాంసాగర్(జుక్కల్): ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని మహమ్మద్ నగర్ ఏవో నవ్య అన్నారు. మహమ్మద్ నగర్ మండలంలోని నర్వ గ్రామంలో శనివారం ఆయిల్ పామ్ సాగుపై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నీటి లభ్యత తక్కువగా ఉన్న భూస్వాములు ఆయిల్ పామ్ సాగు చేయాలన్నారు. వరి, ఆరుతడి పంటలకు దీటుగా ఆయిల్ పామ్ ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు. గున్కుల్ సొసైటీ వైస్ చైర్మన్ గొట్టం నర్సింలు, మాజీ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్, గంగారాం, భూమాగౌడ్, అంజయ్య, పెద్దసాయాగౌడ్, ఏఈవో మదుసూధన్, పంచాయతీ కార్యదర్శి బలరాముడు, కారోబార్ ప్రభాకర్ ఉన్నారు. -
కాలేజీల అభివృద్ధికి నిధులు
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. జిల్లాలో మొత్తం 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా 16 జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ. 3.28 కోట్లు మంజూరయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన బీబీపేట, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, బీర్కూర్ కళాశాలలకు మాత్రం నిధులు మంజూరు కాలేదు. మంజూరైన నిధులతో ఆయా కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, విద్యుత్, నీటి సరఫరా, ప్లంబింగ్ తదితర పనులు చేపట్టనున్నారు. జిల్లాకు ఈ స్థాయిలో నిధులు మంజూరవడం ఇదే తొలిసారి. ఈ నిధులతో పంచాయతీరాజ్ శాఖతో పనులు చేయించనున్నారు. సమస్యలను పరిష్కరిస్తాం జిల్లాలోని జూనియర్ కళాశాలల అభివృద్ధికి రూ. 3.28 కోట్లకుపైగా నిధులు మంజూరయ్యాయి. వీటితో అవసరమైన మరమ్మతులు చేయిస్తాం. మౌలిక వసతులు కల్పిస్తాం. నెలరోజుల్లో పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తాం. – షేక్ సలాం, ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి, కామారెడ్డి కళాశాలల వారీగా నిధుల వివరాలు.. (రూ. లక్షలలో) కళాశాల మంజూరైన నిధులు బిచ్కుంద 43.00 మద్నూర్ 36.50 ఎల్లారెడ్డి 27.00 గాంధారి 22.00 మాచారెడ్డి 22.00 జుక్కల్ 21.00 పిట్లం 21.00 దోమకొండ 21.00 భిక్కనూరు 20.00 లింగంపేట 18.00 సదాశివనగర్ 16.00 బాన్సువాడ 16.50(బాయ్స్) కామారెడ్డి 15.00 తాడ్వాయి 10.50 రామారెడ్డి 13.00 బాన్సువాడ 06.00గర్ల్స్ మౌలిక వసతులు, మరమ్మతుల కోసం.. జిల్లాకు రూ. 3.28 కోట్లు మంజూరు -
అటవీ భూమిని దున్నుతున్న ట్రాక్టర్ పట్టివేత
సిరికొండ: సిరికొండ అటవీ రేంజ్ తూంపల్లి సెక్షన్ గుడిలింగాపూర్ తూర్పు బీట్ పరిధిలో అటవీభూమిని దున్నుతున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు రేంజర్ రవీందర్ తెలిపారు. గుడిలింగాపూర్కు చెందిన మలావత్ మంగికి చెందిన ట్రాక్టర్ను సీజ్ చేసి సిరికొండ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అటవీ భూమిని అక్రమంగా దున్నడం నేరమని ట్రాక్టర్ యజమానికి గతంలో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. నోటీసులను బేఖాతరు చేస్తూ అటవీ భూమిని దున్నుతుండటంతో పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. దాడిలో డిప్యూటీ రేంజర్ గంగారం, సెక్షన్ అధికారి కృష్ణగీత్, బీట్ అధికారులు నాగేశ్, రీజేందర్, నవీన్, హరీశ్ పాల్గొన్నారు. -
యూరియా కోసం రైతుల బారులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద యూరియా ఎరువుల కోసం శనివారం రైతులు బారులు తీరారు. గోదాంకు యూరియా ఎరువుల లారీలు వచ్చాయని తెలియగానే ఉదయం నుంచే సొసైటీ పరిధిలోని గ్రామాలకు చెందిన రైతులు వచ్చి క్యూలో నిల్చొని యూరియా ఎరువులను తీసుకున్నారు. ప్రస్త్తుం మొక్కజొన్న, పత్తి, సోయ పంటలకు ఎరువులు వేసే సమయం వచ్చిందని రైతులు తెలిపారు. ఏఈవో శ్రావణ్కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికీ 9666 సంచుల యూరియా ఎరువులను పంపిణీ చేసినట్లు తెలిపారు. యూరియా అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. -
స్కూటీ, బైక్ ఢీ..
● నలుగురికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: ఎదురెదురుగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ మూడో ప్లాట్ఫామ్ రోడ్డుపై శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎక్కువగా గూడ్స్ రైళ్లు నిలిచే మూడో నెంబరు ప్లాట్ఫాం వెంబడి కోర్టు రోడ్డు నుంచి అశోక్నగర్ వరకు వాహనాల రాకపోకలకు వీలుగా రోడ్డును నిర్మించారు. కొంతకాలంగా ఈ రోడ్డు గుండా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. ఇదే దారిపై శుక్రవారం రాత్రి ఎదురెదురుగా వేగంగా వచ్చిన స్కూటీ, బైక్లు ఢీకొన్నాయి. రెండు వాహనాలపై ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు వారిని వెంటనే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని పట్టణంలోని అశోక్నగర్ కాలనీకి చెందిన శ్రీధర్, మురారి, బొంతల లెనిన్, లోకేశ్గా గుర్తించారు. వారిలో లెనిన్, లోకేశ్లు మైనర్లుగా తెలుస్తోంది. శ్రీధర్, మురారిల కుటుంబాలు ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చి మేసీ్త్ర పనులు చేసుకుంటున్నాయి. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం తగదు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఐకేపీ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని, గ్రామాల్లో ఐకేపీ ద్వారా చేపట్టనున్న వివిధ కార్యక్రమాల్లో మరింత ప్రగతి సాధించాలని అదనపు జిల్లా గ్రామీణాధివృద్ధి అధికారి విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధికి బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. మండల సమాఖ్య అధ్యక్షులు బెస్త శాంత, సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు. -
వసతి గృహానికి స్థలం కేటాయించండి
కామారెడ్డి టౌన్: జిల్లాలో మున్నూరు కాపు బాలబాలికల కోసం కావలసిన వసతి గృహానికి రెండు ఎకరాల స్థలము కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను మున్నూరు కాపు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్రావు కోరారు. శుక్రవారం ఆయనని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి హాస్టల్కు స్థలం, భవన నిర్మాణానికి కావాల్సి నిధులు మంజూరు చేయించాలని కోరారు. జూలై 2న జగన్నాథ రథయాత్ర కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో జూలై 2న మధ్యాహ్నం 2 గంటలకు 3వ జగన్నాథ రథయాత్ర ఉత్సవం నిర్వహించనున్నట్టు స్థానిక ప్రతినిధి వెంకటదాస్ ప్రభు తెలిపారు. జగన్నాథ రథోత్సవం సాయిబాబా ఆలయం చౌరస్తా నుంచి జీవదాన్ మీదుగా సిరిసిల్లరోడ్డు శ్రీకన్యాక పరమేర్వరి ఆలయం వరకు కొనసాగుతుందని, సాయంత్రం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమానికి బరోడా ఇస్కాన్ అధ్యక్షుడు వాసుగోష్ ప్రభు హాజరుకానున్నారని పేర్కొన్నారు. వంద రోజుల కార్యాచరణ అమలు బాన్సువాడ: మున్సిపాలిటీ పరిధిలో వంద రోజుల కార్యాచరణ పక్కాగా అమలు చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని పాత బాన్సువాడలో వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మురికి కాలువల్లో దోమల మందు పిచికారీ చేయించారు. అనంతరం ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మేనేజర్ మల్లికార్జున్రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, సిబ్బంది హన్మండ్లు, సతీష్, లక్ష్మణ్, సురేందర్ తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: మే డ్చల్ జిల్లా దుండిగల్లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రూరల్ మండలం కేశాపూర్కు చెందిన ఓ బాలుడు మృతి చెందాడు. బాలుడి పై నుంచి టిప్పర్ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ మండలం కేశాపూర్కు చెందిన గుడిపల్లి రాజ్కుమార్ నిహారిక భార్యాభర్తలు. వీరు మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధి మల్లంపేట్లో గత ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరికి అభిమాన్షు(6) కుమారుడు, ఓ పాప ఉన్నారు. స్థానిక గీతాంజలి పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం తన తల్లి నిహారికతో కలిసి ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరాడు. మార్గమధ్యలో పల్లవి స్కూల్ జంక్షన్ దగ్గరికి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ స్కూటీని తాకింది. దీంతో బాలుడు స్కూటీపై నుంచి టిప్పర్ చక్రాల కిందపడిపోయాడు. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రెప్పపాటు కాలంలో జరిగిన ప్రమాదంలో కుమారుడిని కోల్పోయనంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరయ్యింది. దీంతో బాధిత కు టుంబ సభ్యులు స్వగ్రామమైన కేశాపూర్లో సా యంత్రం బాలుడి అంత్యక్రియలు నిర్వహించారు. బాలుడి తల్లితండ్రులు రోదించిన తీరు గ్రామస్తులను కంటితడి పెట్టించింది. బాలుడి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మేడ్చల్ జిల్లా దుండిగల్లో ఘటన -
వసతి గృహం తనిఖీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రం భవానీనగర్లోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహాన్ని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి(డీటీడబ్ల్యూవో) సతీష్ యాదవ్ శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ సంక్షేమ అధికారి నవీన్ పాల్గొన్నారు. సదాశివనగర్లో గ్రంథాలయం.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయాన్ని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీకృష్ణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో అందుబాటులో ఉన్న నెలవారి మేగజైన్లు, వార్తా పత్రికలు, పుస్తకాల గురించి ఆరా తీశారు. నిరుద్యోగులకు స్టడీ కుర్చీలను తెప్పించాలని కోరారు. సంబంధిత వివరాలను జిల్లా కార్యాలయానికి పంపించాలని గ్రంథపాలకుడు శ్రీనివాస్కు సూచించారు. సమ్మె నోటీసు అందజేత కామారెడ్డి టౌన్: జులై 9న నిర్వహించే దేశ వ్యాప్త సమ్మె నోటీసును తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డికి అందజేశారు. సమ్మెలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు అయాజ్బేగ్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్రావు, కార్మికులు పాల్గొన్నారు. తీర్థయాత్రలకు బస్సు సౌకర్యం బాన్సువాడ: బాన్సువాడ నుంచి తీర్థయాత్రలకు బస్సు సౌకర్యం ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం సరితాదేవి తెలిపారు. శుక్రవారం బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భద్రాచలం, కాళేశ్వరం, ధర్మపురి, ఘనగపూర్, వేములవాడ, మెదక్ చర్చి, రహమాతాబాద్ దర్గా తదితర ప్రాంతాలకు బస్సు సర్సీసు అందుబాటులో ఉంటాయన్నారు. డీలక్స్ బస్సులో కనీసం 35 సీట్లు బుక్ చేయాల్సి ఉంటుందని అన్నారు. పూర్తి వివరాలకు గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని సూచించారు. -
రైతు వేదిక.. భారం కాదిక
ఎల్లారెడ్డి: ప్రారంభించిన నాటి నుంచి నిర్వహణకు ఎలాంటి నిధులు మంజూరు కాక, వ్యవసాయ శాఖకు గుదిబండలుగా మారిన రైతు వేదికల దశ తిరగనుంది. రైతు వేదికలపై సోలార్ ప్లాంటులను ఏర్పాటు చేసి వాటికి సాలీనా రూ.25 వేల వార్షికాదాయం వచ్చేలా ప్రభుత్వం పథక రచన చేయనుంది. గ్రామీణ ప్రాంతాలలో రైతులకు వ్యవసాయ అధికారులు తక్షణం అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ఏర్పాటుకు నడుం కట్టింది. 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్గా గుర్తించి ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదిక నిర్మాణం చేపట్టింది. కామారెడ్డి జిల్లాలో ఈ క్రమంలో 104 రైతు వేదికలను నిర్మించారు. రైతు వేదికల నిర్మాణం తర్వాత వాటి నిర్వహణ కోసం ఒకే ఒక మారు నిధులు మంజూరైనట్లు తెలిసింది. నాటి నుంచి నేటి వరకు నిర్వహణ నిధులు రాక రైతు వేదికలు వ్యవసాయ విస్తరణాధికారులకు(ఏఈవో) భారంగా మారాయి. రైతు వేదికల నిర్వహణలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య విద్యుత్ బిల్లుల చెల్లింపులు. నిర్వహణ నిధులు రాకపోవడంతో రైతు వేదికలలో ఏళ్ల తరబడి విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. సోమవారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు నేస్తం పథకం కోసం రైతు వేదికల విద్యుత్ బకాయిల చెల్లింపునకు కొద్దో గొప్పో నిధులు ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు తెలిసింది. రైతు వేదికల నిర్వహణ ఖర్చులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా వాటికి సోలార్ ప్లాంటులను అమర్చి స్వయం సమృద్ధిగా మార్చాలని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రధాన మంత్రి కుసుమ్ యోజన కింద రైతు వేదికలతో పాటు మార్కెట్యార్డులు, రైతు బజార్లలోనూ సోలార్ యూనిట్ల ఏర్పాటుకు సిద్ధమవుతోంది యంత్రాంగం. ప్రతి రైతు వేదికపై 5 కిలో వాట్ల సోలార్ ప్లాంట్ అమర్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. సోలార్ యూనిట్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్లో వేదిక అవసరాలకు వాడుకుని మిగితా విద్యుత్ను విద్యుత్శాఖకు అమ్ముకుని ఆదాయం పొందేలా ప్రభుత్వం పథకం సిద్ధం చేస్తోంది. విద్యుత్ శాఖకు మిగులు విద్యుత్ అమ్మడం ద్వారా ఏటా రూ.25 వేల వార్షికాదాయం రైతు వేదికలకు కలుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు చేయనున్న ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రవేశపెట్టారని అధికారులు అంటున్నారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రణాళికలు ఆ దిశగా అడుగులు వేస్తోన్న ప్రభుత్వం ఇప్పటికే ఖమ్మం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలువిధి విధానాలు రావాల్సి ఉంది రైతు వేదికలను స్వయం సమృద్ధి పరిచేందుకు వాటిపై సోలార్యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆసక్తిగా ఉంది. పైలట్ ప్రాజెక్టుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు యూనిట్లు ఏర్పాటు చేశారు. త్వరలో రెడ్కో అధికారులతో అనుసంధానం చేసి యూనిట్ల ఏర్పాటుకు వ్యూహ రచన చేస్తున్నారు. – తిరుమల ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి -
నిర్ణయించిన ధరకే ఇసుక విక్రయించాలి
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లకు అధికారులు నిర్ణయించిన ధరతోనే ఇసుక విక్రయించాలని, అధిక ధరతో విక్రయిస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారనే ఫిర్యాదులతో ఆమె స్పందించారు. మండల తహసీల్ కార్యాలయంలో శుక్రవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎంవీఐ శ్రీనివాస్ ట్రాక్టర్ల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. బిచ్కుంద మండలానికి రూ.2,500, జుక్కల్, మద్నూర్, పెద్దకొపడ్గల్, పిట్లం మండలాలకు రూ.3,500, నిజాంసాగర్ మండలానికి రూ.4,000 ధరతో ఇసుక వేయాలన్నారు. ఒక్కో లబ్దిదారుని అవసరాన్ని బట్టి రెండు, మూడు ట్రాక్టర్ ఇసుక కోసం పర్మిట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బిచ్కుంద తహసీల్ కార్యాలయంలో అంటెడర్గా పని చేసిన హన్మండ్లు పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె పాల్గొని సన్మానించారు. భూ సమస్యలు త్వరగా పరిష్కరించండి పెద్దకొడప్గల్(జుక్కల్): రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి రైతులకు న్యాయం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయాన్ని అకస్మాతుగా తనిఖీ చేశారు. దరఖాస్తుల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని.. స్థానిక రెవెనూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవికాంత్, సిబ్బంది పాల్గొన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి -
స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటాలి
ఎల్లారెడ్డి: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయానికి చేపట్టాల్సిన వ్యూహం గురించి దిశా నిర్దేశాలు జారీ చేశారు. నూతన మండల పార్టీ అధ్యక్షుల స్థానం కోసం పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని అన్నారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, సిరిసిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
మోర్తాడ్: మద్యం సేవిస్తూ ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడగా తీవ్ర గాయాలపాలైన ఒకరు మృతి చెందిన ఘటన మోర్తాడ్ మండలం దొన్కల్లో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని నందిగుట్టకు చెందిన షేక్ రహమాన్(42) అనే వ్యక్తి లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అలాగే ఇంటి నిర్మాణ కార్మికునిగా కూడా పని చేస్తున్న అతను నాలుగు రోజుల క్రితం అల్లెపు రాజు అనే వ్యక్తితో దొన్కల్లో పని చేయడానికి వచ్చాడు. ఇక్కడ పని చేస్తున్న రాజు, రహమాన్లు గురువారం అర్ధరాత్రి మద్యం సేవించారు. ఇద్దరి మధ్య వివాదం తలెత్తగా రాజు రహమాన్పై దాడి చేశాడు. ఈ దాడిలో రహమాన్ తల, కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని ముత్యం అనే వ్యక్తి అంబులెన్స్లో శుక్రవారం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న భీమ్గల్ సీఐ పొన్నం సత్యనారాయణ, మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.మద్యం మత్తులో కాలువలో పడి ఒకరి మృతి బీబీపేట: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బీబీపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బీబీపేటకు చెందిన శ్యాగ గణేశ్(45) మద్యానికి బానిస కావడంతో ఎలాంటి పనిచేయకుండా తిరుగుతుండే వాడు. మద్యం తాగుతూ బస్టాండ్ ఆవరణలో పడుకునేవాడు. గురువారం రాత్రి మద్యం తాగి స్థానిక వైన్స్ షాప్ దగ్గర ఉన్న మురికి కాలువ వద్ద పడుకున్నాడు. ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి మృతిచెందాడు. మృతుడి భార్య భార్య నర్సవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి జైలు ఖలీల్వాడి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన ఐదుగురికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ట్రాఫిక్ సీఐ పి ప్రసాద్ శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిని ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. వీరికి ట్రాఫిక్ పీఎస్లో కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. పది మందికి రూ. పదివేను వేల జరిమానా, ఐదుగురికి రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు సీఐ పేర్కొన్నారు.పోలీసుల అదుపులో ఇద్దరు ఆకతాయిలు ఖలీల్వాడి: నగరంలోని రెండవ టౌన్ పీఎస్లో పరిధిలోని ఉన్న దర్గా వద్ద ఇద్దరు ఆకతాయి యువకులను షీటీం సభ్యులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని షీటీమ్ సభ్యులు స్థానిక పీఎస్కు తరలించారు. విచారణ చేపట్టి వీరిపై కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. బాత్రూమ్ విషయంలో గొడవరామారెడ్డి: బాత్రూమ్ విషయంలో ఇద్దరు అన్నాదమ్ముళ్లు, వారి కుమారుల మధ్య జరిగిన గొడవలో పలువురు గాయపడినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన నర్సయ్య, రాజయ్య ఇద్దరు అన్నాదమ్ముళ్లు. కాగా వీరికి చెందిన బాత్రూం విషయంలో గొడవ జరుగుతోంది. శుక్రవారం వారి మధ్య మళ్లీ గొడవ చోటు చేసుకుంది. మొదట రాజయ్యను తన అన్న నర్సయ్య కుమారుడు శ్రీకాంత్ గొడ్డలితో గాయపర్చాడు. ఆ తర్వాత చిన్న కుమారుడు శ్రీధర్ సైతం రాజయ్యను అతని కుమారుడు నరేశ్పై దాడి చేశాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఉపాధి పనులపై సామాజిక తనిఖీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 2024–25 సంవత్సరంలో జరిగిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ సమావేశాన్ని నిర్వహించారు. పలువురు ఫీల్డు అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. సక్రమంగా పనిచేసిన కూలీలకు తక్కువ డబ్బులు ఇప్పించడం, పనులకు రాని కూలీలకు డబ్బులు వచ్చేలా చేయడం, మస్టర్లలో సరిగా కూలీల హాజరు వేయకపోవడం వంటి తప్పులు జరిగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా డీ ఆర్డీవో సురేందర్ మాట్లాడుతూ.. నిధులను పక్కదారి పట్టించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, డబ్బులను రికవరీ చేస్తామన్నారు. ఎర్రాపహాడ్ ఫీల్డు అసిస్టెంటు బాలురాజును సస్పెండ్ చేశారు. మండల ప్రత్యేక అధికారి శివకుమార్, ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, ఎస్ఆర్పీ సాంబశివచారీ, ఇన్చార్జి ఏపీవో కృష్ణ గౌడ్, జీపీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డు అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి టౌన్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ఎంపిక కోసం ఉపాధ్యాయుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఎస్.రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల నుంచి జులై 13 వరకు https://national awardstoteachers.education.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపిక మార్గదర్శకాల కోసం ఎంహెచ్ఆర్డీ వెబ్సైట్ https://www.education.gov.in ను సంప్రదించాలన్నారు. లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలి బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు ప్రారంభించాలని ఎంపీడీవో ముజాహిద్ అన్నారు. బోర్లం గ్రామంలో శుక్రవారం ఎంపీడీవో ముజాహిద్ పర్యటించారు. లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించారు. బేస్మెంట్ నిర్మాణం పూర్తికాగానే రూ.లక్ష బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామన్నారు. పంచాయతి కార్యదర్శి సాయికుమార్ ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమిపూజ బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులందరూ వెంటనే పనులు ప్రారంభించాలని హన్మాజీపేట్ పంచాయతీ కార్యదర్శి రాజేష్ అన్నారు. గ్రామస్తులతో కలిసి శుక్రవారం ఖాళీ స్థలంలో ముగ్గుపోసి భూమిపూజ చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. మాజీ సర్పంచ్ బోనాల సుభా ష్, నాయకులు వడ్ల శేఖర్, షేక్ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల్లో మందులు విక్రయించే సమయంలో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని విద్యుత్ వినియోగదారుల ఫోరం సభ్యులు రాజాగౌడ్ హెచ్చరించారు. శుక్రవారం లింగంపేట రైతు వేదికలో భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. డీఏపీ, యూరియా బస్తాలు ప్రతి ఫర్టిలైజర్ షాపులో స్టాక్ వివరాలు ప్రదర్శించాలన్నారు. లింగంపేటలోని ఓ దుకాణం యజమాని రైతులు కొనుగోలు చేస్తున్న డీఏపీకి కార్బన్ ప్యాకెట్లు కొంటేనే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. అలాగే ఎల్లారెడ్డిలోని గ్రోమోర్ సెంటర్లో రైతులకు అవసరం లేని మందులు బలవంతంగా అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారికి వివరించగా.. రైతులకు బలవంతంగా కార్బన్ ప్యాకెట్లు అంటగడితే వెంటనే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తామని చెప్పారని అన్నారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్, మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు
గాంధారి: పిచ్చికుక్క దాడిలో పలువురు గాయాలపాలైన ఘటన గాంధారి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఓ చిన్నారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మండల కేంద్రంలోని ఎనిమిదో వార్డులో పిచ్చి కుక్క వీధుల్లో తిరుగుతూ కనబడిన వారందరిపై దాడి చేసి గాయపర్చింది. అమల, అమిక, పాపవ్వ, అనితతో పాటు ఇంటి బయట ఆడుకుంటున్న అమిక అనే చిన్నారిని గాయపర్చింది. పక్కింట్లో ఉండే పాపవ్వ అనే మహిళ కుక్క నుంచి చిన్నారిని విడిపించే ప్రయత్నం చేయగా ఆమైపె కూడా దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారందరిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా డాక్టర్ ప్రసన్న చికిత్స చేశారు. మెరుగైన చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా పిచ్చి కుక్క పశువులు, దూడలపై దాడి చేసి గాయపర్చింది. కాలనీ వాసులు వెంబడించి పిచ్చికుక్కను చంపేశారు. -
పోచంపాడే.. శ్రీరాంసాగర్
మెండోరా మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ముందుగా పోచంపాడ్ ప్రాజెక్ట్గా పిలిచేవారు. ● 1978లో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వ చ్చిన నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పో చంపాడ్ను శ్రీరాంసాగర్గా పేరు మార్చారు. ● పోచంపాడ్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోచంపాడ్ను పాడ్ అనడం బాగుండదని సీఎంకు విన్నవించడంతో పేరు మార్పు జరిగింది. ● పోచంపాడ్లో గోదావరి తీరాన కోదండ రామాలయం ఉండటంతో ఆ ఆలయం పేరు మీదుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్గా పేరు మార్చారు. ● పోచంపాడ్ ప్రాజెక్ట్కు 1963లో నాటి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా 1978లో పూర్తయింది. ● శ్రీరాంసాగర్ ప్రధాన కాలువలకు కూడా అప్పుడే కాకతీయ, లక్ష్మి, సరస్వతి కాలువలకు నామకరణం చేశారు. – బాల్కొండమీకు తెలుసా? -
‘స్వదేశీ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి’
కామారెడ్డి అర్బన్ : ప్రజలు స్వదేశీ ఉత్పత్తులనే వినియోగించాలని స్వదేశీ జాగరణ్ మంచ్ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన్ ప్రముఖ్ జగదీశ్ కోరారు. శుక్రవారం లింగాపూర్లోని ఎస్పీఆర్ హైస్కూల్లో స్వదేశీ జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ‘స్వదేశీ విధానాలు, స్వావలంభి భారత్ అభియాన్లో విద్యార్థుల పాత్ర’ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జగదీశ్ మాట్లాడుతూ పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనకు తెలియకుండానే ఎన్నో విదేశీ వస్తువులను వినియోగిస్తున్నామన్నారు. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుందన్నారు. ప్రధానంగా చైనా, తుర్కియే, అమెరికా వస్తువుల వినియోగాన్ని నిలిపివేయాలన్నారు. స్థానికంగా ఉన్న దుకాణాల్లోనే స్వదేశీ కంపెనీ వస్తువులనే కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ్ మంచ్ తెలంగాణ ప్రాంత యువ ప్రముఖ్ రాహుల్కుమార్, జిల్లా సంఘర్షణ ప్రముఖ్ సంతోష్గౌడ్, కాలేజ్ ప్రిన్సిపల్ కొమిరెడ్డి మారుతి, ప్రతినిధులు అంజనేయులు, సాహిత్, మనీష్, విశ్రాంత అధ్యాపకులు రంజిత్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
‘పౌర హక్కులను కాలరాసిన ఘనత కాంగ్రెస్దే’
కామారెడ్డి టౌన్: భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ, పౌర హక్కులను కాలరాస్తూ 21 నెలల పాటు నియంత పాలన సాగించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లయిన సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యంలో చీకటి అధ్యాయమన్నారు. ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించారని విమర్శించారు. ఇందిరా గాంధీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన రోజు దేశమంతా చీకటితో నిండిన రోజని బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ వ్యాఖ్యానించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న రంజిత్ మోహన్, రాజిరెడ్డిలను సన్మానించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ అధ్యక్షురాలు అరుణతార, రాష్ట్ర నాయకులు మురళీధర్గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, పైలా కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్రెడ్డి, రవీందర్రెడ్డి, నాయకులు వేణు, రవీందర్, లింగారావు, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటిగ్రేటెడ్ లేట్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం గురుకు ల విద్యారంగంలో సమూల మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రె సిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. అన్ని కులాల విద్యార్థులు ఒకే దగ్గర చదువుకునేలా సమీకృత గురుకులాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. సొంత భవనాలు నిర్మించి ప్రారంభించాలని ని ర్ణయించింది. తొలి విడతలో జిల్లాలోని జుక్కల్ ని యోజక వర్గానికి స్కూల్ మంజూరైంది. మద్నూర్ మండల కేంద్రంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు నిర్మించేందుకు గతేడాది డిసెంబర్ 7న అప్పటి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు, సౌకర్యాల కల్పన కోసం రూ. 200 కోట్లు మంజూరు చేశారు. ఆర్థిక శాఖ నుంచి కూడా నిధులు విడుదలయ్యాయి. నియోజకవర్గం పరిధిలోని ఆయా ప్రాంతాల నుంచి 2,500 మంది విద్యార్థులు చదువుకునేలా ఈ పాఠశాల నిర్మించేందుకు ప్లాన్ చేశారు. అలాగే రెండో విడతలో ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాలకు మంజూరయ్యాయి. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో లింగంపేట మండలం మోతె గ్రామంలో, బాన్సువాడ నియోజక వర్గానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పరిధిలో స్కూల్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలుబడ్డాయి. ఇక మిగిలింది కామారెడ్డి నియోజకవర్గం మాత్రమే. మరో విడతలో కామారెడ్డికి మంజూరవుతుందని భావిస్తున్నారు. నెలలు గడుస్తున్నా.. మద్నూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడిచాయి. ఇప్పటికీ టెండర్లు కూడా పూర్తవలేదు. తొలి విడతలో ఇంటిగ్రేటెడ్ గురుకులాలు మంజూరైన ఇతర జిల్లాల్లో టెండర్లు పూర్తవడం గమనార్హం. రెండేళ్లలో భవనాల నిర్మాణం పూర్తి చేసి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించాలన్నది సర్కారు లక్ష్యం. అయితే మద్నూర్లో ఇంకా టెండర్ల దశ కూడా దాటలేదు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది. తర్వాత కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ అగ్రిమెంట్ ప్రాసెస్కు కూడా సమయం పడుతుంది. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు స్పందించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు.ఎన్నో ఆశలు..అన్ని వర్గాల విద్యార్థులు ఒకేచోట చదువుకునేలా కార్పొరేట్ను తలదన్నే రీతిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్కూల్పై ఆశలు పెట్టుకున్నారు. అందులో సీటు వస్తే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నారు. తొలివిడతలో జుక్కల్ నియోజక వర్గానికి మంజూరు శంకుస్థాపన చేసి ఆరు నెలలు.. ఇప్పటికీ టెండర్ల దశ దాటని ప్రక్రియ -
‘నాణ్యమైన భోజనాన్ని అందించాలి’
మాచారెడ్డి : విద్యార్థులకు నాణ్యమైన, శుభ్రమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు. శుక్రవా రం ఆయన మాచారెడ్డిలోని ఎస్టీ మినీ గురుకుల పాఠశాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, పీహెచ్సీని పరిశీలించారు. మహిళా సమాఖ్య కార్యాలయాన్ని సందర్శించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి రమేష్, తహసీల్దార్ సర ళ, ఎంపీడీవో గోపిబాబు, ఏపీవో సాయిబా బా, ఎంపీవో సురేందర్, ఏపీఎం శ్రీనివాస్, బీసీ హాస్టల్ వార్డెన్ చక్రధర్ ఉన్నారు. ‘కేజీబీవీలో నూతన కోర్సులు ప్రారంభం’ రాజంపేట : మండల కేంద్రంలోని కేజీబీవీ లో ఇంటర్లో ఫార్మా టెక్నాలజీ, కమర్షియల్ గార్మెంట్స్ టెక్నాలజీ కోర్సులను ప్రారంభించారు. శుక్రవారం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో డీఈవో రాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు నూతన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం పా ఠశాల ఆవరణలో సరస్వతి మాత విగ్రహ ప్రతిష్ఠాపనకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శ్రీవాణి, జీఈసీవో సుకన్య, ఎంపీడీవో రఘురాం, త హసీల్దార్ జానకి పాల్గొన్నారు. సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన దేవరాజ్ గౌడ్ కామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్: ఫోన్ ట్యా పింగ్ కేసులో డీసీసీ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ శుక్రవారం వాంగ్మూలం ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డిలోని పలువురు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్కు గురైనట్లు సిట్ విచారణలో తేలిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో దేవరాజ్ గౌడ్ ఒకరు. సిట్ అధికారులు ఫోన్ చేసి ఆయనను వాంగ్మూలం ఇవ్వాలని కోరారు. దీంతో ఆయన శుక్రవా రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లి సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ బయట మీడియాతో మాట్లాడారు. దర్యాప్తును వేగవంతం చేసి దోషులకు శిక్ష పడేలా చూడాలని సిట్ అధికారులను కోరానన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్, రామా గౌడ్, నంద రమేశ్, దర్శన్, రాజు ఉన్నారు. సీఎం ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జిల్లాకు గుర్తింపు కామారెడ్డి క్రైం : పోలీసు శాఖకు సంబంధించిన సీఎం ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కా రంలో జిల్లా మంచి పనితీరుతో గుర్తింపు తెచ్చుకుందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. రాష్ట్ర పోలీసు శాఖ కార్యాలయం నుంచి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ జితేందర్ ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్షించారు. ఇందులో కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్లో లేకపోవడంతో జిల్లా నోడల్ అధికారి ఏఎస్పీ నరసింహారెడ్డికి ప్రశంసాపత్రం అందించారని ఎస్పీ తెలిపారు. ఎస్సెస్సీ సప్లిమెంటరీలో 90.67 శాతం ఉత్తీర్ణత కామారెడ్డి టౌన్ : ఎస్సెస్సీ సప్లిమెంటరీ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. జిల్లాలో 675 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 612 మంది పాస్ అయ్యారు. 90.67 శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 422 మంది పరీక్ష రాయగా 376 మంది, బాలికలు 253 మందికిగాను 236 మంది పాసయ్యారని డీఈవో రాజు తెలిపారు. -
‘అటవీ భూములను ఆక్రమిస్తే ఉపేక్షించం’
పెద్దకొడప్గల్: అటవీ భూములను ఎవరు ఆక్రమించినా ఉపేక్షించబోమని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత హెచ్చరించారు. కాటేపల్లి తండా శివారులో అటవీ భూములు కబ్జా అవుతున్న విషయమై ఈనెల 2న సాక్షిలో ప్రచురితమైన కథనంపై డీఎఫ్వో నిఖిత స్పందించారు. శుక్రవారం ఆక్రమణకు గురైన అటవీ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ భూముల జోలికి వెళ్లవద్దన్నారు. కాటేపల్లి తండా శివారులో అటవీ భూమి ఆక్రమణకు గురైందని, ఆ భూమిలో త్వర లో అటవీశాఖ తరఫున మొక్కలు నాటేందుకు చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం తండా వాసులు మాట్లాడుతూ తమ తండా పరిధిలో అటవీ భూములను ఫారెస్ట్ అధికారులు గుర్తించిన విధంగానే ఇతర ప్రాంతాలలో కూడా కబ్జాకు గురైన భూములను స్వాధీనం చేసుకుంటేనే తాము కబ్జా చేసిన భూములను వదులుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారి సునీత, పిట్లం ఎఫ్ఆర్వో రవికుమార్, కౌలాస్ డీఆర్వో అభిలాష్ తదితరులు పాల్గొన్నారు. -
వణుకు పుట్టిస్తున్న
శనివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా ఎ స్పీగా రాజేశ్ చంద్ర బాధ్యతలు చే పట్టిన తర్వాత దాదాపు అన్ని పో లీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. ఏ స్టేషన్కు వెళ్లినా అక్కడి రికార్డుల నిర్వహణ, స్టేషన్ పరిసరాలను క్షు ణ్ణంగా పరిశీలిస్తున్నారు. రికార్డుల నిర్వహణ సరిగా లేని ఠాణాల్లో అక్క డి అధికారులకు ఎలా నిర్వహించాలన్న దానిపై అవగాహన కల్పిస్తూ పద్ధతి మా ర్చుకోవాలని సూచిస్తున్నారు. ఆయా పో లీస్ స్టేషన్లలో పనిచేసే రైటర్లు, కోర్టు డ్యూటీ నిర్వహించే కానిస్టేబుళ్ల నుంచి మొదలుకుని అన్ని విభాగాల సిబ్బందితో పలుమార్లు సమీక్షలు నిర్వహించి అక్రమాలకు, అవినీతికి తావులేకుండా పనిచేయాల ని ఆదేశిస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేసినా, కేసుల పరిశోధన సరిగా లేకపోయినా, డబ్బుల వసూళ్లకు పాల్పడినా, ఫిర్యాదుదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, వారికి సరైన గౌరవం ఇవ్వకపోయినా చ ర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో విధి ని ర్వహణలో బాగా పనిచేసేవారిని అభినందిస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది బదిలీలు.. జిల్లాలో ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డుల బదిలీలు నిర్వహించారు. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన ఏఎస్సైలను వారు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే చాలాకాలంగా ఒకేచోట పనిచేస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు కూడా స్థానచలనం కల్పించారు. 63 మంది సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లు, ఏడుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు, 79 మంది హోంగార్డులను కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేశారు. బాధ్యతగా పనిచేసే వారికి ప్రశంసలు విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని ఎస్పీ ఎప్పటికప్పుడు ప్రశంసిస్తున్నారు. వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. జిల్లాలో వివిధ సందర్భాల్లో చురుకుగా పనిచేసిన ఇరవై మందికిపైగా పోలీసు సిబ్బందిని ఆయన సన్మానించారు. తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో వారిని అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. నిజాయితీగా, బాధ్యతగా పనిచేసి పోలీసు శాఖకు పేరు తేవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని ఆయన పేర్కొంటున్నారు. న్యూస్రీల్ విధుల్లో నిర్లక్ష్యం, తప్పుడు పనులపై సీరియస్ జిల్లాలో పదిమందిపై సస్పెన్షన్ వేటు ఇందులో ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు..మూడున్నర నెలల్లో.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసిన ప ది మందిపై ఎస్పీ కఠిన చర్యలు తీసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతోపాటు బాధి తులు, ఫిర్యాదుదారులు, నిందితుల విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న వారి పై చర్యలకు ఉపక్రమించారు. రామారెడ్డి ఎస్సై రమేశ్, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారిపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. దీంతో వారి ద్దరినీ సస్పెండ్ చేశారు. అలాగే ఇద్దరు హెడ్ కా నిస్టేబుళ్లు, ఐదుగురు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డుపైనా సస్పెన్షన్ వేటు పడింది. బాన్సువాడ లో తాగి న్యూసెన్స్ చేసిన వ్యక్తి విషయంలో వ చ్చిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు గంగాధర్ దురుసుగా ప్రవర్తించడాన్ని ఎస్పీ సీరియస్గా పరిగణించా రు. వారిద్దరినీ సస్పెండ్ చేశారు. జుక్కల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ అంబర్సింగ్ పోలీ సు స్టేషన్కు వచ్చిన బాధితులు, నేరస్తులతో చ నువుగా ఉంటూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తానని డబ్బులు డిమాండ్ చేస్తున్న విషయం ఎస్పీ దృష్టికి రాగా ఆయనపై చర్యలు తీసుకు న్నారు. నిజాంసాగర్ పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్ మోహన్సింగ్ అనైతిక ప్రవర్తనపై సీరియ స్ అయి సస్పెండ్ చేశారు. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ రాకేశ్గౌడ్ మ ద్యం సేవించి వాహనం నడిపినందుకు సస్పెన్షన్కు గురయ్యాడు. పాస్పోర్టు జారీ విషయంలో క్లియరెన్స్ ఇచ్చే విషయంలో దొర్లిన తప్పిదానికి స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణపై చర్యలు తీసుకున్నారు. -
పోచారం నీరే ఆధారం
నాగిరెడ్డిపేట : నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్స్టోరేజీలో ఉంది. వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరలేదు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆందోళన చెందుతోంది. పనులు ప్రారంభించని రైతులు పోచారం ఆయకట్టుకు ప్రాజెక్టు నీరే ఆధారం. ప్రాజెక్టునుంచి వచ్చే నీటిపై ఆధారపడే పంటలు సాగు చేస్తారు. ప్రాజెక్టుపై ఆధారపడి ఏటా వానాకాలంలో అధికారికంగా 10,500 ఎకరాలలో, అనధికారికంగా మరో 5 వేల ఎకరాలలో పంటలు సాగవుతాయి. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్స్టోరేజీలో ఉండడంతో రైతులు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. నీరు లేకపోవడంతో సాగు పనులు మొదలు పెట్టలేకపోతున్నారు. దీంతో ఆయకట్టు పరిధిలో భూములు చాలావరకు బీడుగానే కనిపిస్తున్నాయి.వెలవెలబోతున్న పోచారం ప్రాజెక్టునీళ్ల కోసం ఎదురుచూస్తున్నం పోచారం ప్రాజెక్టు ఆయక ట్టు కింద నాకు ఎకరంనర భూమి ఉంది. ప్రాజెక్టులోకి నీరు ఎప్పుడు వస్తుందా అ ని ఎదురు చూస్తున్నాం. ప్రా జెక్టులోకి వరదరాక ప్రారంభంకాగానే పంటల సాగు పనులు మొదలుపెడతాం. – అంతన్నగారి రవి, ఆయకట్టు రైతు, వాడి నీరొస్తేనే సాగు పనులు.. నాకు ఎకరం భూమి ఉంది. ప్రాజెక్టు నీటితోనే పంటలు పండిస్తాం. ఈ యేడు ప్రాజెక్టులోకి చుక్క నీరు రాలేదు. ప్రాజెక్టులోకి వరదనీరు వస్తేనే మాకు పంటల సాగు మీద నమ్మకం కలుగుతుంది. – లక్ష్మయ్య, ఆయకట్టు రైతు, గోలిలింగాల వర్షాలు లేక.. జిల్లాలోని గాంధారి, తాడ్వాయి, లింగంపేట మండలాల్లో కురిసే వర్షాలతో పోచారం ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతుంది. జూన్, జూలై మాసాల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుతుంది. ఈసారి జూన్ నెల ముగింపునకు వస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్కనీరు కూడా రాలేదు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం డెడ్స్టోరేజీ(0.199 టీఎంసీ)లో ఉంది. ఈ యేడు ముందస్తుగా కురిసిన వర్షాలతో పోచారం ఆయకట్టు రైతులు సంబరపడ్డప్పటికీ ఆ తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం మొదలై మూడువారాలు వానలు లేక.. చుక్క నీరు రాక.. డెడ్స్టోరేజీలోనే ప్రాజెక్టు నీటిమట్టం ఆయకట్టు భూముల్లో మొదలు కాని పంటల సాగు -
పసుపు బోర్డు కేంద్రం ఇచ్చిన బహుమతి
సుభాష్నగర్ : పసుపు బోర్డు ఏర్పాటు జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఎమర్జెన్సీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఎంపీ అర్వింద్ ధర్మపురితో కలిసి గురువా రం ఆయన వీక్షించారు. అనంతరం విలేకరులతో కిషన్రెడ్డి మాట్లాడారు. పసుపు బోర్డు కావాలనే 40 ఏళ్ల రైతుల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం ప్రకటించిందని, ఎంపీ అర్వింద్ కృషితో రాష్ట్ర, జాతీయపార్టీ నిర్ణయం, ప్రధాని మో దీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పడిందన్నారు. పసుపు బోర్డు తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలు అడిగాయని, మోదీ చివరకు నిజామాబాద్లోనే ఏ ర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా జిల్లాకు చెందిన రైతుబిడ్డనే నియమించారన్నారు. ఈనెల 29న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం పూర్తిస్థా యిలో కార్యరూపం దాల్చనుందన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా రైతులు సమ్మేళనానికి హా జరై విజయవంతం చేయాలని కోరారు. పసుపు బో ర్డు కార్యాలయం ప్రారంభం తర్వాత బోర్డు లోగో ను అమిత్ షా ఆవిష్కరిస్తారని తెలిపా రు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని కూడా షా ఆవిష్కరిస్తారని తెలిపారు. రైతు సమ్మేళనానికి తరలిరావాలి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించే రైతు సమ్మేళన బహిరంగ సభకు హాజరవుతారని, రైతులు పెద్దసంఖ్యలో తరలిరావాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి పిలుపు నిచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారా యణ, ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి ఎంపీ అర్వింద్ విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది నిజామాబాద్ జిల్లా రైతు ఉద్యమాలకు కేంద్రబిందువు అమిత్ షా సభను జయప్రదం చేయాలని పిలుపు -
‘సాగర్’లోకి ఇన్ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,025 క్యూసెక్కుల ఇన్ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. క్యాచ్మెంట్ ఏరియాతోపాటు ఎగువన కుండపోతగా కురిసిన వర్షానికి వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1392 అడుగుల (5.2 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,025 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రేపు జాబ్ మేళాకామారెడ్డి క్రైం: ప్రైవేట్ రంగంలో యువతీయువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కలెక్టరేట్లోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈనెల 28వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో 20 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో ఏదైనా డిగ్రీ, పీజీ, ఎంబీఏ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 18 నుంచి 30 ఏళ్ల వయస్సు వారు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు అన్ని సర్టిఫికెట్లతో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హాజరుకావాలని, మిగతా వివరాల కోసం 70975 25933, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. క్రమశిక్షణతో మెలగాలికామారెడ్డి అర్బన్: క్రమశిక్షణతో మెలగాలని విద్యార్థులకు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి దయానంద్ సూచించారు. పట్టణ పరిధిలోని దేవునిపల్లి వాసవీకాలనీలో ఉన్న మైనారిటీ గురుకుల జూనియర్ కళాళాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు. అనంతరం కళాశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేశారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట ఆర్ఎల్సీ కిరణ్గౌడ్, ప్రిన్సిపాల్ ఇంతియాజ్ అలీ, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. సాహస అవార్డు కోసం దరఖాస్తుల ఆహ్వానంకామారెడ్డి అర్బన్: టెన్సింగ్ నార్కే నేషనల్ అడ్వెంచర్ అవార్డు–2024 అవార్డు కోసం సాహస కృత్యాలు చేసిన వారి నుంచి ఈనెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా క్రీడలు, యువజన అధికారి కేఎస్ జగన్నాథన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022, 2023, 2024 సంవత్సరాల్లో భూమి, ఆకాశం, సముద్రంలో సాహస కృత్యాలు చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించవచ్చని సూచించారు.బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశాలకు..కామారెడ్డి అర్బన్: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ సంక్షేమాధికారి పి వెంకటేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కులాల్లో గ్రూప్–1లో ఐదు సీట్లు, గ్రూప్–2లో పది సీట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తిగల వారు జూలై 5వ తేదీలోగా దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలిబాన్సువాడ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని బాన్సువాడ కోర్టు జడ్జి భార్గవి అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. యువత పెడదారి పట్టకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, ఆల్కహాల్, సిగరేట్, బీడీ, గుట్కా వంటివి సేవించడం కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు లక్ష్మీనారాయణమూర్తి, మోహన్రెడ్డి, భూషణ్రెడ్డి, రమాకాంత్, ఆనంద్, హైమద్, అజీం, హర్షద్, కోర్టు సిబ్బంది, ఎకై ్సజ్ అధికారులు పాల్గొన్నారు. -
నీరు వృథా రైతు వ్యథ
బాన్సువాడ : మంజీర నది ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పైపులైన్ లీకేజీలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాన్సువాడ, తాడ్కోల్, చింతల్నాగారం శివార్లలోని పంట పొలాలకు సాగునీరందించాలనే లక్ష్యంతో మంజీర నది ప్రాంతంలో ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేశారు. ఈ ఎత్తి పోతల పథకం కింద సుమారు 600 ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, నిర్వహణ బాధ్యత కోసం రైతులే ఓ కమిటీని ఏర్పాటు చేసి పైపులైన్ లీకేజీలు, మోటార్ల మరమ్మతులు చేయిస్తారు. పంటలు చేతికొచ్చిన తర్వాత ఎకరానికి 70 కిలోల ధాన్యం బస్తాను కమిటీకి చెల్లిస్తారు. ఇలా వసూలైన ధాన్యాన్ని విక్రయించి మోటార్ల మరమ్మతులు, పైపులైన్ లీకేజీలు, కాలువల మరమ్మతులు చేయిస్తారు. ఎత్తిపోతల పైపులైన్ వేసి చాలా ఏళ్లు కావడంతో పైపులైన్కు లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతోంది. నీరు వృథాగా పోతున్న ప్రాంతంలో భారీగా జమ్ము మొలవడమే కాకుండా నీరు పొలాల్లోకి చేరుతోంది. దీంతో పొలాలు జాలుపట్టి పంటలు సరిగా పండడం లేదు. సుమారు 200 ఎకరాల్లో ఎప్పుడూ నీరు ఉంటుండడంతో పొలాలు ఆరడం లేదు. పంట కోతకు వచ్చిన సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎత్తిపోతల పైపులైన్ నుంచి లీకవుతున్న నీరు బురదనీటితో పొలాలు.. పంటల సాగుకు ఇబ్బందులు పడుతున్న రైతులు కొత్త పైపులైన్ వేస్తేనే శాశ్వత పరిష్కారం -
ఎల్లారెడ్డి కాంగ్రెస్లో అసంతృప్తి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలానికి చెందిన సీడీసీ చైర్మన్ మహ్మద్ ఇర్షాదుద్దీన్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు రాజీనామా లేఖలు పంపించారు. కాంగ్రెస్లో క్రియాశీల కార్యకర్తగా పని చేస్తూ, ఎమ్మెల్యేగా మదన్మోహన్రావు గెలుపు కోసం కష్టపడ్డానని లేఖలో పేర్కొన్నారు. గత కొంత కాలంగా తనలాంటి నాయకులను అవమానిస్తూ, విస్మరిస్తూ, పార్టీ ద్రోహులకు కీలక భాద్యతలు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే పీఏల పెత్తనంతో విసిగిపోయానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్అలీని గానీ, మరే ఇతర నాయకులను గానీ కలిస్తే చాలు తమ దగ్గరకు రావొద్దని ఆంక్షలు పెడుతున్నారని, వాట్సాప్ గ్రూప్ల నుంచి తొలగించి అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పీఏల వ్యవహారాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అప్పట్లో రామారెడ్డి మండల నేతలుఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రామారెడ్డి మండలానికి చెందిన కొందరు కాంగ్రెస్ నాయకులు అప్పట్లో పీఏల పెత్తనంపై ఆరోపణలు చేశారు. కొందరు నాయకులు ఇప్పటికీ ఎమ్మెల్యేకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా సదాశివనగర్ మండలానికి చెందిన సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం చర్చనీయాంశమైంది. పార్టీకి సీడీసీ చైర్మన్ ఇర్షాద్ రాజీనామా ఎమ్మెల్యే పీఏల పెత్తనంపై మండిపాటు -
డ్రగ్స్ రహిత సమాజం కోసం ఉద్యమించాలి
కామారెడ్డి క్రైం: డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత ఉద్యమించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అ న్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కామారెడ్డిలో గురువారం సంక్షేమ శాఖ, పోలీస్, ఎకై ్సజ్ శాఖ ఽఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రా రంభించారు. అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొ న్నారు. చర్చి గ్రౌండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ కళాభారతి ఆడిటోరియం వరకు ఉత్సాహంగా కొనసాగింది. అనంతరం కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత చెడు అలవాట్లకు మొదటి నుంచి దూరంగా ఉండాలని సూచించారు. పిల్లలు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణ చాలా కీలకమన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి వరప్రసాద్ అన్నారు. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్ కోసం శ్రమించాలన్నారు. చదువుపై దృష్టి సారించి ఉన్నత స్ధానాల్లో నిలవాలని సూచించారు. మత్తు పదార్థాలు సేవించే వారి వివరాలను తమ దృష్టికి తీసుకునిరావాలన్నారు. 1908, 1933, 1446 టోల్ ఫ్రీ నంబర్ల గురించి వివరించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.1908కి సమాచారం ఇవ్వాలిమత్తు పదార్థాలు సేవించడం కారణంగా చాలామంది విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. ‘డ్రగ్స్ వాడము – ఇతరులను వాడనివ్వము’ అనే నినాదంతో యువత ముందుకు నడవాలన్నారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్ధాల సమాచారం తెలిస్తే 1908 కి సమాచారం ఇవ్వాలని సూచించారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు జిల్లా జడ్జి, కలెక్టర్, ఎస్పీల చేతులమీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో సివిల్ జడ్జి నాగరాణి, అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఆర్డీవో వీణ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, డీఈవో రాజు, ఉద్యోగులు, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ తనిఖీ
● మెడికల్ కళాశాల, జీజీహెచ్ను సందర్శించిన బృందం ● మొక్కుబడిగా ముగించారని విమర్శలుకామారెడ్డి టౌన్: కామారెడ్డి వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మెడికల్ కాలేజీ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) బృందం గురువారం తనిఖీ చేపట్టింది. కమిటీ ఇన్చార్జి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) రవీందర్ నాయక్, సభ్యులు కలెక్టర్ అశిష్ సంగ్వాన్, నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్తో పాటు అధికారులు మధ్యాహ్నం మెడికల్ కళాశాలను తనిఖీ చేశారు. మెడికల్ కళాశాల, హస్టల్ భవనాల పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేసి అప్పగించాలని ఇంజినీర్ అధికారులకు సూచించారు. నీటి సమస్య, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలు, పరికరాలు, సిబ్బంది ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనంగా మరో 100 పకడలతో హాస్టల్ నూతన భవనం కావాలని కామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ శివకుమార్ డీపీహెచ్ను కోరారు. గైర్హాజరైన సూపరింటెండెంట్ ఎంసీఎంసీ బృందం తనిఖీ సమయంలో జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఫరీదా గైర్హాజయ్యారు. ఉదయం హాజరు రిజిస్టర్లో సంతకం చేసిన ఆమె మధ్యాహ్నం వెళ్లిపోయారు. ఆరోగ్యశ్రీ నిధులు హెచ్డీఎస్ కమిటీ అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వినియోగించారని, ఈ వ్యవహారంలో కల్టెకర్ సూపరిండెంట్పై బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తనిఖీ సమయంలో ఉంటే ఉన్నతాధికారులకు విషయం తెలిసిపోతుందనే ఆమె మధ్యాహ్నం వెళ్లిపోయారని ఆస్పత్రి సిబ్బంది, కొంత మంది వైద్యులు గుసగుసలాడారు.40 నిమిషాల్లోనే..జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రికి చేరుకున్న బృందం.. సాయంత్రం 4.20 నుంచి 4.35 మధ్య తనిఖీ చేసింది. ల్యాబ్, ఆక్సిజన్ ప్లాంట్ను పరిశీలించిన అనంతరం సూపరింటెంటెండ్ చాంబర్లో వైద్యాధికారులతో 4.38 నిమిషాలకు సమీక్ష సమావేశాన్ని ప్రారంభించారు. 5 గంటలకు బయటకు వచ్చిన బృందం సభ్యులు 5 గంటల 6 నిమిషాలకు ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. రోగులతో మాట్లాడకపోవడం, ఆస్పత్రి ఆవరణను పరిశీలించకపోవడంతో మొక్కుబడిగా తనిఖీ ముగించారని పలువురు విమర్శించారు. అదనపు కలెక్టర్ విక్టర్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ చందర్నాయక్, టీఎంఎస్ఐడీసీ నిజామాబాద్ ఈఈ కుమార్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్యులు ఉన్నారు. -
తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతుభరోసా
మాచారెడ్డి: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిని, తొమ్మిది రోజుల వ్యవధిలోనే రూ.9వేలకోట్ల రైతు భరోసా ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మండల కేంద్రంలోని శివబాలాజీ ఫంక్షన్ హాలులో గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ మురుగన్, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, పరిశీలకులు కత్తి వెంకటస్వామి, సత్యనారాయణగౌడ్, వేణుగోపాల్యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. పేదల కోసం నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని, ధనికులు తినే సన్న బియ్యం పేదలకు అందించి వారి కడుపు నింపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తోందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. బీజేపీ రాష్టానికి చేసిందేమీ లేదని షబ్బీర్ అలీ ఘాటుగా విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారం లోకి రావాలని చూస్తోందన్నారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త పాత నాయకులు సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.కులగణన దేశానికి ఆదర్శంరాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ అన్నారు. రేవంత్రెడ్డి దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్గా చేసి చూపించారని అన్నారు. ఎంపీ సురేశ్ షెట్కర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా అనుబంధ సంఘాల మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
ఇసుక పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు
బిచ్కుంద(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్ల పేరుతో లబ్ధిదారులకు ఇసుక ఇవ్వకుండా పక్కదారిపట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. తహసీల్, మున్సిపల్ కార్యాలయాలను గురువారం ఆమె సందర్శించారు. సబ్ కలెక్టర్ వచ్చిన విషయం తెలుసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయానికి తరలివచ్చారు. 10 ట్రాక్టర్ల ఇసుకకు ఒకేసారి పర్మిట్లు ఇస్తున్నారని, స్థలం లేక రెండు, మూడు ట్రాక్టర్ల ఇసుక తాము వేసుకుంటుండగా, మిగతా ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటున్నారని సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి కమిషనర్ ఖయ్యూంను ఆదేశించారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని సబ్ కలెక్టర్ ప్రశ్నించగా.. ఆరుగురు సిబ్బంది కొత్తగా విధుల్లో చేరారని, వార్డు అధికారులతోపాటు మరి కొంత మంది సిబ్బంది అవసరం ఉందని కమిషనర్ సమాధానమిచ్చారు. సిబ్బంది నియామకంతోపాటు ఇతర అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సబ్ కలెక్టర్ అన్నారు. -
వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
బాన్సువాడ/తాడ్వాయి/ఎల్లారెడ్డి రూరల్: మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్ఫలితాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో బాన్సువాడ విద్యార్థి నిఖిల్గౌడ్, తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి పాఠశాలకు చెందిన కుమ్మరి తరణి, ఎల్లారెడ్డి మండలం అడివిలింగాల జెడ్పీ పాఠశాల విద్యార్థిని సౌమ్య ప్రతిభా కనబర్చడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. గురువారం కామారెడ్డిలో వీరికి సర్టిఫికెట్లు, మెమోంటో అందజేశారు. పెండింగ్ వేతనాలు చెల్లించాలి కామారెడ్డి టౌన్: మూడు నెలల జీపీ కార్మికుల పెండింగ్ వేతనాలను చెల్లించాలని తెలంగాణ ప్రగతి శీల జీపీ వర్కర్స్ యూనియన్ నేత రమేశ్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలన్నారు. జీవో– 51 రద్దు చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. -
ప్రేమ వ్యవహారంలో బెదిరింపులు: యువకుడి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఒంటర్పల్లి గ్రామంలో ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించగా, విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు బెదిరింపులకు పాల్పడటంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన రాపర్తి సాయిలు–అంజవ్వ దంపతులకు ఓ కూతురు, కొడుకు శ్రీకాంత్(21) ఉన్నారు. వారం రోజుల క్రితం కూతురును తీసుకొని దంపతులిద్దరూ హైదరాబాదుకు బతుకుదెరువు కోసం వెళ్లారు. కొడుకు ఒక్కడే ఒంటర్పల్లిలో నివాసం ఉంటున్నాడు. శ్రీకాంత్ అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన యువతి మామ శ్రీకాంత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తన కొడుకు ఆత్మహత్యకు కారణం యువతి కుటుంబ సభ్యులే అని శ్రీకాంత్ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. గ్రామానికి ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, ఎస్సై వెంకట్రావు, పోలీసులు చేరుకొని ఇరువర్గాల వారిని సముదాయించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.