Kamareddy
-
సంక్షిప్తంగా..
పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన పొట్టిగాని శంకర్కు రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా నియామక పత్రాన్ని గాంధీభవన్లో అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో అప్పగించిన పదవికి తగిన న్యాయం చేయాలని సూచించారు. అడ్డుగా వేసిన షెడ్లను తొలగించాలి భిక్కనూరు: మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న గంగమ్మ ఆలయం, మడివేలు పోచయ్య ఆలయాల ఎదుట కొందరు అక్రమంగా వేసిన షెడ్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పట్టణ గంగపుత్ర సంఘం, రజక సంఘ సభ్యులు ఆందోళన చేపట్టారు. అక్రమంగా ఏర్పాటు చేసిన షెడ్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, ఎస్సై ఆంజనేయులు, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డిలకు వేరువేరుగా వినతి పత్రాలు సమర్పించారు. గంగపుత్ర సంఘ అధ్యక్షుడు రాజయ్య, కార్యదర్శి అంజనేయులు, కోశాధికారి సత్యనారాయణ, రజక సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ ముందస్తు అరెస్ట్ భిక్కనూరు: బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ తున్కి వేణును సోమవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వేణు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులను అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభద్రతాభావం నెలకొందని ఆయన ఎద్దేవా చేశారు. మద్యపానాన్ని నిషేధిస్తూ తీర్మానం మద్నూర్(జుక్కల్): సుల్తాన్పేట్లో సోమవారం వార్డు సభ్యుల సమక్షంలో గ్రామంలో మద్యం విక్రయించరాదని తీర్మానం చేసినట్లు గ్రామ సర్పంచ్ రాజేశ్వర్గౌడ్ పేర్కొన్నారు. గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తున్నట్లు ప్రకటించి తీర్మాన ప్రతులను ఎకై ్సజ్ పోలీసులతో పాటు స్థానిక ఎస్సై మోహన్రెడ్డికి అందించామన్నారు. ఉప సర్పంచ్ బాల్రాజ్ ఉన్నారు. అగ్నివీర్కు 8 మంది ఎంపిక కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అగ్నివీర్ ఎంపికల్లో సత్తా చాటి ఏకంగా 8 మంది ఎంపికయ్యారని ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. ఎంపికై న విద్యార్థులు కార్తీక్, దత్తాద్రి, సంగమేశ్వర్, సందీప్, సతీష్, జ్ఞానేశ్వర్, శంకర్, జైపాల్లను ప్రిన్సిపల్ విజయ్కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, ఎన్సీసీ అధికారి సుధాకర్, పీడీ శ్రీనివాస్ు, ఆయా విభాగాల అధిపతులు అభినందించారు. ఫీజు బకాయిలు విడుదల చేయాలి కామారెడ్డి అర్బన్: విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఒరిజనల్ సర్టిఫికెట్లను కళాశాలల నుంచి పొందలేక ఇబ్బందులు పడుతున్నారని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు బాలు తెలిపారు. ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల మీద లేదని ఆరోపించారు. వెంటనే ఫీజు బకాయిలు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమౌతారని హెచ్చరించారు. శాంతి భద్రతలకు సహకరించాలి భిక్కనూరు: శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని భిక్కనూ ర్ సీఐ నరేష్ కోరారు. సోమవా రం కంచర్ల గ్రామ ప్రజాపతినిధులు, నేతలు ఆయన ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. గ్రామస్తులందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు. దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సర్పంచ్ అరుణ స్వామి, మాజీ సర్పంచ్ చంద్రం, నాయకులు శేఖర్ రెడ్డి, బాపురెడ్డి, అనిల్ రెడ్డి ఉన్నారు. -
కొనుగోలు కేంద్రాలకు కలిసి వెళ్దామా..?
● కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకుల సవాల్ ఎల్లారెడ్డి/లింగంపేట: కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం కుప్పలే లేవని, వెనువెంటనే కొనుగోళ్లు జరుగుతున్నాయని అంటున్న కాంగ్రెస్ నాయకులు తమ వెంట కొనుగోలు కేంద్రాలకు రావాలని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు. సోమవారం వారు ఎల్లారెడ్డి, లింగంపేట మండల కేంద్రాల్లో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యే మదన్మోహన్రావును మాజీ ఎమ్మెల్యేను ఎక్కడా దూషించలేదన్నారు. కేవలం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తరలించాలని సూచించినట్లు తెలిపారు. యాసంగి సీజన్ పూర్తయి రెండు నెలలు కావస్తున్నా ఇంకా రైతుల ధాన్యం కల్లాల్లోనే మూలుగుతున్నదన్నారు. రైతుల గోసను ప్రత్యక్షంగా చూయించినట్లు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్, బీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, ఇమ్రాన్, బర్కత్, యూనుస్, లింగంపేటలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, నరేష్, సత్యం, బండి నర్సింలు, గన్నూనాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మరక్షణ.. కర్రసాము శిక్షణ
బాన్సువాడ : వేసవి సెలవుల్లో సరదాగా గడిపేందుకు పిల్లలు ఆసక్తి చూపుతారు. కానీ, బాన్సువాడకు చెందిన ఈ చిన్నారులు మాత్రం కర్రసాములో మెలకువలు నేర్చుకుంటూ ఔరా అనిపిస్తున్నారు. ఫలితంగా శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, మానసిక ఉల్లాసం, ఆత్మస్థైర్యాన్ని పొందుతున్నారు. పిల్లలు సెలవులను వృథా చేయకుండా ఆత్మరక్షణకు తోడ్పడేలా వేద్ ఆర్యన్ అనే యువకుడు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఆర్య సమాజ్ ప్రాంగణంలో కరాటే, కర్రసాము, యోగాపై శిక్షణనిస్తున్నారు. తొలుత 12 మంది మాత్రమే రాగా ప్రస్తుతం 40 మంది చిన్నారులు శిక్షణ పొందుతున్నారు. పిల్లల ఆసక్తికి తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడయ్యింది. ఆర్యసమాజ్ ప్రాంగణంలో కరాటే మాస్టర్ వేద్ ఆర్యన్ (బ్లాక్ బెల్ట్) ఆధ్వర్యంలో కర్రసాము, కరాటే, యోగాపై ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణనిస్తున్నారు. కరాటే, యోగా శిక్షణతో చిన్నారులలో ఉత్సాహం మానసిక ఉత్తేజం, శారీరక దృఢత్వం బాన్సువాడ ఆర్యసమాజ్ ప్రాంగణంలో ఉచిత శిక్షణ -
చెట్లను పెంచడం కష్టం.. నరకడం సులభం
పిట్లం(జుక్కల్): మండలంలోని రూమ్ తండాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ పర్యావరణ వారోత్సవాలలో భాగంగా ప్రజలకు పర్యావరణ పరిరక్షణ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీట్ ఆఫీసర్ గయాజుద్దీన్ మాట్లాడుతూ.. ఒక చెట్టును పెంచాలంటే కొన్ని సంవత్సరాలు శ్రమించవలసి వస్తుందని, అదే నరికి వేయడం నిమిషాలలో పని అన్నారు. ఎవరు కూడా చెట్లను నరకరాదన్నారు. చెట్లను పెంచడం ద్వారా మానవాళి మనుగడ, పరిరక్షణ జరుగుతుందని, చెట్లను నరికి వేయడం మానివేయాలని ప్రజలను కోరారు. ప్లాస్టిక్ను నిర్మూలించి స్వచ్ఛమైన సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సర్పంచ్ ఏంసింగ్, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతలను పెంచుతాయని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. కామారెడ్డి పట్టణ, తాడ్వాయి పోలీస్స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న పండరి గౌడ్, రాజేందర్లు ఏఎస్సైలుగా పదోన్నతి పొందారు. వారు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ స్వయంగా వారిద్దరికి ఏఎస్సై చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉత్తమ సేవలందించి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గో విభాగానికి చెందిన డెలివరీ కాని పార్సిళ్లను మంగళవారం వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డి డిపో ఆవరణలో వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు వేలంలో పాల్గొనాలని సూచించారు. -
మరకత ఆత్మలింగేశ్వరాలయ నూతన కమిటీ ఏర్పాటు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మకూర్లో ఇటీవల నిర్మించిన మరకత ఆత్మలింగేశ్వరాలయ నూత న కమిటీని సోమవారం ఏర్పాటు చేశారు. చైర్మన్గా కుంట రాఘవరెడ్డి, వైస్చైర్మన్గా బాల్రెడ్డి, కార్యదర్శిగా రాజేశ్వర్రెడ్డి, కోశాధికారిగా రామాగౌడ్, ఆడిటర్గా ఉత్తమ్ రెడ్డి, సలహాదారుగా నారాయణరెడ్డి, సభ్యులుగా రమేష్, వసంత్రెడ్డి, మధు, ఈశ్వర్, సుదర్శన్, ఈశ్వరయ్య, పలంచ, నాగరాజు, సుభాన్రెడ్డి, నరేందర్రెడ్డి, రవీందర్రెడ్డిని నియమించారు. ఆలయ అభివృద్ధికి అన్నివిధాల కృషి చే స్తామని ఆలయకమిటీ సభ్యులు పేర్నొన్నారు. దోమకొండ: మండల కేంద్రం నుంచి ముత్యంపేట వరకు డబుల్ రోడ్డు బీటీ పనులు జరుగుతుండగా, ఆ పనులు మూడేళ్ల నుంచి అసంపూర్తిగా ఉన్నాయని, వెంటనే పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య ప్రజావాణిలో ఇన్చార్జి తహసీల్దార్ స్వప్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముత్యంపేట వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డుపై కంకర పోసి వదిలేశారన్నారు. దీంతో వాహనదారుల తీవ్ర అవస్థలు పడుతున్నారని, వాహనలు దెబ్బతింటున్నాయని తెలిపారు. వెంటనే కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకోతే కలెక్టర్ను కలిసి విన్నవిస్తానని తెలిపారు. వార్డు సభ్యులు బత్తిని సిద్దరాములు, కటికె శ్రీనివాస్, నాయకులు నేతుల మల్లేశం, జనార్దన్, తదితరులున్నారు. కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు న డిపినందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కో ర్టులు సోమవారం ఒకే రోజు 87 మందికి శిక్ష లు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా ఒకరికి 3, 10 మందికి 2, ఇద్దరికి ఒక రోజు జైలు శిక్షతో పాటు మొత్తం 87 మందికి రూ.99 వేలు జరిమానాలను విధించినట్లు ఎస్పీ రాజే ష్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. భిక్కనూరు: మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా సోమవారం నజీముద్దీన్ పదవీ బాధ్యతలు తీ సుకున్నారు. ఇంతకుముందు మండల రెవె న్యూ ఇన్స్పెక్టర్గా పనిచేసిన బాలయ్యకు ప్ర భుత్వం పదోన్నతి కల్పిస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రానికి బదిలీ చేసింది. ఆయన స్థానంలో మండల రెవిన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న నజీముద్దీన్కు పదోన్నతి కల్పించారు. కామారెడ్డి టౌన్ : జి ల్లాకు చెందిన ఇద్దరు అ న్నదమ్ములు అంతర్జాతీ య స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్న చింతల అలెగ్జాండర్ కుమారులు చింతల జాన్ ఆరోక్ (10), చింతల జాన్ ఆరోన్ (7)తమ అద్భుత సంగీత ప్రతిభతో ఈ ఘనత సాధించారు. హై దరాబాదుకు చెందిన ప్రముఖ సంగీత సంస్థ ‘హల్లెల్ మ్యూజిక్ స్కూల్’ వ్యవస్థాపకులు పా స్టర్ అగస్టిన్ దండింగి ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో అంతర్జాతీయ స్థాయి కీబోర్డ్ సంగీ త ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాల నుంచి సుమారు 2 వేల మందికి పైగా కీబోర్డ్ వాయిద్యకారులు పా ల్గొని ఎడతెరిపి లేకుండా గంటపాటు అద్భుతమైన స్వరాలు పలికించారు. అందులో అత్యంత ప్రతిభ కనబరిచిన 777 మంది విద్యార్థుల ను మాత్రమే గిన్నిస్ రికార్డుకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 1న హైదరాబాద్లో ‘అచీవర్స్ మీట్’ నిర్వహించా రు. సంస్థ వ్యవస్థాపకులు దండింగి చేతుల మీ దుగా ఆరోక్, ఆరోన్లు గిన్నిస్ రికార్డ్ ప్రశంసా పత్రాలు, మెడల్స్ అందుకున్నారు. -
కేంద్రీయ విద్యాలయం పనులు ప్రారంభించాలి
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని గ్రామ యువకులు డిమాండ్ చేశారు. ఈ విషయమై వారు సోమవారం తహసీల్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ ముజీబ్కు వినతిపత్రం అందించారు. మండల కేంద్రంలో కేంద్రియ విద్యాలయం 2019లో మంజూరై ఏడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు భవన నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో ఇక్కడి విద్యార్థులు నష్టపోతున్నారని వార్డు సభ్యుడు నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం మద్నూర్కు కేటాయించిన కేంద్రీయ విద్యాలయం ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు మొదలు పెట్టాలని ఆయన కోరారు. 2022లో కేంద్రీయ విద్యాలయం నిర్మాణం కోసం గ్రామానికి చెందిన యువకులు తహసీల్ కార్యాలయ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. -
గుడిసెల్లేని నియోజకవర్గమే నా లక్ష్యం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, తండాల్లో గుడిసెలు లేని ప్రాంతాలుగా మార్చడమే తన ప్రధాన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వ్యాఖ్యానించారు. సోమవారం మండల కేంద్రంతో పాటు గిద్ద గ్రామంలో కొత్తగా నిర్మించుకుని గృహప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆయన వ్యక్తిగతంగా కానుకలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గానికి అదనంగా మరో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. రామారెడ్డి గ్రామానికి వీలైనన్ని ఎక్కువ ఇళ్లను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా లబ్ధిదారులు సొంతంగా తెచ్చుకుంటున్న ఇసుక, మొరం రవాణాకు రామారెడ్డి పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారనే విషయం ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వరరావు, ఎంపీవో తిరుపతి రెడ్డి, రామారెడ్డి సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ నవీన, రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ గౌడ్ పాల్గొన్నారు. -
మక్కలను వేగంగా కొనుగోలు చేయాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మక్కలను వేగంగా కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ ఇన్చార్జి డీఎం క్రాంతి అన్నా రు. ఆమె సోమవారం తాడ్వాయి మండల కేంద్రంలో కొనసాగుతున్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా వచ్చిన మక్కలను వెంట, వెంటనే తూకం చేయాలన్నారు. ఒక వేళ వర్షం కురిస్తే రైతులు ఇబ్బందులను ఎదుర్కోవలసి వ స్తుందన్నారు. తూకం వేసిన బస్తాలను సొసైటీ నిర్వాహకులు వర్షాల నుంచి భద్రపరుచుకోవాలన్నారు. లారీలు తెప్పించి, గన్నీ బ్యాగులు సరిపడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ కపిల్రెడ్డి.. మార్క్ఫెడ్ అధికారిని కోరగా ఆమె సానుకూలంగా స్పందించారు. వైస్ చైర్మన్ ధర్మారెడ్డి, డెరెక్టర్ రాజిరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
తెలంగాణ కోసం 41 రోజులు జైల్లో ఉన్నా..
లింగంపేట(ఎల్లారెడ్డి) : ముస్తాపూర్ గ్రామానికి చెందిన నారాయణ తెలంగాణ సాధనలో భాగంగా చే సిన ఉద్యమంలో అరైస్టె 41 రోజులు జైల్లో గడి పారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడు తూ..‘‘ఇంటర్ నుంచి డిగ్రీ వరకు ఏబీవీపీలో పనిచేశా.. ప్రస్తుతం కామారెడ్డి కోర్టులో న్యాయవాదిగా ప నిచేస్తున్నాను. పదేళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. 2010లో తెలంగాణ యూనివర్సిటీలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ను అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండు చేయడంతో పా టు లాఠీ దెబ్బలు తిన్నా. అలాగే రైల్ రోకోలో భా గంగా ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో కలిసి 9 రో జులు జైల్లో పెట్టారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి రోశయ్యను సంగారెడ్డిలో అడ్డుకున్నాం. పో లీసులు అరెస్టు చేసి 32 రోజులు జైల్లో నిర్బంధించా రు. తెలంగాణ కోసం వంటా వార్పు, రాస్తారోకో లు, నిరసనలు చేసి పలుమార్లు జైలు జీవితం గడిపాం. చివరికి తెలంగాణ సాధించామని తృప్తి ప డ్డాం. కాని ఆశించిన మేరకు అభివృద్ధి జరగలేదు. యువతకు ఉద్యోగాలు రాలేదు. ఎన్నో పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా సమైక్యవాదుల నుంచి విము క్తి దొరికింది’’ అని పేర్కొన్నారు. -
జీపీ కార్మికులను రెగ్యులర్ చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం కార్మికులు ఎంపీడీవో నరేష్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల మండల అధ్యక్షుడు దత్తురాం మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీఎం గ్రామ పంచాయతీ సిబ్బందికి కనీస వేతనాలు నెలకు రూ.26 వేలు అమలు చేయాలన్నారు. గ్రీన్ చానల్ ద్వారా వేతనాలు అకౌంట్లో జమచేయాలన్నారు. కార్మికులు చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులను నియమించాలన్నారు. జీవో–51ని సవరణ చేసి మల్టీ పర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్, బిల్ కలెక్టర్లకు స్టేటస్ కల్పించాలని, కార్మికులు మరణిస్తే రూ.20 లక్షలు పరిహారం అందివ్వాలని, ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలని డిమాండు చేశారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 105 వినతులుకామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 105 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు లాంటి ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు దూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకు గురై జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. ప్రజల సౌకర్యార్ధం డివిజన్ కేంద్రాల్లో కూడా ప్రజావాణి కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. సమస్యలను పరిష్కరించాలి లేదా పరిష్కార మార్గాలు చూపాలని అధికారులకు సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్చ్.. గుర్తింపేది..?
● సతమతమవుతున్న నాయకులు ● ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పార్టీ అభివృద్ధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే నాయకులు, ప్రజాప్రతినిధులుగా అవకాశాలు ఇస్తామని ప్రతి పార్టీ చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో తమకు అంతగా ప్రాధాన్యత కాదు కదా, కనీసం గుర్తింపు కూ డా లేకుండా పోతోందని పలువురు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకులు కుమి లిపోతున్నారు. ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు దక్కడంలేదని ఆవేదన చెందుతున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేస్తున్నప్పటికీ చివరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ టిక్కెట్కు కూడా నోచుకోవడం లేదంటున్నారు. ఇక సర్పంచ్లైతే పా ర్టీలు తమను కరివేపాకులా వాడుకుని వదిలేస్తున్నా యని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో జవాబుదారీగా ఉంటూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం తాము కృషి చేస్తుంటే తమకు అందుతున్న సహకారం అంతంతమాత్రమేనని వాపోతున్నారు. కీలక నాయకులు పట్టించుకోకపోవడంతో అధికారులు సైతం తమతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు సర్పంచ్లు ఆవేదన చెందుతున్నారు. పారాచూట్ నాయకులకు పెద్దపీట ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనివారికి పారాచూట్ మాదిరిగా రాగానే ఏకంగా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇ స్తూ.. ఏళ్లతరబడి పనిచేస్తున్న తమకు కనీసం గుర్తింపు ఇవ్వకపోవడమేమిటని ఆయా పార్టీల్లోని సీనియర్లు గుర్రు గా ఉన్నారు. కేవలం డబ్బులే ప్రామాణికంగా చూసుకున్నప్పటికీ, అప్పటికప్పుడు వచ్చి టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్లతో పోలిస్తే, ఏళ్లతరబడి క్షేత్రస్థాయిలో కార్యక్రమాల కోసం తాము ఖర్చు పెట్టడంతోపాటు పార్టీకి, జనానికి అందించిన సేవలు వెలకట్టలేనివని చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులుగా రిటైర్ అయినవారికి, వ్యాపారాలు చేసుకుని వచ్చినవారికి అప్పటికప్పుడు టిక్కెట్లు ఇవ్వడమేమిటని పలు పార్టీల సీనియర్ నా యకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇ లా వచ్చినవారిలో జిల్లాలో ఒకరిద్దరు గెలిచినప్పటికీ తరువాత పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారని అంటున్నారు. పసుపు నేలగా పేరొందిన ఈ ప్రాంతంలో గెలిచిన ఓ ఎమ్మె ల్యే అయితే ఒక జాతీయ పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ కార్యకర్తలను ఏమాత్రం పట్టించుకోకపోగా, మరో జా తీయ పార్టీతో అంటకాగుతున్నారనే విమర్శలు ఉ న్నాయి. ఈ విషయమై రెండు జాతీయ పార్టీల కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. సదరు ఎమ్మెల్యే తన సొంత గ్రామంలోనూ సర్పంచ్ను గెలిపించుకోలేక చతికిలపడడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. అధికార పార్టీలో ఉండీ.. ఇక అధికార కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల పరిస్థితి మరోరకంగా ఉంది. అధికారంలో లేని సమయంలో అనేక ఇబ్బందులు పడడంతోపాటు డబ్బులు ఖర్చు పెట్టుకున్నామని, తీరా అధికారంలోకి వచ్చాక మా త్రం తగిన గుర్తింపు దక్కకపోగా, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. నామిటేటెడ్ పదవుల్లోనూ సీనియర్లమైన తమకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని, మరోవైపు తమ తమ ప్రాంతల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన చిన్న చిన్న పనులు సైతం చేయించలేని దుస్థితిలో ఉన్నామని పలువురు సీనియర్ నాయకులు తమ సన్నిహితుల వద్ద కుమిలిపోతున్నారు. మరోవైపు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి ఎమ్మెల్యే టిక్కెట్లు తెచ్చుకుని, ఓడిపోవడంతోపాటు తమకు పార్టీ పదవులు కూడా దక్కకుండా చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ సీనియర్లు ఆగ్రహంతో ఉన్నారు. -
కేసీఆర్ స్వార్థానికి ‘ప్రాణహిత’ బలి
● ప్రజలు చైతన్యవంతులైతేనే పొలాలకు సాగునీరు ● జలసాధన సమితి సమావేశంలో వక్తలుకామారెడ్డి అర్బన్: మాజీ సీఎం కేసీఆర్ స్వార్థానికి ప్రాణహిత –చేవెళ్ల పథకం బలైపోయిందని బీజేపీ నాయకుడు, శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం రీడిజైన్తో కామారెడ్డి జిల్లాకు సాగునీరు సంగతి దేవుడెరుగు... తాగునీటికీ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జలసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని కర్షక్ బీఈడీ కళాశాలలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్రెడ్డి ప్రభుత్వంలో షబ్బీర్అలీ మాట చెల్లుబాటు కావడం లేదన్నారు. ప్రజలు, రైతులు చైతన్యవంతులై పోరాడితేనే ప్రాణహిత 22వ ప్యాకేజీ పనులు పూర్తవుతాయని, ఈ ప్రాంతానికి సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. జలసాధన పోరాటానికి అవసరమైన సహకారమైనా అందిస్తానన్నారు. చిత్తశుద్ధి లేకపోతే.. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప ఇంకా రెండు దశాబ్దాలైనా ప్రాణహిత 22వ ప్యాకేజీ పనులు పూర్తి కావని ముఖ్య అతిథులు తెలంగాణ ఇంజినీర్స్ ఫోరం కన్వీనర్ లక్ష్మీనారాయణ, విశ్రాంత నీటిపారుదల శాఖ ఇంజినీర్ గోపాల్ పేర్కొన్నారు. వారు ప్రాణహిత –చేవెళ్ల ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై మాట్లాడారు. రాజకీయ వెనకబాటుతోనే కామారెడ్డికి సాగునీరు, ఉపాధి, ఉద్యోగాల్లో అన్యాయం జరుతోందని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి జలసాధన సమితి మండల కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పనుల పూర్తికి అవసరమైన రూ. 2వేల కోట్లను విడుదల చేయాలని, భూసేకరణ పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రం అందజేయాలని, ప్రభుత్వ స్పందనను బట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని తీర్మానించారు. సమావేశంలో జల సాధన సమితి జిల్లా కన్వీనర్ వెంకటరాంరెడ్డి, తెలంగాణ ఐక్యవేదిక నాయకుడు హన్మాండ్లు, న్యాయవాది జగన్నాథం, కాలమిస్ట్ వేణుగోపాల్, నాయకులు శ్రీనివాస్, తోట గంగయ్య, శంకర్, అంజయ్య, రాజేశ్వర్, పీవీఎస్ఎన్ రాజు, చంద్రశేఖర్, సిద్ధిరాములు, శ్యాంరావు, వెంకటలక్ష్మి, అనసూయ తదితరులు పాల్గొన్నారు. -
ఎవుసం.. సంక్లిష్టం!
సోమవారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2026– 8లో uఅన్నదాతపై ఏటా ఎరువుల ధరల పిడుగు పడుతూనే ఉంది. ఏడాదిలోనే కాంప్లెక్స్ ఎరువుల ధరలను ఆయా కంపెనీలు నాలుగుసార్లు పెంచాయి. దీంతో ఆరుగాలం శ్రమించి పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నకు సాగు మరింత భారంగా మారింది. – బాన్సువాడజిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 3.20 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవనుంది. 90,684 ఎకరాల్లో సోయాబీన్, 54,500 ఎకరాల్లో మక్క, 42,887 ఎకరాల్లో పత్తి, 45,500 ఎకరాల్లో కంది, 3,382 ఎకరాల్లో పెసర, 2,858 ఎకరాల్లో మినుము పంటలు సాగవనున్నాయి. ఆయా పంటలు సాగు చేయడానికి మొత్తం 1,02,325 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేశారు. దీంట్లో 50,079 మెట్రిక్ టన్నుల యూరియా, 29,316 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 11,317 మెట్రిక్ టన్నుల డీఏపీ, 6,648 మెట్రిక్ టన్నుల ఎంవోపీ ఎరువుల అవసరం ఉంటుంది. సాగు పనుల్లో అన్నదాతలు.. వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. దుక్కులు దున్ని భూములు సిద్ధం చేసుకుంటున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎరువుల కొనుగోలు కోసం ఫర్టిలైజర్ షాప్లకు వెళ్తున్న రైతులు అవాక్కవుతున్నారు. ఈసారి సీజన్కు ముందే కంపెనీలు ఎరువుల ధరలు అమాంతం పెంచడంతో ధరలను చూసి బెంబేలెత్తుతున్నారు. కాంప్లెక్స్ ఎరువుల బస్తాపై రూ. 75 నుంచి రూ. 375 వరకు ధర పెరిగిందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో ఇంధన ధరలు పెరగడంతో దున్నకాల ఖర్చులూ తడిసిమోపెడవుతాయని ఆందోళన చెందుతున్నారు. దున్నకాలూ భారమే.. రైతులు దుక్కులనుంచి నాట్లు వేసే వరకు మూడు నాలుగుసార్లు భూములు దున్నుతారు. ఒక సాలు దుక్కి దున్నడానికి గత సీజన్లో ట్రాక్టర్ కిరాయి గంటకు రూ. 1,200 తీసుకున్నారు. ఈసారి డీజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ యజమానులు కిరాయి పెంచేశారు. ప్రస్తుతం రూ. 1,300 నుంచి రూ. 1400 వరకు తీసుకుంటున్నారు.ఏడాది కాలంలో కాంప్లెక్స్ ఎరువుల ధరలను నాలుగు సార్లు పెంచారు. ప్రస్తు పరిస్థితుల్లో వాతావరణ మార్పుల కారణంగా సరైన దిగుబడులు రాక పెట్టుబడులు మీద పడుతున్నాయి. ప్రభుత్వం కంపెనీలతో మాట్లాడి పెంచిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలి. – గులెపల్లి గంగాధర్, రైతు, బాన్సువాడడిజిల్ ధరలు పెరగడంతో ట్రాక్టర్ల యజమానులు దున్నకాలకు సంబంధించి కిరాయిలు పెంచారు. ఎరువుల ధరలు కూడా పెరగడంతో వ్యవసాయం లాభం లేకుండా పోతోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం పంటలకు మద్దతు ధర ఇవ్వాలి. – బర్ల నారాయణ, రైతు, బాన్సువాడగ్రామాలలో పశు సంపద తగ్గిపోవడంతో సేంద్రియ ఎరువులకు కొరత ఏర్పడింది. దీంతో పంటలకు పోషకాలు అందించేందుకు రసాయన ఎరువుల వాడకం తప్పనిసరి అవుతోంది. పంటల సాగులో డీఏపీ, యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులను సైతం సమపాళ్లలో వాడాల్సి ఉంటుంది. మొక్కలకు కావాల్సిన పోషకాలు అందని సమయంలో రసాయన ఎరువుల రూపంలో అందిస్తేనే మంచి దిగుబడులు వస్తాయి. కంపెనీలు డీఏపీ, యూరియా మినహా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాయి. అంతర్జాతీయ సంక్షోభాలు, సరఫరా సమస్యల కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా పెరుగుతున్న ఎరువుల ధరలు బస్తాకు గరిష్టంగా రూ. 375 వరకు పెంపు రైతన్నకు భారమవుతున్న సాగు ఖర్చులు -
మంజీరలో విషాదం
● నీటమునిగి ఇద్దరు గొర్రెల కాపరుల మృతి ● మృతులు బావ బావమరుదులురుద్రూర్: గొర్రెలను కడిగేందుకు మంజీర నది వద్దకు వెళ్లిన ఇద్దరు నీటమునిగి దుర్మరణం పాలైన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్ర సమీపంలోని మంజీర నదిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోతంగల్ గ్రామానికి చెందిన కుర్మ గంగొండ (43) తన గొర్రెలను మేపేందుకు కుమారుడు సంతోష్తోపాటు బావ అయిన రెంజల్ మండలం బోర్గాం గ్రామానికి చెందిన చిక్కాల గంగారాం (50)ను వెంటబెట్టుకొని మంజీర నది ప్రాంతానికి వెళ్లాడు. గొర్రెలను కడుగుతున్న సమయంలో చిక్కాల గంగారాం ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయాడు. అతడిని కాపాడేందుకు గంగొండ వెంటనే నీటిలోకి దూకి గల్లంతయ్యాడు. దీనిని గమనించిన సంతోష్ గ్రామస్తులకు సమాచారం అందించాడు. స్థానికులు, ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గంగొండకు ఇద్దరు కుమారులు, గంగారామ్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడు గంగొండ భార్య రుక్మిణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సునీల్ తెలిపారు. బావ బావమరుదుల మృతితో రెండు గ్రామాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఒకే గ్రామంనుంచి.. అగ్నివీర్కు ఐదుగురి ఎంపిక
పిట్లం: చిన్నకొడప్గల్ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఒకేసారి అగ్నివీర్కు ఎంపికయ్యారు. గ్రామ జనాభా సుమారు 3 వేలు. గ్రామానికి చెందిన శివకుమార్, వికాస్ గౌడ్, అరవింద్, మహ్మద్ ఒమన్, హన్మండ్లు ఒకేసారి అగ్నివీర్కు ఎంపికవడం గమనార్హం. అరవింద్, హన్మండ్లు తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటుండగా.. శివకుమార్ తండ్రి టైర్ పంక్చర్ దుకాణం నిర్వహిస్తున్నారు. వికాస్ గౌడ్ తండ్రి రేషన్ డీలర్ కాగా మహ్మద్ ఒమన్ తండ్రి అటో డ్రైవర్గా పనిచేస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన ఐదుగురు అగ్నివీర్కు ఎంపికవడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి కృషి, పట్టుదలకు ప్రతిఫలం దక్కిందంటూ అభినందిస్తున్నారు. -
భూ తగాదాలతోనే రాజిరెడ్డి హత్య
● ఘాతుకానికి పాల్పడిన తండ్రీకొడుకుల రిమాండ్ ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మధుసూదన్కామారెడ్డి క్రైం : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి హత్య భూ తగాదాల నేపథ్యంలోనే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.హత్యకు పాల్పడిన అదే గ్రామానికి చెందిన మంచాల ఎల్లయ్య, అతని కొడు కు ప్రణీత్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ హత్య కేసు వివరాలను వెల్లడించారు. ఎల్లయ్యకు చెందిన 21 గుంటల భూమిని గతంలో రాజిరెడ్డి రూ.1.20 కోట్లకు ఒప్పందం చేసుకొని కొనుగోలు చేశాడు. అందుకు రూ.28 లక్షలు రాజిరెడ్డి చెల్లించాడు. ఆ డబ్బులలో నుంచి రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్లోని రాజిరెడ్డి సమీప బంధువులకు చెందిన 2 ఎకరాల భూమిని ఎల్లయ్య రూ.40 లక్షలకు కొనుగోలు చేశాడు. రాజిరెడ్డి మిగితా డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో ఎల్లయ్య కూడా తాను కొనుగోలు చేసిన భూమికి డబ్బులు చెల్లించలేదు. కొనడం, అమ్మడం రెండూ పూర్తిస్థాయిలో జరుగక గొడవలు మొదలయ్యాయి. దీంతో కక్ష పెంచుకున్న ఎల్లయ్య, అతని కుమారుడు ప్రణీత్... రాజిరెడ్డి హత్యకు పథకం వేశారు. ఈ నెల 29న సాయంత్రం రాజిరెడ్డిని మాట్లాడేందుకు రమ్మని తమ ఇంటి వెనుక పశువుల కొట్టం వద్దకు పిలిచారు. రాజిరెడ్డి రాగానే ఎల్లయ్య వెనుక నుంచి మెడపై రాడ్డుతో బలంగా కొట్టాడు. ఇద్దరూ కలిసి కిందపడిన రాజిరెడ్డి గొంతు నులుమి హత్య చేశారు.ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని భావించి మృతదేహాన్ని గోనె సంచిలో వేసి గ్రామా నికి సమీపంలోని ఓ పాడుబడిన నీళ్లు లేని బావిలోకి తీసుకువెళ్లి గుంత తీసి పాతిపెట్టారు.రాజిరెడ్డి బైక్ను గ్రామానికి దూ రంగా ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో వదిలేశారు. రాజిరెడ్డి కనిపించకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన అతని కుమారుడు రంజిత్ శనివారం దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చే శారు. ఎల్లయ్య, ప్రణీత్పై అనుమానం ఉందని ఫి ర్యాదులో పేర్కొనడంతో పోలీసులు వారిని విచా రించగా నేరం అంగీకరించారని డీఎస్పీ తెలిపారు. శనివారం అర్ధరాత్రి మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీయించి పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి అప్పగించామన్నారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సిబ్బందిని అభినందించారు. పట్టణ సీఐ నరహరి, అధికారులు పాల్గొన్నారు. -
లారీ, బైక్ ఢీ
● ప్రమాదంలో తండ్రి మృతి, కుమారుడికి తీవ్రగాయాలు పిట్లం(జుక్కల్): మండలంలోని పోతిరెడ్డిపల్లి తండా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందగా కొడుకుకి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతిరెడ్డిపల్లితండా సమీపంలోని పిట్లం–బాన్సువాడ రహదారిపై ఆదివారం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైక్ ఢీకొన్నాయి. ప్రమాదంలో బైక్ నడుపుతున్న దుర్గేశ్కు తీవ్రగాయాలు కాగా, వెనకాల కూర్చున్న తండ్రి దుర్గయ్య(62) అక్కడికక్కడే మృతి చెందాడు. దుర్గేశ్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిజామాబాద్అర్బన్ : ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒకరిపై కత్తితో దాడి చేసిన ఘటన నగరంలోని నాల్గో టౌన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్హెచ్వో సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన సోహైల్ ఖాన్కు, అతని బంధువు అయిన జావిద్ఖాన్ మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. బక్రీద్ సందర్భంగా సోహైల్ఖాన్ తన మేనమామ ఇంటికి వెళ్లగా అక్కడికి వచ్చిన జావిద్ కుమారులు ఫర్హాన్, జియాన్, అక్బర్ దాడి చేశారు. సోహైల్ఖాన్ తండ్రి సలీంఖాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
ఘనంగా బోనాల పండుగ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు కృష్ణాజీవాడిలో ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు తమ ఇండ్లలో బోనాలను వివిధ రంగులతో అందంగా అలంకరించారు. అనంతరంగా డప్పువాయిద్యాలతో బోనాలను ఆలయాల వద్ద వరకు ఊరేగింపు తీసుకెళ్లారు. అనంతరం గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు. బ్రాహ్మణపల్లిలో.. నిజాంసాగర్(జుక్కల్): బ్రాహ్మణపల్లిలో ఆదివారం గ్రామ దేవతలకు బోనాల జాతర నిర్వహించారు. గ్రామంలో బోనాలతో ఊరేగింపు ర్యాలీ చేపట్టారు. ఆలయాల చుట్టూ బోనాల ప్రదక్షణలు చేశారు. పిల్లాపాపలను సల్లంగా చూడాలని అమ్మవార్లను, గ్రామ దేవతలను వేడుకున్నారు. సర్పంచ్ గరబోయిన చంద్రకళ, గ్రామస్థులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): పొల్కంపేటలో ఆదివారం బూర్గుల పోచమ్మ, నల్ల పోచమ్మలకు ఎడ్లబండ్ల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లను కొత్త చీరలు, మామిడి తోరణాలు, రంగులు వేసి ఆకర్షణీయంగా అలంకరించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం గ్రామ దేవతల ఆలయాల చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణలు చేసి అమ్మవారి మొక్కు లు తీర్చుకున్నారు. సర్పంచ్ దివిటి రమేశ్, ఉపసర్పంచ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. కామారెడ్డిఅర్బన్: కామారెడ్డి కల్కి ఆలయం ఆధ్వర్యంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం సాయంత్రం అన్నప్రసాదం అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, శ్రీనివాస్ దంపతుల సహకారంతో భక్తులకు అన్నప్రసాదం అందజేసినట్టు బాలు తెలిపారు. ప్రతినిధులు శ్రీనివాస్, విజయ్కుమార్, సుధాకర్, వెంకన్న, రాజేందర్ పాల్గొన్నారు. -
సృజనాత్మకతను వెలికితీయడానికే..
ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఏర్పడిన నాటి నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం, వారిలోని సృజనకళను ప్రోత్సహించడానికి కవితా కార్యశాలలు, కథాకార్యశాలలను నిర్వహించాం. విద్యార్థులు రాసిన రచనలను వివిధ పత్రికలు, పోటీలకు పంపించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి బహుమతులు వచ్చేందుకు కృషి చేశాం. తెలంగాణ సారస్వత పరిషత్, తెలంగాణ సాహిత్య అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల ద్వారా విద్యార్థులు బహుమతులు పొందారు. – డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక, అధ్యక్షుడు -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
నవీపేట : మండలంలోని నాగేపూర్ గ్రామ శివారులోని బాసర రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. రెంజల్ మండల కేంద్రానికి చెందిన పోసాని(44) నాలుగు నెలలుగా కోస్లీలోని సోదరి జ్యోతి దగ్గర ఉంటుంది. నవీపేటలో పని ఉండడంతో మరిది పోశెట్టితో కలిసి ఆదివారం మధాహ్నం బైక్పై వెళ్తుండగా నాగేపూర్ సమీపంలో అదుపుతప్పిన బైక్ డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో కిందపడిన పోసాని తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోశెట్టికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలికి భర్త, పిల్లలు లేరు. తల్లిదండ్రులు చనిపోయారు. సోదరి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. గాయపడిన యువకుడు ..రుద్రూర్ : ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై సాయన్న ఆదివారం తెలిపారు. వర్ని మండలం కోటయ్య క్యాంపునకు చెందిన వడ్డేపల్లి భూమేశ్(25) శనివారం సాయంత్రం ట్రాక్టర్లో సిమెంట్ బస్తాలను తీసుకెళ్తుండగా మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీ సమీపంలో ట్రాక్టర్ టైరు పంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ప్రమాదంలో భూమేశ్ తీవ్రంగా గాయపడగా 108 అంబులెన్స్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమానాస్పదస్థితిలో ఎలక్ట్రీషియన్ ..భిక్కనూరు : మండల కేంద్రంలో ప్రయివేటు ఎలక్ట్రీషియన్ ఒకరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన బల్యాల సిద్దరాములు (46) ప్రయివేటు ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి సిద్దరాములు కనిపించడం లేదు. ఆదివారం ఆయన ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా సిద్దరాములు మృతి చెంది ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదు
అపూర్వ సమ్మేళనం నాగిరెడ్డిపేట/లింగంపేట/సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావును మాజీ ఎమ్మెల్యే సురేందర్పాటు బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం సరికాదని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట, లింగంపేట, సదాశివనగర్ మండల కేంద్రాల్లో ఆదివారం వారు మాట్లాడారు. ఎల్లారెడ్డిలో శనివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేపై అనుచిత వాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల విషయమై ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఇదివరకే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారన్నారు. నియోజకవర్గంలో ధాన్యం గతంలోకంటే ఈ యేడు అధిక దిగుబడులు రావడం వల్ల కొంతమేర జాప్యం జరుగుతోందన్నారు. రైతుల సంక్షేమం కోసమే నియోజకవర్గంలో మక్కల, జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిన ఘనత ఎమ్మెల్యేదని తెలిపారు. దీంతోపాటు ఎన్నోళ్లుగా మంజీర పరివాహక ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న ముంపు సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.2 కోట్ల 8 లక్షల నిధులను మంజూరు చేయించారని వారు పేర్కొన్నారు. సమావేశంలో నాగిరెడ్డిపేట్ కాంగ్రెస నేతలు శ్రీనివాస్రెడ్డి, ఇమామ్, నాగిరెడ్డిపేట సర్పంచ్ వెంకట్, నాయకులు సుధాకర్, సాయికుమార్, గులాం, సాయాగౌడ్, నారాయణరెడ్డి, లింగంపేట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్, సర్పంచ్ కౌడ రవీందర్, ఉపసర్పంచ్ ప్రసాద్గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సక్రూనాయక్, శెట్పల్లి సర్పంచ్ అట్టెం శ్రీనివాస్, ఎల్లమయ్య, దేవేందర్రెడ్డి, పూల్సింగ్, అర్షద్, బాలకిషన్, కాశీరాం, ఏగొండ, సదాశివనగర్ కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దిన్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి వాణి విద్యాలయం ఉన్నత పాఠశాల 2000–01 పదో తరగతి బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఉల్లాసంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థుల సందడి చేశారు. 25 ఏళ్ల నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. -
బాల సాహిత్య నిలయం
నిజామాబాద్ రూరల్ : బాలల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేది బాల సాహిత్యం. కథలు, కవితలు, గేయాలు రాయిస్తూ సృజనాత్మకతకు అక్షరరూపం కల్పించి సాహితీ లోకానికి పరిచయం చేస్తోంది ఇందూరు బాలసాహిత్య వేదిక. రెండు సంవత్సరాల క్రితం ఉగాది రోజున ప్రారంభమైన ఈ వేదిక జిల్లాలోని అనేకమంది విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ వస్తోంది. కవితారచన, కథారచనలు ఇతర సజనాత్మక ప్రక్రియల్లో విద్యార్థులకు అండగా నిలుస్తున్నది. పాఠశాలల్లో కార్యశాల ఏర్పాటు చేసి కవిత రచన, కథా రచనల్లో మెలకువలను పిల్లలకు నేర్పిస్తున్నది. పుస్తకావిష్కరణలను ప్రోత్సహిస్తున్నది. విద్యార్థులు రాసిన రచనలను వివిధ సాహితీ సంస్థల పోటీలకు పంపించి, బహుమతులు సాధించేలా మార్గదర్శనం చేస్తున్నది. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 20 పుస్తకాలు విడుదలయ్యాయి. గుండారం, తడపాకల్, ఏర్గట్ల, సిరిపూర్, నీలా, కులాస్పూర్, కాలూర్, బాచనపల్లి, వడ్డేపల్లి మొదలైన పాఠశాల విద్యార్థుల రచనలను ప్రోత్సహించి వారి ద్వారా పుస్తకాలు తీసుకువచ్చేందుకు బాల సాహిత్య వేదిక అండగా నిలుస్తున్నది. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు అధ్యక్షుడిగా డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, ప్రధాన కార్యదర్శిగా డి.ప్రవీణ్ కుమార్ శర్మ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ శారద, డాక్టర్ గంట్యాల, చింతల శ్రీనివాస్ గుప్త, శ్రీమన్నారాయణ చారి, స్వర్ణ సమత తదితరులు వ్యవహరిస్తున్నారు. కవితలంటే ఎంతో ఇష్టం.... రెండు సంవత్సరాల నుంచి కవితలు, కథలు రాస్తున్నాను. ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక కవితా, కథా కార్యశాలలో పాల్గొన్నాను. ఇప్పటి వరకు 30 కవితలు, 6 కథలు రాశాను. జాతీయ సైన్స్ఫిక్షన్ కథా పోటీలో నేను రాసిన ‘బ్రేవ్ గర్ల్ ‘అనే కథకు బహుమతి లభించింది. నాకు చాలా సంతోషం వేసింది. మా అందరికీ తెలుగు భాషా భిమానాన్ని కలిగించి, ముందుకు తీసుకెళ్తున్న ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదికకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. – కే. కృతిక, 8వ తరగతి, జాతీయస్థాయి సైన్స్ఫిక్షన్ కథా పోటీల విజేత విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీస్తున్న బాలసాహిత్య వేదిక కవితలు, కథలు, గేయాల రచనల్లో రాణిస్తున్న పిల్లలు ఇప్పటి వరకు 20 పుస్తకాల రచన -
పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఇండియన్ డెంటల్ అసోసియేషన్(ఐడీఏ) జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జీవన్ సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐడీఏ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. నిజాంసాగర్ చౌరస్తా వద్ద సిగరెట్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జీవన్ మాట్లాడుతూ పొగాకు, గుట్కా, సిగరెట్ వంటి వ్యసనాల బారిన పడి ఎంతోమంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ఈ దురలవాట్ల వల్ల ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. వెంటనే ప్రజలు ఈ అలవాట్లను మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీలో ఐడీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర ప్రతినిధి సాజిద్, జిల్లా కోశాధికారి కవిత, వైద్యులు వినోద్, ప్రవీణ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఈహెచ్ఎస్ పేరిట వేతనాల్లో కోత!
కామారెడ్డి టౌన్ : ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) కోసం ప్రభుత్వం మే నెల వేతనాల నుంచి 1.5 శాతం మేర కోత విధించింది. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ స్కీమ్కు కనీస విధివిధానాలు రూపొందించకుండా, ముందస్తు సమాచారం లేకుండా వేతనాల్లోంచి ఎలా కోత పెడతారని ప్రశ్నిస్తున్నారు. స్పష్టత కరువు.. ప్రభుత్వం ఈహెచ్ఎస్ కంట్రిబ్యూషన్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం డబ్బులు మినహాయించింది. అయితే హెల్త్ స్కీమ్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలోని ఏ ఏ ఆస్పత్రుల్లో ఈ ఆరోగ్య పథకం వర్తిస్తుంది? ఉచిత వైద్యం ఎలా అందిస్తారు? అనే విషయాలపై స్పష్టత లేదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులైన సందర్భాల్లో, తల్లిదండ్రులతోపాటు పిల్లలు ఉద్యోగులుగా ఉన్న కుటుంబాల్లో ఈ 1.5 శాతం మినహాయింపులు ఎలా వర్తింపజేస్తారని ప్రశ్నిస్తున్నారు. డ్రాయింగ్ అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండా, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమ్మతి తీసుకోకుండా ఇలా జీతాలు కట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటోంది. హెల్త్ కార్డులు జారీ చేయకుండా, అసలు ఏ హాస్పిటల్లో వైద్యం అందుతుందో చెప్పకుండా హెల్త్స్కీం కోసం వేతనాలు కోత విధించడం సరికాదు. ఉపాధ్యాయుల సమ్మతి లేకుండా కట్ చేసిన సొమ్మును వెంటనే వారి అకౌంట్లకు జమ చేయాలి. – కొంగల వెంకటి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం మండిపడుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు సమాచారం ఇవ్వకుండా కట్ చేయడంపై ఆగ్రహం వెంటనే అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్ -
నేను గీసిన చిత్రం
సాయిప్రభ, 7వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, పిట్లం, కామారెడ్డి ఎన్. సంస్థిత, 4వ తరగతి, రుద్రూర్. సింగారం నిత్యశ్రీ, 7వ తరగతి, తొర్లికొండ, నిజామాబాద్ ప్రవస్తి, 5వ తరగతి, కాకతీయ స్కూల్, నిజామాబాద్ -
ఊపిరి పోశారు..
కామారెడ్డి టౌన్ : నెలలు నిండకుండా పుట్టి, శ్వాస ఆడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవజాత శిశువుకు 108 అంబులెన్స్ సిబ్బంది పునర్జన్మనిచ్చారు. కృత్రిమ శ్వాస అందిస్తూ ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన మానస అనే గర్భిణికి జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో సాధారణ ప్రసవమైంది. అయితే, నెలలు నిండకుండానే మగ శిశు వు జన్మించాడు. పుట్టి న సమయంలో బా బు ఏడవకపోవడం, శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ నిర్జీవ స్థితికి చేరుకోవడంతో పిల్లల వైద్యులు బా బును సాధారణ స్థితి కి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నించా రు. ఫలితం లేకపోవడంతో, మెరుగైన చికి త్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే శిశువును నిజామాబాద్ తరలించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో బాబు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో ఈఎంటీ కృష్ణస్వామి సమయస్ఫూర్తితో అంబులెన్స్లోనే నిరంతరాయంగా ఆక్సిజన్తోపాటు అంబుబ్యాగ్ ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, ఐవీ ఫ్ల్యూడ్స్ ఇస్తూ బాబును సురక్షితంగా ఇంక్యుబేటర్లో ఉంచారు. పైలట్ సుదర్శన్ గౌడ్ సమయస్ఫూర్తితో వాహనాన్ని నడిపి సురక్షితంగా నిజామాబాద్ ఆస్పత్రికి చేర్చారు. బాబుకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. సమయానికి స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడిన 108 ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్ సుదర్శన్ గౌడ్ను శిశువు తండ్రి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి వైద్యుడు, సిబ్బంది సైతం అభినందించారు. ● 108 సిబ్బంది సమయస్ఫూర్తి.. శిశువుకు పునర్జన్మ ● నెలలు నిండకుండా పుట్టిన బాబు ● కృత్రిమ శ్వాసనందిస్తూ ఆస్పత్రికి తరలింపు -
జాతీయ, రాష్ట్ర స్థాయి బహుమతులు అందుకున్నా..
నేను తొమ్మిదో తరగతి నుంచి కవితలు, కథలు రాయడం ప్రారంభించా. ఇప్పటి వరకు దాదాపు 30 కవితలు, 10 కథ లు రాశాను. ఈ మధ్యనే రెండు నాటికలను కూడా రాశా ను. నేను రాసిన కవితలకు, కథలకు జాతీయ, రాష్ట్రస్థాయి బహుమతులు వచ్చాయి. ఇటీవల తెలుగు సాహిత్య అకాడమీ ప్రకటించిన నాటిక రచనల పోటీల్లో నేను రాసిన ‘పల్లెతనం‘ అనే నాటికకు ప్రత్యేక బహుమతి వచ్చింది. రచనలు చేసేందుకు గురువు కాసర్ల, ఇందూరు జిల్లా బాలసాహిత్య వేదిక ఎంతో తోడ్పాటునందించింది. భవిష్యత్తులో నేను ఇలాగే రచనలు కొనసాగిస్తాను. –ఎం.మాధురి,పదో తరగతి -
సాహిత్య బడి.. కొత్త ఒరవడి
● వాట్సాప్ వేదికగా కవితాకార్యశాల ● నవతరం కవులకు మార్గదర్శకం ● కవితారచనపై అవగాహన ● నేడు కవి సమ్మేళనం నిజామాబాద్ రూరల్ : కవిత్వం ఒక సృజనాత్మక, విలక్షణ పక్రియ. ప్రతి సాహిత్య పక్రియ ప్రత్యేకమైనదే.అలాంటి కవిత్వంపై ఈతరం కవులకు మార్గదర్శనం చేస్తోందీ‘సాహిత్య బడి’సమూహం. సాంకేతికతను అందిపుచ్చుకొని వాట్సాప్ వే దికగా నిత్యం కవితా కార్యశాలను నిర్వహిస్తోంది. రోజుకో అంశంపై.. ఇందూరు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు మద్ద కూరి సాయిబాబు, నిర్వాహకులు కాసర్ల నరేశ్రావు ప్రారంభించిన ఈ వాట్సాప్ సమూహంలో జిల్లాకు చెందిన 100 మంది కవులు ఉన్నారు. ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు సమూహసభ్యులకు, ఆ రోజు రాయాల్సిన కవితా అంశాన్ని, ప్రక్రియను సూచిస్తారు. సాయంత్రం 6 గంటలలోపు అందరూ రాయాలి. అలా రాసిన కవితలను రాత్రి 8 నుంచి 9 గంటల వరకు పెద్దలు సమీక్ష చేస్తారు. ఇలా ప్రతిరోజు కొత్త అంశంపై విభిన్న ప్రక్రియలతో ఈ కవితా కార్యశాల కొనసాగుతోంది. సోమవారం పద కవిత, మంగళవారం వర్ణీయ కవిత, బుధవారం వచన కవిత, గురువారం గేయ కవిత, శుక్రవారం చిత్ర కవిత, శనివారం మినీ కవిత, ఆదివారం స్వేచ్ఛా కవితపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రతినెల చివరి ఆదివారంలో సభ్యులంతా కలిసి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కార్యక్రమానికి ప్రముఖ కవులను అతిథులుగా ఆహ్వానించి వారితో కవితారచనలో మెళకువలను వివరిస్తున్నారు. ఉత్తమ కవితలు రాసిన వారిని సన్మానిస్తున్నారు. ఈ నెల 31న సాహిత్య బడి ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించనున్న కవి సమ్మేళనం కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తిక్ నాయక్ అతిథిగా రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. యువ కవుల రచనలను ప్రోత్సహించడం, మెళకువలను నేర్పించడం కోసమే సాహిత్య బడిని ఏర్పాటు చేసుకున్నాం. మద్దుకూరి సాయిబాబు ఆలోచన నుంచి ఆవిర్భవించిన సమూహమిది. రెండు నెలలుగా నిరాటంకంగా కొనసాగుతోంది. ఇందులో విద్యార్థులు, యువకులు, వర్తమాన కవులు చాలామంది ఉన్నారు. – డాక్టర్ కాసర్ల నరేశ్ రావు, కార్యశాల నిర్వాహకులు మంచి వేదిక.. ఈ తరంలో కవితలు రాస్తున్నవారికి, కవితారచన నేర్చుకోవడానికి మంచి వేదికగా సాహిత్య బడిని ప్రారంభించుకున్నాం. చాలామంది కవులు ఈ వేదిక ద్వారా రోజు కవిత్వం రాస్తున్నారు. వివిధ పత్రికల్లో ఈ సమూహంలోని సభ్యుల కవితలు వస్తున్నాయి. కవితలపై తర్ఫీదునిస్తూ రోజురోజుకూ యువ కవులు రాటుదేలేలా, సాహిత్య బడి పెద్దల పర్యవేక్షణలో నడుస్తున్నది. – డా.మద్దుకూరి సాయిబాబు, నిర్వహణ కమిటీ సభ్యులు -
ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కా ర్యాలయం ముందు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాజనర్సు యూనియన్ జెండాను ఆవి ష్కరించారు. రాజనర్సు మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికులందరినీ తక్షణమే పర్మినంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం రూ.26 వేలు, స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో గా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.నాయకులు దీవెన, ప్రభాకర్, రాజు, లక్ష్మి, శివ, రాజవ్వ, కాట్రాల ప్రభు పాల్గొన్నారు. దోమకొండ: మండల కేంద్రంలోని బీబీపేట రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరసయ్య మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి బీబీపేట రోడ్డులో మురుగునీరు రోడ్డుపైకి వస్తుండంతో ప్రజలు కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దోమలు, పందులు, కుక్కలు మురికి కాలువలో స్వైర విహారం చేస్తున్నాయని, ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని ఆర్అండ్బీ డీఈ వినోద్, ఏఈ రవితేజలతో కలిసి డ్రైనేజీ పనులు పరిశీలించారు. రూ.8 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించి నీరు బయటకు కనపడకుండా నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. -
ట్రాక్టర్ బోల్తా: డ్రైవర్కు గాయాలు
రుద్రూర్: మండల కేంద్రంలో ని జవహర్నగర్ కాలనీ సమీపంలో ప్రమాదవశాత్తు ట్రాక్ట ర్ బోల్తా పడగా,డ్రైవర్ తీ వ్రంగా గాయపడ్డాడు.స్థానికు లు తెలిపిన వివరాలు ఇ లా.. కోటగిరి మండలం ఎత్తొండ నుంచి సిమెంట్ బస్తాలను ట్రాక్టర్లో లోడ్ చేసుకొని డ్రైవర్ భూమేష్ శనివారం సాయంత్రం వర్ని మండలం కోట య్య క్యాంపునకు బయలుదేరాడు.జవహర్నగర్ కాలనీ వద్ద ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ భూమేష్ ట్రాలీ కింద ఇరుక్కుపోయాడు. వెంటనే స్థా నికు లు స్పందించి ట్రాలీ కింద నుంచి డ్రైవర్ను బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించారు.వారు ఘటన స్థలానికి చేరుకొని,వివరాలు సేక రించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించారు. వడ్ల లారీ బోల్తా లింగంపేట(ఎల్లారెడ్డి): నల్లమడుగు పెద్ద తండా శివారులో శనివారం వడ్ల లారీ బోల్తా పడినట్లు తండావాసులు తెలిపారు. నల్లమడుగు– గాంధారి రోడ్డులో లారీ అదుపు తప్పి పడిపోవడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ బోల్తా పడిన సమయంలో వాహనాలు, జన సంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తండావాసులు తెలిపారు. -
సంక్షిప్తం..
తిమ్మాపూర్లో వారంతపు సంత ప్రారంభం బాన్సువాడ: బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో వారంతపు సంతను శనివారం సర్పంచ్ అప్పారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల అవసరాలను తెలుసుకుని వారాంతపు సంతను ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామస్తులు కూరగాయల కోసం ప్రతీ మంగళవా రం బీర్కూర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, బస్సు సౌకర్యం లేక, ఇబ్బందులు పడుతున్నారని అన్నా రు. ప్రతి శుక్రవారం గ్రామంలో వారాంతపు సంత కొనసాగుతుందని అన్నారు. గ్రామస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. బడీడు పిల్లలను బడిలో చేర్పించాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని కోరుతూ ధర్మారావ్పేట్లో శనివారం బడిబాటలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో యోసెఫ్ మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ ఇస్తున్నామన్నారు. ప్రధానోపాధ్యాయుడు సదాశివ, వార్డు సభ్యుడు గౌసొద్దిన్, తదితరులు పాల్గొన్నారు. అమ్మమాట అంగన్వాడీ బాట నిజాంసాగర్(జుక్కల్): ఐదేళ్ల లోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని బంజపల్లి గ్రామ సర్పంచ్ ఏలె సుగుణమ్మ అన్నారు. శనివారం నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాల్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అమ్మమాట– అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీల్లో అంగన్వాడీ చిన్నారులకు యూనిఫామ్స్ అందజేశారు. సర్పంచులు ఏలె సుగుణమ్మ, అడ్డగళ్ల శారద, దఫేదార్ బాలమణి తదితరులున్నారు. మహిళా సమాఖ్య సభ్యుల ర్యాలీ గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో శనివారం ఐకేపీ ఆద్వర్యంలో మండల మహిళా సమాఖ్య సభ్యులు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు ఉల్లాస్ కార్యక్రమంపై విస్తృత ప్రచారం చేశారు. మహిళల అక్షరాస్యతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు. మహిళలందరూ విద్యావంతులు కావాలని అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐకేపీ ఏపీఎం ప్రసన్న కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కొలతల ప్రకారం పనిచేయాలి బాన్సువాడ రూరల్: ఉపాధి హామీ కూలీలు కొలతల ప్రకారం పని చేయాలని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ సూచించారు. శనివారం ఆయన బోర్లం గ్రామ శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలు, క్షేత్రసహాయకులకు పలు సూచనలు చేశారు. మండుతున్న ఎండలు, వడగాలులను దృష్టిలో ఉంచుకుని ఉదయం 6 గంటలకు పనులకు వచ్చి 10 గంటల వరకు పనులు పూర్తి చేసుకోవాలన్నారు. కొలత ప్రకారం పనిచేస్తే రోజు కూలి రూ.307 గిట్టుబాటు అవుతుందన్నారు. జీపీ కార్యదర్శి సాయికుమార్ ఉన్నారు. -
క్రైం కార్నర్
ఒకరి దారుణ హత్య కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికుల తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన బండారి రాజిరెడ్డి(56) రైతు. 15 సంవత్సరాలుగా ఆయనకు గ్రామానికి చెందిన మరో కుటుంబంతో భూతగాదాలున్నాయి. శుక్రవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు. దీంతో కుటుంబ సభ్యులు దేవునిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా రాజిరెడ్డిని కొందరు వ్యక్తులు హత్య చేసి గ్రామ శివారులోని ఓ నీళ్లు లేని పాడుబడిన బావిలో పూడ్చి పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో శనివారం రాత్రి ఆ బావి వద్ద పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. విషయం బయటకు తెలియడంతో స్థానికులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో రాజిరెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. భూ తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. విచారణ కొనసాగుతుందని, పూర్తి వివరాలు తొందర్లోనే వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. -
యూఎస్టీ కార్పొరేట్ సేవలు అభినందనీయం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో గతేడాది వరద సహాయక కార్యక్రమాల్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద విశేష సేవలందించిన హైదరాబాద్కు చెందిన యూఎస్టీ సాఫ్ట్వేర్ సంస్థ ప్రతినిధులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం అభినందించారు. యూఎస్టీ సంస్థ మానవతా సహాయం కింద 600 డిజాస్టర్ ఫ్లడ్ రిలీఫ్ కిట్లను సకాలంలో అందించినట్టు కలెక్టర్ పేర్కొన్నారు. విద్య, వైద్యం, డిజిటల్, మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో సీఎస్ఆర్ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. యూఎస్టీ అంబాసిడర్ తిరుమల విజయ్కుమార్, వలంటీర్ బృందం సభ్యులు రాధిక పెరుమాల్, షాహుల్ సయ్యద్, టీ.సురేంద్రనాథ్, ఎండ్ల భిక్షపతి తదితరులున్నారు. -
నీటిగుంతలో మునిగి యువకుడి మృతి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడి గ్రామానికి చెందిన సర్జన ప్రవీణ్(23) అనే యువకు డు నీటిగుంతలో ఈత కు దిగి మునిగి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. ప్రవీణ్ మరికొంతమంది స్నేహితులతో కలిసి శనివారం మండలంలోని అబ్దుల్లా నగర్ శివారులో గల కంకర మిషన్ క్వారీ నీటిగుంతలో స్నానం చేయడానికి వెళ్లారు. స్నేహితులు గుంతలో దిగి ఈత కొడుతుండగా ప్రవీణ్ కూడా స్నానం చేయడానికి నీటి గుంతలో దిగాడు. ప్రవీణ్కు ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన స్నేహితులు గుంతలో నుంచి ప్రవీణ్ను బయటకు తీశారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రవీణ్ను చికిత్స నిమిత్తం గ్రామంలో ఉన్న ఓ ఆర్ఎంపీ దగ్గరకు తీసుకెళ్లారు. ప్రవీణ్ను చూసిన ఆర్ఎంపీ అప్పటికే మృతిచెందాడని ని ర్ధారించారు. మృతుడి తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
నేను గీసిన చిత్రం
బి. మేదశ్రీ 9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, పిట్లం, కామారెడ్డి ఏ. గ్రీష్మంత్ చంద్ర, 10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, ఐలాపూర్, మం: నందిపేట్, జిల్లా : నిజామాబాద్ యశస్వి మహదేవ్ 9వ తరగతి, వాసవి స్పేస్ స్కూల్, మహాలక్ష్మినగర్, నిజామాబాద్ జ్ఞానదీప్, 10వ తరగతి, ఎస్.ఆర్ ప్రైమ్ స్కూల్, నిజామాబాద్ తిరునగరి అక్షిత స్వప్నిల్, నిజామాబాద్ -
మాజీ మంత్రి సంతోష్రెడ్డికి పరామర్శ
మోపాల్: మాజీ మంత్రి, సీనియర్ నాయకులు శనిగరం సంతోష్రెడ్డి, ఆయన కుమారుడు శ్రీనివాస్రెడ్డి (వాసుబాబు)ని శనివారం హైదరాబాద్లోని వారి నివాసంలో రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార, ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి చంద్రశేఖర్ గౌడ్, డీసీసీ ప్రధానకార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి పరామర్శించారు. సంతోష్రెడ్డి సతీమణి విజయారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో వారి కుటుంబీకులను ఇరువురు ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా సంతోష్రెడ్డి ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు. భిక్కనూరు: తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో పీజీ సెంటర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూ ర్వ విద్యార్థులు (1999–2001) సిల్వర్ జూబ్లీ సమ్మేళనం శనివారం నిర్వహించుకున్నారు. పీజీ సెంటర్లో ఆర్గానిక్ కెమిస్ట్రీని అభ్యసించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 22 మంది విద్యార్థులు ఈ సిల్వర్ జూబ్లీ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆనాటి బ్యాచ్ విద్యార్థులు అందరూ ఉన్నత స్థానాల్లో ఉండటం హర్షణీయమని ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, బాలుర హాస్టల్ వార్డెన్ యాలాద్రి అన్నారు. వీరందరూ ఫార్మ, ఇతర వ్యాపార రంగాలలో దేశ విదేశాల్లో స్థిరపడటం ఎంతో గర్వకారణమన్నారు. పూర్వ విద్యార్థుల కమిటీ సభ్యులు ఎంబీ.లక్ష్మణ్, పి.రాజు తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి: మండలంలో ఇందిరమ్మ ఇళ్లు, సొంత నిర్మించుకునే వారికి ఇసుక, మొరం తరలింపునకు అనుమతి లేక ఇండ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోతున్నాయని శనివారం తహసీల్దార్ ఉమాలత, ఎస్సై రాజశేఖర్కు బీజేపీ నేతలు విన్నవించారు. ఈ మేరకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. బీజేపీ మండల అధ్యక్షుడు నోముల సందీప్ మాట్లాడుతూ.. మండలంలో ఇందిరమ్మ గృహాలు, సొంతంగా కట్టుకునే ఇళ్లకు ఇసుక, మొరం తెచ్చుకుంటే పోలీసులు పట్టుకుంటున్నారని ప్రభుత్వం నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు కూడా ఇసుక మొరం తిప్పలు తప్పడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు నోముల సందీప్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గడ్డం ప్రసాద్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి ఇసాయిపేట నరేష్ పాల్గొన్నారు. -
వలంటీర్ల సేవలు అభినందనీయం
బాన్సువాడ రూరల్: కోర్టు ఖర్చులు లేకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ వలంటీర్ల సేవలు అభినందనీయమని శనివారం బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు.కామారెడ్డి జిల్లాలోనే అత్యధికంగా 100కు పైగా భార్యాభర్తలు, సీనియర్ సిటిజన్ కేసులను పరిష్కరించిన వలంటీర్లు ఎర్వాల రామకృష్ణారెడ్డి, అయ్యాల సంతోష్, ఎండీ హైమద్ హుస్సేన్, పుష్పవతి, సాయిబాబా సేవలను ఆయన కొనియాడారు. వలంటీర్లు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా సేవలు అందించడం గర్వకారణమన్నారు. కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమన్నారు. కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్, వలంటీర్లకు తన వంతు సహకారం అందిస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు. ప్రజలు చిన్నచిన్న వివాదాలపై కోర్టులను ఆశ్రయించకుండా స్థానికంగా మీడియేషన్ సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. -
స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్
కామారెడ్డి క్రైం : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ మహిళా వారోత్సవాల్లో భాగంగా స్నేహ సంఘాల ఆధ్వర్యంలో మాక్ పార్లమెంట్ను కలెక్టరేట్లో శనివారం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతలో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందించేందుకు మాక్ పార్లమెంట్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. విద్యార్థులు, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. స్నేహ కార్యక్రమం ద్వారా కిశోర, కిశోరీలలో ఆరోగ్యం, పోషకాహారం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం అక్షరాస్యత పరీక్షలు రాసిన మహిళలను కలెక్టర్ సన్మానించారు. జిల్లాలో ఉల్లాస్ ద్వారా 16,331 మంది మహిళలు అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొని పరీక్షలు రాశారని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ నరసింహ రెడ్డి, అదనపు కలెక్టర్ గిరి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, డీపీఎం శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ : సమ్మర్ క్యాంపులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి వెంకటేశ్వరగౌడ్ అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో కొనసాగుతున్న సమ్మర్ క్యాంప్ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో క్రీడకారులకు సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతిభ కనబర్చిన క్రీడకారులకు విద్య, ఉద్యోగ రంగాల్లో 2 శాతం కోట ద్వారా అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి శిక్షణ శిబిరాలు భవిష్యత్లో ఎంతో ఉపయోగకరంగా మారుతాయన్నారు. వాలీబాల్ కోచ్ సురేందర్, క్రికెట్ కోచ్ నరేశ్ తదితరులు ఉన్నారు. గోదావరి జలాలపై నేడు రౌండ్ టేబుల్ సమావేశం కామారెడ్డి అర్బన్: గోదావరి జలసాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు కామారెడ్డి కర్షక్ బీఎడ్ కళాశాలలో నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని సమితి నాయకులు కోరారు. సమావేశానికి ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, విదార్థి సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించాలని జలసాధన సమితి జిల్లా కన్వీనర్ వై.వెంకటరాంరెడ్డి, న్యాయవాది జగన్నాథం, కాలమిస్ట్ వేణుగోపాల్ అన్నారు. ఫార్మా కంపెనీ నిర్మాణాన్ని నిలిపి వేయాలి భిక్కనూరు : మండల కేంద్రం సమీపంలో కొనసాగుతున్న ఫార్మా కంపెనీ నిర్మాణ పను లను నిలిపివేయా లని భిక్కనూరుకు చెందిన యువకుడు కొ జ్జాపూరం వేణు తహసీల్దార్ సునీతకు శని వారం వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి కేవ లం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఫార్మా కంపెనీ నిర్మాణం కొనసాగుతోందని, కంపె నీ ప్రారంభమైతే దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. వెంటనే ని ర్మాణ పనులను నిలిపివేయించాలని కోరారు. వడదెబ్బతో వృద్ధుడు మృతి బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని బ్రహ్మణ గల్లీకి చెందిన జంగం నాగ్నాథ్ అప్పా (58) వడబెబ్బతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. నాగ్నాథ్ అప్పా దొరికి న పని చేసుకుంటూ ఉండేవాడు. ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి స్పృహతప్పి పడిపోవడంతో కుబుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సుభాష్నగర్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్ఎంసీ) అదనపు కమిషనర్ రవీందర్సాగర్ మల్కాజ్గిరి మున్సిపల్ కా ర్పొరేషన్కు బదిలీ అయ్యారు. రాష్ట్రంలో ము న్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థా నంలో చంద్రశేఖర్ గ్రేటర్ వరంగల్ మున్సి పల్ కార్పొరేషన్ నుంచి బదిలీపై వస్తున్నా రు. అదే విధంగా సీడీఎంఏ నుంచి డిప్యూటీ కమిషనర్గా ఖమర్అహ్మద్, సెక్రటరీగా పి.వెంకటేశ్ బదిలీపై వస్తున్నారు. -
సా..గుతుండగానే మరో విడత
● జూన్ 2 నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం సన్నద్ధం ● తొలివిడతలో జిల్లాలో నిర్మాణం పూర్తయినవి 1604 ఇళ్లు మాత్రమేజిల్లాలో ఇప్పటివరకు 12,090 ఇళ్లను కేటాయించగా, 11,592 ఇళ్లకు ముందస్తు మంజూరు లభించింది. 10,725 ఇళ్ల పనులను ప్రారంభించారు.1,604 ఇళ్ల పనులు పూర్తికాగా లబ్ధిదారులు గృహప్రవేశాలు పూర్తి చేశారు. మరో 9,121 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉండగా, 867 ఇళ్ల పనులు అసలు ప్రారంభమే కాలేదు. నిర్మాణ పనులు చివరి దశలో ఉన్న ఇళ్లను జూన్ 2వ తేదీ నాటికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది సామూహిక గృహప్రవేశాలు చేయించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తోంది. ఇప్పటివరకు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 210.57 కోట్ల నిధులను నేరుగా డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) చేసినట్లు హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి వెల్లడించారు. కామారెడ్డి టౌన్ : పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదటి విడతలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు సా..గుతుండగానే తదుపరి ముహూర్తం ఖరారైంది. తొలి విడతలో ఇళ్లు దక్కని అర్హులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చే నెల 2వ తేదీ నుంచి రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హౌసింగ్ శాఖ సమన్వయంతో ప్రభుత్వం ముమ్మర ఏ ర్పాట్లు చేస్తోంది. దీంతో జిల్లాలో మొదటి విడతగా ప్రా రంభించిన పనుల పురోగతిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల అమలులో జిల్లా ప్రస్తుతం 10వ స్థానంలో కొనసాగుతోంది. నిబంధనలు సడలిస్తేనే పురోగతి! జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నాలుగు దశల్లో ప్రభుత్వం రూ. 5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు నిర్మాణాల వేగాన్ని నియంత్రిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఇంటి నిర్మాణ విస్తీర్ణ పరిమితి (స్క్వేర్ ఫీట్) నిబంధనలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందికరంగా మారాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. పరిమితిని మరింత పెంచి, ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించుకునే వెసులుబాటు కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు మార్కెట్లో సిమెంట్, ఇనుము వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, కొన్ని ప్రాంతాల్లో బిల్లుల చెల్లింపుల్లో సాంకేతికంగా ఆలస్యం వల్ల పనులు నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. రెండో విడత మార్గదర్శకాల్లోనైనా నిబంధనలను కొంత సడలించి, బిల్లులను సకాలంలో క్లియర్ చేయాలని క్షేత్రస్థాయిలో విజ్ఞప్తులు వస్తున్నాయి. రెండో విడత అమలుకు సంబంధించి జూన్ 2వ తేదీ లోపే ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు, స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ నుంచి వచ్చే ఆదేశాలు, సూచ నలు, నిబంధనల మేరకు రెండో విడతను కూడా సజావుగా నిర్వహిస్తామని జిల్లా హౌజింగ్ అధికారులు అంటున్నారు. -
ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం
● రైతుల పక్షాన పోరాడుతాం ● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ధాన్యంసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొనుగోలుకేంద్రాల్లో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్తోకలిసి మండలంలోని మాల్తుమ్మెద, కన్నారెడ్డి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రశాంత్రెడ్డి సందర్శించారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని కొందరు రైతులు మాజీమంత్రికి చూ యించారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ధాన్యంకొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 80శాతం ధాన్యంకోనుగోళ్లు పూర్తయ్యాయని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తిభిన్నంగా ఉన్నాయన్నారు. మాల్తుమ్మెద నుంచి ఇప్పటి వరకు కేవలం 34 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని, మరో 70 నుంచి 80 లారీలకుపైగా ధాన్యంకుప్పలు ఇంకా కేంద్రంలోనే ఉండిపోయాయ న్నారు. రైతులు రాత్రింబవళ్లు ధాన్యంకుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు దిక్కుతోచని స్థితిలో ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. రాబోయే రెండురోజుల్లో లారీల సంఖ్యను పెంచి ధాన్యం తరలింపును వేగవంతం చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జనార్దన్గౌడ్, సీనియర్ నాయకులు ప్రతాప్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య, మాజీ జెడ్పీటీసీ మనోహర్రెడ్డి, గోపాల్పేట సర్పంచ్ వంశీకృష్ణాగౌడ్ తదితరులున్నారు. -
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా రహదా రి భద్రతా కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో శనివా రం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ.. రహదారుల వెంబడి ఉన్న ఆక్రమణలు ప్రమాదాలకు దారితీస్తున్న నేపథ్యంలో వాటి తొలగింపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. హైవేల వెంబడి హోటళ్లు, దాబాలకు అనధికారికంగా ఏ ర్పాటు చేసిన ప్రవేశ మార్గాలను తొలగించాలని ఆ దేశించారు. వన్యప్రాణులు ప్రమాదాలబారిన పడకుండా జాతీయ రహదారుల వెంబడి జంతువుల కోసం అండర్పాస్ల నిర్మాణాలకు ప్రతిపాదనలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా చోట్ల భద్రతా సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. మల్లుపేట, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో, మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, షెవ్రాన్ మార్కింగ్, ఇతర రహదారి భద్రతా సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా కృషి చేయాలన్నారు. సమావేశంలో రవాణా, పోలీస్, రోడ్లు భవనాలు, జాతీయ రహదారుల సంస్థ, అటవీ శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రహదారి వీరుల పథకంపై సమీక్ష రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ఉద్ధేశించిన రహదారి వీరుల (రహవీర్) పథకాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే స్పందించి బాధితులకు సాయం చేయాలని, ప్రతి ఒక్కరూ ’రహదారి వీరులు’గా మారాలని పిలుపునిచ్చారు. ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో కాపాడిన వారికి ప్రభుత్వం తరఫున రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూసేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు తీసుకోండి ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ సంగ్వాన్ -
రైతులు తొందరపడొద్దు
● ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది ● వర్షాలు కురిసిన తరువాతే విత్తనాలు వేయాలి ● ఎరువులు, విత్తనాల కొరత లేదు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి – 9లో uఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026– 8లో uకామారెడ్డి క్రైం : రైతులు ఖరీఫ్ సాగు పనులకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డిని ‘సాక్షి’ శనివారం ఇంటర్వ్యూ చేసింది. వాతావరణ పరిస్థితులు, ఎరువులు, విత్తనాలు తదితర అంశాలపై మాట్లాడిన డీఏవో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇంటర్వ్యూ సాగిందిలా.. సాక్షి : ఈ ఏడాది వర్షంపాత పరిస్థితులు ఎలా ఉంటాయి.. డీఏవో : సాధారణం కన్నా కొంత తక్కువ వర్షపాతం నమోదు కావొచ్చని భావిస్తున్నాం. ఎల్నినో ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ద్వారా తెలుస్తోంది. జిల్లాపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో చెప్పలేం. ● వర్షాలు ఆలస్యమైతే.. ● ప్రాజెక్టులు, చెరువుల, బోర్లు వంటి సాగునీటి వ సతి ఉన్న రైతులు ఎప్పటిలాగే నారుమడులు వేసుకోవచ్చు. జులై చివరి వరకు సోయా, మొక్కజొన్న, పత్తి వంటి వర్షాధారిత పంటలు సాగు చేసుకునే అ వకాశం ఉంటుంది. సకాలంలో, సమృద్ధిగా వర్షాలు కురవకపోతే రైతులు తక్కువ నీటితో సాగయ్యే మాగిజొన్న, ఆముదాలు, ఉలవలు లాంటి పంటల వైపు వెళ్లాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకపోవచ్చు. ● సాగు నీటి కొరత ఎదురైతే భూమిలో తేమశాతం ఉండేలా ఏం చేయాలి.. ● భూమిలో కర్భన శాతం సమృద్ధిగా ఉంటే తేమ ఎక్కువ కాలం ఉంటుంది. అందుకోసం పచ్చిరొట్ట ఎరువు, పశు పేడ వంటి సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. ● గతేడాది యూరియా సకాలంలో అందక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు కదా.. ● జిల్లాలో ఎరువులు, విత్తనాల కొరత లేదు. యూరియా తప్ప అన్ని రకాల ఎరువులు దుకాణాలు, సింగిల్ విండోల్లో సిద్ధంగా ఉన్నాయి. యూరియా బుకింగ్ యాప్ ఇప్పటికే ప్రారంభమైంది. ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం. ● సేంద్రియ వ్యవ సాయాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలు.. ● ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాం. జిల్లాలో ని 15 క్లస్టర్లలో క్లస్టర్కు ఒక గ్రామాన్ని ఎంపిక చేసి గ్రామానికి 125 మంది రైతులకు గాను 125 ఎకరాల భూమిని గుర్తించాం. గ్రామానికో కృషి సఖి అనే వలంటీర్లను నియమించాం. ఎంపిక చేసిన రైతులు, కృషిసఖిలకు శిక్షణ ఇచ్చాం. సేంద్రియ పద్ధతిలో ఈ ఖరీఫ్ నుంచే పంటల సాగు చేపట్టబోతున్నాం. ● భూసార పరీక్షలు చాలా తక్కువ మంది రైతులు చేయిస్తున్నారు.. ● జిల్లాలోని 407 రెవెన్యూ గ్రామాల్లో గ్రామానికి 3 చొప్పున మట్టి శాంపిళ్లను తీయించి ల్యాబ్కు పంపించాం. అలాగే బీబీపేట మండలంలో పూర్తి స్థాయిలో మట్టి శాంపిళ్లను సేకరించాం. మొత్తం 6,100 శాంపిళ్ల ఫలితాలు వచ్చాయి. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా వాడాల్సిన ఎరువులు, ఎటువంటి పంటలు సాగు చేస్తే బాగుంటుందనే అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ● ‘నిగ్రాని సమితి’ల పనితీరుపై విమర్శలు.. ● సర్పంచ్, జీపీ కార్యదర్శి, సీనియర్ రైతులతో ఈ సమితిలను జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చే శాం. విత్తనాలు, ఎరువుల లభ్యత, రైతుల అవసరాలు, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడం లేదా వ్యవసాయ అధి కారుల దృష్టికి తీసుకురావడం వంటి ప నులు చేస్తుంటారు. అన్ని గ్రామాల్లోనూ స మితిలు పని చేస్తున్నాయి. ఎలాంటి ఫిర్యా దులు లేవు. ● నకిలీ విత్తనాలను అరికట్టేందుకు చర్యలు.. ● పోలీసు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కూడిన జిల్లా, డివిజన్, మండల స్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేశాం. ఈ కమిటీలు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నకిలీ విత్తనాలు, ఎరువుల లభ్యతపై నిఘా ఉంచుతాయి. క్రమం తప్పకుండా దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నాం. నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. నాట్లు వేయడానికి అనుకూలమైన సమయం.. సకాలంలో వర్షాలు కురిస్తే దీర్ఘకాలిక రకాలకు మే చివరలో, మధ్యస్థ రకాలకు జూన్ 15 నుంచి, స్వల్పకాలిక రకాలకు జూలై ప్రారంభంలో నారు మడులు పోసుకుని నారు చేతికి రాగానే నాట్లు వేసుకోవాలి. తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్ 15048) రకాన్ని మాత్రం కచ్చితంగా జులై ప్రా రంభంలో నారు వేసుకుని నెలాఖరు లోగా నాట్లు వేయాల్సి ఉంటుంది. యూరియా వినియోగాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు.. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. మరింతగా రైతుల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు చేపడుతాం. ‘పంటల సాగు పనుల్లో తొందరవద్దు. వాతావరణ శాఖ ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉంది. జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాల కొరత లేదు. రుతుపవనాల రాక, ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్న నేపఽథ్యంలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు పనుల్లో ముందుకు వెళ్లాలి. సాగునీటి వసతులు లేని ప్రాంతాల్లో వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు విత్తాలి. భూసార పరీక్షలు, సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.’ – జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి -
ఈత సరదా..
నేను గీసిన చిత్రంపిల్లలు మీరూ పంపండి..83328 87332ఎస్.డీ. నిదాన్, 3వ తరగతి, నిజామాబాద్. టి. అమ్ములు, 9వ తరగతి, జెడ్పీహెచ్ఎస్ పిట్లం, కామారెడ్డి. ఆర్. నవతేజ్, 3వ తరగతి, ఏర్గట్ల, నిజామాబాద్. కోటగిరి ఆర్యన్ శ్రీరామ్, 5వ తరగతి, నిజామాబాద్ శ్రీ హిమతేజ, 6వ తరగతి, హనుమాన్ టేకిడి, బోధన్, నిజామాబాద్ కోటిగిరి శ్రీవల్లి 2వ తరగతి, వినాయక్నగర్,నిజామాబాద్. బాన్సువాడ రూరల్ : వేసవి తాపం పెరగడంతో ఉపశమనం కోసం యువకులు, చిన్నారులు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నా, పెద్దా తేడాలేకుండా కుటుంబసభ్యులతో కలిసి ఈత కొడుతూ సేదతీరుతున్నారు. వేసవిసెలవుల్లో అమ్మమ్మ, తాతల ఇళ్లకు వచ్చిన వారంతా స్విమ్మింగ్పూల్లో ఈత నేర్చుకుంటున్నారు. వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు
డిచ్పల్లి (నిజామాబాద్రూరల్): మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామంలో వీధి కుక్క దాడిలో ఓ బాలుడికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం వీధిలో ఆడుకుంటున్న మగ్గిడి సాయి హర్షిత్ అనే నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసి గాయపరిచింది. బాలుడి అరుపులు విన్న తల్లిదండ్రులు మగిడి పద్మ, మగ్గిడి వినోద్ వెంటనే బయటకు పరిగెత్తుకొని వచ్చి కుక్కను తరిమేయడంతో పెద్ద ప్రమా దం తప్పింది. గాయపడిన బాలుడిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అధికారులు స్పందించి కుక్కలు, కోతుల బెదడను అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మోర్తాడ్: ఏర్గట్ల మండలం బట్టాపూర్ నుంచి వెల్కటూర్కు మొరం తరలిస్తున్న ట్రాక్టర్ శుక్రవారం పెద్దవాగు వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. వెల్కటూర్కు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ పెద్దవాగు వంతెనపైకి చేరుకోగానే అదుపు తప్పి ఇంజిన్ వాగులో పడింది. గమనించిన డ్రైవర్ పల్లెపు శేఖర్కు కిందికి దూకడంతో అతని చేయి విరిగింది. ట్రాక్టర్పై ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని స్థానికులు చెబుతున్నారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని మిర్చి కంపౌండ్లో గురువారం రాత్రి భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం... మిర్చి కంపౌండ్లో రాధ అనే మహిళ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ నివసిస్తోంది. శుక్రవారం తన భర్త బాబు ఇంటికి వచ్చాడు. అదే సమయంలో రాధ బయటకు వెళ్తానని చెప్పడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో బాబు కత్తితో రాధపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని బాబును రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా సమీపంలోని హనుమాన్ ఆలయంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దొంగలు హుండీని పగులగొట్టి రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆట.. ప్రతిభచాటేలా!
● రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల కోసం సన్నద్ధం ● వేసవి సెలవులను బాల్ బ్యాడ్మింటన్ కోసం కేటాయిస్తున్న విద్యార్థులు ● రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శిక్షణ మోర్తాడ్(బాల్కొండ): విద్యార్థులకు ఆటలు ఆడాలని, అందులో ప్రతిభ చాటాలని ఉంటుంది. పా ఠశాలలు నడుస్తున్నప్పుడు పుస్తకాలతో కుస్తీ ప ట్టేందుకే సమయం సరిపోదు. అలాంటి విద్యార్థు లు వేసవి సెలవులను చక్కగా వినియోగించుకుంటున్నారు. మోర్తాడ్, తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలల విద్యార్థులు బాల్ బ్యాడ్మింటన్లో శిక్షణ పొందుతున్నారు. నిత్యం ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రతిభను కనబరుస్తామనే ఆ త్మ విశ్వాసంతో ఉన్నారు. బాల్ బాడ్మింటన్కు ఆ దరణ కరువైతున్న రోజులలో జిల్లా బాల్ బ్యా డ్మింటన్ అసోసియేషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో శిక్షణ పొందుతూ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో తమ ప్రతిభ కనబరిచారు. మరికొందరు విద్యార్థులు జాతీయ స్థాయిలోనూ రాణిస్తున్నారు. మోర్తాడ్లో బాల్ బ్యాడ్మింటన్ ఆడుతున్న విద్యార్థులు నేను జాతీయ స్థాయిలో బా ల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాను. మా గురువు ఇచ్చిన శిక్షణతో ప్రతిభ కనబరిచాం. మా జట్టు జాతీ య స్థాయిలో నెగ్గుకరావడంతోపాటు ఈ ప్రాంత విద్యార్థులు సైతం మాలాగే ప్రతిభ చూపాలని రోజూ మెలకువలు నేర్చుకుంటున్నాం. – సాయినాథ్, తిమ్మాపూర్ రోజూ సాధన చేయడంతో ఎంతో ఉత్సాహంగా ఉంది. మా గురువు ఇచ్చిన శిక్షణ, ఆయన నేర్పిన నైపుణ్యాలతో సాధన చేస్తున్నాం. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి ఈ ప్రాంత కీర్తిని ఇనుమడింప చేస్తాం. సెలవుల ను వృథా చేయకుండా రోజూ ప్రాక్టీస్ చేస్తున్నాం. – భూక్య గంగోత్రి, మోర్తాడ్ జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో మొదటిస్థానంలో నిలువడం కోసం నిత్యం సాధన చేస్తున్నాం. ఇప్పటికే మేము జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాం. జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవాలనే ఆకాంక్షతో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాం. – గగులోత్ స్వప్న, మోర్తాడ్ మా గురువు శ్యామ్ ఇచ్చిన శిక్షణతో దక్షిణ భారత స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్నాను. బాల్ బ్యాడ్మింటన్లో ప్రతిభ కనబరిచామని ఎంతో మంది మెచ్చుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ప్రాక్టీస్ చేస్తూ జాతీయస్థాయి పోటీలకు సన్నద్ధం అవుతున్నా. – భూక్యా నవీన, మోర్తాడ్ వేసవి శిబిరం లేకున్నా సొంతంగానే మా టీం ప్రాక్టిస్ చేస్తున్నాం. బాల్ బ్యాడ్మింటనన్లో జాతీయ స్థాయి గుర్తింపు పొందాలనే సంకల్పంతో సాధన చేస్తున్నాం. మా గురువు ఇచ్చిన శిక్షణను వేసవి సెలవుల్లో ప్రాక్టీస్ చేస్తున్నాం. – జి రితిక, మోర్తాడ్ -
నత్తనడకన తునికాకు సేకరణ
● జిల్లాలో 17 వందల స్టాండర్డ్ బ్యాగుల కొనుగోలు లక్ష్యం ● ఇప్పటివరకు సేకరించింది 850 బ్యాగులే..ఎల్లారెడ్డిరూరల్: జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యాన్ని సాధించడంలో అటవీశాఖ వెనకంజలో ఉంది. వానాకాలం సమీపిస్తున్నా ఇప్పటికి సగం లక్ష్యమే చేరుకుంది. కూలీలు సైతం ఆసక్తి చూపించడం లేదు. జిల్లా అటవీశాఖ పరిధిలో ఎనిమిది రేంజ్లు ఉన్నాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, జుక్కల్, నాగిరెడ్డిపేట, గాంధారి, మాచారెడ్డిలలో రేంజ్ విస్తరించి ఉంది. 50 ఆకులకు ఒక కట్ట చొప్పున చేస్తారు. వెయ్యి కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగుగా పరిగణిస్తారు. జిల్లాలో 17 వందల స్టాండర్డ్ బ్యాగుల తునికాకు సేకరణ లక్ష్యం. అయితే జిల్లాలో ఇప్పటివరకు 850 స్టాండర్డ్ బ్యాగులే సేకరించారు. తునికాకు సేకరించే కూలీలకు అటవీశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్లాల నిర్వాహకులు 50 ఆకుల కట్టకు రూ. 3.40 పైసల చొప్పున చెల్లిస్తారు. ఈ కూలి గిట్టుబాటు కాకపోవడంతో తునికాకు సేకరణకు కూలీలు ముందుకు రావడం లేదు. కాగా తునికాకు సంబంధించిన ఆకు లభ్యత తక్కువగా ఉండడం కూడా లక్ష్యాన్ని చేరుకోకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. కూలీలు తునికాకు సేకరణకన్నా ఉపాధి హామీ పథకంలో పనులు చేయడానికి మొగ్గు చూపుతున్నారని, దీంతో తునికాకు సేకరణ లక్ష్యం చేరడం ఇబ్బందిగా మారిందని అటవీ అధికారులు అంటున్నారు. త్వరలోనే లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొంటున్నారు. -
క్రైం కార్నర్
కొబ్బరి చెట్టు పైనుంచి పడి ఒకరి మృతి మాక్లూర్ : కొబ్బరి బొండాలు తెంపుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి ఒకరు మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. నవీపేట మండలం జన్నేపల్లికి చెందిన జంగయ్య(52)ను జన్నేపల్లి క్రాసింగ్లో కొబ్బరి బొండాల వ్యాపారం చేసే అబ్బూరి చిరంజీవి బొండాలు కొయ్యడానికి కూలీ ప్రాతిపదికన కొత్తపల్లి తీసుకెళ్లాడు. అక్కడ కొబ్బరి చెట్టు ఎక్కి బొండాలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డ జంగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జంగయ్య మృతి చెందినట్టు తెలిపారు. మృతుడి భార్య పెంటమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్ పరిధిలో ఉన్న లక్ష్మమ్మ గుడి వద్ద ఓ గుర్తుతెలియని వృద్ధురాలు (68) మృతి చెందింది. శుక్రవారం రాత్రి గుడి వద్ద వృద్ధురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన స్థానిక కౌన్సిలర్ గంట మధు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. మృతి చెందింది ఎవరనేది తెలియకపోవడంతో, కౌన్సిలర్ మధు దగ్గరుండి అంబులెన్స్ను పిలిపించారు. పోలీసుల సూచనల మేరకు మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు ఎవరైనా ఉంటే జిల్లా ఆస్పత్రి అధికారులు, పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని సాయినగర్–2 కాలనీలో ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.పుట్ట రాజశేఖర్(46) ఆర్థిక ఇబ్బందులు తట్టు కోలేక శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 4వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ అర్బన్ : వినాయక్నగర్లోని కల్లుబట్టిలో ఇటీవల జరిగిన ఓ ఘర్షణలో వ్యక్తిని హత్యచేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వీరిని రిమాండ్ చేయనున్నట్లు సమాచారం. ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. -
వడదెబ్బతో గొర్రెల కాపరి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కందూరి సాయన్న(65) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందినట్లు సర్పంచ్ అట్టెం శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మృతుడు మూడు రోజులుగా గొర్రెలను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. శుక్రవారం గొర్రెలను మేపుకొని ఇంటికి వచ్చిన అనంతరం ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ శ్రీనివాస్, ఏఎన్ఎం రాధిక, ఆశావర్కర్ మంజుల, జీపీవో ఆశమ్ అలీ, సాయన్న మృతదేహాన్ని పరిశీలించారు. మృతునికి భార్య ఎల్లవ్వ, కూతుళ్లు ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని చంద్రానగర్లో శుక్రవారం వడదెబ్బతో ఓ కూలీ మృతి చెందాడు. 48 సంవత్సరాల వ్యక్తి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇటీవల వరుసగా కూలీ పనులకు వెళ్తున్నాడు. వడదెబ్బతో చంద్రానగర్లోని తన ఇంటి వద్ద మృతి చెందాడు. -
కదలని ఇసుక మేటలు
జిల్లాలో గతేడాది ఆగస్టు చివరి వారంలో భారీ వర్షాలు కురిశాయి. భారీ వరదలతో పలు చెరువులు, కుంటలు తెగిపోయాయి. దీంతో లింగంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇసుక మేటలు వేశాయి. అలాగే పెద్దవాగు, పాముల వాగుకు భారీ వరద నీరు పోటెత్తడంతో పరీవాహక ప్రాంతాల్లోని పంటలు కొట్టుకుపోయాయి. వరద ప్రవాహానికి పొలాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అన్నదాతలు భారీగా నష్టపోయారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గతేడాది సెప్టెంబర్ 4న లింగంపేట మండలంలో పర్యటించి బూరుగిద్ద శివారులోని ఊట చెరువు కింద ఏర్పడిన ఇసుక మేటలను పరిశీలించారు. వెంటనే ఇసుక మేటలు తొలగించి సాగుకు యోగ్యంగా మార్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఇసుక మేటల కొలతలు వేశారు.బూరుగిద్దలో పొలంలో ఏర్పడిన ఇసుక మేటలు, పాముల వాగు పరీవాహక ప్రాంతంలో రైతులు సొంతంగా ఇసుక మేటలు తొలగించుకున్న భూమిచెరువు కింద ఎకరంనర పొలం ఉంది. బూరుగిద్ద శివారులోని సోములనయ చెరువు ఆనకట్ట తెగిపోయి అర ఎకరంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. పంట కొట్టుకుపోయి నష్టమైంది. ఇసుక మేటలతో సాగుకు పనికిరాకుండా అయ్యింది. అధికారులు ఇప్పటికీ ఇసుక తొలగించలేదు. చెరువు ఆనకట్ట తెగిపోవడంతో యాసంగిలో పంటలు వేయలేకపోయాం. వానాకాలంలోనూ బీడుగా ఉంచాల్సి వస్తోంది. – కొప్పుల సాయిలు, రైతు, బూరుగిద్దపాముల వాగు పరీవాహక ప్రాంతంలో నాలుగు ఎకరాల భూమి ఉంది. భారీ వరదల కారణంగా ఎకరంనర పొలంలో రాళ్లు, ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అధికారులు సర్వే చేశారు రెండు రోజులు పనులు చేసి వదిలేశారు. ఇసుక అలాగే ఉండడంతో యాసంగిలో ఎకరంనర భూమిని బీడుగా ఉంచాల్సి వచ్చింది. ఇసుక, రాళ్లు తొలగించడానికి రూ. 40 వేల వరకు ఖర్చయ్యాయి. – ఆకుల రాములు, రైతు, లింగంపేటజిల్లాలో గతేడాది వచ్చిన భారీ వరదలతో 288 ఎకరాలలో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అందులో 82 ఎకరాల్లో ఇసుక మేటలు తొలగించాం. మా టార్గెట్ పూర్తి కావడంతో మిగతా వాటిలో రైతులే తొలగించుకోవాలని సూచించాం. కొంత మంది రైతులు సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఇసుక మేటలు తొలగించుకున్నారు. – నరేందర్, ఏపీవో, ఉపాధి హామీ పథకంవర్షాల కారణంగా లింగంపేట మండలంలో 1,336 మంది రైతులకుగాను సంబంధించిన 1,036 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని మండల వ్యవసాయాధికారి అనిల్కుమార్ వివరించారు. కాగా తొమ్మిది నెలలు గడుస్తున్నా పాలకులు ఇప్పటికీ పరిహారం చెల్లించలేదు. వరదలతో నష్టపోయామని, పరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.మండలంలో 602 మంది రైతులకు సంబంధించిన 288 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడినట్లు అధికారుల సర్వేలో తేలిందని ఉపాధి హామీ ఏపీవో నరేందర్ తెలిపారు. అయితే అధికారులు నిబంధనల సాకుతో నామమాత్రంగా ఇసుక మేటలు తొలగించి టార్గెట్ పూర్తయ్యిందంటూ చేతులు దులుపుకున్నారు. 288 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడగా.. ఉపాధి హామీ పథకంలో 82 ఎకరాల్లో మాత్రమే తొలగించడం గమనార్హం. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయిన పలువురు రైతులు సొంతంగానే ఇసుక మేటలను తొలగించుకుంటున్నారు. ఇంకా చాలాచోట్ల అలాగే ఉన్నాయి. భారీగా ఇసుక మేటలు పెట్టిన పొలాలను రైతులు బీడుగా ఉంచుతున్నారు. ముఖ్యమంత్రి ఆదేశించినా నామమాత్రంగానే చర్యలు జిల్లాలో 288 ఎకరాల్లో ఇసుక మేటలు.. తొలగించింది 82 ఎకరాల్లోనే.. సొంతంగానే తొలగించుకుంటున్న రైతులు ఇప్పటికీ సాగుకు యోగ్యంగా మారని భూములు అన్నదాతకు అందని పంట నష్ట పరిహారం -
వైభవంగా ఆలయ వార్షికోత్సవం
బాన్సువాడ రూరల్: పులికుచ్చతండాలో శుక్రవారం శ్రీసంత్సేవాలాల్, జగదాంబ ఆలయ వార్షికోత్సవాన్ని తండావాసులు వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవానికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. తండావాసులతో కలిసి ఆలయ ప్రాంగణంలో భోగ్భండార్ నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ యువతీయువకులు డీజే నృత్యాలతో ఆకట్టుకున్నారు. గిరిజన యువకులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. ఎమ్మెల్యే పోచారంను ఘనంగా సన్మానించారు. గిరిజన నాయకుడు బద్యానాయక్, మోహన్నాయక్, సర్పంచ్ అనితా శ్రీనివాస్, తండా నాయక్ హేమ్లా, కార్యదర్శి విజయ్, నాయకులు దుప్యా, దేవిసింగ్, చోక్లా, పీర్సింగ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. ముత్యాల పోచమ్మకు బోనాలు.. పెద్దకొడప్గల్(జుక్కల్): కాటేపల్లిలో ముత్యాల పోచమ్మకు శుక్రవారం ఘనంగా బోనాలు కార్యక్రమం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఉదయం భక్తులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకొని నైవేద్యాలు సమర్పించారు. సాయంత్రం బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జలాల్పూర్ జీపీ కార్యాలయం వద్ద శుక్రవారం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన పైపులైన్ ఏర్పాటు కోసం అడిగిన వెంటనే ఎమ్మెల్యే రూ.7.5లక్షలు మంజూరు చేశారని సర్పంచ్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశామని ఆయన చెప్పారు. జీపీ కార్యదర్శి వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ వెంచర్కు నోటీసులు
కామారెడ్డిటౌన్: జిల్లా కేంద్రంలోని పాత జాతీ య రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన వెంచర్, మురుగు కాల్వపై స్లాబ్ల నిర్మాణంపై ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు స్పందించారు. ఈ వివాదాస్పద వెంచర్పై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. అనంతరం మున్సిపల్ అధికారులు హైదరాబాద్కు చెందిన వెంచర్ నిర్వాహకుడికి శుక్రవారం అధికారికంగా నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన లేఅవుట్ రాళ్లను, రోడ్లను మూడు రోజుల్లోగా స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు. లేనిపక్షంలో మున్సిపల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసుల్లో హెచ్చరించారు. బిచ్కుంద(జుక్కల్): కోర్డు కేసులలో ఉన్న కక్షిదారులు ఇద్దరూ రాజీపడి లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకోవాలని బిచ్కుంద కోర్టు న్యాయమూర్తి వినీల్ కుమార్ సూచించారు. శుక్రవారం కోర్టు ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జూన్ 20న జాతీయ లోక్ అదాలత్ ఉందని, అందులో ఇరువర్గాలు రాజీపడి కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. న్యాయవాదులు మల్లేశ్వర్, మహ్మద్, లక్ష్మణ్రావు పాల్గొన్నారు. ● రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే బీజేపీ లక్ష్యం ● పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అభయ్పాటిల్ సుభాష్నగర్(నిజామాబాద్ అర్బన్): వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యమని, పార్టీ కన్నా దేశం ముఖ్యమనే సిద్ధాంతాన్ని కార్యకర్తలు గుర్తుంచుకోవాలని, దేశసేవలో ముందు ఉండాలని బీజేపీ తెలంగాణ ఇన్చార్జి అభయ్ పాటిల్ సూచించారు. నగర శివారులోని బోర్గాం(పి) పద్మావతి గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ అధ్యక్షతన రెండు రోజులపాటు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల ప్రశిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. కార్యక్రమానికి అభయపాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై భవిష్యత్ కార్యాచరణపై పలు కీలక సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడమే ఏకై క మార్గమని స్పష్టం చేశారు. శిక్షణ తరగతులు కేవలం పార్టీని బలోపేతం చేయడానికి మాత్రమే పరిమితం కాదని, కార్యకర్తలలో క్రమశిక్షణను, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి ఉద్ధేశించినవని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యమని, ఆ దిశగా క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త అలుపెరగకుండా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం రాష్ట్ర ఇన్చార్జీని ధన్పాల్ ఘనంగా సన్మానించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. బీజేపీ భావజాలాన్ని, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. ప్రపంచంలో భారత్ గౌరవం పెరిగిందని, మోదీ నేతృత్వంలో అనేక పథకాలు గ్రామస్థాయి వరకు చేరుతున్నాయన్నారు. పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, స్రవంతిరెడ్డి, మేడపాటి ప్రకాశ్రెడ్డి, మోహన్రెడ్డి, మల్లికార్జున్రెడ్డి, భరత్రెడ్డి, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా ఓటర్ల జాబితా సవరణ
● అర్హులందరికీ ఓటు హక్కు ఉండాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఫారం–6, ఫారం–7, ఫారం–8ల వినియోగంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ విక్టర్ ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ీసీఈవో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, సవరణల ప్రక్రియపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. కొత్త ఓటరు నమోదు కోసం ఫారం–6, అర్హత లేని లేదా మరణించిన వారి పేర్ల తొలగింపునకు ఫారం–7, ఓటర్ల వివరాలలో తప్పుల సవరణలు, మార్పుల కోసం ఫారం–8ను ఉపయోగించే విధానాన్ని వివరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లాలో అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు అయ్యేలా క్షేత్రస్థాయి అధికారులు చూడాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎన్నికల విభాగం సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించిన తొలిదశ ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాకు సంబంధించి పాలిసెట్ ధ్రువపత్రాల పరిశీలన జూన్ 1 వరకు కొనసాగుతుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, పాలిసెట్ జిల్లా సమన్వయకర్త విజయ్కుమార్ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన విద్యార్థులు జూన్ 3 నుంచి 6 వరకు కళాశాలలను ఎంపిక చేసుకోవాలని, 6న సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమంలో అధికారులు అజారుద్దీన్, ఫర్హీన్ ఫాతిమా, ఆరె శ్రీలత, పవన్కుమార్, రవి, విజయ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
పాలన చేతకాకపోతే దిగిపోండి
మద్నూర్: రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలన చేతకాకపోతే రేవంత్రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోని మైథిలి ఫంక్షన్ హాల్లో జుక్కల్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడు తూ ఖరీఫ్ సమీపిస్తున్నా ఇప్పటికీ పంటల కొనుగోళ్లు పూర్తికాకపోవడం దారుణమన్నారు. పంట కొనుగోళ్లు చేతకాక కేంద్రం మీద నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జొన్న పంటను తక్షణమే కొనాలని, లేకపోతే జుక్కల్లో ధర్నా చేసి ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలపై ఉందన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలని నాయకులకు సూచించారు. బూత్ లెవల్ సభ్యులు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉందో వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సభ్యులు సర్ సర్వేను పరిశీలించాలని మాజీ ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి వీజీ గౌడ్ పార్టీ నాయకులను కోరారు. బోగస్, డూప్లికేట్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని, అర్హుల ఓట్లు ఓటరు జాబితాలో ఉండేలా బీఆర్ఎస్ సమన్వయ కమిటి సభ్యులు చూడాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్ గుప్తా, నల్లమడుగు సురేందర్, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు తదితరులు పాల్గొన్నారు. జొన్నలు కొనకుంటే జుక్కల్ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మద్నూర్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సభ -
రైతులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు
నాగిరెడ్డిపేట: ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఎల్లారెడ్డి మా జీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పేర్కొన్నారు. గోలిలింగాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించి, తూకం వేసి రైస్మిల్లుకు తరలించడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాజాల మాట్లాడుతూ ధాన్యం తరలింపులో ప్రభు త్వం సరైన చర్యలు చేపట్టకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతు న్నార న్నారు. గత ప్రభుత్వ హయాంలో సరిపడా లారీలు అందుబాటులో లేకపోతే ఆర్టీసీ కార్గో బస్సుల్లో ధాన్యం తరలించామన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ధాన్యం సేకరణను ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రెండు రోజులలో సరైన చర్యలు చేపట్టకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య, మాజీ జెడ్పీటీసీ మనోహర్రెడ్డి, సర్పంచ్లు వంశీగౌడ్, మహేందర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
వివాదాల దారిలో..
జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చేస్తున్నారు. అంతేకాకుండా వెంచర్లోకి వెళ్లడానికి దారి కోసం వరద కాలువపై రెండు స్లాబ్లు నిర్మించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై విచారణ జరిపి నోటీసులు ఇవ్వడానికి బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. – కామారెడ్డి టౌన్పాత జాతీయ రహదారి పక్కన గల కస్తూర్బా ఆస్పత్రి వెనక భాగంలో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అనుమతుల కోసం మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నా.. నిబంధనలకు విరుద్ధంగా ఉందన్న కారణంతో అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రధానంగా కామారెడ్డి పెద్దచెరువు వరద కాలువ పక్కన ఉన్న ఈ వెంచర్కు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం ఇక్కడ 60 ఫీట్ల రోడ్లు లేవని అధికారులు గుర్తించారు. చెత్త డంప్ చేసి.. అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతదిగా ప్రచారం జరుగుతోన్న ఈ వెంచర్ లోపలికి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో పెద్దచెరువు నుంచి బుర్రమత్తడి వైపు వెళ్లే ప్రధాన వరద కాల్వ (బడా మురుగు కాలువ)పై రెండు స్లాబ్లను నిర్మించారు. రహదారి పక్కన ఉన్న కల్వర్టు వద్ద మురుగు కాలువ నీరు వెంచర్ వైపు రాకుండా చెత్త డంప్ చేసి, కాలువను మూసివేశారని వెంచర్ నిర్వాహకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలాగే ఉంటే రాబోయే వర్షాకాలంలో ఈ కాలువ ప్రవాహం సాగక, నీరంతా వెనక్కి తన్ని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు సమీప ప్రాంతాలు మళ్లీ వరద ముంపునకు గురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు సంబంధించిన ఈ వరద కాలువపై స్లాబ్ల అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఓ కౌన్సిలర్ మార్చి 30న కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇది అక్రమ నిర్మాణమని, అధికారులు చర్యలు తీసుకోకుంటే వెంచర్ వద్ద, స్లాబ్ల వద్ద ధర్నా చేస్తానని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి మూడు రోజుల క్రితం హెచ్చరించారు. ఈ నిర్మాణంపై జిల్లా ఉన్నతాధికారులు సైతం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. మున్సిపాల్ టౌన్ ప్లానింగ్ అధికారులు దీనిపై విచారణ చేపట్టి, నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వర్షాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఈ వివాదం పట్టణంలో హాట్ టాపిక్గా మారింది.ఈ వెంచర్కు దారి కోసం వరద కాలువపై స్లాబ్ వేయడానికి ఎలాంటి అనుమతులు లేవు. ఇరిగేషన్ శాఖ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాగా స్లాబ్ విషయమై నిర్వాహకులు కోర్టుకు వెళ్లారని తెలిసింది. వెంచర్ నిబంధనల పరిధిలో లేనందున విచారణ చేపడుతున్నాం. ఇప్పటికై తే అనుమతి ఇవ్వలేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేస్తాం. – వినీత్, టీపీవో, కామారెడ్డి మున్సిపల్ కామారెడ్డిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ చెరువు వరద కాలువపై స్లాబ్ల నిర్మాణం చర్యలు తీసుకుంటామంటున్న బల్దియా అధికారులు -
ధాన్యం తడవకుండా కప్పి ఉంచాలి
● చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్మాచారెడ్డి: వర్షాలు కురిసినా వడ్లు తడవకుండా టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన లచ్చపేటలోని రైస్మిల్లును, లక్ష్మీరావులపల్లిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వడ్లు తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు కలగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, చివరి గింజ వరకు కొనుగోలు జరిగేలా సరైన కార్యాచరణ ప్రకారం అధికారులు పనిచేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు వరి కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ట్యాబ్ ఎంట్రీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, తహసీల్దార్ సరళ, సంబంధిత శాఖల అధికారులు, మిల్ యజమానులు, రైతులు ఉన్నారు.కామారెడ్డి క్రైం: జిల్లాలో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈనెల 27న వేకువజామున కురిసిన వర్షంతో రామారెడ్డి, దోమకొండ, సదాశివనగర్, మాచారెడ్డి మండలాల పరిధిలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోయాయని పేర్కొన్నారు. మొత్తం 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం వర్షం ప్రభావానికి గురైందని అధికారులు గుర్తించి, బాయిల్డ్ రైస్మిల్లులకు తరలించారని వివరించారు. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 914.41 కోట్ల విలువైన 3,82,760 మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించామని, 3,27,996 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.783.57 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. 86 శాతం చెల్లింపులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. -
సంపదపై కన్నేసి.. కిడ్నాప్నకు స్కెచ్చేసి..
● ఈజీ మనీ కోసం అడ్డదారి.. ● నేర కుట్రను భగ్నం చేసిన పోలీసులు ● తుపాకీ, రబ్బర్ బుల్లెట్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: ఆ వ్యాపారి వద్ద అప్పులు తీసుకున్నారు. వాటిని తీర్చలేక అతడి సంపదపైనే కన్నేశారు. ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం కిడ్నాప్నకు స్కెచ్చేశారు. ఈ కుట్రను పోలీసులు ఛేదించడంతో కథ సుఖాంతమైంది. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన బూస శ్రీనివాస్ అనే వ్యాపారవేత్తకు చిట్యాలకు చెందిన నిట్టు నర్సింగరావు, సంతాయిపేట్కు చెందిన సూర స్వామి అలియాస్ ఒడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, చిట్యాలకు చెందిన సూరం స్వామితో చాలాకాలంగా పరిచయం ఉంది. వీరి మధ్య గతంలో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. బూస శ్రీనివాస్ వద్ద భారీ మొత్తంలో అప్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. సదరు వ్యాపారి వద్ద పెద్ద మొత్తంలో సంపద ఉన్నట్లు భావించి ఈజీ మనీ కోసం తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నారు. వ్యాపారి బూస శ్రీనివాస్ను కిడ్నాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేయడానికి ప్లాన్ వేశారు. తుపాకీ కొనుగోలు చేయడానికి మహారాష్ట్రలోని నాయేగావ్కు చెందిన అజయ్ హన్మంతరావు గోంగపాలే, వైభవ్ ప్రకాష్ బరాడేవార్లను సంప్రదించారు. ఈనెల 12న నర్సింగరావు, ఒడ్డె స్వామి మహారాష్ట్రకు వెళ్లి అజయ్, వైభవ్ల ద్వారా నాయేగావ్కు చెందిన మారుతి గోకేను కలిశారు. రూ. 30 వేలకు తుపాకీ కొనుగోలుకు ఒప్పందం చేసుకుని రూ. 27 వేలు చెల్లించారు. ఈనెల 27 న మారుతి గోకే తుపాకీని వైభవ్ ప్రకాశ్ బరాడేవార్, అజయ్ హన్మంతరావ్ గోంగపాలేలకు అందించాడు. వారు దానిని తీసుకుని కృష్ణాజీవాడీ గ్రామ సమీపానికి వచ్చారు.కృష్ణాజీవాడి శివాలయం సమీపంలో కొంతమంది అనుమానితులు ఏదో నేరం చేయడానికి కుట్ర పన్నుతున్నారనే సమాచారం రావడంతో తాడ్వాయి ఎస్సై నరేశ్, సిబ్బంది బుధవారం తనిఖీలు చేపట్టారు. పోలీసుల రాకను గమనించి అక్కడ నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా వెంబడించి ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నిట్టు నర్సింగరావు, ఒడ్డె స్వామి, పులి ప్రశాంత్ గౌడ్, సూరం స్వామి, అజయ్ హన్మంతరావు గోంగపాలే, వైభవ్ ప్రకాష్ బరాడేవార్లను విచారించగా కిడ్నాప్ ప్లాన్ బయటపడింది. వారి వద్ద నుంచి ఒక నల్ల రంగు తుపాకీ, ఆరు రబ్బరు బుల్లెట్లు, 2 ఎయిర్ రైఫిల్ పెల్లెట్ బాక్సులు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ధనికుడైన బూస శ్రీనివాస్ను కిడ్నాప్ చేసి అతడి కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయాలని కుట్ర పన్నినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. కుట్రకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రమేయం ఉన్న వ్యక్తులు అందరినీ గుర్తించడానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు పర్యవేక్షణలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, తాడ్వాయి, సదాశివనగర్ ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది శ్రీనివాస్, యాదగిరి, సీసీఎస్ పీసీలు మైసయ్య, కిషన్ తదితరులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించామన్నారు. ఈ కేసులో మరో నిందితుడైన మారుతి గోకే పరారీలో ఉన్నాడన్నారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. -
కాంటా చేసిన ధాన్యాన్ని తరలించాలి
ఎల్లారెడ్డి: కాంటా చేసిన ధాన్యం బస్తాలను వెంటనే తరలించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సూచించారు. మండలంలోని హాజీపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి, రైతుల సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ధాన్యం కుప్పలు పోసి నెల రోజులు కావస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ధాన్యం కాంటాలు కాలేదన్నారు. కాంటా అయిన సంచులు తరలించేందుకు లారీల కొరత ఉన్నదని, దీనిని సత్వరమే అధికారులు పరిష్కరించాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముదాం సాయిలు, జలందర్రెడ్డి, నర్సింలు తదితరులున్నారు. -
ఘనంగా వీర్ సావర్కర్ జయంతి
సదాశివనగర్: లింగంపల్లి గ్రామంలో గురువారం స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి వేడుకలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా సావర్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సామాజిక సమరసత వేదిక జిల్లా అధ్యక్షుడు రాజేందర్ రావు మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమరంలో అపార ధైర్యసాహసాలు ప్రదర్శించిన మహనీయుడు సావర్కర్ అని కొనియాడారు. యువత దేశ భక్తి, క్రమశిక్షణ, సేవాభావంతో ముందుకు సాగాలన్నారు. ఉప సర్పంచ్ ఎడ్ల గంగారాం, మాజీ ఉప సర్పంచ్ దామోదర్రావు, నాయకులు రామారావు, భాస్కర్ రావు, గోపాల్రావు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: బాలలతో బలవంతంగా పనులు చేయించే వారిపై 1098 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని బాలల హక్కుల ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్ కోరారు. బాల కార్మికులకు విముక్తి కల్పించడానికి ప్రతిఒక్కరు సహకారం అందించాలని ఓ ప్రకటనలో కోరారు. డొంకేశ్వర్(ఆర్మూర్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా అందించే పింఛన్ డబ్బుల కోసం పోస్టాఫీసులు, గ్రామ పంచాయతీల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే అవస్థలకు త్వరలోనే తెరపడనుంది. గ్రామీణప్రాంత లబ్ధిదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం పింఛన్ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళా, బీడీ కార్మికులు, చేనేత, కల్లుగీత కార్మికులు కలిపి మొత్తం 2.61లక్షల మంది పింఛన్లు పొందేవారున్నారు. ప్రతినెలా జిల్లాలో రూ.56.35 కోట్ల నిధులు పంపిణీ చేస్తున్నారు. అయితే, పట్టణ ప్రాంతాలకు చెందిన 58,639మంది లబ్ధిదారులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో రూ.12.80 కోట్ల వరకు జమ చేస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్నాయి. మిగిలిన 2,02,889 మంది గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు పోస్టాఫీసులు, జీపీ కార్యాలయల వద్ద నగదును పంపిణీ చేస్తున్నారు. పోస్టాఫీసు సిబ్బంది వచ్చి డబ్బులు పంచే క్రమంలో లబ్ధిదారులు క్యూ కట్టడం, నెట్వర్క్ సమస్యలతో ఆలస్యం అవుతోంది. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి పోవడంతో గ్రామీణ లబ్ధిదారులకు సైతం బ్యాంకు ఖాతాలోనే డబ్బులు వేయాలని నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల నంబర్లను సేకరించి ఆన్లైన్ చేయనున్నారు. దీనికి సంబంధించి ఆదేశాలు రానున్నట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పేర్కొటున్నారు. -
ఖరీఫ్కు సన్నద్ధం!
జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు కింద బాన్సువాడ డివిజన్ పరిధిలో సుమారు 31 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ప్రాంతంలో ముందస్తు వరినాట్లు పడతాయి. దీంతో పాటు నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం, నిజాంసాగర్ మండలంలోని సింగితం, జుక్కల్లోని కౌలాన్నాలా, ఎల్లారెడ్డి మండలంలోని కల్యాణి ప్రాజెక్టుల ఆయకట్టు విస్తీర్ణం కూడా గణనీయంగానే ఉంటుంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా చెరువులు, వ్యవసాయ బోరుబావుల కింద వరి సాగు చేస్తారు. వర్షాధారంగా ఆరుతడి పంటలు వేస్తారు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు.. విత్తనాలు, ఎరువులను కొనేందుకుగాను ఫర్టిలైజర్ దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశాలు ఉండడంతో ముందుగానే కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలని భావిస్తున్నారు. విత్తనాలు.. 81,200 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 28,140 క్వింటాళ్ల సోయాబీన్, 4,480 క్వింటాళ్ల మక్క, 389.25 క్వింటాళ్ల పత్తి, 1,780 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని అంచనా వేసిన వ్యవసాయ అధికారులు.. కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 5.59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సాగుకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చూస్తాం. రైతులు పంటల సాగు విషయంలో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. మంచి దిగుబడులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. – మోహన్రెడ్డి, డీఏవో, కామారెడ్డిఖరీఫ్ సమీపిస్తున్న వేళ జిల్లా వ్యయసాయ శాఖ సాగులోకి వచ్చే పంటలు, అవసరమైన ఎరువులు, విత్తనాలకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేసింది. జిల్లాలో సాగుకు అనుకూలంగా 5.78 లక్షల ఎకరాల భూములు ఉండగా.. 5.59 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఈసారీ అత్యధిక విస్తీర్ణంలో వరి పంట సాగవనుంది. సుమారు 3.20 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేయనున్నారు. వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సోయాబీన్ సాగవనుంది. మక్క, పత్తి, కంది పంటలు కూడా గణనీయమైన విస్తీర్ణంలో సాగవుతాయని భావిస్తున్నారు.మొత్తం 1,02.325 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని అధికారులు అంచనా వేశారు. 50,079 మెట్రిక్ టన్నుల యూరియా, 29,316 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 11,317 మెట్రిక్ టన్నుల డీఏపీ, 6,648 మెట్రిక్ టన్నుల ఎంవోపీ ఎరువులు అవసరం. సకాలంలో ఎరువులు తెప్పిస్తామని అధికారులు చెబుతున్నారు.పంట సాగు అంచనా వరి 3,20,000 సోయా 90,684 మక్క 54,500 పత్తి 42,887 కంది 45,500 పెసర 3,382 మినుము 2,858 ఇతర పంటలు 500వానాకాలం సీజన్ సమీపిస్తోంది. వ్యవసాయ అధికారులు ఖరీఫ్ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ సీజన్లో 5.59 లక్షల ఎకరాలలో వివిధ రకాల పంటలు సాగవుతాయని అంచనా వేసిన అధికారులు.. అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. – కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డిరూరల్ అంచనాలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ 5.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా, 1,16 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం -
క్రైం కార్నర్
కెనాల్లో పడి ఒకరి మృతి నిజామాబాద్ అర్బన్:నాగారం ప్రాంతంలోని నిజాంసాగర్ కెనాల్లో పడి ఒక రు మృతి చెందారు. సాయినగర్కాలనీ–2కు చెందిన జితేందర్(48) గత రెండు రోజుల కిందట అదృశ్యమయ్యాడు. గురువారం నిజాంసాగర్ కెనాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు సమాచారం అందించగా పోలీసులు ఘ టనాస్థలానికి చేరుకుని బయటికి తీయించారు. మృతుడిని జితేందర్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగాధర్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి ప్రాంతంలో రైలు పట్టాలపై గుర్తు వ్యక్తి మృతదేహం లభించిందని రైల్వే హెడ్కానిస్టేబుల్ హన్మాండ్లు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి కరీంనగర్ నుంచి వస్తున్న రైలు కింద పడి సదరు వ్యక్తి ఆత్మహత్యకు చేసుకుని ఉంటాడన్నారు. మృతుడి వయస్సు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే ఎస్సై (87126 58591)కి సమాచారం అందించాలని కోరారు. డొంకేశ్వర్(ఆర్మూర్): ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో జింకలపై కుక్కల దాడులు కొనసాగుతున్నా యి. ఇటీవల ఓ జింక పిల్లను రైతులు కాపాడడగా, తాజాగా గురువారం చుక్కల జింకను కుక్కలు వెంబడించగా అది తప్పించుకొని జీజీ నడ్కుడ గ్రామంలోకి వచ్చింది. గాయాలపాలైన జింకను స్థానికులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చారు. సర్పంచ్ బట్టు సంజీవ్రాజ్ వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. డిప్యూటీ ఎఫ్ఆర్వో సుధాకర్, పశువైద్యాధికారి ధర్మాజీ గ్రామ పంచాయతీకి చేరుకుని జింకకు వైద్యం అందించి ఆర్మూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్లో వదిలిపెట్టారు. ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని లారీ ఢీకొట్టిన ఘటన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్మూర్ నుంచి నందిపేట్ వైపు మట్టి కోసం వెళ్తున్న లారీ ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బలంగా ఢీకొట్డడంతో గద్దె పూర్తిగా దెబ్బతినగా, విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్ పడిపోయాయి. అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. ఎస్సై రజినీకాంత్ గ్రామానికి చేరుకుని వారితో మాట్లాడారు. అంబేడ్కర్ విగ్రహాన్ని మళ్లీ నిర్మింపజేస్తామని లారీ యజమాని ఒప్పుకోవడంతో వివాదం సద్దుమణిగింది. -
ద్విచక్ర వాహనాల చోరీ కేసుల్లో ఒకరి అరెస్ట్
నిజామాబాద్ అర్బన్: ద్విచక్ర వాహనాల చోరీ కి పాల్పడుతున్న ఒకరిని అరెస్ట్ చే సినట్లు ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి గురువారం తెలిపారు. నగరంలోని కవిత కాంప్లెక్స్ ఎదుట పార్క్ చేసి ఉన్న బైక్ ఇటీవల చోరీకి గురైంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం వాహనాల ను తనిఖీ చేస్తుండగా నామ్దేవ్వాడకు చెందిన నవీ న్ అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో పట్టుబడ్డాడు. అతడిని విచారించగా, ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్లు, ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, బాన్సువాడ, పిట్లంలో ఒక్కో బైక్ను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. చోరీ చేసిన బైక్లను కామారెడ్డి జిల్లా సోమేశ్వరం గ్రామానికి చెందిన మోహిద్, మోహన్ అనే ఇద్దరు వ్యక్తులకు విక్రయించినట్లు తెలిపాడు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిజామాబాద్ రూరల్: రైస్మిల్లులో చోరీకి యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ గురువారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖానాపూర్ చెందిన పసుపుల మహిపాల్ ఈనెల 27వ తేదీన విఠల్గౌడ్కు చెందిన పాత రైస్మిల్లో నుంచి 10హెచ్పీ మోటార్ను ఎత్తుకెళ్లేందుకు యత్నించాడు. స్థానికులు గమనించి విఠల్గౌడ్కు సమాచారం అందించగా అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. రాత్రి 10గంటల సమయంలో మద్యం మత్తులో రోడ్డు పక్కన పడుకుని ఉన్న మహిపాల్ను అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీకి యత్నించానని ఒప్పుకున్నాడు. -
హాలిడే ట్రిప్
హలో ఫ్రెండ్స్... నా పేరు సాత్విక్. నేను నిజామాబాద్లోని విశ్వోదయ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. వేసవి సెలవుల్లో అమ్మమ్మ కృపారాణి, అన్నయ్యలు వోమన్త్, మిట్టు, అక్కయ్యలు సౌమ్య, సంగీత, పెద్దమ్మ ఉజ్వల, పెద్దనాన్న ప్రేమ్సాగర్తో కలిసి టూర్కు వెళ్లాం. బాపట్ల బీచ్లో ఈత కొట్టాము. ఇసుకతో ఆటలు ఆడాం. సముద్రపు ఒడ్డున వాలీబాల్ గేమ్ ఆడటం ఎంతో ఆనందంగా అనిపించింది. అలియర్ రిజర్వ్ ఫారెస్టులో ఏనుగులు, జింకల గుంపులను చూశాం. ఊటీలో టీ తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీలను చూశాం. -
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
● కార్యకర్తలే బీజేపీకి ప్రధాన బలం ● ఎంపీ అర్వింద్ ధర్మపురి ● పండిత్ దీన్దయాళ్ ప్రశిక్షణ శిబిరం ప్రారంభం సుభాష్నగర్: కార్యకర్తలే బీజేపీకి ప్రధాన బలమని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయా లని ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. నూతన పదాధికారుల నైపుణ్యాలు మెరుగుపర్చడం, పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, కేంద్ర ప్రభు త్వం సంక్షేమ పథకాలపై సమగ్ర అవగాహనే లక్ష్యంగా నగరంలోని బోర్గాం(పి)లో రెండు రోజులపాటు కొనసాగనున్న జిల్లాస్థాయి పండిత్ దీన్దయాళ్ ప్రశిక్షణ శిబిరాన్ని అర్వింద్ గురువారం ప్రారంభించారు. అంతకుముందు పార్టీ జెండాను ఎగురవేశారు. 1984 నుంచి జిల్లాలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలతో కూడిన ఫొటో ప్రదర్శనను ప్రారంభించి తిలకించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసి, ప్రజల్లో పార్టీపై మరింత విశ్వాసం పెంపొందించాలని కార్యకర్తలకు సూచించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అంది అభివృద్ధి చెందాలన్నదే పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ లక్ష్యమని, ఆ దిశగా బీజేపీ పని చేస్తుందని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక వికాసం
జీవితానికి చదువు ఎంత ముఖ్యమో జీవించడానికి సంస్కారం అంతే ముఖ్యం అంటారు పెద్దలు. క్రమశిక్షణతో కూడిన జీవితం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం సంస్కారంతోపాటు క్రమశిక్షణ నేర్పుతుందని అంటున్నారు లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహరాజ్. ఇందుకోసం తమ ఆశ్రమంలో సంస్కృతి బోధన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ రూరల్ : విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడంతోపాటు ఆధ్యాత్మిక చింతన , భగవద్గీత, మహాభారతం , భాగవతం శ్లోకాలను నేర్పేందుకు లింగేశ్వరగుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణమహ రాజ్ వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. మండలంలోని మల్లారం శివారులో ఉన్న ఆశ్రమంలో ఈనెల 26 నుంచి ప్రారంభమైన శిబిరంలో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు పాల్గొంటున్నారు. శుక్రవారం నాటితో శిబిరం ముగియనుంది. లింగేశ్వర గుట్టపై కొలువుదీరిన శివుని సన్నిధిలో కృష్ణమహరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆధ్యాత్మిక గ్రంథాల్లోని శ్లోకాలను కంఠస్థం చేస్తున్నారు. తల్లిదండ్రుల ను, గురువులను, పెద్దలను గౌరవించడం, దురలవాట్లకు దూ రంగా ఉండడం, సనాత న ధర్మంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు నిత్యాన్నదానం ఈనెల 26న ప్రారంభమైన సంస్కృతి బోధన శిబిరం (వేసవి శిక్షణ) శుక్రవారం ముగియనుంది. సుమారు వంద మంది విద్యార్థులకు లింగేశ్వరగుట్ట ఆశ్రమంలోనే వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సంస్కృతి బోధన శిబిరానికి పంపించగా, ఆధ్యాత్మిక మార్గం ద్వారా పిల్లలు తమ భవిష్యత్ను ఉన్నతంగా తీర్చుదిద్దుకుంటున్నారు. లింగేశ్వరగుట్ట ఆశ్రమంలో సంస్కృతి బోధన శిబిరం సెలవుల్లో ఆధ్యాత్మికతకు, సంస్కారానికి పెద్దపీట 100 మంది విద్యార్థులకు ఆశ్రమంలో బోధనలు -
ఘనంగా బక్రీద్ వేడుకలు
సాక్షి నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా గురువారం బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండలాలు, గ్రామాల్లోని ఈద్గాల వద్ద సామూహిక ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మత పెద్దలు పండుగ విశిష్టతను వివరించారు. అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే ప్రత్యేకంగా చేసిన శీర్ఖుర్మా(సేమియా) బంధుమిత్రులకు పంచిపెట్టారు. బాన్సువాడలోని ఈద్గా వద్ద ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో చైర్మన్ కాసుల బాల్రాజ్లు ముస్లింలకు ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి భిక్కనూరు, బీబీపేటతోపాలు పలు మండలాల కాంగ్రెస్ నేతలు కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తలిపారు. అవాంఛనీయ ఘటనల చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో జరిగిన బక్రీద్ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొని, మాట్లాడారు. బక్రీద్ పండుగ త్యాగానికి, భక్తికి ప్రతీక అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సోదరభావంతో మెలగాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్పీ రాజేష్చంద్ర, స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ గిరిలు, మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, అధికారులు ప్రభుత్వ సలహాదారుకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు షబ్బీర్అలీకి శుభాకాంక్షలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు.. బాన్సువాడలో ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతున్న పోచారం, కాసుల .. -
పిల్లలు మీరూ పంపండి..
నేను గీసిన చిత్రం83328 87332దావత్ లక్షిత రోటరీ నగర్, నిజామాబాద్. కె. భవేష్, 10వ తరగతి, కమ్మర్పల్లి, నిజామాబాద్. వేదశ్రీ, 2వ తరగతి, నారాయణ హైస్కూల్, ఆర్మూర్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
సామెతలు
నేను గీసిన చిత్రంపిల్లలు మీరూ పంపండి..83328 87332వి. శ్రీనిధి, 6వ తరగతి, నారాయణ హైస్కూల్, ఆర్మూర్ వడ్ల స్నేహ, 10వ తరగతి, జెడ్పీహెచ్ఎస్, పిట్లం జిల్లా: కామారెడ్డి విశ్వవేద్ 3 వ తరగతి గ్రామం: గూపన్పల్లి జిల్లా : నిజామాబాద్ చాతెల్లి శ్రేష్ఠ సంహిత 5వ తరగతి ఆర్మూర్ జిల్లా: నిజామాబాద్ జి. హిమాన్షు 5వ తరగతి గ్రామం: పెంటకలాన్ మం:బోధన్ జిల్లా: నిజామాబాద్ వేసవి సెలవుల్లో మీ కలానికి పదునుపెట్టి బొమ్మలు గీస్తున్నారా? చిట్టి కథలు రాస్తున్నారా? ఏదైనా పర్యాటక ప్రదేశం సందర్శించా రా? ఆటపాటల్లో విజయం సాధించి పతకాలు అందుకున్నారా? ఈ విషయాలను మీ స్నేహితులు, పాఠకులతో పంచుకోవాలనుకుంటే వాట్సాప్ నంబర్ ద్వారా మాకు పంపండి. మేము ప్రచురిస్తాం. మీ ఫొటో కూడా జతచేయండి. ఊరు.. పేరు.. జిల్లా రాయడం మరువొద్దు సుమా.. -
తూకాలను వేగవంతం చేయాలి
నాగిరెడ్డిపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ కన్నారెడ్డిగేట్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం రైతులు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, నాగిరెడ్డిపేట తహసీల్దార్ భిక్షపతి, ఎస్సై భార్గవ్గౌడ్ రైతుల వద్దకు వెళ్లి మాట్లాడారు. తూకం వేసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు పంపించడంలో తాండూర్ సొసైటీ సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారని, తమ గ్రామానికి రావాల్సిన లారీలను ఇతర గ్రామాలకు పంపిస్తున్నారని రైతులు ఆరోపించారు. వారి వైఖరి కారణంగా తమ ధాన్యం వర్షానికి తడుస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. లారీలను రప్పించి ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలింపజేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. -
భారీ వర్షం.. తడిసిన ధాన్యం
కామారెడ్డి టౌన్/మాచారెడ్డి/దోమకొండ/ఎల్లారెడ్డిరూరల్/: జిల్లాలోని పలు ప్రాంతాలలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్, లింగాపూర్తో పాటు కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, బీబీపేట్, రాజంపేట, తాడ్వాయి, రామారెడ్డి మండలాల్లో వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్న, జొన్న పంటలు తడిసిపోయాయి. తాడ్వాయి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద ఆరబెట్టిన మొక్కజొన్న కొట్టుకుపోయాయి. లింగాపూర్లో వరి కుప్పలు, ధాన్యం నింపిన సంచులు తడిసిపోయాయి. తోటల్లో కోతకు సిద్ధంగా ఉన్న మామిడికాయలు బలమైన గాలులకు నేలరాలాయి. దోమకొండలో.. దోమకొండ మండలంలో రైతులు ధాన్యం కుప్పలపై కవర్లు కప్పినప్పటికి భారీ వర్షానికి కొంత ధాన్యం తడిసిపోయింది. కాంటా వేసిన వడ్ల బస్తాలు తడిసిపోయాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు కాస్త ఊరట చెందారు. ఎల్లారెడ్డిలో.. ఎల్లారెడ్డి మండలంలో బుధవారం వేకువజామున వర్షం కురవడంతో కాంటా చేసిన ధాన్యం బస్తాలు తడిశాయి. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ, గండిమాసానిపేట, వెల్లుట్ల ధాన్యం కొనగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పల మధ్య వర్షం నీరు నిలిచింది. గండిమాసానిపేట, హాజీపూర్లో కాంటా చేసిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. సదాశివనగర్లో.. సదాశివనగర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్పేట్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు తూకం చేసిన వడ్లబస్తాలు తడిసి ముద్దయ్యాయి.మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్ తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను సముదాయించారు. రెండు లారీలను రప్పించి తడిసిన వడ్లను రైస్మిల్లులకు పంపించారు. -
పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
భిక్కనూరు: పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. బుధవారం భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పశువుల అక్రమ రవాణా లేదా ఎలాంటి చట్ట విరుద్ధ కార్యక్రమాలకు పాడిన వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎస్సైలు నరేష్, ఆంజనేయులు, ప్రభాకర్లున్నారు. బాధితులతో గౌరవంగా వ్యవహరించాలి కామారెడ్డి క్రైం: పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో గౌరవంగా వ్యవహరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. వార్షిక తనిఖీల్లో బుధవారం దేవునిపల్లి పోలీస్ స్టేషన్న్ను ఆయన సందర్శించారు. పరిసరాలను, రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమశిక్షణతో పని చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూధన్, రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, సిబ్బంది పాల్గొన్నారు. పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది కామారెడ్డి క్రైం: పదోన్నతితో పోలీసులకు గుర్తింపుతో పాటు బాధ్యత పెరుగుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బీబీపేట పీఎస్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మధుసూధన్ రావు ఎస్సైగా పదోన్నతి పొందారు. బుధవారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయానికి విచ్చేసి ఎస్పీ రాజేష్చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. మధుసూధన్ రావుకు పదోన్నతి చిహ్నాలను ఎస్పీ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. -
యూరియా కొరత లేకుండా చూడాలి
సుభాష్నగర్: ఉమ్మడి జిల్లా రైతాంగానికి సరిపడా యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేయాలని, అన్నదాతలు ఇబ్బందులు పడకుండా చూడాలని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. బుధవారం హైదరాబాద్లో మంత్రిని తన కార్యాలయంలో రమేశ్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో యూరియా, ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో యూరియా బఫర్ స్టాక్, ఇతరాత్ర సమస్యలను మంత్రికి వివరించారు. మద్నూర్(జుక్కల్): మండలంలోని రుసేగావ్ గేట్ వద్ద 161వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున మామిడి పండ్ల లారీ బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి రాజస్థాన్కు మామిడి పండ్ల లోడ్తో వెళ్తున్న లారీ మండలంలోని రుసేగావ్ గేట్ సమీపంలో డివైడర్ను ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు మధ్యలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. మామిడిపండ్లు రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రెండుగంటలపాటు శ్రమించి క్రేన్ సహాయంతో లారీని పక్కకు జరిపారు. రెండు గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. -
క్రైం కార్నర్
మద్నూర్(జుక్కల్): మండలంలోని మేనూర్ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం హైవే అథారిటీకి చెందిన వాహనాన్ని వెనుక నుంచి బైక్ ఢీకొట్టిన ఘటనలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్ కండక్టర్ అబ్దుల్ నజీర్(42) మృతి చెందాడని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలోని దెగ్లూర్ ఆర్టీసీలో కండక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న అబ్దుల్ నజీర్ బుధవారం సాయంత్రం డ్యూటీ ముగించుకొని మద్నూర్ మీదుగా మేనూర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. మహారాష్ట్రలోని భోకర్కు చెందిన అబ్దుల్ నజీర్కు మండలంలోని మేనూర్కు చెందిన అమ్మాయితో వివాహం కాగా, మేనూర్లోని ఉంటున్నారన్నారు. మృతుడికి భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. భిక్కనూరు: పిడుగుపాటు కారణంగా పాడి గేదె మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బొండ్ల శివయ్య అనే రైతు తన వ్యవసాయ బావి వద్ద ఉన్న పశువుల కొట్టంలో గేదెను కట్టేశాడు. అర్ధరాత్రి ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పాడి గేదైపె పిడుగుపడడంతో మృతి చెందింది. బాధిత రైతు పశువైద్యాధికారులకు సమాచారం అందించాడు. తనకు నష్టపరిహారం అందించాలని అధికారులను కోరాడు. కరెంట్ షాక్తో..నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండల కేంద్రానికి చెందిన పాటిమీది మల్లేశ్ అనే వ్యక్తికి చెందిన గేదె బుధవారం విద్యుత్ షాక్తో మృతి చెందింది. బూర్గుల్ గ్రామ శివారులో మేతకు వెళ్లిన గేదె బాన్సువాడ– ఎల్లారెడ్డి రహదారి పక్కన ఉన్న పంటపొలం వద్ద ట్రాన్స్ఫార్మర్కు తగిలి అక్కడిక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పాడి గేదె మృతితో రైతుకు రూ.60 వేల వరకు నష్టం వాటిల్లింది. రుద్రూర్: పొతంగల్ మండలం హంగర్గా గ్రామ శివారులోని మంజీర నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు కోటగిరి ఎస్సై సునీల్ తెలిపారు. బుధవారం ఉదయం ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లో ఇసుకను లోడ్ చేసుకుని తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. డ్రైవర్ రాజుతోపాటు ట్రాక్టర్ యజమాని రాజేశ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
35 మంది హోంగార్డుల బదిలీ
కామారెడ్డి క్రైం: జిల్లాలో 35 మంది హోంగార్డుల బదిలీల ప్రక్రియను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో 32 మంది నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వారు ఉండగా మరో ముగ్గురు కామారెడ్డి జిల్లాలో పనిచేస్తూ ఒకేచోట మూడేళ్ల సర్వీస్ను పూర్తి చేసుకున్నవారు ఉన్నారని ఎస్పీ తెలిపారు. విల్లింగ్, సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, రికార్డులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా పోస్టింగ్లను కేటాయించామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఆర్ఐలు సంతోష్, నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసి హైదరాబాద్ వైపు నుంచి మహారాష్ట్ర వైపు రైలులో అక్రమంగా తరలిస్తున్న 48.77 కిలోల గంజాయిని కామారెడ్డి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. సంబల్పూర్– పుణే ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం సాయంత్రం కామారెడ్డి రైలే్వ్ స్టేషన్లోని ఒకటో నంబర్ ప్లాట్ఫాం వచ్చింది. ఆ సమయంలో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టి పుణెకు చెందిన రోహిత్ సనీ గోర్ఖే అనే వ్యక్తి గంజాయి ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గంజాయిని అదుపులోకి తీసుకుని విచారించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించామని ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ బుధవారం తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ రూ. 24 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో రైల్వే సీఐ నర్సింలు, ఎస్సై సుబ్బారెడ్డి, ఎకై ్సజ్ ఎస్సై విక్రం కుమార్, సిబ్బంది పాల్గొన్నారన్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్ కళాశాలల్లో చదువుతున్న అన్ని కులాల అభ్యర్థులనుంచి స్కాలర్షిప్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేశ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్రెష్, రెన్యువల్ స్కాలర్షిప్ల కోసం ఈనెల 31లోగా అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు సమాచారం ఇచ్చి దరఖాస్తు చేసే విధంగా చూడాలని ఆయా కళాశాలల అధికారులను కోరారు. కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా ఎ.పాండు నియమితులయ్యారు. ఆయన నాగర్కర్నూల్ కలెక్టరేట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఆర్డీవో క్యాడర్కు పదోన్నతి పొందిన ఆయనను కామారెడ్డి డీఆర్వోగా నియమించారు. ఇక్కడ డీఆర్వోగా పనిచేసిన మధుమోహన్ ఇటీవలే బదిలీపై హైదరాబాద్కు వెళ్లిన విషయం తెలిసిందే. బాన్సువాడ రూరల్: యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర కోఇన్చార్జి రోషిణి జైస్వాల్ సూచించారు. బుధవారం బాన్సువాడలో యువజన కాంగ్రెస్ జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రోషిణి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసి యువజన కాంగ్రెస్కు బలమైన పునాది వేయాలన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ మన్సూర్, జిల్లా ప్రధాన కార్యదర్శి అభిషేక్, నాయకులు అబ్బు, సాజిద్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ: మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, సంఘాలకు వడ్డీలేని రుణాలు అందజేస్తుందని అన్నారు. బాన్సువాడలో ఇళ్లు లేని నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తే చాలా మంది అనర్హులకే అందాయని అన్నారు. ఇంకా చాలా కాలనీల్లో ఇళ్లు లేని పేదలు ఉన్నారని అన్నారు. వార్డులో ఉండే నాయకుల తీరుపై పోచారం ఆగ్రహాం వ్యక్తం చేశారు. 10 మహిళ సంఘాలకు రూ. 2 కోట్ల చెక్కును అందజేశారు. శిక్షణ కేంద్రం ప్రారంభం బాన్సువాడలోని ఐకేపీ కార్యాయలం వద్ద మహిళ సమాఖ్య సముదాయక నిర్వహణ శిక్షణ కేంద్రాన్ని బుధవారం పోచారం శ్రీనివాస్రెడ్డి, కాసుల బాల్రాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో రెండు మండలాలకు ఈ శిక్షణ నిర్వహణ కేంద్రాలు మంజూరు అయ్యాయని, అందులో ఒకటి దోమకొండ, మరొకటి బాన్సువాడకు వచ్చిందన్నారు. మండలంలోని 52 మహిళ సంఘాలకు రూ.6.13 కోట్ల చెక్కును అందజేశారు. మెప్మా పీడీ శ్రీధర్రెడ్డి, ఏపీడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్ ఉన్నారు. -
రైతులకు నష్టం జరగకుండా చూడాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: వర్షాలతో రైతులకు నష్టం కలగకుండా ధాన్యం బస్తాలను వేగంగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఉగ్రవాయిలోని రైస్మిల్లును సందర్శించారు. ధాన్యం నిల్వలు, రవాణా, మిల్లింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. రోజు కనీసం 15 లారీల ధాన్యం దించుకోవాలని మిల్లర్ను ఆదేశించారు. అనంతరం శాబ్దిపూర్లోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. అకాల వర్షాల కారణంగా జిల్లాలో సుమారుగా 1,100 మెట్రిక్ టన్నుల వడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,78,000 మెట్రిక్ టన్నుల వడ్ల సేకరణ పూర్తయ్యిందని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో 1,064 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు ఉన్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నీరు నిల్వ ఉండకుండా కందకాలు తీయాలన్నారు. ధాన్యం కుప్పలను టార్పాలిన్లతో కప్పి ఉంచాలని సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విక్టర్, డీఎస్వో వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో.. సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డిలో ధాన్యం కొనుగోలు కేంద్రాని కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి తడిసిన ధాన్యం వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ సత్యనారాయణ తదితరులున్నారు. -
ఉత్సాహం
ఉల్లాసం.. మల్లారం పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ● యోగాసాధనలో పోటీ పడుతున్న చిన్నారులు ● చెస్, క్యారం, పెయింటింగ్ అంశాల్లో తర్ఫీదు ● శిబిరంలోనే విద్యార్థులకు మధ్యాహ్న భోజనంవిద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులు నిజామాబాద్ రూరల్: ‘వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి కాదు.. వ్యక్తిత్వ వికాసానికి, మనలోని నైపుణ్యానికి పదును పెట్టేందుకు ఉపయోగపడే విలువైన కాలం’ అని అంటున్నారు మల్లారంలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు. పాఠశాలకు సెలవులు ప్రకటించగానే అమ్మమ్మ ఇంటికి, బంధువుల ఇళ్లకు, టూర్లకు వెళ్లిపోకుండా స్థానికంగా తమ పాఠశాలలో ఏ ర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని క్రమశిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్నారు. హెచ్ఎం రామ్మోహన్, ఉపాధ్యాయుడు భూమాగౌడ్ పర్యవేక్షణలో పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతోంది. 78 మంది విద్యార్థులు వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించారు. ఈ నెల 13న ప్రారంభమైన వేసవిశిక్షణ తరగతులు 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇండోర్ గేమ్స్కు ప్రాధాన్యం వేసవి శిక్షణ శిబిరంలో ఇండోర్ గేమ్స్కు ప్రాధాన్యత ఇస్తున్నారు. చిత్రలేఖనం, క్యారం, చెస్, పెయింటింగ్, యోగా సాధన చేయడంతోపాటు శ్లోకాలు కంఠస్థం చేస్తున్నారు. విద్యార్థులకు ఆటలతోపాటు మానసిక ఉల్లాసమూ కలుగుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న హెచ్ఎం రామ్మోహన్ను ఎంఈవో ప్రత్యేకంగా అభినందించారు. శిక్షణ శిబిరం.. బడిబాట ఓ వైపు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు.. మరో వైపు ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గ్రామంలో ‘బడిబాట’ కార్యక్రమాన్ని సైతం నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ పాలక మండలి సహకారంతో ఇంటింటికీ వెళ్తున్న ఉపాధ్యాయులు.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. యోగా సాధన చేస్తున్న చిన్నారులుగ్రామ పంచాయతీ సహకారంతో మా టీచర్లు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం.నేర్చుకోవాలనే తపన ఉండాలి. ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుంది. – కోమలి, 9వ తరగతి చదువుతోపాటు విద్యార్థులకు ఆటపాటలు ఎంతో ముఖ్యం. మా పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందాన్నిస్తోంది. శ్లోకాలు నేర్చుకుంటున్నా. – అనుదీపిక, 7వ తరగతి వేసవి శిక్షణలో అనేక అంశాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు. ఇక్కడ పొందుతున్న శిక్షణ భవిష్యత్లో ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతి రోజూ తరగతులకు హాజరవుతున్నా. – రమ్య, 8వ తరగతి వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లేదాన్ని. స్కూల్ లో వేసవి శిక్షణ శిబిరం ఏ ర్పాటు చేయడంతో ఊరికి వెళ్లలేదు. యోగా, డ్రాయింగ్, పెయింటింగ్, సాధాన చే స్తూ.. ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉత్సాహంగా గడుపుతున్నా. – స్రవంతి, 9వ తరగతి విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకే వేసవి శిక్ష ణ తరగతులు నిర్వహిస్తున్నాం. విద్యాశాఖాధికారు లు పూర్తి సహాయసహకారా లు అందిస్తున్నారు. విద్యార్థులు వేసవి శిక్షణకు ఉత్సాహంగా హాజరవుతుండడం ఆనందాన్నిస్తోంది. – రామ్మోహన్, హెచ్ఎం -
కొనుగోల్కు దూరంగా..
పంట చేతికి వచ్చి నెల గడుస్తున్నా కొనుగోళ్లు ముందుకు సాగకపోవడంతో జిల్లాలో రైతులు ఆగమాగం అవుతున్నారు. యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నా ఇప్పటికీ వడ్ల సేకరణ పూర్తికాలేదు. మక్కలు, జొన్నలదీ అదే పరిస్థితి. మరోవైపు మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం పలుచోట్ల భారీ వర్షం కురియడంతో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – కామారెడ్డి క్రైంజిల్లావ్యాప్తంగా యాసంగి సీజన్లో రైతులు 2,57,785 ఎకరాల్లో వరి సాగుచేశారు. 1,50,470 ఎకరాల్లో దొడ్డు, 1,07,315 ఎకరాల్లో సన్న రకాలు పండించారు. మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చ ని, ఇందులో కొనుగోలు కేంద్రాలకు 5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు వస్తాయని అంచనా ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారి ఆలస్యంగా కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించారు. దీంతో కొద్ది సమయం తేడాలోనే వరి, మక్కలు, జొన్నలు కేంద్రాలకు వచ్చాయి. అధికార యంత్రాంగం వడ్ల కొనుగోళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించినా ఇప్పటికీ సేకరణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఖరీఫ్ ముంగిటకు వచ్చినా ఇప్పటివరకు 3.78 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నారు. కొనుగోళ్లలో జాప్యంతో పలువురు రైతులు వ్యాపారులకు అమ్ముకున్నారు. బాన్సువాడ డివిజన్ పరిధిలో సేకరణ పూర్తయ్యింది. ఎల్లారెడ్డి, కామారెడ్డి డివిజన్ల పరిధిలో మరో 40 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. తూకాల్లో జాప్యం.. హామాలీల కొరతతో తూకాల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత లారీలు రాకపోవడంతో తూకం వేసిన ధాన్యం కుప్పలుతెప్పలుగా కొనుగోలు కేంద్రాల్లో పెరుకుపోయి కాంటాలు నిలిచిపోయాయి. మక్క, జొన్నల కొనుగోళ్లలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. మక్కల కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా ప్రారంభించడంతో ఇప్పటివరకు సగం కూడా సేకరించలేదు. జొన్న కాంటా మాత్రం ప్రారంభ దశలోనే ఉంది. నెల క్రితమే జొన్న కోతలు పూర్తయి కేంద్రాలకు తీసుకువచ్చినా.. నాలుగైదు రోజుల క్రితమై తూకాలు మొదలయ్యాయి. పెద్దమొత్తంలో మక్కలు, జొన్నలు ఇంకా కేంద్రాల్లోనే ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.కేంద్రానికి జొన్నలు తీసుకువచ్చి నెల రోజులైంది. ఇంకా కాంటా కాలేదు. రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. తెల్లారగానే వాసన వస్తున్నాయి. వేగంగా కొనుగోళ్లు చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. తడిసిన జొన్నలను కొనుగోలు చేయాలి. – బామన్ బంతీలాల్, రైతు, పెద్దకొడప్గల్ రైతులు ఆందోళనకు గురికావొద్దు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి నేరుగా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. ధాన్యం సేకరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, కామారెడ్డివరి ధాన్యం తరలింపునకు లారీలు రావడం లేదని బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డిలో రైతులు రాస్తారోకో చేశారు. తూకాలను వేగవంతం చేయాలంటూ నాగిరెడ్డిపేట మండలంలోని కన్నారెడ్డిగేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్లో తడిసిన ధాన్యం బస్తాలతో రైతులు రోడ్డెక్కారు. ఇలా రోజూ ఎక్కడోచోట రైతులు నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ సీజన్లో వరి, మక్క, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం వల్లే రైతులు ఆందోళనలు చేయాల్సి వస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా లారీల కొరత తీవ్రంగా ఉంది. కాంటా పూర్తయినా రైతులు వారాల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వచ్చింది. లారీలు సర్దుబాటు చేయడంలో అధికారుల తీరుపై చాలా గ్రామాల్లో రైతులు అసహనం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడాలని కోరుతున్నారు. ఖరీఫ్ సమీపించినా జిల్లాలో పూర్తికాని వడ్ల సేకరణ మక్కలు, జొన్నలదీ అదే పరిస్థితి లారీలు రాక ముందుకు సాగని కొనుగోళ్ల ప్రక్రియ అకాల వర్షానికి ధాన్యం తడవడంతో రైతుల్లో ఆందోళన -
వడ్ల బస్తాలను తరలించాలి
ఎల్లారెడ్డి: లారీలను పంపించి తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించాలని డిమాండ్ చేస్తూ తిమ్మారెడ్డిగేట్ వద్ద రైతులు రాస్తారోకో చేశారు. బుధవారం ఉదయం కురిసిన వర్షానికి తిమ్మారెడ్డిగేట్ కొనుగోలు కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు ఎల్లారెడ్డి –బాన్సువాడ ప్రధాన రహదారిపై ఆందోళన చేశారు. ట్రాఫిక్ స్తంభించడంతో విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రేమ్కుమార్ సంఘటన స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలనుంచి తూకం వేసిన వడ్ల బస్తాలను తరలించకపోవడంతో వర్షానికి తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రెండు లారీలను పంపి రెండు, మూడు రోజులలో ధాన్యం పూర్తిగా తరలిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
మండల కమిటీలు బలోపేతం చేయాలి
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మున్నూరుకాపు మండల యూత్, మహిళా విభాగాలను బలోపేతం చేయడంతో పాటు కుటుంబ సర్వే నిర్వహించాలని తెలంగాణ మున్నూరుకాపు సంఘం కామారెడ్డి జిల్లా ఇంచార్జి దేమె యాదగిరి పటేల్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా సమావేశం నిర్వహించి వివిధ సమస్యలు, సంఘం బలోపేతం విషయాలపై చర్చించారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మామిండ్ల అంజయ్య, రాష్ట్ర కార్యదర్శి నీలం నర్సింలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గడీల భాస్కర్, నాయకులు రాంకుమార్, రాజలింగం, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ద్వారా దుబాయ్లో ఉద్యోగాల కోసం 18 –40 మధ్య వయసు గల వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. టైల్ మెషిన్, షట్టరింగ్ కార్పెంటర్, ఆర్సీసీ వర్కర్, స్టీల్ ఫిక్సర్, స్కాఫోల్డర్, జనరల్ హెల్పర్ పోస్టులున్నాయని, నెలకు రూ.37,800ల వేతనం, ఫుడ్ అలవెన్స్, ఓవర్టైం, బోనస్ ఉంటుందన్నారు. వివరాలకు 83286 02231, 94400 50951, 94400 51452 నంబర్లకు సంప్రదించాలని పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం(తపస్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘బడిబాట’ పోస్టర్ను డీఈవో ఎస్. రాజు బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఈవో మా ట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన చదువుతో పాటు నైతిక విలువలను అందించేది కేవ లం ఉపాధ్యాయులేనని అన్నారు. జిల్లాలోని బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని,సర్కారు కల్పిస్తున్న మౌలిక వసతులను సద్వినియోగం చేసుకోవాలని కో రారు. తపస్ రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరె డ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉ పాధ్యక్షులు ఆంజనేయులు,రాజశేఖర్, మండ ల బాధ్యులు దత్తాచారి, స్వామి పాల్గొన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ చేశారు. సీతాయిపల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంతో పాటు సీతాయిపల్లిలో నూతనంగా నిర్మించనున్న మహిళా సమాఖ్య భవనాలకు భూమిపూజ చేశారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు
● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. బుధవారం అడ్లూర్ ఎల్లారెడ్డి, ధర్మారావ్పేట్ గ్రామాల్లో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులకు నష్టం జరుగకుండా అండగా ఉంటామని భరోసానిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలన్నారు. సర్పంచ్లు ఎడ్ల నర్సింలు, షేక్ ఉమర్, మాజీ జెడ్పీటీసీలు రాజేశ్వర్ రావు, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి!
ధర్పల్లి: మండలంలోని గోవింద్పల్లి గ్రామానికి చెందిన లక్షిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గోవింద్పల్లికి చెందిన నెహ్రూతో మోస్రా గ్రామానికి చెందిన లక్షితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది.పైళ్లెన రెండు నెలల నుంచే భర్త నెహ్రూతోపాటు అత్తామామలు అదనంగా రూ.2 లక్షల వరకట్నం తీసుకురావాలని లక్షితను వేధించినట్లు ఆమె తండ్రి పిట్ల మోహన్ ఫిర్యాదు లో పేర్కొన్నాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగిందని, సోమవారం సాయంత్రం సైతం తమ కూతురిని అత్తింటి వారు వేధించారని ఫిర్యాదు చేశాడు.లక్షిత చని పోయిందని తమకు సమాచారం ఇచ్చారని, ఆమె మరణంపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తహసీల్దార్ శాంత సమక్షంలో శవ పంచనామా పూర్తి చేశామని, ఏసీపీ ప్రకాశ్యాదవ్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారని ఎస్సై తెలిపారు. -
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నాం
● ఎమ్మెల్యే మదన్మోహన్రావు ● మల్లారం చెరువు మరమ్మతులకు రూ.1.65 కోట్లు మంజూరు లింగంపేట(ఎల్లారెడ్డి): నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మంగళవారం ఆయన లింగంపల్లి(ఖుర్దు) శివారులోని మల్లారం చెరువు పునరుద్ధరణ పనులు ప్రారంభించి మాట్లాడారు. గత సంవత్సరం వర్షాకాలంలో వచ్చిన వరదల వల్ల మండలంలో తీవ్ర నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చాయన్నారు. వరదల వల్ల చెరువులు, కుంటలు, వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయన్నారు. తాను వెంటనే యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తాత్కాలిక మరమ్మతులు చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగా మల్లారం చెరువుతో పాటు అభివృద్ధి పనులకు వరద నష్టం మరమ్మతుల నిధుల కింద రూ.1.65 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ప్రతి పక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేకే విషప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. వర్షాకాలం సమీపిస్తున్న దృష్ట్యా రైతులకు ఇబ్బంది కలగకుండా చెరువు కట్టల మరమ్మతులు వేగంగా చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ కార్యాలయం ప్రారంభం లింగంపేట మండల కేంద్రంలోని అజయ్ ఆస్పత్రి భవనంపైన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు సాయి రాంయాదవ్, సర్పంచులు ప్రత్యూష, కౌడ రవీంద ర్, ఉపసర్పంచ్ ప్రసాద్గౌడ్, సర్పంచుల ఫోరం అ ధ్యక్షుడు సక్రూనాయక్, తదితరులు పాల్గొన్నారు. -
‘ఆధిపత్య పోరులో పుర అభివృద్ధి కుంటుపడుతోంది’
కామారెడ్డి టౌన్ : ఆధిపత్య పోరులో మున్సిపల్ అభివృద్ధి కుంటుపడుతోందని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ..ఎమ్మెల్యే కేవీఆర్, మున్సిపల్ చైర్పర్సన్ భర్తనుద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. మున్సిపాలిటీలో నిధులు లేనప్పుడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు లేకుండా ఎమ్మెల్యే అధికారులతో విడిగా సమీక్షా సమావేశం నిర్వహించడం మున్సిపల్ చట్టాలకు వ్యతిరేకమన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త కౌన్సిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ, కమిషనర్తో పాటు, ఇతర అధికారులు, సిబ్బందిపై పెత్తనం చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మహ్మద్ హఫీజ్, కుంబాల రవి, మన్సూర్, ఎజాజ్, మామిళ్ల లక్ష్మణ్, గరిగంటి స్వప్న, లోలం శ్రీనివాస్, గోపు బాలమణి తదితరులు పాల్గొన్నారు. -
సీడ్ కార్పొరేషన్ ఆర్ఎం బదిలీ
డొంకేశ్వర్(ఆర్మూర్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విత్తన కార్పొరేషన్ రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) రఘు ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యారు. మంగళవారం బదిలీ ఉత్తర్వులు వెలువడగా, జిల్లాకు వినయ్ ఆర్ఎంగా రానున్నారు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర శాఖ నుంచి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. డాక్టర్ జీవీ రావుకు శుభాకాంక్షలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, డాక్టర్ జీవీ రావును మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు. వైద్య రంగంలో డాక్టర్ జీవీ రావు అందిస్తున్న విశిష్ట సేవలను ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. బోధన్: ఎడపల్లిలో ని రైతువేదిక భవ నం వద్ద వీధి కుక్క లు గుంపులుగా సంచరిస్తూ మంగళవా రం ఉదయం లక్ష్మి అనే మహిళపై దాడి చేశాయి. భయంతో లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై కుక్కలను తరిమివేసి ఆమెను కాపాడారు. తీవ్రగాయాలపాలైన లక్ష్మిని చికి త్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానిక నాయకుడు న్యావనది శ్రీకాంత్ పంచాయతీ కార్యదర్శి నాగరాజుగౌడ్కు విన్నవించారు. బాన్సువాడ : ఇద్దరు చిన్నారులు ఆస్పత్రి ప్రాంగణంలో దిక్కుతోచని స్థితిలో అటూఇటూ తిరుగుతుండడంతో ఆస్పత్రి సిబ్బంది చూసి లోపలికి తీసుకెళ్లి ఓ గదిలో సంరక్షణ కల్పించారు. చిన్నారులు అధికారులకు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం చిన్న ఎక్లార గ్రామానికి చెందిన లక్ష్మి తన ఇద్దరు కూతుర్లు గంగోత్రి (10వ తరగతి), హాసిని (2వ తరగతి) లను తీసుకుని శనివారం బాన్సువాడ ఆస్పత్రికి వచ్చింది. ఆస్పత్రి ప్రాంగణంలో ఇద్దరు చిన్నారులను కూర్చొబెట్టి ఇప్పుడు వస్తానని చెప్పి వెళ్లిపోయింది. రాత్రయినా లక్ష్మి రాకపోవడంతో చిన్నారులిద్దరు ఆస్పత్రిలో తిరుగుతుండడంతో సిబ్బంది సుపరింటెండెంట్ విజయభాస్కర్కు సమాచారం ఇచ్చారు. చిన్నారులకు గదిలో వసతి కల్పించి భోజనం పెట్టండి అని చెప్పడంతో సిబ్బంది చిన్నారులకు భోజనం తెప్పించి తినిపించారు. మూడు రోజులైన చిన్నారుల తల్లి రాకపోవడంతో మంగళవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమక్షంలో ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తన తండ్రి చనిపోయాడని చిన్నారులు అధికారులకు వివరించారు. -
నేటి నుంచి పాలిటెక్నిక్ స్లాట్ బుకింగ్
● జిల్లాలో ఐదు కళాశాలలు ● అందుబాటులోకి కొత్త కోర్సులు ఖలీల్వాడి: విద్యార్థుల భవిష్యత్కు ఎంతో ఉపయోగపడే పాలిటెక్నిక్ స్లాట్ బుకింగ్ నేటి(బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. పాలిసెట్ ఫలితాలు విడుదల కావడంతో పాలిటెక్నిక్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ను విడుదల చేసిన నేపథ్యంలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు నిజామాబాద్ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ భారతి తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్లో పలు కొత్త కోర్సులు వచ్చాయి. ఆటోమిషన్ ఇన్ రోబోటిక్, బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ చదివే అవకాశం ఏర్పడింది. పాలిసెట్ ర్యాంక్ కార్డ్, పాలిసెట్ హాల్ టికెట్, పదో తరగతి మార్కుల మెమో, బదిలీ సర్టిఫికెట్ (టీసీ), స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్), కుల ధ్రువీకరణ పత్రం(అవసరమైతే), ఈడబ్ల్యూ విద్యార్థులకు సంబంధించిన కుల ధ్రువీకరణ పత్రం, పీహెచ్, ఎన్సీసీ, క్యాప్, క్రీడా సర్టిఫికెట్లు (అర్హత ఉన్నవారికి), పాస్పోర్టు సైజ్ ఫొటోలు, 2026 సంవత్సరానికి సంబంధించిన ఆదాయ ధ్రువపత్రం సమర్పించిన విద్యార్థులకు కళాశాల ఫీజు రూ.1880 మాత్రమే ఉంటుంది. స్లాట్ బుకింగ్ 27 నుంచి 31 ధ్రువపత్రాల పరిశీలన 29 నుంచి జూన్ 1 ఆప్షన్ల ఎంపిక 29 నుంచి జూన్ 3 సీట్ల కేటాయింపు జూన్ 6 రిపోర్టు గడువు జూన్ 7 నుంచి 8 -
జే–1 పెద్దపులి జాడేదీ?
ఇప్పటికే ఎస్–12 పెద్దపులిపై విషప్రయోగం అనుమానంతో కామారెడ్డి జిల్లాలో పలువురిపై కేసులుసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రెండు నెలల క్రితం నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లా ల అటవీ సరిహద్దుల్లో సంచరించిన జే–1 పెద్దపులి జాడ లేకుండా పోయింది. నెల రోజులుగా కదలికలు లేకపోవడంతో అటవీ శాఖ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఈ జే–1 పెద్దపులి వేటగాళ్ల చేతిలో మరణించిందా? మరెక్కడికైనా వెళ్లిందా? అన్నది తేలక నాలుగు జిల్లాల అటవీ అధికారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కమ్మర్పల్లి రేంజ్లో గట్టుపొడిచిన వాగు అటవీ సమీపంలో కొన్ని రోజులు సేదతీరిన జే–1 పెద్దపులి జగిత్యాల–సిరిసిల్ల సరిహద్దు అడవిలోకి వెళ్లి ఆవుల ను, జంతువులను వేటాడింది. చివరిసారిగా కామా రెడ్డి అటవీ ప్రాంతంలో కనిపించింది. ఏప్రిల్ రెండోవారం నుంచి దాని కదలికలు కనిపించలేదు. నాలుగు జిల్లాల అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లోనూ ఆనవాళ్లు కనిపించలేదు. పచ్చిక బయళ్లు, నీటి కుంటల వద్ద కూడా జే–1 పులి పాదముద్రలు కనిపించలేదు. ఇదిలా ఉండగా నెల రోజులు దాటిపోయినా కూడా పులి ఎక్కడ కూడా వేటాడిన దాఖలాలు లేకపోవడం గమనార్హం. దీంతో వేటగాళ్లు పెద్దపులిని చంపి గోర్లు, చర్మాన్ని తీసుకుని ఎక్కడో పూడ్చి పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేదా పులి అడవుల్లో మరింత లోపలికి వెళ్లి ఉండొచ్చనీ భావిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసుల సహాయంతో అటవీ శాఖ అధికారులు నిజామాబాద్–జగిత్యాల జిల్లా అటవీ సరిహద్దుల్లో పులి ఆనవాళ్ల కోసం షిఫ్ట్లవారీగా అన్వేషిస్తున్నారు. కమ్మర్పల్లి రేంజ్లో కోనాపూర్ సెక్షన్ పరిధిలో కేసీ తండా, వాసన్ గుట్ట పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేస్తున్నారు. అనుమానిత వేటగాళ్లపై నిఘా పెట్టడమే కాకుండా వాళ్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయినప్పటికీ పెద్దపులికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు. జగిత్యాల జిల్లా సరిహద్దుల్లో చింతకుంట బీట్లో ఒక చోట ఇనుప తీగతో ఏర్పాటు చేసిన కంచెను కనిపెట్టిన అటవీ అధికారులు దాన్ని తొలగించారు. ఎస్–12 పై ఇప్పటికీ కరువైన స్పష్టత తాజాగా జే–1 పులి కోసం నిజామాబాద్–జగిత్యాల జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద కనిపించింది జే–1 పులేనా.. కాదా? స్పష్టత కరువు విషప్రయోగం జరిగిందా? 2025 జూలైలో కామారెడ్డి జిల్లాలోకి ప్రవేశించిన ఎస్–12 అనే పెద్దపులిపై విష ప్రయోగం జరిగిన ఘటన కలకలం రేపింది. మాచారెడ్డి రేంజ్ పరిధిలో పెద్దపులి ఓ అవును చంపగా, పులి మళ్లీ ఆవు మాసం తినడానికి వస్తుందనే ఆలోచనతో కొందరు ఆవు కళేబరంపై విషం చల్లారు. అధికారులు విషప్రయోగం చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆ పులి బతికే ఉందా, మరణించిందా అనేది మిస్టరీగానే ఉంది. ఇప్పుడు కూడా కామారెడ్డి అటవీ సరిహద్దులోకి వచ్చి న జే–1 కనిపించకపోవడంపైనా అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ వద్ద కనిపించింది జే–1 పులేనా కాదా అనేదానిపైనా స్పష్టత లేదు. -
బీఆర్ఎస్ పని అయిపోయింది..!
కామారెడ్డి: తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని పీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టల్ ప్యాలెస్లో మంగళవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించారు.నూతన కమిటీ సభ్యులు, మండలాల అధ్యక్షులకు నియామకపత్రాలు అందజేసి, వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నుంచి మొదలుకొని సన్నబియ్యం పంపిణీ వరకు తెలంగాణలో అమలువుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవన్నారు.దేశానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శమన్నారు. గత ప్రభుత్వం దిగిపోయేటప్పుడు రాష్ట్రానికి రూ. 8 లక్షల కోట్ల అప్పులను మిగిల్చిందన్నారు. అంతటి ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఎక్కడా ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.అప్పట్లో వరి వేస్తే ఉరే అన్నారు..వరి వేస్తే ఉరే అని గతంలో రైతులను భయభ్రాంతులకు గురిచేసిన విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు మర్చిపోయారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. కల్లాల మీద రైతులు ప్రాణాలు విడిచిన దుస్థితి గత ప్రభుత్వంలో చూశామన్నారు. కేంద్ర ప్రభుత్వం 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొంటామని కొర్రీలు పెడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు.పీహెచ్సీల నుంచి గాంధీ, నిమ్స్ ఆస్పత్రుల వరకు వైద్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవాలన్న లక్ష్యంతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకోసం కష్టపడే వారికి తగిన గుర్తింపు ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు, నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, చైర్మన్లు ఇప్ప ఉమారాణి, సీమా షెట్కార్, పద్మ శ్రీకాంత్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
‘నిరంతరం కృషి చేయాలి’
కామారెడ్డి అర్బన్: విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత సూచించారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేవునిపల్లి లక్ష్మీదేవి గార్డెన్లో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు పొందిన వైశ్య విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. 56 మంది విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో తొలిసారిగా జిల్లా స్థాయి విద్యార్థుల అభినందన సభ నిర్వహించడాన్ని అభినందించారు. కార్యక్రమంలో జైళ్లశాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ దుద్దెల శ్రీనివాస్గుప్తా, రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఐవీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పబ్బ చంద్రశేఖర్, సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ నీల బాలు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిలువేరి మారుతి, జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్, ప్రతినిధులు సుధాకర్, వెంకటేష్, బుక్క రజని, అన్నపూర్ణ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
బక్రీద్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు! సోషల్ మీడియాపై కఠిన నిఘా!
కామారెడ్డి క్రైం: బక్రీద్ నేపథ్యంలో జిల్లాలోని ఈద్గాలు, మసీదులు, సున్నిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు, భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మంగళవారం జిల్లాలోని వివిధ పీఎస్ల ఎస్హెచ్వోలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు సూచనలు ఇచ్చారు.జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈద్గాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, అవసరమైన చోట్ల ముందస్తు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి అసత్య ప్రచారాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, సమాజంలో అలజడి సృష్టించే వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్ను మరింత బలోపేతం చేయాలన్నారు.సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద సమాచారం గానీ ప్రచారాలు గానీ దృష్టికి వస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద సిబ్బంది 24 గంటల పాటు నిరంతరాయంగా విధులు నిర్వహించాలన్నారు.పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్లో ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
బాన్సువాడ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు సూచించారు. మంగళవారం బాన్సువాడలో బీజేపీ ప్రశిక్షణ మహాభియాన్ శిబిరాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరా డాలన్నారు. శిబిరం రెండు రోజుల పాటు కొనసాగనుంది. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి యెండల లక్ష్మీనారాయణ, నాయకులు అరుణతార, మురళీధర్గౌడ్, రంజిత్మోహాన్, బాణాల లక్ష్మారెడ్డి, మధుసూదన్రెడ్డి, నరేందర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కోనాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: ప్రభుత్వం వెంటనే ప్రాణహిత –చే వెళ్ల 22వ ప్యాకేజీ పనులను ప్రారంభించాలని జలసాధన సమితి కన్వీనర్ వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 31న కామారెడ్డిలోని కర్షక్ బీఈడీ కళాశాలలో నిర్వహించే సమితి రౌండ్ టేబుల్ సమావేశం కరపత్రాలను మంగళవారం బీబీపేటలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి సమస్యపై 2005లో బీబీపేట పెద్ద చెరువు నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర చేసి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు. ప్రాణ హిత పనులు పూర్తయితేనే ఈ ప్రాంతానికి నీళ్లు వచ్చే అవకాశం ఉందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ ప్రణాళిక చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో జలసాధన సమితి కమిటి కోకన్వీనర్ రాజేశ్వర్, సభ్యుడు రవి గౌడ్, ఉపసర్పంచ్ ప్రశాంత్ పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లాలోని వివిధ కోర్టులు మంగళవారం 43 మందికి శిక్షలు విధించాయి. ఐదుగురికి ఒకరోజు, ముగ్గురికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు మొత్తం 43 మందికిగాను రూ. 51,800 జరిమానా విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ● 19 జీవాలు మృత్యువాత కామారెడ్డి క్రైం: రైలు ఢీకొన్న ఘటనలో 19 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్ గ్రామానికి చెందిన కుర్మ ఆరెల్లి లక్ష్మి మంగళవారం తన గొర్రెల మందను మేత కోసం తీసుకువెళ్లింది. తిరుగు ప్రయాణంలో రైలు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా వచ్చిన రైలు మందను ఢీకొంది. ఈ ప్రమాదంలో 19 గొర్రెలు మృతిచెందాయి. వాటి విలువ రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు తెలిపింది. -
హాజీపూర్లో రైతుల రాస్తారోకో
ఎల్లారెడ్డి: ధాన్యం తూకం వేసి రోజులు గడుస్తున్నా మిల్లులకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం ఎల్లారెడ్డి మండలం హాజీపూర్లో ఎల్లారెడ్డి –కామారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలరోజులవుతున్నా కాంటాలు కావడం లేదని, కాంటా అయిన వడ్లు మిల్లులకు తరలడం లేదని పేర్కొన్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రంలోనే గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షంతో వడ్లకు మొలకలు వచ్చాయన్నారు. తూకాలను వేగవంతం చేయాలని, కాంటా వేసిన వడ్లను వెంటవెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రేంకుమార్, ఎస్సై రాజు సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించడంతో రాస్తారోకో విరమించారు. -
పట్టుకోండి చూద్దాం!
● ఇళ్లకు ఎక్కువకాలం తాళం వేసి వెళ్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ● సీసీ కెమెరాలు, భద్రతా పరికరాలు ఏర్పాటు చేసుకోవాలి. ● కాలనీల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. ● బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోవాలి. ఎక్కువ నగదును ఇంట్లో ఉంచుకోవద్దు. ● పొరుగువారితో సమన్వయం కలిగి పరస్పర పర్యవేక్షణ కొనసాగించాలి.వేసవి సెలవులు కావడంతో పట్టణాల్లో నివసిస్తున్నవారు ఇళ్లకు తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లారు. మరికొందరు బంధువుల ఇళ్లకు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఇదే సమయంలో దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులు నిత్యం ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నా, గస్తీలు తిరుగుతున్నా చోరీలు ఆగడం లేదు. వరుసగా జరుగుతున్న చోరీలు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. జిల్లాలో ఇటీవల వరుసగా చోరీలు జరుగుతున్నాయి. ఈనెల 8 న కామారెడ్డిలోని లిక్కర్ మార్ట్లో చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు షటర్ తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించి కౌంటర్లో దాచి ఉంచిన రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి ఎల్లారెడ్డి, దోమకొండ మండల కేంద్రాల్లో సైతం దొంగలు కలకలం సృష్టించారు. దోమకొండలోని ఓ తాళం వేసిన ఇంట్లో చోరీ జరగ్గా.. ఎల్లారెడ్డిలోని ఓ జువెలరీ దుకాణం షటర్ తాళాలు పగులగొట్టేందుకు విఫలయత్నం చేశారు. ● ఈనెల 10 న బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలో 3 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. 4 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ● ఈనెల 11 న ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసిన 7 ఇళ్లలో చోరీలకు పాల్పడి దాదాపు 27 తులాల బంగారం, 47 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ● ఈనెల 12 న రాత్రి బీర్కూర్లో దొంగలు హల్చల్ చేశారు. ఓ కాలనీలో తాళం వేసిన మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. 20 తులాల బంగారం, 120 తులాల వెండి, రూ. లక్షన్నర నగదు దోచుకెళ్లారు. ● ఈనెల 23న జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో దొంగల సంచారం కలకలం రేపింది. వేకువజామున ఇద్దరు దుండగులు తాళం వేసిన ఇళ్లను గమనిస్తూ కాలనీలో సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. దీంతో కాలనీవాసులు భయాందోళనలకు గురయ్యారు.దొంగతనాల నివారణకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నాం. అనుమానితులపై ఎల్లవేళలా నిఘా ఉంటుంది. తాళం వేసి ఊరెళ్లేవారు ఇళ్లలో విలువైన వస్తువులు ఉంచకూడదు. ఎక్కువ రోజులు తాళం వేసి టూర్లకు వెళ్లేవారు సమీపంలోని పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలి. – రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డిగతంలో వేసవి కాలంలో మాత్రమే చోరీల ఘటనలు వెలుగు చూసేవి. అంతర్జిల్లా దొంగలు, ముఠాల సంఖ్య తక్కువగా ఉండేది. అలాంటి దొంగలు జైలుకు వెళ్తే మళ్లీ వారు బయటికి వచ్చేదాకా చోరీ కేసులు వెలుగు చూసేవి కావు. కొంత కాలంగా ముఠాలు, దొంగల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎంత మంది జైలులో ఉన్నా కొత్త చోరీల ఘటనలు వెలుగుచూస్తుండడమే ఇందుకు ఉదాహరణ. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో మహారాష్ట్రకు చెందిన కొన్ని ముఠాలు మాత్రమే సంచరించేవి. కొంతకాలంగా అనేక రాష్ట్రాలకు చెందిన ముఠాలు ఇక్కడ సంచరిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఉపాధి, వలస పేరుతో వచ్చే వారిలో పలువురు, వ్యసనాల బారిన పడిన కొందరు ఈజీ మనీ కోసం చోరీల వైపు వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు రాత్రికి రాత్రి దొంగలు తమ చేతివాటం చూపిస్తున్నారు. జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు వరుస చోరీ ఘటనలతో జనంలో ఆందోళన పోలీసులకు తలనొప్పిగా మారుతున్న కేసులుజిల్లాలో ఈ నెలలో పలు చోరీలు జరిగాయి. ఆయా కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ఈనెల 8 న కామారెడ్డిలోని లిక్కర్ మార్ట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించి నిందితులను రిమాండ్కు పంపించారు. చాలా కేసులు సవాల్గానే ఉన్నాయి.జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల దొంగల ముఠాల సంఖ్య కూడా పెరిగినట్లు తెలుస్తోంది. వరుసగా జరుగుతున్న చోరీ లతో జనం ఆందోళన చెందుతున్నారు. – కామారెడ్డి క్రైం -
వీధి కుక్కల స్వైర విహారం
కామారెడ్డి టౌన్ : జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా మంగళవారం పలువురిపై దాడి చేశాయి. బీబీపేటలో ఇద్దరు చిన్నారులపై దాడి చేసి ఒకరిని తీవ్రంగా గాయపరచగా.. సరంపల్లిలో నలుగురిని ఆస్పత్రిపాలు చేశాయి. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని సరంపల్లిలో ఓ వీధి కుక్క మంగళవారం పలువురిపై దాడి చేసింది. వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న గుడిసె లక్ష్మి, పోలు గంగయ్య, పోలు నరేశ్లతో పాటు పదేళ్ల బాలుడిని తీవ్రంగా గాయపరిచింది. కనిపించినవారిపైకి దూసుకురావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అంతకు ముందు కాలనీలో రెండు లేగ దూడలపై దాడి చేసి చంపినట్లు ఆరో వార్డు కౌన్సిలర్ నిట్టు గంగాధర్ తెలిపారు. కొన్ని రోజులుగా పట్టణ శివారు ప్రాంతాల్లో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, ఇప్పుడు ఏకంగా మనుషులు, పశువులపై దాడులకు తెగబడుతుండడంతో కాలనీవాసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సరంపల్లి, బీబీపేటలలో పలువురిపై దాడి ఐదుగురికి తీవ్ర గాయాలు రెండు లేగ దూడలను కొరికి చంపిన గ్రామసింహం భయాందోళనలో ప్రజలుబీబీపేట: వీధి కుక్క దాడి చేసిన ఘటనలో ఒక చిన్నారి తీవ్రంగా గాయపడగా.. మరో చిన్నారికి స్వల్ప గాయా లయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చాకలి రాజశేఖర్ కూతురు సాన్వి ఇంటి బయట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసింది. చిన్నారి కన్ను కింది భాగంలో, పెదవులపై తీవ్రగాయాలయ్యాయి. అదే కుక్క కొద్దిదూరంలో ఆడుకుంటున్న పాత గంగరాజు కూతురు రుద్వికపైనా దాడి చేసి గాయపర్చింది. ఇద్దరిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన రుద్వికకు చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్ర గాయాలపాలైన సాన్విని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. -
భవాని మాతకు ఘనంగా బోనాలు
పెద్దకొడప్గల్(జుక్కల్): బేగంపూర్ తండాలో భవాని మాత సేవలాల్ మహరాజ్ మందిర్ మూడో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం మహిళలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా బోనాలు, భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా కేంద్రానికి చెందిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పిడుగు మమత నియమితులయ్యారు. ఈ మేరకు టీపీసీసీ రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకత్వం సోమవారం నియామకపత్రం జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని మమత పేర్కొన్నారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి, నాయకులు ఆమెను అభినందిస్తూ సన్మానించారు. -
రసవత్తరంగా కుస్తీ పోటీలు
నిజాంసాగర్(జుక్కల్): మాగి గ్రామంలో సోమవారం మల్లయోధుల కుస్తీ పోటీలు రసవత్తరంగా సాగాయి. పోచమ్మ, ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా మల్లయోధులకు కుస్తీ పోటీలు ఏర్పాటు చేశారు. చుట్టు ప్రక్క గ్రామాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మల్లయోధులు కుస్తీ పోటీలకు తరలి రావడంతో హోరాహోరీగా జరిగాయి. గెలుపొందిన వారికి నగదు బహుమానంగా అందజేశారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్ర శ్రీనివాస్ పటేల్ తన తండ్రి జ్ఞాపకార్థం 3 తులాల వెండి కడియాన్ని విజేతకు బహుమానంగా అందజేశారు. సర్పంచ్ గుర్రపు సుమిత్ర, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, నాయకులు గుర్రపు శ్రీనివాస్ పటేల్, పండరి, శ్రీను, గంగారాం, ఎస్సై శివకుమార్ తదితరులున్నారు. -
శత రోజులు
శిలాఫలకం పడకుండానేనాలుగు మున్సిపాలిటీల్లో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనికి సంబంధించిన శిలాఫలకం పడకుండానే వంద రోజులు గడిచిపోయాయి. నూతన పాలకవర్గాలు వచ్చినప్పటికీ నిధులు లేక నిస్తేజంగా మారిన పట్టణాల్లో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. గతంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో కొత్తగా పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంకామారెడ్డి టౌన్ : జిల్లాలోని మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరి వంద రోజులు పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన జిల్లాలోని కామారెడ్డితోపాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో నూతన పాలకమండళ్లు ఆర్భాటంగా పదవీ బాధ్యతలు స్వీకరించాయి. అయితే తమ సమస్యలు తీరుతాయని, పట్టణాలు ప్రగతి పథంలో పయనిస్తాయని ఆశించిన ప్రజలకు ఈ వంద రోజుల కాలంలో నిరాశే ఎదురైంది. నిధుల కొరత సాకుతో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ‘కొత్త కౌన్సిల్.. పాత సమస్యలు’ అన్న చందంగా బల్దియా పాలన సాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పాలకవర్గాలు ఉన్నాయి. కామారెడ్డి బల్దియా పరిధిలో 49 వార్డులు, బాన్సువాడలో 19, ఎల్లారెడ్డిలో బిచ్కుందలో 12 చొప్పున వార్డులు ఉన్నాయి. కొత్త కౌన్సిల్లు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ కారణంగా వంద రోజుల్లో పాలకులు అభివృద్ధిలో తమదైన ప్రత్యేకత చూపలేకపోయారు. వార్డుల్లో సమస్యలపై ప్రజలు వారిని నిలదీస్తున్నారు. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం రావాల్సిన గ్రాంట్లు సకాలంలో అందకపోవడం, స్థానికంగా ఆదాయ వనరులు పెరగకపోవడంతో మున్సిపాలిటీల ఖజానా వెలవెలబోతోంది. గతంలో మంజూరైన పనులకు సైతం బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు మున్సిపల్ సిబ్బంది జీతాలు, అత్యవసర నిర్వహణ ఖర్చులకే నిధులు సరిపోతుండటంతో కొత్తగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పనికి కూడా రూపకల్పన చేయలేని పరిస్థితి నెలకొంది. ఎల్లారెడ్డిలో.. ఇక్కడ రూ.2 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నిధుల లేమితో నిలిచిపోయాయి. పట్టణంలో ఇంకా సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధిదీపాలు, కల్వర్టులు, అంతర్గత రహదారుల వంటి ఎన్నో పనులు చేపట్టాల్సి ఉంది. బిచ్కుందలో.. నూతనంగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో వంద రోజుల్లో ఒక్కటంటే ఒక్క శంకుస్థాపన గానీ, ప్రారంభోత్సవం గానీ జరగలేదు. డ్రెయినేజీ, రోడ్లు, వీధిలైట్లు, అక్రమ కబ్జాలు, తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వార్డు ఆఫీసర్లు లేరు. అధికారులు, నిధుల కొరత కారణంగా అభివృద్ధి కుంటుపడగా, ప్రజలు పాలకవర్గాన్ని నిలదీస్తున్నారు.నూతన పాలకవర్గాలు నిధులు లేవని చేతులు ముడుచుకోకుండా, ప్రత్యామ్నాయ వనరులను అన్వేషించాలని ఆయా పట్టణాల ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో డ్రెయినేజీలు, రహదారుల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఇప్పటికై నా ప్రజా సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళికలతో అభివృద్ధికి బాటలు వేయాలని అంటున్నారు. మున్సిపల్ పాలకవర్గాలకు నేటితో వంద రోజులు పూర్తి నిధులు లేకపోవడంతో నిస్తేజం నూతన పనులకు శంకుస్థాపన ఊసేలేదు పరిష్కారానికి నోచుకోని ప్రజా సమస్యలు -
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం
భిక్కనూరు : కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. సోమవారం అంతంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు షబ్బీర్ అలీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.అనంతరం షబ్బీర్ అలీ మా ట్లాడుతూ..అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభు త్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గు ర్తు చేశారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధా న్యత ఉంటుందన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎ న్నారై సెల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ కార్యదర్శి అఖిల్, నాయకులు సంజీవరెడ్డి, గంగారెడ్డి తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: రోహిణి కార్తె సోమవారం ప్రారంభమైంది. రైతులు రోహిణి కార్తె నుంచి తమ వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. పంట చేలల్లోకి పశువుల పెంట, సేంద్రియ ఎరువులను తోలడం ప్రారంభిస్తారు. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలిపోతాయని, అంటే అంతగా ఎండలు దంచికొడుతాయని అంటారు. రోహిణి కార్తె అనంతరం మిర్గం..మృగశిర కార్తె నుంచి రైతులు ఆకాశానికేసి వానలు కోసం చూస్తారు. రోహిణికార్తెలో వానలు కురిసి వెంటనే విత్తనాలు వేస్తే రోకళ్లలాంటి పంట పండుతుందని నానుడి. అంటే పంట దిగుబడి వస్తుందని నమ్ముతారు. సోమవారం మధ్యాహ్నం ఆయా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. భిక్కనూరు: రోహిణి కార్తె ప్రారంభం సందర్భంగా సోమవారం గుర్జకుంట గ్రామస్తులు మండల కేంద్ర శివారులో ఉన్న సిద్ధిరామేశ్వర ఆలయంలో స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పాడి పంటలు బాగా పండాలని ప్రతి సంవత్సరం స్వామివారికి రోహిణి కార్తె రోజు జలాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. నిజాంసాగర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రాల బలోపేతంతో పాటు పాఠశాలలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జుక్కల్ ఎమ్మె ల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవా రం జుక్కల్ మండలం నాగుల్గావ్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు చేతుల మీదుగా అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకువెళ్తుందన్నారు. కామారెడ్డి అర్బన్: ప్రజాపిత ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మీడియా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 29న శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ గచ్చిబౌలి శాంతి సరోవర్లో ‘ధ్యానం–సామాజిక శాంతి’ అంశంపై ఈ నెల మీడియా సెమినార్ నిర్వహిస్తున్నట్లు ప్రతినిధి బీకే సంతోషి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మీడియా మిత్రులు 99129 16539 నంబర్కు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చని, హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్క్లబ్ నుంచి 29న ఉదయం 9.30 గంటలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు ఓంశాంతి ప్రతినిధి సంతోషి పేర్కొన్నారు. -
నిందితుల కోసం గాలింపు
నిజామాబాద్అర్బన్: నగరంలోని ఫూలాంగ్ వాగు సమీపంలో ఆదివారం జరిగిన హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీశ్ తెలిపారు. అగర్వాల్ ఐ ఆస్పత్రి వెనకాల ఉన్న కల్లు బట్టిలో రాత్రి నలుగురు మధ్య గొడవ జరిగింది. పాటిగల్లికి చెందిన షాకీర్, శివ కలిసి బట్టీలో కల్లు సేవిస్తున్నారు. అక్కడ మరో ఇద్దరితో వీరికి గొడవ జరిగింది. షాకీర్ను బయటకు తీసుకొచ్చి బండరాయితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శివ తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలయ్యాడు. ఘటనపై ఎస్హెచ్వో సతీశ్ విచారణ జరిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పేర్కొన్నారు. -
చైన్ చోరీ కేసులో ఆటో డ్రైవర్ అరెస్ట్
నిజామాబాద్అర్బన్ : చైన్ చోరీ చేసిన కేసులో ఆటో డ్రైవర్ను అరెస్టు చేసినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. ఈ నెల 20న శుభకార్యానికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఓ వృద్ధురాలిని ఖానాపూర్కు చెందిన డ్రైవర్ విజయ్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కున్నాడు. వృద్ధురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితున్ని పట్టుకున్నారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
సమ్మర్ క్యాంప్.. సూపర్ హిట్
డొంకేశ్వర్(ఆర్మూర్): డొంకేశ్వర్ మండల కేంద్రంలోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొన్ని రోజులుగా ఉత్సాహాంగా సాగిన వేసవి శిబిరాలు (సమ్మర్ క్యాంపులు) ఘనంగా ముగిశాయి. కేవలం చదువుకే పరిమితం కాకుండా సెలవుల్లో విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకత, నైపుణ్యాలను వెలికితీయడమే లక్ష్యంగా ఈ క్యాంపులను నిర్వహించారు. సోమవారం ముగింపు వేడుకల సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వస్తువులు, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, హస్తకళలు, సందేశాత్మక చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ 15 రోజుల్లో విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు మెరుగవగా, నాయకత్వ లక్షణాలు పెరిగాయి. నైపుణ్యాలు బయటకు వెలికి తీసి వారిలో భయాన్ని పోగొట్టారు. హెచ్ఎం సురేశ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ట్యూటర్లుగా నియమింపబడిన స్వప్న, సంధ్యా, సాధన, రమేశ్ విద్యార్థులకు శిక్షణనిచ్చారు. 6వ తరగతి పూర్తి చేసిన అఖిల సమ్మర్ క్యాంప్లో చేరిన వారం రోజుల్లోనే నైపుణ్యాన్ని రెట్టింపు చేసుకుంది. కృత్రిమంగా పూల బొకెలు, జాయింట్ వీల్స్ను తయారు చేసింది. అలాగే 32 రకాల డ్రాయింగ్స్ను కూడా వేసింది. సరికొత్త నైపుణ్యాలతో మెరిసిన డొంకేశ్వర్ పీఎంశ్రీ స్కూల్ విద్యార్థులు డ్రాయింగ్, పెయింటింగ్ రూపంలో సందేశాత్మక చిత్రాలు -
మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటు
● అద్దె బస్సుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే తృత్వంలోని ప్రజా ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాన్ని పురస్కరించుకుని మండల మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం కేటాయించిన ఆర్టీసీ అద్దె బస్సులను వారికి అందజేశారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మ హిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం విరివిగా రుణా లు అందించడమే కాకుండా సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, ఆర్టీసీ అద్దె బస్సులు, స్కూ ల్ యూనిఫాంల స్టిచింగ్, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ వంటి ద్వారా మహిళల ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తోందన్నారు. జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలకు.రూ. 1100 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు 18 అద్దె బస్సులను కేటాయించిందని, అద్దె బస్సుల నిర్వహణను పక్కాగా పర్యవేక్షణ జరపాలని సమాఖ్య ప్రతినిధులకు సూచించారు. జిల్లాలోనే అత్యధికంగా వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. నగరంలో కలెక్టరేట్కు ఆనుకు ని అన్ని హంగులతో నూతనంగా నిర్మించిన ఇంది రా మహిళా శక్తి భవనం త్వరలోనే అందుబాటులో కి రానుందని వెల్లడించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, డాక్టర్ కవితా రెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, డీఆర్డీఏ సాయన్న, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, డీసీసీ అధ్యక్షుడు కాట్పల్లి నగేష్ రెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు హేమలత, మండల మహిళా సమాఖ్యల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
తక్షణ సాయానికి హెల్ప్లైన్
కామారెడ్డి టౌన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా మహిళా సాధికారిత కేంద్రం ఏర్పాటు చేసిన హెల్ప్లైన్, టోల్ ఫ్రీ నెంబర్ బోర్డును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణ, సాధికారిత, సంక్షేమం కోసం ప్రభుత్వం పలు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. మహిళలు ఎదుర్కొనే సమస్యలకు తక్షణ సహాయం అందించేందుకు హెల్ప్లైన్ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్ కార్యాలయాలు, కలెక్టరేట్తోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా సాధికారిత కేంద్రం హెల్ప్లైన్, టోల్ ఫ్రీ నెంబర్ బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు సులభంగా కనిపించే ప్రదేశాల్లో బోర్డులు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ, అత్యవసర సహాయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేడు ‘దోస్త్’ స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్ వెరిఫికేషన్తెయూ(డిచ్పల్లి): దోస్త్ కోర్సులలో స్పెషల్ కేటగిరి రెండో విడతలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు (పీహెచ్సీ/ సీఏపీ/ ఎన్సీసీ / స్పోర్ట్స్ /ఎక్స్ట్రా కరికులమ్ ఆక్టివిటీస్) ఈ నెల 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెయూ అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. -
క్రైం కార్నర్
పండుగ వేళ విషాదం ● బోల్తాపడిన ట్రాక్టర్.. యువతి మృతి ● రామారెడ్డిలో ఘటన రామారెడ్డి : రామారెడ్డి గ్రామంలో బీరప్ప పండుగ వేళ ఆదివారం విషాదం చోటు చేసుకుంది. గ్రామ శివారులో బీరప్ప పండుగ అనంతరం జరిగిన ట్రా క్టర్ ప్రమాదంలో యువతి మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రెడ్డి భూషణంకు చెందిన ట్రాక్టర్ను బీరప్ప పండుగ ముగిసిన అనంతరం బంధువు నర్సింలు నడుపుతుండగా, పటేల్ చెరువు సమీపంలో అదుపుతప్పి పొలంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ ముందు భాగంలో కూర్చున్న భూషణం పెద్ద కు మార్తె శ్రావ్య (19) తీవ్రంగా గాయపడింది. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం మేడ్చల్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి భూషణం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన దండు నారాయణ అనే వ్యక్తి తన ట్రాక్టర్లో మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నామని ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించామన్నారు. అనుమతి లేకుండా ఇసుకరవాణా చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. -
కామారెడ్డి కమిషనర్ ఆకస్మిక సెలవు
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ టి పర్వతాలు ఆకస్మిక సెలవు పెట్టి వె ళ్లిపోయారు. ఒత్తిడి తట్టుకోలేకే ఆయన సోమ వారం రాత్రి 8 గంటలకు అధికారిక సిమ్ కార్డును కార్యాలయంలో అప్పగించేసి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం పట్టణంలో హాట్టాపిక్గా మారింది. ఈనెల 4వ తేదీన బాధ్యతలు చేపట్టిన పర్వతాలు 22 రోజులకే వెళ్లిపోవడానికి తీవ్ర ఒత్తిడే కారణమని తెలుస్తోంది. గతంలో పనిచేసిన కమిషనర్ రాజేందర్రెడ్డిని సైతం కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత వచ్చిన కమిషనర్ 22 రోజులకే చేతులెత్తేశారు. సరెండర్ చేయండి లేదంటే సస్పెండ్ చేయించండి.. ఇటు కౌన్సిలర్లు, అటు ప్రజాప్రతినిధుల భర్తల ఆధిపత్య పోరుతో కమిషనర్ తీవ్ర ఆవేదనకు గురైనట్లు తెలిసింది. వీటికి తోడు ఓ పండుగ ఏర్పాట్ల విషయంలో సైతం కొందరు కౌన్సిలర్లు ఉన్నతాధికారుల ముందే కమిషనర్పై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాలతో మనోవేదనకు గురైన పర్వతాలు.. తనకు సెలవులు కావా లని ఉన్నతాధికారులను వేడుకున్నట్లు తెలిసింది. చైర్పర్సన్ చాంబర్లో నిర్వహించిన మీటింగ్లో నూ ఆయన మాట్లాడుతూ.. సెలవుపై వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని, లేదంటే ప్రభుత్వానికి సరెండర్ చేసినా, సస్పెండ్ చే యించినా ఫర్వాలేదని ఆవేదన తో మాట్లాడినట్లు సమాచారం. ప్రశ్నలు.. నిలదీతలు.. మున్సిపల్ కార్యాలయంలో సో మవారం మధ్యాహ్నం 2 గంటలకు చైర్పర్సన్ చాంబర్లో అధికారులతో సమీక్షాసమావేశం ఏ ర్పాటు చేశారు. అయితే కమిషనర్తోపాటు ఏ ఒక్క అధికారి సకాలంలో రాకపోవడంతో చైర్పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందే కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో నిర్వహించిన అత్యవసర సమావేశానికి వెళ్లడం వల్లే ఆలస్యమైందని కమిషనర్ వివరణ ఇస్తూ.. చైర్పర్స్కు క్షమాపణలు చెప్పినట్లు తెలిసింది. అయితే, సమావేశం ప్రారంభం కాగానే ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన రివ్యూ మీటింగ్కు ఎందుకు వెళ్లారంటూ ఓ ప్రజాప్రతినిధి భర్త అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. గతంలో ఓ మహిళా ఉద్యోగినిని, ఇటీవల టీపీబీఈవోపై ఆ ప్రజాప్రతినిఽధి భర్త పెత్తనంతో దూషించడం, తాజాగా కమిషనర్పై కూడా ఆగ్రహించడంతో కార్యాలయంలో ఆయన వ్యవహార శైలి చర్చనీయాశమైంది. ఫిర్యాదు సమావేశం ప్రారంభానికి ముందే చైర్పర్సన్ ఇప్ప ఉమారాణితోపాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపుకలెక్టర్ ఏవీ గిరికి కమిషనర్ పర్వతాలుపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షాసమావేశానికి ప్రోలోకాల్కు విరుద్ధంగా కమిషనర్ హాజరయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిమ్కార్డును ఆఫీస్లో ఇచ్చేసి వెళ్లిపోయిన పర్వతాలు బాధ్యతలు చేపట్టిన 22 రోజులకే వెనుదిరిగిన అధికారి ఒత్తిళ్లను తట్టుకోలేకేనా..? -
మహిళా సాధికారతకు పెద్దపీట
● ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్గా భూమిపూజకామారెడ్డి టౌన్ : ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందిరా మహిళా శక్తి గ్రామ సంఘాల భవనాల భూమిపూజ, ప్రారంభోత్సవ కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్వీ గిరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్తగా నిర్మించే గ్రామ సంఘాల భవనాలు మహిళా పరస్పర సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద చేపడుతున్న ఈ కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని సూచించారు. రూ.43.70 కోట్లతో భవనాలు, గోదాములు నిర్మించనున్నట్లు తెలిపారు. డీఆర్డీవో దామోదర్రెడ్డి, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రమీల, జిల్లా సమాఖ్య కోశాధికారి లక్ష్మి, కార్యదర్శి రాజమణి, వివిధ మహిళా సమాఖ్య సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
శ్మశానవాటిక అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని హిందూ శ్మశానవాటిక నిర్మాణానికి, అభివృద్ధికి తాము అన్ని కు లసంఘాల వారితో మాట్లాడి కృషి చేస్తుంటే, కొంద రు నాయకులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. సోమవారం జిల్లా కేంద్రంలోని నియోజకవ ర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎస్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు శ్మశాన వాటికల ను అభివృద్ధి చేస్తామని ముందుకు వచ్చి జిల్లా ఉన్నతాధికారులను విన్నవించినా అనుమతులు ఇవ్వ డం లేదని మండిపడ్డారు. రాబోయే 10 రోజుల్లో జిల్లా కలెక్టర్ను కలిసి శ్మశానవాటిక అభివృద్ధికి అనుమతులు కోరతామని, అధికారులు స్పందించకుంటే అన్ని కుల సంఘాల నాయకులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కొత్త కమిషనర్ బాధ్యతలు చేపట్టిన మూడు రోజులకే నిజామాబాద్ వ్యక్తులకు చెందిన 6 ఎకరా ల వెంచర్కు హుటాహుటిన అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. గత వర్షాకాలంలో కూలిపోయిన రోడ్డు డివైడర్లను తిరిగి నిర్మించే పనులను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు. కస్తూ ర్బా ఆస్పత్రి వెనకాల మురికి కాలువపై జరుగుతు న్న అక్రమ కట్టడాలను వారం రోజుల్లోగా కూల్చి వేయకపోతే, నేరుగా ఆయా కట్టడాల ముందే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహిస్తామని స్పష్టం చేశారు. టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పిడుగు మమత, కౌన్సిలర్ మహేష్, నాయకులు నర్సాగౌడ్, సాయిబాబు, తాటి ప్రసాద్, సలీం, చాట్ల వంశీ, తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల్లో స్పందించకుంటే కలెక్టరేట్ ముట్టడిస్తాం అక్రమ వెంచర్లకు అనుమతులు ఎలా ఇస్తారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి -
వడ్లను ఇంకెప్పుడు కొంటరు?
● అన్నారం అన్నదాతల ఆగ్రహం ● మండుటెండలో రాస్తారోకోరామారెడ్డి: చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి ఎదురుచూడాల్సి రావడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నారంలో మండుటెండలో రాస్తారో కో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 40 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బందిపడుతున్నామన్నారు. తూకాలలో జా ప్యం జరుగుతోందని, దీంతో రోజూ వడ్ల కుప్పల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా తూకాలు పూర్తయ్యేలా చూడాలని కోరారు. -
క్యాన్సర్ బారిన బాలిక
● చికిత్సకు రూ. 4.50 లక్షలు ● ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు.. నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఈరవేణి మాధురి(15) ప్రమాదకర క్యాన్సర్తో పోరాడుతోంది. నిరుపేద కుటుంబానికి చెందిన మాధురి క్యాన్సర్ చికిత్సకు రూ. 4.50 లక్షలు అవసరమవడంతో ఆసన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. గ్రామానికి చెందిన ఈరవేణి లతకు మాధురి, కృపాలి ఇద్దరు కుమార్తెలు. ఈరవేణి లత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ వద్ద వంట మనిషిగా పని చేస్తోంది. భర్త కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్నాడు. పెద్ద కూతురు మాధురి ఆర్మూర్లోని కేజీబీవీలో విద్యాభ్యాసం చేస్తుంది. కొన్ని రోజుల కిత్రం ఆడుకునే సమయంలో కాలికి గాయమైంది. తగ్గకపోవడంతో వైద్యులను సంప్రదించగా క్యాన్సర్కు దారితీసినట్లు తెలిసింది. అప్పటికే అక్కడిక్కడ అప్పు చేసి రూ. 3 లక్షలు ఖర్చు చేశారు. ఈ చికిత్సకు మరో రూ. నాలుగున్నర లక్షలు అవసరమని వైద్యులు చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. చికిత్సకు సహకరించే దాతలు 62243637962(ఐఎఫ్ఎస్సీ 72111947869) కు డబ్బులు పంపాలని తల్లి లత వేడుకుంటోంది. రూ.76 వేల ఆర్థిక సహాయం ఈరవేణి మాధురి దైన్య స్థితిని గమనించిన గ్రామానికి చెందిన కోనేరు ప్రసాద్ తన బీటెక్ మిత్రులకు ఈ విషయాన్ని తెలియజేశాడు. స్పందించిన మిత్రులు రూ. 76 వేలు పోగు చేయగా చికిత్స నిమిత్తం మాధురి తల్లి లతకు ఈ నగదును అందజేశారు. -
కారు, లారీ ఢీ
● ముగ్గురికి గాయాలు ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన నలుగురు కారులో నిజామాబాద్ వెళ్తుండగా, నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న లారీ అంకాపూర్ వద్ద కారును ఢీకొట్టింది. కారులో ఉన్న బెలూన్స్ బయటికి రావడంతో ప్రాణనష్టం జరగలేదు. స్థానికులు వెంటనే కారులో ఉన్న నలుగురిని బయటకు తీసి 108 అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే, కారులో ఉన్న ఇద్దరికి స్వల్పగాయాలు కాగా, మహేందర్ అనే వ్యక్తికి తీవ్రగాయాలైనట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేయాలి
కామారెడ్డి టౌన్ : వరి, మక్క కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి ఉత్తమ్కుమార్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పలువురు మంత్రులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదాముల కొరత, లారీలు, హమాలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బంది పెట్టే మధ్యవర్తులు, మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే వారిని ఉపేక్షించవద్దన్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో పంటల అవశేషాలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం పెరగడంతో పాటు నేల సారం దెబ్బతింటుందని, దీనిపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం నుంచి నిర్వహించనున్న మహిళా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతం చేయా లన్నారు. కామారెడ్డినుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి టౌన్ : కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆ దేశించారు. మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడరాఉ. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు వేచి ఉండే పరిస్థితులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారంనుంచి 30 వరకు మహిళా సాధికారిత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థిక, సామాజిక, ఆరోగ్య భద్రత అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళా సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయా లని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీఆర్డీవో దామోదర్రెడ్డి, రైస్ మిల్లర్స్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ‘ప్రజాపాలన’ కార్యక్రమాలను విజయవంతం చేయండి వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి -
కలిసొచ్చిన యాసంగి
జిల్లాలో యాసంగి సీజన్లో 2.57 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. పంట సాగు మొదలు నుంచి కోత దశ వరకు వాతావరణ పరిస్థితులు అనుకూలించింది. దీంతోపాటు చీడ పీడల ప్రభావం లేకపోవడంతో పంటలపై పురుగు మందుల పిచికారి, రసాయన ఎరువుల వాడకం తగ్గడంతో పెట్టుబడులు సైతం తగ్గాయి. ఇదే సమయంలో దిగుబడులు సైతం సాధారణం కన్నా నాలుగైదు క్వింటాళ్లు ఎక్కువగా వచ్చాయి. ఎకరానికి 28 నుంచి 34 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చాయని రైతులు పేర్కొంటున్నారు. నత్తనడకన ధాన్యం సేకరణ ప్రభుత్వం ఐకేపీ, సహకార సంఘాల ఆధ్వర్యంలో వ రిధాన్యం కొనుగోళ్లు చేపడుతోంది. జిల్లాలో 399 కొ నుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 3.51 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరించారు. రైతుల ఖా తాలలో 668 కోట్ల రూపాయలు జమ చేశారు. మరో రూ. 21.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు 99 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు పూర్తవగా.. ఇంకా 300 కేంద్రాల్లో తూకాలు కొనసాగుతున్నా యి. ధాన్యం సేకరణలో జరుగుతున్న తీవ్ర జాప్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్ సమీపిస్తున్నా ఇంకా కుప్పలు తెప్పలుగా వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నాయి. ఇంకా 1.50 లక్ష ల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించాల్సి ఉంద ని తెలుస్తోంది. సన్నరకం వడ్ల సేకరణ దాదాపు పూర్తి కాగా.. దొడ్డు రకం వడ్ల సేకరణ కొనసాగుతోంది.యాసంగి సీజన్లో రైతులకు వరి సాగు కలిసొచ్చింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, చీడపీడల ప్రభావం తగ్గడంతో పెట్టుబడులు తగ్గాయి. మరోవైపు దిగుబడులు సైతం బాగుండడంతో రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అయితే కొనుగోళ్లలో జాప్యంతో ఇబ్బందులు పడుతున్నారు. – నిజాంసాగర్ఈసారి యాసంగి సీజన్ కలిసొచ్చింది. దొడ్డు రకం వరి పంట పండించిన. ఎకరానికి 32 క్వింటాళ్ల దాకా దిగుబడి వచ్చింది. మంచి దిగుబడులు రావడంతో నాలుగు పైసలు మిగిలినై.. – గొల్ల మల్లేశ్ యాదవ్, రైతు, నర్వ16 ఎకరాల్లో వరి పంట సాగు చేసిన. సన్నరకాలు ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు వచ్చినై. ఈసారి తెగుళ్ల బెడద లేకపోవడంతో పెట్టుబడి తగ్గింది. దిగుబడి పెరగడంతో రెక్కల కష్టానికి ఫలితం దక్కింది. – కై దాపురం సాయిరెడ్డి, రైతు, గున్కుల్ తగ్గిన పెట్టుబడులు.. పెరిగిన దిగుబడులు ఎకరాకు 28 నుంచి 34 క్వింటాళ్ల వడ్ల రాక కొనసాగుతున్న కొనుగోళ్ల ప్రక్రియ ఇప్పటికే 3.51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ -
క్రైం కార్నర్
బైక్ అదుపుతప్పి ఒకరి మృతి మాక్లూర్: బైక్ అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో ఆదివారం చోటు చోసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. కల్లెడి గ్రామానికి చెందిన తూర్పు గంగాభూషన్(46) అనే రైతు బైక్పై పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యంలో నిజాంసాగర్ కెనాల్ కల్వర్టు మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు అదుపుతప్పి కెనాల్లో పడి తీవ్రగాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గంగాభూషన్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: మండలంలోని చేపూర్ గ్రామ శివారులో ఉన్న పేకాటస్థావరంపై ఆదివారం చీత ఫోర్స్ దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న వారి నుంచి రూ. 18,300 నగదు, రెండు కార్లు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
రోజుకు 12 లారీలను అన్లోడ్ చేసుకోవాలి
● మిల్లర్లకు అదనపు కలెక్టర్ విక్టర్ సూచన ● కొనుగోలు కేంద్రాలు, రైస్మిల్లుల పరిశీలనమాచారెడ్డి : కొనుగోలు కేంద్రాలలో ధాన్యం నిల్వలు పెరిగిపోకుండా ఉండేందుకు రైస్ మిల్లర్లు రోజుకు కనీసం 12 లారీల ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. ఆదివారం ఆయన చుక్కాపూర్, లచ్చాపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముగించాలన్న ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. మిల్లర్లతో మాట్లాడి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, మిల్లింగ్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. లారీల కొరత రాకుండా చర్యలు చేపట్టాలన్నారు.భిక్కనూరు : రైస్ మిల్లులలో ధాన్యపు నిల్వలు పెరగకుండా మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ విక్టర్ రైస్మిల్లర్లకు సూచించారు. ఆదివారం మండలకేంద్ర సమీపంలోని రైస్మిల్ను సందర్శించి అన్ లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట జిల్లా సహకార అధికారి రామ్మోహన్, సివిల్ సప్లై డీటీ కృష్ణయ్య ఉన్నారు. -
సెల్ వదిలి..శిక్షణకు కదిలి..
● సమ్మర్ క్యాంపులో విద్యార్థుల సందడి ● డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో శిక్షణ పొందుతున్న చిన్నారులు ఆర్మూర్ టౌన్ : మామూలు రోజుల్లో సెల్ ఫోన్ దొరికితే చాలు..పిల్లలు పట్టువిడువరు. ఇక వేసవి సెలవుల్లో అయితే.. సెల్ ఫోన్, టీవీ తదితర వాటికి అతుక్కుపోతారు. ఈ వేసవి సెలవులు మాత్రం వినూత్నంగా సాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలతోపాటు ప్రయివేటు సమ్మర్ క్యాంపులు సైతం విద్యార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని జంబిహనుమాన్ ఆలయ ఆవరణలో గల పీఎంశ్రీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. మోడల్ స్కూల్, కస్తూర్బా, జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు మొత్తం 90 మంది రోజూ హాజరవుతున్నట్లు హెచ్ఎం వనజారెడ్డి తెలిపారు. డ్రాయింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, సంగీతం, యోగా తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. వేసవి సెలవులను పిల్లలు వృథా చేయకుండా, ఇంట్లో ఉండి సెల్ ఫోన్ పట్టకుండా శిక్షణ పొందడంపై తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కొత్త హస్తకళలు నేర్చుకోవడం ఆనందంగా ఉంది. మా చేతులతో తయారు చేసిన బొమ్మలను ఇంటికి తీసుకెళ్లినప్పుడు అందరూ అభినందించారు. డ్రాయింగ్ కూడా చక్కగా నేర్పుతున్నారు. – విహాన్, ఆర్మూర్ డ్రాయింగ్ క్లాస్ చాలా ఇష్టం. కొత్త రంగులను ఉపయోగించి చిత్రా లెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు చాలా రకాల డ్రాయింగ్ మెళకువలను నేర్పిస్తూ, మాతో చిత్రాలు వేయిస్తున్నారు. – నిత్యశ్రీ, 8వ తరగతి, బాలికల పాఠశాల,ఆర్మూర్ ప్రతిరోజు ఉదయం యోగా చేయడంతో చైతన్యం పెరిగింది. దీంతో చదువుకునే శక్తి కూడా మెరుగుపడింది. సంగీతం క్లాస్లో కొత్త పాటలు నేర్చుకున్నాను. – అఖిల,7వ తరగతి మోడల్ స్కూల్, పెర్కిట్ పల్లెటూరి సంప్రదాయక గోళీలాట -
కుసుమ నూనెకు భలే డిమాండ్..!
మద్నూర్(జుక్కల్): వంట నూనెల ఎంపికతోనే ఆరోగ్యం బాగుంటుందని, మార్కెట్లో నూనెలు కల్తీ అవుతున్నాయని ప్రజలు కుసుమ నూనెను ఎంచుకుంటున్నారు. రిఫైన్డ్ నూనెతో పోలిస్తే గుండె ఆరోగ్యానికి కుసుమ నూనె బాగుంటుందని అధిక కొలెస్ట్రాల్ ఉండదని వైద్యులు చెబుతుండటంతో కుసుమ నూనెకు డిమాండ్ ఏర్పడింది. మండలంలో రైతులు పండించిన కుసుమ గింజలను ప్రజలు క్వింటాలుకు రూ.6 వేలతో కొనుగోలు చేసుకుంటున్నారు. క్వింటాల్ కుసుమలకు 27 కిలోల వరకు నూనె వస్తుందని వారు తెలిపారు. కుసుమ నూనెలో ఆరోగ్యానికి మేలు చేసే ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్–ఈ పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి, చర్మ సంరక్షణలో, బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుందని వైద్యులు చెబుతుండటంతో ప్రజలు కుసుమ నూనైపె ఆసక్తి చూపుతున్నారు. మండలంలోని గానుగ నూనె మిషన్ల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. -
ఆర్టీసీ బస్సు కిందపడి ఒకరి దుర్మరణం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎస్సై రాహుల్రెడ్డి తెలిపిన వివరా ల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన బక్కి నర్సయ్య(55) బైక్పై సిరిసిల్లలో ఉంటున్న తన కొడుకును కలిసేందుకు వెళ్తున్నాడు. వెంకటాపూర్ శివారులో ఎదురుగా వస్తున్న ఆటోను ఓవర్ టేక్ చేస్తూ పక్క నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు కింద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై రాహుల్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మొదట గుర్తు తెలియ ని వ్యక్తిగా భావించగా మృతుడి ప్యాంటు జేబులో లభించిన ఆధార్కార్డు ఆధారంగా నర్సయ్యగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భీమ్గల్ యువకుడి నూతన ఆవిష్కరణ
● 100 డిగ్రీల వేడితో ఆహారం తయారయ్యే ‘వాక్యూమ్ ఫ్రైయర్’ తయారీసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలోని భీమ్గల్ మండల కేంద్రానికి చెందిన డాక్టర్ ప్రణీత్ జువ్వి తక్కువ నూనెతో ఎక్కువ ఆరోగ్యం ఎలా అనే ఆలోచనలతో పరిశోధనలు చేసి ‘వాక్యూమ్ ఫ్రైయర్’ అనే పరికరాన్ని తయారు చేశారు. దానికి పేటెంట్ తీసుకున్నారు. వాక్యూమ్ ఫ్రైయింగ్ పరికరం ద్వారా ఆహారం తక్కువ ఒత్తిడి 100 డిగ్రీల నుంచి 120 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత వద్ద మాత్రమే వేడి అవుతుంది. వాక్యూమ్ కారణంగా ఆహారంలో ఉన్న నీరు తక్కువ ఉష్ణోగ్రతలోనే త్వరగా ఆవిరై బయటకు వస్తుంది. కానీ ఆ ఖాళీ స్థానాల్లోకి నూనె ఎక్కువగా చొరబడదు. దీంతో ఆహారంలో నూనె శాతం గణనీయంగా తగ్గి, తక్కువ కొవ్వుతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం లభిస్తుంది. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా అక్రిలమైడ్ వంటి హానికర రసాయనాల ఏర్పాటును తగ్గించవచ్చు. ఈ విధానంలో తయారైన ఆహారంలో సహజ రంగు, రుచి, వాసన, పోషక విలువలను ఎక్కువగా నిల్వ ఉంచుతుంది. ఇక పండ్లు, కూరగాయలు, చిప్స్ తయారీలో వాక్యూమ్ ఫ్రైయర్ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అయితే ఈ సాంకేతికతలో ఉపయోగించే యంత్రాలు ఖరీదైనవి కావడం, నిర్వహణ కొంత క్లిష్టంగా ఉండడం గమనార్హం. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లోని ఇంఫాల్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో సహాయ ఆచార్యుడిగా పనిచేస్తున్న ప్రణీత్ ఫుడ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. ఇంటర్ వరకు నిజామాబాద్లో చదివిన ప్రణీత్ బాపట్లలో ఫుడ్ టెక్నాలజీలో బీటెక్, పంజాబ్లో ఎంటెక్, మైసూరులోని ఫుడ్ టెక్నాలజీ సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. తరువాత డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో రీసెర్చ్ అసోసియేట్గా పనిచేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారంతోనూ పరిశోధనలు చేశారు.150 నుంచి 200 డిగ్రీల్లో వేడి చేయడంతో అనారోగ్యం..‘‘ఆహారాన్ని వేడి నూనెలో వేయించడం సాధారణ విధానం. ఈ విధానంలో ఆహారాన్ని పూర్తిగా నూనెలో ముంచి 150 డిగ్రీల నుంచి 200 డిగ్రీల వరకు ఉండే అధిక ఉష్ణోగ్రత వద్ద వేయిస్తారు. దీంతో ఆహారంలో ఉన్న నీరు ఆవిరై బయటకు వెళ్లిపోయి, ఆ ఖాళీ స్థానాల్లోకి నూనె చొరబడుతుంది. దీంతో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇలాంటి ఆహారాన్ని తరచుగా తీసుకుంటే బరువు పెరగడం, గుండె సంబంధ వ్యాధులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది. అదనంగా అధిక ఉష్ణోగ్రతల వద్ద అక్రిలమైడ్ వంటి హానికర రసాయనాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకే నూనె ను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వల్ల నూనెలో టోటల్ పోలార్ మెటీరియ ల్స్, పెరాక్సైడ్ విలువ పెరుగుతూ నూనె నాణ్యత తగ్గిపోతుంది. ఆక్సిడేషన్ పెరిగి విషపూరిత పదార్థాలు ఏర్పడతాయి. దీని ఫలితంగా ఆహారం రుచి, వాసన మారడమే కాకుండా ఆరోగ్యపరమైన ప్రమాదాలు కూడా పెరుగుతాయి’’ అని వాక్యూమ్ ఫ్రైయర్ తయారీదారు ప్రణీత్ పేర్కొంటున్నారు. -
అ‘పూర్వ’ సమ్మేళనం
సాక్షి, నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్, రామారెడ్డిలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని ఆత్మీయంగా పలకరించుకున్నారు. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒకే వేదికపై తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను కలుసుకోవడంపై అటు గురువులు, ఇటు విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం అందరూ కలిసి విందు భోజనం చేశారు. -
రీచార్జ్ అయ్యేదెలా?
వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలు ఎంతో దోహదపడతాయి. ఇంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే సమయంలోనే బల్దియాలలో ముందస్తుగా ఇంకుడు గుంతల రుసుమును వసూలు చేస్తున్నారు. అయితే నిధులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ.. పనులు చేపట్టడంలో చూపడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఒక్క ఇంకుడు గుంతకు కూడా టెండర్లు నిర్వహించకపోవడం గమనార్హం. ఉన్నతాధికారులు, పాలకులు ఏళ్లుగా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో లక్ష్యం నీరుగారుతోంది. ఇంకుడు గుంతల పేరుతో వసూలు చేసిన నిధులను ఇతర అవసరాలకు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వసూళ్లతోనే సరి.. కామారెడ్డి మున్సిపాలిటీలో 30 వేలకుపైగా ఇళ్లున్నాయి. బాన్సువాడలో 18 వేలు, ఎల్లారెడ్డిలో 10 వేలు, బిచ్కుందలో 7 వేల వరకు గృహాలు ఉన్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో ఏటా 400 నుంచి 500 వరకు కొత్త ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇస్తుండగా.. బాన్సువాడలో 250, ఎల్లారెడ్డిలో 150, బిచ్కుందలో 100 చొప్పున అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఈ దరఖాస్తుతో పాటే ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మాణానికి సైతం అడ్వానన్స్గా రూ. 2,500 నుంచి రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇంకుడు గుంతల పేరుతో ఏటా రూ. రూ. 45 లక్షల వరకునిధులు బల్దియా ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఏడాదికి కామారెడ్డి బల్దియాకు రూ. 25 లక్షలు, బాన్సువాడలో రూ. 10 లక్షలు, ఎల్లారెడ్డిలో రూ. 6 లక్షలు, బిచ్కుందలో 3 లక్షల వరకు నిధులు వస్తున్నాయి.మున్సిపాలిటీల్లో ఇంకుడు గుంతల నిర్మాణాల అంశాన్ని త్వరలోనే కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల అధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తాం. ఇంజినీరింగ్ శాఖ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తాం. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించి త్వరలోనే తగిన చర్యలు చేపడతాం. – పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డిమున్సిపల్ నిబంధనల ప్రకారం ఇలా వసూలైన నిధులతో ఇంజినీరింగ్ విభాగం ద్వారా టెండర్లు నిర్వహించి, అనుమతి తీసుకున్న ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను తవ్వించాల్సి ఉంటుంది. ఈ బాధ్యత బల్దియా అధికారులపైనే ఉంది. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ నిధులను కౌన్సిల్ అనుమతితో ఇతర పనులకు మళ్లించి ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై పాలకవర్గాలు కూడా దృష్టి సారించడం లేదు. బల్దియా సాధారణ సమావేశాల ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరచడం గానీ, చర్చించడం గానీ చేయడం లేదు. తమ వద్ద ముందస్తుగా ఇంకుడు గుంతల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం చాలా మంది ఇంటి యజమానులకే తెలియకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే ఇంకుడు గుంతల నిర్మాణానికి టెండర్లు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటుతున్న తరుణంలో వాటిని రీచార్జ్ చేసేందుకు చేపట్టాల్సిన చర్యలను మున్సిపల్ అధికారులు గాలికొదిలేశారు. ఇంకుడు గుంతల నిర్మాణాల్లో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే ఇంకుడు గుంతల రుసుమును వసూలు చేస్తున్నా.. ఏళ్లుగా ఒక్క గుంతనూ తవ్వించకపోవడం విమర్శలకు తావిస్తోంది. – కామారెడ్డి టౌన్ పట్టణాల్లో ఇంకుడుగుంతల తవ్వకంపై నిర్లక్ష్యం ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలో అడ్వాన్స్లు స్వీకరిస్తున్న బల్దియాలు ఏళ్లుగా ఒక్క గుంతకూ టెండర్లు నిర్వహించని అధికారులు పట్టించుకోని పాలకులు.. నీరుగారుతున్న సర్కారు లక్ష్యం -
వేసవి శిబిరం.. ఉల్లాసభరితం
● పీఎంశ్రీ పాఠశాలలో కొనసాగుతున్న శిక్షణ ● కుట్టుమిషన్, కంప్యూటర్ పరిజ్ఞానం, ఇండోర్గేమ్స్పై విద్యార్థుల ఆసక్తి నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం పీఎంశ్రీ పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి విశేష స్పందన లభిస్తోంది. శిబిరానికి ప్రతి రోజూ 100 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కుట్టుమిషన్, కంప్యూటర్తోపాటు ఇండోర్ గేమ్స్లో ఉల్లాసంగా పాల్గొంటున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతున్న ఈ శిబిరంలో విద్యార్థులకు పలు అంశాలలో ప్రత్యేక ఇన్స్ట్రక్టర్లు శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవులు వృథా కాకుండా పిల్లల్లో నైపుణ్యం పెంపొందించేందుకు వేసవి శిబిరాలు ఉపయోగపడుతుండటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 10 రోజులుగా బొల్లారం స్కూల్లో ఏర్పాటు చేసిన వేసవి శిబిరానికి హాజరవుతున్నాను. కుట్టుమిషన్పై శిక్షణ పొందుతున్నాను. ఇండోర్ గేమ్స్ కూడా ఆడుతున్నాను. ఎండలో తిరగకుండా మంచి శిక్షణ ఏర్పాటు చేశారు. – జ్యోతి, విద్యార్థి, పల్లెబోగుడతండా నేను చెస్ నేర్చుకుంటున్నాను. సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్దామనుకున్నాను. కానీ, మా ఊర్లోని పాఠశాలలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేస్తున్నారని తెలుసుకొని ఇంటి వద్దే ఉండి రోజూ శిబిరానికి వస్తున్నాను. చెస్ చాలా చక్క గా నేర్పుతున్నారు. – సాయికుమార్, విద్యార్థి, బొల్లారం నేను కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ పొందుతున్నాను. రోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిక్షణ శిబిరంలో కంప్యూటర్ నేర్చుకుంటున్నాను. భవిష్యత్తులో నాకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. – సుమలత, విద్యార్థి, బొల్లారం -
నిబంధనలను ఉల్లంఘిస్తే సహించేది లేదు
● చట్టానికి లోబడే ఖుర్బాని ఉండాలి ● పశువైద్యులు, పోలీసులు సమన్వయంతో పని చేయాలి ● పోలీస్ కమిషనర్ సాయిచైతన్య రెంజల్(బోధన్): చట్ట ప్రకారం అనుమతించిన పశువులనే బక్రీద్ సందర్భంగా ఖుర్బాని చేయాలని సీపీ సాయిచైతన్య స్పష్టం చేశారు. మండలంలోని సాటాపూర్లో శనివారం కొనసాగిన పశువుల సంతను సీపీ ఆకస్మికంగా సందర్శించారు. పశువుల, కూరగాయల సంతలో కలియతిరిగి వ్యాపారులతో మాట్లాడారు. వాహనాల్లో పరిమితికి మించి పశువులను తరలించొద్దని వ్యాపారులు, కొనుగోలుదారులకు సూచించారు. బక్రీద్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆవులు, దూడలను ఖుర్బాని ఇస్తున్నారని తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, నిషేధిత పశువులను తరలించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంతలో జరిగిన పశువుల క్రయవిక్రయాల వివరాలను జీపీ సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. పశువైద్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాన్ని సందర్శించిన సీపీ ఆరోగ్యంగా ఉన్న పశువులకు మాత్రమే సర్టిఫికెట్లు అందించాలని వైద్యులకు సూచించారు. కొనుగోలుదారులు పశువులను తరలిస్తున్న వాహనాలను పరిశీలించారు. పశువైద్యు లు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలన్నా రు. శాంతియుత వాతావరణంలో పండగ నిర్వహించుకోవాలని సూచించారు. అనుమానాస్పద కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు. సీపీ వెంట బోధన్ ఏసీపీ శ్రీనివాస్, పశువైద్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రోహిత్రెడ్డి, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, రెంజల్, నవీపేట్,ఎడపల్లి మండలాల పశువైద్యాధికారులు విఠ ల్, నరేందర్, సురేశ్, ప్రమోద్ తదితరులున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో.. బోధన్టౌన్(బోధన్): శాంతి భద్రతల పరిరక్షణలో, సమాజ భద్రతలో సీసీ కెమరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని సీపీ సాయి చైతన్య అన్నారు. ‘మన ఊరు – మన భద్రత – మన బాధ్యత’లో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమరాలను పట్టణ పోలీస్ స్టేషన్లో సీపీ ప్రారంభించారు. పట్టణంలో రాత్రి వేళల్లో రోడ్డు ప్రమాదాలను గుర్తించడానికి, చోరీ కేసులను ఛేదించడానికి, అల్లర్లు సృష్టించే వారిని గుర్తించడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయన్నారు. అడిషనల్ డీసీపీ శుభం ప్రకాశ్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట నారాయణ, వైస్ చైర్మన్ ఇలియాస్, ఆయా పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
మాక్లూర్: మండలంలోని కొత్తపల్లి శివారులో కొనసాగుతున్న ఉపాధిహామీ పనుల వద్ద శనివారం ఘోరం జరిగింది. కూలీలు తవ్విన మట్టిని ట్రాక్టర్లో మరో చోటికి చేర్చి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బొల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ రెడ్డివోని శ్రీధర్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి తన ట్రాక్టర్ను ఉపాధి పనులకు నడుపుతున్నాడు. కూలీలు తవ్విన మట్టిని ట్రాక్టర్లో తన పొలానికి తరలించి ఖాళీ అయిన తరువాత డ్రైవర్ శ్రీధర్ ద్వారా ట్రాక్టర్ను తిరిగి పంపించాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ఇంజిన్ బొల్తాపడింది. దాని కింద పడిన శ్రీధర్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవలే దుబాయి నుంచి తిరిగి వచ్చిన శ్రీధర్ ఇక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. మృతుడి తండ్రి పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనుమానాస్పద స్థితిలో కానిస్టేబుల్ ..నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. చంద్రశేఖర్ కాలనీకి చెందిన కందగట్ల వెంకటేశ్ (52) నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భార్యాపిల్లలు ఉద్యోగరీత్య హైదరాబాద్ ఉంటుండగా, గత కొంతకాలంగా వెంకటేశ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇంటి కింది పోర్షన్లో అద్దెకు ఉంటున్న గౌరయ్య శనివారం ఉదయం వెంకటేశ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకుని పరిశీలించగా, వెంకటేశ్ తన బెడ్ రూమ్లోని మంచంపై విగత జీవిగా కనిపించాడు. మృతదేహం ఉబ్బిపోయి కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని మృతుడు వెంకటేశ్ భార్య పద్మావతి పోలీసులకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొత్తపేట్లో మరో వ్యక్తి..నిజామాబద్ రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన పబ్బ రవిగౌడ్ (40)అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి వచ్చిన రవిగౌడ్ భార్యాపిల్లలతో కలసి కొత్తపేట్లో నివసిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న రవిగౌడ్ భార్య ఈనెల 14వ తేదీ నుంచి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పిల్లలు సైతం ఆమె వద్ద ఉండిపోయారు. కొత్తపేటలోని ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా రవి మృతి చెంది ఉన్నాడు. మృదేహం కుళ్లిపోయింది. మృతుడి తమ్ముడు పబ్బ అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ఎమ్మెల్యే చొరవతో దన్నూర్కు ఆర్టీసీ సర్వీసులు
మద్నూర్(జుక్కల్): ఆ గ్రామానికి ఇంత వరకు ఆర్టీసీ బస్సు సర్వీసులు లేవు. గ్రామానికి వచ్చి న ప్రజాప్రతినిధులతో ఎల్లప్పుడు ఆర్టీసీ బ స్సు విషయంలో గ్రామస్తులు విన్నవిస్తుండేవా రు. ప్రజల విన్నపాలు విన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు.. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సర్వీసులను ప్రారంభింపజేశారు. దన్నూర్ గ్రామంలో శనివారం బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం కావడంతో గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్.. బస్సుకు పూజ చేశారు. బిచ్కుంద నుంచి దన్నూర్ మీదుగా మర్కెల్కు ఉదయం 9.45 గంటలకు బయలు దేరుతుందని తిరిగి అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుందని వారు తెలిపారు. ఉప సర్పంచ్ కవిత, నేతలు విఠల్రావ్, యాదవ్రావ్, గోవింద్, రామరావు, గ్రామస్తులున్నారు. మద్నూర్(జుక్కల్): మూడేళ్లుగా డోంగ్లీ తహసీల్ కార్యాలయానికి సమీపంలోని ప్రధాన రహదారిపై పలు చోట్ల గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. మోకాలి లోతు గుంతలు పడి వాహనదారులు ఇక్కట్లు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై న సంబంధిత అధికారులు స్పందించి ఈ మార్గంలో ఏర్పడి గుంతలనైనా పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు. బాన్సువాడరూరల్(బాన్సువాడ): ఇందిరమ్మ ఇల్లు మంజూరైన వారందరూ ఇళ్లు నిర్మించుకోవాలని బాన్సువాడ డీఎల్పీవో ప్రసాద్ సూచించారు. శనివారం ఆయన ఎంపీడీవో ఆనంద్తో కలిసి దేశాయిపేట్, సోమేశ్వర్ గ్రామాల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం ఇంటి నిర్మాణాల పురోగతి ఆధారంగా బిల్లులు మంజూరు చేస్తుందన్నారు. సర్పంచ్ జ్యోతి ప్రకాశ్, జీపీ కార్యదర్శి గీత, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
దొంగల సంచారం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో అర్ధరాత్రి వేళ దొంగలు సంచరిస్తున్న దృశ్యాలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం తెల్లవారుజామున సుమారు 2:57 గంటల సమయంలో కాలనీలోని వీధుల్లో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతూ సీసీ టీవీ కెమెరాకు చిక్కారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసేందుకే వీరు అర్ధరాత్రి వేళల్లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో కాలనీవాసులు, పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పట్టణ సీఐ నరహరి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని లేదా పొరుగువారికి చెప్పి వెళ్లాలని కోరారు. రాత్రి సమయాల్లో ఇళ్ల ముందు లైట్లు ఆన్ చేసి ఉంచాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
డిచ్పల్లి: మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్కు సమీపంలో ఉన్న చెట్లపొదలకు శనివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన సబ్ స్టేషన్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. విద్యుత్ సిబ్బంది ఆప్రమత్తతతో సబ్స్టేషన్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నిజామాబాద్ అర్బన్: జిల్లా వ్యాప్తంగా గడిచిన వా రం రోజుల్లో 162 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదై నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పట్టుబడిన వారికి మొత్తం రూ.16 లక్షల జరిమానా విధించామని, న్యాయస్థా నం ఇద్దరికి వారం రోజుల జైలు శిక్ష ఖరారు చేసిందని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. డిచ్పల్లి: మండలంలోని దూస్గాం గ్రామానికి చెందిన వీఆర్ఏ నీరడి లింగవ్వ (76) అనారోగ్యంతో మృతి చెందినట్లు తహసీల్దార్ సతీశ్రెడ్డి శనివారం తెలిపారు. గత కొంతకాలంలో అనార్యోగంతో బాధపడుతున్న లింగవ్వ, వృద్ధాప్యం, ఎండ వల్ల తీవ్ర జ్వరంతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు పేర్కొన్నారు. డిచ్పల్లి : డిచ్పల్లి జాతీయ రహదారిపై ఓ టిప్పర్ ముందు వెళ్తున్న లారీని ఢీకొన్నది. అదే సమయంలో పక్క నుంచి ధాన్యం లోడ్తో వెళ్తున్న లారీని ఢీకొట్టిందని ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ లారీని ఆపకుండా వెళ్లాడు. ధాన్యం లోడ్ లారీ, టిప్పర్ ప్రమాదంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచింది. ఈ విషయమై డిచ్పల్లి ఎస్సై హరీఫ్ వివరణ కోరగా ప్రమాదం జరిగింది వాస్తవమేనని, ఇరువురి నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
వారసుడొచ్చిన ఆనందం తీరకుండానే..
● కబళించిన బ్లడ్ క్యాన్సర్ ● లక్ష్మీరావులపల్లిలో విషాదం మాచారెడ్డి: వారసుడు పుట్టాలని ఎన్నో దేవుళ్లను మొక్కిన ఆ వ్యక్తికి కొడుకు పుట్టిన ఆనందాన్ని ఎంతోకాలం ఆస్వాదించలేదు. కొడుకు పుట్టిన పన్నెండు రోజులకే ఆ తండ్రిని బ్లడ్ క్యాన్సర్ కబళించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లక్ష్మీరావులపల్లికి చెందిన పుట్ట శంకర్(38)ఈ నెల 21వ తేదీన ఉన్నట్టుండి బాత్రూంలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటి పోవడంతో వైద్యులు చేతులెత్తేశారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శంకర్ శుక్రవారం కన్నుమూశాడు. ఇద్దరు కూతుళ్ల తరువాత 12 రోజుల క్రితమే శంకర్కు కొడుకుపుట్టాడు. వారసుడు పుట్టిన ఆనందం ఆ కుటుంబంలో లేకుండాపోయింది. శంకర్ మృతితో భార్య, ముగ్గురు పిల్లలు దిక్కులేనివారయ్యారు. -
కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● గడువులోపు ప్రక్రియ పూర్తి చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి టౌన్ : మక్కలు, జొన్నల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, ట్యాబ్ ఎంట్రీ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మక్క, జొన్నల కొనుగోళ్లకు సంబంధించి అవసరమైన నిల్వ స్థలాల లభ్యత, కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సేకరించిన మక్కలు, జొన్నల తరలింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గడువులోపు కొనుగోళ్లను పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ విలువల సవరణపై సమీక్ష కామారెడ్డి టౌన్ : భూముల మార్కెట్ విలువల సవరణ కార్యకలాపాలపై శనివారం హైదరాబాద్ నుంచి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ లోకేష్ కుమార్, రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ హనుమంతు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. మార్కెట్ విలువల సవరణకు సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. జిల్లాల వారీగా పురోగతిని తెలుసుకున్న ఉన్నతాధికారులు.. క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మార్కెట్ వాల్యూ అప్డేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భూ లావాదేవీలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెంపుతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు. -
వానాకాలమొచ్చినా కల్లాల్లోనే వడ్లు
● రెండు రోజుల్లో ధాన్యం తరలించాలి ● లేకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తాం ● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్బీబీపేట: యాసంగి సీజన్ ముగిసి వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ ఇంకా కల్లాల్లోనే వడ్లు ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ఇలాగైతే ఎప్పుడు కొనుగోళ్లు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. శనివారం మల్కాపూర్లోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్ల వివరా లు తెలుసుకున్నారు. గ్రామంలో మొత్తం మూడు చోట్ల వడ్లను పోసినప్పటికీ ఎక్కడా కొనుగోళ్లు పూర్తి కాలేదని రైతులు తెలిపారు. లారీలు రావడం లేదని, నెల రోజులుగా ఇక్కడే కాపలా కాయాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో గంప గోవర్ధన్ అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ట్రాన్స్పోర్టు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వర్షాలు పడితే కనీసం లారీలు కూడా కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తూకం వేసిన వడ్లను వెంటనే రైస్మిల్లులకు తరలించాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో లారీలను టోల్ గేట్ వద్దనుంచి తీసుకువచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని, ప్రస్తుతం అలాగే తీసుకురావాలని సూచించారు. సుమారు 5 వేల బస్తాల ధాన్యం నిల్వ ఉందని, పక్షం రోజులుగా లారీలు రాకుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండు రోజుల్లో ధాన్యం తరలించకపోతే కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సర్పంచ్ నాగరాజు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, నాయకులు రాజేశ్వరరావు, బాలమణి తదితరులున్నారు. -
తరుగని దోపిడీ
● లారీకి ఐదునుంచి ఎనిమిది క్వింటాళ్ల వరకు కోత ● నష్టపోతున్నామంటున్న రైతులులింగంపేట: తరుగు పేరిట రైస్ మిల్లర్లు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మండలంలో యాసంగికి సంబంధించిన ధాన్యం సేకరణ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. దీనికితోడు లారీలు రాకపోవడంతో తూకం వేసిన వడ్లు సైతం కొనుగోలు కేంద్రాలలోనే మూలుగుతున్నాయి. తూకం వేసిన తర్వాత వారం పదిరోజులకు మిల్లులకు తరలిస్తున్నారని రైతులు పేర్కొంటున్నారు. ధాన్యం మరింత ఎండి బరువు తగ్గాయంటూ మిల్లర్లు లారీకి ఐదు నుంచి ఎనిమిది క్వింటాళ్ల వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా తూకం వేయించడంతోపాటు వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలని కోరుతున్నారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యంతో మరింత నష్టం లారీల డ్రైవర్లు నిర్లక్ష్యంతో వాహనాలను నడుపుతుండడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. మిల్లులకు తరలించే క్రమంలో బస్తాలు దారి మధ్యలో పడిపోతున్నాయి. ఐదు రోజుల క్రితం లారీలోంచి ఎర్రాపహడ్, తాడ్వాయి మధ్యలో 20 బస్తాల వరకు రోడ్డుపై పడిపోయాయి. లారీ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం వల్ల తాము నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు.పంట కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన నెల రోజులకు కాంటా పెట్టారు. 376 బస్తాలు అయ్యాయి. తూకం వేసిన ఐదు రోజుల తర్వాత మిల్లుకు తరలించారు. అక్కడ మూడున్నర క్వింటాళ్లు తరుగు తీశారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన సమయంలో వచ్చిన వేయిట్కే డబ్బులు చెల్లించాలి. – వెంకటేశ్వర్గౌడ్, రైతు, కొర్పోల్రెండెకరాలలో వరి పండించాను. పంట నూర్పిళ్లు చేసి కొనుగోలు కేంద్రానికి తరలించి నెల రోజులు అవుతోంది. ఇప్పటికీ కాంటా పెట్టలేదు. ఐకేపీ అధికారులు నేడు, రేపు అంటూ తిప్పుతున్నారు. రోజూ వడ్ల వద్ద కాపలా ఉండాల్సి వస్తోంది. అధికారులు స్పందించి త్వరగా తూకం వేయించాలి. – కాంతమణి, రైతు, కొర్పోల్ -
పర్యాటక బ్రాండ్ కిట్ ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్ : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలు జిల్లాలో ముగిశాయి. వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన చాంబర్లో పర్యాటక బ్రాండ్ కిట్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రాచుర్యం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు రావడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రదేశాల విశిష్టతలను అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీవో దామోదర్రెడ్డి, మెప్మా పీడీ శ్రీధర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా పర్యాటక అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పిట్లం: పోతిరెడ్డిపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను శనివారం జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రోహిత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలకు ఇస్తున్న టీకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: సమష్టిగా పనిచేసి గ్రామీణాభివృద్ధిలో జిల్లాను ముందు వరసలో ఉంచాలని డీఆర్డీవో దామోదర్రెడ్డి కోరారు. శనివారం ఆయనను సంస్థ సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కలిసి పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ సాంకేతిక సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణాగౌడ్, జిల్లా అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్రెడ్డి, ప్రతినిధులు భాస్కర్, రాజేశ్వర్, సురేందర్రెడ్డి, స్వామి, నర్సింలు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో యూత్ – స్పోర్ట్స్ వీక్ వేడుకలు నిర్వహించారు. గతంలో నిర్వహించిన ఉద్యోగ మేళాలో జిల్లాకు చెందిన 52 మంది ఎంపికయ్యారు. వారికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందించారు. కార్యక్రమంలో జీఎం ఇండస్ట్రీస్ లాలు నాయక్, జిల్లా క్రీడల అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పిట్లం(జుక్కల్) : బుర్నాపూర్ నుంచి అల్లాపూర్ గ్రామానికి వెళ్లే మార్గంలో బుర్నాపూర్ శివారులో ప్రధాన రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ పైపులైనుకు భారీ లీకేజీ ఏర్పడింది. దీంతో నీరు పైకి ఎగిసిపడుతూ తాగునీరు వృథాగా పోతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, పైపులైనుకు వెంటనే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
అవినీతి చేయాలనుకుంటే వెళ్లిపోండి
కామారెడ్డి టౌన్ : మున్సిపల్ అధికారులు అవినీతి చేయాలనుకుంటే బదిలీ చేయించుకుని ఇక్కడినుంచి వెళ్లిపోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్, సానిటైజేషన్, ఇంజినీరింగ్, రెవెన్యూ, వాటర్ వర్క్స్ తదితర విభాగాల అధికారులతో ఆయన సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదన్నారు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు ఇస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగా, సక్రమంగా ఉన్న దరఖాస్తులను ఎలాంటి ఆలస్యం లేకుండా అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఏదైనా పనికి ప్రజలను డబ్బులు డిమాండ్ చేసినట్లు తన దృష్టికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అధికారులు ఎవరైనా లంచాలు అడిగితే బాధితులు నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. రాజకీయ, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అధికారుల భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. అనవసరమైన ఒత్తిళ్లకు తలొగ్గి మీ ఉద్యోగ భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, చట్టానికి కట్టుబడి నిష్పక్షపాతంగా పనిచేయాలని అధికారులకు హితవు పలికారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్నాయక్, ఏఈ వేణుప్రసాద్, ఆర్వో రవిగోపాల్, టీపీవో వినిత్, మేనేజర్ రషీద్, అకౌంటెంట్ రాములు, టీపీబీఎస్ సాయి, వార్డు అఫీసర్లు పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భవన అనుమతులిస్తే చర్యలు తప్పవు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు లొంగవద్దు క్యాంప్ ఆఫీస్లో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే కేవీఆర్ -
‘టూ టౌన్’ ఎప్పుడో?
జిల్లా పోలీస్ శాఖ పరిధిలో మూడు సబ్ డివిజన్లు, ఆరు సర్కిళ్లు, 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఇంకా ఠాణాల ఏర్పాటు పూర్తి స్థాయిలో జరగలేదు. పోలీసు విధులకు సంబంధించి జిల్లా కేంద్రంలో సమస్య తీవ్రంగా ఉంది. జిల్లా అయ్యాక కామారెడ్డి రూపురేఖలు మారుతున్నాయి. మున్సిపాలిటీలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో పట్టణం వేగంగా విస్తరిస్తూనే ఉంది. దీనికి అనుగుణంగా సమస్యలు, కేసులు పెరిగాయి. మరోవైపు జిల్లాకేంద్రంలో సహజంగానే బందోబస్తులు, ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయినా ఇప్పటికీ జిల్లా కేంద్రంలో ఒకే ఒక్క పోలీస్ స్టేషన్ ఉంది. ఈ ఠాణాలో ఎస్హెచ్వోగా సీఐ స్థాయి అధికారి, ఐదుగురు ఎస్సైలు, ఇతర అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. లక్షకుపైగా జనాభా ఉన్న పట్టణంలో ఒకే పోలీస్ స్టేషన్ ఉండడంతో ఈ స్టేషన్లో పనిచేస్తున్నవారిపై పనిభారం అధికమవుతోంది. సరిగ్గా పట్టణం మధ్యలో నుంచి రైల్వే లైన్ ఉంది. ప ట్టాలకు మరోవైపు ప్రాంతానికి టూ టౌన్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసినా పనిభారం తగ్గే అవకాశాలుంటాయి. ఆ దిశగానూ సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు పట్టణంలో మహిళలకు సంబంధించిన కేసులు కూడా ఎక్కువగా ఉంటాయి. టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల మహిళలు ఇబ్బందిపడుతున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రత్యేకంగా మహిళా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తే వారికి ఇబ్బందులు ఉండవు.పట్టణ జనాభా 1.20 లక్షలు దాటినా.. డి విజన్గా ఉన్నప్పటిలాగానే ఇప్పటికీ జిల్లాకేంద్రాన్ని ఒకే ఒక్క పోలీస్ స్టేషన్తో నెట్టుకువస్తున్నారు. దీంతో పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై పని భా రం పెరుగుతుంది. కేసులకు తోడు గత కొంత కాలంగా బందోబస్తులు పెరిగాయి. సిబ్బంది కొరత చాలాకాలంగా ఉన్నదే. ఆయా కారణాల తో కనీసం సెలవులు దొరకడం లేదని, కుటుంబాలకు సమయం ఇవ్వలేక పోతున్నామని ప లువురు పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులది కీలక పాత్ర. పెరుగుతున్న జనాభా, కేసుల సంఖ్య, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ కామారెడ్డి పట్టణం డివిజన్ స్థాయినుంచి జిల్లాకేంద్రంగా మారినా.. జనాభా లక్ష దాటినా.. ఇప్పటికీ ఒకటే పోలీస్ స్టేషన్ ఉంది. దీంతో ఉన్న పోలీసులపైనే పనిభారం పడుతోంది. – కామారెడ్డి క్రైంవిస్తరిస్తున్న జిల్లాకేంద్రం పెరుగుతున్న కేసులు, ట్రాఫిక్ సమస్యలు ఉన్న ఒక్క ఠాణా పోలీసులపై తీవ్రమైన పనిభారం ప్రతిపాదనలకే పరిమితమైన ట్రాఫిక్, మహిళా పీఎస్లు -
‘ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవాలి’
లింగంపేట: పోలీసులు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునేలా సేవలు అందించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. శనివారం ఆయన లింగంపేట పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయాలన్నారు. పాత నేరస్తులు, అనుమానితుల కదలికలపై గట్టి నిఘా ఉంచాలన్నారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు జరగాలన్నారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలని, యువతలో చట్టాలపై అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రధాన రహదారులపై హాట్స్పాట్లను గుర్తించి సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు గోవుల ఆక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్లో పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, దర్యాప్తులో ఉన్న కేసుల గురించి ఎస్సై దీపక్కుమార్ ఆయనకు వివరించారు. లింగంపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు లక్ష్మణ్ను ఎస్పీ అభినందించి నగదు రివార్డును అందించారు. విధి నిర్వహణలో లక్ష్మణ్ ఉత్తమ ప్రతిభ చూపారని ప్రశంసించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై దీపక్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
కామారెడ్డి టౌన్: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో ఆర్కే విద్యాసంస్థల సీఈవో, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.జైపాల్ రెడ్డి.. పాట్రన్ మెంబర్గా ఎం.సదాశివ రెడ్డి వైస్ పాట్రన్ సభ్యులుగా చేరారు. శనివారం ఆయన ఛాంబర్లో కలెక్టర్ వారిద్దరినీ అభినందించారు. శాలువాతో సత్కరించి, సభ్యత్వ ధ్రువీకరణ పత్రాలు, మెమెంటోలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెడ్క్రాస్ వంటి అంతర్జాతీయ సేవా సంస్థలో ప్రముఖులు సభ్యత్వం తీసుకోవడం అభినందనీయమని, యువత కూడా సేవా రంగంలోకి రావాలని కోరా రు. జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్క్రాస్ ద్వారా జిల్లాలో మరింత విస్తృతంగా సేవలు అందిస్తామన్నారు. రెడ్క్రాస్ నోడల్ అధికారి శశికుమార్, ప్రతినిధులు దత్తాద్రి, విజయ్,తదితరులు పాల్గొన్నారు. -
అదృశ్యమైన వ్యక్తి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన బోరంచ సునీల్(33)అనే వ్యక్తి గ్రామశివారు లోని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివా రం వెలుగుచూసింది. ఈ నెల 20వ తేదీన ఇంటి నుంచి బ యటికి వెళ్లిన సునీల్ తిరిగి రాకపోవడంతో అతడి భార్య స్రవంతి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామ శివారులో ఉరేసుకొని సునీల్ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్చార్జి ఎస్సై సుబ్రమణ్యచా రి ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో ఘటనాస్థలంలోనే పోస్ట్మార్టం పూర్తి చేయించారు. కుటుంబ కలహాల కారణంగా మరొకరు..బోధన్: ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన ఉప్పు నాగేశ్వర్ (58) అనే వ్యక్తి కుటుంబ కలహాల కార ణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పో లీసులు తెలిపిన వివరాలు ..గ్రామ శివారు లో నూతనంగా నిర్మిస్తున్న ఓ రైస్మిల్లులో కొంత కాలంగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నా నాగేశ్వర్ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి విధులకు వెళ్లిన నాగేశ్వర్ మరుసటి రోజైన శనివారం రైస్మిల్లులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు. -
రెడ్డి ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్గా నాగర్తి చంద్రారెడ్డి
కామారెడ్డి టౌన్: రెడ్డి ఐక్య వేదిక తాత్కాలిక రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఏనుగు సంతోష్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఒక హోటల్లో రాష్ట్ర ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. తాను సంఘం అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడంతో, నూతన తాత్కాలిక కమిటీని ఎన్నుకున్నట్లు ప్రకటించారు. వేదిక తాత్కాలిక రాష్ట్ర కన్వీనర్గా నాగర్తి చంద్రారెడ్డిని, రాష్ట్ర కో–ఆర్డినేషన్ చైర్మన్గా సంధి తిరుపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే కో–కన్వీనర్లుగా ఎలిమినేటి సుమన్ రెడ్డి, బండ గోపాల్ రెడ్డి, నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, రామమ్మగారి బాగా రెడ్డిలను ఎన్నుకున్నట్లు వివరించారు. నూతనంగా ఎన్నికై న కమిటీ సభ్యులు రెడ్డి సామాజిక వర్గ ఐక్యతకు, సమాజ శ్రేయస్సుకు నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఇందల్వాయి: మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో గురువారం రాత్రి రెండు ఇళ్లల్లో చోరీ జరిగినట్లు ఎస్సై సందీప్ తెలిపారు.గ్రామానికి చెందిన బొడ్డు పెద్ద రాజన్న ఇంటికి తాళం వేసి డాబాపై పడుకున్నాడు.మరో వ్యక్తి తాటిపాముల శ్రీనివాస్గౌడ్ ఇంటికి తాళం వేసి కేరళ వెళ్లాడు. గమనించిన దుండగు లు తాళం గడియలు పగులగొట్టి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో అరతులం బంగారం,16 తులాల వెండి, రాజ న్న ఇంట్లో ఏడు తులాల బంగారం,10 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు.ఘటనా స్థలాన్ని డిచ్పల్లి సీఐ వినోద్ పరిశీలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి):మండల కేంద్రానికి చెందిన కోమట్పల్లి పోచయ్య(48) అనే వ్యక్తి అ ప్పులబాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. శుక్రవారం తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి ముందు ఉన్న వేపచెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కుటుంబసభ్యులు, చుట్టు పక్కవారు గమనించి వచ్చేలోపే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య రాజమణి, కుమారుడు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వచ్చేనెల 5 లోపు వడ్లు, మక్కల కొనుగోళ్లు పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేవీఆర్
కామారెడ్డి టౌన్ : వర్షాకాలం సమీపిస్తున్నందున జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియలను వచ్చేనెల 5వ తేదీలోపు పూర్తి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని హాల్లో వరి, మక్క కొనుగోళ్లపై మున్సిపల్, మార్కెటింగ్, సివిల్ సప్లయ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లుల వద్ద తగిన సంఖ్యలో హమాలీలను ఏర్పాటు చేయాలని, తూకం, రవాణా, అన్లోడింగ్ ప్రక్రియల్లో ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. వర్ష సూచనలు ఉన్నందున కేంద్రాల్లోని వరి నిల్వలు తడవకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి రైస్ మిల్లు రోజూ కనీసం 12 వాహనాల ధాన్యాన్ని అన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఇప్పటివరకు 70 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయగా, అందులో 65 వేల మెట్రిక్ టన్నులను మిల్లులకు తరలించామన్నారు. మరో 25 వేల మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 1,471 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేయగా, అందులో 1,231 మెట్రిక్ టన్నులను గోదాములకు తరలించామన్నారు. మిగిలిన మక్కలు, వడ్లను త్వరగా తరలించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆయా శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
హిందూ సంస్కృతిని కాపాడుకోవాలి
● గుడిమేట్ మహాదేవ పీఠాధిపతి మహాదేవ స్వామీజీకామారెడ్డి టౌన్ : దేశాన్ని, హిందూ సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని గుడిమేట్లోని మహాదేవ ధర్మపీఠం అధిపతి సద్గురు మహాదేవ స్వామీజీ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో అంబేడ్కర్ బస్తీ హిందూ సమ్మేళనాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హైందవ సంక్షేమమే భారత సంక్షేమమన్నారు. మనమంతా హిందువులమనే ఐక్యతా భావనను గుండెల్లో నింపుకుని జీవించినప్పుడే దేశాన్ని, సంస్కతిని, పురాతన దేవాలయాలను కాపాడుకోగలమన్నారు. భావితరాలకు సనాతన ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు హిందూ సమ్మేళనాలు దోహదపడతాయన్నారు. అనంతరం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ కళాశాల విద్యార్థి ప్రముఖ్ ఉల్లెంగ ముత్యం, హిందూ సమ్మేళన సమితి ప్రతినిధులు శ్రీనివాస్, గోపీకృష్ణ, సునీల్, కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, తోట వంశీకృష్ణ, పిట్ల వేణుగోపాల్, గంట మధుకృష్ణ, గోపు బాలమణి తదితరులు పాల్గొన్నారు. -
కొలతల ప్రకారం పనులు చేయాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధి హామీ పథకంలో కొలతల ప్రకారం పనిచేస్తే పనికి తగ్గ వేతనం వస్తుందని టెక్నికల్ అసిస్టెంట్ కృష్ణగౌడ్ అన్నారు. ఆయన శుక్రవారం తాడ్వాయి మండలంలోని కన్కల్ శివారులో నడుస్తున్న ఉపాధి పనులను పరిశీలించారు. ఆయన వెంట ఫీల్డు అసిస్టెంటు రాజు, కూలీలు ఉన్నారు. ఉపాధి హామీ పనుల పరిశీలన భిక్కనూరు: బస్వాపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సలహాలు సూచనలు అందజేశారు. ఉపాధి హామీ పథకం ఏపీవో రాధిక సిబ్బంది ఉన్నారు. ఎండపూట విశ్రాంతి తీసుకోవాలి బాన్సువాడ రూరల్: ఇబ్రహీంపేట్ తండా శివారులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ స్వరూప వసంత్ పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కూలీలకు నీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. ఎండలు విపరీతంగా ఉన్నాయని, మధ్యాహ్నం పూట కూలీలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ కాశీరాంకు సూచించారు. -
జనగణన విజయవంతం చేయాలి
బాన్సువాడ రూరల్: ఎటువంటి పొరపాట్లు లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి జనగణన విజయవంతం చేయాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయంలో బాన్సువాడ అర్బన్,రూరల్ సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు, సంబంధిత సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. జనగణన దేశాభివృద్ధికి ఎంతో కీలకమని, ప్రభుత్వం రూపొందించే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేందుకు కచ్చితమైన గణాంకాలు అవసరమన్నారు. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ సమయానికి గణన పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు, సాంకేతిక అంశాలు, డేటానమోదు విధానంపై చర్చించారు. తహసీల్దార్ నరేందర్, ఆర్పీలు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: జనగణనను సక్రమంగా నిర్వహించాలని ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. శుక్రవారం తహసీల్ కార్యాలయంలో జనగణన సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణన సిబ్బంది ప్రజల వివరాలను గోప్యంగా ఉంచాలని అన్నారు. జనగణనలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలని సూచించారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్, ఎంపీడీవో తాహేరాబేగం, జనగణన సిబ్బంది తదితరులున్నారు. -
ఎస్ఐఆర్తో ఓట్లు పోకుండా కాపాడుతాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/కామారెడ్డి టౌన్ : ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)తో అర్హుల ఓట్లు పోకుండా చూస్తామని, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి నివాసంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎస్ఐఆర్ నేపథ్యంలో పార్టీ తరఫున నియమించిన బూత్ లెవల్ ఏజెంట్ల సహకారంతో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడుతామన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి ఓటు హక్కును కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామన్నారు. ఇప్పటికే వందలమంది ఎన్ఆర్ఐలు ఫోన్లు చేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జాతీయ ఎన్నికల సంఘాన్ని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. ఇందుకు పార్టీ తరఫున ఒక సీనియర్ ప్రతినిధి, నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఎమ్మెల్యేలు, ఎంపీల బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్లు తెలిపారు. పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లు గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాలు సేకరించి, వారి ఓటు హక్కును తొలగించకుండా సమన్వయం చేయాలన్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన కార్యాచరణను కేటీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నాయకులకు వివరించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లోని స్థితిగతులను నాయకులు కేటీఆర్కు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, మోసాలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, తిరిగి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తమ అభిప్రాయాలు తెలిపారు. సమావేశంలో మాజీ ఎంపీ సురేశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, జాజాల సురేందర్, జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, నాయకులు ముజీబొద్దీన్, ఆయేషా పాల్గొన్నారు. బూత్ లెవెల్ అసిస్టెంట్లతో గల్ఫ్ ఎన్ఆర్ఐల వివరాల సేకరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం -
తరలని ధాన్యం.. సాగని తూకం..
దోమకొండ: కొనుగోళ్లు వేగంగా సాగకపోవడంతో రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రంలో సరిపడా హామాలీలు లేకపోవడంతో కాంటాలు వేగంగా సాగడం లేదు. మరోవైపు తూకం వేసిన బస్తాలను తరలించడానికి లారీలు రావడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాలలో బస్తాలు పేరుకుపోతున్నాయి. దాదాపు మూడు వారాలుగా కాంటాకోసం, ధాన్యం తరలింపు కోసం ఎదురుచూస్తున్నామని పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతేడాది దోమకొండలోని సింగిల్విండో కార్యాలయ ధాన్యం కొనుగోలు కేంద్రానికి రోజుకు ఎనిమిది లారీల చొప్పున వచ్చేవని, ప్రస్తుతం రోజుకు రెండు లారీలే వస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గత మూడు నాలుగు రోజుల నుంచి లారీల రాక పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. దోమకొండలోనే దాదాపు 3 వేల బస్తాలు కాంటా పూర్తై తరలించడానికి సిద్ధంగా ఉన్నాయని, లారీలు రాకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొంటున్నారు. దోమకొండ సొసైటీ పరిధిలోని లింగుపల్లి, సంఘమేశ్వర్, మాందాపూర్, అంచనూరు గ్రామాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. లారీల కొరత ఉన్న మాట వాస్తవమేనని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకాంత్ పేర్కొన్నారు. త్వరలో రవాణా సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ధాన్యం తరలించడం కోసం మరో 40 రైస్మిల్లులతో మాట్లాడామని పేర్కొన్నారు. -
కుప్పలు ‘తిప్పలు’గా..
● లారీలు రాక కేంద్రాల్లోనే మూలుగుతున్న ధాన్యం బస్తాలు ● పక్షం రోజులుగా కుప్పల వద్దే పడిగాపులుఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు.. పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికీ కష్టపడాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాలలో తూకాలు సాగక, కాంటా అయినా లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు. రెండుమూడు వారాలుగా కుప్పల వద్దే పడిగాపులు పడాల్సి వస్తోంది. త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.కామారెడ్డి క్రైం: జిల్లాలో యాసంగి సీజన్లో దాదాపు 50 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగయ్యింది. ప్రధానంగా గాంధారి, లింగంపేట, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట, భిక్కనూరు, బిచ్కుంద, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో మక్క ఎక్కువగా సాగు చేశారు. గతేడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఈసారి యాసంగిలో మొక్కజొన్న సాగుపై రైతులు ఆసక్తి కనబరిచారు. అయితే ఈసారి చాలా ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వేధిస్తున్న లారీల కొరత.. జిల్లాలో మూడు వారాల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. గాంధారిలో కేంద్రం ప్రారంభం అయిననాటి నుంచి ఇప్పటివరకు 5 లారీలు మాత్రమే వచ్చాయి. ఇప్పటికీ కేంద్రంలో దాదాపు 5 వేల బస్తాలు కాంటా అయి ఉన్నాయి. వాటిని తరలించడానికి లారీలు రాకపోవడంతో మధ్యలో కొన్ని రోజులు కాంటా నిలిపివేయాల్సి వచ్చింది. ఉత్తునూర్లో కూడా దాదాపు 2 వేల బస్తాలను తరలించాల్సి ఉంది. ఇలా జిల్లావ్యాప్తంగా సమస్య ఉంది. ఖరీఫ్ దగ్గరపడుతున్న సమయంలో సాగుకు సన్నద్ధం కావాల్సిన సమయంలో రోజంతా కొనుగోలు కేంద్రం వద్దే గడపాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ అకాల వర్షం కురుస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, త్వరగా మక్కలను గోదాములకు తరలించాలని కోరుతున్నారు. లారీల కొరత విషయమై మార్క్ఫెడ్ అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించగా.. వారు స్పందించడం లేదు. -
దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్
కామారెడ్డి క్రైం: తేలికగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను కామారెడ్డి పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. లింగంపేట మండలం మోతె గ్రామానికి చెందిన గుండ్రెడ్డి రాజు రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 19 న సాయంత్రం తన బంధువు రంజిత్తో కలిసి జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉన్న ఓ ఖాళీ స్థలం వద్ద ఉన్నాడు. ఐదుగురు వ్యక్తులు అక్కడకు వచ్చి వారిని బెదిరించారు. రాజు రెడ్డి వద్దనున్న రూ.4 వేలు, రంజిత్ వద్దనున్న 300 దుబాయ్ ధరమ్స్ లాక్కొని యాప్ ద్వారా రూ.వెయ్యి ఖాతాకు బదిలీ చేసుకుని పరారయ్యా రు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను అదే ప్రాంతానికి చెందిన షేక్ సల్మాన్, మహ్మద్ మోయి జ్, బొందీ లోకేష్, షేక్ షానవాజ్, మరో బాల నేరస్తునిగా గుర్తించారు. వారిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. వీళ్లు ఒంటరిగా ఉన్న వాళ్లను గుర్తించి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి రూ.8300, సెల్ఫోన్లు, 300 ధరమ్స్, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసున్నామని తెలిపారు. కేసు ఛేదనలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు. -
‘ప్రజా పాలన’తోనే ప్రగతి
కామారెడ్డి టౌన్ : ప్రజా పాలనతోనే రాష్ట్ర ప్రగతి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామాల్లోని సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి పరిష్కరించేందుకు ’ప్రజా పాలన’ ఒక అద్భుత వేదికగా నిలుస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు చెరువులు, వాగుల్లోనుంచి మొరం, ఇసుక తెచ్చుకునేటప్పుడు పోలీసులు, అధికారులు కేసులు పెడితే సహించేది లేదన్నారు. రెండేళ్లలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి లేకపోతే ఎలా అని అధికారులను ప్రశ్నించారు. ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోందని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి అధికారులు అంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే జి ల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. జిల్లా ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన వెల్లడించారు. జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునేలా చూసి, జూన్ 2న గృహ ప్రవేశాలు చేయిస్తామని పేర్కొన్నారు. రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు త్వరలోనే ఉదయం అల్పాహార పథకాన్ని ప్రారంభించనున్నామన్నారు. జిల్లా అధికారులు ఆయా శాఖల పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల తీరును పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ గిరి, మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, తహసీల్దార్ హిమబిందు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధి, రైతుల శ్రేయస్సే లక్ష్యం ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్రెడ్డి 99 రోజుల కార్యాచరణ జిల్లా స్థాయి సమావేశం -
సమ్మర్లో.. సరికొత్తగా..
● శిక్షణ శిబిరాల్లో ఉల్లాసంగా పాల్గొంటున్న విద్యార్థులు ● యోగాతోపాటు ఇండోర్, అవుట్ డోర్ క్రీడలపై మక్కువ ● చిత్రలేఖనం, తబల, హార్మోనియంపై తర్ఫీదు లింగంపేట(ఎల్లారెడ్డి): వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా వివిధ రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆరోగ్యం, ఆహ్లాదం సొంతం చేసుకుంటున్నారు. లింగంపేట మండల కేంద్రంలోని పీఎంశ్రీ బాలుర ఉన్నత పాఠశాలలో 70 మంది విద్యార్థులతో సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నారు. 15 రోజులుగా విద్యార్థులు అన్ని రంగాల్లో తర్ఫీదు పొందుతున్నారు. ఆట పాటలు, యోగా, ఇండోర్ గేమ్స్, అవుట్ డోర్ గేమ్స్పై విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. తబల, హార్మోనియం వాయించడంపై తర్ఫీదు పొందుతున్నారు. శిక్షకులు తమకు వచ్చిన కళలను విద్యార్థులకు నేర్పిస్తున్నారు. కొంతమంది విద్యార్థులు కంప్యూటర్ విద్య నేర్చుకొంటే.. మరికొంత మంది డ్రాయింగ్, యోగా, వాలీబాల్ తదితర క్రీడలపై ఆసక్తి చూపుతున్నారు. ప్రతి రోజు సమ్మర్ క్యాంపులో కొంగొత్త విషయాలు నేర్చుకొంటున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో సమ్మర్ క్యాంపుకు వ చ్చి కంప్యూటర్ విద్య నేర్చు కుంటున్నాను. ఇక్కడ ఉపాధ్యాయులు చక్కగా నేర్పిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. – బొల్లు బహుగుణ, ఏడో తరగతి (బాలుర ఉన్నత పాఠశాల లింగంపేట) యోగా, చిత్రలేఖనం, కంప్యూటర్,ఆటలు, పాటలు నేర్చుకుంటున్నాం. బస్సు సౌకర్యం లేకున్నా ఆటో, బైక్పై వచ్చి నేర్చుకుంటున్నా. సమ్మర్ క్యాంపు చాలా ఉపయోగకరంగా ఉంది. – అవంతిక, సజ్జన్పల్లి (ప్రాథమికోన్నత పాఠశాల) సమ్మర్ క్యాంపులో మ్యాథ్స్లో మెళకువలు నేర్చుకోగలుగుతున్నాను. టేబుల్స్, పె యింటింగ్, కలర్స్ వే యడం ఆర్టిస్టు అను భూతి పొందుతున్నాను.వాలీబాల్, చదరంగం తదితర క్రీడలు నేర్చుకుంటున్నాను. – మనోజ్ సాయి, లింగంపేట కొత్త రకమైన కళలు నేర్చుకోవడం సంతో షంగా ఉంది. తబల, హార్మోనియం నేర్పడానికి నిపుణులైన కళాకా రులు వస్తున్నారు. ఇ లాంటి అవకాశం రావ డం చాలా ఆనందంగా ఉంది. – రంగరి సహిష్ణు, జీవదాన్ స్కూల్ ఎల్లారెడ్డి -
డీఆర్డీవోగా దామోదర్రెడ్డి
కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ జిల్లా అధికారి (డీఆర్డీవో)గా దామోదర్రెడ్డి నియమితులయ్యారు. సిద్దిపేట జిల్లాలో ఎంపీడీవోగా పనిచేస్తున్న ఆయన పదోన్నతిపై కామారెడ్డికి వచ్చారు. శుక్రవారం బాధ్యత లు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. కాగా ఇక్కడ డీఆర్డీవోగా పనిచేసిన సురేందర్ను కామారెడ్డి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా బదిలీ అయ్యారు. కామారెడ్డి అర్బన్: జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పడాల తిరుపతి పేర్కొన్నారు. అంతర్జాతీ య జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఒకరోజు జాతీయ వెబినార్ నిర్వహించారు. కార్యక్రమంలో పడాల తిరుపతి మాట్లాడు తూ పర్యావరణ పరిరక్షణ, సమతుల్యత కాపాడడంలో విద్యార్థులు, యువత, గ్రామీణ ప్రజల పాత్ర కీలకమన్నారు. విత్తన బంతుల తయారీ, నీటి సంరక్షణ, ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ వంటి చర్యలు గొప్ప ఫలితాలిస్తాయన్నారు. వెబినార్లో వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల వృక్షశాస్త్ర ప్రోఫెసర్లు, విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కామారెడ్డి కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్, వృక్షశాస్త్ర విభాగాధిపతి దినకర్, సమన్వయకర్తలు జయప్రకాశ్, సుధాకర్, శ్రీవల్లి, శ్రీనివాస్రావు, రాములు పాల్గొన్నారు. బిక్కనూరు: ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని జిల్లా సహకార అధికారి రామ్మోహన్రావు కేంద్రాల నిర్వాహకులు, అధికారులకు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సిబ్బందితో మాట్లాడి కొనుగోళ్ల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ తూకం వేసిన వడ్లను వెంటవెంటనే రైస్మిల్లులకు తరలించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట సొసైటీ కార్యదర్శి రాజు, సిబ్బంది రవి కిరణ్, స్వామి తదితరులున్నారు. నాగిరెడ్డిపేట: జిల్లాలో శనివారం నుంచి విత్తన వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మాల్తుమ్మెద శివారులోని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం(టీఆర్వీకే) శాస్త్రవేత్త అనిల్రెడ్డి తెలిపారు. వారోత్సవాలలో భాగంగా వరి సన్న రకాలైన ఆర్డీఆర్–1200, ఆర్డీఆర్–1162 విత్తనాలను మాల్తుమ్మెద శివారులో గల తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో రైతులకు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. 10 కిలోల బస్తాను రూ.750కి అందించనున్నట్లు తెలిపారు. విత్తనాలు అవసరమైన రైతులు మాల్తుమ్మెద సమీపంలోని టీఆర్వీకేలో సంప్రదించాలని సూచించారు. 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ మూల్యాంకనం ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): జిల్లా కేంద్రంలోని డీఐఈవో కార్యాలయంలో ఇంటర్ సప్లిమెంటరీ రెండో స్పెల్ సబ్జెక్ట్ల మూ ల్యాంకనం 24 నుంచి ప్రారంభమవుతుందని ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, ఎకనామిక్స్, కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్ట్ల అధ్యాపకులు 24న రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు, రెసిడెన్షి యల్ జూనియర్ కళాశాలల లాగిన్లలో అ ధ్యాపకుల అపాయింట్మెంట్ ఆర్డర్లు ఉంచినట్లు తెలిపారు. అధ్యాపకులను ఈనెల 23న రిలీవ్ చేయాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. మూల్యాంకనంలో అధ్యాపకులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.


