breaking news
Kamareddy
-
ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే.. ఇంటికో కట్టె.. అసలేంటీ ఈ కథ?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ ఊరిలో ఎవరైనా చనిపోతే శవ దహనానికి అవసరమైన కట్టెలను ఇంటికి ఒకటి చొప్పున సేకరిస్తారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా ఇంటికొకరైనా ఉంటారు. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ మృతుల కుటుంబాలకు మేమున్నామన్న భరోసా ఇస్తున్నారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన రెడ్డి కులస్తులు. ఎర్రాపహాడ్ గ్రామంలో రెడ్డి కులస్తులతోపాటు ఒకటి రెండు కులాల వారు మాత్రమే మృతదేహాలను దహనం చేస్తారు. మిగతా కులాల వారు ఖననం చేస్తారు. ఈ గ్రామంలో 201 రెడ్డి కుటుంబాలున్నాయి. ఇక్కడ ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు చేయడానికి ఇంటికో కర్ర (కట్టె) జమ చేస్తారు. తాతల కాలం నుంచీ వస్తున్న ఈ ఆనవాయితీ.. ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. కులస్తులు ఎవరు చనిపోయినా వెంటనే ఎవరో ఒకరు ట్రాక్టర్ను రెడ్డి కుటుంబాలు నివసించే కూడలి వద్దకు తీసుకెళతారు. పశువుల కొట్టాల దగ్గరనో, ఇంటి పెరడులోనో ఉంచిన కట్టెల నుంచి తలా ఒక కట్టెను పట్టుకొని వచ్చి ట్రాక్టర్లో వేస్తారు. ట్రాక్టర్ నిండగానే తీసుకెళ్లి శ్మశానవాటికలో కాడు పేరుస్తారు. అంత్యక్రియలు పూర్తయ్యేదాకా అందరూ ఉంటారు. అందుబాటులో లేకపోతే, అనారోగ్యంతో బాధపడుతుంటే, ఇత ర ఇబ్బందులు ఏమైనా ఉంటే మినహాయింపు ఉంటుంది. అలా కుల కట్టుబాటు చేసుకున్నారు. మొత్తం కార్యక్రమం పూర్తయిన తర్వాతే ఎవరి ఇళ్లకు వారు వెళతారు. అమెరికాలో ఉంటున్న అదే గ్రామానికి చెందిన ఏనుగు ప్రభాకర్రెడ్డి తన తండ్రి లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని అందించా రు. ఎవరు చనిపోయినా మృతదేహాన్ని వైకుంఠ రథం ద్వారా శ్మశాన వాటికకు తీసుకెళతారు. అయితే శవయాత్ర జరుగుతున్నపుడు అందరూ శవం వెనకాలే నడవాలని పెద్దమనుషులు చెప్పడంతో అది కూడా పాటిస్తున్నారు. -
దసరా ఉత్సవాలకు ముస్తాబైన బురుజు
దోమకొండ: దోమకొండలోని బురుజును విద్యుత్ దీపాలతో దసరా కోసం ముస్తాబు చేశారు. గురువారం బురుజుపై జాతీయ జెండాను ఎగురువేయడానికి ఏర్పాట్లు చేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా ఇక్కడ జాతీయ జెండాను ఎగురవేయడానికి జనం భయపడేవారు. ఇక్కడి జనం స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు చేశారు. నిజాం కాలం నుంచే ఇక్కడ దసరా ఉత్సవం నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటికీ ఇక్కడ మువ్వన్నెల జాతీయ జెండాను ఎగురవేయటానికి నిజాం పాలకులకు భయపడేవారు. దోమకొండలో 1947 సెప్టెంబర్ 8న ఇక్కడి పాలకులకు తెలవకుండా 23 ఫీట్ల పొడవు, 46 ఫీట్ల వెడల్పుతో జాతీయ జెండాను తయారు చేసి 12 మీ. పొడవు, 2 మీ. వెడల్పు గల దుంగకర్రకు పెట్టి అప్పటి యువకులు ఎగురవేశారు. దీంతొ ఇక్కడి యువకులు కొందరు జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ప్రతి దసరా రోజున జాతీయ జెండాను ఎగురవేయటం ఆనవాయితీగా వస్తోంది. దసరా ఉత్సవంలో భాగంగా దోమకొండలోని బురుజు వద్ద ఆయుధ పూజ చేస్తారు. ప్రతీ ఏటా స్థానిక సర్పంచి జాతీయ జెండాను ఎగురవేస్తారు. ప్రస్తుతం పాలకవర్గం లేకపోవటంతో గ్రామ ప్రత్యేకాధికారి జాతీయ జెండావిష్కరణ చేయనున్నారు. అనంతరం జమ్మీ వృక్షానికి పూజ చేసి, చాముండేశ్వరి ఆలయానికి ఎదుర్కొని వెళ్తారు. ఇక్కడ జమి చెట్టును తాకి ఇంటికి తీసుకెళ్తే అదృష్టవంతులు అవుతారని నమ్మకంతో చాలా మంది పోటీ పడుతుంటారు. ఈ ఏడు సైతం ఉత్సవాలను విజయవంతంగా చేయటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిషన్ భగీరథ ఫ్రీ వాటర్ సర్వీస్ రామారెడ్డి: దసరా పండుగకు వాహనాలను సర్వీసింగ్ చేయించుకోవడం, పూజ చేయించడం సాధారణం. మరి గురువారం దసరా పండుగ అయితే బుధవారమే చాలా మంది తమ వాహనాలను వాటర్ సర్వీసింగ్ చేయించుకుంటారు. కానీ రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర భగీరథ పైప్ లీకేజీతో వాహనాలు ఫ్రీ సర్వీసింగ్ అయ్యాయి. మిషన్ భగీరథ అంటేనే లీకేజీల భగీరథ అనే పేరు సార్థకమైంది. ఆ రోడ్డులో వచ్చిపోయే తమ వాహనాలను అక్కడ ఉంచి శుభ్రం చేసుకున్నారు. -
పేదింట్లో చదువుల ‘భాగ్య’ం!
● ఎంబీబీఎస్ సీటు సాధించిన చాయ్వాలా కుమార్తె ● ఉన్నత చదువులే లక్ష్యమంటున్న విద్యార్థిని సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వాళ్లది నిరుపేద కుటుంబం. తండ్రి హోటల్లో చాయ్ తయారు చేస్తాడు. తల్లి బట్టలు కుడుతుంది. ముగ్గురు కూతుళ్లు. ఇద్దరిని టెన్త్, ఇంటర్ వరకు చదివించి పెళ్లి చేసేశారు. చిన్న కూతురు ప్రభుత్వ బడిలో పదో తరగతి వరకు చదివి 9.8 జీపీఏ సాధించింది. ప్రైవేటు కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఆమె, పట్టుదలతో చదివి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించింది. వివరాల్లోకి వెళితే... సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్కు చెందిన మడపతి నాగయ్యస్వామి, శ్రీశైల దంపతుల కూతురైన భాగ్యలక్ష్మి సిర్గాపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకొని పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించింది. దీంతో బాసరలోని ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. అక్కడికి వెళ్లి జాయిన్ అయిన వారం రోజులకే ఆ చదువు తనకొద్దంటూ ఇంటికి వచ్చేసింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. అప్పటికే ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుండడంతో కామారెడ్డిలోని సాందీపని కాలేజీలో చేర్పించారు. తండ్రి నాగయ్య స్వామి కామారెడ్డి పట్టణంలోని ఓ హోటల్లో చాయ్ తయారు చేసే పనిలో చేరాడు. తల్లి ఇంటి దగ్గర ఉంటూ కూతురు చదువు చూసుకుంది. బైపీసీ బాగా చదివితే డాక్టర్ అవుతావంటూ ప్రోత్సహించింది. ఇంటర్లో 992 మార్కులు వచ్చాయి. కాలేజీ అధ్యాపకుల ప్రోత్సాహం, తల్లిదండ్రుల సహకారంతో భాగ్యలక్ష్మి నీట్ రాసి 406 మార్కులు సంపాదించింది. దీంతో మొదట నిర్మల్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. రెండో విడత కౌన్సిలింగ్లో ఆదిలాబాద్ రిమ్స్లో సీటు సాధించింది. మా నాన్న మా కోసం ఎంతో కష్టపడతాడు. అమ్మ రోజూ చదువుకోమంటూ ఎంతగానో ప్రోత్సహించింది. మెడిసిన్ సీటు సాధించాలంటూ నిత్యం గుర్తు చేస్తూ ఎంకరేజ్ చేసింది. సాందీపని కాలేజీ అధ్యాపకుల సహకారంతో మెడిసిన్ సీటు సాధించాను. ఎంబీబీఎస్ చదివిన తర్వాత కచ్చితంగా పీజీ కూడా సాధిస్తా. న్యూరో లేదా కార్డియాలజీ విభాగంలో సీటు సాధించి మంచి డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తా. – భాగ్యలక్ష్మి, విద్యార్థిని -
క్రైం కార్నర్
చెరువులో పడి వ్యక్తి మృతి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన జోగిని చిన్న మల్లయ్య(62) చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. మృతుడు రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్కు వెళ్లాడు. బతుకమ్మ పండుగకు స్వగ్రామం వచ్చాడు. సెప్టెంబర్ 28న డబ్బుల విషయంలో భార్యతో గొడవపడి రంగంపేటలోని తన పెద్ద కొడుకు వద్దకు వెళ్లాడు. తిరిగి 30వ తేదీన అయిలాపూర్కు చేరుకున్నాడు. ఇంటికి వెళ్లకుండా గ్రామం పక్కనే ఉన్న చెరువులో బట్టలు ఉతుకుంటూ ప్రమాదవశాత్తు కాలుజారి నీటమునిగి చనిపోయినట్లు ఎస్సై పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ● జ్వరంతో బాలుడు మృతి మాచారెడ్డి : జ్వరంతో బాధపడుతూ పది నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని సర్దాపూర్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్దాపూర్ తండాకు చెందిన బానోత్ అశోక్, వెన్నెల దంపతుల కుమారుడు వేదాంశ్(10 నెలలు) జ్వరంతో ఐదురోజులుగా బాధపడుతున్నాడు. దీంతో రాజన్నసిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ఓ పిల్లల ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉందని నీలోఫర్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. బాల్కొండ: మండలంలోని కిసాన్నగర్కు చెందిన మమత(38) వరద కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై శైలేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మమత కొన్నాళ్లుగా కుటుంబకలహాలతో సతమతమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి జీవితంపై విరక్తి చెంది ఎస్సారెస్పీ నుంచి ప్రవహించే వరద కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
గాంధీ జయంతి నాడే దసరా
● మాంసం విక్రయించొద్దని మున్సిపల్ అధికారుల నోటీసులు ● బెల్టుషాపులలో మద్యం స్టాక్ ఫుల్ బిచ్కుంద(జుక్కల్): ఉద్యోగ, ఉపాధి, వ్యాపారం నిమిత్తం పట్టణాలకు వెళ్లిన వారు దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకున్నారు. బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. వాహనాలు, యంత్రాలకు పూజలు చేసి మాంసంతో వంటకాలు, మిత్రులతో కలిసి మద్యం సేవించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. కాగా, ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా పండుగ వచ్చింది. దీంతో జీవహింస చేయొద్దని, మద్యం దుకాణాలను మూసి ఉంచాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే, పండుగ రోజు కూడా మద్యం, మాంసం ముక్క లేకుంటే ఎలా అంటూ ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మాంసం దుకాణాలకు నోటీసులు ఈ నెల 2న గురువారం గాంధీ జయంతి సందర్భంగా మేకలు, కోళ్లు జీవహింస చేయవద్దని బుధవారం మున్సిపల్ అధికారులు మాంసం విక్రయ దుకాణదారులు, హోటళ్లకు నోటీసులు అందజేశారు. హోటళ్లలో సైతం మాంసం కూర వండరాదన్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బెల్టుషాపులలో స్టాక్... గాంధీ జయంతి రోజున మద్యం విక్రయాలపై గ్రా మాలలో అంతగా పట్టింపు ఉండదనే ఉద్దేశంతో బె ల్టుషాపుల నిర్వాహకులు మద్యం బాటిళ్లను నిల్వచే సి పెట్టారు. పట్ణణ, మండల కేంద్రాల నుంచి బెల్టుషాపులకు వచ్చి కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో బ్రాండెడ్ మద్యాన్ని తెచ్చిపెట్టినట్లు తెలిసింది. వైన్స్ లు బంద్ ఉండడంతో అధిక ధరలకు విక్రయించి లాభం పొందవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు. -
ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు
సాక్షి నెట్వర్క్:జిల్లాలో పలుచోట్ల బుధవారం ఆర్ఎస్ఎస్ శతాబ్ధి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నేతలు మాట్లాడుతూ.. ఈ వందేళ్లలో ఆపత్కాలంలో అందరికీ అండగా నిలిచామని పేర్కొన్నారు. దేశ సేవే లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని అన్నారు. ఆర్ఎస్ఎస్లో ఎవరైనా చేరి దేశ సేవ చేయొచ్చని, అందరికీ తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలనే లక్ష్యంతో ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆర్ఎస్ఎస్ను కేశవ్ బలిరాం హెడ్గేవార్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో 1925 విజయదశమి రోజున మొదలు పెట్టారని.. నేడు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పలు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. -
పురాతన కట్టడాలు.. గత వైభవపు ఆనవాళ్లు
బాన్సువాడ రూరల్: ఆనాటి సంస్థానాధీశులు తమ ఆధీనంలోని రాజ్యాన్ని శత్రువుల బారి నుంచి కాపాడుకునేందుకు కాపాలా కోసం పెద్ద పెద్ద బు ర్జు(గడీ)లను నిర్మించారు. వృత్తాకార, చతురస్రాకార, దీర్ఘచతురస్రాకారాల్లో బురుజులను బండరా ళ్లు 20 నుంచి 25 మీటర్ల ఎత్తులో మట్టి, సున్నంతో కలిపి నిర్మించారు. వీటిపైకి ఎక్కడానికి ఒకరు లేదా ఇద్దరు మాత్రమే వెళ్లడానికి మార్గం ఉంటుంది. వీటిపై నుంచి చూస్తే గ్రామ పోలిమేరలు స్పష్టంగా కనిపిస్తాయి. బురుజుల పై భాగంలో చుట్టూ రంధ్రాలుండే రాళ్లతో కూడిన కట్టడం ఉంటుంది. వీటిలో నుంచి సైన్యం తుపాకులను శత్రు సైన్యంపై ఎక్కు పెట్టేవారని పూర్వీకులు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పాతబాన్సువాడ, బండగల్లీతో పాటు దేశాయిపేట్, పాత బాన్సువాడ, పోచారం, రాంపూర్, ఇబ్రహీంపేట్, బోర్లం, హన్మాజీపేట్, కోనాపూర్, సంగోజీపేట్ తదితర గ్రామాల్లో ఇప్పటికి బుర్జులు చెక్కుచెదరకుండా ఉన్నాయి. దసరా పండుగ నాడు వీటిపై జెండాలు ఎగురవేస్తారు. పోచారం గ్రామంలో ప్రతిఏటా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి తమ ఇంటి ఆవరణలో ఉన్న బురుజుపై ఉన్న దస్తగిర్ దర్గాలో ఆనవాయితీగా ప్రార్థన చేసి దసరా ఉత్సవాలను ప్రారంభిస్తారు. -
రూ.2 వేల కోసం హత్య
● నిందితుడి అరెస్ట్ ఖలీల్వాడి: రూ.2 వేల కోసం హత్య చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 6న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస కిరాణా షాప్ ఎదుట గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడైన నవీపేట మండలం జల్లపల్లిఫారానికి చెందిన షేక్ అహ్మద్ను సెప్టెంబర్ 30న పట్టుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. షేక్ అహ్మద్ నగరంలోని రైల్వే స్టేషన్ పరిసరాల్లో నివసిస్తూ క్యాటరింగ్తోపాటు రోజువారీ కూలీ పనులు చేసేవాడు. మద్యం అలవాటు నేపథ్యంలో రైల్వేస్టేషన్ వద్ద ఒంటరిగా కనిపించే వ్యక్తులను బెదిరించి డబ్బులు దోచుకునే వాడు. గత నెల 6న అర్ధరాత్రి రైల్వేస్టేషన్ సమీపంలోని శ్రీనివాస కిరాణా షాప్ ఎదుట ఒక వృద్ధుడు డబ్బులు లెక్కబెడుతూ కనిపించగా దోచుకోవాలనే ఉద్దేశంతో అహ్మద్ అతని దగ్గరకు వెళ్లాడు. డబ్బులివ్వాలని బెదిరించగా వృద్ధుడు ఇవ్వలేదు. దీంతో అహ్మద్ ఒక బట్టతో వృద్ధుడి మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. అనంతరం అతని వద్ద నుంచి రూ.2 వేల నగదు, ఫోన్ దోచుకున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్లు పేర్కొన్నారు. -
ప్రయాణం భారం..
● బస్సులు నడవక ఇబ్బందులు ● కామారెడ్డి, ఎల్లారెడ్డికి వెళ్లాలంటే ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిందే ● పండుగల పూట ప్రయాణికులకు అవస్థలు లింగంపేట(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో నెల రోజులుగా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఆగస్టు 27 నుంచి దాదాపు నెల రోజులకుపైగా కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగంపేట మండలం లక్ష్మాపూర్, అడ్విలింగాల వద్ద రోడ్డు కొట్టుకుపోయాయి. నాగిరెడ్డిపేట మీదుగా మెదక్, హైదరాబాద్ వెళ్లేదారిలో పోచారం ప్రాజెక్టు కింద వంతెనకు ఇరువైపులా రోడ్డు దెబ్బతిన్నది. దీంతో వారం, పది రోజులు రాకపోకలు నిలిచి ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ప్రభుత్వం స్పందించి తాత్కాలికంగా మొరం వేసి రోడ్లు మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించారు. లింగంపేట మండలం లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన, రోడ్డు కొట్టుకుపోవడంతో కామారెడ్డి నుంచి లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్కు ప్రతి రోజు నడిచే బస్సులను అధికారులు నిలిపివేశారు. సుమారు నెల పది రోజులు అవుతున్నా బస్సులు నడపడంలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి నుంచి గాంధారి, నల్లమడుగు మీదుగా లింగంపేట, ఎల్లారెడ్డి మీదుగా పిట్లంకు మూడు బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సుల్లో వెళ్లాలంటే 30 కిలోమీటర్ల మేర దూరం, ఆర్థిక భారం పెరుగుతుంది. కామారెడ్డి నుంచి లింగంపేట మండలం పొల్కంపేట చౌరస్తా వరకు బస్సులు నడుపుతున్నారు. అక్కడి నుంచి ప్రయాణికులు మూడు కిలోమీటర్ల మేర ఆటోల్లో వెళ్లాల్సి వస్తుంది. ఇదే అదనుగా ప్రైవేటు వాహనాల్లో రెట్టింపు చార్జీ వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఆర్థిక భారం, దూరం, సమయం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. అధికారులు చొరవ చూపి పనులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. అయితే, రాకపోకలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు మరో 15 రోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు. నెల రోజులుగా పొల్కంపేట వైపు బస్సులు రావడంలేదు. దీంతో లింగంపేటకు నడిచి వెళ్తున్నాం. ప్రై వేటు వాహనాల్లో చార్జీలు ఎక్కువ గా తీసుకుంటున్నారు. నిత్యావసర సరుకులు, బట్టలు, పండుగ సామ న్ల కొనుగోలుకు లింగంపేట వెళ్లాల్సి ఉంటుంది. పాము ల వాగు వద్ద రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి. – కంల్యానాయక్(ఒంటర్పల్లి)పొల్కంపేట రూట్లో బస్సులు నడపకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం లింగంపేట, కామారెడ్డికి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో మూడు, నాలుగు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ప్రైవేటు వాహనాల్లో వెళ్లాలంటే చార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారు. –వస్రాం(సురాయిపల్లి తండా) -
శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు
వందేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) గురువారం 101వ వసంతంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక, సాంస్కృతిక సంస్థగా ఉన్న ఆర్ఎస్ఎస్ను 1925లో విజయదశమి రోజున నాగ్పూర్లో ఐదుగురు పిల్లలతో కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. తరువాత కొన్నేళ్లకు ఇందూరు నగరంలోని గాజుల్పేట దత్తమందిర్లో ‘ఇందూరు శాఖ’ను ప్రారంభించారు.సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఇందూరు నగరంలో 65 చోట్ల ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి. ప్రతి బస్తీలో శాఖలు ఉండడంతో తెలంగాణలోనే సంపూర్ణ శాఖలున్న మొదటి నగరంగా నిలిచింది. జిల్లాలోని ఇతర మండలాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తు న శాఖలు విస్తరించాయి. ● శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ‘పంచ పరివర్తన్’ పేరిట (కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, స్వ అధారిత జీవనం, బాధ్యతాయుత పౌరవిధు లు, పర్యావరణ పరిరక్షణ) అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరో నెలపాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. ● హెడ్గేవార్ తాతగారైన నరహరి శాస్త్రి 169 సంవత్సరాల క్రితం రెంజల్ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యత ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్పూర్కు వలస వెళ్లారు. ఈ క్రమంలో కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్ కులదైవమైన చెన్నకేశవనాథ్ విగ్రహం, హెడ్గేవార్ విగ్రహం ప్రతిష్ఠించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గో దావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హెడ్గేవార్ పూర్వీకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భారీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. దీని వద్దనే గోదావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. పాఠశాలలో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తున్నారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్సంఘ్ చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరం ప్రారంభానికి ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో హాజరు కానున్నారు. ● కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ నాగ్పూర్లోనే జన్మించారు. కోల్కతాలో వైద్య విద్యనభ్యసించారు. బెంగాల్లో అనుశీలన సమితి, జుగాంతర్ మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. కాంగ్రెస్, హిందూ మహాసభలలో సభ్యుడిగా పనిచేశారు. దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు. హెడ్గేవార్ వైద్య విద్య అభ్యసించినా.. సమాజంలో ఉన్న రుగ్మతలపై ఎక్కువగా దృష్టి సారించారు. దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోవడానికి హిందువులు కులాలవారీగా విడిపోయి కలహించుకోవడం, ఆత్మన్యూనతలో మునిగిపోవడం కారణాలుగా భావించిన ఆయన.. సమాజంలో ఐక్యత కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఆర్ఎస్ఎస్ను స్థాపించారు. ఆయన నాటిన విత్తనం మొలకెత్తి అంచెలంచెలుగా ఎదిగి నేడు వటవృక్షమైంది.హెడ్గేవార్ 1940 జూన్ 21న మరణించారు. ఇందూరు జిల్లాలో ఉరకలెత్తుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కందకుర్తిలో సంఘ్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ మూలాలు హెడ్గేవార్ పూర్వీకుల ఇంటి స్థానంలో కొనసాగుతున్న స్మృతి మందిర నిర్మాణం సంఘ్ ఆధ్వర్యంలో ‘పంచ పరివర్తన్’ సూత్రాలతో శతాబ్ది ఉత్సవాలు నేడు 101వ వసంతంలోకి అడుగు పెట్టనున్న ఆర్ఎస్ఎస్ -
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
● ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల సభ్యులకు బుధవారం కలెక్టరేట్లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలు బాధ్యత ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలపై ఉందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా జోనల్ అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.. సర్పంచ్, వార్డు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గుర్తించిన కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. అభ్యర్థులకోసం ఫారాలు, నామినేషన్ పత్రాలు, ఓటరు లిస్టులను సిద్ధం చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సంబంధిత రూట్ మ్యాప్లను రూపొందించి పంపాలన్నారు. బ్యాలెట్ బాక్స్లను జిల్లా కేంద్రం నుంచి స్వీకరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. సర్పంచ్ అభ్యర్థులు తహసీల్దార్ వద్ద, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీదారులు సంబంధిత ఆర్డీవో వద్దనుంచి అవసరమైన అన్ని రకాల అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతులను సంబంధిత పోలీసు అధికారుల నుంచి తీసుకుని తహసీల్దార్లకు సమర్పించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు, సమస్యలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే (గ్రీవెన్స్ సెల్) 99087 12421 నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీపీవో మురళి, డీఈవో రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వందేళ్లలో తొలిసారి..
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 44 రోజుల వ్యవధిలోనే 237.9 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం. వందేళ్ల చరిత్ర కలిగిన ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరదలు రావడం ఇది తొలిసారి.. – నిజాంసాగర్నిజాంల కాలంలో మంజీర నదిపై అచ్చంపేట వద్ద భారీ జలాశయం నిర్మాణం ప్రారంభించారు. 1923లో ప్రారంభమైన నిర్మాణం 1931లో పూర్తయ్యింది. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురిసే వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చి చేరుతుంది. ఆగస్టు 18న ప్రారంభమైన ఇన్ఫ్లో.. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ ఏడాది ఆగస్టులో ఇన్ఫ్లో ప్రారంభమైంది. ఆ నెలలో భారీ వర్షాలు కురవడంతో 111.53 టీఎంసీల నీరు వచ్చి చేరింది. సెప్టెంబర్లోనూ వరుణుడి జోరు కొనసాగడంతో మరో 126.41 టీఎంసీలు జత కలిసింది. మొత్తం 44 రోజుల వ్యవధిలో 237.94 టీఎంసీల ఇన్ఫ్లో రావడం గమనార్హం. వందేళ్ల ప్రాజెక్టు చరిత్రలో ఇది రికార్డ్ కావడం గమనార్హం. అంతకుముందు 1983 సంవత్సరంలో నిజాంసాగర్ ప్రాజెక్టు భారీ స్థాయిలో వరదలు వచ్చాయి. ఆ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కలిపి 163 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఆ తర్వాత ఈ స్థాయికి మించి వరదలు రావడం ఇదే తొలిసారి. ఒకరోజులో.. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1962 సంవత్సరంలో భారీ వరదలు వచ్చాయి. ఒక రోజులో ప్రాజెక్టు చరిత్రలో గరిష్టంగా 4.32 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదయ్యింది. 1988 సంవత్సరంలో 2 లక్షల క్యూసెక్కులు వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ ఒక రోజులో గరిష్ట ఇన్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు దాటలేదు. ఈసారి అగస్టు 28న 2.56 లక్ష క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది.మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరదలు వచ్చాయి. ఆగస్టు నెల 18 నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా నిర్విరామంగా నీటిని విడుదల చేస్తున్నాం. ఇప్పటివరకు 237.947 టీఎంసీల నీరు ఇన్ఫ్లోగా రాగా 223.778 టీఎంసీలను విడుదల చేశాం. నీటి ప్రవాహం మొదలైన నాటినుంచి అప్రమత్తంగా ఉండి, ఇన్ఫ్లోలను గమనిస్తూ నీటిని విడుదల చేస్తున్నాం. – సోలోమన్, నీటిపారులశాఖ ఈఈ, నిజాంసాగర్ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు బుధవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,03,716 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 77,329 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రానికి 1,402.40 అడుగులు (14.486 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 237.9 టీఎంసీల ఇన్ఫ్లో గతంలో 1983లో 163 టీఎంసీలు చేరిక నెలన్నరగా పరవళ్లు తొక్కుతున్న మంజీర నది -
గిట్లయిపాయె!
● కలిసిరాని రిజర్వేషన్లు ● పలువురు నేతలకు తప్పని నిరాశ ● రాజకీయాలపై వైరాగ్యంజిల్లాలోని వివిధ మండలాల్లో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్నికల బరిలో దిగాలని చాలామంది ఆరాటపడ్డారు. కామారెడ్డి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్రెడ్డి జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావించారు. అది కాకుంటే ఎంపీపీ పీఠం మీద కూర్చోవాలని కలలుగన్నారు. అయితే జెడ్పీటీసీ ఎస్సీ జనరల్, ఎంపీపీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి. మాచారెడ్డి మాజీ ఎంపీపీ నర్సింగరావు మూడు పర్యాయాలు ఎంపీపీగా, ఒక పర్యా యం వైస్ ఎంపీపీగా, ఆయన భార్య అనిత ఒకసారి జెడ్పీటీసీగా పనిచేశారు. ఈసారి రిజర్వేషన్ కలిసొస్తే మరోసారి ఎంపీపీ లేదా జెడ్పీటీసీ చాన్స్ తగిలేది. అయితే ఎంపీపీ, జెడ్పీటీసీ రెండూ ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన నిరాశ చెందారు. మాచారెడ్డి జెడ్పీటీసీగా పనిచేసిన మిన్కూరి రాంరెడ్డికి కూడా నిరాశే ఎదురయ్యింది. భిక్కనూరు నుంచి జెడ్పీటీసీగా ఎంపికై తే జెడ్పీ చైర్మన్ అవకాశం దక్కుతుందని ఆశించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డికి సైతం రిజర్వేషన్ కలిసిరాలేదు. ఈ మండలంలో పలువురు నేతలు జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకోగా వారికి రిజర్వేషన్ అనుకూలించలేదు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు బీసీలకు దక్కడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీకి రెడీ అవుతున్నారు. అధికార పార్టీ మాజీ ఎంపీపీ బల్యాల రేఖను బరిలో దింపే అవకాశం ఉంది. బీబీపేట నుంచి మరోసారి పోటీ చేయాలనుకున్న బీఆర్ఎస్కు చెందిన జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్కుమార్కు రిజర్వేషన్ కలిసిరాలేదు. అయితే ఆయన భార్యకు అవకాశం దక్కవచ్చు. నాగిరెడ్డిపేట నుంచి బీఆర్ఎస్కు చెందిన మాజీ జెడ్పీటీసీ మనోహర్రెడ్డి ఈసారి కూడా జెడ్పీటీసీ లేదంటే ఎంపీపీ కావాలని ఆరాటపడ్డారు. అయితే రెండు పదవులు ఎస్సీలకు కేటాయించడంతో ఆయన ఆశలు గల్లంతయ్యాయి. ఎల్లారెడ్డి నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగి, జెడ్పీ చైర్మన్ పదవి పొందాలని ఆరాటపడిన మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణదీ ఇదే పరిస్థితి. ఇక్కడ జెడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. లింగంపేట నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయాలని పలువురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఆశపడ్డారు. కానీ జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు బీసీలకు దక్కడంతో వారికి అవకాశం చేజారింది. పాల్వంచ జెడ్పీటీసీ స్థానం బీసీలకు, ఎంపీపీ బీసీ మహిళకు కేటాయించారు. రాజంపేట మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎస్టీలకు రిజర్వ్ అవడంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆరాటపడిన నల్లవెల్లి అశోక్, యాదవరెడ్డి, మోహన్రెడ్డి, కృష్ణారావు, ప్రణీత్రెడ్డి తదితరులకు నిరాశే ఎదురైంది. బాన్సువాడ జెడ్పీటీసీ బీసీలకు రిజర్వ్ కావడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆశించిన గోపాల్రెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు బీసీ మహిళలకు కేటాయించడంతో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులకు పోటీ చేసే అవకాశం మిస్సయ్యింది. రామారెడ్డిలో జెడ్పీటీసీగా మరోసారి పోటీ చేయాలని ఆరాటపడిన మోహన్రెడ్డికి రిజర్వేషన్ కలిసిరాలేదు. ఎంపీపీ, జెడ్పీటీసీ రెండు కూడా బీసీ మహిళకు రిజర్వ్ అవడంతో ఆయన పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నేత గీరెడ్డి మహేందర్రెడ్డి ఎంపీపీ కావాలనుకున్నా రిజర్వేషన్ కలిసిరాలేదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంతోమంది ఆరాటపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవులలో రిజర్వేషన్ దేనికి అనుకూలిస్తే దానికి పోటీ చేయాలని భావించారు. కొందరైతే రెండుమూడేళ్లుగా జనంలో ఉంటున్నారు. అలాంటి పలువురు నేతల ఆశలను రిజర్వేషన్లు గల్లంతు చేశాయి. దీంతో వారు రాజకీయాలపై వైరాగ్యంతో ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
నేడు విజయదశమి
● సొంతూళ్లకు చేరుకున్న జనం ● జిల్లావ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చెడుపై మంచి విజయం సాధించిన రోజే విజయదశమి. సకల శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు ఇది. రావణాసురుడిపై రాముడు విజయం సాధించిన సుదినం.. ఈ విజయాలకు ప్రతీకగా దేశమంతా జరుపుకునే పండుగే దసరా. గురువారం విజయదశమి. పండుగ నేపథ్యంలో అంతటా సందడి నెలకొంది. బతుకుదెరువు కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలు, దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా దసరా సెలవుల్లో ఊళ్లకు చేరుకున్నారు. బతుకమ్మ పండగ కోసం ముందుగానే చాలామంది వచ్చారు. దీంతో ఏ ఇంటికి వెళ్లినా సందడి కనిపిస్తోంది. దసరా పండుగ నాడు కొత్త దుస్తులు ధరించి పాలపిట్టను చూడడానికి పచ్చని పొలాల వెంట వెళ్లడం ఆనవాయితీ. పాలపిట్టను దర్శించుకున్న తర్వాత జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. ఆలయాలకు వెళ్లి విజయాలను ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటారు. అనంతరం స్నేహితులు, బంధుమిత్రులకు జమ్మి ఆకు పంచుతూ అలయ్ బలయ్ తీసుకుంటారు. పండగ సందర్భంగా ఆయుధ, వాహన పూజలు నిర్వహిస్తారు.దసరా పండగ రోజున ఇంటింటా మాంసాహార భోజనాలు, మద్యం సేవించడం ఆనవాయితీగా నడుస్తోంది. అయితే ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా పండగ రావడంతో మాంసం, మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. దీంతో చాలా మంది ముందు రోజే అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. -
శోభాయాత్ర శాంతియుతంగా జరుపుకోవాలి
రుద్రూర్: దుర్గామాత నిమజ్జన శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని కోటగిరి ఎస్సై సునీల్ సూచించారు. కోటగిరి పోలీస్స్టేషన్లో మంగళవారం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎస్సై మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉందని, డీజేలు పెట్టవద్దని సూచించారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలో మంగళవారం రాత్రి నిషేధిత మాదక ద్రవ్వాలపై ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పాతబస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులు, హోటల్స్లలో, పాన్షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, ఇతర చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు శిక్షణ పొందిన స్నిపర్ డాగ్ల ద్వారా పరిశీలించారు. కానిస్టేబుల్ సస్పెన్షన్ మోపాల్: మోపాల్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ గంగాప్రసాద్ను పో లీస్ కమిషనర్ సాయి చైతన్య సస్పెండ్ చేసిన ట్లు సీఐ సురేశ్కుమార్ మంగళవారం తెలిపా రు. పోలీస్స్టేషన్కు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని చేరవేయడం, వి ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో శా ఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నా రు. విలువైన సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సురేశ్కుమార్ హెచ్చరించారు. ● కేసీఆర్ పాలనలో యూరియా కొరత రాలేదు● మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డిసుభాష్నగర్ : బాండ్ పేపర్ల సంగతి జిల్లా ప్రజలందరికీ తెలుసని, ప్రస్తుతం బాండ్ పేపర్లను నమ్మే పరిస్థితి లేదంటూ ఎంపీ అర్వింద్ను ఉద్దేశించి మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మంగళవారం భీమ్గల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ ఉండదని అర్వింద్ బాండ్ పేపర్ రాసిస్తా అంటున్నాడని తెలిపారు. బాండ్ పేపర్ పేరుతో ఎంపీ ఒకసారి చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోలేరని, అందుకే బాండ్ పేపర్లను నమ్మే పరిస్థితి లేదన్నారు. అర్వింద్ తన స్థాయిని తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంటో ఒకసారి బడా భీమ్గల్కు వచ్చి చూడాలని సవాల్ విసిరారు. పసుపు రైతులను మోసం చేస్తున్న చరిత్ర ఎంపీదని, పసుపు బోర్డుకు ఒక నేమ్ బోర్డు ఉంది తప్ప పంటకు మద్దతు ధర ఇంకా తేలేదని ఆరోపించారు. బోర్డు రాక ముందు రూ.10వేలు పలికిన ధర ప్రస్తుతం రూ.6వేలకు పడిపోయిందని విమర్శించారు. దేశం కోసం అని నమ్మి.. మోదీని చూసి రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే.. రైతులకు కనీసం యూరియా బస్తాలు ఇప్పించరా? అని ప్రశ్నించారు. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో ఏనాడూ యూరియా కొరత రాలేదని తెలిపారు. ఓటేసి గెలిపిస్తే ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మోదీతో రాష్ట్రానికి, అర్వింద్తో జిల్లాకు ఒరిగిందేమీ లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారని అన్నారు. -
బీఎస్ఎన్ఎల్ సమృద్ధి జీపీగా వేల్పూర్
వేల్పూర్: బీఎస్ఎన్ఎల్ సమృద్ధి గ్రామ పంచాయతీగా వేల్పూర్ ఎంపికై నట్లు సంస్థ హైదరాబాద్ నోడల్ అధికారి నంబి మృదుపాణి పేర్కొన్నారు. మంగళవారం ఆమె వేల్పూర్ గ్రామ పంచాయతీలో బీఎస్ఎన్ఎల్ సమృద్ధి ద్వారా అందించే సేవలను వెల్లడించారు. సమృద్ధి ద్వారా అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నిజామాబాద్ సబ్ డివిజన్ ఇంజినీర్ హనుమాన్సింగ్, మోర్తాడ్ ఎస్డీఈ చిన్నయ్య, నెట్వర్క్ ఇంజినీర్ సుమన్రెడ్డి, మోర్తాడ్ ఫీల్డ్ టెక్నీషియన్ సతీశ్కుమార్, జేఈ రాకేశ్కుమార్, వేల్పూర్ టీఐపీ సుధాకర్ పాల్గొన్నారు. నవీపేట: మండలంలోని యంచ గోదావరి నది బ్రిడ్జిపై దుర్గామాత నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని బీజేపీ నాయకులు కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డికి జిల్లా కేంద్రంలో మంగళవాం వినతిపత్రం సమర్పించారు. దూర ప్రాంతంలోని దుర్గామాత విగ్రహాలను యంచ గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారని, ఇంత వరకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు వడ్డి మోహన్రెడ్డి, మండల నాయకులు ద్యాగ సరిన్, రాజేందర్గౌడ్, రాజశేఖర్, భూషన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగులకు విరమణ తప్పదు
ఖలీల్వాడి: ఉద్యోగులకు పదవీ విరమణ తప్పదని, ఎలాంటి రిమార్క్ లేకుండా పనిచేయడం గొప్ప విషయమని సీపీ పోతరాజు సాయిచైతన్య పేర్కొన్నారు. జిల్లా పోలీస్ శాఖలో పదవీ విరమణ చేసిన ఎస్సైలు బాబూరావు, ఎండీ నసీరుద్దీన్, సీపీ ఆఫీస్ సూపరింటెండెంట్ వనజా రాణిలను మంగళవారం సీపీ ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులకు ఎలాంటి అవసరం ఉన్నా పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీశైలం, వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి, రూరల్ ఎస్సై ఎండీ ఆరీఫ్, రిజర్వ్ సీఐ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
పెర్కిట్(ఆర్మూర్): ఆలూర్ మండలం మచ్చర్లలో గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు సోమవారం రాత్రి ముగిశాయి. పోటీల్లో జిల్లా వ్యాప్తంగా 24 జట్లు పాల్గొన్నాయి. తుది పోరులో జక్రాన్పల్లి మండలం పడ్కల్ తండా విజేతగా నిలువగా, మచ్చర్ల రెండో స్థానంలో నిలిచింది. విజేతలకు స్థానిక కాంగ్రెస్ నాయకుడు యెర్ర జితేందర్ రెడ్డి రూ.8,888 నగదు బహుమతిని అందజేశారు. కార్యక్రమంలో షేక్ సమీర్, వెల్మ రాజ్కుమార్, ఉప్పు గంగారెడ్డి, కొర్వ ప్రవీణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మాక్లూర్: అడ్డుగా వచ్చిన గేదెలను తప్పించబోయి ఓ యువకుడు బైక్పై నుంచి కిందపడి మృతి చెందిన ఘటన మండలంలోని మాదాపూర్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం మేరకు... నందిపేట మండలం వెల్మల్ గ్రామానికి చెందిన మద్దెపల్లి మోహన్ (44) ద్విచక్ర వాహనంపై రాత్రి 7 గంటలకు పని నిమిత్తం నిజామాబాద్ వెళుతున్నాడు. మాదాపూర్ గ్రామం వద్ద పాడి గేదెలను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు బలమైన గాయాలు కావటంతో మోహన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● చిన్నారి పరిస్థితి విషమం ఆర్మూర్ టౌన్: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ శివారు ప్రాంతం, వెంకటేశ్వర కాలనీ, ఔటిగల్లీల్లో పిచ్చికుక్కల స్వైరవిహారం చేశాయి. మంగళవారం సుమారు 17 మందిపై దాడి చేశాయి. క్షతగాత్రులకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు చికిత్స నిర్వహించారు. కాగా, ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మాక్లూర్ : మండలంలోని కొత్తపల్లి శివారులో ఉన్న ఓ మామిడి తోటలో పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడి చేశారు. పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని రూ.4,620 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. బైక్పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రమాదకరమన్నారు. అధిక వేగం మంచిది కాదన్నారు. సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పర్యవేక్షణ జరుగుతోందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వాడడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, రాష్ డ్రైవింగ్ లాంటివి చేస్తే చలానాలు జారీ చేస్తామన్నారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి, ట్రాఫిక్ ఎస్సై మహేష్, టౌన్ ఎస్సై నరేశ్ తదితరులు ఉన్నారు. యూనిఫామ్ల పంపిణీ కామారెడ్డి క్రైం : దసరా పండుగను పురస్కరించుకుని జిల్లాలోని సివిల్ సప్లై హమాలీల కు మంగళవారం యూనిఫామ్లు పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్ వారికి యూనిఫామ్లతో పాటు స్వీట్లు అందించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు దశర థ్, జిల్లా కార్యదర్శి బాలరాజ్, సివిల్ సప్లై హమాలి యూనియన్ జిల్లా కార్యదర్శి బా జీ, జిల్లా కోశాధికారి మహీపాల్, ఆయా సంఘాల ప్రతినిధులు శ్రీనివాస్, కృష్ణ, సాయి లు, రవి, రమేష్, నర్సింలు, బాబు, హనుమాండ్లు, శివాజీ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ కామారెడ్డి రూరల్: అక్టోబర్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ బుధవారం ప్రారంభం కానుంది. ఆహారభద్రత కార్డులపై ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులపై 10 కిలోల చొప్పున అందిస్తారు. ఈనెల ఒకటో తేదీనుంచి 15వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కాగా ఆరునెలలుగా రావాల్సిన కమీషన్ కోసం రేషన్ డీలర్లు ఆందోళనకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయితే త్వరలోనే కమీషన్ వచ్చేలా చూస్తామని సివిల్ సప్లై కమిషనర్ హామీ ఇవ్వడంతో దుకాణాల బంద్ నిర్ణయా న్ని వెనక్కి తీసుకుని, యథావిధిగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు డీలర్ల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. -
జెడ్పీ పీఠంపై కన్ను!
● కాంగ్రెస్లో తెరపైకి ‘ఏనుగు’ పేరు ● జెడ్పీటీసీగా పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్న అనుచరులు ● మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దఫేదార్ శోభ ● బీఆర్ఎస్కు మెజారిటీ వస్తే చైర్పర్సన్ అయ్యే అవకాశం!స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా జెడ్పీ పీఠంపై చర్చ సాగుతోంది. అధికార పార్టీనుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి జెడ్పీటీసీగా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ నాయకురాలు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దఫేదార్ శోభ కూడా మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలవడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా పలువురు నేతల దృష్టి జెడ్పీ పీఠంపై ఉంది. జెడ్పీటీసీగా గెలిచి జిల్లాపరిషత్ చైర్మన్ కావాలని పలువురు ఆశించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం మీద కన్నేసిన పలువురు నేతలు.. వీలైతే తాము లేకపోతే కుటుంబ సభ్యులను బరిలో నిలపాలని భావించారు. అయితే జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినా.. తమ మండల జెడ్పీటీసీ స్థానం రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో చాలామంది నిరాశకు గురయ్యారు. పలువురు నేతలు ఇక రాజకీయాలు వద్దనే పరిస్థితికి చేరుకున్నారు. కోర్టు తీర్పు వచ్చాకే.. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు ఈనెల 8 తీర్పు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పటివరకు వేచిచూసే ధోరణిలో ఆశావహులు ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినా.. ఇప్పుడే తొందరపడి జేబులు ఖాళీ చేసుకోవడం ఎందుకన్న ఆలోచనలో పలువురు ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు వచ్చాక రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.బీఆర్ఎస్కు చెందిన దఫేదార్ రాజు నిజామాబాద్ జెడ్పీ చైర్మన్గా 2014 నుంచి 2019 వరకు పనిచేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత 2019లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. కామారెడ్డి నూతన జిల్లా పరిషత్గా ఏర్పటైంది. 2019లో జరిగిన ఎన్నికలలో బీసీ మహిళకు అవకాశం రావడంతో దఫేదార్ రాజు భార్య శోభ బరిలో నిలిచారు. ఆ ఎన్నికలలో బీఆర్ఎస్కే ఆధిక్యం దక్కడంతో ఆమెకు చైర్పర్సన్ అవకాశం లభించింది. దఫేదార్ రాజు సొంత మండలం మహ్మద్నగర్ మళ్లీ బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. దీంతో మరోసారి శోభ బరిలో నిలిచే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ వస్తే శోభకు చైర్పర్సన్ అవకాశాలుంటాయని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం.. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిన నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికలలో గెలిచి పట్టు నిలుపుకునేందుకు కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆ పార్టీలో చర్చ నడుస్తోంది. చైర్మన్ పదవి జనరల్ కావడంతో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. గతంలో ఎల్లారెడ్డి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంగానే ఆయన రాజకీయాలు నడిపిస్తున్నారు. అయితే బాన్సువాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అక్కడ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఈ నేపథ్యంలో ఏనుగు రవీందర్రెడ్డి జెడ్పీ చైర్మన్ స్థానంకోసం ప్రయత్నించాలని ఆయన అనుచర వర్గం కోరుతోంది. ఆయన సొంత మండలం తాడ్వాయి జెడ్పీటీసీ స్థానం జనరల్ కావడం ఆయనకు అనుకూలించే అంశం. అనుచరులు ఫోన్లు చేసి ఒత్తిడి తెస్తుండడంతో రవీందర్రెడ్డి ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. రవీందర్రెడ్డి లేదంటే ఆయన భార్య మంజులారెడ్డి బరిలో దిగుతారన్న ప్రచారం జోరందుకుంది. -
రాజకీయ పార్టీలు సహకరించాలి
కామారెడ్డి క్రైం: స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కోరారు. మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల ప్రచారం, ప్రచార ఖర్చులు, ఓటింగ్ ప్రక్రియ, ఫలితాల వెల్లడి తదితర అంశాలను పార్టీల ప్రతినిధులకు వివరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్నాయక్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీపీవో మురళి, రాజకీయ పార్టీల ప్రతినిధులు కై లాస్ శ్రీనివాస్రావు, కుంబాల రవియాదవ్, చంద్రశేఖర్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ ప్రయోజనాలే సంఘ్ సభ్యులకు ముఖ్యం
బీబీపేట: ఆర్ఎస్ఎస్ సభ్యులకు వ్యక్తి, కుటుంబం, సంస్థ, కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విభాగ్ సహకార్యవాహ పాపయ్యగారి గోవర్ధన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గోవర్ధన్రెడ్డి మాట్లాడారు. దేశ సేవలో సంఘ్ పాత్ర ఎంతో గొప్పదన్నారు. దేశంలో ప్రపంచంలో ఎన్నో సంస్థలు, సంఘాలు ఏర్పడ్డాయని కానీ కాలగమనంలో గతించాయన్నారు. కానీ సంఘ్ మాత్రం దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలకు కోసం మాత్రమే పని చేసిందని, భవిష్యత్తులో కూడా చేస్తుందని తెలిపారు. సంస్థప్రతినిధులు ఏదుల్ల ఇంద్రసేనారెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు మద్నూర్(జుక్కల్): మండలంలోని మేనూర్లో మంగళవారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను స్వయం సేవకులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనూర్లోని ప్రధాన వీధులలో స్వ యం సేవకులు పద సంచలన్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జి ల్లా విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఆపద వచ్చినా స్వయం సేవకులు ముందుండి సహాయక చర్యల్లో పాల్గొంటారన్నారు. ప్రాణాలకు తెగించి విపత్కర పరిస్థితులను సైతం లెక్క చే యకుండా స్వయం సేవకులు చేసిన సామాజిక కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయన్నారు. దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు. కార్యక్రమంలో స్వయం సేవకులు, ప్రజలు పాల్గొన్నారు. -
బడుగుల చేతికి పల్లె పాలన!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లె పాలనలో బడుగులదే పైచేయిగా నిలువనుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఎంతోమందికి అవకాశాలు దక్కనున్నాయి. జిల్లాలో 532 పంచాయతీలు ఉండగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి కనీసం 371 గ్రామాల్లో సర్పంచ్లుగా అవకాశం దక్కనుంది. ఇందులో 65 గిరిజన పంచాయతీల్లో సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల స్థానాలన్నీ గిరిజనులకే దక్కుతాయి. అలాగే ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా మరో 26 పంచాయతీల్లోనూ గిరిజనులే సర్పంచ్లు కానున్నారు. ఇందులో కనీసం 40 మంది గిరిజన మహిళలకు అవకాశం దక్కనుంది. బీసీలకు 201 సర్పంచ్ పదవులు రిజర్వ్ అయ్యాయి. ఇందులో 96 స్థానాలను మహిళలకు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి 79 పంచాయతీలు దక్కాయి. ఇందులో 35 చోట్ల మహిళలకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో 25 మండలాలు ఉండగా, జెడ్పీటీసీ సభ్యులతో పాటు ఎంపీపీ పదవులు 17 బడుగులకు దక్కనున్నాయి. ఇందులో బీసీలకు 11 స్థానాలు కేటాయించగా, ఐదుచోట్ల బీసీ మహిళలు మాత్రమే పోటీ చేయనున్నారు. ఎస్సీలకు నాలుగు స్థానాలు ఇవ్వగా.. రెండుచోట్ల ఎస్సీ మహిళలకు అవకాశం దక్కింది. ఎస్టీలకు రెండు స్థానాలు కేటాయించగా.. ఒక స్థానంలో ఎస్టీ మహిళ పోటీ చేయనున్నారు. అలాగే ఎంపీటీసీ స్థానాలు 233 ఉండగా.. ఇందులో బీసీలకు 98, ఎస్సీలకు 40, ఎస్టీలకు 20 స్థానాలు రిజర్వ్ అయ్యాయి. 201 పంచాయతీల్లో బీసీలకు రిజర్వేషన్ అనుకూలం 91 సర్పంచ్ స్థానాలు గిరిజనులకు.. 79 సర్పంచ్ పదవులు ఎస్సీలకు రిజర్వ్ -
పోలీస్ పరేడ్ రగ్రౌండ్లో చండీయాగం
● హాజరైన కలెక్టర్, సీపీఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన దుర్గా పరమేశ్వరీ మాత మందిరంలో మంగళవారం మహా చండీయాగం నిర్వహించారు. యాగానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ పోతరాజు సాయిచైతన్యలు సతీమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు బస్వారెడ్డి, రామచంద్రరావు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్కుమార్, ఆర్మూర్, బోధన్ సబ్ కలెక్టర్లు అభిజ్ఞాన్ మాల్వీయ, వికాస్ మహతో, డీఎంహెచ్వో రాజశ్రీ, ట్రెయినీ కలెక్టర్, ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్కోను ముంచిన ‘మంజీర’
● వరద పోటెత్తడంతో నీటమునిగిన ట్రాన్స్ఫార్మర్లు, దెబ్బతిన్న స్తంభాలు ● సుమారు రూ.20 లక్షల నష్టంనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మంజీర పరివాహాక ప్రాంతంలో నదికి వరద పోటెత్తడంతో ట్రాన్స్కోకు భారీ నష్టం వాటిల్లింది. గతనెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చి న వరదనీటి ప్రవాహానికి మండలంలోని ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్శాఖకు సుమారు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు ట్రాన్స్కో అధికారులు తెలిపారు. మండలంలోని 131 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతోపాటు సుమారు 200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు. అలాగే మండలంలోని గోలిలింగాల, చీనూర్, వాడి, నాగిరెడ్డిపేట, లింగంపల్లికలాన్, వెంకంపల్లి, తాండూర్, మాటూ ర్, మాసాన్పల్లి, ఆత్మకూర్ తదితర గ్రామాల శివారుల్లోని పంట పొలాలు నీటమునిగాయి. కాగా, వరదనీటి నుంచి బయటపడ్డ పంటలను గట్టెక్కించాలనే ఉద్దేశ్యంతో తాత్కాలికంగా రెండు 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి వ్యవసాయ బోరుబావులకు కరెంట్ సరఫరా చేశారు. దీంతోపాటు సుమారు 80 ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టి తిరిగి బిగించారు. సుమారు నెలరోజులుగా పంటపొలాలు వరద నీటిలోనే ఉండడంతో మిగిలిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టలేకపోతున్నారు. వరదనీరు పూర్తిగా తొలగిపోయిన తర్వాత నీటమునిగిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతులు చేపట్టడంతోపాటు నేలకూలిన స్తంభాలను సరిచేస్తామని ట్రాన్స్కో అధికారులు పేర్కొంటున్నారు. -
ఇంటి ఆవరణలో విద్యుత్ స్తంభం!
ఎక్కడైన విద్యుత్ స్తంభాలు రోడ్డు పక్కన, ఇంటి ముందరలో ఉంటాయి. కానీ ఇంటి ఆవరణలోనే ఉన్న ఈ విద్యుత్ స్తంభాన్ని చూసి ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే!. మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో అనాచి రమేశ్ అనే వ్యక్తికి చెందిన ఇంటి పైనుంచి విద్యుత్ వైర్లు వెళుతున్నాయి. ఈక్రమంలో వైర్లు కిందికి ఉండటంతో ప్రమాదం సంభవించకుండా మెట్ల పిల్లర్కు ఓ పైపు ద్వారా పోల్ తయారు చేసి దానికి వైర్లు పైకి ఉండేలా ఏర్పాటు చేశాడు. ఈ దృశ్యాన్ని అటుగా వెళ్లేవారు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అయితే వైర్లను, స్తంభాన్ని విద్యుత్శాఖ అధికారులు రోడ్డు పక్కన ఏర్పాటు చేయాల్సిందని పలువురు పేర్కొంటున్నారు. – మాచారెడ్డి -
రుణమాఫీ పథకం వందశాతం అమలు చేయాలి
భిక్కనూరు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ. 2 లక్షల పంట రుణాల మాఫీ పథకాన్ని వందశాతం అమలు చేయాలని రామేశ్వర్పల్లి రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం రామేశ్వర్పల్లిలో విండో చైర్మన్ నాగార్తి భూంరెడ్డి అధ్యక్షతన 68వ విండో మహాజన సభ నిర్వహించారు. ఈ సభలో రైతులు పలు తీర్మానాలను ఆమోదించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని, కొనుగోలు కేంద్రాల్లో హమాలీ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని తీర్మానించారు. కార్యక్ర మంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, వీడీసీ చైర్మన్ మద్ది సూర్యకాంత్రెడ్డి, ప్రతినిధులు పోతిరెడ్డి, నర్సారెడ్డి, విండో సీఈవో శంకర్, వైస్చైర్మన్ శేఖర్, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
ఎన్నికల నియమావళిని పాటించాలి
● కోడ్ ఉల్లంఘించేవారిపై చర్యలు తప్పవు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగుతాయన్నారు. తొలి విడతలో కామారెడ్డి, ఎల్లారెడ్డి డివిజన్లలోని 13 మండలాల(గాంధారి మినహా) పరిధిలోని 266 పంచాయతీలకు, రెండో విడతలో బాన్సువాడ డివిజన్లోని 11 మండలాలతో పాటు గాంధారి మండలానికి కలిపి 266 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ఆయా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఆఫీసర్లు, రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు శిక్షణ కూడా ఇచ్చామన్నారు. ఎన్నికల నియమావళిని అమలు చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై అభ్యర్థులు ఎలాంటి రాతలు రాయొద్దన్నారు. జెడ్పీటీసీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు రూ.4 లక్షల వరకు, ఎంపీటీసీలు రూ లక్షన్నర రూపాయల వరకు, ఐదు వేలకుపైగా జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్లుగా పోటీ చేసేవారు రూ. 2.50 లక్షలు, ఐదు వేలలోపు జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు లక్షన్నర రూపాయల వరకు ఖర్చు చేసుకోవచ్చన్నారు. ఐదు వేల జనాభా పైన ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.50 వేలు, ఐదు వేల లోపు జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులు రూ.30 వేలు ఖర్చు చేసుకోవచ్చన్నారు. నిరంతరం వాహనాల తనిఖీలుంటాయి ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇంటిగ్రెటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే 613 పోలింగ్ లొకేషన్లు, అలాగే సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరిగే 605 పోలింగ్ లొకేషన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో నలుగురి వద్ద ఆయుధాలు ఉన్నాయని, ఎన్నికల నేపథ్యంలో వాటిని డిపాజిట్ చేసుకుంటామని పేర్కొన్నారు. 197 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీపీవో మురళి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
నిలకడగా గోదారి.. నీటిలోనే పంటలు
రెంజల్(బోధన్): ఉగ్ర గోదావరి నిలకడగా మారింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీ వరద వస్తుండగా, స్థానికంగా మంజీర నది నుంచి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో గోదావరి నది పరీవాహక గ్రామాల్లో వేసిన పంటలు నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులుగా వరద నీరు వదలక పోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తాడ్బిలోలి–బోర్గాం గ్రామాల మధ్య నిర్మించిన జాతీయ రహదారికి ఇరువైపులా పంట పొలాలు 15 ఫీట్ల లోతులో మునిగి ఉన్నాయి. నిలిచిన రాకపోకలు తాడ్బిలోలి–బోర్గాం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి బ్యాక్వాటర్తో రెండు గ్రామాల మధ్య ఉన్న వంతెనకు ఇరువైపులా రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. నిజామాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను సాటాపూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా గ్రామానికి నడుపుతున్నారు. -
భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం ● ఎడపల్లి తహసీల్, ఎంపీడీవో కార్యాలయాల తనిఖీ బోధన్: భూ భారతి (రెవెన్యూ) సదస్సుల్లో స్వీకరించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా పర్యవేక్షించాలని తెలిపారు. ఎడపల్లి తహసీల్, ఎంపీడీవో కార్యాలయాలను సోమవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. రెవెన్యూ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ దత్తాద్రి, ఉద్యోగులతో సమావేశమై దరఖాస్తులపై గ్రామాల వారీగా సమీక్షించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ చేపడుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. గడువులోపు ఎస్ఐఆర్ను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. అంతకుముందు ఎంపీడీవో ఆఫీస్ను సందర్శించి అధికారులు, ఉద్యోగులతో మండలంలోని కొనసాగుతున్న అభివృద్ధి పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై ఆరా తీశారు. లబ్ధిదారులందరూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఇప్పటికే పూర్తయిన ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
మోపాల్: మండలంలోని న్యాల్కల్ శివారులో ఉన్న పొలంలో నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. ఎస్సై సుష్మిత తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్ శివారులోని రెండు 25 కేవీ, మరో రెండు 16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. సోమవారం ఉద యం గమనించిన రైతులు విద్యుత్ శాఖ ఏఈ నాగశైర్వానీ, లైన్మన్ మనోహర్కు సమాచా రం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, పంచనామా నిర్వహించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
బీబీపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి అధికారి సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన మండల కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు ఉండకూడదని, వాల్ పెయింటింగ్లు ఉన్నచోట పెయింట్ వేయాలని సూచించారు. అలాగే నాయకుల విగ్రహాల నాయకులకు ముసుగులు వేయాలని తెలిపారు. ప్రతిరోజు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ గంగసాగర్, ఆర్ఐ రాముల తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీల తొలగింపు ఎల్లారెడ్డిరూరల్/ నాగిరెడ్డిపేట: స్థానిక సంస్థలకు సంబంధించి ఎ న్నికల కోడ్ అమలులోకి రావడంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల లో రాజకీయ నాయకుల కు సంబందించిన ఫ్లెక్సీలను సోమవారం తొలగించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో ఎల్లా రెడ్డి, నాగిరెడ్డిపేటలోని ప్రభుత్వ భవనాలు, స్థలాల లో రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్ట ర్లు, ఫ్లెక్సీలను అధికారులు తొలగించి వేశారు. ● జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం ఖలీల్వాడి: తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఎవరో అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం ‘సాక్షి’కి ఫోన్ ద్వారా సోమవారం తెలిపారు. విధుల్లో భాగంగా వివిధ అంశాలపై అందరి సమక్షంలో మాట్లాడుతామని, తనపై అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సబబుకాదన్నారు. తనపై ఎలాంటి జుడీషియల్ విచారణ జరగడం లేదన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. మరోవైపు, ఇదే అంశంపై కామారెడ్డి జైలులోని జూనియర్ అసిస్టెంట్ ముందుకొచ్చి నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్పై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని వివరణ ఇచ్చారు. ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఉన్నతాధికారికి ఉత్తరం అందించారు. -
ఎరువులు అందుబాటులో ఉంచాలి
● వర్షాలకు నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి ● సొసైటీ మహాజన సభల్లో సభ్యుల తీర్మానంబిచ్కుంద/పిట్లం/పెద్దకొడప్గల్: రైతులకు యూరియా, ఎరువులు తగినంత అందుబాటులో ఉంచాలని వివిధ గ్రామాల సొసైటీలు మహాజన సభల్లో తీర్మానించాయి. వర్షాలు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బిచ్కుంద, పిట్లం, పెద్దకొడప్గల్ మండలంలోని పలు సొసైటీల్లో సోమవారం మహాజన సభలు నిర్వహించారు. ఈసందర్భంగా సొసైటీ సభ్యులు, రైతులు పలు అంశాలపై చర్చించి, తీర్మానాలు చేశారు. ముఖ్యంగా రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని, యాసంగి వరి ధాన్యంపై బోనస్ ఇవ్వాలని, ఖరీఫ్ వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని తదితర తీర్మానాలు చేశారు. సొసైటీ చైర్మన్లు నాల్చర్ బాలాజీ, ఒంటరి శబ్దంరెడ్డి, సాయిరెడ్డి, హన్మంత్రెడ్డి, వైస్ చైర్మన్ యాదవరావు, డైరెక్టర్లు, సీఈవో శ్రావణ్ కుమార్, బంతిలాల్, దస్తారుడ్డి, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు. -
గ్రూప్–2 ఉద్యోగాలకు ఎంపిక
భిక్కనూరు: కరీంనగర్ జి ల్లాకు చెందిన శ్రీజారెడ్డి భిక్కనూరులోని తెలంగా ణ యూనివర్సిటీ సౌత్క్యాంపస్లో జియోఇన్ఫర్మెటిక్స్ ద్వితీయ సంవ త్సరం పూర్తి చేసుకుంది. ఇటీవల గ్రూప్–2 పరీక్ష రాయగా, ఫలితాల్లో ఆమె ప్రతిభ చూపి ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై ంది. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్, అఽ ద్యాపకులు నారాయణ గుప్త, ప్రతిజ్ఞ సోమవా రం మాట్లాడుతూ.. శ్రీజారెడ్డి ఒకేసారి రెండు ఉద్యోగాలకు ఎంపిక అవడం హర్షణీయమన్నారు. గ్రూప్1లో 94వ ర్యాంకు ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డికి చెందిన మున్నం శశికుమార్ గ్రూప్1లో రాష్ట్రస్థాయి 94వ ర్యాంకు సాధించి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్గా ఉద్యోగాన్ని సాధించాడు. ఈమేరకు లేబర్ కమిషనర్ దాన కిషోర్ చేతుల మీదుగా ఆయన నియామక ఉత్తర్వులను అందుకున్నారు. శశికుమార్ తల్లితండ్రులు సైతం ఉపాధ్యాయులుగా పని చేసి రిటైర్ అవ్వగా, తండ్రి ఇటీవలే మృతి చెందారు. భార్య మమత సైతం స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తున్నారు. తల్లి, భార్యల ప్రోత్సాహంతోనే ఉద్యోగం సాధించినట్లు శశికుమార్ తెలిపారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కల్లుడిపో సమీపంలో వర్షానికి ఓ ఇల్లు కూలిపోయింది. మండల కేంద్రానికి చెందిన సాకలి పెద్దొల్ల లక్ష్మి భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఒంటరిగా నివసిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి గోడలు ధ్వంసమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున కూలిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో తనకు ప్రభుత్వం న్యాయం చేయాలని లక్ష్మి కోరారు. ఇల్లు కూలిందని అధికారులకు తెలిసినా వచ్చి చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ● మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పెర్కిట్(ఆర్మూర్): ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మార గంగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలు ‘ఏ’ గ్రేడు ధాన్యానికి రూ.2,389, ‘బీ’ గ్రేడు ధాన్యానికి రూ.2,369 మద్దతు ధర అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు మధ్య దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, ఏఈవో సవిత, సీఈవో శ్యాం, డైరెక్టర్లు ఆలూర్ నారాయణ రెడ్డి, పుప్పాల ప్రవీణ్, నరేడ్ల గంగారాం, చిట్టెడి చిన్నయ్య, కుంట గంగారెడ్డి, మురళి, కళ్లెం నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
నిజామాబాద్ లీగల్: హత్యాయత్నం కేసులో ఒకరికి నిజామాబాద్ అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి సాయి సుధా ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా భక్తపూర్కు చెందిన షకీల్ తాగుడుగు బానిసై నిజామాబాద్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో సంచరించేవాడు. 18 అక్టోబర్ 2021న నిజామాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్ఎల్ఎస్ వైన్స్ వద్ద మద్యం తాగి గొడవచేస్తుండగా, షేక్ జలీల్ అనే వ్యక్తి గొడవ చేయొద్దంటూ షకీల్ను బెదిరించాడు. దీనిని మనస్సులో పెట్టుకున్న షకీల్, జలీల్పై దాడిచేయాలని నిర్ణయించుకొని తర్వాతి రోజు కత్తితో వైన్స్ వద్దకు వచ్చాడు. రెండో రోజు సైతం జలీల్ బెదిరించడంతో షకీల్ అతనిపై కత్తితో దాడిచేసి, కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. వైన్స్లో పనిచేస్తున్న రమేశ్, సర్ఫరోజ్ ఖాన్ ఇద్దరినీ విడిపించి, జలీల్ను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి షకీల్ను జైలుకు పంపారు. ఈ కేసులో పోలీసుల తరఫున డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మినర్సయ్య వాదించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి నిందితునికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించారు. వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకరిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేశ్ సోమవారం తెలిపారు. చందూర్ మండలంలో ఆరేళ్ల బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడటంతో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద 63 నెంబర్ జాతీయ రహదారిపై అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని సోమవారం పట్టుకున్నట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. క్రాస్రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా కోరుట్ల నుంచి వచ్చిన ఇసుక లారీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
అమ్రాబాద్ శివారులో చిరుత సంచారం
● లేగ దూడపై దాడితో ఆలస్యంగా వెలుగులోకి.. మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని అమ్రాబాద్ శివారులోగల గుండ్యానాయక్ తండా అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు సోమవారం తెలిపారు. రెండ్రోజుల క్రితం 9 నెలల లేగ దూడపై దాడి చేసి ఎత్తుకెళ్లగా, కళేబరం గుర్తించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెగావత్ రమేశ్ ప్రతిరోజూ 60 ఆవుల మందను మేత కోసం అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్తాడు. మూడు రోజుల క్రితం ఆవుల మందలోని 9 నెలల లేగ దూడ కన్పించలేదు. సోమవా రం కూడా ఆవుల మందను మేత కోసం తీసుకెళ్లగా, చిరుత ఆవుపై దాడికి యత్నించింది. గమనించిన రమేశ్ అరుపులు వేయడంతో అడవిలోకి వెళ్లిపోయింది. దాడిలో ఆవుకు స్వల్పంగా గాయమైంది. లేగ దూడపై కూడా చిరుత దాడి చేసిందని నిర్ధారణకు వచ్చిన రమేశ్.. దాని కోసం వెతకగా బండరాళ్ల మధ్య కళేబరం కన్పించింది. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమివ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. చిరుత సంచరిస్తున్నట్లు సెక్షన్ ఆఫీసర్ సాయికుమార్, బీట్ ఆఫీసర్ సురేశ్కుమార్, వాచర్లు రవి, బీమా గుర్తించారు. ప్రజలు, గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
మోగిన నగారా!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘స్థానిక’ సమరానికి ఎట్టకేలకు ముహూర్తం ఖరారయ్యింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. జిల్లాలో 25 మండలాలకు జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 233 ఎంపీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే జిల్లాలోని 532 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులతో పాటు, 4,656 వార్డులకు సైతం రెండు విడతల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో పాటే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లపై ఫోకస్ చేసింది. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి శిక్షణ, కేంద్రాల మ్యాపింగ్ వంటి పనులు పూర్తిచేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. పంచాయతీ ఎన్నికలు... గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా రెండు విడతల్లో జరగనున్నాయి. జిల్లాలో 532 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 4,656 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదలయ్యింది. మొదటి విడతలో కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోని 266 పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయి. తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 17న విడుదలవుతుంది. ఆనాటినుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 20 న నామినేషన్లను పరిశీలిస్తారు. 23 న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విరమణకు అవకాశం ఉంటుంది. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 31న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రెండో విడతలో గాంధారి, నిజాంసాగర్, పిట్లం, మహ్మద్నగర్, జుక్కల్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మద్నూర్, డోంగ్లీ, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని 266 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. దీనికి సంబంధించి అక్టోబర్ 21న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 21 నుంచి 23 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 24న నామినేషన్ల స్క్రూటినీ నిర్వహిస్తారు. 27న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువుంటుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా, గుర్తులను ప్రకటిస్తారు. నవంబర్ 4న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.ఇతరులు1399087 12421కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులకోసం హెల్ప్లైన్ నంబర్మండల పరిషత్, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి విడత 14 మండలాల పరిధిలో 14 జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 136 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల కోసం అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదేరోజు నుంచి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12న నామినేషన్ల పరిశీలన పూర్తవుతుంది. 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 23న పోలింగ్ జరుగుతుంది. రెండో విడత 11 మండలాల పరిధిలోని 11 జెడ్పీటీసీ స్థానాలు, 97 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలై 15 న ముగుస్తుంది. 16న నామినేషన్ల పరిశీలన, 19 వరకు నామినేషన్ల విరమణకు అవకాశం ఉంటుంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 27న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. రెండు విడతలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఉంటుంది. పల్లెపోరుకు తెరలేచింది. పరిషత్, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యింది. దీని ప్రకారం అక్టోబర్ 23న 14 మండలాల్లో, 27న మిగిలిన 11 మండలాల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 31న 266 పంచాయతీలకు, నవంబర్ 4న మిగిలిన 266 పంచాయతీలకు పోలింగ్ ఉంటుంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ రోజే కౌంటింగ్ నిర్వహించనుండగా.. పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్లను నవంబర్ 11న లెక్కించనున్నారు. జిల్లాలో రెండు విడతల్లో పరిషత్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు కూడా రెండు విడతల్లోనే... అమలులోకి ఎన్నికల కోడ్ ఏర్పాట్లలో యంత్రాంగం బిజీ -
‘నిర్దేశిత ఆర్పీఎంలోనే వరికోతలు చేపట్టాలి’
కామారెడ్డి క్రైం : జిల్లాలోని హార్వెస్టర్ యజమానులు తమ హార్వెస్టర్లను నిర్దేశిత ఆర్పీఎంలో ఉంచి వరికోతలు చేపట్టాలని జిల్లా ర వాణా శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి సూచించారు. సోమవారం తన కార్యాలయంలో హా ర్వెస్టర్ యజమానులకు వరి కోతలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ హార్వెస్టర్ను నిర్దేశిత ఆర్పీ ఎంలో ఉంచితే పొల్లు రాకుండా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు సూ చించిన మేరకు ప్రాధాన్యత క్రమంలో వరి కోతలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంవీఐలు, ఏఎంవీఐలు తదితరులు పాల్గొన్నారు. మెట్ట పంటల పరిశోధన కేంద్రం సందర్శన కామారెడ్డి టౌన్: పటాన్చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రాన్ని సోమవారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సందర్శించారు. కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ హరికిషన్రెడ్డిలతో మాట్లాడి వ్యవసాయ పరిఽశోధనల గురించి తెలుసుకున్నారు. కామారెడ్డిలో చిరుధాన్యాల సాగుకు రైతులకు అవగాహన కల్పించేందుకు సహకరించాలని వారిని కోరారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు గుప్తా, ప్రకాష్, శోభన్ తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ కలెక్టర్గా రవితేజ కామారెడ్డి టౌన్: జిల్లాకు శిక్షణ డిప్యూటీ కలెక్టర్గా రవితేజ నియమితులయ్యారు. తాజా గా టీజీపీఎస్సీ గ్రూప్– 1 నుంచి నియామ కం అయిన ఆయన సోమవారం కలెక్టర్ ఆశి ష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. ఎనిమిదేళ్ల తరువాత జూనియర్ కళాశాలలకు నిధులు నిజామాబాద్అర్బన్: నిజామాబాద్ జిల్లాలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రభుత్వం ఇటీవల రూ.3.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఎనిమిదేళ్ల తరువాత నిధులు రావడం గమనార్హం. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో ఆయా కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ముఖ్యంగా నీటివసతి, మరమ్మతులు, నీటి పైపుల ఏర్పాటు, టాయిలెట్లకు మరమ్మతులు, డ్యూయల్ డెస్క్ వంటి పనులు చేపడతారు. విద్యార్థుల సంఖ్యను బట్టి ఎక్కువ సమస్యలు ఉన్న కళాశాలలకు అవసరాన్ని బట్టి నిధులు మంజూరు చేస్తున్నారు. -
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● పక్కాగా ఎన్నికల నియమావళి అమలు చేయాలి ● వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికామారెడ్డి టౌన్ : స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. సోమవారం ఆమె హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, జిల్లా అధికారులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి అమలుపై పలు సూచనలు ఇచ్చారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్రైటింగ్లను తొలగించాలన్నారు. ఎన్నికల నిర్వహణపై పీవోలు, ఏపీవోలకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాత ధోరణి ఉండేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం, డబ్బు లేదా బహుమతులు తదితర కార్యక్రమాల ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పీవో, ఏపీవో, ఆర్వో, ఏఆర్వోలకు మొదటి విడత శిక్షణ పూర్తి చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. జిల్లాస్థాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలను ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించామన్నారు. ఎన్నికల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను గుర్తించామని, జిల్లాలో అవసరమైన బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, డీపీవో మురళి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీటీవో శ్రీనివాస్రెడ్డి, డీఎల్పీవోలు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున తక్షణమే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం ఆయన ఎంపీడీవోలు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయడానికి నోడల్ అధికారులు పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. -
నిజాంసాగర్లోకి భారీ వరద
ఎస్సారెస్పీలోకి..నిజాంసాగర్ : ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 1,13,552 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 19 వరద గేట్లను ఎత్తి 1,25,307 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,400.55 అడుగుల (11.949 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.బాల్కొండ: ఎగువ నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి సోమవారం ఇన్ఫ్లో పెరిగింది. ఆదివారం రోజు 3.15 లక్షల క్యూసెక్కుల నీరు రాగా, అర్ధరాత్రి తరువాత 4.5 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తరువాత క్రమంగా తగ్గుతూ సోమవారం రాత్రి వరకు 3.5 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. 39 వరద గేట్ల ద్వారా 3.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆది వారం 4.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా సోమవారం తగ్గించారు. కాకతీయ కాలు వ ద్వారా 4 వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వా రా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 400, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, ఆవిరి రూపంలో 581 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా సోమ వారం రాత్రి 1,083.30 (54.7టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉంది. -
ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు
● ఆందోళనలో అన్నదాతలు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు బతుకమ్మతో మహిళ, చిన్నారులు రాజంపేట: నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షా లు రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంటలు నీటమునుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.వేల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తుంటే నిత్యం కురుస్తున్న వర్షాల వల్ల పొలాలు నీటమునుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలుచోట్ల మొక్కజొన్న పంటలు నీరు పట్టి దెబ్బతినగా, వరి పంటలు సైతం చేతికి అందేలా లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నష్టపరిహారం అందిస్తే తప్ప కోలుకునే పరిస్థితిలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. క్రైం కార్నర్నాలుగున్నర ఎకరాలలో వరిపంట సాగు చేస్తున్నాను. గతంలో కురిసిన వర్షాలకు వరి పంట చాలా వరకు దెబ్బతిన్నది. పొలం పక్కన కాలువ ఉండటంతో వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో పంట మునిగిపోతుంది. పొలంలో ఇసుకమేటలు ఏర్పడ్డాయి. ఏమి చేయాలో తోచడం లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. –రాజిరెడ్డి, రైతు, శివాయిపల్లి -
మంచి జీవన శైలి అలవర్చుకోవాలి
శారీరక శ్రమ లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోవడం, మత్తు పదార్థాలు, ధూమపానం వంటి వాటితో అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే అలవాట్లను మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలి. నడకతో గుండె మీద భారాన్ని తగ్గించుకోవచ్చు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకునేందుకు వైద్యుల సలహాలు పాటిస్తే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు. – శరత్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్యకళాశాల, కామారెడ్డి -
జిల్లా కేంద్రంలో ‘పూల’ సందడి
కామారెడ్డి టౌన్: జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం జరుపుకోనున్నారు. ఈక్రమంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని మా ర్కెట్లో పూల కొనుగోళ్లతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని సుభాష్రోడ్, జేపీఎన్ రోడ్ అంతటా గునక, తంగెడు, తదితర పూల కేంద్రాలు వెలియగా విక్రయాలు జోరుగా సాగా యి. వ్యాపారులు పండుగ నేపథ్యంలో పూల ను అధిక ధరలకు విక్రయించడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో నేడు సద్దుల బతుకమ్మ.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో నేడు సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. పట్టణంలోని పెద్ద చెరువుకట్ట, ప్ర భుత్వ జూనియర్ కళాశాల, కొచ్చెరువు, ఆజాద్గ్రౌండ్, రాజుల కుంట వద్ద బతుకమ్మ ఆటలను ఆడి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేయాలని వారు కోరారు. పండుగకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మహేష్కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు. గాంధారిలో.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో నేడు నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రజ లు రోడ్డుపైనే జరుపుకోవాలని గ్రామ కార్యదర్శి కోరారు. వర్షాల కారణంగా వాగు వద్ద వేడుకలు నిర్వహించేందుకు అనుకూలంగా లే దన్నారు. రోడ్డుపైనే ఒక పక్కన వేడులకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
బతుకమ్మ పాట
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో పూల బతుకమ్మ ఉయ్యాలో పండుగ బతుకమ్మ ఉయ్యాలో అద్దాల బతుకమ్మ ఉయ్యాలో ఆడ బతుకమ్మ ఉయ్యాలో అలంకార బతుకమ్మ ఉయ్యాలో పూల తోరణాల బతుకమ్మ ఉయ్యాలో గన్నేరు గజ్జల బతుకమ్మ ఉయ్యాలో గోరింటాకు పూసిన బతుకమ్మ ఉయ్యాలో గోదారి జలాల బతుకమ్మ ఉయ్యాలో గోపురాల వెలుగు బతుకమ్మ ఉయ్యాలో చెంపకూల బతుకమ్మ ఉయ్యాలో చెరువుల కట్టేలా బతుకమ్మ ఉయ్యాలో చిరునవ్వుల బతుకమ్మ ఉయ్యాలో తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో తాళ్లచెట్టు బతుకమ్మ ఉయ్యాలో తెలంగాణ తల్లి బతుకమ్మ ఉయ్యాలో తల్లిదండ్రుల ఆశీర్వాద బతుకమ్మ ఉయ్యాలో మల్లెలు ముత్యాల బతుకమ్మ ఉయ్యాలో మట్టి వాసన బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ గెలిచింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో బతుకమ్మ జయహో ఉయ్యాలో!! – డాక్టర్.సాహితీ వైద్య, టొరంటో కెనడా -
ముంపుప్రాంతాల పరిశీలన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వెంకంపల్లి, తాండూర్, బంజరప్రాంతంలో వరదనీటితో ముంపునకు గురైనప్రాంతాలను ఆదివారం ఎల్లా రెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా వెంకంపల్లి, తాండూర్ శివారులో వరదనీటితో మునిగిన పంటలను రైతులతో కలిసి సందర్శించారు. వెంకంపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరనదిని, బంజర సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా వ చ్చిన వరదనీటిని పరిశీలించారు. వరదనీరు రహ దారి పైకి చేరకుండా అడ్డుగా మట్టికట్టలు వేయా లని హైవే సిబ్బందికి ఆయన సూచించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. -
దేశీదారు పట్టివేత
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన దేశీదారు పట్టుకున్నామని ఎకై ్సజ్ సీ సత్యనారాయణ ఆదివా రం తెలిపారు. పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన మేదరి గంగారాం మహా రాష్ట్ర నుంచి బైక్పై దేశీదారు తీసుకొస్తున్నార ని సమాచారం మేరకు బిచ్కుంద బస్టాండ్ వద్ద కాపుకాచి పట్టుకొని 8 దేశీదారు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంగారాంను పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. ● ఒకరి మృతి ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గేట్ వద్ద ఎక్సెల్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. మహ్మద్నగర్ మండలంలోని నర్వ గ్రామానికి చెందిన గూల చిన్న అంజయ్య (47) నిజాంసాగర్ నుంచి నర్వకు వెళ్తుండగా, బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే అంజయ్య మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా దొంగతనాలు
ఖలీల్వాడి: తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే ముఠాకు చెందిన సభ్యులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీపీ పోతరాజు సాయిచైతన్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న నగరంలోని నాగారం బ్రాహ్మణకాలనీలోని పూజారి వేలేటి పవన్ శర్మ ఇంట్లో చొరబడిన దుండగులు సుమారు 33 తులాల బంగారం, 25 తులాల వెండి, రూ. 30 వేల నగదు అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదయం విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని ధర్మపురిహిల్స్ డ్రైవర్స్కాలనీకి చెందిన షేక్సల్మాన్ అలియాస్ సోనూ, దొడ్డికొమురయ్య కాలనీకి చెందిన మరాఠి ఆకాశ్రావు నాగారంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల చౌరస్తా వద్ద ఆటోలోఅనుమానాస్పదంగా వెళుతుండగా పోలీసులు పట్టుకొని విచారించారు. షేక్సల్మాన్ అలియాస్ సోనూ వద్ద 31 తులాల బంగారం, మరాఠి ఆకాశ్రావు వద్ద దొంగతనానికి ఉపయోగించిన ఆటో, మొబైల్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరినీ విచారించగా ఐదుగురు సభ్యులు కలిసి దొంగల ముఠా ఏర్పడిందని, ముఠాకు నాయకుడు షేక్ సాదక్ అని తెలిపారు. సాదక్కు గంజాయి అలవాటు ఉందని, దొంగతనాలకు స్కేచ్ వేస్తాడన్నారు. వినోద్ చౌహాన్, ముక్తే సాయినాథ్, షేక్ సాదక్ కలిసి దొంగతనాలు చేస్తారని, ముగ్గురిపై నగరంలోని పోలీస్స్టేషన్లలో దొంగతనాల కేసులు ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం ముగ్గురు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. ఈ ముఠా జల్సాలకు అలవాటు పడి డబ్బు సరిపోక దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసును చేధించిన కానిస్టేబుళ్లను సీపీ అభినందించి, రివార్డ్ అందజేశారు. సమావేశంలో ఏసీపీ రాజావెంకట్రెడ్డి, నార్త్ సీఐ బూస శ్రీనివాస్, ఎస్సై గంగాధర్ పాల్గొన్నారు. జల్సాలకు అలవాటు పడిన దొంగల ముఠా ముగ్గురు పరారీ, ఇద్దరు అరెస్ట్ 31 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య -
గొర్రెను చంపిన చిరుత?
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని మేడిపల్లి, గౌరారం అటవీ ప్రాంతంతో మూడు రోజుల క్రితం చిరుతపులి గొర్రైపె దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. మేడిపల్లి గ్రామానికి చెందిన కురమ సంతోష్ తన గొర్రెలను మేపడానికి అడవికి తీసుకెళ్లాడు. అయితే, ఇటీవలే కొనులుగోలు చేసిన విత్తన పొటేలు అడవిలో తప్పిపోయింది. రెండురోజుల క్రితం మేడిపల్లి శివారులో గొర్రె కళేబరం కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంతోష్ ఫిర్యాదు మేరకు ఫారెస్టు బీట్ అధికారి హన్మాండ్లు మరో అధికారితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి పంచనామా చేసి ఫారెస్టు సెక్షన్ అధికారి సునీతకు సమాచారం ఇచ్చారు. సెక్షన్ అధికారి సునీత పరిశీలించిపై అధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. అడవిలో గడ్డి ఏపుగా పెరిగినందున గొర్రైపె దాడి చేసింది ఏ జంతువో కచ్చితంగా చెప్పలేమన్నారు. వెటర్నరీ డాక్టర్ రిపోర్టు ఆధారంగా నిర్ధారణ చేస్తామన్నారు. గౌరారం, మేడిపల్లి అటవీ ప్రాంతంలో చిరుతలున్నాయని, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు. -
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
సాక్షి నెట్వర్క్: జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురా లు ఘనంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అట్ల బతుకమ్మ, సద్దుల బ తుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయా మండలాలు, గ్రామాల్లో మహిళలు ఉద యం నుంచే వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళ బతుకమ్మల ను ప్రధాన కూడళ్లు, రోడ్లపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం మహిళలు, యువతులు వాటిచుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యం చేశారు. పలుచోట్ల మహిళలు కోలాటం ఆడుతూ సందడి చేశారు. అనంతరం స్థానిక చెరువుల్లో బతుకమ్మలను నిమజ్ఞనం చేశారు. అస్ట్రేలియాలో దేశంలో హిందూ మహాసభ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజశేఖర్, సౌజన్య, అఖిలతో పాటు జిల్లా వాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బేగంపూర్ గ్రామంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు -
మేనత్త అంత్యక్రియలు జరిగిన కొద్దిసేపటికే..
● ట్రాక్టర్ను ఢీకొన్న టిప్పర్.. ● రోడ్డు పక్కన స్కూటీపై ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్ ● కోమట్పల్లి వాసి దుర్మరణండొంకేశ్వర్(ఆర్మూర్): మేనత్త అంత్యక్రియలు పూర్తిచేసిన కొద్దిసేపటికే అనుకోని ప్రమాదంలో అల్లుడు మరణించిన సంఘటన డొంకేశ్వర్ మండలం కోమట్పల్లిలో చోటు చేసుకుంది. కోమట్పల్లి గ్రామానికి చెందిన చీనోళ్ల రాజేంద్ర ప్రసాద్ (44) వ్య వసాయం చేస్తుంటాడు. ఆదివారం తన మేనత్త ఎర్రక్క చనిపోవడంతో ఆమె అంత్యక్రియలు గ్రామంలోనే నిర్వహించారు. మేనత్త అంత్యక్రియలు పూర్తిచేసి ఇంటికి వచ్చిన రాజేంద్రప్రసాద్ ఇంటి బయట రోడ్డు పక్కన తన స్కూటీపై కూర్చున్నాడు. అదే సమయంలో నికాల్పూర్ నుంచి కోమట్పల్లి మీదుగా శాపూర్కు వెళ్తున్న ఓ టిప్పర్ ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనుకనుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ముందుకు జరిగి స్కూటీపై ఉన్న రాజేంద్రప్రసాద్ పైకి వచ్చింది. ట్రాక్టర్ చక్రాలు అతనిపై నుంచి వెళ్లడంతో తీవ్రరక్తస్రావమై అక్కడికక్కడే మరణించాడు. ప్రమాదాన్ని చూసిన వారంతా ఉలిక్కిపడ్డారు. మేనత్త చనిపోయిన రోజునే అల్లుడు కూడా మరణించడం అందరినీ కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై శ్యామ్రాజ్ తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు.. వేల్పూర్: వేల్పూర్ వ్యవసాయ మార్కెట్ క మిటీ ఎదుట 63 నెంబర్ జాతీయ రహదారి పై శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన అల్లకుంట దినేశ్(26) మరణించినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. దినేశ్ అతని స్నేహితులు కార్తీక్, రాజ్కుమార్తో కలిసి డ్యూక్ బైక్పై లక్కోర నుంచి మోర్తాడ్ వైపు వెళ్తుండగా, వేల్పూర్ ఏఎంసీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో దినేశ్ అక్కడికక్కడే మరణించాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్, రాజ్కుమార్లను చికి త్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లిన దినేశ్ సెలవుపై గత నెలలో ఇంటికి వచ్చాడు. తిరిగి గల్ఫ్ వెళ్లాల్సి ఉండగా ప్రమాదంలో చనిపోయాడు. మృతుడికి ఒక సోదరి ఉండగా, ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసెలా రోదించారు. -
అప్పులబాధతో యువకుని ఆత్మహత్య
మాచారెడ్డి: అప్పుల బాధతో ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని చుక్కాపూర్లో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై అనిల్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అనాచి రమేశ్(32) ఇటీవల ఇంటి నిర్మాణం కోసం ప్రైవేట్ ఫైనాన్స్లతోపాటు మహిళా సంఘాల వద్ద అప్పు చేశాడు. మొత్తం రూ.15 లక్షల వరకు అప్పులయ్యాయి. మూడు రోజుల కిందట ఫైనాన్షియర్లు ఇంటి విషయంలో ఎలాంటి లావాదేవీలు చేయొద్దని ఇంటికి నోటీస్ అతికించి వెళ్లారు. దీంతో ఈఎంఐలు కట్టలేక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొద్దిరోజులుగా భార్యా,పిల్లలతో కామారెడ్డిలో నివాసముంటున్న రమేశ్ శనివారం రాత్రి చుక్కాపూర్ వచ్చి బలవన్మరణానికి పాల్పడటంతో కుటుంబసభ్యులు బోరున విలపించారు. మృతుడికి భార్య సంధ్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మనస్తాపంతో మహిళ.. రాజంపేట: మనస్తాపంతో ఉరేసుకొని మహిళ మృతి చెందిన ఘటన రాజంపేట మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తోడెంగల మల్లేశం 18 సంవత్సరాల క్రితం తన మొదటి భార్య చనిపోవడంతో సిద్దవ్వను పెళ్లి చేసుకున్నాడు. 6 నెలల క్రితం అనారోగ్యంతో మల్లేశం చనిపోవడంతో సిద్దవ్వ తరచూ మనోవేదనకు గురయ్యేది. రెండు నెలల క్రితం హైదరాబాద్లో ఉన్న సోదరి ఇంటికి వెళ్లిన ఆమె శనివారం సాయంత్రం రాజంపేటకు వచ్చింది. రాత్రి కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నారు. కుటుంబసభ్యులు ఉదయం 7 గంటల ప్రాంతలో సిద్దవ్వ గదిని తెరిచిచూడగా దూలానికి ఉరేసుకొని కనిపించింది. సోదరుడు ముత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమేశ్ తెలిపారు. -
మహమ్మదీయకాలనీలో చోరీ
ఖలీల్వాడి: నగరంలోని మహమ్మదీయ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఐదో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపారు. మహమ్మద్ షకీర్ తన ఇంటికి తాళం వేసి రెండ్రోజుల క్రితం బంధువుల ఫంక్షన్కు వెళ్లాడు. ఆదివారం ఇంటికి చేరుకున్న కుటుంబీకులకు తాళం పగులగొట్టబడి కనిపించింది. అనుమానంతో పరిశీలించగా బెడ్రూంలో ఉన్న తులంన్నర బంగారం, 15 గ్రాముల వెండి, రూ.1.50 లక్షలు అపహరణకు గురైనట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. సదాశివ నగర్ (ఎల్లారెడ్డి): మండలంలోని భూంపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లలో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. దుండగులు బీరువాలను పగులగొట్టి వెండి, బంగారు వస్తువులు, నగదును ఎత్తుకెళ్లారు. ఘటనా స్థలాన్ని సీఐ సంతోష్ కుమార్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం ద్వారా వేలిముద్రలను సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. -
గ్రూపు–2 ఉద్యోగాలకు ఎంపిక
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన బాజ సంతోష్ గ్రూపు–2 ఉద్యోగానికి ఎంపికై నట్లు ఆదివారం తెలిపారు. గ్రూపు–2 ఫలితాల్లో జేడబ్ల్యూసీఎస్, డబ్ల్యూఎస్సీ సెక్షన్లో ప్రొబిషన్ అధికారిగా ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. సంతోష్ ప్రస్తుతం దోమకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. అలాగే మండలంలోని మోతె గ్రామానికి చెందిన పాతూరి సతీష్కుమార్ గ్రూపు–2 ఉద్యోగానికి ఎంపికై నట్లు తెలిపారు. సతీష్కుమార్ ప్రస్తుతం లింగంపేట మండలం పొల్కంపేట తండాలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గ్రూప్–2లో ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికై నట్లు ఆయన తెలిపారు. రామారెడ్డి: మండలంలోని గిద్ద గ్రామంలో ఓ పురాతన బావి ఉంది. ఈ బావిలో నీళ్లు ఎండాకాలంలో కూడా ఇంకిపోవు. ఈ బావి గ్రామంలో ఎంతో మందికి నీటి అవసరాలను తీరుస్తుంది. ఎండాకాలంలో ఈ బావి గ్రామస్తులకు వరప్రదాయినిగా నిలుస్తోందని పేర్కొంటున్నారు. ఈ బావిలో స్థానికులు సుమారు 20 నుంచి 30 వరకు చిన్న మోటార్లను దింపేసి పైపుల ద్వారా ఇళ్లకు నీళ్లను సరఫరా చేసుకుంటున్నారు. బావి వద్ద ఏర్పాటు చేసిన మోటార్లు, పైప్లైన్లను అటుగా వెళ్లేవారు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ దృశ్యాన్ని ఆదివారం సాక్షి క్లిక్మనిపించింది. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి, లింగాపూర్, చిన్నమల్లారెడ్డి గ్రామాల్లో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ధి ఉత్సవం సందర్భంగా విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా సంఘ్ ప్రతినిధులు ఆ యుద పూజ చేశారు. వక్తలు విద్యా భారతి, అ యాచితుల లక్ష్మణ్రావు, నరేందర్రెడ్డి, పటోళ్ల సంతోష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ పంచ పరివర్తనను ప్రతి పౌరుడు పాటించాలన్నారు. స్వదేశీ అనేది అందరిలో దేశభక్తిగా పెంపొందాలని పిలుపు నిచ్చారు. సంఘ్ ప్రతినిధులు బొడ్డు శంకర్, కొమిరెడ్డి స్వామి, అంతిరెడ్డి, ఎల్లయ్య, తమ్మలి మోహన్ పాల్గొన్నారు. -
వీడని ముసురు
● మూడు రోజులుగా జల్లులు ● అక్కడక్కడ భారీ వర్షాలు ● దెబ్బతింటున్న పంటలు● ఇన్ఫ్లో 1.30 లక్షల క్యూసెక్కులు ● అవుట్ఫ్లో 1.51 లక్షల క్యూసెక్కులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అల్పపీడనం ప్రభావంతో ఆదివారం సైతం జిల్లా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. మూడు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో ముసురు పెట్టింది. కొన్నిచోట్ల జల్లులు, ఇంకొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో వాగుల్లో ప్రవాహం మరింత పెరిగింది. చెరువులు, ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తడంతో అలుగులు పారుతున్నాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని వివిధ వాగుల్లోనూ వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. పోచారం, కౌలాస్నాలా, నిజాంసాగర్ ప్రాజెక్టులలోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లా అంతటా వర్షం కురిసింది. కామారెడ్డి చెరువులోకి భారీగా నీరు.. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువుకు భారీగా వరద వస్తోంది. ఎగువన కృష్ణాజీవాడి, లింగాపూర్లలో శనివారం రాత్రి భారీ వర్షం కురవడంతో చెరువుకు వరద పెరిగి అలుగు ఉధృతంగా పారుతోంది. గత నెలాఖరులో చెరువు అలుగు ప్రవాహం పెరిగి, వరదతో జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ, హౌసింగ్ బోర్డు ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగిన విషయం తెలిసిందే.నిజాంసాగర్: ఎగువన ఉన్న సింగూరు ప్రాజెక్టు, హల్దీవాగు, ఘనపురం ఆనకట్టతో పాటు పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతుండడంతో మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టులోకి 1.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 21 వరద గేట్లను ఎత్తి 1.51 లక్షల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. ప్రధాన కాలువకు 900 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,401.40 అడుగుల (12.954 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. సింగూర్లోకి.. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు జలాశయానికి భారీ ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు 10 వరద గేట్లను ఎత్తి 96,604 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. కౌలాస్లోకి 6,285 క్యూసెక్కులు.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6,285 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. ఆదివారం సాయంత్రానికి 457.60 మీటర్ల (1.141 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. మంజీరలో వరద ఉధృతి.. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి 1.40 లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండడంతో పాటు నల్లవాగు, సింగితం, కల్యాణి ప్రాజెక్టుల వరద నీరు కూడా నదిని చేరుతోంది. దీంతో మంజీర 2 లక్షల క్యూసెక్కుల నీటితో ప్రవహిస్తోంది. నది పరీవాహన ప్రాంతంలోని పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.లొకేషన్ వర్షపాతం (మి.మీ.) అర్గొండ 74.0 నస్రుల్లాబాద్ 57.3 బొమ్మన్దేవ్పల్లి 53.8 జుక్కల్ 43.0 కొల్లూర్ 41.8 కలెక్టరేట్ 39.8 దోమకొండ 39.8 తాడ్వాయి 36.3 రామారెడ్డి 36.0 ఇసాయిపేట 31.5 పుల్కల్ 31.5 బీర్కూర్ 30.0 -
గుండె పోటెత్తుతోంది!
జిల్లాలో ఏడాదికేడాది గుండెవ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గుండె సమస్యల బారిన పడిన వారు ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటే వాల్స్ బ్లాక్ అయిన విషయం బయటపడి స్టంట్లు వేయడమో, లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడమో జరుగుతోంది. అయితే సడెన్ కార్డియాక్ అరెస్టు జరిగినపుడు క్షణాల్లో ప్రాణాలు పోతున్నాయి. ఇటీవల జరుగుతున్న మరణాల్లో ఎక్కువగా సడెన్ కార్డియాక్ అరెస్ట్కు సంబంధించినవే ఎక్కువగా ఉంటుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలామంది వృత్తిపరమైన, కుటుంబ, ఆర్థిక సమస్యలతో ఒత్తిళ్లకు లోనవవుతున్నారు. అలాంటి వారే ఎక్కువగా గుండె సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే బయటి ఆహారం తీసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. వారంలో రెండు మూడు రోజులు బయటికి వెళ్లి తినే అలవాటు నేటి జనరేషన్లో పెరిగిపోయింది. దీంతో ఆహార పదార్థాల తయారీలో వాడుతున్న నూనెలు, మసాలాలతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.చాలా మంది అర్ధరాత్రి వరకు పడుకోకుండా బయట తిరుగుతుంటారు. సరైన నిద్ర లేకపోవడం, దానికి తోడు వ్యాయామం చేయకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే తిండి విషయంలో జాగ్రత్తలు పాటించడం లేదు. మద్యం, సిగరెట్లు, ఇతర వ్యసనాలు కూడా సమస్యలకు కారణమవుతున్నాయి. కుటుంబ సమస్యలంటూ, ఆర్థిక సమస్యలంటూ పీకలదాకా తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. జీవన శైలిలో జరుగుతున్న మార్పులు ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. గుండె సమస్యలకు అనేక కారణాలు ఉంటున్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా చాలా మంది అనవసర ఒత్తిళ్లతో గుండె సమస్యల బారిన పడుతున్నారంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రోజూ కనీసం వాకింగ్ గానీ, మరే రకమైన వ్యాయామమైనా చేయాలని పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పడు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యల బారిన పడుతున్న జనం సడెన్ కార్డియాక్ అరెస్ట్తో చాలామంది మృత్యువాత నేడు వరల్డ్ హార్ట్ డే -
‘గెలుపే లక్ష్యంగా పనిచేయాలి’
కామారెడ్డి టౌన్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయనమాట్లాడారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలన్నారు. కష్టపడి ప్రతి అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్లతో పాటు జెడ్పీ పీఠం కూడా బీజేపీ కై వసం చేసుకునేలా కష్టపడాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, రాష్ట్ర నాయకులు మురళీధర్గౌడ్, పైడి ఎల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. రామారెడ్డి: ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ఆనంద్, మల్లేశ్లు జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. గతనెలలో మహబూబ్నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో ఆనంద్ జావలిన్త్రో లో, మల్లేశ్ 60 మీటర్ల పరుగు పందెంలో సత్తా చాటినందుకు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారని పేర్కొన్నారు. వీరు వచ్చేనెల 10 నుంచి 14 వరకు ఒడిషా రాష్ట్రంలోని భువనేశ్వర్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపాల్ మోహన్రెడ్డి, పీడీ లింగం, పీఈటీ రవీంద్ర, కోచ్ సురేశ్ అభినందించారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి భారీగా నీటిని గోదావరిలోకి విడుదల చేస్తుండడంతో దిగువన గోదావరి ఉప్పొంగుతోంది. ఎగువ నుంచి భారీ వరదలు వస్తున్నాయనే సమాచారం మేరకు అధికారులు ప్రాజెక్ట్ నుంచి 39 వరద గేట్ల ద్వారా 4.5 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 3.15 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఆదివారం రాత్రి వరకు వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధి కారులు పేర్కొన్నారు. ప్రాజెక్ట్లో ప్రస్తుతం 58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కానీ నీటిని మరింత ఖాళీ చేయాలన్న ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇన్ఫ్లో కన్నా అవుట్ ఫ్లోను ఎక్కువ చేశారు. నది పరీవాహక ప్రాంతాలైన మెండోరా మండలం దూదిగాం, కోడిచర్ల, చా కిర్యాల్, పోచంపాడ్, సావెల్ గ్రామాల్లో పంట లు నీట మునుగుతున్నాయి. ప్రాజెక్టు దిగువన ఉన్న వడ్డెర కాలనీలోకి భారీగా నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను మరింత పెంచే అవకాశం ఉండడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కోడిచర్ల, సావెల్ గ్రామాల మధ్య వంతెనపై నుంచి గోదావరి ప్రవహిస్తోంది. మెండోరా రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఖలీల్వాడి(నిజామాబాద్అర్బన్): నిజామాబాద్ జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం మరోమారు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. గతంలో చర్లపల్లి జైలు జూనియర్ అసిస్టెంట్, ఖైదీ భార్యపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పోక్సో కేసు కూడా నమోదు అయ్యింది. తాజాగా కామారెడ్డి జైలు జూనియర్ అసిస్టెంట్ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జుడీషియల్ విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం చింతల దశరథం సెలవులో ఉన్నట్లు తెలిసింది. -
సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టాలి
● ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ శివకుమార్ ● మద్నూర్లో ఘనంగా సంఘ్ శతాబ్ది ఉత్సవాలుమద్నూర్: భారతదేశపు ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను నిలబెట్టాలని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా శివకుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని గురు ఫంక్షన్హాల్లో ఆదివారం ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు ఐదు వందల మంది స్వయం సేవకులు మండల కేంద్రంలోని ప్రధాన వీధులలో పథ సంచలన్ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శివకుమార్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ను 1925లో విజయదశమి రోజున హెడ్గేవార్ స్థాపించారన్నారు. ప్రస్తుతం శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడని, ఎవరినీ తక్కువ చేసి చూడవద్దని పేర్కొన్నారు. హిందుత్వంలో అంటరానితనం లేదని స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ పాటించే పంచ పరివర్తన్లో మొదటిది సమరసత అన్నారు. ఆర్ఎస్ఎస్ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోందని, విపత్కర పరిస్థితులలో పునర్నిర్మాణ కార్యక్రమాల్లోనూ సేవలందిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిదులు హన్మండ్లు, నరేష్, నాందేవ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
బాన్సువాడ : మహిళను బెదిరించి బంగారం, నగదు దొంగలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తెల్గాపూర్ గ్రామానికి చెందిన మేడిపల్లి లక్ష్మిని ఈనెల 19న కొండాపూర్కు చెందిన నీరడి సాయిలు బాన్సువాడలోని పోచమ్మ గల్లీకి పిలిపించి ఆమె వద్ద ఉన్న రూ.50 వేల నగదు, అరతులం బంగారు హారం, సెల్ఫోన్ను ఎత్తుకెళ్లాడు. బాధితురాలు బాన్సువాడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.. సీసీ ఫుటేజీలను పరిశీలించి నీరడి సాయిలును తాడ్కోల్ చౌరస్తా వద్ద పట్టుకున్నారు. దొంగలించిన బంగారాన్ని బుర్ర వెంకటరమణకు అమ్మినట్లు నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు. వెంకటరమణ వద్ద 11 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. నీరడి సాయిలు, బుర్ర వెంకటరమణలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. సాయిలుపై గతంలో బాన్సువాడ, లింగంపేట్, నిజాంసాగర్, అమీన్పూర్ పోలీస్స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన సీఐ అశోక్, సిబ్బందిని ఎస్పీ అభినందించారని డీఎస్పీ తెలిపారు. -
టెక్నికల్ కోర్సులతో ఉపాధి
ఎల్లారెడ్డి: టెక్నికల్ కోర్సులతో ఉపాధి అవకాశాలు అనేకం ఉంటాయని ఎల్లారెడ్డి ఆర్డీ వో పార్థసింహారెడ్డి అన్నారు. పట్టణంలో ఏ ర్పాటు చేసిన అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవనాన్ని ఆయన శనివారం ప్రా రంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ రజిత, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్య క్షులు సాయిబాబా, వినోద్గౌడ్, నాయకులు వెంకట్రామ్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. బిచ్కుందలో.. బిచ్కుంద(జుక్కల్)/తాడ్వాయి(ఎల్లారెడ్డి) : బిచ్కుంద, తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడిలో ఏటీసీలు ప్రారంభమయ్యాయి. బి చ్కుందలో ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ప్ర మోద్కుమార్, బ్రహ్మాజీవాడిలో ఎంప్లాయీమెంట్ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెంటర్లలో అన్ని రకాల టె క్నాలజీ యంత్రాలు బిగించడం జరిగిందన్నారు. అడ్మిషన్లు పొందిన విద్యార్ధులకు త రగతులు ప్రారంభమయ్యాయన్నారు. టె క్నాలజీపై విద్యార్ధులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బ్రహ్మాజివాడిలో టీవో రమేశ్, ఏటీవో వెంకటరమణ, శ్రీమాన్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో దోపిడీ తప్ప అభివృద్ధి లేదు కామారెడ్డి టౌన్: బీఆర్ఎస్ హయాంలో రా ష్ట్రంలో దోపిడీ తప్ప అభివృద్ధి జరలేదని డీసీ సీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని పా ర్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటే, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలో దోచుకున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎన్నికల్లో టికె ట్ రాక మతిస్థిమితం తప్పి మాట్లాడుతున్నా రని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వమని మాట్లాడి తన పరువు, వారి పార్టీ పరువు తీసుకున్నారన్నారు. 10 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కానీ, నియోజకవర్గానికి 10 ఇళ్లు ఇవ్వలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో 65వేల ఉద్యోగా లు. పేదలకు సన్న బియ్యం, నియోజవర్గాని కి 3500 ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు అమలు చే స్తోందని వివరించారు. మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చ రించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రా జు, నాయకులు కారంగుల అశోక్రెడ్డి, ఐరేని సందీప్, గోనె శీను, గుడుగుల శీను, పంపరి లక్ష్మణ్, షేరు, అంజద్, లడ్డు, సత్యం, జమీ ల్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ఆరోగ్యం
కామారెడ్డి టౌన్ : రక్తదానం చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతోపాటు ఎదుటి వ్యక్తి ప్రాణాలను నిలిపిన వారమవుతామని హై కోర్టు అదనపు న్యాయమూర్తి నందికొండ నర్సింగ్రావు అన్నారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడే పుణ్యకార్యం రక్తదానమని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆయనకు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రలు ఘన స్వాగతం పలికారు. జీజీహెచ్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో న్యాయమూర్తి నర్సింగ్రావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలన్నారు. ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు రక్తదానం ఎంతో మేలు చేస్తుందని అన్నారు. తాను కూడా రెస్ క్రాస్ సోసైటి సభ్యుడినని గుర్తు చేశారు. ఈ సందర్భంగా రక్తదాతల గ్రూప్ నిర్వాహకుడు బాలుని న్యాయమూర్తి సన్మానించారు. రక్తదాతలకు అభినందన పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా కోర్టును సందర్శించి ఆవరణలో మొక్కలను నాటారు. జిల్లాలోని న్యాయమూర్తులతో సమావేశమై జుడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి టి నాగరాణి, సీనియర్ సివిల్ జడ్జి సూర సుమలత, ప్రథమ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి బి దీక్ష, బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ న్యాయమూర్తులు వినీల్కుమార్, సుష్మ, భార్గవి, డీఎఫ్వో నిఖిత, బార్ అసోసియేషన్ అద్యక్షుడు నంద రమేశ్, రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. -
జెడ్పీ పీఠం జనరల్
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు ● బలహీన వర్గాలకు 42 శాతం సీట్లు... ● మహిళలకు అన్నింటా సగం స్థానాలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పరిషత్ పీఠం జనరల్ స్థానంగా ఖరారైంది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్కు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేయగా.. కామారెడ్డి స్థానం అన్ రిజర్డ్వ్గా డిక్లేర్ చేశారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ పదవులతోపాటు ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్, వార్డు స్థానాలకూ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 42 శాతం చొప్పున ఆయా స్థానాల రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన నిర్ణయించారు. అలాగే అన్నింటా సగం స్థానాలు మహిళలకు కేటాయించారు. జిల్లాలోని 25 మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులతోపాటు 233 ఎంపీటీసీ స్థానాలు, 532 సర్పంచ్, 4,656 వార్డు స్థానాలకు జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమక్షంలో రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఆయా రెవెన్యూ డివిజన్లలో ఆర్డీవోల ఆధ్వర్యంలో ఖరారు చేశారు. పంచాయతీ వార్డు సభ్యులకు సంబంధించి మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఖరారు చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న నేతలు పోటీకి సై అంటుంటే, అనుకూలంగా రాని వాళ్లంతా నిరాశకు గురయ్యారు. మహిళలకు సగం స్థానాలు కేటాయించడంతో కొన్ని చోట్ల నాయకులు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు ఆలోచనలు మొదలుపెట్టారు. జిల్లాలో 25 మండలాలు ఉండగా, 25 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో నాలుగు స్థానాలు జనరల్కు, నాలుగు స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు. 11 స్థానాలు బీసీలకు కేటాయించగా ఆరు బీసీ జనరల్, ఐదు బీసీ మహిళలకు దక్కనున్నాయి. ఎస్సీలకు నాలుగు కేటాయించగా రెండు ఎస్సీలు, రెండు ఎస్సీ మహిళలకు, ఎస్టీలకు రెండు కేటాయించగా ఒకటి ఎస్టీలకు, ఒకటి ఎస్టీ మహిళకు కేటాయిస్తారు. జిల్లాలో 233 ఎంపీటీసీ స్థానాలు, 532 సర్పంచ్ పదవులు, 4,656 వార్డు సభ్యుల పదవులకు కూడా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తోంది. మండలం జెడ్పీటీసీ ఎంపీపీ బాన్సువాడ బీసీ బీసీ భిక్కనూరు బీసీ బీసీ బీబీపేట బీసీ మహిళ బీసీ మహిళ బిచ్కుంద జనరల్ జనరల్ మహిళ బీర్కూర్ జనరల్ జనరల్ మహిళ దోమకొండ జనరల్ మహిళ జనరల్ డోంగ్లీ ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ గాంధారి బీసీ మహిళ బీసీ జుక్కల్ ఎస్సీ ఎస్సీ కామారెడ్డి ఎస్సీ ఎస్సీ మహిళ లింగంపేట బీసీ బీసీ మాచారెడ్డి ఎస్టీ మహిళ ఎస్టీ మహిళ మద్నూర్ బీసీ బీసీ మహమ్మద్నగర్ బీసీ మహిళ బీసీ మహిళ నాగిరెడ్డిపేట ఎస్సీ మహిళ ఎస్సీ నస్రుల్లాబాద్ జనరల్ జనరల్ మహిళ నిజాంసాగర్ బీసీ మహిళ బీసీ పల్వంచ బీసీ బీసీ మహిళ పెద్దకొడప్గల్ బీసీ బీసీ మహిళ పిట్లం జనరల్ మహిళ జనరల్ రాజంపేట ఎస్టీ ఎస్టీ రామారెడ్డి బీసీ మహిళ బీసీ మహిళ సదాశివనగర్ జనరల్ మహిళ జనరల్ తాడ్వాయి జనరల్ జనరల్ మహిళ ఎల్లారెడ్డి జనరల్ మహిళ జనరల్జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా.. -
మురుగుతున్న సోయా
● పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు ● ఆందోళనలో రైతాంగం ● ప్రభుత్వం ఆదుకోవాలని మొర కామారెడ్డి క్రైం : పంట చేతికొచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండడంతో సోయా రైతులు నిండామునిగే పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజులు మినహా గత నెలరోజులుగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో సోయా తీవ్రంగా దెబ్బతిన్నది. వర్షాల కారణంగా సోయా మురిగిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు కూడా తిరిగి చేతికొచ్చే పరిస్ధితులు కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంట.. నెల రోజులుగా కురుస్తున్న వానలకు సోయాబీన్ దాదాపు పోయినట్లేనని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఇంకా పంట కోతలు ప్రారంభం కాకపోగా ఆకు రాలిపోయింది. అధిక వర్షాల కారణంగా కర్ర పలుచబడి కిందపడిపోగా, సోయా గింజలు బూజు పట్టి నల్లగా మారి చెడిపోతున్నాయి. సాధారణంగా ఎకరానికి కనీసం 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ప్రస్తుతం రెండు నుంచి 3 క్వింటాళ్లు కూడా రావడం కష్టంగా ఉంది. మరికొన్ని రోజులపాటు వర్షాలు ఇలాగే కురిస్తే ఆ కొంత దిగుబడి కూడా వచ్చే అవకాశాలు లేవు. నెల క్రితం కురిసిన వర్షాలకే పంట నీట మునిగి చాలా మట్టకు దెబ్బతిన్నది. ఇప్పుడు కోత దశలో కూడా వానలు వదలకపోడంతో పంట పూర్తిగా చెడిపోయి రైతులకు కష్టాలు పెరిగాయి.ఒక ఎకరం సోయా సాగు చేసేందుకు రైతులు రూ.25వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తనం బస్తాకు రూ.3 వేల నుంచి రూ.3,500 వరకు, దున్నడం, ఎరువులు, గడ్డిమందులు, కలుపు తీతలు, పురుగుమందులు, కోతలకు ఖర్చులు, ఇలా దాదాపు రూ.25 వేల వరకు ఎకరానికి పెట్టుబడి ఖర్చులు ఉంటాయి. కనీసం 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తేనే పెట్టిన పెట్టుబడులు తిరిగి రైతుల చేతికొచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇప్పించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.నేను ఏడు ఎకరాల్లో సోయా సాగు చేశా. పంట దాదాపు పోయినట్లే. ఇప్పటికే లక్షన్న రకు పైగా పెట్టుబడి అయింది. రూపాయి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ వానలకు ఏమైనా దిగుబడి వస్తుందో, రాదో కూ డా తెలియడం లేదు. ప్రభుత్వమే నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – జి.సంతోష్, రైతు, గాంధారి -
చేను దగ్గరే వ్యాపారం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తమ కష్టంతో సాగు చేసిన కూరగాయలు, పూలు, పండ్లను దళారు లకు విక్రయిస్తే రైతుకు వచ్చే ఆదాయం తక్కు వ. కొనుగోలుదారు వద్దకు వచ్చే సరికి ధర ఎక్కువ. అదే రైతు నేరుగా కొనుగోలుదారుల కు విక్రయిస్తే కొనేవారికి డబ్బు ఆదా అవుతుంది. రైతులకూ మేలు చేకూరుతుంది. కొందరు రైతులు ఇదే సూ త్రాన్ని పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నా రు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు, పూలు పండించే రైతులు పంట చేను దగ్గరే రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు. అలాగే మామిడి పండ్ల సీజన్లో మామిడి రైతులు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నారు. ఓ వైపు రైతులుగా, మరోవైపు వ్యాపారులుగా రాణి స్తున్న వారిపై ‘సాక్షి’ సండే స్పెషల్.. కూరగాయలు, పూలు, పండ్ల విక్రయాలు కొనుగోలుదారులకు డబ్బు ఆదా.. విక్రయించే వారికి ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న రైతులు -
‘సాగర్’ 15 గేట్లు ఎత్తివేత
నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు కౌలాస్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. అలాగే జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా సింగితం రిజర్వాయర్, నల్లవాగు మత్తడితోపాటు పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నాయి. సింగూరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్లోకి శనివారం 1,09,470 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 15 గేట్ల ద్వారా 1,10,702 క్యూసెక్కుల నీటిని మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. కౌలాస్ ప్రాజెక్టు నుంచి.. కౌలాస్ ప్రాజెక్టులోకి 10,300 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, 5 గేట్ల ద్వారా 12,522 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. -
ఎనిమిదేళ్లకే ఏమిటీ పరిస్థితి..?
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ భవనం నిర్మించి ఎనిమిదేళ్లే అయినప్పటికీ అక్కడి పరిస్థితి మాత్రం పురాతన భవనాన్ని తలపిస్తోంది. గోడలకు నీటి చెమ్మ, పగుళ్లు వస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే అన్ని విభాగాల్లో ఊరుస్తోంది. గ్రౌండ్ఫ్లోర్లో నేల కుంగుతోంది. అక్కడక్కడ పెచ్చులూడుతున్నాయి. అదే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం. 2013లో ప్రభుత్వ నిధులు రూ.కోటితో మున్సిపల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే నిధులు సరిపోకపోవడంతో 2015లో మరో రూ.కోటి 20 లక్షలను ప్రభుత్వం మంజూరు చేయడంతో రెండస్థుల భవన నిర్మాణ పనులను పూర్తి చేశారు. 2017 సెప్టెంబర్ 20న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భవనాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం భవనంలోని ఆయా వి భాగాల గదుల్లో టైల్స్ ధ్వంసమయ్యాయి. చిన్న పాటి వర్షం కురిసినా మొదటి, రెండో అంతస్తులోని ఆయా గదుల్లో ఊరుస్తోంది. దీంతో నీరు పడకుండా బకెట్లు, చెత్తబుట్లను సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. గోడలకు నీటి చెమ్మ వస్తుండడంతో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, అకౌంటెంట్ విభాగాల్లోని విలువైన రికార్డులు కౌన్సిల్ హాల్లోకి తరలించారు. కౌన్సిల్ హాల్లో పోడియం వెనకాల ఏసీ చెడిపోయింది. నీటి చెమ్మ కాణంగా విద్యుత్ వైర్లు కాలిపో తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు చెడిపోతున్నా యి. గోడలకు రంగులు ఊడిపోతు కార్యాలయం క ళావిహీనమైంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని వివరణ కోరగా.. కార్యాలయా నికి మరమ్మతులు చేపడుతామని అన్నారు. వర్షం కురిస్తే ఊరుస్తున్న మున్సిపల్ భవనం ఎక్కడ చూసినా పగుళ్లు.. బలహీనమవుతున్న గోడలు కుంగుతున్న ఫ్లోర్ కామారెడ్డి బల్దియా భవన దుస్థితి ఇది.. -
బతుకమ్మ పాట
శ్రీ గౌరీ పూజ ఉయ్యాలో చేయబూనితిమి ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో కై లాస వాసివి ఉయ్యాలో కాపాడి మమ్మేలు ఉయ్యాలో శంకరి పార్వతి ఉయ్యాలో శంభుని రాణి ఉయ్యాలో ధ్యానింతుమమ్మ ఉయ్యాలో మమ్ములను కరుణించు ఉయ్యాలో ఏటేటా పూజిస్తాం ఉయ్యాలో మా ఊరు చల్లంగా చూడు ఉయ్యాలో మనుసు పెట్టి ఉయ్యాలో మనువంత నిన్ను చేసుకొని ఉయ్యాలో నిండుగా మొక్కుతున్నాం ఉయ్యాలో మమ్మేలు మా అమ్మ గౌరమ్మ ఉయ్యాలో –ఉమారాణి వైద్య, అంగన్వాడీ టీచర్, లింగాపూర్, కామారెడ్డి -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం రాంపూర్కు చెందిన మంజూరు హుస్సేన్(47) అనే వ్యక్తి కొంతకాలంగా మార్కెటింగ్ వృత్తి చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం అతడు బైక్పై నిజామాబాద్ వైపు బయలుదేరాడు. దగ్గి దర్గా శివారులో అతడు ఎడమ వైపు ఉన్న టాటా ఏస్ని ఓవర్టేక్ చేసి ముందుకు వెళ్లగా, ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో అతడు కిందపడిపోయి, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు హెల్మెట్ ధరించినప్పటికీ, సరిగా లేకపోవడంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. కుప్రియాల్ గ్రామ శివారులో.. మండలంలోని కుప్రియాల్ గ్రామ స్టేజీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డికి చెందిన ముత్తినే ని సూర్యరావు (రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్) కొన్నేళ్లుగా హైవేపై ఉన్న శ్రీ కృష్ణ ఉడిపి హోటల్లో పని చేస్తున్నారు. శనివారం ఉదయం అతడు కామారెడ్డి నుంచి తన ద్విచక్ర వాహనంపై హోటల్కు బయలుదేరాడు. కుప్రియాల్ శివారులో అతడిని హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపునకు వెళ్తున్న రెనాల్డ్ క్విడ్ కారు అతివేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సూర్యరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఆ గ్రామ సర్పంచ్ ఎస్టీకి రిజర్వ్
● కాని గ్రామంలో ఒక్కరు కూడా ఎస్టీలు లేరు నస్రుల్లాబాద్: అవును మీరు విన్నది నిజమే. గ్రామంలో ఒక్క ఓటు కూడా ఎస్టీకి లేదు. కాని ఆ గ్రామ ప్రథమ పౌరుడిగా మాత్రం ఎస్టీకి అధికారుల రిజర్వు చేశారు. దీనితో గ్రామ ప్రజల్లో గందరగోళం నెలకొంది. నస్రుల్లాబాద్ మండలంలోని అంకోల్లో సర్పంచ్ పదవికి నిలబడడానికి ఏ ఒక్క అభ్యర్థి లేరని.. పక్క గ్రామం నుంచి అరువు తెచ్చుకుందాం అంటూ సైటెర్లు వేసుకుంటున్నారు. అధికారుల పని తీరుకు ఈ రిజర్వేషన్ ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంత కాలం సర్పంచ్గా పోటీ చేయాలన్న ఆశావహులకు మాత్రం నిరాశ ఎదురైంది. కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తామని గ్రామ ప్రజలు చెబుతున్నారు. మాచారెడ్డి: పాల్వంచ మండలం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కూచని శేఖర్, ప్రధాన కార్యదర్శిగా కోడూరి అంజనేయులు, ఉపాధ్యక్షులుగా నరహరి, రాంచంద్రం, రామకృష్ణ కోశాధికారిగా ల క్ష్మణ్ , సహాయ కార్యదర్శులుగా నర్సింలు, దయా కర్, సలహాదారులుగా రాంచంద్రం బాల్రాజు, దశరథం, శ్రీనివాస్, రవీందర్లు ఎన్నికయ్యారు. లలితా త్రిపుర సుందరి ఆలయ వార్షికోత్సవం కామారెడ్డి అర్బన్: స్థానిక ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయ 8వ వార్షికోత్సవాలు శనివారం ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు లలితా హవనం జరిపించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్గుప్తా, దామోదర్, కె.ప్రభావతి, కాలనీ మహిళ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు అందజేసి, అన్నదానం చేశారు. బీసీ కులగణన వివరాలు తెలపాలి సుభాష్నగర్: రాష్ట్రంలో డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) కులగణన వివరాలను తెలియజేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఆయన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తరపున పూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అలాగే బీసీ కులగణన నివేదిక వివరాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ వివరాలు ప్రజలకు తెలిస్తేనే రిజర్వేషన్ల ప్రక్రియ ఎంత పారదర్శకంగా, సమానత్వంతో అమలు చేయనున్నారో తెలుస్తోందన్నారు. -
అందరూ నియమాలు పాటించాలి
● ఆర్ఎస్ఎస్ విభాగ్ గ్రామ వికాస్ సంయోజక్ కదిరె లక్ష్మారెడ్డి దోమకొండ: మన సంస్కృతీ సంప్రదాయాలు భావితరాలకు తెలిసేలా ప్రతి ఒక్కరూ నియమాలు పాటించాలని ఆర్ఎస్ఎస్ విభాగ్ గ్రామ వికాస్ సంయోజక్ కదిరె లక్ష్మారెడ్డి అన్నారు. రాబోయే విజయదశమి నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శనివారం మండల కేంద్రంలోని పైడిమర్రి ఫంక్షన్హాలులో జరిగిన ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎవరికి వారు నియమాలు, నిబంధనలు పాటించాలన్నారు. స్వదేశీ వస్తువులను వినియోగించాలని, మాతృభాషలో మాట్లాడాలని చెప్పారు. అందరం సమానమనే భావనతో మెలగాలని హితవు పలికారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కదిరె మోహన్రెడ్డి, సుంచు రాములు, భూపాల్ లక్ష్మణ్, సిద్దరామలు, రిటైర్డు ఆర్మీ జవాన్ కిష్టారెడ్డి, డాక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
పూలను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి టౌన్: ప్రపంచంలో పువ్వులను పూజించే ఏకై క పండుగ బతుకమ్మ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో మహిళ ఉద్యోగినులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను కలెక్టరేట్లో అన్ని ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులతో వైభవంగా నిర్వహించామన్నారు. ఎంతో పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు సంతోషంగా ఈ పండుగలో పాల్గొన్నారని తెలిపారు. వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. చైతన్యానికి ప్రతీక బతుకమ్మ భిక్కనూరు: తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. శనివారం భిక్కనూరు మండల కేంద్రంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వరంగల్, వేముల ప్రాంతాల్లో 1000 ఏళ్ల క్రితం ప్రారంభమైన బతుకమ్మ తెలంగాణ ప్రజల పండుగ అని ఏ ఒక్క పార్టీ పండుగ కాదన్నారు. బతుకమ్మ మహిళలను ఒకచోట చేర్చి ఆడుతూ పాడుతూ సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుందన్నారు. బతుకమ్మ పాటలు సమాజంలోని రుగ్మతలను కూడా పారదోలుతాయన్నారు. తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మను స్థానిక చెరువు కుంటల్లో నిమజ్జనం చేయడం వెనుక సైన్స్ దాగి ఉందన్నారు. బతుకమ్మను పేర్చే గునుక, తంగెడి పూలల్లో ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ పూలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు ఔషధ నీరుగా మారుతుందన్నారు. అందంగా బతుకమ్మలను పేర్చిన వారికి బహుమతులను అందజేశారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల రేఖ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కరెంట్షాక్తో బాలుడు మృతి మాక్లూర్: తండ్రితో కలిసి పొలానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్షాక్తో మృతిచెందాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామానికి చెందిన చింత ప్రవీణ్రెడ్డి అనే రైతు శుక్రవారం సాయంత్రం పొలానికి వెళుతుండగా, కుమారుడు చింత అభినయ్ (15) తాను వస్తానని చెప్పడంతో అతడిని తీసుకువెళ్లాడు. ప్రవీణ్రెడ్డి పొలానికి నీరు పెడుతుండగా కొద్ది దూరంలో ఉన్న కుమారుడు కరెంట్ మోటార్ వద్దకు వచ్చాడు. దీంతో అభినయ్కు కరెంటువైర్లు తగిలి, షాక్తో కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు కర్ర సాయంతో వైర్లను తీసివేసి, బాలుడిని చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ఆస్పత్రికి తరలించారు. కానీ అభినయ్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి తండ్రి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. నవీపేట: మండలంలోని బినోల గ్రామానికి చెందిన ముంత పోశెట్టి(56) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. పోశెట్టి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా జీవితంపై విరక్తి చెంది శుక్రవారం గడ్డి మందుతాగాడు. వెంటనే అతడు అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ సిటీ: నగరంలో మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికుడు వాటర్ట్యాంక్ పైనుంచి పడి గాయపడ్డాడు. వివరాలు ఇలా.. మున్సిపల్ కార్పొరేషన్లోని జోన్–4 వాటర్ వర్క్స్ విభాగంలో బింగి మధు అనే వ్యక్తి ఔట్సోర్సింగ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి వాటర్ ట్యాంక్ నిండిపోవడంతో అతడు వాటర్ లెవల్ చెక్చేస్తుండగా ప్రమాదవశాత్తూ ట్యాంక్ పైనుంచి జారి కిందపడిపోయాడు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం తోటి కార్మికులు జిల్లాకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. మధును మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ శనివారం ఉదయం పరామర్శించారు. వైద్య ఖర్చులను సంబంధిత ఏజెన్సీ భరిస్తుందని తెలిపారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
జక్రాన్పల్లి: మండలంలో పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు. జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. జక్రాన్పల్లిలో ఎస్సై మాలిక్ రహమాన్ తన సిబ్బందితో బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈక్రమంలో పాత నేరస్తుడు, మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన కోనేటి నరేష్ అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని పోలీసులు పట్టుకొని విచారించారు. రెండు నెలల క్రితం నల్లగుట్ట తండాలోని ఆలయంలో హుండీ చోరీ, ఈనెల 17న సికింద్రాపూర్లోని ఓ ఇంట్లో చోరీ చేసినట్లు అతడు అంగీకరించాడు. అతడి బ్యాగులో ఉన్న ఇనుప రాడ్ను, అతడి వద్ద నుంచి 9 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై మాలిక్ రహమాన్, ఏఎస్సై శంకర్, కానిస్టేబుళ్లు జీవన్, రాజేశ్వర్ ఉన్నారు. -
ఆలయాల దోపిడీ ముఠా సభ్యుల అరెస్టు
● ఆటో, నగదు, వెండి వస్తువుల స్వాధీనం ● సీసీ ఫుటేజీల ద్వారా నిందితుల గుర్తింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేష్ చంద్ర నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఓ వ్యక్తిని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మండలకేంద్రం గోపాల్పేటకు చెందిన నాదెండ్ల వెంకటరావు ఇటుకబట్టి నిర్వహిస్తున్నాడు. బట్టిలో పనిచేయడానికి కూలీలను అప్పగిస్తామంటూ అతడి వద్ద గతయేడు నవంబర్లో ఒడిశాకు చెందిన సంబా, లింగం, కలియా, పూరణ్ కలిసి రూ.7లక్షల22వేల900 తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా వారు కూలీలను తీసుకురాకపోవడంతో వారిపై డిసెంబర్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణ చేపట్టగా సంబా, కలియా ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నారని తెలిసింది. దీంతో పోలీసులు అక్కడి వెళ్లి వారిని పట్టుకున్నారు. అరెస్ట్చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వివరించారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జప్తిజాన్కంపల్లి వద్ద అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని కేసునమోదు చేశామని ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. లింగంపేట మండలం పర్మల్లతండా నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను ట్రాక్టర్లలో తరలిస్త్తుండగా పట్టుకున్నామన్నారు. డ్రైవర్లు మాలోత్ వినోద్, లాల్సింగ్పై కేసునమోదు చేశామని వివరించారు. నవీపేట: మండలంలోని యంచ వద్ద గల గో దావరిలో ఆత్మహత్యకు యత్నించిన ఒకరిని త హసీల్దార్ వెంకటరమణ శుక్రవారం కాపాడా రు. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా గ్రామానికి చెందిన మహేష్ ఇంట్లో తల్లిదండ్రులతో గొడవపడి బయటకు వెళ్లాడు. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు యంచ గోదావరి బ్రిడ్జిపైకి వచ్చాడు. నదిలో దూకేందుకు యత్నించగా అటువైపు వెళ్లిన తహసీల్దార్ వెంకటరమణ బాధితుడిని కాపాడారు. అనంతరం అతడిని ఎస్సై తిరుపతి దగ్గరకు తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇప్పించారు.కామారెడ్డి టౌన్: ఆలయాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులలో ఇద్దరిని పట్టుకుని అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 10న భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో పెద్దమ్మ గుడి హుండీలో నుంచి రూ.5వేలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. అలాగే ఎల్లమ్మ గుడి, ముత్యాలమ్మ ఆలయాల తాళాలు పగులగొట్టి హుండీల డబ్బులను చోరీ చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టగా ముగ్గురు వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. వారిని పట్టుకుని విచారించగా పలు చోరీల వివరాలు బయటకు వచ్చాయి. హైవేపై ఉన్న ఇళ్లు, ఆలయాలను టార్గెట్ చేసుకుని తాళాలు పగులగొట్టి విలువైన వస్తువులు చోరీలకు పాల్పడుతున్నటు గుర్తించారు. అలాగే గత నెల 19న రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లన్న గుడి, సదాశివనగర్ మండలంలో ఎల్లమ్మ గుడి, ఈ నెల 9న రామాయంపేట పరిధిలోని అయ్యప్ప ఆలయంలో హుండీలోని నగదు, వెండి పూజ సామగ్రి దొంగిలించారు. అదేరోజు భిక్కనూరు మండలం బస్వాపూర్లో ఎల్లమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ ఆలయాల్లో హుండీలో నగదు, అమ్మవారి వెండి కళ్లు చోరీ చేశారు. పక్కనే ఉన్న ఇంటిలో బంగారు ఆభరణాలు, నగదు దొంగిలించారు. జంగంపల్లి గ్రామంలో పెద్దమ్మ, ఎల్లమ్మ ఆలయాల్లో హుండీ డబ్బులు దొంగలించారు. బస్వాపూర్, రామాయంపేట్లోని ఆలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులలో ముగ్గురిని సదాశివనగర్ మండలం తిర్మన్పల్లి గ్రామానికి చెందిన గాంధారి సత్యం, మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన సయ్యద్ సమీర్, అహ్మద్ పఠాన్గా గుర్తించారు. సత్యం, సమీర్ పట్టుబడగా, అహ్మద్ పఠాన్ పరారీలో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి రెండు ఫోన్లు, ఆటో, మూడు జతల అమ్మవారి వెండి కళ్లు, వెండి దీపాలు, వస్తువులు, రూ.5వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును చేధించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీసీఎస్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కుక్కల బెడదను అరికట్టండి
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శునకాలు రోడ్లుపై తిరుగుతూ వాహనదారుల వెంట పడి దాడులు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం బరంగెడ్గిలో ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే మండల కేంద్రంలో శునకాలు గుంపులు గుంపులుగా సంచరించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను తరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దోమకొండ: మండలంలోని ముత్యంపేటలో ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. గ్రామంలోని పంజాబ్ నేష్నల్ బ్యాంకు ముందు రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. దోమకొండ మండల కేంద్రం నుంచి కామారెడ్డికి ముత్యంపేట మీదుగా వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పంచాయతీ పాలకవర్గం లేకపోవడం, అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మురికి నీరు కూడా రోడ్లపైకి వచ్చి దుర్గంధం వ్యాపిస్తోందని వారు పేర్కొంటున్నారు. -
అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
కామారెడ్డి రూరల్: అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం దేవునిపల్లి, కల్కినగర్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గామాతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండప నిర్వహకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు. కామారెడ్డి అర్బన్: స్థానిక ఎన్జీవోస్ కాలనీలోని లలితా త్రిపుర సుందరి ఆలయ 8వ వార్షికోత్సవం శనివారం నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా లలితా హవనం, విశేషపూజలు, మధ్యాహ్నం అన్నప్రసాదం, సాయంత్రం కుమారి పూజ నిర్వహించనున్నట్టు, మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
వైభవంగా నవదుర్గావ్రతం
కామారెడ్డి అర్బన్: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి హౌసింగ్బోర్డులోని శారదమాత శక్తి పీ ఠం ఆధ్వర్యంలో శుక్రవారం సహస్ర సుహాసినీలతో న వదుర్గ సహిత కోటి కుంకుమార్చన, వ్రతం భక్తిశ్రద్ధల తో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని మహిళ లు పెద్ద ఎత్తున వ్రతంలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేశారు. వేద పండితులు జి.అంజనేయశర్మ మార్గదర్శకత్వంలో అర్చకులు సతీష్పాండే, ఇతర అర్చకులు వ్రతం నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు పెంటయ్య, శ్రీధర్, శ్రీహరి, శారదా మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అందజేశారు. -
ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవి
పిట్లం(జుక్కల్): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యలో ఫార్మసిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ కో–ఆర్డినేటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ఫార్మసిస్టులు గజవాడ శ్రీనివాస్, నవిత, ఆయుష్ ఫార్మసిస్ట్లు కవిత, కల్పనలను సన్మానించినట్లు తెలిపారు. వైద్య రంగంలో ఫార్మసిస్టుల సేవలు ఎంతో విలువైనవి, అమూల్యమైనవని పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి బాలు, రీజియన్ ఈఈ కిషన్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
టేకు చెట్ల నరికివేత
● ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు దోమకొండ: మండలం కేంద్రానికి చెందిన రైతు పున్న లక్ష్మణ్ వ్యవసాయ బావి వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టేకు చెట్లను నరికివేశారు. ఐదు చెట్లను నరికి వాటిని ఎత్తుకెళ్లారని ఈ సందర్భంగా రైతు లక్ష్మణ్ తెలిపారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. శుక్రవారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా టేకు చేట్లు నరికివేసి దొంగిలించినట్లు తెలిసిందన్నారు. శనివారం ఘటనా స్థలానికి వస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపినట్లు ఆయన వివరించారు. -
బతుకమ్మ పాట
బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... బంగారు గౌరమ్మ ఉయ్యాలో... మా ఇంట కొలువుండు ఉయ్యాలో... మా కష్టాలు తీర్చు ఉయ్యాలో... తంగేడు పూలమ్మ ఉయ్యాలో... తెలంగాణ శోభమ్మ ఉయ్యాలో... గునుగు పూల వైభవము ఉయ్యాలో... గుండెలనిండా నిలిచి ఉయ్యాలో... పసుపు పారాణమ్మ ఉయ్యాలో... ప్రాణాల తోడమ్మ ఉయ్యాలో... ప్రకృతిని పూజిద్దాం ఉయ్యాలో... పాటలతో కొలుద్దాం ఉయ్యాలో... తొమ్మిది రోజులమ్మ ఉయ్యాలో... తొమ్మిది రూపాలమ్మ ఉయ్యాలో... సద్దులొచ్చిన రోజు ఉయ్యాలో... సంతోషాల క్రాంతి ఉయ్యాలో... అట్లు సత్తుపిండ్లూ ఉయ్యాలో... ఆప్యాయత పంచె ఉయ్యాలో... అందరొక్కటై ఆడుదాం ఉయ్యాలో... ఆనందంగా పాడుదాం ఉయ్యాలో... చెరువు నీరు నిండే ఉయ్యాలో... చల్లగ లోకముండే ఉయ్యాలో... కన్నతల్లి భూమిని ఉయ్యాలో... కళకళలాడించే ఉయ్యాలో... మాంగల్యం నిలబెట్టు ఉయ్యాలో... మా మనసులు చూడమ్మ ఉయ్యాలో... నీ దీవెన మాకిచ్చి ఉయ్యాలో... తరతరాల సౌభాగ్యమై ఉయ్యాలో... బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... మళ్లీ వచ్చేవరకు ఉయ్యాలో... మరల మరల తలచుచు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... – సుధ మర్రివాడ, టీచర్ హంగర్గాఫారం -
రైతు కుటుంబం నుంచి డీఎస్పీ
బిచ్కుంద(జుక్కల్): కందర్పల్లి గ్రామం నుంచి ఓ రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చాటి డీఎస్పీ ఉద్యోగం సాధించాడు. కోజిగెవార్ వెంకటదీప్ గ్రూప్–1 పరీక్షరాసి 141 ర్యాంకు సాధించి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. తండ్రి నాగ్నాథ్ రైతు. వెంకటదీప్ మొదటగా ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. విధుల్లో చేరిన అనంతరం యూపీఎస్సీ గ్రూప్ రాసి 4 నెలల క్రితం సెంట్రల్ అకౌంటెంట్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు. రెండు ఏద్యోగాలు సాధించినప్పటికి సంతృప్తి చెందలేదు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గ్రూప్–1 పరీక్ష రాసి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. తమ తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో డీఎస్పీ ఉద్యోగం సాధించానని వెంకటదీప్ అన్నారు. -
ఫెయిల్యూర్ సీఎం రేవంత్రెడ్డి
● మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్మాచారెడ్డి : ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు బుట్ట దాఖలయ్యాయన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి తగిన గుణపాఠం చెబుతామన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్, మాజీ జెడ్పీటీసీ మిన్కూరి రాంరెడ్డి, మాచారెడ్డి మండల శాఖ అధ్యక్షుడు బాల్చంద్రం, రాజాగౌడ్, హంజీనాయక్, కూచని శేఖర్, తదితరులున్నారు. పాల్వంచ మండల అధ్యక్షుడిగా రాజాగౌడ్.. బీఆర్ఎస్ పార్టీ పాల్వంచ మండల అధ్యక్షుడిగా ఇసాయిపేటకు చెందిన రాజాగౌడ్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గంప గోవర్ధన్ ఆయన్ను సన్మానించారు. పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని సూచించారు. -
ఇదేమి ఆధునికీకరణ!
పాతకు పూత..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్, కాచిగూడ స్టేష న్ల నుంచి నాందేడ్, మన్మాడ్, ముంబయి, నాగర్సో ల్, అకోలా వంటి నగరాలకు వెళ్లే రైళ్లన్నీ ఆగుతా యి. అలాగే నిజామాబాద్, కామారెడ్డి మీదుగా హై దరాబాద్, తిరుపతి, నర్సాపూర్, అనంతపూర్, కడ ప, విజయవాడ, విశాఖపట్టణం, ఒడిషాలోని సంబల్పూర్ వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్ల స్టాప్లు ఇక్కడ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాతోపాటు సిరిసిల్ల, సిద్దిపే ట, మెదక్ జిల్లాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు కామారెడ్డి రైల్వే స్టేషన్ ద్వారా వెళ్తుంటారు. ముఖ్యంగా ముంబయికి రోజూ దేవగిరి ఎ క్స్ప్రెస్లో వందలాది మంది ఇక్కడి నుంచే వెళతా రు. రైల్వే డబ్లింగ్ పనులు పూర్తయితే రైళ్ల సంఖ్య మ రింత పెరిగే అవకాశాలున్నాయి. ఇంతటి ప్రాధాన్య త ఉన్న రైల్వే స్టేషన్ను ఆధునికీకరించి అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీం(ఏబీఎస్ఎస్)ను అమలు చేసింది. ఇందులో భాగంగా స్టేషన్ అభివృద్ధి కోసం రూ.39.90 కోట్లు మంజూరు చేసింది. 2023 ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఏబీఎస్ఎస్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా స్టేషన్లో పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న భవనంలో మార్పులు చేసి వెయిటింగ్ హాల్ను విస్తరిస్తున్నారు. టాయిటెట్స్, ఎస్కలేటర్లు, లిఫ్ట్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.అలాగే స్టేషన్ ముందు భాగాన ఆధునికత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. రైల్వే స్టేషన్కు కావలసినంత స్థలం అందుబాటులో ఉంది. రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. అయితే పనులు నత్తనడకన సాగుతుండడంతో గడువు ముగిసినా పూర్తికాలేదు. అన్ని పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది పట్టే అవకాశం కనిపిస్తోంది.పాత భవనానికే సొబగులు.. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ భవనాన్ని 1896 లో నిర్మించారు. అప్పటి నిజాం పాలకులు హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా మన్మాడ్కు రైల్వే లైన్ వేయించారు. అప్పుడే కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్లు నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. రైల్వే స్టేషన్కు పలుమార్లు మరమ్మతులు చేశారు. స్టేషన్ భవనం పైకప్పు దెబ్బతింది. ఇపుడు దానికే మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు 130 ఏళ్ల నాడు నిర్మించిన భవనానికే మెరుగులు దిద్దుతుండడం విస్మయం కలిగిస్తోంది. రైల్వే స్టేషన్లో ఆధునిక సౌకర్యాలు ఎన్నో కల్పిస్తున్న ప్రభుత్వం.. శిథిలావస్థకు చేరిన స్టేషన్ భవనానికి మెరుగులు దిద్దడం బాగోలేదని పలువురు పేర్కొంటున్నారు. కొత్త భవనం నిర్మించకుండా పాత భవనానికి మరమ్మతులు చేస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలం మన్నేలా నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు. కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. మరోవైపు శతాబ్దం క్రితం నిర్మించిన పాత భవనానికే మరమ్మతులు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి రైల్వే స్టేషన్ భవనానికి 130 ఏళ్లు ‘అమృత్ భారత్’లో అభివృద్ధికి రూ.39.90 కోట్లు మంజూరు కొత్త భవనం నిర్మించకుండా పాతదానికే మరమ్మతులు విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు -
‘157 సెల్ఫోన్ల రికవరీ’
కామారెడ్డి టౌన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న రూ. 25 లక్షల విలువ గల 157 సెల్ఫోన్లను స్పెషల్ డ్రైవ్ ద్వారా రికవరీ చే శామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స మావేశంలో వివరాలను వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీకి గురయిన ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సీఈఐఆర్ పో ర్టల్ ద్వారా జిల్లాలో ఈ వారంలో 968 ఫోన్లు, పోర్ట ల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,862 ఫోన్లు రికవరీ చేశామన్నారు. బాధితులు ఆర్ఎస్సై బాల్రాజు 87126 86114ను సంప్రదించి పోగొ ట్టుకున్న ఫోన్లను తీసుకెళ్లాలని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు వెంటనే సిమ్ బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ చూపిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒక బోరు.. 29 కనెక్షన్లు
మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీలో 47 కుటుంబాలు నివసిస్తున్నాయి. మిషన్ భగీరథ పైప్లైన్ వేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చినా.. నీటిని మాత్రం సరఫరా చేయడం లేదు. కాగా ఈ కాలనీ మొత్తంలో ఒకే పబ్లిక్ బోరు బావి ఉంది. కొన్ని కుటుంబాలకు మాత్రమే సొంత బోర్లున్నాయి. మిగిలిన కుటుంబాలన్నింటికీ ఈ బోరు నీరే ఆధారం. దీంతో బోరునుంచి ఇళ్లకు వేరువేరుగా పైప్లైన్లు ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నారు. అయితే ఈ బోరులోంచి నీరు తక్కువ వస్తుండడంతో నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. – రాజంపేటబోరు మోటారుకు ఏర్పాటు చేసిన పైప్లైన్ కనెక్షన్లు -
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
దోమకొండ : పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. శుక్రవారం ఆమె దోమకొండ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేస్ డైరీస్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్, స్టేషన్ హాజరు రిజిస్టర్, మల్టీ బుక్స్, సీసీ కెమెరాల రికార్డులు, ఆయుధాల భద్రత, లాకప్ గదులను పరిశీలించారు. అనంతరం డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై స్రవంతి, సిబ్బంది ఉన్నారు. -
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో వానాకాలం సీజన్కు సంబంధించిన ధాన్యం సేకరణ కోసం అధికారులు కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ ఒకటో తేదీన ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ధాన్యం సేకరణపై శుక్రవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. వానాకాలం సీజన్లో 5.99 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించాలన్నది లక్ష్యమన్నారు. ఇందుకోసం సొసైటీల ఆధ్వర్యంలో 233, ఐకేపీ ఆధ్వర్యంలో 194 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సరిపడా గోనె సంచులతోపాటు తగినన్ని వేయింగ్ మిషన్లు, తేమ నమోదు శాతం తెలిపే మిషన్లు, ప్యాడీ క్లీనర్స్ను కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు. రైతులకు టోకెన్లు ఇచ్చి వడ్లు కొనుగోలు చేయాలని, సేకరించిన ధాన్యాన్ని 24 గంటల్లో రైస్మిల్లులకు పంపించాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలుంటే 08468–220051 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
రూ. 5,55,555తో అమ్మవారికి అలంకరణ
కామారెడ్డి టౌన్ : జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తు లను అనుగ్రహించారు. జిల్లా కేంద్రంలోని దేవివిహార్ కాలనీలోని దేవి రెసిడెన్సీ బ్లాక్ లో ప్రతిష్ఠించిన అమ్మవారిని రూ.5,55,555 ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ‘విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం’ కామారెడ్డి అర్బన్: విపత్కర పరిస్థితులను ఎ దుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రావణ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయ న్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్ వాహనాలను ఏర్పాటు చేశా మని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, మీటర్ల వద్ద వినియోగదారులు ప్యూజ్లు మార్చడం, రి పేర్లు చేయడం ప్రమాదకరమని, ఏదైనా సమస్య ఉంటే 1912 నంబర్కు ఫోన్చేసి చె ప్పాలని సూచించారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులకు జాతీయ స్థాయి పురస్కారాలు కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సై న్స్ కళాశాల విద్యార్థులు నలుగురికి జాతీ య స్థాయి పురస్కారాలు లభించాయని క ళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నందుకు నేషనల్ ఇంటిగ్రేటెడ్ ఫోరం ఆఫ్ ఆర్టి స్ట్స్ అండ్ యాక్టివిస్ట్స్(నిఫా) సంస్థ జాతీయ స్థాయి యంగ్ కమ్యూనిటీ చాంపియన్ సేవా రత్న పురస్కారాలు అందించిందన్నారు. శు క్రవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు షే క్ రిజ్వన్ అహ్మద్, ఉదగిరి రాజ్కు మార్, బే స మానస, రాందిన్ కుల్దీప్నాయర్ ఈ పురస్కారాలు అందుకున్నారన్నారు. చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నందుకు అవార్డులు దక్కాయన్నారు. తొలి రోజు ఒకటి.. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణా ల నిర్వహణకు సంబంధించిన గెజిట్ నోటి ఫికేషన్ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. తొలి రోజు ఒక దరఖాస్తు వచ్చింది. బాన్సువాడ నుంచి ఒక దరఖాస్తు వచ్చిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు తెలిపారు. జిల్లాలో 49 మద్యం దు కాణాలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి స ర్కిల్ పరిధిలో 15 దుకాణాలు, దోమకొండ పరిధిలో ఎనిమిది, ఎల్లారెడ్డిలో ఏడు, బా న్సువాడలో తొమ్మిది, బిచ్కుందలో పది మ ద్యం దుకాణాలున్నాయి. జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ప్రస్తుతం మద్యం వ్యాపారంలో ఉన్న వారితో పాటు కొత్త వారు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దసరా పండగ తర్వాత దరఖాస్తులు స్పీడందుకోనున్నాయి. బోధన్–బీదర్ రైల్వే పనుల కోసం భూ పరీక్షలు రుద్రూర్ : బోధన్ నుంచి కర్ణాటకలోని బీదర్ వరకు కొత్త రైల్వే లైన్ పనుల కోసం అధికారులు భూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) శివారులో రెండురోజులుగా భూ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల అనంతరం నివేదికను కేంద్ర రైల్వే అధికారులకు సమర్పించనున్నారు. గతంలో బోధన్ నుంచి బీదర్ వరకు కొత్త రైల్వేలైన్ కోసం భూసేకరణ చేసి హద్దులను గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భూ పరీక్షలు చేస్తుండడంతో రైల్వేలైన్ పనుల ప్రారంభంపై ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి. -
కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ: ఆర్టీసీ విశ్రాంత కార్మికుల కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక రెడ్డి సంఘంలో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సంఘంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విశ్రాంత ఆర్టీసీ కార్మికుల సంఘం భవనం కోసం 250 గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఇస్తానని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విశ్రాంత కార్మికులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం, ఎన్ఎండీసీ మాజీ చీఫ్ జనరల్ పద్మారావు, నేషనల్ ఎజిటేషన్ కమిటీ అధ్యక్షులు లక్ష్మి, బాన్సువాడ విశ్రాంత కార్మికులు పాల్గొన్నారు. -
నవ నైవేద్యాల బతుకమ్మ
తొమ్మిదీ రోజులా లక్ష్మివే బతుకమ్మ దండాలు మాయన్ని నీకివే బతుకమ్మ.. శంకరుని ఇల్లాల బృహదమ్మ నీవేగ బతుకమ్మ పేరుతో వస్తివే బతుకమ్మ.. ఎంగిలీ పూలతో సంబురం తెస్తివీ నువ్వులూ, నూకలూ నీకివే బతుకమ్మ.. ఆశ్వయుజ మాసానా అటుకులా వస్తివీ సప్పిడీ, బెల్లమూ తీపివే బతుకమ్మ.. మూడవా రోజునా మెరిసేటి బొమ్మవే పాలబువ్వ అందుకునె పాపవే బతుకమ్మ.. నాలుగో రోజునా కమ్మనీ పాయసం అందించ వస్తిమీ తాగవే బతుకమ్మ.. చప్పట్ల జోరులో పాటలా హోరులో అట్లనే నైవేద్యం తింటివే బతుకమ్మ.. పంచమీ రోజునా అలిగినా బొడ్డెమ్మ పస్తుండి నీళ్ళన్న ముట్టవే బతుకమ్మ.. నూకలా పిండినీ నేతిలో వేయించి కమ్మటీ వేప్పల్లు నీకివే బతుకమ్మ.. ఎనిమిదో రోజునా వెన్నముద్దవమ్మా నువ్వులా లడ్డూలు నీకివే బతుకమ్మ.. తొమ్మిదో రోజునా సద్దులా తల్లివే బంగారి పూలతో సద్దివే బతుకమ్మ.. గంగమ్మ ఒడిలో సాగిపో హాయిగా మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ.. మరుయేడు శిశువులా మారవే బతుకమ్మ.. డొంకేశ్వర్(ఆర్మూర్): రాసినవారు: సుజాత శేర్ల – హిందీ టీచర్, జెడ్పీహెచ్ఎస్, మారంపల్లి (డొంకేశ్వర్) -
కంటైనర్ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● 9 మందికి గాయాలు డిచ్పల్లి: డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు 27 మంది ప్రయాణికులతో ప్రైవేట్ టావెల్స్ బస్సు బయల్దేరింది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతున్న కంటైనర్ను డ్రైవర్ సుద్దపల్లి వద్ద రహదారిపై నిలిపి పక్కనే ఉన్న దుకాణానికి సరుకుల కోసం వెళ్లాడు. అదే సమయంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టి అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఎడమవైపు కూర్చున్న ప్రయాణికులు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఫారుఖ్, రవీందర్, లింగమ్మ, అల్తాఫ్ ఉన్నారు. కంటైనర్ డ్రైవర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు రాహుల్
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ విద్యార్థి నునావత్ రాహుల్ విశ్వ విద్యాలయాల జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఇన్చార్జి పీడీ జి.శ్రీనివాస్రావులు తెలిపారు. అక్టోబర్ 2 నుంచి కర్నాటక బెల్గాంలో నిర్వహించే జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో రాహుల్ పాల్గొంటారని వారు పేర్కొన్నారు.పోర్టుపోలియో జడ్జిని కలిసిన న్యాయవాదులుకామారెడ్డి టౌన్: కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం హైదరాబాద్లో హైకోర్టు, పోర్టు పోలియో న్యాయమూర్తి నందికొండ నర్సింగ్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. కామారెడ్డి కోర్టులో ఉన్న సమస్యలు, పలు అంశాలపై చర్చించారు. న్యాయవాదులు జగన్నాథం, వెంకటరామిరెడ్డి, శ్రీధర్, సురేందర్రెడ్డి, తదితరులున్నారు.రామేశ్వర్పల్లి దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడి మృతిభిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లి గ్రామ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శివ్వగారి కృష్ణంరాజు (40) గురువారం మృతి చెందారు. ఆయన గత నెలరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందాడు. కృష్ణంరాజు గ్రామ మహిళా సంఘంలో సీఏగా పనిచేశాడు. గ్రామ మహిళా సంఘం అభివృద్ధికి కృషిచేయడంతోపాటు ప్రతి మహిళ ఐకేపీ సంఘంలో చేరేలా విస్తృత ప్రచారం చేశారని పలువురు కొనియాడారు. కృష్ణంరాజు అంత్యక్రియల్లో ప్రజలు, నేతలు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.రెండు రోజులు భారీ వర్షాలుకామారెడ్డి క్రైం: వాతావరణ శాఖ సూచనల ప్రకారం జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. గురువారం ఆయన జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
పట్టుబట్టి.. విజయం సాధించి..
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపల్లి గాయత్రి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు జాబ్ చేస్తూనే గ్రూప్–1కు పట్టుదలతో సన్నద్ధమైంది. ఆమె పట్టుదలకు విజయం వరించింది. గ్రూప్–1కు ఎంపికై ంది. మల్జీజోన్–1లో 201వ ర్యాంకు, మహిళా విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. రెండు రోజుల క్రితం టీజీపీఎస్సీ గ్రూప్–1 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగానికి ఎంపికై న గాయత్రి మాటల్లోనే... మా నాన్న సీతారాములు ఆర్టీసీ కండక్టర్, అమ్మ రాజమణి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు రామారెడ్డిలో, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్సీ జిల్లా కేంద్రంలో చదివాను. ఉస్మానియాలో ఎమ్మెస్సీ, ఎంఎల్ఐఎస్సీ పూర్తి చేశాను. 2020లో గ్రూప్–4కి ఎంపికై కామారెడ్డి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరాను. డబుల్ పీజీ చదివి జూనియర్ అసిస్టెంట్గా ఎందుకమ్మా గ్రూప్–1 ప్రయత్నించి అధికారి కావొచ్చని తోటి ఉద్యోగులు చెప్పడంతో నేను అప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నించాను. గ్రూప్–1 ఉద్యోగం రాదని చాలా మంది ఎగతాళి చేయడంతో నాలో ఇంకా పట్టుదల పెరిగింది. ఎలాంటి శిక్షణ లేకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఇటీవల గ్రూప్–1 ఫలితాల్లో నెగ్గాను. ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విధి నిర్వహణలో కూడా విజయాలు సాధిస్తాను. నిజాయితీగా నిబద్ధతగా విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. మా అమ్మ కూడా నన్ను చాలా ప్రోత్సహించింది. ఇంట్లో టీవీ కనెక్షన్ కూడా తొలగించాం. సెల్ఫోన్తో కాలక్షేపం చేయకుండా చాలా కష్టపడ్డాను. నా కష్టానికి ఫలితం దక్కింది. బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తూనే గ్రూప్–1కు ఎంపికై న గాయత్రి మల్టీజోన్–1లో 201 ర్యాంకు, మహిళా విభాగంలో 4వ ర్యాంకు ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్గా ఉద్యోగం -
జిల్లా ఉపాధ్యాయుడికి అవార్డు
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు విజయగిరి రామకృష్ణకు శారద ఎడ్యుకేషనల్ సొసైటీ నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు అందించింది. గురువారం హైదరాబాద్లోని బిర్లా ప్లానిటోరియంలో గల భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమ బోధనలు, సృజనాత్మక ఆవిష్కరణలు, విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి ఈ అవార్డు అందిస్తామని శారద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమలాకర్ తెలిపారు. అనారోగ్యంతో ఒకరి ఆత్మహత్య సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూ ర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఒకరు జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎ స్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య (55) పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూయించినా రోగం నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తి తో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు
నేడు వెయ్యి మందితో సామూహిక నవదుర్గ వ్రతం కామారెడ్డి అర్బన్: కామారెడ్డి హౌసింగ్బోర్డు కా లనీలోని శారదామాత ఆలయంలో దేవి నవరా త్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు లలితా పంచమి సందర్భంగా వెయ్యి మంది మహిళలతో సామూహిక నవదుర్గ మహా వ్రతం నిర్వహించనున్నట్లు వేద పండితులు జి.అంజనేయశర్మ తెలిపారు. మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సాక్షి నెట్వర్క్:దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండపాల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. పలు చోట్ల ప్రత్యేక భజన కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు. -
మాన్యువల్ విద్యుత్ బిల్లింగ్కు స్వస్తి
● జిల్లాలో ‘ఏఎంఆర్’ విధానం మీటర్ల బిగింపు ● ప్రయోగాత్మకంగా హై వోల్టేజీ విద్యుత్ వినియోగదారులకు ఏర్పాటు కామారెడ్డి టౌన్: మానవ రహిత ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) దిశగా టీజీఎన్పీడీసీఎల్ అడుగులు వేస్తోంది. బిల్లుల అందజేతలో వేగం రూపంలో పారదర్శకతను పెంచేందుకు, విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ సమస్యలు లేకుండా చూసేందుకు ఏఎంఆర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో తొలుత పారిశ్రామిక రంగంలో అధిక హై వోల్టేజీ(హెచ్టీ) వినియోగించే పరిశ్రమల్లో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ఇతర సర్వీసులకు సైతం విస్తరించాలని సంస్థ యోచిస్తుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. కామారెడ్డిలో 366 సర్వీసులు.. కామారెడ్డి జిల్లాలో హై వోల్టేజీ వినియోగించే పరిశ్రమలకు సంబంధించి 366 విద్యుత్ సర్వీసులున్నాయి. వాటికి 100 శాతం ఏఎంఆర్ ఏర్పాటు లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 75 శాతం పూర్తి చేశారు. పరిశ్రమల్లో మీటరు రీడింగ్కు హై వోల్టేజీ (హెచ్టీ) విద్యుత్తు వాడుకునే కేటగిరీలో 55 హెచ్పీకి మించి సామర్థ్యం ఉంటే ఏడీఈ స్థాయి అధికారి, 55 హెచ్పీ లోపు ఉంటే ఏఈ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారు. నాన్ స్లాబ్ రీడింగ్ను లైన్ ఇన్స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్ను ప్రైవేట్, జూనియర్ లైన్మన్లు చూస్తారు. మీటరు రీడింగ్ నమోదులో రోజులు ఆలస్యమైతే స్లాబ్ రేటు మారిపోతుంది. ఈ కారణంగా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందన్న ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఏఎంఆర్ పరిష్కారం చూపుతుంది. ఏఎంఆర్ వల్ల తప్పులు జరిగే ప్రసక్తి ఉండదని, విద్యుత్తు సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులు త్వరితగతిన గుర్తించవచ్చని, సిబ్బంది సమయం వృథా కాదని అధికారులు తెలిపారు. ఈ ఏఎంఆర్లో 4జీ కమ్యూనికేషన్ సిమ్ను అమర్చుతారు. దీంతో నమోదైన డేటా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా వరంగల్లోని సెంట్రల్ సర్వర్కు చేరుతుంది. సిబ్బంది ఖర్చు లేకుండా 30 రోజుల్లో కచ్చితమైన బిల్లింగ్ పూర్తవుతుంది. జిల్లాలో ఉన్న హెచ్టీ మీటర్లకు ఏఎంఆర్ను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో మానవ రహితంగా బిల్లింగ్ వస్తుంది. తప్పులు జరిగే ఆస్కారం ఉండదు. సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని హెచ్టీ, పరిశ్రమలకు అన్నింటికి అమర్చుతున్నాం. ఏడీఈ స్థాయి నుంచి లైన్మెన్ వరకు వీటిని పర్యవేక్షిస్తాం. – శ్రవణ్ కుమార్, ఎస్ఈ, కామారెడ్డి -
పార్థీ దొంగల ముఠా సభ్యులపై పీడీ యాక్ట్
కామారెడ్డి క్రైం: జాతీయ రహదారులపై దొంగతనాలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ దొంగల ముఠాకు చెందిన కొందరిని ఇటీవల కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. ఈ ముఠాలోని ముగ్గురు ప్రధాన నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో రహదారుల వెంబడి, దాబా హోటళ్ల వద్ద నిలిపి ఉంచిన వాహనాలను టార్గెట్ చేసుకొని మారణాయుధాలతో దాడులు చేయడం, విలువైన వస్తువులు, నగదు దోచుకోవ డం చేస్తుంటారు. అంతేకాకుండా జాతీయ రహదారుల వెంట ఉండే గ్రామాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను దోచేస్తారు. వీరిపై మహారాష్ట్రలోని ఉద్గిరి నీలం పోలీస్ స్టేషన్ల పరిధిలో హత్య, హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. ముఠాలోని ప్రధాన నిందితులైన కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా ఔరాద్కు చెందిన కృష్ణ బాబు షిండే, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మంగ్యాల్ తడాకు చెందిన నాందేవ్, వసూర్ గ్రామానికి చెందిన రాథోడ్ అజిత్ రమేశ్పై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. పీడీ యాక్టు ఉత్తర్వులను నిజామాబాద్ జైలులో ఉన్న నిందితులకు అందజేశామన్నారు. -
మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ
కామారెడ్డి క్రైం: బతుకమ్మ పండుగ మహిళా సోదరీమణులకు అతిపెద్ద పండుగ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ ఆడడానికి మహిళలు ఎంతో ఉత్సాహాన్ని చూపి ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటారన్నారు. జిల్లాలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిరోజు కలెక్టరేట్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, టీఎన్జీవో ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు. -
● ఎంత పెద్ద వాహనమో..?
క్రైం కార్నర్వర్ని: మోస్రా మండల కేంద్రంలో గురువారం పేకాట స్థావరాలపై స్పెషల్ పార్టీ పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న 16 మందిని అరెస్టు చేసినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. పట్టుబడిన వారి నుంచి రూ. 24,230 నగదు, 16 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. నవీపేట: మండలంలోని నాగేపూర్ శివారులో పేకాట స్థావరంపై బుధవారం రాత్రి దాడి చేసినట్లు ఎస్సై తిరుపతి గురువారం తెలిపారు. పేకాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి రూ.8,430 నగదు స్వాధీనం చేసి, 8 సెల్ఫోన్లు, 6 బైక్లను సీజ్ చేశామన్నారు. ఎవరైనా పేకాట ఆడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
ఆగమాగం.. ఫైళ్లు మాయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అది నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయం.. కొత్తవారు ఎవరైనా వస్తే చేపల మార్కెట్టా.. లేక కొత్త సినిమా టిక్కెట్లు బ్లాక్లో అమ్ముతున్నారా..? అనే సందేహం కలుగక మానదు. ఇదే తరహా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గురువారం గందరగోళ వాతావరణం నెలకొంది. ఓ తొమ్మిది నెలల నిండు గర్భిణి రిజిస్ట్రేషన్ నిమిత్తం రాగా, ఉదయం 11 గంటలకు స్లాట్ ఇ చ్చారు. సాయంత్రం 6.30 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. విచిత్రమేమిటంటే కంప్యూటర్ గదిలో ఎంట్రీ చేసే సిస్టమ్ వద్ద ఉన్న ఫైల్ మాయమైంది. కొన్ని గంటల పాటు వెతకగా చివరకు హాల్లో ఉన్న టేబుల్ మీద ఈ ఫైల్ దొరికింది. కార్యాలయంలో ఏ ఫైళ్లు ఎక్కడ ఉన్నాయో అనేది అర్థం కాని పరిస్థితి. నిండు గర్భిణి రిజిస్ట్రేషన్ నిమి త్తం బుధవారం కూడా రోజంతా అనేక ఇబ్బందు లు కలిగినప్పటికీ వేచి చూసి వెళ్లారు. ఇలా రిజి స్ట్రేషన్ కోసం రెండ్రోజులుగా తిరుగుతున్నవారు చాలామంది ఉన్నారు. డాక్యుమెంట్ రైటర్ల పోటాపోటీ వ్యవహారంలో ఎవరి ఫైళ్లు వారు ముందు పెట్టుకోవాలనే పోట్లాడే పరిస్థితి నెలకొంది. కార్యాలయం మొత్తం డాక్యు మెంట్ రైటర్లదే హవా. దీంతో ఈ కార్యాలయంలో పనిచేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు ముందుకు రావడం లేదు. ఏడాది కాలంగా ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు ఇన్చార్జి ఇచ్చారు. ఈ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్లతో నెట్టుకొస్తున్నారు. అయితే ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న రోజు కార్యాలయంలో రిజి స్ట్రార్ ఒక్కరు మాత్రమే విధులు నిర్వహించారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు రోజంతా వేచిచూడాల్సిన వచ్చింది. అంతకు ముందురోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వర్ పనిచేయలేదంటూ రిజి స్ట్రేషన్లు పూర్తి చేయలేదు. వందల మందికి ఎదురు చూ పులు తప్పలేదు. అ యితే నిజామాబాద్ రూరల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మాత్రం సర్వర్ పనిచేయడం గమనార్హం. నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి తాజా ఘటన ఒక ఉదాహరణ మాత్రమే. అద్దె భవనంలోనే.. అత్యధిక ఆదాయం తీసుకొచ్చే రిజిస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి సొంత కార్యాలయం ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. సమీకృత కలెక్టరేట్ కార్యాలయం ఏర్పాటు చేసి అందులోకి వివిధ ప్రభుత్వ కార్యాలయాలను తరలించారు. ఇలా తరలివెళ్లిన కార్యాలయాలకు సంబంధించి పలుచోట్ల పాత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ భారీగా అద్దెలు చెల్లిస్తూ తగిన సౌకర్యాలు లేని ప్రైవేటు భవనంలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ కార్యాలయా లు నడిపిస్తున్నారు. రెండో ఫ్లోర్లో ఉన్న అర్బన్ కార్యాలయానికి వచ్చేందుకు గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుర్చీలు లేక గంటల తరబడి నిలబడుతున్నారు. మరుగుదొడ్లు, నీటి సౌకర్యం కూడా సక్రమంగా లేవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా పరిశీలించి తగిన విధంగా పరిష్కారం చూపేందుకు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పరిస్థితి స్లాట్ సమయం ఉదయం ఉన్నా.. సాయంత్రం వరకు ఆగాల్సిందే.. మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్న గర్భిణులు, వృద్ధులు -
ముసురేసింది!
● జిల్లా అంతటా జల్లులు ● అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షం ● మరో రెండురోజులు వర్ష సూచనపెద్ద ఎక్లార సమీపంలో నిండుగా పారుతున్న వాగుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా అంతటా ముసురుపట్టింది. గురువారం ఉదయం నుంచి మొదలైన ముసురు రాత్రి వరకూ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంలో గురువారం నాటి అంగడి (వారసంత)కు ముసురు ఆటంకం కలిగించింది. దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో చాలా గ్రామాల నుంచి పట్టణానికి వచ్చి షాపింగ్ చేసే ప్రజలు ముసురుతో ఇబ్బందిపడ్డారు. జిల్లాలో దాదాపు నెల రోజులుగా వర్షం కురుస్తోంది. ఒకటి రెండు రోజులపాటు గెరువివ్వడంతో దుకాణాలు, షాపింగ్ మాల్స్ రద్దీగా కనిపించాయి. పండుగ సీజన్ కావడంతో అందరూ దుస్తులు, ఇతర వస్తువుల కొనుగోళ్లకు కోసం పట్టణాలకు రావడంతో రోడ్లన్నీ బిజీగా కనిపించాయి. కానీ గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రోజంతా జల్లులు కురుస్తూనే ఉన్నాయి. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలున్నాయి. రోజూ కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బంది పడుతున్నారు. గతనెల 27, 28, 29 తేదీలలో జిల్లాలో కుంభవృష్టి కురిసింది. దాదాపు జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. వాగులు పొంగి ప్రవహించాయి. పోచారం, నిజాంసాగర్ ప్రాజెక్టులకు రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. పోచారం ప్రాజెక్టు ఒక సందర్భంలో కొట్టుకుపోతుందనే పరిస్థితికి చేరింది. జిల్లాలో చాలా రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు రాకపోకలు పునరుద్ధరించలేదు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి వద్ద వంతెన దెబ్బతినడంతో ఇప్పటికీ బస్సులు తిరగడం లేదు. జిల్లాలోని చాలా గ్రామాలకు వెళ్లే రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.నెల రోజులుగా వాగులు నిరాటంకంగా ప్రవహిస్తున్నాయి. అయితే గురువారం మళ్లీ వర్షం కురవడంతో వాగుల్లో ప్రవాహం పెరిగింది. జిల్లా అంతటా వర్షం పడుతుండడంతో వాగులు, ఒర్రెల్లో ప్రవాహం పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి అలుగుపైనుంచి నీరు ఉధృతంగా పొంగి పొర్లుతోంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వానలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ పండుగ సమయంలో కురుస్తున్న వర్షాలతో మహిళలు బతుకమ్మ ఆడడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
మద్యం దుకాణాల దరఖాస్తులకు వేళాయే!
● నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ● జిల్లాలో 49 మద్యం దుకాణాలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాల నిర్వహణ కోసం ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 2025–27 సంవత్సరానికి గాను శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జిల్లాలో 49 వైన్షాప్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు రెండు, గౌడ కులస్తులకు ఏడు కేటాయించారు. మిగిలిన 35 దుకాణాలు జనరల్. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు ఫీజును ప్రభుత్వం ఈసారి రూ.3 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. దరఖాస్తు రుసుమును పెంచినా.. పోటీ తగ్గే అవకాశాలు లేవని భావిస్తున్నారు. మద్యం వ్యాపారం కలిసి రావడంతో ఈసారి మరింతగా పోటీ ఉండే అవకాశం ఉందంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్న నేపథ్యంలో చాలా మంది మద్యం వ్యాపారంవైపు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అందరిలోనూ ఆసక్తి... మద్యం దుకాణాల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన జారీ కాకముందునుంచే పలువురు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చాలా మంది గ్రూపులను తయారు చేసుకున్నారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వ్యాపారాలు చేస్తున్న వారు మద్యం దందాపై ఆసక్తి కనబరుస్తున్నారు. గురువారం నోటిఫికేషన్ వెలువడడంతో మద్యం వ్యాపారులతో పాటు ఇతర రంగాలకు చెందిన వారు దందాలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివిధ వ్యాపారాల్లో భాగస్వాములు, స్నేహితులు.. ఇలా కొందరు కలిసి గ్రూపుగా ఏర్పడుతున్నారు. ఐదు నుంచి పది మంది వరకు కలిసి పది నుంచి ఇరవై దుకాణాలకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. కొందరైతే ఇప్పటికే డబ్బులు సర్దుబాటు చేసుకున్నారు. లక్కీ డ్రాలో మద్యం దుకాణం వస్తే రెండేళ్లలో మంచి వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుందన్న భావనతో చాలా మంది మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.జిల్లాలో మద్యం వ్యాపారం మీద మోజు పెరుగుతోంది. దరఖాస్తు రుసుము ఎంత పెరుగుతున్నా వెనక్కి తగ్గడం లేదు. రెండేళ్లకోసారి జరుగుతున్న టెండర్లలో రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు రావడమే ఇందుకు నిదర్శనం. 2021లో 49 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా.. 960 దరఖాస్తు లు వచ్చాయి. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పట్లో రూ. 19.20 కోట్ల ఆదాయం వచ్చింది. 2023లో దరఖాస్తులు 2,175 కి పెరిగాయి. వీటి ద్వారా దాదాపు రూ. 44 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. మద్యం అమ్మకాలు ఏడాదికేడాది పెరుగుతుండడం, వ్యాపారం ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుండడంతో అందరి కన్ను మద్యం వ్యాపారంపైనే ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఈ టర్మ్లో వచ్చే అవకాశాలున్నాయి. దీంతో వైన్షాప్లకు ఈసారి తీవ్రమైన పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈసారి దరఖాస్తులు మూడు వేలు దాటవచ్చని భావిస్తున్నారు. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.3 లక్షలకు పెరిగింది. తద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి.ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 49 వైన్షాప్లకు దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. దీనికి సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశాం. కలెక్టరేట్లోని ఎకై ్సజ్ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తాం. దుకాణాలకు రిజర్వేషన్ల కోసం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నేతృత్వంలో లాటరీ నిర్వహించాం. గెజిట్ నోటిఫికేషన్లో వివరాలు వెల్లడిస్తాం. – హన్మంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి, కామారెడ్డి -
మద్యం దుకాణాల రిజర్వేషన్లకు డ్రా
కామారెడ్డి క్రైం: నూతన మద్యం పాలసీ (2025–27)లో భాగంగా జిల్లాలో 49 మద్యం దుకాణాల నిర్వహణకు గురువారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య డ్రా తీశారు. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో ఐదు ఎస్సీ సామాజిక వర్గానికి, రెండు ఎస్టీ సామాజిక వర్గానికి, ఏడు బీసీ గౌడ కులానికి రిజర్వ్ చేశారు. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేసి వాటి ఆమోదంకోసం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కమిషనర్కు పంపించామని కలెక్టర్ తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్, బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, ఎస్టీ అభివృద్ధి అధికారి సతీశ్, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెబుతారు
● మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ● బాన్సువాడలో బతుకమ్మ సంబురాలుబాన్సువాడ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి బతుకమ్మను తొలగించిన సీఎం రేవంత్రెడ్డి పదవికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వర్షంలో సైతం బతుకమ్మ ఆడారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్రెడ్డి, సునీత, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, జెడ్పీ మాజీ చైర్పర్సన్స్ దఫేదార్ శోభ రాజు, తుల ఉమ, బీఆర్ఎస్ నాయకులు రాధ, లత, పావని తదితరులు బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ తల్లి పాలు తాగి రొమ్మునే గుద్దిన పెద్ద మనిషి పోచారం శ్రీనివాస్రెడ్డి అని విమర్శించారు. ఆ రావణాసురుడికి అంతం తప్పదన్నారు. మోసం చేసిన వ్యక్తికి శిక్ష తప్పదని, ఆయన రేవంత్రెడ్డి కాదని, రైఫిల్రెడ్డి అని పేర్కొన్నారు. కేసీఆర్ను ప్రజలు మనసులో పెట్టుకున్నారన్నారు. ఆయన మళ్లీ రావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. పోచారం లక్ష్మీపుత్రుడు కాదు.. పోచారం శ్రీనివాస్రెడ్డి లక్ష్మీపుత్రుడు కాదని అష్టదరిద్రుడని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కేసీఆర్ పోచారంను లక్ష్మీపుత్రుడిగా భావించి అభివృద్ధికి నిధులు ఇస్తే.. అధికారం పోగానే పార్టీ మారిన పోచారానికి ఉప ఎన్నికల్లో ప్రజలే బుద్ధిచెబుతారని పేర్కొన్నారు. త్వరలో బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమన్నారు. అధికారం లేకున్నా బాన్సువాడలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలకడం ఆడపడుచుల గుండెల్లో కేసీఆర్ ఉన్నారనడానికి సాక్ష్యమన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, జాజాల సురేందర్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబొద్దీన్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు అంజిరెడ్డి, జుబేర్, సుశీలరెడ్డి, శ్రీనివాస్రావు, గణేష్, చందర్, సాయిబాబా, రమేష్యాదవ్, గాండ్ల కృష్ణ, ఉమ మహేష్, శివ, నార్ల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు పాటిస్తేనే అనుమతులివ్వాలి
● ఆస్పత్రులను తనిఖీ చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నిబంధనలు పాటిస్తేనే అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు నడిపించాలన్నారు. అనుమతి లేని ఆస్పత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. అర్హత లేని వారు వైద్యం చేస్తే సీజ్ చేయాలని ఆదేశించారు. వైద్యశాఖ అధికారులు క్రమం తప్పకుండా ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేయాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. -
ఆదర్శ రైతుల ఎంపిక.. సన్మానం
సదాశివనగర్/పిట్లం/భిక్కనూరు/బాన్సువాడ/తాడ్వాయి :లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి ఆధ్వర్యంలో ఆదర్శ రైతులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. బుధవారం బోధన్ కమ్మ సంఘంలో బాన్సువాడ మండలం దేశాయిపేట్కు చెందిన జంగం బసప్ప, బీర్కూర్ మండలం కిష్టాపూర్కు చెందిన పెద్ది నర్సారెడ్డి, సదాశివనగర్కు చెందిన కోతి లింబారెడ్డి, తాడ్వాయికి చెందిన భీమన్నగారి ధర్మారెడ్డి, పిట్లం మండలం తిమ్మాపూర్కు చెందిన బుజ్జారెడ్డి, భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన అంబళ్ల మల్లేశంలను ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ..రైతు దేశానికి వెన్నెముక లాంటోడని, రైతు లేని సమాజం ఉహించ లేనిదని, రైతు కష్టాన్ని గుర్తించాల్సి బాధ్యత మనందరిదని అన్నారు. -
డిపాజిట్ల పేరిట రూ. 8.5 కోట్ల టోకరా
● యూఎస్ డాలర్, క్రిప్టో కరెన్సీ, ట్రేడింగ్ అంటూ ఆన్లైన్ దందా ● ఇద్దరు నిందితుల అరెస్ట్ ఖలీల్వాడి: అనుమతి లేకుండా కంపెనీలు పెట్టి 125 మంది నుంచి డిపాజిట్ల పేరిట డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు క్రైం బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర చారి తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీసీఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన మొయిజ్ ఖాన్, మహమ్మదీయ కాలనీకి చెందిన సయ్యద్ మహ్మద్ హాసన్ ఇద్దరు స్నేహితులు. 2022–23లో షైన్ ఎవర్ గ్రీన్ కంపెనీ పేరిట సంస్థను ఏర్పాటు చేశారు. తమ కంపెనీలో డిపాజిట్ పెడితే రూ. లక్షకు 10 శాతం వరకు అందిస్తామని నమ్మబలికారు. కొంతమంది మిత్రులు, ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని 125 మంది నుంచి రూ.8.5 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఆ తర్వాత మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్లు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తూ వచ్చారు. డిపాజిటర్లు ఒత్తిడి చేయడంతో మకాం మార్చారు. దీంతో ఇందల్వాయి మండలంలోని లో లం గ్రామానికి చెందిన హకీం ఫిర్యాదు చేయడంతో సీపీ పోతరాజు సాయిచైతన్య కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. కేసు దర్యాప్తు అనంతరం మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ వెల్లడించారు. మొయిజ్ఖాన్, సయ్యద్ మహ్మద్ హాసన్లు నిజామాబాద్ నుంచి మకాం మార్చి మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి నుంచి ఆన్లైన్లో క్రిప్టో, యూఎస్ డాలర్, ట్రేడింగ్ పేరిట యాప్ ద్వారా వసూళ్లకు తెర లేపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని మీటింగ్లు ఏర్పాటు చేశారు. కాగా, వీరి వలలోపడి ఎంతమంది ప్రజలు మోసపోయారో తెలియాల్సి ఉందని ఏసీపీ నాగేంద్రచారి తెలిపారు. మరోవైపు హైదరాబాద్లో ఓ భూమిని నిందితులిద్దరూ కలిసి కొనుగోలు చేసి రూ. 25 లక్షలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీసీఎస్ సీఐలు రవీందర్, సురేశ్, కానిస్టేబుళ్లు ఉన్నారు. -
మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు
● రోడ్లు, తాగునీరు, డ్రెయినేజీల అభివృద్ధికి రూ.15 కోట్లు ● హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు, నాయకులు బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసింది. బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పాటై 5 నెలలు కావస్తోంది. నిధులు లేక ప్రజల సమస్యలు పరిష్కారానికి అధికారులు నానాతంటాలు పడుతున్నారని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ) దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీడీఎంఏ కార్యాలయం నుంచి అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయి. సీసీ, ఇతర రోడ్ల నిర్మాణం కోసం రూ.5 కోట్లు, మున్సిపాలిటీ భవనం నిర్మాణానికి రూ.3 కోట్లు, డ్రైనేజీ కోసం రూ.3.50 కోట్లు, కల్వర్టులు రూ.1.50, షాపింగ్ కాంప్లెక్స్ కోసం రూ.2 కోట్లు మొత్తం రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం రూ.కోట్లలో నిధులు మంజూరు కావడంతో ప్రజలు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్ ఎమ్మెల్యేకు, అధికారులు కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. రెండవ విడతలో మరో రూ.15 కోట్లు నిధుల కోసం ఎమ్మెల్యే ప్రయత్న చేస్తున్నారని ఆయన తెలిపారు. -
రికార్డుల వరద
ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ సీజన్లో ఇప్పటికే 180 టీఎంసీల ఇన్ఫ్లో రాగా.. నెల రోజుల వ్యవధిలోనే 166 టీఎంసీల నీరు ఔట్ఫ్లో అయ్యింది. నాలుగు దశాబ్దాలలో ఈ స్థాయిలో వరదలు రావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి ఉమ్మడి జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం 1923లో ప్రారంభమై 1931లో పూర్తయ్యింది. మంజీర నదిపై అచ్చంపేట గ్రామం వద్ద ఈ ప్రాజెక్టు కట్టారు. రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటితోపాటు బోధన్, నిజామాబాద్ పట్టణాల ప్రజలకు తాగు నీటిని అందించేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం అప్పట్లో 1,400 అడుగులు(29.5 టీఎంసీలు). పూడికతో ప్రాజెక్టు సామర్థ్యం తగ్గిపోతూ రావడంతో 1975లో ఎఫ్ఆర్ఎల్ లెవన్ను 4.5 అడుగులకు పెంచారు. దీంతో 1978 సంవత్సరం నుంచి ప్రాజెక్టు నీటిమట్టం 1,405 అడుగుల (17.8 టీఎంసీ)కు చేరింది. సుమారు వందేళ్ల చరిత్ర గల ఈ ప్రాజెక్టులోకి ఈసారి ఊహించనంతగా వరద వచ్చి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 180 టీఎంసీల నీరు వచ్చి చేరిందని నీటి పారుదల శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంత స్థాయిలో నీరు వచ్చింది ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు. మంజీరపై సింగూరు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించకముందు ఎప్పుడో వరద వచ్చిందని, గడచిన నలభై ఏళ్లలో ఈ స్థాయిలో ఇన్ఫ్లో, ఔట్ఫ్లో లేదని చెబుతున్నారు. గతనెల 18 న ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని వదలడం మొదలవగా మధ్యలో ఒకటి రెండు రోజులు మినహా నేటి వరకు వదులుతూనే ఉన్నారు. ఇప్పటివరకు 166 టీఎంసీల నీటిని వరద గేట్ల ద్వారా దిగువకు వదిలారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద లక్షన్నర ఎకరాలలో పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టు నిండుకుండలా ఉండడంతో ఆయకట్టుకు రెండు పంటలకూ భరోసా లభించింది. గతంలో ఒక్కోసారి సరైన వర్షాలు లేక ప్రాజెక్టు నీటిమట్టం డెడ్స్టోరేజీకి చేరి పంటలకు నీరందించడం ఇబ్బందికరంగా ఉండేది. ఈసారి వర్షాకాలం పంటలు చాలావరకు పొట్టదశలో ఉన్నాయి. కొన్నిచోట్ల కోతకు వచ్చాయి. ఇప్పటికీ ప్రాజెక్టు నిండుగా ఉండడం, పెద్ద ఎత్తున ఇన్ఫ్లో వస్తుండడంతో వచ్చే యాసంగితో పాటు తరువాతి వర్షాకాలం పంటలకూ ఢోకా ఉండదన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు నాలుగు దశాబ్దాల కాలంలో ఈసారి వచ్చిన ఇన్ఫ్లోనే అత్యధికమైనదని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతనెల 28న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2,50,912 క్యూసెక్కుల నీరు వచ్చింది. దీంతో 2.20 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఒక రోజులో ఈ స్థాయిలో ఇన్ఫ్లో రావడం, ఔట్ఫ్లో వెళ్లడం ఇదే మొదటిసారి అధికారులు తెలిపారు. సింగూరు నుంచి మంజీర పరవళ్లు తొక్కుతూ రాగా.. పోచారం ప్రాజెక్టు నుంచి కూడా భారీ వరద వచ్చింది. ఎగువన వర్షాలు కురుస్తూనే ఉండడంతో మంజీర జీవనదిలా మారింది. గడచిన 38 రోజులుగా నది పారుతూనే ఉంది. వర్షాలు పడుతుండడంతో మంజీర మరికొన్ని రోజులు పారే అవకాశం ఉంది. ఎగువన మెదక్, సంగారెడ్డి జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మంజీర నదికి వరద తగ్గడం లేదు. బుధవారం 70,328 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. పది గేట్ల ద్వారా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా ఇన్ఫ్లో వచ్చింది. దాదాపు అదే స్థాయిలో నీటిని దిగువకు వదిలాం. దాదాపు నలభై ఏళ్ల చరిత్రలో ఇదే ఎక్కువ ఇన్ఫ్లో, ఔట్ఫ్లో. ఎప్పటికప్పుడు ఇన్ఫ్లోను, ప్రాజెక్టును పర్యవేక్షిస్తూ ఎక్కడా నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఎగువన అలాగే దిగువన ముంపు సమస్య తలెత్తకుండా ప్రజల్ని అప్రమత్తం చేశాం. – టి.శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, కామారెడ్డినిజాంసాగర్ ప్రాజెక్టు గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ సీజన్లో 180 టీఎంసీల ఇన్ఫ్లో నెల రోజుల్లో గేట్ల ద్వారా 166 టీఎంసీలు విడుదల ఒకరోజు గరిష్ట ఇన్ఫ్లో 2.50 లక్షల క్యూసెక్కులు 40 ఏళ్లలో ఇదే అత్యధికమంటున్న అధికారులు -
నాణ్యమైన వైద్యసేవలందించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి టౌన్: బస్తీ దవాఖానాలలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్తో కలిసి జిల్లా కేంద్రంలోని హరిజనవాడ బస్తీ దవాఖానాను సందర్శించారు. వైద్య సేవలను, వైద్యులు, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండి సేవలు అందించాలని సూచించారు. ఆస్పత్రితో పాటు ఆస్పత్రి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. బస్తీ దవాఖానా పక్కన నిర్మిస్తున్న బాలసదనం భవన నిర్మాణాన్ని పరిశీలించి, నాణ్యతతో వేగంగా భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ జనార్దన్ తదితరులు ఉన్నారు. -
నేడు అంగన్వాడీల చలో హైదరాబాద్
బాన్సువాడ : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గురువారం నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు ఖలీల్ పిలుపునిచ్చారు. బుధవారం బాన్సువాడ సీడీపీవో సౌభాగ్యను కలిసి 25న అంగన్వాడీ కేంద్రాల బంద్ నోటీసును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ. 24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. చలో హైదరాబాద్కు అంగన్వాడీ టీచర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు మాధవి, ప్రతినిధులు గౌరీ, శివగంగ, సునీత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారులు సత్వర సేవలు పొందడానికి టీజీఎన్పీడీసీఎల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని విద్యుత్ శాఖ జిల్లా ఎస్ఈ శ్రావణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మొబైల్ ఫోన్ ప్లేస్టోర్లో యాప్ ఉందని పేర్కొన్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1912తో పాటు 1800 425 0028 నంబర్లలోనూ విద్యుత్ సేవల కోసం సంప్రదించవచ్చని సూచించారు. తాడ్వాయి: ప్రజలకు పనులు కల్పిస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కోకన్వీనర్ కృష్ణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై బుధవారం ఎంపీడీవో సాజిద్ అలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నరగా నాలుగు నెలలకోసారి వేతనాలు ఇస్తున్నారన్నారు. ఈసారి ఐదు నెలలైనా వేతనాలు రాలేదని పేర్కొన్నారు. పండుగలోపు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగ సంఘాల నాయకులు స్వామి, రామకృష్ణ, రేఖ, రాణి తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని దేవునిపల్లి మల్లికార్జున స్వామి కల్యాణ మండపంలో గురువారం ఉదయం 9 గంటలకు విజయదశమి ఉత్సవం నిర్వహించనున్నట్లు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు సిద్ధిరాములు, శివరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన సంఘ్ ఇందూర్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ విజయ్భాస్కర్ కృష్ణశాస్త్రి పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. నిజామాబాద్నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో హైరిస్క్లో ఉన్న గర్భిణీకి వైద్యులు ప్రసవం చేశారు. కోటగిరికి చెందిన 23 ఏళ్ల సిమ్రాన్బేగం ప్లేట్లెట్స్ తక్కువగా ఉండి బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం జీజీహెచ్కు తీసుకొచ్చారు. 37 వారాల 4 రోజుల గర్భంతో ఉండి ప్రసవ వేదను అనుభవిస్తున్న సిమ్రాన్బేగంకు జీజీహెచ్ వైద్యులు రెండు యూనిట్ల ఆర్డీపీ, ఒక యూనిట్ ఎస్డీపీ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చారు. ఆ తరువాత ఆమెకు ప్లేట్లెట్ కౌంట్ 57,000కు పెరిగింది. వైద్య బృందం సకాలంలో స్పందించి సిమ్రాన్బేగంకు చికిత్స అందించడంతో ఆమె మొదటికాన్పులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ప్రాణాలను రక్షించిన హౌస్ సర్జన్ హేమంత్, వైద్యులు లక్ష్మీప్రసన్న, హారిక, ఆశ్రిత, రమ్య, రశ్మితకు సిమ్రాన్ బేగం భర్త మహ్మద్ రసూల్తోపాటు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సోయాపై రైతుల్లో ఆశలు!
మద్నూర్: జిల్లాలో సోయా పంట ఆశాజనకంగా ఉంది. మరో పక్షం రోజుల్లో కోతకు రానుంది. పంట బాగుండడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఈసారి 80,476 ఎకరాల్లో సోయా పంట సాగయ్యింది. మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, డోంగ్లీ మండలాల్లో రైతులు అధికంగా ఈ పంట పండిస్తున్నారు. జిల్లాలో 60 శాతం వరకు సోయా పంట ఇక్కడే పండుతుంది. కాలం అనుకూలంగా ఉండడంతో పంట ఏపుగా పెరిగింది. ఈసారి పెద్దగా తెగుళ్ల బెడద కూడా లేకపోవడంతో కాత బాగుంది. మరో పక్షం రోజులు వాతావరణం అనుకూలిస్తే గట్టెక్కినట్లేనన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. భారీగా కాత.. సోయాబీన్ విత్తనాలు వేసిననాటి నుంచి కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేశాయి. సోయా పంటకు కా వాల్సినంత నీరందడంతో ఏపుగా పెరిగింది. ఈసారి భారీగా కాత కాసింది. మోకాలి ఎత్తులో ఉన్న సోయా పంట కళకళలాడుతోంది. పక్షం రోజుల్లో కోతలు ప్రా రంభం కానున్నాయి. మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చని పేర్కొంటున్నారు.ఈసారి వర్షాలు బాగానే కురవడంతో సోయాబీన్ పంట బాగుంది. ప్రస్తుతం భారీ కాయలతో ఉంది. గుత్తులు గుత్తులుగా కాయలున్నాయి. వాటిని చూస్తే ఆనందం వేస్తోంది. మరో 15 రోజుల్లో పంట చేతికి అందనుంది. – దత్తు, రైతు, మద్నూర్జిల్లాలో సోయా పంట వేసి మూడు నెలలు అవుతోంది. ఈసారి పంట బాగా పెరిగింది. కాయలు కూడా బాగా కాశాయి. ప్రస్తుతం సోయకాయ దశలో ఎండుతోంది. మరో పదిహేను రోజుల్లో కోతలు మొదలవుతాయి. – రాజు, ఏవో, మద్నూర్ జిల్లాలో 80,476 ఎకరాల్లో పంట సాగు అనుకూలించిన వర్షాలు.. దిగుబడి పెరుగుతుందని ఆశాభావం పక్షం రోజుల్లో చేతికందనున్న పంట -
ప్రాసెసింగ్ యూనిట్ల కోసం స్థలాల పరిశీలన
నిజాంసాగర్/మద్నూర్: సోయా, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం శాస్త్రవేత్తల బృందం బుధవారం మద్నూర్, జుక్కల్లలో పర్యటించింది. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్లు వారికి స్థలాలను చూపించారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు స్థలాలతోపాటు మద్నూర్ మార్కెట్లోని గోదాములను పరిశీలించారు. సోయా పంటపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోయా, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకోసం కృషి చేస్తున్నారని పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్కుమార్ అన్నారు. స్థల పరిశీలనకు వచ్చిన బృందంలో ఇక్రిశాట్ సీనియర్ అధికారి తమిర్ సెల్వి, అసిస్టెంట్ మేనేజర్ ప్రియాంక, రీసెర్చ్ అసోసియేషన్ టీం మేనేజర్ రాజశేఖర్, సభ్యులు సురేష్కుమార్, గంగారాం తదితరులున్నారు. -
‘స్థానిక’ రిజర్వేషన్లు ఫైనల్!
స్థానిక సంస్థలకు సంబంధించి రిజర్వేషన్ల జాబితా ఫైనల్ అయ్యింది. జెడ్పీ చైర్మన్ పదవిని రాష్ట్ర స్థాయిలో ఖరారు చేశారు. జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులతో పాటు ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు రూపొందించిన రిజర్వేషన్ల జాబితాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి పంచాయతీ వార్డు స్థానాల రిజర్వేషన్లపై ఎంపీడీవోల ఆధ్వర్యంలో, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు ఆర్డీవోల స్థాయిలో, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు అదనపు కలెక్టర్ల ఆధ్వర్యంలో కసరత్తు జరిగింది. అధికారులు ఖరారు చేసి ఇచ్చిన రిజర్వేషన్ల జాబితాలను కలెక్టర్ ఒకటికి రెండుసార్లు పరిశీలించి వాటిని ఉన్నతాధికారులకు నివేదించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా బీసీలకు సీట్లు రిజర్వు చేశారని సమాచారం. ఇతర రిజర్వేషన్లు అన్నీ 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను అధికారులు ఫైనల్ చేసినా.. గోప్యత పాటిస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు విషయం లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఏ స్థానం ఏ వర్గానికి రిజర్వ్ అయ్యిందన్న దానిపై రాజకీయ పార్టీల నేతలు తెలుసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియలో భాగమైన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ సీరియస్గా చెప్పడంతో వివరాలు చెప్పడానికి ఎవరూ ధైర్యం చేయడంలేదని తెలుస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తుండడం, రిజర్వేషన్ల జాబితాను రూపొందించడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రిజర్వేషన్ల అంశం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆయా మండలాల్లో జనాభా ఆధారంగా ఫలానా మండలం ఫలానా వర్గానికి రిజర్వ్ కావచ్చని, ఫలానా జెడ్పీటీసీ స్థానం జనరల్ అయ్యిందని, ఎంపీపీ స్థానం బీసీలకు రిజర్వ్ చేశారని ఇలా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కాగా కొన్ని మండలాల్లో అధికారుల ద్వారా రిజర్వేషన్ల వివరాలు లీక్ అయినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటిస్తే గానీ రిజర్వేషన్లపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.2019లో జరిగిన మండల, జిల్లా పరిషత్ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్లను అధికారులు పరిశీలించారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రెండు టర్మ్లు ఒకే రిజర్వేషన్ ఉండాల్సింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టేసింది. గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లలో దాదాపు అన్ని మారినట్లు తెలుస్తోంది. అప్పుడు జనరల్ అయిన స్థానం ఇప్పుడు ఇతర వర్గాలకు రిజర్వ్ అయినట్లు సమాచారం. ఇలా జిల్లాలోని ఆయా మండలాల ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల్లో చాలావరకు గత ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లలో మార్పులు జరిగాయని సమాచారం. అలాగే ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకూ రొటేషన్లో మార్పు జరిగినట్లు తెలుస్తోంది. గోప్యత పాటిస్తున్న అధికారులు ఫలానా స్థానం ఫలానా వర్గానికి రిజర్వ్ అయ్యిందంటూ ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ -
బ్రాహ్మణ కాలనీలో 30 తులాల బంగారం దొంగతనం
ఖలీల్వాడి: నాగారంలోని బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ అనే అర్చకుడి ఇంట్లో చోరీ జరిగినట్లు నార్త్ సీఐ బూస శ్రీనివాస్ తెలిపారు. వివరాలు ఇలా.. బ్రాహ్మణకాలనీకి చెందిన పవన్ శర్మ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి, పూజలు చేయడానికి బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం అతడు తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దుండగులు ఇంట్లోని లాకర్ను ధ్వంసం చేసి, అందులో ఉన్న 30 తులాల బంగారంను ఎత్తుకెళ్లారు. పోలీసులు సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా, ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్పై వచ్చిన ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
డైట్ బిల్లులు వచ్చేదెప్పుడో?
● జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లకు కొన్ని నెలలుగా నిలిచిన నిధులు ● ఇబ్బందుల్లో విద్యార్థులు, వార్డెన్లుఆర్మూర్టౌన్: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలకు కొన్ని నెలలుగా డైట్ బిల్లులు రావడం లేదు. దీంతో విద్యార్థులు, వార్డెన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని వాపోతున్నారు. అయినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. సరఫరా నిలిచే ప్రమాదం... హాస్టల్స్కు రైస్, పప్పులు, చింతపండు, గుడ్లు, చికెన్, కూరగాయలు, వంటగ్యాస్ సరఫరా జరుగుతున్నప్పటికీ బకాయిలు ఎక్కువ కావడంతో సరఫరాదారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే, విద్యార్థులకు ఆహార పదార్థల సరఫరా నిలిచే ప్రమాదం ఉంది. సరఫరాదారులు బిల్లులు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంటున్నారు. పలుచోట్ల హాస్టల్ వార్డెన్లు తమ జేబుల్లోంచి డబ్బులు వెచ్చించి, విద్యార్థులకు సమస్యలు రాకుండ చూస్తున్నారు. అలాగే హాస్టల్స్లో వందలాది కుక్లు, కాంటీన్ సిబ్బంది, వాచ్మెన్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వేతనాలు అందడం లేదు. దీంతో వారు జీతాలు లేకి కుటుంబ పోషణ కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అద్దె భవనాల్లో హాస్టల్స్ నిర్వహిస్తుండగా, ఇంటి యజమానులకు కొన్ని నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు చెల్లించాలని పలువురు కోరుతున్నారు.బిల్లులు రాకపోవడంతో వసతి గృహం నిర్వహణ కష్టంగా మారింది. హాస్టల్ భవనం అద్దె, పిల్లకు కాస్మెటిక్ చార్జీలు కొన్ని నెలలుగా రావడం లేదు. నిధులు లేక జిల్లాలోని వసతి గృహాల అధికారులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలి. – సౌడ సురేష్, హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
గ్రామ పాలన అధికారుల విధులివే..
మీకు తెలుసా? సమాచారం..కమ్మర్పల్లి: బ్యాంకులో ఖాతా తెరవాలంటే పాన్కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇందుకోసం మనం వాడుతున్న సెల్ఫోన్లోనే దరఖాస్తు చేసుకొని, కొద్ది నిమిషాల్లోనే సులభంగా ఈ–పాన్ కార్డు పొందవచ్చు. మొదటగా గూగుల్లో ’ఈ–ఫిల్లింగ్ అని టైప్ చేయాలి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హోమ్ పేజీలోకి వెళ్లి ఇన్స్టంట్ ఈ–పాన్ అనే ఐచ్చికాన్ని ఎంచుకొని ’గెట్ న్యూ పాన్ కార్డు’ అని నమోదు చేయాలి. తర్వాత ఆధార్ నంబర్ను నమోదు చేయగానే జనరేట్ ఆధార్ ఓటీపీ అని సూచిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆధార్ కార్డుకు లింక్ ఉన్న ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేయగానే ఆధార్లో ఉన్న వివరాలు కనిపిస్తాయి. సరి చూసుకుని అనుమతించాలి. అనంతరం దరఖాస్తు చేసుకున్నట్లు అక్నాలెడ్జ్మెంట్ నంబర్ మన ఫోన్కు సందేశం వస్తుంది. మళ్లీ మన విన్నపాన్ని ఆమోదించినట్లు కొద్ది గంటల్లోనే సందేశం వస్తుంది. రాగానే ఈ–ఫైలింగ్లోనే మళ్లీ హోం పేజీకి వెళ్లి ఇన్స్టంట్ ఈ–పాన్ని ఎంచుకోవాలి. డౌన్లోడ్ ఈ–పాన్ మీద క్లిక్ చేసి ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ అడుగుతోంది. ఓటీపీ ఎంటర్ చేయగానే పాన్ కార్డు ఫైల్ రూపంలో డౌన్లోడ్ అవుతుంది. ఫైల్ను ఓపెన్ చేయాలంటే పుట్టినరోజు తేదీని ఎంటర్ చేస్తే పాన్కార్డు ఓపెన్ అవుతుంది.రామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల క్లస్టర్ల వారీగా ఒక్కో గ్రామానికి ఒక్కో గ్రామ పాలన అధికారిని నియమించింది. వారు నిర్వహించే విధుల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామస్థాయిలో భూఖాతా(విలేజ్ ఎకౌంట్) నిర్వహణ. పహాణీల నమోదు. రెవెన్యూ మాతృదస్వరం నిర్వహణ అన్ని రకాల భూముల నిర్వహణ మార్పులు, చేర్పులు. లావుణీ అసైన్డ్, దేవాదాయ వర్క్స్, ప్రభుత్వం సేకరించిన భూముల నిర్వహణ. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, నీటి వనరుల కింద భూముల పరిరక్షణ. అన్యాక్రాంతం, ఆక్రమణలపై చర్యలకు సహకరించడం. భూమి ఖాతాల నిర్వహణ, మార్పులు, చేర్పులు నమోదు. భూ సర్వేకు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే సేవలందించడం. ప్రకృతి విపత్తులు సంభవిస్తే నష్టం అంచనా. గ్రామస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. వివరాలు ఇలా.. మండల పరిధిలోని వజ్జపల్లి గ్రామానికి చెందిన లింగాల సాయికుమార్, దూస్గాం శ్రీకాంత్ మంగళవారం బైక్పై కామారెడ్డి నుంచి వజ్జపల్లి బయలుదేరారు. మండల కేంద్రం సమీపంలో వీరి బైక్ను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారిలో శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎల్లారెడ్డి: పట్టణానికి చెందిన ఓ యువకుడు తప్పిపోగా, మండలంలోని ఓ వ్యక్తి అతడిని గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించాడు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలోని బీసీ కాలనీకి చెందిన హమీద్ నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపాడు. కానీ అతడు ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు అతడి వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈక్రమంలో ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన రామాగౌడ్ హైదరాబాద్కు వెళ్లగా బొల్లారం రైల్వేస్టేషన్ దగ్గర అతడికి హమీద్ కనిపించాడు. వెంటనే అతడు హమీద్ని కలిసి కుటుంబసభ్యులకు సమచారం అందించారు. అనంతరం హమీద్ను అతడి బంధువులకు అప్పగించారు. దీంతో రామాగౌడ్ను స్థానికులు అభినందించారు. జక్రాన్పల్లి: మండలంలోని తొర్లికొండ గ్రామంలో చోరీకి పాల్పడ్డ నిందితుడికి ఆర్మూర్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. వివరాలు ఇలా.. తొర్లికొండ గ్రామంలోని గడ్డం భూమేశ్వర్ ఇంట్లో మార్చి 27న చోరీ జరిగింది. దుండగుడు ఇంటి తాళాలు పగుల గొట్టి ఇంట్లోని డబ్బులు, వంట సామగ్రిని ఎత్తుకెల్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా అదే గ్రామానికి చెందిన నూనె కిరణ్ను గుర్తించారు. దీంతో అతడిని పట్టుకొని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి విచారణ జరిపి నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించిట్లు ఎస్సై తెలిపారు. -
వారం రోజులు.. రెండు భారీ చోరీలు
● ఇటీవల నగరంలోని ఓ ఇంట్లో 19తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీ అపహరణ ● తాజాగా అర్చకుడి ఇంట్లో..ఖలీల్వాడి: నగరలో శివారు కాలనీలోని తాళం వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారు. గత వారం రోజుల్లో దుండగులు నగరంలో రెండు భారీ చోరీలకు పాల్పడ్డారు. ఇటీవల నగరంలోని ఐదో టౌన్ పరిధిలోగల ఆసద్బాబానగర్లో తాళం వేసిన ఇంట్లోకి దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 19 తులాల బంగారం, రూ.10లక్షల విదేశీ కరెన్సీని చోరీ చేశారు. ఈ ఘటన మరువకముందే తాజాగా మంగళవారం నాగారంలోని బ్రహ్మణకాలనీలో ఓ అర్చకుడి ఇంట్లోని 30 తులాల బంగారంను చోరీ చేశారు. వారం రోజుల్లో రెండు భారీ చోరీలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దసరా సెలవుల నేపథ్యంలో.. దసరా సెలువులు రావడంతో కుటుంబసభ్యులు ఇళ్లకు తాళాలు వేసి పిల్లలతో కలిసి బంధువుల ఇళ్లకు వెళుతున్నారు. ఈక్రమంలో దుండగులు తాళం ఉన్న ఇళ్లను గుర్తించి, తమకు అనుమైన సమయంలో, జనసంచారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి, ఊర్లకు వెళ్లినట్లయితే తమకు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండ, సేఫ్టీ ప్రదేశాల్లో, బ్యాంకు లాకర్లలో ఉంచాలని పేర్కొంటున్నారు.కుటుంబసభ్యులతో కలిసి బయటకు వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అలాగే ఇంట్లో బంగారం, నగదు ఉంచవద్దు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలి. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. – బూస శ్రీనివాస్, నార్త్ సీఐ, నిజామాబాద్ -
లింగంపల్లికలాన్ రోడ్డుకు మరమ్మతులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర–లింగంపల్లికలాన్ రోడ్డుకు ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 17న ‘సాక్షి’ దినపత్రికలో ‘దెబ్బతిన్న బంజర–లింగంపల్లికలాన్ రోడ్డు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి పంచాయతీరాజ్ అధికారులు స్పందించారు. భారీ వర్షాలతో రోడ్డు రెండు చోట్ల దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ మేరకు రెండు చోట్ల భారీ సిమెంట్ పైపులను ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో మొరం పోయించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. మంగళవారం తుంకిపల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి నాయకులు కుమ్మరి రాములు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులు చేయించండి మహాప్రభో..
సంఘమేశ్వర్ వద్ద బీటీ రోడ్డు దెబ్బతినడంతో తాత్కాలికంగా పోసిన మొరందోమకొండ నుంచి ముత్యంపేటకు వెళ్లే మార్గంలో కోతకు గురైన రోడ్డుదోమకొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దోమకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట, గొట్టిముక్కుల, సంఘమేశ్వర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్షాలకు రోడ్లపై గుంతలు పడి, ఇరువైపులా కోతకు గురైంది. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల క్రితం దోమకొండ నుంచి సంఘమేశ్వర్ గ్రామానికి యువకుడు కారులో వెళుతుండగా, ఎడ్లకట్ట వాగు దాటిన తర్వాత కోతకు గురైన రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఈఘటనలో యువకుడు గాయపడగా, కారు సైతం దెబ్బతిన్నది. అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మూల మలుపులు.. మృత్యు పిలుపులు
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ నుంచి వడ్లం గ్రామానికి వెళ్లే దారిలో మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. 10కి పైగా గ్రామాలు, తండాల ప్రజలు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారు. మూలమలుపుల వద్ద కనీసం సూచిక బోర్డులు కరువయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు మొలవడంతో, మూలమలుపు వద్ద వచ్చి పోయే వాహనదారులకు ఏమీ కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మూల మలుపులున్న చోట ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
నిధుల వరదేదీ?
– 9లో uబుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 8లో u‘‘ జిల్లాలో నష్టంపై పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో సమీక్షిస్తా. ఈ లోపు అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించండి. శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు తయారు చేయండి. వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రెండు జిల్లాల అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ చేస్తారు. ఆ లోపు నివేదికలు అందించండి’’ – ఈనెల 4న జిల్లాలో పర్యటించిన సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డిసీఎం ఈ ప్రకటన చేసి ఇరవై రోజులవుతు న్నా మంత్రి సీతక్క ఇప్పటికీ వరద నష్టంపై సమీక్షించింది లేదు. ముఖ్యమంత్రి రివ్యూ ఊసూ లేదు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో భారీ నష్టం వాటిల్లింది. జనజీవితం అతలాకుతలమైంది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాగులు పొంగి పొర్లడంతో వంతెనలు, రోడ్లు కొ ట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలో మూడు కాలనీ లు నీట మునిగాయి. వందలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ. 251.36 కోట్లు అవసరమవుతాయని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు. ఇందులో తక్షణ మరమ్మతుల కోసం రూ. 38.68 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ.212.68 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. అయితే ఈనెల 4న జిల్లాలో దెబ్బతిన్న పంటలు, కూలిపోయిన వంతెనలు, కొట్టుకుపోయిన రోడ్లు, వరదలతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి.. బాధితుల ను ఆదుకునే బాధ్యత తమదన్నారు. సమస్యకు శా శ్వత పరిష్కారం చూపుతామని కూడా పేర్కొన్నా రు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క నష్టంపై రివ్యూ చేస్తారని, పదిహేను రోజుల్లో తాను సమీక్షిస్తానని సీఎం అన్నారు. ఇరవై రోజులు గడచినా ఇప్పటికీ ఎ లాంటి రివ్యూ జరగలేదు. ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో జిల్లా ప్రజలు నిరాశకు గురవుతున్నారు. స్వయంగా సీఎం పర్యటించి వెళ్లినా ఒనగూరిందేమీ లేదని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు. భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి నీటి వనరులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టుతో పాటు కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్తో సహా 203 చెరువులు, కాలువలకు నష్టం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 కోట్లు అవసరమని, పూర్తి స్థాయిలో నిర్మించేందుకు రూ. 44 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. జిల్లాలో గతనెలలో వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని స్వయంగా చూసిన సీఎం రేవంత్రెడ్డి అధికారులతో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిన నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి రూ.500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎంతో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని కోరుతున్నారు. వరదలు, వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,454 ఇళ్లు దెబ్బతిన్నాయి. 118 పశువులు, 53,270 కోళ్లు మత్యువాత పడ్డాయి. 334 గ్రామాల్లో 37,313 మంది రైతులకు సంబంధించి 50,028 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 140 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. విద్యుత్ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 విద్యుత్ స్తంభాలు , 51.84 కిలో మీటర్ల వైర్లు దెబ్బతినగా.. 589 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి.50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో 50 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. సీఎం పర్యటన సమయంలో 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. తర్వాత పంట నష్టం లెక్కలు తగ్గించారు. వరదలతో పొలాల్లో ఇసుక మేటలను తొలగించే పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టారు. రైతుకు జాబ్ కార్డులు ఉండాలన్న నిబంధనతో చాలా మందికి ఆ అవకాశం కూడా దొరకడం లేదు. ఎకరా పంట సాగుకు తక్కువలో తక్కువ రైతులు రూ.20 వేలు పెట్టుబడులు పెట్టారు. పంట ఎదుగుతున్న సమయంలో దెబ్బతినడంతో మరింత నష్టం వాటల్లింది. పెట్టిన పెట్టుబడులే దాదాపు రూ. వంద కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది. నీట మునిగిన పంటలతో పాటు, వరదలతో కొట్టుకుపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించారు. ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పెండింగ్లో పెడితే మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగే అవకాశాలు ఉన్నాయి.రోడ్లకు భారీ నష్టం.. పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించి రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖ ద్వారా పనులు చేపట్టేందుకు రూ. 125.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రూ. 45.50 కోట్లు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. సీఎం పర్యటన సందర్భంగా ఆయా శాఖల అధికారులు జరిగిన నష్టం వివరాలతో నివేదికలను అందించారు. తాత్కాలిక మరమ్మతులు తప్ప పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు రాలేదు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి వెళ్లే ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి కలాన్ వద్ద వంతెన దెబ్బతినడంతో బస్సులు నడపలేని పరిస్థితి ఉంది. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఈ వంతెనను పరిశీలించారు. ఇక్కడ తాత్కాలిక రోడ్డు నిర్మాణం పనులు మొదలయ్యాయి. కాగా పర్మనెంట్గా వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అలాగే ఎల్లారెడ్డి – మెదక్ రహదారిపై పోచారం ప్రాజెక్టు కింద వంతెన వద్ద ఏర్పడిన గొయ్యితో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో భారీ వర్షాలతో అపార నష్టం ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం రేవంత్రెడ్డి పక్షం రోజుల్లో సమీక్షిస్తానని హామీ ఇరవై రోజులైనా రివ్యూ లేదు, నిధులూ రాలే.. పునరుద్ధరణకు నోచుకోని వంతెనలు, రోడ్లు, చెరువులు దెబ్బతిన్న పంటలకు అందని పరిహారం సాయం కోసం రోడ్డెక్కుతున్న రైతాంగం -
‘ప్రీ ప్రైమరీని అంగన్వాడీలోనే కొనసాగించాలి’
కామారెడ్డి టౌన్: ప్రీ ప్రైమరీ స్కూలు పీఎం శ్రీవిద్యను అంగన్వాడీ కేంద్రాలలోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన యూనియన్ మహాసభలలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 2 లక్షలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా ఇందిర, గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా బాబాయి, కోశాధికారిగా సరిత, ఉపాధ్యక్షులుగా లక్ష్మి, యాదమ్మ, అనసూయ, దేవకరుణ, మహాదేవి, సహాయ కార్యదర్శులుగా విజయ, సురేఖ, సునీత, సుమలత, గౌరి, సవిత ఎన్నికయ్యారు. -
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మాచారెడ్డి : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం చుక్కాపూర్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. డీఎంహెచ్వో చంద్రశేఖర్తో మాట్లాడి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇంకా ఏ వసతులు కల్పించాలన్న విషయాలు తెలుసుకున్నారు. జిల్లాలోని ఆయుష్మాన్ మందిర్లకు కావలసిన సామగ్రికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుకిరణ్, తహసీల్దార్ సరళ, వైద్యాధికారి ఆదర్శ్, వైద్య సిబ్బంది ఉన్నారు. రోడ్డు పనుల పరిశీలన ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న పాల్వంచ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మంథని దేవునిపల్లి వరకు ఉన్న రోడ్డుకు జరుగుతున్న మరమ్మతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలతో దెబ్బతిన్న రోడ్లకు త్వరగా మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఈఈ దుర్గాప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ డీఈ స్వామిదాస్, ఏఈ సంజయ్ తదితరులున్నారు.కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
● మరొకరి పరిస్థితి విషమండిచ్పల్లి: డిచ్పల్లి మండలం ధర్మారం (బి) గ్రామంలో సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్సై మహమ్మద్ షరీఫ్ తెలిపిన వివరాలు ప్రకారం.. ధర్మారం(బి)కి చెందిన సుశాంత్(22), మమ్ము అనే ఇద్దరు యువకులు కారులో ప్రధాన రోడ్డుపై అటుఇటుగా ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు గమనించి కారులో ఇరుక్కున్న వారిని బయటికి తీశారు. కాగా, కారులో ఉన్న సుశాంత్(22) ఘటనా స్థలంలోనే మరణించాడు. తీవ్రంగా గాయపడిన మమ్మును 108 అంబులెన్స్లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వమ్ము పరిస్థితి విషయంగా ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మధ్యతరగతికి భారీ ఆదా
● అమలులోకి వచ్చిన జీఎస్టీ కొత్త శ్లాబులు ● తగ్గిన ధరలు ● హర్షం వ్యక్తం చేస్తున్న వివిధ వర్గాల ప్రజలుజీఎస్టీ తగ్గింపు ఊరటనిచ్చే అంశం అనేక రకాల సామగ్రిపై జీఎ స్టీ తగ్గించడం ఎంతో ఊరటనిచ్చే అంశం. జీఎస్టీ తగ్గింపు వల్ల ధరలు తగ్గడంతో పాటు కొనుగోళ్లు పెరగడానికి అవకాశం ఉంది. సామాన్యులకు ఆర్థిక భారం తగ్గుతుంది. విలాసవంతమైన సామగ్రిపై జీఎస్టీ భారం ఉన్నా మధ్య తరగతి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. – లక్ష్మీనారాయణ, లెక్చరర్, జూనియర్ కళాశాల, మోర్తాడ్సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జీఎస్టీ కొత్త శ్లాబుల అమలుతో వివిధ వస్తువుల ధరలు తగ్గడంతో ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. గ తంలో ఉన్న 5, 12, 18, 28 శాతం శ్లాబు ల స్థానంలో 5,18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గుతుండడంతో డబ్బులు ఆదా అవుతా యని పలువురు పేర్కొంటున్నారు. ప్రజలు దీని గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సిగరెట్లు, గుట్కా, పాన్మసాలాలపై 40 శాతం జీఎస్టీ విధించడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు శక్తి పెరుగుతుంది.. ప్రజల కొనుగోలు శక్తి పెరిగేందుకు జీఎస్టీ సంస్కర ణలు ఉపయోగపడతాయి. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తులకు మరింత వైభవం తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికతో ముందుకు వెళుతోంది. విద్యార్థులకు ఉపయోగపడే స్టేషనరీ లాంటి వస్తువులకు జీరో ట్యాక్స్, ఆరోగ్య బీమాకు పన్ను లేకుండా చేశారు. కిరాణా, వ్యవసాయ పరికరాలు, ఔషధాలపై 5 శాతానికి పన్ను తగ్గించారు. చిన్న కార్లు, బైకులు, కంప్యూటర్లు, వివిధ రకాల గృహోపకరణాలపై 10 శాతం పన్ను తగ్గింది. – ధర్మపురి అర్వింద్, ఎంపీ -
రోడ్లు ఇలా.. ప్రయాణం ఎలా?
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండల కేంద్రం నుంచి కళ్యాణి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలలో నీళ్లు నిండి అవి మరింత పెద్దవిగా మారాయని, ఈ గుంతలలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల కారణంగా ఆటోలు, బైక్లు తరుచూ చెడి పోతున్నాయని, దీని వల్ల కష్టపడి సంపాదించిన డబ్బులు ఆటోల రిపేర్లకు పెట్టాల్సి వస్తుందని ఆటోల యజమానులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. నిజామాబాద్ సిటీ: తెలుగు భాషోపాధ్యాయుడు, ప్రముఖ పుస్తక రచయిత, సిర్పూర్ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు డాక్టర్ కాసర్ల నరేశ్రావు కాళోజీ జాతీయ పురస్కారం అందుకున్నారు. సోమవారం హైదరాబాద్లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో నరేశ్రావుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి, తెరసం రాష్ట్ర అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ అవార్డు అందజేశారు. జిల్లాకు చెందిన మరో కవి చందన్రావుకు డాక్టర్ సినారె అవార్డు అందుకున్నారు. రుద్రూర్: రుద్రూర్ ప్రాంతీయ చెరకు, వరి పరిశోధన కేంద్రం అధిపతిగా డా. పవన్ చంద్రారెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2007 నుండి 2013 వరకు రుద్రూర్ పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా సేవలందించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఏరువాక కేంద్రానికి బదిలీపై వెళ్లారు. 2017 వరకు ఏరువాక కేంద్రం అధిపతిగా పనిచేశారు. రుద్రూర్ పరిశోధన కేంద్రంలో ఆరు నెలలపాటు పదోన్నతిపై సీనియర్ శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తించారు. 2018 నుంచి 2023 వరకు రాజేంద్రనగర్లోని వ్యవసాయ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్గా, 2023 నుంచి 2025 వరకు హైదరాబాద్లోని నేల ఆరోగ్య యాజమాన్య సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. రుద్రూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ చంద్రారెడ్డిని బోధన, బోధనేతర సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. -
బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి రిమాండ్
ఖలీల్వాడి: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇ ద్దరిని రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ నెల 19న సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని వర్జిన్ తండాకు చెందిన భూక్య విఠల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పా ర్క్ చేసిన తన బైక్ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం దేవీరోడ్ వద్ద వా హనాల తనిఖీ చేపడుతుండగా నిర్మల్ జిల్లా భైంసాలోని ఓవైసీ నగర్కు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్ దొంగిలించిన బైక్పై వస్తూ పో లీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని విచారించగా నగరంలోని 50 క్వా ర్టర్స్లో నివాసముంటూ మద్యం, జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా బైక్ దొంగతనాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. వారి నుంచి నాలుగు బైక్లు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
నాగిరెడ్డిపేట: జిల్లాలో గత నెలాఖరులో కురిసిన భారీవర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. పంట నష్ట పరిహారం కోసం సోమవారం నాగిరెడ్డిపేటలో అఖిలపక్షం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే రాస్తారోకోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే సహించేది లేదన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో పంటలు నీటమునిగి రైతులకు నష్టం జరిగితే సీఎం రేవంత్రెడ్డి తాడ్వాయి మండలంలో పర్యటించడమేంటని విమర్శించారు. కోతకు వచ్చిన పొలాలు, నోట్లోకి వచ్చిన బుక్క దూరమవుతుంటే ప్రభుత్వానికి, అధికారులకు ఎందుకు పట్టడంలేదని ఆయన ప్రశ్నించారు. వరదల కారణంగా ధ్వంసమైన పోచారం ప్రధాన కాలువకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం రైతుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావుకు అందించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సదాశివనగర్ సీఐ సంతోష్కుమార్ ఆధ్వర్యంలో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట ఎస్సైలు భార్గవ్గౌడ్, మహేష్, దీపక్కుమార్ తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. ఆందోళనలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు మనోహర్రెడ్డి, జయరాజ్, మాజీ ఎంపీపీ రాజ్దాస్, రైతు నాయకుడు బొల్లు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. -
వాకింగ్కు వెళ్లి అనంతలోకాలకు..
● చెరువులో పడి పదో తరగతి విద్యార్థి మృతి ● హాస్టల్ నుంచి వచ్చిన మరుసటి రోజే ఘటనమద్నూర్(జుక్కల్): దసరా పండుగకు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి మరుసటి రోజే దుర్మరణం చెందిన ఘటన మద్నూర్ మండలం చిన్న ఎక్లారలో సోమవారం చోటు చేసుకుంది. ఉదయం వాకింగ్కు వెళ్లిన కొద్దిసేపటికే చెరువులో పడి చనిపోయాడన్న వార్త తల్లిదండ్రులు, గ్రామస్తులను శోకసంద్రంలో ముంచింది. వివరాలు ఇలా ఉన్నాయి. మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామానికి చెందిన సంజు హోటల్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజుకి ఒక కూతురు, కొడుకు సాయిచరణ్(15) ఉన్నారు. సాయిచరణ్ మద్నూర్లోని బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు ఉండటంతో ఆదివారం ఇంటికి వచ్చాడు. సోమవారం ఉదయం వాకింగ్ చేసి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన సాయిచరణ్ గ్రామ శివారులో ఉన్న చెరువులో శవమై కనిపించాడు. కాలకృత్యాల కోసం వెళ్లిన సాయిచరణ్ ప్రమాదవశాత్తు చెరువులో ఉన్న పెద్ద గుంతల్లో పడటంతోనే ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు చెప్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడని తెలుసుకున్న ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. విద్యుదాఘాతంతో యువకుడు..బాన్సువాడ రూరల్: మండలంలోని మొగులాన్పల్లి గ్రామానికి చెందిన మహ్మద్(35) అనే యువకుడు సోమవారం విద్యుదాఘాతంతో మరణించాడు. బీర్కూర్ చౌరస్తాలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో టైల్స్ పని చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. గమనించిన తోటి కార్మికులు మహ్మద్ను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యు లు.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ అశోక్ తెలిపారు. -
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్నమాచారెడ్డి/బీబీపేట/సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. సోమవారం మాచారెడ్డి, బీబీపేట, సదాశివనగర్ మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ..తరగతులకు హాజరుకాని విద్యార్థులను హాజరయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను కళాశాలకు రెగ్యులర్గా హాజరయ్యేలా చూడాలన్నారు. కళాశాలలో ఎఫ్ఆర్ఎస్, హెచ్ఆర్ఎంఎస్ డాటాను తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, యూనిట్ టెస్ట్ల నిర్వహణ, ఫలితాల వివరాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. -
కొలిక్కి వస్తున్న రిజర్వేషన్లు!
పచ్చని తివాచీ..● నేటి సాయంత్రం వరకు పూర్తయ్యే చాన్స్ ● పల్లె పోరుకు సిద్ధమైన యంత్రాంగం ● సీఎస్ ఆదేశాలతో వేగంగా పనులు ● మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ ● అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో వరుణుడు కరుణించాడు.. జలసిరులు కురిపించాడు.. దీంతో పుడమి పులకరించింది.. పచ్చందాలను సంతరించుకుంది.. ప్రస్తుతం కనుచూపు మేరంతా భూమి పచ్చని పంటలతో కళకళలాడుతూ కనువిందు చేస్తోంది. సదాశివనగర్ మండలం మల్లన్నగుట్టపై నుంచి కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల కసరత్తు ముమ్మరం చేసింది. అధికారులంతా సోమవారం ఇదే పనిలో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు కానుండగా, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ పదవులతో పాటు సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు కల్పించనున్నారు. జిల్లాలో 25 జెడ్పీటీసీ, 25 ఎంపీపీ పదవులతో పాటు 233 ఎంపీటీసీ స్థానాలకు అలాగే 532 గ్రామల సర్పంచ్, 4,656 వార్డు స్థానాలకు రిజర్వేషన్లు నిర్ణయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలకు 4,670 పీఎస్లు.. జిల్లాలో మొత్తం ఓటర్లు 6,39,730 మంది ఉండగా.. ఇందులో 3,07,508 మంది పురుషులు, 3,32,209 మంది మహిళలు, 13 మంది ఇతరులు ఉన్నారు. జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ పదవులతో పాటు 4,656 వార్డులకు జరిగే ఎన్నికల కోసం 4,670 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పూర్తి స్థాయిలో గిరిజన ఓటర్లే ఉన్న పంచాయతీలన్నీ సర్పంచ్తో పాటు, వార్డు సభ్యుల స్థానాలు గిరిజనులకే కేటాయిస్తారు. అవి పోను మిగతా వాటిలో రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ప్రాదేశిక స్థానాలకు 1,259 పోలింగ్ కేంద్రాలు.. జిల్లాలోని 25 జెడ్పీటీసీ స్థానాలతో పాటు, 233 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం 1,259 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే కేంద్రాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. అలాగే అవసరమైన సిబ్బందిని కూడా ఖరారు చేశారు. షెడ్యూల్ వెలువడగానే మిగతా పనులన్నీ కొలిక్కిరానున్నాయి. ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమవు తుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. తాము పోటీ చేయాలనుకుంటున్న స్థానం రిజర్వేషన్ అనుకూలంగా వస్తుందో లేదోనని టెన్షన్తో ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స ర్పంచ్ పదవుల మీద కన్నేసిన వారంతా రిజ ర్వేషన్ల ప్రకటన కోసం నిరీక్షిస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక రాజకీయం వేడెక్కనుంది.స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలతో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. మంగళవారం సాయంత్రంలోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. యంత్రాంగం బిజీబిజీ... ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వ హణ ఏర్పాట్లలో బిజీ అయ్యింది. ఇప్పటికే ఓటరు జాబితా లను సిద్ధం చేసిన అధికారులు.. రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించారు. మంగళవారం సాయంత్రంలోపు రిజర్వేషన్ల ఖరారు పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల ఖరారు విషయంలో నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లా యంత్రాంగం జనాభా, ఓటర్ల వివరాలు, రిజర్వేషన్ల శాతం తదితర అంశాలను పరిశీలించిన అనంతరం ఏ స్థానం ఎవరికి రిజర్వు చేయాలన్న దానిపై కసరత్తు జరుపుతున్నారు. -
బతుకమ్మ వేడుకలను వైభవంగా జరపాలి
● ప్రభుత్వ కార్యాలయాలను ముస్తాబు చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ లైట్లతో ముస్తాబు చేయాలన్నారు. జిల్లాలో బతుకమ్మ హోర్డింగ్లను ఏర్పాటు చేయాలన్నారు. పట్టణాలు, గ్రామాల్లో బతుకమ్మ ఆడే ప్రాంతాలు, నిమజ్జనం చేసే వాగులు, చెరువులు, ఇతర నీటి వనరుల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. మైకులను ఏర్పాటు చేయాలని, పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. నిమజ్జన ప్రాంతంలో గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు. కలెక్టరేట్లో సద్దుల బతుకమ్మ వరకు రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరపాలని ఆదేశించారు. 30 వ తేదీన కలెక్టరేట్లో ప్రభుత్వ ఉద్యోగుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహించాలన్నారు. బతుకమ్మ పండుగ ఉత్సవాలకు జిల్లా నోడల్ అధికారిగా డీఆర్డీవో సురేందర్ను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
పెళ్లి కావడం లేదని యువకుడి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ద్యాప మహేశ్(29) ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి రెండేళ్ల క్రితం తిరిగి వచ్చాడు. గల్ఫ్లో ఉన్నప్పుడే అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తిరిగి వచ్చాక పెళ్లి చేసుకొని తండ్రిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని భావించాడు. రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎంతకీ సంబంధం కుదరకపోవడంతో కొద్దిరోజులుగా మనస్తాపానికి గురువుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి సైతం పాల్పడి ప్రాణాలతో బయటపడ్డాడని తెలిసింది. ఆదివారం రాత్రి ఇంటినుంచి బయటకు వెళ్లిన మహేశ్ ఇంటికి తిరిగి రాలేదు. తండ్రి సాయిలు, ఇతర కుటుంబసభ్యులు చాలా చోట్ల గాలించారు. సమీపంలోని రైలు పట్టాలపై మహేశ్ మృతదేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఉరేసుకొని ఒకరు..నవీపేట: మండలంలోని మోకన్పల్లి గ్రామానికి చెందిన గడ్డం రాజు (45) సోమవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. కొన్నిరోజులుగా రాజు మద్యానికి బానిసైనట్లు పేర్కొన్నారు. భార్య పుట్టింటికి వెళ్లిందని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదన్నారు. మృతుడి సోదరుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని చేస్తున్నట్లు తెలిపారు.కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పట్టణ ఎస్హెచ్వో నరహరి సూచించారు. జిల్లా కేంద్రంలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 29 మందిని కోర్టులో హాజరుపర్చగా నలుగురికి జైలు శిక్ష, జరిమానా, మరో 25 మందికి జరిమానాలు విధించింది. వారందరికీ సోమవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్హెచ్వో నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు. క్రమం తప్పకుండా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. రామారెడ్డి: రామారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం బయటకు రానివ్వడం లేదు. కూతురిపై వేధింపులతో తండ్రిపై, ఇదే వ్యవహారంలో మరో వ్యక్తిపై కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్కు తరలించినట్లుగా విశ్వసనీయ సమాచారం. బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ శివారులోని మర్రి మైసమ్మ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాన్ని పగులగొట్టి ఆలయంలోని పూజోపకరణ సామగ్రి, 10 కిలోల ఇత్తడి దీపం, శఠగోపం, యాంప్లిఫైర్తోపాటు హుండీలోని నగదును అపహరించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకట నారాయణ తెలిపారు. మాచారెడ్డి: మండలంలోని ఎల్లంపేటలో సోమవారం వర్షం కురుస్తుండటంతో పలువురు రైతులు చెట్టు కింద కూర్చున్నారు. ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోందని గ్రహించి కొద్దిదూరం వెళ్లగానే చెట్టుపై పిడుగుపడింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రజావాణికి 110 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పాలనాధికారి మస్రూర్ అహ్మద్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏవో, ఇతర అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 110 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని ఏవో సూచించారు. అలాగే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. మత్తడి ఎత్తును తగ్గించాలి.. గ్రామానికి ఆనుకుని ఉన్న మత్తడి ఎత్తును తగ్గించాలని కోరుతూ పాల్వంచ ఎస్సీ కాలనీవాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి ఆనుకుని చెమెల్ల కుంట ఉందన్నారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా గతంలో పనులు చేపట్టి కుంట మత్తడి ఎత్తును పెంచారని తెలిపారు. దీంతో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ కాలనీలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుందన్నారు. కాలనీ సైతం కుంటలా మారుతుందని వాపోయారు. దీంతో పాములు ఇళ్లలోకి రావడం, దోమలు పెరిగి విషజ్వరాలు వస్తున్నాయని తెలిపారు. పెంచిన కుంట మత్తడి ఎత్తును తగ్గించి, జరిగిన నష్టాలకు పరిహారం ఇప్పించాలని ప్రజావాణిలో విన్నవించారు.నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): స్థానిక తహసీల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి పలువురు అధికారులు దూరమయ్యారు. కేవలం తహసీల్దార్ శ్రీనివాసరావు, ఏవో సాయికిరణ్తోపాటు పీహెచ్సీ ఉద్యొగి అనిల్ మాత్రమే ప్రజావాణికి హాజరయ్యారు. కాగా ఎంపీడీవో లలితకుమారితోపాటు ఎంపీవో ప్రభాకరచారి కలెక్టరేట్లో జరిగిన సమావేశానికి వెళ్లారు. మండలంలోని మిగతాశాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరయ్యారు. -
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టులకు భారీ ఇన్ఫ్లో వస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 60,630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు. కౌలాస్ ప్రాజెక్టులోకి.. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమవారం రాత్రి కౌలాస్ ప్రాజెక్టులోకి 7,827 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు వరద గేట్లు ఎత్తి 10,436 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు(1.237 టీఎంసీలు) కాగా.. సోమవారం రాత్రి వరకు 457.95 మీటర్ల(1.225 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. -
బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయండి
బాన్సువాడ రూరల్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 25న బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తెలంగాణ బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన బాన్సువాడలో ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారన్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్నా ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రత కోసమైనా ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారన్నారు. నాయకులు మహ్మద్ జుబేర్, ముజీబుద్దీన్, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, బోడ చందర్, మోచీ గణేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అంగట్లోకి అంగన్వాడీ సరుకులు
● పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు మద్నూర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారం మద్నూర్ మండలంలో పక్కదారి పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయా కేంద్రాలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సరుకుల విషయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అంగన్వాడీ నిర్వాహకులు, ఆయాలు బహిరంగ మార్కెట్లో వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మద్నూర్ మండలంలోని పలు కిరాణ దుకాణాల్లో అంగన్వాడీకి సరఫరా చేసే కంది పప్పు ప్యాకెట్లు దర్శనమిచ్చాయి. 30 కందిపప్పు ప్యాకెట్లను కిరాణ దుకాణంలో ఉంచి అంగన్వాడీ నిర్వాహకులు విక్రయించారు. దీనికి తోడు అంగన్వాడీ కేంద్రాల్లో నిల్వ ఉంచాల్సిన సరుకులు నేరుగా నిర్వాహకుల ఇళ్లలోకి తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రాలను పర్యవేక్షించే సీడీపీవో, సూపర్వైజర్లు కార్యాలయాలకే పరిమితం కావడంతో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతోనే మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నాతాధికారులు స్పందించి అంగన్వాడీ సరుకులు బహిరంగ మార్కెట్లోకి తరలకుండా నిఘా వేయాలని పలువురు కోరుతున్నారు. ఇటీవల కాలం చెల్లిన పాల పంపిణీ ప్రభుత్వం గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం పాలు అందిస్తున్నా అవి కాలం చెల్లినవా లేదా అని చూసుకోకుండా పంపిణీ చేస్తున్నారని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేనూర్ అంగన్వాడీ కేంద్రంలో 3 నెలల క్రితం పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. వాటిని ఇంటికి తీసుకెళ్లిన కొందరు పాల ప్యాకెట్ను పరిశీలించగా ఫిబ్రవరి నెలలోనే పాల ప్యాకెట్ వాడకం గడువు ముగిసిందని గుర్తించారు. అలాగే నాణ్యత లేని గుడ్లు కూడా పెడుతున్నారని మహిళలు వాపోతున్నారు. -
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
గాంధారి/మాచారెడ్డి/కామారెడ్డి అర్బన్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ మైదానంలో సబ్ జూనియర్ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. అత్యంత ప్రతిభ చూపిన 15 మంది బాలురు, 18 మంది బాలికలను ఎంపిక చేసినట్టు అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బాణాల భాస్కర్రెడ్డి తెలిపారు. వీరు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి 35వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. టీజీ పేటా జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు రాజయ్య, అనిల్కుమార్, నరేష్రెడ్డి, నవీన్, లక్ష్మణ్, బాలు, సతీష్రెడ్డి, రేణుక, రాజు, సంజీవ్, లావణ్య, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. -
గుంతల పూడ్చివేత
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రం నుంచి ధర్మారావ్పేట్కు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఏనుగు సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ బడాల భాస్కర్ రెడ్డి, నాయకులు బల్రాం, లక్ష్మణ్, ఆంజనేయులు, సంతోష్, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని, యువకులు రక్తదానం అలవాటుగా మార్చులకోవాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కామారెడ్డి జిల్లా సభ్యుడు సునీల్ రాథోడ్ అన్నారు. మేరా యువ భారత్లో భాగంగా మండలంలోని ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ఒకరికి పునర్జన్మ కల్పించిన వారవుతారన్నారు. రోడ్డు ప్రమాదాలు, సిజేరియన్ డెలివరీల సమయంలో రక్తం అవసరం ఉంటుందన్నారు. యువత రక్తదానం పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడం బాధాకరమన్నారు. అపోహలు వీడి యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ సుభాష్గౌడ్, లక్ష్మణ్, అంజయ్య, నాగరాజు పాల్గొన్నారు. -
‘ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలి’
రాజంపేట : ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ఫిర్యాదులపై వేగంగా స్పందించి ప రిష్కారం చూపాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించా రు. సోమవారం ఆయన రాజంపేట్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. రోల్ కాల్ను పరిశీలించి హాజరై న, గైర్హాజరైన సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. మానవ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించు కోవడం, రోల్ కాల్ ప్రాముఖ్యతను సిబ్బందికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కేసును నైపుణ్యంతో, నిజాయితీతో సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బా ధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. బ్లూ కో ల్ట్స్, పెట్రో కార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని సూచించారు. ప్రజ లు ప్రశాంత వాతావరణంలో దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుపుకునే విధంగా బందోబస్తు ఏర్పాటు చే యాలని రాజంపేట పోలీస్ సిబ్బందికి సూచించా రు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి, భిక్కనూరు సీఐ సంపత్ ఉన్నారు. -
వరద బాధితుల కోసం పీఆర్టీయూ విరాళం
కామారెడ్డి అర్బన్: జిల్లాలో వరద బాధితుల సహాయార్థం 7,06,011 రూపాయల విరాళాన్ని సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కు అందించినట్లు పీఆర్టీయూ ప్రతినిధులు తెలిపారు. సామాజిక బాధ్యతగా జిల్లా శాఖ తరఫున ఈ విరాళం అందించామని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లాపూర్ కుషాల్, పుట్ట శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు గర్ధాస్ గోవర్ధన్ పేర్కొన్నారు. పీఆర్టీయూ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పీఆర్టీయూ నాయకులు మధుసూదన్రెడ్డి, సంగారెడ్డి, హన్మాండ్లు, రమణ, రామచంద్రరెడ్డి, ప్రసాద్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.నేడు ఆయుర్వేద వైద్యశిబిరం కామారెడ్డి అర్బన్: జాతీయ ఆయుర్వేద ది నోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లాకేంద్రంలో ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయుష్ జి ల్లా ఇన్చార్జి వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలి పారు. ఎన్జీవోస్ కాలనీలోని శ్రీలలి త త్రిపు ర సుందరి ఆలయం సమీపంలోగల హోమి యో ఆస్పత్రి వద్ద ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి ఆర్టీసీ డీఎంగా బాధ్యతలు స్వీకరించిన దినేశ్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్గా దినేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఖమ్మం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. గతంలో కామారెడ్డి డీఎంగా పనిచేసిన కరుణశ్రీ హైదరాబాద్కు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా దినేశ్ గతంలో కామారెడ్డి ఆర్టీసీ డిపో సీఐగా పనిచేశారు. దీంతో ఆయనకు డిపోపై పూర్తి అవగాహన ఉంది. 30 వరకు టీజీవో బతుకమ్మ సంబురాలు కామారెడ్డి అర్బన్: తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం(టీజీవో) ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ వరకు బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దేవేందర్, సాయిరెడ్డి తెలిపారు. సోమవారం బతుకమ్మ సంబురాలకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఆయా శాఖల్లోని మహిళా ఉద్యోగులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీజీవో ప్రతినిధులు భూమయ్య, రాజలింగం, సంతోష్కుమార్, జ్యోతి, తురబుద్దీన్, శశికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సాదాబైనామాకు మోక్షం లభించేనా?
కామారెడ్డి క్రైం/ఎల్లారెడ్డి : సాదాబైనామాల క్రమబద్ధీకరణకు కోర్టు చిక్కులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతుల ఏళ్లనాటి నిరీక్షణకు తెరపడింది. ఇకనైనా పెండింగ్లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులకు మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ రికార్డులకు సంబంధించిన ప్రధాన సమస్యల్లో సాదాబైనామా కూడా ఒకటిగా ఉంది. గతంలో భూముల క్రయవిక్రయాల సమయంలో చాలామంది తెల్ల కాగితాలపైనే ఒప్పందాలు చేసుకునేవారు. ఆర్థిక, ఇతర కారణాలతో పట్టాలు చేసుకోవడంలో ఆలస్యం జరిగేది. భూమి తమ ఖబ్జాలోనే ఉన్నా పట్టా పాసుపుస్తకాలు ఉండేవి కావు. తెల్ల కాగితాలపై మాత్రమే భూములు ఉండడంతో సంక్షేమ ఫలాలు అందేవి కాదు. సాదా కాగితాల మీద భూములు కొన్నా పట్టాలు కాకపోవడంతో రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాల లబ్ధి చేకూరలేదు. బ్యాంకు రుణాలకూ నోచుకోలేదు. కొన్ని సందర్భాల్లో ఈ భూముల వ్యవహారం వివాదాలకు సైతం దారి తీసింది. ఇలాంటి సాదాబైనామాల సమస్యలను పరిష్కరించడానికి 2020 అక్టోబర్లో ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ ఏడాది అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 వరకు సాదాబైనామాల క్రమబద్ధీకరణకు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించంది. అయితే కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడంతో జీవోను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి 2020 కి ముందు సాదాబైనామాలకు దరఖాస్తు చేసుకున్న రైతుల సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. తాజాగా మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేయడంతో లైన్ క్లియర్ అయ్యింది. ఆ వెంటనే సాదాబైనామాలకు పరిష్కారాలు చూపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. చిగురించిన ఆశలు.. కామారెడ్డి జిల్లాలో 2020 కి ముందు సాదాబైనామాల కోసం 11,448 రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కోర్టులో కేసు ఉండడంతో వారికి పట్టాలు ఇవ్వలేదు. అయితే ఇప్పటికే అధికారులు క్షేత్ర స్థాయిలో చాలామంది రైతుల దరఖాస్తుల పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం సంబంధిత డివిజన్లో ఆర్డీవోకు పూర్తి అధికారాలు ఉంటాయి. ఆయనే విచారణ అధికారిగా వ్యవహరిస్తారు. దరఖాస్తు చేసుకున్న రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించి, విచారణ జరిపి సంబంధిత రైతు అర్హుడా, కాదా అనే విషయాన్ని తేలుస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే దరఖాస్తును ఆమోదిస్తారు. అనంతరం రికార్డులు సరిచేసి పాస్బుక్లు జారీ చేస్తారు. వేగంగా ప్రక్రియను పూర్తి చేసి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. తొలగిన కోర్టు చిక్కులు పరిష్కారాలకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లాలో 11 వేలకుపైగా దరఖాస్తులు 2020 కి ముందు దరఖాస్తులకు పట్టాలు వచ్చే అవకాశం జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని మిసిమి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్న డి. అక్షిత్, ఎల్. రేవంత్ అనే విద్యార్థులు జాతీయ స్థాయి చౌక్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల కరెస్పాండెంట్ బాలి రవీందర్ తెలిపారు. గత నెల హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీ ల్లో వీరు జిల్లా జట్టు తరఫున పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర జట్టుకి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 28 వరకు విశాఖపట్టణంలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీ లకు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారని అన్నారు. ఆదివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, పీఈటీ సంజీవ్ను అభినందించి సత్కరించారు. -
ఇద్దరూ ఇద్దరే!
సంబురం షురూ..వాతావరణం అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దుర్గా పూజకు వేళాయె దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మండపాలు ఏర్పాటు చేశారు. – 11లో uసోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025– 10లో uఆర్టీసీ ప్రత్యేక బస్సులు బాన్సువాడ : బతుకమ్మ, దసరా పండగలకు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పించనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రధాన రూట్లలో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు కామారెడ్డి క్రైం: శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామని ఎ స్పీ రాజేశ్ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరా రు. మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పని సరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసు శాఖ భద్ర తా చర్యలను సమర్థవంతంగా అమలు చే యగలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశిత సమయానికి శోభాయాత్ర, విగ్ర హ నిమజ్జనం పూర్తి చేయాలని సూచించా రు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు వాడకూడదని, 24 గంటల పాటు మండపా ల వద్ద వలంటీర్లు తప్పనిసరిగా ఉండాల ని పేర్కొన్నారు. అనుమానాస్పద వస్తువు లు, వ్యక్తులు కనబడితే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సా మాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. బీఎస్ఎస్ అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా రామగిరిశర్మ భిక్కనూరు: బ్రాహ్మణ సేవా సంఘం(బీఎస్ఎస్) రాష్ట్ర అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం అర్చకులు కొడకండ్ల రామగిరిశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ ఆదివారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా రామగిరిశర్మ మాట్లాడుతూ 25 ఏళ్లుగా బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్యలో వివిధ హోదాల్లో పనిచేసిన తనను సమాఖ్య అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి నుంచి టీపీటీఎఫ్ అధ్యయన తరగతులు కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో ఈనెల 22, 23వ తేదీలలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర స్థాయి అధ్యయన తరగతులు నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత రాజంపేట్ రైల్వే గేట్ వద్దనున్న లేపాక్షి హోమ్స్ కమ్యూనిటీ హాల్లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్తో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారని తెలిపారు. అధ్యయన తరగ తులను విజయవంతం చేయాలని కోరారు. క్యాసంపల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలుతెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ ఆదివారం జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా మహిళలు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పేర్చారు. అనంతరం బతుకమ్మ ఆడి సంబురాలు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఇద్దరు ముఖ్య అధికారులు తమదైన శైలిలో పనిచేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తూ అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎస్పీ రాజేశ్ చంద్ర నేరాల విషయంలో అధికారులను అప్రమత్తం చేసి కేసులను ఛేదించడంలో విజయవంతంగా సాగుతున్నారు. మరోవైపు ఎవరైనా తప్పు చేస్తే శాఖాపరమైన చర్యలకు వెనకాడడం లేదు. గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వరదలలో చిక్కుకున్నవారి విషయంలో ఇద్దరు అధికారులు చురుకుగా పనిచేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరువురూ పనితీరుతో ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందారు. పనితీరుతో ప్రత్యేకతను చాటుకుంటున్న ఉన్నతాధికారులు అధికారులను పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నేరాలకు కళ్లెం వేయడంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తనదైన ముద్ర -
వరి పంటపై తెగుళ్ల దాడి
● దెబ్బతింటున్న పంట ● ఆందోళన చెందుతున్న రైతన్నలు ● విచ్చలవిడిగా పురుగు మందుల వినియోగం నిజాంసాగర్ : జిల్లాలోని ప్రధాన జలాశయాలతో పాటు చెరువులు, కుంటలు, బోరుబావులు, లిప్టుల కింద 2.8 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయి. ప్రధానంగా ముందస్తుగా సాగు చేసిన పంట తెగుళ్లతో దెబ్బతింటోంది. పాముపొడ, ఎండు తెగులు, కంకినల్లి, సుడిదోమ వంటివి దెబ్బతీస్తున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పురుగుల మందుల దుకాణాలకు వెళ్లి పురుగుల మందులు తెచ్చి ఇష్టారీతిన పిచికారి చేస్తున్నారు. దీంతో చీడపీడల బాధ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో వరిని ఆశిస్తున్న చీడపీడల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను నిజాంసాగర్ ఏవో అమర్ప్రసాద్ వివరించారు. ● ఎండు తెగులు ఆశించిన వరిపంటపై స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 50 గ్రాములు లేదా కాపర్ అక్సిక్లోరైడ్ 300 గ్రాముల మందును 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరం పొలంపై పిచికారి చేయాలి. ● పాముపొడ తెగులు, పొట్టకుళ్లు నివారణకు ప్రాపికొనజోల్ 200 మి.లీ. గాని, హెక్సాకొనజోల్ 400 మి.లీ. గాని 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాల్సి ఉంటుంది. ● కంకినల్లి సొకితే స్పైరోమెసిఫెన్ 100 మి.లీ. మందును 160 లీటర్ల నీటిలో కలిపి ఎకరం విస్తీర్ణంలోని పంటపై పిచికారి చేయాలి. ● సుడిదోమ నివారణకు పైమెట్రోజైన్ 120 గ్రా. లేదా డైనోటెఫ్యూరాన్ 120 గ్రా. ఎకరానికి 160 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. -
వర్క్ ఇన్స్పెక్టర్ విధుల డుమ్మాపై విచారణ
నిజామాబాద్అర్బన్: ఇరిగేషన్ శాఖలోని ఓ వర్క్ ఇన్స్పెక్టర్ విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. మాక్లూర్ మండలంలో పనిచేసే ఓ వర్క్ ఇన్స్పెక్టర్ జిల్లా కేంద్రంలో మీ–సేవా కేంద్రం నిర్వహిస్తున్నాడు. దీంతో కొన్నిరోజులుగా అతడు విధులకు డుమ్మా కొడుతున్నాడు. ఈక్రమంలో స్థానికులు అతడిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అధికారులు ఇటీవల విచారణ చేపట్టి నివేదికను కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులకు పంపించారు. కారేగాం తండావాసికి డాక్టరేట్ నిజామాబాద్అర్బన్: చందూరు మండలం కారేగాం తండాకు చెందిన రామావత్ లాల్సింగ్కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. లాల్సింగ్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో రెండు డిగ్రీలు, తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మాస్టర్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేశారు. ‘భారతదేశ స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్కృతి, సంప్రదాయాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై’ పరిశోధన చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం హిందీ విభాగంలో సమకాలిన్ హిందీ ఉపన్యాసం మే ఏ సాంప్రదాయక సంఘర్ష అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. లాల్సింగ్ పరిశోధనపై సంతృప్తి వ్యక్తం చేసిన ప్రొఫెసర్లు పరిశోధకులు డాక్టరేటును అందించారు. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలినిజామాబాద్ రూరల్: దేవీ మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరిఫ్ సూచించారు. నగరంలోని కేసీఆర్ కాలనీలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో దేవీ నవరాత్రి ఉత్సవాల మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మండపాలకు విద్యుత్ కనెక్షన్లు ఫ్రీగా ఉన్నప్పటికి విద్యుత్ అధికారులను సంప్రదించి కనెక్షన్లు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మండపాల వద్ద రాత్రి ఇద్దరు వ్యక్తులు ఉండాలని, డీజే సౌండ్సిస్టమ్లను నిషేదించినట్లు తెలిపారు. నిమజ్జన సమయంలో దేవీమాతలను త్వరగా నిమజ్జనానికి తరలించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీఐ సురేశ్కుమార్, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
104 సిబ్బంది సర్దుబాటు
● డీఈ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ స్టాఫ్ కామారెడ్డి మెడికల్ కళాశాలకు బదిలీ ● ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్ల బదిలీలకు తాత్కాలిక బ్రేక్నిజామాబాద్నాగారం: నిజామాబాద్ జిల్లాలో సంచార వైద్య సేవలు అందించే 104 వాహన సిబ్బందికి బదిలీలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జిల్లాలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 35మంది ఉద్యోగులను కామారెడ్డి జిల్లాకు కేటాయించనున్నట్లు తెలిసింది. ఆదేశాలు నేడో.. రేపో రానున్నాయి. ఇప్పటికే కామారెడ్డి మెడికల్ క ళాశాలకు డీఎంఈ నుంచి మెయిల్ వచ్చినట్లు సమాచారం. సొంత జిల్లాలో బదిలీ చేయకుండా పక్క జిల్లాకు బదిలీ చేయనుండటంతో జిల్లాలో పని చేస్తున్న 104 ఉద్యోగులు నేడు డీఎంఈ(డైరెక్ట ర్ ఆఫ్ హెల్త్)ను కలవడానికి వెళ్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 84 మంది ఉద్యోగులు 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రజలకు ఇంటివద్దనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 104 పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు 104 వాహనాలు 12 కేటాయించారు. ప్రతి వాహనంలో ఫార్మసిస్టు, ల్యాబ్టెక్నిషిన్, డాటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్ ఉండేవారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 84 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిన సిబ్బంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు. 2022లో 104 సేవలను అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఈక్రమంలో సిబ్బందిని ఇతర వి భాగాల్లో సర్దుబాటు చేస్తుండగా డాటా ఎంట్రి ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయనున్నారు. తక్కువ జీతాలతో ఏళ్ల తరబడిగా విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులను ఉన్న ఫలంగా ఇతర జిల్లాకు కేటాయించడంపై వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, జీజీహెచ్ పరిధిలో ఎక్కడ ఖాళీలు లేవని చెప్పడంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉన్నందున 35 మంది (డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీగార్డులు) అక్కడికి వెళ్లి విధులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయని కన్నీరుపెట్టుకుంటున్నారు. ఫా ర్మసిస్టులు, ల్యాబ్ టెక్నిషియన్ల బదిలీకి మాత్రం తాత్కాలికంగా పెండింగ్ పడింది. ఈ రెండు కేటగిరీలు వైద్యారోగ్యశాఖ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో కోటా ఇచ్చినందున ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాతా మిగిలి ఉంటే బదిలీ చేయనున్నారు. అప్పటి వరకు కూడా జీతాలు రావని అధికారులు చెప్పిన్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. -
తగ్గుతూ పెరుగుతున్న వరద
● ఎగువ నుంచి కొనసాగుతున్న ఇన్ఫ్లో ● 34 గేట్ల ద్వారా లక్షా 28వేల క్యూసెక్కుల నీటి విడుదల బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుతూ పెరుగుతోంది. ఆదివారం ఉదయం 89 వేల క్యూసెక్కులకు తగ్గిన ఇన్ఫ్లో గంట తరువవాత లక్షా 16 వేలకు పెరిగి మళ్లీ 96 వేల క్యూసెక్కులకు తగ్గింది. తరువాత గంటకు లక్షా 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. తరువాత మళ్లీ లక్షా 16 వేల క్యూసెక్కులకు తగ్గి మళ్లీ లక్షా 44 వేల క్యూసెక్కులకు పెరిగి సాయంత్రం వరకు నిలకడగా కొనసాగింది. ఇన్ఫ్లో తగ్గుతూ పెరుగుతుండడంతో అవుట్ఫ్లోను సైతం అదే విధంగా కొనసాగించారు. 34 గేట్ల ద్వారా గోదావరిలోకి లక్షా 28 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాలువ ద్వారా 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 5,500, ఎస్కేప్ గేట్ల ద్వారా 2,500, సరస్వతి కాలువ ద్వారా 400, లక్ష్మి కాలువ ద్వారా 200, అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 180 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిషన్ భగీరథ అవసరాలకు 231 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తుండగా ఆవిరి రూపంలో 709 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి అంతేస్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. -
దుర్గమ్మ పూజకు వేళాయే..
● నేటి నుంచి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ● జిల్లావ్యాప్తంగా సిద్ధమైన మండపాలు నిజామాబాద్ రూరల్: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో వివిధ సంఘాల ఆధ్వర్యంలో దేవి మండపాలను అందంగా ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో పదకొండు రోజులపాటు అమ్మవారు పదకొండు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారిని భక్తులు పూజించి, నైవేధ్యాలు సమర్పిస్తారు. అలాగే మండపాల నిర్వాహకులు సైతం అమ్మవారి దీక్ష చేపట్టి, 11 రోజులు నిష్ఠతో పూజలు నిర్వహిస్తారు. గత 19 సంవత్సరాల నుంచి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నాం. కోరిన కోరికలు తీరస్తు అమ్మవారు ప్రతి ఏటా గాజులపేటలో కొలువుదీరుతుంది. పదకొండు రోజుల పాటు అమ్మవారికి కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు భక్తులు నిర్వహిస్తాం. –ఔదాగిరి సుధీర్, గాజులపేట దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత పదకొండు రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. ప్రతిరోజు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించనున్నారు. అలాగే మండపాల్లో అన్నదానాలు, ఆధ్మాత్మిక కార్యక్రమాలు, నిర్వహిస్తారు. –సురేష్, గాజులపేట