Kamareddy
-
‘కార్పొరేట్’కన్నా మెరుగు
● టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల బాగుంది ● టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్రెడ్డిబీబీపేట: ‘‘మండల కేంద్రంలోని టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాల బాగుంది. కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థల్లోనూ ఇలాంటి సదుపాయాలు ఉండవు’ అని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బీబీపేటలో తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి సుమారు రూ. 6 కోట్లతో నిర్మించిన టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆట స్థలం, సెమినార్ హాల్, గ్రంథాలయాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చాలామంది వందకు వంద శాతం హాజరు కావడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఉత్తమ ఫలితాల కోసం కృషి చేస్తున్న పాఠశాల హెచ్ఎం రవీంద్రారెడ్డిని, ఉపాధ్యాయ బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల భవనం కోసం సుభాష్రెడ్డి రూ. 6 కోట్లు వెచ్చించారని, దీనికి ప్రతిఫలంగా ఆయన విద్యార్థుల బంగారు భవిష్యత్ను మాత్రమే ఆశిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు తాగడానికి మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ప్రతి గ్రామంలో ఖేల్ కూద్.. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఖేల్ కూద్ నిర్వహించడానికి జనగామ గ్రామమే నాంది అవుతుందని జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. జనగామలో తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్లో ఆయన పాల్గొని క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని, క్రీడాభివృద్ధికి తోడ్పాటునివ్వాలని సూచించారు. కొంతమంది డ్రగ్స్, మద్యపానానికి అలవాటు పడుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సుభాష్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారి దృష్టిని క్రీడలపైకి మళ్లించేందుకు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి స్పోర్ట్స్ విలేజ్గా తీర్చిదిద్దుతానన్నారు. అనంతరం క్రీడల్లో సత్తాచాటిన వారిని సత్కరించారు. కార్యక్రమంలో జర్నలిస్టు తెలంగాణ విఠల్, ఆయా గ్రామాల సర్పంచులు మట్ట శ్రీనివాస్, రాజేష్, హరీష్, ఉపసర్పంచ్ స్వామి, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
హాస్టళ్లలో వసతులు కల్పించాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో మౌళిక వసతులు కల్పించాలని, విద్యార్థుల భద్రతకోసం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు చరణ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం ఏబీవీపీ నాయకులు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ విక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో హాస్టల్ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వారి ప్రాణాలకు భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో వరుసగా విద్యార్థులు మరణిస్తున్నా, హాస్టళ్లపై దాడులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. బాలికల హాస్టళ్లకు ప్రహరీ గోడలు, కిటికీలు, సీసీ కెమెరాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. ప్రభుత్వం స్పందించి భద్రత చర్యలు తీసుకోకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కౌశిక్, అక్షయ్, అజార్, శివ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోఆప్షన్’కు 17 నామినేషన్లు
● నేటి సాయంత్రంతో ముగియనున్న గడువుకామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ స భ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలతో ప్రక్రియ ముగియనుంది. మంగళవారం నాటికి మొత్తం 17 నామినేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. సోమవారం రెండు దరఖాస్తులు రాగా, మంగళవారం ఒక్కరోజే 15 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇప్పటివరకు మైనారిటీ విభాగం నుంచి 12 మంది (ఏడుగురు పురుషులు, ఐదుగురు మహిళలు) నామినేషన్ వేయగా, జనరల్ (నాన్ మైనారిటీ) విభాగంలో 5 నామినేషన్లు (ఒకరు పురుషుడు, నలుగురు మహిళలు) వచ్చాయి. కోఆప్షన్ సభ్యత్వాలకు నామినేషన్ దాఖలు గడువు బుధవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుంది. -
పురపాలన ముందుకు సాగేదెలా?
జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ అయిన కామారెడ్డిలో అధికారుల కొరత వేధిస్తోంది. కీలక విభాగాల్లో పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ప్రజలకు సరైన సేవలు అందడం లేదు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి వ్యవహారశైలి వివాదాస్పదమైంది. ఆయన విధుల్లోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ గత నెలలో జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్డీవో గిరికి మున్సిపల్ కమిషనర్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఆయన తన రెగ్యులర్ విధుల్లో బిజీగా ఉంటుండడంతో బల్దియాపై ఫోకస్ చేయలేకపోతున్నారు. పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం పాలనపై ప్రభావం చూపుతోంది. అస్తవ్యస్తంగా టౌన్ ప్లానింగ్.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ టీపీవో గిరిధర్ను సైతం మార్చి 28న కౌన్సిల్ సభ్యులు సొంత శాఖకు సరెండర్ చేస్తూ తీర్మానం చేశారు. అయితే ఈ సరెండర్ వ్యవహారం ఇంకా ఎటూ తేలడం లేదు. ఆయన విధులకు కూడా హాజరు కావడం లేదు. టీపీఎస్ కావ్య కూడా దాదాపు 25 రోజులుగా సెలవులో ఉన్నారు. ఆమె ఇక్కడ విధులు నిర్వహించడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇద్దరు టీపీవోలు, నలుగురు టీపీఎస్లు, నలుగురు టీపీబీవోలు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఇద్దరు టీపీబీవోలతోనే విభాగాన్ని నెట్టుకొస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉండడంతో పర్యవేక్షణ కరువవుతోంది. జిల్లా కేంద్రంలో యథేచ్ఛగా అక్రమ కట్టడాలు వెలుస్తూనే ఉన్నాయి. నోటీసులు జారీ చేసిన 47 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఫైళ్లు పెండింగ్లోనే మూలుగుతున్నాయి. రెవెన్యూ ఆదాయంపై తీవ్ర ప్రభావం.. రెవెన్యూ విభాగం అధికారి (ఆర్వో) రవిగోపాల్ రెండు నెలలుగా సెలవులో ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. మేనేజర్ఏక ఆర్వో అదనపు బాధ్యతలు ఇచ్చారు. రెగ్యులర్ ఆర్వో లేకపోవడంతో పన్ను వసూళ్లలో లక్ష్యం చేరుకోలేకపోయారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇంకా సగం పన్నులు వసూలు కావాల్సి ఉంది. 122 మున్సిపల్ దుకాణాల అద్దెలు, పన్నుల వసూళ్లు సైతం నిలిచిపోయాయి. ఆర్వో లేకపోవడంతో 49 వార్డుల ఆఫీసర్లపై పర్యవేక్షణ కరువైంది. ఇంజినీరింగ్ విభాగంలో రెండు ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అన్ని ప్రధాన విభాగాలలో ఇన్చార్జీల పాలన కొనసాగుతుండడంతో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రజలకు సకాలంలో సరైన సేవలు అందడం లేదు. దీంతో ప్రజలకు సమాధానం చెప్పలేక కౌన్సిలర్లు సైతం ఇబ్బందిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి అధికారులను నియమించి కామారెడ్డి బల్దియాలో పాలనను పట్టాలెక్కించాలని ప్రజలు కోరుతున్నారు.కామారెడ్డి మున్సిపాలిటీలో పాలన గాడి తప్పుతోంది. పలు విభాగాలకు పూర్తిస్థాయి అధికారులు లేకపోవడంతో ఇన్చార్జీలతోనే నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఫలితంగా సరైన పర్యవేక్షణ లేక పురపాలన, అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. – కామారెడ్డి టౌన్బల్దియా సానిటరీ విభాగం రెగ్యులర్ అధికారులు లేక అనాథగా మారింది. సానిటరీ ఎస్సై పర్వేజ్ను బదిలీ చేయడం, మరో సానిటరీ ఎస్సై నగేశ్పై విధుల్లో నిర్లక్ష్యం కారణంగా వేటు పడడంతో పర్యవేక్షణ కరువయ్యింది. ప్రస్తుతం వాటర్వర్క్స్ ఉద్యోగి శ్యామ్, బిల్ కలెక్టర్ డేవిడ్ రాజ్లకు పాత, నూతన పట్టణాల ఇన్చార్జి సానిటరీ ఎస్సై బాధ్యతలు అప్పగించారు. వీరికి ఈ విభాగంపై అవగాహన లేకపోవడంతో పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్నాయి. చెత్త సేకరణ ఆటోలు, ట్రాక్టర్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునేవారు కరువయ్యారు. కీలక విభాగాలకు పూర్తిస్థాయి అధికారులు కరువు ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్న వైనం కమిషనర్ సరెండర్తో ఆర్డీవోకు పాలన పగ్గాలు ఆర్వో లేకపోవడంతో మేనేజర్కు అదనపు బాధ్యతలు ఇతర విభాగాల్లోనూ ఇదే పరిస్థితి -
కొనుగోళ్లను వేగవంతం చేయాలి
రామారెడ్డి: జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం గోకుల్తండాలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ధాన్యం సేకరణలో పాల్గొంటున్న అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు త్వరగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 35,300 మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేశామని అధికారులు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా సివిల్ సప్లైస్ అధికారి శ్రీకాంత్, ఐకేపీ అధికారులు పాల్గొన్నారు. -
మందే ముందు!
● ఫంక్షన్లు, పండుగల్లో తప్పనిసరి ● అశుభ కార్యాల్లో ‘చేదిడుసుడు’ పేరుతో.. ● సుట్టమొచ్చినా, దోస్తు కలిసినా తాగుడేతాగుడు ● జిల్లాలో ఏటేటా పెరుగుతున్న మద్యం విక్రయాలు ● నాలుగేళ్లలో రూ. 2,200 కోట్ల మద్యం అమ్మకంఅది శుభకార్యమైనా.. అశుభకార్యమైనా.. పండుగైనా, పబ్బమైనా మద్యం ఉండాల్సిందే.ఇంటికి సుట్టమొచ్చినా.. బయట దోస్త్ కలిసినా బాటిల్ మూత విప్పాల్సిందే. ఆనందమొచ్చినా.. బాధేసినా మందు పొంగాల్సిందే. ఎవరైనా చనిపోతే సావుకు పోయిరాంగ చేదు ఇడవాలంటూ సుక్క వేయాల్సిందే. సందర్భమేదైనా తాగడం మాత్రం సర్వసాధారణమైంది. జిల్లాలో మందుబాబులు నాలుగేళ్లలో రూ. 2,200 కోట్ల మద్యం తాగడం గమనార్హం. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిజిల్లాలో మద్యం అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతూనే ఉన్నాయి. నాలుగేళ్ల కాలంలో రూ.2,200 కోట్ల విలువైన మద్యం తాగేశారు. లెక్కకు రాని మద్యం కూడా ఉంటుంది. ఉన్నత వర్గాల వారు డిఫెన్స్ క్యాంటీన్ల నుంచి అలాగే విదేశీ మద్యం తెప్పించుకుంటారు. అది కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. సరిహద్దు ప్రాంతాల్లో పొరుగు రాష్ట్రాలనుంచి మద్యం వస్తుంటుంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రల్లో తక్కువ ధరకు లభించే దేశీదారు కొన్ని ప్రాంతాల్లో దొంగచాటుగా అమ్ముతుంటారు. తాగడానికి నీళ్లు దొరకని ఊళ్లుండొచ్చు గానీ మందు దొరకని గ్రామం ఉండదని చెబుతారు. ఊరూరా తెరుచుకున్న బెల్ట్ షాపులతో కావలసినంత మద్యం అందుబాటులోకి రావడంతో వైన్షాప్ల కోసం వెదకాల్సిన పనిలేకుండాపోయింది. కొన్ని గ్రామాల్లో అయితే ఫోన్ చేస్తే చాలు ఉన్న దగ్గరికి మందు బాటిల్ వస్తోంది. తాగడానికి కావలసిన స్టఫ్, ఫుడ్ కూడా ఆర్డర్ ఇస్తే లొకేషన్కు చేరుకుంటోంది. దీంతో మద్యం అమ్మకాలు మూడు సీసాలు, ఆరు గ్లాసుల్లా నడుస్తోంది.స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత అందరూ సామాజిక మాధ్యమల్లో యాక్టివ్గా ఉంటున్నారు. దోస్తు పుట్టిన రోజు, పెళ్లిరోజు ఉందంటే చాలు అందరూ గ్రీటింగ్స్ తెలుపుతున్నారు. చీకటి పడకముందే దోస్తులంతా కలిసి వెళ్లి కేక్ కట్ చేయిస్తున్నారు. దోస్తులంతా కలిసి మందుపార్టీలు చేసుకోవడం కామన్ అయ్యింది. అలాగే బర్త్డే పార్టీల్లో యువత హంగామా చేస్తున్నారు. రాత్రంతా తాగి తూగుతున్నారు.సంవత్సరం అమ్మకాలు(రూ.కోట్లలో) 2022 529.30 2023 549.60 2024 558.79 2025 560.59 -
జనగణనను సమర్థవంతంగా నిర్వహించాలి
నాగిరెడ్డిపేట: వచ్చేనెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని డీఈవో రాజు సూచించారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రం గోపాల్పేట మోడల్స్కూల్లో జనగణన ఎన్యుమరేటర్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను జనగణన ప్రక్రియలో పాటించాలని సూచించారు. పూర్తి వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. ఆయనవెంట ఆర్ఐ మహేశ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లా వ్యాప్తంగా మంగళవారం 58 మందికి శిక్షలు పడ్డాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని పోలీసులు ఆయా కోర్టులలో హాజరుపరచగా.. నలుగురికి రెండు రోజులు, మరో నలుగురికి ఒక రోజు జైలు శిక్షలతో పాటు మొత్తం 58 మందికి కలిపి రూ.75 వేలు జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని కోరారు. కామారెడ్డి అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద ఇంగ్లిష్ మీడియం 3, 5, 8 తరగతులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని 208వ నంబర్ గదిలో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి టౌన్ : ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కీలక పాత్ర పోషించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. మంగళవారం కామారెడ్డి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని రాజానగర్ అంగన్వాడీ కేంద్రంలో ’పోషణ్ మాసోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం పీడీ ప్రమీల మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. పిల్లలను సెల్ఫోన్లకు దూరంగా ఉంచి ఆరోగ్యంగా పెంచాల్సిన బాధ్యత తల్లులపై ఉందన్నారు. కార్యక్రమంలో సీడీపీవో పద్మ, సూపర్వైజర్ కవిత, కౌన్సిలర్లు భానుప్రకాష్, డీసీ ప్రసాద్, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
తాడ్వాయి: మక్క, జొన్నల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో మంగళవారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తాడ్వాయిలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విఠల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పంటను వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. యాప్ ద్వారా యూరియా బుకింగ్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారి మీదుగా తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, తహసీల్దార్ శ్వేతకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో బీకేఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, నాయకులు రవీందర్రావు, సంతోష్రెడ్డి, వెంకట్రావు, రాజిరెడ్డి, భుజంగ్రావు, విఠల్రెడ్డి, గంగారెడ్డి, రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ. 2.50 లక్షల విరాళం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని మత్తడి పోచమ్మ ఆలయ నిర్మాణానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది మోహిన్ హమ్మద్ ఖాద్రీ రూ.2.50 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ నిర్మాణం కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. అందులో భాగంగా మొదటి విడతగా మంగళవారం కుటుంబ సభ్యుడు ఖాసీఫ్ రూ. 2.50 లక్షలు ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు అశోక్, ఉపసర్పంచ్ ప్రసాద్గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: విద్యతోనే సమాజ చైతన్యం సాధ్యమవుతుందని ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అక్కినపల్లి పున్నయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో నిర్వహించిన మహనీయుల జయంతి ఉత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవ జీవన పరిణామ క్రమంలో అనేక రూపాల్లో వివక్ష, అణచివేత ఉండేదని అన్నారు. ఆ వివక్ష, అణచివేతలకు పరిష్కార మార్గాలు చూపిన మహనీయులు మన అందరికి ఆదర్శమన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, ఏపీఆర్వో సరిత, అధ్యాపకులు పాల్గొన్నారు. భిక్కనూరు: క్షయ వ్యాధిగ్రస్తులకు క్రమం తప్పకుండా తెమడ పరీక్షలను నిర్వహించి వైద్య సహకారం అందించాలని జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి ప్రదీప్ అన్నారు. మంగళవారం భిక్కనూరు పీహెచ్సీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో ఉన్న క్షయ వ్యాధిగ్రస్తులను కలిసి వారిని వైద్యం అందించడంతో పాటు దోమకొండ ఆస్పత్రిలో ఎక్స్రే తీయించాలని సూచించారు. వైద్యులు యెమిమా, ఎంపీహెచ్ఈవో వెంకటరమణ ఉన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ స్టేజీ వద్ద గల మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో అర్హులైన ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శోభారాణి తెలిపారు. ఇంటర్ సెకండియర్ పూర్తి చేసిన బాలికలు నేరుగా కళాశాలకు వచ్చి సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు. టెన్త్, ఇంటర్లతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు జిరాక్స్, మూడు పాస్ సోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలన్నారు. -
సంక్షిప్తం..
కామారెడ్డి టౌన్: తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తానని యూనివర్సిటీ పాలకమండలి నూతన సభ్యుడు మహమ్మద్ ఘాజీ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాల లో ఆయనకు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్య ల పరిష్కారానికి ప్రభుత్వం, విశ్వవిద్యాలయానికి మధ్య వారధిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రిన్సిపల్ ఎస్కే రషీద్, కిషన్, బీమాగౌడ్, బీఈడీ విద్యార్థులు పాల్గొని ఘాజీని సన్మానించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాలలో 970 మార్కులు సాధించి నాగిరెడ్డిపేట మండల టాపర్గా నిలిచిన మాల్తుమ్మెదతండాకు చెందిన హారికను మంగళవారం స్థానిక ఎస్సై భార్గవ్గౌడ్ పోలీస్స్టేషన్లో ఘనంగా సత్కరించారు. హారికకు ఉద్యోగం వచ్చేవరకు ఆమె చదువులకు అయ్యే ఖర్చులను తానే భర్తిస్తానని ఈ సందర్భంగా ఎస్సై పేర్కొన్నారు. అనంతరం ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి రూ.3 వేల నగదును అందజేశారు. హెడ్ కానిస్టేబుల్ మనోహార్, కానిస్టేబుల్ అర్చన ఉన్నారు. కామారెడ్డి అర్బన్: రోజు రోజుకు భూతాపం పెరిగిపోతున్నందున పర్యావరణ సమతుల్యానికి ప్రతిఒక్కరు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా పర్యావరణ క్లబ్ సమన్వయకర్త విద్యాసాగర్ అన్నారు. మంగళవారం స్థానిక బీఎడ్ కళాశాల ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఊరేగింపు నిర్వహించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాసాగర్ విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. మొక్కుబడి కాకుండా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం తమవంతు విధిగా ఉండాలన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఎంఏ రషీద్, వైస్ ప్రిన్సిపల్ కిషన్ అధ్యాపకులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఏఈవోలు మంగళవారం పరిశీలిలంచారు. క్షేత్రస్థాయిలో తిరిగి పంట నష్టాన్ని అంచనా వేశారు. ఏఈవోలు వినోద్గౌడ్, లిఖిత్రెడ్డి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: విద్యార్థుల్లో సృజనాత్మకత, జ్ఞా నాత్మక నైపుణ్యాలను పెంపొందించడానికి చెస్ బో ర్డులను అందజేస్తున్నట్టు చెస్ నెట్వర్క్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సుధీర్ కోదాటి అన్నారు. మంగళవారం చిన్నమల్లారెడ్డి జెడ్పీహెచ్ఎస్కు సుధీర్ కోదాటి చెస్ బోర్డులను అందజేశారు. చెస్ నెట్వ ర్క్ అసోసియేషన్ ప్రతినిధి ఎస్.నారాయణ, హెడ్ మాస్టర్ సాయిరెడ్డి, వార్డు సభ్యులు, టీచర్లు, చెస్ వాలంటీర్ హెచ్.అరుణ్రావు పాల్గొన్నారు. -
కో– ఆప్షన్ పదవి ఎవరికో?
● ముఖ్య నేతల ప్రసన్నం కోసం చక్కర్లు కొడుతున్న ఆశావహులుబాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించి నెల పదిహేను రోజులు కావస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపైనే చర్చ కొనసాగుతోంది. కో–ఆప్షన్ ఎంపికపై రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. మున్సిపల్ రాజకీయంలో కొత్త దళం అడుగుపెట్టగా బాన్సువాడ పట్టణంలో స్థానిక లాబీయింగ్ మరింత ఊపందుకుంది. రెండు మూడు రోజుల్లో స్పష్టత.. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కని వారు నిరాశ పడకుండా ముఖ్య నాయకులు కో–ఆప్షన్ ఇస్తామని సర్ది చెప్పి పోటీ నుంచి తప్పించారు. కాంగ్రెస్ నాయకులు కొందరు కో–ఆప్షన్పై ఆశలు పెట్టుకున్నారు. అయితే గతంలో బాన్సువాడ మున్సిపాలిటీకి నాలుగు కో–ఆప్షన్ పదవులు కేటాయించారు. నాలుగు కో–ఆప్షన్ స్థానాల్లో రెండు మహిళలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆశావహులు మాత్రం పదుల సంఖ్యలో ఉన్నారు. కో–ఆప్షన్ పదవి కోసం ఇటు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ఆశీస్సుల కోసం ఆశావహులు చక్కర్లు కొడుతున్నారు. కో–ఆప్షన్ స్థానం మాజీ కౌన్సిలర్లకే అవకాశం ఇవ్వాలనే నిబంధన ఉంది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్గా ఉన్న కాసుల విజయ కుమారుడు కాసుల రోహిత్ మాజీ కౌన్సిలర్గా పని చేశారు. ప్రస్తుతం కాసుల విజయకు రాజకీయ అనుభవం లేకపోవడంతో కాసుల రోహిత్ కో–ఆప్షన్ ఇవ్వాలనే డిమాండ్ బలంగా ఉంది. ఇప్పటికే అభ్యర్థులు తమ అర్హతలు, పార్టీకి చేసిన సేవలు, స్థానికంగా ఉన్న ప్రభావాన్ని ప్రస్తావిస్తూ నేతల ప్రసన్నం కోసం పరస్పరం పోటీ పడుతున్నారు. మరి కో–ఆప్షన్ ఎవరిని వరిస్తుందో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కో–ఆప్షన్ కాకపోతే ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని పలువురు నాయకులకు నచ్చ చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఎస్జీటీని నియమించండి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ధర్మారావ్పేట్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీని నియమించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎంఈవో యోసెఫ్కు వార్డు సభ్యులు గౌస్, సాయిలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...పాఠశాలలో 125 మంది విద్యార్థులు ఉన్నారని, కేవలం నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారని, ఒక పీఈటీ, మరో ఇద్దరు విద్యావాలంటీర్లను నియమించి విద్యార్థులకు విద్యనందిస్తున్నామన్నారు. పీఈటీకి, ఇద్దరు వీవీలకు పేరెంట్స్ నుంచి ప్రతి నెలా డబ్బులు వసూలు చేసి వారికి వేతనాలు ఇవ్వాల్సి వస్తోందన్నారు. ఈ విధానం వల్ల ప్రతి నెలా ఇబ్బంది అవుతోందన్నారు. -
వైశాఖ ఉత్సవాల సందడి
రామారెడ్డి(ఎల్లారెడ్డి): ఇసన్నపల్లిలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం కాలభైరవ స్వామి ఆలయం వైశాఖ మాస ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. దేశంలో కాశీ, ఉజ్జయిని, కశ్మీర్ వంటి అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే దర్శనమిచ్చే కాలభైరవ స్వామి.. స్వయంభూవుగా కొలువుదీరడం ఈ ప్రాంత విశిష్టత వైశాఖ మాసం సందర్భంగా ఆలయంలో ప్రతి మంగళవారం స్వామివారికి నిర్వహించే అలంకారాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. పురాణ ప్రాశస్త్యం ప్రకారం ఈ నెలలో స్వామివారిని దర్శించుకోవడం అత్యంత ఫలదాయకమని భక్తుల నమ్మకం. మంగళవారం స్వామివారిని 108 రకాల పండ్లతో అలంకరించారు. వైశాఖ మాసంలో నిర్వహించే ఈ 108 రకాల అలంకారాలను చూడటం ఒక అదృష్టం అని ఆలయ అర్చకులు శ్రీనివాసశర్మ తెలిపారు. -
తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తాం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తెలంగాణ జాగృతి పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆ పార్టీ మండల అధ్యక్షుడు గరిడె భుజంగరావు అన్నారు. సంగోజీవాడి గ్రామంలో మంగళవారం ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, మహిళలు పార్టీలో చేరారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్పేట్, పద్మాజీవాడి, మర్కల్ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన అడ్లూర్ ఎల్లారెడ్డి సీహెచ్.రాజును మహ్మద్నగర్ మండలం గాలిపూర్కు, ధర్మారావ్పేట్లో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన లింగంపేట్ మండలం అయ్యపల్లికి, పద్మాజీవాడిలో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన ప్రశాంత్ను ధర్మారావ్పేట్కు, మర్కల్లో పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన స్రవంతిని గాంధారి మండలం కాయిత తండాకు బదిలీ చేసినట్లు ఎంపీడీవో సంతోష్కుమార్ తెలిపారు. మండలానికి వచ్చిన కార్యదర్శులు... అడ్లూర్ ఎల్లారెడ్డికి ఎస్.అనిత, పద్మాజీవాడికి కె.గంగాధర్, తుక్కోజీవాడికి ఎస్. రాజ్యలక్ష్మి, మర్కల్కు పి.నరేశ్, వజ్జపల్లి కుర్దుకు వై.రాములు వచ్చినట్లు తెలిపారు. వీరు మంగళవారం బాధ్యతలు స్వీకరించినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి అర్బన్: సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక బి– టాపర్ హైస్కూల్లో నాలుగు రోజుల పాటు హ్యాండ్స్ ఆన్ సైన్స్ వర్క్షాప్ నిర్వహించగా మంగళవారం ముగిసింది. ఉపాధ్యాయులు తమ బోధన నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించడానికి వర్క్షాప్ నిర్వహించినట్టు జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి తెలిపారు. ప్రతిభ చూపిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రతినిధులు ప్రవీణ్కుమార్, శ్రీకాంత్, సత్యానంద్, అమీర్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్ల శిక్షణ మంగళవారంతో ముగిసినట్లు అధికారులు తెలిపారు. జనగణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. కామారెడ్డి అర్బన్: రక్తదానం చేసే ప్రతి ఒక్కరు ప్రాణదాతలేనని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ కల్కి ఆలయంలో పలువురు రక్తదాతలకు హెల్మెట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించగా జిల్లా కార్యదర్శి నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు, ఐవీఎఫ్, కామారెడ్డి రక్తదాతల సమూహం జిల్లా ప్రతినిధులు చంద్రశేఖర్, సుధాకర్, వెంకటేష్, యెల్లంకి సుదర్శన్, ఈశ్వర్, విజయ్కుమార్, గంగరాజం, రమేష్, దిగంబర్ పాల్గొన్నారు. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండలం తుంకిపల్లిలో సోమవారం వేర్వేరు భరత్ పార్టీలలో అర్ధరాత్రి అధిక సౌండ్తో ప్రజలకు ఆటంకం కల్గించిన ఇద్దరు డీజే నిర్వహకులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపారు. -
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): వడదెబ్బ తగలకుండా ఉపాధి హామీ కూలీలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాసుల వద్ద కాపలాగా ఉంటున్న రైతులకు మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండలంలోని మోతె, పర్మళ్ల, భవానిపేట, లింగంపేట తదితర గ్రామాల్లో రైతులు, కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వడదెబ్బతో జ్వరం, వాంతులు, విరేచనాలు అవడం, గుండెపోటు, అస్వస్తతకు గురికావడం తదితర లక్షణాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. నీళ్లు ఎక్కువగా తాగాలని సూచించారు. -
ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూస్తా
కామారెడ్డి టౌన్/మాచారెడ్డి/బీబీపేట/దోమకొండ/భిక్కనూరు: నియోజకవర్గంలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తానని ఎ మ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి హామీ ఇచ్చా రు. మంగళవారం కామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు మండలాల పరిధిలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన చెక్కులను ఆయన అందజేశారు. ఆడపిల్లల పెళ్లిళ్లు పేద కుటుంబాలకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ సాయం అందుతుందని ఆయన తెలిపారు. బీజే పీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
ఎల్లారెడ్డి: ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి బస్టాండ్లో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఏమిలి అరుణ్ (45) అనే వ్యక్తి పండ్లు కొనుగోలు చేయడానికి ఎల్లారెడ్డి బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్లాడు. తిరిగి బయటకు వస్తున్న సమయంలో కామారెడ్డి నుంచి నిజాంసాగర్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతడిని ఢీకొన్నది. బస్సును డ్రైవర్ అతి వేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన అరుణ్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి సురేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లంలో ఉ న్న దత్తాత్రేయ మందిరం పీఠాధిపతి, ఆధ్యాత్మిక గురువు గంగారాం మహరాజ్(75) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బో ర్లం గ్రామంలోనే తుదిశ్వాస విడిచారు. గ్రామంలో తన సొంత నిధులు, భక్తులు అందించిన సహకారంతో దత్తాత్రేయ మందిరాన్ని నిర్మించారు. ఆయన మృతికి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పించారు. కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పట్టణ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేయగా వారి నుంచి రూ.7,590, సెల్ఫోన్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. -
మానసికంగా ఒత్తిడికి గురికావొద్దు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దని ప్రముఖౖ సెకియాట్రిస్టు రమణ అన్నారు. తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. మానసికంగా బాధపడుతున్న వారిని ప్రత్యేక చికిత్స, కౌన్సిలింగ్ ద్వారా నయం చేయవచ్చన్నారు. మానసిక రోగులను గుర్తించి జిల్లాకేంద్రంలో చూపించినట్లయితే ఉచితంగా సలహాలు, మందులను ఇస్తారన్నారు. ప్రిన్సిపల్ సురేఖ, సైకియాట్రిస్టు రాహుల్, దోమకొండ ఎస్సై దీపిక, తదితరులు పాల్గొన్నారు. -
రోటరీ సేవా కార్యక్రమాలు అభినందనీయం
● అదనపు కలెక్టర్ మధుమోహన్కామారెడ్డి టౌన్: సమాజంలో వెనుకబడిన వర్గాల కు, దివ్యాంగులకు అండగా నిలుస్తూ రోటరీ క్లబ్ సే వా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అ దనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. మంగళవా రం గర్గుల్లో ‘పీపుల్ ఫర్ ఇండియా’ స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు వీల్ చైర్లు, బె డ్లు, కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థినుల కు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మహిళలకు స్వ యం ఉపాధి లభించడం హర్షించదగ్గ విషయమన్నారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ఎం. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క రూ ఇలాంటి సేవల్లో భాగస్వాములు కావాలని పి లుపునిచ్చారు. ఎంఈవో ఆనంద్ రావు, గ్రామ స ర్పంచ్ దివ్య, పీఎఫ్ఐ వైస్ ప్రెసిడెంట్ అరవింద్, రో టరీ క్లబ్ ప్రెసిడెంట్ శంకర్, సభ్యులు పాల్గొన్నారు. -
హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో ఈ నెల 24న సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న గాంధీ గంజ్ బస్తీ హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బస్తీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిలువేరు మారుతి, కళ్యాణ్లు కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్, గాంధీ గంజ్, అయ్యప్ప నగర్, గాంధీ నగర్, గోదాం రోడ్డు తదితర ప్రాంతాలలో వారు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తూ, జెండాలను కడుతూ సమ్మేళనంపై ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంద ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో దేశవ్యాప్తంగా బస్తీ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఎల్లారెడ్డిరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. మంగళవారం మత్తమాల, మాచాపూర్ గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్, సర్పంచ్లు శ్రీనివాస్గౌడ్, విజయ్ కుమార్ తదితరులున్నారు. ధాన్యం సేకరణలో ఇబ్బందులు రానీయద్దు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ధాన్యం సేకరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని నాగిరెడ్డిపేట తహసీల్దార్ భిక్షపతి సూచించారు. తాండూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. కొనుగోలుకేంద్రంలో తగిన ఏర్పాట్లు చేయాలని సొసైటీ సీఈవో చంద్రమురళీని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభం నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గిర్నితాండ గ్రామ పంచాయతీలో మంగళవారం ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు సవాయిసింగ్, సంతోష్ రాథోడ్, పంచాయతీ కార్యదర్శి గౌరి తదితరులు ఉన్నారు. -
ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి
కామారెడ్డి టౌన్: ప్రజలకు అత్యవసర సమయంలో అంబులెన్స్ ద్వారా మరింత వేగంగా, నాణ్యమైన సేవలు అందించాలని 108, 102, 1962, నియోనెటల్ అంబులెన్స్ల జిల్లా క్వాలిటీ ఆడిటర్ ఎస్కే ఫయాజ్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలో అంబులెన్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వాహనాల్లోని ఔషధాల నిల్వలు, మెడికల్ పరికరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అంబులెన్సుల కండిషన్ బాగుండాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా మేనేజర్ తిరుపతి, పైలట్లు విజయ్, రోహిత్, ఈఎంటీలు కృష్ణస్వామి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలలో గ్యాడ్యుయేషన్ డే
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలలో సోమవారం గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పట్టాలను సీడీపీవో ప్రసన్న అందించారు. సూపర్వైజర్లు హారతి, అంగన్వాడీ టీచర్ నీలారాణి తదితరులున్నారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు సోమవారం ఫిజియోథెరపి క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఈఆర్పీ కమల్ కిషోర్ మాట్లాడుతూ.. ఫిజియోథెరపి క్యాంపులో భాగంగా ఇక్కడికి వచ్చిన వైద్యురాలు సారిక ఇంటి వద్ద చేసే వ్యాయామం గురించి దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించారు. నిజామాబాద్ అర్బన్: పోలీస్ ప్రజావాణి కార్య క్రమంలో భాగంగా సోమవారం 34 ఫిర్యాదు లు స్వీకరించినట్లు సీపీ సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సీపీని కలిసి తమ సమస్యలను విన్నవించారు. వెంటనే సంబంధి త పోలీసు అధికారులతో మాట్లాడి సమస్యల ను పరిష్కరించాలని ఆదేశించారు. భిక్కనూరు: తన భార్యను ప్రజాప్రతినిధి వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ యువకుడు వాటర్ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన ఘటన భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ రమేశ్ ఓ వివాహితను కొన్నిరోజులుగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె విషయాన్ని తన భర్తకు తెలిపింది. మానసిక ఆవేదనకు గురైన యువకుడు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో వాయిస్ మెసేజ్ పెట్టి వాటర్ ట్యాంక్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సదరు యువకుడిని సముదాయించి కిందకు దించారు. అనంతరం వివాహిత ఫిర్యాదు మేరకు ఉపసర్పంచ్పై కేసు నమోదు చేశామని ఎస్సై వివరించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు సోమవా రం ప్రశాంతంగా జరిగినట్లు అడకమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధి లో ఏర్పాటు చేసిన మొత్తం 29 పరీక్ష కేంద్రాల లో 5,375 మంది విద్యార్థులకు 5,183 మంది హాజరుకాగా 192 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖ ర్ తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్కు అవకాశం ఇవ్వొద్ద ని ఇన్విజిలేటర్లకు సూచించారు. -
కార్పెంటర్ షాప్లపై అటవీశాఖ అధికారుల దాడులు
కమ్మర్పల్లి(భీమ్గల్) : భీమ్గల్ మండలం మెండోర గ్రామంలోని కార్పెంటర్ వర్క్స్ షాప్లపై అటవీశాఖ బాసర సర్కిల్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపతోపాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వర్క్ షాప్ యజమానులపై కేసులు నమోదు చేసి విచారణ జరుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దాడుల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సభ్యులు అనిత, ఇతర సిబ్బందితోపాటు కమ్మర్పల్లి రేంజ్ అధికారులు ఎఫ్ఆర్వో రవీందర్, డీఆర్వోలు శ్రీనివాస్, దేవీదాస్, సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన అక్కనపల్లి శివరాం(58)అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ సోమవారం తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం శివరాం తన భూమిలో ఉన్న ఎర్రజొన్న సొప్పను తగలబెడుతున్నాడు. ప్రమాదవశాత్తు బోరుబావికి చెందిన పానెల్ బోర్డుకు మంటలు వ్యాపిస్తుండగా అందులోనుంచి కరెంటు వైర్లు తీసేందుకు శివరాం ప్రయత్నించాడు. అదే సమయంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడిక్కకడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
● మక్క, జొన్న రైతులను ఆదుకోవాలి ● భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ ● గాంధారిలో రాస్తారోకోగాంధారి: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మక్క, జొన్న రైతులను ఆదుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో సోమవారం మండల కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా విఠల్రెడ్డి మాట్లాడుతూ యాసంగి సీజన్కు సంబంధించిన మక్కలు, జొన్నలు చేతికి వచ్చాయని, ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో కొందరు రైతులు పంటను దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. మక్కలకు మద్దతు ధర క్వింటాలుకు రూ. 2,400, జొన్నలకు రూ. 3,700 ఉండగా.. దళారులు మక్కలకు రూ. 1,800, జొన్నలకు రూ. 2 వేలే చెల్లిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. యూరియా బుకింగ్ యాప్ను రద్దు చేసి రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో బీకేఎస్ నాయకులు శంకర్రావు, రావుసాహెబ్ రావు, మాధవరావు వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. -
నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అధికారులు సూచించారు. సోమవారం జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లను అధికారులు పరిశీలించారు. తాజా కూరగాయలు వాడాలని, మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించారు. – సాక్షి నెట్వర్క్ఎల్లారెడ్డి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో వాష్రూంలను పరిశీలిస్తున్న ఎంపీడీవో ప్రకాష్భిక్కనూరు గురుకుల పాఠశాలలో వంటగదిని పరిశీలిస్తున్న ఎంఈవో రాజ్గంగారెడ్డి -
దేశ సంక్షేమం, ధర్మ సంరక్షణ బీజేపీకే సాధ్యం
● బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డిభిక్కనూరు: దేశ సంక్షేమం, ధర్మ సంరక్షణ బీజేపీకే సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి అన్నారు. సోమవారం రాజంపేట మండలం బసన్నపల్లిలో పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి ఆయన బీజేపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరడం అభినందనీయమన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని అప్పుడే అవినీతి అక్రమాలకు చెక్ పెట్టవచ్చన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని గ్రామాల్లో విజయదుందుబి మోగించాలని, ప్రతి కార్యకర్త మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, రాజంపేట మండలాధ్యక్షుడు సంపత్రెడ్డి, లింగంపెట బీజేపీ మండలాధ్యక్షుడు క్రాంతికుమార్, తాడ్వాయి మండలాధ్యక్షుడు సంతోష్రెడ్డి, ఎల్లారెడ్డి రూరల్ అధ్యక్షుడు నర్సింలు, బీజేపీ నేతలు గంగారెడ్డి, భాస్కర్రెడ్డి, యోగా రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు
బోధన్టౌన్(బోధన్): బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా ఉంటుందని డీహెచ్ ఈడబ్ల్యూ జిల్లా సమన్వయకర్త స్వప్న హెచ్చరించారు. పట్టణంలోని రాకాసీపేట్, గాంధీగర్నగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్లలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సఽందర్భంగా స్వప్న మాట్లాడుతూ బాల్య వివాహాలతో అనేక అనర్థాలు జరుగుతాయని, ఆడపిల్లల చదువు కుంటుపడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. మహిళలంతా ఏకమై బాల్య వివాహాలను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్వైజర్ రాధిక, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
జొన్నలు కొనుగోలు చేయాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తాలో సోమవారం భారత్ కిసాన్ సంఘం ఆ ధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేయాలని రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి పండించిన జొన్నలు అకాల వర్షాలకు తడిసిపోతున్నాయని వాపోయారు. వెంటనే జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గంట సేపు రోడ్డుపై బైఠాయించా రు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ రాజశేఖర్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి 4 రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి లింగంపేట(ఎల్లారెడ్డి): మోతె గ్రామంలో జొన్న, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సోమవారం మార్కుఫెడ్ డీఎం శశిధర్రెడ్డికి మోతె గ్రామ రైతులు వినతిపత్రం అందజేశారు. రైతులు వజీర్ అశోక్రావు, రాజిరెడ్డి, పందిరి రవి, రమేశ్, సుధాకర్గౌడ్, మహిపాల్రెడ్డి గదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్లో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): జొన్న, మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతులకు మద్ధతుగా సోమవారం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యూరియా యాప్ను ఏర్పాటు చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వెంటనే యాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. బీకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ రావు, మండల అధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
తల్లి అంత్యక్రియలు నిర్వహించిన కూతురు
రుద్రూర్: రుద్రూర్లో ఓ కూతురు తన తల్లికి అంతిమ సంస్కారాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటమ్మ (80) అనే వృద్ధురాలికి కూతురు కవిత తప్ప మరెవరూ లేరు. తల్లి ఆరోగ్యం క్షీ ణించడంతో కవిత తన అత్తవారిని ఒప్పించి రెండు నెలలుగా సేవలందించింది. సోమవా రం వెంకటమ్మ మృతి చెందగా స్థానిక సంప్రదాయం ప్రకారం కవిత అంతిమ సంస్కారా లు నిర్వహించింది. మృతదేహాన్ని ఖననం చే సి తల్లికి వీడ్కోలు పలికింది. కూతురు చూపి న మానవత్వం, తల్లిపట్ల ఉన్న మమకారాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. -
బసవేశ్వరుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి
జిల్లా కేంద్రంలో బసవేశ్వరుడి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు తాడ్వాయి మండలం చిట్యాలలో..వీరశైవ లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు చోట్ల సోమవారం మహాత్మా బసవేశ్వర మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వరుడి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే కుల వ్యవస్థ నిర్మూలనకు, అంటరానితనంపై పోరాటం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. సమాజంలో సమానత్వం కోసం ఆయన చేసిన కృషి వల్లనే ఆయన మహాత్ముడయ్యాడని అన్నారు. ప్రతి ఒక్కరూ బసవేశ్వరుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. – సాక్షి నెట్వర్క్ -
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కామారెడ్డి టౌన్ : మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. కామారెడ్డి పెద్దబజార్లోని కేఆర్కే ట్రైనింగ్ సెంటర్లో స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్కూల్ యూనిఫాం స్టిచ్చింగ్పై ఏర్పాటు చేసిన నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి శిక్షణలు మహిళలకు స్థిరమైన ఉపాధిని కల్పిస్తాయని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షక్షులు మహిళలకు యూనిఫాం కొలతలు, కటింగ్, స్టిచ్చింగ్, క్వాలిటీ అంశాలపై ప్రాక్టికల్గా శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో ఏపీఎం రాజేందర్, కోఆర్డినేటర్ సాయిలు, కేఆర్కే ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల సంఘం జిల్లా కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. 18 కమిటీ సభ్యు ల స్థానాలకు ఒక్కొ క్క నామినేషనే రావ డంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి విజయ భాస్కర్ ప్రకటించారు. అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా డి.శరత్, కోశాధికారిగా జి.రాజు, ఉపాధ్యక్షులుగా బి.రేఖ, యాదగిరి, బి.ప్రవీణ్ కుమార్, జాయింట్ సెక్రటరీలుగా ఎస్బీ కవిత, పార్థసారథి, యూ.వెంకటేశ్వర్లు, జనరల్ కౌన్సిల్ సభ్యులుగా సీహెచ్ విజయ్రాజ్, ఎస్.మధుసూదన్, ఎస్.జ్యోతి, కార్యవర్గ సభ్యులుగా శివప్రసాద్, శ్రీనివాస్, గౌతమి, సంగీత్కుమార్, మౌనిక, సమీనా ఎన్నికయ్యారు. కామారెడ్డి క్రైం : మద్యం మత్తులో వాహనాలు నడిపితే జైలు పాలు కావాల్సి వస్తుందని ఎస్పీ రాజేశ్ చంద్ర ఓ ప్రకటనలో హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడిన 80 మందిని సోమవారం జిల్లాలోని కోర్టులలో హాజరు పరచగా.. వారికి మొత్తం రూ. 1,22,400 జరిమానా విధించారని పేర్కొన్నారు. ఇందులో ఆరుగురికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించించని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జిల్లాలో తనిఖీలు మరింత విస్తృతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం సోమవారం రెండు దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. మాజీ మహిళా కౌన్సిలర్ పిడుగు మమతతో పాటు మైనారిటీ నాయకుడు సలీం దరఖాస్తులను సమర్పించారన్నారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందని తెలిపారు. మొత్తం నాలుగు కోఆప్షన్ పదవులకోసం నోటిఫికేషన్ జారీ కాగా.. ఇందులో రెండు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఒక స్థానానికి ఒక దరఖాస్తు చొప్పున నాలుగు దరఖాస్తులే వస్తే ఏకగ్రీవమైనట్లు ప్రకటిస్తారు. నాలుగుకన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తే కౌన్సిల్ సభ్యుల సమక్షంలో ఎన్నిక నిర్వహిస్తారు. ప్రస్తుతం కామారెడ్డి కౌన్సిల్లో కాంగ్రెస్కు 22 మంది, బీజేపీకి 16 మంది, బీఆర్ఎస్కు 11 మంది సభ్యులున్నారు. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. కోఆప్షన్ పదవులనూ ఆ రెండు పార్టీలే పంచుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలో మే 1 నుంచి జూన్ 7 వరకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ఇందుకు అర్హులైన సీనియర్ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, పీడీలు, పీఈటీలు ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి రంగ వెంకటేశ్వరగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన కోచ్, సహాయ కోచ్లకు నెలకు రూ. 7,500, ఖేలో ఇండియా కోచ్లకు రూ.5 వేల ప్రోత్సాహకం ఇస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 24 సాయంత్రం 5 గంటల లోపు కలెక్టరేట్లోని 223వ నంబర్ గదిలో అందజేయాలని సూచించారు. -
ఖాళీ ఖజానాతో గట్టెక్కేదెట్ల?
కామారెడ్డి టౌన్ : ‘‘కామారెడ్డి మున్సిపల్ ఖజానా ఖాళీగా ఉంది. ఆదాయానికి మించి ఖర్చులున్నాయి. ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్న ఖర్చుల వల్ల రూ. కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఇలాగైతే పట్టణాన్ని ఎలా అభివృద్ధి చేస్తాం? ప్రజలకు ఏం సమాధానం చెబుతాం?’’ అని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను, కౌన్సిలర్లను ప్రశ్నించారు. సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ సమక్షంలో బల్దియా సాధారణ సమావేశం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని, ప్రతి విభాగంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆదాయాన్ని పెంచుకోవాలి మొదట రెవెన్యూ విభాగానికి సంబంధించి అకౌంట్స్ ఆఫీసర్ రాములు వివరాలు వెల్లడించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ. 15.69 కోట్ల ఆస్తి పన్ను డిమాండ్కుగాను రూ. 9.10 కోట్లు వసూలైందని తెలిపారు. ప్రభుత్వ భవనాల నుంచి రూ. 8.51 కోట్లు రావాల్సి ఉందన్నారు. కాగా బల్దియా ట్రాన్స్కోకు రూ. 15.20 కోట్లు, కాంట్రాక్టర్లకు రూ. 30 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ ఏటా రూ. 9 కోట్ల ఆదాయం వస్తుంటే నెలకు రూ. 1.80 కోట్లు ఖర్చవుతున్నాయన్నారు. ట్రేడ్ లైసెన్స్లు, అడ్వర్టైజ్మెంట్లు, ఫ్లెక్సీల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని, అనవసర ఖర్చులకు చెక్ పెట్టాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిలదీత పట్టణంలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని సభ్యులు అధికారులను నిలదీశారు. ప్రస్తుతం 238 మంది కార్మికులు పనిచేస్తున్నారని మేనేజర్ రషీద్ వివరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సానిటేషన్లో 312, నాన్ పబ్లిక్ హెల్త్ విభాగంలో 87 మంది, ఇతర విభాగాలకు 91 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిన తీసుకోవాలని కౌన్సిల్ తీర్మానించింది. అనారోగ్యంతో ఉన్న లేదా 60 ఏళ్లు దాటిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించారు. డీజిల్ బిల్లులు పక్కదారి పట్టకుండా చూడాలని, బ్యాటరీ ఆటోలు కొనుగోలు చేసి చెత్త సేకరించాలని ఆదేశించారు. పారిశుద్ద్య వాహనాలకు జీపీఆర్ఎస్ సిస్టం బిగించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు.సమావేశంలో 30 ఎజెండా అంశాలతో పాటు 3 టేబుల్ ఎజెండా అంశాలపై చర్చించారు. చైర్పర్సన్ చాంబర్లో రూ. 1.90 లక్షలతో కంప్యూటర్, ప్రింటర్ కొనుగోలు చేసే అంశాన్ని తిరస్కరించారు. మిగిలిన అంశాలను కౌన్సిల్ ఆమోదించింది. స్టేషన్ రోడ్డులోని చిరు వ్యాపారుల కోసం మున్సిపల్ స్థలాల్లో దుకాణాలు నిర్మించడం, మున్సిపల్ మడిగెల అద్దెలు పెంచడం, కొత్త పొక్లెయిన్ కొనుగోలుపై తీర్మానాలు చేశారు. అత్యుత్సాహంగా అవగాహన లేకుండా మాట్లాడిన కొందరు సభ్యులకు ఎమ్మెల్యే తనదైన శైలిలో చురకలు అంటించారు. మహిళా కౌన్సిలర్లు అన్ని అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సమావేశం జరుగుతుండగా కొందరు సభ్యులకు ఫోన్లు వస్తున్నాయని, వచ్చే సమావేశం నాటికి కార్యాలయంలో జామర్ బిగించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సమావేశంలో ఇన్చార్జి కమిషనర్ గిరి, వైస్ చైర్పర్సన్ గోదావరి, వివిధ శాఖల అధికారులు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్యపై చర్చించారు. 90 కమ్యూనిటీ బోర్ల విద్యుత్ బిల్లులను తగ్గించే మార్గాలను చూడాలని అధికారులను ఆదేశించారు. అమృత్ జల్ పథకం కింద 9 ట్యాంకుల పనులను త్వరగా పూర్తి చేయాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సూచించారు. ఆదాయం రూ. 9 కోట్లు.. ఖర్చులేమో రూ. 20.95 కోట్లు.. అనవసర ఖర్చులు తగ్గించాలి.. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుదాం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బల్దియా సాధారణ సమావేశంలో సుదీర్ఘ చర్చ -
ముంచిన నకిలీ విత్తనాలు
బాన్సువాడ : నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచాయి. ఈ కారణంగా బాన్సువాడ ప్రాంతంలో సుమారుగా 1200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. బాన్సువాడకు చెందిన కొందరు రైతులతో పాటు హన్మాజీపేట్, నస్రుల్లాబాద్ మండలం మైలారం, దుర్కి, వర్ని మండలంలోని జలాల్పూర్ తదితర గ్రామాలకు చెందిన రైతులు కొత్త రకం విత్తనాలను సాగు చేయాలనే సంకల్పంతో పట్టణంలోని పాత అంగడిబజారు సమీపంలో ఉన్న ఓ ఫర్టిలైజర్ దుకాణంలో ధనలక్ష్మి సీడ్స్ కంపెనీకి చెందిన జేజీఎల్–1798 విత్తనాల బ్యాగులు కొనుగోలు చేశారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఈ విత్తనాలు వేస్తే అధిక దిగుబడులు వస్తాయని ఫర్టిలైజర్ వ్యాపారులు నమ్మబలికారు. ప్రభుత్వ అనుమతి పొందిన సీడ్స్ అని చెప్పి విత్తనాలను రైతులకు అంటగట్టారు. దీంతో రైతులు దిగుబడి బాగా వస్తే చాలని ధనలక్ష్మి సీడ్స్ బ్యాగులను కొనుగోలు చేశారు. నారుపోసి పంటలు సాగు చేశారు. చివరకు పంట కోత దశలోకి వచ్చే సరికి కొంత మేరలో ధాన్యం గింజలు ఎర్రబడటం, మరో కొంత భాగంలో ధాన్యం గింజలు పాలు తాగడం, మరో కొంత భాగం పొట్టదశలో ఉండడం జరిగింది. ఇలా మూడు దశలో పంట పూర్తిగా పొల్లు పోయింది. ప్రస్తుతం ఎకరానికి ఐదు క్వింటాళ్ల ధాన్యం వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. రైతులు కంగారు పడి విత్తనాలు కొనుగోలు చేసిన ఫర్టిలైజర్ వ్యాపారి వద్దకు వెళ్లి విషయం చెప్పడంతో జగిత్యాల నుంచి శాస్త్రవేత్తలను పిలిచి రైతుల పంటలను పరిశీలించారు. నష్టవాటిల్లిన పంటలను పరిశీలించి కొన్ని శ్యాంపిళ్లను ల్యాబ్కు పంపించారు. మాకు న్యాయం చేయాలని ఎరువుల దుకాణానికి వెళ్తే వ్యాపారి చేతులు దులుపుకుంటున్నారని రైతులు అంటున్నారు. కొత్త రకం సీడ్స్ అని చెప్పా రు. దిగుబడి బాగానే వ స్తుందని చెప్పడంతో జేజీఎల్–1798 విత్తనాలు వే శాం. పంట కోత దశలో పూ ర్తిగా పొల్లుపోయి ఎండిపోయింది. అగ్గిపెడితే కాలిపోతుంది. ఫర్టిలైజర్ వ్యా పారే మాకు ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలి. –నారాయణ, రైతు, బాన్సువాడ బాన్సువాడ చింతల్నాగారం శివారులో కొందరు రైతులు వేసిన పంటలు నష్టపోయినట్లు మా దృష్టికి వచ్చింది. ఈ విత్తనాలు సుమారు 1200 ఎకరాల్లో వేశారు. జగిత్యాల నుంచి శాస్త్రవేత్తలను పిలిపించాం. నష్టపోయిన పంటలను పరిశీలించి శ్యాంపిళ్లను సేకరించారు. ల్యాబ్కు పంపించారు. రెండు, మూడు రోజుల్లో రిపోర్టు రాగానే చర్యలు తీసుకుంటాం. –మిఫ్ట ఫైజుల్లా, ఏవో, బాన్సువాడ బాన్సువాడ ప్రాంతంలో 1200 ఎకరాల్లో వరి పంట నష్టం మూడు దశల్లో పంట పొల్లు పోవడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు చేతులు దులుపుకుంటున్న ఫర్టిలైజర్ యజమాని -
ఆర్టీసీలో సమ్మె సైరన్!
● సంస్థ రక్షణ, డిమాండ్ల సాధన కోసం పోరుబాట ● రేపటినుంచి సమ్మెలోకి..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో చాలాకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ రక్షణ, సమస్యల పరిష్కారమే ఎజెండాగా తెలంగాణ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఒత్తిడిలో కార్మికులు... కామారెడ్డి డిపోలో 129 బస్సులు, బాన్సువాడ డిపోలో 94, ఆర్మూర్ డిపోలో 94 బస్సులు, బోధన్లో 118, నిజామాబాద్–1 డిపోలో 123, నిజమాబాద్–2 డిపోలో 89 కలిపి మొత్తంగా 647 బస్సులు నడుస్తున్నాయి. బస్సులు దాదాపు రోజూ 2.50 లక్షల కిలోమీటర్ల దూరం తిరుగుతుండగా, రూ. కోటిన్నర ఆదాయం వస్తోంది. అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటలకు బదులు 12 నుంచి 16 గంటల దాకా పనిచేయిస్తున్నారని, స్పెషల్ ఆప్ కూడా ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. విరామం లేకుండా పనిచేయాల్సి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. మరోవైపు బస్సుల్లో 55 మంది ప్రయాణించాల్సి ఉండగా మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చాక వంద నుంచి 120 మంది దాకా ప్రయాణిస్తున్నారు. దీంతో కండక్టర్లతోపాటు డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల డ్రైవర్లకే టికెట్ ఇచ్చే బాధ్యత ఉండడంతో వాహనం నడుపుతూ టికెట్లు ఇవ్వాల్సి రావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిభారంతో కార్మికులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని పేర్కొంటున్నారు. సమరానికి సన్నద్ధం ఆర్టీసీని రక్షించుకోవడం, సమస్యలు పరిష్కరించుకోవాలన్న లక్ష్యంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమరానికి సన్నద్ధమయ్యారు. బుధవారంనుంచి సమ్మెలో పాల్గొనేందుకు ఆయా డిపోల పరిధిలోని కార్మికులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ తాము ఎందుకు సమ్మెకు వెళాల్సి వస్తోందో వివరిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి. 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలి. 2025 వేతన సవరణ చేపట్టాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు రూ. 400 కోట్లను నెలనెలా విడుదల చేయాలి. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వరాదు. ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్లర్, డ్రైవర్లపై కేఎంపీఎల్, ఏపీకే వేధింపులు మానుకోవాలి. 2019 సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేయాలి. ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి. సంస్థలో అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేయాలి. -
వ్యసనాలకు బానిసై చోరీలు
● నిందితుడి అరెస్టు ● రెండు వాహనాలు, ల్యాప్టాప్ స్వాధీనం బోధన్టౌన్(బోధన్): వ్యసనాలకు, విలాసాలకు అలవాటుపడి పట్టణంలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడు రాహీల్ను అరెస్టు చేసినట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాంధారి మండలం పోతంగల్ కలాన్కు చెందిన రాహీల్ బాన్సువాడలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం బోధన్ పట్టణంలోని ఆచన్పల్లిలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో విలాసాలకు అలవాటుపడి డబ్బులు సరిపోక చోరీలకు పాల్పడుతున్నానని నిందితుడు ఒప్పుకున్నాడన్నారు. ఈ నెల 18న అంబం గేట్ వద్ద దుకాణం ఎదుట నిలిచి ఉంచిన బుల్లెట్ వాహనం, 16న గంగారాం ఆస్పత్రి ఎదుట పార్కింగ్ చేసిన బైక్ను అపహరించాడు. ఈ నెల 11న ఆచన్పల్లి ఏరియాలో తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో చొరబడి ల్యాప్టాప్ను దొంగిలించాడు. నవంబర్ నెలలో రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బర్దిపూర్–లంగ్డాపూర్ రోడ్డులో వెళుతున్న ఓ వ్యక్తి వద్ద నుంచి సెల్ఫోన్ లాక్కొని పారిపోయాడని సీఐ తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి పాల్పడిన రెండు వాహనాలతోపాటు ల్యాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు గతంలో అనేక చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని సీపీ అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు. -
జనగణన విధుల్లో పారదర్శకత పాటించాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాలో జనగణన–2027 విధులకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల ఎంపికలో అధికారులు పారదర్శకత పాటించడం లేదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నాయకులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మద్నూర్ మండలంలో ఒక ఉపాధ్యాయురాలికి విధులు కేటాయించినప్పటికీ, శిక్షణకు ముందు రోజు కక్షపూరితంగా ఆమె కంటే జూనియర్కు ఆ విధులను అప్పగించారని తెలిపారు. ఒక్కో మండలంలో ఒక్కో విధంగా విధులు కేటాయిస్తూ కనీస నిబంధనలు పాటించడం లేదని, దీనిపై గతంలో ఫిర్యాదు చేసినా స్పందన లేదని విమర్శించారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న దృష్ట్యా, జనగణన శిక్షణ తరగతులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిర్వహించాలని కోరారు. టీఎస్యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, కోశాధికారి రూప్ సింగ్, నాయకులు గోపాల్, భారత్ భాయ్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
తేనెటీగల దాడిలో పలువురికి గాయాలు
బిచ్కుంద(జుక్కల్): మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాల సందర్భంగా బిచ్కుంద పట్టణంలో సోమవారం లింగాయత్ సమాజ్ జెండా ర్యాలీ నిర్వహించారు. మందిరం వద్ద జెండా ఆవిష్కరణ సమయంలో తేనెటీగలు ఒక్కసారిగా ప్రజలపై దాడి చేశాయి. దీంతో ప్రజలు వాహనాలు వదిలి పరుగులు తీశారు. ఎనిమిది మంది గాయపడ్డారు. ర్యాలీలో ఏర్పాటు చేసిన డీజే శబ్దాలతోనే తేనెటీగలు గుంపుగా లేచి దాడిచేసినట్లు తెలుస్తోంది. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మాక్లూర్: ఆలూర్ మండలం రాంచంద్రాపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించారు. దీంతో సర్పంచ్ తొగరి భూషన్ సోమవారం మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే నిప్పంటించినట్లు అనుమానం వ్యక్తంచేశారు. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆలూర్ ఎంపీడీవో గంగాధర్ దగ్ధమైన జీపీ ట్రాక్టర్ను పరిశీలించారు. ప్రత్యేక శ్రద్ధతో విచారించి నిందితులను పట్టుకోవాలని ఎస్సై రాజశేఖర్తో చెప్పారు. -
అడుగంటుతున్న అన్నదాత ఆశలు
● ఎత్తిపోతున్న బోరుబావులు ● ఎండుతున్న పంటలు ● సర్కారు ఆదుకోవాలని రైతుల వినతిపెద్దకొడప్గల్: ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి బోరుబావులు ఎత్తిపోతున్నాయి. దీంతో సాగు నీరందక పంటలు ఎండుతున్నాయి. పెద్దకొడప్గల్ మండలంలోని అంజని, బేగంపూర్తో పాటు పలు గ్రామాలలో పరిస్థితి దయనీయంగా మారుతోంది. వర్షాకాలంలో భారీగా వానలు కురిసి రబీ ప్రారంభం వరకు చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండడంతో పంటలు బాగుంటాయని రైతులు ఆశించారు. అయితే ఎండల తీవ్రత పెరగడంతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. దీంతో బోరుబావుల్లో ఊట తగ్గుతోంది. ఇప్పటికే పలువురు రైతులు బోర్లు ఎత్తిపోయాయి. బోర్లు ఎత్తిపోతుండడంతో సాగు నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు తెచ్చి పంటలు సాగు చేశామని, ఇప్పుడు పెట్టుబడులూ తిరిగి వచ్చే పరిస్థితులు లేవని పేర్కొంటున్నారు. సర్కారు ఆదుకోవాలని కోరుతున్నారు.పది ఎకరాలు కౌలుకు తీ సుకుని పంటలు సాగు చేస్తు న్నా. ఎండలు ఎక్కువవడంతో బోర్లు ఎత్తిపోతున్నయి. ఇ ప్పటికే ఎకరం ముప్పయి గుంటల పొలం ఎండిపో యింది. కౌలు డబ్బులు కూడా మీద పడేటట్లున్నయి. – అఫ్రోజ్, రైతు, పెద్దకొడప్గల్అంజని గ్రామ శివారులో నాకు నాలుగు ఎకరాలు భూమి ఉంది. రెండు బోర్లపై ఆధారపడి మూడెకరాలలో వరి, ఎకరంలో జొన్న వేశా. బోరు ఎత్తిపోవడంతో ఎకరం వరి, మరో ఎకరం జొన్న పంట ఎండిపోయాయి. – గణేశ్, రైతు, లచ్చీరాం తండా -
ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి
కామారెడ్డి క్రైం: మహాత్మా బసవేశ్వర జయంతిని సోమవారం కల్టెకరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్లు బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవేశ్వరుడు 12 వ శతాబ్దానికి చెందిన గొప్ప భారతీయ తత్వవేత్త, సంఘ సంస్కర్త, కవి, లింగాయత్ ధర్మ స్థాపకుడు అని పేర్కొన్నారు. కులవ్యవస్థ, లింగ వివక్ష, మూఢనమ్మకాలపై పోరాడిన మహనీయుడన్నారు. కష్టపడి పనిచేయడమే కైలాసం అనే సందేశంతో శారీరక శ్రమకు, నిజాయితీకి ప్రాధాన్యత ఇచ్చిన ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ అభివృద్ధి అధికారి చక్రధర్, బహుజన సంఘాల నాయకులు మల్లయ్య, నాగరాజు, లింగాయత్ సమాజ ప్రతినిధి ప్రభాకర్, నాయకులు అశ్వక్, నరేష్, శాంతయ్య, స్వప్న, పవన్ పాల్గొన్నారు. -
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి
నిజామాబాద్ రూరల్: ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే వ్యాధులు రావని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వైద్యులు గంగారాం, ఇన్నమూరి రవితేజ అన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతినగర్లోగల స్నేహా సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో ఆదివారం ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా హిమోఫిలియా వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. అన్ని వ్యాధుల మాదిరిగానే హిమోఫిలియా కూడా ఒకటని అన్నారు. ఏ వ్యాధికై నా వైద్యులు చెప్పినట్టు జాగ్రత్తలు పాటిస్తే తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవితాన్ని ఆహ్లాదంగా ఆస్వాదించవచ్చన్నారు.. . దాసరి విజయ్ నందరావు, అంబరీష్, యజాస్, రఘు, సంతోష్, జగదీ ష్, సొసైటీ కార్యదర్శి సిద్దయ్య పాల్గొన్నారు. -
బోనమెత్తిన పోచారం
వర్ని: మోస్రా మండల కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి అమ్మవారికి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొని, మహిళలతో కలిసి బోనం ఎత్తారు. గ్రామ ప్రధాన వీధుల గుండా బోనాలతో శోభాయా త్ర నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మి అమ్మవారికి బోనాలను సమర్పించారు. గ్రామ దేవతల ఆశీస్సుల వల్ల పాడిపంటలు సమృద్ధిగా పండి, ప్రజలు ఆయురారోగ్యాలతో విలసిల్లుతున్నారని పోచారం వెల్లడించారు. సంఘ అధ్యక్షుడు బిల్ల రాజశేఖర్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి పిట్ల శ్రీరాములు, వర్ని ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, వీడీసీ అధ్యక్షుడు పోతరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ సాయిగౌడ్, నాయకులు గుత్ప విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు. రెంజల్(బోధన్): మండలంలోని బోర్గాం గ్రా మంలో ఆదివారం అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా వ్యవసాయ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని స్వాధ్యాయ పరివారులు గ్రామం నుంచి ట్రాక్టర్లు, జోడెడ్లతో అరక, నాగలి వెంట తీసు కుని వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించి భూమిపూజ చేశారు. నేడు తెయూ పాలకమండలి పరిచయ కార్యక్రమంతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) సభ్యులుగా ప్రభుత్వం ద్వారా నామినేట్ అయిన నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని(గెట్టుగెదర్) సోమవా రం నిర్వహించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈమేరకు వీసీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ యాదగిరి నూతన ఈసీ మెంబర్లను వర్సిటీకి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. వీరి ఆహ్వానం మేరకు తెయూ పరిపాలనా భవనంలోని ఎగ్జిక్యూటివ్ హాల్లో సోమవారం ఉదయం 11.30 గంటలకు నూతన ఈసీ మెంబర్లు ఒకచోట కలువనున్నారు. అనంతరం ఈసీ మెంబర్లను సన్మానించనున్నారు. ఈసీ మెంబర్లు సీహెచ్ ఆంజనేయులు, ఆర్.సుధాకర్గౌడ్, కే.సంజీవరావు, దండు స్వామి, మదన్ మోహన్ దేవబక్తుని, చెరుకూరి రజినీకాంత్ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య, మహమ్మద్ ఘాజీ, ఎస్.జయంత్ తెయూకు రానున్నారు. నిజామాబాద్ రూరల్: జిల్లా వంజరి సంఘ కా ర్యవర్గ సమావేశం మామిడిపల్లి వంజరిసంఘ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాస్టర్ శంకర్, ప్రధాన కార్యదర్శిగా ధాత్రిక వేణుగోపాల్, కోశాధికారిగా కరిపే మధుసూదన్ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. త్వరలోనే పూర్తి స్థాయి జిల్లా కమిటీని నియమిస్తానని తెలిపారు. కార్యదర్శి గంగోనే మల్లేష్, కోశాధికారి నవతే నర్సయ్య పాల్గొన్నారు. -
పైసలు ఇచ్చుకో.. కబ్జా చేసుకో..!
బాన్సువాడ: చెరువుల కాలువలకు ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలుస్తున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. కాల్వలు కబ్జాకు గురవుతున్నాయని బాధిత రైతులు ఫిర్యాదు చేసినా అధికారుల నుంచి స్పందన లేదు. పట్టణంలోని కల్కి చెరువు పెద్ద తూము నుంచి కాలువ ద్వారా పట్టణం చివర భాగం ఉన్న వ్యవసాయ భూములకు సాగునీరు పోతుంది. చైతన్య కాలనీ, ఎన్జీవోఎస్ కాలనీల్లోంచి ఈ కాలువ ద్వారా సాగునీరు వెళ్తుంది. ఈ కాలువకు ఇరువైపులా కొందరు రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు. కాసులిస్తే చాలు ఇష్టానుసారంగా ఎన్వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్)లు ఇచ్చేస్తున్నారు. సాగునీటి కాల్వతో పాటు బఫర్జోన్కు స్థలం వదిలేసి పనులు చేయాల్సి ఉంది. కానీ ఇవేమీ జరగకుండా వెంచర్లు వెలుస్తున్నాయి. రియల్టర్లు కాల్వలు, చెరువుల స్థలాలను ఆనుకుని కబ్జా చేసి వెంచర్లు చేస్తున్నారు. ఇది రైతులకు శాపంగా మారింది. బాన్సువాడ పట్టణంలో పలు వెంచర్లలో ఇదే పరిస్థితి నెలకొంది. చివరి ఆయకట్ట వరకు సాగు నీరు వెళ్లాల్సిన కాల్వలు కబ్జా కోరల్లో చిక్కుకుంటున్నాయి. నీరందించే సాగు కాల్వలను కాపాడాల్సిన అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించకపోవడంతో రియల్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. స్థలాలను పరిశీలించకుండానే.. ఓ వెంచర్ వెలుస్తున్న సమయంలో రియల్టర్లు ముందుగా ఇరిగేషన్ శాఖ నుంచి ఎన్వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్వోసీకి దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించి కాలువలు, చెరువులకు ఆనుకుని ఉన్నాయా.. బఫర్ జోన్లోకి ఏమైనా వస్తున్నాయా అనే విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఎన్వోసీని జారీ చేయాల్సి ఉంటుంది. కానీ అలా జరుగడం లేదని ఆరోపణలున్నాయి. కార్యాలయంలోనే కూర్చొని రియల్టర్లు ఇచ్చే కాసులకు ఆశపడి ఇష్టారాజ్యంగా ఎన్వోసీలు జారీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలా బాన్సువాడ పట్టణంలో పదుల సంఖ్యలో వెంచర్లకు ఇలానే ఎన్వోసీలు ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. గతంలో కాల్వల కబ్జాపై సాక్షి పలు కథనాలు ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారులు స్పందించి కాలువ పక్కన రియల్టర్లు పాతిన హద్దులను తొలగించి వారికి నోటీసులు జారీ చేసిన ఘటనలున్నాయి. వారం రోజుల క్రితం కల్కి చెరువు కాల్వ కబ్జా అవుతున్న విషయంపై బాధిత రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెద్ద చెరువు (కల్కి చెరువు) పారుకం కింద పంటలు పండించుకుంటున్నాం. ప్రస్తుతం చైతన్య కాలనీలో కాల్వలకు ఆనుకుని హద్దురాళ్లు పాతారు. అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు హద్దు తీసివేయలేదు. భవిష్యత్లో పంటకు నీరందించే కాల్వలు కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటే పంటలు ఎలా పండించుకోవాలి. –గొల్ల విఠల్, రైతు, బాన్సువాడ కల్కి చెరువు ఆయకట్ట కింద సుమారు 500 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. చెరువు పెద్ద తూము నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు సాగునీరందుతుంది. కొందరు రియల్టర్లు కాల్వలకు ఇరువైపులా హద్దులు పాతి కాల్వలను కబ్జా చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాం. –ముదిరెడ్డి విఠల్రెడ్డి, రైతు, బాన్సువాడ కాసులిస్తేనే ఎన్వోసీలు కాల్వలు, చెరువులు కబ్జా అవుతున్నా పట్టించుకోని అధికారులు రైతులు ఫిర్యాదు చేసినా స్పందించని ఇరిగేషన్ అధికారులు -
మహిళ బిల్లు–2023ను తీసుకురావాలి
నిజామాబాద్ రూరల్: పార్లమెంట్లో 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లునే అమలు చేయాలని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్లకు ముడిపెట్టడంపైనే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని అన్నారు. నగరంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుందని బీజేపీ ఒక అసత్య దురుద్దేశపూరిత ప్రచారాన్ని సాగిస్తోందని తీవ్రంగా విమర్శించారు. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు 2023లోనే ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. ఇటీవల లోక్సభలో విఫలమైంది రిజర్వేషన్ల ముసుగులో దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల స్థానాల సంఖ్యను పెంచడానికి, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడానికి చేసిన ప్రయత్నమే అని అన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పార్లమెంటు, రాష్ట్రాల శాసన సభల్లో ఉన్న స్థానాల సంఖ్య ఆధారంగానే మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు. బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టడానికి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందన్నారు. నగర కార్పొరేషన్ డీసీసీ కార్యదర్శులు ఉప్పరి స్వప్న, మడుపు స్వప్న, మాజీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగడం సుమన్, మాజీ కార్పొరేటర్ మురళి, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, హమాల్వాడి సంతోషీ మాత సాయిబాబా గుడి చైర్మన్ గంగాకిషన్, నాయకులు అష్రఫ్ ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనను మహిళా రిజర్వేషన్కు ముడిపెట్టడం సరికాదు కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ -
ఎన్ఎఫ్బీఎస్ బాధ్యతలు ఎంపీడీవోలకు..
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రెంజల్(బోధన్): జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (ఎన్ఎఫ్బీఎస్) బాధ్యతలను ఎంపీడీవోలకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ పథకం తహసీల్దార్ల పరిధిలో ఉండేది. ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు ముందుగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో మీసేవల్లో దరఖాస్తు చేసుకుంటే రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్షేత్రస్థాయిలో విచారించి అమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించేవారు. తహసీల్దార్లకు క్షేత్రస్థాయిలో పని ఒత్తిడితోపాటు విచారణలోనూ తీవ్ర జాప్యం తలెత్తడంతో దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. సమస్యను అధిగమించేందుకు పథకానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు, నిధుల విడుదలను ఎంపీడీవోల పరిధిలోకి తీసుకొచ్చింది. పథకం వివరాలు.. నిరుపేద కుటుంబంలోని ప్రధాన సంపాదనపరుడు మృతి చెందితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకాన్ని అమలు చేస్తోంది. మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అర్హత గల కుటుంబాలకు ప్రభుత్వం రూ. 20 వేలు అందిస్తోంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వేగంగా విచారణ చేపట్టిన వెంటనే నేరుగా ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమవుతాయి. కుటుంబ యజమాని మరణిస్తే త్వరితగతిన సాయం అందించేందుకు ప్రభుత్వం బాధ్యతలను మార్పిడి చేసింది. లబ్ధిదారులకు చెందిన దరఖాస్తులు ఎక్కడ పెండింగ్లో ఉన్నాయో తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. మంజూరైన నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. – కమలాకర్, ఎంపీడీవో, రెంజల్ -
పొలంలోని ఎరువులు, పైపులు దగ్ధం
ధర్పల్లి: మండల కేంద్రం శివారులోని రైతు మామిడి లక్ష్మణ్, రాజశేఖర్ చెందిన వ్యవసాయ చేనులోని డ్రిప్పు పైపులు, ఎరువులు ప్రమాదవశాత్తు దగ్ధమయ్యాయి. ఆదివారం పొలాల సమీపంలోని ట్రాన్స్ఫార్మర్కు మంటలు చెలరేగగా, పక్కనే ఉన్న మొక్కజొన్న సొప్పకు మంటలు అంటుకొని కాలిపోయాయి. భారీ గాలులు వీచడంతో మంటలు వ్యాపించి, లక్ష్మణ్ చేనులోని డ్రిప్ పైపులతోపాటు ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. టిప్పర్ క్యాబిన్లో మంటలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎన్హెచ్ 765డి రోడ్డు పనులు చేపడుతున్న కేపీసీకి చెందిన ఓ టిప్పర్ క్యాబిన్లో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం మండలంలోని బంజారతండా వద్ద చోటుచేసుకుంది. రోడ్డు పనుల్లో భాగంగా మొరం తీసుకెళ్తున్న టిప్పర్ బంజారతండా వద్దకు చేరుకోగానే క్యాబిన్లో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ గుర్తించి టిప్పర్ను రోడ్డుపక్కన నిలిపి, కిందికి దిగిపోయాడు. మంటలను గమనించిన తండా సర్పంచ్ సురేష్ జీపీ ట్యాంకర్ను తెప్పించి మంటలను అదుపుచేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి అగ్నిమాపకకేంద్రం ఫైర్ఇన్స్పెక్టర్ వినోద్ ఫైరింజన్తో ఘటనస్థలానికి చేరుకొని టిప్పర్లోని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఘటనాస్థలంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎస్సై భార్గవ్గౌడ్ తన సిబ్బందితో కలిసి రాకపోకలను పునరుద్ధరించారు. నవీపేట: మండలంలోని బినోల గ్రామంలోని తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలోని అయిటి నర్సు శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి, తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి దాబాపై నిద్రించారు. ఉదయం లేచిచూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్రైం కార్నర్
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గొల్లపల్లి కిష్టయ్య(62) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈనెల 16న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు బంధువుల వద్ద వెతికినా ఆచూకీ తెలియ లేదు. గ్రామ శివారులోని మామిడి విఠల్కు చెందిన పొలం వద్ద మంచెకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విఠల్ పొలాన్ని అదే గ్రామానికి చెందిన గైని రాములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఆదివారం ఉదయం అతడు పొలం వద్దకు వెళ్లగా మంచెకు కిష్టయ్య ఉరివేసుకున్నట్లు గుర్తించాడు. వెంటనే మృతుడి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య అంజవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. వేల్పూర్: మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో వనందాస్ మహేందర్గౌడ్, శ్రావణ్కుమార్గౌడ్లకు చెందిన ద్విచక్రవాహనాలను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. బాధితులు ఎప్పటిలాగే తమ వాహనాలను రాత్రి ఇంటివద్ద ఉంచి నిద్రించగా, గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కాలిపోయినట్లు పేర్కొన్నారు. శ్రావణ్కుమార్గౌడ్కు చెందిన స్కూటీ, మహేందర్గౌడ్కు చెందిన బైక్ కాలిపోవడంతో సుమారు రూ.లక్ష 40వేల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. ఘటనపై వేల్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. -
చోరీ కేసులో దంపతుల అరెస్ట్
బాన్సువాడ: ఈనెల 13న బాన్సువాడ పోస్టాఫీసులో వాచ్మన్పై దాడి చేసి చోరీకి పాల్పడిన దంపతులను అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపనున్నట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. బాన్సువాడ డీఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట్కు చెందిన కుర్మ శివకుమార్, కుర్మలావణ్య భార్యాభర్తలిద్దరు బాన్సువాడ పోస్టాఫీసులో చోరీ చేసేందుకు వచ్చారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న వాచ్మన్ సాయిలుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సాయిలు వద్ద ఉన్న రూ.1000 నగదుతోపాటు పోస్టాఫిసులో ఉన్న మూడు సెల్ఫోన్లను దొంగిలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి, నిందితులను గుర్తించారు. శివకుమార్, లావణ్య బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామె పోస్టాఫీసులో దొంగతనం చేసినట్లు అంగీకరించారన్నారు. అనంతరం నిందితుల నుంచి రూ.1000 నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులిద్దరూ హైదరాబాద్తోపాటు పలు పాంత్రాల్లో సెల్ఫోన్ల చోరీకి పాల్పడ్డారని, వారిపై పలు కేసులున్నాయన్నారు. కేసును చేధించిన సీఐ శ్రీధర్, ఎస్సై, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
ఎండతీవ్రం కాకముందే పనులు చేసుకోవాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎండతీవ్రం కాకముందే ఉపాధిపనిని పూర్తిచేసుకోవాలని నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్కుమార్ సూచించారు. మండలంలోని బొల్లారంలో శనివారం ఉపాధికూలీలతో ఆయన సమావేశమయ్యారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో పనులు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి నుంచి తెచ్చుకునే బాటర్బాటిళ్లల్లో ఓఆర్ఎస్ పౌడర్ కలుపుకోవాలని ఆయన సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఆయనవెంట పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఫీల్డ్అసిస్టెంట్ పర్వీన్ ఉన్నారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో ఉపాధి కూలీలకు శనివారం గ్రామ సర్పంచ్ సాయికిరణ్ ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండదెబ్బ బారిన పడకుండా ముందుజాగ్రత్తలు పాటించాలని కూలీలకు సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రభాత, స్వప్న, ీఫీల్డ్అసిస్టెంట్ రాములు తదితరులున్నారు. -
హత్యల కంటే రోడ్డుప్రమాదాల విషాదం ఎక్కువ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): హత్యల కంటే రోడ్డుప్రమాదాలు నింపే విషాదం చాలా ఎక్కువని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లికలాన్కు చెందిన నారుడి రాజు సహకారంతో స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం పలువురు వాహనదారులకు ఆయన హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహానాలు నడిపే ప్రతిఒక్కరూ రోడ్డుభద్రత నియమాలను పాటించాలన్నారు. హెల్మెట్ల దాత నీరడి రాజు, ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అధికారులను సత్కరించిన ఆటోయూనియన్ సభ్యులు నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట బీఎంఎస్ ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రాజారెడ్డి, ఎస్సై భార్గవ్గౌడ్ను సత్కరించారు. ఇటీవల నూతన కమిటీని ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా వారు పోలీసులను కలిశారు. అనంతరం పోలీస్ అధికారులకు శాలువాలను కప్పి సత్కరించారు. ఆటోయూనియన్ అధ్యక్షుడు జానీ, ఉపాధ్యక్షుడు కృష్ణ, కోశాధికారి సుధాకర్, సలహాదారులు అనిల్, అశోక్, రమేష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీతారాంపల్లి సబ్స్టేషన్ వద్ద రైతుల ధర్నా
దోమకొండ: మండలంలోని సీతారంపల్లి సబ్స్టేషన్ వద్ద శనివారం రైతులు ధర్నా నిర్వహించారు. సీతారాంపల్లి గ్రామంతో పాటు బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన రైతులు దోమకొండ–బీబీపేట ప్రధాన రహదారిపై సబ్స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. వ్యవసాయ బావుల వద్ద 12 గంటల త్రీఫేజ్ కరెంట్ ఇవ్వాల్సి ఉండగా, కేవలం 8నుంచి 9 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. పొట్టదశలో ఉన్న వరిపంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు గంట పాటురోడ్డుపై రెండు గ్రామాల రైతులు ధర్నా చేయడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినలేదు. చివరకు విద్యుత్శాఖ అధికారులు అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను తాము జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామనడంతో రైతులు ధర్నా విరమించారు. -
చిన్నరాంపూర్లో పెంకుటిల్లు దగ్ధం
బాన్సువాడ రూరల్: మండలంలోని చిన్న రాంపూర్లో ఎర్రోల్ల గంగారాంకు చెందిన పెంకుటిల్లు శనివారం తెల్లవారుజామున దగ్ధమైంది. అంతకుముందు రోజు రాత్రి అతడు కట్టెల పొయ్యిపై వంట చేసిన అనంతరం మంటలను సరిగా ఆర్పలేదని, దీంతో మంటలు వ్యాపించడంతో ఇల్లు దగ్ధమైందని సమాచారం. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఇంట్లోని సామగ్రి, దుస్తులు, పత్రాలు అన్ని అప్పటికే కాలిబూడిదయ్యాయి. గ్రామంలో అత్యంత నిరుపేద అయిన గంగారం ఒంటరిగా జీవిస్తున్నాడని ప్రభుత్వం అతడిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. రెవెన్యూ అధికారులు పంచనామా చేశారు. దోమకొండలో.. దోమకొండ: మండల కేంద్రంలోని ముత్యంపేట రోడ్డులో శనివారం ఛత్తీస్గడ్కు చెందిన కూలీలు తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులో సిలిండర్ పేలి, మంటలు చెలరేగి గుడిసె దగ్ధమైంది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రోజు మాదిరిగా సదరు కూలీలు కట్టెల పోయ్యిపై వంట చేసుకుని పనికి వెళ్లారు. ఎండ వేడిమికి కట్టెల పొయ్యిలో మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్కు మంటలు అంటుకోగా అది పేలింది. దీంతో కాలనీవాసులు తీవ్రంగా భయపడ్డారు. దగ్గరలోని బోరు నుంచి నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పివేశారు. మంటలు చేలరేగి సిలిండర్ పేలిన సమయంలో తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని కాలనీవాసులు తెలిపారు. -
పంట నష్టపరిహారం ఇవ్వాలని రైతుల ధర్నా
భిక్కనూరు: గత నెలలో కురిసిన ఆకాల వర్షాలకు వరిపంట దెబ్బతిందని నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ రైతు వేదిక ముందర రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు నేతలు నష్టపరిహరం ఇప్పిస్తామని హామీలు ఇచ్చి మరిచిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహరం చెల్లించాలంటూ గంట పాటు నిరసన తెలిపారు. ఏఈవో లత వారి ఉన్నతాధికారులకు సమాచారం అందించానని, ప్రభుత్వానికి కూడా తాము 600 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని నివేదిక ఇచ్చామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సముదాయించడంతో వారు శాంతించి ధర్నాను విరమించారు. -
వాహనం నడిపేటప్పుడు కుటుంబాన్ని గుర్తుంచుకోవాలి
● బాధ్యతగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ ● కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి భిక్కనూరు: వాహనం నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని గుర్తుంచుకోవాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలితీసుకుంటుందని ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. భిక్కనూరులోని ఎస్వీ గార్డెన్స్లో శనివారం నిర్వహించిన అరైవ్–ఆలైవ్ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కామారెడ్డి ఉగ్రవాయి వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో.. ప్రమాదాల కారాణాలను గుర్తించి ఎస్పీ రాజేశ్చంద్ర సూచనలతో అక్కడ ప్రమాద చిహ్నలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి ప్రమాదం జరుగలేదన్నారు. గ్రంథాలయసంస్థ చై ర్మన్ చంద్రకాంత్రెడ్డి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రై వ్ పరీక్షలను ముమ్మరంగా నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలను నడిపిన వారికి జరిమానాలను విధించాలని సూచించారు. కన్నీటి పర్యంతమైన మహిళ సర్పంచ్లు ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమంలో ఇద్దరూ మహిళ సర్పంచులు వేదికపైననే కన్నీటి పర్యంతమయ్యారు. రోడ్డు ప్రమాదాలతోనే మృతి చెందిన వారి కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో పోలీస్ కళాబృందం పాటల రూపంలో వివరించింది. ఈ సందర్బంగా భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి 1న తన అ ల్లుడు కామారెడ్డిలో పొగమంచులో కారు న డుపుతూ మృతి చెందాడని ఆ బాధ తమ కుటుంబం అనుభవిస్తుందని కన్నీటి పర్యంతమయ్యారు. బస్వాపూర్ సర్పంచ్ పద్మ మాట్లాడుతూ తమ ఇంటి సమీపంలో వినయ్ అనే యువకుడు రోడ్డుప్రమాదంలో గాయపడటంతో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా ఉందని బోరున విలపించారు. 250 మందికి హెల్మెట్ల పంపిణీ మండలకేంద్రం సమీపంలో ఉన్న ఎంఎస్ఎన్ ఫ్యా క్టరీ యాజమాన్యం సహకారంతో 18 గ్రామాల యువకులు,వృద్ధులకు 250 హెల్మెట్లను ఏఎస్పీ చై తన్యరెడ్డి పంపిణీ చేశారు. హెల్మెట్ తీసుకున్నవారి పేర్లను తాము నమోదు చేసుకున్నామని వారు హె ల్మెట్ ధరించకుండా దొరికితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.తదుపరి రోడ్డు భద్రత నిబందనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సీఐ సంపత్కుమార్, ఎస్సై ఆంజనేయులుతో పాటు అన్ని గ్రామాల సర్పంచ్లు,ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు యువకులు పాల్గొన్నారు. సౌత్క్యాంపస్లో.. తెలంగాణ యూనివర్సీటీ సౌత్క్యాంపస్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్–ఆలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సురక్షితమైన ప్రయాణంతో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఏఎంవీఐలు మధుకర్, కృష్ణతేజలు అన్నారు. రోడ్డు నిబంధలను పాటిస్తామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. -
మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆదివారం నిర్వహించే 6–10వ తరగతిలో ప్రవేశ పరీక్ష కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 6వ తరగతిలో ప్రవేశం పొందుటకు వంద సీట్లకు గాను 372 మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రవేశం పొందుటకు 272 మంది పరీక్షలు రాయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మోడల్స్కూల్లో నేడు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ గాంఽధీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప రీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీ క్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): దేశ సంస్కృతిని కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై ఉందని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్, తెలంగాణ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు. మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డిలోని ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం రాత్రి జరిగిన విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. విరాట్ హిందూ సమ్మేళన కార్యక్రమ నిర్వహకులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. నిజాంసాగర్(జుక్కల్): హిందువుల్లో ఐక్యత కోసం హిందూ సమ్మేళనాలు అని సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి అన్నారు. శనివారం మహమ్మద్నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో హిందూ సమ్మేళన ఏర్పాట్లను ఆయన పరి శీలించి మాట్లాడారు. హిందూ సమ్మేళన సభ్యులు రవికిరణ్, భానుప్రకాష్, మోహన్,శ్రావణ్,రాజాగౌడ్, నాగరాజు, కార్తిక్, ఓంకార్, రాములు, మనీ తదితరులున్నారు. ఎల్లారెడ్డి: ఎస్ఐఆర్పై పోలింగ్కేంద్రాల వారిగా ఓటర్లకు అవగాహన కల్పించాలని ముస్లిం వెల్ఫేర్ నాయకులు శనివారం ఆర్డీవో ప్రభాకర్కు వినతిపత్రం అందించారు. బీఎల్వోలను నియమించి వారికి ఎస్ఐఆర్పై అవగాహన కల్పించాలని అన్నారు. 2002 కంటే ముందు ఉన్న ఓటరు లిస్టు ఆధారంగా సర్వే నిర్వహించాలన్నారు. మాజీ జడ్పీటీసీ గయాజుద్దిన్, యూనుస్ తదితరులున్నారు. -
హెల్మెట్ ధరించి ప్రయాణించాలి
పిట్లం(జుక్కల్): ప్రతి ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని ఎస్సై ఆంజనేయులు శనివారం పిట్లంలో విస్తృతంగా ప్రచారం చేశారు. మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించి వాహనాలు నడుపుతున్న వారికి పువ్వులు ఇచ్చి అభినందించారు. హెల్మెట్ ధరించని వారి చెవులలో పువ్వులు పెట్టి ప్రాణాలమీదకు తెచ్చుకొవొద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బీబీపేట: మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై చేపట్టిన వాహనాల తనిఖీలో ఎస్సై విజయ్ అధ్వర్యంలో వాహనదారులకు గులాబీ పూలను ఇస్తూ ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వినూత్నంగా ప్రతి వాహనదారునికి పూలను అందిస్తూ వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రయాణికుల భద్రత కోసం పోలీసుల తనిఖీలని ఎస్సై విజయ్ అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
మిస్టరీగానే మర్డర్ కేసు..
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చి వెనుక ప్రాంతంలో ఫిబ్రవరి 2న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా కోసి, సంచుల్లో మూటగట్టి ఆ మూటలను అక్కడక్కడా పడేసిన ఉదంతం సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఈమిస్టరీ మర్డరీ కేసు చేధన పోలీసులకు సవాల్గా మారింది. కలకలం రేపిన ఉదంతం .. ఈ కేసులో మొదట ఓ సంచిలో నడుము నుంచి కిందివైపు భాగం శరీర భాగాలు లభించాయి. రెండు రోజుల తర్వాత కొద్ది దూరంలోని ఓ చిన్న కాలువలో తల, చేతులు ఉన్న మూటను గుర్తించా రు. మిగితా శరీర భాగం లభ్యం కాలేదు. దానిని మరో సంచిలో వేసి పట్టణంలో కాకుండా మరెక్కడైనా దూర ప్రాంతంలో పడేసి ఉండవచ్చని పో లీసులు భావించారు. శివారు ప్రాంతాలన్నీ గాలించినా మిగితా భాగాలు లభ్యం కాలేదు. ఓ వ్యక్తిని ఇంత కిరాతకంగా హత్య చేయడం పట్టణంలో కలకలం రేపింది. లభించిన శరీర భాగాలన్నీ కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతుడిని గుర్తించడం సాధ్యం కాలేదు. పోలీసులు కేసును సవాల్గా తీ సుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మిస్సింగ్ కేసులు, సీసీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక పరిజ్ణానం ఆధారంగా విచారణ జరిపా రు. చివరకు పక్క రాష్ట్రాల పోలీసులకు సైతం మృతుని ఆనవాళ్లతో కూడిన సమాచారం చేరవేశారు. మృతుడిని గుర్తించినా, కేసుకు సంబంధించిన సమాచారం ఏదైనా ఇచ్చినా రూ.10 వేలు రివార్డు సైతం ప్రకటించారు. అయినా హత్యకు ౖగురయిన వ్యక్తి ఎవరనేది గుర్తించడం సాధ్యం కాలేదు. దీంతో కేసులో ముందడుగు పడలేదు. హతుడు, హంతకులు ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఈ హత్య తరువాత జరిగిన పలు హత్య కేసులను పోలీసులు తక్కువ వ్యవధిలోనే ఛేదించారు. కానీ ఈ కేసు మాత్రం పెండింగ్ లోనే ఉంది. చివరికి ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాలి మరి. శరీర భాగాలు లభించిన కేసు లో అన్ని కోణాల్లోనూ విచారణ జరిపాం. శరీర భాగాలు కుళ్లిన స్థితిలో ఉండటంతో చనిపోయి న వ్యక్తి ఎవరనేది తెలియడం లేదు. ఇతర అన్ని కోణాల్లో ప్ర త్యేక బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయి. విచార ణ కొనసాగుతోంది. తొందర్లోనే కేసును ఛేదిస్తాం. – నరహరి, ఎస్హెచ్వో, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 2న సంచిలో వెలుగుచూసిన మృతదేహం మృతుడు.. హంతకుడు.. ఎవరో తెలియని పరిస్థితి వివరాల కోసం శోధిస్తున్న ప్రత్యేక బృందాలు రూ.10 వేలు రివార్డు ప్రకటించిన పోలీసులు సవాల్గా మారిన కేసు -
క్రైం కార్నర్
కామారెడ్డి క్రైమ్: వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ఐదేళ్ల బాలుడి దారుణ హత్య కు పాల్పడిన తల్లి, ఆమె ప్రియుడిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్వో నరహరి వివరాలు వెల్లడించారు. రాజంపేట మండలానికి చెందిన రజిత అలియాస్ లక్ష్మి తన భర్తతో గొడవపడి ఆరు నెలలుగా కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఆమెకు కుమార్తె, కుమారుడు శ్రావణ్ (05) ఉన్నారు. లక్ష్మీనరసింహులు అనే వ్యక్తితో లక్ష్మి కొంతకాలంగా సహజీవనం చేస్తుంది. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి శ్రావణ్ హత్యకు వారిద్దరూ కలిసి కుట్ర పన్నారు. శుక్రవారం లక్ష్మి కూలీ పనులకు బయటకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చిన లక్ష్మీనరసింహులు శ్రావణ్ గొంతు పిసికి, నేలకేసి బాది దారుణంగా హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం వారిని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి ఎల్లారెడ్డి: నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన మాటూరి మల్లేష్(33), మిత్రుడు సా యితో కలిసి శనివారం రుద్రారం గ్రామశివారులోని నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చేపలు పట్టేక్రమంలో మల్లేష్ వలను పట్టుకొని మరో గట్టుకు వెళ్తుండగా వల కాళ్లకు చుట్టుకుంది. దీంతో అతడు ఈత కొట్టలేక నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నవీపేట: అదృశ్యమైన ఓ యువకుడు గోదావరి నదిలో శవమై తేలాడు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాలు ఇలా.. నిర్మల్ జిల్లా ముధోల్ మండలం చించాలం గ్రామానికి చెందిన గట్టుపల్లి రంజిత్ (36) కొన్నేళ్లుగా నిజామాబాద్ జిల్లా బోర్గాం వద్ద గల ఐసీడీఎస్ ఆఫీసులో విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చే నెల 8న అతడికి వివాహం జరగాల్సి ఉంది. ఈనెల 15న అతడు భీంగల్లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి బైక్పై వెళ్లాడు. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. ఆచూకీ తెలియకపోవడంతో ముధోల్ పీ ఎస్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. శనివారం ఉదయం గోదావరి నదిలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రంజిత్ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. యువకుడి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
అవినీతి తిమింగలాలు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కల్లు, మద్యం దందాలో లొసుగులను ఆసరా చేసుకుని ఆబ్కారీ శాఖ అధికారులు అడ్డగోలుగా దండుకుంటున్నారు. కల్లు ముస్తెదారుల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కల్లులో మత్తు పదార్థాలు కలిపారంటూ ఎవరైనా ఆరోపణ చేస్తే చాలు దాడుల పేరుతో మరింతగా దండుకుంటున్నారని తెలుస్తోంది. టెండర్లలో వైన్షాప్లు దక్కించుకున్న వారి నుంచి కూడా గుడ్ విల్ పేరుతో ఆబ్కారీ అధికారులు రూ.లక్షల్లో వసూలు చేశారన్న ఆరోపణలున్నాయి. నెలనెలా మామూళ్లు మామూలుగా మారాయి. ఏదైనా సమస్య ఎదురైతే అదనంగా చెల్లించుకోవలసిందే. బిచ్కుంద సర్కిల్ పరిధిలోని మద్నూర్ మండల కేంద్రంలో కల్లు దుకాణం షిఫ్టింగ్ విషయంలో అడ్డగోలుగా డిమాండ్ చేసి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన సీఐ వ్యవహారంతో ఆబ్కారీ శాఖలో అవినీతిపై మరోసారి చర్చ నడుస్తోంది.కొత్త మద్యం పాలసీ అమలులో భాగంగా డ్రాలో దక్కించుకున్నవారు డిసెంబర్ 1 నుంచి వైన్షాప్లు ప్రారంభించారు. అయితే ఆబ్కారీ అధికారులు వాటి యజమానుల నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసినట్టు ఆరోపణలున్నాయి. ఓ అధికారి తాను ఇన్చార్జీగా ఉన్న పోస్టుతో పాటు, తన ఒరిజినల్ పోస్టు పేరుతో కలిపి డబుల్ డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక్కో దుకాణం నిర్వాహకుడు గుడ్విల్ పేరుతో పైఅధికారులకు రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. కొన్ని దుకాణాల నిర్వాహకులు రూ. 1.60 లక్షలు, ఇంకొందరు రూ.1.40 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే సర్కిళ్లలో పనిచేసే అధికారులు వేరుగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి అంగీకరించకపోతే బెల్ట్షాపులను కట్టడి చేయడం, వైన్షాప్లో సౌకర్యాలు లేవంటూ ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులకు అడిగినంత ముట్టజెబుతున్నట్లు సమాచారం. బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో తమను అధికారుల వేధింపుల విషయాలు బయటికి వస్తున్నాయి.జిల్లాలో కల్లు తయారీలో మత్తు పదార్థాలను వాడుతారనేది బహిరంగ రహస్యం. అయితే కల్లు ముస్తెదారుల నుంచి ఆబ్కారీ అధికారులు నెలనెలా డబ్బులు వసూలు చేస్తూ దీనిని చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకోసం ఒక్కో దుకాణంనుంచి రూ.5 వేల నుంచి రూ.20 వేల దాకా దండుకుంటున్నారని సమాచారం. అనుమతి లేని దుకాణాల నుంచి రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. కల్తీ కల్లు ఆరోపణలు వచ్చినపుడు దాడులు చేసినట్టే చేసి మరింత దండుకుని వెళ్లడం కామన్గా మారిందంటున్నారు. కొన్ని సందర్భాల్లో కల్తీ కల్లుపై మీడియాలో వచ్చే కథనాలు ఆబ్కారీ అధికారులకు కల్పతరువుగా మారుతున్నాయి. కల్తీ కల్లు అమ్మకాల గురించి మీడియాలో వచ్చిందంటూ వసూళ్లు చేస్తున్నారు. కల్లు దుకాణాలు, మద్యం దుకాణాల షిఫ్టింగ్కు అయితే రూ. లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఏసీబీకి పట్టుబడ్డ సీఐ సత్యనారాయణ లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని బిచ్కుంద, మద్నూర్ వైన్స్ యజమానులు గత సంవత్సరం మద్నూర్లో పర్యటించిన ఎకై ్సజ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐ వేధింపులపై వైన్స్లు బందు చేసి నిరసన తెలిపారు. ఆబ్కారీ శాఖలో అక్రమార్కులు వైన్షాప్లు, కల్లు ముస్తెదారుల నుంచి భారీగా వసూళ్ల ఆరోపణలు రూ. 2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన బిచ్కుంద సీఐ -
న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి
కామారెడ్డి టౌన్:ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డి మాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఈనెల 22 నుంచి చేపట్టబోయే నిరవధిక సమ్మెకు మద్దతుగా శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ డిపో ముందు జేఏసీ ఆ ధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు,కార్మికులు సమ్మె కరపత్రాలను ఆవిష్క రించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఎన్నికల హామీలైన ఆర్టీసీ విలీనం,ప్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతా లు, రెండు పీఆర్సీల అమలు చేయలేదన్నారు. 18 వేల ఖాళీలను భర్తీ చేయకుండా, ఉన్న సిబ్బందిపై పనిభారం పెంచి శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను ఆపాలని డిమాండ్ చేశా రు. ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె తప్పదని హెచ్చరించారు. జేఏసీ నాయకులు వీఆర్ రెడ్డి, వీడీ దాస్, వెంకటగౌడ్, శ్రీనివాస్, సంజీవ్, రమేష్, రా జు,చారీ,లింగం,కృష్ణమూర్తి,సుల్తానా,సునంద, బా లలక్ష్మి, లలిత, మంజుల, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఆర్టీసీ డిపో ముందు ధర్నా చేస్తున్న కార్మికులు -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
సాక్షి నెట్వర్క్:తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక – పెన్షనర్ల సంయుక్త కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఆర్డీవో, తహసీల్ కార్యాలయాల్లో నేతలు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులకు సంబంధించి 2వ వేతన సవరణ కమిషన్ సిఫారసుల అమలు, హెల్త్ కార్డుల మంజూరు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, పాత పెన్షన్ పథకం పునరుద్ధరణతో పాటు 63 డిమాండ్లపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు చోట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించారు. -
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఫంక్షన్ హాల్లో శుక్రవారం పోలీసు శాఖ, నేషనల్ హైవే అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ’అరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా సాగిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసరంగా ప్రాణాలు కాపాడే సీపీఆర్ ప్రక్రియపై విద్యార్థులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్న వారికి ప్రాథమిక చికిత్స ఎలా అందించాలో ప్రత్యక్షంగా చేసి చూపించారు. ఈ సందర్భంగా పోలీసు కళాజాత బృందం తమ ఆటపాటలతో అలరించడమే కాకుండా, ట్రాఫిక్ నియమాలను పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న డీఎస్పీ విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. అనంతరం సీఐ తిరుపయ్య, ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. అనంతరం హెల్మెట్లను పంపిణీ చేశారు. జుక్కల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇమ్రోజ్, సర్పంచ్ శేఖర్, ఉప సర్పంచ్ ఆవేజ్, ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, డైరెక్టర్ షేక్ నజీర్, డీసీసీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, నాయకులు రామ్రెడ్డి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బస్టాండులో శుక్రవారం ఎస్సై దీపక్కుమార్ ప్రయాణికులకు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. సిబ్బంది రమేశ్, శ్రీనివాస్, లావణ్య, గ్రామస్తులు ముదాం సాయిలు, బైరయ్య, రమేశ్, బాలయ్య, అంజయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై నరేష్ అన్నారు. దేవాయిపల్లి శివారులో కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో పోలీసులు, ఆర్టీఏ, ఆర్అండ్బీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్పై అవగాహన కల్పించారు. మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శంకర్, ఏఈ రవితేజ, ఆర్టీఏ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్): ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సై అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ ఆవరణలో ప్రజలకు రోడ్డు భద్రతపై అవగహన కల్పించారు. పోలీస్ సిబ్బంది వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
లారీలు రాక.. శనగ పోక
● ఇబ్బందులు పడుతున్న రైతన్నలు మద్నూర్(జుక్కల్): రైతులు ప్రభుత్వ కాంటాలో శనగ పంట తూకం వేసి రోజులు గడుస్తున్నా శనగ బస్తాలను మాత్రం గోదాముకు తరలించడం లేదు. ఇదేమిటని అధికారులను అడిగితే లారీలు రావడం లేదని చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో సహకార సంఘం ఆధ్వర్యంలో శనగ పంట కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి కొనుగోలు చేసి తూకం వేసిన శనగ బస్తాలు అలాగే ఉన్నాయని లారీలో బస్తాలు తరలించే వరకు రైతుల బాధ్యత ఉంటుందని అధికారులు చెప్పడంతో శనగ బస్తాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. గతంలో మార్కెట్లో తూకం వేసిన బస్తాలు చోరీకి గురికావడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. వర్షంతోనూ రైతులు ఆందోళనకు గురువుతున్నారు. -
పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం
డీఎల్పీవో శ్రీనివాస్ భిక్కనూరు: పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని డీఎల్పీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో 16వ వార్డులో మురికి కాలువల నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మురికి కాలువలు, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అన్ని వీధుల్లో మురికి కాలువలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్మిస్తామన్నారు. ప్రజలు చెత్తను వీధుల్లో వేయకుండా చెత్త ట్రాక్టర్, బండి వచ్చినప్పుడు అందులో వేయాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ బల్యాల రేఖ మాట్లాడుతూ..ప్రభుత్వం మండల కేంద్రం అ భివృద్ధికి రూ.5.32 కోట్లను మంజూరు చేసింద న్నారు. ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డి, ఈవో మహేష్ గౌడ్, ఉప సర్పంచ్ మోహన్రెడ్డి, వార్డు సభ్యులు కర్రొల్ల రాజు, మనీషా, సురేష్, రవి, వేణు, నేతలు సుదర్శన్, లింబాద్రి, తదితరులు పాల్గొన్నారు. -
15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అవగాహన
బాన్సువాడ రూరల్: తాడ్కోల్ గ్రామ రైతువేదికలో శుక్రవారం మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎంపీవో సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లు 15వ ఆర్థిక సంఘం నిధుల మంజూరు, అభివృద్ధి పనుల విధానం, పారదర్శకత, లెక్కల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. కొత్తగా ఎన్నికై న సర్పంచ్లకు ఎంతో కీలకమైన సదస్సుకు 25 గ్రామ పంచాయతీల నుంచి 12 మంది సర్పంచ్లు మాత్రమే హాజరుకావడం గమనర్హం. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటివల పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించ గా, పలువురు మద్యం తాగి వాహనాలు నడుపు తూ పట్టుబడ్డారు. పోలీసులు శుక్రవారం ముగ్గురిని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు.జడ్జి వారిలో ఇద్దరికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఒకరికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్ష విధించి నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. రేషన్ బియ్యం పట్టివేత నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్లో రేషన్ బియ్యం పట్టుకున్నట్లు సీసీఎస్ ఏసీపీ మస్తాన్అలీ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు మెకానిక్ షెడ్లో దాడులు నిర్వహించి, ని ల్వఉంచిన 8.5 క్వింటాళ్ల రేషన్బియ్యంను స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. బియ్యంను అక్రమంగా తరలిస్తున్న మిర్జాఅబ్బాస్మేగ్ను అదుపులోకి తీసుకొని 4వ టౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. పెద్దకొడప్గల్(జుక్కల్):మండలంలోని అంజని చౌ రస్తాలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చే స్తుండగా, అక్రమంగా బియ్యం తరలిస్తున్న లారీ ప ట్టుబడింది.గుంటూరు నుంచి గుజరాత్కు అక్రమంగా తరలిస్తున్న 720 బస్తాల బియ్యం లారీని పట్టు న్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. డ్రైవర్పై కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్సై తెలిపారు. -
స్థలాన్ని కేటాయించండి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో తాపీమేసీ్త్రల భవన నిర్మాణం కోసం తమకు స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన తాపీమేసీ్త్రలు శుక్రవారం స్థానిక తహసీల్దార్ భిక్షపతికి వినతిపత్రాన్ని సమర్పించారు. మండలంలో తాము 125 మంది ఉన్నామని, చాలాకాలంగా తాపీమేసీ్త్రల భవన నిర్మాణ స్థలం కోసం నిరీక్షిస్తున్నామని వారు చెప్పారు. మండలకేంద్రంలో అనువైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు బి.సిద్దిరాములు కుమార్తె నిమితను ఎస్పీ రాజేష్చంద్ర అభినందించారు.ఇంటర్లో వెయ్యికి 992 మా ర్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 5వ ర్యాంకు పొందడం ప్రశంసనీయమని ఎస్పీ అన్నారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలన్నారు. పోలీసు కుటుంబాల పిల్లలకు నిమిత రాష్ట్రస్థాయి ర్యాంకు స్ఫూర్తినిస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని హండేకేలూర్లోని శివాజీ చౌక్ ఆవరణలో గల పశువుల తొట్టెను తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. గ్రామంలో పశువులకు, గ్రామ ప్రజలకు ఉపయోగపడే పశువుల తొట్టెను అకారణంగా కూల్చివేసినట్లు వారు తెలిపారు. వారం రోజుల లోపు అదే స్థలంలో నీటి తొట్టెను నిర్మించాలని లేకుంటే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. గ్రామస్తులు నర్సింలుగౌడ్, హన్మాండ్లు, నాగేశ్ తదితరులున్నారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని పెద్ద తడ్గూర్లో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ శిబిరాన్ని డబ్ల్యూహెచ్వో కన్సల్టెంట్ స్నేహ శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా శిబిరంలో గ్రామస్తులకు క్షయ వ్యాధి వలన కలిగే పరిణామాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. రెండు వారాల కంటే ఎక్కువ దగ్గు, జ్వరం, రాత్రి పూట చెమటలు, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులలో క్షయ వ్యాధి నిర్ధారణ చేస్తారని, అనంతరం ఉచితంగా మందులు అందిస్తామన్నారు. టీబీ ప్రొగ్రామ్ అధికారి ప్రదీప్, డోంగ్లీ పీహెచ్సీ వైద్యులు శ్రీలేఖ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్తో ఒకరి మృతి ఎల్లారెడ్డి: మండలంలోని హాజిపూర్ గ్రామంలో ఓ వ్యక్తి కరెంట్ షాక్తో మృతిచెందాడు. వివరాలు ఇలా.. హాజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి(47) శుక్రవారం ఇంట్లో ఉన్న కూలర్ను రిపేర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి, మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ● పది గొర్రెలు మృతి రామారెడ్డి (ఎల్లారెడ్డి): రామారెడ్డి శివారులో శుక్రవారం రోడ్డు దాటుతున్న గొర్రెల మందను అన్నారం నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇసన్నపల్లి గ్రామంలోని దోకి లచ్చయ్యకు చెందిన పది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో సుమారు రూ. లక్ష వరకు నష్టం జరిగినట్టు బాధితుడు పేర్కొన్నాడు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఘటన జరిందని స్థానికులు తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన కుమ్మరి పోచయ్య(54)అనే వ్యక్తి మూడునెలల క్రితం సైకిల్ పైనుంచి పడటంతో కాలికి గాయమైంది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా గాయం తగ్గలేదు. దీంతో మానసికంగా, శారీరకంగా బాధపడుతూ శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. నవీపేట: మండలంలోని జన్నేపల్లి గ్రామంలో విద్యుత్శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో పెంట లక్ష్మి అనే మహిళ మృతి చెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని జన్నేపల్లి గ్రామస్తులు శుక్రవారం ఎస్సై శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్కో ఏఈతోపాటు లైన్మన్ రమేష్కు కరెంటు సరఫరాలోని సాంకేతిక లోపాలపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేశామన్నారు. కానీ వారు ఫిర్యాదులపై స్పందించకపోవడంతో కరెంటు షాక్కు గురై లక్ష్మి మృతిచెందిందన్నారు. దీంతో ఆమె మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. -
మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలి
దోమకొండ:విద్యార్థులు మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని అంబారిపేట గ్రామ సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ అన్నారు. శుక్రవారం గ్రామంలో మహనీయుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలను పంచాయతి సెక్రటరీ నిమ్మ జీవన్ ఉచితంగా అందించగా ఆమె పాల్గొని మాట్లాడారు. జ్యోతిబాపూలే,సావిత్రిబాయి పూలే, భాగ్యరెడ్డి వర్మ, అంబేడ్కర్,కాన్షీరాం జీవిత చరిత్రలు, భారత రాజ్యాంగ పుస్తకాలు పంపిణీ చేశారు. పుస్తకాలు చదివి సమాజం పట్ల బాధ్యతగా ఉండి జీవితాలను సరైన మార్గంలో ప్రయాణించేలా చూసుకోవాలని పేర్కొన్నారు. మాజీ ఎంపీటీసీ పిరంగి రాజేశ్వర్, అంబేడ్కర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘ఎర్లీ బర్డ్’ను సద్వినియోగం చేసుకోండి
కామారెడ్డి టౌన్ : ఎర్లీ బర్డ్ స్కీమ్ను సద్వినియోగం చేసుకుని ఆస్తి పన్ను చెల్లింపులో 5 శా తం రాయితీని పొందాలని మున్సిపల్ ఇన్ చార్జి కమిషనర్, ఆర్డీవో గిరి సూచించారు. ఎనిమిదో వార్డు పరిధిలోని జీవదాన్ ఆస్పత్రి యా జమాన్యం ముందస్తుగా రూ. 7.12 లక్షల ఆస్తి పన్నును శుక్రవారం ఇన్చార్జి కమిషనర్ సమ క్షంలో చెల్లించింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రజలు సకాలంలో పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ శ్రీధర్రెడ్డి, ఆర్ఐ లలిత, సిబ్బంది పాల్గొన్నారు.కామారెడ్డి రూరల్: కామారెడ్డి పట్టణంలోని రై లు పట్టాలపై ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా.. పోలీసులు కాపాడారు. వివరాలిలా ఉ న్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన శోభ కుటుంబ సమస్యల తో ఆత్మహత్య చేసుకోవాలని భావించి తాహె ర్ గార్డెన్ ప్రాంతంలో రైల్వే పట్టాలపైకి వచ్చింది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైలు వచ్చేలోగా కానిస్టేబుళ్లు రామకృష్ణ, నర్సింలు సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగానే మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోందని సీఐ నరహరి తెలిపారు. రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రావ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వర్చువల్గా భేటీ అయ్యింది. ‘మై భారత్ బడ్జెట్–2026’ అంశంపై మూడు దశలుగా నిర్వహించిన వర్చువల్ పోటీలలో పాల్గొన్న శ్రావ్య ప్రతిభ కనబర్చి ఎంపికైంది. ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్లోని కన్నశాంతి వనంలో నిర్వహించిన జాతీయ స్థాయి ‘వర్చువల్ డైలాగ్ విత్ ప్రైమ్ మినిస్టర్’ కార్యక్రమంలో శ్రావ్య పాల్గొందని కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట్రెడ్డి తెలిపారు. పీఎంతో వర్చువల్ భేటీలో పాల్గొన్న శ్రావ్యను అధ్యాపకులు, సహ విద్యార్థులు అభినందించారు. -
పారదర్శకంగా కొనుగోళ్లు జరపాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● పోసానిపేట కొనుగోలు కేంద్రం పరిశీలనరామారెడ్డి: ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం పోసానిపేట్లోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సన్న ధాన్యం నాణ్యతను, తేమ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి బస్తాకు 40.600 కిలోలకన్నా ఎక్కువ తూకం వేయరాదన్నారు. తూకం ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, తహసీల్దార్ ఉమాలత తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి జనగణనపై శిక్షణ కామారెడ్డి టౌన్ : జిల్లాలో జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఆదివారం నుంచి మూడు రోజులపాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తొలి విడతలో తాడ్వాయి, లింగంపేట్, బిచ్కుంద, మాచారెడ్డి, సదాశివనగర్, జుక్కల్, మద్నూర్, గాంధారి, పిట్లం, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి, బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో రెండు బ్యాచ్లుగా శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణ అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని, ఏవైనా సందేహాలుంటే శిక్షణలోనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి అర్బన్: ఉద్యోగుల నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) డిమాండ్ చేసింది. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్తోపాటు తహసీల్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ విక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, ఉద్యోగులు, పెన్షనర్ల నగదు రహిత ఆరోగ్య బీమా కార్డులు, పాత పెన్షన్ విధానం అమలు అంశాలపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రకటించాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న 64 అంశాలను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా సెక్రెటరీ జనరల్ దేవేందర్, రాష్ట్ర కోచైర్మన్ అనిల్, జిల్లా సెక్రెటరీ జనరల్ కుషాల్, నాయకులు సాయిరెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, బాబు, లింగం, భూమయ్య, హన్మంతురెడ్డి, కలీముద్దీన్, చక్రధర్, మోహన్రావు, ప్రవీణ్కుమార్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘నిందితులను కఠినంగా శిక్షించాలి’
కామారెడ్డి అర్బన్: మహారాష్ట్రలోని సాఫ్ట్వేర్ కంపెనీ లో చోటు చేసుకున్న లవ్ జిహాద్ ఘటనలు ఎక్కడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ, బజరంగ్దళ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆ ఘటనకు నిరసనగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం మాట్లాడుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో లవ్ జిహాద్ పేరుతో యువతులపై జరిగిన ఘటనలు సభ్య సమాజం తలదించుకునేవిగా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వీహెచ్పీ జిల్లా ఉపాధ్యక్షుడు సామల గంగారెడ్డి, కార్యదర్శి బొల్లి రాజు, ప్రచార ప్రముఖ్ శ్రీకాంత్రావు, నగర అధ్యక్షుడు పట్నం రమేశ్, బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, జిల్లా గోరక్షక్ ఏకేష్, ప్రతినిధులు పాపారావు, మణితేజ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి దొరికిన ఎకై ్సజ్ సీఐ
బిచ్కుంద(జుక్కల్) : కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎకై ్సజ్ సీఐ సత్యనారాయణ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్లో ఓ కల్లు దుకాణం షిఫ్ట్ విషయంలో సీఐ దుకాణం యజమానిని రూ. 3 లక్షలు డిమాండ్ చేయగా.. బాధితుడు రూ. 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బిచ్కుందలో తాను అద్దె ఉంటున్న ఇంటిలో సీఐ రూ.2 లక్షల నగదు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆ గదిలో ఉన్న మరో రూ.45,760 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఏకకాలంలో జరిపిన సోదాల్లో ఏసీబీ అధికారులు షాద్నగర్లోని సీఐ ఇంట్లో రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి చెందిన ఇతర ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతోందని, నిందితుడిని నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. అధికారులు ఎవరైనా ప్రజల నుంచి లంచం కోసం డిమాండ్ చేస్తే ఏసీబీ 1064 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏసీబీకి పట్టుబడ్డ సీఐ సత్యనారాయణ లంచం ఇవ్వాలని వేధిస్తున్నాడని బిచ్కుంద, మద్నూర్ వైన్స్ యజమానులు గత సంవత్సరం మద్నూర్లో పర్యటించిన ఎకై ్సజ్ మంత్రికి ఫిర్యాదు చేశారు. సీఐ వేధింపులపై వైన్స్లు బందు చేసి నిరసన తెలిపారు. రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టివేత షాద్నగర్లోని సీఐ నివాసంలో రూ.12 లక్షలు స్వాధీనం -
నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి..
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు ఆగడం లేదు. వాహనదారుల చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్తల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, నిబంధనలు పాంచకపోవడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాలు జరిగినపుడు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాళ్లు, చేతులు విరిగినా ప్రాణాలు దక్కాలంటే తలకు గాయాలు కాకుండా ఉండాలి. ప్రమాద ఘటనల్లో హెల్మెట్ లేక తలకు బలమైన గాయాలై చనిపోతున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. పోలీసులు సైతం దీనిపై కళాబృందాల ద్వారా గ్రామస్థాయిలో ప్రదర్శనలు ఇస్తూ విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయినా చాలామంది హెల్మెట్ ధరించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ కూడా రోడ్డు ప్రమాదాలకు మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. భారీ వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సమయాల్లో చేసే నిర్లక్ష్యం కారణంగా కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణపై పోలీసులు మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. -
‘గోల్డెన్ అవర్’ అత్యంత కీలకం
కామారెడ్డి టౌన్ : రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే మొదటి గంట (గోల్డెన్ అవర్) బాధితుల ప్రాణాలను కాపాడడంలో అత్యంత కీలకమని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. ‘అరైవ్ – అలైవ్’లో భాగంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘గోల్డెన్ అవర్’ ప్రాధాన్యతపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఎంహెచ్వో ఆధ్వర్యంలో వైద్యులు సీపీఆర్, ప్రథమ చికిత్సపై ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎదుటివారు ఎలా డ్రైవింగ్ చేసినా, మన జాగ్రత్తతో ప్రమాదాలను నివారించడమే ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ అన్నారు. దీనిపై ప్రతి వాహనదారుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రజల సహకారం, పోలీస్ శాఖ కఠిన చర్యల వల్ల గతేడాదితో పోలిస్తే జిల్లాలో సుమారు 50 రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు నరసింహారెడ్డి, చైతన్యరెడ్డి, డీఎంహెచ్వో రవీందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జీవశాస్త్ర పరిశోధనలో మాలిక్యులర్ సాంకేతికతకు ప్రాధాన్యం
● హెచ్సీయూ ప్రొఫెసర్ రాజగోపాల్ తెయూ(డిచ్పల్లి): ఆధునిక జీవశాస్త్ర పరిశోధనలో మాలిక్యులర్ సాంకేతికత ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తుందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెస ర్ రాజగోపాల్ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘హైమీడియా లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో గురువారం ‘జెనోమిక్ – ప్లాస్మిడ్ డీఎన్ఏ ఐసోలేషన్ అండ్ జెల్ ఎలెక్ట్రోఫోరేసిస్ టెక్నిక్స్’ అనే అంశంపై ఒక రోజు వర్క్షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ రాజగోపాల్ మాట్లాడుతూ డీఎన్ఏ ఐసోలేషన్లో సంప్రదాయ పద్ధతులు, ఆధునిక కిట్ ఆధారిత పద్ధతులపై వచ్చిన మార్పు లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం హైమీడియా లాబొరేటరీస్ నిపుణులు కిరణ్ కుమార్, రాజేశ్ గౌడ్ ప్రసంగించారు. కార్యక్రమంలో సైన్స్ డీన్ ప్రొఫెసర్ సంపత్కుమార్, విభాగాధిపతి అబ్దుల్ అలీమ్ ఖాన్, బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.అరుణ, ప్రొఫె సర్ విద్యావర్థిని, అధ్యాపకులు డీ శ్రీనివాస్, వీ జలంధర్, పీ సుబ్రమణ్యం, ప్రవీణ్, సంతోష్, అమ్రీన్ పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు అందరికీ చేరాలి
మద్నూర్(జుక్కల్): ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందించాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం ఏర్పాటు చేసిన ప్రజపాలన–ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో సబ్ కలెక్టర్ పా ల్గొని మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల ప్రణాళికలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు,మహిళలకు ఉచిత బస్సు,సన్నరకం వడ్లకు బో నస్ తదితర విషయాలపై ఆమె ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సంక్షేమ పథకాలు అందతున్న తీరును తెలుసుకున్నారు.అలాగేడోంగ్లీ మండల కేంద్రంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు.ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఇద్దరు కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక కోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్ కుమార్ తెలిపారు. కో–ఆప్షన్ పదవి కోసం ఎంపిక చేసే అభ్యర్థులు ప్రత్యేక పరిజ్ఞానం కలిగి ఉండాలని,ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు క లిగి ఉండి, మైనారిటీ వర్గాలకు చెందిన వారై ఉండా లని తెలిపారు.కో–ఆప్షన్ సభ్యులపద కాలం ఐదు సంవత్సరాల పాటు ఉంటుందని అన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తుతో కావాల్సిన ధ్రువ పత్రాలను ఈనెల17 నుంచి 28 సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చునని తెలిపారు. బాన్సువాడ:రాష్ట్ర మాల ఎడ్యు కేషనల్ సొసైటీ ఈసీ మెంబర్ గా బాన్సువాడ మండలం దే శాయిపేట్కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యాల సంతోష్ను నియమించారు. రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, రిటైర్డ్ ఎస్పీజాన్ వెస్లీల ఆధ్వర్యంలో మాల చైత న్యం కోసం నిరంతరం శ్రమిస్తున్నందుకు రాష్ట్ర నా యకత్వం గుర్తించి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించా రని సంతోష్ తెలిపారు. బాబా సాహెబ్ అంబేడ్క ర్, మహాత్మా జ్యోతీరావు పూలే సూచించిన ఆశయ సాధన కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. కామారెడ్డి టౌన్ :ఆర్టీసీ కార్మికుల సమస్యల ప రిష్కారం కోసం ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ రీజియన్లోని అన్ని డిపోల్లో సమ్మె సన్నాహక గేట్ మీటింగ్లను విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకుడు వి.డి దాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021, 2025 పీఆర్సీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకం వల్ల పనిభారం పెరిగి నా,జీతాలు మాత్రం పదేళ్ల క్రితం నాటివే ఇస్తున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఆర్మూర్లో ఉదయం 6:30 గంటలకు, నిజామాబాద్ 9:30, బోధన్ 12:30, బాన్సువాడలో మధ్యాహ్నం 2:30, కామారెడ్డిలో సాయంత్రం 6 గంటలకు ఆర్టీసీ డిపోల్లో జరిగే మీటింగ్లకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. -
టేకు దుంగల పట్టివేత
సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను గురువారం పట్టుకున్నట్లు సిరికొండ ఎఫ్ఆర్వో కే నర్సింగరావు తెలిపారు. విశ్వసనీయ సమా చారం మేరకు గ్రామంలో తనిఖీ చేయగా బహిరంగ ప్రదేశంలో 32 టేకు దుంగలు లభ్యం కాగా, వాటిని స్వాధీనం చేసుకొని సిరికొండలోని రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. దుంగల విలువ రూ. 25 వేల వరకు ఉంటుందని, ఎవరు నిల్వ చేశారనేది విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గంగారం, బీట్ అధికారి నవీన్, బేస్ క్యాంపు సిబ్బంది రమేశ్, గోపాల్, శేఖర్ పాల్గొన్నారు. -
నేడు ఉపాధ్యాయ సమస్యలపై తహసీల్దార్లకు వినతి
బాన్సువాడ: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలని తపస్ జిల్లా అధ్యక్షుడు భూనేకర్ సంతోష్ పిలుపునిచ్చారు. గురువారం బాన్సువాడలో తపస్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలైన పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీలు, సీపీఎస్ విధానం రద్దు, సాధారణ బదిలీలు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలపై అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. నేతలు పాలేటి వెంకట్రావ్, రవీంద్రనాథ్ఆర్య, రమేష్కుమార్, రాఘవరెడ్డి, సత్యనారాయణ, లక్ష్మీపతి, జనార్ధన్, వేదప్రకాష్, శివకాంత్, కృష్ణ, తారచంద్ తదితరులున్నారు. నిజాంసాగర్(జుక్కల్): ఈ నెల 19న మహమ్మ ద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమ్మేళన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి కోరారు. గురువారం మహమ్మద్నగర్ మండలం గున్కుల్ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క హిందు బంధువు సమ్మేళనానికి తరలి రావాలని కోరారు. గున్కుల్ గ్రామ సర్పంచ్ రమేష్యాదవ్, హిందు సమ్మేళన నిర్వాహకులు భానుప్రకాష్, రవికిరణ్, మోహన్, భాస్కర్, సంతు తదితరులు ఉన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని చిన్న రాంపూర్లో గ్రామానికి చెందిన ముగ్గురు వృద్ధులకు లయన్స్ క్లబ్ ఆఫ్ బాన్సువాడ ఆధ్వర్యంలో గురువారం కిరాణా సరుకులు పంపిణీ చేశారు. సుమారు 70 సంవత్సరాలు పైబడినా ఆసరా పెన్షన్ మంజూరు కాకపోవడంతో వారి కుటుంబాలు దీనవాస్థలో ఉన్నట్లు గుర్తించి సహాయం అందించినట్లు లయన్స్క్లబ్ ప్రతినిధులు తెలిపారు. ఒక్కొక్కరికి సుమారు రూ.2 వేల విలువ చేసే కిట్లను అందించారు. గ్రామ ఉపసర్పంచ్ షేఖ్ అజీజ్, లయన్స్ ప్రతినిధులు ఖలీద్, దుద్దాల అంజిరెడ్డి, బెజుగం వెంకటరమణ, ప్రకాష్, ప్రధానోపాధ్యాయులు వీరప్ప, నాయకులు కుర్మ గణేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దకొడప్గల్(జుక్కల్):పెద్దకొడప్గల్నూతన తహసీల్దార్గా గురువారం రాజశేఖర్ పదవీ బాధ్యతలు చేపట్టారు. పెద్దకొడప్గల్ తహసీల్దార్గా పని చేసిన భిక్షపతి నాగిరెడ్డిపేట్ మండలానికి బదిలీపై వెళారు. రాజశేఖర్ గతంలో నిజామాబాద్ జిల్లా మోస్రా తహసీల్దార్గా పని చేశారు. తహసీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రతి క్షణం కృషి చేస్తానని తెలిపారు. -
రోడ్డు భద్రత మనందరి బాధ్యత
ఎల్లారెడ్డి రూరల్: సురక్షిత ప్రయాణం కోసం రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ప్రజలందరికి అవసరమని ఎస్సై మహేశ్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పట్టణంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, మరణాల రేటును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ప్రయాణీకులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ శ్రీనివాస్, ఎస్సై మహేశ్లు.. డ్రైవర్లు, ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. -
పాల్వంచ కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఫిర్యాదు
కామారెడ్డి అర్బన్/కామారెడ్డిటౌన్: అంబేడ్కర్ సంఘాలు అడుక్కు తింటున్నాయని, బిచ్చమెత్తుకుంటున్నాయని అహంకారంగా మాట్లాడిన పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్గౌడ్పై గురువారం కామారెడ్డి ఏఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు అంబేడ్కర్ సంఘం జిల్లా నాయకులు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నాయకులు మాట్లాడారు. అంబేడ్కర్ జయంతి రోజున ఫరీద్పేటలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లెరమేష్ గౌడ్ దళిత సంఘాలపై అనుచిత వాఖ్యలు చేశారని, ఇప్పటికై నా బహిరంగ క్షమాపణ చెబితే వదిలిపెడతామని, లేకుంటే ఆయన ఇల్లు ముట్టడించడంతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కోసం పోలీసు ఉన్నతాధికారులతో పాటు పీసీసీ అధ్యఽక్షుడు మహేష్కుమార్గౌడ్ను కలుస్తామన్నారు. సంఘం నేతలు ఆకుల బాబు, కె.గంగారాం, రాజలింగం, బి.బాల్రాజు, వెంకటరాములు, ఎస్.లక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
యువతి ఆత్మహత్య
వర్ని: మండలంలోని పాత వర్ని గ్రామానికి చెందిన సువర్ణ (23) బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కొంతకాలంగా వీరి కుటుంబం సత్యనారాయణపురంలో నివసిస్తోందని, కుటుంబకారణాలతో సువర్ణ బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. పిట్లం(జుక్కల్): మతిస్థిమితంలేని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పిట్లంకు చెందిన గొల్ల శ్రీనివాస్ (30) కొంతకాలంగా మతిస్థిమితంలేక హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఉదయం 9 గంటలకు ఇంట్లోంచి వెళ్లగా, 11 గంటలకు శ్రీనివాస్ పెద్ద చెరువులోకి వెళ్లడాన్ని గమనించిన గ్రామానికి చెందిన గొల్ల సాయిలు తండ్రి బాగాయ్యకు ఫోన్ చేసి తెలిపాడు. వెంటనే వారు అక్కకి వెళ్లి చూడగా చెరువు ఒడ్డుపై చెప్పులు కనిపించాయి. జాలర్లను పిలిపించి వెతికించగా ఒడ్డుకు కొద్దిదూరంలో శ్రీనివాస్ మృతదేహం లభించింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వేసవి కాలం.. దొంగలతో జాగ్రత్త!
● చోరీలు జరిగే అవకాశం ఎక్కువ ● వేరే ఊళ్లకు వెళ్తే సమాచారం ఇవ్వాలంటున్న పోలీసులు ఎల్లారెడ్డి: వేసవి కాలం సరదాలనే కాదు.. దొంగల బెడదనూ తెచ్చి పెడుతుంది. చోరీలతో జాగ్రత్త సుమా అని పోలీసులు అంటున్నారు. సెలవుల్లో సొంతూళ్లకు ప్రయాణాలు, శుభకార్యాలకు వెళ్లటం, ఆరు బయట నిద్రలు చోరీలకు అవకాశం కల్పిస్తుంటాయి. వేరే ఊళ్లకు వెళ్లే సమయంలో ఇళ్లకు తాళాలు వేసి వెళ్లాల్సి వస్తే పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు అంటున్నారు. వేరే ఊళ్లకు వెళ్లేటప్పుడే కాకుండా వేసవి కాలంలో పలువురు తమ ఇళ్లకు తాళం వేసి ఆరుబయట, డాబాలపై నిద్రిస్తుంటారు. తాళం వేయడమే అదనుగా దొంగలు ఇళ్లలో చొరబడి ఉన్నదంతా దోచేస్తారని ఆయన తెలిపారు. గతంలో జరిగిన చోరీ కేసులను పరిశీలిస్తే దొంగలు తాళం వేసిన ఇళ్లనే తమ టార్గెట్గా చేస్తుంటారని అన్నారు. ఎవరైనా ఊరు వెళ్లాల్సి వస్తే ఆ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని ఆయన తెలిపారు. గోప్యంగా ఉంచితే మేలు.. తాము ఊరు వెళ్తున్న సంగతి ఎంత గోప్యంగా ఉంచితే అంత మంచిదని, సామాజిక మాధ్యమాలలో తమ విహార యాత్రల వివరాలను పోస్ట్ చేయవద్దని తెలిపారు. ఇళ్లకు ప్రధాన ద్వారానికి కర్టెన్ వేయడం ఉత్తమమని, కర్టెన్ కప్పి ఉండటం వల్ల ఇంటికి తాళం వేశారా లేదా అని బయటి నుంచి చూసే వాళ్లకు తెలియకుండా ఉంటుందని తెలిపారు. తాము ఊరు వెళ్లినన్ని రోజులు పేపర్, పాల ప్యాకెట్లు వేసే వారికి వాటిని వేయవద్దని తెలపాలని, దొంగలు ఇలాంటి విషయాలనే గమనిస్తుంటారని వివరించారు. ఇంటి ముందు పేపర్లు, పాల ప్యాకెట్లు పడి ఉంటే ఇంట్లో ఎవరూ లేనట్లు దొంగలు నిర్ధారించుకుంటారని తెలిపారు. ఇంట్లో పని చేసేందుకు అపరిచితులను పెట్టుకోవద్దని, నమ్మకమైన తమకు గుర్తు తెలిసిన వాళ్లనే పనికి పెట్టుకోవాలని తెలిపారు. తాము ఊళ్లో లేని రోజుల్లో కూడా ప్రతి రోజూ ఇంటి వాకిలి ఊడ్చి, కళ్లాపి చల్లించేలా పని వాళ్లకు పురమాయించాలి.. వాకిలి ఊడవక పోతే కూడా ఇంట్లో ఎవరూ లేనట్లు దొంగలు గుర్తిస్తారని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ఉత్తమం.. ఇంటికి సీసీ కెమెరాలు పెట్టించడం ఉత్తమమని వాటిని తమ సెల్ఫోన్లకు అనుసంధానించుకోవాలని, తద్వారా సెల్ఫోన్లలో తమ ఇంటి ముందు ఎవరైనా అపరిచితులు తచ్చాడుతుంటే ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించవచ్చని తెలిపారు. వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు ఇళ్లకు నాసిరకం తాళాలు వేయవద్దని , గేటుకు బయట నుంచి తాళం వేయవద్దని లోపలి నుంచి తాళం వేయాలని తెలిపారు. ఎక్కువ రోజులు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపర్చాలని, బీరువా తాళాలను బీరువాలపైనే పెట్టకుండా జాగ్రత్తగా దాచి పెట్టాలని తెలిపారు. ఆరు బయట నిద్రించే సమయంలో ఒంటిపై ఆభరణాలు, విలువైన వస్తువులు ఉంచుకోవద్దని ఆయన తెలిపారు. వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలు జరగే ఆస్కారం ఉండదని అన్నారు. -
సర్టిఫికెట్ల ప్రదానం
బీబీపేట్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితం, సైన్స్ విభాగాల్లో పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మూలరెడ్డి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో 60 నిమిషాలకు పైగా నిరంతరంగా డిజిటల్ ప్లాట్ఫామ్పై శిక్షణ పొందడమే కాకుండా, గణితం, సైన్స్ సబ్జెక్టులలో ఈ విద్యా సంవత్సరంలో 9 కంటే ఎక్కువ క్లిష్టమైన నైపుణ్యాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ వేడుకలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
● ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమేనని బంధువుల ఆరోపణనవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామంలో గురువారం వి ద్యుత్ షాక్తో పెంట లక్ష్మి (46) అనే మహిళ మృతి చెందిందని ఎస్సై శ్రీకాంత్ తెలిపా రు. ఇంట్లోని బోరును స్టార్టర్ బాక్స్ ద్వారా ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందిందని పేర్కొన్నారు. మృతురాలికి కొడుకు, కుమారుడు ఉన్నారు. కొడుకు పెంట శివ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. సబ్ స్టేషన్ ఎదుట ఆందోళన.. పెంట లక్ష్మి మృతికి ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు జన్నెపల్లి గ్రామంలోని సబ్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నేరుగా సబ్స్టేషన్కు తీసుకువచ్చి ఆందోళన చేశారు. దుబ్బ ప్రాంతంలో కొన్ని నెలలుగా కరెంట్ సమస్య ఉందని, షార్ట్ సర్క్యూట్ ఘటనలు జరుగుతున్నాయని ట్రాన్స్కో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్మన్ రమేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశా రు. ఎస్సై శ్రీకాంత్, సర్పంచ్ ముడుసు గంగాధర్, ఉప సర్పంచ్ వీరేందర్రావ్ ఘటనా స్థలానికి చేరు కొని ఆందోళనకారులకు సర్ది చెప్పారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
నాణ్యమైన ఆహారం అందించాలి
● సబ్ కలెక్టర్ కిరణ్మయి మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల కేంద్రంలో గురువారం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోషకాలతో తయారు చేసిన వంటకాల స్టాళ్లలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని చెప్పారు. అనంతరం సర్పంచ్ మచ్కురీ ఉష సంతోష్మేసీ్త్ర మాట్లాడుతూ.. పలు సూచనలు ఇచ్చారు. -
మెట్ల పైనుంచి పడి ఒకరి మృతి
వర్ని: వర్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలో స్వీపర్గా పనిచేస్తున్న ఖదీర్ (47) ప్రమాదవశాత్తు మెట్ల పైనుంచి పడి మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 15న మార్కెట్ కమిటీ కార్యాలయంలో మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో ఖదీర్కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఆసిఫా బేగం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ ..ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామంలో సుంకరి జయపాల (53) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన గురువారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చర్ల గ్రామానికి చెందిన జయపాల భర్త కొన్ని సంవత్సరాల క్రితం మృతి చెందాడు. కూతురికి వివాహం కాగా జయపాల ఒంటరిగా నివసిస్తోంది. కాగా, అదే గ్రామానికి చెందిన సోదరుడు బుధవారం ఉదయం నుంచి జయపాలకు ఫోన్ చేస్తున్నా ఎత్తడం లేదు. దీంతో ఇంటికి వెళ్లిన సోదరిడికి అక్క జయపాల శవమై కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. జయపాల మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని, ఒంటిపై గాయాలు కనిపించటంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
జీపీ విస్తీర్ణం, సరిహద్దులను గుర్తించండి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తమ గ్రామ పంచాయతీ విస్తీర్ణంతోపాటు సరిహద్దులను గుర్తించాలని కోరుతూ గురువారం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట సర్పంచ్ వంశీకృష్ణగౌడ్, ఉపసర్పంచ్ గులామ్.. ఇన్చార్జి తహసీల్దార్ రాజేశ్వర్కు వినతిపత్రాన్ని అంజేశారు. 2018లో తమ పంచాయతీని 800 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా వారు ఇన్చార్జి తహసీల్దార్కు తెలిపారు. ఈ క్రమంలో తమ గ్రామపంచాయతీకి సంబంధించి సరిహద్దులతో కూడిన మ్యాప్ను తమకు అందజేయాలని వారు కోరారు. జీపీ కార్యదర్శి రాజు ఉన్నారు. -
‘సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలి’
లింగంపేట: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలని మండల ప్రత్యేకాధికారి, డీఈవో రాజు సూచించారు. గురువారం లింగంపేటలోని జీఎన్ఆర్ గార్డెన్లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’పై అన్ని శాఖల అ ధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అధికారులు తమ శాఖల అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్, తహసిల్దార్ సురేష్, ఎంపీవో మలహరి, ఎంఈవో అంజల్రెడ్డి ఏవో అనిల్కుమార్, ఏపీఎం వినోద్కుమార్ తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి అర్బన్: గ్వాలియర్లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఎల్ఏన్ఐపీఈ)లో పలు డిప్లొమా కోర్సుల లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా యువజన క్రీడల అధి కారి రంగా వెంకటేశ్వర్గౌడ్ ఒక ప్రకటనలో తె లిపారు. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, ఫిట్ నెస్ మేనేజ్మెంట్, స్ట్రెంత్, స్పోర్ట్స్ కండిషనింగ్, బీపెడ్, ఎంపెడ్, స్పోర్ట్స్ సైన్స్, ఎంఏ యో గా, స్పోర్ట్స్ మేనేజ్మెంట్, క్రీడా జర్నలిజం తదితర కోర్సుల్లో ప్రవేశాలకోసం అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి అర్బన్: కలెక్టరేట్లో శనివారం జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజని కిరణ్ ఒక ప్రకటనలో తెలిపా రు. గూగుల్ పేలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని పే ర్కొన్నారు. శనివారం ఉదయం 10.30 గంట లకు కలెక్టరేట్లోని 121 గదిలో మేళా ఉంటుందని, ద్విచక్ర వాహనం ఉన్న 18 నుంచి 35 ఏళ్లలోపు వారు పాల్గొనాలని తెలిపారు. వివరాలకోసం 97044 12792, 63057 43423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి టౌన్ : ఎస్సెస్సీ పరీక్ష ఫలితాల్లో సై న్స్ సబ్జెక్టుకు సంబంధించి ఫిజికల్ సైన్స్, బ యోసైన్స్ మార్కులను విడివిడిగా మార్కు లి స్టులో పొందుపరచాలని ఉపాధ్యాయులు కో రారు. గురువారం జిల్లా సహాయ పరీక్షల కమిషనర్(ఏసీజీఈ) బలరాంను కలిసి వినతి ప త్రం అందజేశారు. ప్రస్తుతం సైన్స్ సబ్జెక్టులోని రెండు విభాగాలకు కలిపి ఒకే గ్రేడ్ లేదా మా ర్కులు ఇస్తున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏ విభాగంలో పట్టుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ మార్కులను విడివిడిగా చూపిస్తే విద్యార్థులు తమ ప్రతిభను సరిగ్గా అంచనా వేసుకోవడమే కాకుండా, ఇంటర్లో సరైన గ్రూపులను ఎంచుకోవడానికి వీలవుతుందని వివరించారు. కామారెడ్డి అర్బన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, వి శ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని పీఆర్టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రెటరీ జనరల్ దామోదర్రెడ్డి ఆరోపించారు. గురువారం కామారెడ్డిలోని పీఆర్టీ యూ జిల్లా భవన్లో టీజీఈజేఏసీ జిల్లా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దా మోదర్రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత ఆరో గ్య బీమాను తక్షణమే అమలు చేయాలని, పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో శుక్రవారం కలెక్టరేట్తోపాటు తహసీల్ కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన సమయంలో చేపట్టే నిరసనలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ జిల్లా కార్యదర్శి దేవేందర్, అడిషనల్ సెక్రెటరీ జనరల్ కుషాల్, ప్రతినిధులు సాయిరెడ్డి, నాగరాజు, లింగం, విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత
కామారెడ్డి క్రైం: జిల్లాలో క్రీడలు, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం పనులను కలెక్టర్ గురువారం పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, ప్రాజెక్టును గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్లో నిర్వహిస్తున్న కబడ్డీ సమ్మర్ కోచింగ్ క్యాంపును సందర్శించారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. ఇండోర్ స్టేడియంలో 4 షటిల్ బ్యాడ్మింటన్ కోర్టులు, యోగా హాల్, ఇండోర్ క్రీడల సదుపాయాలు, జిమ్, రైఫిల్ షూటింగ్, స్క్వాష్ కోర్ట్ లాంటి ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో గిరి, పబ్లిక్ హెల్త్ డీఈ సంతోష్, అధికారులు పాల్గొన్నారు. -
కుటుంబంకన్నా ఏదీ ముఖ్యం కాదు
● జాగ్రత్తగా వాహనం నడిపి, సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలి ● అదనపు డీజీపీ సంజయ్ జైన్గాంధారి: మన ప్రాణాలు, కుటుంబాలకన్నా ఏదీ ముఖ్యం కాదని అదనపు డీజీపీ సంజయ్ జైన్ పేర్కొన్నారు. జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం మండల కేంద్రంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ –అలైవ్ రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ జైన్ మాట్లాడుతూ యుద్ధాలలోకన్నా రోడ్డు ప్రమాదాలలో మరణించేవారే ఎక్కువన్నారు. అమెరికా –ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నెలన్నరలో సుమారు 3,500 మంది మరణించారని, కానీ మన దేశంలో ఇదే సమయంలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 20 వేల మంది మరణించారని పేర్కొన్నారు. కొందరి వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి ఎస్పీ రాజేశ్ చంద్ర పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొబైల్ కంటి వైద్య శిబిరాన్ని అదనపు డీజీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రేణుక సంజివ్, తహసీల్దార్ రేణుకా చౌహాన్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, స్థానిక ఎస్సై మహేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజాపాలన’లో ప్రజాప్రతినిధులకేదీ గౌరవం
● మహిళా సర్పంచులకు మూలన సీట్ల కేటాయింపు ● అధికారుల తీరుపై విమర్శలుబీబీపేట: ప్రజాపాలన సమావేశాలలో మహిళా సర్పంచ్లకు గౌరవం దక్కడం లేదు. సమావేశాలలో అధికారులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు మహిళా సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మండల కేంద్రంలోని వాసవి క్లబ్లో ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక సర్పంచ్ ఏదుళ్ల సాద్విక అధ్యక్షత వహించాల్సి ఉండగా.. ఆమెకు వేదికపై ఒక మూలన కుర్చీ కేటాయించారు. అంతేకాక మండలంలోని మరో ముగ్గురు మహిళా సర్పంచ్లకూ వేదికపై తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్ : అగ్నిప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంటగదిలో ఎల్పీజీ గ్యాస్ లీకై నప్పుడు లేదా నూనె వల్ల అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా ‘స్టాప్, డ్రాప్ అండ్ రోల్’ పద్ధతిని పాటించాలన్నారు. చిన్నపాటి మంటలను నియంత్రించేందుకు తడిపిన గొంగళి(బ్లాంకెట్)ని ఎలా ఉపయోగించాలో వివరించారు. కార్యక్రమంలో ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, అగ్నిమాపక శాఖ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు. -
బీసీలు 55.53 శాతం
జిల్లాలో కులాలు, ఉపకులాలకు సంబంధించిన లెక్క తేలింది. 2024లో నిర్వహించిన కుల, ఉద్యోగ, సామాజిక గణనలో ఆయా కులాలకు సంబంధించి కుటుంబాలు, జనాభా లెక్కలను ప్రభుత్వం వెలువరించింది. జిల్లా జనాభాలో 55.53 శాతం బీసీలు ఉండగా, 16.82 శాతం ఎస్సీలు, 9.90 శాతం ఎస్టీలు, 6.94 శాతం బీసీ ముస్లింలు, 8.71 శాతం ఓసీలు ఉన్నట్లు వెల్లడైంది. కులాల వారీగా పరిశీలిస్తే ముదిరాజ్లు ఎక్కువగా ఉన్నారు. 41,349 కుటుంబాల పరిధిలో 1,29,842 మంది ముదిరాజ్లున్నారు. బీసీ జనాభాలో వీరు 20.65 శాతం కావడం గమనార్హం. జిల్లా జనాభాలో 27,278 ఎస్టీ కుటుంబాలలో 98,311 జనాభా ఉంది. ఇందులో 91.57 శాతం అంటే 90,028 మంది లంబాడీలు కావడం గమనార్హం. జిల్లాలో ఎస్సీ కుటుంబాలు 51,791 ఉండగా.. జనాభా 1,67,071 మంది ఉన్నారు. ఇందులో 26,299 మాదిగ కుటుంబాలలో 84,792 మంది నివసిస్తున్నారు. ఎస్సీల్లో వీరి శాతం 50.75 గా ఉంది. 19,433 మాల కుటుంబాల్లో 62,104 మంది ఉన్నారు. ఎస్సీల్లో వీరి సంఖ్య 37.17 శాతం. జిల్లాలో ఓసీ కుటుంబాలు 28,838 ఉన్నాయి. 86,515 జనాభాతో 8.71 శాతం ఉన్నట్లు తేలింది. ఇందులో రెడ్డి కులం వారు 44,215 మంది ఉన్నారు. ఓసీల్లో 51.11 శాతం రెడ్డీలే.. ఓసీ జనాభాలో వైశ్యులు 20.14 శాతం ఉన్నారు. నో క్యాస్ట్ కుటుంబాలు 1,751... జిల్లాలో కులం లేని కుటుంబాలు 1,751 ఉన్నాయి. ఆయా కుటుంబాలలో 5,538 మంది ఉన్నారు.కులం కుటుంబాలు శాతం జనాభా శాతం ఎస్సీ 51,791 16.81 1,67,071 16.82 మాదిగ 26,299 56.78 84,792 50.75 మాల 19,433 37.52 62,104 37.17 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఎస్టీ 27,278 8.85 98,311 9.90 లంబాడీ 24,732 90.67 90,028 91.57 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– ఓసీ 28,838 9.36 86,515 8.71 రెడ్డి 15,623 54.18 44,215 51.11 వైశ్య 5,507 19.10 17,423 20.14 ముస్లిం(ఓసీ) 2409 8.35 8,971 10.37 వెలమ 788 2.73 2144 2.48కులాల లెక్క తేలింది. జిల్లాలో యాభై శాతానికిపైగా బలహీన వర్గాలకు చెందినవారే.. కులాలవారీగా తీసుకుంటే ముదిరాజ్లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో లంబాడీలు, మాదిగలు, మాలలు, మున్నూరు కాపులున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి తేలిన కులాల లెక్క ఎస్సీలు 16.82 శాతం, ఎస్టీలు 9.90 శాతం జనాభాలో ముదిరాజ్లే అధికం తర్వాతి స్థానాల్లో లంబాడీలు, మాదిగలు, మాలలు.. -
నిట్ట నిలువు ఎండ!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దక్షిణ తెలంగాణ జిల్లాలతో పోలిస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలు ఎక్కువ ఎత్తులో ఉండడంతో సూర్య కిరణాలు నిట్టనిలువుగా భూమిని తాకుతాయి. ఉత్తర తెలంగాణలో గత వారం రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగా గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా జిల్లాలోని భీమ్గల్లో 43.5 డిగ్రీలు, సరిహద్దులోని నిర్మల్ జిల్లా తానూరులోనూ 43.5 డిగ్రీలు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో 43.4 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా భీమారంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవి ప్రారంభం నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడం గమనార్హం. ఈ నెల 12వ తేదీన భీమ్గల్లో 39.11 డిగ్రీలు, 14న ఆలూరు మండలం మచ్చర్లలో 43.2 డిగ్రీలు, 15న 43.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతను పెంచుతున్న పొడిగాలులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడానికి భౌగోళిక కారణాలు సైతం ఉన్నాయి. ఈ ప్రాంతాలు సముద్ర తీరానికి దూరంగా ఉండడంతో ఇక్కడ ‘టోపికల్ సవన్నా’ (అధిక ఉష్ణోగ్రతలు, స్పష్టమైన వర్షాకాలం) వాతావరణం ఉంటుంది. సముద్రపు గాలుల ప్రభావం లేకపోవడంతో వేడి తీవ్రత నేరుగా ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యా ల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాలు అత్యధికంగా వేడి గాలుల ప్రభావానికి లోనవుతున్నాయి. ఈ ప్రాంతం మీదుగా వీచే పొడిగాలులు ఉష్ణోగ్రతను పెంచుతాయి. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం దేశంలోనే అత్యంత వేడి ప్రాంతాల్లో ఒకటి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు విదర్భ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉండడంతో అక్కడి నుంచి వీచే పొడి, వేడి గాలులు జిల్లాపై ప్రభావం చూపుతున్నాయి. పైగా వేసవిలో సూర్యు డు ఉత్తరార్థ గోళంలో కర్కాటకరేఖకు దగ్గరగా ఉంటాడు. ఉత్తర తెలంగాణ భౌగోళికంగా ఆ అక్షాంశాలకు దగ్గరగా ఉండడంతో సూర్య కిరణాలు నిలువుగా పడి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అడవుల శాతం తగ్గడం, భవనాలు, రోడ్లు వంటి కాంక్రీట్ నిర్మాణాలు ఎక్కువగా ఉండ డంతో వేడి తీవ్రత పెరుగుతోంది. పైగా నల్లరేగడి, రాతినేలలు ఎక్కువగా ఉండడంతో పగటిపూట పీల్చుకున్న వేడి రాత్రి వేళ్లలో బయటకు వస్తోంది. మరోవైపు కొన్నేళ్లుగా పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ ప్రభావం సైతం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2నుంచి 3డిగ్రీలు ఎక్కువ పెరిగేందుకు కారణమవుతున్నాయి.విదర్భ వేడి సైతం ఉత్తర తెలంగాణపై.. నల్లరేగడి, రాతినేలలు పీల్చుకున్న వేడితో రాత్రి సమయాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు ఉత్తర తెలంగాణ కర్కాటకరేఖకు దగ్గరగా ఉండడమూ కారణమే గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా భీమ్గల్, తానూరు ప్రాంతాల్లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు -
హన్మాన్మందిర్ హైస్కూల్కు బెంచీల అందజేత
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి హన్మాన్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి 80 డ్యుయల్ డెస్క్లను అందించినట్లు హెడ్మాస్టర్ అరుణ తెలిపారు. బెంచీలు అందజేసినందుకు విద్యార్థులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు శ్రీధర్రెడ్డి, ఎం.శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, నాయకులు మోహన్రెడ్డి, అశోక్, భూమేశ్ యాదవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండల అధికారులపై చర్యలు తీసుకోవాలి లింగంపేట(ఎల్లారెడ్డి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలపై వివక్ష చూపిన మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి లెగ్గెల రాజు డిమాండు చేశారు. బుధవారం ఆయన లింగంపేటలో మాట్లాడారు. జయంతికి ముందు అంబేడ్కర్ విగ్రహాలకు రంగులు వేసి, పూలతో అలంకరించాలని సర్కులర్ విడుదలైనా.. ఈ విషయమై గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మండల అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే జయంతి నిర్వహించినట్లు ఆరోపించారు. వివక్ష చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. -
నిరుద్యోగులకు జాబ్మేళాతో చక్కని అవకాశం
● బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ: జాబ్మేళాతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. ఉద్యోగాల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా మన ఊరికే వివిధ కంపెనీల ప్రతినిధులు వచ్చి జాబ్మేళాను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ కార్యదర్శి శ్రీకాంత్ను సబ్ కలెక్టర్ అభినందించారు. జాబ్మేళాకు గ్రామీణ ప్రాంత నిరుద్యోగులు అధిక సంఖ్యలో హజరయ్యారు. 41 మందికి ఉద్యోగాలు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్మేళాలో 41 మందికి ఉద్యోగాలు లభించాయని జిల్లా నోడల్ అధికారి సలాం తెలిపారు. ఐటీ కంపెనీలో ఏడుగురు, ఎంఎస్ఎన్ ఫార్మాలో 8 మందికి, విజయ బయో అగ్రికల్చర్లో 22 మంది, బ్యాంకింగ్లో నలుగురు ఉద్యోగాలు సాధించారు. వివిధ కంపెనీల మేనేజర్లు బ్రహానందరెడ్డి, శర్మ, కమలాకర్, నరేష్, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
హోంగార్డు మృతి
భిక్కనూరు: మండల కేంధ్రానికి చెందిన హోంగార్డు ఈరబత్తిని సురేష్(42) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. సురేష్ ప్రస్తుతం బీబీపేట పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. భిక్కనూరు దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీలో సభ్యునిగా ఉన్న సురేష్ మృతితో భిక్కనూరు మండల కేంద్రంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే సురేష్ మృతి వార్తను ఆయన స్నేహితులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సురేష్ అంత్యక్రియలు గురువారం జరుగనున్నా యి. సురేష్కు భార్య, ఇద్దరు కుమారులున్నారు. -
ఈ పంచాయతీ కార్యదర్శి మాకొద్దు
● వెంటనే బదిలీ చేయండి ● ఎంపీడీవో రాజేశ్వర్కు వినతి పత్రం ఇచ్చిన తిమ్మాపూర్ సర్పంచ్, గ్రామస్తులు గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిని వెంటనే బదిలీ చేయాలని, ఈ కార్యదర్శి మాకొద్దంటూ బుధవారం ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవో లక్ష్మీనారాయణకు తిమ్మాపూర్ సర్పంచ్ శంకర్తో పాటు గ్రామస్తులు వినతి పత్రం ఇచ్చారు. సర్పంచ్తో పాటు గ్రామస్తులందరూ ట్రాక్టర్లో ఎంపీడీవో కార్యాలయానికి తరలి వచ్చి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి జ్యోతిశ్రీ సమయ పాలన పాటించడంలేదని, పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉండడం లేదని సర్పంచ్ ఆరోపించారు. గ్రామంలో పారిశుద్ధ్యం, తాగు నీటి సమస్యల గురించి పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఎవరైనా గ్రామస్తులు సమస్యల గురించి గట్టిగా మాట్లాడితే వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. ఉపాధి హామీ పనుల గురించి పట్టించుకోవడంలేదని, పనులు జరిగే చోట కనీసం తాగు నీరు కూడా అందుబాటులో ఉంచడంలేదని ఆరోపించారు. ఏ విషయమైనా నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని, సర్పంచ్కు సైతం కనీస మర్యాద ఇవ్వడంలేదని ఆరోపించారు. అందుకే కార్యదర్శిని వెంటనే బదిలీ చేసి మరో కార్యదర్శిని నియమించాలని గ్రామస్తులు ఎంపీడీవోను కోరారు. -
ఎకరాకు 40 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేయాలి
భిక్కనూరు: ప్రభుత్వం అన్ని మండలాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఎకరాకు 40 క్వింటాళ్లను కొనుగోలు చేయాలని కిసాన్మోర్చా మండలాధ్యక్షుడు జైపాల్రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కిసాన్మోర్చ ఆధ్వర్యంలో ఈ విషయమై తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది పంట దిగుబడి అధికంగా ఉందని ఒక ఎకరాకు 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడి వచ్చిందన్నారు. ఎకరాకు 25 క్వింటాళ్ల నిబంధనల వల్ల రైతులు మిగతా మక్కలను దళారులకు విక్రయించాల్సి వస్తోందన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్, నేతలు భాస్కర్రెడ్డి, గంగారెడ్డి, రమేష్రెడ్డి, వలకొండ రవీందర్రెడ్డి, లక్ష్మిదేవునిపల్లి సర్పంచ్ జిల్లెల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ: తెలంగాణ విద్యుత్ ఆర్జిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు బుధవారం నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. వారి సమ్మె బుధవారం 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా విద్యుత్ కార్మికులు మట్లాడుతూ.. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. విద్యుత్ కార్మికులు దత్తు, నివర్తి, కృష్ణ, పండరి, సాయాగౌడ్, ప్రశాంత్, శ్రీకాంత్, సంజులు, బాల్రాజ్ తదితరులున్నారు. భిక్కనూరు: మద్యం మత్తులో వాటర్ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. రాజంపేట మండలం బసన్నపల్లిలో గ్రామానికి చెందిన బచ్చన్గారి నర్సింలు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో తన భార్యతో గొడవపడి మంచినీటి ట్యాంకును ఎక్కా డు. టవల్తో ఉరివేసుకొని చనిపోతానని బెదిరిస్తూ ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు డయల్ 100కి సమాచారం అందించటంతో అప్రమత్తమైన రాజంపేట నైట్ పెట్రోలింగ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు రాజిరెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నర్సింలు పట్టుకొని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. సమయానికి స్పందించి ఓ నిండు ప్రాణాన్ని కాపా డిని కానిస్టేబుల్ శ్రీనివాస్,హోంగార్డు రాజిరెడ్డిలను ఎస్పీ రాజేశ్చంద్ర,గ్రామస్తులు అభినందించారు. వేల్పూర్: మండలంలోని లక్కోర గ్రామశివారులో 63 నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు లారీలను పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ బుధవారం తెలిపారు. లారీ డ్రైవర్లను విచారించగా ఇసుకకు సంబంఽధించిన పత్రాలు ఏమీ లేవని, ఇసుకను కథలాపూర్ మండలంలోని వాగు వద్ద నింపుకొని వచ్చినట్లు తెలిపారని వెల్లడించారు. ఇసుక లారీలను స్వాధీనం చేసుకొని డ్రైవర్లు, లారీ యజమానులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామానికి చెందిన కోట గంగామణి(26) జీవితంపై విరక్తితో గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ బుధవారం తెలిపారు. నిజామాబాద్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి చెందిన సాయిలుతో ఏడేళ్ల కిందట వివాహం జరగ్గా, ముగ్గురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు. రెండేళ్ల కిందట భర్త సాయిలు అనారోగ్యంతో మృతి చెందగా జన్నెపల్లిలోనే భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. జీవితంపై విరక్తితో మంగళవారం సాయంత్రం యంచ శివారులోని గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలోని బాపూజీనగర్ కాలనీలో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. చందు, కమలేశ్ అనే వ్యక్తులు బాపూజీనగర్ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బుధవారం పోలీసులకు అందిన సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశారు. ఇద్దరు విటులను పట్టుకొని, వారి నుంచి రూ. 2,450 నగదుతోపాటు నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను సురక్షిత ప్రాంతానికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రామారెడ్డి: మండలంలోని జగదాంబ తండా చౌరస్తా లో బుధవారం ఉదయం పోలీసులు రేషన్ బియ్యం పట్టుకున్నారు. మండలానికి చెందిన జూలూరి శ్రీ చరణ్, దుద్దెల్లా రమేశ్ రెండు వాహనాల్లో 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేసి రెవెన్యూ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
న్యాల్కల్లో మహిళ హత్య!
నిందితుల కోసం గాలింపు చర్యలు మోపాల్: మండలంలోని న్యాల్కల్ శివారులోగల ఫౌల్ట్రీ ఫామ్లో పూజిత (30) మంగళవారం అర్ధరాత్రి హత్యకు గురైంది. భర్త అర్జున్ రాథోడ్, ఆయన పెద్ద భార్య రాధ ఆమెను హత్య చేసి పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ శివారులోని కంటేగారి నవీన్రావుకు లక్ష్మీనర్సింహ ఫౌల్ట్రీ ఫామ్ ఉంది. ఆ ఫామ్లో పని చేయడానికి నెల రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన అర్జున్ రాథోడ్ తన ఇద్దరు భార్యలు రాధ, పూజితతో వచ్చాడు. పక్కనే ఉన్న రేకుల షెడ్డులో ఉంటూ పని చేస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు యజమాని నవీన్రావు సముదాయించి సర్ధి చెప్పారు. తాజాగా మంగళవారం కూడా ముగ్గురి మధ్య గొడవ జరిగింది. అర్జున్ రాథోడ్ చిన్న భార్య పూజితను కర్రతో చితకబాది హత్య చేసి పెద్ద భార్య రాధతో కలిసి పరారయ్యాడు. రోజూవారీలాగే యజమాని నవీన్రావు పౌల్ట్రీ ఫామ్ వద్దకు వచ్చి చూడగా కోళ్లు అరుస్తున్నాయి. వెంటనే అర్జున్ రాథోడ్కు ఫోన్ చేయగా ఆయన భార్య రాధ ఫోన్ లిఫ్ట్ చేసింది. ఆరోగ్యం బాగోలేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చామని, అర్జున్ మెడికల్ షాప్కు వెళ్లాడని చెప్పింది. కోళ్లు అరుస్తున్నాయని, దాణా పెట్టలేదా అని అడగగా, పూజితకు పని చెప్పు అని ఫోన్ కట్ చేసింది. పూజితను లేపేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతిచెంది ఉంది. యజమాని నవీన్రావు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఐ.. మహిళ హత్యకు గురైన విషయం తెలుసుకున్న సీఐ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజిత మృతదేహాన్ని పరిశీలించగా ఒళ్లంతా గాయాలు కనిపించాయి.క్లూస్టీం, డ్వాగ్స్క్వాడ్ను పిలిపించారు. పక్కనే కర్రను గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యజమాని నవీన్రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాగా పూజితను అర్జున్ రాథోడ్, రాధ హత్య చేసి పరారయ్యారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. -
కేంద్ర ప్రభుత్వ ఒప్పందాలతో దేశానికి నష్టం
● యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి రోషిణి జైస్వాల్ భిక్కనూరు: కేంద్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ఇతర దేశాలతో చేసుకుంటున్న ఒప్పందాలతో దేశానికి భవిష్యత్తులో తీరని నష్టం వాటిల్లుతుందని యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి రోషిణి జైస్వాల్ అన్నారు. బుధవారం భిక్కనూరులో ఆమె మాట్లాడుతూ.. అమెరికాతో మన కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఒప్పందంతో మన దేశ రైతన్నకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. కేవలం అధికారంలో ఉండాలనే దురుద్దేశంతో బీజేపీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారన్నారు. అందులో ఎంపీ సీట్ల పెంపు ఒకటి అన్నారు. విదేశీ ఉత్పత్తుల దిగుమతి వల్ల దేశీయ రైతులకు గిట్టుబాటు ధర లభించకుండా పోతుందన్నారు. యువత తలచుకుంటే సమాజంలో గొప్ప మార్పు సాధ్యమని పార్టీ సిద్ధాంతాలను గడపగడపకు తీసుకెళ్లడంలో యువత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరాం వెంకటేష్, ఉపసర్పంచ్ దుంపల మోహన్రెడ్డి నేతలు మైపాల్రెడ్డి, నర్మల రాంచంద్రం, తుడుము స్వామి విలియమ్స్ ప్రవీణ్, ప్రదీప్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
వెంటనే వ్యాపారాలు ప్రారంభించండి
గాంధారి(ఎల్లారెడ్డి): మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు వెంటనే వ్యాపారాలు ప్రారంభించాలని మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో సురేందర్ అన్నారు. బుధవారం ఆయన మండలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య భవనంలో ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీఎం ప్రసన్న కుమార్తో కలిసి మహిళా సమాఖ్య సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఐకేపీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గున్కుల్లో ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ వీరంగణాబాయిని బుధవారం డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ పరామర్శించారు. మాజీ ఎంపీపీ భర్త ఈశ్వర్ పటేల్ 15 రోజుల కిందట మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్యాదవ్, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. -
వీణకు అభినందనలు
కామారెడ్డి రూరల్: గర్గుల్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కలిగోట వీణ హాకీలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం తన చాంబర్లో అభినందించి శాలువాతో సన్మానించారు. ఇటీవల రాంచీ, రాజగిర్లో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ హాకీ చాంపియన్షిప్లలో ఆమె అద్భుత ప్రదర్శనతో భారత జట్టుకు ఎంపికై ంది. ఈ ఇండియన్ టీం క్యాంప్ ఏప్రిల్ 19 నుంచి భోపాల్లోని ఎస్ఏఐ సెంటర్లో నిర్వహించనున్నారు. ఇక్కడి నుంచే జపాన్లో జరగనున్న సబ్ జూనియర్(అండర్–18) ఆసియా కప్కు భారత జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనుంది. డీఈవో రాజు, పీడీ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి రూరల్: యువ క్రీడాకారిణి కలిగోట వీణ అంతర్జాతీయ స్థాయిలో హాకీ ఆడేందుకు ఎంపిక కావడం గ్రామానికి గర్వకారణంగా నిలిచిందని సర్పంచ్ చింతల దివ్య, ఎంఈవో ఎల్లయ్యలు అన్నారు. బుధవారం గర్గుల్ ఉన్నత పాఠశాల ఆవరణలో వీణను సత్కరించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిన్న గ్రామం నుంచి అంతర్జాతీయ వేదికపై తన ప్రతిభను చాటుకునే అవకాశాన్ని సాధించడం ఆమె కృషి, పట్టుదల, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు. ఈ సందర్భంగా వీణకు అవసరమైన ప్రయాణ, కిట్, ఇతర ఖర్చుల నిమిత్తం గర్గుల్ గ్రామ సర్పంచ్ చింతల దివ్యరవి తేజ గౌడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రూ.5 వేల నగదు సహాయం అందజేశారు. గ్రామ అభివృద్ధే కాకుండా యువతలో ప్రతిభను ప్రోత్సహించడంలో కూడా తాము ఎల్లప్పుడూ ముందుంటామని సర్పంచ్ పేర్కొన్నారు. అదేవిధంగా వీణ చదువుతున్న పాఠశాల ఉపాధ్యాయులు ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ రూ.10 వేల నగదు అందజేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. వీణ లాంటి విద్యార్థులు మరెంతో మందికి ఆదర్శంగా నిలుస్తారని, ఆమె అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. హెచ్ఎం ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అన్ని గ్రామాల్లో ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పకడ్బందీగా చేపట్టాలని అదనపు డీఆర్డివో విజయలక్ష్మి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఐకేపీ సీసీలు, వీవోఏలకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉద్యహ రిజిస్ట్రేషన్ చేయడం వల్ల గ్రామాల్లోని చిరు వ్యాపారులకు ఎంఎస్ఎంఈలో భాగంగా రుణాలు తీసుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. అన్ని గ్రామాల్లో ఈ నెల 17 నుంచి మే 16 లోపు పూర్తిచేయాలని సూచించారు. ఏపీఎం ప్రసాద్, మండల సమాఖ్య అధ్యక్షులు బాలంబాయి పాల్గొన్నారు. -
అధ్వానంగా ‘చెత్త’ సేకరణ
● కాలనీల్లోనికి రాని చెత్త సేకరణ వాహనాలు ● రోడ్లపైనే చెత్త వేస్తున్న స్థానికులు ● డంపింగ్యార్డులా తయారైన బల్దియా కామారెడ్డి టౌన్ : మున్సిపల్ పరిధిలోని పలు కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మున్సిపల్ చెత్త సేకరణ ఆటోలు ప్రతిరోజూ కాలనీల్లోకి రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది లేక స్థానికులు ఇళ్లలోని చెత్తను రోడ్ల పక్కనే పడేస్తున్నారు. దీంతో వార్డుల్లోని ప్రధాన రహదారులు, ఖాళీ స్థలాలు డస్ట్బిన్లుగా మారుతున్నాయి. రోడ్లపై చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఈ చెత్తపై పందులు, పశువులు స్వైరవిహారం చేస్తూ అపరిశుభ్రతను మరింత పెంచుతున్నాయి. దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రావడం లేదని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. కొన్ని చెత్త సేకరణ ఆటోలు మరమ్మతులు లేక మూలనపడటమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మున్సిపల్లో 49 వార్డులకు ప్రస్తుతం నాలుగు వార్డులకు కలిపి కేవలం ఒకే ఆటోను కేటాయించారు. ఫలితంగా ఒక్కో కాలనీకి వారం రోజులకు ఒకసారి మాత్రమే వాహనం వస్తుండటంతో పారిశుద్ధ్య సమస్య తీవ్రమవుతోంది. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, ప్రతిరోజూ చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలని, పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం పట్టణంలోని పలు కాలనీల్లో ‘సాక్షి’ పర్యటించగా, రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్త కుప్పలు కెమెరాకు చిక్కాయి. -
విద్యార్థి మృతి ఘటనపై ఆందోళన
ఎల్లారెడ్డి: పట్టణంలోని బీసీ బాలికల వసతి గృహంలో ఉంటూ ఎనిమిదో తరగతి చదువుతున్న శ్రావణి (13) బుధవారం వేకువ జామున అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో నిద్ర లేచిన విద్యార్థులకు వాచ్మన్ గది డోర్ వద్ద శ్రావణి అపస్మారక స్థితిలో కనిపించింది. ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పర్యవేక్షణ కరువు.. బాలికల హాస్టల్పై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువయ్యింది. ఇక్కడ పూర్తి స్థాయి వార్డెన్ లేరు. ఇన్చార్జి వార్డెన్ ఉండడంతోవిద్యార్థులపై శ్రద్ధ చూపేవారు కరువయ్యారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సరైన వసతులు కూడా లేవని పేర్కొంటున్నారు. విద్యార్థి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యతని వారు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ.. విషయం తెలుసుకున్న బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. మృతురాలి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రే షియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ రాస్తారోకోలో పాల్గొన్నారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ నాయకులు భిక్షాటన చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి భిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నేడు ఎల్లారెడ్డి బంద్కు పిలుపు హాస్టల్లో విద్యార్థిని శ్రావణి మరణంపై విచారణ జరిపించి, ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎల్లారెడ్డి బంద్కు అఖిలపక్షం పిలుపునిచ్చింది. ఎలాంటి అనారోగ్య సమస్యలేని విద్యార్థిని హఠాత్తుగా మరణించడంపై తమకు అనుమానాలు ఉన్నాయని నాయకులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బుధవారం నిరసన తెలుపుతున్న నేతలను అరెస్ట్ చేయాలని ఖండించారు. ఎల్లారెడ్డి బంద్కు వ్యాపార వర్గాలు సహకరించాలని కోరారు.భిక్కనూరు: ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో మరణించిన ఎనిమిదో తరగతి విద్యార్థి శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ను పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం సాయంత్రం భిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు భారీగా స్టేషన్కు తరలివచ్చారు. సురేందర్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేశారు. అనంతరం పాత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడంతో ఎస్సై ఆంజనేయులు ఆందోళనకారులతో మాట్లాడారు. అయినా వారు రాస్తారోకో విరమించేందుకు అంగీకరించలేదు. దీంతో ఎస్సై సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వారి సూచన మేరకు మాజీ ఎమ్మెల్యేను విడిచిపెట్టడంతో బీఆర్ఎస్ నేతలు రాస్తారోకో విరమించారు. -
ఇది రేవంత్ రాక్షస పాలన
భిక్కనూరు: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని.. రేవంత్రెడ్డి రాక్షస పాలన అని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ పేర్కొన్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి హాస్టల్లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి శ్రావణి మృతి చెందిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలిపారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం కోసం ఆందోళన చేస్తున్న తమను అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యార్థి శ్రావణి మృతికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆమె మృతిపై నిజానిజాలు తేల్చేవరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ఆందోళనల్లో బీఆర్ఎస్ నేతలు అందె మహేందర్రెడ్డి, తున్కి వేణు, సాయగౌడ్, పాల రాంచంద్రం, వెంకట్రెడ్డి, నర్సారెడ్డి, మధుమోహన్రెడ్డి, వాసుయాదవ్, రవీందర్రెడ్డి, యాదగిరి, శ్రీశైలం, మల్లేశం, కనకరాజు, సరస్వతి ప్రభాకర్, హన్మంత్రెడ్డి, బాబు, పోతిరెడ్డి, నరేందర్రెడ్డి, సురేందర్రెడ్డి, బాలకృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘షాడో ఆఫీసర్’పై నివేదిక కోరిన కలెక్టర్!
● ప్రాథమిక విచారణ జరిపిన డీఎంహెచ్వోసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా వైద్యారోగ్య శాఖలో జరుగుతున్న పరిణామాలపై ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన ‘వైద్యారోగ్య శాఖలో షాడో ఆఫీసర్’ కథనంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్వో రవీందర్గౌడ్ను ఆదేశించారు. దీంతో ప్రాథమిక విచారణ జరిపి జిల్లా కలెక్టర్కు నివేదిక సమర్పించినట్లు డీఎంహెచ్వో ఒక ప్రకటనలో తెలిపారు. మాచారెడ్డి పీహెచ్సీకి చెందిన సీహెచ్వో వై.వెంకటేశ్వర్రావు దోమకొండ డిప్యూటీ డీఎంహెచ్వో కార్యాలయంలో పనిచేస్తున్నాడని, అయితే అన్నారం పీహెచ్సీలో అన్ని విషయాల్లో పేలవమైన పనితీరు ఉన్నందున దాన్ని మెరుగు పరిచే ఉద్దేశంతో ఆయనను డిప్యూటేషన్పై పంపించామని నివేదికలో పేర్కొన్నారు. కాగా అన్నారం పీహెచ్సీలో హెచ్ఈవోగా పనిచేసిన మంజూర్ అహ్మద్ను గతంలో పనిచేసిన డీఎంహెచ్వో రాజంపేట పీహెచ్సీకి డిప్యూటేషన్పై పంపారన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి ఉద్యోగుల విషయంలో దురుసుగా వ్యవహరించినట్టు తమ దృష్టికి రాలేదని తెలిపారు. తదుపరి విచారణలో ఏమైనా తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
చట్టాల రూపకల్పనలో మహిళల పాత్రతో దేశానికి మేలు..
చట్టాలను రూపొందించే పార్లమెంటు, శాసన సభల్లోకి మహిళలు గణనీయమైన స్థాయిలో వెళ్లే అవకాశం రావడం చరిత్రాత్మకం. చట్టాల రూపకల్పనలో మహిళలకు కీలక పాత్ర కల్పించడంతో దేశానికి చాలా మేలు కలుగుతుంది. ఇప్పటికే మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తలుగా, టెక్నోక్రాట్లుగా, మరోవైపు న్యాయ మూర్తులుగా చరిత్రాత్మక తీర్పులు ఇస్తున్న నేపథ్యం ఉంది. న్యాయవాదులుగా కీలకమైన కేసులు వాదిస్తూ విజయం సాధిస్తున్నారు. కార్యనిర్వాహక విభాగాల్లో, క్రీడారంగంలో, వ్యాపార రంగంలో అద్భుతాలు సాధిస్తున్నారు. చట్టసభ ల్లోనూ తిరుగులేని పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. – కాటిపల్లి సరళ మహేందర్రెడ్డి, హైకోర్టు న్యాయవాది -
నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం వల్లే ప్రమాదాలు
డిచ్పల్లి: నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా బర్థిపూర్ శివారులోని సుగుణ గార్డెన్స్లో పోలీస్, రవాణా శాఖల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న వారు వ్యక్తిగతంగా వారి కుటుంబాలతోపాటు సమాజానికి, ఇతరులకు కూడా తీరని నష్టం చేకూరుస్తున్నారన్నారు. ఎవరికివారు తమవంతు బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ను విధిగా పాటించినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని హితవు పలికారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్–అలైవ్లో అందరూ భాగస్వాములు కావాలన్నారు. కొత్త బస్ డిపో.. జిల్లాకు త్వరలోనే కొత్త బస్ డిపో రానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి స్పష్టం చేశారు. రవాణాశాఖ పరంగా కూడా చెక్ పోస్టులు ఎత్తివేయడం వంటి అనేక నూతన సంస్కరణలను అమల్లోకి తెచ్చామని గుర్తు చేశారు. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య తదితరులు ప్రసంగించారు. వాల్పోస్టర్లు, కరపత్రాల ఆవిష్కరణ రహ్ వీర్, పీఎం రాహత్, హిట్ అండ్ రన్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక తోడ్పాటు, ప్రోత్సాహకాలపై ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు వీలుగా రూపొందించిన వాల్ పోస్టర్లను, కర పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీపీ తదితరులు సంతకాలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలి రోడ్డు ప్రమాదాల నివారణకు స్వీయ నియంత్రణ తప్పనిసరి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ -
చట్టసభలకు పరిపూర్ణత
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం కోటా అమలు చేసే విషయమై బిల్లు ఆమోదం అయిన నేపథ్యంలో నేటి నుంచి పార్లమెంటులో మూడు రోజుల పాటు చర్చ జరుగనుంది. పార్లమెంటు, శాసనసభలో సీట్ల సంఖ్యను 50 శాతం మేర పెంచనున్నందున రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలు 182కు, 17 లోక్సభ సీట్లు 26కు పెరుగనున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 అసెంబ్లీ సీట్లు 13కు పెరగనున్నట్లు అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 15,71,022 మంది జనాభా, కామారెడ్డి జిల్లాలో 9,72,625 మంది జనాభా ఉంది. ఇక గత ఎన్నికల (2023) లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 20,06,494 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 9,58,718 మంది కాగా, మహిళా ఓటర్లు 10,47,674 మంది, ఇతరులు 102 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళల ఓట్లు 88,956 ఎక్కువగా ఉన్నాయి. విడివిడిగా చూసినా కూడా అన్ని శాసనసభ నియోజకవర్గాల్లోనూ మహి ళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే కూడా ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా, ఓట్ల శాతం అధికంగా ఉంది. తాజాగా చేపడుతున్న జనాభా లెక్కల మేర కు ఉమ్మడి జిల్లాలో మహిళా జనాభా ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. ● రాష్ట్రంలో 182కు అసెంబ్లీ సీట్లు పెరిగితే ఇందులో 60 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. మొత్తంగా జనరల్ మహిళలకు 46, ఎస్సీ మహిళలకు 09, ఎస్టీ మహిళలకు 5 సీట్లు దక్కనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సీట్లు 13కు పెరిగితే మహిళలకు 4 నుంచి 5 సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా. దీంతో ఇక్కడి నుంచి శాసనసభకు చెప్పుకోదగిన స్థాయిలో మహిళలు అడుగుపెట్టే అవకాశాలపై వివిధ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ‘సాక్షి’తో పలువురి అభిప్రాయాలు..చట్టసభల్లో మహిళలకు పాత్ర కల్పించడంతో ఆయా సభలకు కచ్చితమైన పరిపూర్ణత వస్తుంది. మహిళా సాధికారత విషయంలో ఇది తిరుగులేని పరిణామం. ఇప్పటికే మహిళలు స్వయంశక్తులుగా ఎదగడంలో అన్నిరంగాల్లోనూ సాధిస్తున్న తిరుగులేని విజయాలే నిదర్శనం. అమ్మగా అన్నింటినీ చక్కబెట్టే మహిళలు వ్యవస్థలను చక్కబెట్టడంలోనూ గురుతర బాధ్యతతో వెళతారు. – డాక్టర్ కవితారెడ్డి -
ఇక పిడుగులు పడ్డా.. నో ప్రాబ్లమ్
● సమస్యకు చెక్ పెట్టేందుకు ఎన్పీడీసీఎల్ ముందస్తు చర్యలు ● ట్రాన్స్ఫార్మర్లకు రక్షణగా లైట్నింగ్ అరెస్టర్స్ బిగింపు ఎల్లారెడ్డిరూరల్: వర్షాకాలంలో విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా పిడుగులు పడ్డప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడంతో తీవ్ర నష్టం జరుగుతుంటుంది. విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది శ్రమించాల్సి వస్తుంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఎన్పీడీసీఎల్ ముందస్తు రక్షణ చర్యలు చేపడుతోంది. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణగా లైట్నింగ్ అరెస్టర్స్ ఏర్పాటు చేస్తోంది.కొండ ప్రాంతాలు, పిడుగులు పడే ఏరియాలను గుర్తించి లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని రుద్రారం, సాతెల్లి, మాచాపూర్, ఆజామాబాద్, అన్నాసాగర్ గ్రామాల పరిధిలోని విద్యుత్ స్తంభాలకు లైట్నింగ్ అరెస్టర్లను ఏర్పాటు చేశాం. పిడుగులు పడ్డా వీటి వల్ల డీటీఆర్లకు ఇబ్బంది కలగదు. పిడుగులు నేరుగా భూమిలోకి వెళ్లేలా ఇది చూస్తుంది. దీంతో విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉంటుంది. – విజయసారథి, డీఈ, ఎల్లారెడ్డిఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాలున్నాయి. ఆయా మండలాలలో కలిపి 8వేల డీటీఆర్లు(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు) ఉన్నాయి. ఏటా పిడుగులు పడ్డప్పుడు పలు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయి. వాటికి మరమ్మతులు శాఖకు భారంగా మారుతున్నాయి. దీంతో పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగి వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు. పిడుగులు పడ్డా నష్టం జరగకుండా ఉండేందుకు లైట్నింగ్ అరెస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. పిడుగుల వల్ల వచ్చే హైఓల్టేజీ నేరుగా ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ లైన్లపై పడకుండా భూమిలోకి పంపించే సేఫ్టీ ఎక్విప్మెంట్గా ఈ లైట్నింగ్ అరెస్టర్ ఉపయోగపడుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటి వల్ల ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లు రక్షణ పొందుతాయని పేర్కొంటున్నారు. -
‘కార్పొరేట్ స్థాయిలో సర్కారు బడి ఉంది’
బీబీపేట: కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవనం ఉండడమే కాకుండా అంతకంటే మించి వసతులు బాగున్నాయని రిటైర్డ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని టీఎస్ఎన్ఆర్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి పాఠశాల భవనాన్ని అధ్బుతంగా నిర్మించారని, అంతటితో వదిలేయకుండా పాఠశాలలో వసతులు కూడా కల్పిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రంథాలయం, మినరల్ వాటర్ ప్లాంట్ తదితర వాటిని పరిశీలించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు మూల రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు. నిజాంసాగర్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. బుధవారం మహమ్మద్నగర్ మండలంలోని నర్వలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మహమ్మద్నగర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి సర్పంచ్లు రమేశ్ యాదవ్, అనసూజ, జీవన్, కిరణ్, నాయకులు నర్సింలు, అతిఖ్, ఆకాష్, శ్రీనివాస్ సేట్, రామాగౌడ్, శివ రాజ్, కాశయ్య, సాయాగౌడ్ పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కలెక్టరేట్లోని గనులు, భూగర్భజల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎం.గంగాగౌడ్ బుధవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నారు.కామారెడ్డి అర్బన్: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారులు, కార్మిక, పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్, తహసీల్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జేఏసీ జిల్లా చైర్మన్ వెంకట్రెడ్డి తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్, తహసీల్దార్లకు అందజేస్తామని పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణానికి చెందిన గురుకుల ఉపాధ్యాయురాలు క్యాతం వెన్నెల అంబేడ్కర్ రాష్ట్రీయ సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె మైక్రో ఆర్టిస్ట్గా, సామాజిక కార్యకర్తగా, రక్తదాతగా అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 150 నిమిషాల్లో 365 నువ్వు గింజలపై తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు 15 పర్యాయాలు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆమెను ముంబయికి చెందిన గ్లోబల్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా డాట్ కామ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపిక చేశారు. వెన్నెల సేవా కార్యక్రమాలపై గ్లోబల్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా తన మ్యాగజైన్లో సక్సెస్ స్టోరీ సైతం ప్రచురించింది. 24 నుంచి ఎంఈడీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యుల ర్ పరీక్షలు 24 నుంచి ప్రారంభమవుతాయ ని పరీక్షల నియంత్రణాధికారి సంపత్కుమార్ తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.telanganauniversity. ac.in లో సంప్రదించాలని సూచించారు. -
మండుతున్న సూరీడు
● జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు ● భిక్కనూరు, బీబీపేట, వెల్పుగొండలలో 42.8 డిగ్రీలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. వారం రోజులుగా క్రమంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మంగళవారం జిల్లా అంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలతో రైతులు, కూలీలతో పాటు వివిధ వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వృద్ధులు, చిన్నారులు వేడితో అల్లాడిపోతున్నారు. మంగళవారం జిల్లాలో అత్యధికంగా భిక్కనూరు, బీబీపేట మండల కేంద్రాలతో పాటు పాల్వంచ మండలం వెల్పుగొండలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. పిట్లంలో 42.7 డిగ్రీలు, మద్నూర్ మండలం సోమూర్, మేనూర్, ఎల్లారెడ్డి మండలం మాచాపూర్, గాంధారి మండల కేంద్రాల్లో 42.6 డిగ్రీలు నమోదయ్యాయి. నస్రుల్లాబాద్, ఇసాయిపేటలో 42.3 డిగ్రీలు, సదాశివనగర్లో 42.2, జుక్కల్, కొల్లూర్లలో 42.1, సర్వాపూర్, కామారెడ్డి, దోమకొండలలో 41.9, డోంగ్లీ, బొమ్మన్దేవ్పల్లి, బిచ్కుంద, బీర్కూర్లో 41.8, పాత రాజంపేటలో 41.7, పుల్కల్లో 41.4, రామారెడ్డిలో 41.2, రామలక్ష్మణ్పల్లిలో 41.1, తాడ్వాయిలో 40.9, లింగంపేట, లచ్చాపేటలలో 40.8, హసన్పల్లి, ఆర్గొండలలో 40.7, పెద్దకొడప్గల్లో 40.3, నాగిరెడ్డిపేటలో 40.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండలతో హడలిపోతున్న జనం... జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిపోవడంతో జనం హడలిపోయారు. ఉదయం 10 గంటలకే ఎండ మండిపోవడంతో జనం రోడ్లపై తిరగడానికి ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం పూట ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్ కావడతో షాపింగ్, ఇతర పనుల కోసం బయటకు వెళ్లాలన్నా జంకుతున్నారు. వడగాలులు కూడా వీస్తుండడంతో ఇబ్బందిపడుతున్నారు. -
వైద్యారోగ్య శాఖలో ‘షాడో’ ఆఫీసర్!
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో ‘షాడో’ అధికారి పెత్తనం నడుస్తోంది. జిల్లా అధికారికి తానే పోస్టింగ్ ఇప్పించానంటూ చెప్పుకుంటున్న సదరు అధికారి.. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. డబ్బులు అడగడం.. ఇవ్వకపోతే ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారిందని ఆ శాఖ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిదోమకొండ డివిజన్లో పనిచేసే ఓ అధికారి ఇటీవలే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో పరిపాలన విభాగంలో ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్నారు. సదరు అధికారి అక్కడా, ఇక్కడా అధికారులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఏడెనిమిది నెలల్లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉన్న దోమకొండ డివిజన్లో పనిచేస్తున్న ఓ అధికారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం వెలుగు చూసింది. సీహెచ్వోకు హెచ్ఈవో స్థాయి బాధ్యతలు.. మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూటనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్వో) క్యాడర్లో ఉన్న వై.వెంకటేశ్వర్రావు అనే అధికారిని గతంలో దోమకొండ డిప్యుటీ డీఎంహెచ్వో కార్యాలయానికి డిప్యూటేషన్పై తీసుకున్నారు. ఆయనకు డివిజన్లోని ఆరు పీహెచ్సీల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. అయితే హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మానిటరింగ్ చేయడానికి వెంకటేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పర్యవేక్షిస్తున్నారు. డీఎంహెచ్వో ఇచ్చిన ఆర్డర్పై పనిచేస్తున్న వెంకటేశ్వర్రావును.. సదరు షాడో అధికారి టార్గెట్ చేసుకుని అన్నారం పీహెచ్సీకి డిప్యూటేషన్పై పంపించారు. అదే రోజు జాయిన్ కావాలని ఉత్తర్వులు ఇవ్వడంతో వెంకటేశ్వరరావు అన్నారం పీహెచ్సీలో రిపోర్టు చేశారు. వాస్తవంగా అన్నారం పీహెచ్సీలో సీహెచ్వో పోస్టు లేదు. అక్కడ హెచ్ఈవో పోస్టు ఉంది. అక్కడ హెచ్ఈవోగా పనిచేస్తున్న వ్యక్తిని ఇటీవలే రాజంపేటకు డిప్యూటేషన్పై పంపించారు. ఒకవేళ అన్నారం పీహెచ్సీలో అవసరం ఉంటే హెచ్ఈవో డిప్యూటేషన్ను క్యాన్సిల్ చేసి అక్కడ పని చేయించాలి. కానీ గెజిటెడ్ హోదా కలిగిన సీహెచ్వోను హెచ్ఈవో పోస్టుకు డిప్యూటేషన్పై పంపడంపై విమర్శలు వస్తున్నాయి. డిప్యూటేషన్పై పంపడమే కాకుండా అక్కడి అధికారి, సిబ్బందికి ఫోన్లు చేస్తూ వెంకటేశ్వరరావు డ్యూటీకి వస్తున్నారా లేదా అని ఎంకై ్వరీ చేస్తూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. వెంకటేశ్వరరావు వివాదాలకు దూరంగా ఉంటారని, డ్యూటీ మైండ్తో పనిచేస్తారని వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు. సర్వీస్ మొత్తంలో చిన్న కంప్లయింట్ కూడా లేని అధికారిని షాడో ఆఫీసర్ వేధిస్తుండడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సదరు షాడో అధికారి జిల్లా కార్యాలయంలో పనిచేసే ఓ అధికారితోనూ దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.ఎప్పుడూ ఏదో వివాదంలో ఉండే జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఇన్చార్జి డీఎంహెచ్వోగా రవీందర్గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాతైనా శాఖ గాడిన పడుతుందని భావించారు. అయితే వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న షాడో అధికారి తీరుతో ఉద్యోగులు విసిగిపోతున్నారు. ఇబ్బందులకు గురిచేస్తున్న షాడోకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. సదరు షాడో అధికారి వ్యవహారంపై ఇన్చార్జి డీఎంహెచ్వో రవీందర్గౌడ్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. తాను ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యాచరణ కార్యక్రమంలో బిజీగా ఉన్నానన్నారు. రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటానన్నారు. సీహెచ్వో వెంకటేశ్వర్రావుకు శాఖలో మంచి అధికారి అన్న పేరుందని ఇన్చార్జి డీఎంహెచ్వో పేర్కొన్నారు. పనిచేసేవారికి వేధింపులు సీనియర్ అధికారికి తక్కువ స్థాయి పోస్టుకు డిప్యూటేషన్ పలువురిపై దురుసు ప్రవర్తన ఆందోళనకు సిద్ధమవుతున్న ఉద్యోగులు -
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
సదాశివనగర్: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కుప్రియాల్ గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై గల యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్ను ఆయన పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. మూడేళ్లలో ఈ చౌరస్తా వద్ద 12 మంది మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఒక్క ప్రమాదం కూడా జరగలేదన్నారు. ఈ విషయంలో పోలీస్ శాఖ, హైవే అధికారులు సమన్వయంతో తీసుకున్న భద్రతా చర్యలను డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ సంతో ష్కుమార్, ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
హెల్మెట్ ఉంటే బతికెటోడన్నరు..
‘‘ఒక్కగానొక్క కొడుకు.. పేదరికంలో ఉన్నా బీడీలు చుడుతూ చదివించుకున్న. టెట్ రాసి డీఎస్సీ కోసం ఎదురు చూస్తుండె. అప్పటిదాకా ఖాళీగా ఎందుకు అని కామారెడ్డిలో ఓ ప్రైవేటు ఉద్యోగానికి పోయేటోడు. ఆ రోజు కూడా పోయి వస్తానని చెప్పి ఇంటి నుంచి బైక్ మీద బయలుదేరిండు. అవే చివరి మాటలు.. 10 నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది మీ కొడుకు ట్రాక్టర్ ఢీకొట్టడంతో చనిపోయిండని’’ అని బీబీపేటకు చెందిన కళావతి పేర్కొంది. హెల్మెట్ ఉంటే బతికెటోడని అన్నారన్నారు. అరైవ్ అలైవ్లో భాగంగా రోడ్డు ప్రమాదాల బాధిత కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ ‘‘ఇక్కడున్న వారంతా నా కొడుకు లాంటి వారే.. హెల్మెట్ పెట్టుకోండయ్యా, తాగి బండి నడపకండయ్యా’’ అంటూ ఆమె విలపించడం అక్కడున్న వారందరినీ కలచివేసింది. -
ట్రాఫిక్ నిబంధనలను అలవాట్లుగా మార్చుకోవాలి
ఇందల్వాయి: హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణ, నిర్ణీత వేగం, ట్రాఫిక్ నియమాలు పాటించడం నిత్య జీవితంలో అలవాటుగా మార్చుకోవాలని డీజీపీ బి శివధర్రెడ్డి సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా చంద్రయాన్పల్లి గ్రామం వద్ద మంగళవారం నిర్వహించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా 44వ నంబరు జాతీయ రహదారిపై వీడియో సంఘటన గుర్తింపు వ్యవస్థ (వీఐడీఎస్)ను ప్రారంభించారు. వీఐడీఎస్ వ్యవస్థ మానవ ప్రమేయం లేకుండా ఏఐ విశ్లేషణతో కూడి అధునాతన కెమెరాలతో పనిచేస్తుందని డీజీపీ వివరించారు. కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ రాజారెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్రెడ్డి ఎన్హెచ్ 44పై వీఐడీఎస్ ప్రారంభం -
అరైవ్ అలైవ్తో మార్పు
● తగ్గుతున్న రోడ్డు ప్రమాదాలు ● అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి ● డీజీపీ శివధర్రెడ్డికామారెడ్డి క్రైం: ‘అరైవ్ –అలైవ్’తో మార్పు కనిపిస్తోందని డీజీపీ శివధర్రెడ్డి పేర్కొన్నారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించిన అరైవ్–అలైవ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను ఎస్పీ రాజేశ్ చంద్ర పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఏటా రోడ్డు ప్రమాదాల్లో 7,500 మందికిపైగా చనిపోతున్నారన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్రూట్, అతివేగంలాంటి కారణాలతోనే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం అరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. ఈ కార్యక్రమం అమలు చేశాక ప్రమాదాలు తగ్గాయన్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలలో 330 మరణాలు తక్కువగా నమోదయ్యాయన్నారు. ఈ లెక్కన ఏడాదిలో 1200 లకుపైగా మరణాలను తగ్గించే అవకాశం ఉందన్నారు. కుటుంబమే రోడ్డున పడుతుంది ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే అతడి కుటుంబం మొత్తం రోడ్డున పడినట్లే అవుతుందని డీజీపీ పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రాంతంలో ఇటీవల ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో చనిపోతే కుటుంబ పోషణ భారమై అతడి భార్య తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ డిఫెన్సివ్ డ్రైవింగ్ను అలవర్చుకోవాలని సూచించారు. తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకోవాలన్నారు. ప్రతినెలా సమీక్షిస్తున్నాం ప్రతి నెలా జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి జిల్లాలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరుపుతున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో తగిన చర్యలు చేపడుతున్నామన్నారు. సర్పంచ్లు సైతం ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర వహించాలని కోరారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు కామారెడ్డిలోని సాందీపని కళాశాల విద్యార్థులు రోడ్డు ప్రమాదాలతో కలిగే అనర్థాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళాప్రదర్శనలు ఇచ్చారు. డీజీపీ విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఎస్పీ రాజేశ్ చంద్ర, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎఫ్వో నిఖిత, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, డ్రైవర్లు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్రెడ్డికి జిల్లా పోలీసు కార్యాలయం వద్ద కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఆయన కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐజీ చంద్రశేఖర్రెడ్డి, ఏఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా అంబేడ్కర్ జయంతి
కామారెడ్డి టౌన్ : జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రజల హక్కులను పరిరక్షించడంలో రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన బాటలో నడవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, తహసీల్దార్ హిమబిందు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవాలి
కామారెడ్డి టౌన్ : రక్తదానం చేసి ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని కాపాడి ప్రాణదాతలుగా నిలవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘంల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కర్షక్ డిగ్రీ కళాశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తలసేమియా బాధితుల కోసం నిర్వహించిన ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రక్తదానంపై అవగాహన పెంచుకోవాలని, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదానం చేసిన వారికి ప్రశంస పత్రాలతో పాటు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు కొంగల వెంకటి, ప్రవీణ్ నాయక్, తదితరులు పాల్గొన్నారు. -
టీపీఎస్ కోసం స్థల పరిశీలన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశా ల పరిసరాలను డీఈవో రాజు మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాసంవత్సరంలో టీపీవో ప్రారంభం కానుందన్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. అవసరమై తరగతి గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబందించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఆయన వెంట ఎంఈవో రాజు, ఉపాధ్యాయులు ఉన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థిని కలిగోట వీణ అండర్–18 జాతీయ హాకీ జట్టుకు ఎంపికయ్యింది. ఇటీవల రాంచీలో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ హాకీ చాంపియన్షిప్లో అద్భుత ప్రతిభ చూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారని పాఠశాల పీఈటీ మధుసూదన్రెడ్డి తెలిపారు. ఈనెల 19 నుంచి భోపాల్లో నిర్వహించే ఇండియన్ టీం క్యాంప్లో పాల్గొటుందని పేర్కొన్నారు. అనంతరం జపాన్లో నిర్వహించే సబ్ జూనియర్ అండర్ –18 ఆసియా కప్ హాకీ పోటీల్లో భారత జట్టు తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి అర్బన్: ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించడం కోసం బుధవారం ఉదయం 7 గంటలకు కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు 3కే రన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఫైర్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కామారెడ్డి టౌన్ : ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలుపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 16న నిర్వహించనున్న మండల స్థాయి సమావేశాల సంసిద్ధత గురించి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమావేశాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు మేలు జరిగేలా చూడాలని ఎంపీడీవోలకు సూచించారు. సమావేశాల పర్యవేక్షణ బాధ్యతను జెడ్పీ సీఈవో చందర్నాయక్కు అప్పగిస్తూ, అన్ని మండలాల నుంచి నివేదికలు సేకరించి జిల్లా స్థాయి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి సమావేశాలు సజావుగా సాగేందుకు మండల ప్రత్యేక అధికారులను ‘నోడల్ అధికారులు’గా నియమించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, సీపీవో రఘునందన్ పాల్గొన్నారు. నేడు మంత్రి పొన్నం రాక నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్కు రానున్నారు. ఆయన మధ్యాహ్నం 2.45 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి డీఎస్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ, చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం సుగుణ గార్డెన్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఈనెల19న నిర్వహించనున్నట్లు నిజామాబాద్ డీఈవో పార్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం ఆరో తరగతి, మధ్యాహ్నం ఏడో తరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సంబంధిత వెబ్సైట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9391266444 నంబర్ను సంప్రదించాలన్నారు. -
అంబేడ్కర్ చూపిన మార్గంలో నడవాలి
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డిబాన్సువాడ: భారతరత్న బాబా సాహెబ్ అంబేడ్కర్ చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా బాన్సువాడలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశానికి దిక్చూచి వంటి రాజ్యాంగాన్ని రచించిన రూపశిల్పి అంబేడ్కర్ అని అన్నారు. అంబేడ్కర్ చూపిన బాటలోనే నడుస్తూ సమానత్వ భారత నిర్మాణానికి బాటలు వేయాలని కోరారు. బాధతోనే అలా మాట్లాడా.. అభివృద్ధి పనుల విషయంలో కొంత మంది నాయకులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో బాధతోనే అలా మాట్లాడానని పోచారం శ్రీనివాస్రెడ్డి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. వర్ని మండలంలోని సిద్దాపూర్ ఎత్తిపోతల పథకం వద్ద రెండు రోజుల క్రితం ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసినా మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ప్రభుత్వంపై తన అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ విషయమై బాన్సువాడలో ఆయన మంగళవారం మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే అలా మాట్లాడానని చెప్పారు. డీఎస్పీ విఠల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మబేగం, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, కౌన్సిలర్లు దొన్కంటి శ్యామల, రుక్మిణీ, నిజామాబాద్ డీసీ హెచ్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దాం
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే బిచ్కుంద(జుక్కల్): బాబాసాహెబ్ అంబేడ్కర్ అడుగు జాడలో నడిచి ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేద్దామని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే అన్నారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బిచ్కుందలో విగ్రహానికి పూల మాలలు వేసి నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందరివాడు అన్ని వర్గాల అభివృద్ధి, దేశ ప్రగతికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల అందరికీ హక్కులు లభించాయని, కులవ్యవస్ధ నిర్మూలనకు ఎంతో కృషి చేశారని అన్నారు. -
కాంగ్రెస్లో భారీగా చేరికలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ధర్మారెడ్డి గ్రామంలో చిన్నఆత్మకూర్ గ్రామ సర్పంచ్ మిద్దింటి అనితతో పాటు సుమారు 50 మంది మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్గౌడ్, నాయకులు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మకు బోనాలు ఊరేగించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఇంటింటికి బోనం తీసుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. శోభాయాత్ర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎల్లమ్మ ఆలయం చుట్టూ ఐదుసార్లు బోనాలు ప్రదర్శించి అమ్మవారికి సమర్పించారు. మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేశారు. -
అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
ఎల్లారెడ్డిలో నివాళులర్పిస్తున్న ఫైర్ ఆఫీసర్ వినోద్మద్నూర్లో వారోత్సవాలను ప్రారంభిస్తున్న అధికారులుమద్నూర్(జుక్కల్): తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వారోత్సవాలు మంగళవారం ప్రారంభవుయ్యాయి. వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని స్టేషన్ఫైర్ అధికారులు పనిముట్లకు పూలమాలలు వేశారు. లీడింగ్ ఫైర్మాన్ నర్సింలు మాట్లాడుతూ.. 1946 ఏప్రిల్14న ముంబై ఓడరేవులో ఘోర అగ్ని ప్రవూదం సంభవించిందని, మంటలు ఆర్పే ప్రయత్నంలో 46 మంది ఫైర్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆ రోజు నుంచి ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు. ఎల్లారెడ్డిలో అగ్నిమాపక వారోత్సవాలు ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలను ఫైర్ ఆఫీసర్ వినోద్ ప్రారంభించారు. వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక జెండాను ఎగరవేశారు. అనంతరం అగ్ని ప్రమాదాలలో అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు. -
డీజీపీకి సన్మానం
భిక్కనూరు: డీజీపీ శివధర్రెడ్డిని భిక్కనూరు మండల రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుంట లింగారెడ్డి మంగళవారం సన్మానించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, సీనియర్ నేత అంకం రాజు పాల్గొన్నారు. గోల్డెన్ అవర్ ప్రాణదాతకు.. కామారెడ్డి అర్బన్: రోడ్డు ప్రమాదాల్లో తొలి గంట గోల్డెన్ అవర్లో స్పందించి పలువురి ప్రాణాలు కాపాడిన సదాశివనగర్కు చెందిన వంకాయల రవిని డీజీపీ శివధర్ రెడ్డి సన్మానించారు. వంకాయల రవి రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే 108 ద్వారా వెంటనే ఆస్పత్రికి తరలించడం, సీపీఆర్ చేయడం ద్వారా 50 మంది ప్రాణాలు కాపాడటంలో విశేష కృషి చేశారని పోలీసులు ప్రశంసించారు. దళిత రత్న అవార్డు గ్రహీతకు.. కామారెడ్డి రూరల్: దేవునిపల్లి గ్రామానికి చెందిన హోలియ దాసరి, అబ్బినబోయిన చిన్న పోశయ్యలు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా దళిత రత్న అవార్డు పొందడంతో మంగళవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా పోశయ్యను స్థానిక కౌన్సిలర్లు వినోద, కాసర్ల మాధవిలు ఘనంగా సన్మానించారు. అంబేద్కర్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్(జుక్కల్): తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలుపొందాలని స్వామి వారిని వేడుకున్నట్లు మల్లికార్జున్ తెలిపారు. భిక్కనూరు: భిక్కనూరు నాయీ బ్రాహ్మణ సంఘం కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నాగన్నగారి గోపాల్, డైరెక్టర్లుగా కొత్తపల్లి మల్లేశం, సాయన్నగారి బాల నర్సింలు, వెంకమ్మగారి చిన్న బస్వయ్య, చింతకింది స్వామి ఎన్నికయ్యారు. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల హనుమాన్ ఆలయంలో మంగళవారం శ్రీ శబరిమల అయ్యప్ప స్వామి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప భక్తులు పీట పూజ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప జన్మదినం సందర్భంగా మద్నూర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. మద్నూర్(జుక్కల్): వంట గ్యాస్ కష్టాలు రోజురోజుకి పెరుగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ లేకపోవడంతో వారం రోజులకు ఒకసారి బోధన్ నుంచి ఆటోలో గ్యాస్ బుడ్డీలు వస్తున్నాయని.. అదీ సమయానికి రాకపోవడంతో ఎండలో పరేషాన్ అవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి మాత్రమే గ్యాస్ దొరుకుతోందని మిగిలిన వారికి వచ్చే వారం ఇస్తామని వారు చెబుతున్నారని వినియోగదారులు పేర్కొన్నారు. గ్యాస్ కొరత కారణంగా వినియోగదారులు గంటల తరబడి క్యూ కడుతున్నారు. మద్నూర్ లేదా డోంగ్లీ మండలంలో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తే కష్టాలు తీరుతాయని ప్రజలు అంటున్నారు. -
మక్కకు మద్దతు ఏదీ?
వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండడంతో పలువురు రైతులు ప్రత్యామ్నాయంగా మక్క, జొన్న పంటల సాగు చేశారు. జిల్లాలో యాసంగి సీజన్లో 40,580 ఎకరాల్లో మక్క పంట సాగయ్యింది. తాడ్వాయి, గాంధారి, రాజంపేట, లింగంపేట, సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద తదితర మండలాల్లో ఎక్కువగా సాగు చేశారు. దళారులు చెప్పిందే ధర.. మొక్కజొన్న పంట చేతికొచ్చినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు పంటను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే అద నుగా దళారులు ధరను గణనీయంగా తగ్గించారు. ప్ర భుత్వం నిర్ణయించిన ధర క్వింటాలుకు రూ. 2,400 అయితే దళారులు చాలాచోట్ల రూ. 1,700 నుంచి రూ. 1,800 లకు కొనుగోలు చేస్తున్నారు. రైతులు క్వింటాలుకు దాదాపు రూ. 7 వందలు నష్టపోతున్నా రు. ఎండలు మండుతున్నా అకాల వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురిస్తే దళారులు ధరను మరింత తగ్గించే అవకాశం ఉంది. కాగా మక్కలు కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి కూడా గోదాములు అందుబాటులో లేవని తెలుస్తోంది. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు చేయకపోవడం ఇబ్బందికరంగా మారిందని రైతులు అంటున్నారు. మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయాలని, ఎకరాకు 25 క్వింంటాళ్లు అన్న నిబంధన ఎత్తివేసి పూర్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.మక్కల కొనుగోలు విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంతో రైతులు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తున్నారు. మక్కలు కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం మూలంగా దళారులకు అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. మక్కల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో మార్క్ఫెడ్ జిల్లా అధికారి శశిధర్రెడ్డిని వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడచుకుంటామని పేర్కొన్నారు.ఈసారి పంట బాగుండడంతో ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. ఎకరాకు తక్కువలో తక్కువ 40 క్వింటాళ్లు వస్తోంది. కొందరు రైతులకై తే 45 క్వింటాళ్ల పైనే దిగుబడి వచ్చింది. మక్క పంట ఆశాజనకంగా ఉండి, దిగుబడి పెరగడంతో రైతులు ఎంతో సంతోషించారు. మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తే తమకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించారు. ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. ఎంఎస్పీ ప్రకారం రూ.90 వేలకుపైగా ఆదాయం వస్తుంది. అయితే దళారులు ఎకరాకు రూ.1,700 చొప్పున కొనుగోలు చేస్తుండడంతో ఎకరాకు రూ.20 వేలకుపైగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ఆసక్తి చూపుతున్నా.. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. మక్క సాగు చేసిన రైతులు క్వింటాలుకు రూ. 700 వరకు నష్టపోవాల్సి వస్తోంది. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2,400.. దళారులు చెల్లిస్తోంది రూ. 1,700 మాత్రమే.. నష్టపోతున్న రైతులు -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
● వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఎండలు ముదురుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో తీవ్రమైన వడగాలులు నమోదవుతున్నాయన్నారు. ఎండల కారణంగా ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో తాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల నిల్వలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లాంటి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. జిల్లావ్యాప్తంగా బస్టాండ్లు, మార్కెట్లు, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేలా 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఈనెల 16 నుంచి వచ్చేనెల 15 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, డీఎంహెచ్వో రవీందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ‘ఇళ్ల గణన’ పారదర్శకంగా నిర్వహించాలి కామారెడ్డి టౌన్ : జన గణనలో భాగంగా చేపట్టనున్న హౌస్ లిస్టింగ్ (ఇళ్ల గణన) ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జన గణన తెలంగాణ రాష్ట్ర సంచాలకులు భారతి హోళీకేరి సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మే 11నుంచి నిర్వహించే ఇళ్ల గణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని సూచించారు. ఇళ్ల జాబితా బ్లాక్లను రూపొందించాలని, ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సంగ్వాన్ మాట్లాడుతూ.. హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ‘టీపీఎస్’ కోసం చర్యలు వేగవంతం చేయాలి కామారెడ్డి టౌన్ : నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆమె కలెక్టర్లు, డీఈవోలు, ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎల్లారెడ్డిలో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి, అవసరమైన మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. -
మెగా రక్తదానం శిబిరం విజయవంతం చేయాలి
కామారెడ్డి టౌన్ : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలోని కర్షక్ బీఎడ్ కళాశాలలో నిర్వహిస్తున్న మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బాదావత్ ప్రవీణ్ నాయక్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. ఈ శిబిరాన్ని ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రక్తాన్ని తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణ రక్షణ కోసం అందజేస్తామని వివరించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ప్రోత్సహించేందుకు సంఘం సభ్యుల సహకారంతో మొదటి 100 మంది దాతలకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సంగయ్య, కోశాధికారి శ్రీనివాస్, మండల అధ్యక్షులు రాజయ్య, నాయకులు ఎర్ర లింగం, సత్యం, నరసయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో ఈ నెల 19న నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని హిందూ సమ్మేళనం మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్, ముగ్థుంపూర్ గ్రామాల్లో హిందు సమ్మేళన కార్యక్రమం నిర్వహణపై ఊరూరా కరపత్రాలు పంపిణీ చేశారు. సమ్మేళనం కార్యవర్గ సభ్యులు రాజాగౌడ్ స్వామి, శ్రావణ్, రవికిరణ్ తదితరులు ఉన్నారు. డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించనున్న పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ బాసర జోన్ అధికారి యుగంధర లక్ష్మి సోమవారం తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఏదైనా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రవేశపరీక్షకు అర్హులని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు www. tgswreis. telangana. gov. in వెబ్సైట్ ద్వారా నామమాత్రపు రుసుము చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుందని తెలిపారు. ఈ నెల 25 లోపు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని, మే 15న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని తెలిపారు. ఆర్మూర్టౌన్: పెర్కిట్లో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 1,17,940 నగదు, మూడు కార్లు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
సుపరిపాలన అందించాలి
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ నూతన తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన రంజిత్కుమార్ ప్రజలకు ఇబ్బందులు లేని పరిపాలన అందించాలని గ్రామస్తులు కోరారు. డోంగ్లీ తహసీల్ కార్యాలయంలో సోమవారం గ్రామానికి చెందిన పలువురు నూతన తహసీల్దార్కు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందించాలని యువ నాయకుడు ప్రవీణ్కుమార్ కోరారు. డోంగ్లీ మండలంలోని సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. -
నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు
నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ నిబంధన ప్రకారమే వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. సోమవారం గోర్గల్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మరి ధాన్యంలో తాలు లేకుండా, తేమ శాతం ఉండేలా చూసుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. నిబంధన ప్రకారం ధాన్యం సేకరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట సివిల్ సప్లై డీఎం, నాయకులు తదితరులున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి కామారెడ్డి రూరల్: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని సర్పంచ్ గుర్రాల లక్ష్మి సూచించారు. సోమ వారం తిమ్మక్పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రా రంభించారు.ఉప సర్పంచ్ గొర్రె పరమేష్, ఏపీఎం శ్రీనివాస్, పాలకవర్గ సభ్యులు, సీసీలు, మహిళా సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ఈతకు వెళ్లి ఒకరి మృతి మోపాల్: మండలంలోని న్యాల్కల్ చెరువులో ఈతకు వెళ్లి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. బిచ్కుంద గ్రామానికి చెందిన సంజీవ్(37), కమ్మరి రేఖ దంపతులు. ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని ఆనంద్నగర్లో నివాసముంటూ కార్పెంటర్గా ప ని చేస్తున్నాడు. సంజీవ్కు కల్లు తాగే అలవాటు ఉంది. ఆదివారం సాయంత్రం న్యాల్కల్లో కల్లు తాగేందుకు తన కొడుకు లక్ష్మణ్తో కలిసి బైక్పై వెళ్లాడు. కల్లు తాగిన తర్వాత సంజీవ్లో చెరువులోకి ఈత కోసం దిగి నీటమునిగాడు. ఈ విషయాన్ని కొడుకు లక్ష్మణ్ తల్లి రేఖకు తెలపగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోమవారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. భార్య రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. గాయపడిన వ్యక్తి ..బాన్సువాడ: కాలినగాయాలతో చికిత్స పొందుతున్న ఒకరు మృతి చెందినట్లు సీఐ శ్రీధర్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా హత్నూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్(40) మద్యానికి బానిసయ్యాడు. ఇంట్లో నుంచి వెళ్లి ఐదారు రోజులైన తిరిగి వెళ్లేవాడు కాదు. ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిన యూసుఫ్ తిరిగి ఇంటికి రాలేదు. 8న బాన్సువాడలోని ఓ షాపింగ్ మాల్ పక్కన తనకు తాను పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించగా, సోమవారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య పర్వీన్ సుల్తానా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు..ఇందల్వాయి: జాతీయ రహదారి 44పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇందల్వాయి ఎస్సై సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్కు చెందిన సయ్యద్ అహ్మద్(41) కొంతకాలంగా కుటుంబంతో కలిసి ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామంలో కూ లి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి సయ్యద్ అహ్మద్ తన కొడుకు ఇస్మాయిల్తో కలిసి మండల కేంద్రంలో అన్నం అడుక్కునేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా రహదారి దాటే క్రమంలో హైదరాబాద్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన సయ్యద్ అహ్మద్ మృతి చెందాడు. మృతుడి భార్య గౌసియా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రోత్సాహక బహుమతులు
కామారెడ్డి క్రైం: ఉపాధి హామీ పథకంలో భాగంగా ఎన్ఎంఎంఎస్ యాప్లో ముఖం గుర్తింపు ఆధారిత నమోదు ద్వారా అత్యధిక కూలీల హాజరు నమోదు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సన్మానించారు. నాగిరెడ్డిపేట్ మండలం లింగంపల్లి కలాన్ గ్రామానికి చెందిన అంజయ్య (238 కూలీల నమోదు), సదాశివనగర్ మండలం మర్కల్ గ్రామానికి చెందిన రాములు (216 కూలీల నమోదు), భిక్కనూరు మండలం తిప్పాపూర్కు చెందిన నరేష్ (197 కూలీల నమోదు)లకు రూ. వెయ్యి చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆల్ప్రాజోలం పట్టివేత
● ఇద్దరు నిందితుల అరెస్టు ఎల్లారెడ్డి: నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫ్రాజోలంను విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పులి రమేశ్ తన స్నేహితుడైన ఓలెపు రమేశ్, మధ్యవర్తి హసన్పల్లి అనిల్కుమార్ ద్వారా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చేపర్తి ఈశ్వర్గౌడ్కు ఆల్ప్రాజోలంను విక్రయించేందుకు రూ.5 వేలకుఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న సాయంత్రం పులి రమేశ్ సూచనల మేరకు కొనుగోలుదారుకు సాంపిల్ చూపించేందుకు 101 గ్రాముల మత్తు పదార్థాన్ని తీసుకొని ఓలెపు రమేశ్, అనిల్ కుమార్ గండిమాసానిపేట గేట్ వద్దకు బైక్పై వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను రెడ్హ్యాండెడ్గా పట్టుకొని 101 గ్రాముల ఆల్ఫాజ్రోలంను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పులి రమేశ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం
● కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డిభిక్కనూరు: పేదల సొంతింటి కలను నేరవేర్చిన ఘనత సీఎం రేవంత్రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాజంపేట మండలం శివ్వాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు సీఎం రేవంత్రెడ్డి ఫొటోతోపాటు నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ప్రజాపాలన ద్వారా నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారన్నారు. సొంత స్థలం లేని వారికి ఇళ్ల నిర్మాణం కోసం త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య బాల్రాజు, నేతలు ఆనంద్రావు, జూలురి సుధాకర్, మామిళ్ల అంజయ్య, గడ్డమీది మహేశ్, పంపరి శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, సలీం, చాట్ల వంశి, రవీందర్గౌడ్, శ్రీధర్, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్టు
భిక్కనూరు: మండల కేంద్రంలో వృద్ధురాలిపై దాడి చేసిన కేసులో నిందితుడిని మూడు గంటల్లోనే భిక్కనూరు పోలీసులు పట్టుకున్నారని ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. సోమవారం భిక్కనూరులో విలేకరుల సమావేశంలో ఆమె తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఉప్పరి లచ్చవ్వ ఇంట్లోకి చొరబడిన దుండగుడు.. ఆమె తలపై రోకలి బండతో దాడి చేసి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. భిక్కనూరు సీఐ సంపత్కుమార్, ఎస్సై ఆంజనేయులు వెంటనే స్పందించి నిందితుడి కోసం గాలించారు. రాత్రి 11.30 గంటల సమయంలో మండల కేంద్రంలోని చర్చి ప్రాంతంలో నిందితుడు, మండలకేంద్రానికి చెందిన గజ్జె స్వామిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్దనుంచి నాలుగు తులాల బంగారు పుస్తెల తాడు, తులం బంగారు గుండ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. బంగారం ధర భారీగా పెరిగినందున మహిళలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మూడు గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. -
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసిన మహిళ
నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్లో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ చీరతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మోహన్(40) వినాయక్నగర్లో ఉంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బద్ద సౌందర్యతో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ నెల 12 ఉదయం 3 గంటలకు సౌందర్య తన చీరను మోహన్ మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మోహన్ కుటుంబానికి సంబంధించిన వివరాలు తెలియడం లేదన్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే 8712659840 నంబర్ను సంప్రదించాలని తెలిపారు. -
సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు
● భద్రాచలం పీఠాధిపతి విశ్వాత్మానంద గిరి స్వామీజీ ● బాన్సువాడలో ఘనంగా హిందూ సమ్మేళనంబాన్సువాడ : సనాతన ధర్మంలో కులవ్యవస్థ లేదని భద్రాచలం పీఠాధిపతి విశ్వాత్మానంద గిరి స్వామీజీ పేర్కొన్నారు. బాన్సువాడలో పాత బాన్సువాడ బస్తీ ఆధ్వర్యంలో శ్రీ వీరమాత జిజియాబాయి హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంలో స్వామీజీ మాట్లాడుతూ హిందుత్వం ఆచరించదగ్గ జీవన విధానమన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా విడగొట్టే శక్తులు లేవని, కానీ భారతదేశంలోనే మానవులను విడగొట్టే శక్తులున్నాయని పేర్కొన్నారు. దేశాన్ని ముక్కలుగా చేసి రాజకీయం చేస్తున్నాయన్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాముడిని మొక్కడం మాత్రమే కాదని, ఆయనలా బతకాలి అనే భావన అందరిలో రావాలని పేర్కొన్నారు. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్, పాత బాన్సువాడ బస్తీ కమిటీ అధ్యక్షులు ఉమ మహేష్, ప్రధాన కార్యదర్శి గుడాల నగేశ్, సభ్యులు వేదప్రకాశ్, దేఖల సాయిలు, గాజుల రాజులు, నాయకులు కాసుల రోహిత్, పాశం భాస్కర్రెడ్డి, గడ్డమీది అంజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇరవై లక్షల ఎకరాలకు విత్తనాలందిస్తాం
● తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ● నాగిరెడ్డిపేట, లింగంపేటలో రైతులతో సమావేశం నాగిరెడ్డిపేట/లింగంపేట : వచ్చే వానాకాలంలో తెలంగాణ రాష్ట్ర విత్తనసంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలకు నాణ్యమైన విత్తనాలు అందిస్తామని తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి, లింగంపేట మండలం శెట్పల్లి గ్రామాల్లో ఆయన రైతులతో ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్కు అవసరమైన వరి విత్తనాలు సన్నరకాలైన బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, కేఎన్ఎం 1638, దొడ్డు రకాలు కేఎన్ఎం 118, ఎంటీయూ 1010 సమృద్ధిగా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. జీలుగ, జనుము విత్తనాలను సకాలంలో అందజేస్తామన్నారు. రైతులు నిరంతరం వరి మాత్రమే సాగు చేయకుండా పంట మార్పిడి చేయాలని సూచించారు. రసాయన మందులను వినియోగించి వ్యవసాయం చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు తక్కువ ధరకు నాణ్యమైన విత్తనాలను అందిస్తోందని, కానీ రైతులు మాత్రం మార్కెట్లో ఎక్కువ ధరకు లభించే ప్రయివేట్ కంపెనీల విత్తనాలే నాణ్యమైనవిగా భావించి కొనుగోలు చేస్తున్నారన్నారు. కాగా, మార్కెట్లో కొనుగోలు చేసిన విత్తనాలతో నష్టపోయే రైతులకు తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టిందన్నారు. సమావేశంలో ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్ నాయక్, సర్పంచులు జ్యోతిరెడ్డి, అట్టెం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సకృనాయక్, ఆత్మకమిటీ డైరెక్టర్ కిష్టయ్య, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎస్సై భార్గవ్గౌడ్, ఏవో సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
పంట మొత్తం కొనాలి
ఈసారి మంచి దిగుబడి వచ్చింది. నాకై తే ఎకరాకు 50 క్వింటాళ్లు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎకరాకు 25 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేసి, రైతులు పండించిన పంట మొత్తం కొనాలి. – తక్కల నర్సారెడ్డి, రైతు, రామేశ్వర్పల్లి, భిక్కనూరు మండలం మక్క కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వారు తక్కువ ధరకు కొంటున్నారు. దీంతో ఎకరాకు రూ. 20 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – బాపురావ్, రైతు, తాడ్వాయి -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
మాక్లూర్: హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్, మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ పేర్కొన్నారు. మాక్లూర్ పీఎస్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మండలంలోని మెట్టు గ్రామానికి చెందిన బుగ్గ ఆంటోనీ(55) ఈ నెల 10న హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడు అబ్రహాం ఫిర్యాదు మేరకు విచారించగా ఈ నెల 10న రాత్రి ఆంటోనీ, అదే గ్రామానికి చెందిన ప్రాంచీస్ కలిసి ప్రకృతి వనం వద్ద మద్యం సేవించారు. మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో ప్రాంచీస్ పెద్ద బండరాయితో ఆంటోనీ తలపై కొట్టడమే కాకుండా కొంతదూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లడంతో ప్రాణాలు విడిచాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా ప్రాంచీస్ ఇంటికి వెళ్లి స్నా నం చేసి పరారయ్యాడు. సోమవారం ప్రాంచీస్ను పట్టుకొని విచారించగా హత్యకు ఉపయోగించిన బండరాయి, దుస్తులు స్వాధీనం చేసుకొని ప్రాంచీస్ను రిమాండ్కు తరలించామన్నారు. -
జీవితంలో మంచి ఉద్యోగం సాధించాలి
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు జీవితంలో మంచి ఉద్యోగాన్ని సాధించి స్థిరపడాలని మున్సిపల్ కమిషనర్ మ హేష్కుమార్ ఆకాంక్షించారు. సోమవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫేర్వెల్ పార్టీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. డిగ్రీ తరువాత చాలా రంగాలలో ఉద్యోగాలను సాధించవచ్చని చె ప్పారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, అసోసియేట్ ప్రొఫెసర్ శంకరయ్య, వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, కళాశాల కమిటీ సభ్యులున్నారు. -
గురుకులాలు ‘టాప్’.. సర్కారీ కాలేజీలు ‘డ్రాప్’
కామారెడ్డి టౌన్: ఇంటర్ ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు మిశ్రమ ఫలితాలను మూటగట్టుకున్నాయి. ఒకవైపు గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు సంస్థలకు దీటుగా అత్యుత్తమ ఫలితాలు సాధించగా, మరోవైపు సరైన పర్యవేక్షణ లేక సాధారణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వెనుకబడ్డాయి. ముఖ్యంగా సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న కళాశాలలు 90 శాతానికి పైగా ఉత్తీర్ణతతో జిల్లాలో టాప్లో నిలిచాయి. జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్సియల్ కళాశాలలు అద్భుతమైన ఫలితాలు నమోదు చేశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఫలితాలు నిరాశ పరిచాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో... బిచ్కుంద 75.88 శాతం, పిట్లం 75.63, మాచారెడ్డి 71.43, తాడ్వాయి 53.25, కామారెడ్డి 52.5, బాన్సువాడ(బాలికలు) 47.69(జనరల్), 79.08(వొకేషనల్)..బాన్సువాడ(బాయ్స్) 46.3, బీర్కూర్ 38.46, మద్నూర్ 37.68, రామారెడ్డి 34.88, దోమకొండ 26.74, లింగంపేట 26.32, ఎల్లారెడ్డి 16.3, బీబీపేట్ 13.64, భిక్కనూరు 10.2, నాగిరెడ్డిపేట 9.09, సదాశివనగర్ 6.15, నిజాంసాగర్లో 88.89 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కేజీబీవీల్లో... పిట్లంలో 97.83 శాతం, బిచ్కుంద 96.23, లింగంపేట 90.32, బాన్సువాడ 86.11, నిజాంసాగర్ 86.54, దోమకొండ 82.09, జుక్కల్ 82.61, బీర్కూర్ 78.72, గాంధారి 69.05, ఎల్లారెడ్డి 64.52, భిక్కనూరు (జంగంపల్లి) 50, బీబీపేట్ 47.22 శాతం నమోదైంది. మోడల్ స్కూళ్లలో.. నిజాంసాగర్ 77.45 శాతం, బాన్సువాడ 75.7, నాగిరెడ్డిపేట 73.13, సదాశివనగర్ 66.97, ఎల్లారెడ్డి 40.77, మద్నూర్ 38.46 శాతం. సాంఘిక సంక్షేమ గురుకులాలు... పెద్దకొడప్గల్ 98.59శాతం, భిక్కనూరు 86.44, తాడ్వాయి 83.33, దోమకొండ 82.18, బాన్సువాడ (బోర్లం) 80.65, మద్నూర్ 78.38, బాన్సువాడ(తాడ్కోల్) 75.34, నిజాంసాగర్(అచ్చంపేట) 75, లింగంపేట 68.97, నిజాంసాగర్ 50.7, రామారెడ్డి (ఉప్పల్వాయి) 35.85 శాతం. బీసీ సంక్షేమ గురుకులాలు... పిట్లం 100 శాతం, పిట్లం(వర్ని గరల్స్) 100%, ఎల్లారెడ్డి 94.44, భిక్కనూరు(జంగంపల్లి) 92.73, నిజాంసాగర్ 87.88, బీర్కూర్ 70.45, కామారెడ్డి(ఎర్రాపహాడ్) 69.7, బీబీపేట్ 56.25. తెలంగాణ మైనార్టీ రెసిడెన్సియల్.. కామారెడ్డి(బాయ్స్) 98.31 శాతం, జుక్కల్ 91.18, కామారెడ్డి(గర్ల్స్) 83.93, లింగంపేట 80, బాన్సువాడ 77.61, ఎల్లారెడ్డి 60 శాతం. గిరిజన సంక్షేమ గురుకులాలు.. నస్రుల్లాబాద్(హన్మాజీపేట) 93.33 శాతం, కామారెడ్డి 86.67, ఎల్లారెడ్డి 83.82, నస్రుల్లాబాద్(బాయ్స్) 43.55 శాతం . అత్యధికంగా.. అత్యల్పంగా ఇలా.. విద్యా సంస్థ టాప్ మండలం(ఉత్తీర్ణత %) తక్కువ మండలం(ఉత్తీర్ణత %) ప్రభుత్వ కళాశాలలు నిజాంసాగర్(88.89) సదాశివనగర్(6.15) కేజీబీవీ పిట్లం (97.83) బీబీపేట్ (47.22) మోడల్ స్కూల్ నిజాంసాగర్(77.45) మద్నూర్ (38.46) బీసీ వెల్ఫేర్ పిట్లం (100) బీబీపేట్(56.25) టీఎంఆర్జేసీ కామారెడ్డి బాయ్స్ (98.31) ఎల్లారెడ్డి (60) ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన సంక్షేమ విద్యాలయాలు వంద శాతం ఉత్తీర్ణతతో పిట్లం బీసీ వెల్ఫేర్ విద్యార్థుల ప్రతిభ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పడిపోయిన ఉత్తీర్ణత శాతం 6.15 శాతంతో అట్టడుగున సదాశివనగర్ -
ఆరు ఇళ్లలో చోరీ
● బంగారం, వెండి, నగదు అపహరణ నస్రుల్లాబాద్: మండలంలోని నాచుపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన ఆరు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. గ్రామానికి చెందిన గడిగళ్ల రాములు, గైని లచ్చవ్వ, మేత్రి సాయిలు, ప్రసాద్, అప్పాజి ఇళ్లకు తాళ వేసి ఉండటంతో దుండగులు దొంగతనం చేశారు. రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, సుమారు రూ.70 వేల నగదు అపహరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై రాఘవేంద్ర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద టాస్క్ఫోర్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు సోమవారం వేకువజామున అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఓఎస్డీ శ్రీధర్రెడ్డి, డీఎస్పీ శేఖర్రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కిష్టయ్య, భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీని నిలిపివేసి తనిఖీ చేయగా అందులో 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతోపాటు డ్రైవర్ సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో కేసు నమోదు చేసుకొని బియ్యంను జంగంపల్లిలోని ప్రభుత్వ గోదాముకు తరలించారు. -
ఇందిరమ్మ ఇల్ల పురోగతిపై సమీక్ష
బాన్సువాడ రూరల్/బాన్సువాడ: నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. నాణ్యత లోపించకుండా పర్యవేక్షిస్తూ, బిల్లుల చెల్లింపు విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జూన్ నెలాఖరు కల్లా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని, పూర్తయిన ఇండ్లకు వెన్వెంటనే గృహప్రవేశాలు చేయాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, స్టేట్ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఏఎంసీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
నిరుపేదల పాలిట వరం ఇందిరమ్మ ఇల్లు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇంటి పథకం నిరుపేదల పాలిట వరంలా మారిందని తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లిలో సోమవారం ఏలేటి యాదమ్మకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతిరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట ఆత్మకమిటీ చైర్మ న్ దశరథ్ నాయక్, డైరెక్టర్ దివిటీ కిష్టయ్య, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్ రెడ్డి, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు. -
ఉక్కపోతతో రోగుల విలవిల
బాన్సువాడ : బాన్సువాడ మాత శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న వారికి వేసవి కష్టాలు మొదలయ్యాయి. పలు విభాగాల్లో ఏసీలు పని చేయకపోవడంతో కూలర్లు పెట్టి నెట్టుకొస్తున్నారు. ఎండ వేడికి, ఉక్కపోతతో ఇన్ పేషంట్లు విలవిల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉష్ణాగ్రతలు తీవ్రంగా నమోదయ్యాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో అసలే అరోగ్యం బాగా లేక చికిత్స కోసం వచ్చే వారు మరింత ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. అవార్డుతోనే సంతృప్తి.. ఈ నెల 7న బాన్సువాడ ఎంసీహెచ్కు రాష్ట్ర స్థాయి లో అత్యధిక సాధారణ కాన్పులు చేసిన ఆస్పత్రిగా ఉత్తమ అవార్డు వచ్చింది. అవార్డును మంత్రి దా మోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ అందుకున్నా రు. అవార్డు రావడం ఆనందమే అయినా క్షేత్రస్థాయిలో వసతుల కల్పనలో మాత్రం ఆ పరిస్థితులు లేవనే విమర్శలున్నాయి.బాన్సువాడ ఆస్పత్రికి బా న్సువాడ,జుక్కల్,ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచే కాకుండా పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్, కంగ్టి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చి కిత్స కోసం వస్తుంటారు. ఎంబికాలంలో ఏసీలను మరమ్మతు చేయించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. జనరల్ ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తుండటంతో మాత శిశు ఆస్పత్రి ప్రాంగణంలోనే రేకుల షెడ్డు వేసి రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. అసలే ఎండలు మండిపోతున్నాయి. రేకుల షెడ్డు లో రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో వచ్చు.ఏసీలు కొన్ని పని చేయకపోవడంతో రోగుల సౌకర్యం కోసం కూలర్లు తెప్పించారు. కానీ కొన్ని వార్డుల్లో రోగుల కోసం తెచ్చిన కూలర్లను వైద్య సిబ్బందే వాడుకుంటున్నారు.దీంతో రోగులు ఉక్క పోత,ఎండ వేడితో ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో ఏసీలు లేక బాలింతలు, గర్భిణు లు, చిన్నారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భా నుడు మరింత ప్రతాపం చూపకముందే పూర్తి స్థా యిలో ఏసీలను మరమ్మతులు చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ను వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఎంసీహెచ్లో చికిత్సకు వచ్చిన వారికి కష్టాలు పలు విభాగాల్లో ఏసీలు పని చేయక కూలర్లు తెచ్చిన వైనం రోగుల కోసం తెచ్చిన కూలర్లను వాడుకుంటున్న వైద్య సిబ్బంది మండే ఎండలతో అల్లాడుతున్న ఇన్ పేషంట్లు


