Kamareddy
-
ఒకప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించే నాయకత్వం ఉండేది. అన్ని నియోజక వర్గాల నేతలందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు. ఇదంతా గతం.. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా జిల్లాను లీడ్ చేసే నాయకులు కనిపించడం లేదు. ప్రధాన నేతలందరూ తమ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. కాంగ్రె స్ జిల్లా అధ్యక్షుడిగా కై లాస్ శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ముజీబుద్దీన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నీలం చిన్న రాజులు ఉన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు పార్టీ కార్యక్రమా లు ఉన్నపుడు అటెండ్ అవుతారు తప్ప అందరినీ స మన్వయం చేసే పరిస్థితి లేదు. బీఆర్ఎస్ జిల్లా అ ధ్యక్షుడు ముజీబొద్దీన్ పార్టీ అధికారంలో ఉన్న స మయంలో కొంత యాక్టివ్గానే ఉన్నా, మంత్రులు, ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేశారు. ఈ మధ్య కా లంలో ఆయన కూడా రాజకీయాల్లో చురుకుగా పా ల్గొనడం లేదు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నా అందరినీ సమన్వయం చేయడంలో చురుకై న పాత్ర పో షించలేకపోతున్నారన్న అభిప్రాయంవ్యక్తమవుతోంది. కాంగ్రెస్లో ఎక్కడి వారక్కడే.. కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో షబ్బీర్అలీ అన్నీ తానై జిల్లాను నడిపించారు. అయితే మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కామారెడ్డితో పాటు నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గాలకు సంబంధించిన వ్యవహారాలను చూస్తున్నారు. బాన్సువాడకు చెందిన సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి మొన్నటి ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి గెలిచి, తరువాత కాంగ్రెస్లో చేరారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి జిల్లాకు నాయకత్వం వహించారు. తరువాత 2014 లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉమ్మడి జిల్లాను లీడ్ చేశారు. 2018లో రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవిలో ఉన్నారు. ఈసారి పార్టీ మారిన తర్వాత తన నియోజక వర్గానికే పరిమితమయ్యారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తన నియోజక వర్గంలో అన్నీ తానే చూసుకుంటారు. తన నియోజకవర్గంలో మరొకరి పెత్తనం ఉండకూడదనే భావనతో ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూడా తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగు నీరందించేందుకు ఉద్దేశించిన కాళేశ్వరం 22వ ప్యాకేజీకి ఇటీవల రూ. 23 కోట్లు మంజూరయ్యాయి. అయితే రెండు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు నిధులు తాను తెచ్చానంటే తానే తెచ్చానని చెప్పుకున్నారు. పనులు పూర్తి చేయడానికి నేతలు సమన్వయం చేసుకుని అవసరమైన నిధులు తీసుకువచ్చే పరిస్థితి కనబడడం లేదు. బీజేపీలోనూ అంతే..అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో బీజేపీ అభ్య ర్థి గెలుపొందడం, మిగతా మూడు నియోజకవర్గాల్లో మంచి ఓట్లు రావడంతో ఆ పార్టీ శ్రే ణుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే పార్టీ జి ల్లా శాఖను లీడ్ చేసే నాయకత్వం కనిపించ డం లేదు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఎల్లారెడ్డిలో పార్టీ మాజీ జిల్లా అ ధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి పార్టీ వ్యవహారా లను చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎంపీ టికెట్టు ఆశించిన సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి ఈ మధ్య కాలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, జుక్కల్లో మాజీ ఎమ్మెల్యే అరుణతార పార్టీ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. అయితే అంతా ఎవరి నియోజకవర్గానికి వారు పరిమితమవడం, వీరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగే నేత లేకపోవడంతో పార్టీ శ్రేణులలో జోష్ కనిపించడం లేదు. అన్ని పార్టీలను వేధిస్తున్న సమస్య అధికార పార్టీలో నేతల మధ్య సమన్వయం కరువు బీఆర్ఎస్, బీజేపీలదీ అదే పరిస్థితి బీఆర్ఎస్దీ అదే పరిస్థితి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక జిల్లాపై పదేళ్ల పాటు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓటమి తరువాత నాయకత్వ సమస్యలు ఎదుర్కొంటోంది. తొలిసారి అధికారంలోకి వచ్చినపుడు అప్పటి మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి ఐదేళ్ల పాటు నేతలను సమన్వయం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత పోచారం శ్రీనివాస్రెడ్డి తన నియోజక వర్గంపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ఉమ్మడి జిల్లాలో మంత్రిగా వేముల ప్రశాంత్రెడ్డి లీడ్ చేశారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ఆయన సమన్వయం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత పార్టీ నాయకత్వాన్ని సమన్వయం చేసే లీడర్ లేకుండాపోయారు. కామారెడ్డిలో మాజీ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధేలు తమ తమ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను చూసుకుంటున్నారు. బాన్సువాడలో నాయకత్వ సమస్య ఉంది. -
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
కామారెడ్డి టౌన్/భిక్కనూరు/దోమకొండ/కామారెడ్డి రూరల్ : జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గడ్డం చంద్రశేఖర్రెడ్డి నియామకంపై మంగళవారం కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి, స్వీట్స్ పంచకున్నారు. భారీ కేక్కు కట్ చేశారు. ఈ మేరకు కాంగ్రెప్ పార్టీ అధిష్టానానికి, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శివకృష్ణమూర్తి, పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీకృష్ణ, సలీమ్, సాయిబాబ, మహేష్, రాంమోహన్, జూలూరి సుధాకర్, సుగుణ, గ్యార సాయిలు తదితరులున్నారు. పీసీసీ అధ్యక్షుడిని కలిసిన చంద్రశేఖర్రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్కుమార్గౌడ్ను మంగళవారం గడ్డం చంద్రశేఖర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనను జనరల్ సెక్రటరీగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కామారెడ్డికి చెందిన గడ్డం చంద్రశేఖర్రెడ్డి నియామకమైన సందర్భంగా దేవునిపల్లి డబుల్ బెడ్రూమ్ కమ్యూనిటీ అధ్యక్షుడు గడ్డం రవీందర్, జనరల్ సెక్రటరీ కే బాలాజీ, కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో దేవునిపల్లి డబుల్ బెడ్ రూమ్ కమ్యూనిటీ సభ్యులు అశోక్, రవి, శీను తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవచేస్తే తగిన గుర్తింపు : ఇంద్రకరణ్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేస్తేనే తగిన గుర్తింపు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇంద్రకరణ్రెడ్డిని పార్టీ అధిష్టానం నియమించినందున ఆయనను కాంగ్రెస్ నేతలు ఆయన స్వగ్రామైన రామేశ్వర్ఫల్లిలో ఘనంగా సన్మానించారు. షబ్బీర్అలీకి రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, మాజీ ఎంపీపీ తొగరి సుదర్శన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, నేతలు సుధాకర్రెడ్డి, తక్కళ్ల బాపురెడ్డి, శ్రీరాం వెంకటేశ్, నర్సింలు యాదవ్, సాజీద్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బద్దం ఇంద్రకరణ్రెడ్డిని దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు. గతంలో పీసీసీ కార్యదర్శిగా ఉన్న ఇంద్రకరణ్రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రధాన కార్యదర్శిగా నియమించిందని వారు తెలిపారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
దోమకొండ : భూ సమస్యల పరిష్కారానికే ప్రభు త్వం భూభారతి చట్టం తీసుకువచ్చిందని కలెక్టర్ ఆ శిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం సంఘమేశ్వర్లో నిర్వహించిన భూభారతి సదస్సులో ఆ యన పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల దరఖాస్తులకు సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డులలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దరఖాస్తులన్నింటిని కచ్చితంగా ఆన్లైన్లో పొందుపరిచాలని, ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి అన్ని రకాల భూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని తహసీల్దార్ సుధాకర్తో పాటు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. ఇందిరమ్మ లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. ఇంకా ప్రారంభించని వారితో మాట్లాడి ఇళ్లు నిర్మించుకునేలా చూడాలని ఎంపీడీవో ప్రవీణ్కుమార్ను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా, లబ్ధిదారులు ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఆర్డీవో వీణ తదితరులు పాల్గొన్నారు. విద్యా సంస్థలను సిద్ధం చేయాలి విద్యాసంస్థల పునఃప్రారంభానికి ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం దోమకొండ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాల, వసతి గృహం, భోజనశాల, స్టోర్ రూం, మరుగుదొడ్లను పరిశీలించారు. విద్యాలయ ఆవరణలో మొక్కలను నా టారు. గురువారంనుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్నందున వెంటనే ఆవరణతోపాటు గదులను శుభ్రం చేయించాలని, వాటర్ ట్యాంకులను కడిగించాలని ఆదేశించారు. భోజనానికి ఉపయోగించే సరుకులను నాణ్యమైనవే వాడాలని కళాశాల ప్రిన్సిపాల్ చైతన్యకు సూచించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జ్యోతి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల జోనల్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు, ఎంపీడీవో ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు..కామారెడ్డి క్రైం : ప్రతి ఇంటికి శుద్ధమైన నీరు స రఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ సంగ్వాన్ తెలిపారు. మంగళవారం కేంద్ర ప్రభుత్వ జల్ జీవన్ మిషన్ ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హర్ ఘర్ జల్ కార్యక్రమం కింద జరుగుతున్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ వెబ్సైట్లో ఉన్న జిల్లాలోని 953 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 1,095 అంగన్వాడీ కేంద్రాలు, జిల్లాలోని 423 రెవెన్యూ గ్రామాలలో శుద్ధమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు. అన్ని వివరాలను జల్ జీవన్ మిషన్ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
సమాచారం..
ట్రాన్స్కో అధికారులకు కొత్త నంబర్లు మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండల ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది, లైన్మెన్ తదితర వారి ఫోన్ నెంబర్లు మారినట్లు మంగళవారం ట్రాన్స్కో ఏఈ గోపికృష్ణ తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి నూతన ఫోన్ నెంబర్లను ఉన్నతాధికారులు కేటాయించడంతో వారికి సిమ్కార్డులు అందించామని ఏఈ తెలిపారు. గోపికృష్ణ, ఏఈ, మద్నూర్ మండలం 8712482039 సబ్ ఇంజనీర్, మద్నూర్ మండలం 8712482044 సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్(ఎల్ఐ), మద్నూర్ మండలం 8712482041 లైన్ ఇన్స్పెక్టర్, మద్నూర్ టౌన్ 8712482046 లైన్మన్ మద్నూర్ టౌన్ 8712482042 లైన్మన్, హండేకేలూర్ 8712482038 లైన్మన్, ఎక్లార 8712482036 సబ్ స్టేషన్, మద్నూర్ 8712482040 సబ్ స్టేషన్, సోమూర్ 8712482043 -
సమస్యల ఒడిలో సర్కారు బడి
కామారెడ్డి టౌన్ : వేసవి సెలవులు ముగింపునకు వచ్చాయి. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి. బడులను తిరిగి తెరిచేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు జిల్లావ్యాప్తంగా బడిబాట కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే తక్కువ ఉపాధ్యాయులున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు కసరత్తు నడుస్తోంది. అయితే షరామామూలుగా ఈసారీ విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలకనున్నాయి. చాలాచోట్ల మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. పెండింగ్లో రూ. 9.96 కోట్ల బిల్లులు.. పాఠశాలల్లో సౌకర్యాల మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి, అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టింది. జిల్లాలో మొత్తం 1,040 ప్రభుత్వ పాఠశాలలుండగా 973 పాఠశాలల్లో గతేడాది మార్చిలో వివిధ పనులు ప్రారంభించారు. విద్యుత్ సౌకర్యం, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, మూత్రశాలలకు అవసరమైన మరమతులు, తరగతి గదుల్లో మైనర్, మేజర్ మరమ్మతులు, తదితర పనుల బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించింది. ఎంపిక చేసిన స్కూళ్లకు రూ. 22 కోట్ల పనులకు పరిపాలన పరమైన అనుమతులు లభించాయి. చేపట్టిన పనుల్లో ఇప్పటివరకు 98 శాతం పూర్తయ్యాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కానీ పనులు చేసినవారికి ఇంకా రూ. 9.96 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇబ్బందులు లేకుండా చూస్తాం పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. అమ్మ అదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులు పూర్తయ్యాయి. బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి బిల్లులు రాగానే చెల్లిస్తాం. బడుల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చాం. – రాజు, డీఈవో, కామారెడ్డి చాలాచోట్ల మౌలిక వసతులు కరువు ప్రహరీలు లేక ఇబ్బందులు టాయిలెట్లు లేక అవస్థలు రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఎక్కడి సమస్యలక్కడే.. జిల్లాలో చాలా స్కూళ్లలో సమస్యలు తిష్టవేశాయి. చిన్నపాటి వర్షం పడితే చాలు స్కూళ్ల ఆవరణలు కుంటలుగా మారుతున్నాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తాగునీటి సమస్యలున్నాయి. పలు స్కూళ్లకు ప్రహరీలు లేవు. వేసవి సెలవుల్లో బడులకు భద్రత కరువవడంతో కొన్నిచోట్ల ఆకతాయిలు నల్లాలను ధ్వంసం చేశారు. సరైన వంటశాలలు కూడా లేవు. వేసవి సెలవుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం పిల్లల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
రెండు బైక్లు ఢీకొని ఇద్దరు.. బాన్సువాడ: బీర్కూర్ మండలం కిష్టాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. చించోల్లి గ్రామానికి చెందిన ఇల్తాం గంగారం (40) ట్రాక్టర్లోకి డీజిల్ కోసం మంగళవారం రాత్రి బైక్పై బీర్కూర్ వెళ్లాడు. అదే రాత్రి డీజిల్ తీసుకుని బైక్పై చించోల్లికి బయలుదేరాడు. అలాగే అన్నారం గ్రామానికి చెందిన సంగెం నందు(18) అనే యువకుడు మార్కెట్ కోసం బీర్కూర్కు బైక్పై బయలుదేరాడు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ శివారులో వీరిద్దరి బైక్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో గంగారం, నందుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న బాన్సువాడ ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాలను బాన్సువాడ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో పక్కపక్క గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆయా గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబసభ్యుల రోదనలు అందరిని కంటతడి పెట్టించాయి. నందిపేటలో.. నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నందిపేటకు చెందిన ఇమ్ముల రంజిత్(21) అలియాస్ దేవళ్ల సిద్దు అనే యువకుడు ఉపాధి నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నాడు. రంజిత్ నందిపేట మండలం సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన తన స్నేహితుడిని వెంటబెట్టుకుని బైక్పై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి నందిపేటకు బయలుదేరాడు. హైదరాబాద్ శివారులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా నిర్మించిన పిల్లర్ను వీరి బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రంజిత్ తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. సీహెచ్ కొండూర్ గ్రామానికి చెందిన మరో యువకుడికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. వేల్పూర్ మండలంలో.. వేల్పూర్: మండలంలోని పడగల్ గ్రామంలోగల కొత్తచెరువులో ఓ పశువుల కాపరి ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పశువుల కాపరి సెవ్వ రాజయ్య(52) చాలాకాలంగా స్థానిక గురడికాపు వర్గానికి చెందిన పశువులను మేపేవాడు. సోమవారం పశువులను మేపడానికి తీసుకెళ్లగా, చెరువులోకి వెళ్లిన పశువులను తీసుకురావడానికి నీటిలోకి దిగాడు. పశువులను బయటకు తెచ్చే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. మంగళవారం అతడి మృతదేహం తేలడంతో పోలీసులు బయటకు తీసి,, పోస్టుమార్టం కోసం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలులో గుర్తుతెలియని వ్యక్తి... ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వేస్టేషన్ పరిధిలో రైలులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం అర్ధరాత్రి ఒక గుర్తుతెలియని వ్యక్తి గుంతకల్లు నుంచి బోధన్ (రైలు నెంబర్ 57411) వెళ్లు రైలులో ప్రయాణిస్తుండగా, అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ దుర్గ ప్రసాద్ ఇచ్చిన సమాచారం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి, పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతుడి వయస్సు సుమారు 50–55ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎవరికై నా మృతుడి సమాచారం తెలిస్తే రైల్వే ఎస్సై 87126 58591 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. చికిత్స పొందుతూ ప్రభుత్వ పీఈటీ.. మాక్లూర్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వివరాలు ఇలా.. జక్రాన్పల్లి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గోడ దివాకర్(45)అనే ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయుడు నిజామాబాద్లోని కంఠేశ్వర్లో నివాసం ఉంటూ మోస్రా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. మే 30న స్కూటీపై తన స్వగ్రామం బ్రాహ్మణపల్లి వెళ్లి తిరిగి వస్తుండగా మాక్లూర్ మండలం దాస్నగర్ శివారులో 63వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. మృతుడి భార్య నిరోషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పలువురు మృతిచెందారు. నందిపేట, బాన్సువాడ మండలాల పరిధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాతపడ్డారు. అలాగే వేల్పూర్ మండలంలో చెరువులో పడి ఒకరు, నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందారు. -
లింగారెడ్డిపేటలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో గల లింగారెడ్డిపేట గ్రామంలో మంగళవారం స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్ తెలిపారు. వంద రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా లింగారెడ్డిపేట గ్రామంలో ప్రత్యేకంగా డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి మొత్తం మురికి కాలువలను శుభ్రం చేయించమన్నారు. అనంతరం తడి చెత్త, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. మహిళలకు రూ.కోటి 58 లక్షల రుణాలు.. ఎల్లారెడ్డి పట్టణంలోని పలు డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.కోటి 58 లక్షల 50 వేల రుణాలను అందించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. డ్వాక్రా సంఘాల మహిళలు తీసుకున్న రుణాలతో అభివృద్ధి చెందాలని సూచించారు. -
వాటర్ ట్యాంక్ ఎక్కిన కాంగ్రెస్ నాయకులు
బోధన్టౌన్(బోధన్): ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణ యువజన కాంగ్రెస్ నాయకులు బీటీ నగర్ కా లనీలోని వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. సీ నియర్ నాయకుడు, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన సుదర్శన్రెడ్డికి అధిష్టానం మంత్రి పదవి ఇవ్వక పోవడం సరికాదని, సీఎం రేవంత్రెడ్డి తక్షణ మే అధిష్టానంతో మాట్లాడి మంత్రి పదవి ఇవ్వా లని డిమాండ్ చేశారు. సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే తాము ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తలారి నవీన్కుమార్తోపాటు మరో ముగ్గురు నాయకులు హెచ్చరించారు. సమాచారం అందుకున్న పోలీసులు బీటీనగర్ కాలనీకి చేరుకుని పార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మొయినొద్దీన్తో మా ట్లాడారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన వారిని కిందికి ది గాలని పోలీసులు కోరారు. అయినప్పటికీ వారు వినకపోవడంతో కలగజేసుకున్న నాయకులు.. తాము పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడామని చెప్పడంతో వారు ట్యాంక్పై నుంచి కిందికి దిగి వచ్చారు. సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని.. సముదాయించిన నాయకులు, పోలీసులు -
‘ప్రభుత్వం అండగా ఉంటుంది’
కామారెడ్డి క్రైం: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొ న్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన వారి బాగోగులు తెలుసుకునేందుకు మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో స మావేశం నిర్వహించారు. కార్యక్రమంలో బాధిత పిల్లలు, వారి సంరక్షకులు పాల్గొన్నా రు. బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో నిలవాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, బాలల పరిరక్షణ అధికారి స్రవంతి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ స్వర్ణలత, డీసీపీయూ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ టోర్నీకి ఎంపిక కామారెడ్డి అర్బ న్: తమ పాఠశా ల విద్యార్థి వెంకట్ రాష్ట్రస్థాయి అండర్–11 బ్యాడ్మింటన్ టోర్నమెంట్కు ఎంపికయ్యాడని జిల్లాకేంద్రంలోని అక్షర హైస్కూల్ ప్రిన్సిపల్ సంగీతారెడ్డి తెలిపారు. ఇటీవల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో సత్తా చాటడంతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. విద్యార్థిని స్కూల్ కరస్పాండెంట్ లోకేష్రెడ్డి, కోచ్ సందీప్గౌడ్ అభినందించారన్నారు. ‘మాదకద్రవ్యాలకు బానిసలు కావొద్దు’ కామారెడ్డి అర్బన్ : మాదక ద్రవ్యాలకు బానిసలు కావొద్దని, బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మాదక ద్రవ్యాల నియంత్రణ కన్వీనర్లు విశ్వప్రసాద్, ఆకుల సుధాకర్ పేర్కొన్నారు. మంగళవారం కళాశాలలో ప్రిన్సిపల్ విజయ్కుమార్ అధ్యక్షతన మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు క్విజ్తోపాటు చర్చాగోష్టి నిర్వహించారు. మాదక ద్రవ్యాలతో మానసికంగానే కాకుండా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా పతనం అవుతారని ప్రిన్సిపల్ విజయ్కుమార్ పేర్కొన్నారు. వాటికి దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు శ్రీనివాస్రావు, కవిత, తబస్బేగం, అనిల్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. బలమైన గాలులకు ఇద్దరి బలి బాన్సువాడ: బలమై న గాలులు ఇద్దరి ప్రాణాలను బలిగొన్నాయి. బాన్సువాడలో గాలి ప్రభావానికి దాబాపైనుంచి పడి ఒకరు మరణించగా.. నిజామాబాద్లో రేకులు విరిగి మీదపడడంతో మరొకరు మృత్యువాతపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ బల్దియా పరిధిలోని తాడ్కోల్ శివారులోగల డబుల్ బెడ్ రూం కాలనీలో ప్రభు (55) నివసిస్తున్నాడు. సోమవారం రాత్రి అతడు దాబాపై పడుకున్నాడు. గాలులు వీయడంతో నిద్రలోంచి మేల్కొని, నిల్చున్నాడు. గాలులు బలంగా వీయడంతో అదుపుతప్పి కిందపడి మరణించాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. నిజామాబాద్లో.. ఖలీల్వాడి: నిజామాబాద్ సంజీవరెడ్డి కాల నీకి చెందిన విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ ఆస్వాడ్ శ్రీనివాస్(55) సోమవారం రాత్రి వర్షం రా వడంతో వినాయక్నగర్లోని కల్లు బట్టిలోకి వెళ్లాడు. ఆ సమయంలో చెట్టుకూలి కల్లుబట్టిపై పడడంతో, రేకులు విరిగి శ్రీనివాస్పై పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు. కేసు నమోదు చేసుకున్న ట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
ఆర్మూర్లో బధిరుల పాఠశాల
ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో 12 ఎకరాల సువిశాల స్థలంలో 1983 సెప్టెంబర్లో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మెదక్ డయాసిస్ ఆధ్వర్యంలో తెలంగాణలోనే ఏకై క బధిరుల పాఠశాల ప్రారంభమైంది. ● ఐదుగురు విద్యార్థులతో ప్రారంభించిన పాఠశాల నేడు ఎంతో మందికి సేవలందిస్తూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో (దివ్యాంగుల్లో) ఆత్మ విశ్వాసాన్ని నింపుతోంది. ● ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థులతోపాటు ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన సుమారు 110 మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 15 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ● పాఠశాల ప్రారంభం నుంచి సుమారు 500 మందికి పైగా చెవిటి, మూగ విద్యార్థులు విద్యాభ్యాసం పూర్తి చేసుకొని ఆయా ప్రాంతాలలో వివిధ వృత్తులలో జీవనం కొనసాగిస్తున్నారు. ● విద్యార్థులందరికీ సీఎస్ఐ గతంలో ఉచితంగా విద్యా, వసతిని కల్పించేది. ● ప్రస్తుతం నామమాత్రపు ఫీజులతో సంస్థను కొనసాగిస్తున్నారు. ● విద్యార్థులకు సామూహిక, వ్యక్తిగత వినికిడి యంత్రాల సహాయంతో పాఠ్యాంశాలను బోధిస్తూ ఆడిటరీ ట్రెయినింగ్, స్పీచ్ థెరపీని అందిస్తున్నారు. ● వృత్తి విద్య, సాంస్కృతిక, క్రీడా, విద్యా అంశాలలో బధిర విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. – ఆర్మూర్మీకు తెలుసా? -
బల్దియాలో కలపొద్దు
బిచ్కుంద : ‘మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీ నం చేసి మా పొట్టగొట్టొదు’ అంటూ గోపన్పల్లి వా సులు ఆందోళనకు దిగారు. మంగళవారం బిచ్కుంద మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళ న చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో అభిప్రాయ సేకరణ జరిపినప్పుడు అందరూ పంచాయతీగానే కొనసాగించాలని చెప్పార న్నారు. తమ అభిప్రాయాలను పక్కనబెట్టి మున్సి పాలిటీలో విలీనం చేయడం ఎంతవరకు సమంజస మని ప్రశ్నించారు. కూలి పనులు చేసుకుని జీవించే తమకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేయవద్దని కోరారు. అధికారులు స్పందించి తమ గ్రామాన్ని పంచాయతీగానే కొనసాగించాలన్నారు. అనంత రం అధికారులకు వినతి పత్రం అందించారు. గోపన్పల్లివాసుల డిమాండ్ మున్సిపల్ కార్యాలయం ముట్టడి -
బీభత్సం సృష్టించిన ఈదురుగాలులు
సాక్షి నెట్వర్క్:బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో సోమవారం రాత్రి ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. చెట్లు విరిగి రోడ్లపై అడ్డంగా పడ్డాయి. దీంతో చాలా చోట్ల ట్రాఫిక్కు అంతరాయమేర్పడింది. విద్యుత్ తీగలు తెగిపోవడంతో కరెంటు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. స్థానికులు చెట్లను తొలగించి ట్రాఫిక్ను పునరుద్దరించేలా చర్యలు తీసుకున్నారు. రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంగళవారం ఉదయం నుంచే విద్యుత్ సిబ్బంది విద్యుత్ వైర్లను సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు పలుచోట్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు -
పిచ్చి కుక్కల దాడిలో నలుగురికి గాయాలు
బాన్సువాడ: బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలో పిచ్చి కుక్కల దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామంలోని వేర్వేరు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం ఒంటిరిగా వెళ్తున్న రాచకొండ భూమవ్వ, మేకల బేతయ్య, మేకల సాయిలు, బీహారి కూలీపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా కరిచాయి. వెంటనే స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడి నుంచి నిజామాబాద్కు తరలించారు. నిజామాబాద్ ఆస్పత్రిలో ప్రస్తుతం వీరందరు చికిత్స పొందుతున్నారు. -
జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
కామారెడ్డి టౌన్: జిల్లాలోని పలు ప్రాంతాలలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ టీం మంగళవారం అకస్మిక దాడులు నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ టాస్క్ఫోర్స్ టీం హెడ్, జోనల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వి. జ్యోతిర్మయి ఆధ్వర్యంలో దాడులు సాగాయి. ముందుగా సదాశివనగర్ మండలంలోని పోసానిపేటలో గల ఫ్లోర్ మిల్లో తనిఖీ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో శనగ, రాగి, జొన్నపిండి ప్రాసెస్ చేస్తున్నట్లు గుర్తించారు. కిటికీలకు మెష్ లేకపోవడం, మిల్లో బూజుతో కూడిన దుమ్ము ధూళి ఉండడం, రికార్డులు సరిగా లేకపోవడాన్ని గమనించారు. సుమారు రూ. 28.50 లక్షల విలువగల 42,500 కిలోల లేబుల్, ప్యాకింగ్ వివరాలు లేని అనుమానాస్పదంగా ఉన్న శనగపప్పును సీజ్ చేశారు. శాంపిల్స్ సేకరించి పరీక్ష నిమిత్తం హైదరాబాద్లోని ల్యాబ్కు పంపించామని జ్యోతిర్మయి తెలిపారు. యజమానికి నోటీసులు ఇచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో.. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన గల పర్ణిక ప్యాలెస్, డిగ్రీ కళాశాల మైదానం ముందున్న వైష్ణవి ఇంటర్నేషనల్ హోటల్లలోనూ తనిఖీలు చేశారు. రొయ్యలు, చేపలు, చికెన్, కుల్లిన మాంసంతో పాటు, వెజ్, నాన్వేజ్ ఐటమ్లను ఒకే రిఫ్రిజిరేటర్లో కలిపి ఉంచడం, అపరిశుభ్ర వాతావరణం ఉండడంతో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. పలుమార్లు వేడి చేసిన వంట నూనెలను ఆహా ర పదార్థాలలో వాడుతున్నట్లు గుర్తించారు. పర్ణిక ప్యాలెస్ హోటల్ స్టోర్ రూమ్లో రూ. 45 వేల విలువగల నిల్వ ఉంచిన మాంసం, కాలం చెల్లిన ముడి సరుకులు, తేనె, ఫ్రూట్స్, పురుగు పట్టిన బియ్యం, మిల్ మేకర్, ధనియా పొడి తదితర పదార్థాలను ధ్వంసం చేశారు. వైష్ణవి ఇంటర్నేషనల్ బార్ అండ్ రెస్టారెంట్లో సుమారు రూ.17 వేల విలువచేసే 40 కిలోల నిల్వ ఉంచిన దుర్వాసన వస్తున్న మాంసం, 10 కిలోల గోధుమ పిండి, 10 కిలోల కుళ్లిన రొయ్యలను గుర్తించి, ధ్వంసం చేశారు. వాటి యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. కొత్త బస్టాండ్ ముందున్న 3 హోటళ్లపైనా దాడులు చేసి నోటీసులు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు రోహిత్రెడ్డి, శ్రీషిక, పి.స్వాతి, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లోర్మిల్లో రూ. 28 లక్షల విలువైన శనగపప్పు సీజ్ పలు హోటళ్లలో కుళ్లిన మాంసం గుర్తింపు, ధ్వంసం యజమానులకు నోటీసులు జారీ -
ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణం పనులలో వేగం పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీరాజ్ ఇంజినీర్ ను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. మేసీ్త్రలను, ఇతర కార్మికులను అధికంగా నియమించుకొని పనుల్లో వేగం పెంచి నవంబర్లోగా పూర్తిస్థాయిలో నిర్మాణం పనులు జరిపించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ డీఈ స్వామి దాస్, ఏఈ సంజయ్ని ఆదేశించారు. ఈవీఎం గోదాం పరిశీలన కామారెడ్డి క్రైం: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎం గోడౌన్కు రక్షణ చర్యలు కల్పించాలని సెక్యూరిటీ సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మూడు నెలల సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం కలెక్టర్ ఈవీఎం గోడౌన్ను సందర్శించారు. గోడౌన్లో సెక్యూరిటీ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీ ఎం గోడౌన్ను గుర్తింపు పొందిన రాజకీయ పా ర్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించామన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి ఆర్డీవో వీణ, ఎలక్షన్ డీటీ అనిల్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. పెట్రోల్బంకు ఏర్పాటు కోసం స్థల పరిశీలన నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు మంగళవారం బాన్సువాడ సబ్కలెక్టర్, ఎల్లారెడ్డి ఇన్చార్జి ఆర్డీవో కిరణ్మయి మాల్తుమ్మెద శివారులో స్థలాన్ని పరిశీలించారు. మండల సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్బంకు ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపిక చేయాలని జిల్లా అధికారుల నుంచి వచ్చిన ఆదేశాలమేరకు నాగిరెడ్డిపేట రెవెన్యూ అధికారులు మండలంలోని మాల్తుమ్మెద శివారులో గల సర్వే నం,834లో 10గుంటల భూమిని ఎంపిక చేశారు. ఈ మేరకు పెట్రోల్బంకు ఏర్పాటు కోసం ఎంపిక చేసిన స్థలాన్ని స్థానిక అధికారులతో కలిసి ఇన్చార్జీ ఆర్డీవో కిరణ్మయి పరిశీలించారు. మాల్తుమ్మెద శివారులో ఎంపిక చేసిన స్థలం వివరాలను అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు. గతంలో డెయిరీ శిక్షణ కోసం 10ఎకరాల స్థలాన్ని ఐకేపీకి కేటాయిచారని అధికారులు ఆమెకు వివరించారు. ప్రస్తుతం అందులో నుంచి పెట్రోల్బంకు ఏర్పాటు కోసం స్థలాన్ని ఎంపిక చేశామని వారు తెలిపారు. ఆమెవెంట నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు, ఆర్ఐ మహ్మాద్, సీసీ శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల జిల్లా కమిటీ నియామకం బాన్సువాడ : తెలంగాణ మలిదశ ఉద్యమకారుల జిల్లా కమిటీని మంగళవారం బాన్సువాడలో ఏకగ్రీవంగా నియమించారు. మలిదశ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆదేశానుసారంతో జిల్లా అధ్యక్షులు ఉడుత గంగాధర్ సమక్షంలో నూతన కమిటీని నియమించారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా కడెం బాబాగౌడ్, ఉమ్మడి బీర్కూర్ మండలం అధ్యక్షులుగా ఆరేళ్ల పవన్గౌడ్లను నియమించారు. తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమస్యల కోసం పోరాటం చేస్తామని గంగాధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారులు గంజివార్ చందు, ఎర్రవాటి సాయిబాబా, మజీద్, భాస్కర్గౌడ్, కృష్ణ, మారుతి, గంగారం తదితరులున్నారు. -
మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఒక్కరూ కాపురం చేయలేదు..!
కామారెడ్డి: డబ్బులు ఉన్నప్పుడు దుబార ఖర్చులు చేశారు. కాలక్రమేనా.. కనీసం టీ తాగటానికి కూడా డబ్బులు లేక సతమతమయ్యారు. దానికి తోడు కొడుకు సతీశ్కు ఆరు నెలల క్రితం పక్షవాతం రావటంతో సేవలు చేయటానికి కూడా ఎవ్వరు లేకపోవడంతో.. 75 సంవత్సరాల వృద్ధుడైన తండ్రి ఆకుల చిన్న సాయిలు ఓపిక ఉన్నకాడికి సేవలు చేశాడు. చివరికి నీకు సేవలు చేయటం నాతో కావటం లేదు బిడ్డా... ఇక నేను ఏదైన మందు తాగి చచ్చిపోతాను అని తన అభిప్రాయాన్ని ఈ నెల 6 న కొడుకు సతీశ్తో చెప్పాడు. నీతోపాటు నేను కూడా అదే పని చేస్తా బాపూ అంటూ చెప్పి అదే రోజు విష గుళికలు తెప్పించుకుని నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాణిక్భండార్ గ్రామంలోని సొంత ఇంట్లోనే ఇద్దరూ కలిసి విషగుళికలు మింగారు. ఇద్దరూ వాంతులు చేసుకోవటంతో గమనించిన సాయిలు పెద్ద కుమారుడు సంతోష్ వెంటనే వారిద్దరిని ఆస్పత్రికి తరలించాడు. చికిత్సపొందుతూ సతీశ్ (32) సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఆకుల చిన్న సాయిలు (75) ఆదివారం మృతి చెందాడు. రెండ్రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులు మృతి చెందటంతో మాణిక్భండార్ గ్రామంలో విషాదం నెలకొంది. వ్యవసాయ భూమి అమ్మగా వచ్చిన సుమారు రూ. 90 లక్షలకు పైగా డబ్బులను సతీశ్ దుబారాగా ఖర్చు చేశాడు. తీరా చేతిలో చిల్లి గవ్వకూడా లేకుండాపోయింది. పైగా సతీశ్ మూడు వివాహాలు చేసుకున్నప్పటికీ ఒక్క భార్య కూడా కాపురం చేయలేదు. దీంతో తీవ్రమనస్తాపానికి గురై గత సంవత్సం తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఆరు నెలల క్రితం సతీశ్కు పక్షవాతం వచ్చి మంచం పట్టాడు. అప్పటి నుంచి తండ్రి సేవలు చేశాడు. డబ్బులు లేక ఆస్పత్రిలో వైద్యం చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. -
సాహిత్యంలో రాణిస్తున్న డేగల వైష్ణవి
మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తడపాక ల్ ఉన్నత పాఠశాలకు చెందిన డేగల వైష్ణవి తెలుగు సాహిత్యంలో రాణిస్తుంది. ఏడో తరగతి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న వైష్ణవి కథ లు, కవితలు, పద్యాలను రాసి విమర్శకుల ప్ర శంసలను అందుకున్నారు. అమ్మ అనే వచనా శతకం, చిన్నారి కథలు అనే శీర్షిక పేరిట పుస్తకంరాసింది. సామాజిక ఇతివృత్తంతో రాసిన కథ లు ఎంతో మందిని మెప్పించాయి. వైష్ణవి రాసి న కథల పుస్తకాన్ని ఇటీవల కలెక్టర్ ఆవిష్కరించగా, చదువు అనే సరళ వచనా శతకం పుస్తకా న్ని తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఎల్లూరి శివారెడ్డి, ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. వైష్ణవి అక్షరయాన్ బాలికా పురస్కారం, పెందోట సాహిత్య పురస్కారం, బాలజ్యోతి, తానా పురస్కారాలను అందుకుంది. ప్రస్తుతం ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా ప్రేరణ అనే కథల పుస్తకాని రచించానని, త్వరలోనే ఆవిష్కరించనున్నట్లు వైష్ణవి వెల్లడించారు. వైద్య విద్య ను అభ్యసించి పేదలకు సేవ చేయడమే తన ధ్యేయం అని ఈ చిన్నారి సాహితీవేత్త వెల్లడించడం గమనార్హం. -
వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి
రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ సార్వజనిక్ గణే ష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే 75వ ( వజ్రోత్సవ) వార్షికోత్సవంలో గ్రామస్తులు అందరు భాగస్వామ్యులు కావాలని నిర్వాహక కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వేడుకలు వైభవంగా నిర్వహించాలని తీర్మానించారు. ఇందుకు వివి ధ కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో గణేష్ మండలి అధ్యక్ష, కార్యదర్శులు చిదుర వీరేశం, గెంటీల సాయిలు, తదితరులు పాల్గొన్నారు. -
వల్లభాపూర్ వాసికి అమెరికాలో ఫ్రీ సీటు
● పోటీపరీక్షలో ప్రతిభచాటి వైద్యవిద్య కోర్సుకు ఎంపికై న కేశెట్టి చరణ్సిద్ధార్థ్ మాక్లూర్: మండలంలోని వల్లభాపూర్కు చెందిన కేశెట్టి చరణ్ సిద్ధార్థ్ అమెరికాలో యూఎస్ఎంఎల్ఈ కోర్సులో ఫ్రీసీటు సాధించాడు. వల్లభాపూర్లో వ్యవసాయం చే సుకుంటూ జీవించే కేశెట్టి సూర్యప్రకాష్–వనజల ఏకై క కుమారుడు చరణ్ సిద్ధార్థ్. త ల్లిదండ్రులు పట్టభద్రులైనప్పటికీ వ్యవసాయం మీద ఉన్న ప్రేమతో గ్రామంలోనే జీవిస్తుండగా, కుమారుడిని మాత్రం వైద్యుడిని చేయాలనే లక్ష్యంతో చదివిస్తున్నారు. సి ద్దార్థ్ ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేయగా, యూఎస్ఎంఎల్ఈ కోర్సుకుగాను పోటీ పరీక్షలో అత్యాధిక మార్కులు సాధించి ఫ్రీ సీటు పొందారు. మూడేళ్లపాటు ఉండే ఈ కో ర్సుకు గ్రాంటు మొత్తాన్ని అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. సంవత్సరానికి 80 వేల డాలర్లు అక్కడి ప్రభుత్వం నుంచి గ్రాంటు వస్తున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిది..నన్ను డాక్టర్ చేయటానికి నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు. వారి కోరిక మేరకు పెద్ద డాక్టర్ అయ్యాక, వారి ఆశయాలకు అనుగుణంగా పేదోళ్లకు ఉచిత వైద్య సేవలు అందించటంలో ముందుంటాను. –కేశెట్టి చరణ్ సిద్ధార్థ్, వల్లభాపూర్ -
‘పందిరి’ సాగు.. లాభాలు బాగు..
బాల్కొండ: పందిరి విధానంలో కూరగాయాలు సాగు చేయడం వల్ల లాభాలు బాగా ఉంటాయని ఆర్మూర్ డివిజన్ ఉద్యానవన అధికారి రుద్ర వినాయక్ అంటున్నారు. పందిరి విధానంపై ప్రభుత్వం (ఆర్కేవీవై) రాష్ట్రీ య కృషి వికాస్ యోజన కింది సబ్సిడీ సైతం అందిస్తుందంటున్నారు. సాధారణంగా ఎకరం భూమిలో శాశ్వత పందిరి నిర్మించుకోవాడానికి రైతులకు సుమారుగా రూ. లక్ష ముప్పై వేల నుంచి రూ. లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. ఉద్యానవన శాఖ ఎకరానికి రూ. 50వేలు సబ్సిడీ ఇస్తుంది. అలాగే ఉద్యానవన శాఖ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ నుంచి నాణ్యమైన కూరగాయాల నారు కోసం ఎకరానికి రూ6, 400 సబ్సిడీ ఇస్తుంది. ప్రభుత్వం అందించే సబ్సిడీని రైతులు వినియోగించుకొని, కూరగాయల సాగుపై దృష్టిసారించాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రయోజనాలు ఇలా.. ● పందిరి వ్యవస్థలో ప్రధానంగా తీగ జాతి (కాకర, సోర కాయ, టమాట, చిక్కుడు, బీర) లాంటి కురగాయాలను సాగు చేసుకోవాలి. ● సాధారణ పద్దతి కంటే పందిరి పద్దతిలో కూరగాయాలు సాగు చేసుకుంటే 2.5 టన్నుల అదనపు దిగుబడి వస్తుంది. ● పండు యొక్క రంగు, నాణ్యత మెరుగు పడుతుంది. ఐదు ఎకరాల భూమిలో వరి సాగు చేసే బదులు ఎకరం భూమిలో కూరగాయాలు సాగు చేస్తే అంతే ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీని రైతులు వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.రైతు సమాచారం ఈ విధానంలో కూరగాయలు పండిస్తే అధిక దిగుబడి ప్రభుత్వం సబ్సిడీ సైతం అందిస్తుందంటున్న అధికారులు -
బిల్లుల కోసం ఎదురుచూపులు
● నాలుగేళ్లుగా అందని బిల్లులు, రూ. 35 లక్షల బకాయి ● బిచ్కుంద జీపీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ ● ఆందోళనలో కాంట్రాక్టర్లు ● కొత్త పనులకు ముందుకు రాని వైనం బిచ్కుంద(జుక్కల్) : బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాలుగేళ్ల క్రితం గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లుల రాకకోసం కాంట్రాక్టర్లు, సర్పంచులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బిచ్కుంద మండల కేంద్రంలో సీసీరోడ్లు, డ్రెయినేజీ, కల్వర్టులు ఇతర అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. పనులు చేయాలని జీపీ పాలక వర్గం తీర్మానం చేసి ఇచ్చింది. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఏళ్లు గడుస్తున్నా గత ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. సుమారు రూ.35 లక్షల బకాయి బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఎంబీ రికార్డులు చేసి సంబంధిత పంచాయత్రాజ్ (పీఆర్) అధికారులు సమర్పించిన ఎంబీలు కేవలం రికార్డులకే పరిమితమయ్యాయి. సీసీ రోడ్లు, డ్రెయినేజీ, కల్వర్టులు, విద్యుత్లైట్లు, బ్లీచింగ్ పౌడర్ ఇతర బిల్లులు బిచ్కుంద జీపీలో బకాయి ఉంది. బిచ్కుంద జీపీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది బిల్లుచెల్లించడానికి ఎన్ని నిబంధనలు పెండుతుదోనని కాంట్రాక్టర్లు, సర్పంచులు ఆందోళన చెందుతున్నారు. పాత పనులకు నాలుగేళ్లుగా బిల్లులు రాలేదు ఇప్పుడు చేసిన పనులకు బిల్లులు వస్తాయో లేదోనని సీసీరోడ్లు, డ్రెయినేజీ పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద నాలుగు నెలల క్రితం రోడ్లకు కోట్ల నిధులు మంజూరు అయ్యాయి. కొన్ని పనులు చేయగా.. మరికొన్ని వదిలేశారు. -
సూపర్ మార్కెట్లో చోరీ
ఆర్మూర్టౌన్: పట్టణంలోని సాయి చైతన్య సూపర్మార్కెట్లో గుర్తుతెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. దుకాణం షెటర్ను లేపి లోనికి ప్రవేశించిన దుండగులు దుకాణంలోని వస్తువులతో పాటు సుమారు రూ. 80వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. సంతలో సెల్ఫోన్లు.. భిక్కనూరు: మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వారంతపు సంతలో గుర్తుతెలియని దుండగులు ఐదుగురి సెల్ఫోన్లను చోరీచేశారు. దీంతో బాధితులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఒక బాలుడు సెల్ఫోన్ను ఎత్తుకుని వెళ్తుండగా స్థానికులు అతడివెంటపడ్డారు. కానీ సదరు బాలుడు చిక్కకుండ పారిపోయాడు. గతంలో కూడా సెల్ఫోన్ల చోరీలు జరగడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈక్రమంలో సంతలో చోరీల నివారణకు పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాబా హోటల్లో మందుబాబుల హల్చల్ ఖలీల్వాడి: నగరంలోని సారంగాపూర్ కమాన్ సమీపంలోని ఓ దాబా హోటల్ వద్ద శనివారం అర్ధరాత్రి మందుబాబులు హల్చల్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు బిర్యానీ కావాలని హోటల్ నిర్వాహకులతో గొడవకు దిగారు. పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని రెండువర్గాలను వెళ్లగొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత అదృశ్యం సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామానికి చెందిన మున్నూరు శోభ అలియాస్ సంధ్య అదృశ్యమైనట్లు ఎస్సై రామ్ ఆదివారం తెలిపారు. ఈ నెల 7న ఆమె ఎలాంటి కారణం లేకుండానే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, ఇప్పటికీ తిరిగిరాలేదన్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. ఆమె భర్త మహిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డిలో వృద్ధుడు.. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఆజాంపూర కాలనీకి చెందిన 65 ఏళ్ల మహమ్మద్ యాసిన్ఖాన్ అనే వృద్ధుడు అదృశ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి ఆదివారం తెలిపారు. ఈనెల 7న ఉదయం అతడు ఇంటి నుంచి తన స్కూటీపై బయటకు వెళ్లిపోయి, ఇప్పటికీ తిరిగిరాలేదు. ఆదివారం ఉదయం పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద స్కూటీ లభ్యమవగా, కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు సీఐ తెలిపారు. అతడి ఆచూకీ తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లోగానీ, 8712686145, 8712666242 నంబర్లకు సంప్రదించాలన్నారు. తాడ్వాయిలో వాహనాల తనిఖీ తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ చేశారు. లైసెన్స్లు, పొల్యూషన్, వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో పాటు సీటు బెల్టులు, హెల్మెట్లు ధరించని వారికి జరిమానా విధించారు. అలాగే పెండింగ్లో చాలనులు ఉన్న వాహనాలకు ఆన్లైన్లో డబ్బులు కట్టేలా చర్యలు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు. -
కామారెడ్డి శివారులో ట్రాలీ ఆటో– బైక్ ఢీ
● ముగ్గురికి గాయాలు కామారెడ్డి టౌన్: పట్టణ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణ శివారులోని శాబ్ధిపూర్ రోడ్లో ప్రయాణిస్తున్న ట్రాలీ ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న రెడ్డిపేట గ్రామానికి చెందిన పోచవ్వ, నరేష్లకు, ఆటో నడుపుతున్న డ్రైవర్ ఓబుది సాయిలుకు గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నవీపేట మండలంలో.. నవీపేట: మండలంలోని యంచ శివారులోని బాసర బ్రిడ్జి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు గ్రామస్తులు తెలిపారు. రాథోడ్ విజయ్, రాథోడ్ రాజు బైక్పై బాసర్ నుంచి ఫకీరాబాద్ వైపు బయలుదేరగా, యంచ శివారులోని బ్రిడ్జి సమీంలో వారిని మరో బైక్ ఢీకొట్టింది. ఈఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాయ్యాయి. మరో బైక్ నడిపిస్తున్న బాధితుడిని ధర్మాబాద్ వాస్తవ్యుడిగా స్థానికులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానికులు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
సత్తాచాటిన ‘రెంజల్’ విద్యార్థులు
రెంజల్(బోధన్): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షలో రెంజల్ విద్యార్థులు సత్తాచాటారు. జిల్లాలోనే అత్యధికంగా రెంజల్ మండలం నుంచి 17మంది ఎంపికయ్యారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల ప్రతిభను వెలికితీస్తు వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్షలను ప్రతీ సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తుంది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా నుంయి 129 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే ఈ అర్హత పరీక్షల్లో ఎంపికై తే 4 సంవత్సరాల పాటు వారి ఖాతాల్లో నెలకు రూ. వెయ్యి చొప్పున, సంవత్సరానికి రూ. 12వేలను వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఎంపిక విధానం ఇలా: పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. జిల్లా యూనిట్గా కేటగిరీలా వారీగా అర్హుల ఎంపిక నిర్వహిస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారులు కేంద్రం నుంచి వచ్చిన జాబితా ఆధారంగా ఏఏ మండలం నుంచి ఎంత మంది ఎంపికయ్యారనేది గుర్తిస్తారు. ప్రతి సంవత్సరం ఆర్మూర్ మండలం నుంచి అత్యధికంగా విద్యార్థులు ఎన్ఎంఎంఎస్కు అర్హత సాధిస్తారు. ఈసారి రెంజల్ మండలం నుంచి అత్యధికంగా విద్యార్థులు అర్హత సాధించారు. ఎన్ఎంఎంఎస్కు అత్యధికంగా 17 మంది ఎంపిక జిల్లావ్యాప్తంగా అర్హత సాధించిన 129 మందిప్రత్యేక తరగతుల ఫలితం ప్రత్యేక తరగతుల ఫలితంగానే విద్యార్థులు అర్హత సాధించారు. పాఠశాల ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంది.అలాగే సాధించాలనే పట్టుదల విద్యార్థుల్లో ఉండటం వల్లే మంచి ఫలితాలు వచ్చాయి. రెంజల్ హైస్కూల్ నుంచి 10 మంది, మోడల్ పాఠశాల నుంచి ఆరుగురు. మైనారిటీ గురుకుల పాఠశాల నుంచి ఒకరు అర్హత సాధించారు. – ఆంజనేయులు, రెంజల్ హైస్కూల్ హెచ్ఎం, ఎంఈవోసద్వినియోగం చేసుకుంటా.. ఉపాధ్యాయులు ప్రతీరోజు నిర్వహించిన ప్రత్యేక తరగతులు ఎన్ఎంఎంస్ పరీక్షలో అర్హత సాధించడానికి ఎంతో దోహదపడ్డాయి. ఉపకార వేతనానికి ఎంపికై తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించాలని పట్టుదలతో చదివాను. ఎన్ఎంఎంఎస్కు ఎంపికవడంతో, స్కాలర్షిప్ను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులకు సిద్ధమవుతాను. – గగన్కుమార్, రెంజల్ హైస్కూల్ విద్యార్థి -
ఆలయం పేరే ఊరు పేరైంది
మీకు తెలుసా? ఉత్తర తెలంగాణ వరప్రదాయని ఎస్సారెస్పీసమాచారం..పాల్వంచ మండలం బండరామేశ్వర్పల్లి గ్రామంలో క్రీ.శ. 1264లో కాకతీయ సామ్రాజ్య విస్తరణలో భాగంగా రాణి రుద్రమదేవి అక్కడ గుండయ్య అనే సామంతుడిని నియమించి బండరాళ్లతో రామనాథుని ఆలయాన్ని నిర్మించినట్టు ఆలయంపై ఉన్న శిలాశాసనం చెబుతోంది. భక్తులు రానురాను రామనాథున్ని రామలింగేశునిగా, రాజరాజేశ్వర స్వామిగా కొలుస్తున్నారు. బండరాళ్లతో ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి గ్రామానికి బండరామేశ్వర్పల్లి అనే పేరు వచ్చినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. – మాచారెడ్డిబాల్కొండ: మండలంలోని పోచంపాడ్ సమీపంలో 1963 జూలై 26న శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్నిర్మాణం కోసం దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారు. ● ప్రాజెక్ట్ నిర్మాణ పనులు 1978 వరకు పూర్తయ్యాయి. ● ప్రాజెక్ట్ నీటిమట్టం 1091 అడుగులు కాగా 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. కాని పూడిక వలన ప్రస్తుతం 80.5 టీఎంసీలకు నీల్వ సామర్థ్యం పడిపోయింది. ● ప్రాజెక్ట్ ప్రధాన కాలువలుగా కాకతీయ, సర స్వతి, లక్ష్మి ఉన్నాయి. 2010 తరువాత వరద కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభమైంది. ● 1978లోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందారెడ్డి ప్రాజెక్ట్ నుంచి తొలిసారి కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల ప్రారంభించారు. ● ఈ ప్రాజెక్ట్ ద్వారా 18 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. ● ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల ఆయకట్టుకు నీరు అందిస్తారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్గట్ల మాజీ సర్పంచ్ పిట్ల మీన (48) మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఏర్గట్లకు చెందిన మీనా తన సోదరుడితో కలిసి బైక్పై మోర్తాడ్ నుంచి ఏర్గట్లకు బయలుదేరింది. తిమ్మాపూర్ శివారులో వీరి బైక్కు కుక్క అడ్డు రావడంతో, దానిని తప్పించబోయేక్రమంలో బైక్ అదుపుతప్పి మీనా, ఆమె సోదరుడు కిందపడిపోయారు. ఈఘటనలో మీనా తలకు తీవ్ర గాయం కావడంతో ఘటనా స్థలంలోనే మరణించారు. సమాచారం అందుకున్న ఎస్సై విక్రమ్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏర్గట్లలో విషాదఛాయలు... తమ గ్రామానికి సర్పంచ్గా పని చేసిన మీనా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఏర్గట్లవాసులు తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఆమె మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం గ్రామంలో మీనా మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆదర్శం ఫరీదుపేట పూర్వ విద్యార్థులు
మాచారెడ్డి : చదువుకున్న బడి బాగు కోసం ఫరీదుపేట పూర్వ విద్యార్థులు చేస్తున్న కృషి అందరికీ ఆదర్శమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. పల్వంచ మండలం ఫరీదుపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, రెరా చైర్మన్, కామారెడ్డి తొలి కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ గ్రామస్తులు బాధ్యతగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యారంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల ప్రక్షాళనకు విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు, మెరుగైన విద్యా వ్యవస్థ ఏర్పాటుకు సమగ్ర విధానం రూపొందించాలని విద్య కమిషన్ను ఆదేశించామన్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, విద్యాదాతగా పేరున్న తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి ఫరీదుపేట పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. మరికొందరు తమకు తోచిన సాయం అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పూర్వ విద్యార్థులు రమేశ్గౌడ్, డాక్టర్ శంకర్, కొంగల వెంకటి, సిద్దరాంరెడ్డి, భోజిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అపూర్వ కలయిక1962 నుంచి ఇప్పటివరకు ఫరీదుపేటలో చదువుకున్నవారు తమ కుటుంబ సభ్యులతో కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆటపాటలతో రోజంతా సరదాగా గడిపారు. తమకు విద్యాబోధన చే సిన గురువులను ఆహ్వానించి సన్మానించారు. ఈ సందర్భంగా ఫరీదుపేట గ్రామం జాతరను మరిపించింది. పాఠశాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి తామంతా ప్రయత్నిస్తామని పలువురు పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి చర్యలు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ -
కళాభారతిలో ఆమని సందడి
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని కళాభారతి స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కుటుంబ సమేతంగా హాజరుకాగా.. సినీనటి ఆమని, టీవీ నటుడు ప్రభాకర్ ఉత్సవాలలో పాల్గొన్నారు. 15 హిట్సాంగ్స్లతో కూడిన నృత్య రూపకంలో కళాకారులతో కలిసి ఆమని, ప్రభాకర్ నృత్యం చేశారు. కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపకుడు, జాతీయ నృత్య కళాకారుడు వంశీప్రతాప్గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవం -
మంత్రి పదవి
అప్పుడు.. ఇప్పుడు.. అంటూ మంత్రి వర్గ విస్తరణపై ఊరించిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఉమ్మడి జిల్లాకు మొండిచేయి చూపింది. సీనియర్ అయిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమని మొదటి నుంచి అంతా భావించినప్పటికీ ఉమ్మడి జిల్లాలోని మిగతా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే మొదటికే మోసం అన్న చందంగా అసలు ఉమ్మడి జిల్లాకు మంత్రి పద దక్కలేదు. ఓ వైపు బీజేపీ బలపడుతుండగా.. మరో వైపు అసలు జిల్లాకు మంత్రి పదవి ఇవ్వడం లేదని కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఏడాదిన్నర తరువాత చేపట్టినప్పటికీ కేవలం ముగ్గురు మంత్రులతోనే సరిపెట్టడంతో జిల్లాకు మొండి‘చెయ్యి’ మిగిలింది. కేబినెట్లో ఆరు బెర్త్లు ఖాళీగా ఉండగా, కేవలం ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లా నుంచి మాజీ మంత్రి, బోధన్ మాజీ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఖాయమని అంతా భావించినప్పటికీ చివరకు నిరాశే మిగిలింది. దీంతో 18 నెలల పాటు ఊరించి.. ఉసూరుమనిపించినట్లైందని కాంగ్రెస్ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 సీట్లకు గాను బీజేపీ మూడు చోట్ల, బీఆర్ఎస్ రెండు చోట్ల గెలిచాయి. కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన నలుగురిలో ముగ్గురు ఎమ్మెల్యేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సీనియర్ అయిన సుదర్శన్రెడ్డికే కేబినెట్ బెర్త్ ఖాయమని ప్రతిఒక్కరూ భావించారు. మలివిడతలో వస్తుందని భావించడంతో సుదర్శన్రెడ్డి అనధికారిక మంత్రిగానే వ్యవహరిస్తూ వచ్చారు. అధికార యంత్రాంగం సైతం ఆయనను మంత్రిగానే భావిస్తూ రావడం గమనార్హం. ఈ క్రమంలో నిజామాబాద్ రూరల్ నుంచి గెలిచిన డాక్టర్ భూపతిరెడ్డి పేరు సైతం కేబినెట్ బెర్త్ కోసం పార్టీ హైకమాండ్ పరిశీలించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరోవైపు ఎల్లారెడ్డి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మదన్మోహన్ సైతం కేబినెట్ బెర్త్ కోసం ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. జుక్కల్ నుంచి గెలుపొందిన లక్ష్మీకాంతారావు సైతం మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన నలుగురు ఎమ్మెల్యేలు కెబినెట్ పదవి ఆశించినప్పటికీ ఎవ్వరికీ కేటాయించకపోవడంతో ఉమ్మడి జిల్లాకు నిరాశే మిగిలింది. రెడ్డికి దక్కని అవకాశం! కేబినెట్ బెర్త్ కోసం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగా ప్రయత్నించారు. తమకు మంత్రి పదవి కేటాయించకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. వీరిద్దరూ రెడ్డి కులానికి చెందినవారు కావడంతో ఆ ప్రభావం సుదర్శన్రెడ్డి మీద పడింది. ఈ నేపథ్యంలో రెడ్డి కులానికి చెందిన వారికి ఈ విడతలో కేబినెట్ బెర్త్ కేటాయించలేదు. సుదర్శన్రెడ్డి సైతం ఇదే వర్గానికి చెందినవారు కావడంతో రాజగోపాల్రెడ్డి, మల్రెడ్డి సెగ ఇక్కడ తగిలింది. ఫలితంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రిపదవి దూరమైంది.రంగారెడ్డి జిల్లాతో పాటు ఇందూరు జిల్లాకు మాత్రమే ప్రాతినిధ్యం కరువుతాజా కేబినెట్ విస్తరణ తరువాత రాష్ట్రంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మాత్రమే కేబినెట్లో బెర్త్ లేకుండాపోయింది. హైదరాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ తరఫున ఎవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. ఉమ్మడి నిజామాబాద్లో మాత్రం నలుగు రు గెలిచారు. మంత్రి పదవి కేటాయించకపోవ డంతో ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసినప్పటికీ, ఖర్చు పెట్టి పార్టీని పోషించినప్పటికీ అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వంలో జిల్లాకు స్థానం కల్పించకపోవడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. పార్టీ అధినాయకత్వం తీరుపై భగ్గుమంటున్నారు. కాగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి.. సుదర్శన్రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేశారు. బీజేపీకి మరింత బలమిచ్చినట్లేనా..ఉత్తర తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలోపేతమవుతోందని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ మరింత శక్తిమంతంగా ఉందని.. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి కేటాయించకపోవడం బీజేపీకి బలాన్నిచ్చినట్టేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్వింద్ ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలుపొందడంతోపాటు ఉమ్మడి జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీ తరుఫున గెలుపొందారు. కామారెడ్డి నుంచి అయితే వెంకటరమణారెడ్డి ఏకంగా రేవంత్రెడ్డి, కేసీఆర్లను ఓడించి శాసనసభలో అడుగుపెట్టడం గమనార్హం. బీజేపీ రోజురోజుకూ బలపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీని దీటుగా ఎదుర్కోవాల్సి ఉండగా.. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి కేటాయించలేదని కాంగ్రెస్ శ్రేణులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నాయి. కేబినెట్ బెర్త్ కేటాయింపులో జిల్లాకు మొండి‘చెయ్యి’ సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో శ్రేణుల గుర్రు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాకు తాకిన సెగ మంత్రి లేని జిల్లాగా మిగిలిన ఉమ్మడి నిజామాబాద్! అభివృద్ధి కుంటుపడుతుంది.. పార్టీకి నష్టం కలుగుతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కు మంత్రి పదవి లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. జి ల్లాలో వివిధ ప్రాజెక్టులకు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు రావాలంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం తప్పనిసరి. నీటిపారుదల, బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తదితర ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే కేబినెట్ పదవి కచ్చితంగా అవసరం. పాలసీ మేకింగ్లో ఉమ్మడి జిల్లాకు ప్రాతిని థ్యం తప్పనిసరి. మంత్రి లేకపోవడంతో జిల్లాకు అ న్యాయం జరగడంతో పాటు పార్టీకి సైతం నష్టం క లుగుతుంది. జిల్లా నుంచి ప్రభుత్వంలో భాగస్వా మ్యం ఉంటేనే జిల్లా అభివృద్ధితో పాటు పార్టీ బలో పేతం అవుతుంది. పార్టీ నాయకత్వం ఈ అంశాల ను పరిగణలోకి తీసుకోవాలి. – డాక్టర్ భూపతిరెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే -
‘సనాతన ధర్మమే విశ్వగురువు’
భిక్కనూరు: సనాతన ధర్మమే విశ్వగురువు గా మళ్లీ మారుతుందని ధర్మచార్య దర్శనయాత్ర నిర్వాహకులు, హిందు విరాట్ పరి వార్ ప్రతినిధి యజ్ఞం పవన్కుమార్శర్మ పేర్కొన్నారు. ఆదివారం ధర్మచార్య దర్శన యాత్ర భిక్కనూరు మండలంలోని పలు గ్రా మాలమీదుగా సాగి, సిద్దరామేశ్వరాలయానికి చేరుకుంది. సిద్దరామేశ్వరస్వామి, మాత భువనేశ్వరిదేవిలకు ప్రత్యేక పూజలు చేశా రు. వేదపండితుడు గంగవరం ఆంజనేయశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్కుమార్శర్మ మాట్లాడుతూ త్రిమతాచార్యులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యుల ఆశయాల సాధన కోసం ఈ యాత్రను చేపట్టామన్నారు. బాసర వద్ద ప్రారంభమైన ఈ యాత్ర దేశంతో పాటు నేపాల్లోనూ సాగు తుందన్నారు. వేదవ్యాసుని పాదుకలతో ఈ యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. కార్తీక పౌర్ణమి వరకు యాత్రను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిద్దరామేశ్వరాలయం పూజారులు సిద్దగిరిశర్మ, రాజేశ్వరశర్మ పాల్గొన్నారు. డిగ్రీ వన్టైం చాన్స్ బాన్సువాడ రూరల్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల డిగ్రీ (నాన్ సెమి స్టర్) కోర్సులు తప్పిన పూర్వ విద్యార్థులు తి రిగి పరీక్ష రాసుకునేందుకు అవకాశం కల్పించారు. 2000 నుంచి 2015 సంవత్సరం వర కు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్డ బ్ల్యూ కోర్సులను చదివి ఫెయిలైనవారు ఈ నెల 17 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. 2015–16 విద్యాసంవత్సరం సిలబస్ ప్రకారం పరీక్ష నిర్వహించనున్నా రు. పూర్తి వివరాలకోసం ఉస్మానియా యూ నివర్సిటీ వెబ్సైట్లో సంప్రదించాలని బా న్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల స్వామి సూచించారు. వలకు చిక్కిన భారీ చేపలు లింగంపేట: మృగశిర కార్తె సందర్భంగా ఆది వారం చేపల వేట జోరుగా సాగింది. జాలరుల వలలకు భారీ చేపలు చిక్కాయి. భవానీపేట పట్నం చెరువులో 20 కిలోల చేప మత్స్యకారులకు లభించింది. ఆ చేపను రూ. 5 వేలకు విక్రయించినట్లు జాలరులు తెలిపారు. రాంపూర్ ఊర చెరువు 20 కిలోల భారీ చేప చిక్కింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి అభినందన కామారెడ్డి టౌన్: హై దరాబాద్లో త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థా యి బ్యాడ్మింటన్ టో ర్నీకి పట్టణానికి చెందిన ఎస్పీఆర్ విద్యార్థి అతిర ఎంపికై ంది. ఈ సందర్భంగా ఆమె ను స్కూల్ కరస్మాండెంట్ మారుతి, కోచ్ సందీప్గౌడ్ అభినందించారు. కామారెడ్డి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ని ర్వహించిన బ్యాడ్మింటన్ జిల్లా స్థాయి అండ ర్ 13 బాలికల సబ్ జూనియర్ సింగిల్స్, డ బుల్స్ విభాగంలో ప్రతిభ చూపడంతో ఆమె ను రాష్ట్ర స్థాయి టోర్నీకి ఎంపిక చేశారని కోచ్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఎలుగుబంటి మృతి ఇందల్వాయి: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఎలుగుబంటి మృతి చెందింది. ఈ ఘటన ఇందల్వాయి మండలం తిర్మన్పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాతంలో 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది ఎలుగుబంటి కళేబరాన్ని తిర్మన్పల్లి ఫారెస్ట్ సెంట్రల్ నర్సరీకి తరలించారు. డీఎఫ్వో వికాస్ మీనా ఆధ్వర్యంలో మండల పశు వైద్యాధికారి గంగాప్రసాద్ పోస్ట్మార్టం చేశారు. అనంతరం కళేబరాన్ని దహనం చేశారు. మృతి చెందిన మగ ఎలుగుబంటి వయస్సు మూడు సంవత్సరాలు ఉంటుందని ఎఫ్ఆర్వో రవిమోహన్ భట్ తెలిపారు. -
సాగర్ కాలువలిలా.. సాగు నీరొచ్చేదెలా?
బాన్సువాడ : నిజాంసాగర్ ఉపకాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు, చెత్తాచెదారం, పూడిక పేరుకుపోయి సాగునీటి సరఫరాకు అడ్డుపడుతున్నాయి. సుమారు దశాబ్ద కాలంగా మరమ్మతులు లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది. దీంతో ఉప కాలువలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. బాన్సువాడ నియోజకవర్గంలో డి–8 డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రారంభమై డి–39 డిస్ట్రిబ్యూటర్ వరకు ఉంటాయి. కాలువలను పట్టించుకునేవారు లేకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగాయి. గుర్రపుడెక్క వ్యాపించింది. పూడిక పేరుకుపోయింది. వేసవిలో కాలువల్లో పిచ్చిమొక్కలు తొలగించాల్సి ఉన్నా.. సిబ్బంది కొరతతో పనులు చేయడం లేదు. కాలువ కట్టలు సైతం బలహీనంగా మారాయి. పలుచోట్ల కోతకు గురై ఎక్కడ గండి పడుతోందోనని రైతులు భయపడుతున్నారు. కాలువలకు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు.మండలం ఆయకట్టు బాన్సువాడ 10,968 బీర్కూర్ 9,431నస్రుల్లాబాద్ 7,748వర్ని 5,064రుద్రూర్ 3,272మోస్రా 566చందూర్ 2,513కోటగిరి 21,370నియోజకవర్గంలో నిజాంసాగర్ ఆయకట్టు వివరాలు.. (ఎకరాల్లో..)పదేళ్లుగా మరమ్మతులు కరువు ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలు చివరి ఆయకట్టుకు అందని సాగర్ నీరు మరమ్మతులు చేయాలని కోరుతున్న రైతులు -
నిజామాబాద్లో కరోనా కేసు
జిల్లా జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడుజాగ్రత్తలు తప్పనిసరి ప్రజలందరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీ సుకోవాలని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ, జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. కరోనా కేసు నమోదు దృష్ట్యా జాగ్రత్తలు అవసరమన్నారు. తప్పని సరిగా అందరు మాస్క్లు ధరించాలన్నా రు. శానిటైజర్ దగ్గర పెట్టుకోవాలన్నా రు. గుంపుల్లో సంచరించ వద్దన్నారు. ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా మాస్క్లుపెట్టుకోవాలని సూచించారు.నిజామాబాద్నాగారం : నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నగరంలోని అంబేడ్కర్కాలనీకి చెందిన వ్యక్తికి రెండు రోజులుగా జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో శనివారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కు చికిత్స నిమిత్తం వ చ్చారు. వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయడంతో కరో నా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇంటి వద్దే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని, మందులు వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారు. అయితే ఇంటి వద్ద చిన్నపిల్లలు, వృద్ధులైన అ మ్మనాన్న ఉండడంతో ఆస్పత్రిలోనే ఉండి చికి త్స తీసుకుంటానని బాధితుడు చెప్పాడు. వై ద్యులు వెంటనే సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్కు సమాచారం ఇవ్వడంతో జీజీహెచ్లో 7వ అంతస్తులోని ఐసోలేషన్ ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వారం రోజుల క్రి తం నగరంలో ఓఫంక్షన్కు వెళ్లడంతోనే జ్వరం, దగ్గు వచ్చినట్లు కరోనా బాధితుడు తెలిపారు. 2020 సంవత్సరంలో కూడా సదరు వ్యక్తికి కరో నా వచ్చింది. నేడు కుటుంబ సభ్యులకు ర్యాపిడ్ పరీక్షలు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి చెందిన సభ్యులకు ఆదివారం ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎవరికై నా పాజిటివ్ వస్తే ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందించనున్నట్లు ఆస్పత్రి వైద్యులు డాక్టర్ వెంకటేష్ తెలిపారు. -
పరుగు పెడితే పతకమే..
వేల్పూర్: రవాణాశాఖలో హోం గార్డుగా పని చేస్తున్న గుగ్గిలం అశోక్ రన్నింగ్లో జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన అశోక్ పుట్టిన ఊరితోపాటు రాష్ట్రానికి గుర్తింపు తీసుకువస్తున్నాడు. పరుగు పెడితె పతకమే అన్న విధంగా దశాబ్దానికి పైగా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటూ సుమారు 65 పతకాలు సాధించాడు. రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఆదివారం అవంతిక కన్స్ట్రక్షన్స్ నిర్వహించే 3కే, 5కే, 10కే, 21కే రన్నింగ్ పోటీలకు అశోక్ అంబాసిగర్గా గుర్తింపు పొందాడు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించనున్నారు. నాలుగు మారథాన్లకు అంబాసిడర్ జాతీయస్థాయి రన్నింగ్లో ప్రతిభ చాటిన అశోక్ ఇప్పటివరకు నాలుగు మారథాన్లకు అంబాసిడర్గా ఎంపికయ్యారు. మొదట కామారెడ్డిలో మా అసోసియేషన్ వారు నిర్వహించిన ఆఫ్ మారథాన్కు, హైదరాబాద్లో నిర్వహించిన హిస్టారికల్ రన్కు, వరంగ్లో నిర్వహించిన మారథాన్కు అంబాసిడర్గా వ్యవహరించగా, ఆదివారం హైదరాబాద్లో నిర్వహించనున్న ఈవెంట్కు అంబాసిడర్గా వ్యవహరించనున్నారు.పేదరికం నుంచి పరుగువైపు..వేల్పూర్లో గురువు మురళీధర్రెడ్డి వద్ద శిక్షణ పొందిన అశోక్ మండల, జోన్, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఎన్నో పతకాలు సాధించారు. విద్యార్థి దశలోనే సంగారెడ్డిలోని స్పోర్ట్స్ హాస్ట ల్లో ప్రవేశం లభించినా పేదరికం అడ్డురావడంతో వెళ్లలేకపోయారు. ఇంటర్ వరకు చదివిన అశోక్ కుటుంబ పోషణకు ఆటో నడుపు తూ పదేళ్లపాటు ఆటలకు దూరంగా ఉన్నారు. 2012లో స్పోర్ట్స్ కోటాలో రవాణాశాఖలో హోంగార్డుగా ఉద్యోగం పొందిన అశోక్ ప్రస్తు తం కామారెడ్డిలో విధులు నిర్వర్తిస్తున్నారు. క్రీడలపై ఉన్న మక్కువతో తిరిగి తన సాధనను ప్రారంభించాడు. అశోక్ను కామారెడ్డిలో ఫిజికల్ డైరెక్టర్ గోపీరెడ్డి మా అసోసియేషన్లో చేర్చి ప్రోత్సహించారు. వేల్పూర్ వాసి పన్నాల హరీశ్రెడ్డి సూచనతో లాంగ్ రన్నింగ్పై దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రం తరఫున విశిష్ట పురస్కారంరన్నింగ్ పోటీల్లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా పేరుపొందిన అశోక్ను ఈ ఏడాది ఫిబ్రవరి 9వ తేదీన రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల ఉత్తమ క్రీడాకారుడిగా కవయిత్రి మొల్లమాంబ జయంతి సందర్భంగా శాలివాహన విశిష్ట్ట పురస్కారంతో ఏసీపీ డీజీపీ, తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ పూర్ణచందర్రావు, ఇతర అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. మెదక్ ఎంపీ రఽఘునందన్రావు సైం అఽభినందించారు. వేల్పూర్ వీడీసీ వారు, మిత్రులు, శ్రేయోభిలాషులు పలుమార్లు అశోక్ను సన్మానించారు. దశాబ్దానికి పైగా జాతీయస్థాయిలో రాణిస్తున్న వేల్పూర్ వాసి అశోక్ నేడు హైదరాబాద్లో నిర్వహించనున్న పోటీలకు అంబాసిడర్గా ఎంపిక జిల్లా రవాణాశాఖలో హోంగార్డుగా ఉద్యోగం చేస్తూనే రాణింపుఒలింపిక్స్లో పతకం సాధించాలి ఒలింపిక్స్లో నిర్వహించే 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్నదే నా కోరిక. ఈ రన్నింగ్ ఈవెంట్తో ఒలింపిక్ పోటీలకు ముగింపు పలుకుతారు. ఇప్పటిదాకా సాధించిన విజయాల స్ఫూర్తితో ఒలింపిక్లో పతకం సాధిస్తా. నన్ను ప్రోత్సహిస్తున్న ఆత్మీయులందరికీ రుణపడి ఉంటా. – అశోక్ -
మీ మెదడు చెప్పే మాట వినండి
నిజామాబాద్నాగారం: తలనొప్పిని పని ఒత్తిడిగా... మతిమరుపును వయసు ప్రభావంగా... కళ్ళు తిరగడాన్ని అలసటగా తేలికగా తీసుకుంటాం. ఒక్కోసారి సాధారణ లక్షణాలే మన మెదడులోని ఒక తీవ్రమైన సమస్యకు సంకేతాలు కావొచ్చు. మీ మెదడు మౌనంగా సహాయం కోరుతోందేమో ఎప్పుడైనా ఆలోచించారా..? మెదడు చెప్పే మాట వింటే మనం ముప్పు నుంచి బయటపడొచ్చు. నేడు(ఆదివారం) ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భం ప్రత్యేక కథనం.. జిల్లాలో ఇలా... జిల్లాలో సుమారు 10మంది వరకు న్యూరో సర్జన్లు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు నెలకు 4వరకు బ్రెయిన్ ట్యూమర్కు సంబంధించిన రోగులు వస్తున్నారు. నెలకు సుమారు 40మంది వరకు బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వైద్యుల వద్దకు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. ఎమ్ఆర్ఐ స్కానింగ్ చేస్తే ఎలాంటి ట్యూమర్ ఉందో ఇట్లే తెలుసుకోవచ్చు. తద్వారా చికిత్స తీసుకుంటే నయం అవకాశాలు ఎక్కువ. లక్షణాలు మీకు మీ కుటుంబసభ్యులకు ఉదయం పూట తరచుగా వచ్చే తీవ్రమైన తలనొప్పులు, వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా మార్పులు, చూపు మసకబారడం, మాట తడబడటం, మతిమరుపు లేదా గతంలో ఎప్పుడూ లేని ఫిట్స్ (మూర్ఛలు) వంటి లక్షణాలు ఉంటే గమనించాలి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు కావొచ్చు. వీలైనంత త్వరగా డాక్టర్ని సంప్రదించి, అవసరమైన స్కానింగ్లు చేయించుకోవాలి.బ్రెయిన్ ట్యూమరా.. భయం వద్దు ఎంఆర్ఐతో సమస్యను గుర్తించొచ్చు వైద్యుల చికిత్సతో నయమయ్యే అవకాశం నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే -
ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్యచెరువులో మునిగి జాలరి మృతిఇందల్వాయి: మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూండ్ల కిషన్(43) ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మృగశిర కార్తే కావడంతో చేపలు వేటాడేందుకు గ్రామంలోని తుంగకుంటలోకి వెళ్లిన కిషన్ వలలో చిక్కుకొని నీటమునిగిపోయాడు. మృతుడికి పదేళ్లలోపు వయసున్న ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మృతుడి భార్య శ్రావణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న దంపతుల అంత్యక్రియలు పూర్తిఖలీల్వాడి: ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న నగరంలోని గాయత్రినగర్కు చెందిన దంపతులు శ్రీనివాస్(56), మమత(48) అంత్యక్రియలను శనివారం పూర్తి చేశారు. పోలీసులు మృతదేహలకు నిజామాబాద్లోని జీజీహెచ్లో పోస్టుమార్ట పూర్తి చేయించి శనివారం కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీనివాస్, మమత కుమారులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లగా, కోడలు తల్లిగారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సరికి ఈ ఘటన చోటు చేసుకుందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోక్సో కేసులో ఇద్దరి రిమాండ్మోపాల్: పోక్సో కేసులో పరారీలో ఉన్న ఇద్దరిని రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేశ్కుమార్ శనివారం తెలిపారు. మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన చక్రవర్తితోపాటు మరో బాలుడు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరు పరారయ్యారు. శనివారం వారిద్దరు స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం అందడంతో మోపాల్ ఎస్సై యాదగిరిగౌడ్ అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి, రిమాండ్కు తరలించారు. చక్రవర్తిని సారంగాపూర్ జిల్లా జైలుకు, బాలుడిని బోస్టన్ స్కూల్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఒకరి అదృశ్యంకామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీకి చెందిన తొడుపునూరి మహేశ్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి శనివారం తెలిపారు. మహేశ్ కొన్ని సంవత్సరాల క్రితం సిద్దిపేట నుంచి కామారెడ్డికి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇక్కడే స్థిరపడ్డాడు. గొడవల కారణంగా ఇటీవల భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మహేశ్ ఒక్కడే ఉంటున్నాడు. ఈ నెల 2వ తేదీ నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతడి తండ్రి జయప్రకాశ్ శనివారం కామారెడ్డిలోని ఇంటికి వచ్చి చూశాడు. మహేశ్ ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు.లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన లింగంపేట మండలం కొర్పోల్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నర్సని కాశీరామ్కు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, మొదటి విడత లిస్టులో పేరు వచ్చిందని గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు కాశీరాం తాను నివాసం ఉంటున్న గుడిసెను తొలగించి స్థలం చదును చేసుకున్నాడు. ఇంటి నిర్మాణ సమయంలో డబ్బులకు ఇబ్బంది రావొద్దని ముందుగా తనకు ఉన్న 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్మేశాడు. ఆ తరువాత జాబితాలో తన పేరు రాకపోవడంతో కలత చెందాడు. ఉన్న గుడిసె తొలగించడంతో ఉండడానికి ఇల్లు లేకుండా పోయిందని, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని నాయకులను వేడుకున్నాడు. ఈ క్రమంలో తీవ్రమనస్తాపానికి లోనై శనివారం మధ్యాహ్నం గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు హూటాహూటిన అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఖలీల్వాడి: నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన గాజుల రాజమణి గుండెపోటుతో మృతి చెందింది. అయితే తన అసిసెమెంట్ నంబర్తో గంగోనే రాజేశ్వర్ అనే వ్యక్తి తన ఇంటిని రిజస్ట్రేషన్ చేసుకోవడంతో తీవ్రమనస్తాపానికి గురై రాజమణి గుండెపోటుతో మృతి చెందిందని ఆమె సోదరి లలిత, కుటుంబ సభ్యులు ఆరోపించారు. రాజమణి మృతదేహంతో రాజేశ్వర్ ఇంటి ఎదుట ధర్నా చేశారు. రాజేశ్వర్ ఆరు నెలలుగా ఇంటి రిజస్ట్రేషన్ను రాజమణి పేరుపైకి మార్చడంలేదని, దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రాజమణికి శుక్రవారం గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించి శనివారం మృతి చెందడంతో ఆమె మృతదేహంతో ధర్నా చేశారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ శ్రీనివాస్రాజు, ఎస్సై హరిబాబు ఘటనాస్థలానికి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. సోమవారం రోజున ఇంటి రిజిస్ట్రేషన్ మార్పు చేయించి ఇస్తానని గంగోనె రాజేశ్వర్ ఒప్పుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది.రాజంపేట: మండలంలోని ఆర్గోండ గ్రామానికి చెందిన రైతు జంగిటి పెంటయ్య(48) ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పుష్పరాజ్, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెంటయ్య గ్రామ శివారులోని తనుకున్న 20 గుంటల భూమిలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాసంగిలో జొన్న సాగు చేయగా అనుకున్న దిగుబడి రాకపోవడం, తన ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు చేసిన అప్పులు కూడా భారం కావడంతో మానసిక ఆందోళనకు గురయ్యేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 7:30 గంటలకు పొలానికి వెళ్తున్నానని ఇంట్లో నుంచి వెళ్లిన పెంటయ్య తిరిగిరాలేదు. కొద్ది సేపటి తరువాత అదే గ్రామానికి చెందిన జంగిటి దుర్గయ్య అనే వ్యక్తి ఫోన్ చేసి పంట పొలంలోని చెట్టుకు పెంటయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతుడి భార్య రాజమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.మతిస్థిమితం లేని వ్యక్తి..ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన.. గుండెపోటుతో మహిళ మృతిభిక్కనూరు: మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన ఆకారపు స్వామి(39) అనే వ్యక్తి మతిస్థిమితం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. భార్య సంధ్యతో కలిసి ఐదేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్న స్వామికి గత కొన్ని నెలలుగా మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో చిక్తిస చేయించారు. స్వామి గత నెల29వ తేదీన హైదరాబాద్ నుంచి మల్లుపల్లికి వచ్చిన స్వామి పురుగుల మందు తాగాడు. కుటుంబీకులు వెంటనే అతడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ట్యూమర్కు భయపడొద్దు..
బ్రెయిన్ట్యూమర్ అనగానే భయపడొద్దు. గతంలో ట్యూమర్ వస్తే చనిపోతారనే భయం ఉండేది. ప్రస్తుతం వైద్యం అందుబాటులో ఉంది. ట్యూమర్లో చాలా రకాల క్యాన్సర్లు ఉంటాయి. ప్రతి ట్యూమర్ క్యాన్సర్ కాదు. 50శాతం క్యాన్సర్ ఉండదు. ఆపరేషన్తో నయం అవుతుంది. చాలా ట్యూమర్లు జన్యుపరమైనవి కావచ్చు. ఏదీ ఏమైనా ఎమ్ఆర్ఐ చేస్తే తెలిసిపోతుంది. తద్వారా చికిత్సతో నయమవుతుంది. – నరసింహ కట్ట, న్యూరోసర్జన్, మనోరమ ఆస్పత్రి మంచి చికిత్స ఉంది ఒక వ్యాధిగా కాకుండా, రోగికి కొత్త జీవితాన్ని ప్రసాదించే అవకాశంగా చూస్తాం. అధునాతన, న్యూరో–నావిగేషన్ సిస్టమ్స్, మినిమల్ ఇన్వాసివ్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ వంటి అత్యాధునిక పద్ధతులను ఉపయోగించి, రోగులకు సురక్షితమైన, వేగవంతమైన కోలుకునే చికిత్సను అందిస్తున్నాం.ఒక చిన్న స్కాన్, ఒక సరైన వైద్య నిర్ణయం ఒకరి జీవితాన్ని, ఒక కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మారుస్తుంది. – శ్రీకృష్ణ ఆదిత్య, న్యూరోసర్జన్, మెడికవర్ ఆస్పత్రి -
దేవుడి పేరే ఊరి పేరైంది
మీకు తెలుసా? బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ప్రవేశాలు ఇలా..మీకోసంవీరన్నగుట్ట గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ చరిత్ర ఉంది. నాలుగు వందల సంవత్సరాల కిందట గుట్టమీద ఉన్న బండరాయి పగిలి రెండుగా విడిపోగా వాటి మధలో వీరభద్రస్వామి విగ్రహం బయటపడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి చుట్టుపక్కల గ్రామాల భక్తులు ఆలయంలో పూజలు ప్రారంభించారు. కొంతకాలానికి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో చెరుకు నరికేందుకు పలు ప్రాంతాలకు చెందిన కూలీలు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ముందుగా సాటాపూర్ ఫారంగా పంచాయతీ ఏర్పాటైంది. కాలక్రమేణ జనాభా పెరగడంతో వీరన్నగుట్టగా దేవుడిపేరుతో గ్రామానికి పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం మహా శివరాత్రి జరిగిన మూడో రోజు ఇక్కడి ఆలయంలో రథోత్సవం, జాతరను వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా వీరభద్రుడు విరాజిల్లుతున్నాడు. – రెంజల్(బోధన్)జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఎస్సీ (షెడ్యూల్డ్ కులం) విద్యార్థులు మాత్రమే ప్రవేశాలు పొందవచ్చు. ఒకటో తరగతి (నాన్ రెసిడెన్షియల్), ఐదో తరగతి (రెసిడెన్షియల్)ల్లో ప్రవేశాల కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు అందించాలి. దరఖాస్తులు లభించే ప్రాంతం ● నిజామాబాద్ డివిజన్కు చెందిన విద్యార్థులు జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో(63026 61897) సంప్రదించాలి. ● బోధన్ డివిజన్కు చెందిన విద్యార్థులు విజయమేరీ ఉన్నత పాఠశాలలో(90103 42437) సంప్రదించాలి. ● ఆర్మూర్ డివిజన్కు చెందిన విద్యార్థులు ప్రభుత్వ ఎస్సీ బాలికల కళాశాలలో(96760 96374) సంప్రదించాలి. దరఖాస్తు చివరి తేదీ ఈనెల 16 అవసరమైన ధ్రువపత్రాలు కుల, ఆదాయ, నేటివిటీ ధ్రువీకరణపత్రాలతోపాటు బర్త్ సర్టిఫికేట్, ఆధార్కార్డు, రేషన్కార్డు. గెజిటెడ్ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. అర్హతలు ● ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఎస్సీ కులానికి చెందిన విద్యార్థులు 1.6.2019 నుంచి 31.05.2020 మధ్యలో జన్మించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ.లక్షా50వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలోపు మించొద్దు. ● ఐదో తరగతిలో ప్రవేశం కోసం నాల్గో తరగతి బోనొఫైడ్, ప్రోగ్రెస్కార్డు జిరాక్స్ తప్పనిసరిగా సమర్పించాలి. సీట్ల కేటాయింపు ఇలా ● ఒకటో తరగతిలో ఎస్సీ గ్రూప్–1 వారికి ఏడు సీట్లు, గ్రూప్–2 వారికి 61 సీట్లు, గ్రూప్–3 వారికి 34 సీట్లు. ● ఐదో తరగతిలో గ్రూప్–1లో ఏడు, గ్రూప్–2లో 60, గ్రూప్–3లో 34 సీట్లు కేటాయించారు. ఐదో తరగతికి హాస్టల్ సదుపాయం ఉంటుంది. – నిజామాబాద్అర్బన్ -
బాసరలో మకాం.. నిజామాబాద్లో చోరీలు
ఖలీల్వాడి: బాసరలో ఇల్లు అద్దెకు తీసుకుని నిజామాబాద్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని చిలుకల వాడకు చెందిన షేక్ యామీన్ అలియాస్ సమీర్ అలియాస్ గోపి (40), ఆదిలాబాద్ జిల్లా తాటిగూడ రైల్వేస్టేషన్కు చెందిన సయ్యద్ ఫరూక్ (22), మహారాష్ట్రకు చెందిన సత్య నిర్మల్ జిల్లా బాసరలో ఇంటిని అద్దెకు తీసుకుని నిజామాబాద్ జిల్లాలో చోరీలకు పాల్పడుతున్నారు. యామీన్, సయ్యద్ ఫరూక్ 20 పైగా కేసుల్లో జైలుకి వెళ్లి వచ్చారు. శనివారం నిజామాబాద్ నగరంలోని రైల్వేస్టేషన్లో పార్క్ చేసిన బైక్ని దొంగతనం చేసి, అదే బైక్పై చోరీ కోసం వెళ్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. నిందితులు ఎడపల్లి పీఎస్ పరిధిలోని ఓ ఇంటితోపాటు పాన్షాప్లో, నగరంలోని మూడో టౌన్ పీఎస్ పరిధిలోని తాళం వేసి ఉన్న ఇంట్లో, జక్రాన్పల్లి పీఎస్ పరిధిలోని బెల్ట్షాప్లో, రైళ్లలో తిరుగుతూ సెల్ఫోన్ల చోరీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల్లో సత్య పరారీలో ఉండగా, పట్టుబడ్డ నిందితుల నుంచి రూ.5 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, ఒక టీవీ, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. నిందితుల నుంచి దొంగసొత్తును కొన్న హైదరాబాద్లోని కొంపెల్లికి చెందిన అరవింద్ ప్రసాద్పైన కూడా కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్కు తరలించామన్నారు. ముగ్గరి అరెస్ట్.. పరారీలో ఒకరు -
ఇంటి నుంచి తల్లిదండ్రుల గెంటివేత
భిక్కనూరు : సమాజంలో రోజురోజుకు మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. వృద్ధులైన తల్లిదండ్రులను వారి పేరిట ఉన్న భూమిని తనకు ఇవ్వాలని మూడో కుమారుడు ఇంటినుంచి గెంటివేశాడు. ఈ ఘటన భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. కాచాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులైన మర్రి బాగవ్వ–రామయ్యలకు నలుగురు కొడుకులు. మూడో కుమారుడు చంద్రం ప్రేమ పెళ్లి చేసుకుని నిజామాబాద్లో నివసిస్తున్నాడు. మిగతా ముగ్గురు కుమారులు కాచాపూర్ గ్రామంలోనే నివసిస్తూ తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటున్నారు. రామ య్య పేరిట గ్రామంలో 1530 సర్వే నంబర్లో ఐదు ఎకరాల నాలుగు గుంటల భూమి ఉంది. రామయ్య బాగవ్వ దంపతులు తమ నలుగురు కుమారులకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున భూమిని పంచి వారి పేరిట పట్టా చేయించారు. మిగతా ఎకరం నాలుగు గుంటలను తమ పేరిట ఉంచుకున్నారు. తమ బాగోగులు చూసిన వారికి తదనంతరం ఈ భూమి వర్తిస్తుందని కుల పెద్ద మనుషుల ముందు ఒప్పందం చేసుకున్నారు. మూడో కొడుకు చంద్రం తల్లిదండ్రు ల పేరిట ఉన్న భూమిలో తన వాటాకు రావాల్సిన భూమిని ఇవ్వాలని వారిని వేధిస్తున్నాడు. పట్టాదా రు పాసు పుస్తకాలను లాక్కెళ్లాడు. ఈ విషయమై కులపంచాయతీ జరిగింది. తల్లిదండ్రులు బాగోగు లు చూసిన వాళ్లకు ఈ భూమిపై హక్కులు ఉంటా యని తల్లిదండ్రులు బతికి ఉన్నంత కాలం ఈ భూమిని ఎవరి పేరుమీద మార్చవద్దని పంచాయతీ లో పెద్దలు నిర్ణయించారు. దీంతో చంద్రం శనివారం తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటికి వచ్చి వారిని బయటకు గెంటి వేశాడు. సామగ్రిని బయట పారేసి ఇంటికి తాళం వేశాడు. దీంతో వృద్ధులైన తల్లిదండ్రు లు బాగవ్వ, రామయ్యలు భిక్కనూరు పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు ఎస్సై ఆంజనేయులు చంద్రంపై కేసు నమోదు చేశారు. భూమిని తన పేరిట మార్చాలని పట్టాదారు పాసుపుస్తకాలను లాక్కెళ్లిన మూడో కొడుకు భిక్కనూరు మండలం కాచాపూర్లో ఘటన పోలీసులను ఆశ్రయించిన వృద్ధ దంపతులు -
నేడు కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవం
కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి కూచిపూడి క ళాక్షేత్రం వార్షికోత్సవాలను ఆదివారం మ ధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు స్థా నిక కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాక్షేత్రం వ్యవ స్థాపకులు జాతీయ నృత్యకళాకారుడు వంశీప్రతాప్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా ప్రముఖ సినీ నటి ఆమని, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మ న్ పి.రామకృష్ణ గౌడ్, టీవీ నటుడు ప్రభాకర్లను ఆహ్వానించామని పేర్కొన్నారు. కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని కళాభిమానులను కోరారు. ‘యశ్వంత్ సాధన యువతకు ఆదర్శం’ కామారెడ్డి క్రైం : యువ పర్వతారోహకుడు యశ్వంత్ తలపెట్టిన ‘హర్ శిఖర్ పర్ తిరంగా‘ కార్యక్రమం యువతకు ఆదర్శమని ఎ స్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లాకు చెందిన యశ్వంత్ మిజోరాం, మణిపూర్, త్రిపు ర, అరుణాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని ఎత్తైన శిఖరాలను విజయవంతంగా అధిరోహించాడు. ప్రతి శిఖరంపై త్రివర్ణ పతాకంతో పాటు ఎస్పీ రాజేశ్ చంద్ర సేవలకు గౌ రవ సూచకంగా ఆయన ఫొటోను ప్రదర్శించినట్లు యశ్వంత్ తెలిపాడు. శనివారం జి ల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్రను కలిసి, తాను అధిరోహించిన శిఖరాల పై ప్రదర్శిస్తూ తీసిన ఫొటోలను ఎస్పీకి అందించాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలన్నారు. యశ్వంత్ ఇప్పటివరకు మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రస్, మౌంట్ కోసియస్కో, కాంగ్ యాట్సే ఐఐ, యూనామ్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్ తదితర శిఖరాలను అధిరోహించాడు. ప్రపంచంలో ని ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధి రోహించడం తన లక్ష్యమని పేర్కొన్నాడు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలి పెద్దకొడప్గల్: విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పిట్లం మండలానికి చెందిన అల్లాపూర్ గ్రామస్తులు శనివా రం పెద్దకొడప్గల్ విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. అనంతరం ఇన్చార్జి విద్యుత్ మండల అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ పిట్లం మండలంలోని చిన్నకొడప్గల్ విద్యుత్ సబ్స్టేషన్ నుంచి తమ గ్రామానికి విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. ఏ వైనా విద్యుత్ సమస్యలుంటే పెద్దకొడప్గల్ జేఎల్ఎం, సిబ్బంది వచ్చి పరిష్కరిస్తారన్నా రు. నెల రోజుల క్రితం జేఎల్ఎం బదిలీ అ య్యారని, అప్పటినుంచి ఏ అధికారి స్పందించడం లేదని పేర్కొన్నారు. ఎవరిని అడిగినా ఎల్సీ ఇవ్వడం లేదన్నారు. వారం రో జుల వ్యవధిలో రెండు రోజులు గ్రామంలో కరంటు లేక ఇబ్బందిపడ్డామన్నారు. జేఎల్ఎంను నియిమించి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి హత్య పిట్లం : చిన్నకొడప్గల్ గ్రామ పంచాయతీ కార్యదర్శి ధరావత్ కృష్ణ (28) అనే పంచాయతీ కార్యదర్శి హత్యకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రూం తండాకు చెందిన దరావత్ కృష్ణ చిన్నకొడప్గల్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. దీంతో అతడి తండ్రి గోప్యానాయక్ శుక్రవారం పిట్లం పోలీసులకు పిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గాలింపు చేపట్టగా శనివారం చిన్నకొడప్గల్ శివారులోని రెడ్డి చెరువులో మృతదేహం లభించింది. మృతదేహాన్ని బయటకు తీసిచూడగా తలపై, శరీరంపై గాయాలు ఉన్నాయి. అతడిని హత్య చేసి చెరువు పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భద్రత ఏర్పాట్ల పరిశీలన
బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాలు, మసీదుల వద్ద భద్రత ఏర్పాట్లను ఎస్పీ రాజేశ్ చంద్ర పరిశీలించారు. అర్ఫత్ మసీద్ ఈద్గా, ఇస్లాంపురా, గొల్లవాడ, ఇందిరానగర్ కాలనీ, వాంబే కాలనీ, సైలానీ బాబా కాలనీ, బతుకమ్మ కుంట, అశోక్నగర్, విద్యానగర్ ప్రాంతాల్లోని మసీదుల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలను సంతోషకరమైన, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఒకరి మత సంప్రదాయాలను మరొకరు గౌరవించుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
బడికి బాసటగా..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తమ ఉన్నతికి బాటలు వేసిన చదువుల చెట్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి నడుం బిగించారు పాల్వంచ మండలం ఫరీదుపేట జెడ్పీ హైస్కూల్, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల పూర్వ విద్యార్థులు. బడిలో కావలసిన మౌలిక సదుపాయాల కల్పన, కంప్యూటర్ తరగతుల నిర్వహణ, ఐఐటీ వంటి పరీక్షలకు సన్నద్ధం చేయడానికి అవసరమైన బోధకులు, పుస్తకాలు సమకూర్చడానికి అవసరమైన నిధిని సమకూర్చాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ చదివిన వారిలో ప్రొఫెసర్లు, డాక్టర్లు, సీఐ, టీచర్లు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు.. ఇలా వివిధ స్థాయిల్లో స్థిరపడిన వారు ఉన్నారు. పాఠశాల అభివృద్ధికి వారంతా తలా ఓ చేయి అందించడానికి ముందుకు వచ్చారు. తమ స్థోమతను బట్టి తలా కొంత జమ చేసి రూ.30 లక్షలు నిధిని సిద్ధం చేశారు. అలాగే అదే బడిలో చదివి రాజకీయ నాయకులు కూడా పాఠశాల అభివృద్ధిలో తాము సైతం అంటున్నారు. అలాగే ఇంటింటికీ తిరిగి పిల్లలను సర్కారు బడిలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. పాఠశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. పాఠశాలలో చేపట్టిన కార్యక్రమాలు.. ఫరీదుపేటలోని పాఠశాలల భవనాలకు రంగులు వేయించారు. గ్రౌండ్ను చదును చేయించారు. పూలమొక్కలు నాటించారు. శిథిలమైన భవనాలు, టాయ్లెట్లను కూల్చివేయించి నూతనంగా టాయ్లెట్లు నిర్మించారు. ప్రభుత్వ నిధులతో ప్రహరీ నిర్మాణం చేపట్టారు. రెండు నెలల కాలంలో పూర్వ విద్యార్థులు గ్రామ పెద్దలతో కలిసి పాఠశాల రూపురేఖలను మార్చారు. పూర్వ విద్యార్థుల సాయంతో రంగులు దిద్దుకున్న పాఠశాల భవనంలక్ష్యాలు.. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం. ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుంటూ గ్రామంలోని పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం. విద్య, క్రీడా, కళారంగాల్లో రాణిస్తున్న విద్యార్థులను ప్రోత్సహించడం. విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్, కంప్యూటర్ స్కిల్స్, పోటీ పరీక్షలు, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు చేపట్టడం. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల భాషపై తర్ఫీదు ఇవ్వడం. పూర్వ విద్యార్థులను ప్రస్తుత విద్యార్థులతో అనుసంధానం చేయడం. ఫరీదుపేటలో ఒక్కటైన పూర్వ విద్యార్థులు మౌలిక సదుపాయాలపై దృష్టి రూ. 30 లక్షల నిధి సమీకరణ విద్యార్థులను పోటీ పరీక్షలకు తీర్చిదిద్దేలా చర్యలు నేడు ఆత్మీయ సమ్మేళనం -
ఘనంగా ఈద్ ఉల్ అజ్ హా
కామారెడ్డి టౌన్: జిల్లాలో శనివారం బక్రీద్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కామారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు, పెద్దమ్మ ఆలయం సమీపంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆర్డీవో కార్యాలయం వద్దనున్న ఈద్గాలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రసంగించారు. త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వమానవాళికి అందిస్తుందన్నారు. సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో, దేశంలో పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. -
వ్యక్తి అదృశ్యం
కామారెడ్డి క్రైం: పట్టణంలోని భవానీ రోడ్లో నివాసం ఉండే బొడ్డి నూకరాజు (55) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం తెలిపారు. నూక రాజుకు ఇద్దరు భార్యలు ఉండగా, మేసీ్త్ర పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు ఇప్పటికీ తిరిగి రాలేడు. కుటుంబసభ్యులు ఎంతవెతికినా అతడి ఆచూకీ లభించలేదు. రెండో భార్య జ్యోతి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. సజ్జన్పల్లిలో వివాహిత.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని సజ్జన్పల్లి గ్రామానికి చెందిన చిన్నప్పగారి రుక్కవ్వ అనే వివాహిత అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రుక్కవ్వ సోమవారం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా, ఇప్పటికీ తిరిగిరాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు నాగిరెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వెంకటాపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ ఎన్నిక ఎల్లారెడ్డిరూరల్ : ఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నిజ్జన పోచన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మండల పార్టీ అధ్యక్షులు సాయిబాబా శుక్రవారం తెలిపారు. గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా పెంటయ్య, సహాయ కార్యదర్శిగా చిరంజీవులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మల్లేష్ ఉన్నారు. నల్లమడుగు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీని శుక్రవారం మండల ఎమ్మార్పీఎస్ నెల్లూరి గంగారాం ఆధ్వర్యంలో ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా మాల్తూమ్ సాయిలు, ఉపాధ్యక్షుడిగా మాల్తూమ్ నర్సింలు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి గులాంగారి సంజీవులు, సలహాదారులు శేఖర్, సంజీవులు, భాస్కర్, సాయిలును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మండల నాయకులు భూపతి, మాసాని సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
నాన్బెయిలబుల్ వారెంట్ నిందితుడి పట్టివేత
ఖలీల్వాడి: పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులకు చిక్కకుండ తిరుగుతుండగా, అతడిపై నాన్బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కాగా శుక్రవారం పట్టుకున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా దేగ్లూర్ తాలూకాలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బబ్లు బాలాజీ గైక్వాడ్ అలియాస్ ధన్ల బాబు (47) కొన్ని సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లాలో పలు నేరాలకు పాల్పడ్డాడు. ఇతడిపై 24 వారెంట్లు ఇష్యూ కాగా, పోలీసులు ఎంత గాలించినా ఆచూకీ లభించలేదు. నగరంలో అతడు సంచరిస్తున్నట్లు సీపీకి విశ్వసనీయ సమాచారం రావడంతో సీసీఎస్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు సీసీఎస్ పోలీసులు నిందితుడిని పట్టుకుని కామారెడ్డి పోలీసులకు అప్పగించారు. సీసీఎస్ బృందాన్ని సీపీ సాయిచైతన్య అభినందించారు. -
దంపతుల ఆత్మహత్య
ఖలీల్వాడి : నగరంలోని గాయత్రినగర్ ప్రాంతంలో దంపతుల ఆత్మహత్య శుక్రవారం కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. కోటగల్లికి చెందిన శ్రీనివాస్ (56), మమత (52)కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. శ్రీనివాస్ నగరంలోని ఓ ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుండేవాడు. ఇటీవల కోటగల్లిలోని సొంతింటిని విక్రయించారు. కూతురికి పెళ్లి చేయడంతోపాటు ఇద్దరు కుమారులను గల్ఫ్ దేశానికి పంపించారు. ప్రస్తుతం గాయత్రినగర్లో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వేర్వేరు గదుల్లో శ్రీనివాస్, మమత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా స్థలానికి చేరుకొని దంపతుల ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కాగా, ఆర్థిక ఇబ్బందులతోనే భార్యాభర్తలు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికుల ద్వారా తెలిసింది. -
కానిస్టేబుల్ కుమారుడిపై మైనర్ డ్రైవింగ్ కేసు
ఖలీల్వాడి: నగరంలో ఓ కానిస్టేబుల్ కుమారుడు మైనర్ డ్రైవింగ్ చేయడంతో ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద శుక్రవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఓ కానిస్టేబుల్కు ప్రభుత్వం కేటాయించిన బైక్ను అతడి కొడుకు (మైనర్) నడిపించడంతో ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి, బైకును సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ఇసుక వాహనం పట్టివేత రుద్రూర్: కోటగిరి శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టాటా వాహనాన్ని పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వాహనాన్ని కోటగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. డ్రైవర్ షేక్ రఫిక్, వాహన యాజమాని షేక్ లతీఫ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. పేకాడుతున్న ఏడుగురి అరెస్టు ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేసి, పేకాడుతున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. అలాగే వారి నుంచి రూ. 10830 నగదు, ఐదు సెల్ఫోన్లు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. యువకుడి అదృశ్యం బోధన్: ఎడపల్లికి చెందిన గట్టుపల్లి సాయి కుమార్ (27) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. సాయికుమార్కు సరైన ఉద్యోగం లభించక ఏడాదిగా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ నెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో అతడి భార్య ఆద్రిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్తో గేదె మృతి పిట్లం(జుక్కల్): మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం సాయంత్రం ఓ గేదె విద్యుత్ షాక్తో మృతిచెందింది. బాధితుడు తెలిపిన వివరాలు.. గ్రామంలోని రైతు ముందడి బలరాంరెడ్డికి చెందిన గేదె రోజులాగే గ్రామ శివారులో మేత మేసేందుకు వెళ్లింది. మేత మేస్తుండగా కింద పడిన విద్యుత్ తీగలను గేదె తాకడంతో విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మరణించింది. రూ. 50వేల విలువ గల గేదె మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. 70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత కామారెడ్డి క్రైం: డీసీఎం వ్యాన్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 70 క్వింటాళ్ల రేషన్ బియ్యంను కామారెడ్డి సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి 40 కిలోల చొప్పున రేషన్ బియ్యంను సంచులలో నింపి దాదాపు 180 బస్తాలను ఓ డీసీఎంలో తరలించేందుకు సిద్ధం చేశారు. వెంటనే సీసీఎస్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, సీసీఎస్ పోలీసులు కలిసి డీసీఎంను, డ్రైవర్ అర్బాజ్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి వాటిని సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగిస్తామని ఎస్హెచ్వో తెలిపారు. -
రూ.20తో రెండు లక్షల ప్రమాద బీమా
మీకు తెలుసా? ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) కింద ఏడాదికి రూ.20 ప్రీమియం చెల్లించవచ్చు. బ్యాంకు ఖాతా కలిగిన 18–70 ఏళ్ల లోపు వయస్సగల వారు అర్హులు. ఈబీమా ద్వారా ప్రమాదం వలన మరణం సంభవించినా, లేదా ప్రమాద కారణంగా రెండు కళ్లు, రెండు చేతులు, లేదా ఒక కంటి చూపు, చెయ్యి లేదా పాదం కోల్పోయిన రూ. రెండు లక్షల బీమా నామినీకి సొమ్ము చెల్లిస్తారు. ● ఒక కన్ను లేదా ఒక చెయ్యి, లేదా ఒక కాలు వీటిలో ఏదేని ఒకటి కోల్పోయిన రూ.లక్ష చెల్లిస్తారు. ● ప్రమాదం జరిగినట్టుగా పోలీసు ఎఫ్ఐఆర్, డాక్టర్ ధ్రువీకరణతో సులభంగానే సంబంధిత బ్యాంకు ద్వారా క్లైమ్ చేసి బీమా సోమ్ము పొందవచ్చు. – కామారెడ్డి అర్బన్ -
బడి బాట షురూ
కామారెడ్డి టౌన్ : సర్కారు బడుల బలోపేతం కోసం, విద్యార్థుల సంఖ్య పెంపుకోసం ప్రభు త్వం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్ర మాన్ని నిర్వహిస్తోంది. శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. మొద టిరోజు జిల్లాలో 269 మంది విద్యార్థులను గుర్తించారు. కాగా మే 16వ తేదీ నుంచి ముందస్తు బడిబాట కార్యక్రమం నిర్వహించి మొ త్తం 3,699 విద్యార్థులను బడిలో చేర్పించారు. ప్రస్తుత బడిబాటను 19వ తేదీ వరకు నిర్వహించనున్నారు. తొలిరోజు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులతో గ్రామ సభలు నిర్వహించాల్సి ఉండగా.. కొన్నిచోట్ల మాత్రమే సమావేశాలు జరిగాయి. చాలా చోట్ల మొక్కుబడిగా కార్యక్రమం ప్రారంభమైంది. -
అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తాం
కామారెడ్డి టౌన్ : అంతరాయం లేకుండా వి ద్యుత్ సరఫరా చేస్తామని వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎరుకల నారాయణ పేర్కొన్నారు. శు క్రవారం జిల్లా కేంద్రంలోని కలేక్టరేట్ సబ్స్టేషన్లో ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్ర మం చేపట్టారు. వినియోగదారుల నుంచి ఫి ర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల స మస్యలను పరిష్కరిస్తామన్నారు. సబ్స్టేషన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో వేదిక ఫైనాన్స్ మెంబర్లు శ్రీకాంత్, రాజగౌడ్, విద్యుత్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్, డీ ఈ కళ్యాణ్ చక్రవర్తి, ఏడీఈ కిరణ్ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు. బక్రీద్ ఏర్పాట్ల పరిశీలన కామారెడ్డి టౌన్ : బక్రీద్ సందర్భంగా జిల్లా కేంద్రంలో బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈద్గాల వద్ద పరిసరాలను శుభ్రం చేసి, రంగులు వేసి, విద్యుత్ దీపాలు, టెంట్లు వేశారు. ముస్లీంలు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. బక్రీద్ సందర్భంగా ఆర్డీవో కార్యాలయం ముందు, పెద్దమ్మ కాలనీలో, పెద్ద బజార్, పాతబస్టాండ్, అశోక్నగర్కాలనీ, ఇస్లాంపురా ప్రార్థన మందిరాలలో ప్రత్యేక ప్రార్థన చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు షభ్బీర్ అలీ శనివారం ఆర్డీవో కార్యాలయం ముందు జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్కౌంటర్లు నిలిపేయాలి కామారెడ్డి టౌన్ : కగార్ పేరుతో మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసి చంపడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి దశరథ్, సహాయ కార్యదర్శి బాలరాజు, నాయకులు రాజమణి, శంకర్, దేవయ్య, ఈశ్వర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతకు, మాకు ఏ సంబంధమూ లేదు
బీబీపేట : ‘‘విత్తనాల నాణ్యత మేము నియంత్రించ లేని విషయం. ఎలాంటి కష్టనష్టాలకు బాధ్యులం కాము’’ అంటూ బీబీపేటకు చెందిన ఓ విత్తన దుకా ణం నిర్వాహకుడు బిల్లుపై ముద్రించాడు. శుక్రవా రం తనిఖీలకు వెళ్లిన బృందం దీనిని చూసి ఆశ్చర్య పోయింది. సదరు దుకాణం నిర్వాహకుడిపై ఏడీఐ అపర్ణ, ఎస్సై ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రై తులకు అమ్మే విత్తనాలకు దుకాణాదారులే బాధ్యు లని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే లై సెన్స్లు రద్దు చేస్తామని ఏడీఏ అపర్ణ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఫర్టిలైజర్, సీడ్స్ దుకా ణాలను అధికారులు తనిఖీ చేశారు. చాలావరకు వి త్తనాలను తీసుకువచ్చిన కంపెనీల నుంచి బిల్లులు లేకపోవడం, రైతులకు ఎలాంటి రసీదులు ఇవ్వకపోవడాన్ని గుర్తించారు. బిల్లులు ఇవ్వకుండానే విత్తనాలు, మందులను రైతులకు విక్రయిస్తుండడంపై ఏడీఏ అపర్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు, రిజిస్టర్లు సరిగ్గా చూపించని దుకాణాలకు నోటీసులు ఇచ్చారు. దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్సై సూచించారు. బిల్లుపై ముద్రించిన విత్తన దుకాణదారు ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు -
క్రమశిక్షణతో పనిచేయాలి
కామారెడ్డి క్రైం : క్రమశిక్షణతో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. జిల్లాలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న 79 మంది హోంగార్డులకు స్థానచలనం కల్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మూడేళ్లకంటే ఎక్కువ కాలం ఒకే పోలీస్ స్టేషన్లో గానీ, పోలీసు కార్యాలయాల్లో గానీ విధులు నిర్వహిస్తున్న హోంగార్డులను బదిలీ చేశామన్నారు. హోంగార్డుల సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, కోరుకునే పీఎస్లులాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు నిర్వహించామన్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా, స్వయంగా ఆఫీసులో వచ్చి తనను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్ ఉద్యోగంలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒక్కరి తప్పు మొత్తం శాఖపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హోంగార్డులు తమకు కేటాయించిన విభాగాల్లో నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యాకూబ్రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ తిరుపయ్య, ఆర్ఐలు నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర 79 మంది హోంగార్డులు బదిలీ మరో కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు కామారెడ్డి క్రైం: మూడు రోజుల వ్యవధిలో ని జాంసాగర్ ఠాణాలో పని చేస్తున్న మరో కానిస్టేబుల్ సస్పెన్షన్కు గురయ్యాడు. ఎలాంటి అను మతి లేకుండా విధులకు గైర్హాజరు కావడమే కా కుండా అతిగా మద్యం సేవించి పోలీసులకు ప ట్టుబడిన వ్యవహారంలో ఓ కానిస్టేబుల్ను స స్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేశ్ చంద్ర శుక్రవారం ఉ త్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ని జాంసాగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తు న్న ఎస్.రాకేష్ గౌడ్ అనే కానిస్టేబుల్ ఈనెల 5 న అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టా డు. అతిగా మద్యం సేవించి కారు నడిపిస్తూ కా మారెడ్డి వైపు వస్తుండగా.. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. తా డ్వాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ రాకేష్ గౌడ్ మద్యం మత్తులో ఉన్న ట్లు గుర్తించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్ష చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో ఎస్పీ రాజేశ్ చంద్ర అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. క్రమశిక్ష ణ తప్పితే ఉపేక్షించేది లేదని ఎస్పీ పేర్కొన్నా రు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా రెండు రోజుల క్రితం ఇదే పీఎస్కు చెందిన కానిస్టేబుల్ మోహ న్ సింగ్ సస్పెన్షన్కు గురైన విషయం తెలిసిందే. విధులకు డుమ్మా.. ఆపై డ్రంకెన్ డ్రైవ్ చర్యలు తీసుకున్న ఎస్పీ -
బడి బస్సులు పదిలమేనా?
● జిల్లాలో 253 స్కూల్ బస్సులు ● 120 బస్సులకే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి ● 12 తర్వాత స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామంటున్న రవాణా శాఖ అధికారులుఎల్లారెడ్డి: వేసవి సెలవులు ముగింపునకు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల రవాణాకు ఉపయోగించే బస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించి, రవాణాశాఖ నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందే ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. జిల్లాలో అన్ని ప్రైవేట్ పాఠశాలలకు కలిపి 253 వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలను ఏటా ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఫిట్నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు 120 బస్సుల ఫిట్నెస్ పరీక్షలు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలలు సైతం తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. తమ పిల్లలను స్కూల్ బస్సులలో పంపించే తల్లిదండ్రులు కూడా ఆయా బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ పత్రాలను, డ్రైవర్ పరిస్థితిని గమనించడం మంచిదని పేర్కొంటున్నారు. ఫిట్నెస్ లేకపోయినా, వేరే వ్యక్తులు బస్సు నడుపుతున్నా వెంటనే రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.ఫిట్నెస్ నిబంధనలు.. పాఠశాల వాహనాలు తప్పనిసరిగా పూర్తి కండిషన్లో ఉండాలి. 15 ఏళ్ల జీవితకాలం పూర్తయిన వాహనాల ను విద్యార్థుల రవాణాకు వినియోగించరాదు. పాఠశాల వాహనాలకు ముందువైపు ఎడ మ పక్కన పాఠశాల వివరాలు అందరికీ క నిపించేలా రాయించాలి. విద్యాసంస్థ పే రు, యాజమాన్య ప్రతినిధుల సెల్ నంబ ర్, పాఠశాల పూర్తి చిరునామా ఈ వివరా ల్లో స్పష్టంగా ఉండాలి. వాహనాల డ్రైవర్ల ఆరోగ్య వివరాలను యాజమానం తమ వద్ద కలిగి ఉండాలి. డ్రైవర్ బీపీ, షుగర్, కంటి చూపు సామర్థ్యానికి సంబంధించిన వివరాలు క్వాలిఫైడ్ డాక్టర్లతో ప్రతి మూడు నెలలకోమారు చెక్ చేయించాలి. పాఠశాల వాహనాల డ్రైవర్లకు కనీసం ఐదే ళ్ల అనుభవం ఉండాలి. వాహనాలకు తప్పనిసరిగా అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై అత్యవసర ద్వారం అని స్పష్టంగా రాసి ఉండాలి. వాహనానికి సంబంధించి విండ్ స్క్రీన్, వై పర్స్, లైటింగ్, పార్కింగ్ లైట్లు సమర్థవంతంగా పనిచేసేలా చూసుకోవాలి. వాహనాల టైర్లు మంచి సామర్థ్యం కలిగిన వి ఉండాలి. వాహనంలో అగ్నిమాపక పరికరాలు త ప్పనిసరిగా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా ఉండాలి. వాహనం ఫుట్బోర్డు మొదటి మెట్టు భూ మి నుంచి 325 మిల్లీమీటర్ల ఎత్తు మించ కుండా ఉండాలి. మెట్లు జారకుండా ఏ ర్పాటు చేయించాలి ప్రతి బస్సుకు ఒక అటెండర్ తప్పనిసరి. బస్సులో ప్రయాణించేవారి వివరాలు కూ డా అందుబాటులో ఉండాలి. వాహనంలో స్కూల్ బ్యాగులు పెట్టుకునేందుకు షెల్ఫ్లు ఏర్పాటు చేయాలి. కిటికీలకు మధ్యలో ఇనుప కడ్డీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలి.ఫిట్నెస్ లేకపోతే సీజ్ చేస్తాం పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా స్కూల్ బ స్సుల ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేయించుకో వాలని పాఠశాలలకు నోటీసులు ఇచ్చాం. జి ల్లాలో 253 స్కూల్ బస్సులు ఉండగా ఇప్పటి వరకు 120 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. మిగతా వాటికి కూడా ఫిట్నెస్ పరీక్ష లు చేయించుకోవాలి. ఈనెల 12 నుంచి స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తాం. ఫిట్నెస్లేని బస్సులు కనిపిస్తే సీజ్ చేస్తాం. – శ్రీనివాస్రెడ్డి, జిల్లా రవాణాశాఖ అధికారి -
క్షణికావేశానికి రెండు ప్రాణాలు బలి
కామారెడ్డి క్రైం: క్షణికావేశంలో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం కుటుంబంలో విషాదాన్ని నింపింది. కుమారుడితో సహా తల్లి చెరువులో దూకడంతో ఇద్దరి ప్రాణాలు నీట మునిగాయి. నర్సన్నపల్లి గ్రామంలో చోటు చేసుకున్న విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాచమొల్ల ప్రశాంత్కు భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన స్రవంతి(25)తో వివాహమైంది. వీరికి శ్రీవల్లి అనే కూతురు, రుద్రేశ్వర్(4) అనే కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం స్రవంతి అత్తగారికి చెందిన బంగారాన్ని తల్లి గారి కుటుంబ సభ్యులకు ఇచ్చింది. వారు ఆ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. నగలను తిరిగి ఇవ్వకపోవడంతో ఇటీవల ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. శుక్రవారం నగల విషయమై స్రవంతితో కుటుంబ సభ్యులు గొడవ పడ్డట్లు సమాచారం. కొద్దిసేపటి తర్వాత స్రవంతి తన ఇద్దరు పిల్లలను వెంట తీసుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది. పక్కనే ఉన్న చిన్నమల్లారెడ్డి చెరువు కట్టకు వద్దకు చేరుకున్నారు. నీటిలో దూకడానికి కూతురు నిరాకరించడంతో స్రవంతి కుమారుడు రుద్రేశ్వర్తో కలిసి నీటిలో దూకి మరణించింది. దీనిని గమనించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఇద్దరి మృతదేహాలను బయటికి తీయించారు. కుటుంబంలో జరిగిన గొడవల కారణంగానే స్రవంతి తన కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లి రాధమణెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రూరల్ సీఐ రామన్ తెలిపారు. కొడుకుతో కలిసి చెరువులో దూకిన తల్లి ఇద్దరి మృతితో నర్సన్నపల్లిలో విషాదం -
వీపీవో.. మరింత యాక్టివ్!
రుద్రారంలో సివిల్ రైట్స్ డేలో పాల్గొన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ (ఫైల్)సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నేరాలు జరగకుండా ముందస్తు సమాచారం తెలుసుకోవడం, నేరం జరిగితే సంఘటన ఎలా జరిగింది, ఎవరు బాధ్యులు అన్న విషయం తెలుసుకునేందుకు పోలీసు శాఖ విలేజ్ పోలీస్ ఆఫీసర్లను నియమించింది. పోలీస్ స్టేషన్లో పనిచేసే కానిస్టేబుళ్లకు ఒక్కొక్కరికీ ఒక్కో గ్రామాన్ని కేటాయించింది. పుష్కర కాలానికిపైగా ఈ వ్యవస్థ కొనసాగుతోంది. అయితే జిల్లా ఎస్పీగా రాజేశ్ చంద్ర బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామ పోలీస్ అధికారి(వీపీవో) వ్యవస్థపై దృష్టి సారించారు. వీపీవోలు మరింత క్రియాశీలకంగా పనిచేసేలా చూస్తున్నారు. ఆయన ఏ పోలీస్ స్టేషన్కు వెళ్లినా సిబ్బందితో మాట్లాడుతూ గ్రామాల్లో పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు. వీపీవో వద్ద కచ్చితంగా తనకు కేటాయించిన గ్రామానికి సంబంధించిన పూర్తి సమాచారం ఉండాల్సిందేనంటున్నారు. గ్రామాల్లో ఏ సంఘటన జరిగినా క్షణాల్లో తెలిసేలా సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తమకు కేటాయించిన గ్రామాలకు రెగ్యులర్గా వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకోవాలని, దాన్ని అధికారులకు తెలియజేయాలని పేర్కొంటున్నారు. గ్రామ వాట్సాప్ గ్రూప్లలో... సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిపోయింది. ముఖ్యంగా వాట్సాప్ వినియోగం ఎక్కువగా ఉంటోంది. గ్రామాలు, పార్టీలు, కులాల వారీగా వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆయా గ్రూపులలో జరిగే చాటింగ్ల గురించి తెలుసుకోవాలంటే గ్రామ పోలీసు అధికారి ఆ గ్రూపులో యాడ్ అవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీపీవోలు తమ గ్రామ పరిధిలోని వాట్సాప్ గ్రూపులలో మెంబర్లు చేరారు. దీంతో ఆయా గ్రూపులలో జరిగే రాజకీయ సంభాషణలు పోలీసులకు తెలిసిపోతున్నాయి. గ్రామాల్లో ఆధిపత్య పోరులో భాగంగా జరిగే అన్ని విషయాలు తెలుసుకోగలుగుతున్నారు. అలాగే గ్రామంలో అన్ని వర్గాల వారితో స్నేహ సంబంధాలు నెరపడం ద్వారా అన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలా చేయడం వల్ల ఏ సంఘటన జరిగినా వెంటనే గ్రామ పోలీసు అధికారికి తెలుస్తుంది. అందుకే అందరితో స్నేహ పూర్వక సంబంధాలను కొనసాగించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.ఠాణాలో విలేజ్ హిస్టరీ షీట్తన గ్రామానికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించిన గ్రామ పోలీసు అధికారి.. దాన్ని పోలీసు స్టేషన్లో ఉన్న విలేజ్ హిస్టరీ షీట్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఆధిపత్య పోరు, రాజకీయ విభేదాలు, కుల, మత సంబంధ వివాదాలు, ఏ వర్గాల మధ్య గొడవలు ఉన్నాయన్న విషయాలను తప్పనిసరిగా విలేజ్ హిస్టరీ షీట్లో పొందుపరచాలని ఎస్పీ సూచిస్తున్నారు. తద్వారా గొడవలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇలా హిస్టరీ షీట్ నిర్వహించడం వల్ల పండుగల సమయంలో జరిగే వివాదాలు, రాజకీయ గొడవల విషయంలో చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి పోలీసు స్టేషన్లో విలేజ్ హిస్టరీ షీట్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నారు. గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థను బలోపేతం చేస్తున్న ఎస్పీ ఏ సంఘటన జరిగినా తెలిసేలా నెట్వర్క్ విలేజ్ హిస్టరీ షీట్లో అన్ని వివరాలు నమోదు -
పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తాం
భిక్కనూరు : గూడు లేని నిరుపేదలందరికీ ప్రభు త్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని ప్రభు త్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవా రం భిక్కనూరులోని గిద్ద హరిజనవాడ, కుమ్మరిగ ల్లి, పాత హరిజన వాడలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. గత ప్రభుత్వం నిరుపేద ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించా రు. మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ని ర్మించినప్పటికీ లబ్ధిదారులకు కేటాయించకపోవ డం సిగ్గు చేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తోందన్నారు. రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు సన్నబి య్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామన్నారు. ఎవరికి ఎ లాంటి ఇబ్బందులు వచ్చినా తాను అండగా ఉంటా నని హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వా రా మండలానికి సాగునీరు అందిస్తామన్నారు. కా ర్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భీంరెడ్డి, నాయకులు సుదర్శన్, దయాకర్రెడ్డి, రేఖ, లింబాద్రి, శ్రీరామ్ వెంకటేష్, సుధాకర్రెడ్డి నరేందర్రెడ్డి, భూమయ్య, నరసింహారెడ్డి, మోహన్రెడ్డి, మైపాల్రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
పడకేసిన పారిశుధ్యం
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. పాలకులు లేక.. వార్డు అధికారులు పట్టించుకోక ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేస్తున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులున్నాయి. లక్షకుపైగా జనాభా, 25 వేల వరకు గృహాలు ఉన్నాయి. పాలకవర్గాల పదవీకాలం ముగిసిపోవడంతో ప్రత్యేకాధికారుల పాలనలోకి పట్టణం వెళ్లిపోయింది. బల్దియాలలో అభివృద్ధి పనులను సులభతరం చేసేందుకు, పారిశుధ్యం, నీటి సరఫరా నిర్వహణను మెరుగుపరిచేందుకు, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేసేందుకు వీలుగా వార్డు స్థాయి అధికారులను నియమించింది. ప్రతి వార్డుకు ఒక అధికారిని కేటాయించారు. ప్రభుత్వం మూడు నెలల క్రితం గ్రూప్స్నుంచి 34 మంది వార్డు ఆఫీసర్లను కేటాయించింది. వీరితోపాటు మరో 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను 49 వార్డులకు ఆఫీసర్లుగా కేటాయించారు. వార్డు ఆఫీసర్లు తమకు కేటాయించిన వార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే ఎక్కడా వార్డు ఆఫీసర్లు కనిపించడం లేదు. వార్డు ఆఫీసర్లు చాలా వరకు కార్యాలయానికి పరిమితమవుతున్నారని, మొక్కుబడిగా పనులు చేస్తున్నారని, ఫలితంగా వార్డులలో పరిస్థితి అధ్వానంగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కామారెడ్డి బల్దియాలో సమస్యల తిష్ట అందుబాటులో ఉండని వార్డు అధికారులు ఇబ్బందిపడుతున్న ప్రజలు -
‘భూ సమస్యల పరిష్కారానికి చర్యలు’
సదాశివనగర్: భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం యాచారం తండాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. భూ భారతి చట్టంలోని అంశాలను వివరిస్తూ రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూభారతి చట్టాన్ని లింగంపేట్ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామన్నారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూ రికార్డులలో పేర్లు తప్పుగా ఉండడం, విస్తీర్ణం తక్కువగా నమోదు కావడం, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాస్పుస్తకం లేకపోవడం, సాదాబైనామా కేసుల పరిష్కారం, హద్దుల నిర్ధారణ తదితర భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. వాటిని కొత్త చట్టం ప్రకారం పరిశీలించి పరిష్కారం చూపుతామన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామంలోని రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. వజ్జపల్లి తండాలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకృతి వనంలో మొక్కల సంరక్షణను చూసి కార్యదర్శి పాపిరెడ్డిని అభినందించారు. హనుమాన్ ఆలయం ముందు వివిధ రకాల పండ్ల మొక్కలు, ఔషధాల మొక్కలు నాటాలని సూచించారు. తండాలో ఏర్పాటు చేసిన పశువుల షెడ్లు, ఫాంపాండ్ను పరిశీలించారు. ఆయా కార్యక్రమాలలో మండల ప్రత్యేకాధికారి సతీశ్ యాదవ్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ సత్యనారాయణ, డీటీ తిరుపతి, ఎంపీవో సురేందర్రెడ్డి, ఎంఈవో యోసెఫ్, ఏపీఎం రాజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంగ్యానాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్, నాయకులు లచ్చీరాం నాయక్, సర్దార్ నాయక్, బబ్యనాయక్, బలిరాం నాయక్, మంగ్య నాయక్, సక్కు నాయక్ తదితరులు పాల్గొన్నారు.వేగంగా సీఎంఆర్ అందించాలికామారెడ్డి క్రైం: రైస్ మిల్లుల యజమానులు సీఎంఆర్ డెలివరీని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. వారంలోగా బ్యాంక్ గ్యారంటీలను సమర్పించాలన్నారు. కలెక్టరేట్లో గురువారం రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో కస్టం మిల్లింగ్ రైస్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిల్లర్లకు ఇచ్చిన 2023–24 యాసంగి ధాన్యాన్ని మరాడించి వచ్చేనెల 27 లోగా సమర్పించాలన్నారు. సకాలంలో సీఎంఆర్ పూర్తి చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వంద శాతం సీఎంఆర్ పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, పౌరసరఫరాల సంస్థ డీఎం రాజేందర్, సీఎస్వో మల్లికార్జున్బాబు, ఎల్డీఎం చంద్రశేఖర్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
8న పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక
నిజామాబాద్నాగారం: నిజామాబాద్ పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8న ఆదివారం ఏడో పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను నగరంలోని వినాయక్నగర్లో గల విజయలక్ష్మి గార్డెన్స్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు దాసరి నర్సింలు తెలిపారు. ఖలీల్వాడిలోని సంఘం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిచయ వేదికను విజయవంతం చేసేందుకు తమ బంధుమిత్రుల ఇళ్లలో పెళ్లి వయస్సు వచ్చిన అమ్మాయిలు/అబ్బాయిలను తీసుకువచ్చి నమోదు చేసుకొని విజయవంతం చేయాలన్నారు. వధూవరుల రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ఫీజు లేదని, పాల్గొన్న వారికి భోజన వసతి కల్పిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ కోసం 94400091895, 9848047026, 7386323505 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి మైసల నారాయణ, చిలుక నర్సయ్య, భీమర్తి రవి, లోల రాజేందర్, ఆడెపు రాజన్న, భూస శ్రీనివాస్, దిండిగల్ల శంకర్, ధోర్నాల రవి, కోడూరు స్వామి, బీజీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మోదీ పాలనలో భారత్ అభివృద్ధి
కామారెడ్డి టౌన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం ఆర్థికాభివృద్ధి సాధించిందని బీజేపీ మహి ళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి పేర్కొన్నా రు. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంకల్ప సహ కారం సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మోదీ పాలనలో దేశం అన్ని రంగాలలో అత్యంత పటిష్టంగా మారిందన్నారు. అన్ని దేశాలతో భారత్ సత్సంబంధాలు కలిగి ఉండటమే కా కుండా బలమైన మిత్ర పక్షంగా ఎదిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని కోరారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార, నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, రంజిత్ మోహన్, పైలా కృష్ణారెడ్డి, నరేందర్రెడ్డి, రవీందర్రావు, రాము, లక్ష్మారెడ్డి, లింగారావు, వేణు, సంతో ష్రెడ్డి, బాల్రాజు, అనిత, సంధ్య పాల్గొన్నారు. -
ఏడాదైనా దొరకని ఏటీఎం దొంగలు
బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలోని వన్నెల్(బి) చౌరస్తా వద్ద ఎస్బీఐ ఏటీఎంలో గతేడాది జూన్ 4న అర్థరాత్రి తర్వాత భారీ చోరీ జరిగింది. రెక్కీ నిర్వహించి 9 నిమిషాల వ్యవధిలోనే రూ. 24 లక్షల 92 వేల 600 ఎత్తుకెళ్లారు. దొంగిలించిన కారులో వచ్చిన దుండగులు గ్యాస్కట్టర్తో ఏటీఎంను ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు. కాగా, ఏడాది కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు దొంగల ఆచూకీ లభించలేదు. కేసు ఛేదనలో పోలీసులు పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు వస్తున్నాయి. 2022 జూలైలో మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో సైతం ఇదే తరహా చోరీ జరిగింది. నగదు కాలిబూడిద కావడంతోపాటు 8 కిలోల బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ ఘటనలో కూడా గ్యాస్కట్టర్లతోనే లాకర్లను ధ్వంసం చేశారు. కాగా, కేసులో సగం మంది దొంగలను పోలీసులను పట్టుకున్నారు. 2023 సెప్టెంబర్లో మెండోరా మండలం పోచంపాడ్ ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎంను ధ్వంసం చేసి రూ. 12 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఆ కేసు ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. రూ. 25 లక్షల నగదు చోరీ బాల్కొండ మండల కేంద్రంలో ఏటీఎం ధ్వంసం త్వరలోనే పట్టుకుంటాం.. బాల్కొండ మండల కేంద్రంలో గతేడాది ఏటీఎం ధ్వంసం చేసి జరిగిన చోరీపై దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే దొంగలను పట్టుకొని కోర్టులో హాజరుపరుస్తాం. – శ్రీధర్రెడ్డి, ఆర్మూర్ రూరల్ సీఐ, బాల్కొండ -
తల్లి తిట్టిందని కూతురి ఆత్మహత్య
పిట్లం(జుక్కల్): తల్లి తిట్టిందని కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో బు ధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుడగజంగం కాలనీకి చెందిన సంకు వరలక్ష్మి(14)ను బుధవారం సాయంత్రం ఇంటి తాళపు చెవిని పోగొట్టిందని తల్లి సంకు కవిత తిట్టింది. దీంతో మనస్తాపం చెందిన వరలక్ష్మి ఇంట్లోకి వెళ్లి దులానికి చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యంతో మహిళ.. వర్ని: వర్ని పోలీస్స్టేషన్ పరిధిలోని తగిలేపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మక్కవ్వ (45) అనారోగ్య కారణాలతో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మక్కవ్వ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. బాధ భరించలేక గురువారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కొడుకు రవి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదవశాత్తు ఒకరు.. సిరికొండ: మండలంలోని మెట్టుమర్రి తండా అట వీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఎల్ రామ్ గురువారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రమణయ్య కొన్నేళ్లుగా తండా లో ఉంటూ మేసీ్త్ర పని చేస్తున్నాడు. అతనికి ఎవరూ లేకపోవడంతో తండావాసులే రేకుల షెడ్డు వేసి ఇచ్చారు. మద్యానికి బానిసైన రమణయ్య అటవీ ప్రాంతంలో మృతి చెందాడని ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి అదృశ్యం రెంజల్(బోధన్): ఎడపల్లి మండలంలోని అంబం గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి అదృశ్యమైనట్లు రెంజల్ ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వారం రోజుల కిందట రెంజల్లోని తాతయ్య ఇంటికి వచ్చినట్లు పేర్కొన్నారు. గురువారం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లినట్లు తెలిపారు. కుటుంబీకులు, బంధువుల ఇళ్లల్లో గాలించినా కనిపించకపోవడంతో తాత రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
కామారెడ్డి టౌన్: ప్లాస్టిక్ వినియోగంలో నియంత్రణ పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం కామారెడ్డి సీఎస్ఐ గ్రౌండ్లోగల వారసంతలో ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, ప్లాస్టిక్ వాడడం నియంత్రణపై కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దన్నారు. వాటికి బదులుగా జూట్ బ్యాగులు, స్టీలు గ్లాసులు, ప్లేట్లను, పర్యావరణహితమైన వస్తువులనే వినియోగించాలని ప్రజలను కోరారు. ప్రతి పౌరుడు విరివిగా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, మెప్మా పీడీ శ్రీధర్, డీఎస్వో సిద్ధిరాంరెడ్డి, మున్సిపల్ డీఈ వేణుగోపాల్, టౌన్ ప్లానింగ్ అధికారి గిరిధర్ కుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్, మెప్మా సిబ్బంది, మున్సిపల్ వార్డు అధికారులు పాల్గొన్నారు. -
కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు ఇలా..
నాటి అల్లకొండనే నేటి బాల్కొండ మీకు తెలుసా? మీ కోసంరాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన బాల్కొండ ఒకనాటి అల్లకొండ. క్రీ.శ 1059లో సంధికాలంలో ఏర్పడ్డ అల్లకొండను, అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు పాలించడంతో ముందుగా అల్లకొండగా పేరొందింది. ● కాలక్రమేనా అల్లకొండ క్రీ.శ 1422 తర్వాత బాల్కొండగా పిలువబడుతూ ప్రస్తుతం బాల్కొండ మండల కేంద్రంగా, నియోజకవర్గ కేంద్రంగా చెలామణి అవుతోంది. ● అల్లయ్య, కొండయ్యలు పాలించారనడానికి నిదర్శనంగా వారి విగ్రహలు ఇప్పటికీ బాల్కొండ ఖిల్లాలో ఉన్నాయి. ● యుద్ధ పోరాటంలో బహమనీ సుల్తానులు వాళ్ల కాళ్లు, చేతులు నరికి వేశారు. దీంతో వారి విగ్రహాలు కూడా కాళ్లు, చేతులు లేకుండానే ఉండడం విశేషం. – బాల్కొండ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. ఐతే, ఈ కొత్త రేషన్ కార్డులకు అర్హత ఏమిటీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఏయే పత్రాలు అవసరం? అనే వివరాలు మీ కోసం... ● రేషన్ కార్డుకు ప్రధాన అర్హత వార్షిక ఆదాయ ధ్రువీకరణ. గ్రామీణ ప్రాంతాల్లో వారికి రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించకూడదు. ● మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు కుటుంబసభ్యుల ఆధార్ కార్డులు, ఇంటి యజమాని కరెంట్ బిల్లు, గ్యాస్ సిలిండర్ పుస్తకం దరఖాస్తుకు జత చేయాలి. ఉంటే ద్విచక్ర వాహన ఆర్సీ లేదంటే ఓటరు కార్డు జిరాక్సు పెట్టాలి. ● దరఖాస్తు పూర్తయిన తర్వాత దానిని స్థానిక తహసీల్ కార్యాలయంలో అందజేస్తే అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి ఆన్లైన్లో పంపుతారు. అనుకూలత మేరకు ప్రభుత్వం రేషన్ కార్డు మంజూరు చేస్తుంది. ● కారు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్నా కొత్త రేషన్కార్డుకు అనర్హులే. ● ఇప్పటికే రేషన్కార్డు ఉండి అందులో కుటుంబసభ్యుల పేర్లు చేర్పులు, మార్పులు చేయాలంటే సంబంధితుల ఆధార్ కార్డు దరఖాస్తుకు జత చేయాలి. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
ఈసారీ నిరాశే!
నాగిరెడ్డిపేట: జిల్లాలోని పలు కేజీబీవీలు అప్గ్రేడ్కు నోచుకోవడం లేదు. సరైన వసతులు లేకపోవడంతో ఆరు పాఠశాలల్లో ఇంటర్ విద్య అందుబాటులో లేదు. దీంతో ఆయా విద్యాలయాలలో పదో తరగతి చదివిన విద్యార్థినులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొందరు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరుపేద విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. మొదట ఆయా విద్యాలయాలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హాస్టల్ వసతితో కూడిన విద్య అందించారు. కానీ కేజీబీవీలలో ఇంటర్ లేకపోవడంతో చాలామంది పదో తరగతితో చదువుకు పుల్స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఆర్థిక స్థోమత లేక చాలా మంది నిరుపేద విద్యార్థినులు ఇంటర్ విద్యకు దూరమవుతున్నట్లు గుర్తించిన సర్కారు.. కేజీబీవీలలో ఇంటర్ విద్యను ప్రవేశపెట్టింది. జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా.. గతేడాది వరకు 12 విద్యాలయాలు అప్గ్రేడ్ అయ్యాయి. ఆ 12 విద్యాలయాలలో ఇంటర్ విద్య అందుబాటులో ఉంది. కాగా ఈ ఏడాది రాజంపేట మండలంలోని కేజీబీవీని అప్గ్రేడ్ చేస్తూ ఇంటర్విద్యను అమలు చేస్తున్నారు. ఇంకా నాగిరెడ్డిపేట, రామారెడ్డి, మాచారెడ్డి, మద్నూర్, టేక్రియాల్, తాడ్వాయి మండలాల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు అప్గ్రేడ్ కావాల్సి ఉంది.వసతుల లేమితో..విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు లేకపోవడం వల్ల ఆరు పాఠశాలలు అప్గ్రేడ్కు నోచుకోవడంలేదు. ఆయా పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు మాత్రమే సరిపోయే గదులున్నాయి. సరైన వసతులు ఉన్న పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తూ ఇంటర్విద్యకు అవకాశం కల్పిస్తున్న సర్కారు.. వసతులు లేని కారణంగా జిల్లాలోని ఆరు కేజీబీవీలను అప్గ్రేడ్ చేయడం లేదు. పాలకులు స్పందించి అదనపు గదులు నిర్మించి ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలని విద్యార్థులు కోరుతున్నారు. అప్గ్రేడ్కు నోచుకోని పలు కేజీబీవీలు ఇంటర్ విద్యకు దూరమవుతున్న పేద విద్యార్థినులుఅప్గ్రేడ్ చేయిస్తాం జిల్లాలోని కేజీబీవీలను విడతలవారీగా అప్గ్రేడ్ చేస్తున్నాం. గతేడాది వరకు జిల్లాలోని 12 చోట్ల ఇంటర్విద్యను ప్రవేశపెట్టాం. ఈసారి రాజంపేట మండలంలోని కేజీబీవీ అప్గ్రేడ్ అయ్యింది. జిల్లాలోని మిగిలిన పాఠశాలల్లోనూ వసతులు సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వసతుల కల్పన పూర్తవ్వగానే పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తాం. – సుకన్య, జీసీడీవో, కామారెడ్డి -
మానవ అక్రమ రవాణాను నిర్మూలించాలి
కామారెడ్డి టౌన్: మానవ అక్రమ రవాణాను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని డీఈవో రాజు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని టేక్రియాల్ కేజీబీవీలో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఉపాధ్యా యులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తోందన్నారు. ఇది నేరపూరితమైన చర్య అని పేర్కొన్నారు. సోషల్ మీడియాను అతిగా వినియోగించవద్దని సూచించారు. మానవ అక్రమ రవా ణాను ఆదిలోనే అడ్డుకుంటే ఆడపిల్లలను రక్షించుకోవచ్చని స్వచ్ఛంద సంస్థ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ బలరామకృష్ణ పేర్కొన్నా రు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ సభ్యురాలు స్వర్ణలత, కేజీబీవీ, మాడల్, రెసిడెన్షియల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తా కామారెడ్డి టౌన్: నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భక్త మార్కండేయ స్వామి యంత్రమూర్తి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే నియోజకవర్గంలో చాలా వరకు ఆలయాలను అభివృద్ధి చేశామన్నా రు. తాను ముస్లింను అయినా శివుడు ఆల యాల అభివృద్ధికి అవకాశం కల్పిస్తున్నాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయనను ఆలయ కమిటీ, పద్మశాలి సంఘం సభ్యులు సన్మానించారు. నేడు విద్యుత్ సమస్యలపై సదస్సు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సబ్స్టేషన్లో శుక్రవారం లోకల్ సదస్సు నిర్వహించనున్నట్లు విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ కల్యాణ్ చక్రవర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు సదస్సు ఉంటుందని పేర్కొన్నారు. వినియోగదారులు తమ సమస్యలను సదస్సు దృష్టికి తీసుకురావాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం కింద 3, 5, 8 తరగతులలో ప్రవేశాలకు అర్హులైన గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు ఫారాలను ఈనెల 9 నుంచి 17 వరకు కలెక్టరేట్లోని 208 నంబర్ గదిలోగల గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో పొంది, పూర్తి వివరాలతో అందజేయాలని సూ చించారు. 20న కలెక్టర్ సమక్షంలో విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ముగిసిన డిగ్రీ పరీక్షలుతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు గురువారం ముగిశాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. చివరి రోజు యూనివర్సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన 18 పరీక్ష కేంద్రాలలో 325 మంది విద్యార్థులకుగానూ 13 మంది గైర్హా జరయ్యారన్నారు. పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి ముగిసే వరకు వివిధ ప రీక్ష కేంద్రాలలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడు తూ మొత్తం 16 మంది డిబార్ అయ్యారన్నారు. పెరుగుతున్న నీటి మట్టం బాల్కొండ : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 (80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1,062.30 (12.9 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. -
పసుపు సాగులో మెలకువలు
బాల్కొండ: ఖరీప్ సీజన్లో పసుపు సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. ముందస్తు వర్షాలతో కొందరు రైతులు పసుపు విత్తడం ప్రారంభించారు. జిల్లాలో సుమారు 33 వేల ఎకరాల్లో పసుపు పంటను రైతులు సాగు చేస్తారు. పసుపు సాగులో మె లకువలను పాటించాలని ఆర్మూర్ డివిజన్ ఉద్యానవన అధికారి రుద్ర వినయ్ రైతులకు పలు సూచ నలు, సలహాలు చేస్తున్నారు. ఆయన మాటల్లోనే.. నేల తయారీ.. నేలను బాగా లోతుగా దున్నాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 40 ట్రాక్టర్ల నల్లమట్టిని నేలలో వేయాలి. ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ను వాడాలి. అడుగు మందుగా ఎకరానికి ఆరు బస్తాల సింగిల్ సూపర్ పాస్పెట్ చల్లాలి. బెడ్ విధానంలో ఇలా.. బెడ్ పద్ధతిలో విత్తినట్లయితే విత్తే రోజు బెడ్ మీద, బెడ్ మధ్యలో 45 సెంటీ మీటర్ల ఎడం ఉండేట్లు రెండు లైన్లు , రెండు అంగుళాల లోతు ఉండేట్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్ మీద ఎకరానికి మూడు సంచుల వేప పిండి, ఒక్క బస్తా యూరియా, ఒక్క బస్తా పొటాష్ కలిపి లైన్లలో వేయాలి. బెడ్పై లైన్లలో విత్తన ముక్కల్ని సుమారుగా 22.5 సెంటీమీటర్లు (9 అంగుళాలు) దూరం ఉండేట్లు విత్తి బాగా కప్పేయాలి. డ్రిప్పు పైపులు పరిచి నీరు బాగా అందేట్లుగా వదలాలి. కలుపు నివారణ విత్తనం వేసిన మరుసటి రోజు ఎకరానికి కిలో చొప్పున అట్రాజిన్ కలుపు మందును 200 లీటర్ల నీటితో పిచికారీ చేయాలి. విత్తనం వేసిన 21 రోజులకు మొలక వస్తుంది. ఎక్కడైనా గ్యాపులు వస్తే ముందే ట్రేలలో పెంచిన మొక్కలను వాడాలి. విత్తనం ఆదా.. విత్తన శుద్ధి ఇలా కొత్త పద్ధతిలో భాగంగా విత్తన కొమ్మును చిన్నచిన్న ముక్కలు చేయడం ద్వారా విత్తన ఆదా చేసుకోవాలి. విత్తనాన్ని ఒక్క అంగుళం ఉండేట్లు ముక్కలు చేయాలి. దీంతో ఎకరానికి రెండు క్వింటాళ్ల విత్తనం మాత్రమే సరిపోతుంది. విత్తన ముక్కల్ని లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున రిడోమిల్ గోల్డ్ కలిపి తయారు చేసిన మంచు ద్రావణంలో అరగంట సేపు నానబెట్టి శుద్ధి చేసి ఆరబెట్టాలి. విత్తన శుద్ధి రెండు, మూడు రోజుల ముందు చేసుకోవాలి. దీంతో విత్తనం వేసే రోజు హడావుడి ఉండదు. పొలుసు, పురుగు ఉన్న చోట విత్తన శుద్ధి చేసేటప్పుడు లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్ కలపాలి. -
అసలు, వడ్డీ చెల్లించాకే రెన్యువల్
గోల్డ్ లోన్ రెన్యువల్ ప్రక్రియకు ఆర్బీఐ విధించిన నిబంధనలు రుణగ్రహీతలకు ప్రతిబంధకంగా మారాయి. గతంలో ఏడాదికోసారి వడ్డీ చెల్లిస్తే సరిపోయేది. కానీ, ఇక మీదట ఏడాది కాగానే అసలు, వడ్డీ మొత్తం చెల్లించిన తర్వాతే రెన్యువల్ చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రుణగ్రహీతలు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి నెలకొంది. ● గోల్డ్ రుణాలపై మారిన నిబంధనలు ● రెన్యువల్ కోసం రుణం మొత్తం చెల్లించాల్సిందే ● సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు ● వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రుణగ్రహీతలు -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
కామారెడ్డి క్రైం: బక్రీద్ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది. ఆయా ప్రాంతాల్లో పోలీస్శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పెట్రోలింగ్, భద్రతా ఏర్పాట్లు, జాగ్రత్తలను ఎస్పీ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడం కోసమే ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పండుగలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, ఎస్సైలు, 170 మంది సివిల్, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర పట్టణంలో ఫుట్ పెట్రోలింగ్ -
కరపత్రాల ఆవిష్కరణ
బాన్సువాడ: పట్టణంలో గురువారం లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహణ కరపత్రాలను బా న్సువాడ టౌన్ సీఐ అశోక్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ తగాదాలు, సీనియర్ సిటిజన్, గ్రామాల్లో జ రిగే ఇతర తగాదాలను మండల లీగల్ సర్వీస్ అథారటీ ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నా రు. వలంటీర్లు ఉచితంగా న్యాయ సలహాలు, సూచనలు ఇస్తారని అన్నారు. కమ్యూనిటి మీడియేషన్ వలంటీర్లు రామకృష్ణరెడ్డి, అయ్యా ల సంతోష్, అహ్మద్ హుస్సెన్ ఉన్నారు. మూఢ నమ్మకాలను వీడాలి లింగంపేట(ఎల్లారెడ్డి):గ్రామీణ ప్రాంతాల్లో ప్ర జలు మూఢ నమ్మకాలను వీడాలని కళా బృందం సభ్యులు వివరించారు. లింగంపేట బ స్టాండ్ ఆవరణలో గురువారం తెలంగాణ సాంస్కృతిక కళా బృందం సభ్యులు జానపద గే యాలు,ఆట పాటలతో ప్రయాణికులకు అవ గాహన కల్పించారు.సభ్యులు మహేందర్, ర మేశ్రావు, విఠల్రెడ్డి,నాగరాజు,రాము, లక్ష్మినారాయణ,పోశెట్టి,కాశీరాం,దివ్యశ్రీ, సవిత, లత, శిల్ప,ప్రశాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కెపాసిటర్లు బిగించుకోవాలి భిక్కనూరు: రైతులు స్టార్టర్ బాక్స్ల వద్ద కెపాసిటర్లను తప్పనిసరిగా బిగించుకోవాలని ట్రాన్స్కో ఏడీఈ సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని జంగంపల్లి గ్రామంలో గురువారం పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కెపాసిటర్ల వల్ల పంపు మోటర్లకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. విద్యుత్ సిబ్బంది రైతులకు సేవ చేసేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటారని, విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. నార్త్ ఏరియా ఏఈ బాలాజీ, ట్రాన్స్కో సిబ్బంది తిరుపతిగౌడ్,లింగం, తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందుబాటులో యూరియా లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘంలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నట్లు సహకార సంఘం చైర్మన్ దేవేందర్రెడ్డి గురువారం తెలిపారు. వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో పంటల సాగు చేస్తున్న రైతుల కోసం ముందస్తుగా యూరియాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. లింగంపేట సహకార సంఘం పరిధిలోని భవానిపేట 900 బస్తాలు, పోతాయిపల్లి 450 బస్తాలు, లింగంపేటలో 1250 బస్తాలు రైతులకు యూరియా అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. పంటల సాగుకు ముందస్తుగా అందుబాటులో ఉంచిన యూరియాను రైతులు తీసుకెళ్లాలని సూచించారు. బ్రాండెడ్ విత్తనాలను విక్రయించాలి ఎల్లారెడ్డి: ఫర్టిలైజర్ దుకాణాలలో నాణ్యమైన బ్రాండెడ్ విత్తనాలను మాత్రమే విక్రయించాలని సీఐ రవీందర్నాయక్ అన్నారు. పట్టణంలోని ఫర్టిలైజర్ దుకాణాలను గురువారం ఆయన ఏవో నయిమోద్దిన్తో కలిసి పరిశీలించారు. దుకాణాల రిజిస్టర్లను తనిఖీ చేశారు. స్టాక్ వివరాల బోర్డును ప్రదర్శించాలని, నకిలీ విత్తనాలను విక్రయించవద్దని దుకాణాదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. -
పర్యవేక్షణ లేక..
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆయా వార్డులలో పనులు అస్తవ్యస్తంగా సాగుతున్నాయి. ప్రధానంగా పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడి చెత్త అక్కడే కుప్పలుగా వీధుల్లో పేరుకుపోతోంది. మురికి కాలువలు చెత్తాచెదారంతో పూడుకుపోతున్నాయి. అపరిశుభ్ర వాతావరణంతో పలు కాలనీలు కంపుకొడుతున్నాయి. వానరాలు, కుక్కల బెదడ తీవ్రంగా ఉంది. పలు కాలనీలలో ఇంటింటా చేత్తసేకరణ జరగడం లేదు. కొన్నిచోట్ల వీధిదీపాలు వెలగక నెలలు గడుస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. తాగునీరు సమయానికి సరఫరా కాక ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. బల్దియా స్థలాలకు భద్రత లేకుండాపోయింది. అన్ని వార్డుల్లో ప్రకృతి వనాలు వికృతంగా మారాయి. డైలీ మార్కెట్ కంపుకొడుతుంది. అసెస్మెంట్లు ఇష్టారీతిన సాగుతున్నాయి. -
గ్రూపు రాజకీయాలకు చెక్
సుభాష్నగర్: నిజామా బాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ఎంపీ అర్వింద్ ధర్మపురి కీలక నిర్ణయం తీ సుకున్నట్లు తెలిసింది. ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ విష యంలో స్వయంగా తనే ప నులను ఫైనల్ చేయనున్నట్లు సమాచారం. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి రూ.70 లక్షలు కేటాయిస్తు న్నారు. కొవిడ్ సమయంలో కాకుండా తర్వాతి ఏడా ది నుంచి రూ.5 కోట్ల ఎంపీ నిధులను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన కార్యాలయానికి వ చ్చిన దరఖాస్తులను పరిశీలించి, స్థానిక అవసరాల నిమిత్తం నిధులను సమానంగా కేటాయించేవారు. స్థానిక నాయకుల సిఫార్సులకు ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండలాల అధ్యక్షులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమైన పనులకు నిధులు కేటాయిస్తూ, ప్రొసీడింగ్ పత్రాలను ముఖ్య నాయకుల ద్వారా అందించేవారు. కాగా, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీజేపీ నాయకుల గ్రూపు రాజకీయాల నేపథ్యంలో ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ అందజేతపై నిర్ణయం మార్చుకున్నారు. ఈ విషయమై తన కార్యాలయ సిబ్బందిని సైతం ఆదేశించినట్లు తెలిసింది. నియోజకవర్గంలో బీజేపీ బలోపేతమవుతున్న నేపథ్యంలో పార్టీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఎంపీ ల్యాడ్స్ నిధుల కేటాయింపులు, వాటి ఖర్చు, అభివృద్ధి ప నులు, నిధుల విషయంపై ఎంపీ అర్వింద్ స్వయంగా పర్యవేక్షిస్తారని సమాచారం. ● ఎంపీ ల్యాడ్స్ ప్రొసీడింగ్స్ను స్వయంగా ఇవ్వనున్న అర్వింద్ ధర్మపురి -
వాటర్ హీటర్ షాక్తో వృద్ధురాలి మృతి
ఖలీల్వాడి: నగరంలోని వినాయక్నగర్లో వాటర్ హీటర్ షాక్తో రా థోడ్ వీణ(61) మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. నిర్మల్ జిల్లా నాళేశ్వర్ మండలం పుష్పల్ గ్రామంలోని దుర్గా తండాకు చెందిన రాథోడ్ వీణ ఐదేళ్లుగా కూలీ పని చేసుకుంటూ వినాయక్నగర్లో నివాసం ఉంటోంది. గురువారం ఉదయం వీణ స్నానం చేసేందుకు వాటర్హీటర్ను బకెట్లో పెట్టి కొంత సమయం తర్వాత నీళ్లు వేడిగా మారాయో? లేదో తెలుసుకునేందుకు చేతిని నీటిలో పెట్టింది. విద్యుత్ షాక్ తగలడంతో కేకలు వేస్తూ పడిపోయింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి కోడలు రాథోడ్ రేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జీజీహెచ్లో ఫిట్నెస్ సర్టిఫికెట్లకు ఇక్కట్లు నిజామాబాద్ నాగారం: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో వైద్యులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని అమర్నాథ్ యాత్రికులు గురువారం జీ జీహెచ్ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా భక్తుడు ధాత్రిక రతన్ మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వచ్చిన భక్తులను ఏడంతస్తుల మేడలో కిందకు, పైకి తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. జీజీహెచ్ అధికారులు, సూపరింటెండెంట్ స్పందించి భక్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక ట్రాక్టర్ సీజ్ మాచారెడ్డి: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఓ ట్రాక్టర్ను గురువారం సీజ్ చేసినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. పాల్వంచ మండలం బండరామేశ్వరపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో వెళ్లి ట్రాక్టర్ను సీజ్ చేశామన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. -
ప్రకృతిని కాపాడుకోవాలి
దోమకొండ: ప్రకృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా అటవీశాఖ అధికారి నిఖిత పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పించారు. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటిని పరిరక్షించడం తదితర విషయాలను వివరించారు. 170 కుటుంబాలకు మొక్కలను అందజేశారు. కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ దివ్య, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, మాజీ జెడ్పీటీ తిర్మల్గౌడ్, మాజీ సర్పంచ్ అంజలి, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. -
కుస్తీ మే సవాల్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: చుట్టూ కేరింతలు కొడుతూ ఉత్సాహ పరిచే జనం.. ఎదురుగా ఉడుంపట్టు పట్టి పడగొట్టడానికి సిద్ధంగా ప్రత్యర్థి.. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ గట్టి పట్టు పడితేనే వరించే విజయం.. ఆ గెలుపు ఇచ్చే కిక్కే వేరు.. నిర్వాహకులు అందజేసే బహుమతి కన్నా.. ఆ కిక్కు కోసమే మల్లయోధులు పోటీలకు తరలి వస్తుంటారు. పలువురు సరిహద్దులు దాటి వచ్చి తలపడతారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో..ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుస్తీ పోటీలకు ఆదరణ పెరుగుతోంది. జుక్కల్, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలలోని పలు ప్రాంతాల్లో పండుగల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఉగాది, శివరాత్రి, హోలీ, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, దసరా, దీపావళి తదితర పండుగల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామ దేవతల ఉత్సవాలైన అల్లమ ప్రభు జాతర, భేతాళ జయంతి, మత్తడి పోచమ్మ ఉత్సవాలు, ప్రభుస్వామి ఉత్సవాలు, పెద్దమ్మ, దుర్గమ్మ ఉత్సవాలలో కుస్తీ పోటీలు జరుగుతాయి. పోటీలకు ఇరు జిల్లాలకు చెందిన వారే కాకుండా.. పొరుగునున్న కర్ణాటక, మహారాష్ట్రల నుంచి కూడా మల్లయోధులు వస్తుంటారు. పోటీలకు వేలాది మంది హాజరై ఈలలు కొడుతూ ఉత్సాహపరుస్తుంటారు.విజేతలను అభినందిస్తూ ఊరేగిస్తారు. నిజాంసాగర్, పిట్లం, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, కోటగిరి, చందూర్, బోధన్, వర్ని, జుక్కల్, ఎడపల్లి, పెద్దకొడప్గల్, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో కుస్తీ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ మధ్య కాలంలో పోటీల్లో ఆడపిల్లలు కూడా పాల్గొంటుండటం విశేషం. కొన్నిసార్లు ఆడపిల్లలు మగవారిని ఓడించి విజేతలుగా నిలుస్తున్నారు. దశాబ్దాలుగా నిర్వహణ..ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో తరతరాలుగా కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల తాతలు, తర్వాతి కాలంలో తండ్రులు, ఇప్పుడు వారి కొడుకులు.. పోటీల్లో పాల్గొంటూ వారసత్వాన్ని కొనసాగిస్తుండటం విశేషం. తమది మల్లయోధుల కుటుంబం అంటూ గొప్పగా చెప్పుకొనేవారు చాలామంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్, అడవి లింగాల, మత్తమాల, రుద్రారం, తిమ్మారెడ్డి, అల్మాజీపూర్, భిక్కనూరు, నస్రుల్లాబాద్, బొమ్మన్దేవ్పల్లి, సంగం, దుర్కి, నాచుపల్లి, మైలారం, మిర్జాపూర్, దామరంచ, కిష్టాపూర్, బీర్కూర్, దేశాయిపేట, నెమ్లి, లింగంపేట, బోనాల్, లింగంపల్లి కుర్దు, ముంబోజీపేట, జల్దిపల్లి, మెంగారం, బాణాపూర్, భవానీపేట, ఐలాపూర్, ఎక్కపల్లి, సజ్జన్పల్లి, కోర్పోల్, గౌరారం, గాంధారి, జుక్కల్, పోచారం, నిజామాబాద్ జిల్లాలోని పెగడాపల్లి, కందకుర్తి, సాలూర, బోధన్ పట్టణం, ఎరాజ్పల్లి, హందాపూర్, కల్దుర్కి, హున్సా, సాలంపాడ్, కుమ్మన్పల్లి, ఠాణాకలాన్, మంగళ్పాడ్, జాన్కంపేట్, జన్నెపల్లి, రెంజల్, కల్యాపూర్, దూపల్లి, కందకుర్తి, బోర్గాం, సాటాపూర్, కోటగిరి, అంబం, చిక్కడ్పల్లి, గోవూర్, చందూర్ తదితర గ్రామాల్లో పండుగల సందర్భంగా కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నారు.కొత్త తరం కూడా..కొన్ని గ్రామాల్లో కొత్తతరం కూడా కుస్తీ పోటీలకు సిద్ధమవుతోంది. అప్పట్లో తమ తాతలు, తండ్రులు కుస్తీ పోటీల్లో పాల్గొనేవారని, వారి వారసత్వంగా తాము కూడా సై అంటూ చాలాచోట్ల కొత్త తరం పోటీల్లో పాల్గొంటోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగే కుస్తీ పోటీల్లో కొత్త తరం పాల్గొని సత్తా చాటుతోంది. పోటీలపై గ్రామీణ ప్రాంతాల్లో ఏటేటా ఆసక్తి పెరుగుతోంది. -
నలుగురు పీఎంపీలపై కేసులు
గాంధారి: మండల కేంద్రంలో అర్హతలు లేకున్నా ఆస్పత్రులు నడుపుతూ బెడ్స్ ఏర్పాటు చేసి ఇన్పేషెంట్లకు చికిత్సలు చేస్తున్న నలుగురు పీఎంపీలపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పీఎంపీలు నరేందర్, హేమ్సింగ్, అంజయ్య, ఆంజనేయులు రోగులను చేర్పించుకుని చికిత్సలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించారన్నారు. వారి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ‘అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ బీబీపేట: వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీపీవో మురళి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పలు కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పంచాయతీలలో ఆయిల్ బాల్స్ను సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌజ్ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో అబ్బాగౌడ్, కార్యదర్శి రమేష్, కారోబార్ సిద్దరాములు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుతారి రమేష్ తదితరులున్నారు. ఫర్టిలైజర్ దుకాణాలపై దాడులు నాగిరెడ్డిపేట: మండలకేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలపై బుధవారం జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో రైతులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలను, స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన, గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలనే విక్రయించాలని దుకాణాదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీలలో టాస్క్ఫోర్స్ అధికారులు అనిల్కుమార్, మహ్మద్ నదీముద్దీన్, ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి, ఏవో సాయికిరణ్ పాల్గొన్నారు. బాన్సువాడ బల్దియా నుంచి కొయ్యగుట్ట తండా తొలగింపుబాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన కొయ్యగుట్ట తండాను మున్సిపల్ పరిధి నుంచి తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. బుధవా రం బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై మున్సిపల్ నుంచి తొలగించిన కొయ్యగుట్ట తండా వివరాలను అతికించారు. మున్సిపల్ చట్టం ప్రకారం బాన్సువాడ మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఉన్న కొయ్యగుట్ట తండాను తొలగించినట్లు తెలిపారు. తండా వాసుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 11 వ తేదీ వరకు మున్సిపాలిటీలో తెలియజేయాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో 19 వార్డులు ఉన్నాయని, అన్ని వార్డులు అలాగే ఉంటాయని తెలిపారు. కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు కామారెడ్డి క్రైం: నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్.మోహన్ సింగ్ అనే కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, పోలీసు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే చర్యలకు పాల్పడడం, అనైతిక ప్రవర్తనలకు సబంధించిన ఆరోపణలు రావడంతో విచారించి ఈ చర్య తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనైతిక చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
మాచారెడ్డి: ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మాచారెడ్డి ఎస్ఐ అనిల్ సూచించారు. ఈమేరకు పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోరీలు చైన్ స్నాచింగ్ కిడ్నాప్ లు జరగకుండా ఉండాలంటే తప్పనిసరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు నర్సింలు రమేశ్గౌడ్, సమరసింహారెడ్డి, పరశురాంగౌడ్ తదితరులున్నారు. వాహనాల తనిఖీ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ముస్తాపూర్ గ్రామ శివారులో బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలపై పెండింగ్ ఉన్న చాలన్లను చెల్లించాలని సూచించారు. లేదంటే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనాల ధ్రువపత్రాలు లేనివారికి, హెల్మెట్ ధరించని పలువురికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్సై ప్రకాష్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకం
మీకు తెలుసా?శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను ఎత్తిపోతల పథకం ద్వారా మళ్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.204 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టి పూర్తి చేయించారు.●● 2008 మార్చి 18న వైఎస్సార్ స్వహస్తాలతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకంగా నామకరణం చేసి ప్రారంభించారు. ● ఆర్మూర్ ప్రాంత బీసీ నాయకుడు, మాజీ మంత్రి అర్గుల్ రాజారాంకు ఇచ్చిన అరుదైన గౌరవం ఇది. ● ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్పల్లి మండలాల్లోని 53 గ్రామాల్లో 38 వేల 792 ఎకరాల ఆయకట్టు స్థీరీకరణ అయింది. ● నందిపేట మండలం ఉమ్మెడ శివారులో నిర్మించిన ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోని గోదావరి నదీ జలాలు 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుత్ప చెరువు మీదుగా ఆర్మూర్ ప్రాంత వ్యవసాయ భూములకు అందుతుండటంతో రైతులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. – ఆర్మూర్ -
బక్రీద్ పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఎల్లారెడ్డిరూరల్: బక్రీద్ పండగకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు అన్నారు. బుధవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పండగ సందర్భంగా పట్టణంలోని ఈద్గా వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా తగిన చర్యలను తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేశ్, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, గిర్దావార్ శ్రీనివాస్, ఎంపీడీవో ప్రకాష్, విద్యుత్ సిబ్బంది సిద్దార్థరెడ్డి తదితరులున్నారు. ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకోవాలి మద్నూర్(జుక్కల్): రానున్న పండుగలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని బిచ్కుంద సీఐ నరేశ్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా అందరూ కలిసి మెలసి శాంతియుతంగా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఆయనతో పాటు ఎస్సై విజయ్ కోండ, పోలీసు సిబ్బంది, గ్రామస్తులు ఉన్నారు. -
అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు
కామారెడ్డి క్రైం: పశువుల అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఇందుకోసం జిల్లాలో ఏడోచోట్ల సరిహద్దు చెక్పోస్టులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్, భిక్కనూరు మండలంలోని టోల్ప్లాజా, బస్వాపూర్ చెక్పోస్టులను బుధవారం ఆయన తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణాపై నిరంతరం నిఘా పెట్టాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఎవరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే, ద్వేషపూరితమైన పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. -
బోరుబావుల రైతుల ముందుచూపు
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండలంలో బోరు బావుల రైతులు రెండు పంటలు తీసి లాభాలు పొందాలనే ఉద్దేశ్యంతో పత్తి విత్తనాలు సాగు ప్రారంభించారు. జిల్లాలో మద్నూర్లోనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర ఉంది. దీంతో రైతు లు పత్తి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ సా రి వర్షాలు త్వరగానే మొదలవుతాయని బోరుబావుల రైతులు పత్తి పంట విత్తనాలు వేయడం మొదలు పెట్టారు. మండలంలోని పెద్ద తడ్గూర్, అంతాపూర్, సోమూర్, దన్నూర్ తదతర గ్రామాల శివారులో రైతులు పత్తి విత్తనాలను విత్తుకోవడంలో బిజీగా మారారు. పత్తి సంవత్సరం పంట అని, ముందుగా వేయడంతో రెండు పంటలు తీసుకునే అవకాశం ఉందని రైతులు తెలిపారు. జిల్లాలో గతేడాది 33,657 ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా ఈ సారి పంట విస్తీర్ణం పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కాగా, గతేడాది పత్తిసాగు రైతులకు సిరులు కురిపించింది. పత్తి పంటకు ప్రభుత్వం మద్దతు రూ. 589 పెంచుతూ క్వింటాలుకు రూ. 8110 మద్దతు ధర ప్రకటించింది. విత్తనాల ఎంపికలో అయోమయం మార్కెట్లో ఎన్నో రకాల కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. సీజన్ ప్రారంభం కావడంతో రైతులు దుకాణదారులు చెప్పిన పత్తి విత్తనాలనే కొనుగోలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు నాణ్యత లేని విత్తనాలు అంటగడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పత్తి విత్తనాలు అందిస్తే ఇబ్బందులు తప్పుతాయని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు ముఖ్యం లైసెన్స్లు కలిగిన దుకాణాల్లో మాత్రమే రైతులు విత్తనాలు తీసుకోవాలి. ప్రభుత్వం పత్తి విత్తనాలను అందించదు. బయ ట మార్కెట్లో విత్తనాలు తీసుకోని రిసిప్ట్ కచ్చితంగా తీసుకోవాలి. చాలా చోట్ల బోరుబావుల కింద పత్తి విత్తడం రైతులు ప్రారంభించారు. ఈ సారి పత్తి విస్తీర్ణం పెరిగి అవకాశం ఉంది. –రాజు, ఏవో, మద్నూర్ విత్తనాలను ప్రభుత్వమే అందించాలి పత్తి విత్తనాలను ప్రభుత్వమే అందించాలి. బ హిరంగ మార్కెట్లో ఎ న్నో రకాల పత్తి విత్తనా లు విక్రయిస్తున్నారు. ఏ విత్తనాలు అధిక దిగుబడి ఇస్తుందో తెలియని పరిస్థితి ఉంది. వ్యాపారులు సూచించిన పత్తి విత్తనాలు తీసుకొచ్చి విత్తుకున్నాను. వ్యవసాయ అధికారులు విత్తనాల ఎంపికపై సలహాలు అందించాలి. – రాములు, పత్తి రైతు, అంతాపూర్ ముందే పత్తి పంట వేశాను వర్షాలు కురియగానే పత్తి పంట వేశాను. బోరుబావులు ఉండడంతో పత్తికి తడులు అందించవచ్చు. రెండు పంటలు తీయాలని పత్తి పంట విత్తులు ముందే మొదలుపెట్టాం. ఇప్పుడు వేసిన పత్తి నవంబర్లో పూర్తి కాగా అనంతరం ఇతర పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఆరు ఎకరాల్లో పత్తి పంట వేశాను. – మష్ణాజీ, పత్తి రైతు, అంతాపూర్ మద్నూర్ మండలంలో రెండు పంటలతో లబ్ధి పొందాలని పత్తి సాగు ప్రారంభం ప్రభుత్వమే విత్తనాలను అందించాలని డిమాండ్ ప్రైవేటు మార్కెట్లో పలు రకాల పత్తి విత్తనాలు -
సకాలంలో రుణాలు అందించాలి
కామారెడ్డి క్రైం: పంట రుణాలు, విద్య, బ్యాంకు లింకేజీ, మహిళ, శ్రీనిధి, స్వయం ఉపాధి రుణాలను సకాలంలో మంజూరు చేసి జిల్లా ఆర్థిక అభివృద్ధిలో బ్యాంకర్లు కీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బ్యాంకులు, సంక్షేమ శాఖల వారీగా స్వయం ఉపాధి, ఎస్హెచ్జీ, వ్యవసాయ, తదితర రుణాల లక్ష్యాలు, ప్రగతిపై బుధవారం కలెక్టరేట్లో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీఆర్డీఏ మహిళా స్వయం సహాయక సంఘాల రుణాల లక్ష్యాలను సకాలంలో సాధించాలన్నారు. అలాగే బకాయిలను త్వరగా వసూలు చేయాలన్నారు. జిల్లా పారిశ్రామిక కేంద్రం ద్వారా అందజేసే రుణాల వివరాలపై యువతకు అవగాహన కల్పిస్తూ వివిధ బ్యాంకులలో పెండింగ్లో ఉన్న రుణాలు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలను త్వరగా మంజూరు చేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా రూ. 8,204.51 కోట్లతో వార్షిక ప్రణాళికను విడుదల చేశారు. ప్రాధాన్యత రంగానికి రూ. 6,993.58 కో ట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ. 1,210.93 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 5,666.20 కోట్లతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఎంఎస్ఎంఈ లకు రూ. 1,102 కోట్లు, గృహ నిర్మాణానికి రూ. 155.52 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ. 21.81 కోట్లు, సంప్రదాయ ఇంధనానికి రూ. 4.05 కోట్లు, ఇతర రంగాలకు రూ.4 కోట్లు కేటాయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఎల్డీఎం చంద్రశేఖర్, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్, ఆర్బీఐ ఏజీఎం రెహమాన్, డీఆర్డీవో ఏపీడీ మురళీకృష్ణ, బ్యాంకర్లు పాల్గొన్నారు. బ్యాంకర్లతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రూ. 8,204.51 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు -
డీసీసీబీ సేవలకు ఐఎస్వో గుర్తింపు
నిజామాబాద్ సిటీ: జిల్లాకేంద్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కస్టమర్లకు అందిస్తున్న సేవలకు గాను ఐఎస్వో ధ్రువీకరణ పత్రం అందజేసినట్లు చైర్మన్ రమేశ్రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో బుధవారం పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్రెడ్డి మాట్లాడుతూ డీసీసీబీ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నందుకు, బ్యాంకు నిర్వహణ, ఖాతాదారులకు బ్యాంకు ద్వారా అందిస్తున్న విలువైన సేవలకుగాను ఐఎస్వో ధ్రువీకరణ పత్రం (9001 : 2015) జారీ చేసిందన్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిర్వహించిన ఆడిట్లో బ్యాంకు మంచి ఆర్థిక ఫలితాలు సాధించి, అన్ని విభాగాల్లో మెరుగైనట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ స్కోర్ 90 సాధించామని, ఇది బ్యాంకు చరిత్రలో మొదటిసారని పేర్కొన్నారు. ఈ ఘనత సాధించేందుకు సహకరించిన ఖాతాదారులకు, రైతులకు, సహకార సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. డీసీసీబీ డైరెక్టర్లు, సీఈవో నాగభూషణం, అధికారులు పాల్గొన్నారు. -
తనఖా పెట్టేస్తున్నారు
అవసరానికి డబ్బులు సర్దుబాటు కాక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటివారిని గోల్డ్లోన్స్ ఆకర్షిస్తున్నాయి. బ్యాంకులతో పాటు పలు సంస్థలు బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టుకుని సులువుగా రుణాలు ఇస్తుండడంతో అందరూ అటువైపు వెళుతున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రైతులు సహకార బ్యాంకుల్లోనే సుమారు రూ. 400 కోట్ల విలువైన గోల్డ్ లోన్స్ తీసుకోవడం గమనార్హం. ఇతర బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లోనూ బంగారాన్ని తనఖా పెట్టి భారీగానే అప్పులు తీసుకున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● అవసరానికి గోల్డ్ లోన్! ● సహకార బ్యాంకులకు వరుస కడుతున్న రైతులు ● ఉమ్మడి జిల్లాలో రూ. 400 కోట్ల మేర అప్పులు ● వాణిజ్య, కార్పొరేట్ బ్యాంకుల్లోనూ భారీగానే రుణాలు..బయట అప్పు పుట్టక..గతంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు రైతులకు అప్పులు ఇచ్చేవారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు, ఇతర అవసరాలకు కూడా వ్యాపారులు అప్పు ఇచ్చేవారు. పంట చేతికి అందిన తరువాత అదే వ్యాపారి పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి తనకు రావలసిన అప్పు పోను మిగతా సొమ్ము రైతుకు చెల్లించేవారు. అయితే చాలాచోట్ల వడ్డీ వ్యాపారం తగ్గిపోయింది. తరువాతి కాలంలో ఫైనాన్స్లు వచ్చినా అవి అడ్డగోలు వడ్డీలు వసూలు చేయడంతో పోలీసులకు ఫిర్యాదులు వెళ్లాయి. అనుమతి లేని ఫైనాన్స్లపై పోలీసులు దాడులు చేయడం, కేసులు పెట్టడంతో చాలాచోట్ల ప్రవేట్ ఫైనాన్స్లు కనుమరుగయ్యాయి. ఇప్పుడు మార్కెట్లో సామాన్యుడికి అప్పు పుట్టే పరిస్థితి లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యులకు బంగారం తాకట్టు రుణాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. -
రెండేళ్ల బాలుడి కిడ్నాప్.. మూడు గంటల్లో ఛేదన
● దంపతుల అరెస్ట్ కామారెడ్డి క్రైం: రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును కామారెడ్డి పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించా రు. పడుకున్న చోటు నుంచి బాలుడిని కిడ్నాప్ చేసి న దంపతులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించా రు. పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. భిక్కనూర్ మండలం గుర్జకుంట గ్రామానికి చెందిన మక్కాల లక్ష్మి, నర్సింలుకు కుమార్తె, కుమారుడు హర్షిత్ (2) ఉన్నారు. కొంతకాలంగా కామారెడ్డిలో భిక్షాటన చేస్తూ సిరి సిల్ల రోడ్డు ప్రాంతంలోని దుకాణాల ఎదుట నిద్రిస్తుంటారు. మంగళవారం రాత్రి ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ ఎదుట తమ పిల్లలతో కలిసి నిద్రించారు. ఉద యం లేచి చూడగా హర్షిత్ కనిపించలేదు. చుట్టప క్కల గాలించినా దొరకలేదు. బాలుడిని కిడ్నాప్ చేశారని గ్రహించి పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అప్రమత్తమైన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం 3 బృందాలను ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా బాలుడిని ఓ మగ వ్యక్తి, ఓ మహిళ కలిసి ఎత్తుకెళుతున్నట్లు గుర్తించారు. అన్ని కోణాల్లో విచారణ జరుపగా వారిని దోమకొండకు చెందిన పల్లపు రాజు, అతని భార్య శారదగా నిర్ధారించారు. నిందితులు సైతం పట్టణంలో భిక్షాటన చేస్తూ ఉంటారని తేలింది. దీంతో పట్టణంలో గాలింపు చర్య లు చేపట్టి కామారెడ్డి రైల్వేస్టేషన్ వద్ద బాలుడితో కలిసి భిక్షాటన చేసుండగా పట్టుకున్నారు. హర్షిత్ను తల్లిదండ్రులకు అప్పగించి నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీరాం, కానిస్టేబుళ్లు విశ్వనాఽఽథ్, విజయ్, రాజు, నరేశ్, రవి, అశ్విన్ను అభినందించారు. -
ట్రాన్స్కోలో ఇన్చార్జీల పాలన
నిజాంసాగర్: ట్రాన్స్కోలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఈలు, డీఈలు, ఏడీ పోస్టులు ఖాళీగా ఉండడంతో ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. దీంతో సకాలంలో సేవలందక వినియోగదారులు ఇబ్బందిపడుతున్నారు. విద్యుత్ శాఖలో జిల్లావ్యాప్తంగా 10 ఏఈ పోస్టులు, నాలుగు ఏడీ పోస్టులు, ఒక డీఈ పోస్టు ఖాళీగా ఉన్నాయి. జుక్కల్ నియోజకవర్గంలో నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్ ఏఈ పోస్టులు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డిటౌన్, బాన్సువాడ నియోజకవర్గంలో నస్రుల్లాబాద్, బీర్కూర్, కామారెడ్డి నియోజకవర్గంలో దోమకొండ, సర్వపూర్, కామారెడ్డి టౌన్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే పిట్లం, బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి టౌన్ ఏడీ పోస్టులు, బాన్సువాడ డివిజన్ డీఈ పోస్టు ఖాళీగా ఉంటున్నాయి. ఆయా స్థానాలలో ఇన్చార్జీలతో పాలన సాగుతోంది. దీంతో వినియోగదారులకు సకాలంలో సేవలందడం లేదు. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమవుతుండడంతో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా గ్రామాల వారీగా కరెంట్ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. అధికారుల పోస్టులను భర్తీ చేసి, కరెంట్ సమస్యలను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పలు ఏఈలు, ఏడీలు, డీఈ పోస్టులు ఖాళీ.. ఇబ్బందిపడుతున్న వినియోగదారులుప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం మండలాలవారీగా ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులతో పాటు ఏడీలు, డీఈ పోస్టులను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాం. ప్రభుత్వం భర్తీ ప్రక్రియ చేపడితే సమస్య పరిష్కారం అవుతుంది. అప్పటి వరకు ఇన్చార్జిలతో సేవలు కొనసాగిస్తాం. సమస్యలను వేగంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నాం. – శ్రావణ్కుమార్, ఎస్ఈ, కామారెడ్డి -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
సదాశివనగర్: మండల కేంద్రంలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు ఎస్సై రంజిత్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన కుర్మ గంగమల్లు(39) నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి తిరిగొచ్చాడు. తనకున్న ఎకరం 30 గుంటల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల తన భూమిని ప్రైవేట్ సర్వేయర్తో సర్వే చేయించగా మూడు గుంటల భూమి తక్కువ వచ్చింది. దీంతో మనస్తాపం చెందిన గంగమల్లు మంగళవారం బావి వద్ద గడ్డిమందును సేవించి, ఫోన్లో సమాచారం ఇచ్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న గంగమల్లును మొదట కామారెడ్డి ఆస్పత్రికి, తర్వాత ఎల్లారెడ్డిపేట్ అశ్విని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన సీతాపవర్ అమరనాథ్ కుటుంబసభ్యులతో కలిసి గత నెల 31న హైదరాబాద్కు వెళ్లారు. బుధవారం తిరిగి ఇంటికి వచ్చి చూస్తే తాళం పగులగొట్టి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 12 గ్రాముల బంగారం, రూ.11 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలం సిర్పూర్ శివారులో ఉన్న బాలయోగి అవధూత నిర్మలానంద స్వామి ఆశ్రమంలోని కుటీరం దగ్ధంపై ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరిగౌడ్ బుధవారం పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డ్రమ్ము చెప్పే కన్నీటి కథ
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని పలు కాలనీలలో తీవ్ర నీటి కొరత నెలకొంది. ప్రధానంగా అశోక్నగర్ కాలనీలో నీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం వచ్చిందంటే అశోక్నగర్ కాలనీలోని బోర్లు ఎత్తిపోతాయి. దీంతో నీటి సమస్య ఏర్పడుతుంది. 11 వందల ఫీట్ల మేర బోరుబావులు తవ్వించినా చుక్క నీరు రావడం లేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. బోర్లు ఎత్తిపోతుండడంతో కాలనీవాసులు వాటర్ ట్యాంకర్లపైనే ఆధారపడుతుంటారు. ట్యాంకర్ ఎప్పుడొస్తుందా అని కాలనీవాసులు ఎదురు చూస్తుంటారు. ఇళ్ల ముందు రోడ్డు పక్కన డ్రమ్ములు పెట్టుకుని నిరీక్షిస్తూ ఉంటారు. వేసవిలో నీటి కొరత కారణంగా ఆ కాలనీలో ఏ ఇంటి ముందు చూసినా నీటి డ్రమ్ములు కనిపిస్తాయి. ట్యాంకర్ రాగానే డ్రమ్ములలో నీరు నింపుకుంటారు. తర్వాత ఆ నీటిని తిరిగి ఇళ్లలోకి మోసుకువెళ్తారు. అశోక్నగర్ కాలనీవాసులు ఎదుర్కొంటున్న క‘న్నీటి’ కష్టాలను ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. పాలకులు స్పందించి నీటి సమస్యకు త్వరగా శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకేంద్రంలో తీవ్ర నీటి సమస్య ఇబ్బంది పడుతున్న ప్రజలు -
ఆశ.. నిరాశేనా?
● నాలుగు ఎకరాల వరకే అందిన పెట్టుబడి సాయం ● జిల్లాలో మరో 56 వేల మందికి అందని యాసంగి రైతు భరోసా ● నిరాశలో లబ్ధికి దూరమైన రైతులురైతులకు పంటల పెట్టుబడి విషయంలో అండగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 2018 లో రైతుబంధు పథకాన్ని తీసుకువచ్చింది. ఏటా రెండు వ్యవసాయ సీజన్లలో పెట్టుబడి సాయం అందించారు. మొదట్లో సీజన్కు ఎకరానికి రూ. 4 వేల చొప్పున రైతుబంధు ఇచ్చారు. ఆ తర్వాత దానిని రూ. 5 వేలకు పెంచారు. తాము అధికారంలోకి వస్తే ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించింది. అధికారంలోకి వచ్చాక రైతుబంధులో అనేక లోపాలు ఉన్నాయని, సాగుకు యోగ్యం కాని భూములకూ రైతుబంధు ఇచ్చారని చెబుతూ అనర్హులను ఏరివేసేందుకు ఓ కమిటీ వేసింది. అధికార యంత్రాంగం ద్వారా సాగుకు యోగ్యం కాని భూముల లెక్కలు తీశారు. రైతుబంధు పేరును రైతు భరోసాగా మార్చారు. అంతా పూర్తయ్యాక ప్రభుత్వం నిధుల కొరత కారణంగా ఎకరానికి సీజన్కు రూ.6 వేలు మాత్రమే ఇస్తామని ప్రకటించారు. మార్చి 31 వరకల్లా వంద శాతం రైతు భరోసా నిధులు జమ చేస్తామన్నారు. కానీ ఇప్పటివరకు నాలుగెకరాలలోపు భూమి ఉన్న రైతులకే పెట్టుబడి సాయం అందింది. మార్చి నెలాఖరు తర్వాత ఒక్క రైతుకూ పెట్టుబడి సాయం అందించలేదు.ఇస్తారో.. లేదో?తమ మొదటి ప్రాధాన్యత రైతు సంక్షేమమేనని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా పథకాల అమలులో మాత్రం రైతులకు నిరాశనే మిగులుస్తోంది. పంట రుణాల మాఫీతోపాటు రైతుభరోసా నిధుల విడుదల విషయంలోనూ జిల్లాలో వేలాది మంది రైతులకు మొండిచేయి చూపింది. ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమవుతున్నా.. ఇప్పటికీ జిల్లాలో సుమారు 56 వేల మందికి యాసంగి పెట్టుబడి సాయం అందలేదు. వారంతా సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. – కామారెడ్డి క్రైంరైతు భరోసా నిధుల జమ ప్రక్రియ జనవరి 26 న ప్రారంభమైంది. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాకు సంబంధించి మొత్తం 3,25,713 మంది రైతులకుగాను రూ.315.31 కోట్ల నిధులు అవసరం. మార్చి నెలాఖరు వరకు 2,70,149 మంది రైతుల ఖాతాలలో రూ. 215.98 కోట్లు జమ చేశారు. మిగిలిన సుమారు 56 వేల మందికి సంబంధించి రూ. 100 కోట్ల నిధులు విడుదల కావాల్సి ఉంది. యాసంగి సీజన్ ముగిసిపోయి ఖరీఫ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ మిగిలిన రైతులకు రైతు భరోసా అందిస్తారా లేదా అన్న విషయమై స్పష్టత లేదు. దీంతో వారంతా నిరాశకు గురవుతున్నారు. సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. గురువారం నిర్వహించే క్యాబినెట్ మీటింగ్పై ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలి
రాజంపేట : వనమహోత్సవంలో భాగంగా మండలవ్యాప్తంగా మొక్కలు నాటడానికి స్థలాలను గుర్తించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీవో రఘురాం సూచించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం త్వరగా చేపట్టేలా చూడాలన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఏపీవో అన్నపూర్ణ, ఎంఈవో పూర్ణచందర్రావు, టీఏ భాస్కర్, రాజులు పాల్గొన్నారు. -
తహసీల్దార్కు గాయాలు
● కారును ఢీకొన్న డీసీఎం వ్యాన్ పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని అంజనీ చౌరస్తా సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జుక్కల్ తహసీల్దార్ మహేందర్ కుమార్ పిట్లం నుంచి తన కారులో జుక్కల్కు వెళ్తుండగా పెద్దకొడప్గల్ మండలంలోని అంజనీ చౌరస్తా సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న తహసీల్దార్ మహేందర్కుమార్, డీసీఎం డ్రైవర్ ఖలీద్కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం తహసీల్దార్ను హైదరాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. రెవెన్యూ సిబ్బంది నాగునాథ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బంగారంతో పరారైన వర్కర్ ఖలీల్వాడి: ఆభరణాల తయారీకి ఇచ్చిన 15 తులాల బంగారం తీసుకొని ఓ వర్కర్ పరారైన ఘటన నగరంలోని ఒకటో టౌన్లో చోటు చేసుకుంది. ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. కలకత్తాకు చెందిన మహమ్మద్ మజిల్ పదేళ్లుగా నగరంలో గోల్డ్ పనులు చేస్తున్నాడు. అతని వద్ద కలకత్తా నుంచి బాబాన్ హాల్దర్ నాలుగేళ్లుగా ఆభరణాల తయారీ పనులు చేస్తున్నాడు. పనిలో భాగంగా మహమ్మద్ మజిల్ ఇచ్చిన 15 తులాల బంగారం తీసుకొని హాల్దర్ పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే కఠిన చర్యలు
కామారెడ్డి టౌన్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో మంగళవారం ప్రి కాన్సెప్షన్ మరియు ప్రి నెటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్(పీసీపీఎన్డీటీ) జిలా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లు పీసీపీఎన్డీటీ ఫామ్ ఎఫ్ను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. తర్వా ఎఫ్ సర్టిఫికెట్లను డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రతి నెల అందజేయాలని ఆదేశించారు. పోగ్రాం ఆఫీసర్ అన్ని స్కానింగ్ సెంటర్స్లను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి స్కానింగ్ కేంద్రాలలో తప్పనిసరిగా పీసీపీఎన్డీటీ చట్టం సంబంధించిన పోస్టర్లు, స్కానింగ్ రుసుము వివరాలను అతికించాలని చెప్పారు. సీసీ కెమరాలు బిగుంచుకోవాలన్నారు. పని చేయనటువంటి స్కానింగ్ యంత్రాలు ఉంటే, రిజిస్ట్రేషన్లో మార్పులు ఉంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అర్హులైన వైద్యులు మాత్రమే స్కానింగ్ చేయాలని లేకుంటే కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో జిల్లా పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనురాధ, వైద్యాధికారులు విజయశీల, శిరిష, లీగల్ నిపుణులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వైద్యులు మాత్రమే స్కానింగ్ చేయాలి డీఎంహెచ్వో చంద్రశేఖర్ -
మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
ఎల్లారెడ్డిరూరల్/ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలంలోని సోమార్పేట్ గ్రామ శివారులో గల నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో నీట మునిగి మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంగళవారం పరామర్శించారు. ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం త్వరగా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు మృత దేహాలను అప్పగించారు. అనంతరం వారి ఇంటికి వెళ్లి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందేలా చర్యలను తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా, కుడుముల సత్యనారాయణ, ప్రశాంత్గౌడ్ , విద్యాసాగర్, నునుగొండ శ్రీనివాస్, వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. అలాగే నీట మునిగి మృతి చెందిన ముగ్గురి యువకుల కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరవింద్, ఇమ్రాన్, మండల పార్టీ అధ్యక్షులు జలందర్రెడ్డి, సతీష్ తదితరులున్నారు. అమెరికాలో మృతి చెందిన యువకుడి కుటుంబ సభ్యులకు.. తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన యువకుడు గోవర్ధన్ అమెరికాలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఓదార్చారు. గోవర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
ఘరానా దొంగల ముఠా అరెస్ట్
● 39 దొంగతనాలకు పాల్పడిన 8 మంది నిందితులు ● 15 తులాల బంగారం, 4 వాహనాల స్వాధీనం ● సీసీ ఫుటేజీ ఆధారాలతో కేసు ఛేదన ● సీపీ పోతరాజు సాయిచైతన్య వెల్లడిఖలీల్వాడి: జిల్లాలో చోరీలకు పాల్పడిన ఘరానా దొంగల ముఠా సభ్యులను సీసీ ఫుటేజీల ఆధారంగా పట్టుకున్నట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన మహమ్మద్ అమేర్పై అనుమానం రావడంతో ఏసీపీ రాజావెంకట్రెడ్డి ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. అమేర్ చిన్నతనంలో పిక్ ప్యాకెట్లకు పాల్పడేవాడని, దొంగతనాలు చేసేటప్పుడు హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ ఆసిఫ్తో పరిచయం ఏర్పడింది. అబ్దుల్ ఆసిఫ్ తనకు పరిచయం ఉన్న వసీం, సోహైల్, జావీద్ ఖాన్, రియాజ్, అలీ, ఆసిఫ్ ఖాన్ను మహమ్మద్ అమేర్కు పరిచయం చేశాడు. వీరంతా గతంలో నేరాలకు పాల్పడినవారే. అందరూ కలిసి ఒక ముఠాగా ఏర్పడి పక్కా ప్రణాళికతో దొంగతనాలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముఠా సభ్యుల నగరంలోని ఆటోనగర్, ధర్మపురిహిల్స్, పెయింటర్ కాలనీ, డ్రైవర్ కాలనీ, అక్బర్నగర్ కాలనీ, శాంతినగర్లలో సుమారు 24 ఇండ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేశారు. దొంగిలించిన బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను షేక్ వసీంకు ఇచ్చేవారు. వసీం వాటిని నిజామాబాద్ రూరల్ మండలంలోని మోహన్కు అమ్మేవాడు. మోహన్ వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసేవాడు. వచ్చిన నగదును అందరూ కలిసి పంచుకునేవారు. వీరు హైదరాబాద్ శివార్లోని షాపూర్, జీడిమెట్ల పరిసర ప్రాంతాలలో 15 ఆటోలను కూడా దొంగతనం చేశారు. ముఠాసభ్యుల్లో షేక్ వసీంపై 8 కేసులు ఉండగా మీర్పేట్లో పీడీయాక్ట్ నమోదు చేశారు. షేక్ సోహైల్ అలియాస్ చార్పాట్ సోహైల్పై గతంలో 7 కేసులు, మహమ్మద్ అమేర్పై 21 కేసులు, మహమ్మద్ అబ్దుల్ ఆసిఫ్పై 10 కేసులు, జావీద్ ఖాన్ 5 కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ముఠా సభ్యులపై నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, హైదరాబాద్ నగరాలలో కేసులు నమోదైనట్లు సీపీ వెల్లడించారు. బంగారం కొనుగోలు చేసిన మోహన్పై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల నుంచి 15 తులాల బంగారం, నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులో బబ్లూ, అలీ అనే నిందితులు పరారీలో ఉన్నారని, మిగతా వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన సీఐ సురేశ్, ఎస్సై వెంకట్రావు, కానిస్టేబుళ్లను అభినందించి, రివార్డు అందజేశారు. -
మహిళ హత్య కేసు ఛేదన
బాల్కొండ: నందిపేట్ మండలం అయిలాపూర్ శివారులో గత నెల 26న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాల్కొండ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి వివరాలు వెల్లడించారు. నందిపేట్ మండలం శాపూర్కు చెందిన సాద సుమలత(42) గత నెల 26న కూరగాయల కోసం మండల కేంద్రంలో నిర్వహించే సంతకు వచ్చింది. మార్కెట్లో ఆలూర్ మండల కేంద్రానికి చెందిన వేల్పుల పెద్ద గంగాధర్తో పరిచయం ఏర్పడింది. సుమలతను అయిలాపూర్ శివారులోని వంతెన వద్దకు తీసుకెళ్లిన గంగాధర్.. అత్యాచారానికి యత్నించాడు. సుమలత విభేదించడంతో చీర కొంగుతో గొంతు నులిమి హత్య చేశాడు. 27న సుమలత శవమై కనిపించడంతో కొడుకు సాద సంజీవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కేసును ఛేదించారు. మంగళవారం మధ్యాహ్నం నిందితుడు గంగాధర్ ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తుండగా మార్గమధ్యలో బాల్కొండ మండలం చిట్టాపూర్ చౌరస్తా వద్ద పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టినట్లు సీఐ తెలిపారు. కేసును ఛేదించిన నందిపేట్ ఎస్సై చిరంజీవి, సిబ్బందిని సీఐ అభినందించారు. కాగా, గంగాధర్పై గతంలో మాక్లూర్ పోలీస్స్టేషన్లో హత్యకేసుతోపాటు దొంగతనం కేసు కూడా నమోదైంది. -
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
మీకు తెలుసా?భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), ఇతర బీమా కంపెనీలు ఏడాదికి రూ. 436 ప్రీమియంతో బీమాను అందిస్తున్నాయి.కుటుంబంలో ప్రతి ఒక్కరూ చేరవచ్చు. మరణం ఎలా సంభవించిన రూ.2 లక్షల బీమా సొమ్మును నామినీకి చెల్లిస్తారు. ఈపథకంలో ఒకసారి చేరితే 55 ఏళ్ల వరకు కొనసాగుతుంది. ఎలాంటి మెచ్యురిటీ ఉండదు. ● ఏదేని బ్యాంకులో సేవింగ్ ఖాతా ఉన్న 18 నుంచి 50 ఏళ్ల లోపు ఆధార్ కార్డు జిరాక్స్ అందజేసి పీఎంజేజేబీవైలో చేరవచ్చు. 50 ఏళ్లలోపు వారు చేరితే 55 ఏళ్ల వరకు పథకం కొనసాగుతుంది. ● ఏడాది కాలంలో ఏ నెలలో అయినా స్కీంలో చేరవచ్చు. ఖాతాలో సరైన డబ్బు నిల్వ ఉంటే ప్రతి సంవత్సం మే నెలలో ప్రీమియం ఆటో డెబిట్ అవుతుంది. ● రోజుకు ఒకరూపాయి 20 పైసలతో రెండు లక్షల జీవిత బీమా. ● స్కీంలో చేరడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. – కామారెడ్డి అర్బన్ -
టిప్పర్ ఢీకొని ఒకరి మృతి
మాక్లూర్ : ఎదురుగా వస్తున్న టీవీఎస్ ఎక్సెల్ను టిప్పర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని మాదాపూర్, బొంకన్పల్లి గ్రామాల మధ్య లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదానికి టిప్పర్ అతివేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జన్నెపల్లి నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్న టిప్పర్.. ఎదురుగా టీవీఎస్ ఎక్సెల్పై వస్తున్న ముల్లంగి (బి) గ్రామానికి చెందిన భూలోళ్ల నడిపి గంగాధర్ అలియాస్ లక్ష్మణ్ (65)ను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన లక్ష్మణ్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడి కొడుకు రాజు ఫిర్యాదు మేరకు డ్రైవర్పై కేసు నమోదు చేసి టిప్పర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో జారిపడి యువకుడు..రుద్రూర్: పొతంగల్ మండల కేంద్రంలోని చెరువులో జెట్టి గోపాల్ (21) మృతదేహం మంగళవారం లభ్యమైంది. కూలి పనులు చేసే గోపాల్ గత నెల 31న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెతుకుతుండగా స్థానిక చెరువులో మృతదేహం లభించింది. స్నానం చేసేందుకు వెళ్లిన గోపాల్ ప్రమాదవశాత్తు చెరువులో జారపడి ఉంటాడని మృతుడి సోదరి సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. -
కవిత అభిమానుల సోషల్ వార్
● లేఖలోనివి ఆరోపణలు కాదు.. నిజాలంటూ ప్రచారం ● 2019 నుంచే కవితపై జిల్లాలో కుట్రలు.. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయేలా చేశారంటున్న ఉద్యమకారులు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత రాసిన లేఖ విషయమై ఉమ్మడి జిల్లాలో గులాబీ శ్రేణులు గుంభనంగా ఉన్నప్పటికీ ఉద్యమకారులు మాత్రం సోషల్ మీడియా వేదికగా స్వరం గట్టిగా వినిపిస్తున్నారు. లేఖలో కవిత రాసిన అంశాలు ఆరోపణలు కాదని, పచ్చి నిజాలంటూ సోషల్ మీడియాలో వరుస ప్రకటనలు చేస్తున్నారు. మా ధైర్యం మీరే కవితక్క, డాటర్ ఆఫ్ ఫైటర్ అంటూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఉద్యమకారులైన కొందరు సీనియర్ కార్యకర్తలైతే మరింత ఘాటుగా సోషల్ వార్లోకి దిగారు. జిల్లాలో కవితపై 2018 నుంచే కుట్రలు మొదలయ్యాయని, 2019 లోక్సభ ఎన్నికల్లో కవిత ఓటమికి అప్పటి ఎమ్మెల్యేలే కారకులయ్యారని అందుకు తామే ప్రత్యక్ష సాక్షులమంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఉద్యమకారులందరం కవిత వెంటే ఉంటామంటున్నారు. కవిత ఉనికిని ఓర్వలేని కొందరు మాజీ ప్రజాప్రతినిధులు.. పలువురు ఉద్యమకారులను పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేసినట్లు, కవితకు కమ్యూనికేట్ కాకుండా చేసినట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నగరానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించడమే కాకుండా కవిత ఫొటోలను డీపీలుగా పెట్టుకోవద్దు, మా సోదరుడి ఫొటోను మాత్రమే పెట్టుకోవాలంటూ బెదిరించినట్లు చెబుతున్నారు. ఈ మాజీ ఎమ్మెల్యే సోదరుడు షాడో మాదిరిగా వ్యవహరించడమే కాకుండా దళితబంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇతర పథకాల్లో చాలామంది వద్ద భారీగా డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. పీఆర్వోనే లేఖ లీక్ చేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్.. కవితకు పీఆర్వోగా ఉన్న రాజేష్ అనే వ్యక్తి కేసీఆర్కు రాసిన లేఖను లీక్ చేసినట్లు తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఈ విషయమై కేటీఆర్, హరీశ్రావు టీములకు సాక్ష్యాధారాలతో పూర్తి వివరాలు తెలిసినట్లు వీడియోలో ఉంది. ఈ పీఆర్వోనే కవితకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని బయటకు విడుదల చేసినట్లు ఇందులో ఉంది. కేటీఆర్, హరీశ్రావులపై సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయించినట్లు పేర్కొన్నారు. తాజాగా కాంగ్రెస్లోని ఓ నాయకుడికి కోవర్టుగా మారి, కేటీఆర్, హరీశ్రావులకు వ్యతిరేకంగా జాతీయ మీడియాలో ప్రశ్నలు అడిగేలా ఈ పీఆర్వో చేసినట్లు ఇందులో పేర్కొన్నారు. కవితను ఎక్కువగా జాతీయ మీడియాలో కనిపించాలని ప్రేరేపించినట్లు వీడియోలో వివరించారు. తాజాగా కవిత రాసిన లేఖను సైతం ఈ పీఆర్వో రాజేషే తనకు సన్నిహితుడైన మీడియా పర్సన్ ద్వారా లీక్ చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ మీడియా పేరిట కవిత వద్ద భారీగా డబ్బులు దండుకున్న ఇతను హైదరాబాద్ శివార్లలో విల్లా కొనుగోలు చేసినట్లు వైరల్ అవుతోంది. ఈ వీడియోను కేటీఆర్, హరీశ్రావులకు పంపినట్లు ఉద్యమకారులు చెబుతున్నారు. -
అనారోగ్యంతో ఒకరు.. నీట మునిగి మరొకరు..
తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఐతె సామెల్ దంపతులకు ఇద్దరు కుమారులు. మతిస్థిమితం సరి గ్గాలేని పెద్ద కుమారుడు సాయిబాబు నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. చిన్న కొడు కు నవీన్ బైక్ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబాని కి ఆసరాగా ఉంటున్నాడు. అతడైనా వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకుంటే.. సోమవారం ని జాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోయా డు. ఇలా ఇద్దరు కుమారులు కళ్లముందే మరణించడంతో సామెల్ దంపతులకు తీరని గర్భశోకం మిగిలింది. తిమ్మారెడ్డిలో విషాదఛాయలు వేర్వేరు కారణాలతో కొద్దిరోజుల వ్యవధిలో తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. పైచదువుల కోసం అమెరికాకు వెళ్లిన గోవర్ధన్(28).. అక్కడ గతనెల 29న అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన నవీన్ (23) నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో నీట మునిగి మృతి చెందాడు. కొద్ది గంటల తేడాలోనే ఇద్దరు యువకుల మృతదేహాలు గ్రామానికి చేరుకున్నాయి. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
● నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి ముగ్గురి మృత్యువాత ● మూడు కుటుంబాల్లో తీరని విషాదం
నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మృతదేహాల కోసం గాలిస్తున్న ఫైర్ సిబ్బంది, మృతుల బంధువులు హర్షవర్ధన్ (ఫైల్)నవీన్ (ఫైల్)మధుకర్గౌడ్ (ఫైల్)ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్ : సరదాగా క్రికెట్ ఆడిన యువకులు.. ఈత కొట్టేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్లి నీట మునిగి మృతిచెందారు. ఈ ఘటన మూడు కుటుంబాలలో విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డి మండలానికి చెందిన 11 మంది యువకులు సోమవారం సోమార్పేట్ గ్రామ శివారులో క్రికెట్ ఆడారు. అనంతరం స్నానం చేసేందుకు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో దిగారు. వీరిలో ఎల్లారెడ్డికి చెందిన మధుకర్గౌడ్(17), సోమార్పేట్కు చెందిన హర్షవర్ధన్(17), తిమ్మారెడ్డికి చెందిన నవీన్(23) గల్లంతయ్యారు. మిగతావారు ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. గల్లంతైనవారి కుటుంబ సభ్యులు పోలీసుల సహకారంతో నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో గాలించేందుకు ప్రయత్నించినా అప్పటికే చీకటి పడడంతో వెనుదిరిగారు. మంగళవారం ఉదయం ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్లో వలలతో గాలించారు. మొదట మధుకర్గౌడ్ మృతదేహం లభ్యమయ్యింది. మధ్యాహ్న సమయంలో నవీన్, హర్షవర్ధన్ల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం నిజాంసాగర్ పోలీసులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిన్నంటిన రోదనలు గల్లంతైనవారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు బ్యాక్వాటర్ ప్రాంతానికి చేరుకున్నారు. చెట్టంత కొడుకులు కళ్లముందు విగత జీవులుగా కనిపించడంతో మృతుల కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. వారి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. గాలింపు చర్యలను పట్టించుకోని అధికారులు ముగ్గురు యువకులు గల్లంతైనా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. ఫైర్ సిబ్బందితో పాటు మృతుల బంధువులు వలల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అధికారుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు.రోదిస్తున్న మధుకర్గౌడ్ కుటుంబ సభ్యులుఒక్కగానొక్క కుమారుడు.. సోమార్పేట గ్రామానికి చెందిన గూల రాజలింగం దంపతులకు హర్షవర్ధన్ (17) ఒక్కడే కొడుకు. ఇంటర్ చదువుతూ అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. సోమవారం సరదాగా ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లాడు. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కిషన్గౌడ్ పెద్ద కొడుకు మధుకర్గౌడ్ (17) ఇంటర్ చదువుతున్నాడు. తోటి వారితో ఆటపాటలతో సరదాగా ఉండేవాడు. స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్లిన మధుకర్.. నిజాంసాగర్ బ్యాక్వాటర్లో మునిగి చనిపోవడంతో అతడి కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు. -
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
కామారెడ్డి క్రైం : బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించా రు. ఈనెల 7న బక్రీద్ నేపథ్యంలో మంగళవారం క లెక్టరేట్లో ముస్లిం మత పెద్దలు, వివిధ శాఖల అధికారులతో శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శాంతి భ ద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు సమాచారం ఇ వ్వాలని సూచించారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని పోలీ సు శాఖకు సూచించారు. గోవులను, వాహనాలను సీజ్ చేసిన సందర్భాల్లో గోవులను గోశాలకు తరలించడం, వాటికి ఆహారం అందించడం లాంటివి మున్సిపల్ శాఖ చూడాలన్నారు. సోషల్ మీడియా లో వచ్చే వార్తల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ రాజే శ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యరె డ్డి, ఆర్డీవో వీణ, శాఽఖల అధికారులు పాల్గొన్నారు. -
యోగా డే ను విజయవంతం చేయాలి
కామారెడ్డి అర్బన్ : ఈనెల 21 న నిర్వహించే యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయా లని ఆర్డీవో వీణ సూచించారు. అంతర్జాతీ య యోగా దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం ఆయుష్ ఆధ్వర్యంలో పతంజలి యోగా అసోసియేషన్ సహకారంతో జిల్లా కేంద్రంలో యోగా వాక్ నిర్వహించారు. ము న్సిపల్ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వ రకు వాక్ సాగింది. ఇందిర చౌక్లో మానవహారం నిర్వహించి యోగా నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ యోగాతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. రోజూ యోగాసాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయుష్ డీపీఎం ఆకుల శ్రీకాంత్, వైద్యాధికారులు వెంకటేశ్వర్లు, దేవయ్య, నీలిమ, వి జయ, చైతన్య, విజయలక్ష్మి, నహీద, యోగా గురువులు అంజయ్య గుప్తా, యెల్లంకి సుద ర్శన్ తదితరులు పాల్గొన్నారు. 8న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పరుగు పోటీలు కామారెడ్డి అర్బన్: సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 8న హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పరుగు పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా యువజన, క్రీడల అధికారి జగన్నాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. 3, 5, 21 కిలోమీటర్ల పరుగు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అథ్లెట్లు 98494 93010 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ‘ప్రభుత్వ బడులలో చేర్పించాలి’ కామారెడ్డి టౌన్: పిల్లలను ప్రభుత్వ బడుల లో చేర్పించాలని డీఈవో రాజు తల్లిదండ్రులను కోరారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యా య సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన ‘ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించండి –సంస్కారంతో పాటు నాణ్యమైన విద్యను పొందండి‘ బడిబాట పోస్టర్లను మంగళవారం జిల్లాకేంద్రంలోని డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్న తపస్ జిల్లా శాఖను డీఈవో అభినందించారు. కార్యక్ర మంలో తపస్ జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి, ప్రతినిధులు రామచంద్రం, లక్ష్మీపతి, ఆంజనేయులు, రాజశేఖర్, సత్యనారాయణ, పవన్ కుమార్, దత్తాచారి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. హెల్త్కేర్ మేనేజ్మెంట్ కోర్సు మంజూరు కామారెడ్డి అర్బన్ : జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు బీఎస్సీ హెల్త్కేర్ మేనేజ్మెంట్ కోర్సు మంజూరైందని ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. కళాశాలలో ఇప్పటికే డిగ్రీలో బీఎస్సీ ఫిజికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్స్, ఆనర్స్ కోర్సులున్నాయని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ హెల్త్కేర్ మేనేజ్మెంట్ 60 సీట్లతో ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కోర్సులో చేరాలనుకునేవారు దోస్త్లో ఈనెల 8 వరకు(కళాశాల కోడ్: 5009) ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. నేడు విగ్రహ ప్రతిష్ఠాపన బిచ్కుంద: మండల కేంద్రంలోని తక్కడ్పల్లి రోడ్డులో 300 ఏళ్ల నాటి పురాతన శివాలయ పునర్నిర్మాణం పూర్తయ్యింది. బుధవారం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించనున్నారు. సుమారు 150 ఏళ్లుగా పూజలకు నోచుకోని ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావడానికి బిచ్కుందకు చెందిన జంగం నాగరాజ్ ముందుకు వచ్చారు. రూ. 40 లక్షల సొంత డబ్బులతో ఆలయాన్ని పునర్నిర్మించారు. గర్భగుడిలో ఆరడుగుల శిల్పాలున్నాయి. వాటిని అలాగే ఉంచి పక్కనుంచి కొత్తగా గోడలను నిర్మించారు. బుధవారం నుంచి మూడు రోజులపాటు విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు నిర్వహిస్తామని జంగం నాగరాజ్ తెలిపారు. బండాయప్ప మఠం పీఠాధిపతి శ్రీసోమాయప్ప స్వామీజీ చేతుల మీదుగా కార్యక్రమాలు సాగుతాయన్నారు. -
నైపుణ్యాభివృద్ధి కోసం..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్యార్థులలో నైపుణ్యాల ను అభివృద్ధి చేసి బతుకుబాట చూపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్డ్ టె క్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా అప్గ్రేడ్ చేస్తోంది. జి ల్లాలో ఇప్పటికే బిచ్కుంద, ఎల్లారెడ్డిలలోని ప్రభు త్వ ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా మార్చింది. మి గిలిన రెండు నియోజకవర్గాలలోనూ ఏటీసీల ఏ ర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాగా ఆ యా కళాశాలల్లో వివిధ కోర్సులలో ప్రవేశాలకోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. దరఖాస్తు విధానం... ● పదో తరగతి/ఎనిమిదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 2025 ఆగస్టు 1 నాటికి 14 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు. ● ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒకే దరఖాస్తు ద్వారా రాష్ట్రంలోని ఏదైనా ఐటీఐ/ఏటీసీకి వెబ్ ఆప్షన్లను ఎంచుకునే అవకాశం ఉంది. https://iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు వంద రూపాయలు చెల్లించాల్సి ఉంటుంద. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ తప్పనిసరి ఇవ్వాలి. దరఖాస్తులో ఇచ్చిన సమాచారం మారితే సీటు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఎంపికై న అభ్యర్థుల రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందుతుంది. మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రభుత్వం విద్యార్థులలో నై పుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను క ల్పించడానికి చర్యలు తీసు కుంటోంది. ఇందులో భా గంగా ఐటీఐ కళాశాలలను ఏటీసీలుగా మారుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో అందిస్తున్న కోర్సుల్లో చేరినవారికి మంచి భవిష్యత్ ఉంటుంది. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – ప్రమోద్కుమార్, ప్రిన్సిపల్, ఏటీసీ, బిచ్కుందఏటీసీల్లోని కోర్సులు, సీట్ల వివరాలు..బిచ్కుంద ఏటీసీలో మాన్యుఫాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నిషియన్ కోర్సులలో 40 సీట్ల చొప్పున ఉన్నాయి. ఏడాది వ్యవధిగల ఈ 2 కోర్సులకు పదో తరగతి చదివిన వారు అర్హులు. ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. పదో తరగతి చదివిన వారు అర్హులు. ఇదీ ఏడాది కోర్సే. బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ (మెకానిక్), అడ్వాన్స్డ్ సీఎస్సీ మిషనింగ్ టెక్నిషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ కోర్సులలో 24 చొప్పున సీట్లు ఉన్నాయి. రెండేళ్ల కాలవ్యవధిగల ఈ కోర్సులకు పదో తరగతి చదివినవారు అర్హులు. ఎల్లారెడ్డి ఏటీసీలో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కోర్సులో 19 సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో.. ఎల్లారెడ్డిలోని ఆదిత్య ఐటీఐ కళాశాలలో ఫిట్టర్ కోర్సులో 20 సీట్లు, డీజిల్ మెకానిక్ కోర్సులో 24 సీట్లున్నాయి. కామారెడ్డిలోని ఇంజినీర్స్ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ కోర్సులో 20 సీట్లు ఉన్నాయి. కామారెడ్డిలోని శ్రావణి ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ కోర్సులో 120 సీట్లు, ఫిట్టర్ కోర్సులో 20 సీట్లు, డీజిల్ మెకానిక్ కోర్సులో 48 సీట్లు ఉన్నాయి. బాన్సువాడలోని శ్రీ బాలాజీ ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ కోర్సులో 80 సీట్లు, డీజిల్ మెకానిక్ కోర్సులో 24 సీట్లు, రేడియాలజీ టెక్నిషియన్ కోర్సులో 20 సీట్లు, సియూంగ్ టెక్నాలజీలో 40 సీట్లు ఉన్నాయి. బిచ్కుంద, ఎల్లారెడ్డి ఐటీఐ కాలేజీలను ఏటీసీలుగా మార్చిన సర్కారు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ జిల్లాలో మరో రెండు ఏటీసీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు -
మీసేవ సర్టిఫికెట్లు పొందండి ఇలా..
డొంకేశ్వర్(ఆర్మూర్): విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ప్రవేశాలు, దరఖాస్తుల కోసం విద్యార్థులకు కుల, ఆదాయ, నివాస ధృవపత్రాలు తప్పనిసరి. వీటి కోసం మీసేవ కేంద్రాల్లో ఏవిధంగా దరఖాస్తు చేయాలి? ఏయే పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి? అనే వివరాలు మీ కోసం.. కులం (క్యాస్ట్) సర్టిఫికెట్● ఆధార్తోపాటు టెన్త్ మెమో లేదా బోనాఫైడ్/ పుట్టిన తేదీ సర్టిఫికెట్ జత చేయాలి. ● దరఖాస్తుదారునిది పాత కులం సర్టిఫికెట్ లేదా కుటుంబసభ్యుల్లో ఎవరిదైనా ఒకరిది. ఆదాయం (ఇన్కమ్) సర్టిఫికెట్ ● ఆధార్ కార్డు /ఓటరు కార్డు, రేషన్ కార్డు ● ఒక పాస్పోర్టు సైజు ఫొటో నివాస సర్టిఫికెట్ ● ఆధార్కార్డు /ఓటరు కార్డు / ఇంటిపన్ను రసీదు/ కరెంట్ బిల్లు ● ఒక పాస్ పోర్టు సైజు ఫొటో పె ధృవపత్రాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు మీసేవ కేంద్రాల్లోనే లభిస్తాయి. ఆన్లైన్లో దరఖాస్తు పూర్తయిన తర్వాత ఆ ఫారాన్ని స్థానిక తహసీల్ కార్యాలయంలో అందజేయాలి. అధికారులు పరిశీలించి నిర్ణీత గడువులోపు ఆమోదిస్తారు. అనంతరం మీ సేవ కేంద్రంలోనే సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవాలి. -
యూనివర్సిటీలు సంపద సృష్టి కేంద్రాలుగా ఎదగాలి
● తెయూ వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరి రావు తెయూ(డిచ్పల్లి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. వీసీ ప్రొఫెసర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరితో కలిసి పరిపాలనా భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో యూనివర్సిటీలు గ్రోత్ ఇంజిన్లుగా పనిచేస్తూ సంపద సృష్టి కేంద్రాలుగా ఎదగాలని సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా ఏర్పడిన రాష్ట్రం నేడు అభివృద్ధి చెందుతూ దేశానికే రోల్మోడల్గా ఉండటం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, కంట్రోలర్ కే సంపత్ కుమార్, అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్, అధ్యాపకులు సీహెచ్ ఆంజనేయులు, కే రవీందర్రెడ్డి, లక్ష్మణచక్రవర్తి, సంపత్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ సాయాగౌడ్, ఏఈ వినోద్, కాంట్రాక్టు అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, అవుట్సోర్సింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభ చూపిన విద్యార్థులకు సన్మానం
దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం ఇటీవల పదో తరగతిలో 100 శాతం ఫలితాలు సాధించగా వారిలో ఉత్తమ ప్రతిభతో జిల్లాలో ర్యాంకు సాధించిన విద్యార్థులను సన్మానించారు. పదవ తరగతి ఫలితాల్లో పాఠశాలకు చెందిన ఉడేం రాములు 558 మార్కులు, నందకిషోర్ 551 మార్కులు, సాయిచరణ్ 536 మార్కులు సాధించగా వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధలక్ష్మీ, ఉపాధ్యాయులు బాపురెడ్డి, వెంకటరెడ్డి, సుజాతరాణి, ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో చదివితే మంచిర్యాంకులు సాధించవచ్చు తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారం క్రమశిక్షణతో చదివినట్లయితే మంచిర్యాంకులు సాధించవచ్చని ప్రిన్సిపల్ సురేఖ అన్నారు. తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో చదివి ఎంసెట్లో ర్యాంకు సాధించిన విద్యార్థిని లక్కపాటి లాస్యను సోమవారం సన్మానించారు. కార్యక్రమంలో అధ్యాపకులు స్రవంతి, దివ్యవాణి, లాస్య తల్లి లక్కపాటి విజయ, మానవహక్కుల సంఘంజిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి సోమనాథ్, గంగామురళి, జశ్వంత్, సిబ్బంది పాల్గొన్నారు. పాల్వంచ విద్యార్థులకు ప్రశంసలు మాచారెడ్డి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ పాల్వంచ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనతోపాటు సైన్స్ ఎగ్జిబిట్స్ను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులను ప్రశంసించి జ్ఞాపికను అందించారని హెచ్ఎం గోవర్ధన్రెడ్డి తెలిపారు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురి ఆత్మహత్య
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన బొంత నందిని(16) కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని మత్తడికింది పల్లెకు చెందిన నందిని తరచూ ఫోన్ చూస్తోందని తల్లిదండ్రులు శెణవ్వ, పోచయ్య మందలించారు. దీంతో మనస్తాపం చెందిన నందిని ఆదివారం రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటి తలుపులకు గొళ్లెం పెట్టి వెళ్లిపోయింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు లేచి చూడగా బయట నుంచి తలుపులకు గొళ్లెం పెట్టి ఉంది. నందిని కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో లింగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మధ్యాహ్నం లింగంపేటలోని చీరపేండ్ల కుంటలో నందిని మృతదేహం లభించింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తండ్రి మందలించాడని.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని సీతాయిపల్లి గ్రామానికి చెందిన మొగుళ్ల అనిల్ కుమార్(24) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. అనిల్కుమార్ మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఏదైనా పని చేయాలని తండ్రి సాయిలు ఆదివారం మందలించడంతో రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్కు తరలిస్తుండగా సోమవారం మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అగ్రస్థానమే లక్ష్యం
పరిష్కారం లభించేనా?వాతావరణం ఉదయం ఆహ్లాదకరమైన గాలులు వీస్తాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత పెరుగుతుంది. రాత్రి నిర్మలంగా ఉంటుంది.మంగళవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2025రేపటినుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు బాన్సువాడ రూరల్: డిగ్రీ ఫస్టియర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను బుధవారంనుంచి నిర్వహించనున్నట్లు బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల(అటానమస్) ప్రిన్సిపల్ వేణుగోపాలస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 13 నుంచి మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రాక్టికల్స్ సెంటర్ పరిశీలన కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ ప్రాక్టికల్స్ సెంటర్ను సోమవారం ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళవారం నుంచి 6వ తేదీ వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశామన్నారు. నేడు యోగా వాక్ కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం ఉదయం యోగా వాక్ నిర్వహించనున్నట్లు ఆయుష్ డీపీఎం ఆకుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటలకు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద యోగా నడక ప్రారంభమవుతుందని, స్టేషన్ రోడ్డు మీదుగా రైల్వే స్టేషన్ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు యోగా వాక్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డీఎస్పీ ఆఫీస్ ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి డీఎస్పీ ఆఫీస్ను మార్చారు. ఇన్నాళ్లు డీఎస్పీ కార్యాలయం ప్రైవేటు బిల్డింగ్లో కొనసాగుతూ వచ్చింది. నూతన కార్యాలయంలో డీఎస్పీ శ్రీనివాస్రావు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేష్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలి కామారెడ్డి టౌన్: పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి కోరారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చేపట్టిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో ప్రారంభో త్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం 100 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఏఈ శంకర్, ఆర్వో రవిగోపాల్, టీపీవో గిరిధర్, సానిటరీ ఎస్సైలు నగేష్, పర్వేజ్, సిబ్బంది పాల్గొన్నారు. వెల్లుట్లపేటలో ఘనంగా రాజరాజేశ్వర విగ్రహ ప్రతిష్ఠ ఎల్లారెడ్డిరూరల్: వెల్లుట్లపేట గ్రామ శివారు లోని చెనింగ రాజరాజేశ్వరాలయంలో శివుడి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని సోమవా రం ఘనంగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో మూడు రోజులుగా ఉత్సవాలు సాగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా గణపతి, శివుడు, పార్వతిమాత, సుబ్రహ్మణ్యస్వామి, నవగ్రహాలు, నంది, నాగరాజుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. కా ర్యక్రమంలో హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పాల్గొన్నారు. భక్తులు సన్మార్గంలో నడవాలని సూచించారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం : అన్ని రంగాలలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్(టీజీటీడీసీ) చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హౌజింగ్బోర్డు వద్ద ఉన్న తెలంగాణ అమర వీరుల స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పటేల్ రమేశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు. కామారెడ్డిని నేరరహిత జిల్లాగా మార్చడానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. జిల్లాలో అమలు చేస్తున్న పథకాలను ఆయన తన ప్రసంగంలో ఏకరువు పెట్టారు. ఆ వివరాలు.. ● జిల్లాలో ఇందిర మహిళా శక్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రూ.169.29 కోట్లతో 12,905 యూనిట్లు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.76 కోట్లతో 149 యూనిట్లను మంజూరు చేశాం. వాటి ద్వారా మహిళలు ఉపాధి పొందుతున్నారు. ● రైతులకు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున నాలుగు రైతు వేదికలలో దృశ్య శ్రవణ సౌకర్యాన్ని కల్పించి 53 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాం. ● జిల్లాలో అకాల వర్షాలతో 493 మంది రైతులకు సంబంధించిన 480 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.48 లక్షలు బాధిత రైతుల ఖాతాల్లో జమ చేశాం. ● 1,01,535 మంది రైతులకు సంబంధించి రూ.733.22 కోట్ల పంట రుణాలను మాఫీ చేశాం. ● జిల్లాలో 1,072 మంది రైతులు చనిపోగా 693 మంది రైతుల నామినీల ఖాతాల్లో రూ.34.65 కోట్లు జమ చేశాం. ● 11,153 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 2,894 నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. 144 ఇళ్లు బేస్మెంట్ లెవల్ వరకు పూర్తి కావడంతో లబ్ధిదారులకు రూ.1.09 కోట్లు చెల్లించాం. ● అమృత్–2 పథకంలో భాగంగా జిల్లాలోని మూడు మున్సిపాలిటీలలో రూ.180 కోట్లతో చేపట్టిన నీటి సరఫరా పనులు పురోగతిలో ఉన్నాయి. ● జిల్లాలో 2,56,732 రేషన్కార్డులకు ఏప్రిల్లో 5,571 మెట్రిక్ టన్నులు, మేలో 5,787 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ చేశాం. జూన్, జూలై, ఆగస్టు మాసాలకుగాను 17,711 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తాం. ● రూ.500 లకు గ్యాస్ సిలిండర్ పథకం కింద జిల్లాలో 1,50,131 మందికి 5,58,981 సిలిండర్లను పంపిణీ చేశాం. దీనికి రూ.16.05 కోట్లు ఖర్చు చేశాం. ● ఆర్టీసీలో కల్పించిన ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు రూ. 137 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. ● జిల్లాలో 3,889 మందికి రేషన్కార్డులు మంజూరయ్యాయి. అలాగే రేషన్ కార్డులలో 45,344 మంది కుటుంబ సభ్యుల పేర్లు యాడ్ అయ్యాయి. ● చేయూత పథకం ద్వారా జిల్లాలో 1.62 లక్షల మందికి ప్రతినెలా రూ.36.22 కోట్లు అందిస్తున్నాం. ● గృహజ్యోతి పథకం ద్వారా జిల్లాలో 1,57,656 కుటుంబాలకు 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. దీనికోసం ప్రభుత్వం రూ.5.68 కోట్లు ఖర్చు చేస్తోంది. ● జిల్లాలో ఏడాది కాలంలో 17,611 మంది నిరుపేదలకు శస్త్ర చికిత్సలు, చికిత్సల గురించి రూ.42 కోట్లు ఆరోగ్య శ్రీ ద్వారా ఖర్చు చేశాం. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్సవాలలో వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. వారికి జ్ఞాపికలు అందించి అభినందించారు. అభివృద్ధిపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆహూతులు సందర్శించారు. ఉత్సవాలలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అడిషనల్ కలెక్టర్లు చందర్నాయక్, విక్టర్, డీఎఫ్వో నిఖిత, ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, వివిధ శాఖల అఽధికారులు పాల్గొన్నారు.భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టం తెచ్చాం. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో లింగంపేట మండలాన్ని ఎంపిక చేశాం. 23 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాం. 4,225 దరఖాస్తులు రాగా వాటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తున్నాం.మాట్లాడుతున్న పటేల్ రమేశ్రెడ్డిడ్రోన్ పనితీరును ఆసక్తిగా తిలకిస్తున్న అతిథులు● యాసంగిలో 3.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనగోలు చేసి రూ.800.71 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశాం. మహిళలకు ఎక్కువ కేంద్రాలను కేటాయించడం ద్వారా వారు రూ.3.20 కోట్లు లబ్ధిపొందారు. 27,795 మంది రైతుల నుంచి 1.79 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం వడ్లను కొనుగోలు చేశాం. వాటికి రూ.83 కోట్లను బోనస్గా చెల్లిస్తాం. యాసంగి సీజన్లో 2.70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.216 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశాం. 24 జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి 30,202 మెట్రిక్ టన్నుల జొన్నలను కొనుగోలు చేశాం. రైతులకు రూ.102 కోట్లు చెల్లించాం. 653 మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు విత్తనాలను కొనుగోలు చేసి రూ.5 కోట్లను రైతులకు చెల్లించాం. ఖరీఫ్ సీజన్లో 5,067 మంది రైతుల నుంచి లక్ష క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసి రూ.74 కోట్లు చెల్లించాం. ‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’..కామారెడ్డి క్రైం: ‘నాణ్యమైన విత్తనం.. రైతన్నకు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని 8 మంది రైతులకు విత్తన కిట్ (విత్తనాల బస్తా)లను అందించారు. విత్తు కొద్దీ పంట అనే నానుడిని నిజం చేస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని డీఏవో తిరుమల ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని 25 మండలాల పరిధిలో ఉన్న ప్రతి రెవెన్యూ గ్రామానికి ముగ్గురు రైతులను ఎంపిక చేసి వారికి నాణ్యమైన వరి, పెసర విత్తనాలు అందజేస్తామన్నారు. రైతులు ఈ విత్తనాలతో సాగు చేసి, పండిన పంటను ఇతర రైతులకు విత్తనాలుగా అందించడం ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. విత్తన లభ్యతను పెంచడమే కాకుండా నాణ్యమైన విత్తనంపై రైతులకు అవగాహన కల్పించడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మండలానికి ఒక శాస్త్రవేత్తను నియమిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి, శాస్త్రవేత్త ఏనుగు అనిల్రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.భూభారతి అమలుకోసం ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి సదస్సులు నిర్వహించింది. అందులో లింగంపేట మండలం ఒకటి. అధికారులు సదస్సులు నిర్వహించి భూభారతిపై రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. లింగంపేట మండలంలో మొత్తం 4,225 ఫిర్యాదులు రాగా దాదాపు వెయ్యి సమస్యలను అధికారులు పరిష్కరించారు. మిగతావి పరిశీలనలో ఉన్నాయి. దీని బట్టి చూస్తే చిన్నచిన్న సమస్యలకు వెంటనే పరిష్కారాలు దొరికే అవకాశాలున్నాయి. సర్వేలు, నివేదికలు తయారు చేయాల్సిన వాటి విషయంలో కాస్త ఆలస్యం జరగవచ్చు. హైకోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి సాదాబైనామాలను ఇప్పట్లో పరిష్కరించే అవకాశం లేదు. వాటితో పాటు కోర్టులో ఉన్న కేసులు మినహా మిగతా భూసమస్యలకు రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం దొరుకుంతుందని ఆశిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు అనుభవంతో.. లింగంపేట మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించి రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో సదస్సుల నిర్వహణలో జిల్లా యంత్రాగానికి మంచి అనుభవం వచ్చింది. రైతుల నుంచి ఎక్కువగా ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి, సమస్యల పరిష్కారాలకు తీసుకోవాల్సిన చర్యలు ఏ విధంగా ఉండాలి తదితర అంశాలపై జిల్లా అధికారులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. లింగంపేట మండలంలో ఎదురైన అనుభవాలతో జిల్లాలోని మిగతా మండలాల అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించారు. బృందాల ఏర్పాటు.. జిల్లాలో లింగంపేట మినహా మిగిలిన అన్ని మండలాల్లో బుధవారం నుంచి 20వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. ప్రతి మండలానికి అక్కడి పరిస్థితులు, అవసరాలను బట్టి అధికారులను సర్దుబాటు చేస్తూ రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తహసీల్దార్, ఉప తహసీల్దార్లు ఆయా బృందాలకు బాధ్యులుగా ఉంటారు. వారు ప్రణాళిక ప్రకారం కేటాయించిన తేదీల్లో గ్రామాలకు చేరుకుని సదస్సులు నిర్వహిస్తారు. స్థానికంగా ఉండే రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తారు. పట్టా పాస్ పుస్తకాలు, రికార్డుల్లో తప్పులు, సర్వే నంబర్లు, విస్తీర్ణంలో తప్పులు, అటవీ, రెవెన్యూ భూమి సరిహద్దుల వివాదాలు, వారసత్వ హక్కులు, పట్టా మార్పిడులు, రికార్డుల్లో నమోదు కాని భూములు తదితర అన్ని రకాల సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఫిర్యాదులపై విచారణకు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తారు. వీలయినంత త్వరగా, పారదర్శకంగా భూ సమస్యలకు పరిష్కారం చూపడమే ఈ సదస్సుల నిర్వహణ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగాను ఇప్పటికే ఆయా మండలాల్లో పర్యటించాల్సిన బృందాల ఎంపిక, గ్రామాల వారీగా ప్రణాళిక పూర్తి చేశారు.న్యూస్రీల్ తెలంగాణ రైజింగ్–2047 విజన్తో ముందుకు వెళ్తున్నాం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం టీజీటీడీసీ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు నేటి నుంచి రెవెన్యూ సదస్సులు అన్ని గ్రామాల్లో నిర్వహణకు ఏర్పాట్లు భూ సమస్యలపై రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్న అధికారులు కార్యాచరణ సిద్ధం చేసిన యంత్రాంగంభూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు తీసుకువచ్చిన భూభారతి చట్టం అమలుకోసం అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి సర్కారు సిద్ధమయ్యింది. అధికారులు మంగళవారంనుంచి ఈనెల 20వ తేదీ వరకు అన్ని గ్రామాలలో సదస్సులు నిర్వహించి రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. ఈసారైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందేమోనని బాధిత రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. – కామారెడ్డి క్రైంఏర్పాట్లు పూర్తయ్యాయి అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరుగనున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. సదస్సులను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళికా బద్ధంగా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తాం. – మస్రూర్ అహ్మద్, ఏవో, కామారెడ్డి కలెక్టరేట్ -
లంపి స్కిన్ సోకిన ఆవులకు వ్యాక్సినేషన్
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో సంచరిస్తున్న పశువులకు లంపి స్కిన్ వ్యాధి సోకి ఇతర మూగ జీవాలకు వ్యాప్తి చెందుతున్న ఘటనపై సోమవారం ప్రచురితమైన కథనానికి పశువైద్యశాఖ అధికారులు స్పందించారు. సోమవారం మండల పశువైద్యాధికారి రవికిరణ్ వీక్లీమార్కెట్, శివాలయం వద్ద ఆవులను పరిశీలించారు. లంపి స్కిన్ సోకిన ఆవులను గుర్తించి వాటికి చికిత్సతో పాటు వ్యాక్సిన్ వేశారు. మిగతా ఆవులను పరిశీలించారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలలకు పుస్తకాల పంపిణీఎల్లారెడ్డిరూరల్/లింగంపేట/నిజాంసాగర్ : ఎల్లారెడ్డి మండలం ప్రభుత్వ పాఠశాలలకు ఎంఈవో రాజులు సోమవారం పుస్తకాలను అందించారు. పాఠశాలలు ప్రారంభం కానున్న దృష్ట్యా మండల కేంద్రానికి పుస్తకాలు రావడంతో వాటిని మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయుల ద్వారా అందించారు. . అలాగే లింగంపేట మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు ఎంఈవో షౌకత్అలీ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మండలంలోని ఆయా పాఠశాలలకు 21వేల పాఠ్య పుస్తకాలు వచ్చినట్లు తెలిపారు. నిజాంసాగర్ విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈవో తిరుపతి రెడ్డి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. 2025–26 విద్యాసంవత్సరానికి గాను ప్రభుత్వ పరంగా 80 శాతం మేర పాఠ్యపుస్తకాలను సరఫరా చేసిందని ఎంఈవో తిరుపతి రెడ్డి తెలిపారు. విద్యశాఖ కార్యాలయానికి వచ్చిన పుస్తకాలను పాఠశాలల వారిగా ప్రధానోపాధ్యాయులకు అందజేశామన్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు పుస్తకాలను అందించాలని ఉపాధ్యాయులకు ఎంఈవోలు సూచించారు. బస్సు ఆపమన్నందుకు ఒకరిపై దాడి నవీపేట: మండలంలోని యంచ గ్రామంలో ఆర్టీసీ బస్సును ఆపమన్నందుకు డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడని బాధితులు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భైంసా నుంచి నిజామాబాద్కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కేందుకు యంచ మాజీ సర్పంచ్ కొట్టాల లహరి, ఆమె భర్త ప్రవీన్తోపాటు కుటుంబ సభ్యులు బస్టాండ్లో ఉన్నారు. బస్సును ఆపకపోవడంతో సర్పంచ్ భర్త ప్రవీన్ కొద్ది దూరం ముందుకు వెళ్లి బస్సుకు అడ్డుగా నిలబడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్.. ప్రవీన్పై దాడికి పాల్పడి గాయపర్చాడు. దీంతో ప్రవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ
బాన్సువాడ రూరల్: ప్రతి రైతుకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్కలెక్టర్ కిరణ్మయి, వ్యవసాయ అధికారులతో కలిసి పలువురు రైతులకు ఉచితంగా ఫౌండేషన్ సీడ్ పంపిణీ చేశారు. వర్షాకాలం సాగు కోసం వ్యవసాయశాఖ, రుద్రూర్లోని యూనివర్శిటీలు సంయుక్తంగా విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయన్నారు. మండలానికి 10కేజీల 38 ప్యాకెట్ల వరివిత్తనాలు, 19 ప్యాకెట్లు మొక్కజొన్న విత్తనాలను ఆయా గ్రామాలకు చెందిన ఆదర్శరైతులకు అందజేశారు. విత్తనాల ద్వారా ఉత్పత్తి అయిన పంటను కొనుగోలు చేసి గ్రామీణ విత్తనోత్పత్తి కార్యాక్రమాన్ని బలోపే తం చేయనున్నారు. వ్యవసాయశాఖ ఏడీఏ అరుణ, ఎంఏవో ఫయాజుల్లా తదితరులు పాల్గొన్నారు. రెండు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన మండలంలోని నాగారం, చిన్న రాంపూర్ గ్రామాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పర్యటించారు. నాగారం గ్రామంలో రూ.5లక్షల ప్రభత్వ నిధులతో నిర్మించిన శ్రీకృష్ణ యాదవ సంఘం ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. అనంతరం చిన్న రాంపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బీరప్ప అక్కమహంకాళి మందిరంలో నిర్వహించిన కల్యాణమహోత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో నాయకులు అంజిరెడ్డి, నర్సుగొండ, మొగులయ్య,రాచప్ప,పరిగె మోహన్రెడ్డి,పర్వుగొండ, కుర్మ గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్, ఆటో ఢీ..ఒకరికి గాయాలు
ఎల్లారెడ్డి: బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఎల్లారెడ్డికి చెందిన ఖలీల్ ఎల్లారెడ్డి నుంచి దేవునిపల్లికి వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఖలీల్ కాలు విరగడంతో కామారెడ్డికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. పీడీఎస్ బియ్యం పట్టివేత ఎల్లారెడ్డి రూరల్: మండలంలోని మల్లయ్యపల్లి గ్రామ శివారులో పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. ఆదివారం రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వెళ్తున్న గూడ్స్ ఆటోను తనిఖీ చేశామన్నారు. 13 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభించడంతో వాహనాన్ని ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్కు తరలించామని తెలిపారు. విద్యుదాఘాతంతో గేదె మృతి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లిలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో గేదె మృత్యువాత పడింది. గ్రామంలోని మండ గోపాల్కు చెందిన గేదె మేత కోసం వెళ్లి.. ప్రమాదవశాత్తు గ్రామ పంచాయతీ బోరు మోటారుకు అమర్చిన విద్యుత్ వైరుకు తగిలి అక్కడికక్కడే మరణించింది. గేదె విలువ సుమారు రూ.50వేలకు పైగా ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. -
సర్కారు బడిలో పిల్లలు
ఆదర్శంగా నిలిచిన ప్రధానోపాధ్యాయుడుబీబీపేట: తన పిల్లలను సర్కారు బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు మాందాపూర్ ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ చింతల ప్రభాకర్. ప్రభాకర్కు ఇద్దరు పిల్లలు. సోమవారం ఆయన వారిని తీసుకుని పాఠశాలకు వచ్చారు. కూతురు మృణాళినిని మూడో తరగతిలో, కుమారుడు శివకేశవ్ను ఒకటో తరగతిలో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అనుభవం కలిగిన ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. డిజిటల్ తరగతులు అందుబాటులో ఉన్నాయని, నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. అందుకే తన పిల్లలను సర్కారు బడిలో చేర్పించానన్నారు. కార్యక్రమంలో పాఠశాల కమిటీ చైర్మన్ ప్రత్యూష్, ఉపాధ్యాయులు శ్యాం, వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు, కారు ఢీ
డిచ్పల్లి: డిచ్పల్లి బస్టాండ్ వద్ద సోమవారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సు, కారును ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు (నబరు టీజీ 16 టీ 2156) డిచ్పల్లి బస్టాండ్లో నుంచి ప్రధాన రోడ్డుపైకి వస్తోంది. అదే సమయంలో నాగ్పూర్ గేట్ వైపు నుంచి నిజామాబాద్ వెళుతున్న కారు (నంబర్ టీఎస్ 18 హెచ్ 6831)ను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. కారు ఒక్కసారిగా రోడ్డుకు అడ్డంగా తిరగడంతో కారు, బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళన చెందారు. అదృష్టవశాత్తు కారులోని వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుకు అడ్డుగా రెండు వాహనాలు నిలిచిపోయేసరికి కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న డిచ్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా ఉన్న కారు, ఆర్టీసీ బస్సును పక్కకు తొలగించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. -
యువతకు నైపుణ్యమస్తు..
బోధన్: యువత, విద్యార్థులకు స్కిల్ కోర్సులు అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు బోధన్ పట్టణ శివారులోని మైనార్టీ ఐటీఐ ప్రాంగణంలో ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్) సిద్ధమవుతోంది. మరో వారంలో కేంద్రానికి వచ్చిన ఆధునిక సాంకేతిక పరికరాల బిగింపు ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి స్థానిక మైనార్టీ ఐటీఐలో ఉన్న ట్రేడ్ కోర్సులతోపాటు ఏటీసీలో అత్యాధునిక కొత్త కోర్సుల్లో ప్రవేశానికి త్వరలోనే నోటిఫికేషన్ జారీ కానుంది. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత ఉంటుంది. టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సౌజన్యంతో అత్యాధునిక పరికరాలు, యంత్రాలతో తరగతుల నిర్వహణ, ప్రయోగాత్మక బోధనకు వీలుగా తీర్చిదిద్దనున్నారు. దీంతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపర్చనున్నారు. ఆరు కొత్త కోర్సులు ..172 సీట్లు ఏటీసీకి ఆరు అత్యాధునిక సాంకేతిక కోర్సులు మంజూరయ్యాయి. ఏడాది వ్యవధి కోర్సులైన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమెషిన్లో 40 సీట్లు, ఇండస్ట్రీయల్ రొబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్లో 40, ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్ టూల్ (సెక్టార్ క్యాపిటల్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్)లో 20 సీట్లు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధి కోర్సులైన బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫయర్ మెకానికల్లో 24 సీట్లు, అడ్వాన్స్డ్ సీఎన్సీ మ్యాచినింగ్ టెక్నీషియన్లో 24, మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికిల్ కోర్సులో 24 సీట్లు ఉన్నాయి. ఆసక్తి గల విద్యార్థులు ప్రవేశ దరఖాస్తుకు ఎస్ఎస్సీ మెమో, కుల ధృవీకరణ పత్రం, టీసీ, బోనాఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు జత చేయాల్సి ఉంటుంది. త్వరలోనే నోటిఫికేషన్ వస్తుందని, అనంతరం అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శాంతారాం తెలిపారు. మిగతా వివరాలకు 94925 80776, 90592 10915 నంబర్లకు సంప్రదించాలని ఆయన సూచించారు. బోధన్లో పూర్తి కావొస్తున్న ఏటీసీ త్వరలోనే కొత్త కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ -
మున్సిపాలిటీ.. జీపీ.. మున్సిపాలిటీగా..
మీకు తెలుసా?ఏ గ్రామమైనా పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారుతుంది. కానీ ఆర్మూర్ మాత్రం మొదట మున్సిపాలిటీగా, తర్వాత గ్రామ పంచాయతీగా, మళ్లీ మున్సిపాలిటీగా మారిందని ఎంత మందికి తెలుసు.. ● 1956 నుంచి 1962 వరకు మున్సిపాలిటీగా ఉన్న ఆర్మూర్కు మొదటి చైర్మన్గా కేవీ నర్సింహారెడ్డి ఎన్నికయ్యారు. ● పరిపాలనా సౌలభ్యం కోసం 1962లో మున్సిపాలిటీని గ్రామ పంచాయతీగా మార్చారు. ● 44 ఏళ్ల పాటు జీపీగా ఉన్న ఆర్మూర్ను 2006లో 23 వార్డులతో మున్సిపాలిటీగా అభివృద్ధి చేశారు. ● కోర్టు కేసుల అనంతరం 2008 జూన్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించారు. ● 2014, 2019లో మున్సిపల్ ఎన్నికలు చేపట్టారు. ● 2019 ఎన్నికల్లో భౌగోళికంగా ఆర్మూర్ పట్టణానికి చుట్టూ మూడు కిలో మీటర్ల పరిధిలో ఉన్న పెర్కిట్, కొటార్మూర్(హామ్లెట్ గ్రామం), మామిడిపల్లి జీపీలను మున్సిపల్లో విలీనం చేశారు. ● 36 వార్డులుగా విభజించి రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆర్మూర్ పట్టణ పరిధి మరింత పెరిగింది. –ఆర్మూర్ -
రుద్రూర్ వరి ఆర్డీఆర్–1162
ఇది స్వల్ప కాలిక రకం. రెండు కాలలకు అనువైనది. వాన కాలంలో 120–125 రోజులకు, యాసంగిలో 130–135 రోజులకు పంట చేతికి వస్తుంది. మిక్కిలి సన్న గింజ రకం. ఎకరాకు సుమారుగా వాన కాలంలో 32, యాసంగిలో 34 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. తక్కువ నూక శాతం ఉంటుంది. కంకినల్లి, ఉల్లికోడు, ఆకు తెగులు, మెడ విరుపు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. గంగా కావేరి కన్నా అతి సన్న గింజ కలిగి ఉంటుంది. అన్నం మంచి నాణ్యతను, రుచిని కలిగి ఉంటుంది. ఈ రకం 7–10 రోజుల నిద్రావస్థ కలిగి ఉన్నందున కోసిన ధాన్యాన్ని వెంటనే విత్తనంగా వాడు కోవాలంటే బాగా ఎండబెట్టిన తర్వాత మొలక శాతాన్ని పరీక్షించి నారు పోసుకోవాలని పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య వివరించారు. పరిశోధనలు జరిపి శాస్త్రవేత్తలు రూపొందించిన కొత్త వరి రకాలను రైతులు సాగు చేసి లబ్ధి పొందాలని ఆయన కోరారు. -
సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు సుబ్బారావు మృతి
మాక్లూర్: రాష్ట్ర, జాతీయ స్థాయి సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు మైనేని సుబ్బారావు (59) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఆయన పుట్టి పెరిగింది కొత్తపల్లి గ్రామంలోనే. జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఆ క్రమంలోనే కబడ్డీ కోచ్గా నగరంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొనసాగుతూ వచ్చారు. ఈయన మృతిపై ఆయా క్రీడా కోచులు సంతాపం తెలిపారు. అంత్యక్రియలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు.రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యడిచ్పల్లి: మండలంలోని బర్ధిపూర్ శివారు మాధవనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి (45) ఆత్మహత్య చేసుకున్నట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై హెచ్ సాయిరెడ్డి ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మాధవనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. శనివారం రాత్రి నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ హరికృష్ణ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్కు సమాచారం అందించాలని రైల్వే ఎస్సై సాయిరెడ్డి కోరారు. -
వంద రోజుల యాక్షన్ ప్లాన్
గున్కుల్ శివారులో వరి విత్తనాలు చల్లుతున్న రైతులుబాన్సువాడ : మున్సిపాలిటీల్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సోమవారం నుంచి యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు అన్ని మున్సిపాలిటీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో మెప్మా సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు, వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొక్కలు నాటేందుకు స్థలాలు గుర్తించడం, నర్సరీల్లో ఉన్న మొక్కల వివరాలు, ఎక్కడ పంపిణీ చేయాలి. ఎక్కడ నాటాలి అనే వివరాలు నమోదు చేశారు. అదే విధంగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం, చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేయడం లాంటివి చేయనున్నారు. వార్డుల్లో వార్డు ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఆస్తి పన్ను తప్పుఒప్పులను సవరించడం లాంటి కార్యక్రమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.అక్రమ నల్లా కనెక్షన్ల గుర్తింపు..కొత్తగా ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్లు..మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులను గుర్తించడం, వారికి రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడంలాంటివి చేపట్టాలి. వీటితో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన సంఘాలకు రుణాలు ఇప్పించడం, కొత్తగా ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్ల ఏర్పాటు దివ్యాంగులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడంలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బల్దియాల్లో ప్రణాళిక రూపొందించిన అధికారులు అభివృద్ధి పనుల పూర్తి, రుణాలు ఇప్పించడం, కొత్త పొదుపు సంఘాల ఏర్పాటు లక్ష్యం నేటి నుంచి ప్రారంభంనివేదిక సిద్ధం చేశాం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 2 నుంచి 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. అన్ని విభాగాల ఉద్యోగులు చేయాల్సిన పనులు గుర్తించి వాటిని పూర్తి చేస్తారు. ఇందుకు సంబంధించి అన్ని వివరాలతో నివేదిక సిద్ధం చేశాం. – శ్రీహరి రాజు, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడఇంజినీరింగ్ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు పూర్తి చేయడంతో పాటు వార్డుల్లో అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడం, క్రమబద్ధీకరించడం, లేదా తొలగించడం లాంటివి చేపట్టాల్సి ఉంటుంది. మున్సిపల్ అధికారులు ఆస్పత్రుల యాజమాన్యాల సహకారంతో కార్మికులకు వైద్య శిబిరాలు చేపట్టాలి. పార్కుల్లో అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. పారిశుధ్యం మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ఆయా వార్డుల్లో చేపట్టాల్సిన పనుల వివరాలను ఆయా మున్సిపాలిటీలు తేదీల వారీగా జాబితా రూపొందించే పనిలో పడ్డారు. -
లైసెన్స్ రెన్యువల్ ఈజీగా చేసుకుందాం ఇలా..
మీకు తెలుసా? ఒకసారి తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ గడువులోగా రెన్యువల్ చేసుకోవడం చాలా మంది మరిచిపోతుంటారు. గడువు తీరిన 30 రోజుల్లోపు రెన్యువల్ చేయించుకోకుంటే జరిమానా విధిస్తారు. మరీ ఎక్కువ రోజులైతే రద్దు చేసే అవకాశం ఉంది. ● గతంలో ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరిగాల్సి వచ్చేది. https:// transport. telangana. gov. in/ వెబ్సైట్లోకి వెళ్లి ఈజీగా రెన్యువల్ చేసుకోవచ్చు. ● ముందుగా రవాణాశాఖ వెబ్సైట్లోకి వెళ్లి లైసెన్స్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ● తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఎంచుకుంటే మరో పేజీ ఓపెన్ అవుతుంది. ● అందులో కింద ఉండే రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్పై క్లిక్ చేయాలి. ● తర్వాత క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ● మరో కొత్త విండోలో కనిపించే డ్రైవింగ్ లైసెన్స్ బాక్స్లోని రెన్యూవల్ ఆఫ్ లైసెన్స్ తర్వాత కంటిన్యూ స్లాట్ బుకింగ్ని క్లిక్ చేయాలి. ● తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, ఎక్కడ ఇచ్చారు, పుట్టిన తేదీ, మొబైల్ నంబరు తదితర వివరాలు నమోదు చేయాలి. ● రిక్వెస్ట్ ఓటీపీనీ క్లిక్ చేస్తే మన ఫోన్ నంబర్కు ఓటీపి వస్తుంది. ● దానితో పాటు క్యాప్చర్ను ఎంటర్ చేసి గెట్ డీటైల్స్పై నొక్కగానే వివరాలన్ని కనిపిస్తాయి. ● జాగ్రత్తగా పరిశీలించి కన్ఫం క్లిక్ చేయాలి. తర్వాత పేమెంట్ ఆప్షన్ ద్వారా రుసుం చెల్లించాలి. ● ప్రింట్ తీసుకుని నిర్దేశించిన తేదీ రోజు ఒరిజినల్ లైసెన్స్, గుర్తింపు కార్డుతో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లాలి. ● అక్కడ అధికారులు పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్ను రెన్యువల్ చేస్తారు. – కామారెడ్డి టౌన్ -
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి మండలం గర్గుల్లో ఆదివారం చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుంటికాడి నర్సింలు(45) ఆటో నడిపిస్తూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం కుమార్తెకు వివాహం చేయగా అప్పులయ్యాయి. దీనికి తోడు ఆటో సరిగ్గా నడవక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మానసికంగా కుంగిపోయేవాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం నిర్మాణంలో ఉన్న గంగపుత్ర సంఘం భవనం వద్ద ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి రెండో భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
కొత్త వంగడాలతో అధిక దిగుబడులు
రుద్రూర్: రైతులకు వ్యవసాయంలో అవసరమగు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు కొత్త వంగడాలను రూపొందించి రైతులకు అందించడానికి 1935లో రుద్రూర్ చెరుకు, వరి ప్రాంతీయ పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా నాటి నుంచి ఎన్నో చెరుకు, వరి వంగడాలు రూపొందించి రైతులకు పరిచయం చేశారు. చీడ పీడలను తట్టుకుని అధిక దిగుబడులు సాధించే వంగడాల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కొత్తగా తెగుళ్లను తట్టుకుని మంచి దిగుబడినిచ్చే చెరుకు, రెండు వరి వంగడాలను రూపొందించి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ మూడు కొత్త వంగడాలు గూర్చి పరిశోధన కేంద్రం అధిపతి డాక్టర్ అంజయ్య ఆయన మాటల్లో.. రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం కృషి చెరుకు, వరిలో నూతన వంగడాలు సృష్టి -
బైక్ అదుపు తప్పి ఒకరి మృతి
సదాశివనగర్: బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని భూంపల్లి గ్రామానికి చెందిన కార్తిక్రావు(24) కామారెడ్డి నుంచి బైక్పై స్వగ్రామానికి వస్తుండగా గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో అదుపు తప్పి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో ఘటన స్థలిలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు
నిజాంసాగర్(జుక్కల్): గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా పోలీస్ చెక్పోస్టులను ఏర్పాటు చేసినా గోవుల అక్రమ రవాణాకు అడ్డుకట్టపడటం లేదు. రాత్రి వేళల్లో ట్రక్కులు, డీసీఎంలు, ఐచర్ వాహనాల్లో గోవులను గోవధశాలలకు తరలిస్తున్నారు. మహమ్మద్ నగర్ మండలం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద శనివారం అర్ధరాత్రి డీసీఎం వాహనంలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా స్థానిక బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. సదరు వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో వెంబడించి వాహనాన్ని పట్టుకున్నారు. సదరు వాహనంలో 9 ఎద్దులు ఉండటంతో పోలీసులకు బీజేపీ కార్యకర్తలు సమాచారం అందించారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 9 ఎద్దులను తిర్మలాపూర్ గోశాలకు తరలించారు. అచ్చంపేట వద్ద 26 గోవులు నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామం నుంచి శనివారం అర్ధరాత్రి వేళ ట్రక్కులో తరలిస్తున్న 26 గోవులు(ఎద్దులు)లను బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ట్రక్కు వాహనాన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, బీజేపీ కార్యకర్తలు సదరు ట్రక్కులో గోవులను శాంతాపూర్ గోశాలకు తరలించారు. పట్టుబడిన గోవులు, ఎద్దులను గోశాల నిర్వహకులకు అప్పగించారు. అర్థరాత్రి వేళ వాహనాల్లో తరలిస్తున్న వైనం గోశాలలకు అప్పగింత -
కార్పొరేట్ శక్తుల కోసమే మానవ హననం
కామారెడ్డి అర్బన్ : దేశంలోని సహజ వనరులు, అ టవీ సంపదలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చే యడానికి కేంద్ర ప్రభుత్వం మానవ హననానికి పూ నుకుందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకురాలు విమలక్క ఆరోపించారు. శత్రు దేశం పాకిస్తాన్తో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్న ప్ర భుత్వం.. దేశంలోని తమ బిడ్డలతో చర్చలు జరప డానికి సిద్ధంగా లేదని పేర్కొన్నారు. తెలంగాణ రచయితల వేదిక(తెరవే) కామారెడ్డి జిల్లా రెండో మ హాసభను ఆదివారం జిల్లాకేంద్రంలోని కర్షక్ బీఈ డీ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కవులు, కళాకారులు, రచయితలు పాలకుల కుట్రలను బట్టబయలు చేయాలని కోరారు. ప్రజల గొంతుక తెరవే తెలంగాణ రచయితల వేదిక ప్రజల గొంతుకగా నిలబడిందని ఆచార్య జయధీర్ తిరుమలరావు పేర్కొన్నారు. తెరవేను నిషేధించాలని పాలకులు చూసినా వెనకడుగు వేయలేదని, ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసుకుంటూ పోతోందని పేర్కొన్నారు. కవులు, రచయితలు, కళాకారుల మౌనం దేశానికి ప్రమాదన్నారు. ఆద్యకళను రక్షించడానికి శాశ్వత మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అస్తిత్వం, భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణకు తెరవే కృషి చేస్తోందని వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కొండి మల్లారెడ్డి పేర్కొన్నారు. మహాసభల్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను కవులు, రచయితలు పరిశీలించారు. తెరవే ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అమరులైన కవులు, రచయితలను గుర్తు చేసుకుని నివాళులు అర్పించారు. మహాసభల్లో తెరవే జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల గఫూర్ శిక్షక్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన రచయితలు గాజోజు నాగభూషణం, భూర్ల వెంకటేశ్వర్లు, ఉదారి నారాయణ, జి.లచ్చయ్య, ఆడెపు లక్ష్మణ్, ప్రేమ్లాల్, నారాయణగౌడ్, సీవీ కుమార్, తోకల రాజేశం, పబ్బ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు. తెరవే జిల్లా మహాసభల్లో విమలక్క -
సాగునీరు అందేదెప్పుడో?
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సాగు నీ రందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సా ర్ ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగంగా 22వ ప్యాకేజీకి అనుమతులు ఇచ్చారు. భూంపల్లి చెరువును రిజర్వాయర్గా అభివృద్ధి చేసి, దాని ద్వారా ఆయా ప్రాంతాల్లో లక్షకు పైచిలుకు ఎకరాలకు సాగు నీరందించేందుకు పథకాన్ని ప్రారంభించారు. అయితే వైఎస్సార్ మరణానంతరం 22 వ ప్యాకేజీ పనులకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. భూసేకరణే పూర్తి స్థాయిలో జరగలేదు. ఇటీవల రూ.23 కోట్లు విడుదల చేసినా అవి ఏ మూలకూ సరిపోవు. ప్రాజెక్టు పూర్తికి కావలసిన నిధులు ఇవ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సాగునీటి సమస్యతోనే ఈ ప్రాంత రైతులు బోర్లు తవ్వించి అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారు. చాలామంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు. ఇప్పటికీ సాగునీటి సమస్యతో సేద్యం అనుకూలించకపోవడంతో రైతులు, రైతు కూలీ లు గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాలకు సాగునీరందించేందుకు గత ప్రభుత్వంలో నాగమడుగు ఎత్తిపోతల పథకాన్ని చేపట్టా రు. అయితే పనులు మధ్యలోనే ఆగిపోయాయి. దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పోచా రం ప్రాజెక్టు ఎత్తు పెంపు, పూడిక తొలగింపు ఎన్నికల హామీలుగానే మిగిలాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులో పూడిక పెరిగి ఏడాదికేడాది నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. సాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడంతో అన్ని రంగా ల్లో వెనుకబడిపోతోంది. -
రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు
కామారెడ్డి క్రైం: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను సోమవారం నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో అధికారులు ఏర్పాట్లు చేశారు. వేడుకలకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని అధికారులు తెలిపారు. ఆయన ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పురోగతిపై ప్రసంగిస్తారన్నారు. ఆవిర్భావ వేడుకలలో సాంస్కృతిక కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై శకటాల ప్రదర్శన ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, భూ భారతి ఉత్తర్వులు అందిస్తారని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా రానున్న టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి -
వన మహోత్సవానికి సన్నద్ధం
● జిల్లాలో 12 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యం ● 527 నర్సరీల్లో మొక్కలు సిద్ధం సదాశివనగర్ : జిల్లాలో వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే 527 నర్సరీల్లో 12 లక్షల మొక్కలను సిద్ధంగా ఉంచారు. ఈనెల మొ దటి వారంలో కురిసే వర్షాల ఆధారంగా వీ టిని ఆయా గ్రామాలలో నాటడానికి ప్రణాళికలు వెంటనే రూపొందించాలని డీఆర్డీవో సురేందర్ పంచాయతీ కార్యదర్శులకు ఆదే శాలు జారీ చేశారు. ఎక్కడెక్కడ నాటుతారంటే.. నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎక్కడ ఎంత శాతం నాటాలన్న విషయమై ప్రభు త్వం స్పష్టత ఇచ్చింది. రహదారుల వెంట 20 శాతం, సామాజిక, ప్రభుత్వ స్థలాల్లో 20 శాతం, గట్ల వెంట 20 శాతం, ఇంటి ఆవరణ లో 15 శాతం, ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో 10 శాతం, చెరువులు, కుంటలు కట్టల వెంట 5 శాతం, ప్రభుత్వ స్థలాలకు కంచెల కోసం 10 శాతం మొక్కలు నాటాలని సూచించింది. ఏ ఏ మొక్కలు... గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. గుల్మోహర్, టెకోమా, సీమతంగెడు, రేల, కానుగ, స్పాథోడియా, నల్లమద్ది, సీతాఫలం, గన్నేరు, కాగితం, ఈత, వెదు రు, మల్లె, మందారం, విరజాజి, గులాబీ, గోరింట, జామ, ద్రాక్ష, అల్లనేరెడు, బొప్పా యి, మునగ వంటి మొక్కలు పెంచుతున్నారు. లొకేషన్లను గుర్తించాలని సూచించాం జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో మొక్కలు నాటేందుకు లొకేషన్లను గుర్తించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం. దాదాపుగా అన్ని గ్రామాల్లో మొక్కలు నాటేందుకు లొకేషన్లను గుర్తించారు. వర్షాలు కురవగానే మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడతాం. – సురేందర్, డీఆర్డీవో, కామారెడ్డి -
రాష్ట్ర స్థాయి సేవా పతకాలకు ఎంపిక
కామారెడ్డి క్రైం: రాష్ట్ర అ వతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభు త్వం పోలీసు శాఖలో ఉ త్తమ సేవలు అందిస్తున్న వారికి అవార్డులను ప్రక టించింది. జిల్లాలో 17 మంది అవార్డులకు ఎంపికయ్యారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కే.లింగయ్య ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యారు. సీసీఎస్ సీఐ ఎన్.శ్రీనివాస్, భిక్క నూర్ ఎస్సై దత్తాత్రి గౌ డ్, ఏఆర్ ఎస్సై సత్యనారాయణరెడ్డి, దోమకొండ ఏఎస్సై సుబ్రహ్మణ్యం చారి, కామారెడ్డి ఏఎస్సై ఏ.శ్రీనివాస్, మాచారెడ్డి ఏఎస్సై ప్రభాకర్రెడ్డి, బిచ్కుంద ఏఎస్సై శంకర్, రా మారెడ్డి పీఎస్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న కృష్ణమూర్తి, ఏఆర్ హెడ్కానిస్టేబుళ్లు ఎం.నారాయణ, సత్యం గౌడ్, శ్రీధర్, కామారెడ్డి హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్రావు, గాంధారి హెడ్ కానిస్టేబుల్ రవి కుమార్, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ కిషన్, లింగంపేట కానిస్టేబుల్ దేవేందర్, మద్నూర్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ సేవా పతకాలకు ఎంపికయ్యారు. -
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
బాన్సువాడ రూరల్: అర్హులైన పేదలకు కుల, మతాలు, పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు ఇస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన బాన్సువాడ మండలం బోర్లంక్యాంపు తండాలో ఇరువురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గతంలో గృహలక్ష్మిలో భాగంగా జిల్లాకలెక్టర్ ద్వారా మంజూరు వచ్చిన వారు కూడా ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి అర్హులేనన్నారు. గతంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో బాన్సువాడ నియోజకవర్గం ఆదర్శంగ నిలిచినట్లు ఇందిరమ్మ ఇంటినిర్మాణాల్లోనూ ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇసుక అతి తక్కువ ధరకు లబ్దిదారులకు సరఫరా చేసేలా ట్రాక్టర్ ఓనర్లను ఒప్పించామన్నారు. ఆయన వెంట స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, హౌసింగ్ డీఈ గోపాల్, డీఎల్పీవో సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో ముజాహిద్, నాయకులు శ్రీనివాస్రెడ్డి, నర్సింలు, రాజేశ్వర్గౌడ్, మమ్మాయి కాశీరాం, పీర్యానాయక్, శ్రీనివాస్రెడ్డి, కొండా శ్రీశైలం, సుభాష్, సంజీవ్రెడ్డి , కాపర్తి భరత్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలి భిక్కనూరు/నాగిరెడ్డిపేట/బాన్సువాడ /నస్రుల్లాబాద్/ నిజాంసాగర్/కామారెడ్డి రూరల్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణపనులను వేగవంతంగా పూర్తి చేయాలని డీఎల్పీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆయన భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమిపూజ లో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు ధ్రువీకరణపత్రాలను అందజేసి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంటతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎల్లారెడ్డి డీఎల్పీవో మార్కింగ్ ఇచ్చి లబ్ధిదారులకు మంజూరుపత్రాలను అందజేశారు. బీర్కూర్ మండలం దామరంచ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ముగ్గు వేసి పనులు ప్రారంభించారు. నస్రుల్లాబాద్ మండలం సంగం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు మాజీ ఎంపీపీ పాల్త్య విఠల్ భూమి పూజ చేశారు.నిజాంసాగర్ మండలం ఒడ్డేపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రజా పండరి అందజేశారు.కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గుపోశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ ఆకూల రూప రవికుమార్ మాట్లాడుతూ...ఇళ్ల నిర్మాణం చేపట్టినవారికి దశల వారిగా బిల్లులు మంజూరవుతాయన్నారు. గృహలక్ష్మి లబ్ధిదారులూ అర్హులే.. లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి -
దోమకొండలో కరాటే పోటీలు
దోమకొండ: మండల కేంద్రంలో శుక్రవారం ఒకినోవా గోజరో నీడుకాయ్ జాతీయ స్థాయి కరాటే పోటీలను నిర్వహించారు. సంస్థ తెలంగాణ ఆర్గనైజర్ కరాటే గ్రాండ్ మాస్టర్ కామిండ్ల రాజయ్య ఆధ్వర్యంలో 155 మంది క్రీడాకారులకు పోటీలు నిర్వహించారు. పోటీలకు జర్మనీ దేశానికి చెందిన కరాటే గ్రాండ్ మాస్టర్ హన్షీ ఫీటర్, షిహన్సోల్, బెల్జియం దేశానికి చెందిన షిహన్ రెయిన్ హోమ్స్ హాజరైనట్లు రాజయ్య వివరించారు. కరాటే సీనియర్ బ్లాక్ బెల్ట్ మాస్టర్లు కామిండ్ల నవీన్కుమార్, స్వామి, సాయినాథ్గౌడ్, సంతోష్, లక్ష్మినర్సు, సిద్ధరాములు, కుమార్, సాత్విక్, రోహిత్, హరిప్రసాద్, సిద్ధరాములు, సుభాష్ పాల్గొన్నారు. -
పేరుకే పార్ట్టైం.. పనులు ఫుల్టైం
కామారెడ్డి రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రతతోపాటు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించే పార్ట్టైం స్వీపర్ల పరిస్థితి దయనీయంగా మారింది. పేరుకే పార్ట్ టైం అయినప్పటికీ పనులు మాత్రం ఫుల్టైమ్ చేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఉదయం నుంచి పాఠశాల ముగిసే వరకు డ్యూటీ చేయాల్సి వస్తుందని, అయినా అరకొర వేతనాలనే అందిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 110 మంది స్వీపర్లు.. ఉమ్మడి జిల్లాలో సుమారు 200 మంది వరకు పార్ట్ టైం స్వీపర్లుగా 1986లో విధుల్లో చేరారు. అప్పుటి ప్రభుత్వం కేవలం రూ.150 వేతనం మాత్రమే అందించేది. విధులు నిర్వహిస్తున్న పార్ట్ టైమ్ స్వీపర్లలో 40 మంది వరకు చనిపోయారు. మరో 30 మంది పదవీవిరమణ పొందారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో 80 మంది వరకు, నిజామాబాద్ జిల్లాలో 30 మంది వరకు ఆయ పాఠశాలల్లో స్వీపర్లుగా కొనసాగుతున్నారు. పార్ట్టైమ్ స్వీపర్లు అన్న మాటే కానీ ప్రతిరోజు పాఠశాలలో ఫుల్టైమ్ విధులు నిర్వహించాల్సిన వస్తోందని, ఈ ఉద్యోగం వదులుకోలేక ఇతర పనులు చేసుకోలేకపోతున్నామని వాపోతు న్నారు. నెల జీతం రూ.5,200 వస్తుండటంతో 25 రోజులు పనులు చేస్తే రోజు వేతనం రూ. 208 మాత్రమే వర్తిస్తుందన్నారు. దీంతో కనీసం ఉపాధి హామీ కూలీ వేతనం కూడా గిట్టుబాటు కానీ పరిస్థితి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్లో వేతనాలు.. పార్ట్టైమ్ స్వీపర్లుగా ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనం మాత్రం పెరగడం లేదని, దీంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియడం లేదని వారు వాపోతున్నారు. అరకొర వేతనాలు ఇస్తుండటంతోపాటు అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వేతనాలు కూడా నెలల తరబడి బయాయి పెట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్వీపర్ల దీన పరిస్థితిని గమనించి వారిని ఫుల్టైమ్ స్వీపర్లుగా గుర్తించి పూర్తిస్థాయి వేతనాలు అందించాలని కోరుతున్నారు. దయనీయంగా మారిన స్కూల్ స్వీపర్ల పరిస్థితి అరకొర వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పట్టించుకోని ఉన్నతాధికారులు కుటుంబాన్ని పోషించలేని దుస్థితి.. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వాడి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత 40 ఏళ్లుగా పార్ట్టైం స్వీపర్గా పనిచేస్తున్నా. 1986లో జీతం రూ. 150 కాగా ఇప్పుడు రూ.5,200 వస్తుంది. వచ్చే జీతంతో కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాలలో అన్ని పనులు చేస్తాం. ప్రభుత్వం మా ఉద్యోగులను పర్మినేంట్ చేయాలి. –బాలయ్య, స్వీపర్స్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుప్రభుత్వం ఆదుకోవాలి 1992 నుంచి స్వీపర్గా పనిచేస్తున్నా. ఉదయం గంట కొట్టుడు నుంచి సాయంత్రం బడికి తాళం వేసే వరకు ఉంటాం. మమ్మల్నీ మాత్రం పట్టించుకునే వారు లేరు. ఏళ్లుగా వేతనం పెరగడంలేదు. ప్రభుత్వం మా పరిస్థితిని పరిశీలించి ఫుల్టైమ్ స్వీపర్ గా గుర్తించి పూర్తిస్థాయి వేతనం అందించాలని వేడుకుంటున్నా. ఇప్పటికై నా ప్రభుత్వం స్వీపర్లను ఆదుకోవాలని కోరుతున్నాం. –గడీల సరోజ, గర్గుల్ హైస్కూల్, కామారెడ్డి -
కంబోడియాలోనే కిరణ్కుమార్ అంత్యక్రియలు
కామారెడ్డి అర్బన్: పట్టణ పరిధిలోని దేవు నిపల్లికి చెందిన భూంరావుగారి కిరణ్కు మార్ ఉపాధి కోసం కంబోడియా రాజధా ని నాంఫెన్కి వెళ్లగా, ఈనెల 14న గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని సొంతూరికి తీసుకురావడానికి వీసాకు సంబంధించి పలు చిక్కులతో పాటు ఆర్థిక భా రం కావడంతో చివరిచూపు కోసం కుటుంబ సభ్యులు పాస్పోర్టులకు దరఖాస్తు చేసుకున్నా రు. పాస్పోర్టులు చేతికి అందడంతో బుధవారం వారు నాంఫెన్ వెళ్లారు. శుక్రవారం ఉదయం అక్కడే కిరణ్కుమార్ అంత్యక్రియలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భార్య మందాకిని, కొడుకు కార్తికేయ, తల్లి సుగుణబాయి, అన్న ప్రవీణ్కుమార్ అంత్యక్రియల్లో పాల్గొనగా, గుగూల్ మీ ట్ ద్వారా ఇక్కడి బంధువులు అంత్యక్రియలను తిలకించి కన్నీరు పెట్టుకున్నారు. నాంఫెన్ వెళ్లిన కుటుంబసభ్యులను భారత రాయబార కార్యాలయం అధికారులు మంచి సహకారం అందించారని కిరణ్కుమార్ బంధువు శ్రీకాంత్రావు తెలిపారు. -
అవతరణ వేడుకల అతిథి రమేశ్రెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అతిథిగా టూరి జం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్రెడ్డి హాజరు కానున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2వ తేదీన జిల్లా కేంద్రంలో అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు ప్రారంభించారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద గ్రామ పంచా యతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన విష యం తెలిసిందే. మున్సిపల్ కమిషనర్గా మ హ్మద్ ఖయ్యూం శుక్రవారం ప్రత్యేకాధికారి దిలీప్కుమార్ చేతులు మీదుగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి మాట్లాడుతూ..కందర్పల్లి, గోపన్పల్లి, దౌల్తా పూర్ కార్యదర్శులు జీపీ రికార్డులు, పన్ను వసూలు చేసిన రిసిప్ట్ బుక్కులు, గ్రామంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లుల రికార్డు లతోపాటు మొత్తం కార్యాలయ రికార్డులు అ ప్పగించాలని సూచించారు. జీపీ రికార్డులు పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. ఇక నుంచి ఇళ్ల నిర్మాణాల అనుమతులు, లావాదేవీలు జరపొద్దని,ఇకనుంచి మున్సిపాలిటీ పరిధిలోనే చెల్లింపులు, అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మూత్రశాలకు తాళం బీబీపేట: మండలకేంద్రంలోని రైతువేదిక వద్ద మూత్రశాలకు తాళం వేయడంతో శుక్రవారం జీలుగ విత్తనాల కోసం వచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతు వేదిక చుట్టూ ఇళ్లు ఉండడంతో మహిళా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడే మండల వ్యవసాయాధికారి నరేందర్ విధులు నిర్వహిస్తుంటాడు. ఆయన కూడా చూసి చూడనట్లుగా వదిలేయడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు ప్రతిరోజు మరుగుదొడ్లు తెరిచి ఉంచేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు. నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి 132 సబ్ స్టేషన్లో మరమ్మతులు చేపట్టనున్న నేపథ్యంలో శనివారం ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరా యం ఏర్పడుతుందని ఎస్ఈ శ్రావణ్కుమా ర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణంతోపాటు గ్రామాల్లోనూ వి ద్యుత్ సరఫరా నిలిచిపోనుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. -
టేక్రియాల్లో కుక్కల బెడద
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్లో కుక్కల బెడద ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో రోడ్డు వెంబడి వెళ్లాలంటే కుక్కలు వెంట పడుతున్నాయని ఈ విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బెడదను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అపరిశుభ్రంగా నీటితొట్టె మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని కుర్లాలోని బస్టాండ్ ప్రధాన రహదారి పక్కన గల పశువుల నీటి తొట్టె అపరిశుభ్రంగా మారింది. నీటితొట్టె పాకురు, నాచు, కలుషితమైన నీటితో నిండిపోయింది వానాకాలం ప్రారంభం అవుతున్న దృష్ట్యా దోమలు, ఈగలు వ్యాప్తి చెందిన రోగాలు ప్రబలే అవకాశాలున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. -
వెన్నునొప్పితో వెళ్తే ప్రాణాలే పోయాయి
నిజామాబాద్నాగారం: వెన్నునొప్పి చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ ఆపరేషన్ అ నంతరం కన్నుమూసింది. నగరంలోని ప్రతిభ ఆ స్పత్రిలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన రాధిక(35) వెన్నునొప్పితో బాధపడడంతో భర్త సురేశ్ ప్రతిభ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. పరీక్షించిన వైద్యులు వె న్నుపూసకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని తెల పడంతో సురేశ్ ఒప్పుకున్నాడు. గురువారం ఉద యం ఆపరేషన్ పూర్తి చేసి రాధికను వెంటిలేటర్పై ఉంచగా శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో మరణించింది. కాగా, సీనియర్ వైద్యులు చే యాల్సిన ఆపరేషన్ను జూనియర్ వైద్యులు చేయడంతోనే రాధిక మృతి చెందినట్లు భర్త, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆపరేషన్ చేస్తామని చెప్పి ప్రాణాలు తీశారంటూ బోరున విలపించారు. ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులు వచ్చి మృతదేహా న్ని తీసుకొని బయటికి వెళ్లాలని చెప్పడంతో కు టుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అదే సమ యంలో మృతురాలి కుటుంబీకులు, బంధువులు, కుల సంఘాల ప్రతినిధులు, మీడియా, పోలీసులు ఆస్పత్రికి చేరుకోవడంతో శవాన్ని ఆస్పత్రి లోపలికి తీసుకెళ్లారు. అనంతరం రూ. లక్ష ఇస్తామని, మృతదేహాన్ని తీసుకెళ్లాలని బేరసారాలకు దిగడంతో కుటుంబసభ్యులు మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆపరేషన్ ఎలా చేశారో, కే షీట్, ఎమ్ఆర్ఐ తదితర వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కు టుంబసభ్యుల ఆందోళన, యాదవ సంఘం మహి ళా అధ్యక్షురాలు మంజుల యాదవ్ ఒత్తిడితో చివరకు రూ. 3లక్షల 20వేలకు రాజీకుదిరింది. మహిళ మృతి, కుటుంబసభ్యుల ఆందోళన విషయం తెలుసుకొని సిబ్బందితో కలిసి ప్రతిభ ఆస్పత్రికి చేరు కున్న నగర సీఐ శ్రీనివాస్రాజ్..బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లా ల్సి వచ్చింది. కాగా, రాధిక మృతదేహానికి పోస్టు మార్టం చేయిస్తే అసలు నిజాలు బయటికి వచ్చేవని స్థానికంగా పలువురు చర్చించుకున్నారు. ఆపరేషన్ తర్వాత మహిళ మృతి ప్రైవేటు ఆస్పత్రిలో రోజంతా హైడ్రామా వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబీకుల ఆందోళన ప్రాణానికి వెలకట్టిన ఆస్పత్రి యాజమాన్యం -
రైతులకు అండగా బీజేపీ ప్రభుత్వం
కామారెడ్డి టౌన్/లింగంపేట : రైతులు పండించే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను పెంచినందుకు హర్షం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అలాగే లింగంపేటలోని అంబేడ్కర్ చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్ర పటానికి బీజేపీ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ రైతులకు అండగా బీజేపీ ప్రభుత్వం ఉంటుందన్నారు. ఎంఎస్పీకి రూ. 2.70 లక్షల కోట్లు, రైతులకు వడ్డీ రాయితీకి రూ. 15,642 కోట్ల నిధులు, పెట్టుబడిపై రైతులకు 50% లాభం ఉండేలా నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిలా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు, కిసాన్ మోర్చా నాయకులు గంగారెడ్డి, కడెం శ్రీకాంత్, ఆనందరావు, లింగారావు, రాజు, జైపాల్ రెడ్డి, నరసింహ రెడ్డి, వీరేశం, రైతులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, అసెంబ్లీ కన్వీనర్ లింగారావు, ఓబీజీ జిల్లా మాజీ అధ్యక్షుడు మురళి, బిఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్ది శివ్వయ్య, బాన్సువాడ : రైతుల సంక్షేమమే బీజేపీ ధ్యేయమని కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోనాల గంగారెడ్డి, నాయకులు శంకర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, చిదరి సాయిలు, శ్రీనివాస్, చిరంజీవి, ఉమేష్, యోగి, చీకట్ల రాజు, కొండని గంగారం, రామకృష్ణ, కిషన్ తదితరులున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చదివించాలి
ఎల్లారెడ్డి/తాడ్వాయి : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఉపాధ్యాయులు అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామంలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అలాగే తాడ్వాయితో పాటు కృష్ణాజీవాడి, బ్రహ్మాజీవాడి, బ్రాహ్మణపల్లి తదితర గ్రామాలలో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎంఈవో రామస్వామి మాట్లాడారు. ఉపాధ్యాయులు, సీఆర్పీలు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బడిబాటను విజయవంతం చేయాలి బాన్సువాడ రూరల్: జూన్ 6 నుంచి ప్రారంభం కానున్న బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ ఎంపీడీవో ముజాహిద్ కోరారు. శుక్రవారం ఆయన బోర్లంక్యాంపులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బడిబాట సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో డీఎల్పీవో సత్యనారాయణరెడ్డి, నాయకులు పీర్యానాయక్, శ్రీనివాస్రెడ్డి, విష్ణు , వంశీ, హరికృష్ణ, సంత్యాలి,సావిత్రి, ఉపాధ్యాయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కేసు పెట్టారు.. వదిలేశారు!
● సీఎంఆర్ రికవరీలో అధికారుల తీరు ● ఒకరికి ధాన్యం ఇచ్చి.. మరొకరికి వేధింపులు ● నిజామాబాద్ జిల్లాలో రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో రూ.45 కోట్ల విలువైన సీఎంఆర్ పెండింగ్ ● చివరికి ఇన్చార్జి మంత్రి నిలదీయాల్సిన పరిస్థితి.. అయినా రికవరీపై అనుమానాలే.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: సామాన్యుడు చిన్న తప్పిదం చేస్తే, అది నిరూపణ కాకముందే యుద్ధప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించే అధికార యంత్రాంగం.. భారీ మాయాజాలం విషయంలో మా త్రం ప్రజాధనాన్ని రికవరీ చేయకుండా తమకేం సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తోంది. దీనిపై సాక్షాత్తూ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో అధికార యంత్రాంగాన్ని కడిగిపారేశారు. 2014–15 నుంచి 2022–23 సంవత్సరాలకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో 44 మిల్లుల నుంచి రూ.250 కోట్లు, కామారెడ్డి జిల్లాలో 49 మిల్లుల నుంచి రూ.45 కోట్ల విలువజేసే సీఎంఆర్ రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ నుంచి రావా ల్సిందే రూ.60 కోట్ల మేర ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఈ నెల 29న కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లవుతున్న ప్పటికీ రికవరీ చేయకుండా నోటీసులిచ్చి వదిలేయ డమేమిటంటూ అసహనం వ్యక్తం చేశారు. షెడ్యూ ల్, యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని కేసుల మీద కేసులు పెట్టి ఆరు నెలల్లో రికవరీ చేయాలని ఆదేశించారు. ● సీఎంఆర్ విషయంలో బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు మంత్రికి వివరించారు. దీంతో సంతృప్తి చెందని మంత్రి జూపల్లి రెండువారాల్లో పూర్తి వివరాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అడ్వొకేట్ జనరల్తో కలిసి హైదరాబాద్లో సమీక్షకు రావాలని ఆదేశించారు. ● హైకోర్టు ఆదేశాలతో కేసు అయితే నమోదు చేశారు కానీ.. తదుపరి విచారణ, చర్యల విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. బాధితుడి సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణకు వచ్చిన హైకోర్టు తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో చేసినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా సదరు అధికారులను పోలీసు లు ప్రశ్నించకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. కాలయాపన చేస్తే చాలు అన్నట్లుగా యంత్రాంగం వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. వందలకోట్ల ప్రజాధ నం అక్రమార్కులు బొక్కేస్తే ఉన్నతాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై వాళ్లకు సైతం వాటాలు ముట్టినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ● 2021–22 యాసంగి, 2022–23 వానాకాలం సీజన్లకు గాను షకీల్కు చెందిన రహీల్, రాస్, అమీర్, దాన్విక్ అనే మిల్లుల పేరిట 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఈ మిల్లుల్లో ఒక్క గింజ ధాన్యం కూడా మిల్లింగ్ చేయలేదు. నేరుగా ధాన్యాన్ని అక్రమ మార్గంలో ముంబై, కాకినాడ పోర్టుల ద్వారా ఎగుమతి చేసి సొమ్ము చేసుకున్నాడు. కేవలం 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యానికి ఇచ్చేంత పరిమాణంలో రీసైకిల్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు ఇచ్చాడు. ఓ 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం ఏఆర్ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఆర్కాం ఇండస్ట్రీస్ (వర్ని), అబ్దుల్ ఐ ఇండస్ట్రీస్ (ఎడపల్లి), ఎఫ్టీఎఫ్ ఇండస్ట్రీస్ (బోధన్) వాళ్లకు ఇచ్చినట్లు చూపించాడు. ఈ నాలుగు మిల్లుల యజమానులతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బలవంతంగా ధాన్యం తీసుకున్నట్లు లేఖలు ఇప్పించాడు. షకీల్ ఒత్తిడితోనే లేఖలు ఇచ్చినట్లు సదరు మిల్లర్లు తెలిపారు. రూ.60 కోట్ల విలువ చేసే ధాన్యానికి బియ్యం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్కు చెందిన మిల్లులకు రూ.10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటివరకు షకీల్ కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వకపోవడంతో పాటు, జరిమానా సైతం కట్టలేదు. అధికారులు మాత్రం నోటీసులు ఇచ్చామని చెబుతూ కాలం గడిపారు. మరోవైపు బాధితుడు కిశోర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కథ నడిపిన అధికారులే, సీఎంఆర్ సైతం కిశోరే ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం గమనార్హం. న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న, గతంలో నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పనిచేసిన చంద్రశేఖర్, మాజీ డీఎస్వో చంద్రప్రకాశ్, డిప్యూటీ తహసీల్దార్ నిఖిల్రాజ్లపై వర్ని పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. అధికారంలో ఉన్న సమయంలో.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కోట్లాది రూపాయల విలువజేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుని ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు దందా చేశాడు. మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకంతో ధాన్యం ఇవ్వకుండానే కిషోర్ మిల్లు నుంచి సీఎంఆర్ ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేయించాడు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి) : ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లింగంపేట మండల కేంద్రంలో ఫార్మీన్ బేగం ఇంటి నిర్మాణానికి కలెక్టర్ శుక్రవారం ముగ్గుపోసి మార్క్ అవుట్ ఇచ్చారు. కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు నిర్మించుకోవాలని, అవసరమైన ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. రవాణా, లేబర్ ఖర్చులు లబ్ధిదారులు భరించాల్సి ఉంటుందన్నారు. దశల వారీగా నిర్మాణ పనులను బట్టి రూ.5 లక్షలు చెల్లిస్తామన్నారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు. వర్షా కాలం ప్రారంభానికి ముందే మురికి కాల్వల్లో పూడికను తొలగించాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. వర్షం నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి మురళి, మండల ప్రత్యేకాధికారి, డీఆర్డీవో పీడీ సురేందర్, ఎంపీడీవో నరేశ్, కార్యదర్శి శ్రావణ్కుమార్ ఉన్నారు. -
ప్రభుత్వ అధికారులు తీరిక లేకుండా పనులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలను గ్రౌండింగ్ చేయడానికి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. అలాగే భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ఊరూరా రెవెన్యూ సద
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, భూభారతి అవగాహన సదస్సులు వీటికి తోడు ముందస్తు వర్షాలతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, విత్తనాలు, ఎరువుల కొరతను అధిగమించడం, నకిలీ విత్తనాలను అరికట్టడం, స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభమవుతుండడంతో సౌకర్యాలపై దృష్టి పెట్టడం.. ఇలా ఆయా అంశాలపై అధికారులు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఈ నెల 28, 29 తేదీలలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం సాగు ఏర్పాట్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై సమీక్షలు నిర్వహించి జూన్ 1 నాటికి ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుంది. 2న జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తరువాతి రోజు నుంచి వరుస కార్యక్రమాలతో అధికారులు బిజీగా ఉండాల్సిందే. ఆయా కార్యక్రమాలు అమలుతీరుపై క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. రాజీవ్ యువ వికాసం గ్రౌండింగ్ రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ను పూర్తి చేసి జూన్ 2 నుంచి 9వ తేదీ వరకు మంజూరు పత్రాలను అందించాల్సి ఉంటుంది. జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు జిల్లా, నియోజకవర్గ స్థా యిలో రాజీవ్ యువవికాసం లబ్ధిదారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 16 నుంచి స్వయం ఉపాధి యూనిట్లను ప్రారంభించాల్సి ఉంటుంది. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా.. ఈసారి రుతు పవనాలు ముందుగానే రావడంతో వర్షాకాలం పంటల సాగు మొదలుకానున్న నేపథ్యంలో అవసరమైన మేర విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడానికి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలి. జిల్లాలో బోర్లు, బావులు, ప్రాజెక్టుల కింద వరి పంట సాగవుతుండగా, మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న, పత్తి, సోయాతో పాటు పప్పుదినుసులు సాగు చేస్తారు. అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. ఇదే సమయంలో నకిలీ విత్తనాలపై దృష్టి సారించాలి. సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం వర్షాకాలం సీజన్లో డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. ఈ నేపథ్యంలో పారిశుధ్య సమస్యను పరిష్కరించడం, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవలసిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి సమస్యలు పరిష్కరించాలి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఒకవేళ వ్యాధులు ప్రబలితే వెంటనే వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. అవసరమైన మందులు నిల్వ చేసి ఉంచాలి. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం వేసవి సెలవులు ముగించుకుని స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫాంలు సిద్ధం చేయాలి. అలాగే స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. చాలా స్కూళ్లలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. స్కూళ్లు తెరవడానికి మరో పదిహేను రోజులు మాత్రమే ఉంది. ఈ లోపు అన్ని సమస్యలు పరిష్కరించాలి. అలాగే స్కూళ్లలో విద్యార్థులు చేరేలా బడిబాట నిర్వహించాలి. హాస్టళ్లు, గురుకులాలు, కస్తూర్భాలలో సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. ఇందిరమ్మ ఇళ్లపై ఫోకస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పనులు ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా అధికారులు ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఇసుక దోపిడీ జరగకుండా కట్టడి చేయాలని ఆదేశించింది. జూన్ 3 నుంచి 20 వరకు భూభారతి సదస్సులుధరణి స్థానంలో తీసుకువచ్చిన భూభారతి పోర్టల్పై జూన్ 3 నుంచి 20 వరకు మండలాల్లో భూ భారతి సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రెవెన్యూ యంత్రాంగం సదస్సుల నిర్వహణపై దృష్టి సారించింది. భూభారతిపై రైతులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న లింగంపేట మండలంలో రెవెన్యూ గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు జరిగాయి. మిగతా 24 మండలాల్లో అవగాహన సదస్సులు చేపట్టాల్సి ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ పర్యవేక్షించడం రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక, శిక్షణ భూభారతి అమలుపై రెవెన్యూ సదస్సులు సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టాల్సిందే... విత్తనాలు, ఎరువుల సరఫరా, నకిలీ విత్తనాలపై ఫోకస్ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పన జూన్ నెల మొత్తం బిజీ షెడ్యూల్ -
అప్రమత్తంగా ఉండాలి
బాన్సువాడ : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్ సూచించారు. బీర్కూర్ ప్రాథమి క ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన తని ఖీ చేశారు. ల్యాబ్తోపాటు ఫార్మసీ గదిని, డె లివరీ రూములను పరిశీలించారు. ఇన్ పే షెంట్, అవుట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, మొక్కలను నాటాలని సూచించారు. వైద్యులు విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశా రు. ఆయన వెంట ఆస్పత్రి సిబ్బంది దయానంద్, శ్రీలేఖ తదితరులు ఉన్నారు.ప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్యసదాశివనగర్(ఎల్లారెడ్డి) : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి జాయింట్ డైరెక్టర్ ఉషారాణి అన్నారు. మండలంలోని కల్వరాల్ జెడ్పీ పాఠశాలను జేడీ శుక్రవారం పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్య అందుతుందని, ప్రభుత్వ పాఠశాలలు బాగు పడాలంటే తల్లిదండ్రుల సహకారం అవసరమన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను ఏడు నుంచి 53కు పెంచిన హెచ్ఎం విష్ణువర్ధన్రెడ్డిని అభినందించారు. జేడీవెంట డీఈవో రాజు, వీడీసీ చైర్మన్ రాజురెడ్డి ఉన్నారు.ప్రోటోకాల్ పేరుతో అడ్డంకులుబీబీపేట: కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభివృద్ధి చేయకపోగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రోటోకాల్ పేరుతో అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ నాయ కులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ ఇంటి ఎదుట ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ శుక్రవారం బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుతారి రమేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 29వ తేదీన ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం ఉండగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి జిల్లా అధికారులకు ఫోన్ చేసి ప్రోటోకాల్ ప్రకారం తాను లేకుండా ఎలా ప్రారంభోత్సవం చేస్తారని బెదిరించారని మండిపడ్డారు. గెలిచిన నాటి నుంచి కేవీఆర్ గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమయ్యారని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చెక్కులను ఇవ్వడానికే పరిమితమయ్యారని మార్కెట్ కమిటీ చైర్మెన్ పాత రాజు విమర్శించారు. అభివృద్ధిపై వచ్చే నెల 5వ తేదీన బీబీపేట చౌరస్తాలో బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నామని దమ్ముంటే రా వాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. భూమాగౌడ్, ఇంద్రసేనారెడ్డి, ఆయా గ్రా మాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చెరువు శిఖం భూమి కబ్జా
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని సారంగా పూర్ శివారులో చెరువు శిఖం భూముల ఆక్రమణ, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహరం ఇటీవల వెలుగు చూసింది. 10 ఎకరాల చెరువు శిఖం భూమిలో ప్లా ట్ల దందా ప్రారంభించారు. నిజామాబాద్ – బోధన్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న కోట్ల రూపా యల విలువజేసే ఈ స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో శిఖం భూమి పక్కనే ఉన్న ప్రైవేటు భూమి పట్టాను చూపుతూ కొందరు కబ్జాకు యత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, గతంలో చెరువు శిఖం భూమిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంగా గుర్తిస్తూ బోర్డును పెట్టారు. సర్వే నంబర్ 231లోని సుమారు 10 ఎకరాల 8 గుంటల శిఖం భూమి చుట్టూ కందకాన్ని తవ్వారు. కానీ, ఇటీవల ఓ మాజీ కార్పొరేటర్ కందకాన్ని తొలగించి శిఖం స్థలంలో ప్లాట్లు చేసి అమాయకులకు విక్రయించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే శిఖం భూమిని కబ్జాదారుల నుంచి కాపాడాలని స్థానిక నాయకులు కొందరు ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆర్డీవో రాజేంద్ర కుమార్ రెవెన్యూ సిబ్బందితో కలిసి చెరువు శిఖం భూమిని పరిశీలించారు. పది ఎకరాల్లో ప్లాట్ల దందా కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతం -
రికవరీ ఎందుకు చేయలేదు?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో డిఫా ల్ట్ రైస్మిల్లర్ల నుంచి సీఎంఆర్ రికవరీ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఎకై ్సజ్, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం, భూభారతి, వానాకాలం సాగు ప్రణాళిక అంశాలపై సమీక్షించారు. ఈ సీజన్లో నిజామాబాద్ జిల్లా నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా ధాన్యం సేకరించిన విషయమై అధికార యంత్రాంగాన్ని అభినందించారు. రికవరీ రూ. 4.4 కోట్లేనా? కామారెడ్డి జిల్లాలో 49 మంది డిఫాల్ట్ మిల్లర్ల నుంచి రూ.45 కోట్లు రికవరీ కావాల్సి ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. రూ. 4.4 కోట్లు మాత్రమే రికవరీ చేయడమేమిటని, మిగిలిన మొత్తం రికవరీ కోసం చర్యలు తీసుకోవాలని జూపల్లి ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రతి 15 రోజులకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ఫలితం సాధించాలన్నారు. కామారెడ్డి జిల్లాలో 426 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.77 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వివరించారు. 116 మిల్లులకు ధాన్యం నిల్వలను కేటాయించామని, రైతులకు రూ.822 కోట్ల మేర బిల్లుల చెల్లింపులు జరిపామని పేర్కొన్నారు. గతేడాదికంటే ఈసారి యాసంగిలో 30 శాతం అధికంగా ధాన్యం సేకరించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలల కాలంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలులోకి తెచ్చామని మంత్రి జూపల్లి అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి, నిరుద్యోగ యువతకు బాసటగా నిలువాలని, ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని ఇప్పటికే పైలట్ మండలాల్లో అమలు చేశామని, జూన్ 3 నుంచి అన్ని మండలాల్లో విజయవంతంగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర రైతు, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. సీఎంఆర్ రాబట్టే విషయంలో చర్యలు తీసుకోలేదెందుకు? ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు -
90 శాతం సబ్సిడీతో మగ్గాల ఏర్పాటు
దోమకొండ: దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఆరుగురికి 90 శాతం సబ్సిడీతో మగ్గాలు అందించేందుకు హైదారాబాద్కు చెందిన చేనేత సేవ సొసైటీ ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని దోమకొండ గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ తెలిపారు. మండల కేంద్రంలోని ఆనంద్భవన్లో స్థానిక చేనేత కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. వచ్చేనెలాఖరుకల్లా ఈ మగ్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత కార్మికులకు ఆర్థిక భద్రత, సహాయం అందించేందుకు త్రిఫ్ట్ ఫండ్ పేరుతో సామాజిక సంక్షేమ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ నిధిని విద్య, వైద్య ఖర్చులు, వివాహం లేదా ఇంటి నిర్మాణం వంటి అవసరాలను విని యోగించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిర్మల్గౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంపును అధిరోహించిన జిల్లావాసి
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి లిటిల్ స్కాలర్స్ హైస్కూల్ డైరెక్టర్ జ్యోత్స్న నేపాల్ మార్గంగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్(5,364 మీటర్ల ఎత్తు) అధిరోహించారు. త్రివర్ణ పతాకంతో పాటు పాఠశాల బ్యానర్ను ప్రదర్శించారు. జ్యోత్స్న ఎవరెస్ట్ను అధిరోహించడం తమ పాఠశాలకు గర్వకారణమని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. విద్యార్థి సంఘాల ఆందోళన కామారెడ్డి టౌన్: అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని ఓ స్కూల్లో విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్కూల్కు అనుమతి లేదని డీఈవో ఉత్తర్వులు జారీ చేసినా స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వారి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారని తెలిపారు. పుస్తకాలు, యూనిఫాం, అడ్మిషన్ల పేరిట ఫీజులు వసూళ్లు చేస్తున్నారని తక్షణమే స్కూల్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో నాయకులు విఠల్, ముదాం అరుణ్కుమార్, బుల్లెట్, స్టాలిన్, మణికంఠ, రాహుల్, హరి, శివకృష్ణ, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. గణపతి ఆలయంలో పూజలు కామారెడ్డి అర్బన్: పట్టణంలోని పశ్చిమ హౌసింగ్బోర్డు కాలనీలోని సంకష్టహర గణపతి ఆలయంలో గురువారం భక్తిశ్రద్ధలతో సామూహిక కల్యాణ తిలక ఉత్సవం నిర్వహించారు. పెళ్లి కాని, వివాహ ప్రయత్నం చేస్తున్న యువతీ, యువకులు సుమారు 105 మంది కల్యాణ తిలకం ఉత్సవంలో పాల్గొని పూజలు చేశారు. కార్యక్రమంలో వేదపండితుడు జి ఆంజనేయశర్మ, ఆలయ కమిటీ ప్రతినిధులు సుతారి అంజయ్య, రవీందర్గౌడ్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో పోలీసుల తనిఖీ ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో గురువారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్వాలపై ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులను, హోటళ్లు, పాన్ షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్లతో తనిఖీలు చేశారు. నిషేధిత మత్తు పదార్థాలు వాడితే చర్యలు తప్పవన్నారు. -
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం
మద్నూర్: మండలంలోని కొడిచిరలో డాక్టర్ కేవీ రెడ్డి మెమోరియల్ లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 62 మంది కంటి పరీక్షలు నిర్వహించుకోగా 18 మందికి మోతిబిందు ఉన్నట్లు వైద్యుడు అజయ్ తెలిపారు. కార్యక్రమంలో క్యాంప్ ఇన్చార్జి హన్మంత్రావు, సిబ్బంది రఫిక్, జీపీ కార్యదర్శి రాజు,ఆశావర్కర్ రుక్మిణి,గ్రామస్తులు పాల్గొన్నారు. తాడ్వాయిలో.. తాడ్వాయి: మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో గురువారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. కంటి వైద్యుడు లింబాద్రి పిల్లలకు కంటి పరీక్షలు చేశారు. అవసరం ఉన్న వారికి మందులు, కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో హరీశ్గౌడ్, స్వప్న, లింబాద్రి, నీరజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. డీపీఎంల నుంచి షురూ.. ● బదిలీకు ఆప్షన్లు ఇచ్చిన సెర్ప్ డొంకేశ్వర్(ఆర్మూర్): ఐకేపీలో ఉద్యోగ బదిలీల ప్రక్రియ మొదలైంది. డీపీఎంల నుంచి బదిలీలను మొదలు పెట్టిన రాష్ట్ర సెర్ప్ శాఖ వారికి ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించింది. జిల్లాలో ఆరుగురు డీపీఎంలతోపాటు ఒక ఏపీడీ ఉన్నారు. వీరందరినీ బదిలీ చేసేందుకు ఆప్షన్ ఫారాలను ఇచ్చింది. వీటిని నింపిన డీపీఎంలు, ఏపీడీ సెర్ప్ శాఖకు హార్డ్కాపీని అందజేయగా ఆన్లైన్లో కూడా ఆప్షన్లు పెట్టుకున్నారు. రెండు, మూడు రోజుల్లో సెర్ప్ సీఈవో వీరికి వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు చేపట్టనున్నారు. అయితే, డీపీఎంల బదిలీలు పూర్తయిన వెంటనే ఏపీఎంలు, సీసీలకు కూడా బదిలీలకు ఆప్షన్లు ఇవ్వనున్నారు. వీరికి జిల్లా స్థాయిలోనే డీఆర్డీవో ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ జరుగుతుంది. -
జీవితంపై విరక్తితో ఒకరి ఆత్మహత్య
రెంజల్(బోధన్): మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని బోర్గాం గ్రామానికి చెందిన మేకల లక్ష్మణ్(42) మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. గత శనివారం మద్యం సేవించి ఇంటికి వచ్చిన లక్ష్మణ్ భార్యతో ఘర్షణ పడగా, ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చిన తల్లికి లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి పోసాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పప్పు, నూనె గింజ పంటలతో అధిక లాభాలు
రుద్రూర్ : పప్పు ధాన్యాలు, నూ నె గింజ పంటల సాగుతో అధిక లాభాలను అర్జించవచ్చునని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయ్కుమార్ సూచించారు. పొతంగల్ మండలం హెగ్డోలిలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వరి, సోయా, మొక్కజొన్న పంటల్లో తీసుకోవాల్సిన సమగ్ర సస్యరక్షణ విధానాలను వివరించారు. ఒకే రకమైన పంట వేయడంతో భూములు చౌడు బారిపోతున్నాయని, దీని నివారణకు పంట మార్పిడి చేయాలన్నారు. తక్కువ కాల పరిమితి రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చునని తెలిపారు. వ్యవసాయ సమాచార సాధానాలపై విస్తరణ శాస్త్రవేత్త శ్వేత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారిణి నిశిత, వెటర్నరీ డాక్టర్ సురేశ్కుమార్, ఏఎంసీ చైర్మన్ హన్మంతు, మాజీ ఎంపీపీ పుప్పాల శంకర్, రైతులు పాల్గొన్నారు. -
ప్రయాణ ప్రాంగణాలపై పట్టింపేది..?
నస్రుల్లాబాద్: ఆర్టీసీ అధికారుల తీరుతో ప్రయాణ ప్రాంగణాలపై పట్టింపు లేకుండా పోయింది. ఉచిత బస్సు సౌకర్యం అమలులో ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే జనం సంఖ్య పెరిగింది. దీంతో బస్సు వచ్చే వరకు బస్టాండుల్లో వేచి చూడాల్సి వస్తోంది. కానీ బస్టాండ్లో మాత్రం కనీస వసతులు కల్పించ క పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు.రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండుల్లో తాగు నీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేక పోవడంతో ప్రయాణికులుఅసహనంవ్యక్తం చేస్తున్నారు. ఏళ్లు గడిచినా వసతులు కరువు నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో దశాబ్దాల క్రితం బస్టాండ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు బస్సులు వెళ్తుంటాయి. అంతే కాకుండా నస్రుల్లాబాద్ చుట్టూ ఉన్న గ్రామాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉండటంతో ఆంధ్రప్రదేశ్కు సైతం ప్రజలు వెళ్తుంటారు. అర్ధరాత్రుళ్లు కూడా బస్టాండ్లో ప్రజలు లేట్ నైట్ బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బస్టాండ్ను ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ మరుగుదొడ్లు, నీటి వసతి కల్పించడంలో మాత్రం ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నెమ్లి గ్రామానికి చెందిన దాతలు బస్టాండ్ ప్రాంగణం నిర్మించి ఇచ్చారు. కానీ కనీస వసతులు లేక నిరుపయోగంగా మారింది. కామిశెట్టిపల్లి, అంకోల్ వంటి గ్రామాల్లో కూడా ప్రయాణ ప్రాంగణాల వైపు అధికారులు కన్నెత్తి చూడక పోవడంతో నిరుపయోగంగా మారాయి. అద్దెలు సరే.. అవసరాల మాటేమిటి ఆర్టీసీ బస్టాండ్లో వ్యాపారాలు చేయాలంటే టెండర్ వేసి అద్దెలు వసూలు చేస్తారు. ఇదే తరహాలో నస్రుల్లాబాద్ బస్టాండ్లో కూడా ఏళ్లుగా వ్యాపార సముదాయాలకు అద్దెలు వసూలు చేస్తున్నారు. వీటితో ఆర్టీసీ లాభాలు పొందుతుందే కానీ ప్రయాణికుల అవసరాలను తీర్చడంలో శ్రద్ధ వహించడం లేదు. ఇకనైనా ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి సౌకర్యం, మరుగుదొడ్ల సదుపాయం కల్పిచాలని ప్రయాణికులు కోరుతున్నారు. కనీస వసతులు లేని నస్రుల్లాబాద్ బస్టాండ్ అసౌకర్యాల నడుమ బస్టాండ్లు కనీస వసతుల కల్పనలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు -
అమెరికాలో తిమ్మారెడ్డి యువకుడు అనుమానాస్పద మృతి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి గ్రా మానికి చెందిన గోవర్ధన్ (28) అనే యువకుడు గురువారం అమెరికాలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన గూల విఠల్ కుమారుడు గోవర్ధన్ నాలుగు సంవత్సరాల క్రితం అమెరికాలో ఒకాయోలో ఎంఎస్ చదివేందుకు వెళ్లా డు. గతేడాది నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న గోవర్ధన్.. బుఽ దవారం కుటుంబసభ్యులతో మాట్లాడాడు. గురువారం గోవర్ధన్ మృతి చెందినట్లు సమాచారం రావడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కుమారుడి మృతిపై అనుమానం ఉన్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. గోవర్ధన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహం వచ్చేందుకు నాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నదని స్థానికులు తెలిపారు.