Kamareddy
-
రెండు సెల్ఫోన్ల చోరీ.. రెండేళ్ల జైలు
కామారెడ్డి క్రైం : ఓ ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్ఫోన్లను ఎత్తుకెళ్లిన కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్ట ణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన గుండ్ల రాజు ఇంట్లో 2016 మే 8న వేకువ జము న చోరీ జరిగింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి రెండు సెల్ఫోన్లు ఎత్తుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కే సు నమోదు చేసుకుని, దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగతనం చేసిన వ్య క్తిని కామారెడ్డి పట్టణానికి చెందిన సద్దుల శంకర్గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. అప్పటినుంచి కేసు కోర్టు పరిశీలనలో ఉంది. నేరం రుజువు కా వడంతో కామారెడ్డి కోర్టు న్యాయమూర్తి సు ధాకర్ మంగళవారం తీర్పు ఇచ్చారు. నిందితుడికి రెండేళ్ల జైలు శిక్ష, రూ. వెయ్యి జరిమా నా విధించారు. నిందితునికి శిక్ష పడడంలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. కొనుగోలు కేంద్రాల సందర్శన కామారెడ్డి క్రైం : వర్షాల తో ఆగమవుతున్న రైత న్న అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. కామారె డ్డి గంజ్తో పాటు దేవునిపల్లి, లింగాపూర్, అడ్లూర్, చిన్నమల్లారెడ్డి, గర్గుల్లలోని కొనుగోలు కేంద్రాలను డీఎస్వో మల్లికార్జున్ బా బు, అధికారులు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎస్వో మాట్లాడు తూ ఆయా కేంద్రాలలో నిరంతరంగా కాంటాలు కొనసాగుతున్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తామని తెలిపారు. ‘13,450 యూనిట్లు లక్ష్యం’ నాగిరెడ్డిపేట: రాజీవ్ యువ వికాసం ద్వారా జిల్లాలో 13,450 యూనిట్లు మంజూరు చేయాలన్నది లక్ష్యమని డీఆర్డీవో సురేంద ర్ పేర్కొన్నారు. మండల పరిషత్ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. బ్యాంకులకు పంపిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందకొడిగా సాగడంపై అసంతృప్తి వ్యక్తం చే శారు. నిత్యం బ్యాంకులకు వెళ్లి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఎంపీడీవో ప్రభాకరచారిని ఆదేశించారు. మండల పరిషత్ సిబ్బందికి ఐకేపీ సీసీలు సహకరించేలా చూడాలని ఏపీఎం జగదీశ్కు సూచించారు. అనంతరం వివిధ బ్యాంకులకు వెళ్లి రాజీవ్ యువవికాసం దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయా లని మేనేజర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి 41,547 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 12,624 దరఖాస్తులను బ్యాంకర్లు పరిశీలించారని పేర్కొన్నారు. మిగతావాటి పరిశీలన ప్రక్రియను రెండురోజుల్లో పూర్తి చేస్తామన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ కళాశాలకు మరో పీజీ కోర్సు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు మరో పీజీ కోర్సు మంజూరయ్యింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పీజీ కోర్సును ప్రారంభించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ తెలిపారు. 60 సీట్లతో పీజీ ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ కోర్సును మంజూరు చేస్తూ కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. కళాశాలలో మొత్తం 12 పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డిగ్రీ దోస్త్ ప్రవేశాలపై సందేహాలుంటే నేరుగా కళాశాలలో గానీ 94416 21456, 91823 04067 నంబర్లలోగాని సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. పదోన్నతి పొందినవారికి జిల్లాల కేటాయింపు కామారెడ్డి క్రైం: ఎస్సైలుగా పదోన్నతి పొంది శిక్షణ పూర్తి చేసుకున్న ఏఎస్సైలకు జిల్లాలను కేటాయిస్తూ ఉన్నతాధికారులు మంగళవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జిల్లాకు చెందిన పదకొండు మంది ఉన్నారు. జిల్లా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేసిన లచ్చీరాం, సిద్దిఖీ, సాదు లింబాద్రి, పి.గణేష్, ఉమేష్, మల్లారెడ్డి, సుబ్రహ్మణ్య చారి, సంజీవ్, నర్సింలు, రాములు, హన్మాగౌడ్లను సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు కేటాయించారు. -
కొనుగోళ్లలో కొర్రీలు
● మిల్లర్లు ధాన్యం తిరస్కరిస్తే లారీ కిరాయి రైతే భరించాలి ● తరుగు విషయంలో మిల్లర్లతో మాట్లాడుకోవాలి ● ఒప్పంద పత్రం ఇస్తేనే ధాన్యం కొనుగోళ్లు ● కొత్త కండిషన్లతో ఇబ్బందిపడుతున్న రైతులుబిచ్కుంద: బిచ్కుంద మండల కేంద్రంలో సింగిల్ విండో సొసైటీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. తేమశాతాన్ని పరీక్షించి కొనుగోలు చేస్తున్నారు. గడ్డిపోసలు, దుమ్ము ఉందని బస్తాకు అరకిలో తరుగు తీస్తున్నారు. అయితే దీనికి తోడు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఒప్పంద పత్రం అడుగుతున్నారు. నాణ్యత తక్కువ ఉన్న కారణంగా మిల్లర్లు వడ్లు తీసుకోవడానికి తిరస్కరిస్తే రవాణా ఖర్చులు తామే భరించుకుంటామని రైతులు ఒప్పంద పత్రం రాసి ఇస్తేనే వడ్లు కొనుగోలు చేస్తామని నిర్వాహకులు చెబుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. రైతు రాిసిచ్చే ఒప్పంద పత్రం రైతుకు నష్టం చేసేదిగా, మిల్లర్లకు లాభం చేకూర్చే విధంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాణ్యత, తేమ శాతం పరిశీలించి అన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తున్నప్పుడు ఒప్పంద పత్రం ఎందుకివ్వాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. మిల్లుల్లో అదనపు కోత వడ్ల లారీలను మిల్లులకు తరలించిన తర్వాత మిల్లర్లు వడ్లను రెండుమూడు బస్తాల నుంచి శాంపిళ్లు సేకరించి వడ్లలో నాణ్యత లేదు, తేమశాతం ఎక్కువగా ఉందని, బరువు తగ్గిందని వంకలు పెడుతూ లారీకి రెండుమూడు క్వింటాళ్ల వరకు తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి ఒప్పుకోకపోతే లారీ రిటర్న్ పంపిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు సైతం మిల్లర్లకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. కొనుగోలు కేంద్రంలో తూకం వేసి ఇచ్చిన స్లిప్పును కాకుండా మిల్లు యజమాని వేసిన తూకాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఒప్పంద పత్రంలో రైతులు రాసి ఇవ్వాలని అధికారులు చెబుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లేదంటే రైతులే నేరుగా మిల్లుకు వెళ్లి మాట్లాడుకోవాలని సూచిస్తున్నారంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఒప్పంద పత్రం, వడ్లలో కోత లేకుండా చూడాలని కోరుతున్నారు.బిచ్కుందలో వడ్లు ఆరబెడుతున్న రైతుఒప్పంద పత్రం ఇవ్వాలంటున్నరు రైతులు ఒప్పంద పత్రం ఇస్తేనే వడ్లు కొంటామ ని అధికారులు చెబుతున్నారు. వడ్లు మిల్లుకు వె ళ్లిన తర్వాత ఏదో వంకతో రెండు, మూడు క్వింటాళ్లు కట్ చేస్తున్నారు. మిల్లు యజమాని ఎంత తగ్గించినా ఒప్పుకోవాలనడం ఎంతవరకు న్యాయం. అధికారులు న్యాయం చేయాలి. – శ్రీనివాస్, రైతు బిచ్కుంద పైఅధికారుల సూచనలతోనే.. మిల్లులు క్వింటాలు వడ్లకు 65 కిలోల బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది. యాసంగి వడ్లలో 65 కిలోల బియ్యం వస్తలేవట. నాణ్యత లేవంటూ వడ్లను రిటర్న్ పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పైఅధికారుల సూచనలతో రైతుల నుంచి ఒప్పంద పత్రం తీసుకుంటున్నాం. – శ్రావణ్, సొసైటీ కార్యదర్శి, బిచ్కుంద -
జిల్లాలో రౌడీయిజాన్ని నిర్మూలిస్తాం
కామారెడ్డి క్రైం : జిల్లాలో నేరాలు, బెదిరింపులు, అక్రమ దందాలకు తావులేకుండా చేస్తామని, రౌడీయిజాన్ని నిర్మూలిస్తామని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీట్ కలిగిన వ్యక్తులతో మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘రౌడీ మేళా‘ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రౌడీ షీట్లు ఉన్నవారు నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, హింసాత్మక చర్యలకు పాల్పడడం లాంటి నేరాలను పూర్తిగా మానుకోవాలని సూచించారు. మంచి ప్రవర్తన కనబర్చిన వారి రౌడీ షీట్లు మాత్రమే తొలగిస్తామని తెలిపారు. పోలీసు రికార్డ్స్, రౌడీ షీట్స్ రివ్యూ కమిటీ నివేదిక ప్రకారం మంచి ప్రవర్తన కలిగి ఉన్న 13 మందిపై రౌడీషీట్లు తొలగించామన్నారు. ఇతరులలోనూ ఇలాంటి మార్పు రావాలని ఆకాంక్షించారు. సత్ప్రప్రవర్తన కలిగి పదేళ్ల పాటు ఎలాంటి కేసులు లేకుండా ఉంటే నిష్పక్షపాత విచారణతో వారి రౌడీ షీట్స్ కూడా తొలగిస్తామన్నారు. గంజాయి, రౌడీయిజం, హత్యలు, హత్యాయత్నాలు, గొడవలు తదితర అసాంఘిక కార్యకలాపాలకు తరచుగా పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో కత్తులతో ఫొటోలు పోస్ట్ చేయడం, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం, భయబ్రాంతులకు లోనయ్యేలా చేసే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రతి ఆరు నెలలకోసారి రౌడీ మేళా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్రావు, విఠల్రెడ్డి, ఎస్బీ సీఐ తిరుపయ్య, డీసీఆర్బీ సీఐ మురళి తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ రాజేశ్ చంద్ర సత్ప్రవర్తనతో మెలిగిన 13 మందిపై రౌడీ షీట్లు ఎత్తివేత -
ఏ రోడ్డు చూసినా..
వర్షాలు కురిసినపుడల్లా పట్టణంలోని ప్రధాన రోడ్లు చెరవులను తలపిస్తుంటాయి. సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, నిజాంసాగర్ రోడ్డు, అశోక్నగర్ రోడ్లపై భారీ ఎత్తున వరద నీరు చేరుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏటా ఈ సమస్య ఎదురవుతూనే ఉంది. అప్పుడప్పుడు బల్దియా ద్వారా నీటిని తోడేసే ప్రయత్నం చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అలాగే పట్టణంలో పలు కాలనీలలో డ్రెయినేజీలు కబ్జాకు గురయ్యాయి. దీంతో వర్షాకాలంలో వరద నీరు పోయేందుకు దారి లేక నీరంతా రోడ్లపై నిలిచిపోతూ ఇళ్లలోకి చేరుతోంది. వర్షపు నీరు సులువుగా వెళ్లేలా డ్రెయినేజీలు నిర్మించినా చాలాచోట్ల వాటిని ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ కబ్జాకు గురై నీరు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. -
విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
కామారెడ్డి క్రైం : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో ప్రధానోపాధ్యాయులు కీలకపాత్ర వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. దేవునిపల్లి జెడ్పీహెచ్ఎస్లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడు నూతన బోధన పద్ధతులపై అవగాహన పెంచుకుంటూ మిగతా ఉపాధ్యాయులను దిశానిర్దేశం చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన విద్యాబోధన చేయాలన్నారు. తల్లిదండులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఈవో రాజు, అకడమిక్ మానిటరింగ్ అధికారి వేణుగోపాల్, ట్రైనింగ్ సెంటర్ ఇన్చార్జి గంగాకిషన్, ఏసీజీఈ బలరాం, పరీక్షల కార్యదర్శి లింగం తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకునేలా లబ్ధిదా రులను ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని 19వ వార్డు సైలా నీబాబా కాలనీలో జరీనా బేగంకు మంజూరైన ఇంటి నిర్మాణానికి మార్కవుట్ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి దశల వారీగా బిల్లులు వ స్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వనిత, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
దైవభక్తి.. దేశభక్తి
రామారెడ్డి: దక్షిణ కాశీగా పేరుగాంచిన ఇసన్నపల్లి(రామారెడ్డి)లోని శ్రీకాలభైరవ స్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు కొనసాగుతున్నాయి. వైశాఖ మాసంలో చివరి మంగళవా రం కావడంతో 108 రకాల పువ్వులతో స్వామివారిని అలంకరించారు. ఈ క్రమంలో దైవభక్తి తో పాటు దేశభక్తిని చాటుకున్నారు. మువ్వన్నె ల పువ్వులతో స్వామివారి ముందు అలంకరించారు. అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ లు స్వామివారికి పూజలు చేశారు. ఉదయం నుంచి స్వామివారికి జలాభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వా మి వారిని దర్శించుకున్నారు. రామారెడ్డి పోలీసులు బందోబస్తు కల్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చే శారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు గు ప్తా, జూనియర్ అసిస్టెంట్లు లక్ష్మణ్, నాగరాజ్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంజి సతీశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో రెండు గేదెలు మృతి
కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ శివారులోని పంట పొలాల్లో విద్యుదాఘాతంతో రెండు గేదెలు మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. పట్టణ కేంద్రానికి చెందిన రైతు రాజేశ్ తనకున్న రెండు గేదెలను తీసుకొని శివారు ప్రాంతానికి మేత కోసం తీసుకెళ్లాడు. అక్కడ మేత మేస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగి పడి రెండు గేదెలపై పడ్డాయి. ఈ ఘటనలో అవి మృతి చెంది. పక్కనే ఉన్న మరో 20 గేదెలు, పశువలకు పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ ఏడీఈ కృష్ణ చైతన్య, మండల పశువైద్యాధికారి రవికిరణ్, రెవెన్యూ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి తనకు నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరుతున్నాడు. -
ఉద్యాన పంటలసాగును ప్రోత్సహించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో మహిళలను ఉద్యానపంటలసాగుకు ప్రోత్సహించాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండల సమాఖ్య సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉద్యానపంటల సాగుతో మహిళలు ఆర్థికంగా స్థిరపడతారని ఆయన చెప్పారు. ఉద్యానపంటలను సాగుచేసిన రైతులకు ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వాహణ ఖర్చులు చెల్లిస్తామన్నారు. మునగపంటను సాగు చేసే రైతులకు గుంతలు తీసేందుకు, నీళ్లు పట్టేందుకుగానూ ఉపాధిహామీ ద్వారా డబ్బులు వస్తాయని ఆయన చెప్పారు. కాగా నాగిరెడ్డిపేట మండలంలో బ్యాంకులింకేజీ ద్వారా 683సంఘాలకు రూ.36కోట్ల80లక్షలు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. లక్ష్యం నెరవేర్చేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఆయన చెప్పారు. దీంతోపాటు సీ్త్రనిధి రుణాల రికవరీని వందశాతం చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు బేస్త శాంత, సీ్త్రనిధి మేనేజర్ కిరణ్, ఏపీయం జగదీశ కుమార్, సీసీలు నారాయణ, దత్తు, రమేష్, శ్రీనివాస్రెడ్డి, రషీద్, సుజాత, అకౌటెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ముంబోజీపేటలో ఒకరి అదృశ్యం
లింగంపేట: మండలంలోని ముంబోజీపేట గ్రామానికి చెందిన పస్కూరి కాశీరాం అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై వెంకట్రావు మంగళవారం తెలిపారు. మూడు రోజుల క్రితం భార్య రాణితో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్యఖలీల్వాడి: అనారోగ్యంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. వినాయక్నగర్కు చెందిన దోమల చంద్రకళ(55) ఆరు నెలలుగా అనారోగ్యంతో పాటు మానసికంగా బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త ధర్మాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ల్యాప్టాప్ అప్పగింతరాజంపేట: పోగొట్టుకున్న ల్యాప్టాప్ను రికవరి చేసి బాధితుడికి అందించినట్లు ఎస్సై పుష్పరాజ్ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన వెంకోళ్ల యాదగిరి 15 రోజుల క్రితం తన ల్యాప్టాప్ను పోగొట్టుకున్నాడు. పోలీసులు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ అనుమానిత వ్యక్తిని విచారించారు. డేటాబేస్ ఆధారంగా ల్యాప్టాప్ను పట్టుకుని బాధితుడికి అందించినట్లు తెలిపారు. కానిస్టేబుళ్లు చిరంజీవి, చరణ్ ఉన్నారు. పాతకక్షలతో ఒకరిపై దాడిఖలీల్వాడి: పాతకక్షల నేపథ్యంలో ఒకరిపై దాడి జరిగిన ఘటన నగరంలోని మైఫిల్ హోటల్ వద్ద జరిగింది. ఘటనకు సంబంధించి ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. వినాయక్నగర్కు చెందిన సాయికుమార్, సాయినాథ్లకు గతంలో పాత కక్షలు ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి సాయికుమార్ తన స్నేహితుడైన శివ బర్త్డే వేడుకల్లో పాల్గొని మంగళవారం ఉదయం 3 గంటలకు మైఫిల్ హోటల్ వద్దకు వచ్చారు. కాగా అక్కడే ఉన్న సాయినాథ్ వీరిని పలుకరించాడు. సాయికుమార్ను పక్కకు రావాలంటు సాయినాథ్ కోరడంతో అతను వెళ్లాడు. తనపై గణేశ్ ఉత్సవాల్లో ఎందుకు పోలీస్ కేసు పెట్టావంటు జేబులో ఉన్న బ్లేడ్తో సాయికుమార్ గొంతుపై దాడి చేశాడు. వెంటనే స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నందిపేట్లో యువకుల ఘర్షణనందిపేట్: మండల కేంద్రంలోని బస్డిపో స్థలంలో గుర్తు తెలియని యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన కొండూర్ రమేశ్ అనే వ్యక్తి సోమవారం రాత్రి మద్యం తాగేందుకు స్థానిక బస్ డిపో స్థలానికి వచ్చాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల మధ్య రమేశ్కు గొడవ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో రమేశ్కు తీవ్రగాయాలు కావడంతో అచేతన స్థితికి చేరాడు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకు వివరాలు సేకరించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
జంగమాయిపల్లిలో రొయ్యల చెరువులు
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని జంగమాయిపల్లిలో ఐదు ఎకరాలలో రొయ్యల చెరువును మహిళా రైతు రజితారెడ్డి ఏర్పాటు చేసింది. రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. ఎల్లారెడ్డి మండలంలోని జంగమాయిపల్లి గ్రామానికి చెందిన రజిత ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని నెల్లూరు, చీరాల, బాపట్ల తదితర ప్రాంతాలకు విహార యాత్రకు వెళ్లింది. అక్కడి రైతులు సాగు చేస్తున్న రొయ్యల చెరువును చూసి వివరాలు తెలుసుకుంది. రైతుల వద్ద వారు సాగు చేస్తున్న విధానం, పద్ధతులను తెలుసుకుని గత నెలలో రొయ్యల చెరువును ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో రొయ్యల పంట.. రొయ్యలలో వనామి, టైగర్లాంటి రకరకాల రొయ్యలు ఉంటాయి. వీటిలో రజిత వనామి అనే రకానికి చెందిర రొయ్యలను సాగు చేస్తున్నది. ఐదు ఎకరాల సాగులో ఉన్న రొయ్యల చెరువులో 11 లక్షల రొయ్య పిల్లలను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. రొయ్యలకు ప్రతి రోజుల నాలుగు పూటలు దాణాను వివిధ రకాల పద్ధతుల్లో అందిస్తున్నారు. వీటిని జాగత్త్రగా కాపాడుకోవాల్సి ఉంటుంది. 24 గంటల పాటు వెలుతురు, ఆక్సిజన్ అందించాల్సి ఉంటుంది. పాములు రాకుండా ఫెన్సింగ్, పక్షులు రాకుండా నెట్ ఏర్పాటు చేశారు. వెంట్రుక మందంలో ఉన్న మీసాల రొయ్యలు మూడు నెలల పాటు వాటికి దాణా అందిస్తారు. మూడు నెలల తరువాత వాటిని విక్రయిస్తారు. కిలో రూ. 350 ధర పలకడంతో వాటి ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. రొయ్యల విక్రయాలను హైదరాబాద్, కోల్కత్తా ఏజెన్సీ ద్వారా విదేశాలకు ఎక్స్పోర్టు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఐదు ఎకరాలలో రొయ్యలను సాగు చేస్తున్న మహిళా రైతు రజిత ఆదర్శంగా నిలుస్తున్న వైనంప్రభుత్వం రుణాలను అందించాలి ఆంధ్రా రైతులను ఆదర్శంగా తీసుకుని రొయ్యల చెరువును ఏర్పాటు చేశాను. తెలంగాణాలో రొయ్యలను తినే వారు చాలా మంది ఉన్నారు. ఇక్కడ దొరకక పోవడంతో ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు కొనుక్కుంటున్నారు. రొయ్యలు ఎక్స్పోర్టు కావడంతో ఇవి లభించడం చాలా అరుదు. తన వ్యవసాయ పొలంలో రొయ్యల చెరువులను తవ్వి రొయ్యల సాగు చేస్తున్నాను. ఇదే మొదటి పంట. లాభాలు రావాలని కోరుకుంటున్నాను. రొయ్యల చెరువులకు సైతం ప్రభుత్వం రుణాలను అందిస్తే మరింత మంది రైతులు రొయ్యల చెరువులను సాగు చేస్తారు. – రజిత, మహిళా రైతు, జంగమాయిపల్లి -
హోన్నాజీపేట్లో చోరీ
ధర్పల్లి: మండలంలోని హోన్నాజీపేట్లో చోరీ జరిగినట్లు ఎస్సై రామకృష్ణ మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తొంటకొల్ల గంగారం సోమవారం రాత్రి ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి దాబాపై నిద్రపోయారు. విషయం గమనించిన దుండగులు రాత్రి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు, 12 తులాల వెండి ఆభరణాలు, రూ. మూడు లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బంక్లో డీజిల్.. మోపాల్: మండలంలోని కాస్బాగ్ తండా శివారులో ఉన్న ఇండియన్ బంక్లో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు 154 లీటర్ల డీజిల్ను దొంగిలించారు. వివరాలిలా ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బంక్ వెనక వైపు నుంచి లోపలికి వచ్చి సీసీ కెమెరాలను నిలిపేశారు. ఆ తర్వాత బంక్లోని ఆన్లైన్ సిస్టమ్ను బ్రేక్ చేశారు. డీజిల్ గన్ను అన్లాక్ చేసి రూ.14,951 విలువైన 154 లీటర్ల డీజిల్ను దొంగిలించారు. ఈవిషయమై ఎస్సై యాదగిరి గౌడ్ వివరణ కోరగా, ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఎస్ఈ చొరవతో విద్యుత్ లైన్లకు మరమ్మతులు
బీబీపేట: మండలంలోని ఇస్సానగర్ గ్రామంలో గతేడాది నుంచి వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్లు కిందకి ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్ఈ శ్రావణ్కుమార్ సోమవారం గ్రామంలోని వ్యవసాయ బావుల వద్ద ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో అక్కడున్న రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన 10 ఇంటర్ పోల్స్ వెంటనే వేయాలని సిబ్బందికి సూచించారు. మంగళవారం ఇంటర్ పోల్స్ను సిబ్బంది మరమ్మతులు చేసి అమర్చారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ సిబ్బందికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో డీఈఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ సుదర్శన్ రెడ్డి, ఏఈ విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
ఖలీల్వాడి: యువత మత్తుకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీసీపీ శ్రీనివాస్రావు సూచించారు. నగరంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో మంగళవారం గంజాయికి అలవాటు పడిన యువకులతో పాటు వారి తల్లితండ్రులకు టాస్క్ఫోర్స్ సీఐ ఆర్ అంజయ్య, టాస్క్ ఫోర్స్ ఎస్సై గోవింద్తో కలిసి కౌన్సెలింగ్ నిర్వహించారు. అందమైన జీవితాన్ని మత్తుకు బానిస కాకుండా చూసుకోవాలని యువకులకు సూచించారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. ఎవరైనా మత్తు పదార్థాలు సరఫరా చేసినా, గంజాయి పెంచినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా గంజాయి రవాణా చేసినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. -
బ్రిడ్జీలను నిర్మించారు.. రోడ్డును మరిచారు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రాహ్మణపల్లి, కాలోజీవాడి శివార్లలోని రహదారుల మధ్యలో రెండు బ్రిడ్జీలను నిర్మించారు. బ్రిడ్జిలకిరువైపులా తారు రోడ్డు వేయకుండా అలాగే వదిలేశారు. ఈరోడ్డు గుండా నిత్యం వెళ్లే వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొరం వేయడంతో కొద్దిపాటి వర్షానికే తొలగిపోయి గుంతలయంగా మారుతున్నాయి. దీంతో ద్విచక్రవాహనదారులు అదుపు తప్పి కిందపడుతున్నారు. వర్షాకాలంలో కాలోజీవాడి, బ్రాహ్మణపల్లి శివారులో ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండేవి. దీంతో ఈ ప్రాంతంలో ఉన్న ఐదుగ్రామాల ప్రజలు జిల్లా కేంద్రం, మండల కేంద్రానికి వెళ్లాలంటే ఇబ్బందులు పడేవారు. 2023లో ప్రభుత్వం బ్రాహ్మణపల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు, కాలోజీవాడి నిర్మాణానికి రూ. 2.10 కోట్ల నిధులను మంజూరు చేసింది.వెంటనే అధికారులు పనులను ప్రారంభించారు. గతేడాది రెండు బ్రిడ్జ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. సదరు కాంట్రాక్టు బ్రిడ్జిలపై తారు రోడ్డు వేయడం కుండా మట్టిమొరం పోసి వదిలేశారు. పక్కనే ఉన్న భిక్కనూరు మండలంలో ఆరునెలల క్రితం ప్రారంభమైన బ్రిడ్జిలను పూర్తి చేసి బీటీవేశారు. ఇక్కడ మాత్రం మధ్యలోనే ఆపేశారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బ్రిడ్జిల వద్ద తారు రోడ్డును వేయించాలని వాహనదారులు కోరుతున్నారు. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి, కాలోజీవాడి శివార్లలో నిర్మాణం తారు రోడ్డు వేయక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులుకాంట్రాక్టర్కు బిల్లులు రాలేదు రెండు బ్రిడ్జిలను నిర్మించిన కాంట్రాక్టర్కు ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. సదరు కాంట్రాక్టర్కు ప్రభుత్వం బిల్లులు విడుదల చేసిన వెంటనే బ్రిడ్జిల వద్ద ఉన్న తారు రోడ్డు వేసేలా చూస్తాం. – రవితేజ, ఆర్అండ్బీ ఏఈ, తాడ్వాయి -
ధర్మమార్గంలో నడవాలి
● మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డొంకేశ్వర్(ఆర్మూర్): ప్రజలంతా ధర్మమార్గంలో నడవాలని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధానంగా యువత సన్మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. సోమవారం డొంకేశ్వర్ మండలం నికాల్పూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రతిష్టాపన ముగింపు ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తనది నిర్మల్ జిల్లా అయినప్పటికీ డొంకేశ్వర్ మండల చుట్టు పక్కల గ్రామాల్లో బంధువులు ఉన్నారని, నికాల్పూర్లో కూడా ఉన్నట్లు తెలిపారు. అనంతరం జెడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన కమిటీ, వీడీసీ సభ్యులు, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. చివరి రోజు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, అభిషేకం, కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తిరుపతి రెడ్డి, రావుల సుభాష్, భీమ్నాయక్, సుమన్ పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంమోపాల్: మండలంలోని మంచిప్ప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008–09 సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత కలిసిన విద్యార్థులు.. ఆత్మీయంగా పలకరించుకొని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు. -
మెరుగైన బోధనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ
బాన్సువాడ రూరల్: విద్యాబోధనలో నైపుణ్యాలను పెంచేలా జిల్లాలోని గెజిటెడ్ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి 24వ తేదీవరకు టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన జిల్లా రిసోర్స్ పర్సన్స్ వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. వివిధ సబ్జెక్టుల బోధనను మెరుగు పర్చుకునేలా జీవన నైపుణ్యాలు లీడర్షిప్ క్వాలిటీస్ పెంపుదలకు ఈశిక్షణ తోడ్పడనుంది. కామారెడ్డి జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు లేదా ఎంఈవోలు సూచించిన పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఐదు రోజుజుల పాటు శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు శిక్షణ ఉంటుంది. మధ్యాహ్న భోజన వసతి, టీ, స్నాక్స్ కూడా అందజేయనున్నారు. విధిగా ఉపాధ్యాయులంతా శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. 25 మండలాల్లో శిక్షణ.. జిల్లాలోని 25మండలాల్లో మండల విద్యాశాఖాధికారుల పర్యవేక్షణలో మండల స్థాయిలో ఎస్టీటీలు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలకు రెండోవిడత శిక్షణ ఈనెల 20 నుంచి 24 వరకు ఇవ్వనున్నారు. సుమారు 2500మంది టీచర్లు శిక్షణలో పాల్గొననున్నారు. మరో సుమారు 2వేల మంది గెజిటెడ్ హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు కామారెడ్డి జిల్లాకేంద్రంలో 10సెంటర్లలో అలాగే బాన్సువాడలో 4చోట్ల శిక్షణ కొనసాగనుంది. 27 నుంచి తుది విడత శిక్షణ నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు నిజామాబాద్లోని డైట్ కాలేజీలో శిక్షణ కొనసాగిస్తున్నారు. ప్రధానాంశాలు.. ఉపాధ్యాయులకు శిక్షణలో భాగంగా ఎఫ్ఎల్ఎన్, ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ), డిజిటల్ పాఠాలపై లర్నింగ్ అవుట్ కమ్స్, లైఫ్స్కిల్స్, తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. జిల్లాస్థాయిలో ఇటీవల శిక్షణ పొందిన మండల స్థాయి రిసోర్స్ పర్సన్లు ఈ ఉపాధ్యాయులకు గుర్తించిన శిక్షణ ఇవ్వనున్నారు. మండల విద్యాశాఖాధికారులు గుర్తించిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణకు హాజరు కావాల్సి ఉంటుంది. శిక్షణకు హాజరయ్యే ఉపాధ్యాయులు టెక్ట్స్ బుక్స్ వెంట తీసుకుని రావాల్సి ఉంటుంది. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ కొరకు ఐఫోన్ బదులుగా అండ్రాయిడ్ ఫోన్ వెంట తీసుకుని వస్తే అందులో రోజువారి అస్సెస్మెంట్ మరియు ఎవల్యూయేషన్ ఉంటుంది. ఎస్జీటీలకు నేటి నుంచి 24వ తేదీ వరకు.. ఎస్ఏలకు 3 దశల్లో ట్రైనింగ్ 4,500 మందికి శిక్షణ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు విడతల్లో సుమారు 4500 మంది ఉపాధ్యాయులకు ఆయా సబ్జెక్టులపై వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్నాం. ఎంఈవోల పర్యవేక్షణలో శిక్షణ కొనసాగుతుంది. ఉపాధ్యాయులు తప్పనిసరిగా శిక్షణకు హాజరు కావాలి. హాజరు కాని వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. – రాజు, డీఈవో, కామారెడ్డి -
మనస్పర్ధలతో భార్యను కడతేర్చిన భర్త
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని.. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందనే అంజలిని భర్త గంగారెడ్డి అడ్డు తొలగించుకున్నట్లు సమాచారం. దుబాయిలో ఉంటున్న గంగారెడ్డి.. ఫేస్బుక్లో పరిచయమైన మహిళతో కొన్నేళ్లుగా వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని భార్యకు తెలవడంతోనే గొడవలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లగా, కోర్టులో కేసు నడుస్తుండగానే అంజలిని గంగారెడ్డి హతమార్చాడు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.ఆర్మూర్టౌన్: కట్టుకున్న భార్యను కన్నపిల్లల ఎదుటే గొంతుకోసి హతమార్చిన ఘటన ఆర్మూర్ పట్టణంలో సోమవారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అలియాస్ గంగారెడ్డికి జగిత్యాల జిల్లా మొగిల్పేట్ గ్రామానికి చెందిన అంజలి(35)తో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గంగారెడ్డి జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్తూ వస్తుండేవాడు. గంగారెడ్డి–అంజలి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం బోధన్ కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కేసు నడుస్తోంది. గొడవల కారణంగా అంజలి తన ఇద్దరి కూతుళ్లతో కలిసి 20 రోజుల క్రితం ఆర్మూర్ పట్టణంలో నివాసముంటుంది. కేసు నిమిత్తం అంజలి కూతుళ్లతో కలిసి సోమవారం బోధన్ కోర్టుకు హాజరై తిరిగి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటోంది. భర్త గంగారెడ్డి ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న పిల్లలను తోసేసి అంజలి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. పిల్లల అరుపులు విన్న ఇంటి యజమాని విషయం తెలుసుకునేందుకు రాగా అతనిని సైతం తోసేసాడు. దీంతో గంగారెడ్డి బయటికి వెళ్లకుండా యజమాని ఇంటి గేటు మూసేసి గడియపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజలి అప్పటికే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని సీపీ సాయి చైతన్య, ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. పిల్లల ఎదుటే దారుణం -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల రాకేశ్(20) అనే డిగ్రీ విద్యార్థి సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్న ఆరేపల్లి గ్రామానికి చెందిన కొంకుల పోచవ్వ, గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడైన రాకేశ్ ఎల్లారెడ్డి పట్టణంలో రౖపైవెట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఉపాధి కోసం తల్లిదండ్రులు హైదరాబాద్కు వలస వెళ్లారు. తమ్ముడు మధుతో కలిసి చదువుకుంటూ ఇంటి వద్ద ఉంటున్న రాకేశ్ ఫోన్లో ఆన్లైన్ గేమ్కు అలవాటు పడ్డాడు. ఆన్లైన్ గేమ్ ఆడటం ద్వారా రూ. 80 వేలు పొగొట్టుకున్నాడు. ఈ విషయం తండ్రికి తెలిసి మందలించాడు. అంతే కాకుండా రాకేశ్ తరచూ ఫోన్ మాట్లాడుతున్నాడని తండ్రి మరోమారు మందలించడంతో తీవ్ర మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై శివకుమార్ మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణి ద్వారా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 96 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. త్వరితగతిన తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యలను పరిష్కరించడం గాని, పరిష్కార మార్గాలు చూపడం గాని చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలపై దరఖాస్తుదారుడికి రాతపూర్వకంగా సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 96 ఫిర్యాదులు -
తండ్రి దాడిలో కొడుకు మృతి
కామారెడ్డి క్రైం: తండ్రీకొడుకుల మధ్య గొడవ ఒకరి హత్యకు దారితీసింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ గ్రామానికి చెందిన వడ్ల నిఖిల్ (24) కొన్ని నెలల క్రితం గల్ఫ్ వెళ్లి మూడు నెలల క్రితం తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి నిఖిల్ మద్యం, కల్లు లాంటి దురలవాట్లకు బానిసయ్యాడు. డబ్బుల కోసం నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ఆదివారం రాత్రి తండ్రి భాస్కర్తో గొడవ జరిగింది. భాస్కర్ ఆవేశంతో అక్కడే ఉన్న ఓ ఇనుప రాడ్డుతో నిఖిల్పై దాడి చేశాడు. నిఖిల్ తలకు బలమైన గాయం కావడంతో వెంటనే కామారెడ్డి జనరల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నిఖిల్ సోమవారం మృతి చెందాడు. భాస్కర్పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానీపేట గ్రామ శివారులోని పంట చేనులో బండరాళ్ల కోసం అమర్చిన జిలెటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. భవానీపేట గ్రామానికి చెందిన దర్శనం సిద్ధిరాములు పంట చేనులో ఉన్న బండరాళ్లను తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ అమర్చినట్లు సమాచారం అందడంతో ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ రవీందర్, ఎస్సైలు వెంకట్రావు, రాఘవేంద్ర గ్రామానికి చేరుకొని పరిశీలించారు. డాక్ స్క్వాడ్తో తనిఖీలు చేయగా 31 జిలెటిన్ స్టిక్స్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సిద్ధిరాములు భూమిని బాగు చేసుకునేందుకు జిలెటిన్ స్టిక్స్ అమర్చినట్లు తెలిపారు. కాగా, ఆదివారం జిలెటిన్ స్టిక్స్ పేల్చడంతో సబ్స్టేషన్కు ప్రమాదం తప్పిందన్నారు. పలు ఇళ్లు, వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు జిలెటిన్ స్టిక్స్ అమర్చిన వ్యక్తిని, పంట చేను యజమానిని అదుపులోకి తీసుకున్నారు. గుర్తు తెలియని మహిళ మృతి ఖలీల్వాడి: నగరంలోని గాజుల్పేట్ గురుద్వారా సమీపంలో స్పృహ తప్పిన గుర్తు తెలియని మహిళ (60 నుంచి 65) ఆస్పత్రిలో మృతి చెందినట్లు రెండో టౌన్ ఎస్సై తెలిపారు. వివరాలు తెలిస్తే 87126 59838 నంబర్కు సమాచారం అందించాలని తెలిపారు. -
విపత్తులపై అప్రమత్తం చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జిల్లా కేంద్రంలో నేడు మాక్డ్రిల్కామారెడ్డి క్రైం: వర్షాకాలంలో విపత్తులు, వరదలు వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. వర్షాకాలంలో ఎదురయ్యే విపత్తులపై అవగాహన కల్పించేందుకు మంగళవారం జిల్లాకేంద్రంలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో పోలీస్, రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వరద లు వచ్చినప్పుడు ప్రజలను సురక్షత ప్రాంతాలకు తరలించడం, అప్రమత్తం చేయడం వంటి కార్యక్రమాలను మాక్ డ్రిల్ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం అందించే సహాయ, సహకారాలను గురించి ప్రజలకు వివరించాలన్నారు. అధికారులు తప్పనిసరిగా మాక్డ్రిల్ లో పాల్గొనాలన్నారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ నరసింహారెడ్డి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ట్రాన్స్కో ఎస్ఈ శ్రావణ్ కుమా ర్, ఆర్అండ్బీ ఈఈ రవిశంకర్, డీపీవో మురళి, జిల్లా ఫైర్ అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్లు రాజేందర్, శ్రీహరి, మహేష్ పాల్గొన్నారు.దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలి కామారెడ్డి క్రైం : రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాల ని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వచ్చిన 41,547 దరఖాస్తులను పరిశీలన నిమిత్తం బ్యాంకులకు పంపించామన్నారు. వాటిలో 15,515 దరఖాస్తులను బ్యాంకర్లు పరిశీలించారన్నారు. మిగిలిన వాటిని రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకుల నుంచి సమాచారాన్ని వీలైనంత త్వరగా తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చందర్, డీఆర్డీవో సురేందర్, బీసీ సంక్షేమ అధికారి స్రవంతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్ పాల్గొన్నారు. -
స్కూల్ బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరి
కామారెడ్డి క్రైం: పాఠశాల బస్సులకు ఫిట్నెస్ తప్పనిసరిగా చేయించుకోవాలని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్రెడ్డి సూచించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సోమవారం స్కూల్ బస్సుల డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీటీవో మాట్లాడుతూ స్కూల్ బస్సులు ప్రమాదాలకు గురి కాకుండా డ్రైవర్లు, యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోడ్డు దాటే క్రమంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. బస్సులకు మరమ్మతులు ఏవైనా ఉంటే ముందుగానే చేయించుకుని ఫిట్నెస్ ధ్రువీకరణ చేసుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం బస్సులు నడపకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
సైన్యం పరాక్రమానికి ప్రతీక సిందూర్
కామారెడ్డి టౌన్: భారత సైన్యం పరాక్రమానికి ప్రతీ క అపరేషన్ సిందూర్ అని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. పహల్గాంలో ఉగ్రదాడి అనంత రం మన దేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థా న్, పీవోకేలలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని సోమ వారం జిల్లాకేంద్రంలో తిరంగా ర్యాలీ నిర్వహించా రు. గాంధీ గంజ్ వద్ద ప్రారంభమైన ర్యాలీ.. పుర వీధుల మీదుగా సాగింది. జాతీయ జెండాలతో పాటు ఆపరేషన్ సిందూర్ ప్లకార్డులు, మోదీ కటౌట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ను విజయవంతంగా పూర్తి చేసి పాకిస్థాన్పై విజయం సా ధించినందుకు త్రివిధ దళాలకు కృతజ్ఞతలు తెలిపా రు. దేశ సైనికుల వీరత్వాన్ని, త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమన్నారు. దేశ ప్రజలు వారికి రుణపడి ఉంటారన్నారు. మోదీ పాలనలో దేశం సురక్షితంగా ఉందన్నారు. ర్యాలీలో బీజేపీ రాష్ట్ర నాయకులు మురళీధర్ గౌడ్, రంజిత్ మోహన్, జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మోదీ పాలనలో దేశం సురక్షితం తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే కేవీఆర్ -
కేసుల విచారణలో నాణ్యత ముఖ్యం
కామారెడ్డి క్రైం: నాణ్యతతో కూడిన కేసుల విచారణ చేపట్టాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూ చించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సో మవారం ఆయా పోలీస్ స్టేషన్ల రైటర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేసుల దర్యాప్తు, విచారణ, పరిశోధనలో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. ముఖ్యంగా సీసీటీఎన్ఎస్లో కేసులకు సంబంధించిన సమాచా రం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అయ్యేలా చూడాలన్నారు. ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు అన్ని వివరాలు సమగ్రంగా, స్పష్టంగా నమోదు చేయాలని, ఒక్క అంశంలో కూడా తప్పులు దొర్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి రైటర్కు ఉందని తెలిపారు. బాధితుడికి న్యాయం జరిగేలా విచారణ సాగాలన్నారు. సమావేశంలో డీసీఆర్బీ సీఐ మురళి తదితరులు పాల్గొన్నారు. పోలీసు శాఖకు మంచి పేరు తేవాలి కామారెడ్డి క్రైం : నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. రెండు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరు పోలీసుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను సోమ వారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వడ్ల రవి భార్య సౌఖ్య, అనారోగ్యంతో మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రమేష్ కూతురు మానసలకు జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగ పత్రాల ను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ నర్సింహారెడ్డి, కార్యాలయ ఏవో అప్సర్ తదితరులు పాల్గొన్నారు. మల్బరీ మొక్కల పరిశీలన బీబీపేట : యాడారంలో పట్టు పురుగుల సా గు కోసం పెంచుతున్న మల్బరీ మొక్కలను సోమవారం జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు పట్టు పురుగుల పెంపకంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ పరిశ్రమతో తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి ఆశించవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల రైతులు సంప్రదించాలని సూచించారు. ఆమె వెంట డివిజన్ ఉద్యాన అధికారి సంతోషి రాణి, జిల్లా పరిశ్రమల అధికారి అయిలయ్య తదితరులు ఉన్నారు. డిగ్రీ పరీక్షలకు 508 మంది గైర్హాజరుతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు సోమవారం మూడో రోజు ప్రశాంతంగా జరిగినట్లు ఆడి ట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖ ర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 32 పరీక్ష కేంద్రాల్లో 7,680 మంది విద్యార్థులకు 7,172 మంది హాజరు కాగా 508 మంది గై ర్హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం జరిగిన 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 7,112 మంది విద్యార్థులకు 6,670 మంది హాజరు కాగా 442 మంది గైర్హాజరయ్యారని తెలిపా రు. మధ్యాహ్నం జరిగిన 1వ సెమిస్టర్ బ్యా క్లాగ్ పరీక్షలకు 558 మంది విద్యార్థులకు 502 మంది హాజరు కాగా 66 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయంపై నైపుణ్య శిక్షణ డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ(ఆత్మ) ఆధ్వర్యంలో గ్రా మీణ యువ రైతులకు సేంద్రియ వ్యవసా యంపై నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ భరత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26 నుంచి జూన్ 1వరకు శిక్షణ ఇస్తామని.. వారం రోజుల పాటు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు 23లోగా ఆత్మ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఆయిల్పాం సాగుపై దృష్టి సారించాలి
బీబీపేట: ఆయిల్పాం సాగుకు రైతులు ముందుకు రావాలని, దాని వల్ల సుమారు 30 ఏళ్లవరకు ఆదాయం సంపాదించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. సోమవారం యాడారంలో హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయిల్పాం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని ధర్మారెడ్డి రైతు పది ఎకరాల్లో 525 మొక్కలు నాటుతున్నారన్నారు. జిల్లాలో ఆయిల్పాం సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఆయిల్పాం మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. జిల్లాలో ఆయిల్పాం ఫ్యాక్టరీ పెట్టడానికి హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ కసరత్తు చేస్తోందన్నారు. కార్యక్రమంలో డివిజన్ ఉద్యాన శాఖ అధికారి సంతోషిరాణి, అధికారులు వరుణ్, విజయ రామస్వామి, నసీం, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, తహసీల్దార్ సత్యానారాయణ, ఏవో నరేందర్, ఏఈవోలు సంతోష్, రమేష్, హెచ్యూఎల్ జనరల్ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
దోమకొండ: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ సూచించారు. ఆదివారం ఆయన అంచనూరు, లింగుపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. వర్షం కురిసినా ఇబ్బందులు రాకుండా కుప్పల చుట్టూ కాలువలు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్లతో కప్పి ఉంచాలని సూచించారు. ఐకేసీ ఏపీఎంతో పాటు సిబ్బందికి ఆయన సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి రమేశ్ బాబు, ఐకేపీ ఏపీఏం రాజు, సీసీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ గేట్ల మరమ్మతులు పూర్తి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మిగులు జలాలను గోదావరిలోకి వదులుటకు నిర్మించిన వరద గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రస్తుతం భద్రంగా ఉన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణ కాలంలో 42 వరద గేట్లను నిర్మించగా, 1983లో తొలిసారిగా ప్రాజెక్ట్ నుంచి మిగులు జలాలను గోదావరిలోకి వదిలారు. అప్పటి నుంచి ఉపయోగంలో ఉన్నటువంటి వరద గేట్లకు పూర్తి స్థాయిలో మరమ్మతులు ఎప్పుడూ చేపట్టలేదు. ప్రతి సంవత్సరం వేసవిలో మెయింటెనెన్స్ చేపట్టి వదిలేశారు. దీంతో కొన్ని గేట్లు టన్ బక్కెలు చెడిపోయి, రోప్ తెగిపోయి ప్రమాదకరంగా మారాయి. గేట్లు ఎత్తితే లేవకుండా, దించితే దిగకుండా ఉండిపోయాయి. ఈక్రమంలో గత ప్రభుత్వ హయాంలో 2022లో వరద గేట్ల పూర్తిస్థాయి మరమ్మతుల కోసం రూ.17.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. అప్పటి నుంచి ప్రారంభమైన పనులు ఇప్పటికి పూర్తయ్యాయి. తిప్పలు తప్పినట్టే.. 42 వరద గేట్లను ప్రస్తుతం పూర్తిస్థాయిలో మరమ్మతులు పూర్తి కావడంతో అన్ని వరద గేట్లను ఎత్తినా ఎలాంటి తిప్పలు ఉండవని ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. ప్రతి సంవత్సరం వేసవిలో గేట్ల నిర్వహణ చేపట్టకపోతే మళ్లీ కథ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. గేట్ల రోప్లకు గ్రీస్, గేట్లకు రంగు వేయడం మరిచిపోతే మళ్లీ టన్ బక్కెలు, రోప్లు చెడిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏటేటా మెయింటెనెన్స్కు నిధులు మంజూరు చేయాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. వరద గేట్ల ద్వారా 16 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేలా నిర్మించారు. 1983లోనే తొలిసారి గరిష్టంగా అంత స్థాయిలో నీటి విడుదల చేపట్టారు. తరువాత అలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. తరువాత కాలంలో గరిష్టంగా 6.5 లక్షల క్యూసెక్కుల నీటినే గోదావరిలోకి వదిలినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. 2022లో నిధులు మంజూరు మూడేళ్లకు పూర్తయిన పనులుఎలాంటి ఇబ్బంది లేదు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 42 వరద గేట్లకు మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రస్తుతం గేట్ల ఆపరేటింగ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వరదలు వచ్చినా గోదావరిలోకి నీటిని వదులుటకు 42 వరద గేట్లను వినియోగించుకోవచ్చు. – వంశి, డ్యాం ఏఈఈ, ఎస్సారెస్పీ -
బడి బాగుకు ఒక్కటయ్యారు
మాచారెడ్డి : తమకు విద్యాబుద్ధులు నేర్పిన బడి బాగు కోసం పూర్వ విద్యార్థులు నడుం బిగించారు. ఉనికి కోల్పోతున్న చదువుల చెట్టుకు పూర్వ వైభవం తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆ పాఠశాలలో చదువుకొని ఉన్నతంగా ఎదిగిన పలువురు ఉద్యోగులు, వృత్తి నిపుణులు తలా కొంత డబ్బులు జమ చేసి పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. పాల్వంచ మండలం ఫరీదుపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు జమ చేసిన రూ.10 లక్షలతో పాఠశాలలో విద్య, క్రీడ, కళారంగాల్లో రాణిస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలు, ఐఐటీ ఫౌండేషన్, కంప్యూటర్ బోధన, పోటీ పరీక్షల కోసం శిక్షణ, వ్యక్తిత్వ వికాసం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పూర్వ విద్యార్థులు తెలిపారు.బడిబాట నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థులు (ఫైల్)అందరూ కదులుతున్నారు చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు భరోసా ఇస్తున్నారు. ఈ బడి అభివృద్ధి కోసం ఇక్కడ చదివిన అన్ని బ్యాచ్ల విద్యార్థులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. – కె.వెంకటి, స్కూల్ అసిస్టెంట్, పూర్వ విద్యార్థి నిధులు సమకూరుస్తా... పాఠశాలకు పూర్వ వైభ వం తెచ్చేందుకు పూర్వ విద్యార్థులంతా ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. బ డి అభివృద్ధికోసం ప్ర భుత్వం నుంచి నిధులు తీసుకురావడానికి నా వంతుగా ప్రయత్నాలు చేస్తా. – పి.రమేశ్గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, పూర్వ విద్యార్థి బడి రుణం తీర్చుకునేందుకు... ఓనమాలు దిద్దిన బడి రుణం తీర్చుకోవడానికి ఒక్కటిగా కదిలాం. పూ ర్వ విద్యార్థుల సమావే శం ఏర్పాటు చేసి చర్చించాం. విద్యార్థుల కు కార్పొరేట్ స్థాయిలో చదువు అందించేందు కు కలిసి కృషి చేస్తున్నాం. – వి.శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పూర్వ విద్యార్థి పాఠశాల అభివృద్ధికి.. మేము చదువుకున్న పా ఠశాలను అభివృద్ధి చే యాలని సంకల్పించాం. పాఠశాలలోని సమస్య లను పరిష్కరించడంతో పాటు మెరుగైన వి ద్యనందించేందుకు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – ఎం.సిద్దిరాంరెడ్డి, జిల్లా సైన్స్ అధికారి, పూర్వ విద్యార్థి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తూ.. పూర్వ విద్యార్థులు ఇటీవల గ్రామంలో బ డిబాట నిర్వహించారు. ప్రైవేటు పాఠశాల లకు వెళుతున్న దాదాపు 150 మంది వివ రాలను నమోదు చేసుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలు కల్పించి నీట్, జేఈఈ, ఏప్సెట్ తదితర పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమై న ఫ్యాకల్టీని తాము ఏర్పాటు చేస్తామని త ల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. దీంతో చా లామంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స ర్కారు బడిలో చేర్పించడానికి ఆసక్తి చూ పుతున్నారు. సర్కారు బడిలో సదుపాయాల కల్పనకు రూ.10 లక్షలు జమ పిల్లలను చేర్పించాలంటూ బడిబాట ఆదర్శంగా నిలుస్తున్న ఫరీదుపేట పూర్వ విద్యార్థులు -
● అ‘పూర్వ’ సమ్మేళనం
బోధన్: సాలూర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2003–2004కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 21 ఏళ్ల తర్వాత అందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెరమరేసుకున్నారు. సమ్మేళనానికి ఎంఈవో రాజీ మంజూష, నాటి పాఠశాల ఉపాధ్యాయుడు విశ్రాంత హెచ్ఎం గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు మనోహర్, గురుదత్తు, హన్మాండ్లు, గణేశ్, శ్రీనివాస్, ఇల్తెపు గంగారాంలను ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చీల శంకర్, చిద్రపు అశోక్, లక్ష్మణ్, సాయిలు, రాజు, భీంరావు, భీమేశ్, వెంకటేశ్, గంగాప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు. -
ఔషధ గుణాల తాటిముంజ
బాన్సువాడ రూరల్: ఔషధ గుణాలు కలిగి ఉన్న తాటిముంజల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని ఐస్ఆపిల్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు. తాటిముంజాలు వేసవిలోనే లభిస్తుంటాయి. పట్టణ పరిసరాల్లో ఆశించిన స్థాయిలో తాటివనాలు లేనప్పటికీ నిజాంసాగర్, పిట్లం, మహ్మద్నగర్ తదితర గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తాటిముంజలను పట్టణాలకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. బాన్సువాడ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, సోమేశ్వర్ , బుడిమి చౌరస్తాలో రహదారులకు ఇరువైపులా డజన్ రూ.60నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. తాటి కల్లు తరహాలోనే ముంజలకు సైతం ఔషధ గుణాలు ఉంటాయని మన పూర్వీకులతోపాటు వైద్యులు సైతం పేర్కొంటున్నారు. మానవ శరీరంలోని టాక్సినస్ను వదిలించుకోవడానికి, శరీర సహజ ఉష్ణోగ్రత నిర్వహణకు తాటి ముంజలు సహాయ పడతాయంటున్నారు. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజలు చక్కని ఫలహారం. ఆటలమ్మ వంటివి సోకినప్పుడు శరీరంపై ఏర్పడే పుండ్లపై తాటి ముంజల నీటిని పట్టిస్తే దురద తగ్గి అవి త్వరలోనే మానిపోతాయి. ముంజలను గుజ్జుగా చేసి, ముఖానికి పైపూతగా రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందించి, వేసవిలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో తాటి ముంజలతో శీతల పానీయాలను కూడా తయారు చేస్తారు. తమిళనాడులో తాటిముంజల పానీయాన్ని ‘ఎలనీర్ నుంగు’ అంటారు. పోషక భాండాగారం తాటిముంజాలు శరీరంలోని చక్కర, ఖనిజ లవణాలను సమతుల్యం చేస్తాయి. విటమిన్ బి–7, విటమిన్ కే, పోటాషియం, ఐరన్, జింక్, కాల్షియంతోపాటు సెలబుల్ ఫైబర్, విటమిన్ ఏ, బీ, డీ, కే ఎక్కువగా లభిస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. డీ–హైడ్రేషన్ బారిన పడకుండా తాటిముంజలు దోహదం చేస్తాయి.ఆరోగ్యానికి మేలు తాటిముంజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ ఇష్టంగా తినవచ్చు. షుగర్, బీపీ వ్యాధిగ్రస్తులకు జీర్ణకోశ సమస్యలు ఉన్న వారికి దివ్య ఔషధంగా పనిచేస్తాయి. పోటాషియం ఎక్కువగా లభిస్తుంది. పొట్టుతో తీసుకుంటే మలబద్ధ్దకం తగ్గుతుంది. – శ్రీనివాస్ ప్రసాద్, డాక్టర్ -
దుకాణంలో చోరీకి యత్నం
ఖలీల్వాడి: నగరంలోని ఒకటో పోలీస్స్టేషన్ పరిధిలోని ఆర్కే బిల్డర్స్లో దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి యత్నించినట్లు ఎస్హెచ్వో రఘుపతి ఆదివారం తెలిపారు. దుండగులు బీరువా, లాకర్ ధ్వంసం చేయగా ఎలాంటి వస్తవులు చోరీకి గురి కాలేదన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. దుకాణ నిర్వాహకుడు గుజ్జ రవికృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. పేకాట స్థావరంపై దాడిమద్నూర్: మండలంలోని అంతాపూర్లో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై విజయ్కొండ తెలిపారు. గ్రామంలో శనివారం రాత్రి పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన నలుగురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో రూ. 5,640 నగదు, నాలుగు ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకొని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్సై వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. ఒకరిపై కేసు నమోదులింగంపేట: మండలంలోని భవానిపేట శివారులోని పంట చేనులో బండరాళ్లను పగులగొట్టడానికి సదరు వ్యక్తి బ్లాస్టింగ్ చేయడంతో చుట్టు పక్కల ఇళ్లు దెబ్బతిన్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన దర్శనం సిద్ధిరాములుకు సంబంధించిన భూమిలో ల్యాండ్ డెవలప్ చేయడానికి బ్లాస్టింగ్ చేశారు. దీంతో బండరాళ్లు ఎగిరి పలువురి ఇళ్లపై పడడంతో ఇళ్లు, బైక్, కారు ధ్వంసమయ్యాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి ఎస్సై, సిబ్బందితో చేరుకొని పరిశీలించారు. బ్లాస్టింగ్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. విద్యుత్ షాక్తో గేదె మృతిరుద్రూర్: పొతంగల్ శివారులో ఆదివారం విద్యుత్ షాక్ తగిలి గేదె మృతి చెందింది. గంగారాం అనే రైతుకు చెందిన గేదె వ్యవసాయ పొలం వద్ద మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ ఎర్త్వైర్కు తగిలి విద్యుత్ షాక్కు గురైంది. విద్యుత్ షాక్తో మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు తెలిపాడు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారం ఇవ్వాలని ఆయన కోరాడు. దుబ్బాకలో.. ధర్పల్లి: మండలంలోని దుబ్బాక గ్రామంలో నాగుల ఎర్రన్నకు చెందిన గేదె విద్యుత్ షాక్తో ఆదివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమీపంలో మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్కు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. గేదె విలువ రూ.60 వేల వరకు ఉంటుందని, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరాడు. -
నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్
నందిపేట్: శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నిర్మూలనకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని రాజానగర్ దుబ్బ, ఎన్టీఆర్ కాలనీలో ఆదివారం రాత్రి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఏసీపీ తెలిపారు. సుమారు 102 మంది పోలీసు అధికారులు, సిబ్బంది 210 ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 52 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు కమ్యూనల్ రౌడీలను, నలుగురు అనుమానిత వ్యక్తులను చెక్ చేసినటులతెలిపారు. నంబర్ ప్లేట్ లేని, మోడిఫైడ్ సైలెన్సర్లు బిగించిన 12 వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. తనిఖీల్లో ఆర్మూర్ టౌన్ సీఐ సత్యనారాయణ, భీమ్గల్ సీఐ సత్యనారాయణ, స్థానిక ఎస్సై చిరంజీవి, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 9 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, స్పెషల్ పార్టీ, రిజర్వ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి -
వరికొయ్యలకు నిప్పు.. భూసారానికి ముప్పు
ఎల్లారెడ్డి రూరల్: వరి పంటలను హార్వెస్టర్ మిషన్ల ద్వారా కోత కోసిన అనంతరం రైతులు వరికొయ్యలకు నిప్పు పెడితే భూసారానికి ముప్పు జరిగే ప్రమాదం ఉంది. వరికొయ్యలకు నిప్పు పెట్టడంతో వాయు కాలుష్యం ఏర్పడుతుంది. గ్రామాలలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికి ఒకరిని చూసి మరొకరు వరికొయ్యలకు నిప్పు పెడుతున్నారు. వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడడంతో పాటు భూమిలో సారవంతం తగ్గిపోతుందని, వానపాములు, చిన్నచిన్న సూక్ష్మజీవులు చనిపోవడంతో భూమి సారవంతం చేసే పని నిలిచిపోతుందన్నారు. వరి కొయ్యలతో పాటు, మొక్కజొన్న, జొన్న సొప్ప పొలంలో అలాగే వదిలేయాలి. నాటు వేసే వారం రోజుల ముందు పొలంలో మడులలో నీటిని నింపి ఎకరాకు రెండు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్పేట్ మందును చల్లి వారం రోజుల పాటు ఉంచాలని, దీంతో గడ్డి మురిగి పోయి భూమికి సేంద్రియ ఎరువుగా మారుతుందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటు పొలం దుక్కి దున్నే ఖర్చు సైతం మిగులుతుందన్నారు. పంటపొల్లాలో కొయ్యలను కాల్చేస్తే వాయుకాలుష్యం నశిస్తున్న సూక్ష్మజీవులు, పర్యావరణానికి హాని -
అన్నదాతపై విత్తన భారం
మోర్తాడ్: జీలుగ సాగుతో భూసారం పెరుగుతుంది. అందుకే రైతన్నలు వీటిపై ఆసక్తి చూపుతారు. రాష్ట్ర ప్రభుత్వం జీలుగ విత్తనాలను రాయితీపై అందిస్తుంది. ఈ ఏడాది యాభై శాతం రాయితీపై విత్తనాలను సహకార సంఘాల ద్వారా విక్రయిస్తున్నా గతంలో కంటే ధర రెట్టింపు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీలుగ విత్తనాల సంచి పరిమాణం 30 కిలోలు ఉండగా గతంలో రాయితీ పోను రూ.1,116కు రైతులకు లభించింది. అంటే నాడు ఒక్కో సంచికి రూ.2,232 ఉండేది. ఇప్పుడు సంచి ధర రూ.4,275 ఉండగా 50 శాతం రాయితీపై రూ.2,137కు లభిస్తోంది. గతంలో కంటే రూ.1,021 ధర పెరిగిందని స్పష్టమవుతోంది. విత్తనాల సేకరణలో ఇబ్బందితోనే.. జీలుగ విత్తనాల సేకరణలో ఇబ్బందులు కలుగడంతో ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ యాజమాన్యం వెల్లడించింది. జీలుగ విత్తనాలు గతంలో మాదిరిగా తక్కువ ధరకు లభించి ఉంటే అటు రైతులపై, ఇటు ప్రభుత్వంపై భారం ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం స్పందించి జీలుగ విత్తనాల ధర పెంపుపై పునరాలోచన చేసి రైతులకు మేలు చేయాలని పలువురు కోరుతున్నారు. రైతులకు భారమే... జీలుగ విత్తనాల ధర పెంపుతో రైతుల్లో ఆందోళన గతంలో కంటే రెట్టింపు ధరకు విక్రయం విత్తనాల కొరతతోనే ఎక్కువ ధరకు కొనుగోలు: విత్తనాభివృద్ధి సంస్థ యాజమాన్యం ఇబ్బంది పడుతున్న రైతులుజీలుగ విత్తనాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వానికి భారం ఏర్పడటమే కాకుండా రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది. జీలుగ విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో వీటి సేకరణకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వం ఎక్కువ ధరకు కొనుగోలు చేయడంతో ఖజానాకు ఆర్థిక భారం ఏర్పడింది. రాయితీ గతంలో మాదిరిగానే వర్తింప చేసినా ధర పెరగడం వల్ల రైతులపై భారం తప్పలేదని చెప్పవచ్చు. -
ర్యాష్ డ్రైవింగ్.. రోడ్డుపై నిలబెట్టింది
ఖలీల్వాడి: ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఇద్దరు యువకులను స్వయంగా పట్టుకున్న సీపీ సాయిచైతన్య.. సామాజిక సేవ చేయాలని వారికి సూచించారు. శనివారం రాత్రి నగరంలోని కోర్టు చౌరస్తా మీదుగా ఇద్దరు యువకులు బైక్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ సీపీ వాహనం పక్కనుంచే వెళ్లగా ఆయన గమనించి వెంటనే వారిని పట్టుకున్నారు. వారిలో ఒకరిని ఎన్టీఆర్ చౌరస్తా, మరొకరిని కోర్టు చౌరస్తాలో నిలబెట్టి వాహనదారులకు హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని సూచించారు. దీంతో ఇద్దరు యువకులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్లకార్డులను ప్రదర్శించారు. -
భవిత కేంద్రాలకు మహర్దశ
● నిజామాబాద్లో 29 కేంద్రాల మరమ్మతులకు రూ.68.05 లక్షలు, ● కామారెడ్డిలో 22 కేంద్రాలకు రూ.51.62 లక్షలు మంజూరు ● టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ కోసం రూ.14 లక్షలు కేటాయింపుఆర్మూర్: సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగంలోని దివ్యాంగ విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. అందులో భాగంగా భవిత కేంద్రాల్లో టీచింగ్ లర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎమ్)తోపాటు భవనాల మరమ్మతులకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు భవిత కేంద్రాల్లో అవాంతరాలు లేని పరిసరాల్లో విద్యా బోధన చేయడానికి ఏర్పాట్లు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో శాశ్వత భవనాలు ఉన్న 156 భవిత కేంద్రాలకు, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 446 కేంద్రాలకు కలిపి మొత్తం 602 భవిత కేంద్రాల మరమ్మతులకు రూ. 14 కోట్ల 12 లక్షల 73 వేలు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో మరమ్మతుల కోసం.. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భవిత కేంద్రాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని శాశ్వత భవనాలు ఉన్న ఏడు కేంద్రాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 22 కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.68,05,517 మంజూరు చేశారు. కామారెడ్డి జిల్లాలో శాశ్వత భవనాలు ఉన్న ఐదు కేంద్రాలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న 17 కేంద్రాల్లో మరమ్మతుల కోసం రూ.51,62,806 మంజూరయ్యాయి. మరమ్మతు పనులకు ఇంజినీర్లతో అంచనాలు సైతం రూపొందించారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో భవిత కేంద్రాల్లో ఫ్రెండ్లీ టాయిలెట్లు, ర్యాంపులు, రెయిలింగ్, వాల్ పెయింటింగ్స్, అవసరం ఉన్నచోట భవన నిర్మాణా ల మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. టీఎల్ఎం కోసం..జిల్లాలోని శాశ్వత భవనాలు ఉన్న నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ఎడపల్లి, మోర్తాడ్, సిరికొండ, నందిపేట్లలోని భవిత కేంద్రాలకు టీఎల్ఎంతోపాటు అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరయ్యాయి. ప్రతి కేంద్రానికి రూ. 2 లక్షల చొప్పున మొత్తం రూ. 14 లక్షలు కేటాయించారు. జిల్లా విద్యాధికారి సూచనల మేరకు మండలాల ఎంఈవో, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, భవిత కేంద్రం నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కలిపి కమిటీ వేసి పరికరాలను కొనుగోలు చేయనున్నారు. -
రైస్మిల్లుల తనిఖీ
భిక్కనూరు: మండలంలోని రెండు రైస్మిల్లులను జిల్లా వ్యవసాయాధికారి తిరుమలప్రసాద్, డీఎస్వో మల్లికార్జున్, పౌరసరఫరాల శాఖ డీఎం రాజేందర్ ఆదివారం తనిఖీ చేశారు. ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేగవంతంగా ధాన్యం బస్తాలను అన్లోడ్ చేయాలని సూచించారు. వారి వెంట తహసీల్దార్ శివప్రసాద్, ట్రాన్స్పోర్టు కాంట్రాక్టర్ గౌరిశెట్టి సంతోష్ కుమార్ ఉన్నారు. మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. అకాల వర్షాలు కురుస్తున్నందున రైతులకు ఇబ్బందులు కలగకుండా వేగంగా కాంటాలు నిర్వహించి, ధాన్యాన్ని రైస్మిల్లులకు పంపించాలని సూచించారు. సరిహద్దులో చెక్పోస్ట్ ఏర్పాటు మద్నూర్: బక్రీద్ నేపథ్యంలో పశువులను తరలించకుండా సలాబత్పూర్ వద్ద ఆదివారం పోలీస్ సిబ్బంది చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. పక్క రాష్ట్రాల నుంచి పశువుల అక్రమ రవాణా జరగకుండా చూసేందుకు చెక్పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు. నేడు ఆయిల్పాం మొక్కల మెగా ప్లాంటేషన్ బీబీపేట : యాడారంలో సోమవారం ఆయిల్పాం మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి జ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీ అధికారులు, ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. రైతుబంధు నిధులు విడుదల చేయాలి ● వ్యవసాయశాఖ మంత్రికి ఎన్డీసీసీబీ చైర్మన్ రమేశ్రెడ్డి వినతి సుభాష్నగర్: యాసంగి సీజన్కు సంబంధించి నాలుగు ఎకరాలపైన రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును హైదరాబాద్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశా రు. ప్రభుత్వం యాసంగి సీజన్లో నాలుగు ఎకరాల వరకు మాత్రమే రైతుబంధు నిధు లు జమ చేసిందని, మిగతా రైతులకు త్వ రగా విడుదల చేయాలని కోరారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో సాంకేతిక కారణాలతో మాఫీ పొందని రైతులకు కూడా రుణమాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే నిధు లు జమ చేసేలా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు రమేశ్రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని మంత్రి సూచించారని పేర్కొన్నారు. కానిస్టేబుల్పై కేసు నిజామాబాద్ రూరల్: అధిక వడ్డీ వసూలు చేస్తున్న కానిస్టేబుల్పై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్హెచ్వో ఆరిఫ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందిరప్రియదర్శిని కాలనీకి చెందిన గంగాధర్ మెండోరా పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఓ మహిళకు రూ.8 లక్షలు అప్పుగా ఇచ్చి, ఆమెకు చెందిన ఆస్తి పత్రాలను సేల్ డీడ్ చేసుకోవడంతోపాటు ఐదు శాతం వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా సేల్డీడ్ చేసుకున్న ఆస్తిని గంగాధర్ వేరొకరికి విక్రయించినట్లు తెలుసుకున్న మహిళ.. రూరల్ పోలీసులు ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. అధిక వడ్డీలు వసూలు చేసే వారి వివరాలను తమకు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. -
ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ గాలికి!
నిజాంసాగర్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల నిర్వహణను గాలికి వదిలేశారు. ఏటా వర్షాకాలం ప్రారంభానికి రెండు నెలల ముందే ప్రాజెక్టు వర ద గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ చే యించాల్సి ఉంది. మరో పక్షం రోజుల్లో వర్షాకాలం సీజన్ ప్రారంభం కానున్నా.. ఇప్పటికీ పనుల ఊసే లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లతో పాటు కల్యాణి, సింగితం రిజర్వాయర్ వరద గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనుల కోసం ప్ర భుత్వం రూ. 8 లక్షలు మంజూరు చేసింది. కానీ ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకురావ డం లేదు. రిస్క్తో కూడుకున్న పను లు కావడం, పనులు చేసినా సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. మరోవైపు సింగి తం రిజర్వాయర్ వరద గేట్లను ఎత్తే రాడ్ వంగిపోయింది. దీంతో ప్రమాదపు అంచున్న గేట్లున్నాయి. ‘సింగితం’ వరద గేట్ల రాడ్లను బాగుతో పాటు గ్రీ సింగ్, ఆయిలింగ్ పనులకు ప్రతిపాదించినా పను లు చేసేందుకు కాంట్రాక్టర్లు జంకుతున్నారు. టెండర్లకు ముందుకు రావడం లేదు నిజాంసాగర్ ప్రాజెక్టు 20 గే ట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ ప నుల కోసం మూడోసారి టెండర్లు పిలిచాం. పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. గేట్లకు గ్రీసింగ్, ఆయిలింగ్ పనులు చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సోలోమన్, నీటిపారుదలశాఖ ఈఈ, నిజాంసాగర్ గ్రీసింగ్, ఆయిలింగ్ కరువు పనులకు ముందుకు రాని కాంట్రాక్టర్లు పట్టించుకోని అధికారులు -
ఎస్సీ వర్గీకరణ రద్దయ్యే వరకు పోరాటం చేద్దాం
నిజామాబాద్నాగారం: ఎస్సీ వర్గీకరణ రద్దయ్యే వరకు న్యాయ పోరాటం చేద్దామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కేసీఆర్ కాలనీలోగల ఓ ఫంక్షన్హాల్లో శనివారం మాలమహానాడు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చెన్నయ్య హాజరై మాట్లాడారు. మనమందరం ఐక్యంగా ఉండి కోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణ రద్దు అయ్యేవరకు న్యాయ పోరాటం చేయాలన్నారు. అందుకు ప్రతి మాల సోదరుడి నైతిక సహాయం అవసరం ఉందని తెలిపారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండల బోరేగంలో బుద్ధ పూర్ణమి రోజున బుద్ధ భగవాన్ విగ్రహం పెట్టినందుకు దళితులపై అగ్రకులాల వారు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడ్డవారిపై పోలీస్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడ్ల నాగరాజు, ఎల్లయ్య, జిల్లా నూతన అధ్యక్షుడు చొక్కం దేవిదాస్, టీమ్ కన్వీనర్ అలుక కిషన్, జిల్లా ప్రధాన కార్యదర్శి నాంది వినయ్ కుమార్, కోశాధికారి రాజన్న, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ కార్డ్ స్టేటస్ ఏమిటో?
రామారెడ్డి: కొత్త రేషన్ కార్డుల కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడానికి ప్రజలు ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు.జిల్లా వ్యాప్తంగా 60వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శులకు మొబైల్ యాప్ను అందజేశారు. రెండు నెలల క్రితం దరఖాస్తులు పరిశీలించిన కార్యదర్శులు వాటిని ఉన్నతాధికారులకు పంపించారు. ఇప్పటి వరకు రేషన్ కార్డులు జారీ కావడం లేదు. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కావడం లేదు. దీంతో దరఖాస్తుదారులు తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు.. కుటుంబ సభ్యుల పేర్లు, నమోదు కార్డుల విభజన కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త కార్డులు జారీ అయ్యాయి. కుటుంబ సభ్యుల పేర్లు నమోదు అవుతున్నాయి. దరఖాస్తు ఎవరి వద్ద పెండింగ్లో ఉందో తెలుసుకునే వీలుంది. మీసేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు చాల వరకు పరిష్కారించారు. కొంత మందికి కొత్త కార్డులు వచ్చాయి. ఐదు సంవత్సరాల పిల్లల పేర్లను రేషన్ కార్డులో నమోదు చేయడానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. మళ్లీ వేచి చూడడమేనా... ప్రజా పాలనలో ఇచ్చిన దరఖాస్తుల స్టేటస్ కనిపించడం లేదు. మీ సేవా కేంద్రాల ద్వారా మళ్లీ దరఖా స్తు చేసుకుంటే నెలరోజుల్లో పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ సేవా కేంద్రాల్లో ద రఖాస్తు చేసుకుంటే దరఖాస్తులు పరిష్కారం అవుతు న్నాయి. దరఖాస్తు స్టేటస్ ఏమిటో చూసుకోవచ్చు. రేషన్ కార్డ్ రాకపోతే మీసేవా కేంద్రంలో దరఖాస్తులు చేసుకుంటే ఎక్కడ పెండింగ్ ఉందో స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే https:// epds. telangana. gov. in/ వెబ్సైట్లో రేషన్ కార్డును ఎంటర్ చేసి ఎక్కడో పెండింగ్ ఉందో తెలుసుకోవచ్చు. తహసీల్, ఎంపీడీవో ఆఫీస్ల చుట్టూ చక్కర్లు కొడుతున్న ప్రజలు జారీకాని రేషన్ కార్డులు స్టేటస్ తెలుసుకోవచ్చు మీసేవా కేంద్రాల్లో కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయి, సభ్యుల కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకున్నా పెండింగ్లో ఎక్కడుందో తెలుసుకోవచ్చు. – రమేశ్రెడ్డి, మీసేవ నిర్వాహకుడు, రామారెడ్డి -
గంజాయి తాగిన వ్యక్తి అరెస్టు
మోపాల్(నిజామాబాద్రూరల్): గంజాయి తాగిన ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. మండలకేంద్రంలో శనివారం ప్రొబేషనరీ ఎస్సై శైలేందర్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టగా, శ్రీరాంనగర్ తండాకు చెందిన భామన్ బహదూర్ సింగ్ బైక్పై వెళుతుండగా ఆపి తనిఖీ చేశారు. అతడు గంజాయి తాగినట్లు గుర్తించి, పట్టుకున్నారు. బైక్లో ఉన్న 45 గ్రాముల గంజాయిని, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు, సౌత్ రూరల్ సీఐ సురేష్కుమార్ అభినందించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత నందిపేట్(ఆర్మూర్): మండలంలోని తల్వేద గ్రామ సమీపంలోని గోదావరి నది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై చిరంజీవి శనివారం తెలిపారు. మండలంలోని చింరాజ్పల్లి గ్రామ సమీపంలో తనిఖీలు చేపడుతుండగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు కనిపించడంతో వాటిని పట్టుకుని పో లీస్స్టేషన్కు తరలించామన్నారు. ఇసుక ట్రాక్టర్ల డైవర్లపై కేసు నమెదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నాడు. నకిలీ డాక్టర్పై కేసు నమోదు ఖలీల్వాడి: నగరంలోని బోధన్ రోడ్డులో ఫస్ట్ఎయిడ్ సెంటర్ నడిపిస్తున్న నకిలీ డాక్టర్పై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్హెచ్వో రఘుపతి శనివారం తెలిపారు. మేకల రాకేష్ అనే వ్యక్తి విజిలెన్స్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయగా, అధికారులు ఇటీవల ఆస్పత్రిలో తనిఖీ చేశారు. ఆస్పత్రి నిర్వాహకుడు ఎలాంటి డాక్టర్ పట్టా లేకుండా రోగులకు వైద్యం అందిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. -
ఆటలతో సమ్మర్ సందడి
రామారెడ్డి : విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికి తీసేందుకు క్రీడా ప్రాఽథికార సంస్థ, జిల్లా యువజ న క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6 నుంచి వేసవి క్రీడా శిబిరాలను జిల్లా వ్యాప్తంగా ప్రారంభించింది. వాటి పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 14 ఏళ్లలోపు బాల బాలికలు ఉదయం, సాయంత్రం వేళలో శిక్షకుల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈశిబిరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10 వేసవి సమ్మర్ క్యాంప్లను నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాల్లో కబడ్డీ, అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, కోకో, టెన్నిస్ తదితర క్రీడలకు సంబంధించి శిక్షకులు ఉద యం సాయంత్రం పూట శిక్షణనిస్తున్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, శారీరక ధృడత్వం పెంచుకోవడానికి ఈశిబిరాలు దోహదపడుతున్నాయి. క్రీడాశిబిరాలతో నైపుణ్యం పెరుగుదల జిల్లా వ్యాప్తంగా 10 సమ్మర్ క్యాంప్ల ఏర్పాటు మెలకువలు నేర్పిస్తున్నాం రామారెడ్డిలో ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ క్రీడల్లో బాలబాలికలకు క్రీడల్లో మెలకువలు నేర్పిస్తున్నాం. భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరగడానికి దోహదపడుతుంది. –బాల్రాజు, సమ్మర్ క్యాంప్ శిక్షకుడు, రామారెడ్డి -
కొనసాగుతున్న యోగా శిక్షణ తరగతులు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్లో భాగంగా శనివారం యోగా శిక్షణ తరగతులు నిర్వహించినట్లు మండల కోర్సు ఇన్చార్జి వహీద్సిద్దిఖీ తెలిపారు. ఈ సందర్భంగా యోగా శిక్షణలో భాగంగా సూర్యనమస్కారం, ధనురాసనం, శీర్షాసనం, చేతు బందహాసనం, ప్రాణయామం, ధ్యానం చేయించినట్లు తెలిపారు. యోగా శిక్షణలో ఆరో తరగతి నుంచి 9వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో యోగా నిపుణులు నర్సింలు, ఉపాధ్యాయులు ప్రభాకర్, రాజులు, యూసుఫ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలబారిన పడొద్దు సదాశివ నగర్(ఎల్లారెడ్డి): సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రంజిత్ సూచించారు. శనివారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ జరుగుతున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమానికి హాజరై అవగాహన కల్పించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహారించిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, ఎంఈవో యోసేఫ్ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా శ్రీకాంత్ రాజంపేట: రాజంపేట మండల మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడిగా దుబ్బని శ్రీకాంత్ నియామకమయ్యారు. జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీను నియామక పత్రాన్ని దుబ్బని శ్రీకాంత్ కు అందజేశారు.కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టిగాడిఅంజయ్య, బచ్చగారి నర్సింలు, తుల బసవయ్య, నాయిని శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
అల్ప్రాజోలం పట్టివేత
బోధన్టౌన్(బోధన్): బోధన్ మండలంలోని బెల్లాల్ గ్రామంలో 264 గ్రాముల అల్ప్రాజోలం పట్టుకున్నట్లు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ స్వప్న శనివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బె ల్లాల్ గ్రామంలోని ము స్తాబాద్ వీరగౌడ్ ఇంట్లో సోదాలు నిర్వహించగా అల్ప్రాజోలం లభించిందని, వెంటనే వీరగౌడ్ను అదుపులోకి తీసుకొని, సరుకును స్వాధీనం చేసుకున్నామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం బోధన్ ఎకై ్సజ్ కార్యాలయానికి అప్పగించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ భాస్కర్రావ్ తెలిపారు. ఈ సోదాల్లో సబ్ ఇన్స్పెక్టర్ నరసింహ చారీ, రామ్కుమార్, సిబ్బంది రామ్ బచ్చన్, గంగారాం, సాయికుమార్లు ఉన్నారు. ఒకరిపై కేసు నమోదు లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామానికి చెందిన లెగ్గల రాజు అనే యువకుడిపై శుక్రవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. సదరు యువకుడు ముస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేసినట్లు తెలిపారు. దీంతో వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేయగా, పలు సెక్షన్ల కింత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
బ్యాంకు కేసులు రాజీ కుదర్చాలి
కామారెడ్డి టౌన్: జూన్ 14వ తేదీన జిల్లా కోర్టులో జరిగే జాతీయ లోక్ అదాలత్లో సమన్యాయంతో బ్యాంక్ కేసులు రాజీ కుదర్చాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి. నాగరాణి బ్యాంక్, చిట్ఫండ్ మేనేజర్లకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో బ్యాంక్, చిట్ఫండ్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకు కేసులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ప్రిలిటిగేషన్ కేసులుగా కూడా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. బ్యాంకు అధికారులు, చిట్ ఫండ్ కంపెనీలు వీలైనన్ని కేసుల పరిష్కారానికి సహకరించాలని కోరారు. కక్షి దారులు జూన్ 14 న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చంద్రసేన్రెడ్డి, మేనేజర్లు పాల్గొన్నారు. లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి జిల్లా న్యాయమూర్తి నాగరాణి -
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
బోధన్టౌన్(బోధన్): రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ప్రతిఒక్కరూ కృషి చేయాలని, వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలని ట్రాన్స్పోర్ట్ జిల్లా అఽధికారి ఉమామహేశ్వర్రావ్ అన్నారు. పట్టణంలోని ఇందూర్ హైస్కూల్లో శనివారం ట్రస్మా ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ శాఖలు సంయుక్తంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మాక్ డ్రిల్ చేసి చూపించారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను వివరించారు. అనంతరం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల కరపత్రాలను ఆవిష్కరించారు. ఎంవీఐ శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ చందర్ రాథోడ్, అగ్నిమాపక శాఖ అధికారి సుభాష్, ఎంఈవో నాగయ్య, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడాలి కిశోర్కుమార్, పట్టణ అధ్యక్షుడు హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భూభారతి దరఖాస్తులపై సమీక్ష
లింగంపేట: భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, క్షేత్ర స్థాయిలో విచారణ ఎంతవరకు వచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం సాయంత్రం ఆయన లింగంపేట తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు, విచారణ, పాజిటివ్, నెగెటివ్ ఉత్తర్వుల తయారీ విషయమై అన్ని క్షేత్ర స్థాయి టీమ్ల ప్రోగ్రెస్ గురించి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్ ఆయనకు వివరాలు తెలిపారు. దరఖాస్తుల విచారణ, ఉత్తర్వుల తయారీని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. -
ఈసారైనా స్పందించేనా?
ఎల్ఆర్ఎస్–2020 స్కీం కింద ప్రభుత్వం 25 శాతం రాయితీ ఇచ్చినా దరఖాస్తుదారులు స్పందించడం లేదు. ఇప్పటికే మూడుసార్లు గడువు ఇచ్చినా 30 శాతం కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించలేదు. దీంతో అక్రమ లేఅవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించడంతోపాటు నిబంధనల్లోనూ మార్పులు చేసింది. గిఫ్ట్, వారసత్వ డీడ్ల ద్వారా జరిగే లావాదేవీలను కూడా పరిశీలనలోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. కామారెడ్డి టౌన్ : అనధికార ప్లాట్లు, అక్రమ వెంచర్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్–2020 పేరిట దాదాపు ఐదేళ్ల క్రితం దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఆ ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయింది. ప్రభుత్వం ఇటీవల దానిని పట్టాలెక్కిస్తూ 25 శాతం రాయితీతో ఫిబ్రవరిలో వన్టైం సెటిల్మెంట్ పథకాన్ని ప్రకటించింది. దీనికి మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే దరఖాస్తుదారుల నుంచి స్పందన రాకపోవడంతో ఏప్రిల్ 30 వరకు గడువును పొడిగించింది. ఆ తర్వాత ఈనెల 3వ తేదీ వరకు అవకాశమిచ్చింది. ఎల్ఆర్ఎస్ వేగవంతం కోసం జోరుగా ప్రచారం చేస్తున్నా, కలెక్టరేట్, బల్దియా కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినా అంతగా స్పందన రాలేదు. దీంతో ఇటీవల నాలుగోసారి ఎల్ఆర్ఎస్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వరకు అవకాశం ఇచ్చింది. ఫీజు చెల్లించింది 5,166 మందే.. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 20,500 వచ్చాయి. అయితే ఎల్ఆర్ఎస్కు 5,166 మంది దరఖాస్తుదారులు మాత్రమే ఫీజు చెల్లించారు. అంటే 30 శాతం కూడా దరఖాస్తుదారులు స్పందించలేరు. ఇందులో 1,755 మంది దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. దరఖాస్తుదారుల ప్లాట్లను క్రమబద్ధీకరిస్తూ ప్రొసిడింగ్ పత్రాలను అందజేశారు. ఈనెల 3వ తేదీవరకు మూడు మున్సిపాలిటీలకు రూ. 12.16 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. నాలుగోసారి గడువు పెంచడంతో మరికొంతమంది స్పందించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. కాగా బల్దియాలలో టౌన్ ప్లానింగ్ విభాగంలో అధికారులు, సిబ్బంది పోస్టుల ఖాళీలతో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలనకు సాధ్యం కావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. కామారెడ్డి బల్దియాలో రెండు టీపీవో పోస్టులకు ఒకరు మాత్రమే ఉన్నారు. అలాగే నాలుగు టీపీఎస్ పోస్టులుండగా ఒక్కరు, నాలుగు టీపీబీఎస్ పోస్టులకు ఒక్కరు మాత్రమే ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో దరఖాస్తులను పరిష్కరించడంలో ఆలస్యం అవుతుండడంతో దరఖాస్తుదారులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం, మున్సిపల్ శాఖ ఎల్ఆర్ఎస్ పథకం గడువు ను ఈనెలాఖరు వరకు పొడగిస్తూ జీవో జారీ చేసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారు లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అక్రమ లేఅవుట్ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలి. లేకపోతే గడువు ముగిసిన తర్వా త భవన నిర్మాణ అనుమతులకు ఇబ్బందులు పడా ల్సి ఉంటుంది. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డిమూడు విడతల్లో వచ్చిన ఎల్ఆర్ఎస్ ఫీజు వివరాలు..వారసత్వానికి సెల్ డీడ్ లేకున్నా..దరఖాస్తుదారుల ప్రధాన సమస్యకు మున్సిప ల్ శాఖ తాజాగా పరిష్కారం చూపింది. గతంలో ఎల్ఆర్ఎస్కు తప్పనిసరిగా సెల్డీడ్ను జ తపరిస్తేనే సంబంధిత ప్లాటు లేదా లే అవుట్ క్ర మబద్ధీకరణకు అవకాశం ఉండేది. ఇప్పుడు ని బంధనల్లో సవరణలు చేశారు. రిజిస్టర్డ్ గిఫ్ట్ డీ డ్, ఎక్స్ఛేంజ్ డీడ్ లేదా వారసత్వ హక్కుతో స్థ లాన్ని పొందిన వారు కూడా ఇప్పుడు క్రమబద్ధీ కరణకు అర్హులని సర్కారు పేర్కొంది. ఈ నేపథ్యంలో నాలుగో విడత గడువులో దరఖాస్తుదారులు ఏ మేరకు స్పందిస్తారో చూడాలి. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుపై అనాసక్తి మూడు విడతల్లో స్పందించింది 30 శాతం దరఖాస్తుదారులే.. నాలుగోసారి గడువు పొడిగించిన సర్కారు క్రమబద్ధీకరణ నిబంధనల్లో మార్పులు గిఫ్ట్, వారసత్వ డీడ్ల ద్వారా రెగ్యులరైజేషన్కు అనుమతి -
లోక్ అదాలత్లో ఎక్కువ కేసులను పరిష్కరించాలి
కామారెడ్డి టౌన్ : వచ్చేనెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించడానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా కోర్టులో పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి పోలీస్ శాఖ మరింతగా కృషి చేయాలని సూచించారు. కక్షిదారులు జాతీయ లాక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని రాజీయే రాజమార్గంగా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, ఎస్పీ రాజేశ్ చంద్ర, పీపీలు రాజ్గోపాల్ గౌడ్, సూర్యప్రసాద్, అశోక్, నిమ్మ దామోదర్రెడ్డి, సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీగా మెలగాలి కామారెడ్డి క్రైం: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల తో ఫ్రెండ్లీగా మెలగాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. శనివారం ఆమె కామారెడ్డి ప ట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. రికార్డులను, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ డ యల్ 100 కు వచ్చే ఫోన్ కాల్స్కు వెంటనే స్పందించాలన్నారు. ప్రజల సమస్యల పరి ష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలన్నా రు. కేసులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. ‘వాహనాలను తీసుకెళ్లకుంటే వేలం వేస్తాం’ కామారెడ్డి క్రైం : కేసుల్లో పట్టుబడిన, వివిధ ప్రాంతాల్లో లభించిన వాహనాలను వాటి యజమానులు తీసుకువెళ్లాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ఆరు నెలల్లోగా తీసుకువెళ్లని పక్షంలో వేలం వేస్తామని పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో 211 బైక్లు, 3 ఆటోలు, 3 కార్లు ఉన్నాయని, వాటి వివరాలు జిల్లా పోలీసు శాఖ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. వాహనాల యజమానులు ధ్రువీకరణ పత్రాలతో కార్యాలయానికి వచ్చి పోలీసు మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి నవీన్ కుమార్ను సంప్రదించాలని సూచించారు. బడిబాటను వాయిదా వేయాలి కామారెడ్డి టౌన్: బడిబాట కార్యక్రమాన్ని వచ్చేనెల 6వ తేదీన ప్రారంభించకుండా 9వ తేదీకి వాయిదా వేయాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, ప్రధాన కార్యదర్శి కాంబ్లె గోపాల్ ప్రభుత్వాన్ని కోరారు. జూన్ 7 తేదీన బక్రీద్ను దృష్టిలో ఉంచుకొని బడిబాటను వేయాలని విజ్ఞప్తి చేశారు. భిక్కనూరు సొసైటీ కార్యదర్శిపై వేటు భిక్కనూరు : ధాన్యం తూకం వేయనందున మనస్తాపంతో ఇద్దరు రైతులు తమ వడ్లకు నిప్పు పెట్టడానికి యత్నించిన విషయంలో సహకార శాఖ అధికారులు పలువురిపై చర్యలు తీసుకున్నారు. భిక్కనూరు సింగిల్విండో కార్యదర్శి నర్సింలును సస్పెండ్ చేస్తూ డీసీవో రామ్మోహన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రం పర్యవేక్షణలో విఫలమైనందున ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రం నిర్వాహకుడు గంగారాంను విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రానికి సంబంధించిన రికార్డులను సరిగా నిర్వహించకపోవడం, వడ్లు తీసుకవచ్చిన రైతులు వివరాలను సీరియల్ రిజిస్టర్లో రాయకపోవడం, టోకెన్లను ఇవ్వకపోవడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. కేంద్రాన్ని పర్యవేక్షించడంలో విఫలమైనందున కొనుగోలు కేంద్రం సూపర్వైజర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమేశ్కు సంజాయిషీ నోటీసు ఇచ్చారు. -
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
మాచారెడ్డి/బిచ్కుంద : జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం గాలివాన బీభత్సాన్ని సృష్టించాయి. మాచారెడ్డి మండల కేంద్రంతో పాటు లక్ష్మీరావులపల్లి, చుక్కాపూర్, వాడి, పాల్వంచ, బిచ్కుంద తదితర గ్రామాల్లో వర్షం కురిసింది. వర్షంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల వద్ద వడ్లు తడిసిపోయాయి. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. వర్షంలో నానకుండా ఉండేందుకు టార్పాలిన్లు కప్పినా గాలి వేగానికి అవి కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసిపోయింది. మామిడి కాయలురాలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. విద్యుత్ అధికారులు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. రోడ్డు వెంట చెట్లు విరిగిపడడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఇబ్బందిపడ్డారు. -
ఇందూర్లో భావ్సర్లు
బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించాలని భారత ప్రజలు ముఖ్యంగా భావ్సర్ క్షత్రియులు బలంగా కోరుకుంటున్నారు. బలూచ్ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలుగుతుందని ఆశించడమే అందుకు ప్రధాన కారణం. విభజన సమయంలో బలూచ్ ప్రాంతాన్ని వీడి వచ్చిన భావ్సర్ క్షత్రియ సమాజ్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇందూరులో వేయి కుటుంబాలకు పైగా ఉండగా, వారు తమ ఆరాధ్య దైవం హింగులా మాత ఆలయాన్ని నిర్మించి ప్రత్యేకంగా కొలుస్తున్నారు. ● నగరంలో హింగులామాతకు ఆలయం ● భావసార్ క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో 1982లో నిర్మాణం ● దేశ విభజన సమయంలో ఇక్కడికి రాక ●● ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో హింగులా శక్తిపీఠంపై ఆసక్తిసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీ ర్ కన్నా ఎక్కువగా ఆ దేశానికి నైరుతిభాగంలో ఉన్న బలూచిస్తాన్ అంశంపైనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా కొనసాగేందుకు బలూచిస్తాన్ తగిన ఏర్పాట్లు చేసుకుంటుండగా, భారతదేశంలోని ప్రతిఒక్క రూ ప్రత్యేక బలూచిస్తాన్ దేశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే భారతదేశ విభజన సమయంలో బలూచిస్తాన్ ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చిన భావ్సర్ క్షత్రియ సమాజ్ వారు మాత్రం మరింత ఆసక్తిగా, బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా అవతరించాలని బలంగా కో రుకుంటున్నారు. తమ మూలస్థానమైన బలూచ్లో కొలువై ఉన్న హింగులా మాతను మొ క్కుకుంటున్నారు. అఖండ భారత్లో భాగమైన బలూచ్ ప్రాంతంలోని అమ్మవారి శక్తిపీఠాన్ని స్వేచ్ఛగా సందర్శించే అవకాశం కలగాలని కోరుకుంటున్నారు. అమ్మవారి 52 శక్తి స్వరూపాల్లో ఒకటైన హింగులాదేవి ప్రధాన ఆలయం పాకిస్తాన్లోని బలూచిస్తాన్లోని హింగోల్ నేషనల్ పార్క్లో ఉంది. కరాచీకి 90 కిలోమీటర్ల దూరంలో హింగుల పర్వతంపై హింగోసీ నదీతీరం ఈ శక్తిపీఠానికి మూలస్థానం. హింగులా మాత అసలు పే రు కోటరి. హింగుల పర్వతంపై ఉండడంతో హింగులాదేవిగా ప్రసిద్ధి పొందింది. ఈ పర్వ తంపై గుహలో హింగులామాత నిత్యం జ్వలి స్తూ దర్శనమిస్తోంది. ప్రకృతి నిర్మిత గుహ ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన అష్టదిగ్గజాల్లో ఒకరైన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రలో హింగులాదేవి ప్రస్తావన ఉంది. ఇంతటి ప్రాచీన చరిత్ర కలిగిన శక్తిస్వరూపిణి ఆలయాన్ని ఇందూరు నగరంలో భావ్సర్ క్షత్రియ సమాజ్ (రంగరి) (వస్త్రాలకు రంగులు వేసే) ఆధ్వర్యంలో 1982లో నిర్మించారు. ఇందూరులోని హింగుళాంబిక మాత ఆలయందేశవిభజన సమయంలో ఇక్కడికి..దేశవిభజన సమయంలో రంగరి (భావ్సర్ క్షత్రియ సమాజ్) కులస్తులు బలూచిస్తాన్ ప్రాంతం నుంచి రాజస్తాన్కు వలస వచ్చారు. ఆ తరువాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం నిజా మాబాద్ జిల్లాలో ఈ సమాజ్కు చెందిన వేయికి పైగా కుటుంబాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం క్షత్రియులుగా ఉన్న వీరిని అంతమొందించేందుకు పరశురాముడు వెంటాడితే వీరి వంశీయులు దేవీమాత శరణు కోరగా హింగులాదేవి కాపా డి వస్త్రాలకు రంగులు అద్దే కళను కటాక్షించింది. అప్పటి నుంచి ఈ వృత్తిని చేస్తున్నట్లు ఈ సమాజ్ పెద్దలు తెలిపారు. -
తగాదాలకు దూరంగా ఉండడం అభినందనీయం
భిక్కనూరు : తగాదాలు, పోలీసు కేసులు లేకుండా జీవించడం అభినందనీయమని జిల్లా న్యాయసేవా ధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి టి.నాగరాణి పేర్కొన్నారు. శనివారం ఆమె ర్యాగట్లపల్లి గ్రామా న్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. 15 ఏ ళ్లుగా గ్రామంలో ఒక్క పోలీస్ కేసు లేకుండా ఉండడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రతిదానికి ఘర్షణలు పడుతూ పోలీస్ కేసులు పెట్టుకుంటున్న ఈ కాలంలో ఒక్క పోలీస్ కేసు లేకుండా ప్రజలు కలసిమెలసి ఉండడం అభినందనీయమన్నారు. మూడేళ్ల క్రితం ర్యాగట్లపల్లి గ్రామం ఒక్క కేసు లేని గ్రామంగా ఎంపికైందన్నారు. అలాగే ఈ గ్రామం ఇప్పటివరకు అ లానే ఉందన్నారు. ఒక్క కేసు నమోదు కాకుండా ఉ న్న విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులకు నివేదించేందుకోసం గ్రామాన్ని సందర్శించడానికి వచ్చానన్నారు. యువత పాశ్చాత్య సంస్కృతి మోజులో ప డి వ్యసనాలకు బానిసగా మారుతోందని, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి తమ పిల్లలను వా టికి దూరంగా ఉంచాలని సూచించారు. గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో ఏవైనా సమస్యలు ఎదురైతే ఎలా పరిష్కరించుకుంటారని ప్రశ్నించగా.. రాజీ మార్గాన్ని ఎంచుకుంటామని వారు స మాధానమిచ్చారు. తమ పెద్దలు చూపిన మార్గంలో పయనిస్తామని యువకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చట్టాలపై ప్రజలకు అ వగాహన కల్పించారు. కార్యక్రమంలో నేతలు నరేందర్రెడ్డి, ప్రతాపరెడ్డి, సిద్దరామురెడ్డి, కోర్టు సూపరింటెండెంట్ చంద్రసేన్రెడ్డి పాల్గొన్నారు. 15 ఏళ్లుగా కేసుల్లేని గ్రామంగా ర్యాగట్లపల్లి నిలిచింది జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి -
పిడుగుపాటుతో గొర్రెల కాపరి మృతి
మాచారెడ్డి : వాడి శివారులో శ నివారం పిడుగుపాటుకు ఒక రు మరణించారు. వివరాలి లా ఉన్నాయి. ఫరీదుపేటకు చెందిన మదిర సురేశ్ (23) మదిర మహిపాల్ గొర్రెల మందను మేతకు తీ సుకువెళ్లారు. వాడి శివారులో మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలుకావడంతో చెట్టుకిందకు చేరారు. ఆ స మయంలో పిడుగు పడడంతో సురేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. స్పృహ కోల్పోయిన మహిపాల్ను స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని గ్రామస్తులు తెలిపారు. సురేశ్ స్వగ్రామం భిక్కనూరు మండలం మోటాటిపల్లి. నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుని ఫరీదుపేట గ్రామానికి ఇళ్లరికం వచ్చాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్నామని మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే హత్య
ఎల్లారెడ్డి: వివాహేతర సంబంధానికి సహజీవనం చేస్తున్న భాగస్వామి అడ్డు ఉన్నాడని ప్రియుడితో కలిసి మహిళ హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎల్లారెడ్డి మండలంలో చోటుచేసుకున్న ఘటన వివరాలను శుక్రవారం సీఐ రవీందర్ నాయక్ వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలంలోని లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన పౌలవ్వ భర్త కొన్నేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆమె ఒంటరిగా జీవిస్తుండగా ఎల్లారెడ్డిలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ అహ్మద్ (47)తో పరిచయం ఏర్పడింది. దీంతో అహ్మద్ తన భార్య, పిల్లలను వదిలేసి పౌలవ్వతో సహజీవనం చేశాడు. కొద్ది నెలల క్రితం పౌలవ్వకు సాతెల్లి గ్రామానికి చెందిన కుర్మ సాయిలుతో పరిచయం ఏర్పడింది. సాయిలుతో చనువుగా ఉంటున్న పౌలవ్వకు షేక్ అహ్మద్ అడ్డుగా వస్తున్నాడని భావించి అతడి అడ్డును తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో జనవరి 24న అహ్మద్ను ప్రియుడు సాయిలుతో కలిసి ఎల్లారెడ్డి శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లింది. అనంతరం అతిగా మద్యం తాగిన షేక్ అహ్మద్ను పౌలవ్వ, ప్రియుడు సాయిలు కలిసి గొంతు నులిమి, మర్మాంగాలపై దాడి చేయడంతో మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇదిలా ఉండగా అహ్మద్ కనబడటం లేదని అదే నెల 28న పౌలవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టగా పౌలవ్వ కాల్ డేటా ఆధారంగా కేసును చేధించారు. అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా ఉన్న మృతుడి కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సై మహేష్, పీసీలు ఇద్రిస్, సిద్దు, అనిల్, హోంగార్డు ప్రసాద్లను ఎస్పీ అభినందించారని, వీరికి రివార్డు ఇవ్వనున్నట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు, వెండి కడియం, టీవీఎస్ ఎక్సెల్ వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ వెల్లడించారు. ప్రియుడితో కలసి సహజీవన భాగస్వామిని హతమార్చిన మహిళ లింగారెడ్డిపేట వ్యక్తి మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు వివరాలను వెల్లడించిన ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ -
‘డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’
కామారెడ్డి క్రైం: డయల్ 100కు వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఎస్పీ రాజేశ్ చంద్ర పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. డయల్ 100 సేవలు, విధుల నిర్వహణపై జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో బ్లూకోల్ట్స్, పెట్రోకార్స్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమన్నారు. డయల్ 100 కు ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందించి వీలైనంత త్వరగా ఘటనా స్థలానికి చేరుకుంటే నేరం తీవ్రతను తగ్గించవచ్చన్నారు. కాబట్టి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్య పెద్దదైతే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉండే ప్రదేశాలలో విజిబుల్ పోలీసింగ్ ఉండాలన్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులను ప్రతిరోజు తనిఖీ చేయాలన్నారు. సిబ్బందికి ఉద్యోగపరంగాలేవైనా సమస్యలుంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో బిచ్కుంద సీఐ నరేశ్, డయల్ 100, పెట్రో కార్స్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
హమాలీలతో గొడవ.. వడ్లకు నిప్పుపెట్టిన రైతులు
భిక్కనూరు: వరిధాన్యం కాంటా విషయంలో హమాలీలతో గొడవపడ్డ ఇద్దరు రైతులు తమ వడ్ల కుప్పకు నిప్పుపెట్టేందుకు యత్నించారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఇద్దరు రైతులు వడ్లను భిక్కనూరు పాత జాతీయ రహదారిపై ఆరబోశారు. వాటిని తూకం వేయాలని సింగిల్విండో సిబ్బందిని కోరారు. సీరియల్గా తూకం వేస్తామని సిబ్బంది చెప్పడంతో సరేనని అక్కడే ఉన్నారు. మధ్యాహ్న సమయంలో హమాలీలు భోజనం చేసేందుకు వెళ్లారు. చాలాసేపటి వరకు రాకపోవడంతో వారికోసం వెతకగా.. మార్కెట్ యార్డులో మక్కలను కాంటా చేస్తూ కనిపించారు. దీంతో రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీలు అడిగిన డబ్బులు ఇవ్వనందున ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హమాలీల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తమ ధాన్యం కుప్పల వద్దకు వచ్చి నిప్పపెట్టేందుకు యత్నించారు. అక్కడే ఉన్న మిగతా రైతులు వారిని వారించారు. విషయం తెలుసుకున్న సింగిల్విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి కాంటాలు వేయించారు. అనంతరం డీసీవో రామ్మోహన్ తహసీల్దార్ శివప్రసాద్తో కలిసి భిక్కనూరుకు వచ్చి సదరు రైతులను కలిసి వివరాలు సేకరించారు. అడ్డుకున్న తోటి రైతులు తూకం వేయించిన అధికారులు -
25 ఏళ్లుగా అంబలికేంద్రం నిర్వహణ
ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలో 25 ఏళ్లుగా అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తు కుడుముల సత్యనారాయణ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీరుస్తున్నాడు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ 2001లో కుడుముల సత్యనారాయణ ట్రస్టును ఏర్పాటు చేశారు. ఈట్రస్టు ద్వారా ప్రతిఏడాది వేసవి కాలంలో పట్టణంలోని గాంధీచౌక్లో అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంబలి కేంద్రంలో తైదల పిండితో తయారు చేసిన అంబలిని అందరికి అందిస్తున్నారు. రోజుకు 20 కిలోల పిండితో తయారు చేసిన అంబలిని 800 మంది నుంచి వెయ్యి మందికి అందిస్తున్నారు. అంబలి కేంద్రంతో పాటు కరోనా సమయంలో సైతం కషాయాన్ని అందరికి అందించి ఆపదలో అండగా నిలిచారు. అంబలి తాగడంతో వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండడంతో పాటు శరీరంలోని ఉష్ణోగ్రత పెరగకుండా కాపాడుతుంది. దీంతో చాలా మంది అంబలి తాగేందుకు ఆసక్తి కనబరుస్తారు. ప్రజలకు అంబలిని అందిస్తు సత్యనారాయణ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. దాహార్తి తీరుస్తున్న కుడుముల సత్యనారాయణ కరోనా సమయంలోను కషాయం అందజేత -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ
దోమకొండ/తాడ్వాయి/పిట్లం/ఎల్లారెడ్డి/లింగంపేట : దోమకొండలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ముగ్గుపోసి భూమిపూజ చేశారు. 12 ఇళ్లకు ముగ్గుపోయగా, మిగతా లబ్ధిదారులు త్వరలో పనులు మొదలుపెట్టాలని వారు సూచించారు. తాడ్వాయిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అధికారులు మార్కింగ్ చేశారు. ఈసందర్భంగా ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ మాట్లాడుతూ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికి ఇళ్లు మంజూరు చేస్తుందన్నారు. పిట్లం మండలం కంభాపూర్, చిల్లర్గి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల పరిషత్ అధికారి కమలాకర్ భూమి పూజ చేశారు. ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్ పనులను ఎంపీవో ప్రకాష్ పరిశీలించారు. గ్రామంలో మంజూరైన లబ్ధిదారులకు సంబంధించిన ఇళ్లకు ఎంపీవో భూమిపూజ చేసి మార్కింగ్ వేశారు. లింగంపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎంపీడీవో నరేష్ మార్కింగ్ ఇచ్చారు. అర్హులపైన పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈకార్యక్రమంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
అల్ప్రాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్ అరెస్టు
బోధన్రూరల్: సాలూర మండల కేంద్రంలో ప్రత్యేక నిఘాతో దాడి నిర్వహించి అల్ప్రాజోలం స్మగ్లింగ్ గ్యాంగ్ను పట్టుకుని రూ.25లక్షల విలువల గల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ సీపీ సాయి చైతన్య అన్నారు. బోధన్ సర్కిల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. సాలూరలో అల్ప్రాజోలం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం రావడంతో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్, ఎస్సై మచ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మహారాష్ట్రకు చెందిన అమర్సింగ్ దేశ్ముఖ్ (ఏ1), బాబురావు కడేరీ (ఏ2), షబ్బీర్ అలీ పాషామీయా చౌదరి (ఏ3), పరమేశ్వర్ బర్ధాడే (ఏ4), నిజామాబాద్ జిల్లాకు చెందిన మల్లెపూల లక్ష్మణ్గౌడ్ (ఏ5) గురువారం అర్ధరాత్రి కారులో రూ.25లక్షల విలువల 2.5కిలోల అల్ప్రాజోలంను రవాణా చేస్తుండగా పట్టుకున్నామన్నారు. నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి కారు, 8ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నిందితుడు విశ్వనాథ్ శిపంకర్ (ఏ6) పరారైనట్లు తెలిపారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్, ఎస్సై మచ్చేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రూ.25లక్షల విలువగల 2.5 కిలోల సరుకు పట్టివేత వివరాలు వెల్లడించిన నిజామాబాద్ సీపీ సాయి చైతన్య -
పెన్షనర్ల న్యాయపరమైన సమస్యలు పరిష్కరిస్తా
నిజామాబాద్నాగారం: పెన్షనర్లకు న్యాయపరమైన సమస్యలుంటే పరిష్కరించడానికి కృషి చేస్తానని జిల్లా న్యాయసేవ సమితి కార్యదర్శి, జిల్లా సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్భాస్కర్ తెలిపారు. నగరంలోని న్యాయసేవాధికారి సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఆయనను తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి పలు సమస్యలపై చర్చించారు. పెన్షనర్స్–సీనియర్ సిటిజెన్స్ భవనాన్ని కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్గా గుర్తించినట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్రావు తెలిపారు. కుటుంబ తగాదాలు, నిర్లక్ష్యానికి గురవుతున్న తల్లిదండ్రులు, వృద్ధులు వారి సమస్యలు, భార్యాభర్తల వివాదాలు, సివిల్ తగాదాలు ఇవన్నీ కూడా ఈ మీడియేషన్ కేంద్రంలో చర్చించి పరిష్కార మార్గాన్ని చూపిస్తారని, ఇది జిల్లా న్యాయసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈవీఎల్ నారాయణ, లావు వీరయ్య, జీవన్ రావు తదితరులు ఉన్నారు. తహసీల్దార్ల బదిలీ నిజామాబాద్అర్బన్: జిల్లాలో పలువురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ ఎన్నికల్లో పలువురు తహసీల్దార్లను బదిలీ చేయగా, ప్రస్తుతం వారిని సొంత జిల్లాలకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాకు వచ్చే తహసీల్దార్లు శ్రీనివాస్, సతీష్రెడ్డి, ముజీబుద్దీన్, ప్రసాద్, వీర్సింగ్, ఇతర జిల్లాలకు వెళ్లే వారు మాలతి, మల్లయ్య, హిమబిందు, జానకి, పెద్దరాజు, నాగార్జున, ప్రభాకర్, గజానన్, రహిమోద్దీన్, సునీత, ఆంజనేయులు ఉన్నారు. ప్రశాంతంగా ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ సెమిస్టర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 7189 మంది విద్యార్థులకు గానూ 6709 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 829 మంది విద్యార్థులకు గానూ 724 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి, కంట్రోలర్ సంపత్ కుమార్, ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తనిఖీ చేశారు. -
‘వేగంగా కాంటాలు వేయడం అభినందనీయం’
భిక్కనూరు: రైతులకు ఇబ్బందులు కలుగకుండా వేగవంతంగా వరిధాన్యం కాంటా లు చేయడం అభినందనీయమని జిల్లా స హకార అధికారి రామ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పెద్దమల్లారెడ్డిలో సింగిల్ విండో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగో లు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 రోజుల్లో 40 వే ల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైసుమిల్లులకు పంపించామన్నారు. విండో చైర్మ న్ రాజాగౌడ్ను అభినందించారు. కొనుగోళ్ల టార్గెట్ను పూర్తిచేసినందున పెద్దమల్లారెడ్డి సింగిల్విండో కొనుగోలు కేంద్రాన్ని మూసి వేశామన్నారు. ఇదే స్ఫూర్తితో మిగతా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కూడా వేగవంతంగా కొనుగోళ్లను పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట ధాన్యం కొనుగోలు కేంద్రాల జిల్లా మానిటరింగ్ అధికారి నగేష్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, విండో చైర్మన్ రాజాగౌడ్, సీఈవో మోహన్గౌడ్ ఉన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలి మాచారెడ్డి: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని విద్యా శాఖ జాయింట్ డై రెక్టర్ ఉషారాణి సూచించారు. శుక్రవారం ఆ మె పాల్వంచలో నిర్వహించిన బడి బాట, వి ద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్ర భుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళే ఇద్ద రు విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. అనంతరం పదో తరగతిలో అత్యధిక మా ర్కులు సాధించిన విద్యార్థులతో పాటు ప్ర ధానోపాధ్యాయుడు గోవర్ధన్రెడ్డిని అభినందించారు. దేవునిపల్లిలో.. కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ ప రిధిలోని దేవునిపల్లి జెడ్పీ హైస్కూల్లో ని ర్వహిస్తున్న సమ్మర్ క్యాంపు ముగింపు సమా వేశానికి ఉషారాణి హాజరయ్యారు. విద్యార్థు ల నృత్య ప్రదర్శనను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్, ఉపాధ్యాయులు లావణ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ క్యూఆర్ కోడ్ కీచైన్ల పంపిణీ కామారెడ్డి టౌన్: ఆర్టీసీ రిజినల్ మేనేజర్ జ్యోత్స్న శుక్రవారం కామారెడ్డి డిపోను సందర్శించారు. డిపో పరిధిలోని సిబ్బందికి, పోలీసులకు సంస్థ క్యూఆర్ కోడ్ కీచైన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే బస్సుల సమయ సమాచారం, బస్సు ఎక్కడ ఉందన్న వివరాలు తెలుస్తాయన్నారు. 10 రకాల యాప్లతో కూడిన సేవలు ఇందులో అందుబాటులో ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ కరుణశ్రీ, అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభం కామారెడ్డి రూరల్: పాతరాజంపేటలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం చేపట్టినవారికి దశలవారీగా బిల్లులు మంజూరవుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, హౌసింగ్ ఏఈ అశోక్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ కన్వీనర్లు రాజేందర్, నర్సింహారెడ్డి మాజీ సర్పంచ్ బత్తుల చందన రవి, నాయకులు లక్ష్మణ్, లక్ష్మణ్, భాస్కర్, యూసుఫ్, రాజయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు. -
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి కామారెడ్డి క్రైం: రైతులు పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధాన్యం సేకరణపై సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా లోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించా రు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం రాజేందర్, డీఎస్వో మల్లికార్జునబాబు, జిల్లా సహకార అధికారి రామ్మో హన్, డీఏవో తిరుమల ప్రసాద్, డీఆర్డీవో సురేందర్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ మహేష్ కుమార్, డీపీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు.జోరుగా ధాన్యం కొనుగోళ్లు..కామారెడ్డి క్రైం : జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 446 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 62,830 మంది రైతుల నుంచి రూ.776 కోట్ల విలువైన 3.35 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 44,495 మంది రైతులకు రూ.660 కోట్ల వరకు డబ్బులు చెల్లించామని తెలిపారు. 18,570 మంది రైతులు సన్నరకం ధాన్యం విక్రయించారని, వారికి రూ. 73.96 కోట్ల బోనస్ చెల్లింపులకోసం ప్రభుత్వానికి సిఫార్సు చేశామని పేర్కొన్నారు. -
పిచ్చుకపైనే బ్రహ్మాస్త్రం!
శనివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2025– IIలో uసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కల్తీకల్లు కోసం ఉపయోగించే రసాయనాలు, కల్లు తయారీదారులను పట్టుకునే విషయంలో అధికార యంత్రాంగం విచిత్రంగా వ్యవహరిస్తోంది. భారీ స్థాయిలో రసాయనాలను సరఫరా చేస్తున్న వా రిని, తక్కువ ధరకు లభించే డ్రగ్స్ ను కల్లు తయారీకి ఉపయోగించేలా ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలేసి కల్లు సొసైటీ సభ్యులుగా ఉండి చిన్నపాటి డిపోలను నిర్వహిస్తున్న తమపైనే ప్రతాపం చూపిస్తున్నారని గౌడ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. రూ.కోట్లలో వ్యాపారాలు చేస్తూ భారీగా రసాయనాలను రవాణా చేస్తున్న వారిని వదిలేసి పిచ్చుకపై బ్రహ్మాస్త్రం మాదిరిగా తమను ఇబ్బందులపాలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేసుల లెక్కల కోసం ఇలా చేయడం సరికాదంటున్నారు. కల్లుపై ప్రయోగాలు కృత్రిమ కల్లును గతంలో క్లోరోహైడ్రేట్ రసాయనంతో తయారు చేసేవారు. ప్రభుత్వం దీన్ని నిషేధించాక డైజోఫాం ఉపయోగించారు. ప్రస్తుతం అల్ప్రాజోలం రసాయనం వాడుతున్నారు. ఈ రసాయనా లు సాధారణంగానే అత్యంత ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో గుండెపోటు, కిడ్నీ, జీర్ణవ్యవస్థ దెబ్బ తినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం జరుగుతుంది. ఇక మోతాదు పెంచితే తాగినవాళ్లు కుప్పకూలాల్సిందే. కాగా ఈ రసాయనాల కొనుగోలు ఖర్చును మరింతగా తగ్గించుకొని, అధిక లాభాలను ఆర్జించేందు కు సరికొత్తగా కొందరు బడా ముదుర్లు కల్లు ప్రియులపై యథేచ్ఛగా ప్రయోగాలు చేసేందుకు వెనుకాడడం లేదని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఇలాంటి బడా ముదుర్లను వదలి తమపై అధికార యంత్రాంగం ప్రతాపం చూపడంపై కల్లు సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాళ్లలో అల్ప్రాజోలం రసాయనాన్ని సరఫరా చేస్తున్న వారిని పట్టుకోవడం మాని కేవలం రెండు నుంచి మూడు కిలోలు తెచ్చుకుంటున్న తమపై కేసులు నమోదు చేసి ఉన్నతాధికారుల వద్ద జిల్లా అధికారులు మెప్పు పొందుతున్నారని సొసైటీల సభ్యులు చెబుతున్నారు. అల్ప్రాజోలం విషయానికొస్తే ఉమ్మడి జిల్లాలో 2023లో 6.4 కిలోలు, 2024లో 9.6 కిలోలు, 2025లో ఇప్పటి వరకు 0.25 కిలోలు మాత్రమే పట్టుకోవడం గమనార్హం. ఇదంతా గమనిస్తే బడా ముదుర్లను మాత్రం వదిలేస్తున్నట్లు అర్థమవుతోందని సొసైటీల సభ్యులు అంటున్నారు.న్యూస్రీల్రసాయనాల బదులు..కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలో గతనెల 7వ తేదీన కల్లుడిపోలో కల్లు తాగిన 69 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఇందులో 17 మందిపై తీవ్ర ప్రభావం చూపడంతో నిజామాబాద్ జీజీహెచ్లో 72 గంటలపాటు వైద్య చికిత్సలు అందించారు. చికిత్స సమయంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా లక్షణాలు కనిపించడంతో క్షుణ్ణంగా పరిశీలించిన వైద్యులు.. కల్లు తయారీలో కలిపిన రసాయనాల విషయమై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధితులకు గంటల వ్యవధిలోనే నాడీవ్యవస్థ దెబ్బతినడంతోపాటు నాలుక దొడ్డుగా మారడం, డిస్టోనియా(మరమనిషి మాదిరిగా), రిజిడ్(గట్టిగా), సిరలు పడిపోవడం, నొప్పులు తదితర లక్షణాలు కనిపించాయి. దీంతో కొత్తగా ‘యాంటీ సైకోటిక్ గ్రూపు’నకు చెందిన డ్రగ్స్ను వాడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ యాంటీ సైకోటిక్ గ్రూపులోని డ్రగ్స్ను ‘మేజర్ మెంటల్ డిజార్డర్’ ఉన్నవారికి ఉపయోగిస్తారు. ఈ డ్రగ్ పేషెంట్ను కామ్డౌన్ చేస్తుంది. అయితే యాంటీ సైకోటిక్ గ్రూపులో క్లోర్ప్రామజిన్ లాంటి మరో ఐదురకాల డ్రగ్స్ ఉంటాయి. ఇలా రసాయనాల బదులు కొత్త రకం డ్రగ్స్తో కల్లు ప్రియులపై ప్రయోగాలు చేస్తున్నవారిని వదిలి అధికారులు తమపై ప్రతాపం చూపుతున్నారని సొసైటీల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కల్లు తయారీలో కల్లు సొసైటీలపైనే అధికారుల ప్రతాపం కొత్త రకం డ్రగ్స్ను సరఫరా చేస్తున్న మాఫియాకు మినహాయింపు ‘యాంటీ సైకోటిక్ డ్రగ్స్’ వాడకాన్ని ప్రోత్సహిస్తున్న ముదుర్లు తక్కువ ఖర్చుతో లభించే రసాయనాల వైపు కొందరి చూపు అధికారుల తీరుపై విమర్శలు -
నవీపేటలో ఆటో చోరీ
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం ఆటో చోరీకి గురైనట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నవీపేటకు చెందిన మంజుసింగ్ తన ఆటోను సంత సమీపంలో పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. కొద్దిసేపటికి వచ్చి చూసేసరికి ఆటో లేకపోవడంతో, చోరీకి గురైందని గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్వాడి: నగరంలోని బస్టాండ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. మృతుడు నీలం రంగు ఫుల్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. వయస్సు 55నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. గత 3 రోజుల నుంచి ఇక్కడే చుట్టుపక్కల తిరుగుతూ రోడ్డుపై పడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతుడికి సంబంధించిన వారు ఎవరైన ఉంటే నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో లేదా, ఫోన్ నెంబర్ 8712659840, 8712659719కు సంప్రదించాలని అన్నారు. ఒకరి ఆత్మహత్య నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని దుర్కి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. దుర్కి గ్రామంలోని మామిడి బాల్రాజు(47)కు గత రెండు సంవత్సరాల క్రితం నుంచి మతి స్థిమితం బాగాలేదు. ఎన్ని ఆస్పత్రుల్లో చికిత్స అందించినా నయంకాలేదు. ఈక్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతడు ఇంటి వెనక గల పాకలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి అతడిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యులు పరీక్షించి, మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృతికామారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లాకేంద్రంలోని గుమాస్తా కాలనీకి చెందిన గుమ్మడి రాజేందర్ (69) డెయిరీఫామ్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం డెయిరీఫామ్లో పనులు చూసుకుని ఇంటికి వచ్చేందుకు కామారెడ్డి–రామారెడ్డి ప్రధాన రహదారి దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ బైక్ అతడిని ఢీకొట్టింది. ఈఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి భార్య లక్ష్మీపార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
అధ్వానంగా ఆటో నగర్
నిజామాబాద్ సిటీ: నగర శివారులోని ఇండస్ట్రియల్ కారిడార్ ‘ఆటో నగర్’ను పట్టించుకునే వారు కరువయ్యారు. స్థానిక సమస్యలను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఆటో నగర్ అధ్వానంగా మారింది. కనీస వసతులు లేక, కంకర రోడ్లు, పారిశుధ్య లోపంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్లుగా సమస్యలతో సావాసం.. ఇండస్ట్రియల్ పనుల కోసం ప్రత్యేకంగా 1982లో అప్పటి ప్రభుత్వం నగర శివారులో 26 ఎకరాల స్థలం కేటాయించింది. దాని చుట్టూ ప్రహరీ ఏర్పాటుచేసింది. ఇందులో దాదాపు 200 వరకు పలు రకాల ఇండస్ట్రియల్ కార్యాలయాలు, వర్క్షాపులు ఉన్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 2వేల మంది ఆధారపడి పనులను చేస్తున్నారు. అయితే ఇంత పెద్ద కారిడార్లో మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఆటో నగర్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. 40 ఏళ్ల క్రితం చేసిన పనులే తప్ప కొత్తగా ఎలాంటి అభివృద్ధి లేదు. సీసీ డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరు మొత్తం రోడ్లమీదనే పారుతోంది. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కుంటలను తలపిస్తున్నాయి. పాత రోడ్లు పాడైపోయి కంకర తేలి అధ్వానంగా మారాయి. చెత్త సేకరణ జరగడం లేదు. పాడైపోయిన షెడ్కు వచ్చిన కార్లు కూడా రోడ్డుమీదనే పార్కు చేస్తున్నారు. దీంతో రోడ్లు ఇరుకుగా మారిపోయాయి. సమస్యలపై వినతులు.. ఆటోనగర్ ఏరియాలో పారిశుధ్య పనులు చేపట్టాలని దుకాణదారులు ఇటీవల మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కమిషనర్ స్పందించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, చెత్త సేకరణ చేపడతామని తెలిపారు. వర్షపునీరు బయటకు వెళ్లేలా, సీసీ డ్రెయినేజీల నిర్మాణం కోసం అంచనాలు వేయాలని ఇంజినీరింగ్ డీఈ సుదర్శన్రెడ్డి, ఏఈ షాదుల్లాను ఆదేశించారు. పారిశుధ్య పనులు చేపట్టాలని అసిస్టెంట్ కమిషనర్ జయకుమార్ను ఆదేశించారు. దీంతో వారు ఆటోనగర్ వెళ్లి దుకాణదారులతో మాట్లాడారు. అలాగే ఆటోనగర్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండ్ కేటాయించాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీని దుకాణదారులు కోరారు. ఆయన స్పందించి ఎస్టిమేషన్ వేయించాలని అధికారులకు సూచించారు. దీంతో త్వరలో సమస్యలు తీరనున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు లేక వాహనదారుల ఇబ్బందులు పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం పట్టించుకోని అధికారులుఎస్టిమేషన్ వేయించాం.. ఆటోనగర్ ఇండ్రస్ట్రియల్ ఏరియా మున్సిపల్ పరిధిలోకి రాదు. దానికి స్పెషల్ స్టేటస్ ఉంది. అయినా శానిటేషన్ పనులు చేయిస్తున్నాం. సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణం, వర్షపునీరు బయటకు వెళ్లేలా ఏర్పాట్ల కోసం అధికారులను పంపి ఎస్టిమేషన్స్ వేయించాం. – దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ -
‘సానిటరీ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకోవాలి’
కామారెడ్డి టౌన్: కార్మికులను వేధిస్తున్న సానిటరీ ఇన్స్పెక్టర్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. శుక్రవారం విధులను బహిష్కరించి బల్ది యా కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు రాజనర్సు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను సానిటరీ ఇన్స్పెక్టర్ నగేశ్కు విన్నవిస్తే ఆయన అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కార్మికులకు ఫోన్లు చే స్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందించకపోతే ఆందోళన లు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే పెండింగ్లో ఉన్న వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించా లని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యద ర్శి మహబూబ్, ఉపాధ్యక్షుడు సంతోష్, కార్మికులు దీవెన, శివరాజవ్వ, జ్యోతి, నర్సింలు, లక్ష్మి, కిషన్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. -
వేతనం అందేదెప్పుడో?
నాగిరెడ్డిపేట : ఇటీవల నియమితులైన 2008 డీఎ స్సీ కాంట్రాక్ట్ టీచర్లు వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. విధుల్లో చేరి మూడు నెలలు దాటినా ఇంతవరకు వేతనాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ప్రభు త్వం డీఎస్సీ–2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ బేసిస్ పై ఎస్జీటీ ఉద్యోగాలు ఇచ్చింది. వీరికి నెలకు రూ.31,040 చొప్పున గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించింది. ఫిబ్రవరి 15న వీరికి నియామక పత్రాలు అందించింది. జిల్లాలో 72 మంది కాంట్రా క్ట్ ఎన్జీటీలుగా నియమితులయ్యారు. అప్పటివరకు ప్రైవేట్ పాఠశాలలతోపాటు ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్న వారు ప్రభుత్వ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేశారు. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత ఇప్పటివరకు ఒక్క నెల వేతనం కూడా రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వేతనాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా వేతనాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. విధుల్లో చేరినప్పటి నుంచి అందని వేతనాలు డీఎస్సీ–2008 కాంట్రాక్ట్ టీచర్ల ఎదురుచూపులు -
ఎండు గంజాయి పట్టివేత
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి ఎండు గంజాయిని పట్టుకున్నారు. రైల్వే స్టేషన్, శివాజీ చౌక్ సమీపంలో దాడులు చేసి పురుషోత్తం, ఖురేషి చోటుమియాలను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద సోదాలు నిర్వహించగా ఇద్దరి దగ్గర 200 గ్రాముల చొప్పున ఎండు గంజాయి లభ్యమైంది. నిందితులను అదుపులోకి తీసుకుని ఎస్హెచ్వోకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ సీఐ విలాస్, ఎస్సై సింధు, సిబ్బంది చంద్రమోహన్, నీలిరాజు, కిరణ్కుమార్, నర్సయ్య చారి, సాగర్రావ్, సలీమ్, భూమేశ్వర్, గోపి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఆవులను ఎత్తుకెళ్లేందుకు యత్నం ఖలీల్వాడి: నగరంలోని ఆకుల పాపయ్య రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎత్తుకెళ్లేందుకు యత్నించినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. దుండగులు ఉదయం 3.30 గంటల ప్రాంతంలో ఓ ఆవుకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కారులో తరలించేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి కేకలు వేశారు. వెంటనే దుండగులు ఆవును వదిలి కారులో పరారైనట్లు తెలిపారు. ఆవుల యాజమాని అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కేబుల్ వైర్ల చోరీ నిందితుడి పట్టివేత లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లోని బోరుబావుల వద్ద కేబుల్ వైర్లు దొంగిలిస్తున్న నిందితుడిని స్థానిక రైతులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మండల కేంద్రంలోని మత్తడికిందిపల్లెకు చెందిన ధారావత్ రాములు అనే వ్యక్తి గత కొంతకాలంగా బోరు బావుల వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బోరు బావి వద్ద కేబుల్ వైర్లు చోరీ చేస్తుండగా రైతులు పట్టుకొని మండల కేంద్రానికి తీసుకొచ్చి కేబుల్ మెడలో వేసి ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై ఎస్సై వెంకట్రావును వివరణ కోరగా ధారావత్ రాములును రైతులు అప్పగించినట్లు తెలిపారు. విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మేకలపై చిరుత దాడి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాలోత్ సంగ్యా నాయక్ తండాలో ఆరు మేకలపై చిరుత దాడి చేసి హతమార్చినట్లు తండావాసులు శుక్రవారం తెలిపారు. తండాకు చెందిన నేనావత్ శివరాం, నేనావత్ లక్ష్మణ్కు చెందిన మేకలు తండా సమీపంలోని గుట్ట ప్రాంతంలో మేతకు వెళ్లాయి. అదే సమయంలో అటవీ ప్రాంతంలో నుంచి వచ్చిన చిరుత ఆరు మేకలపై దాడి చేయగా, మృతిచెందినట్లు బాధితులు తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి బీట్ అధికారి సాయికిరణ్ చేరుకొని వివరాలు సేకరించారు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరారు. వివాహిత అదృశ్యం రుద్రూర్: పోతంగల్ మండలం జల్లాపల్లి పారంకు చెందిన వివాహిత (20) అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ శుక్రవారం తెలిపారు. ఈ నెల 11న ఎవరికి చెప్పకుండా ఆమె ఇంటి నుంచి వెళ్లి, ఇప్పటికీ తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో వివాహిత భర్త హైమద్ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
లక్ష్మికి ఇందిరమ్మ ఇల్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జోడో యాత్రలో భాగంగా 2023 మార్చి 18న కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామం మీదుగా వెళుతూ కూలిపోయిన ఇంటిని చూసిన అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తామని భిక్కనూరు లక్ష్మికి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే విషయంపై ‘రేవంతన్నా.. నన్ను యాది మరువకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్ ఎడిషన్లో ప్రచురించిన కథనంపై సీఎం స్పందించారు.ఉన్నతాధికారులను ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు అదే రోజు లక్ష్మి ఇంటికి వెళ్లి ఇల్లు మంజూరుకు ప్రతిపాదనలు పంపుతున్నట్టు చెప్పారు. అయితే ఎన్నికల కోడ్ రావడంతో లక్ష్మికి ఇల్లు మంజూరు కాలేదు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రూపుదిద్దుకోవడంతో భిక్కనూరు లక్ష్మితోపాటు చిట్యాల రాజమణి, భిక్కనూరు రేణుకలకు కూడా ప్రత్యేక కేసు కింద ఈ ఏడాది జనవరి 28న ఇళ్లు మంజూరయ్యాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం ద్వారా మంజూరైన పత్రాలను గురువారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లక్ష్మితోపాటు మరో ఇద్దరికి అందజేశారు. ఇంటి నిర్మాణం కోసం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చందర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ‘సాక్షి పేపర్ల నాకు సీఎం సారు ఇచ్చిన హామీ గురించి రాసిండ్రు. ఇచ్చిన మాట నిలుపుకున్న రేవంత్రెడ్డి సారుకు కృతజ్ఞతలు’ అంటూ భిక్కనూరు లక్ష్మి తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. చదవండి: మంత్రి కొండా సురేఖకు అభినందనలు తెలిపిన కేటీఆర్ -
సాక్షి కథనాలు.. పరిష్కారాలు
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండలంలోని ప్రజా సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చి కథనాలను ప్రచురించి ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఎన్నో ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించింది. బాధితుల పక్షాన ఉంటూ మన్ననలు పొందుతోంది. ఏప్రిల్ నెలలో బిచ్కుంద మండలంలో ఏడు సమస్యలు ప్రచురించగా అధికారులు పరిష్కరించారు. 6వ తేదీన దౌల్తాపూర్ను వణికిస్తున్న విషజ్వరాలు.. కథనాలతో వైద్య ఆరోగ్య శాఖ స్పందించి మూడు రోజులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి రక్తనమూనాలు సేకరించి వైద్యం అందించారు. 10న మురికి కూపంగా బస్టాండ్.. కథనంతో డీపీవో మురళి స్పందించి బిచ్కుంద ఆర్టీసీ బస్టాండ్ సందర్శిచి మురికి తొలగించి శుభ్రం చేయించారు. 16న ప్రమాదకరంగా ముళ్లపొదలు... కథనం ప్రచురించగా ఆర్అండ్బీ అధికారులు స్పందించి బిచ్కుంద–కందర్పల్లి రోడ్డు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను ప్లొకెయిన్తో తొలగించి శుభ్రం చేయించారు. 18న ఆడవాళ్ల ఆత్మగౌరవం పట్టదా... ప్రచురించిన కథనానికి బాన్సువాడ ఆర్టీసీ డీఎం సరితాదేవి స్పందించి మరుగుదొడ్ల విరిగిన తలుపులకు మరమ్మతులు చేయించి సమస్య పరిష్కరించారు. 24న స్కావెంజర్ డబ్బులు కాజేత... వచ్చిన కథనానికి విద్యా శాఖ అధికారులు స్పందించి విచారణ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం కాజేసిన స్కావెంజర్ రూ.13 వేలు తిరిగి ఇచ్చేశారు. మే 2న పడకేసిన పారిశుధ్యం...అనే వచ్చిన కథనానికి అధికారులు వెంటనే స్పందించి పరిష్కరానికి చొరవచూపి పారిశుధ్య పనులు చేయించి దౌల్తాపూర్లో తాగునీటి సమస్య పరిష్కరించారు. మాతాశిశు సంరక్షణ కార్డుల కొరత... ఎన్నో కథనాలతో సమస్యల పరిష్కరానికి కృషి చేసిన ‘సాక్షి’ కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలు వెలుగులోకి.. ప్రచురితమైన కథనాలకు స్పందన బిచ్కుంద మండలంలో సమస్యలు పరిష్కరించిన అధికారులు -
కేసులను పెండింగ్ లో పెట్టొద్దు
● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: పోలీస్ స్టేషన్లకు వచ్చే కేసులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సాయంత్రం జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల అధికారులతో నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి కేసులోనూ నాణ్యవంతమైన దర్యాప్తు చేపట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. సైబర్ మోసాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. గంజాయి, మట్కా, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలనీ, అన్ని పోలీస్ స్టేషన్లో పరిధిలో సీసీ కెమెరాల ను ఏర్పాటు చేసుకోవడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహా రెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. సెల్ఫోన్ అప్పగింత రెంజల్(బోధన్): పోగొట్టుకున్న సెల్ఫోన్ను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. మండలంలోని కందకుర్తి గ్రామానికి చెందిన సోహైల్ అనే వ్యక్తి సెల్ఫోన్ పోగొట్టుకోగా ఆయన ఫిర్యాదు మేరకు ట్రేస్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. గురువారం బాధితునికి ఫోన్ అప్పగించినట్లు చెప్పారు. కంప్యూటర్ ఆపరేటర్ గణేశ్ ఉన్నారు. -
విద్యుత్ షాక్తో అసిస్టెంట్ లైన్మన్ మృతి
బోధన్ రూరల్: బోధన్ మండలంలోని రాజీవ్నగర్ తండాలో విద్యుత్ మరమ్మతులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై అసిస్టెంట్ లైన్మన్ మృతి చెందాడు. వివరాలు ఇలా.. ఎడిపల్లి మండల కేంద్రానికి చెందిన బి మహేందర్(34) బోధన్ సబ్స్టేషన్ పరిధిలోని బెల్లాల్ ప్రాంతంలో అసిస్టెంట్ లైన్మన్గా విధులు నిర్వహిస్తున్నారు. రాజీవ్నగర్ తండాలో చిన్నపాటి విద్యుత్ మరమ్మతులు ఉండటంతో గురువారం అతడు ఎల్సీ (లైన్ క్లియర్) తీసుకోకుండా మరమ్మతులు చేపట్టాడు. ఈ క్రమంలో పైనున్న 11 కెవి విద్యుత్ తీగలు తగలడంతో అతడికి తగలడంతో ట్రాన్స్ఫార్మర్పై పడి, అక్కడి నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. బోధన్ ట్రాన్స్కో డీఈ ఎండీ ముక్తార్, అధికారులు ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
నగరంలో సైబర్ మోసం
● లింక్ ఓపెన్ చేసి, రూ.1.48లక్షలు పోగొట్టుకున్న రిటైర్డ్ ఉద్యోగి ఖలీల్వాడి: నగరంలోని ఓ రిటైర్డ్ విద్యుత్ ఉద్యోగి బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ మోసగాళ్లు రూ.1.48 లక్షలు కాజేశారు. నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ గురువారం తెలిపిన వివరాలు ఇలా.. రిటైర్డ్ ఉద్యోగి ఇటీవల ఫోన్పే పని చేయకపోవడంతో బ్యాంక్ అధికారులను సంప్రదించారు. దీంతో బ్యాంక్ సిబ్బంది గూగుల్పే లేదా ఫోన్పే కస్టమర్ కేర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈక్రమంలో సదరు వ్యక్తి గూగుల్లో సెర్చ్ చేసి ఓ ఫోన్ నంబర్కు కాల్ చేశాడు. అనంతరం వేరే ఫోన్ నెంబర్ నుంచి సైబర్ మోసగాళ్లు కాల్ చేసి ఓ లింక్ పంపిస్తున్నామని చెప్పి పంపించారు. వెంటనే అతడు లింక్ ఒపెన్ చేయడంతో బాధితుడికి ఉన్న యూనియన్బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, పంజాబ్నేషనల్ బ్యాంక్ల ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు రూ.1.48 లక్షలను కాజేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు గురువారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో మేక మృతి నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): మండలంలోని జలాల్పూర్ గ్రామశివారులో గురువారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మేక మృత్యువాత పడింది. మండలంలోని జప్తిజాన్కంపల్లి గ్రా మానికి చెందిన చిన్నన్న అంజయ్య రోజూలాగే గు రువారం తన మేకల మందను తీసుకొని మేతకో సం జలాల్పూర్ శివారుకు వెళ్లాడు. కాగా ఇటీవల కురిసిన గాలివానకు జలాల్పూర్ శివారులో విద్యుత్స్తంభం నుంచి విద్యుత్వైరు ఊడిపోయి కిందపడింది. కిందపడిన వైరును గమనించక మేకలమంద అటువైపు వెళ్లగా మందలోని ఓ మేక ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడింది. ప్రమాదంలో మృతిచెందిన మేక విలువ సుమా రు రూ.10వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. కాగా విద్యుత్వైరు నేలపై పడిన వైపు మనుషులెవరూ వెళ్లకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ట్రాన్స్కో అధికారులు, పశువైద్య సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగినతీరును తెలుసుకున్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత సిరికొండ: మండలంలోని కొండాపూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఎమ్మారై గంగరాజం గురువారం పట్టుకొని పంచనామా చేసి పోలీసులకు అప్పగించారని ఎస్సై రామ్ తెలిపారు. కొండాపూర్కు చెందిన ట్రాక్టర్ యాజమాని మామిడి నర్సయ్య, డ్రైవర్ రామకృష్ణ, మెట్టుమర్రి తండాకు చెందిన మురళిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ఇసుక తుపాన్
మంజీర పరీవాహక ప్రాంతమైన బిచ్కుంద మండలం ప్రతిరోజూ వార్తల్లో నిలుస్తోంది. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఇసుక తుపానులో కొట్టుకుపోతున్నారు. గతంలో కొందరు రెవెన్యూ, పోలీసు అధికారులపై వేటుపడిన విషయం తెలిసిందే. తాజాగా ఏసీబీ అధికారులు బిచ్కుంద పోలీస్ స్టేషన్లో సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఇసుక అక్రమ రవాణా ఫిర్యాదుల నేపథ్యంలోనే సోదాలు చేపట్టారు. బిచ్కుంద(జుక్కల్): జిల్లాలో ఎక్కడా లేని విధంగా బిచ్కుంద మండలంలో ఏడు ఇసుక పాయింట్లు ఉన్నాయి. మంజీరా నది పరీవాహక గ్రామాలైన బండారెంజల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హజ్గుల్, శెట్లూర్, ఖద్గాం గ్రామాల పరిధిలో మంజీరాలో కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక మేటలు ఉండగా, అనుమతుల పేరుతో కొందరు.. అక్రమంగా కొందరు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. పుల్క ల్, హజ్గుల్, శెట్లూర్, ఖద్గాం గ్రామాలకు చెందిన కొందరు యువకులు ఇసుక మాఫియా అవతారమెత్తారు. ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా సహకరిస్తున్న రెవెన్యూ, పొలీస్ అధికారులు లక్షల్లో వసూళ్లకు పాల్పడుతూ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇప్పటికే పలువురు పోలీసు, రెవెన్యూ అధికారులపై వేటుపడింది. 2012లో డిప్యూటీ తహసీల్దార్, సర్వేయర్, వీఆర్వో, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటుపడింది. అలాగే సుమారు మూడేళ్ల క్రితం బిచ్కుంద, మద్నూర్ పొలీసు సిబ్బంది నలుగురిని అప్పటి ఎస్పీ సస్పెండ్ చేశారు. బిచ్కుందలో పని చేసిన ఎస్సై ఇసుక ట్రాక్టర్ను పట్టుకుని ఓ కాంట్రాక్టర్కు ఇసుక అమ్మేసుకోగా ఆయనను బదిలీ చేశారు. ఇలా చాలా మంది ఎస్సైలు, సీఐలు, తహసీల్దార్లు, ఆర్ఐలు అవినీతి మసిపూసుకుని వెళ్లారు. పదేళ్ల కాలంలో కొందరు ఉన్నతాధికారులకు చిక్కగా కొందరు అప్రమత్తమై బదిలీపై వెళ్లిపోయారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో ఫిర్యాదుల నేపథ్యంలో బోధన్ సబ్ కలెక్టర్ నేరుగా హజ్గుల్ మంజీరా నదిలోకి వెళ్లారు. వందల ట్రాక్టర్లు ఇసుక నింపుతుండగా రెడ్హ్యాండెడ్గా 40 ట్రాక్టర్లను పట్టుకున్నారు. డ్రైవర్లు, ఓనర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.హైకోర్టుకు బార్ అసోసియేషన్..మంజీరా క్వారీ నుంచి ఇసుక తరలించేందుకు ఒకచోట అనుమతి పొంది మరోచోట ఇసుక తవ్వుతున్నారని, అక్రమంగా వందల లారీలు, ట్రాక్టర్లలో ఇసుక తరలించి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారని బిచ్కుంద బార్ అసోసియేషన్ గతేడాది జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. స్పందించిన హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ వ్యవహారంలో సంబంధిత జిల్లా అధికారులకు నోటీసులు జారీ కావడంతో ఇసుక అక్రమ రవాణాకు బ్రేక్ పడింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ స్పందించి ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసి దాడులు చేస్తే ఇసుక అక్రమ రవాణాను అరికట్టొచ్చని ప్రజలు అంటున్నారు. వరుస వివాదాల్లో బిచ్కుంద పోలీసు, రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలతో కలకలం అయినా మారని తీరు.. కొనసాగుతున్న వసూళ్లు ఏడు పాయింట్ల నుంచి యథేచ్ఛగా రవాణా -
చైన్స్నాచింగ్ ముఠా అరెస్టు
ఆర్మూర్టౌన్: ఆటోలో ప్రయాణించే మహిళలను టార్గెట్ చేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తెలిపారు. ఆర్మూర్ పోలీస్స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామానికి చెందిన చైన్ స్నాచింగ్ బాధితురాలు బొబ్బిలి లక్ష్మి ఇటీవల ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ బైపాస్ మార్గం వద్ద గురువారం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన ఏడుగురు నిందితులు కూలీ పనుల పేరుతో నిర్మల్ జిల్లాలోని తిమ్మాపూర్, మంజులపూర్ ప్రాంతాల్లో నివసిస్తూ, మహిళల మెడల నుంచి బంగారు గొలుసులు చైన్ స్నాచింగ్ చేసినట్లు నిర్ధారించారు. కాగా వారి వద్ద నుంచి 12.2 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైకులు, ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముఠాను పట్టుకోవడంలో కృషిచేసి పోలీసులకు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్వో సత్యనారాయణ, శ్రీధర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
సెల్ టవర్ ఎక్కి హల్చల్
నిజామాబాద్ రూరల్: అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తూ, సెల్టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాలు ఇలా.. మండలంలోని మల్లారం గ్రామనికి చెందిన ఎం. సాయిలు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లుకు అర్హత ఉందని, ఇటీవల ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కానీ అధికారులు అనర్హతగా ప్రకటించడంతో గురువారం అతడు మల్లారం గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ విషయంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే ఆయన ఫోన్లో అక్కడ ఉన్న స్థానిక నాయకులతో మాట్లాడి సెల్టవర్ ఎక్కిన సాయిలుకు కాన్ఫరెన్స్ ద్వారా ఫోన్లో మాట్లాడి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన సెల్టవర్ దిగి ఎమ్మెల్యే భూపతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సాయిలు సెల్టవర్ దిగడంతో మల్లారం ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని నిరసన రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీతో దిగివచ్చిన వ్యక్తి -
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్లు డిక్యూఎంఏఎస్ (జిల్లా క్వాలిటీ అసెస్మెంట్ అధికారి) రాధిక అ న్నారు. గురువారం ఎన్ఏక్యూస్ (నేషనల్ క్వా లిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్) సంస్థ బృందం స భ్యులు లింగంపేట మండలం మోతె, పొల్కంపేటలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజారోగ్య సేవల నాణ్యతను పెంపొందించడానికి ఏర్పాటు చేసిన సంస్థ అన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన రెండు కేంద్రాలలో ఆరోగ్య సేవలను, నాణ్యతను పరిశీలించారు. ఉత్తమ సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యలను వైద్య సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో డీపీవో పద్మజ, దిఖ్యం జహీరా, వైద్యాధికారి రాంబాయి, సీహెచ్వో రమేశ్, ఫరిదా, యాదగిరి, గణేష్, రాజేశ్వరీ, ఎలిజబేత్, విజయకుమారి, రజిని, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఐక్యత కోసం కలిసి పనిచేయాలి రాజంపేట : మండల కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఉండరాదని అందరూ పార్టీ కోసం ఐక్యతతో పని చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట గ్రామంలో నెలకొన్న ఇందిరమ్మ ఇళ్ల గందరగోళ విషయంపై ఆయన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎవరు డబ్బులు వసూలు చేసినట్లు నిరూపణ జరిగినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నాయకత్వంలో పార్టీ కోసం కష్టపడి పని చేయాలని, రాబోయే స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని సూచించారు. మండల పార్టీ అధ్యక్షులు యాదవ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయశాఖలో ఘటనపై విచారణకు ఆదేశం డొంకేశ్వర్(ఆర్మూర్): మరణించిన ఉద్యోగికి సంబంధించిన ఫ్యామిలీ బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఇబ్బందులు పెడుతున్నారనే ఆరోపణలపై నిజామాబాద్ రూరల్ వ్య వసాయాఽధికారిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారులుగా సింగారెడ్డి, శివాజీ పాటిల్లను నియమించింది. వీరు హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చి శుక్రవారం బాధిత కుటుంబాన్ని, అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని విచారించనున్నారు. ఇటు టీజీవో ఆధ్వర్యంలో కలెక్టర్, డీఏవోకు వేర్వేరుగా వినతిపత్రాలు అందజేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
మాట నిలుపుకున్న సీఎం రేవంత్
కామారెడ్డి రూరల్: కాంగ్రెస్ మాట తప్పదని, మడమ తిప్పదని, తమది పేదల పక్షపాతి అని రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. 2023 మార్చి 18 తేదీన హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అకాల వర్షాల కారణంగా కూలిన ఇళ్లను పరిశీలించి బాధితులైన భిక్కనూరి లక్ష్మి, చిట్యాల రాజమణి, భిక్కనూరి రేఖ శ్రీకాంత్కు తాము అధికారంలోకి రాగానే ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారన్నారు. షబ్బీర్ గురువారం మార్క్ అవుట్, భూమిపూజ చేసి ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా పేదలకు ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల 50 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున మంజూరయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి ఫామ్హౌస్లో పడుకొని ఇది చేయలేదు, అది చేయలేదంటున్నారన్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత తాను స్వయంగా లేదా వర్చువల్ ద్వారా గృహప్రవేశానికి హాజరవుతానని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిపారు. నియోజక వర్గంలో ఇప్పటివరకు 3028 ఇళ్లు నిరుపేదలకు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్, కై లాస్ శ్రీనివాస్రావు, గూడెం శ్రీనివాస్రెడ్డి, ఎడ్ల రాజిరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీవో హెప్సిబా రాణి, అన్మాల గంగయ్య, రామాగౌడ్, ఆనంద్రావు, కొల్మిభీంరెడ్డి, నిమ్మ విజయ్కుమార్రెడ్డి, ఇతర శాఖల అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు.. మడమ తిప్పదు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిన్నమల్లారెడ్డిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ -
ఆర్టీసీ స్మార్ట్ సేవలు
కామారెడ్డి టౌన్ : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తూనే సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ప్రయాణికుల కోసం అనేక రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా క్యూఆర్ కోడ్ కీ చైన్ల సేవలతో మరింత స్మార్ట్ అయ్యింది. ప్రత్యేకంగా తయారు చేసిన తెలంగాణ ఆర్టీసీ సంస్థ కీ చైన్లపై క్యూ ఆర్కోడ్ను ముద్రించి ప్రయాణికులకు అందజేస్తోంది. దీన్ని స్కాన్ చేస్తే పూర్తి సమాచారం మన అరచేతిలో ఉంటుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అందుకు తగినట్లుగా ఆర్టీసీ సమాచారాన్ని చేరువ చేస్తోంది. కీ చైన్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆర్టీసీ అందించే సేవలు కనిపిస్తాయి. కావాల్సిన వివరాలు ప్రత్యక్షం ఫోన్లో గూగుల్ ఓపెన్న్ చేసి పైన కనిపించే కెమెరాపై క్లిక్ చేయాలి. అనంతరం కీ చైన్పై రూపొందించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కావాల్సిన వివరాలు ప్రత్యక్షమవుతాయి. మెయిల్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో మన వివరాలు పొందుపరిస్తే దీన్ని వినియోగించుకో వడం మరింత సులభమవుతుంది. సలహాలు, సమస్యలపై సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వివాహాది శుభకార్యాలతోపాటు విహార యాత్రలకు బస్సులను రాయితీపై బుక్ చేసుకొనే విధానం కూడా అందుబాటులో ఉంది.పది రకాల యాప్లుఆర్టీసీ అందించే కీ చైన్లోని క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తే పది రకాల యాప్లు ఉంటాయి. గమ్యం యాప్ ద్వారా మనం ప్ర యాణించాల్సిన బస్సు ఎక్కడుంది. గమ్యా నికి ఎప్పుడు చేరుకోవచ్చు వంటి వివరాలు తెలుసుకునే వీలుంటుంది. లైవ్ ట్రాకింగ్, టికెట్ బు కింగ్ తదితర సేవలతోపాటు ఇన్స్ట్రాగామ్, ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్ చాన ల్, యూట్యూబ్ వంటివి కనిపిస్తాయి. క్యూఆర్ కోడ్లో ఆర్టీసీ సమాచారం స్కాన్ చేస్తే చాలు కళ్ల ముందు అన్ని రకాల సేవలు ప్రయాణికులకు ప్రత్యేక కీ చైన్లుప్రజలకు మరింత చేరువయ్యేలా ఆర్టీసీ కీచైన్లను ప్రయాణికులకు బహుమతుల రూపంలో ప్రత్యేక సందర్భాల్లో , ఉచితంగా అందజేస్తున్నాం. ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండటం, మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా క్యూఆర్ కోడ్తో ఉన్న కీచైన్లను ఆర్టీసీ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలా సులువుగా సేవలు పొందొచ్చు. సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – కరుణశ్రీ, ఆర్టీసీ డిపో మేనేజర్, కామారెడ్డి -
‘ఈ పాస్’తోనే ఎరువులు విక్రయించాలి
కామారెడ్డి క్రైం: కేంద్రప్రభుత్వం ఆదేశానుసారం ప్రతి డీలర్ ఈ పాస్ మిషన్ ద్వారానే రైతులకు ఎరువులను విక్రయించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లాలోని 360 మంది ఎరువుల డీలర్లకు ప్రస్తుతం వాడుతున్న ఎల్–0 రకం ఈ పాస్ మిషన్ల స్థానంలో కొత్తగా వచ్చిన ఎల్–1 ఈ పాస్ మిషన్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎరువులు విక్రయించే డీలర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. రైతుల ఆధార్తో అనుసంధానం చేస్తూ ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయాలు జరపాలన్నారు. కార్యక్రమంలో డీఏవో తిరుమల ప్రసాద్, ఏడీఏలు, ఏవోలు, డీలర్లు, ఇఫ్కో కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.రేపు జాబ్ మేళా కామారెడ్డి క్రైం: నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి కల్పనాధికారి మల్లయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డిలోని వరుణ్ మోటార్స్లో రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ, మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లొమా చదివిన వారు అర్హులని, 18 నుంచి 30 ఏళ్లు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థ్ధులు తమ బయోడేటా, సర్టిఫికెట్లతో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలలోగా హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 98854 53222, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎక్కువ లాభాలు అర్జించాలిలింగంపేట(ఎల్లారెడ్డి): పంటల సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించాలని జేడీ తిరుమల ప్రసాద్ అన్నారు. లింగంపేట మండలం మోతె గ్రామంలోని రైతు వేదికలో గురువారం ‘రైతు ముంగిట్లో శాస్త్ర వేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ రైతులకు పంటల సాగులో పాటించాల్సిన మెలకువలు వివరించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. సాగునీరు, పంటల సాగు యాజమాన్యంపై సలహాలు, సూచనలు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ అంజయ్య, భాస్కరన్, అనిల్కుమార్, రత్నం, జ్యోతి, అనిల్రెడ్డి, రేవంత్నాథన్, గ్రామపెద్దలు రాంరెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
మారుతున్న కాలంతోపాటు టీచర్లు అప్డేట్ కావాలి
● ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ కామారెడ్డి రూరల్: మారుతున్న కాలంతోపాటు ఉపాధ్యాయులు అప్డేట్ కావాలని నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా డైట్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సూచించారు. గురువారం కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామంలోని జెడ్పీహెచ్ ఎస్లో నిర్వహిస్తున్న సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయులకు ఏ డిజిటల్ ఉపకరణం కాదని పేర్కొన్నారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచాలని, సామాజిక సర్దుబాటులు నేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో కామారెడ్డి మండల విద్యాధికారి వై. ఎల్లయ్య, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ డా. సుభాష్, డీఆర్పీలు ప్రసూన్, బాలరాజ్, రాజభైరయ్య, ఎనిమిది మండలాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
భూ సేకరణ, చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద చేపట్టిన ప్యాకేజీ – 22 పనుల పురోగతి, భూసేకరణ, పరిహారం, చెల్లింపులు తదితర అంశాలపై ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పనులకు సంబంధించి భూసేకరణ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి రూ.23.15 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. భూసేకరణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ టి శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఈఈ ఎం మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐ యామ్ ఏ ఫార్మర్
● పెళ్లిపత్రికలో సగర్వంగా ముద్రించుకున్న యువరైతు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రైతేరాజు అనేది అనాదిగా ఉన్న నానుడి. అయితే రానురాను వ్యవసాయం చేస్తున్న యువకులను పెళ్లిచేసుకునేందుకు మాత్రం అమ్మాయిలు ముందుకు రావడం లేదు. దీంతో వ్యవసాయం చేస్తున్నానని చెప్పుకునేందుకు సైతం యువత ముందుకు రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఓ యువకుడు తాను రైతునని గర్వంగా చాటుకుంటున్నాడు. తన వివాహ పత్రికపై ‘ఐ యామ్ ఏ ఫార్మర్’ అని పేరు పక్కన సగర్వంగా పెట్టుకున్నాడు. అదేవిధంగా నాగలి పట్టిన రైతు, ఎద్దుల బొమ్మను ఉండేలా పత్రికను ముద్రించుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మాతు సంగెం గ్రామానికి చెందిన యువ రైతు జ్ఞానేశ్వర్, సౌందర్య వివాహం ఈ నెల 22వ తేదీన గాంధారిలో జరగనుంది. వివాహ పత్రిక చూసినవారు దీనిపై చర్చింకుంటున్నారు. -
దొంగకు కీ ఇవ్వొద్దు!
ఈనెల 11న రాత్రి సదాశివనగర్ మండలం యాచారం తండాలో దొంగలు జగదాంబ మాత ఆలయ ప్రధాన ద్వారం తాళం పగులగొట్టి హుండీ చోరీ చేశారు.15 రోజుల క్రితం తాడ్వాయికి చెందిన సాయిలు కుటుంబం తాళం వేసి ఊరెళ్లింది. దొంగలు ఆ ఇంటి తాళం పగులగొట్టి, 40 తులాల వెండి, కొంత నగదు ఎత్తుకెళ్లారు. అదే రోజున పక్క కాలనీలోని పరశురాములు ఇంట్లో కూడా చోరీ చేసి బంగారం, నగదు అపహరించారు. ఈనెల 8 న వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు 8 తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లారు.ఈనెల 7 న గాంధారి మండలం పొతంగల్ ఖుర్దు గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. ఓ కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ చేసి నగదు, బంగారం అపహరించారు. అదే రోజు రాత్రి ఓ ఇంట్లోకి చొరబడి కత్తితో బెదిరించి మహిళ మెడలోంచి బంగారు గొలుసు తెంపుకెళ్లారు.20 రోజుల క్రితం బాన్సువాడకు చెందిన సాయవ్వ ఇంటికి తాళం వేసి డాబాపై పడుకుంది. దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి 12 తులాల బంగారు, 60 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గత నెల 29న పొతంగల్ మండలం హంగర్గాలో పుట్టి రాములు ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి మేడపై పడుకున్నారు. దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు దోచుకెళ్లారు.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో చోరులు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. – కామారెడ్డి క్రైంగతనెల 12 న బాన్సువాడలోని సంగమేశ్వర కాలనీలో తాళం వేసిన రెండిళ్లలో చోరీలు జరిగాయి.సాధారణంగా వేసవిలో దొంగల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈసారి కూడా చేతివాటం ప్రదర్శిస్తునారు. వేసవి సెలవుల్లో పట్టణాల నుంచి చాలా మంది స్వగ్రామాలకు, బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు, ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్తుంటారు. ఇలాంటి సమయాల్లోనే తాళం వేసిన ఇళ్లకు కన్నం వేయడానికి దొంగలు పథకాలు వేస్తుంటారు. పగలు రెక్కీ.. రాత్రికి చోరీలు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులను కలిగి ఉంది. దీంతో ఇక్కడ దొంగల బెడద మొదట్నుంచీ ఎక్కువే. కర్ణాటకలోని బీదర్, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాలకు చెందిన దొంగలు, పార్థీ గ్యాంగ్ లాంటి ముఠాలు ఎక్కువగా ఇక్కడ చోరీలకు పాల్పడుతుంటాయి. ఇటీవల ఇతర రాష్ట్రాల దొంగల ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. వీరు ముఖ్యంగా తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తుంటారు. అంతేకాక ఏకంగా కత్తులతో బెదిరిస్తూ చోరీలకు పాల్పడుతున్న ఘటనలు సైతం వెలుగు చూస్తున్నాయి. దొంగలు పగటిపూట కాలనీల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను ఎంచుకుంటారని, అర్ధరాత్రి దాటాక ఆ ఇళ్లలో చోరీలకు పాల్పడుతుంటారని తెలుస్తోంది. సీసీ కెమెరాల్లో తమ ఆనవాళ్లు తెలియకుండా ముసుగులు ధరించడం, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై సంచరించడం చేస్తున్నారు. దీంతో వారిని గుర్తించడంలో పోలీసులకు సైతం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అప్రమత్తంగా ఉంటేనే.. బంగారం, ఆభరణాలు వంటి విలువైన వస్తువులు ఇంట్లో ఉంచడం కంటే.. బ్యాంకు లాకర్లో గానీ, బంధువుల వద్ద గానీ దాచుకోవడం ఉత్తమం. ఇంటికి వేసిన తాళం బయటికి కనిపించకుండా కర్టెన్తో కప్పి ఉంచాలి. సెంట్రల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఊరెళ్లే వారు సమీపంలోని పోలీసులకు సమాచారం ఇస్తే ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుంది. బీరువా తాళాలు దొంగలకు తేలికగా దొరికే ప్రదేశాల్లో పెట్టకూడదు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఉమ్మడి జిల్లాలో రెచ్చిపోతున్న చోరులు తాళం వేసిన ఇళ్లే టార్గెట్ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న పోలీసులుదొంగతనాల నివారణకు చర్యలు.. ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలి. విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకూడదు. కాలనీల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో దొంగతనాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలి. – రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి -
అకాల వర్షంతో ఇబ్బందులు
నిజాంసాగర్: అకాల వర్షాలకు అన్నదాత ఆగమవుతున్నాడు. పంటలు తడిసిపోతుండడంతో ఆందోళన చెందుతున్నాడు. మంగళవారం రాత్రి జిల్లాలోని పలు ప్రాంతాలలో వర్షం కురిసింది. మహమ్మద్నగర్ మండలంలోని హసన్పల్లి, నర్వ, మహమ్మద్నగర్, గున్కుల్, బూర్గుల్, తుంకిపల్లి, కోమలంచ, గాలీపూర్, ముగ్ధుంపూర్, గిర్ని, కొనతండాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం రాశులు తడిసిపోయాయి. కుప్పలచుట్టూ చేరిన నీటిని తొలగించేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. తడిసిన ధాన్యం బస్తాలను రోడ్డువరకు మోసుకుని వచ్చి ఆరబెట్టారు. త్వరగా తూకాలు పూర్తి చేసి, ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. -
బిచ్కుంద పీఎస్లో ఏసీబీ తనిఖీలు
బిచ్కుంద: ఏసీబీ అధికారులు బుధవారం బిచ్కుంద పొలీస్ స్టేషన్పై దాడి చేశారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో ఎస్సై మోహన్రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. సుమారు ఆరు గంటలపాటు స్టేషన్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ మీడియాతో మాట్లాడారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో పొలీసులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయన్నారు. ఈ అంశంపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో తాము సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఎస్సై మోహన్రెడ్డి పట్టుకున్న పది ఇసుక ట్రాక్టర్లు పొలీస్ స్టేషన్లో ఉన్నాయని, వారిని డబ్బులు అడిగారని, అలాగే గతంలో పలు కేసులలో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. దాని ఆధారంగా పూర్తి విచారణ చేసి పైఅధికారులకు నివేదిక పంపిస్తామన్నారు. కాగా మంజీర నది పరీవాహక ప్రాంతాల నుంచి వందలాది ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఫిర్యాదు చేసినవారెవరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావడం లేదని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడుతున్న ఏ శాఖ అధికారులౖపైనెనా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని, వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.జరిమానా కట్టినా వదలడం లేదుజరిమానా కట్టినా పొలీసులు ట్రాక్టర్లు వదిలిపెట్టడం లేదని పలువురు ట్రాక్టర్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతితో ఇసుక తరలిస్తున్నామని, పట్టుకున్న పది ట్రాక్టర్లను ఎస్సై మోహన్రెడ్డి మైన్స్ అధికారులకు అప్పగించారని పేర్కొన్నారు. మైన్స్ అధికారులు విధించిన జరిమానా చెల్లించి నాలుగు రోజులవుతున్నా పొలీసులు ట్రాక్టర్లు వదిలిపెట్టడం లేదన్నారు. అక్రమ వసూళ్ల విషయంలో ఎస్సైపై విచారణ ఆరు గంటలపాటు కొనసాగిన సోదాలు -
ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
కామారెడ్డి టౌన్: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు అడ్లూర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన గండ్ల హేమలతకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని, 575 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. హేమలత మాట్లాడుతూ తన భర్త మరణించాడని, బీడీలు చుడుతూ ఇద్దరు కుమారులను చదివిస్తున్నానని పేర్కొంది. తనకు ప్రభుత్వం ఇల్లు మంజూరు చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, హౌసింగ్ పీడీ జైపాల్రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అధికారులకు అభినందన
కామారెడ్డి క్రైం: డీఆర్డీవో అధికారులు, సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం అభినందించారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో 11,668 మహిళా సంఘాలకుగాను రూ.802 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ రుణాలను అందించడం ద్వారా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఇందుకోసం కృషి చేసిన డీఆర్డీవో సిబ్బందిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం తన చాంబర్లో సన్మానించారు. ఈయేడాది సైతం లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, డీపీఎం సుధాకర్, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.దరఖాస్తుల ఆహ్వానంకామారెడ్డి అర్బన్: హైదరాబాద్ మధురానగర్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, యూసుఫ్గూడ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో అనాథలు, పాక్షిక అనాథలు, పేద బాలికలకు ప్రవేశం కల్పించనున్నారు. ఆసక్తిగలవారు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా సంక్షేమాధికారి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. పాలిసెట్ రాయకపోయినా పదో తరగతి పాసైతే చాల ని పేర్కొన్నారు. అనాథలకు కులం, ఆదా య ధ్రువీకరణ పత్రాలు అవసరం లేదని తెలిపారు. దరఖాస్తుల సమర్పణ, ఇతర వివరాలకు కామారెడ్డి ప్రియా డీలక్స్ రోడ్డులోని బాలరక్ష భవన్లో సంప్రదించాలని సూచించారు.జిల్లా సరిహద్దులో పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటునాగిరెడ్డిపేట: బక్రీద్ను పురస్కరించుకొని జిల్లా సరిహద్దులోగల పోచారం వద్ద బుధవారం పోలీసులు ప్రత్యేక చెక్పోస్ట్ను ఏర్పా టు చేశారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెక్పోస్ట్ను ఏర్పాటు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. జిల్లాలోకి ప్రవేశించే, జిల్లాను దాటి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామన్నారు. వచ్చేనెల ఏడో తేదీ వరకు చెక్పోస్ట్ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలో ఉన్న పోలీస్ సిబ్బంది విడతలవారీగా చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తారని తెలిపారు.ఎలక్ట్రీషియన్పై వేటుభిక్కనూరు: భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయంలో హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఎలక్ట్రీషియన్ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీధర్ బుధవారం తెలిపారు. గత నెల 22న ఆలయంలో హుండీ లెక్కిస్తుండగా సదరు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’ గతనె ల 29న వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన దేవాదాయశాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఎలక్ట్రీషియన్ను సస్పెండ్ చేయాలని ఈవోను ఆదేశించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఆర్జేసీ ఆదేశాల మేరకు ఎలక్ట్రీషియన్పై చర్యలు తీసుకున్నామన్నారు.రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్ల నిలిపివేతపెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని సొసై టీలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ జిల్లా అధికారి మహేష్ కుమార్ బుధవారం పరిశీలించారు. రెండు రోజుల్లో జొన్న కొనుగోళ్లను నిలిపి వేయను న్నట్లు తెలిపారు. ఇంకా రైతుల వద్ద జొన్న లుంటే వెంటనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, సొసైటీ చైర్మన్ హన్మంత్రెడ్డి, కార్యదర్శి సందీప్ పాల్గొన్నారు.17 నుంచి ఆర్ఎస్ఎస్ ఉద్యోగి ప్రారంభిక్ వర్గకామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్లో ఈనెల 17న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఉద్యోగి ప్రారంభిక్ వర్గ ప్రారంభంకానుందని ఆ సంస్థ జిల్లా కార్యవాహ సంతోష్రెడ్డి తెలిపారు. 17 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే శిక్షావర్గ 19న ముగుస్తుందని పేర్కొన్నారు. 20 ఏళ్లుపైబడి ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, వృత్తి పనుల్లో స్థిరపడ్డవారు పాల్గొనాలని, ఇతర వివరాలకోసం 94411 54360, 94407 68774, 99489 28740 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ఆలయానికి విరాళం అందజేత
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని పశ్చిమ హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న పోచమ్మ, మైసమ్మ ఆలయం షెడ్డు నిర్మాణానికి మాజీ కౌన్సిలర్లు నిట్టు వేణుగోపాలరావు, కృష్ణమోహన్రావు వారి తల్లి దివంగత హైమావతి జ్ఞాపకార్థంగా రూ.లక్షా 50వేల విరాళాన్ని బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు చీటి పాండురంగారావు, మంచి రవి, రాజేశ్వర్రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఆలయానికి గడ్డి వితరణ భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వర ఆలయ కోడెలకు కుషాల్రెడ్డి కుటుంబీకులు ట్రాక్టర్ గడ్డిని బుధవారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ అధ్యక్షుడు అందె మహేందర్రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
గౌతంనగర్లో పోలీసుల తనిఖీలు
60 వాహనాల స్వాధీనం ఖలీల్వాడి: నగరంలోని మూడో పోలీస్ స్టేషన్ పరిధి గౌతంనగర్లో బుధవారం రాత్రి సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు అడిషనల్ డీసీపీ బస్వా రెడ్డి సూచన మేరకు ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. 100 మంది పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి పెట్రోలింగ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, రౌడీ షీటర్లను తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు, నంబర్లు లేని దాదాపు 60 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు పోలీసులని, చట్టాన్ని గౌరవించాలన్నారు. అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలపై సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలన్నారు. కాలనీవాసులు ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం కాలనీవాసుల సూచనలు, సలహాలు స్వీకరించారు. కార్యక్రమంలో సీఐలు శ్రీనివాస్ రాజ్, రఘుపతి, సురేశ్, మల్లేశ్, భిక్షపతి, శ్రీలత, ఎస్సైలు హరిబాబు, గంగాధర్, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి
ఆర్మూర్ టౌన్: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని 63వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణానికి చెందిన కొండూరు నాగార్జున్ (21), నరేంద్ర (19) గత ఆదివారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురం గ్రామంలోని మేనత్త ఇంట్లో జరిగిన శుభకార్యానికి బైక్పై వెళ్లారు. బుధవారం ఉదయం తిరిగి వస్తుండగా చేపూర్ సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్న్ బైక్ను ఢీకొట్టింది. దీంతో నాగార్జున్ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్ర గాయాలపాలైన నరేందర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ఇరువైపులా నిలిచిన ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. కటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్ను ఢీకొన్న డీసీఎం వాహనం ఆర్మూర్లో విషాదఛాయలు ఒంటరైన తల్లి.. ఆర్మూర్ పట్టణంలోని జెండాగల్లీలో నివాసముండే కొండూరు పద్మ భర్త ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. నాగార్జున్ హైదరాబాద్లో ఏసీ మెకానిక్గా పనిచేస్తుండగా తమ్ముడు నరేంద్ర అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నాడు. వారం క్రితమే ఆర్మూర్లోని ఇంటికి వచ్చారు. అన్నదమ్ములిద్దరూ హైదరాబాద్కు బయల్దేరాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. కొడుకులు ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్నారనుకుంటుండగానే రోడ్డు ప్రమాదం ఇద్దరిని బలిగొంది. కట్టుకున్న భర్త, ఇద్దరు కుమారులు లోకం వదిలి వెళ్లడంతో తల్లి పద్మ ఒంటరిగా మిగిలింది. -
చోరీలకు పాల్పడిన మహిళ అరెస్టు
ఎల్లారెడ్డి: ఇళ్లలో చోరీలకు పాల్పడిన మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ బుధవారం తెలిపారు. ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన నీరడి మంజుల (45) ఎల్లారెడ్డి పట్టణంలో అనుమానాస్పదంగా నగలు విక్రయించేందుకు రాగా పట్టుకొని విచారించడంతో అసలు విషయం బయటపడిందన్నారు. ఏప్రిల్ 3న అనిత అనే ఇంట్లో చోరికి పాల్పడి బంగారు ముక్కుపుడక దొంగిలించిందని తెలిపారు. ఈ నెల 9న దుద్దుల దుర్గయ్య ఇంట్లో 5 తులాల వెండి, రూ.10 వేల నగదు, మంగళి కిషన్ ఇంట్లో 20 తులాల వెండి, చెవి కమ్మలు, రూ.13 వేల నగదును చోరీ చేసినట్లు పేర్కొన్నారు. తానే ఈ చోరీలకు పాల్పడినట్లు మంజుల ఒప్పుకుందని, ఆమె నుంచి ఒక జత బంగారు కమ్మలు, 20 తులాల వెండి, 5 తులాల వెండి కడియం, రూ.12 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితురాలిని పట్టుకున్న ఎస్సై మహేశ్, పీసీ ఇద్రీస్, హోంగార్డు ప్రసాద్లను ఎస్పీ అభినందించినట్లు సీఐ తెలిపారు. -
‘వెంచర్’ చేస్తే.. పక్కాగా ఉండాల్సిందే
నిజామాబాద్ సిటీ: నుడా పరిధిలో వెంచర్ వేయాలంటే నిబంధనలు తూ.చ. తప్పకుండా పాటించాల్సిందేనంటున్నారు అధికారులు. ప్రభు త్వ అనుమతులు సరిగా లేకున్నా, వివాదాస్పద స్థ లాలున్నా నిబంధనలు అతిక్రమించినా వెంచర్ల కథ కంచికేనంటున్నారు. గతంలో వెంచర్లు ఎలా చేసినా చెల్లుబాటు అయింది. కానీ, ప్రస్తుతం మాత్రం టీఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని, సరైన ధృవీకరణ పత్రాలుంటేను వెంచర్లకు అనుమతి మంజూరు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. విచ్చలవిడిగా వెలుస్తున్న వెంచర్లు.. నగర శివార్లతోపాటు నుడా పరిధిలో వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా రియల్టర్లు వెంచర్లు చేస్తున్నారు. అనుమతులు లేకుండానే ప్లాటింగ్ చేసి వాటిని దళారులతో అమ్మిస్తున్నారు. కొన్నిచోట్ల అక్రమ నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసిన అమాయకులు లబోదిబోమంటున్నారు. అమాయకులే లక్ష్యంగా రియల్టర్లు స్థానిక నాయకులతో ములాఖత్ అవుతున్నారు. వారికి కమీషన్ ఆశచూపి వారితో ప్లాట్లను విక్రయిస్తున్నారు. అనుకున్నదే తడవుగా, స్థలం ఉంటే చాలు వెంచర్లు వేస్తున్నారు. ముందస్తు అనుమతులు లేకున్నా పనులు మొదలుపెడుతున్నారు. రాత్రింబవళ్లు పనులు చేసి అధికారుల దృష్టికి వచ్చేలోపు ప్లాట్లన్నీ అమ్మేస్తున్నారు. నగర శివార్లలో అధికం.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నగర శివార్లలో ఈ అక్రమ వెంచర్లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. నాగారం, గొల్లగుట్ట, గాంధీనగర్, సారంగపూర్, శా స్త్రీనగర్, మల్కాపూర్–ఏ, ముబారక్నగర్, కేశాపూ ర్, బర్దిపూర్, బోర్గాం (పి), న్యాల్కల్, మోపాల్, సి రిపూర్, రాంనగర్, బోర్గాం (కె), ఖానాపూర్, గౌడ్స్ కాలనీ, తారకరామనగర్ శివార్లలో వెంచర్లు వెలుస్తున్నాయి. 2 నుంచి 5 ఎకరాలున్నా చాలు వెంటనే వాటిని వెంచర్లు చేసి హాట్కేకుల్లా అమ్మేస్తున్నారు. ప్రభుత్వ, ఇరిగేషన్, వక్ఫ్ భూములు.. వెంచర్లు చేస్తున్న రియల్టర్ల కన్ను ప్రభుత్వ, అసైన్డు, ఇరిగేషన్, వక్ఫ్ భూములు, స్మశానాలపై పడింది. దాంతో తమ స్థలంతో పక్కనే ఉన్న ఈ స్థలాలను సైతం కలుపుకుంటున్నారు. ఇలా నాలాలు, కుంటలు, స్మశాన వాటికలు, పబ్లిక్ పార్కుల స్థలాలనూ వదలడం లేదు. విస్తరించిన నుడా పరిధి.. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గతంలో కేవలం 72 గ్రామాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం 380 గ్రామాలకు విస్తరించింది. ఇందులో 3 మున్సిపాలిటీలు కూడా వచ్చాయి. ఈ పరిధిలో వెంచర్లు చేయాలంటే నుడా అధికారి డీసీపీ అనుమతి తప్పనిసరి. కానీ, స్థానిక నాయకుల సహకారంతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వెంచర్లు వేయడం గమనార్హం. టీఎస్బీపాస్లో దరఖాస్తు చేసుకోవాలి నుడా అనుమతి తప్పనిసరి 10 శాతం స్థలం ఖాళీగా ఉంచాలి నిబంధనలు ఇవే.. వెంచర్చేసే స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు సరిగ్గా ఉండాలి. మొత్తం వెంచర్ విస్తీర్ణంలో 10 శాతం స్థలం వదిలివేయాలి. (ఈ స్థలంలో పార్కు, ఆస్పత్రి, కిరాణాషాపు, మెడికల్ షాపు వంటి వాటి కోసం). రోడ్లు, డ్రైనేజీలు, విద్యుద్దీపాలు ఏర్పాటు చేయాలి. ఏరియా మార్కెట్ రేటు ప్రకారం ఫీజును నుడాకు లేదా మున్సిపాలిటీకి చెల్లించాలి. 15 శాతం సొమ్ము చెల్లించిన తర్వాత మొదటి డ్రాఫ్ట్ ఇస్తారు. మొదట డమ్మీ వెంచర్ ఏర్పాటు చేయాలి. రెండేళ్ల తర్వాత వెంచర్ను పక్కాగా నిబంధనల మేరకు నిర్మించాలి. సూచించిన వసతులు, సౌకర్యాలు ఏర్పాటు చేసిన తర్వాతే ఫైనల్ లేఅవుట్ను అనుమతిస్తారు. నుడా అనుమతి తీసుకోవాలి టీఎస్ బీపాస్ ద్వారా అనుమతి పొంది, సరైన ఫీజు చెల్లించాలి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టవద్దు. సరైన పత్రాలతో టౌన్ప్లానింగ్ అధికారులకు సహకరించాలి. నాన్ లేఅవుట్ వెంచర్లు చేస్తే తొలగిస్తాం. వెంచర్ పూర్తయిన తర్వాతే అమ్మకాలు చేయాలి. నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. – కేశ వేణు, నుడా చైర్మన్ అక్రమ వెంచర్లు కూల్చివేస్తాం వెంచర్ చేయాలనుకునేవారు టీఎస్ బీపాస్ ద్వారా దరఖా స్తు చేసుకోవాలి. డాక్యుమెంట్లలో లోపాలుండొద్దు. సూచించిన స్థలంలోనే వెంచర్ చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. ప్రజలు జాగ్రతగా ఉండాలి. నాన్ లే అవుట్ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దు. ఇటీవల అనుమతి లేని వెంచర్లను తొలగించాం. – శ్రీధర్రెడ్డి, డిస్ట్రిక్ట్ చీఫ్ ప్లానర్ -
ఉసురుతీసిన ఆన్లైన్ గేమ్
● రాయకూర్లో యువకుడి ఆత్మహత్య రుద్రూర్: ఆన్లైన్ గేమ్ కు అలవాటుపడ్డ యు వకుడు డబ్బులు పో వడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని రాయకూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయన్న తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయకూర్ గ్రామానికి చెందిన మాగిరి గంగాధర్ (20) కొంతకాలంగా ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. డబ్బులు లేకపోవడంతో తండ్రి ఫోన్లో నుంచి రూ. 5 వేలు తన ఫోన్కు ట్రాన్స్ఫర్ చేసుకొని గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన గంగాధర్ మంగళవారం రాత్రి పాడుబడ్డ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు ఇంటికి రాలేదని కుటుంబసభ్యులు వెతుకుతుండగా బుధవారం ఉదయం మృతదేహం కనిపించింది. మృతుడి తండ్రి పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. తండ్రి మందలించాడని..డిచ్పల్లి: పని చేయాలనీ లేదా చదువుకోవాలని తండ్రి మందలించడంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన డిచ్పల్లి మండలం మెంట్రాజ్పల్లి శివారులోని ఇటుకబట్టీ వద్ద చోటుచేసుకుంది. ఎస్సై షరీఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాకు చెందిన భరత్ మాజీ, అతని భార్య మెంట్రాజ్పల్లిలోని ఆంజనేయులుకు చెందిన ఇటుకబట్టీలో కొంతకాలంగా కూలీలుగా పనిచేస్తున్నారు. వారి కొడుకు మున్షీ మాజీ (14)ని స్థానికంగా చదువుకోవాలని లేదా పనిచేయాలని తండ్రి మంగళవారం మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన మున్షి మాజీ అర్ధరాత్రి తాము ఉంటున్న రేకుల షెడ్డులోని కర్రకు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే గమనించిన కుటుంబసభ్యులు బట్టీ యజమానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భార్య కాపురానికి రావడం లేదని.. కామారెడ్డి క్రైం: భార్య కాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీ శివారులో బుధవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన తక్కడపల్లి శ్రీకాంత్ (32) మెకానిక్గా పనిచేస్తూ బీడీ వర్కర్స్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య లత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గొడవల కారణంగా భార్య పిల్లలతో కలిసి మూడు నెలలుగా తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. దీంతో శ్రీకాంత్ మద్యానికి బానిసయ్యా డు. భార్య కాపురానికి రాకపోవడంతో జీవితంపై వి రక్తి చెందిన శ్రీకాంత్ బుధవారం జయశంకర్ కా లనీ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహ త్య చేసుకున్నాడు. మృతుడి తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కరడ్పల్లి గ్రామశివారులో పేకాటస్థావరంపై బుధ వారం దాడి చేసి రాజు, సంతోష్, నర్స య్యలను పట్టుకు న్నట్లు ఎస్సై మురళి తెలిపా రు. వారిపై కేసు నమో దు చేసి, రూ.8,700 లు, మూడు బైక్లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
కూతురు పెళ్లైన రెండు రోజులకే..
నందిపేట్(ఆర్మూర్): కూతురి పైళ్లెన రెండు రోజులకే గుండె పోటుతో తండ్రి మరణించిన ఘటన నందిపేటలో చోటు చేసుకుంది. నందిపేట మండల కేంద్రంలో గత 30ఏళ్లుగా సేవలందిస్తున్న పోస్టుమన్ గంగాధర్ (50)కు ముగ్గురు కూతుళ్లు కాగా చిన్న కూతురు పెళ్లిని ఆదివారం రోజు ఘనంగా చేశారు. మంగళవారం కూతురి అత్తగారింటికి టాటావ్యాన్లో కుటుంబంతో సహా వెళుతుండగా మార్గమధ్యలో ఒక్కసారిగా గంగాధర్కు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా, ఫలితం లేకుండా పోయింది. 30ఏళ్లుగా గ్రామీణ డాక్ సేవక్గా ప్రజలకు సేవలందిస్తూ ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిన పోస్టు గంగాధర్.. కూతురు పెళ్లి జరిగి రెండు రోజులు గడువక ముందే హఠన్మరణం చెందడంతో గ్రామస్తులంతా తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అంత్యక్రియలలో వేలాది మంది పాల్గొని కంటతడి పెట్టారు. గుండెపోటుతో తండ్రి మరణం -
ఆర్టీసీ క్యూఆర్ కోడ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి టౌన్: ఆర్టీసీ నూతనంగా అమలు చేస్తున్న క్యూఆర్ కోడ్ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో కామారెడ్డి ఆర్టీసీ డీఎం కరుణశ్రీ ఆర్టీసీ క్యూఆర్ కోడ్ కీచైన్లను జిల్లా అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే ఆర్టీసీకి సంబంధించి పూర్తి సమాచారం అరచేతిలో ఉంటుందన్నారు. ఆర్టీసీ యాప్లు, వెబ్సైట్ వివరాలు, టికెట్ బుకింగ్, బస్సుల టైంటేబుల్, ఇతర వివరాలు ఈ క్యూఆర్ కోడ్తో తెలుస్తాయన్నారు. తాజాగా క్యూఆర్ కోడ్తో ముద్రించిన ఈ కీచైన్లను ప్రయాణికులకు ఉచితంగా అందజేస్తామన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీపీఆర్వో భీమ్కుమార్, ఆర్టీవో వీణ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కామారెడ్డి క్రైం: తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తమ ఆట, పాటల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కళాకారులు అందిస్తున్న సేవలను గుర్తించి బుధవారం తన చాంబర్లో శాలువాలతో సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి కార్యక్రమాలను ప్రజలకు ఆట, పాటల ద్వారా గత నెలలో దాదాపు 15 రోజుల పాటు తెలియజేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రభు త్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి భీమ్ కుమార్, కళాకారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
ఇసుక టిప్పర్ను పట్టుకున్న అధికారులు
మద్నూర్(జుక్కల్): ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్ఐ సాయిబాబా హెచ్చరించారు. ‘సాక్షి’లో ఇటీవల ప్రచురితమైన ‘ఆగని ఇసుక అక్రమ రవాణా’ అనే కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు డోంగ్లీ ఆర్ఐ సాయిబాబా తెలిపారు. దీంతో బుధవారం తెల్లవారుజామున డోంగ్లీ మండలంలోని లింబూర్ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ను పట్టుకొని మద్నూర్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు చెప్పారు. ఆయన వెంట రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
పెళ్లిలో భోజనం చేస్తూ ఒకరి మృతి
భిక్కనూరు: పెళ్లిలో భోజనం చేస్తూ కుప్పకూలి ఒకరు మృతి చెందిన ఘటన కాచాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామానికి చెందిన గరిగంటి నరేశ్(33) స్నేహితులతో కలిసి మద్యం సేవించి కాచాపూర్ గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న వివాహానికి వెళ్లాడు. అక్కడ భోజనం చేస్తూ ఆకస్మికంగా కిందపడిపోయాడు. స్నేహితులు వెంటనే నరేశ్ను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు చోరీ
ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసంఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలంలోని జానకంపేట గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. జానకంపేట గ్రామానికి చెందిన మంగళ రవి కుటుంబం వేసవి ఉక్కపోత భరించలేక ఇంటి తలుపులు తెరిచి నిద్రించారు. దుండగుడు ఇంట్లోకి చొరబడి రవి భార్య లావణ్య మెడలో ఉన్న సుమారు రెండు తులాల పుస్తెలతాడును కత్తిరించి, పుస్తెలను అక్కడే వదిలేసి గొలుసు ఎత్తుకెళ్లాడు. అలికిడి శబ్దం విన్న లావణ్య మేల్కొని అరవడంతో దొంగ పరారయ్యాడు. ఎడపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. జగదాంబ ఆలయంలో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని యాచారం తండా పరిధిలో ఉన్న జగదాంబ దేవి, సేవాలాల్ మహరాజ్ ఆలయంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. పూజారి రమేశ్ సోమవారం ఉదయం పూజ చేసేందుకు ఆలయానికి వెళ్లగా తాళం పగిలి ఉంది. విషయాన్ని తండా పెద్ద మనుషులకు తెలపడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. 16 తులాల వెండి, 5 గ్రాముల మంగళసూత్రం, 6 మాసాల పట్టెగొలుసులు అపహరణకు గురైనట్లు పూజారి పేర్కొన్నారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.ఇందల్వాయి: ఇందల్వాయి గ్రామానికి చెందిన మిట్టపల్లి శ్రీనివాస్, చుక్కపురం శంకర్, చింతలపల్లి గోవర్ధన్ రెడ్డిలకు చెందిన 15 కేవీ, 25 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఆదివారం రాత్రి దుండగులు ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై ఏఈ పండరీనాథ్ సమక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ట్రాన్స్ఫార్మర్లను అందించాలని బాధితులు కోరగా పైఅధికారులకు నివేదిక అందించి, వారం రోజుల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు అందేలా చూస్తామని ఏఈ తెలిపారు. -
26 ఏళ్లుగా అంబలి కేంద్రం ఏర్పాటు
బాన్సువాడ : వేసవిలో బాటసారుల దప్పికను తీర్చాలనే ఉద్దేశంతో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త నాగులగామ వెంకన్న తన తండ్రి గిర్మయ్య జ్ఞాపకార్థంగా 26 ఏళ్లుగా అంబలి కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. వేసవి కాలం పూర్తయ్యే వరకు అంబలి వితరణ చేయనున్నారు. 26 ఏళ్లగా తాడ్కోల్ చౌరస్తా వద్ద అంబలి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నిత్యం చుట్టు పక్కల గ్రామాలు, మండల కేంద్రాల నుంచి జనం ఏదో ఓ పని కోసం బాన్సువాడకు వస్తారు. ప్రతి గురువారం బాన్సువాడలో సంత ఉండడంతో వందలాది గ్రామీణ ప్రాంతాల ప్రజలు వస్తారు. సంతకు వెళ్లాలంటే తాడ్కోల్ చౌరస్తా నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సంతకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు బస్సులు, ఆటోలలో వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ అంబలి తాగుతారు. ప్రతి రోజు 600 నుంచి 680 గ్లాసుల అంబలి పంపిణీ చేస్తే ప్రతి గురువారం మాత్రం 800 నుంచి 850 గ్లాసులు పంపిణీ చేస్తారు. ప్రతి రోజు 15 –20 కిలోల జోన్న పిండి ఉడకబెట్టి అంబలి చేస్తారు. సంతరోజు మాత్రం 30–35 కిలోల జోన్న పిండిని ఉడకబెట్టి అంబలి తయారు చేస్తారు. ఈ అంబలి కేంద్రం జూన్ మొదటి వారం వరకు కొనసాగుతుంది. తండ్రి జ్ఞాపకార్థంగా అంబలి వితరణ ప్రయాణికులు, ప్రజలు, వాహనదారులకు తీరుతున్న దాహందాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో.. మా నాన్న దివంగత గిర్మయ్య జ్ఞాపకార్థం బాన్సువాడలో అంబలి కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి రోజు బాన్సువాడకు వచ్చే పేద ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించాం. – నాగులగామ వెంకన్న, వ్యాపార వేత్త బాన్సువాడ -
ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 76 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరు తదితర అంశాలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. పరిష్కారాలకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై తగిన చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం.. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సన్మానించారు. పట్టణానికి చెందిన శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థిని బొడ్డుపల్లి నాగ అక్షయ 586, బి హర్షవర్ధన్ 576, ఎస్ మృణాళిని 572, సిహెచ్ జాహ్నవి 562, బి.అలేఖ్య 562, పి.రుతిక 555, బి.రామ్ చరణ్ 554, ఆర్ నిశాంత్ 554 మార్కులను సాధించారు. వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ కుమార్, ప్రతినిధులు అన్నపూర్ణ, సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 76 ఫిర్యాదులు -
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఎల్లారెడ్డి/సదాశివనగర్/తాడ్వాయి/రాజంపేట/లింగంపేట/నాగిరెడ్డిపేట : బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పలు చోట్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు సోమవారం పంపిణీ చేశారు. ఎల్లారెడ్డిలోని 8వ వార్డుకు చెందిన పాపిని లింగంకు రూ.10వేల చెక్కు మంజూరు కావడంతో కాంగ్రెస్ నాయకులు అతడి ఇంటికి వెళ్లి చెక్కును అందజేశారు.సదాశివనగర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు మంజూరైన రూ. 23లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 67మందికి అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు సంగారెడ్డి తెలిపారు. తాడ్వాయి మండలం సంగోజీవాడి, కాలోజీవాడి, ఎర్రపహాడ్, చిట్యాల గ్రామాలలో బాధితులకు మంజూరైన రూ. 4లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వెంకట్రెడ్డి తెలిపారు. రాజంపేట మండలంలోని పలు గ్రామాలలో 25 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి, మండల కమిటీ ఆధ్వర్యంలో అందించారు. లింగంపేట మండలం శెట్పల్లి గ్రామానికి చెందిన సువర్ణ సాయవ్వకు రూ. 36వేలు, బొడ్డు పోచయ్యకు రూ. 12,500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కృష్ణగౌడ్ అందజేశారు. నాగిరెడ్డిపేట మండలం బంజారతండాకు చెందిన బాధితుడు గన్యానాయక్కు మంజూరైన రూ. 60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎల్లారెడ్డి ఏఎంసీ డైరెక్టర్ నాగేశ్వర్ అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
చేపల వేటకు వెళ్లి.. పాము కాటుకు బలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు ప్రమాదవశాత్తు పాముకాటుకు గురై మృత్యువాత పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని అచ్చాయపల్లి గ్రామానికి చెందిన బెస్త అశోక్(47)ఆదివారం గ్రామశివారులోని ఊర చెరువులో చేపలు పట్టేందుకు వల వేసి, చెరువు ఒడ్డున పడుకొని ఉండగా గుర్తు తెలియని పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అశోక్ను చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం ఆస్పత్రిలో అశోక్ మృతిచెందినట్లు భార్య భారతి నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు.. బాల్కొండ: మెండోరా మండలం సావెల్ శివారులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని ఏర్గట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన కశవత్రి గంగాధర్(46) మృతి చెందాడు. ఎ స్సై యాసర్ ఆరాఫత్ తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్ సావె ల్ గ్రామంలో తన బంధువు మైసమ్మ పండుగ చేయడంతో భోజనం కోసం వచ్చాడు. రాత్రి దోంచందకు బైక్పై తిరిగి వెళుతుండగా ఎదురుగా వెల్కటూర్ నుంచి సావెల్ వైపు వేగంగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఓ ప్రైవేట్ వాహనంలో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి గంగాధర్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భార్య కశవత్రి సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఎల్లారెడ్డి మైనారిటీ యూత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గం ఎన్నిక
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మైనారిటీ యూత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగాసయ్యద్ నజీబుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు మాజీ జెడ్పీటీసీ గయాజుద్దిన్ సోమవారం తెలిపారు. ఎల్లారెడ్డిలో నూతనంగా మైనార్టీ యూత్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధ్యక్షుడిగా షోయబ్ మోహినోద్దిన్, ఫరూఖ్, ప్రధాన కార్యదర్శిగా అబ్రార్, కోశాధికారిగా అబ్దుల్ రహ్మాన్లను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గం ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేష్లను కలిసినట్లు వారు తెలిపారు. మహిళను కాపాడిన కానిస్టేబుల్నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద సోమవారం ఓ మహిళ తాను చనిపోతానంటూ పరుగెత్తడాన్ని గమనించిన స్థానిక వ్యాపారి పోలీసులకు సమాచారం అందించారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ శ్రీనివాస్ వెంటనే అప్రమత్తమై నిజాంసాగర్ ప్రధాన కాలువ వైపు పరుగెడుతున్న మహిళను పట్టుకొని నచ్చజెప్పి స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం ఆమెను కుటుంబసభ్యులకు అప్పగించారు. మహిళ ప్రాణాలను రక్షించిన కానిస్టేబుల్ శ్రీనివాస్ను ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. మహిళలే.. పారిశుధ్య కార్మికులుబాన్సువాడ రూరల్: మండలంలోని హన్మాజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కో–ఆపరేటివ్ బ్యాంక్ వద్ద మురికి నీళ్లు రోడ్డుపై నుంచి పారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే మురికి కాలువ పొంగడంతో చెత్తాచెదారం, మురికి నీరు సమీపంలోని ఇళ్ల ముందు చేరింది. శుభ్రం చేయించాల్సిన పంచాయతీ కార్యదర్శి పట్టించుకోకపోవడంతో మహిళలే పారిశుధ్య కార్మికులుగా మారి పరిసరాలు శుభ్రం చేసుకున్నారు. అధికారులు స్పందించి గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాధిత కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ పరిధి 44వ జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రణీ త కుటుంబానికి అండగా నిలవాలని ఆదిలాబా ద్ జిల్లా మాజీ మంత్రి జోగు రామన్న సూచించడంతో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కుటుంబానికి అండగా నిలిచారు. సంబంధిత ఆస్పత్రి సూపరిండెంట్, పోలీస్ అధికారులతో మాట్లాడారు. వెంటనే పోస్టుమార్టం జరిపించి బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అందించారు. దీంతో ప్రణీత కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. -
ముంబై రోడ్లపై ఇందూరువాసి
ఖలీల్వాడి: నిజామాబాద్కు చెందిన ఓ వ్యక్తి ముంబైలోని విక్ రోలీ వెస్ట్ ఫుట్పాత్పై ఉన్నట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సదరు వ్యక్తి వాటర్, టీ తీసుకుంటున్నాడని, ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతున్నాడని, అడ్రస్ అడిగితే నిజామాబాద్ అని చెబుతున్నాడని తెలిపారు. తెలిసిన వారు ఎవరైనా ఉంటే పోలీసులను సంప్రదించాలని పేర్కొన్నారు. ‘డయల్ 100’ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి జైలుబోధన్: అత్యవసర సమయాల్లో వినియోగించుకోవాల్సిన ‘డయల్ 100’ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఒకరోజు జైలు శిక్ష విధించినట్లు టౌన్ సీఐ వెంకటనారాయణ సోమవారం తెలిపారు. రాకాసీపేట ప్రాంతానికి చెందిన ఎండీ ఫారూఖ్ మద్యం మత్తులో డయల్ 100కు కాల్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేయడంతోపాటు దుర్వినియోగానికి పాల్పడినందున కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా జడ్జి శిక్ష విధించారని పేర్కొన్నారు. ‘డయల్ 100’ను దుర్వినియోగం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
దోమకొండలో ఉచిత మెగా వైద్య శిబిరం
దోమకొండ: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రయ్యగారి అనంతరెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటెరీ తాటిపల్లి శ్రీకాంత్, శివ బాలాజీ సిండికేట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలువురు ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. దాదాపు 600 మందికి ఉచితంగా పలు రకాల పరీక్షలు నిర్వహించి మందులను అందించామని ఆస్పత్రి ఇన్చార్జి ఓబుల్రెడ్డి తెలిపారు. బీపీ, షూగర్, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, దగ్గు, జ్వరం, ఆయాసం,తలనొప్పి, ఆకలి లేకపోవడం, రక్తహీనతతో పాటు ఈసీజీ పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుమలగౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు శంకర్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల కోసం లెక్చరర్ల పాట్లు
కామారెడ్డి టౌన్ : ఇంటర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్ర క్రియ నడుస్తోంది. ఈనెల ఒకటో తేదీనుంచి దర ఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షలలో 11,871 మంది ఉత్తీర్ణులయ్యా రు. వారిని ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించడం కోసం లెక్చరర్లు ఇంటింటికి వెళ్తున్నారు. ఫలితాల్లో అట్టడుగున.. ఇంటర్ ఫలితాల్లో జిల్లా వెనకబడి ఉంది. ఫస్టియర్ లో 50.09 శాతం, సెకండియర్లో 56.38 శాతం ఉ త్తీర్ణత సాధించి, రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో ని లిచింది. సరైన వసతులు లేకపోవడం, లెక్చరర్ల పో స్టులు ఖాళీగా ఉండడంతో సగం మంది వరకు ఫె యిల్ అవుతున్నారు. వరుసగా రెండేళ్లుగా ఫలితా ల్లో చిట్టచివరన ఉండడంతో ప్రభుత్వ కళాశాలలపై నమ్మకం సడలుతోంది. ఇది అడ్మిషన్లపై ప్రభావం చూపుతోంది. లెక్చరర్ల పోస్టులు 244 ఉండగా.. ఇరవైకిపైగా ఖాళీలున్నాయి. ఆసక్తి చూపని విద్యార్థులు.. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నా యి. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ ఒక్కో సెక్షన్కు 44 సీట్లున్నాయి. జిల్లాలోని అన్ని కళాశాలల్లో కలిపి ఫస్టియర్లో 2,816, సెకండియర్లో 2,816 సీట్లున్నాయి. అయితే ఇవి పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. 2023–24 విద్యాసంవత్సరంలో ఫస్టియర్లో 2,103 మంది, సెకండియర్లో 2,599 విద్యార్థులుండగా.. 2024–25 విద్యాసంవత్సరంలో ఫస్టియ ర్లో 1,993 మంది, సెకండియర్లో 2,447 మంది మాత్రమే ఉన్నారు. గతేడాది ఫస్టియర్లో 8 వందలకుపైగా సీట్లు ఖాళీగా ఉండడం గమనార్హం. అడ్మిషన్లు బాగానే వస్తున్నాయి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే లెక్చరర్లు తమ పరిధిలోని గ్రా మాలు, వార్డులకు వెళ్లి సర్వే చేస్తూ, సర్కారు కాలేజీల గురించి ప్రచారం చేస్తు న్నారు. అడ్మిషన్లు బాగానే వస్తున్నాయి. – షేక్ సలాం, ఇంటర్ నోడల్ అధికారి, కామారెడ్డిజిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వాటిలో అడ్మిషన్ల కోసం లెక్చరర్లు శ్రమిస్తున్నారు. కళాశాల పరిధిలోని గ్రామాలకు వెళ్లి పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. సర్కారు కళాశాలల్లో వసతుల గురించి వివరిస్తున్నారు. తమ కళాశాలలో చేరాలని కోరుతున్నారు. అయితే చాలా మంది సర్కారు కాలేజీలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. పేద, దిగువ మధ్య తరగతి విద్యార్థులు కొందరు మాత్రమే సర్కారు కళాశాలల వైపు చూస్తున్నారు. -
కౌలు చెల్లించక వేటకు దూరం
నిజాంసాగర్: కౌలాస్ నాలా ప్రాజెక్టులో చేపల వేటకు సంబంధించిన కౌలు ఐదేళ్లుగా చెల్లించకపోవడంతో.. చేపట వేటపై వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో మత్స్యకారులు వేటకు దూరం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుపై ఆధారపడి తొమ్మిది గ్రామాల మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు. కౌలాస్ మత్స్యసంఘం పరిధిలో కౌలాస్, సావర్గావ్, లింగంపల్లి, వజ్రకండి, సోపూర్, బాబుల్గావ్, విఠల్వాడి, చింతల్వాడి, డోన్గావ్ గ్రామాలున్నాయి. ఈ సంఘంలో 160 మత్స్యకార్మిక కుటుంబాలు సభ్యులుగా ఉన్నాయి. వీరిలో చాలామంది చేపల వేటపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా ప్రాజెక్టులో చేపల పెంపకానికి సంబంధించి ఏటా రూ. 72,600 వేల చొప్పున మత్స్యకార్మికులు ప్రభుత్వానికి కౌలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చేపలు పెంచి, ఉపాధి పొందుతున్న కార్మికులు ఐదేళ్లుగా వివిధ కారణాలతో కౌలు చెల్లించడం లేదు. చేపల వ్యాపారంలో దళారుల పాత్ర పెరగడం, మత్స్యకారులకు కూలి గిట్టుబాటు కాకపోవడం, పలువురు మత్స్యకారులు వేరే పనుల నిమిత్తం వలస వెళ్లడం, ఉన్నవారిలోనూ ఐక్యత లేకపోవడం తదితర కారణాలతో కౌలు చెల్లించడానికి ఐదేళ్లుగా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఐదేళ్లకు సంబంధించి బకాయిలు రూ. 3.63 లక్షలకు చేరా యి. ఈ బకాయిలను చెల్లించాలని మత్స్యకార్మిక సొసైటీ సభ్యులకు మత్స్యశాఖ అధికారులు గతేడాది జూన్లో నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ బకాయిలు చెల్లించడానికి సొసైటీ సభ్యులు ముందుకు రాలేదు. ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కౌలాస్ మత్స్య సొసైటీ పరిధిలోని మత్స్యకారులు కౌలాస్ నాలాలో చేపలు వేటాడరాదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా చేపల వేట కోసం వేలం నిర్వహించాలని మత్స్యశాఖ అధికారులకు సూచించారు. దీంతో ఇన్నాళ్లూ ప్రాజెక్టును నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారులు ఉపాధికి దూరం కానున్నారు. కౌలాస్ ప్రాజెక్టులో వేటపై ఆంక్షలు విధించిన అధికారులు ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు రేపు వేలం నిర్వహణకు ఏర్పాట్లువేలంలో దక్కించుకున్నవారికే వేటకు అవకాశం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలతో బుధవారం కౌలాస్ నాలాలో చేపల వేటపై వే లం పాట నిర్వహించాలని నిర్ణయించాం. అచ్చంపేట మత్స్యశాఖ కార్యాలయంలో వేలం ఉంటుంది. ఐదేళ్ల కౌలు బకాయి డబ్బులకు అదనంగా వేలం పాట పాడిన వారికి చేపల వేటను అప్పగిస్తాం. కౌలాస్ మత్స్య సొసైటీ సభ్యులు కౌలు చెల్లించనందున చేపలు పట్టరాదు. పాత సొసైటీ పరిధిలోని గ్రామాల మత్స్యకార్మికులు చేపలు పడితే కేసులు నమోదు చేస్తాం. – డోలిసింగ్, ఎఫ్డీవో, నిజాంసాగర్ -
సీసీ కెమెరాల ప్రాధాన్యతను గుర్తించాలి
కుస్తీపోటీల్లో తలపడుతున్న మల్లయోధులుకామారెడ్డి క్రైం: ప్రతిఒక్కరు సీసీ కెమెరాల ప్రాధా న్యతను గుర్తించాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో ఏర్పాటు చేసిన 30 సీసీ కెమెరాలను ఆమె సోమవారం ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీలో ఉన్న వారందరూ దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ప్రజలే అయినప్పటికీ కలసికట్టుగా ముందుకు వచ్చి రూ. 2 లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పా టు చేసుకోవడం అభినందనీయమన్నారు. పోలీసు లకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా కాలనీల ప్రజలు సైతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకో వాలన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై శ్రీరామ్, సిబ్బంది కమలాకర్రెడ్డి, విశ్వ నాథ్, అజర్, సంపత్, నర్సారెడ్డి, కాలనీవాసులు రా జు, ముజాహిద్, షాదుల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే పెళ్లి పత్రికకు షష్టి పూర్తి
బాన్సువాడ రూరల్(నిజామాబాద్): రాష్ట్ర ప్రభుత్వ వ్యవసా య సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి వైవాహిక జీవితంలోకి అడుగిడి అరవై ఏళ్లవుతోంది. 1965 మే 12న బాన్సువాడ మండలంలోని ఇబ్రాహీంపేట్కు చెందిన పుష్పవతితో ఆయన వివాహం జరిగింది. కాగా వీరి పెళ్లి పత్రికను పోచారం శ్రీనివాస్రెడ్డి బావమరిది ఇబ్రాహీంపేట్ మాజీ సర్పంచ్ మాలెపు నారాయణరెడ్డి ఫ్రేం కట్టించి భద్రపరచుకున్నారు. 30 కిలోల మీనండొంకేశ్వర్(ఆర్మూర్) : ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ఓ మత్స్యకారుడి వలకు బొచ్చ రకానికి చెందిన 30 కిలోల భారీ చేప చిక్కింది. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఆదివారం గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. భరత్ అనే మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. దీనిని వ్యాపారులకు విక్రయించాడు. ప్రతి వేసవిలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గి 20 నుంచి 30 కిలోల పైబడిన చేపలు మత్స్యకారులకు చిక్కుతున్నాయి. -
ఎప్సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థుల సత్తా
నిజామాబాద్అర్బన్: ఎప్సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఫలితాలు విడుదల కాగా, పలువురు విద్యార్థులు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారు. నగరంలోని నారాయణ జూనియర్ కళాశాలకు చెందిన హర్షిత్కు అగ్రికల్చర్ విభాగంలో 1314 ర్యాంకు, నిహాల్కు 2553 ర్యాంకు వచ్చింది. పదివేల లోపు పదిర్యాంకులు, 20వేలలో పు 26 ర్యాంకులను తమ విద్యార్థులు సాధించినట్లు ఏజీఎం లక్ష్మారెడ్డి అన్నారు. కాకతీయ కళాశాలలో.. జిల్లా కేంద్రంలోని కాకతీయ జూనియర్ కళాశాల విద్యార్థులు అనస్అలీ 1766 ర్యాంకు(అగ్రికల్చర్), ఎం.సంకీర్త్ 2398 , జి.వేదస్కర్ 2881, భవ్యశ్రీ 3310, ఎం.లోకేశ్ 3671, ఏ.వైష్ణవి 4172, రిషిక్ 5932, వి.నికేతన్ 6293 ర్యాంకులు సాధించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ రామోజీరావు సన్మానించారు. కళాశాల డైరెక్టర్ తేజస్విని, ప్రిన్సిపల్ సందీప్, రణదీప్, శ్యామ్ పాల్గొన్నారు. ఎస్ఆర్ కళాశాలలో.. నగరంలోని ఎస్ఆర్ కళాశాల విద్యార్థులు కార్తీక్ 572 ర్యాంకు, విష్ణువర్ధన్ 689 ర్యాంకు (అగ్రికల్చర్), అతీఫ్అఫ్నాన్ 1305 (అగ్రికల్చర్), నవదుర్గ 1484 (ఇంజనీరింగ్), శ్రీకాంత్ 1611(అగ్రికల్చర్), తేజస్విని 1914(అగ్రికల్చర్), జి.సిరి 2117(అగ్రికల్చర్), రాజశ్రీ 2175 ర్యాంకు (అగ్రికల్చర్) సాధించారు. విద్యార్థులను కళాశాల ఏజీఎం గోవర్ధన్రెడ్డి సన్మానించారు. వెక్టార్ జూనియర్ కళాశాలలో.. నగరంలోని వెక్టార్ జూనియర్ కళాశాల విద్యార్థులు శ్రీవర్షిణి 1316 ర్యాంకు, మామిడి నిశాంత్రెడ్డి 1737, చంద్రవన్రెడ్డి 2532, వినాయక్ జోషి 2660, ఆర్గుల్ వెన్నెల 3554 ర్యాంకు సాధించారు. విద్యార్థులను కళాశాల చైర్మన్ మధుసూదన్జోషి అభినందించారు. క్షతియ జూనియర్ కళాశాలలో.. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు వివేక్రెడ్డి 1,813 ర్యాంకు (ఇంజినీరింగ్), హరివర్థిని 3,724 ర్యాంకు (అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ) సాధించినట్లు ప్రిన్సిపల్ నాగేశ్వర్ రావు తెలిపారు. పెన్షన్ ఉద్యోగుల ప్రాథమిక హక్కునిజామాబాద్ నాగారం: పెన్షన్ ప్ర భుత్వ భిక్ష కాదని, ఉద్యోగుల ప్రాథమిక హక్కు అని, దానిని కాలరాసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్ర యత్నిస్తున్నాయని ఇన్సూరెన్స్ ఉ ద్యోగుల జాతీయ నాయకుడు జీ తిరుపతయ్య అన్నారు. ఎంప్లాయీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్ భవన్లో ఆదివారం నిర్వహించిన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. ఈపీఎస్, న్యూ పెన్షన్ స్కీం, యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, కొత్త పెన్షనర్లు, పాత పెన్షనర్లంటూ వర్గీకరించి పెన్షన్ను ఎగవేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగ, కార్మికులు పోరాటం చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ నెల 20న సమ్మెకు పూనుకున్నట్లు తెలిపారు. జేఏసీ జిల్లా చైర్మన్ నాశెట్టి సుమన్, స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ రామ్మోహన్రావు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు వెంకటేశ్ , ఈవిల్ నారాయణ, నేతి శేఖర్, శ్రీనివాసరావు, విజయానందరావు, ఎల్ శ్రీధర్, మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదం కాదు.. హత్యే..
మాక్లూర్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి భర్తను ప్రియుడితో కలిసి భార్య హతమార్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొదట దాబా పైనుంచి పడి చనిపోయాడని నమ్మించి అంత్యక్రియలు పూర్తిచేయగా, కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టగా హత్య విషయం తెలిసింది. కేసు వివరాలను ఆదివారం నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్ మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ వెల్లడించారు. మాక్లూర్ మండలం కల్లెడి తండాలో ఈ నెల 5న రాత్రి గూగులోత్ శంకర్ దాబా పైనుంచి పడి మృతి చెందాడని భార్య యమున నమ్మించింది. మరుసటి రోజు అంత్యక్రియలు సైతం పూర్తిచేశారు. ఈ విషయమై మృతుడి కుమారుడు గూగులోత్ రమేష్ తండ్రి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఈనెల 10 మాక్లూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రాజశేఖర్ వెంటనే విచారణ ప్రారంభించి యమునను అదుపులోకి తీసుకుని విచారించగా, హత్య చేసినట్లు నేరం ఒప్పుకున్నారు. 5వ తేదీ రాత్రి తన ప్రియుడు నందుతో కలిసి భర్త శంకర్ను దాబా పైనుంచి తోసివేసింది. అనంతరం కర్రతో కొట్టి గొంతు నులిమి హత్య చేశారు. దీంతో భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య దాబా పైనుంచి పడి చనిపోయాడని నమ్మించిన వైనం కుమారుడి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): అడ్లూర్ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలోగల 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠం గ్రామానికి చెందిన అముల్ నేవీలో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సెలవులు రద్దు కావడంతో భార్య బోయర్ ప్రణీత(19)తో కలిసి ఆదివారం సాయంత్రం కారులో విశాఖపట్నం బయలుదేరా డు. అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులో వీరి వాహనం అ దుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రణీతకు తీవ్ర గా యాలు కాగా అముల్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రణీత మృతి చెందింది. అముల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. -
ఇరువర్గాల ఘర్షణ: పలువురికి గాయాలు
● సమాచారం ఇచ్చినా స్పందించని పోలీసులు వర్ని: మండల కేంద్రంలో ఆది వారం సాయంత్రం జరిగిన ఇ రు వర్గాల మధ్య ఘర్షణలో ప లువురికి గాయాలయ్యాయి. ఘర్షణపై పోలీసులకు సమాచా రం ఇచ్చిన స్పందించలేదని స్థానికులు తెలిపారు. వివరాలు ఇలా.. వర్నిలో ఆదివారం సాయంత్రం రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈఘటనపై ఇరువురి వాహనదారుల మధ్య మాటామాట పెరిగి చివరకి అంతాపూర్, తగిలేపల్లి గ్రామస్తుల మధ్య ఘర్షణగా మారింది.సుమారు గంటన్నరపాటు ఇరువర్గాలు తోపులాట, తిట్టుకోవడం, కొట్టుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. సుమారు గంటన్నర నుంచి పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసిన స్పందించలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు నిఘా వేయగా ట్రాక్టర్ పట్టుబడింది. ఈ ట్రాక్టర్ను కోటగిరి పోలీస్స్టేషన్ తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ బాన్సువాడ రూరల్: మండలంలోని ఇబ్రాహింపేట్ గ్రామానికి చెందిన బండిసాయిలు అనే రై తు పొలంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి కాయిల్ చోరీచేశారు. సుమారు రూ.40వేల నష్టం వాటిల్లిన ట్లు ట్రాన్స్కో రూరల్ ఏఈ కిరణ్కుమార్ తెలిపారు. ప్రస్తుతం వరికోతలు పూర్తికావడంతో రైతులు పొలాలవైపు వెళ్లకపోవడంతో దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయని ట్రాన్స్కో అధికారులు పేర్కొంటున్నారు. 29 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత నవీపేట: నిజామాబాద్ నుంచి ధర్మాబాద్ వైపు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై వినయ్ ఆదివారం తెలిపారు. టాటాఏస్ వాహనంలో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు రావడంతో నవీపేట శివారులో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డీటీ మహేష్కుమార్కు అప్పగించామన్నారు. నిజామాబాద్లోని మాలపల్లికి చెందిన వాహన యజమాని షేక్ ఖయ్యూమ్, డ్రైవర్ సొఫియాన్లపై కేసు నమోదు చేశామన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చింరాజ్పల్లి గ్రామ శివారులోగల తోట గణేష్ అనే వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం సుమారు 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమయింది. వడదెబ్బ తగిలి సుమారు రెండు మూడు రోజుల క్రితమే అతడు మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మృతుడి ఒంటిపై బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్, కాఫీ కలర్ టీషర్టు ఉన్నదని, సంబంధీకులు ఎవరైన ఉంటే పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. -
మోడల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి): ఇంటర్మీడియట్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనుకునే బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మోడల్ కళాశాలలు వరంగా మారాయి. 2025– 2026 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్లో ప్రవేశాల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. ప్రతి గ్రూపులో 40 మంది విద్యార్థులు.... జిల్లాలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, సదాశివనగర్, బాన్సువాడ,మద్నూర్లలో మోడల్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులలో మొదటి సంవత్సరంలో అడ్మిషన్లకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రతి గ్రూపులో 40 మంది విద్యార్థుల చొప్పున ఒక్కో కళాశాలలో 160 మంది విద్యార్థులకు అవకాశం లభించనున్నది. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభం మోడల్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు 2024–2025 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఆన్లైన్లో ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు చేసిన అనంతరం సాఫ్ట్ కాపీని ఆయా కళాశాలలో అందించాలి. ఇంటర్మీడియట్ మెరిట్ జాబితాను ఈనెల 26న ప్రకటించడం జరుగుతుంది. ఈనెల 27 నుంచి 31 వరకు కళాశాలలో ఎంపికై న విద్యార్థుల ఒరిజినల్ ధృవపత్రాల పరిశీలన చేయడం జరుగుతుంది. అనంతరం ఎంపికై న విద్యార్థులకు అడ్మిషన్ చేసుకుంటారు. జూన్ 1 నుంచి కళాశాలలు ప్రారంభం కానున్నాయి. మోడల్ కళాశాలలో ఎంపికై న విద్యార్థులకు ఇంటర్మీడీయట్ బోధన ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకునే ఆసక్తి గల విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న మంచి అవకాశం.ఆన్లైన్లో దరఖాస్తులు 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో ఇంటర్మీయట్లో చదువుకునేందుకు ఈనెల 20 లోగా దరఖాస్తులు చేసుకోవాలి. మెరిట్ ప్రకారం సీట్లను కేటాయించడం జరుగుతుంది. – తోటగాంధీ, ప్రిన్సిపాల్, మోడల్ కళాశాల, ఎల్లారెడ్డిబాలికలకు ఉచిత వసతిమోడల్ కళాశాలలో ఇంటర్మీడియల్లో చదివే విద్యార్థినులకు ప్రభుత్వం హాస్టల్ వసతిని కల్పిస్తుంది. కళాశాలకు 5 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చే విద్యార్థినులకు ఇబ్బంది కలుగకుండా 100 మంది విద్యార్థినులకు ఉచితంగా హాస్టల్ సౌకర్యాన్ని అందిస్తోంది.విద్యార్థులకు రిజర్వేషన్ల వారీగా సీట్ల కేటాయింపుకేటగిరి సీట్లశాతం సీట్లు బాలురు బాలికలు జనరల్ 50 20 13 07 ఎస్సీ 15 06 04 02 ఎస్టీ 06 02 01 01 బీసీ ఏ 07 03 02 01 బీసీ బీ 10 04 03 01 బీసీ సీ 01 00 00 00 బీసీ డీ 07 03 02 01 బీసీ ఈ 04 02 02 00 దివ్యాంగులకు 3శాతం ఈనెల 20 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులకు అవకాశం ఇంగ్లిష్ మీడియంలో బోధన జిల్లాలో 6 మోడల్ కళాశాలలు -
ఆగని ఇసుక అక్రమ రవాణా
మద్నూర్(జుక్కల్): అధికారులు, పోలీసులు అనుమతులు లేని ఇసుక వాహనాలను పట్టుకుంటున్న అక్రమార్కులు మాత్రం రాత్రి వేళల్లో తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. మద్నూర్ ఉమ్మడి మండలంలోని కుర్లా, సిర్పూర్ ప్రాంతాల్లోని మంజీర వాగులోంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయాల్లో టిప్పర్, ట్రాక్టర్లలో ఓవర్ లోడ్తో ఇసుకను నింపి తరలిస్తుండడంతో రోడ్లు ధ్వంసమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు అక్రమ ఇసుక టిప్పర్, ట్రాక్టర్లను పట్టుకోని కేసులు నమోదు చేస్తున్న అక్రమార్కులు మాత్రం వెనక్కితగ్గడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మంజీర నది నుంచి ఇసుకను లోడ్ చేసి మద్నూర్ మండలంలోని పెద్ద తడ్గూర్, పెద్ద ఎక్లార మీదుగా కర్ణాటక, మహారాష్ట్రలకు తరలిస్తున్నారు. మంజీరాలో ఇసుకను తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అంతరించే పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇసుక తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టిప్పర్లతో పక్క రాష్ట్రాలకు తరలింపు మద్నూర్ ఉమ్మడి మండలంలోని మంజీర వాగులో ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులుకఠిన చర్యలు తప్పవు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత వాహనాలను పట్టుకోని మైన్స్ అధికారులకు అప్పగిస్తున్నాం. అలాగే అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలపై కేసులు సైతం నమోదు చేస్తున్నాం. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేశాం. – విజయ్ కొండ, ఎస్సై, మద్నూర్ -
దశాబ్దాల తర్వాత కలిసిన బాల్య మిత్రులు
సాక్షి నెట్వర్క్: చిన్ననాటి మిత్రులందరూ దశాబ్దాల తర్వాత మళ్లీ ఒక్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లాలో పలుచోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికిలోనైన స్నేహితులు -
బిచ్కుందలో జర్నలిస్టుల నిరసన
● ఏపీలో కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని.. ● అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేతబిచ్కుంద(జుక్కల్): ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తుందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రిక ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకు ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి ఇంటిపై పొలీసులతో సోదాలు చేయించి వేధింపులకు గురిచేయడం బాధకరమన్నారు. ఈవిషయంలో ఏపీ పొలీసుల తీరును నిరసిస్తూ ఆదివారం బి చ్కుందలో వర్కింగ్ జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడు తూ కూటమి ప్రభుత్వానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ కళ్లు తెరపించాలని కోరుతూ ఆయన విగ్రహానికి వినతి పత్రం అందించామన్నారు. కార్య క్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా సహాయక కార్య దర్శి జీ. వీరయ్య, జర్నలిస్టులు శంకర్ పటేల్, సంజీవ్, డీ శ్రీనివాస్, నాగరాజ్, విజయ్కుమార్, లక్ష్మణ్, బీ.విఠల్, సుభాష్ జాదవ్, ప్రవీణ్, మోహపిన్, సుభాష్, అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు.అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి లింగంపేట(ఎల్లారెడ్డి): కూలీ పనులు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన అంతోటి ఉపేంద్ర(47) భవన నిర్మాణ పనులు చేయడానికి కొన్ని రోజుల క్రితం లింగంపేట మండల కేంద్రానికి వచ్చాడు. వెంకటేశ్వర్రావు మేసీ్త్ర వద్ద అతడు కూలీ పనులు చేస్తుండేవాడు. ఆదివారం ఉదయం అతడు అనుమానాస్పదస్థితిలో మృతిచెంది ఉన్నాడు. మేసీ్త్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రఘునాథపాలెంలోని మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు నిజామాబాద్రూరల్: మండలంలోని తిర్మన్పల్లి గ్రామంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు అయినట్లు రూ రల్ ఎస్హెచ్వో మహ్మద్ఆరీఫ్ తెలిపారు. వివ రాలు ఇలా.. తిర్మన్పల్లి గ్రామంలో బోనాలపండుగ నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామంలో ఉ న్న ఎస్టీలకు ఇతర ప్రజలకు మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తి ర్మన్పల్లి గ్రామస్తుల ఎస్సీ, ఎస్టీ వర్గాల ఫిర్యా దు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. -
ఇనుప కూలర్లతో జర భద్రం
నాగిరెడ్డిపేట: ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు ఉక్కపోతను భరించలేకపోతున్నారు. ఈ క్రమంలో కూలర్ల వాడకం పెరిగిపోయింది. పేద, మధ్యతరగతి కుటుంబాలు కూలర్లను విరివిగా వినియోగిస్తున్నారు. అయితే ఎక్కువగా ఇనుప కూలర్లను వాడుతున్నారు. తక్కువ ధరకే లభిస్తుండడంతో ఎక్కువగా వీటినే కొనుగోలు చేస్తున్నారు. వీటితో మరో ప్రయోజనం ఏమిటంటే బ్రాండెడ్ కూలర్లకన్నా ఇవి ఎక్కువ గాలిని ఇస్తాయి. దీంతోపాటు ఇళ్లలోని కిటికీల వద్ద అమర్చుకోవడానికి ప్లాస్టిక్ కూలర్ల కంటే ఇనుప కూలర్లే అనుకూలంగా ఉంటాయి. దీంతో ఎక్కువమంది ఇనుప కూలర్ల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. అయితే వీటిని వాడడం ప్రారంభించిన కొంతకాలానికే తుప్పుపడుతుంటాయి. దీంతోపాటు కూలర్లోని విద్యుత్వైర్లు దెబ్బతిని కూలర్ బాడీకి విద్యుత్ సరఫరా అయ్యే ప్రమాదం ఉంటుంది. దీనిని గమనిం చక చాలామంది కూలర్లను అలాగే వినియోగించి విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారులు ఇనుప కూలర్లను తాకి విద్యుదాఘాతానికి గురై మరణించారు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది సైతం ఒకరు మృత్యువాతపడ్డారు. రెండు రోజుల క్రితం జుక్కల్ మండలం గుల్లతండాలో తల్లీకూతుళ్లు ఇనుప కూలర్తో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.గుల్ల తండాలో తల్లీ కూతుళ్ల మరణానికి కారణమైన ఇనుప కూలర్జాగ్రత్తలు పాటిస్తే మేలు..ఇనుప కూలర్లను వినియోగించేవారు కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే విద్యుత్ ప్రమాదాల బారినపడకుండా ఉండవచ్చు. ఇను ప కూలర్లను కొన్నవారు ఒక ఏడాదిపాటు వినియోగించాకా వాటిలోపలి భాగానికి కొత్తగా రంగు వేసుకోవాలి. దీంతోపాటు అందులోని విద్యుత్తీగలు సరిగ్గా ఉన్నా యో లేదో సరిచేసుకోవాలి. కూలర్ ఆన్ చే సినప్పుడు కూలర్బాడీకి విద్యుత్ సరఫరా అవుతుందేమోనని చెక్ చేసుకోవాలి. వి ద్యుత్ సరఫరా అవుతున్నప్పుడు కూలర్ల సమీపానికి వెళ్లకపోవడం ఉత్తమం. -
జవాన్ కుటుంబానికి అండగా ఉంటాం
మాచారెడ్డి : మావోయిస్టుల మందుపాతర కు బలైన గ్రేహౌండ్స్ జవాన్ వడ్ల శ్రీధర్ కు టుంబానికి అండగా ఉంటామని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నా రు. ఆదివారం పాల్వంచలో శ్రీధర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రభు త్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఆ యన వెంట బీజేపీ నేతలు తోట బాల్రాజు, వెంకటరెడ్డి, అనిల్, సురేశ్ ఉన్నారు.గిరిజన గురుకులాల్లో ఇంటర్ అడ్మిషన్లుఇందల్వాయి : రీజియన్ పరిధిలోని మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని గిరిజ న సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ రీజినల్ కోఆర్డినేటర్ గంగారాం నాయక్ తెలిపారు. మెదక్, చేగుంట, నర్సాపూర్, కోనాపూర్, ఎల్లారెడ్డి, హన్మాజీపేట, ఇందల్వాయి బాలికల జూనియర్ కళాశాల లో ఎంపీసీ, బైపీసీ సీట్లు, నర్సాపూర్లో సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కౌడిపల్లి, నాగిరెడ్డిపేట, చీమన్పల్లి బాలుర జూనియర్ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ సీట్లు, బాన్సువాడలో సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. మొదట గిరిజన సంక్షేమ గురుకులాల్లో చదివిన విద్యార్థులతో సీట్లు భర్తీ చేశామని, మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 15న కామారెడ్డిలో బాలురకు, 16న చేగుంటలో బాలికలకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.30 కిలోల మీనండొంకేశ్వర్ : ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ఓ మత్స్యకారుడి వలకు బొచ్చ రకానికి చెందిన 30 కిలోల భారీ చేప చిక్కింది. డొంకేశ్వర్ మండలం చిన్నయానం గ్రామానికి చెందిన కొంతమంది మత్స్యకారులు ఆదివారం గోదావరిలో చేపల వేటకు వెళ్లారు. భరత్ అనే మత్స్యకారుడికి భారీ చేప చిక్కింది. దీనిని వ్యాపారులకు విక్రయించాడు. ప్రతి వేసవిలో ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తగ్గి 20 నుంచి 30 కిలోల పైబడిన చేపలు మత్స్యకారులకు చిక్కుతున్నాయి. -
ఎప్సెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఎప్సెట్(ఈఏపీసీఈటీ) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాకేంద్రంలోని సాందీపని జూనియర్ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో గోలివడ్డ నవదీప్ 3,433వ ర్యాంకు, సర్వత్ ఫాతిమా 3,850, సాయి రిశ్వితరెడ్డి 4,265, భాగ్యలక్ష్మి 6,001, మన్సీరా మలిహా 6,399, బిలాల్ 9,177, రిత్విక్ 9,965 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో సీహెచ్ శివకార్తీక్ 6,979వ ర్యాంకు సాధించాడు. మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను కళాశాల ప్రతినిధులు బాలాజీరావు, సాయిబాబా, రాజశేఖర్, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. బాన్సువాడ విద్యార్థులు.. బాన్సువాడ : ప్రభుత్వం అదివారం ప్రకటించిన ఎప్సెట్ ఫలితాల్లో బాన్సువాడ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పట్టణానికి చెందిన అర్షపల్లి శ్రీశౌర్యకు 905 వ ర్యాంకు, మామిళ్ల అక్షయకు 1,855వ ర్యాంకు, ర్యాల తేజస్వినికి 3,419వ ర్యాంకు వచ్చాయి. తమ పిల్లలు మంచి ఫలితాలు సాధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ఎక్కడి నిల్వలు అక్కడే
పెద్దకొడప్గల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతన్న ఆపసోపాలు పడుతున్నాడు. నూర్పిళ్ల అనంతరం జొన్నలను కొనుగోలు కేంద్రాలకు తరలించగా సమయానికి కాంటా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మరోవైపు లారీల కొరతతో కాంటా అయిన బస్తాల తరలింపులో జాప్యం ఏర్పడుతుండడంతో అకాల వర్షాలు కురిస్తే ఎక్కడ ధాన్యం తడిసిపోతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన కాంటాలు.. పెద్దకొడప్గల్ మండలంలోని వ్యవసాయ సహకార సంఘంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రానికి ఐదు రోజుల నుంచి లారీలు రాకపోవడంతో కాంటాలు నిలిచాయి. ఇప్పటికే వేల బస్తాలు కాంటా పూర్తయి తరలించడానికి సిద్ధంగా ఉన్నాయి. వాటిని తరలించకపోవడంతో రైతులు రాత్రింబవళ్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. వర్షం వచ్చినప్పుడల్లా జొన్నలపై టార్పాలిన్లు కప్పుతూ కాపాడుకుంటున్నారు. కాగా ఆయా గ్రామాల రైతులు వడ్ల తరలింపునకు లారీల యజమానులకు ఎక్కువ డబ్బులు ఇస్తుండడంతో వారికే లారీలను కేటాయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి లారీలను తెప్పించి బస్తాలను త్వరగా తరలించాలని రైతులు కోరుతున్నారు. లారీల కొరతతో ఇబ్బందులు రైతుల్లో అకాల వర్షాల భయం రాత్రింబవళ్లు జొన్న కుప్పల వద్దే పడిగాపులు పట్టించుకోని అధికారులు డబ్బులిస్తేనే లారీలు.. జొన్నలు తూకం వేసి పది రోజులవుతోంది. లారీలు రాకపోవడంతో ఇక్కడే ఉ న్నాయి. ఇతర గ్రామాల రై తులు లారీల యజమానుల కు బస్తాకు రూ. 30 నుంచి రూ.40 ల చొప్పున ఇస్తుండడంతో అక్కడికే వెళుతున్నాయి. – బస్సి కిషన్, రైతు, పెద్దకొడప్గల్ ఇబ్బందుల్లేకుండా చూస్తాం.. వరి, జొన్నలు ఒకేసారి రావడంతో బస్తాల తరలింపులో ఆలస్యమవుతోంది. వరి కొనుగోళ్లు పూర్త య్యాయి. జొన్నల కొనుగోలు మిగిలింది. బస్తాలు తరలించేందుకు లారీలు వస్తున్నాయి. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. మా సొసైటీ పరిధిలో 58,072 క్వింటాళ్లు కొనుగో లు చేశాం. మరో 25వేల క్వింటాళ్ల జొన్నలు వచ్చే అవకాశం ఉంది. – సందీప్, కార్యదర్శి, పెద్దకొడప్గల్ పీఏసీఎస్16 రోజులైనా కొనుగోలు చేయలే కొనుగోలు కేంద్రానికి జొన్నలు తెచ్చి 16 రోజులు దాటినా ఇంత వరకు కొనుగోలు చేయలేదు. రాశుల వద్దే పడిగాపులు కాస్తున్నాం. వర్షం వచ్చినప్పుడల్లా పట్టాలు కప్పలేక ఇబ్బందిపడుతున్నాం. –గోండ శంకర్, రైతు, పెద్దకొడప్గల్ -
కలెక్టర్ చెప్పినా కరుణించరా?
బాల్కొండ: రహదారిపై కిలోమీటర్ల మేర ఉన్న ధాన్యం బస్తాలను రెండ్రోజుల్లో తరలించాలని సాక్షాత్తు జిల్లా పాలనాధికారి ఆదేశించినా అధికారుల్లో చలనం లేదు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్ గ్రామశివారులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రెండు రోజుల క్రితం కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు పరిశీలించారు. జాతీయ రహదారి 44 నల్లూర్ చౌరస్తా నుంచి పెద్ద వాగు వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర రోడ్డుపై ధాన్యం బస్తాలు, వడ్ల కుప్పలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారణాలు చెప్పకుండా రెండ్రోజుల్లో బస్తాలను తరలించాలని అధికారులను ఆదేశించారు. కానీ, పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా ఉంది. తూకం వేసి నెల రోజులు దాటుతున్నా ధాన్యం బస్తాలు తరలించక పోవడంతో రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. స్వయంగా కలెక్టరే పరిస్థితిని గమనించి అధికారులను ఆదేఽశించినా ప్రయోజనం లేకపోవడంతో నిట్టూరుస్తున్నారు. మరోవైపు నెలల తరబడి ధాన్యం తూకం వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిత్యం గాలివాన కురుస్తుండడంతో ధాన్యం కుప్పలపై ముళ్లకంపలు వేస్తున్నారు. అధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేసి, ధాన్యం బస్తాలను తరలించాలని వేడుకుంటున్నారు. పెద్దవాగు రోడ్డుపై ధాన్యం బస్తాలు రెండు రోజుల్లో తరలించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ ఇప్పటికీ కదలని ధాన్యం బస్తాలు నెల రోజులవుతోంది.. పెద్దవాగు రోడ్డుపై ధాన్యం ఆరబెట్టి కుప్పలు చేసి నెల రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు బస్తాలు నింపి కాంటా వేయలేదు. ధాన్యం నింపిన బస్తాలను మిల్లుకు తరలించలేదు. కలెక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదు. – గంగారెడ్డి, రైతు, నాగంపేట్ -
ఇటుక బట్టిని తొలగించాలని ఫిర్యాదు
బాన్సువాడ రూరల్: మండలంలోని సోమేశ్వర్ శివారులో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఓ ఇటుకబట్టీని తొలగించాలని కోరుతూ శనివారం సోమేశ్వర్ గ్రామస్తులు బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటుకబట్టీలతో తమ గ్రామంలోకి ప్రతిరోజు పొగ, దుమ్ముధూళి చేరుతుండటంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇటుకబట్టీ ద్వారా వెలువడే పొగ, డస్టు వల్ల చుట్టూపక్కల పొలాలకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు. తాడ్వాయిలో వాహనాల తనిఖీ తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో శనివారం పోలీసుల వాహనాలను తనిఖీ చేపట్టా రు.వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ ప త్రాలలేనివారితో పాటు,హెల్మెట్ ధరించని ప లువురికి జరిమానా విధించారు. పోలీసు సిబ్బంది,హోంగార్డులు పాల్గొన్నారు. అప్రమత్తంగా ఉండాలి ● డీఎస్పీ విఠల్ రెడ్డి నస్రుల్లాబాద్(బాన్సువాడ): పోలీసులు విధు ల్లో అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ డీఎ స్పీ విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డయల్ 100కు ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. సైబర్ క్రైంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట పీఎస్సై అరుణ్ కుమార్, సిబ్బంది శ్రీనివాస్, రాము, సరిత తదితరులు ఉన్నారు. చోరీల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలి మాచారెడ్డి : చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో మాచారెడ్డి, పాల్వంచ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాచారెడ్డి ఎస్సై అనిల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.బయట నిద్రించవద్దని, అనుమానితు లు కనబడితే పోలీసులకు సమాచారం ఇ వ్వా లని కోరారు. ఊరికి వెళ్లేటపుడు విలువైన వస్తు వులు, ఆభరణాలు, డబ్బులు ఇంట్లో ఉంచవద్ద ని సూచించారు.జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
నాలుగేళ్లుగా కొనసా..గుతూనే
బాన్సువాడ : బీర్కూర్ వద్ద మంజీర నదిలో చెక్ డ్యాం పనులు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవతో నాబార్డు నిధులు రూ. 28.29 కోట్ల వ్యయంతో మంజీర నదిపై చెక్ డ్యాం నిర్మాణ పనులకు అప్పటి రోడ్డు, భవనాలు, గృహనిర్మాణం, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి 2021లో శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టే ప్రాంతంలో పూర్తిగా ఇసుక నిండి ఉంది. దీంతో బీర్కూర్కు చెందిన కొందరు అక్రమార్కులు అభివృద్ధి పనుల పేరిట ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. నిత్యం టిప్పర్లలో పదుల సంఖ్యలో బీర్కూర్ నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారు. బీర్కూర్ పోలీస్స్టేషన్ ముందు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో నెల రోజుల్లో వర్షకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో చెక్ డ్యాం నిర్మాణ పనులకు బ్రేక్ పడే అవకాశం ఉంది. నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన పనులు కనీసం 30 శాతం కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. బీర్కూర్ బ్రిడ్జి వద్ద చెక్ డ్యాం పనులు పూర్తయితే బీర్కూర్తో పాటు కిష్టాపూర్, బరంగెడ్గి, డోంగ్లీ మండలం కుర్లా, శేట్లూర్, ఖత్గాం గ్రామాలకు భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. బీర్కూర్ వద్ద మంజీర నదిలో నెమ్మదిగా చెక్ డ్యాం పనులు ఇసుక దందాకు తెరలేపిన అక్రమార్కులు పట్టించుకోని సంబంధిత అధికారులు -
‘లూపస్’పై అవగాహన అవసరం
నిజామాబాద్లో 2కే రన్ నిజామాబాద్ నాగారం: శరీరంలోని అన్ని భాగాల ను ప్రభావితం చేసే ‘లూపస్’ వ్యాధిపై ప్రజలు అ వగాహన పెంచుకోవాలని వైద్యులు సూచించారు. ప్రపంచ లూపస్ దినోత్సవం సందర్భంగా శనివా రం ఐఎంఏ, నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వ హించారు. వినాయక్నగర్లోని హనుమాన్ జంక్షన్ నుంచి రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంట ర్ వర కు రన్ కొనసాగింది. అనంతరం చర్మవ్యాధి నిపు ణురాలు గ్రీష్మ మాట్లాడుతూ లూపస్ వ్యాధి కళ్లు, మెదడు,ఊపిరితిత్తులు,మూత్రపిండాలు,రక్త నాళా లు తదితర ఏ భాగాన్ని అయినా ప్రభా వితం చే స్తుందన్నారు.ఐఎంఏ అధ్యక్షుడు డా అజ్జ శ్రీనివాస్, కోశాధికారి డా. రాజేందర్ మాట్లాడుతూ లూపస్ వ్యాధి నివారణకు రుమటాలజిస్టును సంప్రదించి సూచించిన మందులు వాడాలన్నారు. డాక్టర్ జీ రవి కిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచినిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం తదితర మంచి జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జీవన్ రావు , శ్రీశైలం, పీబీ కృష్ణమూర్తి ఉన్నారు. -
ప్రారంభమైన పచ్చళ్ల సీజన్
బాన్సువాడ : వేసవి కాలంలో ఏ గ్రామంలో చూసిన మామిడి కాయల సుగంధం, పచ్చడి తయారీ, వడియాల సన్నాహాలతో సందడి నెలకొంటుంది. ఆహార పదార్థాలు మాత్రమే కాదు సంప్రదాయం, కుటుంబ బంధాలు, గ్రామీణ సంస్కృతి సజీవ చిహ్నాలు. పచ్చళ్లు ఆహార సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. రుచిని పెంచడమే కాక ఆహారాన్ని సంరక్షించే సంప్రదాయ పద్ధతిగా కూడా పని చేస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన గ్రామాల్లో ఆవకాయ పచ్చడి లేని ఇల్లు ఉండదంటే ఆశ్చర్యం కలగక మానదు. బెల్లం అవకాయ, మెంతి అవకాయ, పులిహోర అవకాయ వంటి రకాలు ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. ఈ ప్రక్రియలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, పాత తరం నుంచి కొత్త తరానికి జ్ఞానాన్ని అందించడం వంటివి సాంస్కృతిక సంబంధాలను బలపరుస్తాయి. పచ్చడి తయారీ విధానం.. ● గట్టిగా, పుల్లగా ఉన్న పచ్చి మామిడి కాయలను ఎంచుకుని లోపల టెంకలు తీసి ముక్కలుగా కోయాలి. ● ఆవపిండి, ఎండుమిరపకాయల కారం, ఉప్పు, మెంతిపొడి, నువ్వుల నూననె వంటి ప్రధాన పదార్థాలు కలిపేందుకు సిద్ధం చేసుకోవాలి. కొన్ని రకాల్లో బెల్లం, వెల్లుల్లి కూడా కలుపుతారు. ● ఆ తరువాత జాడీలో కారం మిశ్రమాన్ని మామిడి ముక్కలతో పొరలు, పొరలుగా అమర్చి, పైన నూనె పోస్తారు. ఇది పచ్చడిని పాడవకుండా సంరక్షిస్తుంది. ● 34 రోజుల పాటు గాలిచొరబడకుండా మూత పెట్టి ఉంచిన తర్వాత తినడానికి తయారవుతుంది. కొన్ని రకాలు ఎండబెట్టి దీర్ఘకాల నిల్వకు సిద్ధం చేస్తారు. ఆరోగ్య ప్రయోజనాలెన్నో.. మామిడి పచ్చడిలు రుచికరమైనవే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. వీటిని మితంగా తీసుకోవడం ముఖ్యం. పచ్చి మామిడిలో పొటాషియం, ఇతర ఖనిజాల వల్ల వేసవిలో డీహైడ్రేషన్, జీర్ణక్రియను మెరుగుపర్చుకోవడం, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడతాయి. జీలకర్ర జీర్ణక్రియను మెరుగురచడంలో సహాయ పడతాయి. కాయల ఎంపిక ముఖ్యం మామిడి కాయ పచ్చడి తయారీకి కాయల ఎంపిక చాలా ముఖ్యం. ఇందు కో సం నేను సంతకు వెళ్లి మా మిడి కాయలను తీసుకొ స్తాను. తర్వాత వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు చేసి మసాల ఉప్పు, కారం, ఆవాలు వేసి బాగా కలిపి జాడీల్లో పెడతాం. –శంకర్,బాన్సువాడ కుటుంబ బంధాలను బలపరుస్తుంది ప్రతి సంవత్సరం వేసవిలో మామిడి కాయల పచ్చడి చేయడం మాకు ఒక పండుగలా ఉంటుంది. కుటుంబ సభ్యులందరం కలిసి తయారీలో పాల్గొంటాం. ఏడాది పొడవునా రుచిని ఇస్తుంది. అలాగే మా కుటుంబ బంధాలను కూడా బలపరుస్తుంది. –పుష్పలత, శేట్లూరు గ్రామం మామిడికాయలు, ఇతర దినుసుల కొనుగోళ్లలో జనం బిజీ ఏడాదికి సరిపడా తయారీకి ఏర్పాట్లు -
నల్లమట్టి లారీ బోల్తా
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలోని విజయనగరం గ్రామం వద్ద నల్లమట్టిని తరలిస్తున్న లారీ బోల్తా పడింది. నిర్మల్ జిల్లా పంచగూడ గ్రామ సమీపంలోని గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి ఆర్మూర్ పరిసర ప్రాంతాలకు నల్లమట్టిని తరలిస్తుండగా భారీ లారీ విజయనగరం గ్రామ సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తా పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై నుంచి లారీతోపాటు నల్లమట్టిని తొలగించడంతో రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ఈత చెట్లు దగ్ధం రుద్రూర్: మండలంలోని రాణంపల్లి శివారులో శనివారం మధ్యాహ్నం ఈత చెట్లు దగ్ధమయ్యాయి. సమీప పొలంలో నుంచి వచ్చిన మంటలతో 40 ఈత చెట్లు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు. బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు అధికారులను కోరారు. -
జిల్లా కీర్తిని ప్రపంచానికి చాటిన సౌమ్య
నిజామాబాద్నాగారం: జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటుతూ జిల్లా కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్నారని, ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోత్ సౌమ్య మరింత చాటిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. జిల్లా కేంద్రంలోని గీతా భవనంలో శనివారం నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్ జట్టులో స్థానం పదిలం చేసుకున్న గుగులోత్ సౌమ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ హాజరై ఆమెను అభినందిస్తూ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తాను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులుతో కలిసి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఉపాధ్యక్షుడు భక్తవత్సలం మాట్లాడుతూ.. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జిల్లాకు ప్రత్యేక క్రీడామైదానంతోపాటు కోచ్లు, వసతులు లేక క్రీడాకారులు ఇక్కట్లకు గురవుతున్నారన్నారు. కోచ్ నాగరాజు, నిఖత్ జరీనా, భూమ్రెడ్డి సంజీవరెడ్డి, అబ్బన్న, రమే్శ , ఉమర్, సురేశ్, జావీద్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
దైవం మాతృ రూపేణ..
బిడ్డలకు కిడ్నీలు ఇచ్చి పునర్జన్మను ప్రసాదించిన తల్లులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నవమాసాలు మోసి బిడ్డల్ని కన్న తల్లులు.. వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే భరిస్తారు. బిడ్డలు ఎదిగే క్రమంలో ఏదైనా ఆపద వస్తే తన ప్రాణాన్ని అడ్డు పెట్టయినా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే తన ఆయుష్షు తీసుకునైనా బిడ్డను కాపాడు తండ్రీ అంటూ తను నమ్ముకున్న దేవుళ్లను వేడుకుంటారు. తల్లి ప్రేమ అలాంటిది మరి.. జిల్లాలో పలువురు తల్లులు తమ బిడ్డల ప్రాణాలను కాపాడడానికి తమ కిడ్నీలను ఇచ్చారు. జిల్లాలో దాదాపు ఇరవై మంది తల్లులు తమ బిడ్డలకు కిడ్నీలు ఇచ్చి పునర్జన్మ ప్రసాదించినట్లు తెలుస్తోంది.కామారెడ్డి పట్టణానికి చెందిన శంకర్ అనే యువకుడికి కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టాడు. ఆస్పత్రులకు తీసుకువెళ్లి వైద్యం చేయించగా.. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. దీంతో కొడుకుకు తాను కిడ్నీ ఇస్తానంటూ తల్లి పద్మ ముందుకు వచ్చింది. 2022 మార్చి 24న కిడ్నీ మార్పిడి జరిగింది. తల్లీకొడుకులు ఆరోగ్యంగా ఉన్నారు. శంకర్ తన పని తాను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అమ్మ తనకు పునర్జన్మనిచ్చిందని శంకర్ పేర్కొంటున్నాడు. కొడుకుకోసం కిడ్నీ ఇచ్చి.. -
నవమాసాలు కడుపున మోసి, కని పెంచిన కనిపించే దైవం అమ్మ.. ఆమె ప్రేమకు ప్రతిరూపం.. త్యాగానికి మారుపేరు.. పిల్లలు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని కాంక్షిస్తుంది. తానేమైపోయినా పర్వాలేదు బిడ్డ మాత్రం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. తన ఆయుష్షును పోసుకుని నిండునూరేళ్ల
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : క్రీడలు, క్రీడాకారులకు నిలయమైన తాడ్వాయి మండల కేంద్రం దేశ సేవలోనూ ముందుంది. ఆ ఊరు నుంచి ఇప్పటివరకు 23 మంది సైన్యంలో చేరగా.. రవీందర్రెడ్డి అనే సైనికుడు ఏడాది క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ప్రస్తుతం 22 మంది సైన్యంలో ఉన్నారు. ఆదివారం మాతృ దినోత్సవం సందర్భంగా సైనికుల తల్లులతో ‘సాక్షి’ ముచ్చటించింది. తమ పిల్లలు సైన్యంలో పనిచేయడం తమకు గర్వంగా ఉందని, పాకిస్థాన్ చేస్తున్న దాడులతో కొంత భయపడుతున్నామని వారు పేర్కొన్నారు. తమ బిడ్డలకు రోజూ ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతున్నామన్నారు. ‘‘దేవుళ్లను నమ్ముకున్నోళ్లం, దేవుడి మీద భారం వేశాం’’ అని ఆ తల్లులు వివరించారు. ఒక్కరితో మొదలై.. గ్రామానికి చెందిన గుట్టకాడి సంజీవరెడ్డి 15 ఏళ్లనాడు సైన్యంలో చేరారు. తర్వాత ఆయన స్ఫూర్తితో గ్రామానికి చెందిన యువత సైన్యంలో చేరసాగారు. గుట్టకాడి సంజీవరెడ్డి, మ్యాదరి ఎల్లేశ్, మర్రి మహేశ్, మర్రి ప్రశాంత్, లింగమ్మల మనోజ్, హన్మంతుల స్వామి, బెస్త సంజయ్, పీసు సంజీవరెడ్డి, టేకుల రాజు, దాసరి నరేశ్రెడ్డి, ఆకిటి ప్రశాంత్రెడ్డి, కీసరి నవీన్, కమ్మరి నవీన్, ప్రదీప్రావు, గొల్ల సంతోష్, మిద్దె కల్యాణ్, సుర్కంటి సతీష్రెడ్డి, సాయిరాంగౌడ్, రాజిరెడ్డి, ముదాం రాహుల్, సాకలి అనిల్, గాండ్ల భానుతేజ సైన్యంలో ఉన్నారు. దాదాపు అందరూ దేశ సరిహద్దు ప్రాంతాల్లోనే పనిచేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లోనూ ముందు.. గ్రామానికి చెందిన సైనికులంతా కలిసి సొంత డబ్బులతో గ్రామంలో ప్రధాన రహదారిపై సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యువతను సైన్యంలో చేరాలంటూ ప్రోత్సహిస్తుంటారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. సైన్యంలో 23 మంది తాడ్వాయివాసులు దేశ సరిహద్దుల్లో యుద్ధమేఘాలతో కొంత భయం బిడ్డలకు జాగ్రత్తలు చెబుతున్న తల్లులు నేడు మాతృ దినోత్సవం -
‘భూభారతి డెస్క్ వర్క్ నిర్వహించాలి’
లింగంపేట: భూభారతి డెస్కు వర్క్ను వే గంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విక్ట ర్ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. శనివా రం ఆయన పోతాయిపల్లి, నల్లమడుగు, కో మట్పల్లి గ్రామాల్లో భూభారతి సర్వేకు సంబంధించిన డెస్కు వర్క్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూ భారతి చట్ట ప్రకారం భూ సర్వే నిర్వహించి అర్జీదారుల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులకు కనీస వసతులు, సౌకర్యాలు కల్పించాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. ఆలయన వెంట రెవెన్యూ, సింగిల్ విండో సిబ్బంది, రైతులు ఉన్నారు. ‘2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం’ నాగిరెడ్డిపేట: జిల్లాలో ఇప్పటివరకు సుమా రు 2.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు డీసీవో రామ్మోహన్ తెలిపారు. శనివారం ఆయన వాడి, చీనూర్, నాగిరెడ్డిపేట, మాల్తుమ్మెద, గోలిలింగాల, లింగంపల్లికలాన్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూకం చేసిన ధాన్యం సంచులపై టార్పాలిన్లను కప్పి ఉంచాలని, ధాన్యం బస్తాలను వెంటవెంటనే రైస్మిల్లులకు పంపాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 2,06,061 మెట్రిక్ టన్నుల ధాన్యం, ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో 73,195 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. సుమారు 2.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.4.87 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఆయన వెంట మానిటరింగ్ అధికారి నర్సింలు, మాల్తుమ్మెద సొసైటీ సీఈవో సందీప్కుమార్ ఉన్నారు. 18 నుంచి బజరంగ్దళ్ ప్రశిక్షణ వర్గ ఎల్లారెడ్డి: బజరంగ్దళ్ ప్రశిక్షణ వర్గను ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు బజరంగ్దళ్ ప్రతినిధులు తెలిపా రు. కరీంనగర్లోని శ్రీసరస్వతి శిశు మందిర్లో వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమానికి వెళ్లే వారు ఎల్లారెడ్డి బజరంగ్దళ్ ప్రతినిధుజీలను సంప్రదించాలని సూచించారు. కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు మాచారెడ్డి : చుక్కాపూర్లోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగు తున్నాయి. శనివారం ఉదయం సేవాకాలం శాంతిపాఠం నిర్వహించారు. అనంతరం ద్వారతోరణ పూజలు, మూలమంత్ర హవనం, ఉత్సవ మూర్తులకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్రెడ్డి, ఈవో శ్రీధర్రావ్, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజిరెడ్డి, ఆంజనేయులు, బాల్రెడ్డి, ఆలయ సిబ్బంది సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దంచికొట్టిన వాన బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో శనివారం రాత్రి అకాలవర్షం దంచి కొట్టింది. దీంతో కల్లాల్లో ఉన్న సజ్జలు, నువ్వులు, కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 40 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. -
పత్రికా స్వేచ్ఛకోసం నిరసన గళం
13న పాలిసెట్ కామారెడ్డి అర్బన్ : జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించే పాలిసెట్ కోసం ఏర్పాట్లు చేసినట్లు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, పరీక్షల సమన్వయకర్త విజయ్కుమార్ తెలిపారు. జిల్లాలో 2,900 మంది పరీక్షలు రాయనున్నారని, వారికోసం ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. ఉద యం పదిగంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని, 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆ లస్యం అయినా అనుమతించబోమని పేర్కొన్నారు. హాల్ టికెట్పై అభ్యర్థి ఫొటో స్పష్టంగా లేకపోతే గెజిటెడ్ అధికారితో ధ్రువీకరణ చేయించుకుని రావాలని సూచించారు.పీజీ ఫలితాల వెల్లడి బాన్సువాడ రూరల్ : ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ, పీజీ (అటానమస్) కళాశాలలో శనివారం పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాలను తెలంగాణ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంపత్కుమార్ విడుదల చేశారు. ఎంఏ ఇంగ్లిష్ మొదటి సెమిస్టర్లో 100 శాతం ఉత్తీర్ణత నమోదయ్యిందని, ఎంఏ తెలుగులో 93 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులను అభినందించారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి మాట్లాడుతూ తెలంగాణ కామన్ పీజీ ఎంట్రె న్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల అయ్యిందన్నారు. మే 19లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తెయూ అడిషనల్ కంట్రోలర్ సంపత్, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ షేక్ అక్బర్ బాషా, అడిషనల్ కంట్రోలర్ అంబయ్య తదితరులు పాల్గొన్నారు.తుజాల్పూర్లో రాస్తారోకో చేస్తున్న రైతులుతాగునీటి కోసం బోరుబావి వద్ద వేచి ఉన్న రతన్ సింగ్ తండావాసులుబాన్సువాడ రూరల్: పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ బాన్సువాడ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఆంధ్రా పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ శనివారం బాన్సువాడ అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేశారు. సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడాన్ని మానుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్గౌడ్, చంద్రశేఖర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకుడు సయ్యద్ లతీఫ్, జిల్లా నాయకులు రాజు, పంతులు నరేష్, జర్నలిస్టులు శ్రీకాంత్రెడ్డి, వరప్రసాద్, జకీర్, రామాగౌడ్, శ్రీనివాస్, సుందర్, సలీం, సతీష్గౌడ్, సుధాకర్, నబీ తదితరులు పాల్గొన్నారు.బీబీపేట: అకాల వర్షాలతో ఇప్పటికే నష్టపోతున్నామని, వడ్లను వెంటవెంటనే కొనుగోలు చేసి రైస్మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ తుజాల్పూర్ రైతులు శనివారం రోస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీలు రావడం ఆలస్యం కావడం వల్ల కాంటా అయిన వడ్లు పేరుకుపోతున్నాయని, వర్షాలతో తడిసిపోతున్నాయని పేర్కొన్నారు. తడిసిన వడ్లను మిల్లులకు తరలిస్తే అదనపు తరుగు తీస్తున్నారని ఆరోపించారు. అధికారులు, సొసైటీ చైర్మన్ స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులను సముదాయించారు. సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. పెద్దకొడప్గల్: తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని రతన్సింగ్ తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్లైన్కు లీకేజీలతో మురికి నీరు సరఫరా అవుతుండడంతో ఆ నీరు తాగలేకపోతున్నారు. దీంతో బోరుబావుల వద్దకు వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. అయితే శనివారం తండాలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. తండావాసులు మండుటెండలో తాగునీటి కోసం గంటల తరబడి బోరుబావి వద్ద వేచి చూడాల్సి వచ్చింది. అధికారులు స్పందించి తాగునీటి గోస తీర్చాలని కోరుతున్నారు. -
తల్లీబిడ్డను కాటేసిన కరెంట్
నిజాంసాగర్ (జుక్కల్): ఇంట్లోని ఇనుప కూలర్కు కరెంట్ సరఫరా కావడంతో తల్లీకూతురు మరణించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పెద్ద గుల్లా తండాకు చెందిన చవాన్ ప్రహ్లాద్, శంకబాయి (36) దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ప్రహ్లాద్ డ్రైవర్గా, శంకబాయి వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి శంకబాయి, చిన్న కూతురు శ్రీవాణి (12), కుమారుడు ఇంట్లో నిద్రించారు. తల్లి, కూతురు ఒకేచోట ఇనుప కూలర్ ముందర నిద్రించగా, కుమారుడు ప్రతీక్ కొద్ది దూరంలో పడుకున్నాడు. రాత్రి వేళ కూలర్ అడుగు భాగంలోని నీటిలో శ్రీవాణి కాలుపడటంతో కరెంట్ షాక్ సరఫరా జరిగి శ్రీవాణితో పాటు పక్కనే పడుకున్న తల్లి శంకబాయి మృతి చెందింది. ఉదయం నిద్ర లేచిన ప్రతీక్ తల్లి, సోదరి మృతి చెందడాన్ని గమనించి తండా ప్రజలకు చెప్పాడు. సమాచారం తెలుసుకున్న బిచ్కుంద సీఐ నరేశ్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, ట్రాన్స్కో ఏఈ బాలాజీ తండాకు చేరుకున్నారు. ఇనుప కూలర్కు కరెంట్ సరఫరా కావడంతోనే వారు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కళ తప్పిన గాందీగంజ్ !
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఒకప్పుడు కామారెడ్డి గంజ్ (గాంధీ గంజ్) అంటే.. పేరున్న మార్కెట్. ఏటా రూ.వందల కోట్ల విలువైన బెల్లం వ్యాపారంతో ఘనకీర్తి సాధించింది. కామారెడ్డి పట్టణానికి చుట్టుపక్కల ఉన్న మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన రైతులు కూడా ఇదే మార్కెట్కు వచ్చేవారు. ఎడ్ల బండ్లపై బెల్లం ముద్దలు తీసుకొచ్చి ఇక్కడి వ్యాపారులకు విక్రయించేవారు. బెల్లం వ్యాపారంతో మార్కెట్కు మంచి ఆదాయం సమకూరేది.అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ బీఎన్ రామన్ ఆధ్వర్యంలో.. స్థానిక గంజ్ వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, విద్యావేత్తలు అందరూ కలిసి విద్యారంగ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించారు. గంజ్లో జరిగే క్రయ విక్రయాలపై కొంత సెస్సును విద్యారంగం కోసం వసూలు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అప్పట్లో 267 ఎకరాల మేర భూమిని సేకరించి.. అందులో భారీ భవనాన్ని నిర్మించారు. ఆ భవనమే ప్రస్తుత ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల. గంజ్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. ఇదంతా గతం. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. బెల్లంపై విధించిన ఆంక్షలతో బెల్లం వ్యాపారం దెబ్బతింది. నల్లబెల్లం అంటూ కేసులు పెట్టడంతో వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. బెల్లం కొనుగోళ్లు లేకుండా పోయాయి. రైతులు బెల్లం వండలేని పరిస్థితి ఏర్పడింది.తరువాత దివంగత సీఎం వైఎస్సార్ బెల్లంపై ఆంక్షలు ఎత్తివేసి రైతులకు అండగా నిలిచారు. ఆయన హయాంలో బెల్లం తయారీతో పాటు వ్యాపారం పుంజుకుంది. కానీ వైఎస్సార్ మరణంతో మళ్లీ బెల్లానికి కష్టాలొచ్చాయి. తరువాత బెల్లంపై ఆంక్షలు మరింత పెరిగి బెల్లం తయారీ లేకుండా పోయింది. దీంతో గంజ్ ఉనికి కోల్పోయింది.ఉనికి కోల్పోయిన గంజ్బెల్లంతో పాటు ఇతర పంటల కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగేవి. ఏటా రూ.వందల కోట్ల వ్యాపారం నడిచేది. అప్పుడు గంజ్ కళకళలాడుతూ ఉండేది. బెల్లంపై ఆంక్షలతో గంజ్ వ్యాపారం దెబ్బతినిపోయింది. బెల్లం దందా నడిచిన అడ్తి దుకాణాల్లో ఇతర వ్యాపారాలు వచ్చాయి. గంజ్కు సంబంధించి బెల్లం కొనుగోళ్లు చేసిన షెడ్లు కూడా కనుమరుగయ్యాయి. మూడేళ్ల కిందట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసమంటూ షెడ్లను తొలగించడంతో గంజ్ రూపు కోల్పోయింది.ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం కూడా పిల్లర్ల వద్దే నిలిచిపోయింది. గంజ్లో మిగిలిందల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం, కొన్ని షెడ్లు మాత్రమే. దీంతో గంజ్ ఉనికి లేకుండా పోయిందనే చెప్పాలి. అప్పట్లో నిత్యం గంజ్కు వేలాది మంది రైతులు వచ్చేవారు. పంటల సీజన్లో అయితే ఎడ్ల బళ్లు వరుస కట్టేవి. పంట ఉత్పత్తులను తీసుకువచ్చి వ్యాపారుల వద్ద అమ్మేవారు.వ్యాపారులు, రైతుల మధ్య మంచి అనుబంధంబెల్లం దందా నడిచిన కాలంలో రైతులు, వ్యాపారులకు మధ్యన మంచి అనుబంధం ఉండేది. రైతులు పంట పెట్టుబడి కోసం వ్యాపారుల వద్దే అప్పు తీసుకునేవారు. పంట చేతికందిన తరువాత ఆ పంటను అదే వ్యాపారులకు అమ్మేసి, అప్పు పోను మిగతా డబ్బులు తీసుకునేవారు. రైతు ఇంట్లో పెళ్లిళ్లు ఉన్నా, ఇళ్లు కట్టుకున్నా సరే వ్యాపారులు అండగా నిలిచేవారు. వ్యాపారులు, రైతుల ఇళ్లలో పండుగలు, ఫంక్షన్లు, పెళ్లిళ్లకు ఒకరినొకరు ఆహ్వానించుకునేవారు. రైతులు, వ్యాపారుల మధ్య మంచి అనుబంధం ఉండేది. గంజ్ వ్యాపారాలు దెబ్బతిన్న తరువాత రైతులు రావడమే నిలిచిపోయింది. వ్యాపారులు కూడా ఇతర దందాల వైపు మళ్లారు. -
40 ఫీట్ల రోడ్డు కబ్జాకు యత్నం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో సుభాష్ థియేటర్ ఎదురుగా ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారం 40 ఫీట్ల రోడ్డును ఓ వ్యక్తి కబ్జాకు యత్నిస్తున్నాడు. గతంలో ఈ రోడ్డులో భవన నిర్మాణ పనులు ప్రారంభించగా అప్పటి టీపీవో నోటీసులు జారీ చేసి కూల్చివేయించారు. ఈ రోడ్డు స్థలం తనదేనంటూ హద్దురాళ్లు వేసి సదరు వ్యక్తి మళ్లీ కబ్జాకు యత్నిస్తున్నాడు. దీంతో స్థానిక కాలనీవాసులు ఈ రోడ్డుగుండా వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. టీపీవో గిరిధర్కు స్థానికులు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజులుగా రోడ్డుకు అడ్డంగా రాళ్లు అలానే ఉన్నాయి. ఈ విషయమై సాక్షి టీపీవోను వివరణ కోరగా సదరు వ్యక్తికి రెండు సార్లు నోటీసులు జారీ చేశామని, క్రిమినల్ చేసు నమోదు చేయిస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై తుది విచారణనాగిరెడ్డిపేట : మండలంలోని వదల్పర్తిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాపై శుక్రవారం అధికారులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎల్పీవో సురేందర్, ఎంపీడీవో ప్రభాకరచారి, ఎస్సై మల్లారెడ్డి సమక్షంలో జీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఇళ్లకు సంబంధించిన గైడ్లైన్స్ను వివరించారు. 17మంది లబ్ధిదారుల జాబితాను పరిశీలించి, ఏడింటిని రిజెక్ట్చేసి 10మందిని ఎంపిక చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈ పిచ్చయ్య, జీపీకార్యదర్శి అజీమోద్దీన్ తదితరులున్నారు. ఆసక్తి, అర్హత ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు బాన్సువాడ రూరల్ : ఆసక్తి ఉండి, అర్హతలు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని బాన్సువాడ ఎంపీడీవో ముజాహిద్ సూచించారు. శుక్రవారం ఆయన బా న్సువాడ మండలం బోర్లంక్యాంపులో ఇందిరమ్మ లబ్ధ్దిదారుల ఎంపిక కోసం సర్వే చే పట్టారు. జీపీ కార్యదర్శి పరిపూర్ణ, కారోబార్ వినయ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సంజీవ్రెడ్డి, షబ్బీర్, పీర్యానాయక్, సంత్యాలి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన బిచ్కుంద(జుక్కల్) : మండలంలోని గుండెకల్లూర్లో ఎంపీడీవో గోపాల్ ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. లబ్ధ్దిదారులు ముందుకు రావాలని కోరారు. గుండెకల్లూర్ గ్రామానికి 111 ఇళ్లు మంజూరు అయ్యాయని, 17 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి తెలిపారు. ఇళ్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక సమస్య లేకుండా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. -
డ్రంకన్డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
రుద్రూర్: మండల కేంద్రంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు డ్రంకన్డ్రైవ్, వాహనాల తనిఖీలు చేపట్టారు. బొప్పపూర్ గ్రామానికి చెందిన సాయిలు, రానంపల్లి గ్రామానికి చెందిన వీరేశంలు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. శుక్రవారం వారిని కోర్టులో హాజరుపరచగా జడ్జి ఒకరికి మూడురోజుల జైలు, మరొకరికి రెండు రోజుల జైలుశిక్షతోపాటు రూ.1000 జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. సిలిండర్ లీకై మంటలు నందిపేట్(ఆర్మూర్): మండల కేంద్రంలోని రాజనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న గందం గంగామణి ఇంట్లో శుక్రవారం సిలిండర్ నుంచి గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇంట్లో మంటలు వ్యాపించడంతో విలువైన సామగ్రి, నిత్యవసర సరుకులు కాలిపోయాయి. విద్యుత్ షాక్తో ఆవు మృతి రాజంపేట: మండలంలోని షేర్ శంకర్ తండాలో విద్యుత్ షాక్తో ఓ ఆవు మృతి చెందింది. తండాలోని రైతు కాట్రోత్ సురేందర్కు చెందిన ఆవు శుక్రవారం ఉదయం గ్రామ శివారులో మేతకు వెళ్లగా సమీపంలోని విద్యుత్ వైర్ల కర్ర విరిగిపడగా, కర్రకు కట్టిన విద్యుత్ తీగలు ఆవుపై పడటంతో షాక్తో మృతిచెందింది. సుమారు రూ. 50వేల వరకు నష్టపోయానని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరాడు. హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుకామారెడ్డి క్రైం/సదాశివనగర్(ఎల్లారెడ్డి): పాత గొడవలను మనసులో పెట్టుకుని వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కామారెడ్డి కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించింది. వివరాలు ఇలా.. సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద జాతీయ రహదారి పక్కన కల్వర్టు కింద 2020 జూలై 13న ఓ మృతదేహం ఉందని సమాచారం రావడంతో పోలీసులు విచారణ జరిపి మృతుడిని సదాశివనగర్కు చెందిన మాడల సతీష్గా గుర్తించారు. అతనికి, అదే గ్రామానికి చెందిన గోల్కొండ రవి కుమార్కు మధ్య గొడవలు ఉండేవి. సతీష్ తరచుగా రవి కుమార్ను, అతని కుటంబ సభ్యులను తిడుతుండేవాడు. దీంతో అతడిని ఎలాగైనా చంపాలని రవి నిర్ణయించుకున్నాడు. అదే సంవత్సరం జులై 10న రవి ఆర్మూర్ దాకా వెళ్లి వద్దామని అతడిని నమ్మించాడు. సదాశివనగర్ మండల కేంద్రం శివారులోని కామారెడ్డి వైపునకు వెళ్తున్న మార్గమధ్యలో రహదారిపై ఉన్న కల్వర్డు వద్దకు తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆ తర్వాత వంతెన పైనుంచి కిందికి తోసి వేశాడు. దీంతో సతీష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రవీందర్ కల్వర్టు కిందికి వెళ్లి గాయాలతో కొట్టుకుంటున్న సతీష్ను రాయితో తలపై కొట్టి హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితుడికి జీవిత ఖైదుతోపాటు, రూ.2వేల జరిమానా విధిస్తు తీర్పు ఇచ్చారు. అప్పటి సదాశివనగర్ సీఐం వెంకట్, ఎస్సై జగడం నరేశ్, ప్రస్తుత సీఐ సంతో ష్కుమార్, ఎస్సై రంజీత్లను ఎస్పీ రాజేశ్ చంద్ర అభినందించారు. -
ప్రభుత్వ పథకాల్లో అక్రమాలను సహించను
నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాస్, కల్యాణక్ష్మితో పాటు పలు ప్రభుత్వ పథకాల్లో అక్రమాలను సహించబోనని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సంక్షేమ పథకాలను అమ్ముకునే నాయకులు రాజకీయాల్లో పనికిరారని హెచ్చరించారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్ హాల్లో కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుతో మహమ్మద్ నగర్ మండలాన్ని ఇండస్ట్రియల్ టౌన్ షిప్గా మారుస్తానన్నారు. కొత్తగా ఏర్పాటైన మహమ్మద్ నగర్ మండల దశదిశను మార్చడం తన లక్ష్య మన్నారు. త్వరలోనే మండల కార్యాల యాల ఏర్పాటుకు భూమి పూజ చేస్తామన్నారు. మహమ్మద్ నగర్ మండలానికి 30 వేల మెట్రిక్ టన్నుల గిడ్డంగి మంజరు చేశామని చెప్పారు. రూ. కోటి ఆరవై లక్షలతో సీసీ రోడ్లు వేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 248 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. పథకాల కోసం కార్యకర్తలను, నాయకులు మభ్యపెట్టవద్దన్నారు. పార్టీ కోసం కష్టపడ్డవారికి గుర్తింపు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుర్తింపు లభిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా గడప గడపకు పథకాలను తీసుకు వెళ్లాలన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలు ఎగురవేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పిట్లం వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రెడ్డి నాయకులు మల్లయ్యగారి ఆకాష్, సవాయిసింగ్, లోక్యానాయక్, నాగభూషణంగౌడ్, గొట్టం నర్సింలు, ఖాలిక్, రాజు తదితరులున్నారు. ఇండస్ట్రియల్ టౌన్ షిప్గా మహమ్మద్ నగర్ మండలం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు -
హుటాహుటిన విధుల్లోకి వెళ్లిన మద్నూర్ జవాన్
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ బండివార్ పరుశురాం మిలటరీ ఉన్నత అధికారుల ఆదేశాలతో శుక్రవారం హుటాహుటిన విధుల్లో చేరేందుకు తరలివెళ్లారు. భారత్–పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అత్యవసర పరిస్థితులతో విధుల్లోకి చేరినట్లు పరుశురాం కుటుంబ సభ్యులు తెలిపారు. పరుశురాం ఈ నెల 2న మద్నూర్కు సెలవులపై వచ్చాడని, ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఉండగా హఠాత్తుగా బయలుదేరి వెళ్లినట్లు వారు తెలిపారు. భారత సైన్యానికి మద్దతుగా పూజలుమద్నూర్/భిక్కనూరు : భారత సైన్యానికి మద్దతుగా పలు చోట్ల ప్రజలు పూజలు నిర్వహించారు. మద్నూర్ మండలం సలాబత్పూర్ హనుమాన్ ఆలయంలో శుక్రవారం భారత సైన్యానికి మద్దతుగా ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయంలో శుక్రవారం పూజలు చేశారు. పూజారులు రామగిరిశర్మ,రాజేశ్వరశర్మలు స్వామివారికి ఈ విషయమై ప్రత్యేక అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. సైనికులపై స్వామి వారి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగచేసి వారిని కాపాడాలని వేడుకున్నారు. -
సమష్టి కృషితో శతశాతం ఫలితాలు
మాచారెడ్డి : ఉపాధ్యాయులు, విద్యార్థుల సమష్టి కృషితో ఉమ్మడి మాచారెడ్డి మండలంలో పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రత్యేక తరగతులు, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల పట్టుదల వెరసి 517 మంది విద్యార్థులకు గాను 512 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 12 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఒక కస్తూర్బా, మరో ప్రైవేటు ఉన్నత పాఠశాలల్లో వందశాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో మాచారెడ్డి ఉన్నత పాఠశాలకు చెందిన సబా తబస్సుం అనే విద్యార్థిని 581 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. ఇసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన వైష్ణవి 578 మార్కులతో ద్వితీయ స్థానం సాధించింది. అదే పాఠశాలకు చెందిన నిఖిత 575 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. 14 ఉన్నత పాఠశాలలకు గాను 11 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం ప్రత్యేక తరగతులతో ఉత్తీర్ణత సాధించినట్టు ఉపాధ్యాయులు తెలిపారు.విద్యార్థులను ప్రోత్సహించాం ప్రతి రోజూ పాఠశాలకు హాజరుకావాలని విద్యార్థులను ఎల్లవేళలా ప్రోత్సహించాం. నెలలో 30 రోజులు హాజరైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి పాఠశాలకు వచ్చే విధంగా కృషి చేశాం. అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి శ్రద్ధతో చదివేట్టు కృషి చేశాం. దీంతో విద్యార్థులు వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు. – దేవేందర్రావు, ఎంఈవో, మాచారెడ్డి ఉమ్మడి మాచారెడ్డి మండలంలో 11 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత పది ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు -
ఆటో బోల్తాపడి ఆరుగురికి గాయాలు
ఎల్లారెడ్డి: బైక్ను తప్పించబోయి ఆటో బోల్తాపడటంతో ఆటోలోని ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలో ప్రయాణికులను ఎక్కించుకొని ఓ ఆటో రుద్రారం బయలుదేరింది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట ఆటోకు ఎక్సెల్ వాహనం అడ్డురావడంతో దానిని తప్పించబోయి బ్రేక్ వేయడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నిజాంసాగర్కు చెందిన రజిత, సుమలత, ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సంగవ్వ, మల్కాపూర్ గ్రామానికి చెందిన శేర్ల చంద్రయ్య, శకుంతల, లక్ష్మీలకు గాయాలయ్యాయి. వారిని స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. క్షత గాత్రులను మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ పరామర్శించారు. బైక్ అదుపుతప్పి ముగ్గురికి.. మద్నూర్(జుక్కల్): మండలంలోని మేనూర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం బైక్ అదుపు తప్పడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. పిట్లం నుంచి మద్నూర్ వైపు బైక్పై ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. మేనూర్ వద్ద వారి బైక్ అదుపు తప్పడంతో డివైడర్కు ఢీకొన్నారు. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
బైక్ చోరీల కేసులో నిందితుడి అరెస్టు
మోపాల్(నిజామాబాద్రూరల్): చెడు వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై యాదగిరిగౌడ్, సీఐ సురేష్ తెలిపారు. మోపాల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం వారు కేసు వివరాలను వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని వివేకానంద కాలనీకి చెందిన భూమిగారి నవీన్, తల్లి రాజేశ్వరితో కలిసి నివాసం ఉంటున్నాడు. కూలీ పని చేసుకునే క్రమంలో చెడు వ్యసనాలకు బానిసై ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. పలు కేసుల్లో గతంలో జైలు జీవితం గడిపాడు. జైలు నుంచి బయటకు వచ్చిన అతడు కొన్ని నెలలుగా బతుకుదెరువు కోసం ఆటో నడుపుకుంటున్నాడు. కానీ ఆదాయం సరిపోకపోవడంతో మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈనెల 5న రోటరీనగర్లో బైక్ చోరీ చేసి, అదేరాత్రి మంచిప్ప శివారులోగల గండి మైసమ్మ ఆలయంలో, ముదక్పల్లిలోని సూదులమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డాడు. అలాగే ఇంటి ఆవరణలో పెట్టిన బైక్ను చోరీ చేశాడు. బైక్లను శుక్రవారం తరలిస్తున్న క్రమంలో మోపాల్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, నేరాలను ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ సురేష్ తెలిపారు. ఏఎస్సై రమేష్బాబు, సిబ్బంది దూప్సింగ్, తదితరులు పాల్గొన్నారు. -
వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. సిద్దిపేట్ జిల్లా సూర్యపేట గ్రామానికి చెందిన బండి బిక్షపతి(65) కొన్ని సంవత్సరాలుగా అంకాపూర్లో కూలీ పనిచేస్తు జీవనం సాగిస్తున్నాడు. కాగ రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం కూలీ పనికి వెళుతున్నాంటూ ఇంట్లో నుంచి వెళ్లాడు. కాగ వ్యవసాయ క్షేత్రంలోనే భిక్షపతి చెట్టుకు ఉరి వేసుకొని, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. పిట్లం మండలంలో.. పిట్లం(జుక్కల్): మద్యానికి బానిసై తాగిన మైకంలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రాంపూర్ గ్రామంలో చొటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. రాంపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రాజు (33) గత కొంతకాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి తాగిన మైకంలో ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి బాన్సువాడ రూరల్: మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడ పట్టణానికి చెందిన గూడ సంతోష్ కుమార్(45) గురువారం రాత్రి బైక్పై బయలుదేరాడు. బాన్సువాడ–బీర్కూర్ రహదారిపై కొల్లూర్ రైస్మిల్ సమీపంలో అతడికి మరో బైక్ ఎదురుగా రావడంతో రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో సంతోష్కు తీవ్రగాయాలు కావడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. బాన్సువాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి అదృశ్యం ఎల్లారెడ్డిరూరల్: మండల కేంద్రానికి చెందిన షేక్ సలీం(28) అనే యువకుడు అదృశ్యమైనట్లు ఏఎస్సై సిద్ధిఖీ శుక్రవారం తెలిపారు. ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిన సలీం ఇంతవరకు తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చట్ట ప్రకారమే అర్జీలను పరిశీలించాలి
లింగంపేట : భూభారతి చట్ట ప్రకారమే రైతుల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. శుక్రవారం ఆయన లింగంపేట ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ బృందాల సమావేశంలో మాట్లాడారు. గత నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు లింగంపేట మండలంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించగా.. భూములకు సంబంధించిన సమస్యలపై 4,225 దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిని పరిశీలించడానికి తొమ్మిది బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వారు ఇప్పటివరకు 1,443 దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పర్యటన చేసి భూములను పరిశీలించారన్నారు. మిగతావాటిని కూడా త్వరగా పరిశీలించాలని ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో సంయుక్త సర్వే చేపట్టాలన్నారు. దీర్ఘకాలిక సమస్యలను సైతం పరిశీలించాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, సబ్కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్, ల్యాండ్ సర్వే సహాయ సంచాలకులు శ్రీనివాస్, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తహసీల్దార్లు, రెవెన్యూ, అటవీ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పటివరకు 1,443 దరఖాస్తుల పరిశీలన మిగతావాటిని త్వరగా పరిష్కరించాలి రెవెన్యూ బృందాలతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
రూ. 2.10 కోట్ల రుణాలు రికవరీ
లింగంపేట: శెట్పల్లిసంగారెడ్డి సొసైటీ పరిధిలో రైతులకు ఇచ్చిన దీర్ఘకాలిక రుణాలు రూ. 2.10 కోట్లు రికవరీ చేసినట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మేనేజర్ లింబాద్రి తెలిపారు. శుక్రవారం ఆయన శెట్పల్లిసంగారెడ్డి సొసైటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ నుంచి రైతులకు రూ. 6.70 కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇవ్వగా అందులో 2024–25 సంవత్సరానికి రూ. 2.10 కోట్లు వసూలయ్యాయన్నారు. మండలంలోని లింగంపేట, నల్లమడుగు సొసైటీల కంటే ఎక్కువగా రుణాలు రికవరీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ సీఈవో శ్రీనివాస్ను సన్మానించారు. కార్యక్రమంలో లింగంపేట సహకార బ్యాంకు మేనేజర్ కుమార్స్వామి, అధికారులు పాల్గొన్నారు. మూడు రోజుల్లో 130 సెల్ఫోన్ల రికవరీ కామారెడ్డి క్రైం: జిల్లాలో సెల్ఫోన్ పోయిందనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడంతో సీఐ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఆర్ఎస్సై, 10 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి 3 రోజుల్లోనే 130 ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. రికవరీ చేసిన సెల్ఫోన్లను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. లేకపోతే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశాలు ఉంటాయన్నారు. వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డు తీసుకోవాలని సూచించారు. ఇలా చేస్తే పోయిన సెల్ఫోన్లను సీఈఐఆర్ విధానంలో రికవరీ చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేశామన్నారు. సమాచారం లేని వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (8712686114) ను సంప్రదించాలని సూచించారు. బాన్సువాడ డీఎస్పీగా విఠల్రెడ్డి బాన్సువాడ : బాన్సువాడ డీఎస్పీగా విఠల్రె డ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బాన్సువాడలో డీఎస్పీగా పనిచేసిన సత్యనారాయ ణ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో న ల్గొండ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో వైస్ ప్రి న్సిపల్గా పనిచేసిన విఠల్రెడ్డి వచ్చారు. శు క్రవారం సత్యనారాయణ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాన్సువాడ టౌన్, రూరల్, బిచ్కుంద సీఐలు, డివిజన్ లోని ఎస్సైలు నూతన డీఎస్పీని కలిశారు. ఉద్యాన పంటలకు ప్రోత్సాహం కామారెడ్డి అర్బన్: జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి కార్యాచరణ రూపొందించామని జిల్లా ఉద్యాన అ ధికారి జ్యోతి తెలిపారు. పండ్ల తోటల పెంపకంతోపాటు మల్చింగ్, నీటి కుంటలు, ఉ ద్యాన యాంత్రీకరణ, సూక్ష్మసేద్యం, గట్లపై వెదురు సాగు, 2,500 ఎకరాల్లో ఆయిల్ తో టల పెంపకాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 2 వేల ఎకరాలకు సబ్సిడీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. పూర్తి వివరాలకోసం కామారెడ్డి, బీబీపేట, దోమకొండ, రాజంపేట, మాచారెడ్డి, పా ల్వంచ, భిక్కనూరు మండలాల రైతులు 89777 14030లో సంప్రదించాలన్నారు. ఎ ల్లారెడ్డి, లింగంపేట, తాడ్వాయి, గాంధారి, రామారెడ్డి, సదాశివనగర్, నాగిరెడ్డిపేట మండలాల రైతులు 89777 14022 నంబర్ లో, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల రైతులు 89777 14029 నంబర్లో సంప్రదించాలని శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. -
సాక్షిపై కక్ష సాధింపు సరికాదు
ఎల్లారెడ్డి: సాక్షి దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించడం సరికాదని జర్నలిస్టులు పేర్కొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై ఏపీ పోలీసుల దాడిని శుక్రవారం ఎల్లారెడ్డి జర్నలిస్టులు ఖండించారు. నిజాలను బయట పెడుతున్న సాక్షి పత్రికపై తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో ఇన్చార్జి ఏవో చంద్రశేఖర్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఎన్యూజే జాతీయ ఉపాధ్యక్షులు రాజేందర్నాథ్, జర్నలిస్టులు రామప్ప, మహేష్, సిద్దు, యశ్వంత్ పవార్, సంగ్రాం, నాగేశ్వర్రావు, శ్రీనివాస్, రాజ్కుమార్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరసన గళమెత్తిన జర్నలిస్టులు నిజామాబాద్అర్బన్: సెర్చ్ వారెంట్ లేకుండా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం సరైంది కాదంటూ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనంజయరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని అన్ని జర్నలిస్టు సంఘాల నాయకులు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపాయి. సుమారు రెండు గంటలపాటు జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడం, అక్రమ కేసులు నమోదు చేయడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రవేశ మార్గం నుంచి నిరసన ప్రదర్శనగా వెళ్లి అదనపు కలెక్టర్ అంకిత్కు వినతిపత్రం అందజేశారు. ఆందోళనలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకుడు జమాల్పూర్ గణేశ్, ఐజేయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బిలి నర్సయ్య, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, ప్రమోద్గౌడ్, రవికుమార్, మోహన్, ధనుంజయ్, రామ్చందర్, సదానంద్, పంచరెడ్డి శ్రీకాంత్, దేవల్ రవిబాబు, ఇంగు శ్రీనివాస్, ఉమామహేశ్వర్, కొక్క రవి, ఆంజనేయులు, జాన్సన్, సురేశ్, సాక్షి బ్యూరో ఇన్చార్జి భద్రారెడ్డి, ఎడిషన్ ఇన్చార్జి ప్రభాకర్, సాక్షి టీవీ వీడియో జర్నలిస్ట్ సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
అశ్రునయనాలతో..
కొవ్వొత్తులతో నివాళి● పాల్వంచలో గ్రేహౌండ్స్ జవాన్కు అంతిమ వీడ్కోలు ● నివాళులర్పించిన మంత్రి పొన్నం, షబ్బీర్, మదన్మోహన్రావు ● అధికార లాంఛనాలతో అంత్యక్రియలుకామారెడ్డి క్రైం/మాచారెడ్డి : నక్సల్స్ అమర్చిన మందుపాతరకు బలైన గ్రేహౌండ్స్ జవాన్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలు శుక్రవారం పాల్వంచ మండల కేంద్రంలో అధికార లాంఛనాలతో జరిగాయి. పాల్వంచ గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చి జవాన్కు కన్నీటి వీడ్కోలు పలికారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య్యరెడ్డి తదితరులు శ్రీధర్ మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. భారీగా తరలివచ్చిన జనం... ములుగు జిల్లా కర్రిగుట్టల్లో నక్సల్స్ అమర్చిన మందుపాతర గురువారం ఉదయం పేలడంతో గ్రేహౌండ్స్ జవాన్ వడ్ల శ్రీధర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వరంగల్లో పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం రాత్రికి పాల్వంచకు చేరుకుంది. శుక్రవారం ఉదయం నుంచే శ్రీధర్ ఇంటికి వేలాది మంది ప్రజలు చేరుకుని కన్నీటి నివాళులర్పించారు. అందరితో కలుపుగొలుగా ఉండే శ్రీధర్ మరణవార్త గ్రామస్తులను కలచివేసింది. ఉదయం గ్రామంలో ఆయన ఇంటి వద్ద ప్రారంభమైన అంతిమయాత్ర ప్రధాన వీధుల మీదుగా సాగింది. శ్రీధర్ స్నేహితులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులు, పోలీసులు శ్రీధర్ అమర్రహే, జై జవాన్, భారత్మాతాకీ జై అంటూ నినదించారు. గ్రామ శివారులోని శ్మశానవాటికలో మృతదేహాన్ని ఖననం చేశారు. ఆయన సోదరుడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పోలీసులు తుపాకులు పేల్చి గౌరవవందనం చేశాారు. శ్రీధర్ తల్లి లక్ష్మి, భార్య శ్రీవాణిల రోదనలతో అక్కడి వారి హృదయాలు ద్రవించాయి. అంత్యక్రియలలో గ్రేహౌండ్స్ కమాండర్ (ఆపరేషన్స్) రాఘవేందర్రెడ్డి, ఓఎస్డీ దయానంద్, డీఎస్పీ శంకరయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.పాల్వంచలో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న గ్రామస్తులు -
అసంపూర్తిగా అంగన్వాడీ భవనాలు
నస్రుల్లాబాద్: మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గతంలో రూ. తొమ్మిది లక్షల నిధులు కేటాయించి భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. పనులు మొదట పెట్టి ఏళ్లు గడుస్తున్నా అంగన్వాడీ భవనాలు మాత్రం పూర్తి కావడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అద్దె భవనాల్లో.. అంగన్వాడీ భవనాలకు సంబంధిత కాంట్రాక్టర్లు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినా అనుకున్న ప్లాన్ ప్రకారం నిర్మాణ పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపేశారు. దీంతో చిన్నారులు అద్దె భవనాల్లోనే చదువును కొనసాగిస్తున్నారు. పలు చోట్ల ఇరుకు గదులు, రేకుల ఇళ్లలో కాలం వెల్లదీస్తున్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి, రాముల గుట్ట తండా, ఫకీరానాయక్ తండాల్లో ఉన్న కేంద్రాలు ప్రారంభించి మధ్యలోనే నిలిపేశారు. అంగన్వాడీ భవన నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోవడంతో మందు బాబులకు అడ్డాగా, అసాంఘిక కార్యాకలాపాలకు నిలయంగా మారింది. శాశ్వత భవన పనులు పూర్తి కాకపోవడంతో చి న్నారులు అద్దె భవనంలో ఇరుకు గదులలో అ వస్తలు పడుతున్నారు. నిధులను కేటాయించి పను లు మొదలు పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. రాముల గుట్ట తండాలో నిలిచిన పనులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిన పరిస్థితి నిధులు లేక పూర్తి కాని నిర్మాణాలు అద్దె గదిలో చిన్నారుల అవస్థలు పనులను పూర్తి చేయాలి చిన్నారులు, బాలింతలు, గర్భిణులు ఇరుకు గదుల్లో ఉంటున్నా అధికారులకు స్పందించడం లేదు. సరైన భవనాలు లేక అంగన్వాడీ సరుకులు సైతం ఎలుకలకు ఆహారంగా మారుతున్నాయి. అసంపూర్తిగా ఉన్న భవన నిర్మాణాలు చేపట్టాలి. – పుట్ట భాస్కర్, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు