Kamareddy
-
మంత్రి పదవికి రాజీనామా చేయాలి
సాక్షి నెట్వర్క్:కుమారుడు పోక్సో కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రిగా ఉండి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ నేతలు వినతిపత్రాలు అందించి మాట్లాడారు. బాలికపై అత్యాచారం కేసు విషయంలో బీజేపీ మౌనంగా ఉండటం సరికాదన్నారు. -
సంస్కృతికి పెద్దపీట
తెలంగాణ సామెతలు మోర్తాడ్(బాల్కొండ): వేసవి సెలవులంటే కాలక్షేపం కోసం కాదు.. ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. ఆ చిన్నారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు మోర్తాడ్కు చెందిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీహర్షిణి. చిన్నారులకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు కూచిపూడి నృత్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని స్థానిక చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంసీఏ చదివిన శ్రీహర్షిణి నాంది ఫౌండేషన్, మహేంద్ర ప్రైడ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నృత్యశిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి నేర్పాలనే ఉద్దేశంతో మోర్తాడ్లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈనెలాఖరు వరకూ శిక్షణ తరగతులను కొనసాగిస్తానని శ్రీహర్షిణి తెలిపారు. ఒక అబ్బాయికి క్లాసికల్ డ్యాన్స్లో ఒక గంట పాటు ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తుండటం గమనార్హం. సెలవులను కాలక్షేపం కోసం కాకుండా నృత్య శిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్న ఈ చిన్నారులు ఎంతో మందికి స్పూర్తి అని చెప్పొచ్చు. ● మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు (ఎక్కువ మంది జోక్యం చేసుకుంటే పని సరైన దారిలో సాగకుండా గందరగోళంగా మారుతుంది.) ● సిగ్గులేదా జీడి గింజా అంటే.. నల్లగున్నా నాకేమి సిగ్గు అనిందట. (తన తప్పును లేదా లోపాన్ని సమర్థించుకుంటూ, ఏమాత్రం సిగ్గు పడకుండా ఎదురు సమాధానం చెప్పడం) వేసవి సెలవులను వృథా కానివ్వడం లేదు. నృత్యంలో శిక్షణ పొందడానికి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లితండ్రులు, మా శిక్షకురాలు ఇచ్చే ప్రోత్సాహంతో ముందుకు సాగుతాం. – హన్విక, దొన్కల్ మోర్తాడ్లో మేము పొందుతున్న నృత్య శిక్షణ ఎంతో బాగుంది. వేసవి సెలవులను ఎలా గడపా లని ఆలోచించాం. మోర్తాడ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలియగానే మా తల్లిదండ్రులు శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. – విహాన్షి, రామన్నపేట్ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు కళలో ప్రావీణ్యానికి సెలవులు సద్వినియోగం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా రాణిస్తూనే నృత్య శిక్షణ ఇస్తున్న శ్రీహర్షిణి మోర్తాడ్లో ప్రతిరోజూ వేసవి శిక్షణ తరగతులు -
ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. జక్రాన్పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బదావత్ లత, నరేశ్ దంపతులు తమ కుమారుడు నిక్షిత్(16 నెలలు) ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యుడు మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగుకాకపోవడంతో రాత్రి వేళ మళ్లీ బాబును ఆస్పత్రికి తీసుకురాగా, ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స ప్రారంభించి సైలెన్లు పెట్టారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మంగళవారం ఉదయం స్కానింగ్కు రిఫర్ చేశారు. స్కానింగ్ చేయించి బాబును ఆస్పత్రికి తీసుకు వచ్చిన కొద్దిసేపటికి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులతోపాటు వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని వారిని సముదాయించారు. ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ● ఆస్పత్రి ఎదుట ఆందోళన -
ఎరువుల విక్రయ కేంద్రానికి తాళం
రుద్రూర్: తమకు అవసరం లేకున్నా నానో యూరియాను ఎరువులతోపాటు బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డొలిలో ఎరువుల విక్రయ కేంద్రానికి రైతులు మంగళవారం తాళం వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నానో యూరియా లిక్విడ్ ఇంకా మిగిలి ఉండగానే మళ్లీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం మోపడం తగదన్నారు. వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
క్రైం కార్నర్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి జక్రాన్పల్లి/నిజామాబాద్ రూరల్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్కు గ్రామానికి చెందిన జైడి పెద్దోళ్ల నర్సయ్య (70) మంగళవారం 44వ నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా.. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయాలపాలైన నర్సయ్యను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. బైక్ను లారీ ఢీట్టిన ఘటనలో తాపిమేస్త్రి.. నిజామబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూపన్పల్లి క్రాసింగ్ వద్ద బైక్ను లారీ ఢీట్టిన ఘటనలో తాపిమేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన షేక్ షాకీర్(28) మాక్లూర్ మండల బోర్గాం(కే)లో మేస్త్రి పని చేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్పల్లి క్రాసింగ్ బైక్ను లారీ ఢీకొట్టగా షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి క్రైం: భార్యతో గొడవల కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మహ్మద్ హుస్సేన్ (35) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతి రోజూ భార్యతో గొ డవలు జరిగేవి.కొద్ది రోజుల క్రితం అతడి భార్య గౌసియా బేగం పిల్లలతో కలిసి హైదారాబాద్లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కామారెడ్డికి రావాలని హుస్సేన్ పలుమార్లు అడిగినా ఆమె రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో నరహరి తెలిపారు. ఆర్మూర్టౌన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆర్మూర్, మోర్తాడ్లో చీత ఫోర్స్ మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం పట్టుకుంది. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు భారీ లారీలను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
వైభవంగా పెద్దమ్మకు బోనాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): పర్మళ్లలో మంగళవారం పెద్దమ్మకు గ్రామస్తులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులు ఇంటింటికి బోనాలు తీసుకొని గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పువాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగించారు. అనంతరం పెద్దమ్మ ఆలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లారెడ్డిరూరల్: గ్రామాలలో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీవో తాహేరాబేగం సూచించారు. బ్రాహ్మణపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఏపీవో వినోద్, సిబ్బంది తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: విద్యా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో యోగ, ధ్యానం నిర్వహించారు. యోగా గురువు నగేష్ను ప్రిన్సిపల్ కె.విజయ్కుమార్, అధ్యాపకులు, సిబ్బంది సన్మానించారు. భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరాలయానికి మల్లుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డిలు మంగళవారం రెండు ట్రాక్టర్ల గడ్డిని సోమవారం విరాళంగా అందజేశారు. ఆలయ పునర్నిర్మాణకమిటీ చైర్మన్ లింబాద్రి, డైరెక్టర్ నీల అంజయ్య వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ: అంతర్జాతీయ నర్సు దినోత్సవాన్ని మంగళవారం బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వైద్య సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా నర్సుల సేవల గురించి వివరించారు. వైద్యులు సౌజన్య, సూపర్వైజర్ సుశీల, నర్సమ్మ, సిబ్బంది ప్రీతి, శ్రీలత తదితరులున్నారు. నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వారి అంగీకారం మేరకు హిజ్రాల ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
నీట్ పరీక్ష రద్దుతో నిరాశ!
● మళ్లీ రాయాల్సిన పరిస్థితి ● ఇబ్బంది పడుతున్న విద్యార్థులు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : డాక్టర్ కావాలన్న లక్ష్యంతో కష్టపడి జాతీయ అర్హత పరీక్ష (నీట్) రాసిన విద్యార్థులు.. ప్రశ్నపత్రం లీకయ్యిందని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. పరీక్ష రద్దుతో నిరాశకు గురవుతున్నారు. జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు మెడిసిన్ చదవాలన్న లక్ష్యంతో ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసి నీట్కు సన్నద్ధమయ్యారు. సుమారు ఐదు వేల మంది వరకు ఈనెల 3న నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. ఇందుకోసం రెండేళ్ల పాటు అంటు ఇంటర్తోపాటు నీట్ కోసం ప్రిపేర్ అయ్యారు. మరికొందరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. పరీక్ష పూర్తవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కీ చూసుకుని ఎన్ని మార్కులు వస్తాయన్న దానిపై లెక్కలు వేసుకుని తమకు ఎక్కడ మెడిసిన్ సీటు వస్తుందన్న దానిపై ఓ అంచనాకు వచ్చారు. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ తదితర కోర్సులన్నింటికీ నీట్ ద్వారానే సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు మొదట ఎంబీబీఎస్కు ప్రాధాన్యతనిస్తారు. ఎంబీబీఎస్లో సీటు రాకుంటే బీడీఎస్తో పాటు ఇతర కోర్సుల్లో చేరాలనుకుంటారు. కొందరు విద్యార్థులు తమకు సీటు రాని పక్షంలో మరో ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్కూ వెళతారు. మెడిసిన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రాత్రింబవళ్లు చదివిన వారంతా నీట్ పరీక్ష రద్దయిందని తెలియడంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇంతకాలం హాస్టళ్లలో ఉండి ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన వారు.. మళ్లీ పరీక్ష రాయాలంటే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈసారి కీ చూసుకున్న తర్వాత తమకు సీటు గ్యారంటీగా దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారు.. మళ్లీ పరీక్ష రాస్తే తమకు అన్ని మార్కులు వస్తాయో లేదోననే ఆందోళన చెందుతున్నారు. నీట్ పరీక్ష రద్దుతో తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారు. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. విద్యార్థులు మాత్రం అప్పుడే పుస్తకాలతో కుస్తీ ప్రారంభించారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● జిల్లాలో 8,618 మంది విద్యార్థులు.. ● 31 పరీక్ష కేంద్రాల ఏర్పాటు కామారెడ్డి టౌన్ : జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా మొత్తం 8,618 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 5,561 మంది (జనరల్ 4,774, వొకేషనల్ 787), ద్వితీయ సంవత్సరం నుంచి 3,057 మంది (జనరల్ 2,538, వొకేషనల్ 519) పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో బాలికలు 5,170 మంది కాగా, బాలురు 3,448 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ను నియమించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 200 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. -
బండి సంజయ్ రాజీనామా చేయాలి
కామారెడ్డి టౌన్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయా లని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేయగా.. పోలీసులు వారిని అ డ్డుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ బండి సంజయ్ తన కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసును నీ రుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ యన పదవిలో ఉంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగదన్నారు. వెంటనే భగీరథను అరెస్ట్ చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, నాయకులు గోనె శ్రీనివాస్, రాజాగౌడ్, రామాగౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
‘జాతీయ రహదారిపై బస్టాండ్ ఏర్పాటు చేయాలి’
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో జాతీయ ర హదారి పక్కన బస్టాండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మంగళవారం హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని జామాబాద్, ఆర్మూర్ తదితర డిపోలనుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు చాలా వరకు బైపాస్ మీ దుగా ప్రయాణిస్తున్నాయని, పట్టణంలోకి రావడం లేదని పేర్కొన్నారు. దీంతో బస్సులకోసం పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణానికి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ప్ర భుత్వ భూములు ఉన్నందున హైవే బస్టాండ్ ఏర్పా టు చేయాలని కోరారు. తమ వినతిపై మంత్రి సా నుకూలంగా స్పందించి బస్టాండ్ ఏర్పాటు అంశా న్ని పరిశీలించాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కౌ న్సిలర్ గడ్డ మీది మహేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ని మ్మ విజయ్కుమార్రెడ్డి, క్రెడా అధ్యక్షుడు లక్ష్మీనర్సా గౌడ్, కాంగ్రెస్ నేత శ్రీధర్రావు తదితరులున్నారు. -
ట్యాబ్ ఎంట్రీలు వేగవంతం చేయండి
● కనీస మద్దతు ధర అందేలా చూడండి ● అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి టౌన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రి యకు సంబంధించి పెండింగ్లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం సేకరణపై సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. డీసీవో, డీఆర్డీఏ అధికారులు అన్ని కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ధాన్యం విక్రయించిన రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలని సూచించారు. కేంద్రాల వద్ద సరిపడా రవాణా వా హనాలను అందుబాటులో ఉంచాలని డిస్ట్రిక్ట్ మేనేజర్లకు సూచించారు. మిల్లుల వద్ద వాహనాలు నిలిచిపోకుండా డీసీఎస్వోలు నిరంతరం పర్యవేక్షిస్తూ మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా అన్ని కేంద్రాలు, మిల్లుల వద్ద తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని డీఎంవోను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, సివిల్ సప్లై అధికారి వెంకటేష్, డీసీవో రామ్మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, డీఆర్డీఏ సురేందర్, ఆర్టీవో శ్రీనివాస్, డీఎం శ్రీకాంత్ పాల్గొన్నారు. -
హిందుత్వం అంటే సంస్కృతి
● భగవద్గీతలో ప్రతి సమస్యకు పరిష్కారం ● బీకేఎస్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు అంజిరెడ్డి భిక్కనూరు: హిందుత్వం అంటే మతం ఒక్కటే కాద ని, సంస్కృతి సంప్రదాయాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నా రు. మంగళవారం జంగంపల్లిలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భ గవద్గీతను చదవాలని, గో సంరక్షణ, దేవాలయ ప రిరక్షణకు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే ఆచార వ్య వహరాలు, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించాలన్నారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఇస్కాన్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి వెంకటదాసు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో రోజూ గంట పాటు దైవనామస్మరణకు సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని రామాయంపేట సేవికా సమితి ప్రతినిధి కవిత పేర్కొన్నారు. అహిల్యాబాయి, జిజియా మాతల్లా ఆదర్శంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో కుషాల్ మనోహర్, కార్తీక్ మనోహర్ భగవద్గీత శ్లోకాలు, సామూహిక హనుమాన్ చాలీసా, వందే మాతర గీతం ఆలపించారు. కార్యక్రమంలో సమ్మేళనం అధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణాగౌడ్, కోశాధికారి మోహన్రెడ్డి, సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్, నాయకులు సిద్దరాములు, నర్సింలు యాదవ్, నాగరాజు, శ్రీనివాస్, శేఖర్గౌడ్, నవీన్, సంజీవ్, దేవేందర్, సూర్యప్రకాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చిత్రకళతో సృజనాత్మకత
● బోధన్లో మూడేళ్లుగా వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం బోధన్: చిత్రలేఖనమంటే బొమ్మలు గీయడ మే మాత్రమే కాదు.. మనస్సుతో మాట్లాడే భా ష అని చిత్రకారులంటున్నారు. తమ ఊహాశక్తితో పౌరాణిక, జానపద, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరిస్తారు. చిత్రలేఖనం పిల్ల ల్లో ఏకాగ్రతను పెంపొందించడంతోపాటు సృజనాత్మకతకు పదును పెడుతుంది. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లింబూరు లక్ష్మణ్ తేజ క్రియేటివ్ కిడ్స్ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా బోధన్ పట్టణంలో వేసవి చిత్రలేఖన ప్ర త్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఈ ఏడాదీ శిబిరం ప్రారంభమైంది. ప్రస్తుతం శిబిరంలో 15 మందికి పైగా విద్యార్థులు చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకుంటూ అద్భుత ప్రతిభ చాటుతున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి ఎర్రొల్ల అవంతి విద్యార్థులకు బోధిస్తున్నారు. పెన్సిల్ డ్రాయింగ్, షేడింగ్స్, కలర్ పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కామారెడ్డి అర్బన్: హరేరామ హరేకృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు సంస్కృతి వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాసు ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భగవద్గీత శ్లోకాలు, తబలా, చిత్రలేఖనం, నైతిక, పౌరాణిక, నీతి కథలు, ధ్యానం, కీర్తనలు, నృత్యం, రుచికర సహజ వంటల తయారీ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు రామారెడ్డి రోడ్డు లోని మెడికల్ అసోసియేషన్ భవనంలోని ఇస్కాన్ కేంద్రంలో లేదా 99129 16108, 99596 02551 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. మేము గీసిన చిత్రాలు ఇంటి కోడికి ఒకటే కాలు.. పొరుగు కోడికి మూడు కాళ్లు ( మన దగ్గర ఉన్నదాని కన్నా పక్కవాడికి ఉన్నదే గొప్పగా భ్రమపడటం) గాడిద సోపతి తన్నులకే.. ( చెడ్డవాళ్లతో, మూర్ఖులతో స్నేహం చేస్తే మంచి కాకుండా నష్టం, అవమానం, ఇబ్బందులు వస్తాయి.) నాకు బొమ్మలు గీయడమంటే ఎంతో ఇష్టం. మూ డో తరగతి నుంచి బొమ్మ లు గీయడంపై ఆసక్తి పెంచుకున్నాను. ఇంటి వద్దనే బొమ్మలు గీసేదానిని. బోధన్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటైనట్లు తెలుసుకొని నేను, తమ్ముడు చేరాం. ప్రతి రోజు వచ్చి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాం. – భవ్య, 7వ తరగతి విద్యార్థిని, బోధన్ డ్రాయింగ్ నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. బొమ్మలు గీయడం ఎంతో సులభమో విద్యార్థులకు మెలకువలు నేర్పుతున్నాం. రంగులపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు సొంతంగా బొమ్మలు గీసేలా ప్రొత్సహిస్తున్నాం. – ఎర్రొల్ల అవంతి, ప్రముఖ చిత్రకారిణి -
పేలిన ట్రాక్టర్ టైర్
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ఆర్మూర్టౌన్: ట్రాక్టర్ టైర్ పేలి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రజినికాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కత్తి బాలకృష్ణ(40) అనే వ్యక్తి ఆర్మూర్ మండలం మగ్గిడిలోని ఇటుక బట్టిలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అంకాపూర్ గ్రామంలో ట్రాక్టర్ ఇటుకలోడ్ను దించి తిరిగి మగ్గిడికి వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ వద్ద టైర్ పేలిపోవడంతో ముందున్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ బాలకృష్ణ టైర్ కిందపడగా, మరో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ ఆస్పత్రిలో మృతిచెందగా, మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పెంచులమ్మ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. డిచ్పల్లి : డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుద్దపల్లి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఎండిపోయిన గడ్డి, పిచ్చి మొక్క లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించా యి. సమీపంలో ఇళ్లు ఉండటం, మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్ స్టే షన్కు సమాచారం అందించారు. ఘటనా స్థ లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అరగంటపా టు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
క్రైం కార్నర్
పాముకాటుతో మహిళ మృతి నవీపేట : మండలంలోని ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(57) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో భోజనం చేశాక ఆరుబయట పడుకుందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కట్లపాము కాటువేయగా 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతురాలి సోదరి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామానికి చెందిన బండారి సాయిలు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మొరందుబ్బ ప్రాంతంలో సాయిలు ఉరేసుకొని మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్ ● ఒకరి మృతి ఆర్మూర్టౌన్: చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం గోవింద్పేట్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్ గ్రామానికి చెందిన సీతానగర్ దాకయ్య(50) గోవింద్పేట్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనుల నిమిత్తం గోవింద్పేట్ గ్రామం నుంచి ఆర్మూర్కు వస్తుండగా గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో దాకయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
శ్రీనగర్లో దొంగల బీభత్సం
మూడు ఇళ్లలో చోరీ వర్ని: మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన వజ్రమ్మ, రమణ, శ్రీనివాసరావు ఇళ్లలో చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లలో కలిపి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా తీసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. వేసవికాలంలో డాబాల మీద పడుకున్న, ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
బడిలో సామగ్రి భద్రమేనా?
ఎల్లారెడ్డి: ప్రహరీలు లేని భవనాలు.. వాచ్మెన్లు అసలే ఉండరు.. రాత్రి కాగానే ఆకతాయిలకు మందు బాబులకు అడ్డాలు.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో మూతబడ్డ పాఠశాలలు జూన్లో తెరుచుకుంటాయి. అప్పటివరకు ఎలాంటి రక్షణ లేని ఇలాంటి భవనాలలో లక్షల రూపాయలు ఖరీదు చేసే కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, డిజిటల్ స్క్రీన్లు తదితర వస్తువులు పడి ఉంటున్నాయి. అలాగే వేసవి సెలవులకు ముందు పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన బియ్యం భద్రంగానే ఉన్నాయా అన్న ప్రశ్న పలువురిలో నెలకొంది. ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు.. ఎల్లారెడ్డి మండలంలో 44 ప్రాథమిక, 4 యూపీఎస్, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇవేకాకుండా కేజీబీవీ, మోడల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో కనీసం ఒక కంప్యూటర్, డిజిటల్ ప్రొజెక్టర్, స్క్రీన్ తదితర వస్తువులు ఖచ్చితంగా ఉంటున్నాయి. కళ్యాణి గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) విద్య నేర్పేందుకు మండల పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. దీంతో బడిలో దాదాపు 10 వరకు అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్ స్క్రీన్లు ఉన్నాయి. అలాగే ప్రతీ విద్యాలయంలోనూ బియ్యం నిల్వలు సైతం బాగానే ఉన్నాయి. ప్రతీ గురుకుల పాఠశాల, మోడల్ స్కూళ్లలో వాచ్మెన్లు ఉంటారు కాబట్టి రక్షణ ఉండే అవకాశం ఉంది. కానీ మిగితా ఏ పాఠశాలలోనూ వాచ్మెన్లు ఉండకపోవడంతో వాటికి రక్షణ కరువైంది. ఆకతాయిలకు అడ్డాలు.. గ్రామీణ ప్రాంతాలలోని బడులు రాత్రి వేళల్లో మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. వారు పాఠశాలలో మద్యం తాగడమే కాకుండా మందు సీసాలను పగలగొట్టి నానా హంగామా చేస్తున్నారు. గేట్లకు తాళాలు వేసినా వాటిని పగలగొట్టి పాఠశాలలోకి వెళుతున్నారు. అంతేగాక పాఠశాలల్లో విలువైన వస్తువులు, బియ్యం ఉన్నాయని తెలిస్తే దొంగలు పాఠశాలల తలుపులు పగలగొట్టి ఎత్తుకెళ్లే అవకాశం ఉంది. అందరి భాగస్వామ్యం ఉంటేనే.. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతీ పాఠశాల హెడ్మాస్టర్ ప్రతీ రెండు రోజులకోసారి స్కూల్ను విజిట్ చేసి పరిస్థితిని పరిశీలించాల్సి వస్తుంది. కొందరు హెచ్ఎంలు స్థానిక పెద్దలతో మాట్లాడి స్కూల్ సంగతి చూడమని కోరుతున్నారు. మరికొందరు పట్టణ ప్రాంతాల్లో పోలీసులను పెట్రోలింగ్ చేయమని కోరుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల రక్షణ పెద్ద సమస్యగా మారుతున్నది. ఈక్రమంలో పాఠశాలల్లోని విలువైన వస్తువులను రక్షించుకోవడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎవరో ఒకరు పాఠశాల పరిసరాలను పరిశీలిస్తుండాలి. ఎవరైనా ఆకతాయిలు, మందు బాబులు పాఠశాల పరిసరాలలో కనిపిస్తే నివారించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పాఠశాలను రక్షించుకోవచ్చు .విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు ప్రతీ రెండు రోజులకోసారి బడుల ను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాల ఆస్తులను రక్షించుకోవాలని ఎస్ఎంసీ బాధ్యులకు, స్థానిక సర్పంచులకు కోరాం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ఉన్న విలువైన వస్తువులను కాపాడుకోవడంలో భాగస్వామ్యం కావాలి –రాజులు, ఎంఈవో, ఎల్లారెడ్డి వేసవి సెలవుల కారణంగా పాఠశాలలకు తాళాలు గదుల్లో రూ.లక్షల విలువచేసే కంప్యూటర్లు, ఇతర పరికరాలు రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువు -
అంకితభావంతో విద్యా బోధన
● ఉత్తమ టీచర్గా పలు అవార్డులు ● ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయురాలుగాంధారి(ఎల్లారెడ్డి): అంకితభావంతో చిన్నారులకు విద్యాబోధన చేస్తూ ఉత్తమ టీచర్గా పలు అవార్డులు అందుకుంటున్నారు మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు భవాని. మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాలకు భవాని 2018లో బదిలీపై వచ్చారు. అప్పుడు కేవలం 40 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేవారు. భవాని గ్రామంలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. చిన్నారులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేస్తూ క్రమంగా విద్యార్థుల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం పాఠశాలలో 140 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఆటలు, పాటలు, కంప్యూటర్ పాఠాలు కూడా బోధిస్తున్నారు. సొంత డబ్బులతో పాఠశాలకు ఒక కంప్యూటర్లను సమకూర్చి కంప్యూటర్ పరిజ్ఙానం కల్పిస్తున్నారు. ఆమె సేవ, కృషిని గుర్తించిన సంబంధిత అధికారులు పలుమార్లు మండల ఉత్తమ టీచర్గా ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇటీవలే రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ ఎంపికై సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. ఇతర దేశాల్లో విద్యాబోధన పరిశీలన కోసం వెళ్లిన ఉపాధ్యాయుల బృందంలో చోటు దక్కించుకుని విదేశాల్లో కూడా ఆమె పర్యటించారు. -
నేడు కామారెడ్డి బల్దియా చైర్పర్సన్తో ‘సాక్షి’ ఫోన్ఇన్
76509 87777వేసవిలో నీటి ఎద్దడి, పైప్లైన్ల లీకేజీలు, మున్సిపల్ బోర్ల మరమ్మతులు తదితర సమస్యలపై కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణితో సాక్షి ఫోన్ఇన్ నిర్వహిస్తోంది. నీటి సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడానికి కింది నంబర్కు ఫోన్ చేయండి.తేది : 11–05–2026 (సోమవారం) సమయం: ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు..ఫోన్ చేయాల్సిన నంబర్: -
జొన్న పంటకు మద్దతు కరువు
● పత్తాలేని కొనుగోలు కేంద్రాలు ● పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో రైతులుతెల్గాపూర్లో జొన్న కుప్పలు నిజాంసాగర్ : జొన్న రైతులకు మద్దతు కరువవుతోంది. పంట పూర్తిగా చేతికివచ్చినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు. యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 86 వేల ఎకరాల్లో జొన్న పంట సాగయ్యింది. ఈసారి వరికి బదులుగా చాలా మంది జొన్న సాగు చేశారు. బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లి, పిట్లం, పెద్దకొడప్గల్, నిజాంసాగర్, మహమ్మద్నగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లో ఈ పంట ఎక్కువగా సాగయ్యింది. ఆయా మండలాల్లో సాగు చేసిన జొన్న పంట నూర్పిడీలు పూర్తై నెల రోజులు కావస్తోంది. కానీ ఇంతవరకు జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చి కుప్పలుగా పోసిన రైతులు.. కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. -
ముందడుగేది..?
మహాప్రస్థానంకుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : లక్షకు పైగా జనాభా ఉన్న కామారెడ్డి పట్టణంలో శ్మశాన వాటికలు అధ్వానంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అంతిమ సంస్కారాల సందర్భంగా ఇబ్బందిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ గతనెల 20న ‘అంతిమ కష్టాలు’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది కథనం వైరల్ అయ్యింది. అదేరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ‘సాక్షి’ కథనాన్ని చూపుతూ సమస్యను లేవనెత్తారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ కథనాన్ని చదివి చలించిన బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి సొంత డబ్బులతో శ్మశానాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు. పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతనెల 27న ఎస్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు జిల్లా అధికారులను కలిసి లేఖ అందించారు. ఈ వినతిని పరిశీలించాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి బల్దియా కమిషనర్ను ఆదేశించారు. ఎటూ తేల్చలేకపోతున్న అధికారులు శ్మశాన వాటికను సొంత డబ్బులతో అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా.. అనుమతులు ఇచ్చే విషయంలో బల్దియా అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం కూడా సదరు స్వచ్ఛంద సంస్థ నిర్ణయాన్ని స్వాగతించాయి. పలు కుల సంఘాలూ మద్దతు ప్రకటించాయి. అయినా అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బులతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన వారిని అభినందించి సహకరించాల్సిన అధికారులు.. ఈ వ్యవహారంలో నాన్చుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చొరవ చూపి వైకుంఠధామంలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.కష్టాల కాష్టం... కామారెడ్డి పట్టణంలో ఉన్న రెండు శ్మశాన వాటికల్లోనూ అనేక సమస్యలున్నాయి. శ్మశానానికి సంబంధించిన భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన కొద్ది స్థలంలో అన్ని వసతులను కల్పించేందుకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు మధ్యలో ఆగిపోవడంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. ప్రధానంగా హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్ చేసింది. గతేడాది ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో చెరువు అలుగు ఉప్పొంగి వాగు వేగంగా ప్రవహించడంతో శ్మశాన వాటికి ప్రధాన గేటు వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడచినా తట్టెడు మట్టిపోయకుండా వదిలేశారు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలు లేవు. ఒకేసారి రెండు మృతదేహాలను మాత్రమే దహనం చేయడానికి అవకాశం ఉంది. మూడో వ్యక్తి చనిపోతే కాడు ఎక్కడ పేర్చాలో తెలియని పరిస్థితి.. అంత్యక్రియల సందర్భంగా స్నానాలు చేయడానికి ట్యాంకర్ను తెచ్చుకోవాల్సిదే. ఇలాంటి దయనీయ పరిస్థితుల మధ్య అంత్యక్రియలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రంలో అధ్వానంగా ‘వైకుంఠధామం’ సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ స్వాగతించిన బీజేపీ, అధికార పార్టీలోని ఒక వర్గం అనుమతుల విషయాన్ని నానబెడుతున్న బల్దియా పక్షం రోజులవుతున్నా ఏ విషయం తేల్చని అధికారులు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రజలు జిల్లాకేంద్రంలో అధ్వానంగా ఉన్న వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా.. అనుమతులు ఇవ్వడంలో బల్దియా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏ నిర్ణయం చెప్పకుండా కాలయాపన చేస్తుండడంపై ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. శ్మశాన వాటికలో సమస్యల పరిష్కారం, వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నేటి నుంచి జనగణన!
● తొలి దశలో కుటుంబాల గుర్తింపు ● జిల్లాలో 1,954 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ● పూర్తయిన స్వీయగణన ప్రక్రియ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశవ్యాప్తంగా జరిగే జనగణన ప్రక్రియ సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి వారికి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. జనగణనలో తొలి దశలో కుటుంబాల గుర్తింపు చేపట్టనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే జనగణన తొలి దశ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది. మొదట జిల్లాలో కుటుంబాల లెక్క తేలుస్తారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జనగనణ కోసం 1,954 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించారు. గణనకు అవసరమైన మెటీరియల్ అందించారు. సోమవారం నుంచి వారికి కేటాయించిన ప్రాంతాల్లో తిరిగి కుటుంబాల గుర్తింపు ప్రక్రియ చేపడతారు. కాగా స్వీయగణన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. దాదాపు 10 వేల మంది స్వీయగణన చేసుకున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్కు ‘కొత్త’ రక్తం!
● మండలాలు, పట్టణాల అధ్యక్షుల నియామకం ● కార్యవర్గాల ఏర్పాటే ఆలస్యం సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కాంగ్రెస్ను క్షేత్ర స్థాయి లో బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకత్వం చ ర్యలు తీసుకుంటోంది. మొదట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, తర్వాత జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మండల, పట్టణ అధ్యక్షుల నియమక ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో బాన్సువాడ ని యోజకవర్గం మినహా మిగతా అన్ని మండలాలు, పట్టణ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జీల సూచనల కు అనుగుణంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మ ల్లికార్జున్ మండలాలు, పట్టణాల పార్టీ అధ్యక్షుల నియామక ప్రక్రియ నిర్వహించారు. చాలా వరకు యువతకు అవకాశాలు కల్పించారు. మూడేళ్లకుపైగా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని దాదాపు తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇ చ్చారు. కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేస్తున్న పండ్ల రాజును తప్పించారు. ఆయ న స్థానంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ను నియమించారు. కామారెడ్డి మండలానికి దశాబ్దకాలానికిపైగా అధ్యక్షుడిగా కొనసాగిన గూ డెం శ్రీనివాస్రెడ్డి స్థానంలో ధర్మగౌని రాజాగౌడ్ను అధ్యక్షుడిని చేశారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల అధ్యక్షులుగా నౌసీలాల్, రమేశ్గౌడ్లను రెండో పర్యాయం కొనసాగించారు. బీబీపేట మండల అధ్యక్షుడిగా పనిచేసిన సుతారి రమేశ్ను తప్పించి, ఆయన స్థానంలో భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ పాత రాజుకు అవకాశం ఇచ్చారు. భిక్కనూరుకు నరేందర్రెడ్డి, రాజంపేటకు అంకం కృష్ణారావ్ను నియ మించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి మండల అ ధ్యక్షుడిగా కుర్మ సాయిబాబా, నాగిరెడ్డిపేటకు శ్రీధర్గౌడ్, లింగంపేటకు గొల్ల సాయిరాం యాదవ్, సదాశివనగర్కు మహీపాల్రెడ్డి, తాడ్వాయికి సంజీవులు, రామారెడ్డికి ప్రవీణ్గౌడ్, గాంధారికి శ్రీని వాస్ నియమితులయ్యారు. జుక్కల్ మండల అధ్యక్షుడిగా రమేశ్ దేశాయ్, నిజాంసాగర్కు ప్రజాపండరి, మహ్మద్నగర్కు రవీందర్రెడ్డి, పిట్లంకు రవీందర్, పెద్దకొడప్గల్కు శ్యామప్ప, మద్నూర్కు సాయిలు, డోంగ్లీకి గజానన్, బిచ్కుందకు నాగనాథ్, బిచ్కుంద పట్టణానికి విజయభాస్కర్రెడ్డి అధ్యక్షులయ్యారు. బాన్సువాడ పట్టణంతో పాటు బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించలేదు. ఆయా మండలాలకు సైతం త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే పూర్తి స్థాయి పట్టణ, మండల కార్యవర్గాలనూ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఆయా మండలాలు, పట్టణాల్లో అ ధ్యక్షుల నియామకంలో యువతకు ప్రాధాన్య తనిచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి చాలాచోట్ల యువకులను అవకా శం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీ సుకువెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చే యడానికి యువ రక్తానికి ప్రాధాన్యతనిచ్చిన ట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడు మొదలు, మండల, పట్టణ అధ్యక్షులు చాలావరకు యువకులే ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్ను మరింత బ లోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ మండల, పట్టణ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. బాన్సువాడకు సంబంధించిన నియామకాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. -
నేటి నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు
కామారెడ్డి అర్బన్: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, వసతులు, శిక్షణ కార్యక్రమాలు, తల్లిదండ్రుల సమావేశం, విద్యా ప్రమాణాలపై చర్చ, గ్రంథాలయ దినోత్సవం, డిజిటల్ విద్యపై అవగాహన, విద్యార్థులకు బహుమతుల ప్రదానం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. 13 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం కామారెడ్డి అర్బన్:/కామారెడ్డి టౌన్ : కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13న ఉచిత వేసవి క్రికెట్ శిబిరాన్ని ప్రారంభించ నున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మోజా మ్ అలీఖాన్, కార్యదర్శి ముప్పారపు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్, నిజామాబాద్ క్రికేట్ అసోసియేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు బాల, బాలికలు, యువతీయువకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 13న నేరుగా స్టేడియానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో పతకాల పంట కామారెడ్డి అర్బన్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లె టిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల విభాగంలో కే.మేఘన జా వెలిన్ త్రోలో బంగారు పతకం, షాట్పుట్ లో కాంస్య పతకం సాధించగా, వై.శిరీష జా వెలిన్ త్రోలో కాంస్య పతకం పొందారు. అండర్–20 బాలుర విభాగంలో లాంగ్ జంప్ లో నందు, రాకేష్ వెండి పతకాలు, పవన్ క ళ్యాణ్ కాంస్య పతకం సాధించారు. అండర్–18 బాలికల విభాగం 400 మీటర్ల ప రుగులో కె.నందిని వెండి పతకం పొందారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ అభినందించారు. ‘బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం’ కామారెడ్డి అర్బన్: జిల్లాలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎకై ్సజ్ అధికారి హన్మంతురావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇటీవలి కాలంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై 91 కేసులు నమోదు చేసి బాధ్యులైన 90 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అక్రమంగా మద్యం విక్రయించే పనిని మానుకోవాలని సూచించారు. నేడు ‘కోఆప్షన్’ ఎన్నిక బిచ్కుంద: బిచ్కుంద మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం జరుగనుంది. నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. 12 వార్డులు ఉండగా 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది కోఆప్షన్ కోసం నామినేషన్లు వేశారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించనున్నారు. మైనార్టీ విభాగం నుంచి అసద్అలీ, పర్వీన్ అబ్దుల్, జనరల్లో చింతల హన్మండ్లు, బొగడమీది తానుబాయిలకు కోఆప్షన్ సభ్యులుగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అవకాశం కల్పిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. -
కస్టమర్ దేవోభవ..!
ఆందోళనకు సిద్ధం మోర్తాడ్: రైతుల సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకపోతే తాను ఆందోళ నకు సిద్ధమవుతానని, రోడ్డెక్కుతానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆ రోపించారు. బాల్కొండ మండలం కిసాన్నగర్, మోర్తాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించి రైతులతో మా ట్లాడారు. అక్కడి నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికా రితో ఫోన్లో మాట్లాడారు. అరగంట నుంచి ప్రయత్నిస్తున్నా కలెక్టర్ తన కా ల్స్కు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ధా న్యం సేకరణలో లోపాలు చోటు చేసుకుంటున్నా యని ఆరోపించారు. తరుగు పేరుతో సతాయించే మిల్లుల జాబితాను సిద్ధం చేసి వాటిని సీజ్ చేస్తే రైస్మిల్లర్లు ఎందుకు ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకోరని ఆయన ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూశామన్నారు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తామంటున్న మిల్లర్ల భరతం పట్టాలని అధికారులకు సూచించారు. -
నెరవేరిన పేదల సొంతింటి కల
ఎల్లారెడ్డిరూరల్/ఎల్లారెడ్డి/నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరిందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఎల్లారెడ్డిలోని 12వ వార్డులో నూతనంగా నిర్మించిన జూకంటి రుక్కవ్వ ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. అలాగే మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో చాకలి సాయిలు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ గజ్జల జీవన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ అనసూయ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హిందూ సమ్మేళనానికి తరలిరావాలి
భిక్కనూరు: మండల కేంద్రంలోని అంగడి బజారులో ఈనెల 11న జరిగే హిందూ సమ్మేళనానికి ప్రజలు తరలిరావాలని సమ్మేళన నిర్వాహకులు కోరారు. భిక్కనూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనం ప్రధాన వక్తగా సామాజిక సమరసత వేదిక, తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్, ఆశీ ప్రసంగిక్గా మెట్పల్లి గీతా కేంద్రం విశోక తీర్థ స్వామిజీ హాజరవుతారన్నారు. అధ్యక్షుడు చల్ల లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి లింగా రాజబాబుగౌడ్, కోశాధికారి పెద్దబచ్చుగారి చంధ్రశేఖర్, ప్రతినిదులు గొల్ల రమేష్, సందుగారి రవీందర్రెడ్డి, విలాస్రెడ్డి, బల్యాల వెంకటనర్సింలు,జేపి సిద్దాగౌడ్ తదితరులు ఉన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని నందివాడ గ్రామంలో శనివారం సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు జంగం మంగారెడ్డి, సంకు పోచయ్య, డైరెక్టర్లు సంజీవరెడ్డి, రాజిరెడ్డి, గ్రామపెద్దలు, రైతులు పాల్గొన్నారు. భిక్కనూరు : అనారోగ్యంతో మృతి చెందిన తాతకు మనుమరాలు తలకొరివి పెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మంగలి కొనింటి చిన్న బాలయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. మృతుడికి ఒక కూతురు ఉండగా ఆమె ఒక ఆడ కూతురుకు జన్మనిచ్చి గతంలో మృతి చెందింది. దీంతో బాలయ్యకు మనుమరాలు గీత మాత్రమే ఉన్నారు. ఆయన మృతి చెందడంతో చివరకు గీత తలకొరివి పెట్టింది. మోపాల్: మండలంలో ని కంజర్ గ్రామంలో ధాన్యం తరలించేందు కు వచ్చిన లారీ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఎస్సై జాడె సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం.. సొసైటీ ధాన్యం వద్దకు వెళ్లే క్రమంలో లారీ క్యాబిన్కు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. క్షణాల్లోనే మంటలు లారీ టైర్లకు వ్యాపించి దగ్ధమయ్యాయి. స్థానికులు ఫైరింజన్కు సమాచారమివ్వగా ఇందల్వాయి నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పేసింది. డ్రైవర్ సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఫైరింజన్ పైలెట్ ప్రకాశ్ పేర్కొన్నారు. -
బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు తొలగించొద్దు
బాన్సువాడ: బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు తొలగించవద్దని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈమేరకు వారు శనివారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నస్రుల్లాబాద్ మండలంలోగల ఓ ప్రయివేట్ పాఠశాలలో వివిధ తరగతుల్లో బెస్ట్ అవైలబుల్ స్కీంలో భాగంగా 144 మంది ఎస్సీ విద్యార్థులు చదువుతుండగా, ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో వారిని తొలగిస్తామని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం చెల్లింపులు చేసి, పునరుద్ధరణ చేయాలని మాల ఎడ్యూకేషనల్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్యదర్శిఽ పాండురంగం డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మెక్క సురేష్, పండరి, పోశెట్టి, అశోక్, విఠల్ తదితరులు ఉన్నారు. నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్–బోధన్ రహదారి విస్తరణ పనులతో ప్రయాణికులకు బస్ షెల్టర్లు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం వేచిచూస్తున్నారు. ఈక్రమంలో మహమ్మద్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం శనివారం సర్పంచ్ దఫేదార్ బాలమణి పచ్చని పందిరి వేయించారు. పందిరి వేయించి ఎండ కష్టాలను దూరం చేసిన సర్పంచ్కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాన్సువాడ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించరాదని బాన్సువాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెర్రె నర్సింహులు అన్నారు. శనివారం ఆయన బోర్లం క్యాంపులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. సహకార సంఘం అధికారులు, సిబ్బంది కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. నాయకులు గాండ్ల సాయిలు, మన్నె చిన్న సాయిలు, మంగలి ధత్తు, గంగాధర్ తదతరులు ఉన్నారు. నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైంది. గ్రామానికి చెందిన దార గంగాధర్కు చెందిన గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్ చేరుకుని మంటలను ఆర్పివేసినప్పటికీ లాభం లేకుండాపోయింది. రూ.25వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
‘ప్రైవేట్’కు దీటైన ఫలితాలు
● పదిలో ఏటా శతశాతం ఉత్తీర్ణత ● ట్రిపుల్ ఐటీకి పలువురు ఎంపిక ● ఆదర్శంగా నిలుస్తున్న దోమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలదోమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ పాఠశాలలో మూడుసార్లు శతశాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. దోమకొండ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాలలో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో 49 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా.. అందరూ పాసయ్యారు. ఆ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీకి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 82 కు చేరింది. ఇందులో ఒక్కరు మినహా మిగిలిన అందరూ ఉత్తీర్ణులయ్యారు. నలుగురికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. 2024–25 విద్యా సంవత్సరంలో 70 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించారు. గత విద్యా సంవత్సరంలో 80 మంది విద్యార్థులకు 80 మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పావని 582 మార్కులతో జిల్లాస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల టాపర్గా నిలిచింది. భవాని 578 మార్కులు, అమూల్య 576 మార్కులు, భవిష్య 575 మార్కులు, షఫియా 573 మార్కులు, రసజ్ఞ 570 మార్కులతో సత్తా చాటారు. గత విద్యాసంవత్సరంలో పాఠశాలలో 334 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో పాఠశాలకు గదుల కొరత ఉండగా, రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో అదనపు గదులు నిర్మించారు. దీంతో గదుల సమస్య పరిష్కారమైంది. ఈ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య సైతం అందుతోంది. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. పలు క్రీడాంశాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు. ఉపాధ్యాయులు సైన్స్ఫేర్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థినుల్లో నృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. పాఠశాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. సబ్జెక్ట్ వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తున్నారు. చదువుతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారిలో సృజనాత్మకత పెంపొందేలా చూస్తున్నాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. – శరత్కుమార్, ప్రధానోపాధ్యాయులు, దోమకొండ -
గ్యాస్ నింపుతుండగా అగ్ని ప్రమాదం
● రెండు వ్యాన్లు, కారు, ఓ బైక్ దగ్ధం ● కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో ఘటనకామారెడ్డి క్రైం: గృహ వినియోగ సిలిండర్లో నుంచి కారులోకి గ్యాస్ నింపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించి రెండు వ్యాన్లతోపాటు ఓ కారు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలి టీ పరిధిలోని దేవునిపల్లిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. సురేశ్, శ్రీశైలం అనే ఇద్దరు వ్యక్తు లు వారి ఇంటికి సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో వేసి ఉన్న రేకుల షెడ్డులో కొంత కాలంగా తమ కార్లను పార్కింగ్ చేసుకుంటున్నారు. నిబంధనలకు విరు ద్ధంగా గృహ వినియోగ సిలిండర్ నుంచి ఓ వ్యాన్లోకి గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షెడ్డులో ఉన్న అన్ని వాహనాలకు వ్యా పించాయి. స్ధానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే రెండు ఈకో వ్యాన్లు, ఓ బెలెనో కారు, ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యా యి. ప్రమాదానికి కారణమైన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్, రీఫిల్లింగ్ మిషన్లను దేవునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చేవరకు కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. -
కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి
● ఇరిగేషన్ అధికారులకు ప్రజాప్రతినిధుల సూచన ● పలు మండలాల్లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారం’ నిర్వహణలింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, అయ్యపల్లి తండాల శివారులో గత వర్షాకాలంలో భారీ వర్షాలకు ధ్వంసమైన చెరువు కట్టలు, కట్టు కాల్వల మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని ఆయా గ్రామాల సర్పంచులు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘రైతు వారం’ నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, ఫీడర్ చానల్లకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సర్పంచులు అట్టెం శ్రీనివాస్, గోనె లింగం, ఆత్మ కమిటీ చైర్మన్ ధశరత్నాయక్, ఏవో అనిల్కుమార్, ఇరిగేషన్ ఏఈ సతీష్కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండలంలో.. మాచారెడ్డి: చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని ఇరిగేషన్ ఏఈ వంశీ కృష్ణ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం గజ్యానాయక్ తండా రైతు వేదికలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. చెరువులలో పూడిక తియ్యడం, ముళ్ల పొదలు తొలగించడం, నీటిని సమృద్ధిగా వాడడం వంటి పనులు చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల స ర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులున్నారు. ఎల్లారెడ్డి మండలంలో.. ఎల్లారెడ్డిరూరల్: పోచారం ప్రాజెక్టు నీరు చివరి ఆయకట్టు వరకు అందించడంలో అధికారుల పనితీరు అభినందనీయమని ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత అన్నారు. మండలంలోని మీసాన్పల్లి రైతు వేదికలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారోత్సవాలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు కురవడంతో రెండు పంటలు సాగు కావడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, నీటి పారుదల శాఖ ఏఈ రాజేష్, రైతులు తదితరులున్నారు. భూసార పరీక్షలు చేయించుకోవాలి పెద్దకొడప్గల్(జుక్కల్): ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఏవో కిషన్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ప్ర జా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘రైతు వా రోత్సవాలు’ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణంగానే ఎరువులు ఉపయోగించాలని సూచించారు. నాయకులు బస్వరాజ్ దేశాయ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేను చేసిన మంచిపని
పక్షుల దాహార్తి తీరుస్తూ.. బాన్సువాడ: మండే ఎండలో పక్షుల దాహా ర్తిని తీర్చేలానే సంకల్పంతో ఓ చిన్నారి తనకు తోచిన ఆలోచనకు పదును పెట్టింది. పట్టణానికి చెందిన తేలి శ్రియాదిత ఖాళీ వాటర్ బాటిళ్లను మధ్య వరకు కట్ చేసి బాటిళ్లలో నీటిని నింపి ఇంటి పైన స్లాబ్కు కట్టింది. మరికొన్ని బాటిళ్లలో ధాన్యం గింజలు వేసి ఉంచడంతో ప్రతిరోజు పదుల సంఖ్యలో పక్షులు వచ్చిన ధాన్యం గింజలు తిని నీటిని తాగి వెళ్తున్నట్లు చిన్నారి తెలిపింది. విద్యార్థి పేరు: తేలి శ్రియాదిత, పదో తరగతి, పాత బాన్సువాడ -
76509 87777
రేపు కామారెడ్డి బల్దియా చైర్పర్సన్తో ‘సాక్షి’ ఫోన్ఇన్వేసవిలో నీటి ఎద్దడి, పైప్లైన్ల లీకేజీలు తదితర సమస్యలపై కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణితో సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. నీటి సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడానికి కింది నంబర్కు ఫోన్ చేయండి.తేది : 11–5–2026 (సోమవారం) సమయం: ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు..ఫోన్ చేయాల్సిన నంబర్: -
గోమాతల అక్రమ రవాణా అరికట్టాలి
పిట్లం(జుక్కల్): గోమాతల అక్రమ రవాణాను అరికట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శనివారం పిట్లం పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్భంగా గోమాతలను అక్రమంగా తరలించి హింసాత్మక చర్యలకు పాల్పడటం హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. గో సంరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గోమాతల అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొరారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చే యాలని కోరుతూ వీహెచ్పీ నాయకులు శనివారం ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డికి వినతిపత్రం అందించారు. గోహత్య జరగకుండా తగిన చర్యలను తీసుకోవాలని వారు విన్నవించారు. వీహెచ్పీ, గోసంరక్షక్ నాయకులు వినోద్, తులసి, రాజు ఉన్నారు. -
సంక్షిప్తం..
నూతన సీఐకి సన్మానం భిక్కనూరు: భిక్కనూరుకు బదిలీపై వచ్చిన నూతన సీఐ జగడం నరేష్ను మండల కేంద్రంలోని మున్నురుకాపు యువజన సంఘం ప్రతినిదులు శనివారం సన్మానించారు. సంఘ ప్రతినిదులు వడ్లూరి అశోక్, ముధాం క్రిష్ణ, సురేష్, దొబ్బి సిద్దరాములు, రంజిత్, అశోక్, రాము,శేఖర్, భాస్కర్లు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని సామదుబ్బ తండాలో ఇటీవల షార్ట్సర్క్యూట్తో పలువురి గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పార్టీ మండల అద్యక్షుడు సంజీవులు, నాయకులు వెంకట్రెడ్డి, షౌకత్అలీ, రాజీవ్కుమార్, మేకల రాజు, సుధాకర్రావు, గంగారెడ్డి, సర్పంచ్లు జాదవ్ రేణుక, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. నియామకం భిక్కనూరు: మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరాం వెంకటేశ్ నియమితులయ్యారు. ఈమేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరన్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు పదవి రావడానికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొట్టాల్గడ్డ తండాలో శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని జిల్లా అధ్యక్షుడు సంపత్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమావత్ మోహన్, ఉపాధ్యక్షుడిగా ఇస్లావత్ శివరామ్, యూత్ అధ్యక్షుడిగా రమావత్ నరేష్, యూత్ ఉపాధ్యక్షుడిగా మెగావత్ దేవిదాస్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే ఆయా పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. లింగంపేట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్రెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు జైల్సింగ్, శ్రీకాంత్, సాయిలు, శంకర్, మహేందర్, భరత్ తదితరులు పాల్గొన్నారు. త్రీఫేజ్ విద్యుత్ వేళలు పెంచాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో త్రీఫేజ్ విద్యుత్ వేళలు పెంచాలని మండల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు వారు శనివారం తాడ్వాయి సబ్స్టేషన్లో ట్రాన్స్కో సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో త్రీఫేజ్ వి ద్యుత్ను 12గంటలు మాత్రమే ఇవ్వడంతో గ్రామా ల్లో బోరు మోటార్లు సరిగా నడవక తాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయన్నారు. సింగిల్విండో చైర్మన్ కపిల్రెడ్డి, సర్పంచ్లు మంగారెడ్డి, చంద్రారెడ్డి, తాజోద్దీన్, నర్సిములు, బీఆర్ఎస్ నాయకులు రాములు, రాజిరెడ్డి, సంజీవ్, ధర్మారెడ్డి ఉన్నారు. -
కరెంట్ షాక్తో మహిళ మృతి
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పిండి గిర్ని శుభ్రం చేస్తూ ఓ మహిళ విద్యుత్ షాక్తో శనివారం మృతి చెందింది. గ్రామానికి చెందని బండి రేణుక (35) తన ఇంట్లోనే పిండిగిర్ని ఏర్పాటు చేసుకుంది. శనివారం ఉదయం యంత్రాన్ని నీటితో శుభ్రం చేస్తుండగా విద్యుత్షాక్ కొట్టింది. వెనక్కిపడిపోయిన రేణుక తలకు తీవ్రగాయం కాగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భిక్కనూరు: తల్లి మందలించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన జిల్లెల బాలమణి రెండో కుమారుడు బాపురెడ్డి (25) తల్లితో కలిసి వ్యవసాయం చేసేవాడు. ధాన్యాన్ని ఆరబోసే విషయంలో గురువారం సాయంత్రం బాలమణితో బాపురెడ్డి గొడవపడ్డాడు. ఆ తరువాత బయటికి వెళ్లిన బాపురెడ్డి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం భిక్కనూరు బొబ్బిలి చెరువలో యువకుడి మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఒడ్డుకు తీసుకువచ్చి మృతుడిని రామేశ్వర్పల్లికి చెందిన జిల్లెల బాపురెడ్డిగా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: ప్రయాణికురాలి పర్సులో నుంచి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైన ఘటన కామారెడ్డిలోని కొత్త బస్టాండ్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. హైదరాబాద్లోని చితంల్లో నివాసం ఉండే మహిళ తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్కు హాజరయ్యేందుకు కామారెడ్డికి వచ్చి తిరుగు ప్రయాణమైంది. బస్సు ఎక్కిన తరువాత పర్సును చూసుకోగా నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ బస్సు ఎక్కే క్రమంలో చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పుట్టెడు దుఃఖం.. పిల్లలే లోకంగా జీవనం
ముప్పై ఏళ్లుగా..కడుపున పుట్టిన బిడ్డల మానసిక, శారీరక లోపాలను వారు శాపంగా చూడలేదు. వారిని భారంగా భావించలేదు. ఏళ్లు మీదపడుతున్నా ఆరోగ్యం మెరుగుపడదని తెలిసినా సరే వదిలించుకోవాలనుకోలేదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో, పిల్లల కోసమే బతుకుతున్నారు. తమంత ఎత్తు పెరిగినా చంటి పిల్లల్లా భావిస్తూ సపర్యలు చేస్తూ అమ్మతనానికి మరింత వన్నె తెస్తున్నారు. జిల్లాలో పలువురు తల్లుల త్యాగనిరతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిదుఃఖాన్ని దిగమింగుకుని.. ఎల్లారెడ్డిరూరల్: ‘‘అప్పుల బాధతో నా భర్త నర్వ నారాయణ ఆత్మహత్య చేసుకున్నడు. ఆయన చనిపోయిన సమయంలో పెద్దకొడుకు సిద్దిరాములుకు ఎనిమిదేళ్లు, చిన్నకొడుకు నాగరాజుకు ఆరేళ్లు. ఓవైపు అప్పులు.. మరోవైపు పుట్టెడు దుఃఖం.. అయినా పిల్లల కోసం బతకాలనుకున్నా. పొలం పనులు చూసుకుంటూ పిల్లలను పెంచి పెద్దచేసిన. పెద్ద కొడుకు ఉప సర్పంచ్ అయ్యిండు. చిన్న కుమారుడు నాగరాజు బాసర త్రిపుల్ ఐటీలో చదివిండు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఎన్ఐటీలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తుండు’’ అని జంగమాయిపల్లికి చెందిన సిద్ధవ్వ పేర్కొంది. ఇప్పటికీ పసి పాపే.. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్లో నివసించే బూక్య రజిత, రాజునాయక్లకు కూతురు, కొడుకు ఉ న్నారు. బిడ్డ బూక్య లక్కీకి పుట్టుకతోనే ఆరోగ్య సమ స్య ఉంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కదిలే స్థితిలోలేని బిడ్డ ను కంటిపాపలా చూసుకుంటున్నారు. రజితకు భర్త రాజునాయక్ ఆసరా అవుతారు. 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నా ఏ నాడూ భారంగా అనిపించలేదని చెబుతోంది రజిత. లక్కీని అందరూ ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపింది. బిడ్డను చూసుకుంటూనే రజిత లా చదువుతోంది. కూతురికి అన్నీ తానై.. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెంది న బోరంచ లక్ష్మి, దుర్గయ్య దంపతులకు కూతురు రేణుక ఉంది. ఆమెకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమైనా.. కన్న కూతురును 19 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఆ అమ్మ. కూలినాలి చేసుకుంటూ బిడ్డకు అన్ని సపర్యలు చేస్తూ కాపాడుకుంటోంది.తల్లి సిద్దవ్వతో నాగరాజుకామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన సూరం సంతోష, వెంకటేశ్లది రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం. వారికి 33 ఏళ్ల కూతురు అశ్విని, 31 ఏళ్ల కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేరు.. నడవలేరు. కనీసం నిలబడలేరు. 2010లో భర్త వెంకటేశ్ చనిపోవడంతో పిల్లల పూర్తి బాధ్యత సంతోషపైనే పడింది. పిల్లలే లోకంగా బతుకుతున్న సంతోష.. వారికి సేవలు చేస్తూ, ఇంట్లోనే బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజూ పొద్దున్నే పిల్లలు బ్రష్, స్నానం చేయించి, ఏదైనా తినిపించి కూర్చోబెట్టాల్సిందే. కాలకృత్యాలకు తీసుకెళ్లి శుభ్రం చేయాలి. పిల్లలను వదిలి ఎటూ వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూర్చోబెట్టి బయట డోర్ లాక్ చేసి మార్కెట్కు వెళ్లొస్తుంటానని చెబుతోంది. పిల్లలకు సేవ చేస్తూ, వారిని చూసుకుంటూ బతుకుతున్నానని తెలిపింది.ఇద్దరు కుమారులతో తల్లి రామకిష్టవ్వఆనందంగా సాగిపోతున్న వారి జీవితాల్లో విధి కల్లోలం రేపింది. జంగమాయిపల్లికి చెందిన నర్వ సిద్దవ్వ భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా.. మల్కాపూర్కు చెందిన కొండ రామకిష్టవ్వ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి జీవితంలో అంధకారం అలుముకుంది. అయినా వారు తమ పిల్లల కోసం దుఃఖాన్ని దిగమించుకుని ముందుకు సాగారు. కష్టపడి పిల్లలను పెంచి ప్రయోజకులను చేశారు. – ఎల్లారెడ్డి రూరల్ప్రయోజకులను చేసిన.. ఎల్లారెడ్డిరూరల్: ‘‘నా భర్త కొండ లచ్చయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన లేకుండా బతుకుడెట్లా అనుకున్న. మాకు ఇద్దరు పిల్లలు. వారిని ప్రయోజకులుగా చేయాలనుకున్న. వ్యవసాయం చేస్తూ చదివించిన. పెద్ద కొడుకు వంశి అగ్నివీర్లో ఎంపిక జమ్మూకశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నడు. చిన్న కొడుకు ఇంటర్ వరకు చదివిండు. వ్యవసాయంలో తోడుంటున్నడు’’ అని మల్కాపూర్కు చెందిన కొండ రామకిష్టవ్వ తెలిపింది. -
ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి
నాగిరెడ్డిపేట: వర్షాలు కురిసినా కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎస్వో రామ్మోహన్ సూచించారు. శనివారం ఆయన నాగిరెడ్డిపేట, తాండూర్ గ్రామాల్లో ని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. సీ ఈవోలు సందీప్, చంద్రమురళిలతో మాట్లా డి కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. రైస్మిల్లులకు తరలించిన వడ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ వెంటవెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా ఇప్పటివరకు 1.38 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటికే 18వేల మంది రైతుల ఖాతాల్లో ధాన్యం డ బ్బులు రూ. 303 కోట్లు జమ చేశామని పే ర్కొన్నారు. ఆయన వెంట మానిటరింగ్ అధి కారి రాధిక తదితరులున్నారు. పీహెచ్సీని సందర్శించిన కేంద్ర బృందం రామారెడ్డి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం నేషనల్ క్వాలి టీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం సందర్శించింది. లేబర్ రూమ్, జ నరల్ అడ్మినిస్ట్రేషన్, ఓపీ విభాగం, జాతీ య ఆరోగ్య కార్యక్రమాల విభాగాలను పరిశీలించారు. పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యాధికారి సురేశ్ మాట్లాడుతూ తనిఖీ బృందం సూచనలను పాటిస్తామన్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు జాశ్వ అభిషేక్ బండాలా, రాజేష్ మిశ్రా, డీఎంహెచ్వో రవీందర్ గౌడ్, జిల్లా ప్రోగ్రాం అధికారులు విద్య, రోహిత్, రాజు గౌడ్, వైద్యాధికారులు యెమీమా, విజయ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల వారితో అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్అర్బన్: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే కార్మికులు, అద్దెదారులు, ఉద్యోగుల విషయంలో ఇంటి యజమానులు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో సూచించారు. ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లు కుటుంబ వివరాలు, పనిచేసే స్థలం వచ్చిన తేదీ వంటి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అవసరం అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా వారి వివరాలు నమోదు చేయించాలన్నారు. -
ఆధ్యాత్మికం..
రేపటి నుంచి హరినామ సప్తాహం బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ గ్రామ విఠలేశ్వర మందిరంలో ఈనెల 11 నుంచి అఖండ హరినామ సప్తాహం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ అందె రమేష్ తెలిపారు. ఈసందర్భంగా శనివారం గ్రామంలో ఆయన గ్రామస్తులు, వార్కారి భక్తులతో కలిసి కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వార్కారి మహారాజ్ గొల్ల గంగాధర్యాదవ్, సొసైటీ చైర్మన్ గంగుల గంగారాం, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, దర్జి హన్మాండ్లు, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాదం వితరణ కామారెడ్డి అర్బన్: కామారెడ్డి కోడూరు హనుమాన్, పశుపతినాథ్ ఆలయ ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాలు శనివారం మూడోరోజు కొనసాగాయి. ఈసందర్భంగా జలావాసంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ధాన్యవాసంలోకి మర్చారు. సామూహిక హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు వేదపండితులు ఆంజనేయశర్మ అన్నప్రసాదం అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వైభవంగా పెద్దమ్మ కల్యాణోత్సవం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలోగల పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కొనసాగుతున్న ఆలయ వార్షికోత్సవాలు మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ గ్రామంలోగల లక్ష్మీనరసింహస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి, ఈవో ప్రభు రాంచంద్రం, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నీటి కష్టం తీరేదెప్పుడో?
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 200 కాలనీలలో 25 వేల గృహాలున్నాయి. సుమారు లక్షకుపైగా జనాభా నివసిస్తున్నారు. పట్టణ నీటి అవసరాలు తీర్చడం కోసం రోజూ 12 ఎంఎల్డీ (మెగాలీటర్స్ పర్ డే) అవసరం. కానీ క్షేత్రస్థాయిలో అందుతున్నది 6 ఎంఎల్డీ మాత్రమే. అంటే అవసరంలో సగం నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో నల్లాల ద్వారా రెండు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. అవి కూడా తక్కువ ప్రెషర్తో వస్తుండడంతో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శివారు కాలనీలకు నీరు అందడం లేదు. పైప్లైన్ల నిర్వహణ సరిగా లేక.. పట్టణంలో 300లకు పైగా మున్సిపల్ బోర్లు, 70కి పైగా కమ్యూనిటీ బోర్లు ఉన్నాయి. వీటితో పాటు పట్టణానికి శ్రీరాంసాగర్నుంచి గోదావరి జలాలు సరఫరా అవుతున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు, బుర్రమత్తడి ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. అయితే పైప్లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోంది. నత్తనడకన ‘అమృత్’.. కేంద్ర ప్రభుత్వం రూ. 90 కోట్లతో చేపట్టిన అమృత్ పథకం పనులు పట్టణంలో నత్తనడకన సాగుతున్నాయి. ఈ నిధులతో పట్టణంలో ఏడుచోట్ల భారీ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. అయితే ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పైప్లైన్ల అనుసంధానం పూర్తి కాకపోవడంతో మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందడం లేదు. ఎక్కడ చూసినా తవ్వి వదిలేసిన గుంతలే తప్ప కుళాయిల్లో నీటి గలగలలు వినిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. అల్లాడుతున్న కాలనీలు.. పట్టణంలో ప్రధానంగా గోసంగి కాలనీ, రాజీవ్నగర్, డ్రైవర్స్ కాలనీ, బతుకమ్మకుంట, అశోక్నగర్, శ్రీరామ్నగర్, విద్యానగర్, రుక్మిణికుంట, స్నేహపూరి కాలనీ, లింగాపూర్, టేక్రియాల్, పాత రాజంపేట్, ఇల్చీపూర్ తదితర కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు నిరీక్షిస్తుంటారు.ఎండలతోపాటే కామారెడ్డి బల్దియాలో తాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. పాలకులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తాగునీటి ఎద్దడికి సాక్ష్యంగా పలు కాలనీలలో ఏ ఇంటి ముందు చూసినా డ్రమ్ములు దర్శనమిస్తున్నాయి. – కామారెడ్డి టౌన్ కామారెడ్డిలో అసంపూర్తిగా ‘అమృత్’ పనులు సరిపడా సరఫరా కాని నీరు ప్రతి ఇంటిముందు డ్రమ్ములు.. ఏటా ఇదే పరిస్థితి పట్టించుకోని పాలకులు -
హమాలీల సంఖ్య పెంచండి
● గడువులోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు హమాలీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కేంద్రం నిర్వాహకులు చూడాలని సూచించారు. తూకాలు వేగంగా పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. మెప్మా సంఘానికి వచ్చే కమీషన్ మొత్తాన్ని సభ్యులందరికీ ప్రయోజనం చేకూరేలా వినియోగించాలని, తద్వారా సంఘం ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ధాన్యం కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలి కామారెడ్డి క్రైం: భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలో రూ. 5 కోట్లతో నిర్మాణంలో ఉన్న జిల్లా ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25 లోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ భవనం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, పీఆర్ డీఈఈ స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు. -
భవితనిచ్చిన బడికి బాసట!
● ప్రైవేట్కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్న పూర్వ విద్యార్థులు ● ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నెమ్లి హైస్కూల్నస్రుల్లాబాద్ : బతుకు బాటలు వేసిన బడికి అండగా నిలుస్తున్నారు పలువురు పూర్వ విద్యార్థులు. తాము చదివిన పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. దీంతో ఆ పాఠశాల పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. నెమ్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెమ్లితోపాటు హాజీపూర్, సంగం, అంకోల్, అంకోల్ క్యాంపు, అంకోల్ తండా, నాచుపల్లి, కామిశెట్టిపల్లి, బైరాపూర్, లింగంపల్లి, దుర్కి, మీర్జాపూర్, దేశాయిపేట్ గ్రామాల నుంచి విద్యార్థులు చదువుతున్నారు. గత విద్యాసంవత్సరంలో 381 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ పాఠశాల అభివృద్ధి కోసం నాలుగేళ్ల క్రితం పూర్వ విద్యార్థులు ఒక్కటయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటైన వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చారు. విరాళాలు సేకరించి పాఠశాల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన డెస్క్ బెంచీలను అందించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ఏడాదిగా ఇద్దరు స్కావెంజర్లకు జీతాలు అందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ వద్ద రూ. 7లక్షలు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకోసం ఈ నిధిని సమీకరించి ఉంచారు. ఎస్సెస్సీలో మంచి ఫలితాలు.. సౌకర్యాలు మెరుగవడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించగలుగుతున్నారు. ఉపాధ్యాయులు నాణ్య మైన విద్య అందిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏటా పదో తరగతిలో విద్యార్థుల సంఖ్యతోపాటు ఫలితాలూ మెరుగవుతూ వస్తున్నాయి. 2024లో పదో తరగతిలో 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. 2025లో 97 శాతం పాస్ అయ్యారు. ఈసారి 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్, అప్పేరల్ కోర్సుల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ పాఠశాలనుంచి ఏటా ఎన్ఎంఎం స్కాలర్షిప్నకు ముగ్గురు చొప్పున ఎంపికవుతున్నారు. రెండేళ్లుగా ట్రిపుల్ఐటీకి ఒక్కొక్కరు ఎంపికవుతూ వస్తున్నారు.విద్యాసంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత శాతం 2023–24 94 82 87.23 2024–25 94 92 97.87 2025–26 117 116 99.14 -
కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి
కామారెడ్డి టౌన్: రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారుల కార్పొరేషన్లకు నామమాత్రపు నిధులు కేటాయించడంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్. వెంకట్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ నిధులు విడుదల కాకపోవడంతో కార్పొరేషన్లు నిర్వీర్యమవుతున్నాయని, నిధులు లేని చోట చైర్మన్ల నియామకం వల్ల అదనపు భారమే తప్ప ఒరిగేదేమీ లేదని విమర్శించారు. నూతనంగా నియమితులైన చైర్మన్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టాలని, వృత్తుల ఆధునీకరణకు కృషి చేయాలని కోరారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడిగా నూతనంగా ఎన్నికై న కుంబాల రవి యాదవ్ శుక్రవారం హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఎన్నికకు సహకరించినందుకు గంప గోవర్ధన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, ప్రభాకర్ యాదవ్, పిట్ల వేణు, స్వప్న లక్ష్మీనారాయణ, మామిండ్ల లక్ష్మణ్, లోలపు శ్రీనివాస్, అజాజ్, మన్సూర్, గోపు బాలమణి తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ధర్మారావ్పేట్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న గీతం, రసజ్ఞ, రిత్విక్, అఖిల, నవ్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో యోసెఫ్, పీడీ శ్రీనివాస్లు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 17న హైదరాబాద్లో జరుగనున్నట్లు వారు పేర్కొన్నారు. సర్పంచ్ ఉమర్, ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు ప్రమీలమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. దోమకొండ: రాష్ట్రంలోని ఆరు లక్షల మంది బీడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు నెలసరి ఉద్యోగులకు బీడీ ప్యాకింగ్ వర్కర్స్కు వేతనాల పెంపుదల గురించి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలిపారు. చర్చలలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోవర్ధన్, రాష్ట్ర నేతలు అనుమల్ల గంగాధర్, అయ్యవార్ల లక్ష్మణ్, ఆది రంగారెడ్డి, తదితరుల తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలు సఫలం కావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బీసీ వసతి గృహం సమీపంలో ధాన్యం లోడ్తో వెళ్తున్న డీసీఎం శుక్రవారం సాయంత్రం బోల్తా పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. డీసీఎంలో ఓవర్ లోడ్ చేసుకొని సురాయిపల్లి నుంచి లింగంపేటకు వస్తుండగా మండల కేంద్రంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణలు అర్థరహితం
కామారెడ్డి టౌన్: మున్సిపల్ కో–ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికేనని మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఆమె మాట్లాడారు. స్థానిక పరిస్థితులను బట్టి, పట్టణ అభివృద్ధిని కాంక్షించి మున్సిపాలిటీల్లో పరస్పర సహకారం ఉంటుందని, అందుకనే చైర్పర్సన్, కో–ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామన్నారు. దీనిని రాజకీయ కోణంలో చూడటం తగదన్నారు. భైంసా, అమంగల్, ఖానాపూర్ వంటి మున్సిపాలిటీల్లో బీజేపీ స్వయంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పొందిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అక్కడ లేని అపవిత్ర పొత్తు కామారెడ్డిలో ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కౌన్సిలర్లు హాఫీజ్బేగ్, ప్రభాకర్ యాదవ్, మామిండ్ల లక్ష్మణ్, ఎజాజ్, లోలపు శ్రీనివాస్, కో–ఆప్షన్ సభ్యుడు కుంబాల రవియాదవ్, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్రావు, తదితరులు పాల్గొన్నారు. -
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లింగాపూర్లో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దూడల సంరక్షణ, పశుగ్రాసాల సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కాఫ్ ర్యాలీ నిర్వహించి రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి భరత్, మండల పశువైద్యాధికారి రవికిరణ్, కౌన్సిలర్ కాసర్ల రాణి, విజయ డెయిరీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికం..
సామూహిక కుంకుమార్చనలు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి కోడూరు హన్మాన్ ఆలయ ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు చేశారు. కుంకుమార్చనల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నప్రసాదం అందజేశారు. ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన బీబీపేట: మల్కాపూర్లో రెండు రోజులుగా జరుగుతున్న ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయం ముందు దాత మాసానిపల్లి పెరమాండ్లు అందించన ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. ఉదయం నుంచి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ప్రాణ ప్రతిష్ట జరిపించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. బోనమెత్తిన గంగపుత్రులు నిజాంసాగర్ (జుక్కల్): శివసత్తుల పూనకాలు..... డప్పు సప్పులతో గంగమ్మ తల్లికి గంగపుత్రులు ఘనంగా బోనాలు సమర్పించారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బోనాలతో ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట గ్రామశివారులోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శుక్ర, శనిరాల్లో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆదివారం గ్రామదేవతలకు బోనాలు, సోమవారం పెద్దమ్మతల్లికి బోనాలను సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. -
వేర్వేరు చోట్ల చోరీలు
మద్యం దుకాణంలో రూ.లక్ష కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్లో ఉన్న ఓ లిక్కర్ మార్ట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిర్వాహకులు గురువారం రాత్రి దుకాణం మూసేసి ఇళ్లకు వెళ్లగా, అర్ధరాత్రి తర్వాత అద్దాలు, కిటికీలు పగులగొట్టి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు చోరీ చేశారు. కౌంటర్లో దాచి ఉంచిన నగదు ఎత్తుకెళ్లినుట్ల సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రూ.లక్ష చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. పట్ణణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసిన ఇంట్లో.. దోమకొండ: దోమకొండ గ్రామానికి చెందిన సామల నరేశ్ ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వృత్తి రీత్యా నరేశ్ రెండు నెలలుగా కామారెడ్డిలో ఉంటున్నారు. శుక్రవారం పని నిమిత్తం దోమకొండకు రాగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని రూ. 7,000 అపహరణకు గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో చోరీకి విఫలయత్నం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో జ్యువెల్లరి దుకాణంలో దొంగలు చోరీకి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలోని అవుసుల మాణిక్యం జ్యువెల్లరి దుకాణానికి సంబంధించిన మూడు తాళాలను దుండగులు గురువారం అర్ధరాత్రి పగులగొట్టారు. నాలుగో తాళం పగలగొట్టే సమయంలో జనం అలికిడికి దొంగలు పరారై ఉంటారని బాధితుడు మాణిక్యం తెలిపారు. తలుపులు తెరవకపోవడంతో ఎలాంటి చోరీ జరగలేదని పేర్కొన్నారు. సుభాష్నగర్ అపార్ట్మెంట్లో.. నిజామాబాద్అర్బన్: నగరంలోని సుభాష్నగర్ అపార్ట్మెంట్లో చోరీ జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ వేణుగోపాలరావు సుభా ష్నగర్లోని అక్షయ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ఆయన ఊరికి వెళ్లగా గురువారం రాత్రి దొంగలు చొరబడి కిలో వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్లోని సుభాష్నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
ఇక టీజీఎస్ఈబీ?
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): పదో తరగతి తరువాత చాలా మంది బాలికలతోపాటు బాలురు ఇంటర్ విద్యకు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు బీడీలు చుట్టడం, టైలరింగ్ వంటి పనుల వైపు, వ్యవసాయ నేపథ్యం ఉన్న బాలురు అటువైపు వెళ్తుండగా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు ఇదో ఒక పనికి వెళ్తూ పైచదువులకు దూరవుతున్నారు. అలాగే ఇంటర్ కళాశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్య తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు పాఠశాల విద్య(8 నుంచి 10వ తరగతి), ఇంటర్మీడియెట్ను విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఉండవనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ రెండు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ప్రకారం 10+2 విద్యను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చేవి. ఇంటర్మీడియట్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కోర్సులు ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో ఉండేవి. పరీక్షల విధానంలో మార్పులు 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విలీనమైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు ఉండే అవకాశాలు లేవు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్కూల్ బోర్డు పరిధిలో విద్యార్థులు అభ్యసించనున్నారు. అలాగే 8 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు నూతన బోర్డు పరిధిలో వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు పాఠశాల విద్యాశాఖలో ఇంటర్బోర్డు విలీనానికి రంగం సిద్ధం రెండు శాఖల నుంచి ప్రతిపాదనలు 8 నుంచి 12వ తరగతి వరకు ఒక బోర్డు.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మరొక బోర్డు రానున్న విద్యా సంవత్సరం నుంచే అమలులోకి! -
క్రైం కార్నర్
భర్తను చంపిన భార్య ● హత్యకు సహకరించిన కొడుకు నందిపేట్(ఆర్మూర్): కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో హత్య చేసిన ఘటన నందిపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ జానారెడ్డి, నందిపేట ఎస్సై శ్యామ్రాజ్ శుక్రవారం తెలిపారు. నందిపేట మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం(44) ఈ నెల 6న మృతి చెందాడు. మద్యం మత్తులో మంచంపై నుంచి కిందపడి చనిపోయాడని మృతుడి భార్య లలిత చెప్పడంతో కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తామే హత్య చేసినట్లు ఒప్పకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు ముత్యంకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఇంట్లో తరుచూ గొడవలు జగుతుండేవని మృతుడి భార్య లలిత తెలిపింది. ఎంత చెప్పినా అతనిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 5న రాత్రి మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముత్యం మెడకు చీర అంచుతో బిగించగా కొడుకు కాళ్లు కదలకుండా పట్టుకొని సహకరించాడని, దీంతో తన భర్త మృతి చెందాడని పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది. శుక్రవారం నిందితులు లలిత, ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచినట్లు సీఐ జానారెడ్డి వెల్లడించారు. -
‘ఉపాధి’లో ఫీల్డ్ అసిస్టెంట్ల ఇష్టారాజ్యం
● కొందరికి పనులు చేయకున్నా హాజరు వేస్తున్నారన్న ఆరోపణలు ● చర్యలు తీసుకోవాలని కోరుతున్న కూలీలుపెద్దకొడప్గల్: గ్రామాలనుంచి వలసలను తగ్గించి స్థానికంగానే పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపట్టిన ఉపాధి హామీ పథకం కొందరి వల్ల నీరుగారిపోతోంది. పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు చేయకున్నా కొందరికి హాజరు వేస్తున్నారని పలువురు కూలీలు పేర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాలలో కొందరు కూలీలు కేవలం హాజరు సమయానికి వచ్చి ఫొటోలు దిగి వెళ్తున్నారని తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమవారు పనులు చేయకున్నా పట్టించుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఇస్టారాజ్యం కొనసాగుతోందని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పనులు చేసేవారికే కూలి డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు.కొంతమంది కూలీలు ఎలాంటి పనులు చేయకుండానే ఫొటోలు దిగి వెళ్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. పనులు చేయని వారికి హాజరు వేయవద్దని ఫీల్డ్ అసిస్టెంట్లకు చెప్పాం. పనిచేసేవారికే వేతనాలు అందేలా చూస్తాం. – సుదర్శన్, ఏపీవో, పెద్దకొడప్గల్ -
ప్రతిభకు పదును.. భవితకు దన్ను
మోపాల్(నిజామాబాద్రూరల్): చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఉద్ధేశంతోపా టు వారు ఆయా అంశాల్లో నైపుణ్యం సాధించేలా మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల సొసైటీ వేసవిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. సొసైటీ కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలు కలిగిన పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ని మోపాల్ మండలం కంజర శివారులో ఉన్న మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్లోని 11, ఉమ్మడి ఆదిలాబాద్లోని 13 పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులకు 15 రోజులపాటు వేసవికాల శిబిరాన్ని ఏర్పాటుచేసింది. శిక్షణా శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో ని ర్వహించగా, నిజామాబాద్ ఆర్సీవో సత్యనాథ్రె డ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేసవి సెల వుల్లో గ్రామాల్లో, ఇళ్లల్లో విద్యార్థులు చేయాల్సిన, చేయకూడని పనులను క్షుణ్ణంగా వివరించడంతోపాటు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీ, వైస్ ప్రిన్సిపాల్ సుదం, సిబ్బంది కత్తుల శంకర్, రాజేందర్, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణనిచ్చిన అంశాలు విద్యార్థులకు 15 రోజులపాటు వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, కంప్యూటర్, కరాటే, డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్, పేపర్ కటింగ్స్తోపాటు టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. ఇందుకోసం సుమారు 25 మంది వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించారు. ముగింపు సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. వేదిక్ మ్యాథ్స్ ద్వారా చాలా విషయాలు తె లిశాయి. గణితమంటే భయపడకుండా సులభపద్ధతిలో వేదిక్ మ్యా థ్స్లో మెలకువలు నేర్చుకున్నాను. దీంతోపాటు డ్యాన్స్, సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాం. వివిధ జిల్లాల విద్యార్థులందరం ఒక దగ్గర శిక్షణ పొంది స్నేహితులుగా మా రడమే కాకుండా ఎన్నో అంశాలు నేర్చుకున్నాం. – సాయి భానుతేజ, ఏడోతరగతి, తాండూరు, ఆదిలాబాద్ వేసవి శిక్షణాశిబిరంలో అనేక విషయాలు నేర్చుకున్నాను. స్పోకెన్ ఇంగ్లి ష్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్ వంటి వాటిపై చాలా అవగాహన వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని అంశాలపై శిక్షణనిచ్చారు. క్రీడల్లోనూ పాల్గొనడంతో శారీరకంగా ఉల్లాసంగా అనిపించింది. – దత్తాద్రి, ఏడోతరగతి, బీర్కూర్, కామారెడ్డి విద్యార్థులకు చదువుతోపా టు క్రీడలు, ఇతర అన్నిరంగా ల్లో రాణించాలి. సెల్ఫోన్లు, టీవీలకు ఆకర్షితులై చదువు ను మర్చిపోతున్నారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో యేటా వేసవిలో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. శిబిరం విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీలు, పీడీలకు ప్రత్యేక కృతజ్ఞతలు. – సత్యనాథ్రెడ్డి, ఆర్సీవో, ఉమ్మడి నిజామాబాద్ విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ మోపాల్ బీసీ బాలుర గురుకులంలో ముగిసిన వేసవి శిబిరం పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు -
వారంనుంచి నీళ్లొస్తలేవు
మా కాలనీకి వారం రోజులుగా నీళ్లు రావడం లేదు. మున్సిపల్ బోరు కూడా అరగంట కంటే ఎక్కువ రాదు. పైప్లైన్ సరిగ్గా లేకపోవడంతో కుళాయిల ద్వారా నీరు అందడం లేదు. ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ నీళ్ల కోసమే మా సమయమంతా సరిపోతోంది. – సాయవ్వ, గోసంగి కాలనీ, కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే మున్సిపల్ బోర్ల మరమ్మతులకు నిధులు కేటాయించాం. నీటి సమస్య ఎక్కువగా ఉన్న కాలనీలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. అమృత్ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించాం. – టి.పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
● ఇద్దరికి తీవ్రగాయాలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జప్తిజాన్కంపల్లి గేట్ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మహ్మద్నగర్కు చెందిన మల్లేశం, మరో మహిళ మండలంలోని జప్తిజాన్కంపల్లిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డి నుంచి జేబీఎస్కు వెళ్తుండగా జప్తిజాన్కంపల్లి గేట్ వద్ద మల్లేశం నడుపుతున్న బైక్ ఢీకొన్నాయి. మల్లేశంతోపాటు బైక్పై ఉన్న మరో మహిళకు తీవ్రగాయాలు కాగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
యుద్ధ కళల్లో చిన్నారులకు శిక్షణ
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ పొందుతున్నారు. మండలంలోని సంగోజీపేట్కు చెందిన మాగి నవీన్ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కళల గురుకులం(అకాడమీ ది రైట్ వే కరాటే క్యాంపస్ ) అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులను బేతాళస్వామి వద్ద ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారులకు కరాటేపై శిక్షణ ఇస్తున్నారు. -
గుంతలోకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరికి తీవ్ర గాయాలు రామారెడ్డి: మండల కేంద్రంలో పైప్లైన్ నిర్మాణం కోసం తీసిన 12 అడుగుల భారీ గుంతలోకి కారు దూసుకెళ్లి నిట్ట నిలువునా ఇరుక్కుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కామారెడ్డి నుంచి రంగంపేట వైపు వస్తున్న కారు శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా రోడ్డు పక్కన పైప్లైన్ కోసం తీసిన గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న భార్యాభర్తలు రమేశ్ గౌడ్ వనిత ఇరుక్కుపోగా రంగంపేట గ్రామస్తులు బయటికి తీశారు. తీవ్ర గాయాలైన దంపతులను 108 అంబులెన్స్లో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ధర్మారెడ్డిలో సమ్మర్క్యాంప్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ధర్మారెడ్డి గ్రామంలో శుక్రవారం వైద్యసిబ్బంది స్నేహ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్హెచ్పీ లావణ్య గ్రామంలోని కిశోర బాలికలకు, మహిళలకు రక్తహీనత గురించి వివరించడంతోపాటు దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలియజేశారు. తలసేమియా వ్యాధి గురించి..బాల్యవివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఆమె తెలియజేశారు. అనంతరం కిషోర బాలికలకు, మహిళలకు రక్త, బీపీ, షుగర్ పరీక్షలకు చేశా రు. ఏఎన్ఎం సంధ్యారాణి, ఆశావర్కర్లు అంజమ్మ, సావిత్రి, నాయకులు నారాయణ పాల్గొన్నారు. వర్ని: మోస్రా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల శిశువు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి మల్లారం గ్రామానికి చెందిన జర్పుల దశరథ్ భార్య నిరోషా, మూడు నెలల శిశువుతో నిజామాబాద్ నుంచి స్వగ్రామమైన మల్లారానికి కారులో వస్తోంది. మోస్రా శివారులో అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కారు ప్రమాదానికి గురై పొలాల్లో బోల్తా కొట్టింది. ప్రమాదంలో మూడు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందగా, నిరోషకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిరుత దాడిలో దూడ..లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్ద కట్టేసిన పాడి దూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన చౌడ లింగం అనే రైతు తన పొలం వద్ద పాడి గేదెలు, ఆవులను గురువారం రాత్రి కట్టేసి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వెళ్లేసరికి చిరుత దాడిలో పాడి దూడ మృతి చెందినట్లు తెలిపారు. ఎర్రాపహాడ్ సెక్షన్ అధికారి వినోద్, బీట్ అధికారి లింగయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. లింగంపేట పశువైద్యాధికారి హన్నా జోనస్ పోస్టుమార్టం నిర్వహించారు. దూడ విలువ రూ. 50 వేలు ఉంటుందన్నారు. -
ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి
నిజామాబాద్ అర్బన్: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్లో జాబ్మేళా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జాబ్మేళాను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నిజామాబాద్లో మెగా జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగాలు సాధించిన యువత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, జాబ్మేళాకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతకు ముందు ఉద్యోగాలకు ఎంపికై న వారికి కలెక్టర్, ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీవైఎస్వో పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేశ్ కుమార్, ఎన్ఐసీ అధికారి మధు, ఈ–డీఎం కార్తిక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. యువతికి జాబ్ ఆఫర్ లెటర్ అందజేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి జాబ్మేళాను ప్రారంభిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి,తాహెర్ తదితరులు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు మెగా జాబ్మేళాకు విశేష స్పందన -
ఆధ్యాత్మికం..
ప్రారంభమైన కోడూరు హన్మాన్ ప్రాణప్రతిష్ఠాపనోత్సవాలు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి దళితవాడ కిష్టమ్మగుడి సమీపంలోని ప్రాచీన కోడూరు హన్మాన్ ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రాణప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితులు గంగవరం నారాయణశర్మ, అంజనేయశర్మల ఆధ్వర్యంలో గురువారం విగ్రహాల జలవాసం, హోమం, అన్నదానం నిర్వహించారు. ఐదురోజులు హోమ కార్యక్రమాలుంటాయని అంజనేయశర్మ పే ర్కొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు నర్సింలు, రమేష్, నరేష్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్రావు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా బోనాల ఊరేగింపు రామారెడ్డి: గంగపుత్రుల కులదైవం గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా గంగపుత్ర మహిళలు గురువారం పోచమ్మలకు బోనాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. శుక్రవారం గంగమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనతో పాటు అన్నదానం, సాయంత్రం గంగమ్మ తల్లికి బోనాల ఊరేగింపు ఉంటుందని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు నామాల లింబాద్రి తెలిపారు. యాడారంలో పెద్దమ్మకు బోనాలు.. బీబీపేట: యాడారంలో ముదిరాజ్ సదర్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న వనదుర్గ పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున్న బోనాలు ఊరేగించారు. బైండ్లోళ్ల ఆట పాటలతో, డప్పు చప్పుళ్లతో ఘనంగా బోనాలను తీశారు. మల్కాపూర్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు బీబీపేట: మల్కాపూర్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు రెండు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ప్రతి వీధి గుండా ఆలయం ముందు ప్రతిష్ఠించే ధ్వజ స్తంభాన్ని డప్పు చప్పుళ్ల మధ్య తీసుకువచ్చారు. ప్రతి ఇంటి నుంచి కలశాలతో మహిళలు ర్యాలీగా ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా అమ్మవారి ప్రతిష్ఠాపన మహోత్సవం బాన్సువాడ రూరల్: హన్మాజీపేట్ జీపీ పరధిలోని సంగ్రాం తండాలో నూతనంగా నిర్మించిన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆలయంలో జంగదాంబ దేవి, శ్రీసంత్ సేవాలాల్, రామ్రావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన చేపడుతున్నారు. గురువారం వేదపండితులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పౌరాదేవి పీఠాధిపతి శ్రీ బాబుసింగ్ మహరాజ్, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆల్ ఇండియా బంజారా శక్తీపీఠం పౌరాదేవి జాతీయ ప్రధానకార్యదర్శి బద్యానాయక్ల సంయుక్త ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభచాటిన, సేవలందించిన వారిని సత్కరించనున్నట్లు హైదరాబాద్కు చెందిన ‘ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమీ’ అధ్యక్షుడు ఈఎస్ఎస్ నారాయణ మాస్టారు ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయిత లు, సంగీత, నృత్య, కళాకారుల, ఉపాధ్యాయు ల, విద్యావంతులు, వైద్యుల, సమాజ సేవకులు తదితర రంగాల్లోని ప్రతిభావంతులు ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9652347207 నెంబర్లో సంప్రదించాలని కోరారు. నియామకపత్రాల అందజేతనిజామాబాద్ రూరల్: రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్గా బాడ్సి శేఖర్గౌడ్, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా వేణుగోపాల్ యాదవ్ నియామకపత్రాలు అందుకున్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరికీ గురువారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్గౌడ్, వేణుగోపాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్కుమార్ గౌడ్ను సన్మానించారు. -
30 ఫీట్ల స్థలం వదిలి ఇళ్లు నిర్మించుకోవాలి
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి–రాజంపేట–గుండారం ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మాణాలు చేసే వారు తప్పనిసరిగా రోడ్డు మధ్య నుంచి 30 ఫీట్ల స్థలం వదిలిపెట్టాలని చిన్నమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ బి.లక్ష్మి సూచించారు. గురువారం ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశం నిర్వహించగా ఏఈ, దేవునిపల్లి ఎస్సైలు హాజరయ్యారు. సమావేశంలో ఆర్ అండ్ బీ రోడ్డు నిబంధనలను గ్రామస్తులకు వివరించారు. 500పైగా మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులను సన్మానించారు. సమావేశంలో మాజీ సర్పంచులు ఆనందరావు, రామాగౌడ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు శ్రీకాంత్, రాజేశ్వరి, ప్రకాష్, సౌజన్యలు బదిలీపై ఇతర పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం ఎస్సై అనిల్, సిబ్బంది వారిని శాలువా కప్పి సన్మానించారు. -
మోడల్ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
బాన్సువాడ రూరల్: కొత్తాబాదిలో ఉన్న తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కమల్ కిశోర్ తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీతో పాటు కొత్తగా ఏసీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయాలని నూ తనంగా ఎన్నికై న లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొళ్ల సాయిరాంయాదవ్కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సూచించారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షునిగా సాయిరాంను నియమిస్తూ నియామాక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తనను నియమించినందుకు ఎమ్మెల్యేకు సాయిరాం యాద వ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. బాన్సువాడ రూరల్: ఈ నెల 9న సాయంత్రం నుంచి 10న రాత్రి 9 గంటల వరకు పిట్లం మండల కేంద్రంలోని మజీద్–ఏ–వహీద్లో నిర్వహించే ఇస్లామిక్ వర్క్షాప్ను విజయవంతం చేయాలని జామా మజీద్ ఇమామ్ మౌలానా మహమూద్ అలీ, ఆయేషా మస్జీద్ మౌలానా సయ్యద ఈసా తెలిపారు. ఖత్మే నబూవత్ ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్షాప్నకు హైదరాబాద్, నిజామాబాద్ నుంచి ప్రముఖ ఉలేమాలు హాజరై ప్రసంగిస్తారన్నారు. యువకు లు హాజరై వివిధ అంశాలపై అవగాహన పొందాలన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఏవో రాజలింగంతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. విండో డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ సంజీవు, రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు.. ఎమ్మెల్సీ ప్రోసర్ కోదండరామ్కు విజ్ఞప్తి చేశారు. గురువారం కామారెడ్డి రోటరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి కార్యక్రమానికి కోదండరామ్ హాజరుకాగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆయనను కలిసి వినతి పత్రం అందజేసి సన్మానించారు. బీసీ సంఘం నాయకులు సాప శివరాములు, నాగరాజు తదితరులున్నారు. -
స్వీయ గణనపై అవగాహన
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిదిలోని పిష్కిల్ గుట్ట గ్రామ పంచాయితీని గురువారం సందర్శించి తండావాసులకు స్వీయ గణనపై అవగాహన కల్పించినట్లు తహసీల్దార్ రేణుక చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. అవగాహన కల్పించిన అనంతరం తండాలో వందశాతం స్వీయ గణన నమోదు చేసినట్లు తెలిపారు. సర్పంచ్ రేణాబాయి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు. స్వీయ గణన చేసుకున్న ప్రజాప్రతినిధులు ఎల్లారెడ్డిరూరల్/కామారెడ్డిటౌన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపడుతున్న జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా కామారెడ్డి 46, 47 వార్డుల కౌన్సిలర్ దంపతులు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణలు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్లు గురువారం స్వీయ గణన పూర్తి చేసుకున్నారు. ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని వారు కోరారు. -
తలసేమియా బాధితులకు అండగా కామారెడ్డి రక్తదాతలు
● నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం ● 35 శిబిరాల ద్వారా 6 వేల యూనిట్ల రక్తం సేకరణ కామారెడ్డి అర్బన్: తలసేమియా వ్యాధి... చిన్నారుల్లో అరుదుగా వచ్చే ఈ వ్యాధికి ప్రతి 20 రోజులకు ఒక సారి రక్తం అందించడమే వైద్యం. రక్తం అందించకుంటే వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడే 250 మంది చిన్నారులకు అండగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్), ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలు అండగా నిలిచి గత మూడేళ్లలో మెగా రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటికి 6 వేల యూనిట్ల రక్తం సేకరించడం సాధారణ విషయం కాదు. రక్తదాతల సహకారంలో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం తాము 6 వేల యూనిట్ల రక్తం సేకరించడం ఎంతో తృప్తిని ఇస్తుందని కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు అన్నారు. తమ సేవలు గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదు చేసి అవార్డు ప్రదానం చేశారని, దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు సేవా పురస్కారాలు అందించినట్టు బాలు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దేశంలో 500 మంది చిన్నారులు తలసేమియా వ్యాధి బారిన పడుతున్నారు. తల్లిదండ్రుల హిమోగ్లోబిన్ స్థాయి, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్, జన్యు పరీక్షలను పెళ్లికి ముందే చేయడం ద్వారా తలసేమియా వ్యాధి పిల్లలు జన్మించకుండా చూసే అవకాశం ఉంటుంది. తలసేమియా వ్యాధితో జన్మించిన పిల్లలకు 20 రోజులకు ఒక సారి రక్తమార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. బోన్మారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తి చికిత్సకు రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వ్యయం అవుతుంది. పేదరికంలో ఉండే తల్లిదండ్రులకు ఇది పెద్ద భారం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి చిన్నారుల ప్రాణాలు కాపాడాలి. – బాలు, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ -
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
● ఉరేసుకొని యువతి ఆత్మహత్య మాక్లూర్: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్లెడికి చెందిన కునాల హన్మాండ్లుకు ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె శివాని(31) టీటీసీ పూర్తి చేసింది. గతంలో శివానీకి పెళ్లి సంబంధం కుదిరి ఏర్పాట్లు జరుగుతుండగానే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అప్పటి నుంచి శివానికి పెళ్లి సంబంధాలు రావటం లేదు. వచ్చినా విషయం తెలిసి పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో శివాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భోజన అనంతరం గదిలోకి వెళ్లిన శివాని గురువారం ఉదయం 10 గంటలు దాటినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపుతట్టాడు. ఉలుకుపలుకు లేకపోవటంతో గోడ దూకి చూడగా శివాని ఉరేసుకొని మృతి చెందింది. తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
42 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రుద్రూర్: మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సి విల్ సప్లయ్ అధికారులు గురువారం స్వాధీనం చే సుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో అధికారులు శర్ఫుద్దీన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.42 క్వింటాళ్ల రేషన్బి య్యాన్ని స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి):మండలంలోని సజ్జన్పల్లి చౌ రస్తా వద్ద గురువారం ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడినట్లు రైతులు తెలిపారు. శెట్పల్లిసంగారెడ్డి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధా న్యం బస్తాలు లోడ్ చేసుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యంలో సజ్జన్పల్లి చౌరస్తా వద్ద లారీ బో ల్తాపడింది. ఘటనలో డ్రైవర్తోపాటు ఎవరికి గా యాలు కాలేదని తెలిపారు. ధాన్యం బస్తాలను మ రో లారీలో లోడ్ చేసి పంపినట్లు రైతులు తెలిపారు. ● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దోమకొండ: ఆస్తి వివాదాల నేపథ్యంలో అత్తను ఇద్దరు కోడళ్లు హత్య చేసేందుకు యత్నించిన ఘటన దోమకొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కట్ట లక్ష్మిపై ఆమె కోడళ్లు కట్ట లహరిక, కట్ట పవిత్ర బుధవారం రాత్రి దాడి చేశారు. చీర పల్లుతో మెడబిగించి హత్యకు యత్నించగా, లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. బాధితురాలు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై వివరించారు. -
ఆలూర్లో లారీ బీభత్సం
● విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొన్న లారీ ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్ర సమీపంలో లారీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొని బీభత్సం సృష్టించింది. నల్లమట్టిని తీసుకువచ్చేందుకు ఆలూర్ నుంచి వెల్మల్ మీదుగా నందిపేట్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అడ్డం వచ్చిన చెట్లు, ఆరు విద్యుత్ స్తంభాలు, రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటన సమయంలో పొలాల్లో రైతులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కాగా, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సమీపంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏడీఈ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేస్తామని తెలిపారు. -
స్నేహితుడి వివాహానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిఎల్లారెడ్డిరూరల్: స్నేహితుడి వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన దండు నాగరాజు (25) హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నస్రుల్లాబాద్లో స్నేహితుడి వివాహం ఉండడంతో గురువారం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరాడు. తిమ్మారెడ్డి గ్రామశివారులో ఎల్లారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న చెట్టును కారు బలంగా ఢీకొనడంతో ఘటన స్థలంలోనే నాగరాజు మృతి చెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితం వివాహమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్తో ఒకరి మృతి వర్ని: మండలంలోని చలకతండాలో గురువారం విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కేతావత్ కిశోర్ (29) సౌండ్ బాక్స్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడన్నారు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డివైడర్ను ఢీకొన్న బైక్ ● ముగ్గురికి గాయాలుమద్నూర్(జుక్కల్): బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని 161 జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికుల, అంబులెన్స్ టెక్నిషియన్ సంజయ్ కథనం ప్రకారం.. డోంగ్లీకి చెందిన తుకారాం, అతడి అక్క పూజ, ఇద్దరు పిల్లలు ఆరాధ్య, సువాన్షు గురువారం మధ్యాహ్నం మద్నూర్ నుంచి మేనూర్ వైపు బైక్పై వెళ్తుండగా డివైడర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో తుకారాం, పూజలకు స్వల్పగాయాలు కాగా ఆరాధ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆరాధ్యను దేగ్లూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. గురువారం ఆరుగురిని ఆర్మూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
కో ఆప్షన్ సభ్యులకు సన్మానం
కామారెడ్డి టౌన్ : కాంగ్రెస్ తరఫున మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై న సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు గోనె సునీత, అలీ బిన్ అబ్దుల్లా, ఆస్మా అదిబా ఖనాంను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కౌన్సిల్ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పట్టణ అభివృద్ధికి కో ఆప్షన్ సభ్యులు కృషి చేయాలని సూచించారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్కు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12వ జిల్లా స్థాయి సబ్జూనియర్ అండర్–8, 10, 12, 14 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. దాదాపు 110 మంది క్రీడాకారులు హాజరు కాగా ఉత్తమ ప్రతిభ చూపిన 25 మంది క్రీడాకారులను ఎంపిక చేయడంతోపాటు వారికి బంగారు, వెండి, కాంస్య పతకాలు, ప్రశంసాపత్రాలను అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, కేపీ అనిల్కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ అందజేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 17న హైదరాబాద్ కొల్లూర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. అసోసియేషన్ ప్రతినిధులు, పీఈటీలు శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, నరేశ్రెడ్డి, రేణుక, శివాగౌడ్, లక్ష్మణ్, ప్రసాద్, మహేశ్, నరేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి మొండిచేయి
● కాసుల తరువాత మరొకరికి దక్కని నామినేటెడ్ పదవి ● నిరాశ, నిస్పృహల్లో కాంగ్రెస్ నేతలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లాకు కాంగ్రెస్ నేతలకు మళ్లీ నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల ముచ్చట వచ్చినప్పుడల్లా తప్పకుండా తమను పదవులు వరిస్తాయన్న నమ్మకంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. అయితే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చివరికి నారాజ్ అవుతుండడం మామూలు విషయంగా మారింది. ఈ క్రమంలో బుధవారం విడుదలైన నామినేటెడ్ జాబితాలో ఒక్కరి పేరు కూడా లేకపోవడంతో జిల్లాకు చెందిన నాయకులు నిరాశకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలకు మొదటి విడతలోనే కీలకమైన పదవులు దక్కాయి. తాజాగా మరో ఇద్దరికీ అవకాశం దక్కింది. కామారెడ్డి జిల్లాలో ఒక్క కాసుల బాల్రాజును మాత్రమే నామినేటెడ్ వరించింది. ఆయనతోపాటు ఎంతో మంది నామినెటెడ్ పదవులపై ఆశలుపెట్టుకుని పనిచేస్తూ వచ్చారు. ఆయనను మినహాయించి మరెవరికీ అవకాశాలు దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తనకు మొదటి విడతలోనే నామినేటెడ్ పదవి దక్కుతుందని జిల్లా కేంద్రానికి చెందిన డీసీసీ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కై లాస్ శ్రీనివాస్ ఆశించారు. ఏరోజైనా తనకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఉన్న ఆయనకు ఈ సారి కూడా అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు టి దేవరాజ్గౌడ్ సైతం నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి వెంట ఉండి పార్టీ ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతోపాటు జిల్లాకు చెందిన ముఖ్యనేతలందరితోనూ సన్నిహిత సంబంధాలున్న దేవరాజ్గౌడ్ తనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కుతుందని ఎదురుచూడగా నిరాశే ఎదురైంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేసిన పండ్ల రాజు ఫిషర్మెన్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాలకు చెందిన మరికొందరు నాయకులు కూడా ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన ఏ ఒక్కరినీ పదవులు వరించడం లేదు.నామినేటెడ్ పదవుల పందేరంలో జిల్లాకు మొదటి నుంచీ అన్యాయమే జరుగుతోందని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. బాన్సువాడకు చెందిన సీనియర్ నాయకుడు కాసుల బాల్రాజుకు మాత్రమే నామినేటెడ్ దక్కింది. నాలుగు నియోజక వర్గాల నుంచి ఎంతో మంది ఆశలు పెట్టుకుని అన్ని ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరుకు చెందిన బద్దం ఇంద్రకరణ్రెడ్డి నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నించగా, ఆఖరుకు పీసీసీ పదవితో సరిపెట్టుకున్నారు. అదే మండలానికి చెందిన చంద్రకాంత్రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. కామారెడ్డి నియోజకవర్గంలో మండల, జిల్లా స్థాయి నేతలు పలువురు ఏదైనా అవకాశం దక్కుతుందేమోనని ఇప్పటికీ ఆశతో ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి సన్నిహితుడైన గీరెడ్డి మహేందర్రెడ్డి నామినేటెడ్ పదవిపై పెట్టుకున్న ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. ఇలా ఎంతో మంది నేతలు అవకాశాలు దక్కకపోవడంతో నిరాశచెందుతున్నారు. -
విద్యుత్ సరఫరాలో లోపాలపై ఫిర్యాదు చేయాలి
బాన్సువాడ : విద్యుత్ సరఫరాల ఎలాంటి లోపాలున్నా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్–2) చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. బాన్సువాడలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కర వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఫోరమ్కు ఫిర్యాదు చేయాలన్నారు. అసరమైతే ఫోరమ్ సభ్యులే వినియోగదారుల ఇంటికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, మీటర్ స్టిక్ కావడం వంటి సాంకేతిక సమస్యలను 48 గంటల్లో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1912, ఫోన్ నంబర్ 83380–22841ను సంప్రదించాలని అన్నారు. సీజీఆర్ఎఫ్–2 సభ్యులు రామకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి ఆగం చేసిన వాన
లింగంపేట/గాంధారి(ఎల్లారెడ్డి)/మద్నూర్(జుక్కల్): అన్నదాతను మరోసారి అకాల వర్షం ఆగం చేసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని గురువారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు తీశారు. లింగంపేట మండలం ముంబోజిపేట, ముంబోజిపేట తండా, కంచుమల్, భవానీపేట, జల్దిపల్లి, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల తదితర గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల వరద నీటిలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా గ్రామాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. తడిసిన దాన్యం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలంటున్నారు. మద్నూర్ మండల కేంద్రంలో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. అలాగే మార్కెట్కమిటీ యార్డులో రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న సంచులు తడిసిపోయాయి. గాంధారి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ధాన్యం కుప్పలు, మొక్కజొన్న, జొన్న తడిసిపోయాయి. డీఆర్డీవో సురేందర్ మేడిపల్లి గ్రామాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం వద్ద రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఏపీఎం ప్రసన్నకుమార్ తదితరులున్నారు. జిల్లాలోని పలు చోట్ల కురిసిన అకాల వర్షం తడిసిన మొక్కజొన్న, కొట్టుకుపోయిన ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలుపడ్డ రైతులు -
‘నిధులు మంజూరు చేయండి’
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు, ధ్వంసమైన హై లెవల్ వంతెల మరమ్మతుల కోసం అవసరమైన నిధు లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను కోరారు. నియోజవకర్గంలోని పలుగ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులకు రూ.19.60 కోట్ల నిధులు అవసరమవుతాయని వివరిస్తూ మంత్రికి గురువారం వినతిపత్రం అందజేశారు. అలాగే లింగంపల్లిఖుర్దు, అడ్విలింగాల, కన్నాపూర్, గిద్ద హైలెవల్ బ్రిడ్జిలకు మరమ్మతులు చేపట్టాలని, గాంధారి, రామారెడ్డి, లింగంపేట, రాజంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. నియోజకవర్గంలోని గ్రామీణప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: అటవీశాఖ జిల్లా అధికారి (డీఎఫ్ఓ)గా గురువారం బాధ్యతలు చేపట్టిన నీరజ్ కుమార్ టిబ్రీవల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది వరకు డీఎఫ్వోగా పనిచేసిన నిఖిత బదిలీపై వెళ్లగా, ఆసిఫాబాద్ నుంచి నీరజ్కుమార్ బదిలీపై జిల్లాకు వచ్చారు. కలెక్టర్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి అనంతరం జిల్లాలో అటవీ సంరక్షణ, వనమహోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కామారెడ్డి క్రైం: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేసవిలో పశువుల సంరక్షణ, యాజమాన్యంపై అవగాహన కల్పించేందుకు ప్రభు త్వం రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. వేసవిలో పశువులకు తగిన ఆహారం, తాగునీరు, నీడ, ఆరోగ్య సంరక్షణ చర్యలపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 8న జిల్లాలో పశువుల ఆరోగ్య శిబిరాలు, మేలుజాతి పశువుల అభివృద్ధి, కృత్రిమ గర్భాధారణ, పశు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలపై ప్రజలను చైతన్యం చేయాలి
కామారెడ్డి అర్బన్ : బీసీ రిజర్వేషన్లు, నిరుద్యోగ, రైతాంగ, సాగునీరు, కార్మిక సమస్యలపై ప్రజల్లో చైతన్యవంతులను చేయాలని తెలంగాణ జన సమతి పార్టీ (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం సాయంత్రం కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ రోటరీ ఆడిటోరియంలో జిల్లా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలన్నారు. కామారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి త్వరలోనే పర్యటిస్తానని అన్నారు. సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గాన్ని కోదండరామ్ ప్రకటించారు. టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజ్జన రమేశ్ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడిగా కుంబాల లక్ష్మణ్యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్, ఉపాధ్యక్షులుగా పూల్సింగ్, లాల్సింగ్, కార్యదర్శులు సంగరాజు, వర్షిత్, సంజీవ్, విజయ్కుమార్, మహిళా అధ్యక్షురాలిగా నాగరాణి పేర్లను ప్రకటించారు. -
కారు చేయి దోస్తీ
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మరోసారి రసవత్తరంగా మారాయి. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేతులు కలిపాయి. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో జత కట్టిన రెండు పార్టీలు.. ఇప్పుడూ అదే దోస్తీని కొనసాగించి బీజేపీకి షాక్ ఇచ్చాయి. మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి, కమిషనర్ టి పర్వతాలు సమక్షంలో ఎన్నిక ప్రక్రియను గురువారం నిర్వహించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్కు 22, బీజేపీకి 16, బీఆర్ఎస్కు 11 మంది సభ్యుల బలం ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కో ఆప్షన్ పదవులను చేజిక్కించుకోవడానికి సంఖ్యాబలం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు మరోసారి మిత్రపక్షాలుగా మారాయి. ఎన్నిక ప్రక్రియకు 40వ వార్డు కౌన్సిలర్ సాహెబ్ నాగమణి (కాంగ్రెస్) గైర్హాజరు కాగా.. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులందరూ హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన 32 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపడంతో నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. ముందస్తు ఒప్పందం ప్రకారం మూడు పదవులు కాంగ్రెస్కు, ఒక పదవి బీఆర్ఎస్కు దక్కాయి. బీజేపీకి మళ్లీ నిరాశ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే విషయంలో గతంలోనే భంగపడ్డ బీజేపీకి, ఈ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. కో ఆప్షన్ ఎన్నికలో తమ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులను బరిలో దించింది. కౌన్సిల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలయికతో బీజేపీ అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. ముందే చెప్పిన ‘సాక్షి’ కో ఆప్షన్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ జతకడతాయని, కాంగ్రెస్కు మూడు, బీఆర్ఎస్కు ఒక పదవి ఇచ్చుకునేలా ఒప్పందం కుదిరిందని ‘సాక్షి’ ముందే అభ్యర్థుల పేర్లతో సహా ప్రచురించింది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ‘సాక్షి’ ముందే ఊహించి చెప్పినట్లుగానే అభ్యర్థుల ఎన్నిక జరగడం గమనార్హం. వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.ప్రమాణస్వీకారం చేస్తున్న కుంబాల రవియాదవ్, గోనె సునీత, అలీ బిన్ అబ్దుల్లా, ఆస్మా అదిబా ఖానంకో ఆప్షన్ పదవుల కోసం మొత్తం 33 మంది పోటీలో ఉండగా, ఎన్నికల సమయంలో 9 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి జనరల్ విభాగంలో గోనె సునీత, మైనారిటీ విభాగంలో అస్మా అదిబా ఖనాం, అలీ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నుంచి జనరల్ విభాగంలో కుంబాల రవి పదవిని దక్కించుకున్నారు. ఎన్నికై న సభ్యులకు అదనపు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం అధికారులు, సభ్యుల సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. గెలుపొందిన వారిని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు సన్మానించారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర మద్దతు మూడు పదవులు కాంగ్రెస్కు.. ఒకటి బీఆర్ఎస్కు కమలం పార్టీకి మరోసారి భంగపాటు -
18న ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్
● పాల్గొననున్న అత్యవసర సేవల విభాగాలు ● ప్రజలు ఆందోళన చెందొద్దు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: వర్షాకాల సన్నద్ధతలో భాగంగా జిల్లా కేంద్రంలో ఈనెల 18వ తేదీన జిల్లా స్థాయి ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. వరదలు, విపత్తుల నిర్వహణ చర్యలపై అగ్నిమాపక శాఖ డీజీ విక్రయ్సింగ్ మాన్ గురువారం జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి సమన్వయ స మావేశాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ప లు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో ఏ ర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సంగ్వాన్ మాట్లా డుతూ.. 18న నిర్వహించే ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్లో రె వెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచా యతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరాశాఖలతోపాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయని తెలిపారు. మాక్ ఎక్సర్సైజ్ ద్వారా శాఖల మధ్య సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలు, సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు ప్రక్రియ, రక్షణ చర్యలు, సహాయక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వరదల సమయంలో చేపట్టాల్సిన అన్ని రకాల సన్నద్ధతను పరీక్షించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. ఇది కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే సన్నద్ధత కార్యక్రమం మాత్రమేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. కామారెడ్డి క్రైం: జనాభా గణన–2027 లో భాగంగా అన్ని కార్యకలాపాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గృహగణన కార్యకలాపాలపై గురు వారం సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలీకేరి వర్చువల్గా గురువారం సాయంత్రం సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. గృహ జాబితా రూపకల్పన కార్యకలాపాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జనాభా గణన–2027 కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణను ఖచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. మొబైల్ వ్యాన్ల ద్వారా అన్ని మండలాల్లో ప్రజలకు జనగణన కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
ఇందల్వాయి : మండలంలోని గంగారాం తండా గ్రామానికి చెందిన నసీం సుల్తానా ఇంట్లో గత నెల 22వ తేదీన చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దించామన్నారు. బుధవారం గన్నారం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బొమ్మెర్ల సోమేశ్, శైలేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారన్నారు. నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూలీ పనులు చేసుకునే ఇద్దరు దొంగిలించిన బంగారు నగలను కన్నాపురం నరేందర్ అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలిపారన్నారు. వారి నుంచి బంగారు, వెండి నగలతోపాటు రూ.8,500 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక టీవీ, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వినోద్, ఎస్సై సందీప్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
ఆయిల్పాంతో అధిక ఆదాయం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తాడ్వాయి: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఎండ్రియాల్ గ్రామశివారులో రైతు బొక్క హన్మండ్లు సాగు చేస్తున్న ఆయిల్పాం తోటను సందర్శించారు. 2022 లో మూడున్నర ఎకరాలలో పంటను సాగు చేస్తున్నానని రైతు తెలిపాడు. అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నానని, ఎకరానికి రూ. 1.20 లక్షల వరకు ఆదాయం వస్తోందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్పాం సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. ఆయిల్పాం పంట ధర టన్నుకు రూ. 23 వేలు ఉందని, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. సబ్సిడీపై వచ్చిన ఆయిల్పామ్కు సంబంధించిన డ్రిప్ పరికరాలను ఏడుగురు రైతులకు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారు పడమటి కౌసల్య ఇంటిని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను పోగు చేసినట్లయితే కిలోకు టిఫిన్ బాక్స్ ఇస్తామని గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రకటించింది. దీంతో గ్రామానికి చెందిన ఓ మహిళ రెండు కిలోల ప్లాిస్టిక్ కవర్లను తీసుకురావడంతో ఆమెకు కలెక్టర్ చేతులమీదుగా రెండు టిఫిన్ బాక్సులను అందించారు. అనంతరం కలెక్టర్ వాటర్ట్యాంక్ను పరిశీలించారు. గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, ఉద్యానశాఖ జిల్లా అధికారి జ్యోతి, మండల ప్రత్యేకాధికారి రఘునందన్, డీఎల్పీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సవాలకు ‘కోడూరు’ ముస్తాబు
● నేటినుంచి విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలుకామారెడ్డి టౌన్ : కోడూరు హనుమాన్ ఆలయం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. గురువారంనుంచి 12వ తేదీ వరకు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్వ కాలంలో కామారెడ్డి పట్టణం పేరు ‘కోడూరు’గా ఉండేది. అప్పట్లో ఈ గ్రామం కిష్టమ్మ గుడి ప్రాంతంలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ పురాతన హనుమాన్ ఆలయం ఉంది. ఏటా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పండుగల సందర్భంగా పట్టణంలో నిర్వహించే శోభాయాత్రలు ఇక్కడినుంచే ప్రారంభమవుతాయి. వేద పండితులు గంగవరం ఆంజనేయశర్మ సూచనల మేరకు భక్తులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో గురువారం నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. -
ధాన్యం తరలించాలంటూ రైతుల రాస్తారోకో
భిక్కనూరు: ధాన్యం తూకం వేసి వారం రోజులు గడుస్తున్నా రైస్మిల్లులకు తరలించేందుకు లారీలు రావడం లేదని రైతు లు ఆరోపించారు. బుధవారం కాచాపూర్ రైతులు కామారెడ్డి –పెద్దమల్లారెడ్డి రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తూకం వేసిన 6 వేల బస్తాల ధాన్యం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలోనే మూలుగుతోందన్నా రు. వెంటనే లారీలను పంపించి ధాన్యం తరలించాలని డి మాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్, భిక్కనూరు తహసీల్దార్ సునీత, గ్రామపరిపాలన అధికారి రాజులు వచ్చి రైతులతో మాట్లాడారు. వెంటనే ధాన్యం బస్తాలను తరలింపజేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి నిరసనను విరమించారు. -
అప్పుల్లేని వ్యవసాయం చేయాలి
● పంటల మార్పిడితో మేలు ● రైతువారోత్సవంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ రూరల్: ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతులను పాటిస్తూ రైతులు అప్పులేని వ్యవసాయం దిశగా సాగాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం దేశాయిపేట్ సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు వారోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రైతులు సాగు ఖర్చులు తగ్గించుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. పంటమార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గంగాధర్, బాన్సువాడ ఏఎంసీ చైర్పర్సన్ అంజవ్వ, సొసైటీ చైర్మన్ ఎర్వాల క్రిష్ణారెడ్డి, ఏడీఏ అరుణ, సర్పంచ్లు వీరేశం, రమేష్నాయక్, మల్లుగొండ, నాయకులు నారాయణరెడ్డి, ఉద్దర రాజ్కుమార్, ప్రశాంత్, విజయ్గౌడ్, శ్రావణ్, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలో రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి బోనాల ఊరేగింపు నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు జరిపారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయం వరకు మహిళలు, యువకులు ర్యాలీగా తరలి వెళ్లారు. సర్పంచ్ కుమ్మరి రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, గౌడ సంఘం నాయకులు ఉన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): తుక్కోజీవాడిలో శ్రీ కృష్ణ మందిరం వార్షికోత్సవాలు బుధవారం ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన, అన్నపూర్ణ కల్యాణోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. సర్పంచ్ సంగారావు, ఆలయ కమిటీ ప్రతినిధులు రమేశ్ రావు, నవీన్రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి పనుల పరిశీలన
దోమకొండ: మండల కేంద్రంలోని గండ్ల చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ ఐరేని నర్సయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 6 గంటల లోపు పనులకు చేరుకుని తిరిగి 10 గంటల వరకు పనులు ముగించుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలందరికి ఎండ వేడిమి నుంచి కాపాడుకునేందుకు టోపీలను అందజేస్తానన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు కొనసాగుతున్నాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం నిర్వహించిన నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, ఐదో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 1,607 మంది విద్యార్థులకుగాను 1,522 మంది హాజరు కాగా 85 మంది గైర్హాజరైనట్లు వివరించారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన రెండో సెమిస్టర్ రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 298 మంది విద్యార్థులకుగాను 283 మంది హాజరు కాగా 15 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. -
పారదర్శకంగా బదిలీ ప్రక్రియ
● 146 మందికి బదిలీ: ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి టౌన్ : జిల్లాలో 146 మంది పోలీస్ సిబ్బంది బదిలీ అయ్యారని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీ ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. ఎనిమిది మంది ఏఎస్సైలు, 18 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 111 మంది కానిస్టేబుళ్లు, 9 మంది ఎంటీ సెక్షన్ సిబ్బంది బదిలీ అయ్యారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్లు పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్ల సర్వీస్ ఉన్న ఏఎస్సైలతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి విల్లింగ్ స్టేషన్ల ఆధారంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆర్ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కల్వర్టును ఢీకొట్టిన కారు.. పెళ్లింట విషాదం
● ఎనిమిది మందికి గాయాలు ● ఆందోళనకరంగా ఒకరి పరిస్థితి కామారెడ్డి అర్బన్: రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందంలోని ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన చౌదరి సిద్ధిరాములు కొడుకు భరత్ పెళ్లి కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లక్ష్మిదేవి గార్డెన్లో బుధవారం ఉదయం జరిగింది. అయితే కారులో బంధువులను తీసుకువస్తుండగా చిన్నమల్లారెడ్డి వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు తండ్రి సిద్ధిరాములు, తల్లి వినోద, మేనేత్త సుజాతతోపాటు మరో ఐదుగురు బంధువులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో పెళ్లి కొడుకు మేనేత్త సుజాత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
పండుగలా ఉండేది
కామారెడ్డిఅర్బన్: మా చిన్నతనంలో వేసవి సెలవులంటే ఓ పండుగగా ఉండేది. నేను పుట్టి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్. అక్కడే పదవ తరగతి వరకు చదివాను. ఖానాపూర్కు అర కిలోమీటరు దూరంలో గోదావరి నది ఉండేది. అప్పటికింకా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మించలేదు. వేసవి సెలవుల్లో ఉదయం లేచింది మొదలు దోస్తులతో కలిసి గోదావరిలో ఈతకు వెళ్లేవాళ్లం. అక్కడే మామిడి తోటల్లోకి వెళ్లి మామిడి పళ్లు తినేవారం. ఈత కల్లు తాగేవాళ్లం. మధ్యాహ్నం వరకు ఇంటికి చేరే లోపు చేసే అల్లరి పనులకు ఇంట్లో లొల్లి జరిగేది. నాలుగైదు సార్లు మా నాన్నతో దెబ్బలు సైతం తిన్నాను. నా స్నేహితులు మారన్న, మురళీధర్రావు సైతం అల్లరిగా ఉండేవారు. ఇద్దరు పోలీసు శాఖలో ఎస్పీ స్థాయిలో రిటైర్డ్ అయ్యారు. 1973లో నేను ఎలక్ట్రికల్ డిప్లొమా చేసి ఇంజనీర్ను అయ్యాను. కామారెడ్డిలో ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిర నివాసిని అయ్యాను. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చినందకు సాక్షికి ధన్యవాదాలు. – మారవేని రాజన్న, విశ్రాంత విద్యుత్ ఇంజనీర్, కామారెడ్డి -
అమ్మమ్మ ఇంటికి వెళ్లి పుంజీతం ఆడేవాళ్లం
భిక్కనూరు: నా చిన్నతనంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడ పుంజీతం ఆట(పులి మేక) ప్రతిరోజు ఆడేవాడిని. అలాగే క్యారంబోర్డు, అష్టాచెమ్మా ఆడేవాడిని. ఎండ తగ్గాక సాయంత్రం పూట పంట చేనుల వద్దకు వెళ్లి మామిడి కాయలు తెంపుకుని అక్కడే తినేవాళ్లం. ఎప్పుడు ఎండా కాలం వస్తుందా అని రోజులు లెక్కించుకునేవాడిని. అలాగే ప్రతిరోజు తాటి ముంజలు మొర్రిపండ్లను కూడా తినేవాళ్లం. అప్పట్లో పది పైసలకు 20 బిస్కట్లు వచ్చేటివి. – తాటిపాముల నాగభూషణంగౌడ్, రిటైర్డ్ ఎంఈవో, భిక్కనూరు -
ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్గా ఎన్వై గిరి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా కామారెడ్డి ఆర్డీవో ఎన్వై గిరి నియమితులయ్యారు. అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన మధుమోహన్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఎన్వై గిరి బుధవారం ఇన్చార్జి అదనపు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని 38 వార్డుతో పాటు 36, 40 వార్డుల బ్యాలెట్ బాక్స్లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని మున్సిపల్ అధికారులు కోర్టుకు చేర్చారు. మున్సిపల్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ 38వ వార్డులో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ఓటర్లు, ఇతర వార్డుల ఓటర్లు 38వ వార్డులో ఓటేయడంతో తాను ఓడిపోవాల్సి వచ్చిందని ఆ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని కోర్టుకు అందించారు.కామారెడ్డి టౌన్ : వేసవి కాలంలో పట్టణ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోందని మున్సిపల్ కమిషనర్ పర్వతాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఏ వార్డులోనైనా నీటి ఎద్దడి ఏర్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణంలో నీటి సమస్య ఉన్నట్లయితే కింది అధికారులను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ : 98499 07825 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ : 98499 07822 మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ : 95151 84201 కామరెడ్డి క్రైం: రాఘవపూర్ శివారులో బొమ్మా బొరుసు నిర్వహిస్తున్న ఓ స్థావరంపై దేవునిపల్లి, సీసీఎస్ పోలీసులు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. బొమ్మాబొరుసు ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ. 73 వేల నగదు, రెండు బైకులు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. నేడు, రేపు దోస్త్ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తెయూ(డిచ్పల్లి): దోస్త్ – యూజీ కోర్సులలో స్పెషల్ కేటగిరి కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు పీహెచ్సీ/ సీఏపీ ఈ నెల 7న, ఎన్సీసీ/స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ విద్యార్థులు ఈ నెల 8న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెయూ అడ్మిషన్స్ డైరక్టర్ వాసం చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిపాలనా భవనంలోని అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెషన్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. -
చెరుకుకు మద్దతు
చెరుకు రైతుకు కాస్త తీపి వార్త అందింది. మద్దతు ధర టన్నుకు వంద రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రైతులు మాత్రం వరి పంటకు ఇచ్చినట్లుగా బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● టన్నుకు రూ. వంద పెరుగుదల ● రూ.3,885 కు చేరిన ధర ● వరి లాగే బోనస్ ఇవ్వాలంటున్న రైతులుజిల్లాలో ఒకప్పుడు 30 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగయ్యేది. సాగు ఖర్చులు, చెరుకు నరకడానికి కూలీలకు చెల్లించాల్సిన కూలీ రేట్లు పెరగడంతో పెట్టుబడులుపోనూ మిగిలేది అంతంత మాత్రంగానే ఉంటుండడంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లారు. ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తుండడంతో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. దీంతో చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఆంక్షలతో సాగుకు దూరం జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, పాల్వంచ, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి తదితర మండలాల్లో దశాబ్దాలుగా చెరుకు సాగుపై రైతులకు అవగాహన ఉంది. అప్పట్లో అన్ని ప్రాంతాల్లో ఖండసారి చక్కెర కర్మాగారాలుండేవి. అలాగే పుట్ల కొద్ది బెల్లం వండేవారు. అయితే సారా తయారీలో నల్లబెల్లం వినియోగిస్తున్నారన్న సాకుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్లం వండడంపై ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. బెల్లం వండితే కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో చాలా మంది చెరుకుసాగుకు దూరమయ్యారు. సాగు కష్టాలు పెరగడం, కూలీల సమస్య, ధర సరిపోకపోవడంతో మరికొంతమంది చెరుకు సాగు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆరేడు వేల ఎకరాలలో కూడా పంట సాగవడం లేదు.చెరుకు పంటకు మద్దతు ధర మాత్రమే పెంచడంతో కొంతే ఊరట లభించిందని రైతులు పేర్కొంటున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధర పెరగడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల పంట అయిన వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.. ఏడాది పంట అయిన చెరుకుకు సైతం ప్రోత్సాహకం అందించాలని రైతులు కోరుతున్నారు.గతేడాది చెరుకు టన్ను ధర రూ. 3,774.90 ఉండేది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో టన్నుకు రూ.వంద పెరుగుతుంది. 10.25 శాతం ప్రాథమిక రికవరీ రేటుకు ఈ ధర వర్తిసుంది. రికవరీ రేటు ఎక్కువగా ఉంటే మద్దతు ధర మరింత పెరుగుతుంది. జిల్లాలో గాయత్రి షుగర్స్లో రికవరీ శాతం 10.95 ఉండడంతో టన్నుకు రూ. 110 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన చెరుకు టన్ను ధర రూ. 3,885 కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. -
సమ్మర్ అంటే సంబరమే..
వేసవిలో ఓ వైపు ఎండల తీవ్రత ఉక్కిరిబిక్కరి చేస్తున్నా.. మరోవైపు ఎన్నో సరదాలు, సంతోషాలను కూడా వెంట తీసుకొస్తుంది. ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో వేసవిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. అదే రెండు, మూడు తరాల వెనక్కు వెళ్తే.. వేసవి మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వయోవృద్ధులను పలకరిస్తే తమ చిన్నతనంలో వేసవి ఎంత ఉత్సాహంగా గడిపారో గుర్తు చేసుకున్నారు. – సాక్షి నెట్వర్క్ -
ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లికలాన్, వెంకంపల్లి గ్రామాల్లో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. లింగంపల్లికలాన్లో నాయికోటి రుక్కవ్వ, వెంకంపల్లిలో పోల రమేష్కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు వారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్నారు. దీంతో బుధవారం నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎంపీవో ప్రభాకరచారి ఆయా గ్రామాల సర్పంచ్ అనిత, జ్యోతితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహాప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలకు వరం లాంటిది ఇందిరమ్మ ఇళ్లు బీబీపేట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు వరం లాంటివని మాందాపూర్ సర్పంచ్ ఆకుల హరీష్ యాదవ్ అన్నారు. బుదవారం గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. నూతన వస్త్రాలను అందజేశారు. కార్యదర్శి గంగుబాయి, వార్డు సభ్యులు సతీష్, కనకయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దోమకొండలో.. దోమకొండ: మండల కేంద్రంలోని పెద్దిరెడ్డి నాగమణి–భాస్కర్రెడ్డిలు బుధవారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ తిర్మల్గౌడ్ లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహూకరించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశపోయిన శ్రీనివాస్, నేతలు అనంత్రెడ్డి, సీతారాం, మధు, సిద్దారెడ్డి, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సొంతింటి కల నెరవేరుతున్నదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం తిమ్మారెడ్డి, కొక్కొండ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు పరిశీలన లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇల్లును ఎంపీడీవో నరేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి బిల్లులు సకాలంలో జమచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యదర్శి శ్రవణ్కుమార్ ఉన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణఖేడ్లో హైదరాబాద్ – నాందేడ్ – అకోలా నేషనల్ హైవే 161పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. జుక్కల్కు చెందిన పొడిచెర నిఖిల్ (23) బైక్పై సంగారెడ్డి నుంచి స్వస్థలానికి వెళ్తుండగా.. నిజాంపేట్ సమీపంలో వంతెన సైడ్వాల్ బైక్ ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నిఖిల్ను ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
తెయూతో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ ఎంవోయూ
తెయూ(డిచ్పల్లి): స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) సంస్ధ, తెలంగాణ యూ నివర్సిటీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది. ఈ మేరకు బుధవారం వర్సిటీ వైస్ చాన్స్లర్ టి యాదగిరిరావు సమక్షంలో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీకాంత్ ముప్పల్ల, వర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ సంస్థ స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్, మూక్స్లలో ఆసక్తికర విద్యార్థులకు శిక్షణ ఇస్తుందని రిజిస్ట్రార్ తెలిపారు. తమ కార్యకలాపాలు యూనివర్సిటీ విద్యార్థులతోపాటు అనుబంధ కళాశాలల విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ ముప్పల్ల తెలిపారు. -
చదువులమ్మ ఒడి.. ఈ సర్కారు బడి!
● బీబీపేట టీఎస్ఎన్ఆర్ హైస్కూల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు ● ప్రైవేట్కు దీటుగా బోధన ● ఏటేటా పెరుగుతున్న ఉత్తీర్ణతబీబీపేట: మౌలిక వసతులు కల్పించి, ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయగలమని సర్కారు పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బీబీపేట విద్యార్థులు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 2021 కి ముందు సరైన వసతులు లేవు. భవనం శిథిలావస్థకు చేరడంతో బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన పరిస్థితులుండేవి. ఈ పాఠశాలను జనగామ గ్రామానికి చెందినప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి తన తల్లిదండ్రులు తిమ్మయ్యగారి సుశీల, నారాయణరెడ్డి జ్ఞాపకార్థం రూ. 6 కోట్లతో అభివృద్ధి చేశారు. నూతన భవనం నిర్మించడంతోపాటు అన్ని వసతులు కల్పించారు. అన్ని హంగులతో పాఠశాల అందుబాటులోకి రావడం, సరిపడా ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేట్కు కాకుండా సర్కారు బడికే పంపించాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సైతం తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. నాణ్యమైన విద్య.. బీబీపేటలోని టీఎస్ఎన్ఆర్ హైస్కూల్లో డిజిటల్ విద్య, కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక కోర్సులుగా హోటల్ మేనేజ్మెంట్, అగ్రకల్చర్ కోర్సులున్నాయి. కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులో ఉండడంతోపాటు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఏటా పలువురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు పొందుతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు 11 మంది ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారు. క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తున్నారు. పదో తరగతిలో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతోపాటు ఫలితాలూ మెరుగవుతున్నాయి. సరైన సౌకర్యాలు కల్పిస్తే అన్ని పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం 2023–24 131 118 90 2024–25 143 142 99 2025–26 152 152 100 -
సరదాగా గడిచిపోయేది..
కామారెడ్డి అర్బన్: చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఆ రోజులు ఎంత బాగుండేది అనిపిస్తుంది. నేను అమ్మమ్మ ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లింగన్నపేటలో చదువుకున్నా. వేసవి సెలవుల్లో దోస్తులతో కలిసి ప్రతిరోజూ లింగన్నపేట పెద్ద చెరువులో సాన్నాలు చేసేవారం. అలాగే దొరవారి కోనేరులో పై నుంచి దూకి ఈత కొట్టేవారం. ఆకలైతే దగ్గర చెట్ల నుంచి తెంపుకుని మామిడి పండ్లు, జామ పండ్లు తినేవారం. అలాగే దగ్గరిలోని కొత్తపల్లికి వెళ్లేవారం. లింగన్నపేటలో తాళ్లతో కట్టి ఉండే రథాన్ని లాగేవారం. ఎంతో అల్లరిగా సంతోషంగా చిన్నతనం గడిచింది. అలాంటి రోజులు ఈరోజు పిల్లలకు లేవు అనిపిస్తుంది. – యెల్లంకి సుదర్శన్, వ్యాపారి, కామారెడ్డి -
ఏసీబీకి చిక్కిన బోధన్ టౌన్ ఎస్సై
బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై భాస్కరా చారి పాత కేసు విచారణలో రూ. 7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో మార్చిలో ఓ సివిల్ వివాదంలో కేసునమోదు అయ్యింది. ఈ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో మరికొంత మంది ఉన్నారని, వారిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తామని ఎస్సై అందులోని ఓ వ్యక్తికి ఫోన్ చేసి చెప్పారు. ఈ సందర్భంగా రూ. 10 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో పట్టణానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి అన్న కొడుకు ఉన్నారు. లంచం ఇవ్వడానికి నిరాకరించి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. పథకం ప్రకారం బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దారుడు ఎస్సైకి రూ. 7 వేలు ఇస్తుండగా ఏసీబీ అఽధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుకు సబంధించిన ఫిర్యాదు దారుడి వివరాలను గొప్యంగా ఉంచుతున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ప్రజలు తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే లంచం డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖకు చెందిన 1064 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుద్రూర్: పొతంగల్ మండలం కారేగాం గ్రామ పరిధిలో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం క్వారీలో లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అండుగంటి ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ నరహరి సునీల్ మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల వల్ల మంజీర పరీవాహక ప్రాంతాల్లో ఉన్న లిఫ్ట్, డీ ఫ్లోరైడ్ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తాగునీటి సరాఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని, సాగునీటి కోసం బోర్లు, లిప్ట్లపై ఆధార పడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భారీ స్థాయిలో ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. వర్ని: మండలంలోని మల్లారం శివారులో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అంజి.. పాత వర్నికి చెందిన గంగాధర్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు బుధవారం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయన్నారు. గాయాలపాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
రైతు వేదికలలో సౌర వెలుగులు!
● సోలార్ ప్యానల్స్ ఏర్పాటు దిశగా సర్కారు చర్యలు ● నిర్వహణ భారం తగ్గించేందుకు..ఎల్లారెడ్డిరూరల్ : రైతు వేదికలకు సౌర విద్యుత్ అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే సోలార్ ప్యానళ్లు అమర్చే అవకాశాలున్నాయి. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. పంటల సాగుకు ప్రణాళికలను సిద్ధం చేయడం, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు రైతులందరు ఒకచోట సమావేశమయ్యేందుకు వీటిని నిర్మించారు. జిల్లాలో 104 రైతు వేదికలు ఉన్నాయి. వీటిలో రైతులతో నేరుగా మాట్లాడేందుకుగాను వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం గలవి 72 ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో ప్రతి మంగళవారం పంటల సాగుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణకు ప్రత్యేక నిధులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. విద్యుత్ బిల్లులతో పాటు వర్కర్ల వేతనాలు కూడా భారంగా మారింది. సౌర పలకల ఏర్పాటుతో.. రైతు వేదికలలో సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అన్ని వేదికలలో ఒకేసారి కాకుండా దశలవారీగా సౌర వి ద్యుత్ అందించే అవకాశాలున్నాయి. విద్యుత్ బిల్లు ల భారం తగ్గించేందుకు వీటిని బిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 104 రైతు వేదికలలో సోలార్ ప్యాన ల్స్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ని ధులు మంజూరు కాగానే రైతు వేదికలలో ఏ ర్పాటు చేస్తాం. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ఆదాయవనరుల పెంపుపై దృష్టి సారించాలి
నిజామాబాద్ అర్బన్: అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు సుధీర్రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన అదనపు కలెక్టర్లు తమ జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరును వివరించారు. ప్రజాప్రతినిధులు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి సారించాలని రాజయ్య సూచించారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
స్వీయ గణనలో ఆదర్శం
● సోమ్లానాయక్ తండాలో వంద శాతం పూర్తి ● రాష్ట్రంలో రెండో గ్రామంగా గుర్తింపుబాన్సువాడ రూరల్: బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్ తండా గ్రామం స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)లో ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ వంద శాతం సీయ గణనలో పాల్గొన్నారు. ఇలా రాష్ట్రంలో వందశాతం పూర్తిచేసిన రెండో గ్రామంగా సోమ్లానాయక్ తండా రికార్డు సృష్టించింది. ఈ తండా జిల్లాలో తొలిగ్రామంగా గుర్తింపు పొందింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం మేరకు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామంలో వి స్తృతంగా అవగాహన కల్పించారు. ఇంటింటికి వె ళ్లి స్వీయ గణన ప్రాముఖ్యతను వివరించి, ఆన్లై న్లో వివరాలు నమోదు చేసుకునేలా చూశారు. సర్పంచ్ మీరిబాయి చందర్, పాలకవర్గ సభ్యు లు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతి కు టుంబం స్వీయ గణన పూర్తిచేసేలా ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు, వలంటీర్లు ప్రజలకు స హాయం చేయడంతో నమోదు ప్రక్రియను సులభతరమైంది. మంగళవారం నాటికి గ్రామంలోని అన్ని కుటుంబాలు స్వీయ గణన పూర్తిచేయడంతో లక్ష్యం నెరవేరింది. నిరక్షరాస్యులు, వృద్ధులు, డిజిటల్ పరిజ్ఞానం లేనివారికి ప్రత్యేకంగా సహ కారం అందించిన వారిని తహసీల్దార్ నరేందర్ గౌడ్ అభినందించారు. ఇతర గ్రామాలు సోమ్లా నాయక్ తండాను ఆదర్శంగా తీసుకుని స్వీయగణనను వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మీరిబాయి చందర్, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, జీపీవో విఠల్, ఉపాధ్యాయులు కుషాల్, మంద ప్రవీణ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ బదిలీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), డీఆర్వో సీహెచ్ మధుమోహన్ బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్లో కామారెడ్డి డీఆర్వోగా వచ్చిన ఆయనకు నెలరోజులకే అదన పు కలెక్టర్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ యన నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అధికారులు, ఉద్యోగులను కలుపుకుపోయే అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనను గద్వాల జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. కీలక పోస్టుల్లో ఇన్చార్జీలే.. మధుమోహన్ బదిలీతో జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే పలు శాఖలకు జిల్లా అధికారులుగా ఇన్చార్జీలే కొనసాగుతున్నారు. డీఎంహెచ్వో, డీఈవో, జిల్లా ఎకై ్సజ్ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జిల్లా యువజన సంక్షేమ అధికారి తదితర పోస్టుల్లో ఇన్చార్జీ అధికారులే ఉన్నారు. కలెక్టరేట్లో కీలకమైన సూపరింటెండెంట్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు సూపరిండెంట్లు హజ్ యాత్రకు వెళ్లగా మరో ఇద్దరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు సూపరింటెండెంట్లే పనిచేస్తున్నారు. -
పలుచబడి..
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026– 9లో uవిద్యారంగ అభివృద్ధికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా మని ప్రభుత్వాలు గొప్పులు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కనీస సౌకర్యాలు కరువవడం, సరిపడా టీచర్లు లేకపోవడంతో జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతూనే ఉంది. సౌకర్యాలు మెరుగుపరచకపోతే చాలా పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతంలో 1,257 స్కూళ్లు ఉండేవి. విద్యార్థులు లేకపోవడంతో పలు పాఠశాలలు మూతపడి గతేడాది 1,017 కు తగ్గిపోయాయి. అందులోనూ 52 స్కూళ్లలో జీరో విద్యార్థులున్నట్లుగా గుర్తించారు. దీంతో గత విద్యాసంవత్సరంలో 965 పాఠశాలలే కొనసాగాయి. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, తరగతులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం 81,864 మంది విద్యార్థులు ఉంటే గత విద్యాసంవత్సరానికి సంఖ్య 76,082 కి తగ్గిపోయింది. మూడేళ్లలో ఆరువేల మంది విద్యార్థులు తగ్గిపోవడం గమనార్హం. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, కొన్ని బడులు మూతబడడానికి పలు కారణాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా ఇవ్వడం, మధ్యాహ్న భోజనం సమకూర్చడం వంటి పథకాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు ఎందుకు పంపుతున్నారో పాలకులు గుర్తించడం లేదు. కొన్ని బడుల్లోనే సౌకర్యాలు ఉండగా, చాలాచోట్ల సమస్యలున్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, కనీసం తాగునీటి సౌకర్యం లేకపోవడం గమనార్హం. పిల్లలు ఇంటి నుంచే తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు సక్రమంగా రాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. భోజనం లోనూ నాణ్యత ప్రశ్నార్థకంగానే ఉంది. చాలా చోట్ల శిథిలావస్థకు చేరిన గదుల్లో ఎప్పుడు పెచ్చులూడి పడిపోతాయోనన్న భయం మధ్య చదువులు సాగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ పథకాల కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణాలు నిధుల సమస్యతో అర్ధాంతరంగా నిలిచిపోయి చెట్లకింద చదువుకునే దుస్థితి ఉంది. వీటికి తోడు సబ్జెక్టు టీచర్లు లేక చాలాచోట్ల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం కూడా మొక్కుబడిగానే సాగుతోంది. సర్కారు బడులకు పిల్లలను రప్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ‘ప్రైవేటు’లో పెరుగుదల.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా.. ప్రైవే ట్ స్కూళ్లలో మాత్రం ఏటా పె రుగుతోంది. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 184 ఉన్నాయి. మూడేళ్ల క్రితం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 65,271 మంది విద్యార్థులు ఉండగా.. గతేడాది వీరి సంఖ్య 71,165కు పెరిగింది. అంటే మూడేళ్లలో దాదా పు ఆరువేల మంది విద్యార్థులు పెరిగారు. 965 ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 76,082 మంది విద్యార్థులుండగా.. కేవలం 184 ప్రైవేటు పాఠశాలల్లోనే 71,165 మంది విద్యార్థులు ఉండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న త విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయులు దాదా పు ఐదు వేలపైచిలుకు పనిచేస్తున్నారు. ప్రైవే టు బడుల్లో చాలావరకు గ్రాడ్యుయేషన్ చదివి న వారితోనే నెట్టుకొస్తున్నారు. కొద్దిమంది మా త్రమే ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారున్నారు. అయినా ప్రైవేట్ బడులవైపే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపుతుండడం ఆలోచించాల్సిన విషయం. పర్యవేక్షణ కరువు.. స్కూళ్లను పర్యవేక్షించే అధికారులు కరువయ్యా రు. చాలామంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా.. కొందరు మాత్రం సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఆర్ఎస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా కొందరు డుమ్మాలు కొ డుతున్నట్లు తెలుస్తోంది. మండల విద్యాశాఖ అ ధికారులుగా సీనియర్ పీజీ హెచ్ఎంలను నియమించారు. వారు తాము పనిచేసే బడిని, మండ ల విద్యాశాఖను చూసుకోవాల్సి ఉంటుంది. జి ల్లా స్థాయిలోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో బడుల్లో బోధన ఎలా సాగుతుందన్న దానిపై ఎ వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందడం లేదన్న భావన తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. దీంతో పిల్లల భవిష్యత్ కోసం చాలామంది తల్లిదండ్రులు అప్పు చేసైనా ప్రైవేట్ బడికి పంపిస్తు న్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి, ప్రైవేటులో పెరుగుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కారు స్కూళ్లలో ఏటేటా తగ్గుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు సౌకర్యాలు మెరుగుపరచాలంటున్న విద్యాభిమానులు -
‘కోఆప్షన్’కు ముహూర్తం ఖరారు
● రేపు ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్లో ఎన్నిక ● బరిలో 33 మంది.. అభ్యర్థుల్లో ఉత్కంఠకామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. బల్దియాలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికకు కౌన్సిల్ సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు హాజరుకావాలని చైర్పర్సన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ పదవులు ఉండగా.. మొత్తం 35 దరఖాస్తులు వచ్చాయి. ఇద్దరు త మ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తు తం 33 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, బీ ఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నా రు. 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జనరల్ విభాగంలో ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ), మైనారిటీ విభాగంలో ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ) సభ్యులను ఎన్నుకోనున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో చైర్పర్సన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్తో జతకట్టిన బీఆర్ఎస్.. ఈసారి కూడా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు రెండు కోఆప్షన్ పదవులు కావాలని బీఆర్ఎస్ పట్టుబడుతుండగా, ఒక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్లోనూ రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ మద్దతుతో చెరో రెండు పదువులను పంచుకుని కాంగ్రెస్కు చెక్ పెట్టుందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యూహాలకు పదును.. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం ఆయా పార్టీలు సమావేశం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తమ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అటు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కూడా విడివిడిగా భేటీ కానున్నారు. కుంబాల రవి(బీఆర్ఎస్), గోనె సునీత(కాంగ్రెస్), తయ్యబ్ సుల్తానా(కాంగ్రెస్), జమీరొద్దీన్(కాంగ్రెస్)కు అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పిడుగు మమత, ముస్కాన్, భాస్కర్గౌడ్లతో పాటు మరికొందరు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్వో
తాడ్వాయి: ఎర్రాపహాడ్లోని ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్వో) రవీందర్గౌడ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్ గదులను తనిఖీ చేశారు. రోజూ సక్రమంగా విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఆయన వెంట మండల వైద్యాధికారి ఖాసీం, హెచ్ఈవో నారాయణ, పీహెచ్ఎన్లు నక్షత్రం, స్వాతి, శ్రీనివాస్, సుమలత తదితరులు ఉన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. సీనియర్స్, అండర్–16, 18, 20 మహిళలు, పురుషుల విభాగాలలో పోటీలు నిర్వహించగా.. 76 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చూపిన 21 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ తెలిపారు. ఎంపికై నవారు ఈనెల 10న హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, ప్రభులింగం, రేణుక, శివాగౌడ్, నరేష్, మహేష్, నవీన్, సంతోష్, ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ‘పంటల మార్పిడి చేయాలి’ భిక్కనూరు: రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పంటల మార్పిడి చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి సూచించారు. మంగళవారం భిక్కనూరులోని ఎస్వీ గార్డెన్లో నిర్వహించిన ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన పంటలు, ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పామాయిల్ పంటతో పాటు పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి సూచించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. కార్యక్రమంలో భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ, ఏడీఏ అపర్ణ, పశువైద్యాధికారి దేవేందర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, నేతలు భీంరెడ్డి, శ్రీరాం వెంకటేశ్, నరేందర్రెడ్డి, అధికారులు, హెచ్యూఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాంటాలను వేగవంతం చేయాలి భిక్కనూరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను వేగవంతంగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన భిక్కనూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అవసరమైన మేర టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, ఏఈవోలు వినోద్, లిఖిత్రెడ్డి పాల్గొన్నారు. -
‘బాధితులకు అండగా ఉంటాం’
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన పూల, పండ్ల తదితర దుకాణాలను సోమవారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పరిశీలించారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్నిప్రమాదంలో నష్టపోయిన 22 మంది దుకాణదారుల పూర్తి వివరాలను సేకరిస్తున్నామని, వీరికి ప్రభుత్వం నుంచి తక్షణమే ఆర్థిక సహాయం అందేలా చూస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున త్వరలోనే ఐరన్ షెడ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటానన్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. -
‘డబ్లింగ్’ దిశగా..
● అవసరమైన చోట భూసేకరణ ప్రక్రియ ● జిల్లాలో త్వరలో పనులు ప్రారంభించనున్న రైల్వే శాఖసికింద్రాబాద్ –నాందేడ్ మధ్య రోజూ 56 రైళ్లు తిరుగుతున్నాయి. అలాగే పదికిపైగా గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే సింగిల్ లైన్ మూలంగా క్రాసింగ్లతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ మార్గాన్ని డబ్లింగ్ చేస్తే రైళ్ల రాకపోకలకు ఆటంకాలు తొలగిపోవడంతో పాటు మరిన్ని రైళ్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీనికి తోడు వందేభారత్ ట్రైన్ కూడా కేటాయించడంతో రవాణాకు మరింత మేలు జరగనుంది. సింగిల్ లైన్తో ఇబ్బందులు... సికింద్రాబాద్ నుంచి నాందేడ్ రూట్లో కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల పరిధిలో ప్రస్తుతం సింగిల్ లైన్ ఉంది. దీంతో రైళ్ల రాకపోకలకు కొంత ఇబ్బందికరంగా ఉంది. చాలా సందర్భాల్లో క్రాసింగ్లతో సమయం వృథా అవుతోంది. ఒకే సమయంలో ఎదురెదురుగా రైళ్లు వచ్చినప్పుడు ఒక దానిని సమీపంలోని స్టేషన్లో నిలిపివేయాల్సి వస్తోంది. ఎదురుగా వచ్చే రైలు వెళ్లిపోయిన తర్వాత లైన్ క్లియర్ చేస్తున్నారు. గేటు పడినప్పుడల్లా పది నిమిషాల వరకు వేచి చూడాల్సి వస్తుండడంతో ప్రయాణికులు విసిగిపోతున్నారు.ముథ్కేడ్ –మేడ్చల్ రూట్లో 221 కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులను 2023లో ప్రారంభించారు. ఇప్పటికే చాలావరకు పనులు జరిగాయి. ఈ రూట్లో డబ్లింగ్ పనులు 2029 లోగా పూర్తి చేయాలన్న లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. కాగా కామారెడ్డి జిల్లాలో పొందుర్తి, సరంపల్లి, కామారెడ్డి, తిప్పాపూర్, రామేశ్వర్పల్లి, భిక్కనూరు, బస్వాపూర్, ఉప్పల్వాయి గ్రామాల పరిధిలో దాదాపు పది ఎకరాల భూమి అవసరం పడింది. భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసే పనిలో అధికారులున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికే నిజామాబాద్ వైపు నుంచి డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఉప్పల్వాయి నుంచి కామారెడ్డి మీదుగా పనులు చేపట్టాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే జిల్లాలోనూ డబ్లింగ్ జరగనుంది. మరోవైపు అమృత్ స్కీంలో కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఇటు స్టేషన్ ఆధునికీకరణ పనులు, అటు డబ్లింగ్ పనులు జరిగితే ప్రయాణికులకు మేలు జరుగనుంది.హైదరాబాద్, నాందేడ్ మధ్య ప్రయాణానికి ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతోంది. డబ్లింగ్ పూర్తయితే రైళ్ల వేగం కూడా పెరిగే అవకాశాలున్నాయి. కాగా ఈ మార్గంలో ఇప్పటికే వందేభారత్ రైలు మంజూరయ్యింది. డబ్లింగ్ పనులు పూర్తయ్యాక ఈ రైలును ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ రైలొస్తే హైదరాబాద్ – నాందేడ్ మధ్య ప్రయాణ సమయం సగానికి తగ్గనుంది. రైల్వే డబ్లింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.రైల్వే డబ్లింగ్ పనుల దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పనులు ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లాలో కొన్నిచోట్ల భూమి సేకరించాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే డబ్లింగ్ పనులు మొదలుపెట్టనున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
రెండు దశాబ్దాలకు బస్సొచ్చింది
లింగంపేట: మండలకేంద్రం నుంచి శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, జల్దిపల్లి, ఎక్కపల్లి, బొల్లారం మీదుగా ఎ ల్లారెడ్డికి ఇరవై ఏళ్ల తర్వాత బస్సు సర్వీస్ పునఃప్రారంభమైంది. ఆయా గ్రామాల సర్పంచ్లు సోమవారం లింగంపేట బస్టాండ్లో బస్సు సర్వీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి – ఎల్లారెడ్డి రూట్లో నడిచే ఈ బస్సు లింగంపేట, శెట్పల్లి, అయ్యపల్లి, పర్మళ్ల, జల్దిపల్లి, ఎక్కపల్లి, బొల్లారం మీదుగా సాగుతుందని పేర్కొన్నారు. ఆయా గ్రామాలకు బస్సు నడపడానికి కృషి చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు సకృనాయక్, అట్టెం శ్రీనివాస్, గోనె లింగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయండి
మద్నూర్ : మండల కేంద్రంలో జొన్న కొనుగోలు కేంద్రం లేకపోవడంతో పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక ఇబ్బందిపడుతున్నామని రైతులు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. సోమవారం తహసీల్దార్ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మండలంలో 1,325 ఎకరాల్లో జొన్న పంట సాగయ్యిందన్నారు. 2,650 టన్నుల వరకు పంట దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు. డోంగ్లీలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్ గోండ, రఘు గోండ, రవి పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లను వేగవంతం చేయండి
● వర్షాలు కురిసినా వడ్లు తడవకుండా జాగ్రత్తలు తీసుకోండి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం : రాబోయే ఐదు రోజుల పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ మంత్రి, ఇతర మంత్రులు, అధికారులు సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఆశిస్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమై డివిజన్ల వారీగా వరి కొనుగోళ్లపై సమీక్షించారు. వడ్లు తడవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, పిట్లం, నిజాంసాగర్, జుక్కల్ మండలాల్లో వరి కొనుగోళ్లను వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేంద్రాల నుంచి లారీల్లో వెంటనే తరలించాలన్నారు. టార్పాలిన్లు, డ్రెయినేజీ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎల్లారెడ్డి డివిజన్లో ధాన్యం నిల్వలు తడవకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీ సంబురాలు
కామారెడ్డి టౌన్ : పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడం, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుపొందడంతో సోమవారం బీజేపీ నాయకులు సంబురాలు జరుపుకున్నారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ పెరుగుతోందని, ఈ ఫలితాలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. -
‘శనగ డబ్బులు ఇప్పించండి’
మద్నూర్: మద్నూర్ కొనుగోలు కేంద్రంలో శనగ పంట విక్రయించి నలభై రోజులు కావస్తున్నా ఇప్పటికీ డబ్బులు రాలేదని రైతులు పేర్కొన్నారు. డబ్బులు ఇప్పించాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ ముజీబ్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ శనగ పంట విక్రయించి డబ్బుల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. డబ్బులు ఇప్పించాలని ఇంతకు ముందు కూడా వినతి పత్రం అందించామని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. త్వరగా డబ్బులు వచ్చేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతులు నరేశ్, సంతోష్, గంగారాం, నాగేశ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. -
మున్సిపాలిటీ అనుమతులు ఇచ్చేనా?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాకేంద్రంలో అధ్వానంగా ఉన్న వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన ఎస్ఆర్ ఫౌండేషన్.. ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థ కోరిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకుని, సమాచారం ఇవ్వాలని జిల్లా రెవెన్యూ అధికారి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో బల్దియా ఎలా స్పందిస్తుందోనన్న అంశంపై అంతటా చర్చ నడుస్తోంది. కామారెడ్డిలో ఉన్న రెండు హిందూ శ్మశాన వాటికలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గతంలో అభివృద్ధి పనులు చేపట్టిన అసంపూర్తిగా వదిలేశారు. దీంతో అంత్యక్రియల నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. హౌసింగ్ బోర్డు సమీపంలోని శ్మశాన వాటికలో సమస్య తీవ్రంగా ఉంది. దీనిపై ‘అంతిమ’ కష్టాలు శీర్షికన ‘సాక్షి’ ప్రచురించిన కథనం ప్రజలను కదిలించింది. దీనిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చ నడిచింది. అంతిమ కష్టాలు తీర్చేందుకు ఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. గతనెల 27న ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు అదనపు కలెక్టర్ మధుమోహన్ను కలిసి తమ సంస్థ ఆధ్వర్యంలో శ్మశాన వాటికను తీర్చిదిద్దుతామని లేఖ అందించారు. దీనిని పరిశీలించిన జిల్లా అధికారులు ఎస్ఆర్ ఫౌండేషన్ కోరిన అనుమతుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించినట్లు తెలిసింది. కమిషనర్ నిర్ణయం కోసం ఫౌండేషన్ ప్రతినిధులు వేచి ఉన్నారు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు వస్తే ఏ రకంగా అభివృద్ధి చేయాలన్న దానిపై ప్రణాళిక తయారుచేస్తామని పేర్కొంటున్నారు. జిల్లా కేంద్రంలో అధ్వానంగా వైకుంఠధామం అభివృద్ధి చేయడానికి అనుమతించాలని కోరిన ఎస్ఆర్ ఫౌండేషన్ వినతిని పరిశీలించాలని బల్దియా కమిషనర్కు అదనపు కలెక్టర్ ఆదేశాలు -
కంప్యూటర్ల అందజేత
కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ నుంచి వచ్చిన కంప్యూటర్లను సోమవారం ఎంపీడీవోలకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత, వేగవంతమైన సేవల కోసం ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో నూతన కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫీల్డ్, టెక్నికల్ సిబ్బంది మస్టర్లు, మేజర్మెంట్ బుక్లు, బిల్లులు ఆన్లోనే పూర్తి చేయాలని సూచించారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చూడాలన్నారు. ఆయా పనులకు ఈ కంప్యూటర్లను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి’
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. పదోన్నతి పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. కామారెడ్డి పట్టణ పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న ఎల్లారెడ్డికి ఏఎస్సైగా, జిల్లాలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి. వారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిశారు. ఎస్పీ వారందరికీ పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన వారిలో సదాశివనగర్ పీఎస్కు చెందిన మురళి మోహన్, దోమకొండకు చెందిన రజినీకాంత్, దేవునిపల్లి నుంచి శ్రీనివాస్, నస్రుల్లాబాద్ నుంచి హరిచంద్ర, బీర్కూర్ నుంచి కిషన్, బిచ్కుంద నుంచి జీవన్, సీసీఎస్ నుంచి గణపతి, మైసయ్యలు ఉన్నారు. ఉత్తమ సేవలందించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.కామారెడ్డి క్రైం: కామారెడ్డి డీఎస్పీగా మధుసూదన్ నియమితులయ్యారు. సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. కామారెడ్డి అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించిన చైతన్యరెడ్డి ఇటీవలే రంగారెడ్డి అదనపు ఎస్పీగా బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మధుసూధన్ కామారెడ్డి డివిజనల్ పోలీస్ అధికారిగా బదిలీపై వచ్చారు. కామారెడ్డి అర్బన్: విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నామని ఎస్ఈ సాలియా నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇనుప కూలర్లు వినియోగించవద్దని, ఇనుప వైర్లపై దుస్తులు అరవేయవద్దని, ప్రతి ఇంటికి ఎర్తింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ తీగల కింద రాజకీయ పార్టీలు జెండాలు ఏర్పాటు చేయవద్దని, పొలాలకు కరంట్ వైర్లతో కంచెలు ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు. జీరో ప్రమాదాల లక్ష్యానికి వినియోగదారులు సహకరించాలని కోరారు. కామారెడ్డి క్రైం: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఉద్యాన శాఖపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. భిక్కనూరులోని ఎస్వీ గార్డెన్స్, తాడ్వాయిలోని మా గార్డెన్స్, నస్రుల్లాబాద్ రైతు వేదిక, జుక్కల్లోని సాయగౌడ్ రైతు తోటలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. ఉద్యాన పంటలు, ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంపు, ఆధునిక సాగు పద్ధతులు, కూరగాయలు, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమగ్ర సమాచారం అందిస్తామని తెలిపారు. రైతులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలకు హాజరుకావాలని కోరారు. -
రసవత్తరంగా కుస్తీపోటీలు
లింగంపేట(ఎల్లారెడ్డి): ఐలాపూర్లో సోమవారం దుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. ప్రతీ ఏటా దుర్గమ్మ ఉత్సవాల్లో భాగంగా కుస్తీపోటీలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు దుర్గారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి వెండి కడెం వరకు కుస్తీపోటీలు ఆద్యంతం ఉత్కంఠగా సాగాయి. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, చివరి కుస్తీ వెండి కడెం బహూకరించినట్లు తెలిపారు. సర్పంచ్ రాజయ్య, ఉపసర్పంచ్ సంజీవులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నిలిచిన వాహనాలు రాస్తారోకో చేస్తున్న రైతులు -
పశువుల పాకలోకి దూసుకెళ్లిన కారు
● మూడు గేదెలు మృతి, ఆరుగురికి గాయాలు ● ఉప్పల్వాయిలో ఘటన రామారెడ్డి: కారు అదుపుతప్పి పశువుల పాకలోకి దూసుకెళ్లిన ఘటన మండల పరిధిలోని ఉప్పల్వాయి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండలంలోని సోమారంపేట నుంచి కారులో గంగవత్ సుభాష్తోపాటు మరో ఐదుగురు వ్యక్తులు గాంధారి వైపు వెళ్తున్నారు. ఉప్పల్వాయి గ్రామంలోకి రాగానే కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పశువుల పాకలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఘటనలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకటి తీవ్రంగా గాయపడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి. బాధితుడు జింగిటి రాజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
క్రైం కార్నర్
చేపలు పట్టేందుకు వెళ్లి ఒకరి మృతి బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామానికి చెందిన జెల్ల హన్మాండ్లు (30) ఆదివారం మధ్యాహ్నం చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు భార్య సుమలత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెరువులో చేపలు పడుతుండగా వల కాళ్లకు చుట్టుకోవడంతో నీటమునిగి ఊపిరాడక మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారని సీఐ తుల శ్రీధర్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహా న్ని పోస్టుమార్టం నిమిత్తంప్రభుత్వఏరియాఆస్పత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ ఒకరు..గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఉప్పు సాయిలు(55) గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. కుటుంబ కలహాలతో సాయిలు గత నెల 26న తన వ్యవసాయ క్షేత్రం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఈ నెల 2న హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ సాయిలు సోమవారం మృతి చెందాడు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పోతంగల్ కలాన్ గ్రామానికి చెందిన రాజాహ్మద్ సోమవారం ట్రాక్టర్పై నుంచి పడిపోవడంతో కాలువిరిగినట్లు అంబులెన్సు సిబ్బంది తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పాత ఇంటికి కూల్చివేస్తూ ఆ మట్టిని ట్రాక్టర్ ద్వారా గ్రామశివారులోని ఓ కుంటలోకి తరలిస్తున్నారు. అయితే, ట్రాక్టర్పై వెళ్లిన రాజాహ్మద్ ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తుల సమాచారం మేరకు క్షతగాత్రుడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘ఇందిరమ్మ’ లబ్ధిదారులకు వంట సామగ్రి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ పథకం లబ్ధిదారు శ్రీరామ్ సు భాష్,సుజాత దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారుల ఇంటికి కావాల్సిన వంట సామగ్రిని బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ని రుపేదలకు అండగా నిలుస్తోందని, ప్రతి పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ధ్యే యమని పేర్కొన్నారు. కౌన్సిలర్లు తాటి లావణ్య ప్ర సాద్, గడ్డమీది మహేష్, తదితరులు పాల్గొన్నారు. అగ్నిప్రమాద స్థలం పరిశీలన కామారెడ్డిటౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద అగ్నిప్రమాదానికి గురైన దుకాణదారులను గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఎస్పీ, ఆర్డీవో, రెవెన్యూ అధికారులు తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలన్నారు. బా ధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని, స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి చొరవ తీసుకుని త్వరితగతిన నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. కౌన్సిలర్ గడ్డమీది మహేష్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జూలూరి సుధాకర్, నాయకులు చాట్ల వంశీ, సలీం, తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పర్ష వెంకటరమణ కుమారులు పర్ష తృషాల్, పర్ష మృణల్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం మూడు సార్లు రక్తదానం చేస్తూ ఆదర్శంగా ని లుస్తున్నారని రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు అన్నారు. సోమవారం రోడ్డు ప్ర మాద బాధితుడు రవీందర్రెడ్డి కోసం ఓ నెగిటివ్ రక్తం అవసరం కాగా సోదరిలిద్దరు రక్తదానం చేశారన్నారు.రక్తదాత తృషాల్ను రక్తదాతల సమూహం ప్రతినిధులు జమీల్, చంద్రశేఖర్, సుధాకర్ తదితరులు అభినందించారు. భిక్కనూరు: తిప్పాపూర్ గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏనుగు బాలరాజిరెడ్డి(70) సోమవారం మృతి చెందారు. సాయంత్రం వరకు ఆరోగ్యంగా ఉన్న ఆయనకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబీకులు ఆయనను కారులో కామారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమద్యలోనే మృతి చెందారు. తిప్పాపూర్ సర్పంచ్గా బాలరాజిరెడ్డి 1988 నుంచి 1995 వరకు పనిచేశారు. మంగళవారం గ్రామంలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నట్టు కుటుంబీకులు తెలిపారు. మద్నూర్(జుక్కల్): స్వీయ గణనను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ ముజీబ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం వద్ద సోమవారం ప్రచార రథాన్ని తహసీల్దార్ ప్రారంభించారు. స్వీయ గణనలో ప్రజలంతా పాల్గొని సక్రమంగా జనగణన చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వీయ గణనపై సోషల్ మీడియా వేదికపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కవ మంది సెల్ఫోన్లు వాడుతున్నందున సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలన్నారు. తహసీల్ కార్యలయంలో అవగాహన కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది రవి, ప్రవీణ్, అశోక్, హుల్లాజీ తదితరులున్నారు. పెద్దకొడప్గల్లో.. పెద్దకొడప్గల్(జుక్కల్): స్వీయ జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలని తహసీల్దార్ రాజశేఖర్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలో జన గణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆటోలో మైక్ పెట్టించి ప్రచారం చేయించారు. ఆర్ఐ అంజయ్య, ఉప సర్పంచ్ నాగు, సిబ్బంది పాల్గొన్నారు. -
తరుగు పేరిట మోసగిస్తున్నారని రైతుల ఆందోళన
నస్రుల్లాబాద్ : రైస్మిల్ యజమానులు తరుగు పేరిట మోసం చేస్తున్నారని మైలారం గ్రామ రైతులు సోమవారం మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి లారీల్లో మిల్లుకు తరలించిన తర్వాత తరుగు తీసి మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత సివిల్ సప్లయి డీటీతో ఫోన్లో మాట్లాడితే తనకేం సంబంధం లేదని సమాధానం చెబుతూ, రైస్మిల్లు యజమానులకు వత్తాసు పలుకుతున్నారని పేర్కొన్నారు. సుమారు గంట పాటు రోడ్డుపై కూర్చొని జిల్లా అధికారులు తమ గోడుపట్టించుకోవాలని వేడుకున్నారు. ఘటన స్థలానికి తహసీల్దార్ సువర్ణ చేరుకొని రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి
భిక్కనూరు: రైతులు పంటల సాగులో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని బీజేఆర్ వ్యవసాయకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకట్రామ్, టీచింగ్ అసోసియేట్ రషీద్ఖాన్ అన్నారు. సోమవా రం తిప్పాపూర్ రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు –అన్నదాతల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకుని సాగు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయాలని సూచించారు. తిప్పాపూర్, మోటాట్పల్లి సర్పంచ్లు లింగారెడ్డి, భూమయ్య, ఉప సర్పంచ్ జీవన్, తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో క్రీడా సంబరమే
● జిల్లాలో 20 వేసవి శిక్షణ శిబిరాలు ● 20 క్రీడల్లో శిక్షణ రామారెడ్డి: వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన, క్రీడల శాఖ సిద్ధమైంది. ఇందు కోసం ఆయా మండలాల్లో క్రీడల్లో నైపుణ్యం కల్గిన వారిని శిక్షకులుగా నియమించింది. జిల్లావ్యాప్తంగా 10 క్యాంప్లు రూరల్ ప్రాంతాలలో 10 క్యాంప్లు అర్బన్ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి జూన్ 7 వరకు ఈ శిబిరాలను నిర్వహించనున్నారు. ఇందులో సుమారు 20 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా, ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూరల్ ప్రాంతాలలో రూ.5 వేల, అర్బన్ ప్రాంతాలలో రూ.7,500 చొప్పున శిక్షకులకు ఇవ్వనుంది. అర్బన్లో నిర్వహించే క్రీడలకు మాత్రమే ఫీజు అర్బన్ ప్రాంతాల్లో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజు చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ప్రాంతంలో క్రీడలకు ఎలాంటి ఫీజు లేకుండానే పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్బన్ క్రీడల్లో అథ్లెటిక్స్ క్రీడాకారుడు రూ.400 చొప్పున, బాస్కెట్ బాల్కు రూ.400, బ్యాడ్మింటన్కు రూ.1,000, క్రికెట్, టేబుల్ టెన్నిస్కు రూ.700, స్కేటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్కు రూ.800 చొప్పున ఫీజు నిర్ణయించారు. రామారెడ్డిలో క్రీడా శిక్షణ శిబిరంలో భాగంగా ఫుట్బాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నాం. 50 నుంచి 70 మంది వరకు హాజరవుతున్నారు. క్రీడలో మెలకువలు నేర్చుకోవడం, క్రమశిక్షణ నేర్చుకోవడం, సమయం వృథా కాకుండా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. – రేకుల బాల్రాజ్, ఫుట్బాల్ శిక్షకుడు, రామారెడ్డి మే లో నిర్వహించే వేసవి శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. జిల్లావ్యాప్తంగా అర్బన్ 10, రూరల్లో 10 చొప్పున మొత్తం 20 క్యాంపులు నిర్వహిస్తున్నాం. విద్యార్థులు వేసవిలో ఖాళీగా ఉండకుండా క్రీడల్లో నైపుణ్యం పెంచుకునేందుకు ఇది మంచి అవకాశం. సీఎం క్రీడలకు మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు. –రంగ వెకంటేశ్వర్గౌడ్, జిల్లా యువజన క్రీడాధికారి -
బీజేపీ శ్రేణుల విజయోత్సవాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నాయకులు టపాకాయలు కాల్చి, స్వీట్లు పంచారు. మూడు రాష్ట్రాల విజయ స్ఫూర్తితో తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు బొల్లారం క్రాంతికుమార్, దత్తురాం, రజినీకాంత్, నరేష్, శివ్వయ్య, తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ : బాన్సువాడలో బీజేపీ నాయకులు స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద టపాసులు పేల్చి, స్వీట్లు పంచారు. ఈ సందర్బంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అరాచక పాలనకు ప్రజలు చమరగీతం పాడుతూ నరేంద్ర మోదీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వానికి స్వాగతం పలికారని అన్నారు. బీజేపీ నాయకులు శ్రీనివాస్రెడ్డి, చీదరి సాయిలు, శంకర్గౌడ్, గజ్జల మహేష్, పాశం భాస్కర్రెడ్డి, మోహాన్రెడ్డి, తదితరులున్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బీజేపీ విజయం సాధించడంపై సోమవారం నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా కార్యవర్గ సభ్యులు హన్మాండ్లు, నాయకులు శ్రీనివాస్, కొండ మీరాతాయి, శ్రీకాంత్, బాలయ్య, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్, పట్టణాధ్యక్షుడు బొందుగుల భాస్కర్, లక్ష్మీదేవునిపల్లి సర్పంచ్ లింగారెడ్డి, నేతలు నరేందర్రెడ్డి, వినయ్, సుధాకర్రెడ్డి, విలాస్రెడ్డి, గందం రాజు, నరేష్రెడ్డి సంబరాల్లో పాల్గొన్నారు. -
బదిలీపై వెళ్తున్న సీఐకి సన్మానం
భిక్కనూరు: రెండున్నర ఏళ్లకు పైగా భిక్కనూరు సీఐగా పనిచేసి హైదరాబాద్లోని ఐజీ కార్యాలయానికి బదిలీపై వెళ్తున్న సంపత్కుమార్ను సోమవారం పలువురు నేతలు ఘనంగా సన్మానించారు. భిక్కనూరు సీఐగా ఆయన ప్రజలతో కలిసి మెలిసి ఉండి శాంతి భధ్రతల పరిరక్షణకు ఎంతగానో కృషి చేశాడని కొనియాడారు. శాలువా, మొమెంటోలతో సత్కరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి, కాంగ్రెస్ జిల్లా ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ సుధాకర్రెడ్డి, నేతలు అంకం రాజు, శ్రీరాం వెంకటేష్లు పాల్గొన్నారు. భిక్కనూరు: మహత్మా జ్యోతీబాపూలే బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియేట్ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కో–ఆర్డినేటర్ శ్రీలత సోమవారం తెలిపారు. 2026–27 సంవత్సరానికిగాను కామారెడ్డి జిల్లాలో బాలుర కోసం నాలుగు, బాలికల కోసం నాలుగు కళాశాలలు ఉన్నాయన్నారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పదవ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపు జరుగుతుందన్నారు. ఈనెల 12 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. గోశాలలో అగ్ని ప్రమాదం ● 3 వేల గడ్డి కట్టలు దగ్ధం మాక్లూర్ : మండలంలోని వేణుకిసాన్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గాలిబ్నగర్ వద్ద గల శ్రీమన్నారాయణ గోశాలలో సోమవారం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పశువుల మేత కోసం ఉంచిన సుమారు 3000 గడ్డి కట్టలు దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గోశాలలో ఉన్న గడ్డి కట్టలన్నీ కాలిపోయాయి. ఈ సందర్భంగా శ్రీమన్నారాయణ గోశాల నిర్వాహకుడు మాట్లాడుతూ రైతులు తమకు తోచిన విధంగా గడ్డి కట్టలు దానం చేయాలని కోరారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామంలో వరి కోస్తున్న హార్వెస్టర్కు విద్యుత్ తీగలు తగలడంతో దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. హార్వెస్టర్కు విద్యుత్ తీగలు తగలడంతో గమనించిన డ్రైవర్ చాకచక్యంతో వెంటనే మిషన్ పైనుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. కాగా, విద్యుత్ తీగలు చేతికందేలా వేలాడుతున్నాయని గతంలో విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వేలాడుతున్న తీగలను వెంటనే సరి చేయాలని కోరుతున్నారు. సిరికొండ: మండలంలోని మైలారం గ్రామానికి చెందిన ఒక బాబుపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. సోమవారం ఇద్దరు హిజ్రాలు ఆటోలో వచ్చి తన బాబును గోడకేసి కొట్టినట్లు తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో వేర్వేరు కారణాలతో ఇద్దరు వ్యక్తులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండల కేంద్రానికి చెందిన కార్లం సతీశ్(38) గత కొంత కాలంగా కుటుంబ సమస్యలతోపాటు అనారోగ్యంతో మానసిక ఆందోళనకు గురవుతున్నాడు. సతీశ్ ఇద్దరు పిల్లలు చిన్న వయస్సులోనే మరణించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం ఇంట్లోని బెడ్రూమ్లో ఉరేసుకోగా, చుట్టుపక్కల వారు గమనించి వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సతీశ్ మృతి చెందినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మృతుడి భార్య రోజా ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కడుపునొప్పితో మరొకరు.. మండల కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన నిమ్మలబోయిన భూమయ్య(66) కొన్ని సంవత్సరాలుగా కడుపునొప్పి, అల్సర్తో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రుల్లో చూయించుకున్నా ఆరోగ్యం కుదుటపడలేదు. ఆదివారం రాత్రి ఇంటి ఎదుట ఉన్న రేకుల షెడ్డులో ఉరేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీర్ఘకాలిక అనారోగ్యం, తీవ్ర నొప్పుల కారణంగా జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఇక రాష్ట్రవ్యాప్తం!
మన ‘సీపీవో’..వచ్చే విద్యాసంవత్సరంనుంచే..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాఠశాలల్లో విద్యార్థులు ముఖ్యంగా ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారికి రక్షణ కల్పించేందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అమలు చేసిన చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్(సీపీవో) విధానం రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ మోడల్ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలోని 5,711 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా నియమించనున్నారు. విద్యార్థులకు సంబంధించిన అన్ని విషయాల్లో సీపీవో ఎలా వ్యవహరించాలన్న దానిపై శిక్షణ ఇవ్వనున్నారు. సీపీవోలకు మరిన్ని బాధ్యతలు.. కామారెడ్డి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు గత విద్యాసంవత్సరంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. జిల్లాలో నాలుగు వందలకుపైగా పాఠశాలల్లో సీపీవోలను నియమించారు. ఇది సత్ఫలితాలు ఇచ్చి బాలికలపై వేధింపులు తగ్గాయి. కామారెడ్డి జిల్లాలో అమలు చేసిన ఈ విధానానికి మరింత మెరుగులుదిద్ది రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీపీవోకు వివిధ బాధ్యతలు అప్పగించనున్నారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బాలల హక్కులపై అవగాహన కల్పించడం, లీగల్ లిటరసీ, చైల్డ్ రైట్స్ క్లబ్ల ఏర్పాటు, విద్యార్థులకు న్యాయ సహాయం, కౌన్సిలింగ్ సేవలు, డ్రాపవుట్ పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడం వంటి చర్యలు తీసుకుంటారు.రాష్ట్రంలో 4,704 ప్రభుత్వ, జిల్లా పరిషత్ స్కూళ్లు, 495 కేజీబీవీలు, 194 మోడల్ స్కూళ్లు, 35 సొసైటీ గురుకులాలు, 33 అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు, 250 ఎయిడెడ్ స్కూళ్లలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను నియమిస్తారు. విద్యార్థుల భద్రత, సంక్షేమం వంటి అంశాలను వీరు పర్యవేక్షిస్తారు. విద్యార్థినులు వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది. ఏదైనా సమస్య తలెత్తినపుడు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ విభాగానికి సమాచారం అందించి వారితో కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు లైంగిక వేధింపులకు గురికాకుండా చూడాల్సి ఉంటుంది. ఎవరైనా ఇబ్బందిపెట్టినట్లయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి. పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత ఉండాలన్న ప్రధాన ఉద్దేశంతో దీన్ని అమలు చేయనున్నారు. విద్యార్థుల రక్షణ కోసం జిల్లాలో గతేడాది ఏర్పాటు సత్ఫలితాలు ఇవ్వడంతో ఈ మోడల్ను అన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు చర్యలు 5,711 హైస్కూళ్లలో టీచర్లకు బాధ్యతలు ఇవ్వనున్న ప్రభుత్వం -
జిల్లా సరిహద్దులో చెక్పోస్ట్ ఏర్పాటు
నాగిరెడ్డిపేట: జిల్లా సరిహద్దులోని పోచారం వద్ద ఆదివారం స్థానిక పోలీసులు ప్రత్యేక చెక్పోస్ట్ను ఏర్పాటు చేశారు. కరీంనగర్లోని ఒక జ్యువెలరీ షాపులో ఆదివారం ఐదుగురు దుండగులు పిస్టల్తో కాల్పులు జరిపి దొంగతనం చేసి పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా సరిహద్దులో చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి వివరాలను సేకరిస్తున్నామని పేర్కొన్నారు. -
వృద్ధురాలి హత్య కేసులో నిందితుల అరెస్టు
భిక్కనూరు: వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ ఆదివారం తెలిపారు. మెదక్ జిల్లా బచ్చురాజుపల్లి గ్రామానికి చెందిన తొత్తల సుశీల (83)ఏప్రిల్ 29న కాచాపూర్ నుంచి కామారెడ్డికి వెళ్తానని చెప్పి అదృశ్యమైన విషయమై భిక్కనూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అయితే, సుశీల రాజంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడిని కలిసి చికిత్స చేయించుకునేందుకు వెళ్లింది. ఆస్పత్రి వద్ద సుశీలకు షేర్ శంకర్ తండాకు చెందిన బోక్య బోలి అనే మహిళతో పరిచయమైంది. ఇద్దరూ కలిసి కల్లు దుకాణంలోకి వెళ్లి కల్లు సేవించారు. అదే సమయంలో రాజంపేటకు చెందిన బస్వయ్య అక్కడికి వచ్చి వీరితో మాట్లాడారు. అనంతరం ముగ్గురు కలిసి సమీపంలోని వ్యవసాయబావి వద్దకు వెళ్లి అక్కడ సైతం మద్యం సేవించారు. ఆ తర్వాత సుశీల చేతులకు ఉన్న రెండు వెండి కడియాలు, మూడు వెండి గాజులు లాక్కొని ఆమెను బావిలోకి తోశారు. రాజంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రి, వైన్షాపుల వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా సుశీలతో బోక్యబోలి, బసవయ్య ఉన్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తామే బావిలో పడేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు బావి వద్దకు వెళ్లి సుశీల మృతదేహాన్ని బయటికి తీశారు. నిందితుల నుంచి మూడు వెండి గాజులు, రెండు వెండి కడియాలు, ఒక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సంపత్కుమార్ తెలిపారు. ఆయన వెంట ఎస్సైలు ఆంజనేయులు, రాజు ఉన్నారు. కామారెడ్డి క్రైం: ఆర్థిక సమస్యలు వెన్నాడటంతో మనస్తాపానికి గురైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ పాత ఎస్పీఆర్ పాఠశాల సమీపంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు .. శ్రీనివాస్(43) అనే వ్యక్తి గాంధారి మండలం పేట్ సంగెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలు పెరగడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం తన భార్య, ఇద్దరు పిల్లలను పోచంపాడ్లోని అత్తగారింటికి పంపించి ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారు. శనివారం సాయంత్రం శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో గమనించిన స్థానికులు దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపులు తెరిచి చూడగా, శ్రీనివాస్ ఇంట్లో ఉరేసుకొని విగతజీవిగా కనిపించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో రెండు, మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రాథమిక విచారణలో ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు .. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకొని గుర్జాల్ గ్రామానికి చెందిన మంగళారం శ్రీకాంత్(24) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. యువకుడి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఈ విషయమై ఎస్సై మహేందర్ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. శ్రీనివాస్(ఫైల్ ) -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని దేమికలాన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేమికలాన్ ఉన్నత పాఠశాలలో 2006–2007 సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 19 సంవత్సరాల అనంతరం కలుసుకున్నారు. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని, ప్రస్తుతం ఏం చేస్తున్నారో ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. తాండూర్లో.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని తాండూర్ హైస్కూల్లో ఆదివారం 2011–12 బ్యాచ్కు చెందిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 14 సంవత్సరాల తర్వాత కలుకున్న మిత్రులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. -
బడాపహాడ్ శివారులో లారీ బోల్తా
త్రుటిలో తప్పిన ప్రమాదం వర్ని: మండలంలోని బడాపహాడ్ అటవీ ప్రాంతంలో మక్కల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఆదివారం చింతలపేట్లోని కొనుగోలు కేంద్రం నుంచి మక్కలను లోడ్ చేసుకొని జాకోరా సొసైటీకి తరలిస్తుండగా బడాపహాడ్ శివారులో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును తప్పించబోయి లారీ లోయలో పడినట్లు స్థానికులు తెలిపారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో రోడ్డు పక్కకు లారీని తీసుకువెళ్లడంతో బస్పై పడలేదని, బస్సుపై పడి ఉంటే పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందేవారని పేర్కొన్నారు. ప్రమాదంలో డ్రైవర్కు స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీలో సుమారు 400 క్వింటాళ్ల వరకు మక్కలు ఉన్నట్లు జాకోర సొసైటీ సీఈవో రామకృష్ణ తెలిపారు. -
త్వరలో కేకేవై రోడ్డుకు మహర్దశ
● నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా ● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావులింగంపేట: కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి(కేకేవై) రోడ్డుకు త్వరలో మహర్దశ రాబోతోందని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. ఆదివారం పొల్కంపేట చౌరస్తాలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేకేవై రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ఫైల్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్ద ఉందన్నారు. త్వరలో నిర్మాణానికి అనుమతులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కాళేశ్వరం 22వ ప్యాకేజీ ద్వారా కాటేవాడి, మోతె, ధర్మరావుపేట, గుర్జాల్ ప్రాంతాల్లో మినీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానన్నారు. ప్లాస్టిక్ నిషేధం బాధ్యత సర్పంచులదే.. గ్రామాల్లో ప్లాస్టిక్ను నిషేధించే బాధ్యత సర్పంచులదే అని ఎమ్మెల్యే అన్నారు. ఈ విషయంలో ప్రతి గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో ఐస్క్రీములు విక్రయించకుండా చూడాలన్నారు. ఐస్క్రీములు విక్రయిస్తే రూ. 3 వేలు జరిమానా విధించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు, నాయకులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం పలువురికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు ప్రత్యూష, సాయిరాం, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత, డీఆర్డీవో సురేందర్, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్, ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్నాయక్, నాయకులు నారాగౌడ్, శ్రీనివాస్, రాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘దేశ రక్షణలో ముందుండాలి’
కామారెడ్డి అర్బన్: దేశ, ధర్మ రక్షణలో ప్రతి ఒక్కరు ముందుండాలని కామారెడ్డి పాతరాజంపేటలోని ఆర్ష గురుకుల అధిపతి స్వామి బ్రహ్మానంద సరస్వతి సూచించారు. గురుకులంలో నిర్వహించిన యువ నిర్మాణ ఆర్యవీర్ దళ్ పది రోజుల శిక్షణ శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా బ్రహ్మానంద సరస్వతి మాట్లాడుతూ ప్రస్తుతం గురుకుల విద్యావ్యవస్థ లేకపోవడంతో విలువలు, జీవన ప్రయోజనం లేని విద్యతో సమాజం తప్పుదోవలో నడుస్తోందన్నారు. ప్రతి విద్యార్థి మాతృ, పితృ, గురు, దైవ, దేశభక్తి కలిగి ఉండాలన్నారు. స్వీయరక్షణ, దేశ రక్షణ కోసం కర్రసాము, కత్తిసాము, ఆసనాలు నేర్చుకోవాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు శిక్షణలో పాల్గొన్నారు. దేశ, ధర్మాల రక్షణకు కట్టుబడి ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేయించారు. శిబిరంలో పాల్గొన్నవారికి పతకాలు, ప్రశంస పత్రాలు అందించారు. ఈ సందర్భంగా శిక్షార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆచార్యులు సందీప్ ఆర్య, వేదమిత్ర వేదార్థి ఆర్య, హరిదాస్ ఆర్య, సూర్యప్రకాశ్, సుదర్శన్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
సుభాష్రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో శ్మశానవాటికల అభివృద్ధికి ముందుకు వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డికి పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. పట్టణంలోని అశోక్నగర్ కాలనీలోగల భక్త హనుమాన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ సుభాష్రెడ్డి చేస్తున్న నిస్వార్థ సేవలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. వైకుంఠధామాల అభివృద్ధి వంటి పవిత్రమైన కార్యక్రమాల్లో ఆయన చొరవ అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నీల ప్రభాకర్, కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి రమేశ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
బొమ్మను చూసి.. చిత్రం గీసి..
● సొంతంగానే చిత్రకళలో ప్రావీణ్యం ● పెయింటర్ నుంచి క్రియేటివ్ డైరెక్టర్ వరకు ఎదిగిన గోపాల్ గౌడ్ఎల్లారెడ్డి: ఆయన ఎవరి వద్ద కుంచె పట్టి చిత్రకళ నేర్చుకోలేదు. చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఆసక్తితో బొమ్మలను వేయడంలో నైపుణ్యం సాధించాడు. మొదట్లో గుళ్లలో దేవుళ్ల చిత్రాలను గీయడం అలవాటుగా మొదలైన చుక్క గోపాల్ గౌడ్ ప్రస్థానం.. క్రియేటివ్ డైరెక్టర్ వరకు ఎదిగింది. కైరో(ఈజిప్ట్) దుబాయ్, ముంబైల్లోని ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీలలో క్రియేటివ్ డైరెక్టర్గా ఎన్నెన్నో అవార్డులు, పురస్కారాలు పొందారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన చుక్క గోపాల్ గౌడ్ చిన్న తనం నుంచే స్వగ్రామంలో ఉన్న గుళ్ల గోడల మీద కాలెండర్లలోని చిత్రాలను చూస్తూ శివుడు, ఆంజనేయుడు, రాముడు లాంటి దేవుళ్ల చిత్రాలను గీసేవాడు. ఆయన ప్రతిభ చూసి పలువురు మెచ్చుకునేవారు. మలుపుతిప్పిన ఇంగ్లిష్ లెక్చరర్.. ఇంటర్ చదువుతున్నప్పుడు ఈయన నైపుణ్యం చూసి ఇంగ్లిష్ లెక్చరర్ వహీద్ జేఎన్టీయూ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ కోర్సు గురించి తెలియజేశారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంటర్ కాగానే 1979లో ఆ కోర్సులో చేరారు. అక్కడ అధ్యాపకుల పర్యవేక్షణలో పెయింటింగ్లో నిష్ణాతుడయ్యాడు. జేఎన్టీయూలో పెయింటింగ్ కోర్సు పూర్తి కాగానే హైదరాబాద్లోని పలు అడ్వర్టయిజింగ్ కంపెనీలలో సినిమా పోస్టర్లను పెయింటింగ్ చేస్తూ చిత్ర కళాకారుడిగా జీవితం ప్రారంభించారు. అక్కడ నుంచి పదోన్నతిపై బెంగళూరు వెళ్లి అక్కడ ప్రముఖ అడ్వర్టయిజింగ్ కంపెనీలైన మా కమ్యూనికేషన్, సిస్టాస్, చైత్ర, లియోబర్సెడ్లో పనిచేశారు. కొద్ది రోజులు ముంబైలో పని చేస్తూ క్యాలెండర్ పెయింటింగ్ నేర్చుకున్నారు. ఏషియన్ ఆర్ట్స్ ఫెస్టివల్లో భారత దేశం తరపున బ్యాంకాక్లో పోటీలో పాల్గొన్నారు. అందుకున్న అవార్డులు.. దుబాయ్లో ఒక కంపెనీలో క్రియేటివ్ డైరెక్టర్గా పనిచేస్తూ ప్రతిష్టాత్మక బెస్ట్ ఐడియా ఆఫ్ ఇయర్ పురస్కారాన్ని అందుకున్నారు. యూరప్లో క్విట్ స్మోకింగ్పై జరిగిన పోటీలలో దుబాయ్ ఆరోగ్య శాఖ ద్వారా ఉత్తమ పోస్టర్ పురస్కారాన్ని అందుకున్నారు. సేవ్ వాటర్ అన్న అంశంపై దుబాయ్లో జరిగిన పోటీలలో ఉత్తమ షోకేస్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నారు. ప్రముఖ అడ్వర్టయిజింగ్ కంపెనీ ఓ అండ్ ఎం సంస్థలో ఆయన చేసిన కంపెనీ యాడ్కు బంగారు పతకం లభించింది. శివతత్వాన్ని ఇష్టపడే ఆయన ఆధునిక చిత్రకళతో అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్, కాన్వాస్ పెయింటింగ్, గృహాలంకరణ చిత్రాలలో శివుడిపై ఎన్నో చిత్రాలు గీశారు. ఆయన గీసిన పలు వాణిజ్య ప్రకటనలు, లఘు చిత్రాలు, యాడ్ ఫిలిమ్స్, మోడ్రన్ ఆర్ట్ చిత్రాలు ఎన్నో అవార్డులను సాధించి పెట్టాయి. 2025లో హైద్రాబాద్లో మంజునాఽథ ఫౌండేషన్ వారు భారత్ విభూషణ్ అవార్డుతో సత్కరించి బంగారు నందిని బహూకరించారు. చిత్రకళలో ఆయన నైపుణ్యాన్ని గుర్తించి సినీ బెల్డియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కు, మిస్టర్ అండ్ మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ పోటీలకు న్యాయ నిర్ణేతగా(జ్యూరీ మెంబర్) ఎంపిక చేశారు. పెయింటర్గా, క్రియేటివ్ డైరెక్టర్గా, క్రియేటివ్ హెడ్గా ఎన్నో దేశాలలో పనిచేశాను, ఎన్నో దేశాల ప్రతిష్టాత్మక అవార్డులు సాధించాను. ఎన్ని దేశాలలో పనిచేసినా రిటైర్ అయ్యాక నేను పుట్టి పెరిగిన సొంతూరు ఎల్లారెడ్డిలో స్థిర పడటం ఎంతో తృప్తినిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత నా అభిరుచికి తగ్గట్టు ఎల్లారెడ్డిలో చిన్న ఇల్లు కట్టుకుని పెయింటింగ్లు వేసుకుంటూ, చిత్రకళపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు, పిల్లలకు పెయింటింగ్ నేర్పుతూ నా భార్య సుగుణతో కలిసి శేష జీవితాన్ని గడపడం ఆనందంగా ఉంది. –చుక్క గోపాల్ గౌడ్, చిత్రకారుడు, ఎల్లారెడ్డి -
క్రైం కార్నర్
బీబీపేట: నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలకు నీళ్లు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాలు.. ఆముదాల కిష్టయ్య (73) ఇంట్లోని కొత్త గోడకు మోటార్తో నీళ్లు పట్టి అదే చేతితో ప్లగ్ తీస్తుండగా విద్యుత్ షాక్ తగిలి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే కిష్టయ్య మృతి చెందాడు. భార్య ఆముదాల భారతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఎర్రకుంట తండాకు చెందిన మలావత్ పత్యా(48) ఆదివారం నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పత్యా గత నెల 23న ఆత్మకూర్ గేట్ వద్ద జరిగిన రోడ్డు ప్రమా దంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 10 రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన పత్యా ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. -
జిల్లాకేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం
● 16 దుకాణాలు అగ్నికి ఆహుతి.. ● రూ. కోటి వరకు ఆస్తినష్టం జరిగిందంటున్న బాధితులు ● కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా ఘటనకామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఆదివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. 16 దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఎదురుగా ప్రధాన రహదారి వెంట రేకుల షెడ్డులతో కూడిన దుకాణాలున్నాయి. వాటిలో పూలు, పండ్ల దుకాణాలు, పాన్ షాపులు, టీ పాయింట్లు, సెల్ఫోన్ రిపేర్ లాంటి మొత్తం 16 దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో దుకాణాల వెనక భాగంలో మంటలు చెలరేగి అక్కడే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు అంటుకున్నాయి. ట్రాన్స్ఫార్మర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. ఆ వరుసలోనే టీ పాయింట్, ఇతర దుకాణాల్లోని మొత్తం 3 సిలిండర్లు పేలిపోయాయి. దీంతో మంటల ఉధృతి పెరిగి మొత్తం దుకాణాలు కాలిబూడిదయ్యాయి. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ట్రాన్స్ఫార్మర్ వద్దనున్న చెత్తకు నిప్పంటుకుని గానీ, ట్రాన్స్ఫార్మర్ వద్ద షార్ట్సర్క్యూట్తో గానీ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, పలువురు కాంగ్రెస్ నాయకులు బాదితులను ఓదార్చారు. ఆర్డీవో గిరి ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. సుమారు రూ.కోటి వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు.కామారెడ్డి అర్బన్: ఇందిరా చౌక్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి రూ. 15 లక్షల నష్టం జరిగిందని ఎస్ఈ సాలియా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అగ్ని ప్రమాదంతో పూలు, పండ్ల దుకాణాలు దహనం అయ్యాయని, అయితే దీనికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం, సాంకేతిక లోపం కారణం కాదని పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశామని, వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతవరకు ప్రత్యామ్నాయ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేస్తామని పేర్కొన్నారు.నా పాన్ షాప్ మొత్తం కాలిపోయింది. దుకాణం మీదనే మా బతుకులు ఆధారపడి ఉన్నాయి. అగ్ని ప్రమాదంలో జీవనాధారాన్ని కోల్పోయాం. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి. – ఖదీర్, బాధితుడు, పాన్షాప్ఎన్నో ఏళ్లుగా ఇక్కడే పండ్ల వ్యాపారం చేస్తున్నాను. నిన్ననే పండ్ల లారీ లోడ్ వచ్చింది. అన్ని పండ్లు కాలిపోయాయి. సామాన్లతో సహా దుకాణం మొత్తం బూడిదయ్యింది. రూ. 6 లక్షల వరకు నష్టం జరిగింది. – మహ్మద్ యూసుఫ్, బాధితుడు, పండ్ల వ్యాపారి -
‘వానాకాలం నాటికి సిద్ధంగా ఉంచండి’
నిజాంసాగర్: వర్షాకాలం ఆరంభం నాటికి నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లు, గేర్ బాక్సులు, రూప్ వైర్లకు అవసరమైన మరమ్మతులు చేయించి సిద్ధంగా ఉంచాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ దోర్జీ గ్యాంబా సూచించారు. ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టుతో పాటు హెడ్స్లూయిస్ జలవిద్యుదుత్పత్తి కేంద్రాన్ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు బృందం పరిశీలించింది. ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ఇన్ఫ్లోలు, గేట్ల నిర్వహణ, ప్రాజెక్టు నీటిమట్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భం దోర్జీ గ్యాంబా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు దిగువన వంతెనకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలన్నారు. గుల్దస్తా వద్ద ఎకో టూరిజం పనులు వేగవంతంగా జరుగుతుండడంతో పర్యాటకంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట బాన్సువాడ ఎస్ఈ దక్షిణామూర్తి, ఈఈ సోలోమాన్, ఏఈలు ఉన్నారు. ‘పోచారం’ సందర్శన నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టును ఆదివారం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ దోర్జీ గ్యాంబా సందర్శించారు. ప్రాజెక్టు వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు ప్రధాన కాలువ వెంట నాగిరెడ్డిపేట శివారులో ఉన్న జగ్గనిచెరువును పరిశీలించారు. ఆయనవెంట బోర్డు ఈఈ వేణుగోపాల్, ఇరిగేషన్ ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ అక్షయ్కుమార్, పోచారం సర్పంచ్ సంజీవులు, మాజీ సర్పంచ్ నర్సాగౌడ్, సిబ్బంది యాదగిరి, నర్సింలు తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 7న జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ (రన్స్, త్రోస్, జంప్స్) ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. అండర్–8, 10, 12, 14 కేటగిరీలలో బాలబాలికలకు పోటీలుంటాయి. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు పుట్టిన తేదీ సర్టిఫికెట్ లేదా ఆధార్ కార్డు జిరాక్స్ వెంట తీసుకుని గురువారం ఉదయం 8గంటలకు ఇందిరా గాంధీ స్టేడియానికి రావాలని సూచించారు. -
వడదెబ్బతో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
డిచ్పల్లి: మూడు రోజుల క్రితం వడదెబ్బకు గురైన గుర్తుతెలియని వృద్ధుడు(70) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు డిచ్పల్లి ఎస్సై మహమ్మద్ ఆరీఫ్ తెలిపారు. ఏడో బెటాలియన్ సమీపంలోని విక్టరీ హైస్కూల్ దగ్గర వృద్ధుడు పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు డిచ్పల్లి ఎస్సై 8712659852, సీఐ 8712659851 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామ శివారులో ఉన్న పెద్దవాగు నుంచి శనివారం అర్ధరాత్రి అక్రమంగా ఇసు క తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. శనివారం రాత్రి పక్కా సమాచారం మేరకు సిబ్బందితో కలిసి పెద్దవాగులో ఆకస్మికంగా తనిఖీలు చేయగా అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నామన్నారు. ఇసుక లేదా మొరం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్– 4 ఆధ్వర్యంలో ఆదివారం నీట్ విద్యార్థుల కోసం క్యాంపస్ ఆవరణలో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా యూనిట్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సయ్య మాట్లాడుతూ.. గ్రామీణ విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం, వనరులు అందితే వారు కూడా ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారని తెలిపారు. నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు అవసరమైన సహకారం అందించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు అనిల్, సమీర్, రాజేందర్, కృష్ణ, ఆకాష్ పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ బంగారు దుకాణంలో దుండగుల కాల్పుల కలకలం నేపథ్యంలో ఆదివారం రూర ల్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. అలాగే హోటళ్లను సైతం విస్తృతంగా తనిఖీ చేశారు. వాహనదారుల వివరాలతోపాటు, హోటళ్లలో ఉంటున్న వారి వివరాలు సేకరించారు. ఎస్హెచ్వో శ్రీనివాస్, ఎస్సై షరీఫ్తోపాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి నుంచి దేవాయిపల్లి మీదుగా బ్రాహ్మణపల్లి వరకు ఉన్న రోడ్డు అధ్వాననంగా తయారైంది. ప్రతి రోజూ ఈరోడ్డుపై వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ మార్గంలో నిర్మించిన కల్వర్టు కూడా పూర్తిగా ధ్వంసమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చొరువ తీసుకొని ఈ రోడ్డును బాగు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
మున్నూరుకాపు సంఘ అభివృద్ధికి కృషి
సుభాష్నగర్: పంచముఖి మున్నూరుకాపు సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని 6వ డివిజన్ కార్పొరేటర్ గోపిడి స్రవంతిరెడ్డి అన్నారు. నగరంలోని వినాయక్నగర్ పంచముఖి మున్నూరు కాపు సంఘం భవనంలో సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్పొరేటర్ స్రవంతిరెడ్డితోపాటు పదోన్నతి పొందిన సంఘ సభ్యులు చిట్టి నారాయణరెడ్డి, స్వర్ణలతను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా స్రవంతిరెడ్డి మాట్లాడుతూ.. తనను భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు. డివిజన్ అభివృద్ధితోపాటు ఎన్నికల్లో సహకరించిన సంఘాలకు నిధులు కేటాయిస్తామన్నారు. ఎంపీ అర్వింద్ ధర్మపురి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో మాట్లాడి నిధులు అందేలా చూస్తామన్నారు. సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిద్దె రవికుమార్, దారం పోతన్న, కోశాధికారి కర్క రమేష్, గౌరవాధ్యక్షుడు ఆకుల శ్రీశైలం, ముఖ్య సలహాదారుడు చిట్టి నారాయణరెడ్డి, పెద్ద కాపులు ధర్మేందర్, జగదీష్ పాల్గొన్నారు. -
ఏకచక్రేశ్వర గోశాలలో అగ్ని ప్రమాదం
● 10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు దగ్ధం ● రూ. 8 లక్షల వరకు నష్టం బోధన్రూరల్: పట్టణంలోని ఏకచక్రేశ్వర గోశాలలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో సుమారు 10 వేలకు పైగా ఎండు గడ్డికట్టలు అగ్నికి ఆహుతి అయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు. స్థానికులు, బోధన్ మున్సిపాలిటీ, పోలీసు సిబ్బంది సైతం సహాయక చర్యల్లో పాల్గొని మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. గోశాలలోని పశువులను బయటికి తరలించారు. ప్రమాదంతో సుమారు రూ.6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు నష్టం వాట్లినట్లు ఏకచక్రేశ్వర గోశాల కమిటీ అధ్యక్షుడు నేపాల్ సింగ్ తెలిపారు. ప్రమాదంపై గోశాల ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
‘అంతిమ’ కష్టాలు తొలగాలి
సాక్షి ప్రతినిఽధి, కామారెడ్డి : దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశాన వాటికలను అభివృద్ధి చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా కామారెడ్డి పట్టణ సదర్ సంఘం ప్రతినిధులు సమావేశమై వైకుంఠధామంలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చిన ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో సమావేశమైన ఆయా కుల సంఘాల ప్రతినిధులు.. వైకుంఠధామం దుస్థితిని వెలుగులోకి తీసుకువచ్చిన ‘సాక్షి’ని అభినందించారు. సొంత డబ్బులతో శ్మశాన వాటిక రూపురేఖలు మారుస్తానని ప్రకటించిన సుభాష్రెడ్డి దాతృత్వాన్ని కొనియాడిన సదర్సంఘం ప్రతినిధులు.. అభివృద్ధి పనులు చేపట్టేందుకు జిల్లా అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే పట్టణంలోని అశోక్నగర్ కాలనీ భక్త హనుమాన్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సుభాష్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇప్పటికే సుభాష్రెడ్డిని బీజేపీ కౌన్సిలర్లు అభినందించడంతో పాటు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల కష్టాలను తీర్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చే విషయంలో తాను అండగా ఉంటానని పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి ప్రకటించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నేతలు హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి శ్మశాన వాటికల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. బల్దియాలో ఉన్న టుఫిడ్కో నిధులతో అభివృద్ధి చేయడం కోసం డీపీఆర్ సిద్ధం చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి పేర్కొన్నారు. ఇలా అందరూ స్పందిస్తుండడంతో జిల్లాకేంద్రంలోని అన్ని వర్గాల ప్రజలు శ్మశాన వాటిక సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న నమ్మకంతో ఉన్నారు.కామారెడ్డి టౌన్ : పట్టణంలోని వైకుంఠధామాల అభివృద్ధికి కులమతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చేయి కలపాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో శ్మశాన వాటికల అభివృద్ధిపై సదర్ సంఘం సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో శిథిలావస్థకు చేరిన వైకుంఠధామాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సేవా కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు చేపట్టే విషయమై సదర్ సంఘం సభ్యులు చర్చించారు. సుభాష్రెడ్డికి సహకరించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఆయా కుల సంఘాల అధ్యక్షులు, ప్రముఖులు చింతల రమేష్, అశోక్ యాదవ్, రాజుగౌడ్, మోహన్రెడ్డి, భూమే ష్, కురుప మహేందర్, శ్రీకొండ నారాయణ, బెజ్జని సుదర్శన్, మనకంటి శ్రీనివాస్, నర్సల్లా మహేష్, సాయికుమార్, గుమ్మలవారి రవి, కూటాడి అంజయ్య, ప్రభాకర్, సంజీవ్, అర్జున్రావు, సుదర్శన్, రాజు, నరేష్, సంతోష్, పుల్లూరి సతీష్, రామ్రెడ్డి, మల్లేష్, మారుతి తదితరులు పాల్గొన్నారు. అందరిదీ అదే మాట సుభాష్రెడ్డికి మద్దతు ప్రకటించిన కామారెడ్డి సదర్ సంఘం పాలాభిషేకం చేసిన అశోక్నగర్ ఆర్యవైశ్య సంఘం నేతలు వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి అభినందనల వెల్లువ -
ప్రశాంతంగా నీట్
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్(నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కళాశాలలతోపాటు నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ కళాశాల యూజీ బ్లాక్లోని ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ బ్లాక్, కంఠేశ్వర్లోని పాలిటెక్నిక్ కాలేజీ, బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాక్లూర్లోని జెడ్పీ హైస్కూల్లో సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు తమ వెంట అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూఫ్, లేటెస్ట్ పాస్పోర్టు సైజ్ ఫోటో తమ వెంట తెచ్చుకుంటేనే లోనికి అనుమతించారు. అనంతరం బయోమెట్రిక్ నమోదు చేశారు. దీంతో వెంట ఫొటోలు తీసుకురాని వారు సమీపంలోని స్టూడియోలకు వెళ్లి ఫొటోలు తీసుకువచ్చారు. 3,334 మందికిగాను 3,227 మంది హాజరయ్యారు. గిరిరాజ్ కళాశాల సెంటర్ను సీపీ సాయిచైతన్య, మాక్లూర్లోని సెంటర్ను అడిషనల్ కలెక్టర్ కిరణ్కుమార్ తనిఖీ చేశారు. -
అగ్గి రేగుతోంది.. బుగ్గి చేస్తోంది
రెంజల్(బోధన్): ఉమ్మడి జిల్లాలో వరుస అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, విద్యుత్ సంబంధిత సమస్యలు, ప్రజల్లో అవగాహన లేమి ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. రైతులు వరి కొయ్యలకు నిప్పంటిస్తుండటంతో మంటలు విస్తరించి చెట్లు, చుట్టు పక్కల పంటలు బూడిదవుతున్నాయి. బీడీ, సిగరేట్ తాగేవారి నిర్లక్ష్యంతో అటవీ ప్రాంతాలు, చెరువు కట్టలు కాలిపోతున్నాయి. తాజాగా ఆదివారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో షార్ట్ సర్క్యూట్, అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రెంజల్ శివారులో ఆదివారం వరి కొయ్యలు కాలుతూ రోడ్డు పక్కన ఆరబెట్టిన ధాన్యం కుప్పకు అంటుకున్నాయి. రైతులు అప్రమత్తం కావడంతో ధాన్యం కుప్పపై కప్పిన బార్దాన్ దగ్ధమవ్వగా, ధాన్యం కాలిపోకుండా మంటలను ఆర్పివేశారు. లారీ గ్యారేజీలో.. బాన్సువాడ: పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న లారీ బాడీ బిల్డింగ్ గ్యారేజీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్యారేజీలో ఉన్న లారీ బాడీ కట్టెలకు మొదట మంటలు అంటుకొని క్షణాల్లో గ్యారేజీ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగలు, మంటలు రావడంతో స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. పంట ఉత్పత్తులు తరలించిన మరునాడే.. బాన్సువాడ రూరల్: మండలంలోని కోనాపూర్ గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. రైతులు శనివారం తమ పంట ఉత్పత్తులను తరలించగా ఆదివారం మొక్కజొన్న చేన్లకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు గమనించి మంటలు విస్తరించకుండా ఆర్పివేశారు. స్థానికంగా ఉన్న కోళ్లఫారం వరకు మంటలు విస్తరించడంతో భయాందోళనకు గురైనట్లు స్థానిక రైతులు పేర్కొన్నారు. అవాల్గావ్ చెరువు కట్టకు.. మద్నూర్: మండలంలోని అవాల్గావ్ గ్రామంలోని చెరువు కట్టకు ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. కట్ట గ్రామానికి సమీపంలో ఉండటంతో మంటలు ఇళ్ల వైపు వ్యాపిస్తుండటంతో సర్పంచ్ మన్యాబాయి గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్తో మంటలను ఆర్పివేయించారు. గుర్తు తెలియని వ్యక్తులు పొగ తాగడం ద్వారా ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో బట్టల షాపు దగ్ధం ఎల్లారెడ్డి: షార్ట్ సర్క్యూట్తో పట్టణంలోని కనెక్ట్ మెన్స్వేర్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యజమాని ఆదివారం దుకాణం తెరిచే సరికి పొగలు రావడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. -
బాలలు.. ఆధ్యాత్మిక వారధులు..
బాలబాలికలకు హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు నేర్పించాలన్న లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్లు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఎల్లారెడ్డి పట్టణంలోని దొరవారి హనుమాన్ మందిరంలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించారు. మొదట్లో వీహెచ్పీ, బజరంగ్దళ్ సభ్యులు పిల్లలకు హనుమాన్ చాలీసా, శ్లోకాలు నేర్పించారు. పలువురు చిన్నారులు వాటిని కంఠస్థం చేశారు. ఆ తర్వాత వారే ఇతరులకు నేర్పిస్తున్నారు. వీరిలో ఐదో తరగతి చదువుతున్న అద్విక్, ఎనిమిదో తరగతికి చెందిన రాంచరణ్, యువాన్ ముందున్నారు. వీరు హనుమాన్ చాలీసాను, భగవద్గీత శ్లోకాలను నేర్చుకుని తోటి పిల్లలకు నేర్పుతున్నారు. అద్విక్ తోటి వారికి నేర్పడమే కాకుండా ఇటీవల హైదరాబాద్లో జరిగిన హిందూ సమ్మేళనంలాంటి ధార్మిక కార్యక్రమాలలో హనుమాన్ చాలీసాను, భగవద్గీత శ్లోకాలను పఠించి శెభాష్ అనిపించుకున్నాడని అతడి తండ్రి ప్రదీప్ తెలిపారు. ఇతర కాలనీలలోనూ.. దొరవారి హనుమాన్ మందిరంలో ప్రారంభమైన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుండడంతో ఇతర కాలనీలతోపాటు చుట్టు పక్కలనున్న సుమారు 30 గ్రామాలకూ విస్తరించింది. పట్టణంలోని టీచర్స్ కాలనీలో ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న రాంచరణ్ తేజ్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాడు. సెలవుల్లోనూ ఈ కార్యక్రమం ఆగడం లేదు. సెలవులకు స్వగ్రామానికి వెళ్దామన్నా తమ వాడు రావడం లేదని రాంచరణ్ తేజ్ తండ్రి దుర్గయ్య తెలిపారు. తమ పిల్లలు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేస్తూ చదువుల్లోనూ ప్రతిభ చూపుతున్నారని పలువురు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.పిల్లలకు శ్లోకాలు, హనుమాన్ చాలీసాను నేర్పడం ద్వారా వారిలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించాలన్న సంకల్పంతో ఎల్లారెడ్డిలోని గుడిలో ప్రారంభమైన కార్యక్రమం.. నాలుగేళ్లుగా ప్రతి శనివారం నిరంతరాయంగా కొనసాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలకూ విస్తరించింది. పిల్లలు శ్లోకాలు, హనుమాన్ చాలీసా నేర్చుకుని తోటివారికీ నేర్పుతున్నారు. – ఎల్లారెడ్డిపట్టణంలో ప్రా రంభించిన హనుమా న్ చాలీసా పారాయణానికి ప్రతి శనివారం బాల బాలికలు స్వ చ్ఛందంగా వస్తున్నా రు. శ్లోకాలు, హనుమాన్ చాలీసా నేర్చుకుంటున్నారు. కొందరు పిల్లలు తాము నేర్చుకొని తోటి వారికి నేర్పిస్తున్నారు. రాంచరణ్, అద్వి క్, యువాన్లాంటి పిల్లలు చొరవ తీసుకుని తోటి వారికి నేర్పడం అభినందనీయం. – తులసీదాస్, జిల్లా గోరక్షా ప్రముఖ్పిల్లలకు శ్లోకాలు, హనుమాన్ చాలీసా నేర్పించాలన్న లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం దొరవారి హనుమాన్ మందిరంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాం. ప్రతీ శనివారం నిర్వహిస్తున్నాం. పిల్లలు ఆసక్తితో శ్లోకాలు నేర్చుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో పట్టణంలోని టీచర్స్ కాలనీ, సిద్దుల రామాలయంతో పాటు సమీపంలోని 30 గ్రామాలలో ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతోంది. – వినోద్ కుమార్, జిల్లా సంఘటన మంత్రి, విశ్వహిందూ పరిషత్ నాలుగేళ్లుగా హనుమాన్ చాలీసా పారాయణం తోటి పిల్లలకు నేర్పిస్తున్న పలువురు చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించిన కార్యక్రమం -
పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయి
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సదాశివనగర్, గాంధారి పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న రామక్రిష్ణయ్య, రవి కుమార్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. వారు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ స్వయంగా వారిద్దరికీ ఏఎస్సై చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు శాఖలో నిజాయితీ, నిబద్ధతతో పని చేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. -
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం
రామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, కాంగ్రెస్ నాయకులు, అధికారులు రైతులను పట్టించుకోవడంలేదని బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి ఆరోపించారు. శనివారం మోషన్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మోషన్ పూర్ ఉపసర్పంచ్ సంతోష్రెడ్డి, వార్డు సభ్యుడు సత్యరాజ్తో కలిసి పరిశీలించారు. వడ్లూరు ఎల్లారెడ్డి సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం సేకరిస్తున్నప్పటికీ కొనుగోళ్లను వేగవంతం చేయడం లేదని, రైతులు కల్లాల్లోనే ఎండలో ఎండుతున్నారని ఆరోపించారు. రైతుల ఆవేదనను సర్కార్ అర్థం చేసుకొని కొనుగోళ్లను వేగవంతం చేయాలని, కూలీలు లేనిచోట వెంటనే అధికారులు స్పందించి కూలీలను సమకూర్చి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
వరిధాన్యం కొనుగోళ్ల జాడేది..?
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండలం సింగితం గ్రామంలో వరిధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. వరి పంట నూర్పిడి చేసిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. ఆ కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యాన్ని ఆరబెట్టి కుప్పలు పోసి, విక్రయాల కోసం సిద్ధం చేశారు. అయితే సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినా ధాన్యం తూకాలకు నోచుకోవడం లేదు. హమాలీల కొరత నెలకొంది. బిహారీ హమాలీల కోసం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు ఎదురు చూస్తున్నారు. సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా తూకాలపై శ్రద్ధ చూపడం లేదు. మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ధాన్యం తూకాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తూకాలు ప్రారంభమయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
వైభవంగా రథోత్సవం
మద్నూర్(జుక్కల్): రెండు రోజుల నుంచి కొనసాగుతున్న రథోత్సవం శనివారం రాత్రి ముగిసింది. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో రథపౌర్ణమి సందర్భంగా రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. యువకులు, గ్రామస్తులు రథాన్ని లాగుతు లక్ష్మీరమణ గోవింద... వెంకట రమణ గోవింద అంటూ భక్తి పారవశ్యంలో మునిగారు. రథోత్సవంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింధే, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని మాజీ ఎమ్మెల్యే ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఉత్కంఠ భరితంగా సాగిన కుస్తీ పోటీలు రథోత్సవం సంబర్భంగా గోశాలలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఉత్కంఠగా సాగాయి. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి కుస్తీ పోటీల్లో పాల్గోన్నారు. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు ఆడపిల్లలు సైతం కుస్తీ పోటీల్లో పాల్గొన్నారు. గెలిచిన వారికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే నగదు బహుమతిని అందించారు. -
వండర్ కిడ్!
ఆ వయసులో పిల్లలు అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటుంటారు. బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తారు. కానీ కామారెడ్డికి చెందిన ఏడాదిన్నర వయసు కూడా లేని బాలుడు పునుగోటి హ్రిద్యాన్ష్రావు మాత్రం తన ప్రతిభతో ఔరా అనిపించుకుంటున్నాడు. రికార్డులు నెలకొల్పుతూ అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు. – కామారెడ్డి టౌన్జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో నివసించే పునుగోటి పావని, సాయిరామ్లకు 17 నెలల వయసున్న కుమారుడు హ్రిద్యాన్ష్రావు ఉన్నాడు. తండ్రి బేకరీ నిర్వహిస్తుండగా.. తల్లి యూపీఎస్సీ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతోంది. తమ కుమారుడిలోని అసాధారణ మేధస్సును గుర్తించిన తల్లిదండ్రులు.. అతడిని ప్రోత్సహించారు. నెలల వయసునుంచే ఎన్నో విషయాలను నేర్పించారు. అతడి ప్రతిభకు పదునుపెట్టి ప్రపంచానికి పరిచయం చేశారు. చిన్న వయసులో పెద్ద ఘనతలు హ్రిద్యాన్ష్రావు అసాధారణమైన జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. 14 నెలల వయసునుంచే అతడు ఆల్ఫాబెట్స్ను గుర్తుపట్టడమే కాకుండా వాటి ఫోనిక్ సాంగ్ను కూడా పాడగలడు. మానవ శరీర భాగాల పేర్లు, ఒకటి నుంచి 20 వరకు సంఖ్యలు, చాలా రకాల జంతువుల పేర్లు, పండ్ల పేర్లు, వివిధ వాహనాల పేర్లు.. ఇవన్నీ అతనికి కొట్టినపిండిగా మారాయి. కూర్చుకోవడం, నిల్చోవడం, నడవడం, నవ్వడం, ఏడవడం వంటి యాక్షన్ వర్డ్స్ ను కూడా గుర్తించగలడు. వారంలోని 7 రోజులు, సంవత్సరంలోని 12 నెలల పేర్లు, అలాగే సౌర కుటుంబంలోని 9 గ్రహాల పేర్లు కూడా టకాటకా చెబుతున్నాడు. ఈ అసాధారణ ప్రతిభ కారణంగా హ్రిద్యాన్ష్రావు ఇప్పటివరకు పలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నాడు. హ్రిద్యాన్ష్రావు ప్రతిభకు సంబంధించిన వీడియోను అతడి తల్లిదండ్రులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థకు పంపించగా.. వాటిని పరిశీలించి రికార్డ్స్లో చోటు కల్పించారు. ఈ బుడతడు ఇప్పటికే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు, లెజెండ్స్ ఆఫ్ భారత్ –2026 అవార్డులను కూడా కై వసం చేసుకున్నాడు. తమ కుమారుడి ప్రతిభకు గిన్నిస్ వరల్డ్ రికార్ట్స్లో చోటు కోసం ప్రయత్నిస్తున్నట్లు బాలుడి తల్లిదండ్రులు ‘సాక్షి’ తో పేర్కొన్నారు. ఏడాదిన్నర వయసులోనే అసాధారణ ప్రతిభ చూపుతున్న హ్రిద్యాన్ష్రావు ఈ బుడతడికి అక్షరాలు, గ్రహాలు, జంతువుల పేర్లు కొట్టినపిండి ఇప్పటికే ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు బాలుడి ఖాతాలో అబ్దుల్ కలాం నేషనల్ స్టార్, లెజెండ్స్ ఆఫ్ భారత్ అవార్డులు.. -
వైకుంఠ రథం అందజేత
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్ గ్రామానికి చెందిన మేడుదుల చిన్నరాజయ్య–నర్సమ్మ, కిష్టయ్యల జ్ఞాపకా ర్థం మేడుదుల లక్ష్మి శనివారం వైకుంఠ రథాన్ని విరాళంగా అందజేశారు. రూ.3.10 లక్షల వ్య యంతో రథాన్ని తయారు చేసి ఇవ్వడంతో దా త మేడుదుల లక్ష్మిని టేక్రియాల్ గ్రామస్తులు అభినందించారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్ కొత్తపల్లి లలిత, మేడుదుల రమేష్, తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: వేసవిలో విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్న కంప్యూటర్ శిక్షణను గ్రామ విద్యార్థులు, యువకులు సద్వినియో గం చేసుకోవాలని బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ అన్నారు. శనివారం రాత్రి ఆయన బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మన్నె అనిల్ సారథ్యంలో ఏర్పాటు చేసిన వేసవి కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని సర్పంచ్ మన్నె రమేష్తో కలిసి ప్రారంభించారు. గ్రామానికి చెందిన విద్యార్థులు, యువతీ, యువకులు వేసవి సెలవుల్లో ఎండల్లో తిరగకుండా శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని చిన్నారులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే ఆడుకోవాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కంప్యూటర్ శిక్షణకు పంపించాలని సూచించారు. ఉప సర్పంచ్ బస్వయ్య, గ్రామపెద్దలు శ్రీనివాస్రెడ్డి, నర్సింహులు, రాజేశ్వర్గౌడ్ తదితరులున్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): ప్రతి కార్మికుడు జీవిత బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సహాయ కార్మిక శాఖాధికారి కమ్రోద్దీన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. కార్మికుల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అమలు చేస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు. నిజాంసాగర్(జుక్కల్): గ్రామాలు, కుటుంబాల వారీగా జనగణన సర్వేను పకడ్బందీగా చేపట్టాలని మహమ్మద్నగర్ మండల తహసీల్దార్ ఎస్.లత సూచించారు. శనివారం మహమ్మద్ నగర్ జెడ్పీహెచ్ఎస్లో సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు 3 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. కుటుంబాల వారీగా వివరాలు సేకరించి రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. గిర్దావర్ పండరి, సూపర్ వైజర్లు, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు గ్రామంలో శనివారం పొచమ్మ ఆలయం వద్ద నిర్వహించిన కుస్తీపోటీలు రసవత్తరంగా సాగాయి. రథాల పున్నమి సందర్భంగా ప్రతి ఏటా కుస్తీ పోటీలు పోచమ్మ ఆలయం వద్ద నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సందర్భంగా టెంకాయ కుస్తీ నుంచి వెండి కడెం వరకు కుస్తీ పోటీలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగాయి. గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు, చివరి కుస్తీ వెండి కడెం బహూకరించినట్లు తెలిపారు. కుస్తీ పోటీలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. సర్పంచ్ తహసీన్ బేగం, తదితరులు పాల్గొన్నారు.


