breaking news
Kamareddy
-
అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు
● రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు బాన్సువాడ: బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న దంపతులను వాహనం ఢీకొన్న ఘటనలో భార్య మృతి చెందగా భర్త తీవ్రగాయాలపాలైన ఘటన బీర్కూర్ మండలం రైతునగర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి గ్రామానికి చెందిన మోత్కూర్ సాయాగౌడ్, శకుంతల(50) భార్యభర్తలు. బీర్కూర్ మండలం కిష్టాపూర్లో వారి బంధువు చనిపోతే అంత్యక్రియలకు ఎక్స్ఎల్ వాహనంపై బయలుదేరారు. మిర్జాపూర్ మీదుగా రైతునగర్ నుంచి కిష్టాపూర్కు వెళ్లే దారిలో రైతునగర్ వద్ద మలుపు దాటుతుండగా ఎదురుగా పొతంగల్ నుంచి బాన్సువాడ మార్కెట్కు వస్తున్న బొలెరో వాహనం ఢీకొన్నది. దీంతో సాయాగౌడ్కు, శకుంతలకు తీవ్ర గాయాలు కావడంతో బాన్సువాడ ఆస్పత్రికి స్థానికులు తరలిస్తుండగా మార్గమధ్యలో శకుంతల మృతి చెందింది. సాయాగౌడ్కు రెండు కాళ్లు విరగడంతో బాన్సువాడ ఆస్పత్రి వైద్యుల సూచన మేరకు నిజామాబాద్కు తరలించారు. ప్రస్తుతం సాయాగౌడ్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బీర్కూర్ పోలీసులు తెలిపారు. -
ఏటీఎం ధ్వంసం కేసులో నిందితుడికి ఏడాది జైలు
బాల్కొండ: ఏటీఎం ధ్వంసం కేసులో నిందితుడికి ఆర్మూర్ కోర్టు ప్రథమశ్రేణి న్యాయమూర్తి నెల్లి సరళరాణి ఏడాది జైలు శిక్ష విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలేంద్ర గురువారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండ మండల కేంద్రంలోని పోచమ్మగల్లీకి చెందిన బండి నరేంద్ర 2025 ఏప్రిల్ 24న మండల కేంద్రంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి నగదు చోరీకి యత్నించాడు. దీంతో అతనిపై పోలీస్ కేసు నమోదైంది. నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి ఏడాది జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానాను విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ఎవరైనా దొంగతనాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. న్యూసెన్స్ కేసులో ఒకరికి నాలుగు రోజులు..ధర్పల్లి: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వ్యక్తికి జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని సీతాయిపేట్కు చెందిన భానుచందర్ రెండు రోజుల క్రితం బహిరంగ ప్రదేశంలో మద్యం తాగి తాను నివాసం ఉండే కాలనీలో న్యూసెన్స్ చేశాడు. దీంతో కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతన్ని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. జడ్జి ఆధారాలను పరిశీలించి భానుచందర్కు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు తెలిపారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలి
● డీఆర్డీవో సురేందర్ నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లోని మహిళాసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి, రైతుల్లో నమ్మకాన్ని పెంచాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీ్త్రనిధి రుణాలతోపాటు బ్యాంకు లింకేజీ రుణాలను లక్ష్యం మేరకు మహిళా సంఘాల సభ్యులకు అందించాలన్నారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, డీపీఎం సాయిలు, ఏపీఎం రాంనారాయణగౌడ్, అకౌంటెంట్ రాజుతోపాటు సీసీలు పాల్గొన్నారు. బీబీపేట: బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని, తద్వారా సొసైటీకి, బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించిన వారవుతారని నాబార్డు డీడీఎం ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం మండలంలోని ప్రాథమిక సహకార సంఘం ఆవరణలో‘అంతర్జాతీయ సహకార సంవత్సరం కార్యక్రమంలో భాగంగా చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన సహకార బ్యాంకు, నాబార్డ్ గురించి రైతులకు అవసరమైన సూచనలు, లోన్లు విషయంలో అవగాహన కల్పించారు. ఎన్డీసీసీ బ్యాంకు సీఈవో వందే నాగభూషణం, డీజీఎం లింబాద్రి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, సెక్రెటరీ నర్సాగౌడ్, సంఘం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలని బాన్సువాడ డీఎల్పీవో ప్రసాదరావు అన్నారు. గురువారం ఆయన బోర్లం గ్రామం షమానగర్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఎంపీడీవో ఆనంద్తో కలిసి భూమిపూజ చేశారు. నిర్మాణాలు ప్రారంభించిన లబ్ధిదారులకు 5 విడతల్లో రూ.లక్ష చొప్పున రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరై ఇంకా పనులు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: రైలు నుంచి కిందపడి గుర్తు తెలియని ఒకరు(25) మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై లింబాద్రి గురువారం తెలిపారు. వివరాలు.. భిక్కనూరు–తలమడ్ల రైల్వేస్టేషన్ల మధ్య ఒకరు గుర్తు తెలియని రైలు నుంచి కింద పడి మృతి చెందాడు. మృతుడి కుడి చేతిపై మోకిట్ ఏకే అనే పచ్చబొట్టు ఇంగ్లిష్లో రాసి ఉంది. మృతుడి వద్ద ఖమ్మం నుంచి లక్నో వరకు టిక్కెట్లు ఉన్నాయి. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658616 నంబర్కు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఖలీల్వాడి: పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందని డీఈవో అశోక్ కుమార్ గురువారం తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫీజును అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13వ తేదీ లోపు హెచ్ఎంలకు చెల్లించాలన్నారు. హెచ్ఎంలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లించి విద్యార్థుల డాటాను నవంబర్ 18 లోపు డీఈవో కార్యాలయంలో అందించాలని తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29, రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 2 నుంచి 11వ తేదీవరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 15 నుంచి 29 వరకు పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. -
మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మద్యానికి బానిసైన ఓ యువకుడు జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం తాండూర్లో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాండూర్కు చెందిన దాకమొల్లి సంగయ్య, ఎల్లవ్వకు ఇద్దరు కుమారులు నాగరాజు, కుమార్(18) ఉన్నారు. పెద్దకుమారుడైన నాగరాజు హైదరాబాద్లో ఉంటుండగా చిన్నాకుమారుడు కుమార్ గ్రామంలో తల్లితండ్రులతో కలిసి ఉంటున్నాడు. కొంత కాలంగా కుమార్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
సాక్షి నెట్వర్క్ :పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో పలుచోట్ల గురువారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు డ్రగ్స్ను ఎలా అదుపు చేయాలి.. డ్రగ్స్ వల్ల యువత ఎలా చెడిపోతున్నారనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు పెట్టారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు అమరుల ఆత్మశాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం పోలీసు కళాబృందం సభ్యులు విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని విద్యార్థులకు పోలీసులు సూచించారు. అలాగే నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్లో పోలీస్ సిబ్బందికి ‘పనిప్రదేశంలో లింగ వివక్షత’అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. -
ప్రతిరోజు వ్యాయామం చేయించాలి
బాన్సువాడ రూరల్: శారీరక వికలాంగులైన విద్యార్థులకు ప్రతిరోజు తల్లిదండ్రులు బాధ్యతగా భావించి వ్యాయామం చేయించాలని బాన్సువాడ మండ ల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. గు రువారం ఆయన బాన్సువాడ లోని భవిత కేంద్రంలో కొనసాగిన ఫిజియోథెరపీ శిబిరాన్ని సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులను ప్రతినెలా డాక్టర్ను చూపించి మందులు వేయాలన్నారు. చదువుకు వైకల్యం అడ్డు కావద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం భవిత సెంటర్లు నెలకొల్పిందన్నారు. రిసోర్స్ టీచర్స్ వెంకట పద్మ, అందె అనిల్, మంద ప్రవీణ్, ఫిజి యోథెరపిస్టు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొత్తాబాది దర్గా వద్ద ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న హజ్రత్ సోఫి సయ్యద్షా, మొహ్మద్ అయినోద్దీన్ దర్గా ఉర్సును విజయవంతం చేయాలని నిర్వాహకులు సయ్యద్ షా మహ్మద్ యూసుఫుద్దీన్ కోరారు. ఈ నెల 25న గంధం ఊరేగింపు, ఖవ్వాలి కార్యక్రమం ఉంటుందన్నారు. ఆదివారం దీపారాధన, మహిఫిలే సమజల్స–ఏ–ఔలియా ఖవ్వాలీ, 26న తక్మీమ్–ఏ తబరుకాత్ సాయంత్రం తిలావతే ఖురానేపాక్, ఫాతేహా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. భిక్కనూరు: కామారెడ్డి–రామాయంపేట మధ్య బస్సు ట్రిప్పుల సంఖ్యను పునరుద్ధరించినట్లు కాంగ్రెస్ నేతలు అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రుంలో కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అందె దయాకర్రెడ్డి, యువజన కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీరాం వెంకటేశ్, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, తదితరులులు విలేకరులతో మాట్లాడుతూ.. పదిరోజులుగా కామారెడ్డి–రామాయంపేట మధ్య బ స్సు ట్రిప్పుల సంఖ్యను తగ్గించారని, ఈ విషయ మై ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి విన్నవించగా ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి, బస్సుల సంఖ్యను పునరుద్ధరింపజేశారన్నారు. కాంగ్రెస్ నేతలు విజయకుమార్గౌడ్, మైపాల్రెడ్డి, దుంపల మోహన్రెడ్డి, నీల అంజయ్య, చీకోటి ప్రభాకర్,జనార్దన్రెడ్డి తదితరులున్నారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో సీనియర్ బాలుర, బాలికల జట్ల ఎంపికలను పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో గురువారం నిర్వహించగా క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా క్రీడలు, యువజన అధికారి ఆర్ వెంకటేశ్వరగౌడ్ ప్రారంభించారు. 150 బాలికలు, 178 మంది బాలురు మొత్తం 328 మంది పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన 20 మంది బాలురు, 20 మంది బాలికలను రా ష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై న వారికి ఈనెల 25 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు అసోసియేన్ ఉమ్మడి జిల్లా చైర్మన్ అనిల్, అధ్యక్షుడు జీవీ భూమారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి అతీకుల్లా, కోశాధికారి మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అధిక పంట దిగుబడికి డ్రోన్లను వినియోగించాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతులు అధిక దిగుబడి సాధించడానికి ఆధునిక టెక్నాలజీ డ్రోన్లను వినియోగించుకోవాలని గాయత్రి షుగర్స్ ప్రెసిడెంట్ శంకర్ రావు, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రావులు సూచించారు. మొదటగా మండల కేంద్రంలో వంగిటి రాజు(రైతు) పంటలో గాయత్రి ఎయిరో సిస్టమ్స్ ఆధ్వర్యంలో డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం గాయత్రి షుగర్స్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. అధునాతన సాంకేతికతో డ్రోన్లను తయారు చేశామన్నారు. డీజీసీఏ అనుమతితో రూ.7లక్షల 50వేల విలువ గల డ్రోన్ రూ.లక్ష సబ్సిడీ ఇస్తూ.. ఇన్సూరెన్స్తో పాటు రూ.6లక్షల 50వేలకు అందజేస్తున్నట్లు తెలిపారు. దీంతో రోజుకు 30 నుంచి 32 ఎకరాల పంటకు స్ప్రే చేయవచ్చని సూచించారు. డ్రోన్లు కావల్సిన రైతులు గాయత్రి షుగర్స్లో సంప్రదించాలని, లేకుంటే ఫీల్డ్ మెన్లను సంప్రదించాలని సూచించారు. చెరుకు సాగుకు రైతులకు అనేక రాయితీలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. డ్రోన్ కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫైలట్కు ఉచితంగా శిక్షణను కూడా ఇస్తామన్నారు. మార్కెటింగ్ మేనేజర్ రాజేంద్రప్రసాద్, ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, ఏవో రమేశ్, విండో చైర్మన్ కమలాకర్ రావు, రైతులు పాల్గొన్నారు. -
పంట ఆరబోసేందుకు ఇబ్బందులు
● టార్పాలిన్లు లేక కష్టాలు పడుతున్న అన్నదాతలు ● అద్దెకు తెచ్చుకోవడంతో అదనపు భారం దోమకొండ: గతంలో మాదిరిగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది. ఈ సీజన్లో ఒక్కో రైతుపై కనీసం రూ.2 వేల నుంచి మూడున్నర వేలవరకు భారం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరిపంటను అరబెట్టుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో టార్పాలిన్లు అత్యవసరం. గతంలో ప్రభుత్వం 50 శాతం రాయితీపై వాటిని సరఫరా చేసింది. కాని నాలుగైదేళ్లుగా ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడంతో.. రైతులపై అదనపు భారం పడుతోంది. టార్పాలిన్లు లేకపోవడంతో రోడ్డుపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం ఆరబోస్తూ రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు 50 శాతం సబ్సిడీపై వ్యవసాయశాఖ 8 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉన్న టార్పాలిన్లను జిల్లా వ్యాప్తంగా అందజేసింది. రైతన్నలకు అదనపు ఖర్చు.. జిల్లాలో ఈ సారి 427 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో సహకార సంఘాల ద్వారా 233, ఐకేపీ ఆధ్వర్యంలో మరో 194 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా, 5.90 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కాగా జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణాల పరిధిలో టార్పాలిన్లు అద్దెకు ఇస్తున్నారు. రైతులు ఒక్కోదానికి రోజూ రూ 60 నుంచి రూ.80 వరకు అద్దె చెల్లిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి గాను రైతుకు కనీసం 6 నుంచి 10 టార్పాలిన్లు అవసరం అవుతున్నాయి. వాటిపై ప్రతి రైతుకు రూ.5 వేల వరకు భారం పడుతోంది. మాకు 20 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ప్రతి ఏటా పంటల సీజన్లో టార్పాలిన్ల అద్దె కోసం రూ.10 వేల వరకు ఖర్చవుతున్నాయి. గతంలో మాదిరిగా ప్రభుత్వమే సబ్సిడీపై సరఫరా చేయాలి. ఇప్పటికే నమస్యల్లో కూరుకుపోయిన రైతులకు ఇది అదనపు భారం అవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులకు సబ్సిడీపై వీటిని అందించాలి. ఈ భారాన్ని తమపై మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – బోరెడ్డి నాగరాజ్రెడ్డి, రైతు, దోమకొండ -
విద్యార్థులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం
బాన్సువాడ రూరల్: విద్యార్థులతో కలిసి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి గురువారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈనెల 14న నియోజకవర్గ పర్యటన నిమిత్తం బయలుదేరిన ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గుంపులుగా బస్సు కోసం వేచి చూస్తున్న విద్యార్థులను గమనించి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో గంటల తరబడి వేచిచూడాల్సి వస్తోందని విద్యార్థులు వాపోవడంతో వెంటనే ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డిపో మేనేజర్ను ఆదేశించారు. బస్సు సౌకర్యం ప్రారంభం కాగా గురువారం ఆకస్మికంగా బస్టాండ్ చేరుకుని విద్యార్థులతో కలిసి కళాశాల వరకు బస్సులో ప్రయాణించారు. దీంతో విద్యార్థులు హర్షం వ్యక్తంచేశారు. బస్సు సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగించాలని డిపో మేనేజర్ రవికుమార్ను ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, నాయకులు పాల్గొన్నారు. -
మేన బావతో వివాహం.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. గాంధారి మండల కేంద్రానికి సమీపంలో వారం రోజుల క్రితం వెలుగు చూసిన హత్య కేసును పోలీసులు చేధించారు. మృతుడు, నిందితులను మేడ్చల్ జిల్లా కీసర వాసులుగా గుర్తించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేష్ చంద్ర వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 న గాంధారి శివారు లోని చద్మల్ వెళ్లే దారిలో రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువలో మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గుర్తు తెలియని వ్యక్తిని ఎవరో హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. హత్య జరిగగిన సమయంలో అటుగా వెళ్తున్న ఓ యువకుడు మృతదేహం పక్కన మరో వ్యక్తి ఉన్నట్లు గమనించాడు. అతడు ఇచ్చిన ఆనవాళ్లు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను మేడ్చల్ జిల్లా కీసర మండలం భవానీ నగర్కు చెందిన ఏలూరి ఆంజనేయులు, ఇరగడింట్ల నవనీతలుగా గుర్తించారు. వారిని బుదవారం అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు.మేన బావతో 2012లో వివాహం..కీసర ప్రాంతానికి చెందిన నవనీత కు మేన బావ నరేష్తో 2012 లో వివాహం జరిగింది. వారిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ జీవించేవారు. కొంత కాలం క్రితం వారిద్దరూ ఆంజనేయులు వద్దకు కూలీ పనులకు వెళ్లారు. అక్కడ ఆంజనేయులుకు, నవనీతకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ముగ్గురూ కలిసి ఏడాది క్రితం పెద్దగుట్టకు దైవదర్శనానికి వచ్చి వెళ్లారు. కొద్ది రోజులుగా ఆంజనేయులు, నవనీతల వ్యవహారంపై అనుమానం వచ్చిన నరేష్ ప్రశ్నించడం, నవనీతను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. 15 న మరోసారి దైవదర్శనం కోసం అని చెప్పి నవీన్ను ఒప్పించి ముగ్గురూ కలిసి బైక్పై పెద్దగుట్ట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాంధారి సమీపంలో ఆగి మద్యం సేవించారు. నరేష్కు అతిగా మద్యం తాగించి కాలువలో పడేశారు. ఆపై తీవ్రంగా కొట్టి హత్య చేశారు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో సమీపంలోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి కాల్చివేశారని ఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నామని అన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది సంజయ్, రవికుమార్, సాయిబాబా, ప్రసాద్, బంతీలాల్ లను అభినందించారు. -
ఆభరణాల కోసమే వృద్ధురాలి హత్య
● అంకోల్తండా హత్య కేసును ఛేదించిన పోలీసులు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్రకామారెడ్డి క్రైం: నస్రుల్లాబాద్ మండలం అంకోల్ తండాలో రెండు రోజుల క్రితం జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. తండాకు చెందిన రాధీబాయి (67)కి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారంతా పెళ్లిళ్లు చేసుకుని ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. రాధీబాయి తన ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఎదురు ఇంట్లో ఉండే సవాయిసింగ్ చాలా రోజులుగా మద్యం, పేకాట, ఇతర వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గతంలో అతనిపై పలు దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ నెల 20న ఇంట్లో ఒంటరిగా ఉన్న రాధీబాయిపై సవాయి సింగ్ గొడ్డలి కామతో దాడి చేసి, గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న 30 తులాల వెండి ఆభరణాలు తీసుకుని పరారయ్యే క్రమంలో పక్క ఇంట్లో ఉండే లక్ష్మీబాయి చూసింది. మృతురాలి చిన్న కొడుకు లాల్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం నిందితుడిని పట్టుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని తక్కువ సమయంలో పట్టుకున్న బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్సై రాఘవేంద్ర, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
1,449 దరఖాస్తులు..
కామారెడ్డి రూరల్: జిల్లాలోని మద్యం దుకాణాలకు బుధవారం 5 దరఖాస్తులు అందినట్లు ఎక్సై జ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 1,449 దరఖాస్తులు అందాయన్నారు. కామారెడ్డి ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో 15 దుకాణాలకు గాను 450 దరఖాస్తులు, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 దుకాణాలకు 226, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 దుకాణాలకు 245, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 307, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 దుకాణాలకు 221 దరఖాస్తులు అందినట్లు వివరించారు. గురువారం సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆసక్తిగల వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈఎస్ కోరారు. 27వ తేదీన కామారెడ్డి పట్టణంలోని రేణుకాదేవి కల్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమక్షంలో దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా తీయనున్నట్లు తెలిపారు. -
ప్రధాన కారణాలివే..!
జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా, వాటిలో ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, గౌడ కులస్తులకు 7, ఓపెన్ కేటగిరి కింద 35 వైన్షాపులను కేటాయించారు. దుకాణాల నిర్వహణకు అయ్యే ఖర్చు రోజురోజుకి పెరుగుతుండగా లాభం తగ్గుతోందని వ్యాపారులు అంటున్నారు. తమకు మొదటి రూ.2 కోట్ల అమ్మకాలపై ప్రభుత్వం నుంచి 12 శాతం లాభాన్ని ఇస్తారని.. రూ.2 కోట్ల విక్రయాల తర్వాత ఇచ్చే కమిషన్ అమాంతం 4 శాతానికి పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు ఎక్కువగా ఉండే వైన్షాపులకు రూ.2 కోట్ల వ్యాపారం మొదటి 3 నుంచి 4 నెలల్లోలే పూర్తవుతుంది. కానీ ఖర్చులు ఎప్పటికీ ఉండేవే. దీంతో ఖర్చులు ఎక్కువ.. లాభం తక్కువ అనే భావన వ్యాపారుల్లో పెరుగుతోంది. దీనికి తోడు దరఖాస్తు రుసుమును ప్రభుత్వం ఈ సారి రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. -
పరీక్షల వేళ శిక్షణ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా విద్యాశాఖ అధికారుల అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపంగా మారుతున్నాయి. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, శిక్షణ, సమావేశాల పేరుతో చాలా స్కూళ్లలో బోధన కుంటుపడింది. సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)–1 పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుండగా, చాలా చోట్ల ఆయా సబ్జెక్టులకు సంబంధించి పోర్షన్ పూర్తి కాలేదు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు ఎస్ఏ–1 పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే పరీక్షలు ప్రారంభం కానున్న శుక్రవారం రోజు నుంచే ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ టీచర్లకు ఎక్స్పరిమెంటల్ లర్నింగ్ మెథడాలజీస్పై ఐదు రోజుల శిక్షణ ఏర్పాటు చేశారు. సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఓ కార్పొరేట్ సంస్థ ఆర్థిక సహకారంతో ఈ నెల 24 నుంచి ఐదు రోజులపాటు జిల్లా కేంద్రంలో శిక్షణ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అది కూడా ఓ కార్పొరేట్ సంస్థ ఆర్థిక సాయంతో ప్రైవేట్ కాలేజీలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆఖరుకు ట్రైనింగ్కు హాజరయ్యే ఉపాధ్యాయులకు వారే లంచ్ ఏర్పాట్లు చేసుకోవాలంటూ మెసేజ్లు చేశారు. మరి కార్పొరేట్ సంస్థ ఇచ్చే ఆర్థిక సాయం ఎవరి జేబుల్లోకి వెళుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కలెక్టర్ దృష్టి సారిస్తేనే.. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన డిప్యుటేషన్లతో జిల్లా విద్యాశాఖ చేస్తున్న అవినీతి గురించి ఉపాధ్యాయులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో ఉండే చాలా మంది ఉపాధ్యాయులు ప్రమోషన్లు, బదిలీలల్లో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్ తదితర మండలాలకు వెళ్లారు. సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో చాలా మంది టీచర్లు కార్లలోనే ప్రయాణం చేస్తుంటారు. కారుకు అయ్యే ఖర్చు వేలల్లో ఉంటోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పుకుని జిల్లా కేంద్రానికి సమీపంలోని బడులకు డిప్యుటేషన్పై వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి అక్రమ డిప్యుటేషన్లకు తెరలేపారు. ఈ విషయంలో కలెక్టర్ క్షేత్ర స్థాయిలో విచారణ జరిపితే ఎన్నో అక్రమాలు వెలుగు చూస్తాయని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలో శిక్షణలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో అధికారులకే తెలియాలి.విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో సంబంధిత సబ్జెక్టు టీచర్లు శిక్షణకు వెళ్తే పరీక్షలు ఎవరు నిర్వహించాలో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్లు లేక బోధన సరిగా సాగడం లేదు. ఉన్న చోట ఉపాధ్యాయులకు రకరకాల పనులు నెత్తిన పెట్టడంతో పోర్షన్ పూర్తి కావడం లేదు. కనీసం పరీక్షలు ఉంటాయన్న సోయి లేకుండా అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాల్సిన ఉపాధ్యాయుడే ట్రైనింగ్కు వెళితే ఎవరు నిర్వహించాలన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులకు మంచి బోధన అందించాలని ప్రభుత్వాలు కొత్త కొత్త పథకాలకు శ్రీకారం చుడుతుంటే విద్యాశాఖ అధికారులు మాత్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పిల్లలకు పాఠాలు బోధించే పరిస్థితులు లేకపోగా, పరీక్షల సమయంలోనైనా టీచర్లు బడుల్లో ఉండకుండా ట్రైనింగ్ల పేరుతో వారిని పంపించడం తగదని పలువురు పేర్కొంటున్నారు. రేపటి నుంచే ఎస్ఏ – 1 పరీక్షలు ఇదే సమయంలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు జిల్లా విద్యాశాఖ అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తో ఆటలు -
ఆర్టీఏ చెక్పోస్టుల ఎత్తివేత
మద్నూర్/భిక్కనూర్ : జిల్లాలోని సలాబత్పూర్, జంగంపల్లి వద్ద కొనసాగిన ఆర్టీఏ చెక్పోస్టులను ఎత్తివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 5గంటలకు చెక్పోస్టులను మూసివేసిన అధికారులు జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేశారు. ఇక నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోని సలాబత్పూర్తోపాటు భిక్కనూర్ మండలం జంగంపల్లి శివార్లలో రవాణాశాఖకు సంబంధించి చెక్పోస్టు కార్యకలాపాలు కొనసాగవు. చెక్పోస్టుల్లోని కంప్యూటర్లు, ప్రింటర్లు, రిజిస్టర్లతోపాటు ఇతర సామగ్రిని జిల్లా కేంద్రానికి తరలించారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్.. రాష్ట్రంలోని రవాణశాఖ చెక్పోస్ట్లను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెక్పోస్ట్ల స్థానంలో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్(ఏఎన్పీఆర్) విధానం తీసుకువస్తున్నారు. ఏఎన్పీఆర్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ సిస్టమ్ హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉంటుంది. ఏ వాహనమైనా కెమెరా కన్నుకప్పి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రంలోకి వస్తే వాటిని జాతీయ రహదారులపై అడ్డుకొని చర్యలు తీసుకునేందుకు వీలుగా మొబైల్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దింపనున్నారు. ఈ వ్యవస్థపై ముందుగా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహన యాజమానుల అసోషియేషన్కు ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్యాసింజర్ వెహికల్స్తోపాటు సరుకు రవాణా వాహనాల పర్మిట్లు మిగిలిన అనుమతులన్ని ముందే ఆన్లైన్లో పొందేలా రాష్ట్ర రవాణా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతులు లేకుండా లేదా నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్రంలోకి ప్రవేశిస్తే వెంటనే గుర్తించి చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సలాబత్పూర్, జంగంపల్లి శివార్లలో మూసివేత కార్యాలయాలకు తాళాలు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో రిపోర్ట్ చేసిన అధికారులు -
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నా రు. మండలంలోని నందివాడలో బుధవా రం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కలెక్టర్ మా ర్కింగ్ చేశారు. నందివాడ గ్రామానికి 24 ఇళ్లు మంజూరు కాగా అందులో 13 మా త్రమే మార్కింగ్ చేశారన్నారు. స్లాబ్ లెవల్ లో ఒకటి ఉండగా, బేస్మెంట్ లెవల్లో నాలుగు ఉన్నాయని, మరో నాలుగు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. మూడు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని, వాటి నిర్మాణాలు ప్రారంభం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లు నిర్మించుకున్న వారికి సకాంలో బిల్లులు అందేలా చూస్తామన్నారు. పీడీ విజయసా యిరెడ్డి, డీఈ సుభాష్రెడ్డి, ఎంపీడీవో స య్యద్ సాజీద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవితారెడ్డి, ఏఈ శ్రీనివాస్, గ్రామపెద్ద లు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఎన్కౌంటర్ విచారణ అధికారిగా ఎల్లారెడ్డి డీఎస్పీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసిన రియాజ్ ఎన్కౌంటర్ పై పోలీసు శాఖ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావును విచారణాధికారిగా నియమించింది. బుధవారం డీఎస్పీ శ్రీనివాసరావు నిజామాబాద్ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వచ్చి విచారణ నిర్వహించారు. రియాజ్ ఎన్కౌంటర్ పై పౌరసంఘాలు స్పందించడం, మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో పోలీసు శాఖ పక్క జిల్లా డీఎస్పీ ద్వారా విచారణ చేయిస్తోంది.బాన్సువాడ: పట్టణంలోని మార్కెట్ కమిటీ యార్డులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ బుధవారం పరిశీలించారు. రైతులు, అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రంలోని సమస్యలను తెలుసుకున్నారు. తేమశాతాన్ని పరీక్షించే యంత్రాలతోపాటు ప్యాడి క్లీనర్లను సరఫరా చేస్తామన్నారు. పెద్ద డ్రైయర్ల సరఫరా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఎండీ పేర్కొన్నారు. ఆమెవెంట అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీవో సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ అధికారి రామ్మోహన్, సివిల్ సప్లయీస్ జిల్లా అఽ దికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ , పీఎసీఎస్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్ , రైతులు, సొసైటీల సెక్రెటరీలు, రైతులు పాల్గొన్నారు.కామారెడ్డి అర్బన్: ఈనెల 27వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్రెడ్డి, విజయరామరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 మార్చి నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ధర్నా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. జర్మనీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్(టాంకాం) ద్వారా జర్మనీ దేశంలో ఆరోగ్య సంరక్షణ ఉ ద్యోగాల కోసం 18 నుంచి 28 ఏళ్లలోపు వారి నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తులు కో రుతున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజనీకిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్మనీలో 3 ఏళ్ల నర్సింగ్ ఇంటర్నేషనల్ డిగ్రీని పొందడంతో పాటు నెలకు రూ.లక్ష స్కాలర్షిప్ అందిస్తారని, కోర్సు అనంతరం నెలకు రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగ అవకాశం ఉంటుందన్నారు. ఇంటర్లో కనీసం 60 శా తం మార్కులతో పాసైన వారికి హైదరాబా ద్లో 9 నెలల పాటు జర్మనీ భాషలో రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 63022 92450, 94400 51763 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. -
రైతులకు తక్కువ ధరకే డ్రోన్ స్ప్రేయర్లు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): చెరుకు రైతుల సంక్షేమమే గాయత్రి షుగర్స్ లక్ష్యమని, రూ.7.50 లక్షల విలువ చేసే డ్రోన్ స్ప్రేయర్ను రూ.లక్షకే అందజేస్తున్నా మని గాయత్రి షుగర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు, శంకర్రావు అన్నారు. గాయత్రి ఏఈఆర్వో ఆధ్వర్యంలో తయారు చేసిన డ్రోన్తో పురుగు మందు పిచికారీ చేసే విధానంపై బుధవారం మండల కేంద్రంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం నూతన సాంకేతిక విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. కామారెడ్డి, నిజాంసాగర్ గాయత్రీ షుగర్స్ పరిధిలో గల చెరుకు రైతుల అభివృద్ధి కోసం రైతు పథకాలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. స్ప్రేయర్ కొనుగోలు చేసిన రైతుకు ఒక బ్యాటరీ సెట్, చార్జర్తోపాటు డ్రోన్ నడిపే శిక్షణను ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్ స్ప్రేయర్ కొనుగోలు రైతులకు బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. చెరుకు నాటిన రైతులకు రూ.9,437 విలువగల చెరుకు విత్తనం 2 టన్నుల 50 కిలోలను ఉచితంగా అందజేస్తుందన్నారు. గాయత్రి షుగర్స్ ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, మార్కెటింగ్ మేనేజర్ రాజేందర్, గాయత్రి షుగర్స్ ఫీల్డ్ మెన్లు, ఏవోలు, రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక
దోమకొండ: మండల కేంద్రంలోని గడీకోటలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిర్మల్గౌడ్, ఎస్సై స్రవంతి, ఎంపీడీవో ప్రవీ ణ్కుమార్ తదితరులు ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. అండర్– 14 ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో భువన్, ప్రణీత్, అంకుల్, అండర్ –14 బాలికల విభాగంలో లాస్య, స్నేహ, రమ్య, అండర్– 17 బాలుర విభాగంలో శ్రీశాంత్, రేహాన్, రామ్చరణ్, బాలికల విభాగంలో ప్రీతి, శ్రీవర్చన, సహస్ర, అండర్–10 విభాగంలో వర్షిత, అండర్–19 బాలుర విభాగంలో రాజేందర్, దీక్షిత్, రిత్విక్, బాలికల విభాగంలో అమూల్య, సుమిత్ర, అశ్విని, రికరు అండర్–14 బాలుర విభాగంలో రుత్విక్, స్నేహిత్, బాలికల విభాగంలో వర్షిణి, నక్షత్ర, నైనిక, అండర్ 17 విభాగంలో ఇందు, సుమంత్, కాంపౌండ్ విభాగంలో కృష్ణసాయి తదితరులు ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, గడీకోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జి, పీడీ నరసింహారెడ్డి, అర్చరీ అసోసియేషన్ కార్యదర్శి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కదిరె మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
కుక్కను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా
● ఒకరి మృతి బోధన్రూరల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పింబోయిన ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు బోధన్రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వెండి లక్ష్మణ్(37) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం పొలంలో కోసిన వడ్లను ట్రాక్టర్ ద్వారా రైస్మిల్కు తరలిస్తుండగా గ్రామ శివారులో రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను త ప్పింబోయి ట్రాక్టర్ బోల్తాపడింది. ప్రమాదంలో లక్ష్మణ్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కు టుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. విద్యుత్షాక్తో రైతు ..ఎల్లారెడ్డిరూరల్: వ్యవసాయ పొలంలో చెడిపోయిన బోరుబావి స్టాటర్ డబ్బాను రిపేర్ చేస్తుండగా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామానికి చెందిన కొండ అమృత్రావు(48) అనే రైతు విద్యుత్షాక్తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అమృత్రావు పొలం పనులు చేసుకుంటు జీవిస్తున్నాడు. బుధవారం తన వ్యవసాయ పొలంలో బోరుబావి మోటరు పనిచేయకపోవడంతో స్టాటర్ డబ్బాను విప్పి రిపేరు చేస్తున్నా డు. ఈ క్రమంలో విద్యుత్షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ..తాడ్వాయి: అనారోగ్య సమస్యలతో బాధపడుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళచికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తాడ్వాయి ఎస్సై న రేశ్ తెలిపారు.వివరాలిలా ఉన్నాయి.మండలంలోని సోమావారం తండాకు చెందిన భూక్య కమిలి(32) అనే మహిళ కొన్నేళ్ల నుంచి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. దీంతో జీవితంపై విరక్తితో ఈనెల 20న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు వెంటనే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఫారెస్ట్ అధికారి వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం
రాజంపేట: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అకారణంగా తమను వేధింపులకు గురిచేస్తున్నాడంటు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రాజంపేట మండలం శేర్శంకర్ తండాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన కాట్రోత్ సుభాష్ అనే వ్యక్తిని గతేడాది ఓ కేసు విషయంలో ఫారెస్ట్ ఆఫీసర్ బాబా అరెస్టు చేసి జైలుకు పంపారు. అంతేకాకుండా కేసు విషయంలో ట్రాక్టర్ను సైతం కోర్టులో హాజరుపర్చినట్లు సుభాష్ పేర్కొన్నాడు. బుధవారం తిరిగి సెక్షన్ ఆఫీసర్ తన సిబ్బందితో కలిసి ట్రాక్టర్ను తీసుకెళ్లడానికి ప్రయత్నించగా సుభాష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి యత్నించాడు. గమనించిన కుటుంబీకులు కామారెడ్డి ఆస్పత్రికి త రలించారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో రమేశ్ను ‘సా క్షి’ వివరణ కోరగా గతంలో ఉన్న కేసులో భాగంగానే అధికారులు సుభాశ్ ట్రాక్టర్ను అదుపులోకి తీసుకోడానికి ఇంటికి వద్దకు వెళ్లారని తెలిపారు. -
స్టడీ అవర్స్ పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న స్టడీ అవర్స్ను ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రశ్నలు వారి ప్రతిభను గమనించారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ప్రైవేటు కళాశాలల విద్యార్థులకు ధీటుగా చదివి మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో నీట్, జేఈఈ, ఎంసెట్ తదితర పరీక్షలకు కావాల్సిన సిలబస్ను ప్రత్యేక తరగతుల ద్వారా బోధిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంటర్ పరీక్షలు ఈ సంవత్సరం ఫిబ్రవరి 23 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఇంటర్ బోర్డు ద్వారా మంజూరైన రూ.16 లక్షల నిధులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలతో నిర్వహిస్తున్న పనులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. బాన్సువాడరూరల్: పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని అమలు చేస్తోందని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. బుధవారం తాడ్కోల్ గ్రామ పంచాయతీలో అధికారులు, లబ్ధిదారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంజూరు వచ్చాక కూడా పనులు ప్రారంభించకపోవడానికి కారణాలను అడిగి తెల్సుకున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష వరకు జీఎస్టీ మినహాయించి రూ.4 లక్షలే బిల్లు ఇవ్వగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షలు ఇస్తోందన్నారు. డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలకు అదనంగా రూ.లక్ష బ్యాంకు రుణం మంజూరు చేయిస్తున్నామన్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే విడతల వారీగా బిల్లులు చెల్లింపు చేస్తున్నామన్నారు. గ్రామంలో పలువురు లబ్ధిదారుల ఇండ్లకు భూమిపూజ చేశారు. నేతలు మధుసూదన్రెడ్డి, సొసైటీ చైర్మన్ గంగారాం, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, సూపరింటెండెంట్ ముజాహిద్, తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద: తనపై అకారణంగా దాడి చేశాడంటు బిచ్కుంద ఎన్డీసీసీబీ మేనేజర్ త్రిశుల్పై పబ్బత్ తుకారాం అనే రైతు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశాడు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన రైతు తుకారాం స్థానిక ఎన్డీసీసీబీలో ఏడేళ్ల క్రితం రుణం తీసుకున్నాడు. తాను తీసుకున్న లోన్ డబ్బులు కొంత తిరిగి ఇచ్చానని, మిగతా దానికి సమయం ఇవ్వాలని కోరినా బ్యాంక్ మేనేజర్ వినిపించుకోకుండా మంగళవారం జరిగిన వాగ్వాదంలో తనపై దాడి చేశాడని ఆరోపించాడు. తాను ఇంట్లో లేని సమయంలో మహిళలను దూషించాడని రైతు పేర్కొన్నాడు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ను వివరణ కోరగా తాను మహిళలను దూషించలేదని తుకారాం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. -
పన్ను వసూలు వేగవంతం చేయండి
● డీపీవో శ్రీనివాస్రావు బోధన్: గ్రామ పంచాయతీ పరిధిలో ఆస్తి, ఇతర పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రావు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే లోపు వంద శాతం పన్ను వసూళ్లకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగు నీటి సరఫరా విషయంలో అప్రమత్తంగా ఉండి, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బుధవారం సాలూర గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులను తనిఖీ చేశారు. డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవోలు శ్రీనివాస్, మధుకర్, ఎంపీవో మద్దిలేటి, తహసీల్దార్ శశిభూషణ్తో సమావేశమయ్యారు. పంచాయతీ పాలనకు సంబంధించిన అంశాల పై చర్చించారు. అనంతరం నర్సరీని సందర్శించి నాటిన మొక్కల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఈజీఎస్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, సిబ్బంది ఉన్నారు. సిరికొండ: మండల కేంద్రంలోని దళితవాడ వైకుంఠధామంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని సంఘం సభ్యులు వాపోతున్నారు. గోసంగి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి సెల్ ఫోన్ లైట్ల వెలుతురులో అంత్యక్రియలు నిర్వహించామని వారు వాపోయారు. రోడ్డు సరిగా లేదని, నీటి సౌకర్యం లేదని వారు తెలిపారు. సమస్యను పరిష్కరించాలని పాలకులకు పలుమార్లు విన్నవించినా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. -
కరాటే శిక్షణ.. ఆత్మరక్షణ
మూడు నెలలపాటు శిక్షణ● జిల్లాలోని 40 పీఎంశ్రీ బడుల్లో అమలు ● ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు శిక్షణ ఖలీల్వాడి: బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి శ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది నవంబర్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు కేజీబీవీ, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమ లు చేయనున్నారు. ఈ బడుల్లో విద్యతో పాటు బాలికలకు కరాటే, జూడో, కుంగ్ఫూ వంటి వాటిని నేర్పిస్తారు. వీటిని నేర్పించడంతోపాటు విద్యార్థినులకు పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి ధ్రువపత్రాలు అందిస్తారు. గతంలా కాకుండా.. గతంలో పాఠశాలల్లో కరాటే, కుంగ్ఫూ, జూడో వంటి శిక్షణలను ఇష్టారాజ్యంగా నిర్వహించేవారు. విద్యార్థినులకు ప్రత్యేకమైన మెలకువలు నేర్పించాలనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు సమగ్ర శిక్షణ అధికారులు స్వీయరక్షణ కోసం ఇచ్చే మెలకువలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. శిక్షణకు ముందుగా విద్యార్థినులకు కసరత్తులు, స్కిల్ ట్రైనింగ్ తోపాటు వ్యాయామాలు చేయించిన తర్వాతే విద్యార్థినులకు కరాటే, కుంగ్పూ, జూడో వంటి వాటిపై శిక్షణ అందించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 72 తరగతులు నిర్వహించాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ క్లాసులను స్కూళ్లలోని పీఈటీ, పీడీ పర్యవేక్షణలో 45 నిమిషాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. పీఏం శ్రీ కింద ఉన్న పాఠశాల విద్యార్థినులకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో, కుంగ్ఫూ వంటి శిక్షణ అందిస్తాం. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సహకారంతో మహిళా శిక్షకులను ఎంపిక చేస్తాం. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వచ్చాయి. దీంతో బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందుతుంది. ఇవి పీఈటీల పర్యవేక్షణలో కొనసాగుతాయి. నవంబర్లో శిక్షణ ప్రారంభమవుతుంది. – భాగ్యలక్ష్మి, జెండర్ ఈక్విటీ కో–ఆర్డినేటర్, నిజామాబాద్ జిల్లాలో 40 పాఠశాలలు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయి. వీటిలో చదువుతున్న బాలికలకు ఆత్మరక్షణ విద్య అమలు చేయనున్నారు. ఇందుకు ఒక్కో పాఠశాలకు రూ.30 వేల చొప్పు న నిధులు మంజూరయ్యాయి. వారానికి ఆరు సార్లు మూడు నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థినులకు శిక్షణ ఇస్తారు. 50 మంది లోపు విద్యార్థినులు ఉంటే రూ.15 వేల వేతనం, 50 కంటే ఎక్కువ ఉంటే రూ.30 వేల గౌరవ వేతనాన్ని శిక్షకులకు అందించనున్నారు. ఈ శిక్షణ నేర్పించేందుకు అవసరమైన మహిళా శిక్షకురాలను జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎంపిక చేయాల్సి ఉంటుంది. -
నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణం
● బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): వరదలతో పంటలు నష్టపోయి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా చేపట్టిన అయ్యప్ప ఆలయ నిర్మాణాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణదశలో ఉన్న ఆలయ వివరాలను స్థానికులను అడిగి ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఇటీవల రెండు పండుగలు గడిచిపోయినా వరద బాధితులకు నష్టపరిహారం అందకపోవడం విచారకరమన్నారు. వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంపై లేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు హన్మాండ్లు, దేవిసింగ్, రాజు, విష్ణు తదితరులున్నారు. -
అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టం
భిక్కనూరు:దేవాలయాల అభివృద్ధిలో భాగస్వా మ్యం అవడం పూర్వజన్మ సుకృతంగా తాను భావిస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ అన్నారు. బుధవారం భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం పునర్నిర్మాణకమిటీ పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో షబ్బీర్అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్తో కలిసి పాల్గొన్నారు. వీరికి ఆలయం తరపున వేద బ్రాహ్మణులు సిద్దగిరిశర్మ, రామగిరిశర్మ, రాజేశ్వరశర్మలు పూర్ణకుంభంతో స్వా గతం పలికారు. ఈ సందర్భంగా షబ్బీర్అలీ మా ట్లాడుతూ..తాను 1992లో భిక్కనూరు సిద్దరామేశ్వరాలయానికి మండల కేంద్రం నుంచి బీటీరోడ్డు, టీటీడీ కల్యాణం మండపాన్ని నిర్మించానని తెలియజేశారు. తాను మంత్రిగా వైఎస్సార్ హయాంలో ప నిచేసినప్పుడు నియోజకవర్గంలో చాలా ఆలయాలను దూపదీప నైవేద్య పథకంలో చేర్పించానన్నా రు.వేదబ్రాహ్మణులు,పండితుల ఆశీర్వచనాలు దే వుళ్ల ఆశీస్సులతోనే తాను ప్రజలకు సేవలు అందిస్తున్నానన్నారు.హైకోర్టు న్యాయవాది పెద్దబచ్చగా రి రాంరెడ్డి సిద్ధరామేశ్వరాలయం అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందిస్తున్నారని ఆయనను అభినందించారు. పునర్నిర్మాణ కమిటీ సభ్యులు నిజాయితీగా పనిచేసి ఆలయం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆలయం అభివృద్ధికి తాను ముందుంటానని రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయం మహంత్ సదాశివ మహంత్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, కిసాన్ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, నేతలు బల్యాల సుదర్శన్, బల్యాల రేఖ, జాంగారి గాలిరెడ్డి, తొగరి సుదర్శన్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాముల లింబాద్రి, వైస్చైర్మన్ అందె దయాకర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. షబ్బీర్ తోడ్పాటు అభినందనీయం: ఎంపీ షెట్కార్ షబ్బీర్అలీ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కొనియాడారు. నూతన దేవాలయాలను నిర్మించడం కంటే పురాతన దేవాలయాలను అభివృద్ధికి తోడ్పాటును అందించాలన్నారు. సిద్దరామేశ్వరాలయం అభివృద్దికి రూ.5 లక్షలను తన ఎంపీ నిధుఽల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
నేరస్తులకు ముకుతాడు!
● మూడు నెలల్లో ఎనిమిది మందిపై పీడీ యాక్టు ● నేరాల నియంత్రణకు పోలీసుల చర్యలునేరం చేసి అరెస్టయి బెయిల్పై విడుదలైన కొందరు నేరప్రవృత్తిని మార్చుకోవడం లేదు. జైళ్లకు వెళ్లినా వారు మారడం లేదు. అక్కడ పరిచయమయ్యే నేరస్తులతో కలిసి మరిన్ని నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని కట్టడి చేయడం పోలీసులకు సవాల్గా మారుతోంది. ఒక్కోసారి చిన్న ఆధారం దొరక్క నేరస్తులను పట్టుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారికి ముకుతాడు వేసేందుకు జిల్లా పోలీసు శాఖ పీడీ యాక్ట్ (ప్రివెంటివ్ డిటెక్షన్)ను ప్రయోగిస్తోంది. వారిపై పీడీ యాక్టు నమోదు చేయడం మూలంగా త్వరగా బెయిల్ దొరక్క ఎక్కువ రోజులు జైలులోనే గడపాల్సి ఉంటుంది. అందుకే పోలీసు ఉన్నతాధికారులు పీడీ యాక్టుకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా దారిదోపిడీలు, దొంగతనాల వంటి కేసుల్లో చిక్కిన వారిపై పీడీ యాక్టు ప్రయోగించి ముకుతాడు వేసే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో మూడు నెలల కాలంలో ఎనిమిది మంది నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేయడమే ఇందుకు నిదర్శనం. ఇందులో అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర దొంగలు ఉన్నారు. జిల్లాకు చెందిన వారు ఒకరిద్దరు ఉండగా, మిగతావారు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలకు చెందినవారున్నారు. జిల్లాలోని లింగంపేట మండలం కన్నాపూర్ గ్రామానికి చెందిన గారబోయిన శ్రీకాంత్ (29) అంతర్జిల్లా దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతూ పలుమార్లు పోలీసుకు చిక్కాడు. లింగంపేటలో అమ్ముల లక్ష్మి అనే మహిళను చంపి ఆభరణాలను ఎత్తుకెళ్లిన కేసులో అరెస్టయ్యాడు. దీంతో కలెక్టర్ అనుమతి తీసుకుని పోలీసు శాఖ గత సెప్టెంబర్లో శ్రీకాంత్పై పీడీ యాక్టు నమోదు చేసింది. జైల్లో ఉన్న సదరు నేరస్తుడికి పీడీ యాక్టు నమోదు పత్రాలు అందించారు. అలాగే జాతీయ రహదారులపై దొంగతనాలు, దారిదోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాపై పీడీ యాక్ట్ అమలు చేశారు. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో రహదారులపై వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మారణాయుధాలతో దాడులు చేసి దారిదోపిడీలకు పాల్పడ్డారు. అలాగే ఇళ్లలో దొంగతనాలు, ఇంట్లో ఉన్నవారిపై దాడులు చేసిన కర్ణాటకలోని బీదర్ జిల్లా ఔరాద్కు చెందిన కృష్ణబాబు షిండే (25), మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మంగ్యాల్ తడాకు చెందిన నామ్దేవ్ (28), వసూర్కు చెందిన రాథోడ్ అజిత్ రమేశ్ (21)పై ఇతర ప్రాంతాల్లో హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. వీరిద్దరు దారిదోపిడీ కేసుల్లో నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఉన్నారు. జూలై 25న వీరిపై పీడీ యాక్టు నమోదు చేశారు. అలాగే దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడిన అంతర్రాష్ట్ర పార్థీ ముఠా సభ్యులు నలుగురిపై పీడీ యాక్టు నమోదైంది. మహారాష్ట్రలోని వార్దా జిల్లాకు చెందిన చోండా అలియాస్ కూలీ పవార్ (30), జాకీ గుజ్జియా బోస్లే (27), హరీశ్పవార్ (18), అనురాగ్ రత్నప్ప బోస్లే (50)పై జూలై 7న పీడీ యాక్టు నమోదైంది. వీరు కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో తొమ్మిది దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలపై దాడి చేసి ఆయుధాలతో బెదిరించి డబ్బులు, మొబైల్స్, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు.పదేపదే నేరాలకు పాల్పడుతూ సమాజంలో శాంతి, భద్రతలకు విఘాతం కలిగించే వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నాం. పీడీ యాక్టు నమోదైన వారు జైలు జీవితానికే పరిమితం కావాల్సి ఉంటుంది. తరచూ నేరాలకు పాల్పడే వారు సమాజంలో భయాందోళనలు కలిగిస్తున్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. – రాజేశ్ చంద్ర, ఎస్పీ -
పోలీసుల కాల్పుల్లో రియాజ్ హతం
డీజీపీ పరామర్శ..నిజామాబాద్ అర్బన్ : కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడైన పాత నేరస్తుడు షేక్ రియాజ్ సోమవారం పోలీసు కాల్పుల్లో మృతి చెందిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్, ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కొని ఫైర్ చేయడానికి ప్రయత్నించిన క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. నగరంలోని హస్మికాలనీకి చెందిన రియాజ్కు వాహనాల దొంగతనాలు , చైన్స్నాచింగ్లు చేయడం అలవాటుగా మారింది. అతనిపై 40 పైగా కేసులు నమోదు అయ్యాయి. పాత కేసుల విచారణలో భాగంగా సీసీఎస్ పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకున్న తరువాత ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కత్తితో పొడిచి హత్యచేసి పారిపోయిన రియాజ్ కోసం ఎనిమిది ప్రత్యేక బృందాలు జల్లెడ పట్టాయి. సారంగపూర్ వద్ద అరెస్టు చేసి రియాజ్ను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రియాజ్కు ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని 407 గదిలో చికిత్స అందించారు. అనంతర పరిణామ ఘటనల్లో రియాజ్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. పంచనామా, పోస్టుమార్టం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృత దేహాన్ని అందించగా మంగళవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు పకడ్బందీగా వ్యవహరించారు. బాణాసంచా కాల్చి.. షేక్ రియాజ్ పోలీసు కాల్పుల్లో మరణించాడని తెలిసిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రి ముందు బీజేపీ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొందరు బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. మూడవ టౌన్, ఆర్మూర్ పోలీస్స్టేషన్, ఇతర ఠాణాల్లో పోలీసులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరి కొందరు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మెడికల్ రిప్రంజెంటేటివ్లు ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించారు.పాత నేరస్తుడు రియాజ్ మృతిపై హర్షం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కున్న నిందితుడు ఫైర్ చేసేందుకు ప్రయత్నం.. ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు హతుడి పై కానిస్టేబుల్ హత్య కేసు, గతంలో 40 పైగా చైన్ స్నాచింగ్, వాహనాల దొంగతనాల కేసులు సంచలనం రేపిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన ఆస్పతి ఎదుట, ఠాణాల్లో బాణాసంచా కాల్చి సంబురాలు -
త్యాగాల ఫలితమే శాంతి, సౌభ్రాతృత్వం
ఘనంగా దీపావళిదీపావళి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. అమావాస్య తిథి సోమవారం మధ్యాహ్నం రాగా పండితులు శుభ ముహూర్తంగా సూచించిన రాత్రి 7.15 గంటల నుంచి లక్ష్మీదేవికి పూజలు నిర్వహించారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలను అందంగా అలంకరించారు. దీపాల వెలుగులో కళకళలాడాయి. అందరూ కలిసి సంతోషంగా పండుగను జరుపుకుంటూ పటాకుల మోత మోగించారు.నేరప్రవృత్తిని మార్చుకోకుండా తరచూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారికి ముకుతాడు వేసేందుకు పోలీసుశాఖ పీడీ యాక్ట్ను ప్రయోగిస్తోంది. ప్రజాభద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తోంది. మూడు నెలల కాలంలో జిల్లాలో ఎనిమిది మందిపై జిల్లా పోలీసుశాఖ పీడీ యాక్ట్ నమోదు చేసింది. ఎనిమిది మందిలో జిల్లాకు చెందిన ఇద్దరు నేరగాళ్లు ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిజైలులో ఉన్న నేరస్తులకు పీడీ యాక్ట్కు సంబంధించిన ఉత్తర్వులను అందజేస్తున్న పోలీసు అధికారులు (ఫైల్) -
రోడ్డు ప్రమాదంలో స్నేహితుడి మృతి.. తట్టుకోలేక ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలో ని జంగంపల్లి గ్రామశివారులో జాతీయ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, తట్టుకోలేక స్నేహితుడు ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఎస్సై అంజనే యులు తెలిపిన వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన మంగలి పెద్ద నర్సింలు (60) సోమవారం గ్రామానికి చెందిన కొమ్మ భాస్కర్తో కలిసి, బైక్పై గ్రామంలోని శ్రీ కృష్ణమందిరానికి బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో వారు రోడ్డు దాటుతుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వా రిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, నర్సింలును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. ఇదిలా ఉండగా జంగంపల్లి గ్రామానికి చెందిన హరి భూమయ్య(58), మంగలి పెద్ద నర్సింలు ఇద్దరూ ప్రాణస్నేహితులు. నర్సింలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం హరి భూ మయ్యకు తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యా డు. ఈక్రమంలో విపరీతంగా మద్యం తాగి, సో మవారం రాత్రి ఇంటికి వచ్చాడు. మళ్లీ మంగళ వారం ఉదయం కూడా విపరీతంగా మద్యం తాగడంతో భూమయ్యను భా ర్య గౌరవ్వ ప్రశ్నించింది. వెంటనే అతడు పొలం వ ద్దకు వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంత రం పొలంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చే సుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించి, వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూ మయ్య స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
బార్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నంద రమేశ్
కామారెడ్డి అర్బన్: తెలంగాణ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉ పాధ్యక్షుడిగా కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్ ఎన్నికయ్యారు. నాంపల్లి కోర్టు ఆవరణలో ఎన్నికలు నిర్వహించగా నిజామా బాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం.సాయిరెడ్డి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికై న ట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రమేశ్కు పలువురు అభినందనలు తెలిపారు. మాచారెడ్డి: పాల్వంచ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్గౌడ్ను ఏకగ్రీవంగా మంగళవారం ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా తోట బాల్రాజు, ఉపాధ్యక్షులుగా రమేష్ యాదవ్, నాగయ్య, కోశాధికారిగా శంకర్లను ఎన్నుకున్నారు. ● సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ కామారెడ్డి క్రైం: ‘సాక్షి’ దినపత్రికలో కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు అనే శీర్షికతో ఆదివారం(ఈ నెల 19న) ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధారి మండలంలో మొత్తం 38 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమైనా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఇంకా రావడం లేదని, 5 కేంద్రాలకు మాత్రమే ధాన్యం కుప్పలు వచ్చాయన్నారు. తేమ శాతం నిబంధనల ప్రకారంగా లేకపోవడంతో రైతులు ధా న్యాన్ని ఆరబెడుతున్నారని తెలిపారు. అందుకే కాంటా ప్రారంభం కాలేదన్నారు. 7 కేంద్రాలకు ధాన్యం రాకపోవడంతో గన్నీ బ్యాగులు పంపలేదన్నారు. తొందర్లోనే అన్ని కేంద్రాల్లో గన్నీ బ్యాగులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్ శివారులోని ప్రధాన రోడ్డుపై కోతకు గురైన కల్వర్టు మరమ్మతుల పనులను మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నారాగౌడ్ ప్రారంభించారు. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కల్వర్టు కోతకు గురైంది. దాంతో కోమట్పల్లి, పోతాయిపల్లి, కన్నాపూర్, రాంపల్లితండా, పొల్కంపేట గ్రామాలతో పాటు మెదక్ వెళ్లడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆదేశాల మేరకు కల్వర్టుకు మరమ్మతులు చేసి ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. నాయకులు సంగయ్య, భైరయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. బీబీపేట: అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ఇసుక లారీలను సోమవారం పట్టుకున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక ధరకు అమ్మడానికి ములుగు జిల్లా, మరొకటి కరీంనగర్ జిల్లాల నుంచి బీబీపేటకు వస్తుండగా, యాడారం రోడ్డులో ఒక లారీని పట్టుకున్నామన్నారు. అలాగే మరోక లారీని పెద్దమ్మ ఆలయం వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లను విచారించగా సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు. -
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
గాంధారి(ఎల్లారెడ్డి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. మండల కేంద్రంతోపాటు గుర్జాల్, మాతుసంగెం, పేట్సంగెంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కల్లాల్లో ధాన్యం తేమ 40 నుంచి 50 శాతం వస్తోందని 17 శాతం తేమ వచ్చేవరకు ఆరబెట్టాలని రైతులకు సూచించారు. ఆయన వెంట గాంధారి విండో ఇన్చార్జి సీఈవో సాయిలు, రైతులు, సిబ్బంది ఉన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
వర్ని: మండలంలోని కూనిపూర్ గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన గోవూరి సుజాత ఇటీవల ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. మంగళవారం తిరిగి వచ్చేసరికి చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమచారం అందించింది. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వెనకాల తలుపులు పగలగొట్టి ఇంట్లో చొరబడి 4 తులాల బంగారు ఆభరణాలు, 6 తులాల వెండి ఆభరణాలు, రూ. 30వేల నగదును ఎత్తుకెళ్లినట్లు ఎస్సై తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దుర్గామాత ఆలయంలో.. వర్ని: మండలంలోని అఫంధి ఫారం గ్రామంలోగల దుర్గామాత ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి హుండీని పగలగొట్టి నగదుతోపాటు 20 తులాల వెండి, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. -
కుటుంబ సభ్యులు తిడుతున్నారని సెల్ టవర్ ఎక్కిన వృద్ధుడు
భిక్కనూరు: వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించానని కుటుంబ సభ్యులు తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇక తనకు చావే శరణ్యమని జంగంపల్లికి చెందిన వృద్ధుడు కర్రోల్ల చిన్న మల్లయ్య మంగళవారం సెల్ టవర్ ఎక్కా డు. ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని టవర్పై ఉన్న మల్లయ్యతో ఫోన్లో మాట్లాడి సముదాయించడంతో అతడు కిందికు దిగాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని విక్రయించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, తనపై వేడి టీ పోశారని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక తనకు చావే దిక్కని భావించి సెల్టవర్ ఎక్కానని అన్నాడు. -
ఎస్సారెస్పీకి 878 టీఎంసీల వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్ చరిత్రలోనే మూడో అత్యధిక వరద నీరు వచ్చి రికార్డును నెలకొల్పింది. 1983–84లో రికార్డు స్థాయిలో 1165 టీఎంసీలే ప్రథమస్థానంలో ఉండగా, 1988–89లో 912.95 టీఎంసీలతో రెండో స్థానంలో ఉంది. కాగా ప్రస్తుత సంవత్సరం (2025–26) 878 టీఎంసీల వరద నీరు వచ్చిచేరడంతో మూడో స్థానం సాధించింది. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల నుంచి గత నాలుగు రోజులుగా గోదావరి శాంతించింది. కనిష్టంగా 5464 క్యూసెక్కులకు వరద పడిపోయింది. మళ్లీ కొంత మేర పెరిగి9464 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. మరో పక్షం రోజులు గడిస్తే ఖరీఫ్ సీజన్ పంటలకు నీటి సరఫరా నిలిపి వేస్తారు. ఇప్పటి వరకు కాలువల ద్వారా, గోదావరిలోకి మొత్తం 810 టీఎంసీల నీటిని వదిలారు. అధికంగా మహా వరద.. ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో స్థానిక ఎగువ ప్రాంతాల నుంచే అధికంగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ప్రస్తుత సంవత్సరం అధికంగా మహారాష్ట్ర ప్రాంతం నుంచే వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్లోకి వచ్చిన 878 టీఎంసీల వరదలో 70 శాతం మేర నీరు మహారాష్ట్ర ప్రాంతం నుంచే వచ్చి చేరిందని రికార్డులు తెలుపుతున్నాయి. మరో వారం రోజులు గడిస్తే మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే నీటికి బ్రేకులు పడుతాయి. అక్టోబర్ 28న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసి వేస్తారు. కొనసాగుతున్న నీటి విడుదల ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు)తో నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం యాసంగీ సీజన్ ప్రారంభం వరకు కూడ ప్రాజెక్ట్ నిండుకుండల ఉండే అవకాశం ఉంది. -
పైరవీలు.. ప్రదక్షిణలు..
● ఐకేపీలో ఇటీవల జరిగిన బదిలీలు ● అప్పుడే డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన పలువురు ఏపీఎంలు డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (ఐకేపీ)లో ఉద్యోగ బదిలీలు జరిగి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే డిప్యుటేషన్ల కోసం సిబ్బంది ప్రయత్నాలు మొదలు పెట్టారు. కొన్ని రోజులుగా పలువురు ఏపీఎంలు తమదైన స్థాయిలో పైరవీలు చేయడంతోపాటు, నిత్యం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అలాగే డీఆర్డీవోపై సైతం ఒత్తిడి పెంచుతున్నారు. జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు.. పదేళ్ల తర్వాత సెర్ప్ సీఈవో పారదర్శకంగా బదిలీలు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో కొందరు ఇప్పుడు జిల్లా కార్యాలయానికి వచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఐతే, బదిలీలు జరిగిన తర్వాత మళ్లీ ఈ డిప్యుటేషన్లు ఏంటీ అని శాఖలోని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఐకేపీలో ఈ ఏడాది ఆగస్టు నెలలో డీపీఎంల నుంచి మొదలుకొని సీసీల దాకా ఉద్యోగ బదిలీలు జరిగాయి. సెర్ప్ సీఈవోనే సీనియార్టీ ప్రకారం జాబితాను జిల్లాకు పంపించి కలెక్టర్ అధ్యక్షతన స్థాన చలనం కలిగించారు. బదిలీలకు ఆప్షన్లు పెట్టుకుని ఇతర మండలాలకు వెళ్లిన ఏపీఎంలు ఇప్పుడు డిప్యుటేషన్లను ఆశించడం వెనక మతలబు ఏంటో తెలియడం లేదు. జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండు పోస్టుల్లో డిప్యుటేషన్పై వచ్చి పని చేయడానికి నాలుగురైదుగురు ఏపీఎంలు పోటీ పడుతున్నారు. మండలాల్లో పని చేసే సదరు ఏపీఎంలు జిల్లా స్థాయిలో ఎందుకు పని చేయాలని కోరుకుంటున్నారో అని శాఖలోని ఉద్యోగులు అనుకుంటున్నారు. డిప్యుటేషన్లకు అవకాశం కల్పిస్తే మిగతా ఉద్యోగులు కూడా వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని డీఆర్డీవోను కోరుతామంటున్నారు. పైరవీలకు తలొగ్గి డిప్యుటేషన్లు వేస్తారా? లేదా ఫైలును తిరస్కరిస్తారా? అనేది డీఆర్డీవోపై ఆధారపడి ఉందంటున్నారు. జిల్లా కార్యాలయంలో రెండు ఏపీఎం పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉద్యోగ బదిలీలు చేసినప్పుడు వీటిని భర్తీ చేయలేదు. డిప్యుటేషన్పై జిల్లా ఆఫీసులో పని చేస్తామని కొందరు ఏపీఎంలు దరఖాస్తు పెట్టుకున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐతే ఒకరిద్దరు సీసీలకు మాత్రం వారి సమస్యను పరిగణలోకి తీసుకుని నిబంధనల ప్రకారం మ్యూచ్వల్ బదిలీ చేయాలనుకుంటున్నాం. –సాయాగౌడ్, డీఆర్డీవో, నిజామాబాద్ -
క్రైం కార్నర్
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని అంకోల్ తండాలో ఓ వృద్ధురాలు హత్యకు గురైందని ఎస్సై రాఘవేందర్ తెలిపారు.వివరాలు ఇలా.. తండాకు చెందిన రాధిబాయి(65) సోమ వారం ఇంట్లో ఒక్కరే ఉ న్నారు.ఈక్రమంలో ఆమె ఒంటిపై ఉన్న వెండి నగలను కాజేయడానికి తండా కు చెందిన మెగావత్ సవాయి సింగ్ ఇంట్లోకి చొరబడ్డాడు. లోపలి నుంచి తలుపులు వేసి వృద్ధురాలిపై దాడి చేసి, ఒంటిపై ఉన్న వెండినగలు దోచుకొని పారిపోయాడు. వెంటనే స్థానికులు గుర్తించి కేకలు వేయడంతో దుండగుడు వారిని ఎవరికై న చెబితే మీ అందరిని చంపుతామని బెదిరించాడు. తలకు తీవ్రగాయమైన వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కొడుకు లాల్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు సవాయి సింగ్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు. వృద్ధురాలి ఆత్మహత్య మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన అంగోత్ సోనాబాయి (56) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. ఆమెకు మద్యం తాగే అలవాటు ఉంది. ఈనెల 18న కొడుకు శ్రీరామ్ మద్యం తాగవద్దని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన సోనాబా యి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అనంతరం గ్రామ శివారులోని నీటికుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఆమె మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం అందించారు. కు టుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
డీఈవో ఎస్.రాజు కామారెడ్డి టౌన్: విద్యార్థులు చదువులతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని డీఈవో ఎస్.రాజు వ్యాఖ్యానించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి జానపద నృత్య పోటీల ముంగిపు కార్యక్రమానికి డీఈవో హాజరై విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. 64 కళలలో నృత్యానికి చాలా ప్రాధాన్యం ఉందన్నారు. అందులో జానపద నృత్యం గ్రామీణ ప్రజల గుండె చప్పుళ్లను ప్రతిధ్వనిస్తుందన్నారు. ఈ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవునిపల్లి విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. సోమారంపేట, ఇసాయిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, ప్లానింగ్ కో–ఆర్డినేటర్ నాగవేందర్, న్యాయనిర్ణేతలు వసుధ, మనోహర్, భవాని, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో విజేత గాంధారి జట్టు
కామారెడ్డి అర్బన్:సీహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్రస్థా యి రెండు రోజుల ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ సోమవారం రాత్రి ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి విజేత జట్ల కు బహుమతులు,ట్రోఫీలు అందజేశారు. ప్రథమంగా నిలిచిన గాంధారి జట్టుకు రూ.20వేల నగదుతో పాటు ట్రోఫీ అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన పిట్లం జట్టుకు రూ.10వేల నగదు, తృతీయ స్థానంలో నిలిచిన తాడ్వాయి జట్టుకు రూ.5వేల న గదు అందజేశారు.పాల్గొన్న క్రీడాకారులకు జ్ఞాపికలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరేష్, మహేందర్రెడ్డి, గంగాధర్రెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు సీహెచ్ రాజు, గడీల భాస్కర్, మనోహర్రావు, బాబా, జగదీష్, మురళి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. వాలీబాల్ పోటీల్లో పేట్సంగెం విద్యార్థిని ప్రతిభ గాంధారి(ఎల్లారెడ్డి): రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన అండర్–17 బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచినట్లు జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లక్ష్మణ్ మంగళవారం తెలిపారు. రాష్ట్రస్థాయి ఉమ్మడి నిజామాబాద్ జట్టులో జెడ్పీ ఉన్నత పాఠశాల పేట్సంగెం విద్యార్థిని సృజన మంచి ప్రతిభ కనబర్చి నిర్వాహకుల దృష్టిని ఆకర్షించి ప్రశంసా పత్రం అందుకున్నట్లు తెలిపారు. సృజనను పాఠశాల ఉపాద్యాయులు, గ్రామస్తులు అభినందించారు. -
దళారులను ఆశ్రయించొద్దు
కామారెడ్డి క్రైం: డ్రైవింగ్ లైసెన్స్లు, వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాల కోసం దళారులను ఆశ్రయించొద్దని రవాణా శాఖ జిల్లా అధికా రి శ్రీనివాస్రెడ్డి సూ చించారు. మంగగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. ఏ అవసరం ఉన్నా మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని నేరుగా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించాలన్నారు. రవాణా శాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అపోహలకు తావు లేదని స్పష్టం చేశారు. ఇటీవల ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘సారథి’ అనే వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ చేసేందకు ఎక్కువ సమయం తీసుకుంటోందని, అదొక్క టి మాత్రమే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అందులో రెన్యువల్స్కు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి స్లాట్ బుకింగ్ త్వరగా అయ్యేలా చూడాలని ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని, ప్రతి రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గగంటల వరకు అందుబాటులో ఉంటానని తెలిపారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన దొంతుల అరుణ్కుమార్ (రాజు) (41) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, నాలుగో టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామంలో అరుణ్కుమార్ కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. దీపావళి పండుగ కావడంతో సోమవారం ఉదయం బైక్పై సామగ్రి కోసం నిజామాబాద్కు బయలుదేరాడు. నగరంలోని హనుమాన్ జంక్షన్ వద్ద అతడు మూల మలుగుతుండగా, అదేసమయంలో మాధవనగర్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అరుణ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. నిర్లక్ష్యపు డ్రైవింగే కారణం! మాధవనగర్కు చెందిన యువకుడితోపాటు మరో ముగ్గురు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు, స్థానికులు పేర్కొంటున్నారు. కారులో ఉన్న నలుగురు పరారయ్యారు. మంగళవారం సాయంత్రానికి కూడా వారి ఆచూకీ లభించలేదని తెలిసింది. కాగా యువకుడు మృతికి కారణమైన వారిని కాపాడేందుకు పోలీస్స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలని పూలు, కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన అరుణ్ మృతిచెందడంతో కుటుంబ పెద్దను కోల్పోయి కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడికి అనారోగ్యంతో ఉన్న తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేడ్చల్లో మాచారెడ్డి మండల వాసి.. మాచారెడ్డి: మేడ్చల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాచారెడ్డి మండలం నెమ్లిగుట్ట తండాకు చెందిన భానోత్ శ్రీనివాస్ (33) మృతిచెందాడు. వివరాలు ఇలా.. శ్రీనివాస్ మేడ్చల్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. దీపావళి కోసం ఇంటికి వచ్చిన శ్రీనివాస్ మంగళవారం బైక్పై తిరిగి మేడ్చల్ బయలుదేరాడు. మేడ్చల్ సమీపంలో అతడిని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్కు తీవ్ర గాయాలు కాావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెరువులో పడి మహిళ.. ఎల్లారెడ్డి: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని సాతెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన పసుపుల పద్మ (43) ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. గ్రామశివారులోని చెరువులో మరుసటి రోజు ఆమె మృతహం తేలడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమచారాం అందించారు. పోలీసు లు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాలకృత్యాల కోసం వెళ్లిన పద్మ చెరువులో జారి పడి ఈతరాక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. ఫిట్స్తో చిన్నారి.. మోపాల్: మండలకేంద్రంలో ఐదు నెలల చిన్నారి ఫిట్స్తో మృతిచెందినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మండలం, కూర్మల్ గూడ గ్రామం ఇంద్రానగర్ కాలనీకి చెందిన జంగం లక్ష్మీ–శ్రీరాములు దంపతులకు ఐదు నెలల చిన్నారి(సంధ్య) ఉంది. దంపతుల మధ్య గొడవల కారణంగా లక్ష్మీ చిన్నారితోపాటు రెండు నెలల క్రితమే మోపాల్లోని తన అన్న ఇంటికి వచ్చింది. చిన్నారి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో మంగళవారం ఫిట్స్ రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలి తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో జరిగిన వివిధ ఘటనల్లో పలువురు మృతిచెందారు. వారిలో రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత చెందగా, చెరువులో పడి ఓ మహిళ, ఫిట్స్తో ఓ చిన్నారి ప్రాణాలు విడిచారు. అలాగే సౌతాఫ్రికాలో భిక్కనూరుకు చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మరణించారు. -
సౌతాఫ్రికాలో అనుమానాస్పద స్థితిలో భిక్కనూరు వాసి..
భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు సౌతాఫ్రికాలో అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన బత్తుల శ్రీనివాస్ (34) ఆరేళ్లుగా సౌతాఫ్రికా దేశంలో బోర్వెల్స్లో పనిచేస్తుండేవాడు. ఏడాదికి రెండు మూడు పర్యాయాలు స్వదేశానికి వెళ్లివస్తుండగా, ఈ ఏడాది జనవరిలో భిక్కనూరుకు వచ్చి ఏప్రిల్లో తిరిగి సౌతాఫ్రికాకు వెళ్లాడు. సౌతాఫ్రికాలోని జెలిజా పట్టణం సమీపంలో ఓ చెట్టుకు శ్రీనివాస్ వేలాడుతున్నట్లు ఉన్న ఫొటోలను అక్కడి వారు సోమవారం అతడి కుటుంబీకులకు పంపించారు. ఆదివారం కుటుంబీకులతో సంతోషంగా మాట్లాడిన శ్రీనివాస్ సోమవారం వేకువజామున ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో శ్రీనివాస్ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రీనివాస్ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని శుక్రవారం మృతదేహం ఇండియాకు చేరుకుంటుందని తెలుస్తోంది. మృతుడికి తండ్రి బలరాం, తల్లి లావణ్య భార్య నవనీత, కూతురు లాస్య కుమారుడు నిహాల్ ఉన్నారు. -
పత్తి విక్రయించేందుకు స్లాట్ బుక్చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా తప్పనిసరిగా స్లాట్ బుక్ చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. స్లాట్ బుక్ చేసుకుంటే రైతులు పత్తిని ఏ తేదీన, ఏ మిల్లుకు తీసుకురావాలనే వివరాలు అందులోనే ఉంటాయని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ లేని, ఫోన్ వాడకం తెలియని రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఓటీపీ ద్వారా అధికారులు రైతులకు స్లాట్బుక్ చేసి ఇస్తారని, స్లాట్ బుక్ చేసుకోకుంటే సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయానికి అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తేమ శాతం 8కి మించకుండా ఉండేలా చూసుకుని రైతులు కొనుగోలు కేంద్రాలకు పత్తిని తీసుకువచ్చి, రూ.8,110 మద్దతు ధర పొందాలని పేర్కొన్నారు. -
కుక్కల స్వైర విహారం
● వాహనదారులను వెంటాడుతున్న కుక్కలు ● తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు దోమకొండ: గ్రామాల్లో ఎక్కడా చూసినా శునకా లు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపించి న వారిని వెంటాడుతున్నాయి. దొరికిన వారిపై దాడి చేస్తున్నాయి. ఏ గ్రామంలో చూసినా పదు ల సంఖ్యలో శునకాలు వీధుల్లో తిరుగుతుండడంతో జనాలు రోడ్లపైకి రావాలంటేనే జంకుతున్నారు. నిత్యం కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్నారు. వీటి సంఖ్య పెరగకుండా కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. మండల కేంద్రంలో కుక్కలు అడ్డు వచ్చి వాటిని తప్పించబోయి గ్రామానికి చెందిన పలువురు ఇటీవల గాయపడ్డారు. స్థానిక పాత పోలీస్స్టేషన్, బీబీపేట రోడ్డులో కుక్కలు ఎక్కువగా రోడ్డుపై అడ్డురాగా, వాటిని తప్పించే క్రమంలో బైక్లు అదుపు తప్పిపడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. రోడ్ల పక్కన కోళ్ల వ్యర్థాలు.. ముఖ్యంగా మండల కేంద్రంలో చికెన్ దుకాణా ల వద్ద కుక్కలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. రోడ్ల పక్కనే కోళ్ల వ్యర్థాలు పడేయడటంతో కు క్కలు తిరుగుతున్నాయి. చికెన్ దుకాణదారులు కోళ్ల వ్యర్ధాలను దారుల వెంట వేయడంతో వాటిని తినేందుకు పోట్లాడుకుంటున్నాయి. కోళ్ల వ్యర్థాలను గ్రామానికి దూరంగా వేసేలా, పంచాయతీ అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన ప్రజలు కోరుతున్నారు. -
క్రైం కార్నర్
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. వివరాలు ఇలా.. తాడ్వాయికి చెందిన గాంధారి రమేష్ (40) ఈనెల 14న ఉదయం మొక్కజొన్న కొట్టడానికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం అతడు ఇంటికి రాగా, కొద్దిసేపటికే మళ్లీ బయటకు వెళ్లాడు. రాత్రయినా అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. మరుసటి రోజు తాడ్వాయి బస్టాండ్ దగ్గర అతడు కిందపడి ఉండటంతో విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నిజామాబాద్లోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 18న సాయంత్రం రమేష్ మృతిచెందాడు. మృతుడికి భార్య ముత్తవ్వ, కూతుర్లు కీర్తన, శృతి ఉన్నారు. మృతుడి భార్య ముత్తవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. మోపాల్ మండలంలో మహిళ.. మోపాల్: మండలంలోని గుడి తండాలో శనివారం రాత్రి జరిగిన దాడి ఘటనలో ఓ మహిళ గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన రుదవత్ నీలాబాయి (41), భర్త వామన్ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు వినోద్, తన భార్యతో కలిసి గ్రామంలోనే ఆటో నడుపుకుంటున్నాడు. ఇటీవల వారి కుటుంబంలో కలహాలు నెలకొనగా, శనివారం రాత్రి వామన్, వినోద్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరిని నీలాబాయి సముదాయించే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తుడైన వామన్ ఆమె తలపై కర్రతో కొట్టాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందింది. కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు వామన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
అంబేడ్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
మాచారెడ్డి: పాల్వంచ మండల నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా జి.చంద్రం, అధ్యక్షునిగా ఎం.బాల్ నర్సు, ఉపాధ్యక్షుడిగా జి.నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా శంకర్ బాబు, కోశాధికారిగా సీహెచ్. మైసయ్య, కార్యదర్శిగా డి.రవి, సలహాదారులుగా సీహెచ్ లక్ష్మణ్, నడిపి నర్సింలు, శ్రీను, రమేష్, కార్యవర్గ సభ్యులుగా మల్లేష్, నర్సింలు, రాకేష్, చిన్న నర్సింలు, బాల ఎల్లయ్య, రాజులను ఎన్నుకున్నారు. బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణానికి చెందిన అద్నాన్ నిర్మాతగా పలు భాషల్లో తెరకెక్కుతున్న వాంపర్స్ సాగా చిత్రంలోని పలు సన్నివేశాలను బాన్సువాడ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో చిత్రీకరిస్తున్నారు. మండలంలోని బోర్లంక్యాంపు, తాడ్కోల్ తదితర గ్రామాల్లో శనివారం రాత్రి చిత్ర సన్నివేశాలు తీశారు. హర్రర్ మూవీ కావడంతో రాత్రిపూట శ్మశానవాటిక, ఊడలమర్రి చెట్ల కింద షూటింగ్ తీస్తున్నారు. ఇటీవల చిత్రం టీజర్ విడుదల చేయగా డిజిటల్ ప్లాట్ఫామ్లలో సంచలనం సృష్టించిందని చిత్ర నటుడు, దర్శక, నిర్మాత అబ్దుల్ అద్నాన్ పేర్కొన్నారు. సినిమాలో యాక్షన్, కామెడీ, రొమాన్స్, హర్రర్ ఓ స్థాయిలో ఉంటాయన్నారు. చిత్ర షూటింగ్ సందర్భంగా సినీతారలు జుబేర్ఖాన్, సనా సుల్తానా, బుష్రా షేక్, చేతన్, హన్స్రాజ్ సందడి చేశారు. ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలి నిజామాబాద్ నాగారం: రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ఉందని సీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం ప్రెస్క్లబ్లో పౌరహక్కుల సంఘం(సీఎల్సీ) ఉమ్మడి జిల్లా 17వ మహాసభ జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కుల సంఘం ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుతోందన్నారు. సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యమం, తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తోందన్నారు. కశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లోని హక్కులని, మారణ హోమానికి వ్యతిరేకంగా కార్యాచరణ కొనసాగిస్తోందన్నారు. -
ప్రారంభించిన ఒక రోజుకే దిగబడ్డ లారీ
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లి(ఖుర్దు) వద్ద పాముల వాగు వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. 45 రోజులుగా బస్సులు, లారీల రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు చొరవతో డైవర్షన్ రోడ్డుకు రూ.కోటి మంజూరు చేయించారు. నెల రోజుల నుంచి డైవర్షన్ రోడ్డు పనులు చేపట్టారు. మొదట వర్షాలు కురియడంతో రోడ్డు పనులు నత్తనడకన కొనసాగాయి. పది రోజులుగా వర్షాలు ఆగిపోయి ఎండలు కొడుతుండటంతో రోడ్డు పనుల్లో వేగం పెంచారు. వాగు మధ్యలో కంకర రోడ్డు వేసి రెండు వరుసల్లో పైపులు వేశారు. పైపులకు ఇరువైపులా మొరం వేసి రోలర్తో తొక్కించి రాకపోకలు పునరుద్ధరించారు. రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి కంకర, రాళ్లు వేయకుండానే కేవలం మొరం వేయడంతో రాకపోకలు పునరుద్ధరించిన ఒక రోజుకే లారీ దిగబడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వంతెనకు ఇరువైపులా మొరం దిగబడుతుండడంతో ఆదివారం నుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఆదివారం తిరిగి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఆర్ఈండ్బీఽ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు కొనసాగించే రోడ్డు నాణ్యతగా చేపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కోరుతున్నారు. -
పత్తి రైతు చిత్తు..!
● భారీ వర్షాలతో తగ్గిన దిగుబడి ● పెట్టుబడులు కూడా రాని వైనం పెద్దకొడప్గల్(జుక్కల్): ఇటీవల నెల రోజుల పా టు నిరంతరాయంగా కురిసిన భారీ వర్షాలకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో మొ త్తం 5 వేల 310 ఎకరాలల్లో పత్తి పంటను రైతులు సాగుచేశారు. ఇది వరకు పత్తి పంటను మూడు,నా లుగు సార్లు తీసేవారు. 8 నుంచి 10 క్వింటాళ్ల పత్తి పండేది. ఇప్పడు కురిసిన భారీ వర్షాలకు తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గి ఒకేసారి పత్తిని తీయగానే పత్తి మొక్కలను తొలగించే పరిస్థితి వచ్చింది. దిగుబడి 4 క్వింటాళ్ల నుంచి 5 క్వింటాళ్లకు తగ్గిపోయింది. గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు అవుతున్నాయి. ఎకరం భూమి కౌలు రూ.25 వేల వరకు ఉండగా ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు కలిపి మరో రూ.25 వేలు అవుతోంది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.10 వేల ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు ఉంటుంది. పంట చేనులో ఉన్నదన్నా ఏరుకోవాలంటే కూలీలు దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏరింది అమ్ముకుందామంటే మార్కెట్లో మద్దతు ధరలేదు. ఓపెన్ మార్కెట్లో దళారీలదే రాజ్యం నాణ్యత పేరుతో వారు నిర్ణయించిందే ధర. రూ.4,800 నుంచి రూ.5, 200 వరకు ధరకే కొనుగోలు చేస్తున్నారు. తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తడిసిన పత్తి నాణ్యతా ప్రమాణాల ఆంక్షలు లేకుండా రూ.10 వేల కనీస ధర తగ్గకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నాకున్న మూడు ఎకరాలల్లో పత్తి పంట వేసుకున్నాను. భారీ వర్షాలకు పత్తి నల్లబారడమే కాకుండా నాణ్యత కూడా తగ్గిపోయింది. 8 నుండి 10 క్వింటాళ్ల పత్తి పండేది. ఇప్పడు కురిసిన భారీ వర్షాలతో తెగుళ్లు వచ్చి దిగుబడి తగ్గింది. తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి.కనీసం రూ.10 వేలు ధర తగ్గకుండా కొనుగోలు చేసి నష్టపోయిన రైతాంగాన్నిఆదుకోవాలి. – తోట కిష్టయ్య, రైతు, పెద్దకొడప్గల్ నేను 8 ఎకరాలు కౌలు తీసుకున్నాను. గతంలో కంటే పత్తి పంటకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరం పత్తి పంట సాగు చేయాలంటే కౌలుతో కలిపి రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చి రూ.10 వేలు ధర ఉంటేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది. కూలీలు దొరక్క కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – గోతి సుప్చంద్, రైతు, టికారం తండా పత్తి పంట దెబ్బతినడంతో రెండో పంటగా రైతులు మొక్కజొన్నపైనే ఆశలు పెట్టుకుంటున్నారు. తీయటానికి వచ్చిన పత్తిని తీసుకుని వెంటనే పత్తిని తొలగించి దాని స్థానంలో మొక్కజొన్న పంట వేసేందుకు రైతులు సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది కూడా పత్తి పంట నష్టం రావడంతో రెండో పంటగా మొక్కజొన్న సాగుచేశారు. ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చి క్వింటా రూ.2 వేలపైనే పలకడంతో రైతులకు కొంత ఊరట లభించింది. -
మార్కెట్లో కొనుగోళ్ల సందడి
జిల్లా కేంద్రంలోని మార్కెట్లో దీపావళి సందడి నెలకొంది. జిల్లా ప్రజలు పండుగకు ఒకరోజు ముందుగానే ఆదివారం సామగ్రి కోసం తరలిరావడంతో కిటకిటలాడింది. ప్రధాన ప్రాంతాల్లో, రోడ్ల పక్కన ప్రమిదలు, పూలు, పండ్లు, పూజా సామగ్రి, టపాసుల దుకాణాలను వ్యాపారులు పోటాపోటీగా ఏర్పాటు చేశారు. అలాగే టపాసులు అమ్మేందుకు దుకాణదారులు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడ చూసిన పండుగ సామగ్రి కొనుగోళ్లతో దీపావళి శోభ సంతరించుకుంది. –సాక్షి నెట్వర్క్ పటాకులు కొనుగోలు చేస్తూ..జిల్లా కేంద్రంలోని మార్కెట్లో పండుగ సామగ్రి కొనుగోలు చేస్తూ.. -
రెండు రోజుల్లో పేకాడుతున్న 81 మంది అరెస్ట్
● రూ. 85వేలు నగదు స్వాధీనం ● ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో పేకాడుతున్న 81 మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. వారి వద్ద నుంచి రూ.85వేల నగదు, 41 సెల్ఫోన్లు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పేకాడిన వారిపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశామన్నారు. పేకాట, చట్ట వ్యతిరేక కార్యకలపాలను సహించేది లేదన్నారు. దీపావళి నేపథ్యంలో పేకాటపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పేకాడితే పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 87126 86133కు గానీ, డయల్ 100కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. బట్టాపూర్లో.. మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని బట్టాపూర్లో ఒక ఇంట్లో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై రాజేశ్వర్ ఆదివారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,01,280 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఐదు సెల్ఫోన్లు, 3 బైక్లను సైతం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇసుక లారీ స్వాధీనం మోర్తాడ్(బాల్కొండ): ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ శివారు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకుని, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్వర్ ఆదివారం తెలిపారు. మెండోరా మండలం పోచంపాడ్కు చెందిన కాంట్లి రాజు, కమ్మర్పల్లికి చెందిన బోదాసు రాజు లారీలో ఇసుకను నింపుకుని ఏర్గట్లవైపు వస్తుండగా లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్నామన్నారు, లింగంపేటలో ట్రాక్టర్.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలోని పెద్దవా గు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ను సీజ్ చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ ఆదివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన రాజు అనుమతులు లేకుండా పెద్ద వాగు నుంచి ట్రాక్టర్పై ఇసుక తరలిస్తుండగా పట్టుకొని ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ముదక్పల్లిలో టిప్పర్.. మోపాల్: మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదక్పల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ను పట్టుకున్నట్లు ఎస్సై సుస్మిత ఆదివారం తెలిపారు. డ్రైవర్ మహేష్ సరైన అనుమతులు చూపకపోవడంతో టిప్పర్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సెమీస్ చేరిన జిల్లా వాలీబాల్ జట్టు
నిజామాబాద్ నాగారం: మహబూబ్ నగర్ జిల్లాలో ఎస్జీఎఫ్ అండర్ 17 బాలికల రాష్ట్రస్థాయి వాలీబా ల్ టోర్నమెంట్ కొనసాగుతోంది. పోటీల్లో నిజామాబాద్ జట్టు సెమీస్కు చేరినట్లు సమాచారం. ఈసందర్భంగా క్రీడాకారులకు జిల్లా క్రీడల కార్యదర్శి నాగమణి ఒక ప్రకటనలో అభినందనలు తెలిపారు. ‘సాగర్’ గేటు ఎత్తివేత నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి 7,048 క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఆదివారం నిజాంసాగర్ ప్రాజెక్టు ఒక వర ద గేటును ఎత్తారు. వరద గేటు ద్వారా 4,048 క్యూ సెక్కుల నీటిని మంజీరా నదిలో వదులుతున్నామ ని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీల)కు ప్రస్తుతం 1405 అడుగులు (17.8 టీఎంసీల) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. -
పదికి ప్రత్యేక కసరత్తు
నిజాంసాగర్(జుక్కల్): పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలే లక్ష్యంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థుల్లో విద్యాసామర్థ్యాలు పెంచి, వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 13,617 మంది విద్యార్థులు జిల్లాలోని 306 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతోపాటు గురుకులాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 13,617 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. పబ్లిక్ పరీక్షలకు ముందుగానే ఆయా పాఠశాలల్లో విద్యార్థులను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం వేళలో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పాఠ్యాంశాల్లో సందేహాలను నివృత్తి చేస్తున్నారు. నవంబర్ నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతను సా ధించడమే లక్ష్యంగా విద్యార్థు లను పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం. సబ్జెక్టుల వారీగా సిలబస్ పూర్తి చేయడంతోపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక క్లాసులు ఉంటాయి. – రాజు, జిల్లా విద్యాశాఖ అధికారి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల సన్నద్ధం ఉదయం, సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాసులు చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శద్ధ వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
కామారెడ్డి అర్బన్: స్మారక క్రీడలు నిర్వహిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం.చంద్రకాంత్రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి శ్రీ సరస్వతి శిశుమందిర్ మైదానంలో ఆదివారం సాయంత్రం సీహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ఆయా జిల్లాల నుంచి 15 జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్లో కామారెడ్డి జిల్లా బొల్లారం, సిద్దిపేట జట్లు తలపడ్డాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు సీహెచ్ రాజు, గడీల భాస్కర్, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఎం.జైపాల్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, జగదీశ్, నర్సింలు, మనోహర్రావు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో రియాజ్
నిజామాబాద్అర్బన్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకేసులో నిందితుడైన పాతనేరస్తుడు రియాజ్ పోలీసులకు ఆదివారం చిక్కాడు. బైక్ చోరీ కేసులో శుక్రవారం రాత్రి అరెస్టు చేసి తీసుకొస్తుండగా కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు సీపీ సాయిచైతన్య ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఆదివారం మధ్యా హ్నం 12 గంటలకు సారంగాపూర్ ప్రాంతంలో ఓ లారీ విడిభాగమైన క్యాబిన్లో రియాజ్ దాక్కున్న ట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించా రు. ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకో గానే గమనించిన రియాజ్ పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. అదే సమయంలో రియాజ్ను పట్టుకునేందుకు ఆసిఫ్ అనే యువకుడు ప్రయత్నించగా అతడిపై గాజు ముక్కతో దాడి చేశాడు. అప్పటికే పోలీస్ బృందాలు రియాజ్ను చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్ వదంతులు రియాజ్ను సారంగాపూర్ ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని ఆదివారం మధ్యాహ్నం వదంతులు వ్యాపించాయి. అయితే రియాజ్ తమ అదుపులోనే ఉన్నాడని, ఎన్కౌంటర్ చేయలేదని సీపీ సాయి చైతన్య ప్రకటన విడుదల చేయడంతో వదంతులకు పుల్స్టాప్ పడింది. వీడియో వైరల్ రియాజ్ను అదుపులోకి తీసుకున్న సమయంలో అదే ప్రాంతంలో ఒకరు తీసిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది. నిందితుడి వద్ద కత్తి ఉందనే అనుమానంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అదుపులోకి తీసుకున్నారు. తుపాకులతో గురిపెట్టి నేలపై పడుకోబెట్టి, అనంతరం బేడీలు వేసి, తాళ్లతో కట్టేసి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భద్రత నడుమ ఆస్పత్రికి.. నిందితుడు రియాజ్కు దెబ్బలు తగలడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోని ఖైదీలకు వైద్యం అందించే వార్డులో ఉంచారు. మొదట ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం రియాజ్ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో గాయలపాలైన ఆసిఫ్ను పోలీసులు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసిఫ్ పరిస్థితి నిలకడగా ఉంది.శుక్రవారం రాత్రి నుంచి 8 ప్రత్యేక బృందాలు రియాజ్ కోసం తీవ్రంగా గాలించాయి. నిందితుడు మొదట జిల్లా దాటినట్లు భావించినప్పటికీ సరిహద్దు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం నగరంలోనే ఉన్నట్లు నిర్దారణకు వచ్చారు. రియాజ్ పాతనేరస్తుడు కావడంతో అతడు తరచూ తిరిగే ప్రాంతాలు, కలిసే వ్యక్తులపై పోలీసులు నిఘా సారించి ఫోన్ నంబర్ను ట్రేసింగ్లో పెట్టారు. కానీ రియాజ్ ఫోన్ ఉపయోగించకుండా చోరీ చేసిన బైకుతో పోలీసుల కన్నుగప్పి వివిధ ప్రాంతాలు తిరిగాడు. బర్కత్పురాలోని ఓ లాయర్ వద్దకు వెళ్లిన రియాజ్ అతడి ద్వారా లొంగిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ సదరు లాయర్ సాయం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. సారంగాపూర్ ప్రాంతంలో పట్టుకున్న ప్రత్యేక బృందాలు అడ్డుకున్న స్థానిక యువకుడిపై కత్తితో దాడి చేసిన నిందితుడు వదంతులు నమ్మొద్దు : సీపీ -
దాడులు దాడులే.. వసూళ్లు వసూళ్లే...
రవాణా శాఖ చెక్పోస్టులు, చెక్పాయింట్లపై అప్పుడప్పుడు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించడం, ఏవో కేసులు నమోదు చేయడం తర్వాత వసూళ్లు యథావిధిగా నడుస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఏసీబీ అధికారుల కళ్లెదుటే వసూళ్ల పర్వం కొనసాగుతుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీఏ కార్యాలయాలు, చెక్పోస్టుల్లో జరిగే వసూళ్ల దందా విషయం అందరికీ తెలిసినా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ప్రభుత్వ విధానాల్లో లోపాలే ఇలాంటివి కొనసాగడానికి కారణమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు దాడులు చేసి రవాణా శాఖను బద్నాం చేయడమే తప్ప, తీసుకున్న చర్యలు పెద్దగా ఏమీ ఉండడం లేదు. వసూళ్లను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
● ఈ నెల 23 వరకు అవకాశం కామారెడ్డి రూరల్: మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 23 వరకు పొడిగించినట్లు కామారెడ్డి ఎకై ్సజ్ శాఖ అధికారి హనుమంత రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం మొదట ఈ నెల 18 వరకే గడువు విధించింది. అయితే, శనివారం రాత్రి వరకు మొత్తం 1,444 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కామారెడ్డి పరిధిలో 449, దోమకొండ పరిధిలో 307, బిచ్కుంద పరిధిలో 222, బాన్సువాడ పరిధిలో 240, ఎల్లారెడ్డి పరిధిలో 226 దరఖాస్తులు వచ్చాయి. మరో ఐదు రోజులపాటు గడువు పొడిగించడంతో ఆసక్తిగలవారు దరఖాస్తు చేసుకోవాలని ఎకై ్సజ్ అధికారి హనుమంతరావు తెలిపారు. ఈ నెల 27న లాటరీ నిర్వహించి మద్యం దుకాణాలను కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల నుంచి 7,048 క్యూసెక్కుల వరద నీరు వ స్తుండటంతో ఆదివారం నిజాంసాగర్ ప్రాజె క్టు ఒక వరద గేటును ఎత్తారు. వరద గేటు ద్వారా 4,048 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలో వదులుతున్నామని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీల)కు ప్రస్తుతం 1405 అడుగులు(17.8 టీఎంసీల) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.కామారెడ్డి అర్బన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో సీనియర్ పురుషులు, మహిళా క్రీడాకారుల ఎంపిక ఈనెల 23న గురువారం ఉదయం 9గంటలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నట్టు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అతీకుల్లా ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు ఈ నెల 25 నుంచి నవంబర్ 5 వరకు పిట్లంలో ప్రత్యేక శిబిరం నిర్వహించి నవంబర్ 6 నుంచి 9వ తేదీ వరకు పెద్దపల్లి ఇండియన్ మిషన్ హైస్కూల్లో నిర్వహించే 58వ రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు పంపుతామని పేర్కొన్నారు. వివరాలకు 85559 96271, 94942 259901, 96762 69988 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ● ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి క్రైం: దీపావళి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ రాజేశ్చంద్ర జిల్లా ప్రజలకు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. బాణాసంచా కాల్చేటప్పుడు గాయాలు కాకుండా, అగ్ని ప్రమాదాలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లను అలంకరించే క్రమంలో దీపాలు, లైటింగ్ ఏర్పాట్లు విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. శబ్ద, కాలుష్య నియంత్రణ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు, పరిమితులను తప్పనిసరిగా పాటించాలన్నారు. ● జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ కామారెడ్డి రూరల్: లైసెన్స్ ఉన్న షాపులలో మాత్రమే పటాకులు కొనుగోలు చేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ సుధాకర్ ప్రజలకు సూచించారు. జిల్లా అగ్నిమాపక కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 94 పటాకుల దుకాణాలకు అనుమతి ఇచ్చామని వెల్లడించారు. దుకాణాల మధ్య 3 మీటర్ల దూరం, ప్రతి షాపు వద్ద 200 లీటర్ల నీటి బ్యారెల్, 5 కిలోల ఫైర్ సేఫ్టీ సిలిండర్ ఉండాలని తెలిపారు. ప్రజలు పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించారు. రోడ్లు, ఇళ్ల మధ్య పటాకులు కాల్చొద్దని, ఓపెన్ స్థలాల్లో మాత్రమే కాల్చాలన్నారు. -
ఓపెన్ కలెక్షన్!
ఏసీబీ దాడిచేసిన సలాబత్పూర్ ఆర్టీవో చెక్పోస్ట్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : అవి చెక్పోస్టులు, చెక్పాయింట్లు అనేకంటే కలెక్షన్ సెంటర్లు అనొచ్చు. ఎందుకంటే అక్కడ వాహనాల తనిఖీలు ఉండవు. కేవలం వసూళ్లే జరుగుతాయి. అది కూడా బహిరంగంగా నడిచే వ్యవహారమే. ఈ విషయం రవాణా శాఖ ఉన్నతాధికారులకు తెలియందీ కాదు. పైగా చెక్పోస్టులు, చెక్పాయింట్లలో ప్రైవేటు వ్యక్తులే వ సూళ్ల బాధ్యతలు చూసుకుంటారు. వాళ్లే లెక్కలు క ట్టి అధికారులకు అప్పగిస్తారు. ఇదంతా బహిరంగ రహస్యం. అయితే ఏసీబీ అధికారులు అప్పుడప్పు డు దాడులు చేయడం, వాళ్ల ఎదుటే సరుకు రవాణాకు సంబంధించిన వాహనదారులు డబ్బులు తీసుకువచ్చి అక్కడ ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేసి వెళ్లడం సర్వ సాధారణమైంది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కామారెడ్డి జిల్లాలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై భిక్కనూరు మండలం పొందుర్తి వద్ద ఉన్న చెక్పాయింట్పై, అలాగే 161వ నెంబర్ జాతీయ రహదారిపై మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్ట్పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారుల ఎదుటే వాహనదారులు డబ్బులు తెచ్చి బాక్సుల్లో వేసి వెళ్లారు. భిక్కనూరు మండలం పొందుర్తి వద్ద చెక్పాయింట్లో రూ.51,300 అలాగే మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద చెక్పోస్టులో రూ.36 వేల నగదును సీజ్ చేశారు. చెక్ పోస్టుల వద్ద డ్రైవర్లు డబ్బులు వేసేందుకు బాక్సుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులతో దర్జాగా వసూళ్లు మారని రవాణా శాఖ తీరు మరోసారి దాడులు చేసిన ఏసీబీ -
దాడులు తెలియక.. యథావిధిగా..
మద్నూర్(జుక్కల్): మద్నూర్ మండలం సలాబత్పూర్ వద్ద ఉన్న ఆర్టీవో చెక్పోస్ట్పై శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే, ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నా.. ఆ విషయం తెలియని లారీ డ్రైవర్లు చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన డబ్బాలో యథావిధిగా డబ్బులు వేస్తూ కనిపించారు. ఆ డబ్బులను ఓ ప్రయివేటు వ్యక్తి ఎప్పటికప్పుడు తీసుకెళ్లడాన్ని ఏసీబీ అధికారులు గమనించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపారు. చెక్పోస్ట్లలో అవినీతి జరుగుతున్నట్లు తమ దృష్టికి రావడంతో ప్రభుత్వానికి నివేదించామని, దీంతో త్వరలో అన్ని చెక్పోస్ట్లను ఎత్తివేయనున్నట్లు పేర్కొన్నారు. ఇకపై చెక్పోస్ట్లలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక యాప్ తయారు చేసి ఆ యాప్పై లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిపారు. -
కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గ్రామాల్లో వరికోతలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభం కాలేదు. గత 15 రోజుల క్రితమే కలెక్టర్ ఆదేశాలతో అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ప్రారంభించారు.కేంద్రాల్లో ఇప్పటికి వరకు కాంటాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో లేవు.మండలంలో 21,200 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. మండల పరిధిలో మొత్తం 37 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కానుండగా, అందులో 25 ఐకేపీ ఆధ్వర్యంలో, 12 కేంద్రాలు గాంధారి, ముదెల్లి సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా అందుకు తగిన ఏర్పాట్లు ఇప్పటికీ చేయలేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి మద్దతు ధర క్వింటాల్కు రూ.2,389 ఉండగా, రైస్ మిల్లు వ్యాపారులు పచ్చి ధాన్యాన్ని క్వింటాల్కు రూ. 1800–1850 కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. అధికారులు తొందరగా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. అధికారుల ఆదేశాల మేరకు గత 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము. వరి కోతలు ఇప్పుడే ప్రారంభం అయ్యాయి. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించి ఆరబెట్టే వరకు కేంద్రాల్లో కాంటాలు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంటాయి. రైతులు తొందర పడి పచ్చి ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించి నష్టపోవద్దు. – ఏవో రాజలింగం, గాంధారి వాతావరణ పరిస్థితులకు భయపడి పచ్చి వడ్లను రైస్ మిల్లు వ్యాపారికి విక్రయించాను. అధికారులు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ కేంద్రంలో కాంటాలు, గన్నీ బ్యాగులు లేవు. ధాన్యం ఆరబోసినా తేమ శాతం వచ్చిన తరువాత వర్షం పడితే మళ్లీ తడిసిపోయి నష్టం జరిగే అవకాశం ఉంది. అందుకే కొంత మేర నష్టం జరిగినా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో పచ్చి ధాన్యం విక్రయించాను. – నాగ్లూర్ గంగాధర్ రైతు, గాంధారి గాంధారి మండలంలో అధికారికంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం మొదలైన వరికోతలు పచ్చి ధాన్యాన్ని నేరుగా రైస్మిల్లు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు -
రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందిస్తాం
● డీసీసీ అధ్యక్ష పదవి కోసం 30 దరఖాస్తులు ● ఏఐసీసీ పరిశీలకుడు రాజ్పాల్ కరోలకామారెడ్డి టౌన్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం 30 దరఖాస్తులు అందాయని, ప్రతి ఒక్కరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందిస్తామని ఏఐసీసీ పరిశీలకుడు రాజ్పాల్ కరోల అన్నారు. డీసీసీ అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకున్న 30 మంది నాయకులతో శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో రాజ్పాల్ సమావేశమయ్యారు. ఒక్కోక్కరితో ప్రత్యేకంగా సుదీర్ఘంగా చర్చించి అభిప్రాయాలు సేకరించామని, వారి అభిప్రాయాలు, సలహాలను ఆన్లైన్లో నమోదు చేశామని ఆయన తెలిపారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఉత్కంఠ.. డీసీసీ పదవికి నాయకుల నుంచి పోటీ బాగానే ఉంది. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి నాయకులు డీసీసీ పదవిని ఆశిస్తున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన కరోల నాలుగు నియోజకవర్గాల్లో నాయకుల అభిప్రాయాలను సేకరించారు. జిల్లా అధ్యక్ష పదవి ఎవరిని వరించెనో అని ఉత్కంఠ నెలకొంది. -
స్కూటీని ఢీకొన్న లారీ
● రిటైర్డ్ వీఆర్వో దుర్మరణం కామారెడ్డి క్రైం: అదుపుతప్పిన లారీ స్కూటీని ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని పోలీస్స్టేషన్ ఎదురుగా శనివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీకి చెందిన రిటైర్డ్ వీఆర్వో జనార్దన్ రావు వ్యక్తిగత పనుల మీద స్కూటీపై వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ అదుపుతప్పి స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో జనార్దన్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికులు ఆయనను జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇసాయిపేటకు చెందిన ఆయన కొంతకాలంగా కుటుంబంతో కలిసి కామారెడ్డిలోని ఎన్జీవోస్ కాలనీలో స్థిరపడ్డారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన బ్యాగరి రాజయ్య(52) చేపలవేటకు వెళ్లి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. గ్రామశివారులోని పెద్దవాగు మడుగులో శనివారం విద్యుత్ తీగల సహాయంతో చేపలను పట్టేందుకు స్టార్టర్ బాక్సులోని ఫ్యూజ్కు వైరు పెట్టి నీటిలో దిగుతున్న క్రమంలో షాక్ తగిలి రాజయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి మృతుడి సోదరి లక్ష్మికి సమాచారం ఇచ్చారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజివాడి గ్రామ శివారులోని స్ప్రింగ్ ఫీల్డ్స్ స్కూల్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన కామెల్లి అరవింద్ స్వామి(29) సదాశివనగర్ మండల కేంద్రంలోని అత్తగారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలను చూసి తిరిగి ద్విచక్ర వాహనంపై గాంధారికి వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేసి వెళ్తూ ఎదురుగా వస్తున్న హైచర్ వ్యాన్ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన స్వామిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. చికిత్స పొందుతూ మాజీ ఎంపీటీసీ.. ఇందల్వాయి: మండలంలోని తిర్మన్పల్లి మాజీ ఎంపీటీసీ జంగిడి లక్ష్మి(61) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. 15 రోజుల క్రితం లక్ష్మి పురుగుల మందు సేవించింది. విషయం తెలిసిన ఆమె చెల్లెలు వెంటనే అక్కను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి శనివారం మృతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలైన జంగిడి లక్ష్మి మృతి పార్టీకి తీరని లోటని మండల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. -
పైన పటారం.. లోన లొటారం
గంజీ వేస్తేనే ఖద్దరు అంగీకి ఖదర్ ఎక్కువ. ఖద్దరు బట్టలు తొడిగితేనే లీడర్కు గుర్తింపు. జేబులో రూపాయి ఉన్నా లేకున్నా మెయింటెనెన్స్ చేయాల్సిందే. అంగీకి గంజీ వేసి, ఇసీ్త్ర చేయాలంటే కనీసం రూ.100 నుంచి రూ.150 అవుతుంది. అందుకే చోటామోటా లీడర్లు ఖద్దరు బట్టలను జాగ్రత్తగా చూసుకుంటారనే కన్నా కాపాడుకుంటారని అనాలి. కొందరైతే ఖద్దరు అంగీ చిరిగిపోయినా సరే కుట్లేయించుకుని మరీ వాడుకుంటారు. చాలా మంది గంజీ వేసి, ఇసీ్త్ర చేసిన అంగినీ కనీసం నాలుగు రోజులైనా ధరించాల్సిందే. లేదంటా వాటిని మెయింటేన్ చేయడానికి రూ.వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఖద్దరు బట్టలు వేసుకున్నపుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో వారిని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. రాజకీయాలు ఖరీదైపోయాయి. గ్రామ, మండల స్థాయిలో అయితే లీడర్గా మనగలగాలంటే నలుగురు అనుచరులను మెయింటేన్ చేయాలి. ఉన్నంతలో చిన్నదో పెద్దదో కారు ఉండాలి. ఎవరో ఒకరి పని కోసం గ్రామం నుంచి మండల కేంద్రానికో, నియోజకవర్గ కేంద్రానికో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కారులో సరిపడా ఇంధనం ఉండాలి. గ్రామ స్థాయి నాయకుడు కనీసం నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కొందరైతే రూ.50 వేల దాకా ఖర్చు చేస్తుంటారు. డబ్బు ఉన్నవాడు ఎలాగోలా నెట్టుకొస్తాడు. కానీ పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన లీడర్లు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. ఫంక్షన్కు వెళ్లి తినకుండానే.. రాజకీయాల్లో ఉన్నపుడు ఎవరు పిలిచినా ఫంక్షన్లు, పెళ్లిళ్లకు వెళ్లాల్సిందే. ఒక్కడే వెళ్తే బాగోదు కాబట్టి వెంట నలుగురిని వేసుకుని వెళ్లాలి. కొందరు లీడర్లు ఇంటి నుంచి బయటకు వెళ్లేటపుడు సాధారణ బట్టలు ధరిస్తారు. ఫంక్షన్కు చేరే ముందు ఎక్కడో ఒక చోట ఆగి ఖద్దరు అంగీలు తొడుక్కుని వెళుతుంటారు. ఖద్దరు బట్టలు ధరించకుంటే లీడర్గా గుర్తించరనే భావన చాలా మందిలో ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఖద్దరు అంగీ తొడుక్కుంటారు. ఫంక్షన్కు వెళ్లిన వారిలో చాలా మంది ఈ మధ్య కాలంలో భోజనం చేయడం లేదు. వేరే ఫంక్షన్లో తిన్నామనో, వేరే దగ్గరికి వెళ్లాల్సి ఉందనో చెప్పి బయటపడుతున్నారు. తినకపోవడం వెనుక పెద్ద కారణమే ఉందని పలువురి మాటల్లో తెలుస్తోంది. ఫంక్షన్లో తినే సమయంలో షర్ట్ నలిగిపోతుంది. చెమటతో గంజీ (స్టార్చ్) పవర్ పోతుంది. అంతేగాక ఏదైనా ఆహార పదార్థం పడితే బట్టలకు మరకలవుతాయి. రూ.వేలు ఖర్చు చేసి కుట్టించుకుని, దాన్ని మెయింటెనెన్స్ కోసం రూ.వందలు ఖర్చు చేసి అనవసరంగా మరకలు అంటించుకుంటే, అవి పోయే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో చాలా మంది తినడం లేదని తెలుస్తోంది. కొందరు తప్పనిసరి తినాల్సి ఉంటే జాగ్రత్తగా తిని బయటపడుతున్నారు. కొన్ని చోట్ల మందు దావత్ ఉంటే కూడా త్యాగం చేస్తున్నారు. బట్టలు దెబ్బతింటే ఇబ్బంది అవుతుందని జాగ్రత్త పడుతున్నారు.చాలా మంది చోటా, మోటా లీడర్లను కదిలిస్తే చాలు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి తమదంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు. ఓ మారుమూల గ్రామంలో సర్పంచ్గా పనిచేసిన యువకుడొకరు ఊరి అభివృద్ధి కోసం ఎంతో శ్రమించాడు. ఉత్తమ పంచాయతీగా గుర్తింపు తీసుకువచ్చాడు. కానీ తాను చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. బిల్లులు రాక, అప్పులు తీర్చే మార్గం కానరాక తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన రెండెకరాల భూమిని అమ్ముకుని అప్పులు కట్టాడు. మూడేళ్లు గడచినా మూడు రూపాయలు రాలేదని సదరు మాజీ సర్పంచ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇలా ఎవరిని కదిలించినా కన్నీళ్లు రాలుతున్నాయి. ఖద్దరు వేసుకున్నోళ్లంతా ఉన్నోళ్లు కాదని, ఖద్దరు వెనుక కన్నీటి వేదన ఎంతో ఉందని ఈ ఘటన స్పస్టం చేస్తోంది.రాజకీయాల్లో చాలా మంది ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. కొందరు డాబు ప్రదర్శించేందుకు స్థాయికి మించి ఖర్చులు చేసి అప్పులపాలవుతున్నారు. సులువుగా డబ్బులు సంపాదించొచ్చు అన్న భావనతో చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి నిండా మునిగారు. గ్రామాల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలు, జెడ్పీటీసీలుగా పనిచేసిన ఎంతో మంది అప్పులపాలయ్యారు. ఎన్నికలు అంటేనే ఖర్చుతో కూడుకున్నవి కావడంతో చాలా మంది అప్పులు చేసి పోటీ చేయడం, తరువాత సంపాదన ఏమో గానీ, మెయింటెనెన్స్ చేసేందుకు అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. ఖర్చుల మందమైనా సంపాదించాలన్న ఆశతో కొందరు కాంట్రాక్టు పనులు చేసి బిల్లులు రాక చిత్తయ్యారు. ముఖ్యంగా మొన్నటి వరకు సర్పంచులుగా పనిచేసిన వారిలో వందలాది మంది అప్పుల్లో కూరుకుపోయారు. కొందరైతే అప్పులు తీర్చేందుకు ఆస్తులు కూడా అమ్ముకున్నారు. పెద్ద పంచాయతీలు, నిర్మాణాలు ఎక్కువగా జరిగే చోట అంతో ఇంతో ఖర్చులకు సంపాదించారు గానీ, చాలా గ్రామాల్లో సర్పంచులు అప్పులపాలయ్యారు. ఇప్పటికీ కోలుకోవడం లేదు. పైన పటారం.. లోన లొటారం అన్నట్టుగా ఉంది పరిస్థితి. -
‘సాక్షి’పై కూటమి కుట్రలు
కామారెడ్డి టౌన్: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షర యజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభు త్వం చేస్తున్న కుట్రలు చేస్తోందని ప్రజా, ఉ పాధ్యాయ, జర్నలిస్టు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. హైదరాబాద్లోని సా క్షి దినపత్రిక ప్రధాన కార్యాలయంపై దాడు లు అలాగే ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు వంటిచర్యలను మానుకోవాలని అ న్ని వర్గాలు ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై దాడి చేయడం హేయమైన చర్య. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా చేయడం దారుణం. ఏపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు. సాక్షిపై కక్ష సాధింపులను మానుకోవాలి. – ఎల్ దశరథ్, సీపీఐ జిల్లా కార్యదర్శిమీడియా జోలికి వస్తే ఊరుకునేది లేదు. ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. రాజకీయంగా ఏదైనా ఉంటే కోర్టులు, చట్టాలు ఉ న్నాయి. న్యాయపరంగా పోరాడాలి. సాక్షిపై దాడులు చేయడం, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం సరికాదు. – ముదాం శంకర్, టీయూడబ్ల్యూజే, జిల్లా ఉపాధ్యక్షుడుపత్రికా స్వేచ్ఛను హరించే చర్యలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే. ఆంధ్రప్రదేశ్లో సాక్షిపై కక్ష సాధింపులు మానుకుని చట్టప్రకారం ముందుకెళ్లాలి. ప్రజా సమస్యలను కథనాల రూపంలో రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు. – కొంగల వెంకటి, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడుసాక్షి మీడియాపై రాజకీయ కక్షతోనే దాడులు చేయడం సరికాదు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై అక్రమ కేసులు బకాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావిస్తున్నాం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం కుట్రలు మానుకోవాలి. – సీహెచ్ అనిల్కుమార్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు దాడులు, అక్రమ కేసులు బనాయించడం దారుణం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలి పత్రికాస్వేచ్ఛను కాపాడాలి -
సోయా.. కొనే సోయి లేదా?
మద్నూర్(జుక్కల్): చేతికొచ్చిన సోయాను ఆరబోస్తూ రాశులు చేస్తున్న రైతులు కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని ఎదురు చూస్తున్నారు. పండగ పూట చేతిలో చిల్లిగవ్వలేక సతమతమవుతున్నారు. గత పదిహేను రోజులుగా సోయా కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో సోయాబీన్ 80 వేల ఎకరాల్లో సాగు కాగా, అందులో 35 వేల ఎకరాల సాగు విస్తీర్ణం మద్నూర్, డోంగ్లీ మండలాల పరిధిలో ఉంది. మద్నూర్, డోంగ్లీ, బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఎక్కువ శాతం రైతులు సోయా పంట పండించారని వ్యవసాయ అధికారులు చెప్పారు. ఈ సారి పంట కోతల సమయంలో భారీ వర్షాలు కురవడంతో సోయా దెబ్బతిన్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా, ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్లకు పడిపోయిందని, ఖర్చులు బాగా పెరిగాయని రైతులు అంటున్నారు. కేవలం కల్లానికి ఎకరాకు రూ.5 వేల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆగమవుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్కు రూ.5320 కాగా, బహిరంగ మార్కెట్లో వ్యాపారులు కేవలం రూ.3,800 నుంచి రూ.4,200 చెల్లిస్తున్నారు. అంతే కాకుండా హడత్, హామాలీ పేరుతో రూ.వెయ్యి వరకు కట్ చేస్తున్నారు. ఈ ఏడాది డోంగ్లీలో సైతం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మండల రైతులు కోరుతున్నారు. మద్నూర్ వరకు తీసుకువెళ్లాలంటే రవాణా ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని అంటున్నారు.నిజాంసాగర్(జుక్కల్): ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం సోయా కొనుగోళ్లు చేపట్టి రైతులకు మద్దతు ధర అందేలా తగు చర్యలు తీసుకుంటున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలిపారు. సోయా కొనుగోళ్ల అంశంపై మార్కెఫెడ్ చైర్మన్ గంగారెడ్డితో శనివారం ఫోన్లో మాట్లాడినట్లు ఎమ్మెల్యే సాక్షికి తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలో సోయా పంట ఆశాజనకంగా ఉందని, పంట కొనుగోళ్లను సత్వరమే ప్రారంభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వారం రోజుల్లో సోయా కొనుగోళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించొద్దని రైతులకు ఎమ్మెల్యే సూచించారు.కొనుగోలు కేంద్రం ప్రా రంభం కాకపోవడంతో బహి రంగ మార్కెట్లో రూ.4వేలకు చొప్పున 6 క్వింటాళ్ల సోయాను అమ్మేశా. పండగపూట చేతిలో చిల్లిగ వ్వ లేకపోవడం, అప్పుల వాళ్లు డబ్బులు కట్టాలనడంతో మరోదారి లేక అమ్మేశా. – శివన్న, రైతు, మద్నూర్ పంట చేతికొచ్చి పదిహేను రోజులు.. ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు రోడ్లపై పంట దిగుబడి రాశులు పండగ పూట చేతిలో చిల్లిగవ్వ లేక రైతుల సతమతం తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు విక్రయం -
ధ్రువపత్రాల భద్రతకు ‘డిజిలాకర్’
మీ కోసం.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రయాణాలు ఇతర సందర్భాల్లో చాలా మంది ఉత్తీర్ణత, ఇతర విలువైన ధ్రువపత్రాలను మరిచిపోతున్నారు. ఒక్కోసారి పోగొట్టుకున్న పత్రాలను తిరిగి పొందడం కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితిని అధిగమిస్తూ ఎలాంటి ధ్రువపత్రాలనైనా భద్రంగా దాచుకునేలా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే డిజిలాకర్. ● కాగిత రహిత పాలనను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రారంభించిన ఈ డిజిలాకర్ను విద్యార్థులు, నిరుద్యోగులే కాకుండా ప్రతి ఒక్కరూ విలువైన పత్రాలను దా చుకునేందుకు బ్యాంక్ లాకర్గా పనిచేస్తోంది. ● డిజిటల్ విధానంలో దాచుకున్న పత్రాలను ఎక్కడైనా, ఏ సమయంలోనైనా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు. ● ఇవి వాస్తవ ధ్రువీకరణ పత్రాల మాదిరే చట్టపరంగానూ చెల్లుబాటు అవుతాయి. ● లాకర్ సహాయంతో పంపించే ఈ పత్రాలను వాటి క్యూఆర్ కోడ్ లేదా డిజిటల్ సంతకాలతో నిర్ధారణ జరుగుతుంది. ● డిజిలాకర్ ఖాతాకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ● ఆధార్ కార్డు, దానితో అనుసంధానమైన ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ● అనంతరం ఓటీపీతో లాగిన్ అయితే మన ఆధార్పై లాకర్ తెరుచుకుంటుంది. ● డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్, ఓటరు ఐడీ, పాన్కార్డు, పాస్పోర్టు, జనన ధ్రు వపత్రాలు, విద్యార్హత ఇలా అన్ని రకాల పత్రా లను స్కాన్ చేసుకొని భద్రపరుచుకోవచ్చు. ● ఒక్కొక్కరూ ఒక జీబీ వరకు డాటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. -
అధికారిక లాంఛనాలతో కానిస్టేబుల్ అంత్యక్రియలు
● నివాళులు అర్పించిన ఐజీ, సీపీ ● నిందితుడి కోసం ఎనిమిది పోలీసు బృందాల గాంలిపునిజామాబాద్అర్బన్: సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ను పట్టుకునేందుకు ఎనిమిది పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. శుక్రవారం బాబన్సాబ్ పహాడ్ వద్ద కెనల్ కట్ట ప్రాంతంలో రియాజ్ను పట్టుకునేందుకు కాని స్టేబుల్ ప్రయత్నం చేశాడు. కెనాల్ కాల్వ గుండా పారిపోతున్న రియాజ్ను వెంబడించి పట్టుకున్నాడు. అనంతరం తన బైక్పై సీసీఎస్ ఎస్సై విఠల్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి బైౖక్పై తీసుకువస్తున్నారు. ఈ సందర్భంలోనే రియాజ్ కానిస్టేబుల్ను పొడిచి హత్య చేశారు. నిందితుడు రియాజ్ సెల్ఫోన్ వదిలేసి మరో బైక్ను దొంగిలించి పారిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలు గాలిస్తున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు నగరంలోనే ఉన్నట్లు పోలీసులకు సమాచారం. కొన్ని బృందాలు పట్టణంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మరికొన్ని బృందాలు రియాజ్ తరచుగా వెళ్లే ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని సీపీ సాయి చైతన్య అన్నారు. అంత్యక్రియలో పాల్గొన్న ఐజీ, సీపీ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలు నగరంలో శనివారం అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. స్థానిక రైల్వే కమాన్ ప్రాంతంలోని బ్యాంకు కాలనీలోని ఆయన నివాసం నుంచి శవ యాత్ర ప్రారంభమైంది. ఈ అంత్యక్రియలకు మల్టీజోన్– 1 నార్త్ తెలంగాణ ఐజీ చంద్రశేఖర్రెడ్డి, సీపీ సాయి చైత న్య, పోలీస్ అధికారులు హాజరయ్యారు. ప్రమోద్ కుటుంబానికి అండగా ఉంటామని సీపీ పేర్కొన్నారు. ప్రమోద్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. శవ యాత్రలో పాడె మోశారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిందితుడు రియాజున్ త్వరలోనే పట్టుకుంటామన్నారు. శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించబోమన్నారు. -
బీసీ బంద్ సక్సెస్
కామారెడ్డి టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ శనివారం జిల్లాలో సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదుట శనివారం తెల్లవారుజామున జేఏసీ నాయకులు బైఠాయించి బస్సులు బయటికి రాకుండా ధర్నా చేశారు. అనంతరం పట్టణంలో బైక్ ర్యాలీ, నిజాంసాగర్ చౌరస్తాలో మానవహారం చేపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఈ బంద్లో చాంబర్ ఆఫ్ కామర్స్, వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు పాల్గొన్నాయి. బంద్తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే సుభాష్, జేపీఎన్, మాయా, సిరిసిల్లా, స్టేషన్ రోడ్లు, నిజాంసాగర్ చౌరస్తా, కొత్తబస్టాండ్ ఏరియాలో బోసిపోయాయి. బస్సులు డిపో, బస్టాండ్లకు పరిమితమయ్యాయి. బంద్లో బీసీ కుల సంఘాల జేఏసీ నాయకులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ నాయకులతోపాటు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.కదలని ఆర్టీసీ బస్సు చక్రాలు బంద్లో పాల్గొన్న వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు నిర్మానుష్యంగా మారిన రోడ్లు 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం జేఏసీ డిమాండ్ -
182 సార్లు కాశీ యాత్ర...2 సార్లు చార్ధామ్ యాత్ర
● 2002 నుంచి పర్యటిస్తున్న కామారెడ్డి వాసి కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లికి చెందిన నీలం వెంకటి ఇప్పటికి 182 సార్లు కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. కాశీలో ఒక్కోసారి వారం రోజుల పాటు ఉండి గంగస్నానం చేశారు. దేవునిపల్లి శివాలయంలో 2002లో శివదీక్షలు ప్రారంభించినపుడు అర్చకులు మశ్చేందర్ప్రసాద్ దేశ్పాండేతో కలిసి దీక్ష పరులందరితో కలిసి కాశీ వెళ్లినట్టు వెంకటి వివరించారు. అర్చకులు మశ్చేందర్ప్రసాద్ ఇప్పటికి 108 సార్లు కాశీకి భక్తులను తీసుకుపోయి గంగాతీరంలో పశుపత రుద్రయాగాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివమాల ధరించడం, డ్రైవింగ్ బాగా రావడం, కామారెడ్డి నుంచి కాశీ, అయోధ్య వరకు అన్ని దగ్గరి దారులు తెలియడంతో పాటు కాశీలో పలువురితో పరిచయాలు ఉండడంతో కాశీలో తక్కువ వ్యయంతో బస చేయడానికి ఇబ్బందులు పడకుండా ఇక్కడి భక్త బృందాలు వెంకటిని వెంట తీసుకుపోతున్నారు. అలాగే 13 శక్తిపీఠాలు దర్శించడంతో పాటు తిరుమల వేంకటేశ్వరుడిని 100 సార్లు దర్శించుకున్నట్టు, అనేక సార్లు రామేశ్వరం, సోమనాథ్, రెండు సార్లు చార్ధామ్ యాత్ర చేశారు. తనకు శక్తి ఉన్నంత వరకు కాశీయాత్ర చేస్తూనే ఉంటానని నీలం వెంకటి వెల్లడించారు. -
వైన్ షాపులకు 1400కు పైగా దరఖాస్తులు
● ముగిసిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ● గణనీయంగా తగ్గిన పోటీ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాలకు దరఖాస్తుల దాఖలు గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. జిల్లాలోని 49 వైన్ షాపులకు 1400కు పైగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం అర్ధరాత్రి వరకు సంబంధిత అధికారులు దరఖాస్తులను పరిశీ లిస్తున్నారు. రెండేళ్ల కిందట 49 దుకాణాలకు 2,204 దరఖాస్తులు రాగా.. ఈ సారి తగ్గాయి. గతంలో దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉండగా, ఈ సారి రూ.3 లక్షలకు పెంచారు. దీంతో దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందని భావిస్తున్నారు. సర్కిళ్ల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసిన అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.బాన్సువాడ రూరల్/కామారెడ్డి రూరల్: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సందర్శన కోసం జిల్లాలో పదో తరగతి అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. బాన్సువాడ మండలం కోనాపూర్ జెడ్పీహైస్కూల్కు చెందిన విద్యార్థిని జి శైలజ, కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నిఖిల, రవిత్రేణి ఎంపికై నట్లు హెచ్ఎంలు శంకర్, సాయిరెడ్డి తెలిపా రు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన సైన్స్ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు త్వరలోనే ఇస్రో సందర్శనకు వెళ్తారన్నారు. శైలజను ఉపాధ్యాయులు, గ్రామస్తులు శనివారం అభినందించారు. ఉపాధ్యాయులు అంజయ్య, నబీ, రమేశ్, ప్రేమ్సింగ్, నర్సింగ్రావు, స్నేహలత, సుజాత, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చిన్నమల్లారెడ్డి పాఠశాల హెచ్ఎం సాయిరెడ్డి మాట్లాడుతూ.. భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు, గైడ్ టీచర్ ప్రవీణ్కుమార్ మార్గదర్శకత్వంలో తమ పాఠశాల విద్యార్థులు ఇస్రో సందర్శనకు ఎంపికయ్యారని అభినందించారు. కామారెడ్డి అర్బన్: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈనెల 22వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం రజినీకిరణ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరుణ్ మోటార్స్లో ఉద్యోగాల భర్తీ కోసం బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్లోని 121 నంబర్ గదిలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొ న్నారు. ఎంపికై న వారు నిజామాబాద్లో పనిచేయాల్సి ఉంటుందని, వివరాలకు 98854 53222, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి క్రైం: రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుమోహన్ అన్నారు. మత్య్సశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదా నం ప్రాణదానంతో సమానమన్నారు. అత్యవసర పరిస్థితుల్లో అవసరం ఉన్నవారికి రక్తం అందించడానికి జిల్లాలో విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రక్తదా నం చేసేందుకు ముందుకు వచ్చిన వారిని అ భినందించారు. శిబిరంలో భాగంగా మత్య్స శాఖ అధికారులు, సిబ్బంది, మత్య్సపారిశ్రామిక సహకార సంఘాల ప్రతినిధులు మొత్తం 40 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. కా ర్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా అధికారి శ్రీప తి, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, వైస్ చైర్మన్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు సహకరించాలి
కామారెడ్డి క్రైం: రైతులకు మద్దతు ధర వచ్చేలా వరి కోతల సమయంలో హార్వెస్టర్ల యజమానులు నాణ్య తా ప్రమాణాలు పాటించాలని జిల్లా వ్యవసాయ అ ధికారి మోహన్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని నరసన్నపల్లి వద్దనున్న రవాణా శాఖ కార్యాలయంలో జిల్లాలోని హార్వెస్టర్ల యజమానులు, డ్రైవర్లకు శనివారం అవగాహన సదస్సు నిర్వ హించారు. ఈ సందర్భంగా డీఏవో మాట్లాడుతూ.. ఖరీఫ్లో 3.18 లక్షల ఎకరాల్లో వరిసాగు అ య్యిందని, ఈ సమయంలో రైతులకు వ్యవసాయ కూలీలు, హార్వెస్టర్ వాహనదారుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. పంట కోతల సమయంలో అధికారుల సూచనలను పాటించాలన్నారు. డీటీవో శ్రీనివాస్రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మధుమోహన్, ఎంవీఐ శ్రీనివాస్, ఏడీఏ ప్రసన్న, అధికారులు, సిబ్బంది, హార్వెస్టర్ల యజమానులు, డ్రైవర్లు పాల్గొన్నారు. నిజామాబాద్అర్బన్: రెవెన్యూ శాఖలో పలువురు ఉద్యోగులను కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి డిప్యుటేషన్పై బదిలీ చేశారు. ఇటీవల రేషన్కార్డుల జారీలో అనేక అక్రమాలు జరిగినట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ జిల్లా అధికారులకు నివేదించారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఆయా మండలాల్లో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించారు. అయి తే, వారిపై సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉండగా, బది లీలతో సరిపెట్టడం చర్చనీయాంశంగా మారింది. రెంజల్ తహసీల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ గౌతంను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి, బోధన్ తహసీల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ సుమంత్ను జిల్లా కేంద్రంలోని టీజీఎస్సీఎస్సీఎల్కు, ఇందల్వాయి ఆర్ఐ దండి మోహన్ను టీజీఎస్సీఎస్సీఎల్కు, సిరికొండ ఆర్ఐ గంగరాజంను నిజామాబాద్ సౌత్ మండలానికి, ధర్పల్లి ఆర్ఐ రవిని ఎడపల్లికి, నిజామాబాద్ సౌత్ మండల ఆర్ఐ నవాజ్ను బోధన్ తహసీల్ కార్యాలయానికి డిప్యుటేషన్పై పంపించారు. -
రెండేళ్లకు చిక్కాడు..
తాండూరు: హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని రెండేళ్ల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. వివరాలను డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సీఐ నగేశ్ శనివారం విలేకరులకు వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం మన్సన్పల్లికి చెందిన ముడావత్ రవి(39) వ్యవసాయ పనులు చేస్తూ జీవించేవాడు. గ్రామ శివారులోని ఓ ఫామ్హౌస్లో పనిచేసే కామారెడ్డి జిల్లా మద్నూర్కు చెందిన బాలయ్య అలియాస్ బాలాజీతో ఇతనికి స్నేహం కుదిరింది. ఈ క్రమంలో పలుమార్లు మద్యం తాగేందుకు రవి వద్ద బాలాజీ రూ.2,050 అప్పుగా తీసుకున్నాడు. నెలలు గడుస్తున్నా తిరిగి డబ్బులు ఇవ్వకపోవడంతో పలుమార్లు అడగగా, రవి తన పరువు తీస్తున్నాడని కక్షపెంచుకున్న బాలాజీ 2023 ఆగస్టు 12న మద్యం తాగుదామంటూ తాను పనిచేసే ఫామ్హౌస్ వద్దకు పిలిచాడు. అనంతరం పథకం ప్రకారం కత్తితో పొడిచి పారిపోయాడు. ఆస్పత్రి పాలైన బాధితుడు చికిత్స పొందుతూ ఆరు రోజుల తర్వాత మరణించాడు. దీంతో నిందితుడైన బాలాజీపై హత్య, అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. నాటి నుంచి హంతకుడి కోసం పోలీసులు వెతుకుతున్నా ఆచూకీ లభించలేదు. ఇటీవల మృతి చెందిన తన తల్లి అంత్యక్రియలకు సైతం రాలేదు. కొన్నాళ్లుగా అతని కుటుంబసభ్యుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు, కాల్డాటా ఆధారంగా నిందితుడు సిద్దిపేటలోని తన సోదరుడు సంజీవ్ ఇంట్లో ఉన్నట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. హత్య అనంతరం చాలారోజులు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వీసాపూర్లో తలదాచుకున్నాడని విచారణలో వెల్లడైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు. కేసులో కీలకంగా పనిచేసిన పోలీసులు అంజాద్, శివకుమార్, మున్నయ్యను అభినందిస్తూ డీఎస్పీ రివార్డులు అందజేశారు. హంతకుడు మద్నూర్వాసి సిద్దిపేటలో అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలింపు -
సాదాసీదాగా ప్రజావేదిక
మాచారెడ్డి: ఉపాధి హామీ పనులకు సంబంధించిన ప్రజావేదిక శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అడిషనల్ డీఆర్డీవో వామన్ రావు ఆధ్వర్యంలో సాదాసీదాగా కొనసాగింది. ఉమ్మడి మాచారెడ్డి మండలంలోని ఆయా గ్రామాల్లో 1 ఏప్రిల్ 2024 నుంచి 31మార్చి 2025 వరకు జరిగిన పనులకు సంబంధించి ఈ నెల 10 నుంచి 17వరకు సామాజిక తనిఖీ సిబ్బంది చేపట్టిన వివరాలను ప్రజావేదికలో వెల్లడించారు. చిన్న చిన్న సాంకేతిక లోపాలు మినహా పనులన్నీ సవ్యంగా సాగినట్లు సిబ్బంది వివరించారు. ఏడాది కాలంలో మొత్తం 730 పనులకు గానూ రూ 20.10 కోట్లు వ్యయమైనట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో గోపిబాబు, ఎంపీవో తిరుపతిరెడ్డి, ఏపీవో ప్రశాంత్, శ్రీనివాస్ ఉన్నారు. ప్రజాప్రతినిధులు లేని ప్రజావేదిక.. ఎప్పుడైనా ఉపాధిహామీ సామాజిక తనిఖీ ప్రజావేదికలకు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో అధికారులే తమ సిబ్బందితో సామాజిక తనిఖీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు. ఉమ్మడి మాచారెడ్డి మండలంలో 730 పనులకు గానూ రూ.20.10కోట్ల వ్యయం -
చిన్న నిర్లక్ష్యం.. భారీ మూల్యం
● ధాన్యం నూర్పిళ్లు, ఆరబోతలతో రోడ్డు ప్రమాదాలు ● గత అక్టోబర్లో జరిగిన ప్రమాదాల్లో 27 మంది మృతి ● అందులో ధాన్యం ఆరబోతలతో జరిగినవే ఎక్కువ ● పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కనిపించని మార్పు కామారెడ్డి క్రైం: ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రోడ్లపై ధాన్యం ఆరబోతలు, నూర్పిళ్ల విషయం కూడా అలాంటిదే. ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు సంబంధించిన విషయం కావడంతో అందరూ సర్దుకుపోతుంటారు. కాకపోతే రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసుశాఖ గుర్తు చేస్తోంది. రోడ్లపై ధాన్యం ఆరబోయడంతో రోడ్డు ప్రమాదాలకు ఆస్కారం ఉంటుందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ విలువైన ప్రాణా లను కాపాడుకోవాలని సూచిస్తున్నారు. గతేడాది జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే పోలీసులు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా మార్పు కనిపించడం లేదు. తాజాగా తాడ్వాయి మండలం చందాపూర్లో ఓ వ్యక్తి బైక్పై వెళ్తూ రోడ్డుపై ఆరబోసిన మక్కల కారణంగా అదుపుతప్పి కిందపడి మృత్యువాత పడ్డాడు. పోలీసుల ప్రత్యేక దృష్టి.. కామారెడ్డి జిల్లాలో ప్రతి సంవత్సరం అక్టోబర్ నాటికి వరి, మొక్కజొన్న, సోయాబీన్, పప్పు దినుసుల కోతలు పూర్తవుతాయి. చాలామంది వాటిని రహదారుల వెంట ఆరబోయడం, నూర్పిళ్లు చేస్తుంటారు. ఈ క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతకాలం క్రితం టేక్రియాల్ వద్ద ఓ రైతు వడ్లను రోడ్డు వెంట ఆరబోసి రాత్రిపూట రోడ్డు దాటే క్రమంలో వాహనం ఢీకొని మృతి చెందాడు. వాహనాలు అదుపుతప్పి పడిపోవడంతో సంభవించిన మరణాలు అనేకం. గత అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది మృతి మృతి చెందగా, అందులో ధాన్యం ఆరబోతల కారణంగా దాదాపు 10 ప్రమాదాలు జరిగినట్లు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అందరి బాధ్యత.. రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆరబోసే విషయంలో వాహనదారులే కాకుండా రైతులు సైతం ప్రమాదాల బారినపడిన ఘటనలు ఉన్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో కుటుంబ పెద్ద దిక్కయిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంటుంది. అందుకే ధాన్యాన్ని రోడ్లపై కాకుండా గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో మాత్రమే ఆరబోయాలని రైతులకు పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణం తీసిన మక్కలు కుప్పను తప్పించబోయి బైక్ అదుపుతప్పి ఒకరు మృతి తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి గ్రామ శివారులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన పైడి చిన్నగంగారెడ్డి(52) బైక్పై తాడ్వాయిలోని చిన్న కూతురు వద్దకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో రోడ్డపై ఉన్న మక్కల కుప్పను తప్పించబోయి అదుపుతప్పి బైక్పై నుంచి కిందపడడంతో గంగారెడ్డి తల, ముక్కుకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. గంగారెడ్డి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గంగారెడ్డి మరణించాడు. మృతుడికి భార్య మల్లవ్వ, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మల్లవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్లపై ధాన్యం నూర్పిళ్లు, ఆర బోయడంతో ఏటా పలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత. జీపీలు, రైతు సమితులు కేటాయించిన స్థలాల్లోనే పంట దిగుబడులను ఆరబోయాలి. విలువైన ప్రాణాలు రక్షించుకోవాలి. – రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి -
ఎస్సారెస్పీలోకి తగ్గిన వరద
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 5,654 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 4 వేలు, సరస్వతి కాలువ ద్వారా 650, లక్ష్మి కాలువ ద్వారా 200, మిషన్ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం సాయంత్రానికి అంతే స్థాయి నీటిమట్టంతో ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందని అధికారులు తెలిపారు. నిజామాబాద్నాగారం: నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు పీడియాట్రిక్ విభాగంలో నాలుగు పీజీ సీట్లు పెంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ శనివారం తెలిపారు. ఇది వరకే మూడు పీజీ సీట్లు వచ్చాయని, తాజాగా నాలుగు పెంచడంతో ఏడు సీట్లకు పెరిగినట్లు వివరించారు. డెర్మటాలజీ విభాగంలో నాలుగు పీజీ సీట్లు నూతనంగా అందుబాటులోకి వచ్చాయన్నారు. వైస్ ప్రిన్సిపాళ్లు జలగం తిరుపతి రావు, డాక్టర్ నాగమోహన్ , డాక్టర్ కిశోర్, హెచ్వోడీలు, ఫ్యాకల్టీ, ఆఫీస్ సూపరింటెండెంట్ నాగరాజు సిబ్బంది, సహకారంతోనే సాధ్యమైందని తెలిపారు. బోధన్టౌన్(బోధన్): బోధన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయ పరిధిలోని 18 మద్యం దుకాణాలకు శనివారం రాత్రి 10 గంటల వరకు 422 దరఖాస్తులు వచ్చినట్లు సీఐ భాస్కర్రావ్ తెలిపారు. ఈ నెల 23న లక్కీడ్రా నిర్వహిస్తామని, డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయని సీఐ వెల్లడించారు. రాజంపేట: మండలంలోని పెద్దాయిపల్లి గ్రామ శివారులోని గుట్ట నుంచి మొరం అక్రమ రవాణా చేస్తున్న పలువురిపై కేసు నమోదు చేసి తొమ్మిది ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై రాజు శనివారం తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక, మొరం రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
స్పెషల్ డ్రైవ్లో 164 సెల్ఫోన్ల రికవరీ
● ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి క్రైం: ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళనకు గురికావొద్దని, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో 164 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. సీఈఐఆర్ విధానంతో సెల్ఫోన్ రికవరీ చేసేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలో 15 రోజుల క్రితం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 164 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,579 సెల్ఫోన్లు, సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,026 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. వాటి విలువ దాదాపు రూ.6.45 కోట్ల వరకు ఉంటుందన్నారు. సెల్ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. ఆలస్యం చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. రికవరీలో ప్రతిభ కనబరిచిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేస్తామని, జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ఎస్సై బాల్రాజు (87126 86114)ను సంప్రదించి ఫోన్లు తీసుకెళ్లాలని సూచించారు. -
జన జీవనమా? అజ్ఞాతమా?
ఆపరేషన్ కగార్తో దండకారణ్యంలో నక్సలైట్ ఉద్యమం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులకు తోడు ఇటీవలి కాలంలో జరుగుతున్న లొంగుబాట్లతో ఆ పార్టీ మరింత దెబ్బతింటోంది. అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఏడుగురు దశాబ్దాల కాలంగా నక్సలైట్ ఉద్యమంలో కొనసాగుతున్నారు. వారంతా ఎక్కడున్నారు? వాళ్లదారి ఎటువైపు అనేదానిపై చర్చ జరుగుతోంది.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్కు పదును పెట్టి దండకారణ్యాన్ని జల్లెడ పడుతోంది. కొంత కాలంగా భద్రతాదళాలు జరుపుతున్న కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు. మరెందరో అరెస్టయ్యారు. లొంగుబాట్లు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెందిన అజ్ఞాత నక్సల్స్ ఎక్కడున్నారు? వాళ్ల దారి ఎటువైపు ? అన్నదాని గురించి చర్చ జరుగుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇస్రోజివాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి బస్తర్లో స్పెషల్ జోనల్ కమిటీ (ఎస్జెడ్సీ) సభ్యుని హోదాలో పనిచేస్తున్నట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయన మూడు దశాబ్దాల కాలంగా విప్లవోద్యమంలో ఉన్నారు. అప్పట్లో నిజామాబాద్ జిల్లా పడ్కల్లో 36 గంటలకు పైగా సాగిన ఎన్కౌంటర్లో స్వామి తప్పించుకున్న తీరు గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. సుదీర్ఘకాలంగా అజ్ఞాతంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో నక్సల్స్ ప్రభావం ఉన్న అన్ని ప్రాంతాల్లో స్వామి సుపరిచితుడు. రెండు దశాబ్దాల కిందట అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తీవ్ర నిర్భంధం విధించడంతో స్వామిని దండకారణ్యానికి పంపించారు. అప్పటి నుంచి ఆయన తిరిగి జిల్లా వైపు రాలేదని చెబుతారు. తండ్రి చనిపోయినా, ఇటీవల తల్లి చనిపోయినా ఇంటి ముఖం చూడలేదు. అయితే స్వామి భార్య లోకేటి సులోచన అలియాస్ నవత కూడా కొంత కాలానికే ఆయన వెంట నడిచింది. దళ కమాండర్గా సౌత్ బస్తర్ ప్రాంతంలో పనిచేస్తుండగా ఏడెనిమిదేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోగా అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దరూ అజ్ఞాతంలో ఉండడంతో పిల్లలిద్దరూ బంధువుల వద్ద ఉండి చదువుకున్నారు. అయితే 2009లో వాళ్లిద్దరూ కూడా అడవిబాట పట్టారు. స్వామి కొడుకు లోకేటి రమేశ్ సౌత్ బస్తర్ కొంటా ఏరియాలో డీసీఎంగా పనిచేస్తునట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయనపై రూ.4 లక్షల రివార్డుంది. అలాగే స్వామి కూతురు శాంతి అలియాస్ లోకేటి లావణ్య కూడా అన్నతో కలిసి అడవిబాట పట్టింది. తల్లిదండ్రులతోపాటు ఇద్దరు పిల్లలు కూడా అజ్ఞాతంలోనే ఉండగా తల్లి సులోచన అనారోగ్యంతో చనిపోయింది. కాగా స్వామి, రమేశ్, లావణ్య ముగ్గురూ వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్నట్టుగా పోలీసు రికార్డులు చెబుతున్నాయి. పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రవి అలియాస్ దినేశ్ అలియాస్ సంతోష్ 2001లో అజ్ఞాతంలోకి వెళ్లినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఆయన దళ కమాండర్ హోదాలో ఉన్నారు. ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ఉంది. సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన వెంకట్రెడ్డి 1999 నుంచి అజ్ఞాతంలో ఉన్నారని, ఆయన ఏ స్థాయిలో పనిచేస్తున్నది మాత్రం పోలీసుల రికార్డుల్లో పేర్కొనలేదు. అతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం లింగాపూర్కు చెందిన ఒకరు, డిచ్పల్లి మండలం ఇందల్వాయికి చెందిన మరొకరు దండకారణ్యంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం.స్వామి అలియాస్ లోకేటి చందర్లోకేటి లావణ్య అలియాస్ శాంతిసంతోష్ అలియాస్ ఎర్రగొల్ల రవిలోకేటి రమేశ్మనోళ్ల దారెటు.. ఉమ్మడి జిల్లా నుంచి అజ్ఞాతంలో ఏడుగురు ఎస్జెడ్సీ మెంబర్ హోదాలో స్వామి వివిధ స్థాయిల్లో పలువురుఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరు ప్రాంతంలో కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామానికి చెందిన మావోయిస్టు నాయకురాలు లోకేటి లావణ్య అలియాస్ శాంతి పోలీసులకు చిక్కినట్టు తెలుస్తోంది. ఏరియా కమిటీ మెంబర్గా పనిచేస్తున్నట్టు పోలీసు రికార్డుల్లో ఉంది. ఆమైపె రూ.4 లక్షల రివార్డు ఉంది. లావణ్య అరెస్టు అయ్యిందా ? లొంగిపోయిందా ? ఎక్కడ ఉన్నది తెలియరాలేదు. అలాగే లోకేటి రమేశ్ తనతో కలిసి పనిచేస్తున్న దళసభ్యురాలిని వివాహమాడినట్టు సమాచారం. రమేశ్ భార్య కూడా ఇటీవల అరెస్టయి జైల్లో ఉన్నట్టు తెలుస్తోంది. -
కేసులు పెండింగ్లో ఉంచొద్దు
● విచారణ త్వరగా పూర్తిచేయాలి ● నెలవారీ సమీక్షలో ఎస్పీ రాజేశ్చంద్రకామారెడ్డి క్రైం: పెండింగ్లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీ రాజేశ్చంద్ర అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కేసుల వివరాలు, చేపడుతున్న విచారణ తదితర విషయాలను స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల పరిష్కారంలో జాప్యం తగదన్నారు. గ్రేవ్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరించడంతోపాటు ప్రతి ఫిర్యాదును వెంటనే పరిష్కరించే దిశగా కృషి చేయాలన్నారు. గ్రామాల వారీగా పోలీసు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలతో సత్సంబంధాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణలో భాగంగా నిత్యం డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలన్నారు. దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో ఎలాంటి అలసత్వం వహించొద్దని ఆదేశించారు.దీపావళి వేడుకలను సురక్షితంగా జరుపుకోవాలని జిల్లా ప్రజలకు ఎస్పీ సూచించారు. టపాకాయలు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. పేకాటపై ప్రత్యేక నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. పేకాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
కూటమి కుట్రలపై.. వెల్లువెత్తిన నిరసన
ప్రజా సమస్యలపై వార్తలు, కథనాలతో ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ మీడియాపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని జర్నలిస్టు, ప్రజా, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. సాక్షితోపాటు ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ కామారెడ్డి, బాన్సువాడ, నిజాంసాగర్లో శుక్రవారం నిరసన కార్యక్రమాలు చేపట్టారు. – కామారెడ్డి టౌన్/ బాన్సువాడ/ బాన్సువాడ రూరల్ / నిజాంసాగర్కామారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలుపుతున్న జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు -
పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు
● ఏఐసీసీ పరిశీలకుడు రాజ్పాల్ కరోలనిజాంసాగర్(జుక్కల్): కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే పదవులు దక్కుతాయని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు రాజ్పాల్ కరోల పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకుల అభిష్టం మేరకు డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం నిజాంసాగర్ గుల్దస్తా వద్ద జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్కు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నారు. 30 ఏళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి లేదని, కనీసం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, పీసీసీ కార్యదర్శి అశోక్రెడ్డి, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, పార్టీ మండల అధ్యక్షులు మల్లికార్జున్, రవీందర్రెడ్డి, హన్మాండ్లు, రమేశ్దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. అరవింద్ అడ్డగింత డీసీసీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు వచ్చిన సౌధాగర్ అరవింద్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో అధిష్టానం అరవింద్ను సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అడ్డు చెప్పారు. దీంతో స్థానిక పోలీసులు అరవింద్ను సమావేశం నుంచి బయటకు పంపించారు. -
ధాన్యం సేకరణ సమర్థవంతంగా చేపట్టాలి
● డీసీవో రామ్మోహన్నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాలలో ధా న్యం సేకరణ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా సహకార శాఖ అధికారి రామ్మోహన్ సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద, గోలిలింగాల, లింగంపల్లి కలాన్, నాగిరెడ్డిపేట, తాండూర్, కిచ్చన్న పేట గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాలకు చేరిన ధాన్యం తేమ శాతాన్ని డీసీవో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 427 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయ గా, సహకార శాఖ ఆధ్వర్యంలో 233, ఐకేపీ ఆధ్వర్యంలో 194 కేంద్రాలను ప్రారంభించారన్నారు. ఖరీఫ్లో 5,99,212 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరుగుతుందని అంచనా వేశామన్నారు. మరో మూడు రోజులలో ధాన్యం సేకరణ ప్రారంభమవుతుందని తెలిపా రు. ఆయన వెంట ఎల్లారెడ్డి క్లస్టర్ అధికారి శ్రీనివాస్, మాల్తుమ్మెద, తాండూర్ సొసైటీల సీఈవోలు సందీప్, చంద్రమురళి తదితరులు ఉన్నారు. -
లక్ష్యంతో ముందుకు సాగాలి
● విద్యార్థులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉద్బోధ ● భిక్కనూరు హైస్కూల్ తనిఖీభిక్కనూరు: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగితే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉద్బోధించారు. శుక్రవారం ఆయన భిక్కనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధ్యాయుడిలా మారి పదో తరగతి విద్యార్థులకు సౌర వ్యవస్థపై పాఠాలను బోధించారు. పాఠశాలలు విద్యాగణనకు కేంద్ర బిందువులుగా నిలుస్తాయన్నారు. ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారని సూచించారు. చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యాన్ని పెంపోందించుకోవాలని తెలిపారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందజేస్తున్న విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇస్రో సందర్శనకు ఎంపికై న ఇద్దరు విద్యార్థులను కలెక్టర్ అభినందించి వారికి నోటు పుస్తకాలను అందజేశారు. మరిన్ని పరిశోధనలు నిర్వహించి విద్యార్థులను ముందుకు తీసుకెళ్లాలని సైన్స్ టీచర్ తమ్మల రాజుకు సూచించారు. కలెక్టర్ వెంట డీఈవో రాజు, ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డి, ఎంఈవో రాజ్గంగారెడ్డి తదితరులు ఉన్నారు. -
మానవ అక్రమరవాణా నిర్మూలన అందరి బాధ్యత
● బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ: మానవ అక్రమరవాణాను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పేర్కొన్నారు. బాన్సువాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో స్కూల్ అసిస్టెంట్లకు రెండ్రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మానవుల అక్రమ రవాణాను నిర్మూలించడంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అని పేర్కొన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి మానవ అక్రమరవాణా నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్ లక్క నరహరి, ఫౌండేషన్ ప్రతినిధులు సిరజ్, సంజీవులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి అర్బన్: పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ మైదానంలో ఈ నెల 19, 20 తేదీల్లో సీహెచ్ శ్రీనివాస్ స్మారక రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నీ నిర్వహిస్తున్నట్టు ఆర్గనైజింగ్ ప్రతినిధులు సీహెచ్ రాజు, జి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవానికి తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని వీరేశ్, ప్రధాన కార్యదర్శి మద్ది మహేందర్రెడ్డి హాజరవుతారని పేర్కొన్నారు. మ్యాట్పై నిర్వహించే ఈ పోటీలకు ఇప్పటికే 15 జట్లు పేర్లు నమోదు చేసుకున్నాయని తెలిపారు. కామారెడ్డి రూరల్: జిల్లాలోని మద్యం దుకాణాలకు శుక్రవారం 414 దరఖాస్తులు వచ్చాయని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 49 దుకాణాలకు ఇప్పటి వరకు 833 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 దుకాణాలకు 240, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 దుకాణాలకు 154, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 దుకాణాలకు 131, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 172, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 దుకాణాలకు 131 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దోమకొండ: దోమకొండ గడికోటలో శనివారం ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలను నిర్వహించనున్నట్లు ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిర్మల్గౌడ్, ప్రధాన కార్యదర్శి కదిరె మోహన్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు క్రీడా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారని వారు వివరించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో 2025–26 విద్యాసంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించను న్నట్లు అడ్మిషన్స్ డైరెక్టర్ వాసం చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి 21 మధ్యాహ్నం 12 గంటల వరకు దర ఖాస్తులు స్వీకరిస్తారన్నారు. అదేరోజు మ ధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అభ్య ర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించి మెరి ట్ ప్రకారం అడ్మిషన్లు ఇస్తారని తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్లు వెంట తీసుకుని వచ్చి కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు. స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు పొందిన వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని, హాస్టల్ వస తి కూడా ఉండదన్నారు. అభ్యర్థులు టీసీ, అకడమిక్ సర్టిఫికెట్లు, అడ్మిషన్ రసీదు, అవ సరమైన ఇతర పత్రాలతో హాజరు కావాలని సూచించారు. ఆసక్తి, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఽరైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దళారులకు విక్రయించి నష్టపోవద్దని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వరి పంటకు మద్దతు ధర పోస్టర్లను ఆయన శుక్రవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్, డీసీఎస్వో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కుట్రలపై వెల్లువెత్తిన నిరసన
కామారెడ్డి టౌన్/ బాన్సువాడ/బాన్సువాడ రూరల్ / నిజాంసాగర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి దిన పత్రిక, ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కూటమి ప్రభు త్వం అక్రమ కేసుల నమోదుపై ప్రజా సంఘాలు, జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కామారెడ్డి జేఏసీ కన్వీనర్ జగన్నాథం మాట్లాడుతూ ఏపీలో నకిలీ మద్యం దందాపై వార్తలు రాస్తున్నారనే కక్ష సాధింపుతో సాక్షి, జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. టీపీటీఎఫ్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు అనిల్కుమార్, వెంకటి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం సాక్షి గొంతుకను నొక్కే కు ట్ర చేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛను హరించాలని చూస్తే ప్రజా ఆగ్రహానికి గురవుతారన్నారు. తక్షణ మే దాడులు నిలిపివేసి, తప్పుడు కేసులను కొట్టివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ మాట్లాడుతూ ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న సాక్షిపై, జర్నలిస్టులపై వరుసగా దాడులు చేయడం సిగ్గుచేటన్నా రు. సీపీఎం, సీపీఐల జిల్లా కార్యదర్శులు చంద్రశేఖర్, దశరత్ మాట్లాడు తూ సాక్షిపై దాడు లు చేయడం రా జ్యాంగాన్ని అవమానపరచడమే అన్నారు. కార్యక్రమంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు నర్సింలు, బాలరాజు, విఠల్, ఆబిద్, ముదాం శంకర్,వినయ్, అన్వర్, శ్రీకాంత్, ప్రభు, ఆశన్న, సత్యం పాల్గొన్నారు. ● సాక్షి దినపత్రికకు మద్దతుగా బాన్సువాడలోని అంబేడ్కర్ చౌరస్తాలో పాత్రికేయులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీలో కూటమి సర్కా రు సహకారంతో కొనసాగుతున్న నకిలీ మద్యం దందాపై సాక్షిలో వస్తున్న వరుస కథనాలను నిరోధించడానికి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిని నోటీసుల పేరుతో పోలీసులు వేధిస్తున్నారని అన్నా రు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్గౌడ్, గంట చంద్రశేఖర్, సీపీఎం నాయకు డు ఖలీల్, బీఆర్ఎస్ నాయకులు సాయిబాబా, బోడ చందర్, ఇసాక్, మహేశ్, జర్నలిస్టులు గిరిధర్, అంబిల్పూర్ రాజు, పోశీరాం, జాడె గోపాల్, హన్మాండ్లు, సతీశ్, శ్రీనివాస్, మధుసూదన్, ప్ర మోద్రెడ్డి,బర్ల సుధాకర్, అహ్మద్, సుధీర్, అశ్వాఖ్, సుందర్, శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ● సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేయడంపై వర్కింగ్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం నిజాంసాగర్ తహసీల్దార్ భిక్షపతికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. నకిలీ మద్యం తయారీపై వార్తలు ప్రచురించడంతో ఏపీ ప్రభు త్వం అక్రమ కేసులు నమోదు చేస్తూ పత్రికాస్వేచ్ఛను కాలరాస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బాలరాజు, రెడ్డిశెట్టి భాస్కర్, జూనే ద్, రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి’ పై కక్ష సాధింపు మానుకోవాలని డిమాండ్ కామారెడ్డి, బాన్సువాడ, నిజాంసాగర్లో జర్నలిస్టు, ప్రజా సంఘాల ఆందోళనలు జిల్లా కేంద్రంలో కొవ్వొత్తుల ప్రదర్శన -
గోవుల అక్రమరవాణా అడ్డగింత
భిక్కనూరు: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు లారీలో అక్రమంగా తరలిస్తున్న గోమాతలను శుక్రవారం మండలంలోని బస్వాపూర్ గ్రామం జాతీయ రహదారిపై గోసంరక్షణ సమితి ప్రతినిధులు పట్టుకున్నారు. గోవుల తరలింపును గమనించి వారు హైవేపై లారీని వెంబడించారు. లారీని నిలిపి అందులో చూడగా 53 ఆవులు ఉన్నట్లు గుర్తించి, పోలీసులుకు సమాచారం అందించారు. ఎస్సై అంజనేయులు కేసు నమోదు చేసుకొని, మద్దికుంట బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న గోశాలకు ఆవులను తరలించారు. డ్రంకన్డ్రైవ్ కేసులో నలుగురికి జైలు ఎల్లారెడ్డి: మండలంలో పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు చేపట్టగా, నలుగురు వ్యక్తులు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వా రిని శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. జడ్జి వారికి ఒకరోజు జైలు శిక్షతోపాటు పదకొండు వందల రూపాయల జరిమానా విధించినట్లు ఎస్సై మహేశ్ శుక్రవారం తెలిపారు. -
వెలుగుల మాటున ప్రమాదం
● బాణా సంచా కాలుస్తున్నప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి ● అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు బాన్సువాడ : చిన్నా పెద్ద తేడా లేకుండా ఆనందోత్సాహాలతో గడిపే దీపావళి పండుగను ఈ నెల 20న లక్ష్మి పూజలు, 21న పాఢ్యమిని జరుపుకోనున్నారు. ఆ రోజు బాణసంచా కాలుస్తూ ఆనంద డో లికల్లో ఓలలాడుతారు. అయితే ఆ వెలుగుల మా టున ప్రమాదం పొంచి ఉంటుంది. టపాసులు కా ల్చే సమయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వ్యాప్తంగా టపాసుల వ్యాపారం మొదలైంది. పోలీసు, రెవెన్యూ, ఫైర్, ట్రాన్స్కో శాఖల అధికారులు నిత్యం టపాసుల విక్రయ కేంద్రాలను పర్యవేక్షిస్తుండాలి. ఇవి పాటించాలి.. ● గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములు, పూరి గుడిసెలు ఉంటాయి. అక్కడ రాకెట్లు, చిచ్చుబుడ్లు, తా రాజువ్వలు వంటివి కాల్చరాదు. టపాకాయల పనితీరు, వెలిగించాల్సిన విధానం తదితర అంశాలపై పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. ● పెద్దల పర్యవేక్షణలో పిల్లలతో టపాసులు కా ల్పించాలి. రోడ్లపై పేల్చితే వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ● వ్యాపారులు జన సంచారం లేని, ఊరికి దూరంగా ఉండే ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేయాలి. ● టపాసులు విక్రయించే వ్యాపారులు రెవిన్యూ, పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్/పంచాయితీ, విద్యుత్ శాఖ తదితర శాఖల అధికారుల నుంచి అనుమతులు పొందాలి. ● విక్రయ ప్రాంతంలో విధిగా ఇసుక, నీరు, కార్బన్ డయాకై ్సడ్ వాయువును అందుబాటులో ఉంచుకోవాలి. ● దుకాణాల సమీపంలో ఎవరూ సిగరెట్లు, బీడీలు కాల్చకూడదని బోర్డులు ఏర్పాటు చేయాలి. ● సెల్ఫోన్లో మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలి. దుకాణాల మధ్య కనీసం 10 అడుగుల దూరం ఉండాలి. ● మందుగుండు సామగ్రి విక్రయించే కేంద్రాల్లో విద్యుత్ వైరింగ్ సక్రమంగా ఉండేలా చూడాలి. ● ప్రతీ దుకాణం ఎదుట అగ్ని మాపక కేంద్రాల ఫోన్ నంబర్లు ఉండాలి. టపాకాయలు విక్రయించే వ్యాపారులు తప్పనిసరిగా అనుమతులు పొందాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయిస్తే చర్యలు తప్పవు. – తుల శ్రీధర్, సీఐ, బాన్సువాడ -
బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలి
కామారెడ్డి టౌన్: బీసీలకు 42శాతం అమలు చేయాలని తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని కామారెడ్డి బీసీ కులాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. రాష్ట్ర బంద్తో బీసీల తడాఖా చూపిస్తామన్నారు. ఈ బంద్లో వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలు, విద్యా సంస్థలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్కు తరలివెళ్లి టీఎన్జీవోస్, టీజీవో సంఘాల నాయకులకు వినతిపత్రాలను అందజేశారు. బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరారు. బీసీ కులాల జేఏసీ నాయకులు నాగరాజు, కుంబాల లక్ష్మణ్, శివరాములు, పండ్ల రాజు, కుంబాల రవి, నాగరాజ్ గౌడ్, భూమన్న, కొత్తపల్లి మల్లన్న, గైని శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. అలాగే బంద్కు బీఆర్ఎస్, బీఎస్పీ, బీసీ టీయూ, ఎమ్మార్పీఎస్ మద్దతు తెలిపాయి. -
ఎక్కడి వడ్లు అక్కడే
బీబీపేట: ఈ ఏడాది జిల్లా అంతటా భారీ వర్షాలు కురవడం ఆశించిన మేర పంటలు పండడంతో నెల రోజుల ముందే పంట చేతికి వచ్చింది. దీంతో ఇప్పటికే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వడ్లను రైతులు తీసుకువచ్చారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ప్రారంభించింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కేంద్రం వద్ద కూడా వడ్లను కొనడం ప్రారంభించలేదు. దీంతో రైతుల్లో భయాందోళన నెలకొంది. వారం రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోజుకో మాదిరిగా వాతావరణం ఉండడంతో రైతులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఒకరోజు ఉక్కపోత, మరో రోజు మేఘాలు కమ్మడంతో రైతులకు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండల కేంద్రంలోని సొసైటీ పరిధిలో 6 కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ పరిధిలో 5 కేంద్రాలు ఉండగా ఎక్కడా కూడా వడ్లను కొనడం లేదు. ఇప్పటికే కేంద్రాల వద్దకు వడ్లు చేరడంతో పాటు రైతులు ఆరబెడుతున్నారు. గత ఖరీఫ్ సీజన్లో 11 కేంద్రాల్లో 1,51,658 క్వింటాళ్లు వడ్లు కొనుగోలు చేయగా ఈ ఏడాది ఇంకా ఎక్కువగానే వచ్చే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. అధికారులు త్వరితగతిన కొనుగోళ్లు చేపడితే తప్ప రైతులకు ఇబ్బందులు తప్పేలా లేవు.● కేంద్రాలు ప్రారంభమైనా కొనుగోలు చేయని వడ్లు ● వాతావరణంలో మార్పులతో రైతుల దిగులు -
కేటీఆర్పై చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి టౌన్: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ అసత్యపు ప్రచారానికి బాధ్యులుగా చేస్తూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు శుక్రవారం జిల్లా అదనపు ఎస్పీ నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో విద్వేషాన్ని, రెచ్చగొట్టే విధంగా అసత్యపు పోస్టులు పెడుతున్నారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, నాయకులు గుడుగుల శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, రవీందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: డీసీ సీ అధ్యక్షుడి ఎన్నిక పారదర్శకంగా ఎన్నుకోవాలని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు రా జ్పాల్ కరోలాను టీ పీపీసీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి కోరారు. శుక్రవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కామారెడ్డి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడి ఎన్ని క ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పారు. పాత అధ్యక్షుడికి ఏవైనా పదవులు వచ్చేంత వరకు.. జిల్లా అధ్యక్షుడిగా ఉంటారని ప్రకటించడం ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు. పార్టీ బలోపేతం దిశగా ఎన్నిక జరగాలని కోరారు. -
ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి పట్టణంలో ఈనెల 24 నుంచి నిర్వహించనున్న రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ఎల్లారెడ్డి సొసైటీ వైస్ చైర్మెన్ ప్రశాంత్గౌడ్ గౌడ సంఘం సభ్యులతో కలిసి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు శుక్రవారం ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్గౌడ్, ఈశ్వర్గౌడ్, నారాగౌడ్ తదితరులున్నారు. పిట్లం(జుక్కల్): విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలూ అవసరమేనని, క్రీడలు విద్యార్థులలో మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పిట్లం మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించారు. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి, క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.అనంతరం ఆయా పా ఠశాలలకు చెందిన విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ ని ర్వహించారు. మార్చ్ ఫాస్ట్లో పిట్లం బ్లూబె ల్స్ పాఠశాల విద్యార్థులు మొదటి బహుమతి ని గెలుచుకున్నారు. ఎంఈవో దేవిసింగ్, ఆ యా ఉపాధ్యాయ సంఘాల సభ్యులు, ఉపాధ్యా యులు,నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కామారెడ్డి రూరల్: మండల బీజేపీ కార్యవర్గాన్ని పార్టీ మండల అధ్యక్షుడు చందన శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నుకున్నారు. ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన చెన్నాల అనిల్రెడ్డి, భాస్కర్, లక్ష్మారెడ్డి, బాలక్రిష్ణ, రాజలింగం, స్వామిలను ఉపాధ్యక్షులుగా, మండల యువ మోర్చా అధ్యక్షుడిగా చెట్కూరి మహిపాల్, దళి త మోర్చా అధ్యక్షుడిగా దేవునిపల్లి పోచయ్యలను ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శులుగా రవి, అమృతరావు, కార్యదర్శులుగా శ్రీనివాస్గౌడ్, రమేష్గౌడ్, సాయిరెడ్డి, భాస్క ర్, నరేశ్, కోశాధికారిగా వీరేశంలను నియమించారు. అనంతరం వారిని సన్మానించారు. ఆర్టీసీ లక్కీడ్రా విజేతలకు చెక్కుల ప్రదానం నిజామాబాద్ సిటీ: దసరా సీజన్ నేపథ్యంలో ఆర్టీసీ ‘లక్కీడ్రా’ కార్యక్రమాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ వరకు లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సుల్లో ప్రయాణించిన వారికి డ్రాలో పాల్గొనే అవకాశం కల్పించింది. జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లోగల ఆర్ఎం కార్యాలయంలో ఇటీవల డ్రా తీయగా, విజేతలకు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి శుక్రవారం చెక్కులు అందించారు. మొదటి బహమతి చంద్రయ్యకు రూ.25 వేలు, రెండో బహుమతి షేక్ బాబర్కు రూ.15 వేలు, మూడో బహుమతి రాంప్రసాద్కు రూ.10వేలు అందించారు. కార్యక్రమంలో ఆర్ఎం జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, పరమాత్మ, ఆనంద్ బాబు, డీఎం–1 ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చెట్కూరి మహిపాల్ ,దేవునిపల్లి పోచయ్య -
క్రైం కార్నర్
చెరువులో పడి ఒకరి మృతి పెద్దకొడప్గల్(జుక్కల్): ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరు మృతి చెందిన ఘటన బేగంపూర్ గ్రామ శివారులోని కింద చెరువులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని కాస్లాబాద్ గ్రామానికి చెందిన పిసుకే నడిపి సాయిలు (50)కు గతంలోనే వివాహం జరుగగా, భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. తరచుగా తమ్ముడి ఇంటికి వెళ్లివస్తుండేవాడు. ఈక్రమంలో బుధవారం ఉదయం సీతాఫలాలను తీసుకురావడానికి తమ్ముడి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లాడు. కానీ అతడు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు గాలింపు చేపట్టినా, ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం బేగంపూర్ గ్రామ శివారులోని కింది చెరువులో అతడి మృతదేహం లభ్యమైంది. సాయిలుకు గత కొన్నిరోజులుగా కళ్లు సరిగా కనిపించడంలేదు. చెరువు కట్ట పైనుంచి అతడు నడుచుకుంటు వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి, ఈతరాక మృతిచెందినట్లు మృతుడి తమ్ముడు లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర సమీపంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు కరెంట్షాక్తో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూర్ జిల్లా రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు(16)అనే బాలుడు తన తల్లి ముంతాజ్తోపాటు గ్రామానికి చెందిన మరికొంత మందితో కలిసి బాతులను మేపేందుకు ఈనెల 12న మండలానికి వచ్చారు. కాగా శుక్రవారం ఉదయం మండలంలోని నాగిరెడ్డిపేట శివారులో బాతుల మంద నుంచి కొన్ని బాతులు విడిపోయి పక్కకు పోతుండగా చోటు వాటిని మందలోకి తోలుతున్నాడు. ఈక్రమంలో పొలంలోని స్టార్టర్బాక్స్ వద్ద ఉన్న కరెంట్వైరుకు అతడు తగిలి కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మండలకేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్): అచ్చంపేట గ్రామంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి పేకాడుతున్న ముగ్గురిని పట్టుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ.1,390 నగదు, 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేశామని వివరించారు. -
సాక్షి గొంతునొక్కే కుట్ర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టాలను గౌరవించకుండా కేవలం కక్ష సాధింపుతో సాక్షిపై దాడులు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి కక్ష సాధింపుగానే భావిస్తున్నాం. ఏమైనా ఉంటే న్యాయ, చట్టపరంగా ముందుకు వెళ్లాలి. ఇలా అక్రమ కేసులు పెట్టి పత్రికాస్వేచ్ఛను, గొంతును నొక్కేందుకు ప్రయత్నించడం సరికాదు. – శివప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్రాజకీయ కక్షలతో సాక్షిపై దాడులు చేస్తూ కేసులు చేస్తున్నారు. పత్రిక గొంతు నొక్కితే పతనం తప్పదు. గత కొద్ది రోజులుగా సాక్షిపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అంతా గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో పత్రికలపై జరుగుతున్న దాడులను అందరూ ఖండించాల్సిందే. – పద్మ వెంకట్, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుకామారెడ్డి టౌన్/బాన్సువాడ/ఎల్లారెడ్డి: ప్రజా సమస్యలపై ప్రశ్ని స్తున్న ‘సాక్షి’ గొంతును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నొక్కుతోందని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను హరిస్తోందన్నారు. ప్రజల పక్షాన అక్షర స మరం చేస్తున్న కక్షగట్టి ఎడిటర్ ఆర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయిండం, విచారణ పేరుతో సాక్షి ప్రధాన కార్యాలయంపై పోలీసులు దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని విమర్శించా రు. సాక్షిపై దాడులను ఆపాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ శుక్రవారం ఉదయం బాన్సువాడలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాకు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, విద్యార్థి సంఘాల, సీసీఐ, సీపీఎం నాయకులు హా జరుకానున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులా..? ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే.. కక్ష సాధింపులు మానుకోవాలి నేడు బాన్సువాడలో ధర్నా మీడియాపై రాజకీయ కక్ష తగదు. వాస్తవాలను చెబుతున్న సాక్షిని కేసులు పెట్టి అడ్డుకోవాలని కూట మి ప్రభుత్వం చూస్తోంది. మీడియాపై అధికారుల దాడులు, ఒత్తిళ్లు, వేధింపులు ఆపకపోతే తీవ్ర పరిణాలుంటాయి. దీన్ని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నాం. – విజయ్కుమార్, బీసీ విద్యార్థి సంఘం బాన్సువాడ డివిజన్ అధ్యక్షుడు ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడులు, కేసుల నమోదు పత్రికాస్వేచ్ఛకు గొడ్డలి పెట్టుగా భావిస్తున్నాం. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తీరుమార్చుకోవాలి. – సురేశ్, పీడీఎస్యూ రాష్ట్ర కోశాధికారిపత్రికా స్వేచ్ఛపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని తప్ప ఇలా వ్యక్తిగతంగా సాక్షిపై దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయిండం సరికాదు. పత్రికా స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం కాపాడాలి. – లక్ష్మణ్యాదవ్, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు -
నిజామాబాద్కు ‘అగ్రి’ కళాశాల
● ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్ ● వ్యవసాయ రంగానికి మరింత ఊతం ● విద్య, పరిశోధనలతో పాటు కొత్త వంగడాల సృష్టికి అవకాశండొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయాధారిత జిల్లాగా పిలువబడే నిజామాబాద్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రి కోర్సులు చేసే నిజామాబాద్ జిల్లాతోపాటు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ విద్యార్థులకు వ్యవసాయ కళాశాల వరమనే చెప్పొచ్చు. తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ కళాశాలను తేవడం నిజామాబాద్కు మరింత వన్నె తెస్తుంది. వ్యవసాయ కళాశాలను కూడా యూనివర్సిటీ పక్కనే ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రా జెక్టులు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయి. వరితోపాటు పసుపు, మొక్కజొన్న, సోయా, జొన్నలు, సజ్జలు కూడా ఎక్కువగా సాగవుతున్నాయి. జిల్లాలో పండించిన పంటలు ఇతర ప్రాంతాలు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక పంటలు, రైతులు ఉన్న జిల్లాల్లో ఒకటిగా నిజామాబాద్ ఉంది. దీంతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు డిమాండ్ ఏర్పడింది. చెరుకు పరిశ్రమలు అలాగే రుద్రూర్ కృషి విజ్ఞా కేంద్రం, కమ్మర్పల్లి పసుపు పరిశోధన కేంద్రాలకు తోడుగా వ్యవసాయ కళాశాల రావడంతో రైతుల్లో హర్షం వ్యకమవుతోంది. ఎంచక్కా విద్య... స్థానికంగా పరిశోధన... ఇందూరు కేంద్రంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటైతే చుట్టు పక్కనున్న జిల్లాల విద్యార్థులు నిజామాబాద్లోనే వ్యవసాయ కోర్సులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. వ్యవసాయ కోర్సులు చేయాలంటే హైదరాబాద్లోని రాజేంద్రనగర్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంతదూరం వెళ్లి చదువు, పరిశోధనలు చేయాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు నిజా మాబాద్ వ్యవసాయ కళాశాలలోనే పట్టభ ద్రులుగా, పరిశోధకులుగా, ప్రొఫెసర్లుగా తయారు కావొచ్చు. వ్యవసాయానికి అనువుగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో పంటలపై ప్రయోగాలు సులువుగా చేయాడానికి వీలుంటుంది. -
రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
● యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి ● రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలుకామారెడ్డి టౌన్: రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్షాసమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ భారతి, సీఎం, కలెక్టరేట్ ప్రజావాణిల పెండింగ్ దరఖాస్తులు, సర్టిఫికెట్ల జారీ, ఇసుక, మట్టి అక్రమరవాణా, ప్రభుత్వ భూముల సర్వే, రేషన్ కార్డుల పంపిణీ తదితర 16 అంశాలపై రివ్యూ నిర్వహించి పరిష్కార మార్గాలను సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే సాదా బైనామాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్తగా గ్రామపాలన అధికారులు కూడా వచ్చారని, మానవ వనరులకు ఇబ్బంది లేదన్నారు. అందుబాటులో ఉన్న శిక్షణ లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. మండలాల్లో పెండింగ్లో ఉన్న రెవెన్యూ, ఫారెస్ట్ భూముల వివాదాలను ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల సర్వే చేపట్టాలని, రేషన్ కార్డుల పంపిణీకి, ఇసుక, మొరం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ , డీఆర్వో మధుమోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సర్వేయర్లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.జిల్లాలోని బీఎల్వోలకు ఐడీ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని, నూతన ఎపిక్ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్రెడ్డి గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఫామ్ 6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో 259 దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే వందేళ్ల వయస్సు పైబడిన వారు 106 మంది ఉన్నారని, వారిలో చనిపోయిన వారి గుర్తింపు, మిగతా వారి వయస్సు ధ్రువీకరణను పరిశీలిస్తున్నామని వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్వో మధుమోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దారి తప్పిన సర్దుబాట్లు!
నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల డిప్యుటేషన్లు ● అవసరం ఉన్న చోట కాదు.. అనుకూలంగా ఉన్న చోటికి.. ● మారని విద్యాశాఖ అధికారుల తీరుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రావ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కామారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. డబ్బులు సర్దుబాటు చేస్తే ఎక్కడికంటే అక్కడికి సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరిగినట్టు తెలుస్తోంది. అవసరం ఉన్న బడికి సమీప పాఠశాలల నుంచి టీచర్లను సర్దుబాట్లు చేయాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలుగా డిప్యుటేషన్లు వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అవసరం ఉన్న చోటకు సమీపంలోని ఉపా ధ్యాయులను సర్దుబాటు చేయాలని జీవో నంబర్ 25 స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ జిల్లాలో విచ్చలవిడిగా డిప్యుటేషన్లు వేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన టీచర్ల సర్దుబాటు వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ● నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేటలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఒకరిని రామారెడ్డి మండలానికి పంపించారు. నాలుగైదు మండలాలు దాటించారు. తరువాత అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు. సదరు ఉపాధ్యాయుడు పనిచేయాల్సిన బడిలో అవసరం లేకుంటే, అదే నాగిరెడ్డిపేట మండలంలో ఏదో ఒక బడికి పంపించాలి. లేనిపక్షంలో పక్కనే ఉన్న ఎల్లారెడ్డి మండలానికో, పొరుగున ఉన్న లింగంపేట మండలంలో అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేయాలి. కానీ నాలుగైదు మండలాలు దాటించి జిల్లా కేంద్రానికి తీసుకురావడంలో మతలబు ఏమిటో విద్యాశాఖ అధికారులకే తెలియాలి. ● కామారెడ్డి మండలం రామేశ్వర్పల్లి నుంచి ఓ ఉపాధ్యాయుడిని కామారెడ్డి పట్టణంలోని ఎస్సీవాడ ఉన్నత పాఠశాలకు, తరువాత అక్కడి నుంచి ఉగ్రవాయి బడికి పంపించారు. ఇదేం సర్దుబాటనేది ఎవరికీ అర్థం కాదు. ● లింగంపేట మండలం మోతె నుంచి రామారెడ్డికి, రామారెడ్డి నుంచి మోతెకు పరస్పరంగా సర్దుబాటు చేశారు. ● ఎల్లారెడ్డి మండలం నుంచి మరో ఉపాధ్యాయుడిని బాన్సువాడకు పంపించారు. ● భిక్కనూరు మండలం కాచాపూర్ నుంచి కామారెడ్డి పట్టణానికి ఇంకో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేశారు. ● మద్నూర్ మండలం నుంచి రామారెడ్డి మండలానికి మరో ఉపాధ్యాడిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది. ● ఎల్లారెడ్డి మండలం నుంచి రాజంపేట మండలానికి మరో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేశారు.గత విద్యాసంవత్సరంలో ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు చేపట్టిన వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను రద్దు చేసి, నిబంధనల ప్రకారం సర్దుబాటు చేశారు. అయినా ప్రస్తుతం అధికారులు అదే రకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చేపట్టిన సర్దుబాట్లే దీనికి నిదర్శనమని పలువురు అంటున్నారు. అడ్డగోలుగా జరిగిన సర్దుబాట్లపై ఓ ఉపాధ్యాయ సంఘం నేత విద్యాశాఖ అధికారిని నిలదీయగా, రద్దు చేస్తానని పేర్కొన్నట్టు తెలుస్తోంది. టీచర్ల సర్దుబాటు వ్యవహారంపై విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లకు సమీపంలోని లేదా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న, లేదా అవసరానికి మించి ఎక్కువ మంది టీచర్లు ఉన్న స్కూల్ నుంచి సర్దుబాటు చేయాలి. ముఖ్యంగా కాంప్లెక్స్ పరిధిలో సర్దుబాటు చేయాలి. కాదూకూడదంటే మండలం పరిధిలో, అవసరం మేరకు పక్క మండల నుంచి సర్దుబాటు చేయాలి. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కొందరు టీచర్లతో లాలూచీ పడి మూడు, నాలుగు మండలాలు దాటించి వారికి అనుకూలం ఉన్న బడికి పంపించారు. అలాగే పరస్పర డిప్యుటేషన్లు కూడా చేపట్టారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయుడు అవసరం ఉన్నప్పటికీ టీచర్ అవసరం కోసం డిప్యుటేషన్పై పంపించారు. -
శాంతించిన మంజీర
● ‘సాగర్’కు తగ్గిన వరద ● మూసుకున్న ఫ్లడ్ గేట్లునిజాంసాగర్(జుక్కల్): రెండు నెలలుగా వరద ప్రవాహంతో ఉరకలేసిన మంజీర నది శాంతించింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గు ముఖపట్టడంతో నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లను బుధవారం మూసివేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ నెల వరకు ప్రాజెక్టులోకి 290.275 టీఎంసీల ఇన్ఫ్లోగా వచ్చింది. ఆగస్టు 18న ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తగా అప్పటి నుంచి 53 రోజులపాటు 270.990 టీఎంసీల నీటిని మంజీరలోకి విడుదల చేశారు. వంద సంవత్సరాల ప్రాజెక్టు చరిత్రలో 290.275 టీఎంసీల ఇన్ఫ్లో రావడం ఇదే తొలిసారి అని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నిలకడగా నీటిమట్టం ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం నిలకడగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1405 అడుగుల (17.8టీఎంసీల) నీరు నిల్వ ఉంది. -
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
దోమకొండ : పాడి, గొర్రెలు, మేకల పెంపకం ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల వారికి జీవనాధారం. జీవనోపాధినిస్తున్న మూగజీవాల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు గాలికుంటు వ్యాధి నివారణ (ఏఫ్ఎండీ) అత్యంత కీలకం. పాడిపశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాడిరైతులు తీవ్రమైన నష్టాలను చావిచూడాల్సివస్తుంది. దేశవాలి పశువుల్లో కన్నా సంకర జాతి పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పికార్నో అనే వైరస్ ద్వారా ఈ వ్యాధి పశువుల్లో త్వరగా వ్యాప్తి చెందుతుంది. గాలికుంటు వ్యాధిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రతి సంవత్సరం ఆరు నెలలకోసారి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈనెల 16 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్య బృందాలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నాయి. జిల్లాలో ఆవులు 68,370, గేదెలు 97,570 ఉన్నాయి. అదేవిధంగా గొర్రెలు 4,87,903, మేకలు 1,50,046 ఉన్నాయి. ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకల్లో గాలికుంటు వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. నవంబర్ 14వరకు జిల్లాలో ప్రత్యేక శిబిరాలు జిల్లాలో ఆవులు 68,370, గేదెలు 97,570.. గొర్రెలు 4,87,903, మేకలు 1,50,046 -
చట్టాలపై అవగాహన ఉండాలి
దోమకొండ: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం న్యాయసేవా సదస్సు నిర్వహించారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో భారత శిక్ష సంవిధాన, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, పోక్సో, విద్యా హక్కు చట్టాల గురించి న్యాయమూర్తి వివరించారు. మైనర్ వివాహాల నిషేధ చట్టాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యాహక్కు చట్టం 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ చదువుకునే హక్కు కల్పించిందన్నారు. పిల్లలను పనికి పంపితే తల్లిదండ్రులు నేరస్తులవుతారని స్పష్టం చేశారు. మండల విద్యాశాఖ అధికారి విజయ్కుమార్, దోమకొండ ఎస్సై స్రవంతి, పారాలీగల్ సొసైటీ సభ్యులు, పాఠశాల హెడ్ మాస్టర్ శరత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాన్సువాడ : పార్టీ కోసం కష్ట పడి పని చేసే వారికే పదవులు లభిస్తాయని ఏఐసీసీ జిల్లా పరిశీలకులు రాజ్పాల్ కరోలా అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్లో గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోలా మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, కష్టకాలంలో పార్టీ వెంట ఉండి కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు అందజేశారన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కై లాస్ శ్రీనివాస్కు తిరిగి డీసీసీ పదవి ఇవ్వాలని స్థానిక నాయకులు సూచించారు. కరోలాను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి వర్గం కార్యకర్తలతో రాజ్పాల్ కరోలా సమావేశమయ్యారు.కామారెడ్డి టౌన్: ఈ నెల 18న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ బంద్కు వ్యాపార, వాణిజ్య, విద్య, రవాణా సంస్థలు, ప్రజలు సహకరించాలని బీసీ, అఖిలపక్ష నాయకులు కోరారు. బంద్లో పాల్గొనాలని కోరుతూ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆయా వ్యాపార సంఘాలకు గురువారం వినతిపత్రాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలు బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు గణేశ్నాయక్, కొత్తపల్లి మల్లన్న, వెంకట్గౌడ్, ప్రవీణ్, యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
21 నుంచి పోలీస్ అమరుల వారోత్సవ పోటీలు
ఎస్పీ రాజేశ్ చంద్ర కామారెడ్డి క్రైం: పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి 31 వరకు జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజన్ల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు విధి నిర్వహణలో తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేస్తూ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు విశేష సేవలు అందించారన్నారు. ఫొటో, షార్ట్ ఫిలిం పోటీలు.. అలాగే ఫోటో, షార్ట్ ఫిలిం పోటీలు కూడా నిర్వహించనున్నామని, విద్యార్థులు, యువత, ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొనవచ్చన్నారు. పోలీసులు చేసిన సేవలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాల నివారణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో పోలీసుల సేవ వంటి అంశాలపై 3 నిమిషాల లోపు షార్ట్ ఫిల్మ్లు లేదా సమాజంలో పోలీసుల ప్రతిష్ఠను పెంపొందించే ఫొటోలు రూపొందించి అక్టోబర్ 23లోపు కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫొటోలు(ప్రింట్ లేదా డిజిటల్), షార్ట్ ఫిల్మ్లు(పెన్ డ్రైవ్ రూపంలో) అందజేయాలన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన మూడు ఉత్తమ ఎంట్రీలకు బహుమతులు ప్రదానం చేస్తామని, వీరిలో ఉత్తములను రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని, యువత, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని, పోలీస్ అమల త్యాగాలకు నివాళులర్పించాలని ఎస్పీ కోరారు. విద్యార్థులకు పోటీలు.. ఈ సందర్భంగా జిల్లాలో విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. అక్టోబర్ 21 నుండి 28 వరకు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో డ్రగ్స్ నివారణలో పోలీసుల పాత్ర–విద్యార్థులు డ్రగ్స్ నుండి ఎలా దూరంగా ఉండాలి అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొనడానికి విద్యార్థులు https:// forms. gle/ jaWLdt2 yhNrMp e3 eఅ లో లాగిన్ అయి పేరు, విద్యార్హత ఇతర వివరాలు నమోదు చేయాలన్నారు. వ్యాసాన్ని పేపర్పై రాసి, దానిని ఫొటో లేదా పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలన్నారు. వ్యాసరచనలో గరిష్టంగా 500 పదాలు మాత్రమే ఉండాలని సూచించారు. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు జిల్లా పోలీస్ కార్యాలయంలో బహుమతులతో సత్కరించి, రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 20న బ్యానర్లు, హోర్డింగుల ఏర్పాటు 21న పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉదయం 8 గంటలకు అమరవీరుల దినోత్సవ కార్యక్రమం 22న కామారెడ్డి, 24న ఎల్లారెడ్డి, 25న బాన్సువాడ డివిజన్లలో అమరవీరుల కుటుంబాలకు పరామర్శ 25న సైకిల్ ర్యాలీ 27న కామారెడ్డి, 28న ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనన్లలో ప్రజా అవసరాల సేకరణ 29న పోలీస్ హెడ్క్వార్టర్స్లో మెగా రక్తదాన శిబిరం 30న ఓపెన్ హౌస్ కార్యక్రమం 31న క్యాండిల్ ర్యాలీ కార్యక్రమం -
వాహనాల చోరీ నిందితుల అరెస్టు
● వివరాలు వెల్లడించిన సీపీ సాయి చైతన్య నిజామాబాద్అర్బన్: జిల్లాలో పలు చోట్ల వాహనా ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను అ రెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. సీసీ ఎస్ పోలీస్స్టేషన్లో సీపీ గురువారం వివరాలు వెల్లడించారు. కొందరు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్ప డి బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, ముథోల్లో ఆటోలు, బైక్లను చోరీ చేసి కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్కు చెందిన షేక్ ఫజల్, మహ్మద్ నవాజ్ను అదుపులోకి తీసుకొని విచారించగా షేక్అలీ, వహిద్, అలీమ్లతో కలిసి 9 ఆటోలు, మూడు బైక్లు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. అపహరించిన వాహనాలను కోరుట్లలో విక్రయించినట్లు పేర్కొన్నారు. దొంగ వాహనాలను కొనుగోలు చేసిన మహ్మద్ ఇమ్రాన్, మహ్మద్ ఇలియాస్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కేసును త్వరిగతిన ఛేదించిన సీసీఎస్ ఏసీపీ నగేంద్రచారి, సీఐ సాయినాథ్, ఇతర పోలీసు సిబ్బందిని సీపీ అభినందించారు. -
ఇస్రోజీవాడికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి
కామారెడ్డి రూరల్: ఇస్రోజీవాడి గ్రామానికి ఆర్టీసీ బస్సు లేక ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామానికి బస్సు నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం గ్రామ యువకులు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు పాఠశాలకు, కళాశాలకు సకాలంలో చేరడం లేదని పేర్కొన్నారు. కొందరు ప్రైవేటు వాహనాల్లో వెళ్తూ అధిక ధరలు చెల్లించాల్సి వస్తుండగా, ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో లేక ఇటు గర్గుల్కు, పోసానిపేట రోడ్డు వరకు నడిచి వెళ్లే పరిస్థితి నెలకొందని తెలిపారు. సమస్య అర్థం చేసుకొని బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. యువకులు కొత్తపల్లి రాజు, సురేష్, ప్రశాంత్, అరవింద్, బన్నీ తదితరులు ఉన్నారు. -
తమ్ముడి ఇంట్లో అన్న చోరీ
● వ్యాపారంలో నష్టాలొచ్చాయని.. ● కేసును ఛేదించిన పోలీసులు నిజామాబాద్ అర్బన్: వ్యాపారంలో నష్టాలు, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లో అన్న చోరీకి పాల్పడ్డాడు. నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పది రోజుల క్రితం జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. నగర సీఐ శ్రీనివాస్రాజ్ గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 6న మహ్మదీయకాలనీకి చెందిన మహ్మద్ సాబీక్ పాషా ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు తిరిగిరాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. నగదుతోపాటు బంగారం చోరికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన రెండో టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఇంటి పక్కనే ఉన్న అతని అన్న మహ్మద్ షఫీ పాషాను అనుమానించి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడం, అప్పులు పెరగడంతో తమ్ముడి ఇంట్లోకి చొరబడి రెండు తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. షఫీ పాషాను అరెస్టు చేసి బంగారం, డబ్బులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు విచారణలో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాయిద్తోపాటు సిబ్బందిని అభినందించారు. -
షీటీంలపై అవగాహన పెంచుకోవాలి
మాచారెడ్డి: విద్యార్థినులు షీటీంపై అవగాహన పెంచుకోవాలని మాచారెడ్డి ఏఎస్సై ప్రభాకర్ రెడ్డి సూచించారు. గురువారం పాల్వంచ మండలం ఆరేపల్లి వద్ద ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా, ఆన్లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైన వాళ్లు 1930 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. బాలికలు, మహిళలు ఏ దైనా మోసాలకు గురైనప్పుడు 87116 86094 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించా రు. సిబ్బంది రాజేందర్, సౌజన్య, భూమయ్య, తిరుపతి, శేషారావు, తదితరులు ఉన్నారు. ● ఒక్కటైన ప్రేమజంట నిజాంసాగర్(జుక్కల్): మహ్మద్నగర్ మండలం తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల రవీందర్, నేపాల్కు చెందిన మాయ ఒక్కటయ్యారు. గురువారం తెల్గాపూర్ గ్రామంలో వేద పండితుడు, గ్రామస్థుల సమక్షంలో ఇద్దరి పెళ్లి సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెల్గాపూర్ గ్రామానికి చెందిన దనుల వెంకవ్వ, ఎల్లయ్య దంపతులు రెండో కుమారుడు రవీందర్ ఏడు సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉంటూ ఉపాధి పొందుతున్నాడు. రవీందర్ పని చేస్తున్న కంపెనీలోనే నేపాల్కు చెందిన మాయ పనిచేస్తోంది. మూడు సంవత్సరాల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పది రోజుల కిందట రవీందర్తోపాటు మాయ దుబాయ్ నుంచి తెల్గాపూర్ గ్రామానికి వచ్చారు. రవీందర్ తన తల్లిదండ్రులను ఒప్పించి మాయను వివాహం చేసుకున్నారు. భిక్కనూరు: అంతంపల్లి గ్రామ విండో మహాజన సభను ఈ నెల 17న నిర్వహిస్తున్నట్లు విండో అధ్యక్షుడు వలకొండ వెంకట్రెడ్డి గురువారం తెలిపారు. విండో పరిధిలోని అంతంపల్లి, లక్ష్మీదేవునిపల్లి గ్రామాలకు చెందిన రైతులు తప్పనిసరిగా సభకు హాజరు కావల్సిందిగా ఆయన కోరారు. -
పౌష్టికాహారం తీసుకోవాలి
కామారెడ్డి టౌన్: ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన పోషణ మాసం ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రోజూ తినే ఆహారంలో చక్కెర, ఆయిల్, ఉప్పు స్థాయిలను తగ్గించాలని సూచించారు. అంగన్వాడీల్లో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతం చేయాలన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం రెగ్యులర్గా అందిస్తూ దేశాన్ని ఎనీమియా రహిత భారత్గా మార్చాలని సూచించారు. అనంతరం కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణులకు సామూహిక సీమంతాలు, చిన్నారులకు అన్నపాసన కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యలక్ష్మిలో రెగ్యులర్ అటెన్డెన్స్ ఉన్న గర్భిణులకు, నార్మల్ డెలివరీ అయి పూర్తి ఆరోగ్యంగా ఉన్న మహిళలు, చిన్నారులకు బహుమతులు అందజేశారు. ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ప్రోగ్రాం ఆఫీసర్ యమిమ, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుడు ప్రవీణ్కు అభినందన
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ప్రవీణ్కుమార్ను గురువారం రాత్రి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. 2025– 26 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కృత్యాధార బోధనకు విశేష ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఎస్సీఈఆర్టీ తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రతిభావంతమైన 15 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారి ద్వారా ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రయోగ దీపికలను రూపొందించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా నుంచి ప్రవీణ్ కుమార్ను ఎంపిక చేశారు. ప్రవీణ్ ప్రతిభ, కృషిని గుర్తించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా సైన్స్ అధికారి సిద్దరాంరెడ్డి ఉన్నారు. -
డీపీఆర్వోగా తిరుమల
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా నూతన డీపీఆర్వోగా ఆదిలాబాద్లో విధులు నిర్వహిస్తున్న బి.తిరుమల బదిలీపై వచ్చారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకేను అందజేసి, ఉత్తర్వులను అందుకున్నారు. ఇన్చార్జి డీపీఆర్వో రవికుమార్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. ఎల్లారెడ్డి: ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ, వీహెచ్ఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంఘం నాయకులు కంతి పద్మారావు, రామగళ్ల శివానందం తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ గవాయ్పై దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఆయనపై దాడి చేసిన ద్రోహులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎమ్మార్వో కార్యాలయానికి ఎమ్మార్పీఎస్ దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని వారు కోరారు. సాక్షి నెట్వర్క్:బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ను జయప్రదం చేయాలని బీఎల్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిరాములుతో పాటు బీసీ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో వేర్వేరుగా పిలుపునిచ్చారు. అలాగే బీసీ బంద్కు సహకరించాలని బీసీ సంఘం నాయకులు పిట్లంలో తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్కు వినతిపత్రం అందజేశారు. బంద్కు తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం నేతలు, తెలంగాణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు అర్కల ప్రభాకర్ యాదవ్లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ..బీసీలకు 42శాతం రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. కామారెడ్డి టౌన్: తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిగా రాజనర్సును ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్లో ఇటీవల నిర్వహించిన యూనియన్ ఐదో రాష్ట్ర మహాసభల్లో జిల్లాకు చెందిన నాయకులను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. గుర్రం దీవెన, మహబూబ్, వీరయ్య, నర్సవ్వను రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీలో చోటు సాధించిన వారిని జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు అభినందించారు. -
క్రైం కార్నర్
సిర్పూర్ కాగజ్నగర్లో రుద్రూర్వాసి మృతి రుద్రూర్: మండల కేంద్రానికి చెందిన కర్రోళ్ల శ్రీనివాస్ (53) అనే వ్యక్తి గురువారం కుమురం భీం జిల్లా సిర్పూర్ కాగజ్నగర్ రైల్వేస్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు కింద పడి దుర్మరణం చెందినట్టు స్థానికులు తెలిపారు. కూలి పని నిమిత్తం పది రోజుల క్రితం వెళ్లిన శ్రీనివాస్ మృతి చెందాడన్న సమాచారం తెలుసుకున్న బంధువులు సిర్పూర్ కాగజ్నగర్కు బయల్దేరి వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గాంధారి శివారులో మృతదేహం గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్ర శివారులోని గాంధారి–చద్మల్ రహదారి పక్కన గుంతలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గురువారం లభించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. రైతుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. దుండగులు గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి పెట్రోలు పోసి దహనం చేసినట్లు తెలుస్తోంది. మృతదేహం పాక్షికంగా దహనం అయింది. సదాశివనగర్ సీఐ సంతోష్ కుమా ర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ను రప్పించి విచారణ చేశారు. మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30–35 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలిరంగు జీన్ ప్యాంటు, తెల్లని బనియన్, నల్లచారలు కల్గిన తెల్లచొక్కా ధరించి ఉన్నాడు. సంబంధీకులు ఎవరైనా 8712686165, 8712686163 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని తెలిపారు. చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్ మాచారెడ్డి: చోరీ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్ గురువారం తెలిపారు. జూన్ 2న మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన ఆమ లక్ష్మీనారాయణ ఇంట్లో నుంచి గుర్తు తెలియని దుండగులు బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడిన వ్యక్తులను అదే గ్రామానికి చెందిన రాయన పట్ల రాజు, గజ్యానాయక్ తండా చౌరస్తాకు చెందిన మేకల మాధవ్గా గురువారం గుర్తించారు. నిందితుల నుంచి ఐదు మాసాల బంగారు ఉంగరం, మూడు మాసాల వెండి గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. మహిళ అదృశ్యం లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన బైండ్ల గంగామణి అదృశ్యమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. లింగంపేటకు చెందిన బైండ్ల సాయిలుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య గంగామణి, రెండో భార్య భూమవ్వ ఈ నెల 13న గొడవపడ్డారు. దీంతో పెద్ద భార్య గంగామణి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. చుట్టుపక్కల, స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. లింగంపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’పై దాడులు..?
కక్ష సాధింపు మానుకోవాలి కామారెడ్డి టౌన్/బా న్సువాడ/ఎల్లారెడ్డి: ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూ నిరంతరం అక్షరయజ్ఞం చేస్తున్న ‘సాక్షి’ దినపత్రిక, ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఈ అన్యాయాలను, కుట్రలను అన్ని వర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సాక్షి దినపత్రికపై కక్ష సాధింపు మానుకోవాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న పత్రికతోపాటు ఎడిటర్, జర్నలిస్టులపై అక్రమ కేసులను ఎత్తివేయాలి. – నీల నాగరాజు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు -
మొక్కజొన్నల తూకంలో మోసం
● రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యాపారులు భిక్కనూరు: మండలంలోని గుర్జకుంట గ్రామంలో తూకంలో మోసం చేస్తూ వ్యాపారులు పట్టుబడ్డ ఘటన గురువారం చోటుచేసుకుంది. గాంధారి ప్రాంతానికి చెందిన గిరిజన వ్యాపారులు భిక్కనూరు మండలం గుర్జకుంటలో ఒక ఏజెంట్ను పెట్టుకొని మొక్కజొన్నలను కోనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్న బస్తాను 62 కిలోల చొప్పున తూకం వేస్తున్నట్లు రైతులను నమ్మించి 72 కిలోల మొక్కజొన్నలను బస్తాలో నింపి వాహనాల్లో వేశారు. రైతులకు అనుమానం రావడంతో తూకం వేసే ఎలక్ట్రానిక్ కాంటా 10కిలోలు మైనస్లో చూపించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏజెంట్ను, గాంధారి వ్యాపారులను నిలదీశారు. ఒక దశలో తూకంలో మోసానికి పాల్పడిన వారిని చెట్లకు కట్టివేయాలని పలువురు రైతుల యత్నించగా మిగతా రైతులు వారిని సముదాయించారు. చివరికి వ్యాపారులకు జరిమానా విధించి వదిలిపెట్టారు. -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
మాక్లూర్: చదువులో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతో మండలంలోని చిక్లీ గ్రామానికి చెందిన దీమర వెంకట్(16) గురువారం సాయంత్రం గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. చిక్లీ గ్రామానికి చెందిన దీమర సాయిరెడ్డి, మంజుల కుమారుడు వెంకట్ డిచ్పల్లి మండలం ధర్మారం(బి)లోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. చదువులో నెలవారీగా నిర్వహించే కామన్ పరీక్షలలో తోటి స్నేహితుల కంటే తక్కువ మార్కులు వస్తున్నాయన్న బాధతో ఉండేవాడని తెలిపారు. దీపావళి పండుగ కోసం నాలుగు రోజుల ముందే చిక్లీకి వచ్చాడు. గురువారం వెంకట్ గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం
భిక్కనూరు/బోనకల్: రాంగ్ రూట్లో దూసుకొచ్చిన టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ హృదయ విదారక ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద ఎన్హెచ్ 44పై బుధవారం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కరడ్పల్లికి చెందిన మెరుగు కిషన్ (54) ఆదిలాబాద్ జిల్లా రణదీవ్నగర్లో చర్చి పాస్టర్గా పనిచేస్తుండగా, ఆయన తల్లిదండ్రులు కామా రెడ్డిలో ఉంటున్నారు. కిషన్ తన కుమార్తె జాస్లీన్ (30)ను ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన ఆగ మని ప్రకాశ్కు ఇచ్చి వివాహం చేశాడు. ప్రకాశ్ చింతకాని మండలం చిన్న మండవలో పాస్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు జోయల్ ప్రకాశ్ (4), జాడ్సన్ (3 నెలలు). కామారెడ్డిలో ఉంటున్న తన నానమ్మ, తాతయ్య వద్దకు జాస్లీన్ తన ఇద్దరు కుమారులతో కలిసి కొద్ది రోజుల క్రితం వచ్చింది. కిషన్ సైతం తన తల్లి దండ్రుల వద్దకు వచ్చాడు. జాస్లీన్ తన చిన్న కుమారుడు జాడ్సన్కు టీకా వేయించేందుకు భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆశ వర్కర్గా పనిచేస్తున్న తమ బంధువు వద్దకు తండ్రి, పెద్ద కుమారుడితో కలిసి ఎలక్ట్రిక్ స్కూటర్పై బయల్దేరింది. వారి వాహనం జంగంపల్లి వద్దకు చేరుకోగానే రాంగ్రూట్లో అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో నలుగురు రోడ్డుపై పడిపోయారు. కిషన్, జాస్లీన్ అక్కడి కక్కడే మృతి చెందగా, చిన్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్ను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు ఘటనాస్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
‘టీచర్లతో పాఠశాల తనిఖీ బృందాలు ఏర్పాటు చేయొద్దు’
కామారెడ్డి అర్బన్: ఉపాధ్యాయులతో పాఠశాలల పరిశీలన బృందాల ఏర్పాటు అశాసీ్త్రయ, అవివేకమైన ఆలోచనా విధానమని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు ఒక ప్రకటనలో ఆరోపించారు. పాఠశాలల పర్యవేక్షణ, తనిఖీలు, ఉపాధ్యాయుల పనితీరు గమనించే క్రమంలో సహచర ఉపాధ్యాయులపై తనిఖీ బృందాల ఏర్పాటును ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1,473 మంది టీచర్లతో 165 బృందాలు ఏర్పాటు చేయడం ద్వారా వీరిని పాఠశాల విధులకు దూరం చేయడంతో పాటు, అనేక గొడవలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఎంఈవోలు, హెడ్మాస్టర్లు, కాంప్లెక్స్ హెచ్ఎంలను తనిఖీలకు వినియోగించాలని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు కోరారు. బాన్సువాడ: బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజేష్, అన్నారం మాజీ ఉపసర్పంచ్ మొగుల య్య, బుక్కారెడ్డి, మల్గొండ, మహేంద్ర, ప్రసా ద్, నర్సాగౌడ్ తదితరులు బుధవారం బీజీపీ లో చేరారు. బాన్సువాడ బీజీపీ ఇన్చార్జి లక్ష్మీనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతు న్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి యువత బీజేపీలో చేరుతోందన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో బీజీపీ బలపడుతుందన్నారు. నాయకులు సాయికిరణ్, శ్రీనివాస్రెడ్డి, శంకర్గౌడ్, చిదురసాయిలు, కోనాల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో బుధవారం షీటీమ్ బృందం సైబర్ నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబరుకు అలాగే 8712686094 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఎమర్జెన్సీ ఉంటే 100 నంబరుకు డయల్ చేయాలని సూచించారు. కానిస్టేబుల్ శ్రీశైలం, సుప్రజ తదితరులు పాల్గొన్నారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో ఈనెల 17, 18 తేదీలలో స్కూల్ గేమ్స్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారి దేవి సింగ్ పేర్కొన్నారు. దీంతో బుధవారం బ్లూబెల్స్ పాఠశాల కరస్పాండెంట్ సంజీవరెడ్డి ఆట పోటీల నిర్వహణ ఖర్చుల నిమిత్తం తన వంతు సహాయంగా రూ.50 వేల చెక్కును స్థానిక ఎంఈవో దేవి సింగ్కు అందించారు. ఈ సందర్భంగా ఎంఈవో దేవి సింగ్ మాట్లాడుతూ..క్రీడల నిర్వహణకు సంజీవరెడ్డి రూ.50 వేల విరాళంగా ఇవ్వడం ఎంతో శుభపరిణామమని అన్నారు. ఆట పోటీల నిర్వహణ అధికారి రమణారావు, బ్లూబెల్స్ పీటీ లాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన అక్మత్బేగ్ అనే ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. సదరు విద్యార్థి బుధవారం బోధన్లోని కళాశాలకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు అతడి కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో విద్యార్థి తండ్రి కరామత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బీబీపేటలో ఒకరు.. బీబీపేట: మండల కేంద్రానికి చెందిన బట్టుపల్లి నాగరాజుగౌడ్ (33) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై ప్రభాకర్ బుధవారం తెలిపారు. నాగరాజు గౌడ్ మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అతడి తండ్రి సిద్దరామగౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేశారు. ఎవరికై న అతడి ఆచూకీ తెలిస్తే పోలీసు స్టేషన్లో తెలపాలని ఎస్సై పేర్కొన్నారు. గాంధారిలో ఒకరు.. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన పత్తి బాల్రాజు(40) అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. బాల్రాజు మంగళవారం ఉదయం ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో బాల్రాజు భార్య పత్తి మేఘన బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయండి
ఎల్లారెడ్డి: ఎల్లారె డ్డి డివిజన్ కేంద్రంలో భవన ని ర్మాణ కార్మిక సంఘం భవన నిర్మా ణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ సంఘం నాయ కులు రాష్ట్ర అసిస్టెంట్ లేబర్ కమిషనర్కు వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్కు తరలి వెళ్లిన కార్మిక సంఘం నాయకులు భవన నిర్మాణ రంగాల సంక్షేమ మండలి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకట రమణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. డివిజన్ కేంద్రమైన ఎల్లారెడ్డిలో కార్మి క శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, సంఘం కార్యాలయం కోసం స్థలం కేటాయింపు, ని ర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నేతలు దానబోయిన శ్యామ్, అబ్దుల్ రజాక్, నిమ్మ కృష్ణ, బేల్దార్ తుకారాం, సంఘమేశ్వర్, సాయిలు, పిట్ల హనుమంతు తదితరులు పాల్గొన్నారు. -
ఇళ్ల నిర్మాణ పనుల పరిశీలన
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. బుధవారం ఆయన కొర్పోల్, బోనాల్, బాయంపల్లి, బాణాపూర్, బాణాపూర్ తండా, మెంగారం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పరిశీలించారు. అలాగే బాయంపల్లి, బాణాపూర్ తండాల్లోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పెద్దకొడప్గల్(జుక్కల్): నాణ్యతతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు ఎంపీడీవో లక్ష్మీకాంత్ రెడ్డి సూచించారు. బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన వెంట కార్యదర్శి ప్రదీప్, లబ్ధిదారులు పాల్గొన్నారు. -
ఖోఖోకు క్రీడాకారులు ఎంపిక
నిజాంసాగర్(జుక్కల్):అండర్–14, అండర్–17 వి భాగం జిల్లా స్థాయి పోటీలకు బుధవారం మండలంలోని మల్లూర్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీ డాకారులను ఎంపిక చేసినట్లు ఎంఈవో తిరుపతి రె డ్డి తెలిపారు. నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్ మండలాల పరిధిలోని పిట్లం జోన్ తరపున జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు క్రీడాకారులను ఎంపిక చే శామన్నారు.పీడీలు రాజు,జావిద్,సంజీవ్,సంతోష్, సాయిలు,ప్రియాంక,అన్నపూర్ణ ఉన్నారు. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక నస్రుల్లాబాద్: రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మాధవరావు తెలిపారు. బుధవారం పాఠశాలలో వారిని అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తరఫున ఈనెల 16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో వీరు పాల్గొంటారని ప్రిన్సిపాల్ తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ రాహుల్, పీఈటీ ప్రవీణ్ పాల్గొన్నారు. లింగంపేట నుంచి నలుగురు విద్యార్థులు.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జ్యోతిబాపూ లే గురుకుల పాఠశాలకు చెందిన నలుగురు విద్యా ర్థులు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మంజుల తెలిపారు. ఎస్జీఎఫ్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన క్రీడల్లో అండర్–14, అండర్–17 విభాగంలో ప్రతిభ కనపర్చిన నలుగు రు విద్యార్థులు ఆత్మారాం, అరివింద్, శ్రీప్రణీత్, కా ర్తీక్ వాలీబాల్ క్రీడలకు ఎంపికై నట్లు తెలిపారు. ఆ విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు. తాడ్వాయి నుంచి ఇద్దరు క్రీడాకారులు.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లిలో గల ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు కబడ్డీ, వాలీబాల్లో అండర్–14 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల హెచ్ఎం చంద్రవతి, పీడీ నగేష్ తెలిపారు. కబడ్డీ విభాగంలో ఏ. సమన్విత, వాలీబాల్ విభాగంలో వి.నందిని ఇటీవల కామారెడ్డిలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని తమ ప్రతిభను కనబర్చారన్నారు. క్రీడాకారులను పాఠశాలలో బుధవారం అభినందించారు. క్రైం కార్నర్ -
స్తంభాన్ని ఢీకొన్న బైక్: ఒకరి మృతి
ఎల్లారెడ్డి: మండలంలో బైక్ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్సై మహేశ్ వివరాలు ఇలా.. వెల్లుట్ల గ్రామానికి చెందిన పండుగ లక్ష్మణ్(36) బుధవారం మోటార్ సైకిల్పై బాన్సువాడ నుంచి గ్రామానికి బయలుదేరాడు. ఆజామాబాద్ గ్రామ శివారులోని మూల మలుపు వద్ద బైక్ అదుపుదప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొన్నాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. రైలు ప్రమాదంలో ఒకరు.. నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని దుబ్బకు చెందిన ట్రాన్స్జెండర్ మీరా అలియాస్ నారాయన్ కామాజీ అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం నిజామాబాద్ రైల్వేస్టేషన్–జాన్కంపేట స్టేషన్ల మధ్య పట్టాలపై వస్తున్న రైలుకు ఎదురువెళ్లారు. ఈక్రమంలో రైలు ఢీకొని తీవ్రగాయాలై మృతిచెందారు.ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎల్లారెడ్డి: చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో ము నిగి మృతిచెందిన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమయ్యింది. వివరాలు ఇలా.. బాలాజీనగర్ తండాకు చెందిన రుడావత్ గణేశ్ (48) మంగళవారం చేపలు పట్టడానికి ఎల్లారెడ్డి పెద్దచెరువులో దిగగా ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహం కోసం గాలించగా బుధవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ట్యాంకర్ను ఢీకొన్న బస్సు
● ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు డిచ్పల్లి: మండలలోని హైవేపై ఓ ప్రయివేట్ బస్సు అదుపుతప్పి ఇంధన ట్యాంకర్ను ఢీకొని, సమీపంలోని ఏడో బెటాలియన్ పెట్రోల్ బంక్లోకి దూసుకెళ్లింది. ఈఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. డిచ్పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. హరికృష్ణ ట్రావెల్స్కు చెందిన బస్సు బుధవారం హైదరాబాద్ నుంచి జగిత్యాలకు బయలుదేరింది. డిచ్పల్లిలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే బస్సు ముందు వెళుతున్న ట్యాంకర్ను ఢీకొని బంకులోకి దూసుకెళ్లింది. దీంతో పెట్రోల్ బంక్లో ఉన్న వాహనదారులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సు సమీపంలోకి వచ్చి నిలిచిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. అజాగ్రత్తగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ప్రభాకర్ తేజపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: పట్టణంలో ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్టీసీ బస్సు నిజామాబాద్ నుంచి హన్మకొండకు బయలుదేరింది. ఈక్రమంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో బైక్ను బస్సు వెనుకనుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్ ఆజాగ్రత్తగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, ఇరువురిని పోలీస్ స్టేషన్కు తరలించారు విద్యుత్ షాక్తో జీపీ కార్మికుడికి .. బీబీపేట: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్తో గాయపడ్డాడు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు కొంగరి చంద్రం బుధవారం పెద్దమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ బల్బులు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. అప్పటికే విద్యుత్ సరఫరా ఉండడంతో అతని చేతులకు విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. దీంతో కుడి కాలు విరిగింది. స్థానికులు వెంటనే అతడిని కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
నేడు ఆర్ట్స్ కళాశాలలో ఫుడ్ ఫెస్టివల్, ఈకో బజార్
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో గురువారం ఫుడ్ ఫెస్టివల్, క్యాంపస్ ఈకో బజార్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. విద్యార్థులకు వస్తువుల అమ్మకం, మార్కెటింగ్ ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, స్టాళ్ల ఏర్పాటు, సుందరీకరణ, పర్యావరణ స్నేహ పూర్వక ఉత్పత్తులు, సేవలను తెలియజేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ప్రిన్సిపల్ వివరించారు. కామారెడ్డి అర్బన్: అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం ఈనెల 17న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని 121 నంబర్ గదిలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం.రజనీ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. డి–ఫార్మా, బి–ఫార్మా(పీసీఐ) అర్హతతో సీ్త్ర, పురుష ఫార్మసిస్టులకు 40 ఖాళీలు(రూ.17,644 వేతనం), డి–ఫార్మా, బి–ఫార్మా అర్హతతో పురుషులకు ట్రైయినీ ఫార్మసిస్టులకు 20 (రూ.16,144 వేతనం), పదవ తరగతి అర్హతతో ఫార్మసీ అసిస్టెంట్ పురుషులకు 30(రూ.15,879 వేతనం), రిటైల్ ట్రైయినీ 10 ఖాళీలు పురుషులకు (రూ.12వేల వేతనం) ఉన్నాయని పేర్కొన్నారు. వివరాలకు 72079 17714, 76719 74009 నంబర్లకు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన వ్యాపారి పడిగేల సుభాష్ సేట్ సతీమణి వారం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అదే విధంగా గురుస్వామి ఈశ్వర్ దయాళ్రెడ్డి మాతృమూర్తి గత వారం రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే బుధవారం వారి ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
సమయపాలన పాటించని అధికారులపై చర్యలు
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నిజాంసాగర్(జుక్కల్): సమయపాలన పాటించని అధికారులు, ఉద్యోగులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. బుధవారం మహమ్మద్నగర్ మండల తహసీల్ కార్యాలయంలో ఎన్హెచ్–765డి విస్తరణ పనుల్లో భూములు కోల్పోతున్న రైతుల సమావేశానికి సబ్ కలెక్టర్ వచ్చారు. తహసీల్ కార్యాలయం అటెండెన్స్ రిజిష్టర్ను పరిశీలించారు. అనంతరం పల్లె దవాఖానాను సందర్శించారు. పల్లె దవాఖానా వైద్యురాలితో పాటు ఏఎన్ఎం విధులకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె దవాఖానాలో నెల రోజుల నుంచి రోగుల రిజిష్టర్ నిర్వహణ చేపట్టకపోవడంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సబ్కలెక్టర్ ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితిని వివరించారు. ఆమె వెంట తహసీల్దార్ లత, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, గిర్దావర్ పండరి తదితరులున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల లక్ష్యం చేరుకోవాలి నిజాంసాగర్(జుక్కల్): గ్రామ పంచాయతీల వారిగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను చేరుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం మహమ్మద్నగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, నిర్మాణాలకు ముందుకు రాని లబ్ధిదారులతో మాట్లాడాలన్నారు. ఇళ్ల నిర్మించుకునే ఉద్దేశం లేకుంటే రద్దు చేసి కొత్తవారికి ఇళ్లు మంజూరు చేయించాలని సూచించారు. అలాగే ఎన్హెచ్–765డి రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని రైతులకు సూచించారు. పట్టాదారు పాసుబుక్కులు ఉంటే నష్ట పరిహారం అందుతుందన్నారు. శిఖం, అసైన్డ్, భూములు ఉన్న రైతులకు పరిహారం రావడం కష్టమన్నారు. తహసీల్దార్ లత, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, గిర్దావర్ పండరి తదితరులున్నారు. -
పాడి సంపదను పెంచుకోవాలి
డిప్యూటీ కలెక్టర్ రవితేజ తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచుకోవాలని డిప్యూటీ కలెక్టర్ రవితేజ అన్నారు. దేమికలాన్లో బుధవారం నిర్వహించిన పశువైద్య శిబిరానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తోందన్నారు. పశుగ్రాసాన్ని పెంచుకొని పశువులకు ఆహారంగా ఇచ్చినట్లయితే పాల శాతం పెరుగుతుందన్నారు. అనంతరం జిల్లా పశువైద్యాధికారి భాస్కరన్ మాట్లాడుతూ.. రైతులు తమ పశవులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను వేయించాలన్నారు. లేకుంటే పశువులలో పాలదిగుబడి గణనీయంగా తగ్గి, పశువు పునరుత్పత్తి సామర్థ్యం దెబ్బతింటుందన్నారు. గాలికుంటు రోగం వస్తే పశువులకు కాళ్ల గెటికెలు, నోట్లో పుండ్లు అవుతాయని, దీంతో పశువులు మేతమేయక చనిపోయే ప్రమాదముందన్నారు. పశుగ్రాసం ఆవశ్యకత, రకాలు, ప్రభుత్వం ఇస్తున్న గడ్డి విత్తనాల రకాల గురించి వివరించారు.అసిస్టెంటు డైరెక్టర్ శ్రీనివాస్, మండల పశు వైద్యాధికారి రమేష్, వీఎల్వో పోచయ్య, జేవీవోలు కొండల్రెడ్డి, ప్రేంసింగ్, గోపాల మిత్రలు పాల్గొన్నారు. -
ఒకే కుటుంబంలోని ముగ్గురి ఆత్మహత్యాయత్నం
● మృతిచెందిన తండ్రి, చికిత్స పొందుతున్న తల్లి, కొడుకు ● పెళ్లి విషయమై గొడవలే కారణం నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఇందులో తండ్రి మృతి చెందగా, తల్లి, కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండో టౌన్ ఎస్సై గంగాధర్ తెలిపిన వివరాలు ఇలా.. శివాజీనగర్ కు చెందిన దాసరి కిషన్(68)కు భార్య నాగమణి, ఇద్దరు కొడుకులు వంశీ, బాలకృష్ణ ఉన్నారు. పెద్దకొడుకు వంశీ గల్ఫ్కు వెళ్లి తిరిగి వచ్చి, మద్యానికి బానిసయ్యాడు. చిన్న కొడుకు బాలకృష్ణతో కలిసి కిషన్ కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. బాలకృష్ణకు వివాహం జరుగగా, వంశీకి పెళ్లి కాలేదు. ఈవిషయమై మంగళవారం అతడు తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. దీంతో వంశీ గడ్డిమందు తాగి చనిపోతానంటూ మందు తాగాడు. వెంటనే వంశీ నుంచి తల్లి గడ్డిమందు డబ్బా తీసుకొని ఆమె తాగింది. ఆమె నుంచి కిషన్ డబ్బా తీసుకొని తాగాడు. దీంతో ముగ్గురు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు గమనించి వారిని వెంటనే చికిత్స కోసం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున కిషన్ చికిత్స పొందుతు మృతిచెందగా, మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై మృతుడి చిన్నకుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి వెళ్లి వారు విచారణ చేపట్టారు. కిషన్ మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం పోలీసులకు ఇవ్వకపోవడం, మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంపై పోలీసులు ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సంబంధిత డివిజన్, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుపేద ప్రజలు సౌకర్యవంతంగా సొంత ఇంట్లో నివసించాలనే కలను సహకారం చేస్తూ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిందన్నారు.జిల్లాలో మొత్తం 11,679 ఇళ్ల నిర్మాణాలకు మహిళల పేరిట అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. జిల్లాకు మంజూరు చేసిన అన్ని ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభి, త్వరగా పూర్తి చేయించాలని సూచించారు. ఎంపీడీవోలు, ఎంపీవోలు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీసీలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.వీసీలో సూచనలిస్తున్న కలెక్టర్ -
ఏకాభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్పాల్ కరోలఎల్లారెడ్డి: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల ఏకాభిప్రాయం మేరకు డీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తామని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు, రాజ్యసభ ఎంపీ రాజ్పాల్ కరోల స్పష్టం చేశారు. బుధవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన సంఘటన సృజనా అభియాన్, నియోజవకర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్పాల్ కరోలా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేస్తామని, అందరి ఏకాభిప్రాయ నిర్ణయంతోనే కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుందన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల ప్రార్టీ శ్రేణుల అభిప్రాయ సేకరణ పూర్తయ్యాక టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, సీఎం రేవంత్రెడ్డి, జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీలకు తమ నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ మోహన్రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు రజిత వెంకట్రామ్రెడ్డి, బండారి పరమేశ్, మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా చేపట్టిన ఓట్ చోర్..గద్దీ చోర్ ఆందోళనకు మద్దతుగా రాజ్పాల్ కరోల, మదన్మోహన్ రావు, డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు తదితరులు సంతకాలు చేశారు. -
టీకా కోసం వెళ్తూ అనంతలోకాలకు..
భిక్కనూరు: టీకా వేయించేందుకు మూడు నెలల పసికందుతోపాటు వెళ్లిన ముగ్గురిని టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. భిక్కనూరు మండలం జంగంపల్లి బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసు కున్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. తాడ్వా యి మండలం కరడ్పల్లి గ్రామానికి చెందిన మెరుగు కిషన్ (54) అనే వ్యక్తి 20 ఏళ్లుగా ఆదిలాబాద్ జిల్లా రణదీవ్నగర్ చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. వృద్ధులైన తల్లిదండ్రుల బాగోగులను ఒక నెల కిషన్, మరో నెల తన సోదరుడు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తన వంతు వచ్చినప్పుడు కిషన్ శాబ్దీపూర్ శివారులో ఉన్న అద్దె ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. కిషన్ కుమార్తె జాస్లీన్ (30)కు ఖమ్మం జిల్లా ముష్టికుంటకు చెందిన పాస్టర్ ఆగమని ప్రకాశ్తో వివాహం చేశాడు. జాస్లీన్కు జోయల్ ప్రకాశ్(4), మూడు నెలల జాడ్సన్ అనే కుమారులు ఉన్నారు. జాస్లీన్ ఇటీవల కొడుకులతో వచ్చి తండ్రి, నానమ్మ–తాతయ్యలతో కలిసి ఉంటోంది. అయితే, జాడ్సన్ కు నెల టీకా ఇచ్చే సమయం అయ్యింది. దీంతో భిక్కనూరు ప్రభుత్వాసుపత్రిలో ఆశవర్క రుగా పనిచేసే బంధువును కలిసి జాడ్సన్కు టీకా ఇప్పించవచ్చని భావించిన జాస్లీన్ ఈ విషయాన్ని తండ్రి కిషన్కు వివరించింది. దీంతో కిషన్ తన ఎలక్ట్రిక్ స్కూటీపై జాస్లీన్, మనుమలు జోయల్ ప్రకాశ్, జాడ్సన్లను తీసుకొని భిక్కనూరుకు బయల్దేరాడు. జంగంపల్లి వద్ద జాతీయ రహదారిపై వెళ్తుండగా ఎదురుగా రాంగ్ రూటులో టిప్పర్ వేగంగా వచ్చి ఎలక్ట్రిక్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో నలుగురు గాలిలో ఎగిరి కిందపడ్డారు. కిషన్, జాస్లీన్లు అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న చి న్నారులు జోయల్ ప్రకాశ్, జాడ్సన్లను కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసినా ప్రాణాలు దక్కలేదు. అప్పటికే చిన్నారులిద్దరూ మరణించారు. ఘటనా స్థలా న్ని ఎల్లారెడ్డి డీఎస్పీ, కామారెడ్డి ఇన్చార్జి శ్రీనివాస్ రావు, రూరల్ సీఐ రామన్ పరిశీలించారు. డ్రైవర్ అజాగ్రత్తగా టిప్పర్ను రాంగ్రూట్లో నడపడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. కేసు నమోదు చేసుకొని డ్రైవర్ రాజిరెడ్డిని అరెస్టు చేశామని ఎస్సై ఆంజనేయులు వివరించారు. టిప్పర్ రూపంలో ఎదురుగా వచ్చిన మృత్యువు తాత, ఇద్దరు మనుమలు, కుమార్తె మృతి జంగంపల్లిలో నెత్తురోడిన జాతీయ రహదారి -
బోనస్ ప్రశ్నార్థకం..!
యాసంగి సన్నాలకు అందని వైనం ● జిల్లాకు రావాల్సింది రూ.89 కోట్లు ● ఇస్తారనే ఆశతో ఖరీఫ్లో మళ్లీ సన్నరకం వరి సాగు ● స్పష్టత లేక రైతుల్లో ఆందోళనకామారెడ్డి క్రైం: సన్నరకం వడ్ల సాగును ప్రోత్సహిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రా గానే క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రకటించింది. అందులో భాగంగా ఖరీఫ్లో నిధులు మంజూరు చే సిన ప్రభుత్వం, యాసంగి నుంచి బోనస్ ఊసె త్తడం లేదు. యాసంగిలో రైతులు విక్రయించిన స న్నాలకు సంబంధించిన బోనస్ డబ్బులు ఇప్పటికీ పడలేదు. అయితే, ఖరీఫ్లోనైనా ఇవ్వకపోతారా అనే ఆశతో మళ్లీ సన్నాలు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోతలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ప్రభు త్వం నుంచి అధికారిక ఉత్తర్వులు, ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెండింగ్లో రూ.89 కోట్లు.. గత యాసంగిలో జిల్లా వ్యాప్తంగా రైతులు మొత్తం 2,61,110 ఎకరాల్లో వరి సాగుచేశారు. దాంట్లో దాదాపు 60 వేలకు పైగా ఎకరాల్లో సన్నరకం వడ్లను పండించారు. మార్చి నెలాఖరు నుంచి కొనుగోళ్లు ప్రారంభించి మొత్తం 3.82 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని సేకరించారు. అందులో 1,78,416 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం సేకరణ చేపట్టగా, అందుకు సంబంధించిన రూ.886 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. బోనస్ డబ్బుల కోసం సన్నాలు పండించిన 72,852 మంది రైతులు మాత్రం ఎదురుచూస్తూనే ఉన్నారు.బోనస్ వస్తుందనే ఆశతోనే యాసంగిలో సన్నరకం వడ్లు పండించాను. 6 నెలలు దాటినా ఇంకా బోనస్ డబ్బులు పడలేదు. సాగు ఖర్చులు బాగా పెరిగాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం స్పందించాలి. – అల్లం రాములు, మైలారం, నస్రుల్లాబాద్ మండలంయాసంగి బోనస్ డబ్బులకు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాకు రూ.89 కోట్ల వరకు రావాల్సి ఉంది. నేరుగా రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమ అవుతాయి. బోనస్ అనేది నిరంతర ప్రక్రియనే. ఎప్పుడు వస్తాయనే దానిని ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. – శ్రీకాంత్, డీఎం, సివిల్ సప్లయ్ కార్పొరేషన్, కామారెడ్డియాసంగిలో కంటే ఖరీఫ్లో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత ఖరీఫ్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3.18 లక్షల ఎకరాల్లో వరి పండించారు. అందులో 1.40 లక్షల ఎకరాల్లో సన్నరకం వడ్ల సాగు జరిగి ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్, నిజాంసాగర్, నాగిరెడ్డిపేట తదితర మండలాల పరిధిలో వరి కోతలు మొదలుకాగా, కేంద్రాలకు ధాన్యం తరలివస్తోంది. -
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా
● ఎస్ఈ శ్రావణ్కుమార్ నిజాంసాగర్(జుక్కల్): వ్యవసాయరంగంతో పాటు గృహ అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎస్ఈ శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని మల్లూ ర్ 33 కేవీ సబ్స్టేషన్లో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రేకర్ను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ కరెంట్ సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద నీటి ప్రవాహాల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలయన్నారు. వాటి స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేసి కరెంట్ సరఫరాకు ఆటంకం లేకుండా చూశామని తెలిపారు. కార్యక్రమంలో ట్రాన్స్కో ఏడీ అరవింద్, ఏఈ మోహన్ నాయక్, లైన్మన్లు శ్రీనివాస్, శేర్ అలీ, నాగరాజు తదితరులు ఉన్నారు.● ప్రారంభించిన అదనపు కలెక్టర్ విక్టర్ కామారెడ్డి క్రైం: వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కలెక్టరేట్లోని సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను అదనపు కలెక్టర్ విక్టర్ బుధవారం ప్రారంభించారు. ఽఅనంతరం కంట్రోల్ రూంను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన ఏవైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే టోల్ఫ్రీ నెంబర్ 08468–220051కు సంప్రదించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డీఎం శ్రీకాంత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం క్యాంపు శివారులోని నిజాంసాగర్ ప్రధాన కా లువకు అనుబంధంగా ఉన్న 11 నెంబర్ డి స్ట్రిబ్యూటరీ కెనాల్ను బుధవారం నీటి పారు దల శాఖ ఎస్ఈ దక్షిణమూర్తి పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు డి స్ట్రిబ్యూటరీ కెనాల్ వద్ద కట్ట కుంగిపోయి మట్టికొట్టుకుని పోయింది. దీంతో ప్రధాన కాలువ ప్రమాదకరంగా మారింది. మరమ్మతులకు రూ.10 లక్షల నిధులు మంజూరైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. దీంతో ఎస్ఈ దక్షిణమూర్తి, డీఈఈ శ్రీచంద్, ఏఈ నితిన్ వాస్తవ పరిస్థితిని గమనించారు. కాంట్రాక్టర్లతో మాట్లాడి వీలైనంత త్వరగా పనులు పూర్తిచేయిస్తామన్నారు. వారి వెంట గ్రామస్తులు శ్రీనివాస్రెడ్డి, మమ్మాయి కాశీరాం, సత్యం, కృష్ణ, బస్వయ్య, మంద శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ● ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి రూరల్: ప్రతి పోలీసు ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. పోలీస్ ఉద్యోగం బాధ్యత, సేవతో కూడుకున్నదని తెలిపారు. కామారెడ్డి రూ రల్ పోలీస్ స్టేషన్ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సర్కిల్ కా ర్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన రికా ర్డు రూంను ప్రారంభించారు. స్టేషన్ శుభ్రత, రికార్డుల నిర్వహణ, దర్యాప్తులో ఉన్న గ్రేవ్ కే సుల ప్రగతిని సమీక్షించారు. ఎలాంటి కేసు లు పెండింగ్లో ఉండకుండా చర్యలు తీసు కోవాలన్నారు. కేడీ, సస్పెక్ట్, రౌడీ షీటర్లు కదలికలను క్రమం తప్పకుండా పరిశీలించి, నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. రో డ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాల్లో ర్యాంబుల్ స్ట్రిప్స్, ఇసుక డ్రమ్ము లు, సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలన్నారు. ఎస్పీ వెంట రూరల్ సీఐ రామన్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
డీసీసీ పదవికి పెరిగిన పోటీ!
● ఇప్పటికే పది మందికి పైగా దరఖాస్తు ● మరికొందరు దరఖాస్తు చేసుకునేందుకు సన్నద్ధం ● ఎవరి ప్రయత్నాల్లో వారు...సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఏర్పాటైన తర్వాత పట్టణానికి చెందిన సీనియర్ నేత కై లాస్ శ్రీనివాస్రావ్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమించారు. అప్పటి నుంచి ఆయనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డీసీసీ కొత్త కార్యవర్గాల నియామకానికి పార్టీ నాయకత్వం కసరత్తు చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో ఏఐసీసీ పరిశీలకులు రాజ్పాల్ కరోలా ఆధ్వర్యంలో ని యోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నా రు. తొలుత జిల్లా నాయకులతో జిల్లాస్థాయి సమా వేశం కామారెడ్డిలో జరిగింది. తర్వాత కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల సమావేశాలు మంగళ, బుధవారాల్లో పూర్తయ్యాయి. బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల సమావేశాలు కూడా గురు, శుక్రవారాల్లో నిర్వహించనున్నారు. అయితే, జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండడంతో చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే పది మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ మరోసారి దరఖాస్తు చేసుకున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన పంపరి శ్రీనివాస్, కామారెడ్డి మండలానికి చెందిన నిమ్మ విజయ్కుమార్రెడ్డిలు ఏఐసీసీ పరిశీలకుడిని కలిసి దరఖాస్తు చేసుకున్నారు. సదాశివనగర్ మండలానికి చెందిన లింగాగౌడ్, రా మారెడ్డి మండలానికి చెందిన గీరెడ్డి మహేందర్రెడ్డి, నారెడ్డి మోహన్రెడ్డి, గాంధారికి చెందిన ఆకుల శ్రీనివాస్, నిజాంసాగర్కు చెందిన మల్లికార్జున్ తదితరు లు దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ తన ప్రధాన అనుచరుడు, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్కు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గ సమావేశంలో అందరూ కలిసి ఆయన పేరును ప్రతిపాదించారు. అయితే ఇప్పటికే డీసీసీ అధ్యక్షులుగా ఉన్నవారిని తిరిగి నియమించకపోవచ్చని అంటున్నారు. దీంతో కై లాస్ శ్రీనివాస్రావ్ పదవిపై డైలామా నెలకొంది. ఆయనను కాదంటే షబ్బీర్ అలీ ఎవరి పేరును సూచిస్తారన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్రావు తన అనుచరుడు లింగాగౌడ్కు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా తనకు అవకాశం ఇవ్వాలని రామారెడ్డి మండలానికి చెందిన మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే మండలానికి చెందిన మాజీ జెడ్పీటీసీ నారెడ్డి మోహన్రెడ్డి కూడా డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు తన అనుచరుడు మల్లికార్జున్కు ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్లో రెండు గ్రూపులు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి తమ అనుచరులను రంగంలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు. గాంధారి మండలానికి చెందిన మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కామారెడ్డి మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు నిమ్మ విజయ్కుమార్రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి అనుచరుడిగా ఉన్న సీనియర్ నేత పంపరి శ్రీనివాస్ డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతుందని ఏఐసీసీ పరిశీలకుడు వెల్లడించడంతో మరికొందరు నేతలు దరఖాస్తు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల నుంచి మరికొందరు నేతలు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరాటపడుతున్న నేతలు ఎన్నికలు వాయిదా పడడంతో డీసీసీ పదవికి ఓ దరఖాస్తు పెడితేపోలా అనే ఆలోచనలో ఉన్నారు. నామినేటెడ్ పదవులు రానివాళ్లంతా డీసీసీ పదవులపై కన్నేశారు. దీంతో పోటీ పెరిగే అవకాశం ఉంది.జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి అంటే పార్టీ పరంగా ప్రోటోకాల్ ఉంటుందనే భావనతో పలువురు నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తమ గాడ్ఫాదర్లతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
మిగిలింది మూడు రోజులే..
● ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 267 ● మద్యం దందాపై ఆసక్తి తగ్గిందా! సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణాలు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతోపాటు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించి, 23న అధికారులు డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. అయితే దరఖాస్తులు చేసుకునే గడువు మూడు రోజులే మిగిలి ఉండగా 49 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు కేవలం 267 మాత్రమే. దసరా తర్వాత దరఖాస్తులు వెల్లువలా వస్తాయని అనుకున్నా, ఆ స్థాయిలో రావడం లేదు. శుభ ముహూర్తాలు వచ్చినా దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మద్యం దుకాణాలకు దరఖాస్తు ఫీజు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరగడంతో చాలా మంది వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో 49 మద్యం దుకాణాలకు బుధవారం నాటికి 267 దరఖాస్తులు వచ్చినట్టు జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి హన్మంతరావ్ ‘సాక్షి’కి తెలిపారు. కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 దుకాణాలకు 63, దోమకొండ పరిధిలోని 8 దుకాణాలకు 44, ఎల్లారెడ్డి పరిధిలోని 7 దుకాణాలకు 41, బాన్సువాడ పరిధిలోని 9 వైన్సులకు 59, బిచ్కుంద పరిధిలోని 10 దుకాణాలకు 60 దరఖాస్తులు వచ్చాయి. గతంలో పోటీ.. జిల్లాలో మద్యం దుకాణాలకు రెండేళ్లకోసారి నిర్వహించే కేటాయింపు దరఖాస్తులకు గతంలో పెద్ద ఎత్తున పోటీ ఉండేది. 2021–23 సంవత్సరాలకు 49 మద్యం దుకాణాలకు 960 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.19.20 కోట్ల ఆదాయం వచ్చింది. 2023–25 సంవత్సరాలకు 49 మద్యం దుకాణాలకు 2,204 దరఖాస్తుల ద్వారా రూ.44.08 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి కూడా మద్యం దుకాణాలు అంతే ఉండగా, గతంలో కన్నా ఎక్కువ దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించారు. అయితే ఇప్పటి వరకు కేవలం 267 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఈ నెల 18తో అంటే మరో మూడు రోజుల్లో గడువు ముగియనుంది. ఆఖరి మూడు రోజుల్లో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. -
5.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావొచ్చు
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: ఖరీఫ్ సీజన్లో 5.98 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లు, అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై బుధవారం వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు కురిస్తే వరద నీరు రాకుండా కొనుగోలు కేంద్రాలను ఎత్తయిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలన్నారు. కేంద్రాల్లో అవసరమైన యంత్రాలు, కాంటాలు, టార్ఫాలిన్లు, రవాణా వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. -
బాన్సువాడలో సినిమా షూటింగ్ సందడి
బాన్సువాడ: బాన్సువాడలో మంగళవారం సినిమా షూటింగ్తో సందడి నెలకొంది. పంపారీస్ సాగ (హిందీ) సినిమాలో హీరో–హీరోయిన్లుగా జూబేర్ ఖాన్, అనుషాల నటిస్తుండగా డైరెక్టర్ జూబేర్ ఖాన్, నిర్మాత, రైటర్ అబ్దుల్ అద్నాన్ (బాన్సువాడ) ఉన్నారు. గతంలో పాత బాన్సువాడలో దివంగత వ్యాపారవేత్త విఠల్రెడ్డి స్వగృహంలో ఫిదా సినిమా షూటింగ్ చేసిన విషయం తెలిసింది. అదే ఇంట్లో ప్రస్తుతం పంపారీస్ సాగ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. ముంబైకి చెందిన హీరోహీరోయిన్లు, మిగత నటీనటులు షూటింగ్కు రావడంతో బాన్సువాడ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తిలకించారు. -
రోడ్లు, కుంటల మరమ్మతులకు నిధులు మంజూరు
భిక్కనూరు: వరదలతో దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, కుంటలు, కాల్వల మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని పీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. మంగళవారం భిక్కనూరు మండల కేంద్రంలో ఇటీవల వరదలకు తెగిన దాసనమ్మ కుంట కట్ట మరమ్మతు పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం వరదలను ప్రత్యేక విపత్తుగా భావించి నిధులను మంజూరు చేసి పనులను ప్రారంభింపజేసిందన్నారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీంరెడ్డి, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు దయాకర్రెడ్డి, నీల అంజయ్య, సాజీద్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్మూర్లో మహిళ దారుణ హత్య
● వివాహేతర సంబంధమంటూ ఘాతుకానికి పాల్పడిన భర్త ● నిందితుడి అరెస్టు ఆర్మూర్టౌన్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆర్మూర్లో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జగదీష్ 40 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం ఆర్మూర్కు వలస వచ్చాడు. కొన్నేళ్ల క్రితం మెదక్ జిల్లాకు చెందిన మమతను వివాహం చేసుకొని మామిడిపల్లి లో నివసిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జగదీష్ ఒక సామిల్లో పనిచేస్తుండగా, మమత నిజామాబాద్లో గణపతి విగ్రహాలకు మెరుగులు దిద్దే పనిచేస్తుంది. కాగ మమత మామిడిపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న విషయం తెలిసిన భర్త పలుమార్లు వారించాడు. ఈ విషయమై మంగళవారం వారు పోలీస్ స్టేషన్కు వెళ్లగా దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అనంతరం పనికి వెళ్లిన జగదీష్ ఇంటికి వచ్చేసరికి భార్య, ప్రియుడు కలిసి ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. విచక్షణ కోల్పోయి, వంట గదిలో ఉన్న కత్తితో భార్య గొంతును కోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్హెచ్వో స్యతనారాయణగౌడ్, ఎస్సైలు రమేష్, వినయ్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
చేపలు పట్టడానికి వెళ్లి ఒకరు గల్లంతు
ఎల్లారెడ్డి: చేపలు పట్టడానికి చెరువుకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన ఎల్లారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన రుడావత్ గణేశ్ (48) మంగళవారం ప ట్టణ శివారులోని పెద్ద చెరువులో చేపలు పట్టడానికి ఇంటి నుంచి బయలుదేరాడు. చెరువులోకి దిగిన అతడు ప్రమాదవశాత్తూ నీళ్లలో మునిగిపోయాడు. అతడి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది సహకారంతో పోలీసులు సాయంత్రం వరకు ప్రయత్నించినా చీక టి పడటంతో సాధ్య పడలేదు. మృతదేహం కోసం బుధవారం ఉదయం గాలింపులు చేపడతామ ని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. నిజాంసాగర్(జుక్కల్):కాలకృత్యాలు తీ ర్చుకునేందు నిజాంసాగర్ ప్రధాన కాలు వలోకి వెళ్లిన ఓ వ్యక్తి నీటమునిగి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన ఎడ్ల భానుప్రసాద్ (22) సోమవారం సాయంత్రం తుంకిపల్లి గ్రామం నుంచి మహమ్మద్ నగర్ గ్రామానికి బైక్పై బయలుదేరాడు. బూర్గుల్ గ్రామ శివారులో ని నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట వద్ద బహి ర్బుమి కోసం వెళ్లాడు. అనంతరం ప్రధాన కాలువ నీటిలో కాలకృత్యాలు తీర్చుకుంటుండగా ప్రమాద వశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడు. కాలువలో గా లింపు చేపట్టగా మంగళ వారం మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. శంకర్పల్లి: గ్రామంలోని ఓ మహి ళ మెడలోని పుస్తెలతాడును చోరీకి యత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా.. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గాన్కు చెందిన కుంబారే సిద్ధారెడ్డి, సునీత దంపతులు వారి కుమారుడు, కుమార్తెతో కలిసి నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం శంకర్పల్లికి వచ్చారు. పట్టణంలో టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కొన్నాళ్లుగా ఈ దంపతుల కదలికలను గమనిస్తున్న దుండగు డు మంకీ క్యాప్ ధరించి హఠాత్తుగా ఇంట్లోకి చొరబడ్డాడు. సు నీత కళ్లలో కారం చల్లి.. క్రికెట్ బ్యాట్తో దాడి చేసి మెడలోని పుస్తెలతాడును లాక్కుని పరారయ్యాడు. అక్కడే కార్ వాషింగ్ సెంటర్ నిర్వహిస్తున్న ప్రవీణ్ గమనించి వెంటనే పట్టుకుని తనిఖీ చేశాడు. బ్యాగులో కారం పొడి, మంకీక్యాప్, పుస్తెలతాడు లభించింది. అప్పటికే సునీత భర్తకు సమాచారం ఇచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధారెడ్డి దుండగుడు టిఫిన్ సెంటర్ ఎదురుగా అద్దెకు ఉండే వాసు(45)గా గుర్తించాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వాసు డైలీ ఫైనాన్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చేవెళ్ల కోర్టులో హాజరు పరిచారు. రిమాండ్ నిమిత్తం చర్లపల్లి జైలుకి తరలించారు. -
క్రైం కార్నర్
మహిళ ఆత్మహత్య పిట్లం(జుక్కల్): ఓ వివాహిత మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా..బాన్సువాడ డివిజన్ తాడ్కోలు గ్రామానికి చెందిన చిన్న నాగమణి (52) గత మూడేళ్లుగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. చికిత్స చేయించినప్పటికీ వ్యాధి తగ్గకపోవడంతో జీవితం మీద విరక్తిచెందింది. ఈక్రమంలో బుధవారం రాత్రి ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చి బొల్లపల్లి గ్రామ శివారులోని మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. ఆటో డ్రైవర్ .. భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు మంగళవారం తెలిపా రు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన తిప్పబోయిన నితిన్(21)ఆటో డ్రైవర్గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం నితిన్ ఆటో కిరాయికి వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి, బయలుదేరాడు. మధ్యాహ్నం తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తన వ్యవసాయ పొలం వద్ద మామిడి చెట్టుకు ఉరివేసుకుంటున్నట్టు చెప్పి, చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నితిన్ గత కొన్ని నెలలుగా మద్యానికి బానిసగా మారాడని సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ఉపాధి కూలీలకు ఈ–కేవైసీ హాజరు
● జాబ్కార్డులతో ఆధార్ అనుసంధానం ● పని ప్రదేశంలో ఐరిస్ నమోదు పెర్కిట్(ఆర్మూర్)/కమ్మర్పల్లి: మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల బోగస్ హాజరుకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కూలీల హాజరును ఈ–కేవైసీతో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ జాతీయ మస్టర్ పర్యవేక్షణ వ్యవస్థ(ఎన్ఎంఎంఎస్)ను తీసుకురాగా, కూలీల వివరాలు, ఈ–కేవైసీ నమోదు చేయడం తప్పనిసరి చేసింది. ఈ విధానంలో కూలీల జాబ్ కార్డులకు ఆధార్ అనుసంధానం చేయడంతోపాటు ఒకరి బదులుగా మరొకరు పనులకు రాకుండా ఐరీస్ నమోదు తప్పనిసరి చేశారు. ఈకేవైసీ పూర్తి చేసుకోని కూలీలకు పనులు కల్పించే అవకాశం ఉండదు. ఒకరి జాబ్కార్డుపై మరొకరు పని చేసే అవకాశం ఇక ఉండదని అధికారులు చెబుతున్నారు. అక్రమాలకు ఆస్కారం లేకుండా.. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో చేపట్టనున్న ప నుల వివరాల నమోదుకు ఈ–ఎంబీ (ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్) విధానాన్ని అమలులోకి తీసు కు వచ్చారు. పనిచేసే ప్రాంతాల వివరాలను గుర్తించిన తర్వాత పనులు కొలతలను ఎంబీ రికార్డు చే సిన అనంతరం ఆన్లైన్లో ఈ–ఎంబీ చేయాల్సి ఉంటుంది. వివరాలను ప్రత్యేక యాప్లో అనుసంధానం చేస్తే ఆయా పనులను ఉన్నతాధికారులు ఎ క్కడి నుంచయిన పరిశీలించవచ్చు. దీంతో ఒకేచోట రెండు పనులు చేయడం వంటి తప్పిదాలకు ఆ స్కారం ఉండదు. నూతన సంస్కరణలతో పనులు పారదర్శకంగా కొనసాగడంతోపాటు, కూలీలకు కూలి చెల్లింపులు న్యాయంగా జరుగుతాయి. గతంలో పని ప్రదేశం వద్ద కూలీల హాజరును నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్లో అప్లోడ్ చేసేవారు. కానీ కొందరు క్షేత్ర సహాయకులు, మేట్లు నకిలీ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నట్లు గుర్తించారు. సామాజిక తనిఖీల్లో అక్ర మాలు బయటపడుతుండటంతో వీటిని అరికట్టేందుకు కేంద్రం ఎన్ఎంఎంఎస్ యాప్ తీసుకువచ్చింది. ఈ యాప్ కూడా దుర్వినియోగం చేస్తున్నట్లు గుర్తించింది. దీంతో నకిలీల హాజరు అరికట్టేందుకు ఈ–కేవైసీ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం సెల్ఫోన్లో ఫొటోలను తీసి అప్లోడ్ చేస్తారు. నాలుగు గంటల తర్వాత మరోసారి ఫొటో తీసి అప్లోడ్ చేస్తారు. ఒకే వ్యక్తి రెండు ఫొటోల్లో ఉంటేనే కూలీ డబ్బులు అందుతాయి. జిల్లాలో మొత్తం 2,40,605 లక్షల కూలీలు ఉండగా, ఇప్పటి వరకు 1,27,807 మంది కూలీలకు ఈ–కేవైసీ పూర్తయింది. జిల్లాలో కూలీల ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. సాధ్యమైనంత త్వరగా నమోదు పూర్తిచేయించేలా చర్యలు తీసుకోవాలని ఏపీవోలను ఆదేశించాం. ఈ–కేవైసీ విధానానికి కూలీలు పూర్తిగా సహకరించాలి. జిల్లాలో మొత్తం 2,40,605 లక్షల కూలీలు ఉండగా, ఇప్పటివరకు 1,27,807 మంది కూలీలకు ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తయింది. –సాయాగౌడ్, పీడీ, డీఆర్డీవో, నిజామాబాద్ ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో జాబ్ కార్డు ఉన్న కూలీల వివరాలను ఈ–కేవైసీ చేయిస్తున్నాం. ఇప్పటికీ దాదాపు 50 శాతంపైనే ఈకేవైసీ పూర్తి చేశాం. గ్రామాల్లోని ఫీల్డు అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు నూతన విధానంపై అవగాహన కల్పించాం. నకిలీ మస్టర్లకు తావులేకుండా అర్హులైన కూలీలందరికి వంద రోజుల పని కల్పించేందుకు కృషి చేస్తున్నాం. –సురేష్, ఏపీవో, ఆర్మూర్ -
మన చేతుల్లోనే ఆరోగ్యం
సేంద్రియ ఎరువుల ద్వారా పంటలను పండించాలి● తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కుంటేనే ఎంతో మేలు ● నేడు గ్లోబల్ హ్యాండ్ వాష్డే కమ్మర్పల్లి: మనం ఏం తిన్నామో కాదు, ఎలా తిన్నామో అనేదే ముఖ్యం. భోజనం తినడానికి ముందు, బాత్రూమ్ వెళ్లివచ్చిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంతో మేలు. ముఖ్యంగా తల్లిదండ్రులు చిన్నారులకు తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవడం అలవాటు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేతులు శుభ్రం చేసుకోవడంపై పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఏటా అక్టోబరు 15న విశ్వవ్యాప్తంగా చేతుల పరిశుభ్రత దినోత్సవం(గ్లోబల్ హ్యాండ్ వాష్ డే)గా పాటిస్తున్నారు. శుభ్రంగా లేకుంటే.. మనిషి ఆరోగ్యం శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. మురికిగా ఉన్న చేతులతో భోజనం చేస్తే వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి జబ్బులు వస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా పనులు చేస్తుంటాము. ఈక్రమంలో మనం తాకిన ప్రతి వస్తువులపైన కనిపించని క్రిములుంటాయి. ఆయా వస్తువులను తాకినపుడు మన చేతికి అంటుకొంటాయి. చేతుల్లో కంటికి కనిపించని వైరస్లు లక్షల్లో దాగిఉంటాయి. అవే చేతులను కళ్లు, నోరు, ముక్కు దగ్గర పెట్టినపుడు బ్యాక్టీరియా, వైరస్ మన శరీరంలోకి చేరుతుంది. చేతులను నీటితో శుభ్రం చేసుకోకుండా ఆహారం తీసుకుంటే చేతుల్లోని క్రిములు నోటిద్వారా శరీరంలోకి చేరుతాయి. అవగాహన కల్పించాలి..చేతుల శుభ్రతపై పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం అరచేతుల్లో ఎక్కువ తేమ ఉండటంతోపాటు కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ చేతులతోనే తినేయడంవల్ల అనేక రోగాల్ని చేతులతో ఆహ్వానించినట్టే. తరచు చేతులు శుభ్రం చేసుకోవడంవల్ల 80 శాతం రోగాలు మన శరీరానికి దూరంగా ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. అందుకే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ముందు విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఆహారం తీసుకునేముందు సబ్బు లేదా యాంటీ బాక్టీరియల్ లోషన్, సానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవాలి. -
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక
కామారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో ఈ నెల 16 నుంచి 18 వరకు జరిగే రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టులను ఎంపిక చేసినట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అండర్–17 బాలుర, బాలికల జట్టులను క్రీడాకారులను ప్రకటించారు. నిజామాబాద్ నుంచి 14 మంది, కామారెడ్డి నుంచి 12 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. వ్యాయామ ఉపాధ్యాయులు స్వామి గౌడ్, అశోక్, రాజా గౌడ్, బాలయ్య, లక్ష్మణ రాథోడ్, సతీష్, శేఖర్, శ్రీనివాస్, మధు తదితరులున్నారు. భిక్కనూరు: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఫరీదుపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని చింతల స్పందన ఎంపికై ందని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు భాస్కర్రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ నెల 16 నుంచి 18వరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో స్పందన పాల్గొంటుందన్నారు. స్పందనను పాఠశాల హెచ్ఎం మనోహర్రావు, పాఠశాల చైర్మన్ సౌజన్య ఉపాధ్యాయులు అభినందించారు. గాంధారి(ఎల్లారెడ్డి): గండివేట్ శివారులో మంగళవారం క్షేత్ర స్థాయిలో వరి పొలాలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. వరి పొలాల్లో మానిపండు తెగులు, ఆకుల పై పసుపు పచ్చ మచ్చలున్నట్లు గుర్తించామన్నారు. మోతాదుకు మించి యూరియా మందును వాడకం వల్ల ఈ తెగులు ఆశిస్తుందన్నారు. సంబంధిత రైతులకు సస్యరక్షణ చర్యల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినట్లు తెలిపారు. కామారెడ్డి రూరల్: దేవునిపల్లి 35వ వార్డులోని దత్తాత్రేయ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాత రాజేశ్వర్కు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజుపాటిల్, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, పోచయ్య, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
వడ్ల పొట్టుకు భలే డిమాండ్
బీబీపేట: ఇటుక బట్టీలు, హోటళ్లు, కోళ్ల ఫారాలు ఇలా అనేక వాటిలో వడ్ల పొట్టును వాడాల్సిందే. అయితే ప్రస్తుతం వడ్ల పొట్టు లేకపోవడం, ఉన్న కాస్త పొట్టు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో స్థానికంగా కొరత ఏర్పడుతోంది. దీనికి తోడు వర్షాకాలం సీజన్లో రావాల్సిన వడ్లు ఇంకా రైస్ మిల్లులకు చేరకపోవడంతో రైస్ మిల్లులు నడవడం లేదు. దీంతో అందుబాటులో ఉన్న కొంత ఊకను సైతం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానికంగా కోళ్ల ఫారాలు.. బీబీపేట మండలంలో సుమారు 2 లక్షలకు పైగా కోళ్లను పెంచే సామర్థ్యం ఉన్న ఫారాలు ఉన్నాయి. 2 లక్షల కోళ్లను పెంచేందుకు సుమారు 60 టన్నుల వడ్లపొట్టు అవసరమవుతుంది. ప్రతి రెండు నెలలకోసారి 60 టన్నుల ఊక అవసరం ఏర్పడడంతో స్థానికంగా కొరత ఏర్పడుతోంది. పది వేల కోళ్లు ఉండే ఫామ్కి సుమారు 3 టన్నుల కన్నా ఎక్కువే ఊక అవసరం పడుతుంది. ఒక కోళ్ల ఫామ్ రైతు ప్రతి రెండు నెలలకోసారి ఊకను తీసుకుపోవాల్సిన వస్తుంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో లారీలు రావడంతో వారికి విక్రయిస్తున్నారు. అలాగే చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న ఇటుక బట్టీలకు ఊక అవసరం ఉంటోంది.రైస్ మిల్లులు పూర్తిగా నడవకపోవడంతో ప్రస్తుతం ఊకకు డిమాండ్ పెరిగింది. ఒక్కో రైస్ మిల్లు రోజంతా నడిస్తే సుమారు 3 నుంచి నాలుగు టన్నుల ఊక మాత్రమే వస్తుంది. అది ఒక లారీ నింపడానికి కూడా సరిపోవడం లేదు. రెండు రోజులు నడిస్తే తప్ప లారీ నిండే అవకాశం లేదు. అలాగే వడ్ల పొట్టు తక్కువగా ఉండడంతో ధర కూడా పెంచుతున్నారు. ప్రస్తుతం రూ. 4 వేల నుండి రూ. 5 వేల వరకు ఒక టన్నుకు అమ్ముతున్నారు. ఒక్కోసారి ఊక కొరత ఉండడంతో రూ. 6 వేల వరకు ధర పెరుగుతోంది. దీంతో కోళ్ల ఫారాల రైతులపై ఆర్థికభారం పడుతోంది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేయడంతో కొరత ఏర్పడి ఆ ప్రభావం స్థానికులపై పడుతోంది. ఇటుక బట్టీలు, కోళ్ల ఫారాలకు వడ్ల ఊకే ఆధారం రైస్ మిల్లులు నడవక వడ్ల పొట్టు కొరత భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి స్థానికంగా కొరతతో ఇబ్బందులు -
వివాదాస్పదమైన నీటికుండీ తొలగింపు
భిక్కనూరు: గ్రామస్తులు నిర్మించిన నీటి కుండీ తన తన ఇంటి ముందు ఉందని ఓ వ్యక్తి దాన్ని తొలగించాడు. దీంతో గ్రామస్తులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయగా సదరు వ్యక్తి నీటిట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటన మండలంలోని గుర్జకుంట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన కుంట ప్రభాకర్రెడ్డి ఆరు నెలల క్రితం 450 గజాల ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ స్థలం ముందు 30 ఏళ్ల క్రితం గ్రామస్తులు పశువుల కోసం నిర్మించిన నీటికుండీ ఉంది. ఆ కుండీని ప్రభాకర్రెడ్డి కొన్ని నెలల క్రితం తొలగించగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్టోబర్ 10వ తేదీ నాటికి కుండీని యథాస్థానంలో తిరిగి నిర్మిస్తానని అతడు గ్రామస్తులకు తెలుపడంతో వారు శాంతించారు. అయితే గడువు దాటినా కుండీ నిర్మించలేదని ప్రభాకర్రెడ్డిని గ్రామస్తులు ప్రశ్నించారు. తామే నిర్మిస్తామని మంగళవారం పనులు ప్రారంభించడంతో ప్రభాకర్రెడ్డి గుళికల మందు తీసుకుని సమీపంలోని వాటర్ట్యాంక్ ఎక్కాడు. పనులు నిలిపివేయకుంటే గుళికలు మింగుతానని హెచ్చరించాడు. దీంతో గ్రామస్తులు పనులు నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై ఆంజనేయులు గ్రామానికి చేరుకుని ఫోన్లో ప్రభాకర్రెడ్డితో మాట్లాడి సముదాయించాడు. పలువురు గ్రామస్తులు వాటర్ ట్యాంక్ మీదకు చేరుకుని ప్రభాకర్రెడ్డిని కిందికి తీసుకుని వస్తుండగా కొన్ని గుళికలను ప్రభాకర్రెడ్డి నోట్లో వేసుకున్నాడు. పక్కనే ఉన్న వారు అతడిని కిందకు తీసుకురాగా, వైద్య పరీక్షల నిమిత్తం ఎస్సై కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రభాకర్రెడ్డి వాటర్ ట్యాంక్లో గుళికలు కలిపి ఉండొచ్చనే అనుమానంతో నీటిని ఖాళీ చేయించి ట్యాంకును శుభ్రం చేయించారు. వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేసిన వ్యక్తి భిక్కనూరు మండలం గుర్జకుంటలో ఘటన -
పెరిగిన రేషన్ కోటా
దోమకొండ: ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు నిరంతరాయంగా సాగుతోంది. ప్రతినెలా కార్డుల మంజూరుతోపాటు కోటా సైతం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. బియ్యం పంపిణీ ప్రారంభించగానే ఠంచనుగా రేషన్ దుకాణాలకు వెళ్లి తీసుకువెళ్తున్నారు. ఉమ్మడి జిల్లాలో.. ఉమ్మడి జిల్లాకు కొత్తగా 80,538 కార్డులు మంజూరయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 4,92,806 కార్డులు ఉండగా, 16,38,839 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే జిల్లాకు కొత్తగా 45,240 కొత్త కార్డులు మంజూరయ్యాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మొత్తం 2,88,553 రేషన్కార్డులు ఉండగా, 8,61,131 మంది లబ్ధిదారులు ఉన్నారు. జిల్లాకు 35,298 మందికి కొత్త రేషన్కార్డులు మంజూరయ్యాయి. రేషన్కార్డులకు అనుగుణంగా రేషన్ దుకాణాల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్, మున్సిపాలిటీలతోపాటు 545 గ్రామ పంచాయతీలు ఉండగా, 759 రేషన్ దుకాణాలు ఉన్నాయి. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు, 22 మండలాలు, 532 గ్రామ పంచాయతీల పరిధిలో 578 రేషన్ దుకాణాలు ఉన్నాయి. కాగా కొత్త గ్రామ పంచాయతీలు, వార్డులు ఏర్పాటైనప్పటికీ దుకాణాల సంఖ్య మాత్రం పెంచడం లేదు. కొత్తగా రేషన్కార్డులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో దుకాణాల సంఖ్య సైతం పెరగాల్సి ఉంది. పలు మండలాల పరిధిలో పౌర సరఫరాలశాఖ ఆధ్వర్యంలో గోదాములు ఏర్పాటు చేసి అక్కడి నుంచి రేషన్ దుకాణాలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నారు. కొత్తగా ఆహార భద్రత కార్డులను ప్రభుత్వం అందజేయగా సన్నబియ్యం పంపిణీ జరుగుతోంది. డీలర్లు బియ్యం ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డులకు అనుగుణంగా దుకాణాల సంఖ్య పెరిగితే తమ ఇబ్బందులు దూరం కావడంతోపాటు సమయం సైతం ఆదా అవుతుందని లబ్ధిదారులు అంటున్నారు. అధికారులు దుకాణాల సంఖ్యను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉమ్మడి జిల్లాలో కొత్త కార్డులు 80,538 నిజామాబాద్ జిల్లాకు 45,240.. కామారెడ్డి జిల్లాకు 35,298 కార్డుల మంజూరుకు అనుగుణంగా పెరగని దుకాణాల సంఖ్య -
భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి
● మండలాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి ● అధికారులకు కలెక్టర్ సంగ్వాన్ ఆదేశాలు కామారెడ్డి క్రైం: వారం రోజుల్లోగా భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో మహమ్మద్నగర్, బిచ్కుంద, గాంధారి, లింగంపేట మండలాల తహసీల్దార్లతో సమావేశమై భూభారతి పెండింగ్ దరఖాస్తుల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకు రావడం, రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించడం ద్వారా రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వెంటనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఆయా మండలాల్లో పెండింగ్లో దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిష్కారం త్వరగా జరిగేలా ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, సంబంధిత ఆర్డీవోలను ఆదేశించారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, సూపరింటెండెంట్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ కోసం కష్టపడ్డ వారికే పదవులు
● పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించింది ● ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్పాల్ కరోలకామారెడ్డి టౌన్: పార్టీ అభివృద్ది కోసం కష్టపడ్డ వారికే పదవులు దక్కుతాయని ఏఐసీసీ జిల్లా అబ్జర్వర్ రాజ్పాల్ కరోల అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథిగృహంలో మంగళవారం నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం నిర్ణయించిందని తెలిపారు. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నామన్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకుల అభిప్రాయాలను కరోల సేకరించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ.. కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించిన కై లాస్ శ్రీనివాస్రావునే మళ్లీ డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలన్నారు. ఆయనని మార్చాలని నిర్ణయిస్తే ప్రభుత్వం ఏదైనా మంచి అవకాశం కల్పించిన తర్వాతే ఆయనను మారుస్తామన్నారు. ఈ మేరకు నియోజకవర్గ నాయకులు కై లాస్ శ్రీనివాస్ను డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని తీర్మానం చేశారు. సమావేశంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మహమ్మద్ ఇలియాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, నాయకులు సందీప్, పండ్ల రాజు, గోనె శ్రీనివాస్ నియోజకవర్గంలోని నాయకులు పాల్గొన్నారు. -
పోచారం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద
● రెండునెలలుగా కొనసాగుతున్న ఇన్ఫ్లో ● గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది 28 టీఎంసీల వరదనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నిజాంకాలంలో అప్పటి ప్రభువు మండలంలోని ఆలేరువాగుపై నిర్మించిన పోచారం ప్రాజెక్టుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరద వచ్చింది. సుమారు 103 ఏళ్ల క్రితమే పోచారం ప్రాజెక్టును 70 వేల క్యూసెక్కుల వరదనీటి ప్రవాహాన్ని తట్టుకునేలా డిజైన్ చేసి నిర్మించారు. కానీ ఈ ఏడాది కురిసిన భారీవర్షాల కారణంగా లక్షా 82వేల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడింది. ఈ ఏడాది కురిసిన భారీవర్షాలతో ఆయకట్టు కింద వానాకాలం పంటలసాగు మొదలైనప్పటి నుంచి పంటలు కోతదశకు చేరే వరకు సుమారు రెండునెలలుగా ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు వరద నీరు ప్రవహిస్తూనే ఉంది. మంజీరలోకి 26 టీఎంసీలు.. పోచారంప్రాజెక్టు అలుగు పైనుంచి వరద దిగువకు ప్రవహిస్తూ 26 టీఎంసీల నీరు పోచారం పెద్దవాగు ద్వారా మంజీరలోకి చేరింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వరద నీరు అవుట్ ఫ్లోగా వెళ్లలేదు. 1917–22 మధ్యకాలంలో అప్పటి నిజాం ప్రభువు అలీ నవాబ్ జంగ్ బహదూర్ 27.11లక్షలు వెచ్చించి 2.423 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేలా ఆలేరు వాగుపై 1.7 కిలోమీటర్ల పొడువుతో, 21అడుగుల ఎత్తుతో పోచారం ప్రాజెక్టును నిర్మించారు. దీంతోపాటు ప్రాజెక్టులోని నీరు గేట్ల ద్వారా ఆయకట్టుకు చేరేలా 58 కిలోమీటర్ల పొడువుతో ప్రధానకాలువను నిర్మించారు. కాలువకు 73 డిస్ట్రిబ్యూటరీలను నిర్మించారు. 103 ఏళ్లలో ఎన్నడు కూడా ఈ స్థాయిలో ఇన్ఫ్లోగా రాలేదు. ఈ ఏడాది ప్రాజెక్టు ఎగువన కురిసిన భారీవర్షాల కారణంగా 28.020 టీఎంసీల నీరు ఇన్ఫ్లోగా రాగా 25.933క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా దిగువకు వెళ్లింది. కాగా ఈ ఏడాది ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటలసాగు కోసం ప్రాజెక్టు నుంచి కేవలం 0.172 టీఎంసీల నీటిని అధికారులు ప్రధా న కాలువలోకి విడుదల చేశారు. పోచారం ప్రాజెక్టు అలుగు పైనుంచి దిగువకు ప్రవహిస్తూ గత ఆగస్టు 16న 12 వేల క్యూసెక్కులతో మొదలైన అవుట్ ఫ్లో నేటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు అలుగుపై నుంచి 742 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. -
నవంబర్ 27న ఫిజిక్స్ జాతీయ సదస్సు
భిక్కనూరు: నిజామాబాద్ జిల్లా కేంద్రలోని గి రిరాజ్ ప్రభుత్వ కళాశాలలో నవంబర్ 27వ తే దీన నిర్వహించనున్న ఫిజిక్స్ జాతీయ సద స్సుకు సంబంధించిన వాల్పోస్టర్లను సౌత్క్యాంపస్లో ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్గౌడ్ ఆద్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కృత్రిమ మేధ యుగంలో విజ్ఞాన శాస్త్రాలకు ఉ న్న అవకాశాలు – సవాళ్లు’ అనే అంశంపై సద స్సులో చర్చ ఉంటుందని తెలిపారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉన్నతమండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి హాజరవుతారని, అలాగే వివిధ యూనివ ర్సిటీల ప్రతినిధులు కూడా పాల్గొంటారన్నా రు. విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్య లో హాజరుకావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సదస్సు ఇన్చార్జి రామకృష్ణ, ఫిజిక్స్ హెచ్వోడీ మోహన్బాబు, పాఠ్య ప్రఽణాళిక విభాగం చైర్మన్ హరిత, లక్కరాజు, అధ్యాపకులు లలిత, ప్రతిజ్ఞ వైశాలి, సరిత, దిలీప్, శ్రీమతి, నారాయణ, పోతన్న పాల్గొన్నారు.కామారెడ్డి రూరల్: జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు మంగళవారం నాటికి 193 దరఖాస్తులు అందినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి 23వ తేదీన లక్కీ డ్రా నిర్వహిస్తామన్నారు. మంగళవారం అందిన 27 దరఖాస్తులతో కలిపి ఇప్పటి వరకు ఆయా దుకాణాలకు 193 దరఖాస్తులు అందాయన్నారు. కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 15 దుకాణాలకు 54 దరఖాస్తులు, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 దుకాణాలకు 25, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 దుకాణాలకు 44, దోమకొండ స్టేషన్ పరిధిలో 8 దుకాణాలకు 32, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 10 దుకాణాలకు 38 దరఖాస్తులు అందినట్లు ఈఎస్ వివరించారు. కామారెడ్డి అర్బన్: టాంకామ్ ద్వారా గ్రీస్ దేశంలో హాస్పిటాలిటీ నిర్వహణ, సేవా రంగంలో వెయ్యి చట్టబద్ధమైన ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతున్నట్టు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం రజనీకిరణ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఇంగ్లిష్ నైపుణ్యం కలిగి ఉండాలని, ఉచిత బీమా, భోజన, వసతితోపాటు నెలకు జీతం రూ.92 వేల నుంచి రూ.లక్షా22 వేల వరకు ఉంటుందన్నారు. హోటల్ మేనేజ్మెంట్లో డిప్లొమా, డిగ్రీ ఉన్నవారు లేదా ప్రభుత్వ నైపుణ్యం ధ్రువీకరణ పొందిన వారు దరఖాస్తు చేయొచ్చన్నారు. www.tomcom.telangana.gov. inలో గానీ, 94400 52081, 94400 51452 నంబర్లకు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు. గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు.. ఎల్లారెడ్డి: జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాలల్లో 2025 – 2026 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిపోయిన సీట్ల భర్తీ చేయనున్నట్లు ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ ఏడాది ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించిన ప్రవేశపరీక్షకు హాజరై ఉండాలని, ఇప్పటి వరకు నిర్వహించిన ప్రవేశాల ప్రక్రియలో ఎక్కడా సీటు పొంది ఉండొద్దని స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 16, 17 తేదీల్లో తమ సర్టిఫికెట్లు, ప్రవేశ పరీక్ష హాల్ టికెట్ తదితర ధ్రువపత్రాలతో ఎల్లారెడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కామారెడ్డి టౌన్: వైద్యారోగ్యశాఖ పరిధిలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధార్ బేస్డ్ అటెన్డెన్స్ సిస్టం(ఆబాస్) అమలులో రాష్ట్ర స్థాయిలో జిల్లా తృతీయ స్థానంలో నిలిచింది. ఈ మేరకు డీఎంహెచ్వో చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ.. ఆబాస్ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సక్రమంగా అమలు చేయాలని అన్నారు. పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, ఆబాస్ యాప్లో ఆన్లైన్ అటెన్డెన్స్ మరింత పకడ్బందీగా నమోదు చేసుకొని రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో జిల్లా నిలిచేలా కృషి చేయాలని కోరారు. -
టీటీఐలో సౌకర్యాలు కల్పించాలి
కామారెడ్డి క్రైం: రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రానికి సమీపంలోని ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్ (టీటీఐ) ఎంతో అనువుగా ఉంటుందని, సౌకర్యాలు కల్పించాలని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. టీటీఐ భవనాన్ని ఎస్పీ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్ కేసుల్లో పట్టుబడిన వారికి సైతం కౌన్సెలింగ్ ఇచ్చేందుకు టీటీఐ భవనాన్ని వినియోగిస్తామన్నారు. ఇక్కడి విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలను కల్పించాలని రిజర్వ్డ్ విభాగం సీఐ సంతోష్కుమార్కు ఎస్పీ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు సహకరించాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. -
ముగిసిన అటవీశాఖ స్పోర్ట్స్ మీట్
నిర్మల్టౌన్: జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో అటవీశాఖ ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఆదివారం రాత్రి అట్టహాసంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జిల్లా జడ్జి శ్రీవాణి, అటవీశాఖ బాసర సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ శర్వానన్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. పోటీల్లో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన సుమారు 350 మంది అటవీశాఖ క్రీడాకారులు పాల్గొనగా 35 రకాల క్రీడలు నిర్వహించారు. టగ్ ఆఫ్ వార్ పురుషుల విభాగంలో నిర్మల్ జట్టు, మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు విజేతగా నిలిచాయి. వాలీబాల్లో ప్రథమ విజేతగా ఆదిలాబాద్, రన్నరప్గా నిర్మల్ జట్టు, క్రికెట్లో నిజామాబాద్ జట్టు, కబడ్డీ పురుషుల విభాగంలో నిజామాబాద్, మహిళల విభాగంలో నిర్మల్ జట్టు, త్రోబాల్ మహిళల విభాగంలో ఆదిలాబాద్ జట్టు, మార్చ్పాస్ట్లో నిర్మల్ జట్టు విజేతగా నిలిచాయి. ఓవరాల్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్మల్ జట్టు కై వసం చేసుకుంది. నిజామాబాద్ డీఎఫ్వో వికాస్ మీనా, నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను, అధికారులు సుధాకర్రావు, శివకుమార్, నాలుగు జిల్లాల అటవీశాఖ అధికారులు, సిబ్బంది తదితరు లు పాల్గొన్నారు. -
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
పొగాకు లద్దె పురుగు నివారించడానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. తల్లి పొగాకు లద్దె పురుగు ఆకుల అడుగు భాగాన గుంపుగా గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన చి న్న లార్వాలు ఆకు అడుగున గుంపులు గుంపులుగా చేరి ఆకులోని పత్రహరితాన్ని గీసుకుని తినేస్తాయి. లార్వా దశలు పెరిగే కొద్ది విడివిడిగా ఆకులను కొరికి తిని ఈనెలను మాత్రమే మిగుల్చుతాయి. పగటి పూట ఇవి మొక్క మొదళ్ల భాగంలో భూమి లోపల ఉండి రాత్రి పూట నష్టం ఎక్కువ చేస్తాయి. –ప్రజాపతి, ఏవో,సదాశివనగర్ -
పత్తిలో పొగాకు లద్దె పురుగు
● కాత దశలో తీవ్రనష్టం ● దిగుబడిపై వాన దెబ్బ సదాశివనగర్(ఎల్లారెడ్డి): పత్తి పంటను పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. రోజురోజుకూ లద్దె పురుగు ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే వర్షాలతో పత్తి పంటకు తెగుళ్లు సోకి తీవ్రంగా నష్టపోతుంటే, మరోవై పు లద్దె పురుగు ఆశించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడిందన్న చందంగా మారింది. జిల్లా లో వరి తర్వాత రైతులు అధికంగా పండించేది పత్తి పంట.అన్ని మండలాల్లో రైతులు పత్తి సాగుకే ప్రా ధాన్యమిస్తుంటారు. పత్తి పంట సాగుకు ఎకరానికి రూ.25 వేల వరకు ఖర్చు పెట్టారు. అయితే, గతేడా ది వర్షాలు లేక పంటలు దెబ్బతినగా ఈ ఏడాది వి స్తారంగా కురిసిన వర్షాలు పత్తి పంటను నాశనం చే స్తున్నాయి. భూముల్లో తేమ శాతం అధికమై మొక్క ల్లో ఎదుగుదల లోపించింది. ఆశించిన స్థాయిలో పూత రాక, కాయలు సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. భారీ వర్షాల కారణంగా ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు. రసాయణ నియంత్రణ చర్యలు: విషపు ఎర: మూడోదశ దాటిన పొగాకు లద్దెపురుగు అదుపు చేయటానికి విషపు ఎరను వాడాలి. ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లంతోపాటు 300 గ్రాములు థయోడికార్బ్ మందును సరిపడా నీటితో కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సాయంత్రం వేళలో పొలమంతా చల్లుకోవాలి. మందు పిచికారీ: పొగాకు లద్దె పురుగు నివారణకు నొవాల్యూరాన్ 1 ఎంఎల్ లేదా లుఫెన్యురాన్, 1.25 ఎంఎల్, లేదా థయోడికార్బ్ 1.5, క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. సహజ నియంత్రణ చర్యలు వేప గింజల కషాయం 5 శాతం లేదా వేప నూనె 1500 పీపీఎం,5 ఎంఎల్ ఒక లీటరు నీటికి కలిపి పి చికారీ చేయాలి. ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలు ఏ ర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరా నికి ఎర పంటగా 20 ఆముదం మొక్కలు నాటాలి. -
దేవుడి ముందు పెట్టిన దీపం అంటుకొని ఇల్లు దగ్ధం
బాల్కొండ: దేవుడి ఫొటోల ముందు ఉన్న దీపంతో ఇంటికి నిప్పు అంటుకొని కాలిపోయిన ఘటన మెండోరా మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మెండోరాలోని రాజారపు భార్గవి సోమవారం ఇంట్లో దేవుడి ఫొటోల ముందర దీపం ముట్టించింది. అనంతరం ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లింది. కొంత సమయం తర్వాత ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వారు గమనించి, ఇంటి తాళాలు పగలగొట్టారు. కానీ అప్పటికే ఇంట్లో సామగ్రి, నగదు కాలి బూడిదయ్యాయి. విషయం తెలసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ చారి ఘటన స్థలాన్ని పరిశీలించారు. సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం కింద రేషన్ బియ్యాన్ని అందించారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేలా ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానన్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరారు.


