Srikakulam
-
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ కష్టాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని కూటమి సర్కార్ నిలిపివేయడంతో రాష్ట్రంలో రేషన్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రేషన్ షాప్ వద్దకు వచ్చి సరుకులు తీసుకునేందుకు గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండలో రేషన్ తెచ్చుకొనేందుకు వృద్ధులు, వికలాంగులు తీవ్ర పాట్లు పడుతున్నారు.పాతపట్నం నియోజకవర్గంలోని గొట్టిపల్లి, పెద్ద రాజపురం, చిన్న రాజపురం, చీపురుపల్లి, పెద్దగూడ, దిగువగూడ, గ్యాసరగూడ, శివుడి మామిడిగూడ, జెన్నోడుగూడ, బలదగూడ, దబ్బాగూడ గ్రామాలకు చెందిన గిరిజనులకు రేషన్ కష్టాలు మొదలయ్యాయి. రేషన్ కోసం కూలి పనులు మానుకోవాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.అల్లూరి సీతారామరాజు జిల్లా: ఏజెన్సీలోనూ రేషన్ కష్టాలు మొదలయ్యాయి. కిలోమీటర్ల దూరం వెళ్లి మళ్లీ రేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వ్యవస్థ ద్వారా తమకు చాలా మేలు జరిగిందంటున్న గిరిజనులు.. అదే పథకాన్ని పునరుద్ధరించాలని ఏజెన్సీ వాసులు కోరుతున్నారు.కోనసీమ జిల్లా: ఇంటి వద్దకే రేషన్ అందించే విధానాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపివేయడంతో ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ రేషన్ కష్టాలు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపుు వద్ద వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు. మండుటెండల్లో మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
మద్యానికి బానిసై వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. అనంతరం టెక్కలి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ శాలిపేట గ్రామానికి చెందిన చలపాక తారకేశ్వరరావు (39)గా గుర్తించినట్లు తెలిపారు. మద్యానికి బానిసై నిత్యం తాగుతూ ఉంటాడని, శరీరం డీ హైడ్రేషన్కు గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. కారు బోల్తా.. తప్పిన ప్రాణాపాయం టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఓ కారు బోల్తాపడింది. ఒడిశాకు చెందిన ఏడుగురు వ్యక్తులు దైవ దర్శనానికి విశాఖపట్నం వెళ్లి తిరిగి వస్తుండగా శ్రీపురం సమీపంలో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రూ.23,700 విలువైన కలప స్వాధీనం ఎచ్చెర్ల: ప్రాంతీయ నిఘా అమలు అధికారి బి. ప్రసాదరావు ఆదేశాల మేరకు లావేరు మండ లం బెజ్జిపురం జంక్షన్ వద్ద విజిలెన్స్, అటవీశా ఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. రణస్థలం మండలం చిల్లపేట గ్రామాని కి చెందిన సిల్లా శంకరరావు అటవీశాఖ అను మతులు లేకుండా బుడతవలస నుంచి చిల్లపేటకు అక్రమంగా తరలిస్తున్న రూ.23,700 విలువైన అకేషియా కలప దుంగలను పట్టుకున్నారు. అనంతరం బొలెరో వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా కలపను తరలిస్తు న్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని అధికారులు తెలిపారు. ఈ తనీఖీల్లో విజిలెన్స్ అధికారులు సీఐ సతీష్కుమార్, ఎస్సై రామారావు, సిబ్బంది ఈశ్వరరావు, కన్నబా బు, అటవీశాఖ అధికారులు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గౌరీశంకర్ పాల్గొన్నారు. 23 కేజీల గంజాయి సీజ్ నరసన్నపేట: మడపాం టోల్గేట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 23 కేజీల 800 గ్రాముల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనలో పర్లాకిమిడికి చెందిన ముక్తా పరిషా, కటక్కు చెందిన రత్నాకర్ జెన్నాలను అరెస్టు చేశారు. శనివారం నరసన్నపేట సర్కిల్ స్టేషన్లో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. మడపాం టోల్గేట్ వద్ద శనివారం ఉదయం , మధ్యాహ్నం వేర్వేరుగా నరసన్నపేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. ముక్తా పరిషా అనే మహిళ మూడేళ్ల బిడ్డతో 10 కేజీల గంజాయిని పర్లాకిమిడి నుంచి చైన్నెకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆమెతో ఉన్న మరో వ్యక్తి పరారయ్యాడు. అలాగే కటక్ నుంచి హైదరాబాద్కు రత్నాకర్ అనే వ్యక్తి 13 కేజీల 800 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేసి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండు కేసుల్లో మరింత దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. సమావేశంలో నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ ధారణ తప్పనిసరి శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, ఎఫ్ఏసీ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.శ్రీధర్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ట్రాఫిక్ నిబంధనలు, మోటారు యాక్ట్పై అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి శ్రీధర్, ట్రాఫిక్ సీఐ వి.నాగరాజు, పారా లీగల్ వలంటీర్లు పాల్గొన్నారు. నదిలో జారిపడి వృద్ధుడి మృతి శ్రీకాకుళం రూరల్: బైరి గ్రామానికి చెందిన గొర్లె రామారావు(70) శనివారం సాయంత్రం ఆరుబయటకు వెళ్లి వంశధార నది వద్ద ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఎవరూ లేకపోవడంతో మునిగిపోయి చనిపోయాడు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కాలంలో నదిలో ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరిగాయని, ఆ గోతులే ప్రాణాలు బలిగొంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీకాకుళం
అమ్మో..జూన్జూన్ భయపెడుతోంది. ఓ వైపు స్కూలు ఖర్చులు, మరోవైపు ఖరీఫ్ ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. –8లోఏడాదిలో హామీలే మిగిలాయి ● వెన్నుపోటు పొడవడంలో బాబుకు ఎవరూ సాటిరారు ● బాబుకు ఓటేసినందుకు జనం నోట్లో మట్టి కొట్టారు ● జూన్ 4న వెన్నుపోటు దినం ● పోస్టర్ ఆవిష్కరణలో ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు ఆదివారం శ్రీ 1 శ్రీ జూన్ శ్రీ 2025శ్రీకాకుళం రూరల్: కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలో హామీలే మిగిలాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు తెలిపారు. జూన్ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం పోస్టర్ను శనివారం స్థానిక పార్టీ కా ర్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపుతో వెన్నుపోటు దినోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం వెన్నుపోటుతోనే మొదలైందన్నారు. వెన్నుపోటు పొడవడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని చురకలు అంటించారు. సాధ్యం కాని హామీలు ఇ చ్చి ఇప్పటికీ వాటిని అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే సంవత్సరానికి లక్షా 25వేల కోట్లు బడ్జెట్ అవసరమన్నారు. 25 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగులకు రూ.3వేలు, రాష్ట్రవ్యాప్తంగా బడికి వెళ్లే 40లక్షల మంది పిల్లలకు రూ.15వేలు ఇస్తామంటూ ఇచ్చిన మాటలన్నీ మర్చిపోయారని అన్నారు. మహిళలకు ఉచిత న్యూస్రీల్ -
‘ఖరీఫ్ సమీపిస్తున్నా సన్నద్ధత లేదు’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఖరీఫ్ సమీపించినా ఇంతవరకు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయలేదని, కూటమి ప్రభుత్వానికి ముందు చూపు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగ రం పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి వెంకట సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముందస్తు నైరుతి రు తుపవనాలు వచ్చినా ఇప్పటివరకు సిద్ధం చేయలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నా రు. పెట్టుబడి సాయం ఎలాగూ ఇవ్వలేదు, కనీసం ఎరువులు, విత్తనాలు ముందస్తు ప్రణాళికతో సమకూర్చకపోతే ఎలా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏటా ముందస్తుగానే ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉండేవన్నారు. -
● సేద్యానికి, చదువులకూ ఒకేసారి ఖర్చులు ● రైతులు, సామాన్యులపై ఆర్థిక భారం ● గత ప్రభుత్వంలో ఆసరాగా నిలిచిన రైతుభరోసా, అమ్మఒడి పథకాలు
బడులు అవసరమవుతాయి. ఏ పంట వేయాలన్నా తొలినాళ్లలోనే ఎకరాకు తక్కువలో తక్కువ రూ.20 వేలు ఖర్చు చేయాల్సిందే. దీంతో పెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు. చదువులకు ఖర్చు ఎక్కువే.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 90 వేల మంది, గురుకుల పాఠశాలల్లో 10వేల మంది విద్యార్థులు చదువుతుండగా, 50 వేల మంది పైచిలుకు విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్నారు. ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థల్లో మరో వేల 20వేల మంది వరకు చదువుతున్నట్లు అంచనా. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం, బ్యాగులు, షూస్ కోసం కనిష్టంగా రూ.10వేలు వరకు ఖర్చు చేయాల్సిందే. రూ.20వేల నుంచి రూ,50వేల వరకు ఫీజులు కోసం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.50వేలకు పైబడి ఖర్చు ఉంటుంది. ఇక, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు 65 వేల మంది ఉన్నారు. వీరంతా ఉన్నత విద్య కోసం రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. అప్పులు చేయాల్సిందే.. ఏటా జూన్లో పంటల సాగు, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఏకకాలంలో రెండు రకాల ఖర్చులు భారంగా మారాయి. అవసరమైన సమయంలో బ్యాంకుల్లో రుణాలు లభించని పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేస్తున్నారు. ఎక్కువ వడ్డీలు కూడా పేద, మద్య తరగతి వర్గాలకు ఇబ్బందికరంగా తయారవుతోంది. ఏది ఏమైనా జూన్ నెల గట్టెక్కడం సామాన్యుడికి సవాల్ అనే చెప్పాలి. అందని పథకాల సొమ్ము.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల రూపంలో దాదాపు ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు డబ్బులు ఖాతాల్లో జమయ్యేవి. అవి స్కూల్, వ్యవసాయం, ఇతర ఖర్చులకు ఆసరాగా నిలిచేవి. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన పథకాలతో ఠంఛనుగా చెప్పిన తేదీకే తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ము జమా అయ్యేది. దీంతో పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలు తమ పిల్లల్ని దర్జాగా చదివించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాలకు పంగనామాలు పెట్టేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో అమ్మఒడి పేరిట రూ.1298.51 కోట్లు తల్లులు ఖాతాల్లో వేస్తే, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పైసా విదల్చలేదు. దీంతో 2.10 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచారంగా మారింది. ఉన్నత విద్య చదువుతున్న 65 వేల మంది విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. రైతన్నకు తిప్పలు.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లాలోని రైతు భరోసా పథకం ద్వారా 18.19 లక్షల ఎకరాల భూమికి పెట్టుబడి సాయం, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉచిత పంటల బీమా పథకంతో ఆదుకునేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింఇచ్ఛాపురం రూరల్: పిల్లలు బడి బాట.. పెద్దలు పొలంబాట పట్టే సమయం ఆసన్నమైంది. దీంతో అందరిలోనూ ‘జూన్’ గుబులు ప్రారంభమైంది. వ్యవసాయంలో పెట్టుబడులు ఎంత అవసరమో, పిల్లల చదువులకూ అంతకన్నా ఎక్కువే అవసరమవుతోంది. రెండింటికీ ఒకే సమయంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితుల్లో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడం, చదువులకు సంబంధించిన ఫీజులు, ఇతర ఖర్చులు కూడా పెరిగి జూన్ ఎలా గట్టెక్కేదని ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీసీ ప్రభుత్వంలో రైతుభరోసా, అమ్మఒడి వంటి పథకాలు సకాలంలో అందడంతో ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పెరిగిన సాగు ఖర్చులు.. జిల్లాలో మెజారిటీ ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో ఎడ్లు నాగల్లతో దుక్కిదున్నేవారు. ప్రస్తుతం 90 శాతానికి పైగా రైతులు ట్రాక్టర్లనే వినియోగిస్తున్నారు. దీంతో దుక్కి దున్న డం నుంచి విత్తనం వేసే వరకు ఖర్చు రెట్టింపవుతోంది. విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టు -
సంబరాలకు వేళాయె..!
● కంచిలిలో నేటి నుంచి కంచమ్మతల్లి ఉత్సవాలు ● తొమ్మిది రోజులపాటు నిర్వహణ ● భారీ విద్యుత్ అలంకరణలతో ముస్తాబు కంచిలి : మండల కేంద్రం కంచిలిలో కొలువై ఉన్న కంచమ్మతల్లి అమ్మవారి ఉత్సవాలు ఆదివారం రాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 10వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు ఆరు నెలల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గ్రామస్తులు సమావేశమై ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భారీ స్థాయిలో విద్యుత అలంకరణ చేపట్టారు. పది రోజులపాటు పురవీధుల్లో అమ్మవారిని ఊరేగించనున్నారు. 2015లో చివరి సారిగా గ్రామదేవత ఉత్సవాలు నిర్వహించారు. మళ్లీ పదేళ్ల తర్వాత జరుగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి అమ్మవారిని గ్రామంలోకి ఆహ్వానం పలకడానికి సర్వం సిద్ధం చేశారు. నమూనా విగ్రహం ఏర్పాటు.. భక్తుల దర్శనార్ధమై అమ్మవారికి వజ్రవైడూర్యాలు, బంగా రు ముత్యాలహారం, బంగారు జడపాళి, వెండి మకరతోరణం, వెండి కవచం, బంగారు అభయహస్తం తదితర ఆభరణాలను అమ్మవారి నమూనా విగ్రహానికి అలంకరించా రు. ఈ విగ్రహాన్ని స్థానిక రైల్వేస్టేషన్ కూడలి వద్ద పీఠస్థా నంసమీపంలో మెయిన్రోడ్డు పక్కన ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలివే.. అమ్మవారి ఊరేగింపుతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. ఒకటో తేదీ రాత్రి అమ్మవారిని కాళికాదేవి నృత్యనాట్య ప్రదర్శనలతో ఆర్భాటంగా ఆహ్వానించనున్నారు. 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం అమ్మవారి ఆభరణాలు పెట్టెను మేళతాళాలతో ఊరేగింపుగా పీఠస్థానం వద్దకు తీసుకొస్తారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు అమ్మవారి ఊరగింపుతోపాటు గ్రామదేవతలు, గ్రూపు డ్యాన్స్లు, కోలాటం, పాలబొమ్మలు, తీన్మార్, చైనా కోబ్రా తదితర కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ప్రతి రోజు రాత్రి 8 గంటల నుంచి కంచిలి జూనియర్ కళాశాల మైదానంలో వివిధ స్టేజి ప్రోగ్రామ్లు నిర్వహించనున్నారు. -
●పట్టించుకోవడం లేదు
నా భర్త రామారావు ఇటీవల మృతిచెందారు. గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ తీసుకునే వారు. ఆయన చనిపోయాక నాకు పెన్షన్ ఇస్తారని పెద్దలు చెప్పారు. దీంతో నేను సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. వెంటనే మంజూరు చేశారు. కానీ దాన్ని ఆమదాలవలస ఎమ్మెల్యే అడ్డుకున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై కలెక్టర్ గ్రీవెన్స్కు వెళ్లాం. కలెక్టర్ ఎంపీడీఓకు ఆదేశాలు జారీ చేశారు. కానీ పింఛన్ మాత్రం ఇవ్వలేదు. మాలాంటి పేదల పొట్టలు కొడుతున్నారు. – గుజ్జు లక్ష్మి, కటకమయ్యపేట, బూర్జ మండలం -
కేశవరావు పెద్ద కర్మపై ఆంక్షలు సరికాదు
టెక్కలి: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు పెద్దకర్మ కార్యక్రమంపై పోలీసులు ఆంక్షలు విధించడం సరికాదంటూ సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ రాష్ట్ర నాయకులు పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు శనివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. మృతదేహాన్ని అప్పగించకుండా ఆంక్షలతో అడ్డుకున్నారని, ఇప్పుడు కుటుంబ సభ్యులు చేపట్టనున్న పెద్దకర్మ కార్యక్రమం పై పోలీసులు లేని పోని ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా మని పేర్కొన్నారు. ఎలాంటి సంతాప సభలు లేకుండా కేవలం కుటుంబ సభ్యులు చేస్తున్న కార్యక్రమానికి ఈ విధంగా అడ్డుకోవడం మంచిది కాదన్నారు. దీన్ని వివిధ రాజకీయ పా ర్టీలు, ప్రజా సంఘాలతో పాటు ప్రజాస్వామిక వాదులు ఖండించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్దానంలో కార్గో విధ్వంసం వద్దు మందస: మందస మండలం బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్ పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కోమర వాసు పిలుపు మేరకు ప్రజా కళా మండలి అధ్యక్షుడు కొర్రాయి నీలకంఠం, రంగం కళాకారుడు కొనారి సూధన్ ఆధ్వర్యంలో శనివారం కళాజాత కార్యక్రమం నిర్వహించారు. పచ్చని ఉద్దానంలో విధ్వంసకర ఎయిర్ పోర్టు నిర్మాణాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు. రాంపురం, భేతాళపురం, చీపురుపల్లి గ్రామాల ప్రజలు వీరికి సంఘీభావం తెలిపారు. ఏ అభివృద్ధి పనులైనా ప్రజలకు ప్రయోజనం కలిగించాలని, వారి ఆమోదం ఉండాలని సీపీఎం కార్యదర్శి డి.గోవిందు, జిల్లా కార్యదర్శి తాండ ప్రకాశ్, కొర్లా హేమారావు, తెప్పల అజయ్ తెలిపారు. భాగంగా జుత్తు గున్నయ్య, తెప్పల గున్నయ్య, దున్న హరికృష్ణ, రాములమ్మ, కృష్ణారావు, ఉద్యానవనం యూనివర్సిటి బోర్డు మెంబర్ బత్తిని లక్ష్మణరావు, నారాయణ, గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు. పీఎస్హెచ్ఎంల వెబ్ ఆప్షన్కు మరో రోజు గడువు పెంపు శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంల వెబ్ ఆప్షన్కు ప్రభుత్వం మరో రో జు గడువు పెంచింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక విజ్ఞప్తి మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి వెబ్ఆప్షన్ల నమో దు చేసుకునేందుకు ఆదివారం సాయంత్రం వరకు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నేత్రపర్వంగా మల్లన్న వార్షిక కల్యాణం టెక్కలి: టెక్కలి మండలం రావివలస గ్రామంలో గల ఎండల మల్లి కార్జునస్వామి దేవస్థానంలో శనివారం స్వామి వా రి వార్షిక కల్యా ణాన్ని నేత్రపర్వంగా నిర్వహించా రు. కార్యనిర్వహణాధికారి జి.గురునాధరావు ఆధ్వర్యంలో అర్చకులు రామకృష్ణ, మోహన్రావు, యుగంధర్ తదితరులు భ్రమరాంబ సమేత మల్లన్నకు కల్యాణం నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్.ఎల్.నాయుడు, బి.జగదీ శ్వర్రావు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
అప్పులు చేసి చదివిస్తున్నాం
జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది పిల్లల చదువుకు సంబంధించి అమ్మ ఒడి పథకం ద్వారా నేరుగా మా ఖాతాలో జమ అయ్యేది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం ద్వారా సొమ్ము ఇస్తామన్నారు. నేటికి ఏడాది అవుతున్నా నయా పైసా కూడా ఇవ్వలేదు. రోజురోజుకు పెరుగుతున్న బడ్జెట్ కారణంగా పిల్లల్ని చదివించుకునేందుకు సగటు మధ్యతరగతి ప్రజలు అప్పులు చేయాల్సి వస్తోంది. – దున్న జ్యోతి, బూర్జపాడు, ఇచ్ఛాపురం మండలం ద ప్రతీ ఏడాది రూ.20వేలు ఇస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేరలేదు. దీంతో ఏడాది నుంచి అన్నదాతలు అప్పులు చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు. వ్యవసాయం కోసం తలకు మించి అప్పులు చేసి కొంత మంది అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. -
‘ఉపాధి’లో పైసా కూడా దుర్వినియోగం కాకూడదు
● రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ● పీఆర్ శాఖ ఇంజినీర్ల పనితీరు మారాలి ● నరసన్నపేట పర్యటనలో పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ నరసన్నపేట: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఎక్కడా పైసా కూడా దుర్వినియోగం కాకూడదని, మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మరింత బాధ్యతగా వినియోగించాలని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. నరసన్నపేట మండలం బొరిగివలస, నరసన్నపేటలో శనివారం పర్యటించారు. మెటీరియల్ కాంపొనెంట్ నిధులతో నిర్మించిన రోడ్లు, ఉపాధి నిధులతో నిర్మించిన ఫారం పాండ్స్, సోప్ పిట్స్ పరిశీలించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్కు హాజరై జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలను తిలకించారు. బొరిగివలస వద్ద ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ కాంపొనెంట్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన రోడ్డును పరిశీలించారు. రోడ్డు పక్కల వేసిన బెర్ములు నాణ్యతగా లేకపోవడాన్ని గమనించి పీఆర్ ఇంజనీర్లను ప్రశ్నించారు. గ్రావెల్కు బదులు మట్టి వేస్తున్నారని , రోడ్డు వేసిన తరువాత బెర్ములు నాణ్యతగా ఉంటేనే పది కాలాలు ఉంటుందని చెప్పారు. ఇలాగే పనులు చేస్తున్నారా.. అంటూ మండి పడ్డారు. బిల్లులు చెల్లించాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి తీసుకొస్తున్నారని పీఆర్ ఇంజనీర్లు వెనకేసుకురావడాన్ని ఆయన తప్పుపట్టారు. అనంతరం బొరిగివలసలో ఫారం పాండ్స్ను పరిశీలించి రైతు పొన్నాడ ప్రసాద్కు పలు సూచనలు చేశారు. పంచాయతీ కార్యాలయం సమీపంలో మంచినీటి బోరు వెల్ వద్ద సోప్పిట్ నిర్మాణం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి వేతనాలు త్వరలోనే విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, పీడీ బి.సుధాకర్, జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, పలువురు ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కోవిడ్ అప్రమత్తతపై నిర్లక్ష్యం
● జిల్లాకు చేరని పరీక్ష కిట్లు ● అందుబాటులో లేని మందులు శ్రీకాకుళం: కోవిడ్ అప్రమత్తతపై ప్రభు త్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రిలో పది పడకల వార్డును ఏర్పాటు చేసినప్పటికీ వ్యాధి లక్షణాలతో వచ్చిన వారిని పరీక్షించేందుకు కిట్లు లేవు. నాలుగేళ్ల కిందట తెప్పించి మిగిలిపోయిన కిట్లతో ప్రస్తుతం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అప్పట్లో ఈ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తే వ్యాధి నిర్ధారణ కాదని, ఫలితాలు తప్పుగా వస్తున్నాయని పక్కన పడేశారు. ఇప్పుడు కిట్లు సరఫరా కాకపోవడంతో మరో గత్యంతరం లేక పాత కిట్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు గానీ, మాస్క్లు గానీ, నోడల్ బృందాలు గానీ ప్రత్యేక పారిశుద్ధ్య పనులు గానీ చేపట్టడం లేదు. ఇది ప్రమాదకమైన పరిస్థితులకు దారితీస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కోవిడ్ నిర్ధారణ పరీక్షలు మండల స్థాయిలో కాకుండా, జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాటు చేయటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ప్రస్తుత వేరియంట్ ప్రమాదకరం కాదంటూనే గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులకు ఈ వేరియంట్ వల్ల ప్రమాదం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పరీక్ష కిట్లు, మందులు, మాస్క్లు, శానిటైజర్లు జిల్లాకు, మండల కేంద్రాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని, ప్రజలను అవగాహన కలిగిస్తూ, అప్రమత్తం కలిగించాలని కోరుతున్నారు. కిట్లు తెప్పిస్తున్నాం జిల్లాకు ఒకటి, రెండు రోజు ల్లో కోవిడ్ నిర్ధారణ పరీక్ష కిట్లు వస్తాయి. పాత కిట్లు సుమారు 2500 వరకు ఉన్నాయి. మాస్క్లు, శానిటైజర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రజలకు అవగాహన కలిగించేలా తగిన చర్యలు తీసుకున్నాం. గ్రామస్థాయిలో వైద్య సిబ్బంది వెళ్లి అప్రమత్తం చేస్తున్నారు. – డాక్టర్ అనిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, శ్రీకాకుళం -
స్కూల్ అసిస్టెంట్ పోస్టుల పదోన్నతులకు వేళాయె
● సీనియారిటీ జాబితా ప్రకారం అర్హులైన ఎస్జీటీల సర్టిఫికెట్ల పరిశీలన రేపు ● 73 పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ చర్యలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్లలో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ) పోస్టులను అర్హులైన సెకెండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ)లతో భర్తీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్జీటీల సర్టిఫికెట్లను జూన్ రెండో తేదీన పరిశీలించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లలోని ఉన్నత పాఠశాలల్లో ఖాళీ (పదవీవిరమణ, మరణం, రీఅపోర్షన్ కారణంగా)గా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల పోస్టులను అర్హత కలిగిన ఎస్జీటీలు, త త్సమాన కేటగిరిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో భర్తీ చేసేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. 73 పోస్టుల భర్తీకి చర్యలు.. జిల్లాలో వివిధ మేనేజ్మెంట్లలో సబ్జెక్టుల వారీగా మొత్తం 73 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో జిల్లా పరిషత్ పరిధిలో అత్యధికంగా ఎస్ఏ పీఈ (ఫిజికల్ ఎడ్యుకేషన్) 33 పోస్టులు ఉండటం గమనార్హం. సంబంధిత సబ్జెక్టులలో సీనియారిటీ జాబితాను శ్రీకాకుళం డీఈఓ.ఓఆర్జీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. సీనియారిటీ జాబితాలో పేర్కొన్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరీ ఉపా ధ్యాయులు మాత్రమే జూన్ రెండో తేదీన ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం ప్రభుత్వ(బాలుర) ఉ న్నత పాఠశాల వేదికగా జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. సీనియారిటీ జాబితాలో ఉన్న ఎస్జీటీలు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు సర్వీస్ రిజిస్టర్తో తమవెంట తీసుకురావాలని డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. -
5న ప్రభుత్వ ఉద్యోగుల మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మూడో రాష్ట్ర కౌన్సిల్ మహాసభలు ఈ నెల 5న జరగనున్నాయని, ఈ సభలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ఉద్యోగులు తరలిరావాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రతినిధులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని క్లాత్ మర్చంట్ అసోసియేషన్ కార్యాలయంలో శనివారం సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని, పెండింగ్ పీఆర్సీ, డీఏ, ఎస్ఎల్ఎస్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు కోసం, సీపీఎస్/జీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని, 1వ తేదీన జీతాలు/ పెన్షన్లు చెల్లింపు చట్టబద్దం చేయాలని, ఎన్ఎంఆర్ కంటింజెంట్ / కాంట్రాక్టు / ఔట్ సోర్సింగు ఉద్యోగుల రెగ్యులరైజెషన్ తదితర 14 ప్రధాన డిమాండ్ల ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సభ్యులు తెలిపారు. అనంతరం మహాసభల పోస్టర్ను ఉద్యోగులు ఆవిష్కరించారు. సమావేశంలో ప్రెసిడెంట్ ఎస్.సోమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సంతోష్ కుమార్, స్టేట్ కార్యదర్శి జి.తిరుపతిరావు, సంఘ ప్రతినిధులు ఇప్పిలి నారాయణరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పైల రవి, టౌన్ బోడి ప్రెసిడెంట్ పి.నాగేశ్వరరావు, టౌన్ సెక్రటరీ సూర్య చంద్ర, కె.రాజేశ్వరరావు, వి.శరథబాబు, అప్పలనాయుడు, రాష్ట్ర, జనరల్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. -
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
కొత్తూరు/సరుబుజ్జిలి: జిల్లాలో వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ఇద్దరు మృత్యువాతపడ్డారు. కొత్తూరు మండలం ఆకులతంపర కాలనీకి చెందిన పెయ్యల సింహాచలం(79) శనివారం కాలనీ సమీపంలో ఉన్న పొలాల్లోకి మేకలను మేతకు తీసుకెళ్లాడు. ఇంతలో వర్షం కురవడంతో చింతచెట్టు కిందకు చేరుకున్నాడు. ఇంతలో పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు సర్పంచ్ నాగళ్లు అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ కేసు నమోదు చేశారు. సింహాచలంకు భార్య పున్నమ్మ, వివాహమైన ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే విధంగా, సరుబుజ్జిలి మండలం బుడ్డివలసకు చెందిన బూరాడ అప్పలనాయుడు(54) పొలం పనులకు వెళ్లగా పిడుగుపాటుకు కుప్పకూలిపోయాడు. స్థానికులు స్పందించి పీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతిచెందాడు. అప్పలనాయుడుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
ఆదివారమైనా బాధ్యతలు స్వీకరించాల్సిందే
● హెచ్ఎంలుగా పదోన్నతి పొందినవారు నేడు విధుల్లో చేరిక శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖలో ఇటీవల హెచ్ఎంలుగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ఆదివారం విధుల్లో చేరనున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లలో ఇటీవల 83 మంది స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. వీరికి గత నెల 29న శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వేదికగా పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆరోజు ఉదయం 10 గంటలకు మొదలువకావాల్సిన ఆన్లైన్ కౌన్సెలింగ్ సాయంత్రం 6 నుంచి రాత్రి 9.30 వరకు మాన్యువల్ విధానంలో పూర్తిచేసిన ఉదంతం విదితమే. కాగా ఆరోజు హెచ్ఎంలగా పదోన్నతి పొందిన వారంతా ఎంపిక చేసుకున్న పాఠశాలల్లో ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించి, విధుల్లో చేరాల్సిందేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఈ 83 మందిలో జిల్లా పరిషత్ మేనేజ్మెంట్లో 80మంది, మున్సిపల్ ఇద్దరు, మున్సిపల్ కార్పొరేషన్లో ఒకరు ఉన్నారు. వీరంతా శనివారం పాత పాఠశాలల నుంచి రిలీవ్ అయ్యారని డీఈఓ తిరుమల చైతన్య పేర్కొన్నారు. -
సీజ్ ద కంపెనీ..
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ఆ మధ్య ‘సీజ్ ద షిప్’ అని కూటమిలోని ఓ కీలక నేత ఆదేశాలపట్ల స్ఫూర్తి పొందారో ఏమో.. శ్రీకాకుళం జిల్లాలో కూటమి ఎమ్మెల్యే ఒకరు ‘సీజ్ ద కంపెనీ’ అంటూ చెలరేగిపోతున్నారు. తన స్కూల్కు ఇటీవల ఓ కాంట్ట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలతో గ్రావెల్ను అక్రమంగా తరలించుకుపోవడమే కాక.. ఇప్పుడదే ఎమ్మెల్యే ఏకంగా తన స్కూల్ శ్లాబ్ కోసం రూ.15 లక్షల విలువైన కాంక్రీట్ను ఉచితంగా వేయాలని ఒక కంపెనీని డిమాండ్ చేశారు. అంత చేయలేమని ఆ సంస్థ సున్నితంగా చెప్పడంతో సదరు ప్రజాప్రతినిధి అధికారుల ద్వారా కక్షసాధింపు చర్యలకు తెగబడ్డారు. ‘ఆ కంపెనీని మూస్తారా లేదా.. మీకు పనిచేయడం చేతకాదా..’ అంటూ చిందులు తొక్కడంతో అధికారులు బిక్కుబిక్కుమంటూ చర్యలకు ఉపక్రమించారు.ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలంలోని పైడిభీమవరం పారిశ్రామికవాడలో శర్వాణీ కాంక్రీట్ రెడీమిక్సింగ్ పరిశ్రమ ఉంది. ఇటీవల ఓ కూటమి ఎమ్మెల్యేకి తన స్కూల్ పైఅంతస్తులో శ్లాబ్ వేసేందుకు కాంక్రీట్ అవసరమైంది. పైడిభీమవరంలోని స్థానిక కూటమి నాయకులకు విషయం చెప్పగా వారు శర్వాణి కాంక్రీట్ పరిశ్రమ యాజమాన్యాన్ని సంప్రదించారు. క్యూబిక్ మీటర్కు రూ.4,900లు అవుతుందని.. 300 క్యూబిక్ మీటర్లు సుమారు రూ.15 లక్షలు అవుతుందని యాజమాన్యం చెప్పింది. ఈ సమాచారాన్ని స్థానిక నాయకులు ఆ ఎమ్మెల్యేకి చెప్పగానే.. ‘ఆఫ్ట్రాల్ 300 క్యూబిక్ మీటర్లు ఉచితంగా వేయలేరా? నేను డబ్బులు కట్టాలా’.. అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దీంతో పరిశ్రమ యాజమాన్యంతో స్థానిక నేతలు మరోమారు సంప్రదించగా.. ఎమ్మెల్యేకు కాబట్టి తగ్గిస్తాం తప్ప ఉచితంగా వేయలేమని చెప్పారు. ఇదంతా రెండు నెలల క్రితం జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న సదరు ఎమ్మెల్యే అప్పటి నుంచి ఆ పరిశ్రమ యాజమాన్యానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. నిత్యం పంచాయతీ, కాలుష్య నియంత్రణ, రెవెన్యూ, విద్యుత్ శాఖాధికారులను పంపించి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 2024–25కు గాను పంచాయతీ పన్ను ఏకంగా రూ.21 లక్షలు పైచిలుకు కట్టాలని నోటీసు పంపించారు. ఇలా వారం రోజులుగా ఆయా శాఖల అధికారులు చేస్తున్న హడావుడితో శర్వాణి ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు.. పరిశ్రమ వర్గాలు కూటమి నేతల తీరును తీవ్రంగా నిరసిస్తున్నాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న తమపై ఈ తరహా ఒత్తిళ్లకు గురిచేస్తే వెళ్లిపోవడం తప్ప మరో మార్గంలేదని వాటి యాజమాన్యాలు కుండబద్దలు కొడుతున్నాయి.ఆ ఎమ్మెల్యే మామూలుగా ఇబ్బంది పెట్టడంలేదు..ఎమ్మెల్యే అయి ఉండి కూడా కాంక్రీట్ ఫ్రీగా వేయమంటారు. మాకేమీ అర్థంకావట్లేదు. కాలుష్య నియంత్రణ, ఎంపీడీఓ, తహసీల్దార్ ఇలా ఇష్టమొచ్చిన వాళ్లను పంపిస్తున్నాడు. 300 క్యూబిక్ మీటర్లు అడిగారు. రూ.15 లక్షలు విలువ ఉంటుంది. ఎమ్మెల్యే ఒత్తిడితో నిత్యం అధికారులు వస్తున్నారు. వాళ్లు కూడా బాధపడుతున్నారు. ఎమ్మెల్యే మామూలుగా ఇబ్బంది పెట్టడంలేదు. – శర్వాణి పరిశ్రమ యాజమాన్యం పన్ను కట్టాలని నోటీసు ఇచ్చాం..పైడిభీమవరం పారిశ్రామికవాడలోని అన్నీ పరిశ్రమలకు పన్ను చెల్లించాలని నోటీసు ఇచ్చాం. అందులో భాగంగానే శర్వాణి పరిశ్రమకూ అందించాం, ఇప్పటికే రెండుమార్లు ఇచ్చాం.– ఎం. ఈశ్వరరావు, ఎంపీడీఓ, రణస్థలం పరిశ్రమను సందర్శించాం..శర్వాణి పరిశ్రమను ఇటీవల సందర్శించి నాలా కన్వర్షన్ జరిగిందా లేదా అని పరిశీలించాం. నాలా కన్వర్షన్ జరిగింది, మిగతా విషయాలను మండల పరిషత్ అధికారులే చూస్తున్నారు. – ఎన్. ప్రసాద్, రణస్థలం తహసీల్దార్ -
● సర్వర్ డౌన్.. అంతా పరేషాన్
రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు.. కొత్త రేషన్ కార్డుల నమోదు అంటూ ఊదరగొట్టింది కూటమి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఎప్పుడు సచివాలయానికి వెళ్లినా సర్వర్ డౌన్.. వెబ్సైబ్ నాట్ ఓపెన్.. చాలా వరకు ఇవే సమాధానాలు వినిపించాయి. ఈకేవైసీ విషయానికొస్తే చుక్కలు కనబడుతున్నాయి. వేలి ముద్రలు పడడం లేదు. నెట్వర్క్ సమస్య తీవ్రంగా ఉండి.. పనులు ముందుకు సాగడం లేదని లబ్ధిదారులు వాపోతున్న విషయం ఇటీవల ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. ఇదీ కూటమి ప్రభుత్వం ప్రజల సౌకర్యాలపై చూపిస్తున్న శ్రద్ధ. ప్రకటనలకు మాత్రమే పరిమితమైన వైనం. – ఆమదాలవలసకూటమి పాలనలో -
నాడు–నేడు ఆగింది చూడు
నాడు–నేడు విద్యా వ్యవస్థ ఎన్నడూ చూడని విప్లవం. దశాబ్దాల తరబడి అలాగే కునారిల్లుతున్న ప్రభుత్వ బడులకు వైఎస్ జగన్ కొత్త జీవం పోశారు. తాగునీరు, రన్నింగ్ నీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, ఐఎఫ్పీ ప్యానల్స్, గ్రీన్చాక్బోర్డు, ఫర్నీచర్, ఫ్యాన్లు, లైట్లు, ఆర్వో ప్లాంట్లు ఇలా బడులకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలను సంవృద్ధిగా కల్పించారు. నాడు–నేడు మొదటి ఫేజ్ కింద 1247 పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దారు. రెండోఫేజ్లో 1096 విద్యాసంస్థలను బాగు చేశారు. వీటిలో సగంలో ఆగిపోయిన పనులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. కేవలం లక్షల్లో నిధులు వెచ్చిస్తే అయిపోయే పనులను కూడా పూర్తి చేయడం లేదు. నాడు–నేడుతో సుందరంగా కనిపిస్తున్న జి.సిగడాం మండలం కొత్తపెంట ఎంపీపీ స్కూల్ -
ట్యాబ్ ఇక గతమే..
ప్రభుత్వ బడుల్లో డిజిటల్ విద్యను చేరువ చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసింది. 2022 డిసెంబర్ 21న 25,953 ట్యాబ్లు, 2023 డిసెంబర్ 21వ తేదీన 25,289 ట్యాబ్లు అందజేసింది. ఇందులో అత్యంత విలువైన బైజూస్ కంటెంట్ కలిపి ఉండేది. కూటమి వచ్చాక డిజిటల్ విద్య ఊసే లేదు. వారు ప్రతిపక్షంలో ఉండగా ‘మీరు ట్యాబ్లు ఇచ్చారు.. మేమొస్తే అంతకుమించి ఇస్తామ’ని గొప్పలు చెప్పినా ఒక్క ట్యాబ్ కూడా ఇవ్వలేకపోయారు. -
తల్లికి వందనం ఎప్పుడో..?
ఒక తేదీ చెప్పి ఆ తేదీకి అమ్మ ఒడిని ఠంచనుగా గత ప్రభుత్వం వేసేది. ఐదేళ్లలో ఇలా రూ.1298.51 కోట్లు విద్యార్థుల ఖాతాలో జమ చేసింది. విద్యార్థులు, వారి తల్లుల ఖాతాల వివరాలు అన్నీ సర్కారు వేలి కొసనపైనే ఉన్నాయి. అయినా తల్లికి వందనం వేయడానికి కూటమికి తీరిక దొరకడం లేదు. విద్యా సంవత్సరం అయిపోయి చాలా మంది స్కూళ్లు, కాలేజీల నుంచి రిలీవైపోయినా.. ఇంకా తల్లికి వందనం ఇవ్వలేదు. జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్(+2) వరకు 2.10లక్షల మంది చదువుతున్నారు. వీరిందరికి కలిపి మొదటి ఏడాది రూ.315 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం బాకీ పడింది. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో సిక్కోలుకు పెద్ద పీట
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ౖవెఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మెంటాడ స్వరూప్ నియమితులయ్యారు. మరో నలుగురికి రాష్ట్ర యువజన విభాగంలో చోటు కల్పించారు. వీరిలో ఒకరిని రాష్ట్ర కార్యదర్శిగా, మరో ముగ్గురిని రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ శుక్రవారం రాత్రి రాష్ట్ర పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగాయి. రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా పలువురు నియామకమయ్యారు.మెంటాడ స్వరూప్కు సముచిత స్థానంజిల్లా యువజన నాయకుడు మెంటాడ స్వరూప్కు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి గుర్తింపు ఇచ్చారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడిగా నియమించారు. గతంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తర్వాత యువజన విభాగం జోనల్ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు. తాజాగా రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు పనిచేస్తుండటంతో అధినేత గుర్తించారు. యువజన విభాగంలో నెంబర్ త్రీగా నియామకమయ్యారు.టెక్కలి నియోజకవర్గం దేవుపురం ఎంపీటీసీగా, గతంలో సర్పంచ్గా పనిచేసిన యర్రా చక్రవర్తిని యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. పార్టీకి విశేష సేవలు అందించడంతో సరైన గుర్తింపు లభించింది. ఈయన భార్య విశ్వశాంతి చక్రవర్తి గతంలో నందిగాం ఎంపీపీగా పనిచేశారు.సంయుక్త కార్యదర్శిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి చెందిన నక్క రామరాజు నియమితులయ్యారు. గతంలో కూడా వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగంలో పనిచేశారు. పార్టీ కోసం అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ రాష్ట్ర పార్టీలో నియమించారు.నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలం బెలమర గ్రామానికి చెందిన చింతు రాఘవరావును యువజన విభాగం రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఆయన తొలిసారి యువజన విభాగంలో చోటు దక్కించుకున్నారు.ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జీఆర్పురం గ్రామానికి చెందిన పిన్నింటి సత్యంనాయుడును కూడా రాష్ట్ర యువజన విభాగంలో సంయుక్త కార్యదర్శిగా నియమించారు. వీరికి కూడా తొలిసారి యువజన విభాగం దక్కింది. -
జూన్ 4న ’వెన్నుపోటు దినం’
● విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలను మోసం చేసి, ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. ఆ బాధలను ప్రజల తరఫున వెల్లడించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు జూన్ 4న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ‘వెన్నుపోటు దినం’ నిర్వహించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారని పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్లి కలెక్టర్లకు, నియోజకవర్గ స్థాయి అధికారులకు జూన్ 4న మెమొరాండం ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలంతా ఉత్సాహంగా పాల్గొనా లని పిలుపునిచ్చారు. ఇది ప్రజలతో ఉన్న మమకారాన్ని చాటే సమయం, అన్ని వర్గాల సమస్యలకు అండగా నిలవాల్సిన సందర్భమని అన్నారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి బలంగా తెలియజేయాలని కృష్ణదాస్ కోరారు. వెన్నుపోటు దినం విజయవంతం చేద్దాం ● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం రూరల్: వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శుక్రవారం ధర్మాన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది పాలనలోనే ఎక్కడికక్కడే వ్యతిరేకత వస్తోందన్నారు. ముందుగా ఏడురోడ్ల జంక్షన్ నుంచి డేఅండ్నైట్ మీదుగా జన సమూహంతో ర్యాలీగా వెళ్లి కూటమి చేసిన మోసంపై తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వాలన్నారు. పార్టీ అప్పగించిన పదవుల మేరకు వారివారి విభాగాలను కలుపుకుంటూ అందరితో కలిసి సమావేశాలు నిర్వహించాలన్నారు. గార, రూరల్ ప్రాంతంతో పాటు ప్రతి డివిజన్ నుంచి అధిక సంఖ్యలో జనాలు వచ్చేలా పార్టీ నేతలు చూసుకోవాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాలనపై వ్యతిరేకంగా ఉన్నవారిని సంప్రదించి వారు కూడా ర్యాలీలో పాల్గొనేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
మెరిసేవన్నీ అక్షయ పాత్రలు కావు
శ్రీకాకుళం క్రైమ్ : చూసేందుకు కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుస్తుంది.. దాన్ని తెచ్చిన వారి మాట లు వింటే అరచేతిలోనే స్వర్గం కనిపిస్తుంది. తీరా మోసపోయాక గానీ అర్థం కాదు మెరిసేవన్నీ అక్షయపాత్రలు కావని. సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస సమీపంలో పురాతన అక్షయ పాత్ర, రైస్ పుల్లింగ్ అని నమ్మించి మోసం చేస్తున్న పది మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అదన పు ఎస్పీ కేవీ రమణ, శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. అంతా రియల్ వ్యాపారులే.. విశాఖపట్నం మధురవాడకు చెందిన పచ్చితల రవిశంకర్(45), అతని స్నేహితుడు రుద్రరాజు వెంకటరంగరాజు (64), పెద గంట్యాడకు చెందిన కనకరాజు (40), నరసన్నపేట మండలం కిళ్లాంకు చెందిన నక్కిన రఘునాథ రావు (52), తిరుపతి జిల్లా చిన్న గొట్టికల్లు మండలం చట్టివారిపాలెంకు చెందిన గట్టెక్కుల మురళీకృష్ణ (59), హైదరాబాద్కు చెందిన గరిక శ్రీను (36), కాకినాడ జిల్లా పిఠాపురం అగ్రహారానికి చెందిన కొండ శ్రీవెంకట నాగసత్యనారాయణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవారు. కరోనా కాలంలో వ్యాపారం లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారు. దీంతో సులభంగా డబ్బు సంపాదించే మార్గం గురించి ఆలోచించారు. రవిశంకర్ 2016 లో రణస్థలం మండలం కొచ్చెర్లకు చెందిన పూని భద్రయ్య (33)తో కలసి రైస్పుల్లింగ్ చేశారు. అప్పట్లో వీరిలో ఒకరిపై కొత్తూరు పీఎస్ పరిధిలో కేసు కూడా నమోదైంది. ఆ కేసులో ఎస్ఐ సస్పెండయ్యారు కూడా. మళ్లీ అదే అక్షయ పాత్ర, రైస్ పు ల్లింగ్ చేస్తే బాగుంటుందని రవిశంకర్, భద్రయ్య తో చేతులు కలిపాడు. రవిశంకర్ మధ్యవర్తిత్వంలో పూని భద్రయ్య వద్ద ఉన్న అక్షయపాత్రను రూ.25 లక్షలకు రుద్రరాజు వెంకటరంగరాజు బేరం కుదుర్చుకుని రూ. 5 లక్షలు అడ్వాన్సు ఇచ్చేందుకు ఒ ప్పుకున్నారు. నిజానికి ఇది రూ.1600కు మించదు. పట్టుబడ్డారిలా.. ఎల్ఎన్పేట బొర్రంపేటకు చెందిన కుప్పిలి భాస్కరరావు సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస సమీపంలో ప్లేస్ సెట్ చేయడంతో మూడు కారుల్లో ఈ నెల 29 మధ్యాహ్నం అంతా బయల్దేరి వెళ్లారు. రవిశంకర్ వద్ద భద్రయ్య సోదరుడు పూనిరాజు డ్రైవర్ కావడంతో అతనూ వెళ్లాడు. అప్పటికే సమాచారం అందుకున్న సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి సిబ్బందితో వెన్నెలవలస గ్రామం రిజర్వాయర్ సమీపానికి వెళ్లగా పాడుబడిన బంగ్లాలో వీరంతా చేరి క్ర య విక్రయాలు జరుపుతూ కనిపించడంతో అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. డీఎస్పీ వి అక్షయ పాత్ర, రైస్ పుల్లింగ్ పేరిట మోసాలకు పాల్పడిన ముఠా అరెస్టు పది మందిని రిమాండ్కు తరలించినట్లు అదనపు ఎస్పీ, డీఎస్పీలు వెల్లడి వేకానంద పర్యవేక్షణలో ఆమదాలవలస సీఐ సత్యనారాయణ విచారణ చేపట్టారు. రూ. 25 లక్షలకు కొన్న అక్షయపాత్రను మరొకరికి రూ. 50 లక్షలకు అమ్మేందుకు సిద్ధమైనట్లు విచారణలో తేలింది. మభ్యపెట్టి.. ఈ అక్షయ పాత్ర సాధారణమైనది కాదని, పిడుగు పడినా, హైవోల్టేజీ విద్యుత్ కాంతులకై నా, సెల్ఫోన్ ప్లాష్ పడినా పనిచేయదని, అత్యధిక వేడిమిని కా యదని, దాన్ని ఉంచేందుకు ఇన్సిలేటర్ అనే బా క్స్ను సైతం చూపించి మభ్యపెట్టడం వీరి నైజం. ఆ బాక్సు ఎంత వేడిమినైనా తట్టుకుంటుందని మాయమాటలు చెబుతారు. ప్రతిభకు ప్రశంసలు.. మీడియా సమావేశం అనంతరం నిందితుల వద్ద నుంచి 3 కార్లు, రూ. 5 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు. కేసును డీఎ స్పీ వివేకానంద పర్యవేక్షణలో చాకచక్యంగా ఛేదించిన ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్ఐ హైమావతి, సిబ్బంది జనార్ధనరావు, తిరుపతిరా వు, గణపతిరావు, సత్యనారాయణ, లక్ష్మణరావు, నర్సింగరావు, సంతోషిలను అభినందించారు. -
గుట్టురట్టు
● టాస్క్ఫోర్స్ దెబ్బతో.. బెట్టింగ్ మాఫియాశ్రీకాకుళం క్రైమ్ : అంతర్జాతీయ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లే వీరి ఆదాయ మార్గాలు.. క్రికెట్ను బలహీనతగా చేసుకున్న యువతే వీరి పెట్టుబడులు.. మెల్లిగా బెట్టింగ్ ఊబిలోకి దింపేసి వారి ద్వారా సులువుగా వచ్చే డబ్బులే వీరి విచ్చలవిడి ఖర్చులకు పచ్చ కార్పెట్లు.. షీటర్లు, రాజకీయ నాయకులతో సమస్యలు.. ఏదైనా సమస్య వస్తే అందరినీ మేనేజ్ చేసే చాకచక్యం. ఈ పరిస్థితిలో వీరిని ఎలాగైనా పకడ్బందీగా పట్టుకోవాలనే ఫిర్యాదుదారులు చాలా తెలివిగా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డికి విషయం చేరవేశారు. దీంతో ఎస్పీ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. అంతే.. టాస్క్ఫోర్స్ పోలీసుల దెబ్బకు జిల్లాను ఎప్పటినుంచో పీడిస్తున్న బెట్టింగ్ మాఫియా గుట్టు రట్టు అయ్యింది. ఎట్టకేలకు శ్రీకాకుళం రూరల్ మండలం, ఎచ్చెర్ల పోలీసులు కేసును ఛేదించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న సూత్రధారులు ఎనిమిది మందిలో ఏడుగురిని రిమాండ్కు తరలించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉండటం విశేషం. మరో 15 మంది బెట్టింగ్ పాల్పడేవారిని ఇదే కేసులో సాక్షులుగా మార్చారు. దీనికి సంబంధించి వివరాలను శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. ఎస్పీ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి, ఎచ్చెర్ల మండలం పొన్నాడ వద్ద దాడులు చేసి కీలక బుకీలను అదుపులోకి తీసుకుని లాఅండ్ఆర్డర్ పోలీసులకు అప్పజెప్పినట్లు చెప్పారు. దీంతో డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు, జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐలు రాము, సందీప్లు తమ సిబ్బందితో విచారణ చేపట్టారు. ఎలా పట్టుబడ్డారంటే.. విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ఉంటున్న జలుమూరు మండలం దరివాడ గ్రామానికి చెందిన దున్న మన్మధరావు, ఎచ్చెర్ల మండలం పొన్నాడకు చెందిన పాకల కిషోర్, కర్రి రవితేజ, భైరి ఉపేంద్రలు శుక్రవారం పొన్నాడ గ్రామంలోని హనుమాన్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, బెట్టింగ్ వివరాలుండే రెండు నోట్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూరల్ మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన మంత్రి ధనుంజయరావు నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇతనితో పాటు విశాఖపట్నం పోతినమల్లయ్యపాలెంకు చెందిన దయాల శ్రీనివాసరావు, అతని భార్య సంగీత లక్ష్మి క్రికెట్ లావాదేవీలను పరిశీలిస్తూ కనిపించారు. వీరితో పాటు బెట్టింగ్ నిర్వహిస్తున్న శ్రీకాకుళం ఏపీహెచ్బీ కాలనీకి చెందిన రొక్కం స్వాతినాయుడు అలియాస్ తనూజ్ రాక కోసం చూస్తూనే మరోవైపు లావాదేవీల వివరాలుండే పుస్తకాలను చూస్తున్నారు. వెంటనే పోలీసులు దాడులు జరిపి వారి వద్ద నుంచి ఐదు మొబైల్ ఫోన్లను, బెట్టింగ్ వివరాలు నమోదు చేసే పుస్తకాలు, రూ.8,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని రిమాండ్కు తరలించిన పోలీసులు రూ.8,500 మాత్రమే స్వాధీనం.. మిగతాదంతా ఆన్లైన్లోనే.. బెట్టింగ్ నిర్వహణ ఇలా.. మ్యాచ్లు జరిగేటప్పుడు వీరి వద్ద బెట్టింగ్ కాసే ఆటగాళ్ల వివరాలను ఓ నోట్బుక్లో రాసుకుంటారు. బాల్ టు బాల్, ఓవర్ టు ఓవర్.. వందకు రెండు రెట్లు, ఒక్కోసారి వందకు నాలుగు రెట్లు.. ఇలా అంతా ఫోన్లలోనే వాట్సాప్ మెసేజ్ల ద్వారా పంపుతుంటారు. వీరి వద్ద లిక్విడ్ క్యాష్ ఉండేది తక్కువ. అంతా ఆన్లైన్లోనే లావేదేవీలే. కీలక బుకీలు మంత్రి ధనుంజయ, దుంగ మన్మధ, దయాల శ్రీనివాసరావు, పాకల కిషోర్లే ఆర్గనైజింగ్ చేస్తుంటారు. డబ్బంతా వివిధ మార్గాల్లో శ్రీనివాసరావు అకౌంట్లోకి చేరి అక్కడి నుంచి చివరికి అతని భార్య సంగీత లక్ష్మి అకౌంట్లో నిలుస్తుందని అదనపు ఎస్పీ వెల్లడించారు. వీరి ఖాతాలన్నీ ప్రస్తుతం వెరిఫై చేస్తున్నామని, ఎవరెవరు ఎంత పంపింది.. మొత్తంగా ఎంతన్నది విచారణ చేసి చెబుతామన్నారు. మరో వ్యక్తి, కీలక బుకీ రొక్కం తనూజ్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసుకు సహకరించిన స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాన్ని, డీఎస్పీ సీహెచ్ వివేకానంద ఆధ్వర్యంలో చాకచక్యంగా ఛేదించిన సీఐలు పైడపునాయుడు, అవతారం, మిగతా సిబ్బందిని అదనపు ఎస్పీ అభినందించారు. -
అక్రమ నిర్మాణంపై నోటీసులు
గార: మేజర్ పంచాయతీ శ్రీకూర్మంలో పాత బస్టాండ్ వద్ద పంచాయతీ స్థలంలో అక్రమంగా ఇంటి నిర్మాణం జరుగుతుండటంపై అధికారులు షోకాజ్ నోటీసు ఇచ్చారు. ‘దర్జాగా కబ్జా’ అనే శీర్షికన ఈ నెల 26న సాక్షిలో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. గ్రామకంఠంగా పిలవబడే సర్వే నెంబర్ 600లో ఈ నిర్మాణాలు జరుగుతుండటంపై శుక్రవారం ఈవోపీఆర్డీ కూర్మారావు, ఇన్చార్జి ఈవో శైలజలు పరిశీలించారు. నిర్మాణదారులు అందుబాటులో లేకపోవడంతో గోడలకు నోటీసులు అంటించారు. స్థలం డాక్యుమెంట్లు, పంచాయతీ, సుడా అనుమతుల వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. -
దినసరి వేతనదారులపై నివేదిక సిద్ధం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పనిచేసిన 49 మంది దినసరి వేతనదారుల సమస్యకు మరికొద్ది రోజుల్లో శాశ్వత పరిష్కారం లభించనుంది. కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే దినసరి వేతనదారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించేసి..అందర్నీ విధుల నుంచి తప్పించాలని రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జీతాల చెల్లింపు పూర్తి చేసి అవసరమైన సిబ్బంది సంఖ్య ఖరారు చేసేందుకు విశాఖపట్నం దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సుజాత, జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్పట్నాయక్, ఆలయ ఈవో వై.భద్రాజీలతో కూడిన త్రీమెన్ కమిటిని నియమించారు. వీరు గురువారం విశాఖపట్నంలో సమావేశమై కీలక నిర్ణయాలను నివేదిక రూపంలో సిద్ధం చేశారు. దీని ప్రకారం దినసరి వేతనదారుల సంఖ్యను ఖరారు చేసిన తర్వాత రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు ఔట్ సోర్సింగ్ విధానం ద్వారా ఆ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించారు. అరసవల్లిలో తొలిసారిగా ఔట్సోర్సింగ్ సేవలను రంగంలోకి దించనున్నారు. ప్రస్తుతానికి విధుల్లో ఉన్న 49 మందిలో 15 మంది మినహా మిగిలిన వారికి ఉద్వాసన తప్పదని దాదాపుగా తేలిపోయింది. ఈ అంశంపై విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ సుజాత వద్ద సాక్షి ప్రస్తావించగా.. త్రిమెన్ కమిటీ సమావేశం ముగిసిందని, ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో.. అనే విషయమై నివేదికను రాష్ట్ర కమిషనర్ రామచంద్రమోహన్కు సోమవారం పంపించనున్నట్లు స్పష్టం చేశారు. -
కొనసాగుతున్న నిర్వాసితుల దీక్ష
మెళియాపుట్టి: రేగులపాడు ఆఫ్షోర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరాహార దీక్ష తొమ్మిదో రోజు కూడా కొనసాగింది. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు గంగారపు సింహాచలం దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ కోసం సొంతూరు, స్థలాలు, పొలాలు, ఇళ్లు సైతం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. 132 మందికి ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయన్నారు. సోషల్ ఎకనామిక్లో లేని 40 కుటుంబాలకు వెంటనే సర్వే చేసి పరిహారాలు అందజేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. దీక్ష చేపట్టి తొమ్మిది రోజులు కావస్తున్నా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండటం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యవ్వారి ఈశ్వరరావు, దొర విజయ్ కుమార్, కిరణ్, మాధవరావు తదితరులు ఉన్నారు. -
సొమ్ము అందరిదీ.. సోకు టీడీపీ నాయకుడిది!
ఇదేం తీరు? వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 70 శాతం పనులు పూర్తి చేశాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులు చేయకుండా పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు. ఎండోమెంట్ నిధులతో పాటు 250 కుటుంబాలు ఇంటికి రూ. 5వేలు చొప్పున్న ఇచ్చారు. దాతల సహకారంతో నిర్మాణం పూర్తి చేసుకుంది. వీటిని విస్మరించి స్థానిక టీడీపీ నేత శివప్రసాద్ ఆలయ ధర్మకర్తగా కరపత్రాలు వేయించుకోవడం ఎంత వరకు సమంజసం? సొంత పార్టీ వాళ్లే ఛీ కొడుతున్నారు. – అంగ లక్ష్మి జనార్దన్, సర్పంచ్, కాపుగోదాయవలస సంతబొమ్మాళి: అధికార పార్టీ నాయకులు పబ్లిసిటీ కోసం దేవుడినీ వదలడం లేదు. దేవదాయ శాఖ నిధులు, దాతల సహాయంతో నిర్మాణం పూర్తిచేసుకున్న రామాలయానికి అన్నీ తానేనంటూ ఆలయ ధర్మకర్తగా టీడీపీ నాయకుడు కుత్తుమ శివప్రసాద్ కరపత్రం వేయించుకోవడంపై దాతలు, గ్రామస్తులు మండి పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం కాపుగాదాయవలసలో రూ.1,50,000 సంఘం డబ్బులతో రామాలయ నిర్మాణానికి 2015వలో పునాది వేశారు. ఆలయ నిర్మాణానికి రూ.15లక్షలు అవసరం కావడంతో సర్పంచ్ అంగ లక్ష్మితో పాటు గ్రామస్తులు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ సహాయంతో అప్పటి దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ను, ఎండోమెంట్ అధికారులను సంప్రదించారు. ఆలయ నిర్మాణానికి ఎండోమెంట్ నిధులు మంజారు కావాలంటే ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలని అధికారులు తెలియజేశారు. దీంతో గ్రామానికి చెందిన వాడరేవు సింహాచలం తన సొంత డబ్బులు రూ.3లక్షలు ఎండోమెంట్ ఖాతాలో జమ చేశారు. దీంతో 2023 నవంబర్లో రూ.15లక్షలు ఎండోమెంట్ నిధులు (ఆర్సీ నె.ఏ4/476702/2023)మంజూరయ్యాయి. దీంతో స్థానిక సర్పంచ్ భర్త అంగ జనార్దన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. 70 శాతం ఆలయ నిర్మాణ పనులను సొంత డబ్బులతో పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. మరికొద్ది రోజుల్లో మిగతా బిల్లులు మంజూరవుతాయనగా.. ప్రభుత్వం మారిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు బిల్లులు చెల్లించకుండా నిలిపి వేశారు. దీంతో మిగిలిన పనులను పూర్తి చేయడానికి గ్రామస్తులే రంగంలోకి దిగారు. దీన్ని కూడా పోలీసుల సహాయంతో టీడీపీ నాయకులు నిలుపుదల చేయించారు. ఆ తర్వాత ఆలయ నిర్మాణ బాధ్యతలు టీడీపీ నాయకుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి గ్రామంలో ఉన్న సుమారు 250 కుటుంబాలు ఒక్కొక్క కుటుంబం రూ.5వేలు చొప్పున్న విరాళంగా అందజేశారు. పలువురు దాతలు ఆలయ ధ్వజస్తంభం, రెండు కిలోల వెండి, గ్రానైట్, టైల్స్ను అందించారు. వీరందరి సహాయంతో గ్రామంలో రామాలయం నిర్మాణం పూర్తిచేసుకుని జూన్ 5 నుంచి 7వ తేదీ వరకు ప్రతిష్టాపనోత్సవాలకు సిద్ధమయ్యింది. వెల్లువెత్తిన విమర్శలు.. స్థానిక టీడీపీ నాయకుడు కుత్తుమ శివకుమార్ రామాలయం నిర్మాణం తన ఖాతాలో వేసుకోవడానికి పన్నాగం పన్నాడు. ఏకంగా ఆలయ ధర్మకర్తగా తన పేరుతో కరపత్రాలను ముద్రించి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నాడు. వీటిని చూసిన గ్రామస్తులు, దాతలతో పాటు సొంత టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దేవున్ని కూడా ప్రచారానికి వదల్లేదంటూ సొంత పార్టీ నాయకులే బహిరంగ విమర్శిస్తున్నారు. దేవదాయశాఖ నిధులు, దాతల సహాయంతో నిర్మాణం పూర్తి చేసుకున్న రామాలయం ఆలయ ధర్మకర్తనంటూ కరపత్రం వేయించుకున్న టీడీపీ నేత శివప్రసాద్ మండిపడుతున్న దాతలు, గ్రామస్తులు -
నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ రాక
నరసన్నపేట: పీఆర్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ శనివారం మండలానికి వస్తున్నారని డ్వామా పీడీ సుధాకర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన సెక్రటరీ రాక సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్థానిక అధికారులతో సమీక్షించారు. నరసన్నపేట, బొరిగివలస, లుకలాంల్లో ఆయన పర్యటిస్తారని తెలిపారు. కార్యక్రమాల్లో స్థానిక అధికారులు పాల్గొనాలని సూచించారు. సమీక్షలో ఎంపీడీఓ మధుసూదనరావు, ఏపీఓ యుగందర్లతో పాటు పీఆర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.రేపు మోడల్ డీఎస్సీ పరీక్షశ్రీకాకుళం న్యూకాలనీ: పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మోడల్ డీఎస్సీ–2025 ఎస్జీటీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.మురళీమోహన్రావు, డి.కేవశరావు తెలిపా రు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అరసవల్లి సూర్యనారాయణస్వా మి దేవస్థానం సమీపంలో ఉన్న పీఆర్టీయూ భవనంలో ఉదయం 9 గంటలకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కారు ఢీకొని పరిశ్రమ ఉద్యోగికి గాయాలుఎచ్చెర్ల క్యాంపస్ : అల్లినగరం కూడలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పైడి భీమవరం అరబిందో పరిశ్రమ ఉద్యోగి గాయపడ్డాడు. గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన పందిరి పాపారావు శుక్రవారం బైక్పై విధులకు వెళ్తుండగా అల్లినగరం కూడలి సమీపంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాపారావును 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్కు వైద్యులు రిఫర్ చేయగా కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రూరల్ మండలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. రిమ్స్ ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.గోవులు స్వాధీనంఎచ్చెర్ల: నరసన్నపేట వైపు నుంచి విశాఖపట్న ం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను శుక్రవారం లావేరు మండలం బుడుమూరు వద్ద జాతీయ రహదారిపై ఎస్సై జి.లక్ష్మణరావు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్ పోలవరపు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.వివాహిత అనుమానాస్పద మృతికొత్తూరు: మహర్తాపురంలో ప్రవళ్లిక (26) అనే వివాహిత శుక్రవారం అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కొత్తూరు ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం వడ్డంగి గ్రామానికి చెందిన పత్తిక సురేష్కు గుమ్మలక్ష్మిపురం మండలం కేదారపురం గ్రామానికి చెందిన నమ్మక ప్రవళ్లికతో ఐదేళ్ల కిందట వివాహం జరిగింది. సురేష్ జియో టవర్ కంపెనీలో పనిచేస్తున్నందున కొత్తూరులోని మహర్తాపురంలో భార్యతో కలిసి నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే సురేష్ శుక్రవారం విధులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి ప్రవళ్లిక ఫ్యాన్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వగా పోలీసులు వచ్చి వివరాలు సేకరించారు. కాగా, అల్లుడు సురేష్ అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నందున కుమార్తె ప్రవళ్లిక ఆత్మహత్యకు పాల్పడినట్లు తల్లి అరుణకుమారి ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, భర్త సురేష్ వేధిస్తున్నట్లు ప్రవళ్లిక గతంలోనూ బత్తిలి, గుమ్మలక్ష్మిపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులుఎచ్చెర్ల : రైతులు సాగు యాజమాన్య పద్ధతులను పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథస్వామి తెలిపారు. చిలకపాలెంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాగోలు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్ ఉదయ్బాబు మాట్లాడుతూ వరి రకాలు, తెగుళ్లను వివరించారు. అనంతరం నవధాన్యాలు, విత్తనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ గాంధీ, వ్యవసాయ సహాయ సంచాలకులు బగ్గు రజనీ, భవానీశంకర్, కేవీకే శాస్త్రవేత్త సునీత, మండల ఇన్చార్జి వ్యవసాయాధికారి దుర్గాప్రసాద్, ప్రకృతి మాస్టర్ ట్రైనర్ నాయుడు, విస్తరణాధికారులు జగన్మోహనరావు, రేవతి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ మూల్యాంకనం
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకనం శనివారం నుంచి మొదలుకానుంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల కేంద్రంగా మూడు రోజులపాటు జరిగే ఈ స్పాట్ జూన్ రెండో తేదీ వరకు కొనసాగనుంది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే కోడింగ్ ప్రక్రియ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించే ఈ ప్రక్రియలో మొత్తం ఏడు పేపర్లకు సంబంధించిన 10,080 జవాబుపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు కలిపి 250 మందిని నియమించారు. జిల్లా క్యాంప్ ఆఫీసర్గా డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య నేతృత్వంలో స్ట్రాంగ్రూమ్ డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్గా అసిస్టెంట్ కమిషనర్ లియాకత్ ఆలీఖాన్, ఉపవిద్యాశాఖాధికారి విజయకుమారి డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. -
కలిసికట్టుగా పనిచేయాలి..
ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అసమర్థులంకాదు. బలహీనులం అసలే కాదు. మన రోజు వచ్చినప్పుడు తడాఖా చూపించాలి. అంతవరకూ కలసికట్టుగా పని చేయాలి. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీకి మంచి నాయకత్వం ఉంది. పూర్వ వైభవం తప్పక వస్తుంది.అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచి అధికారం సాధించారు. అధినేత జగన్ అనుమతిస్తే భవిష్యత్తులో నరసన్నపేట అభ్యర్థిగా కృష్ణ చైతన్య పోటీ చేస్తారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
అవినీతి ఆరోపణలు
వికృత చేష్టలు..పొందూరు: కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండాపోతోంది. ఇందుకు పొందూరు రెవెన్యూ కార్యాలయంలో గురువారం జరిగిన ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఇక్కడి వాష్రూమ్కు వెళ్లిన ఓ మహిళా రెవెన్యూ ఉద్యోగిని వీడియో తీస్తూ కంప్యూటర్ ఆపరేటర్ సువ్వారి సన్యాసిరావు పట్టుబడిన సంగతి తెలిసిందే. సద రు మహిళా ఉద్యోగి వెంటనే స్పందించి ఫోన్లో వీడియోను డిలీట్ చేయించి తహశీల్దార్కు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి సన్యాసిరావు అవినీతిపరుడనే, మహిళలను వేధిస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. తన మాట వినకపోతే పనులు చేయకుండా విసిగించడమే కాకుండా రాజకీయంగా పలుకుబడి ఉందని బెదిరిస్తూ మరింత రెచ్చిపోయేవాడు. ఈ విషయమై గతంలో కొంత మంది మహిళా ఉద్యోగులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని, సన్యాసిరావు వికృత చేష్టలకు అంతులేకుండా పోయిందని మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్యాసిరావు ల్యాప్టాప్లో మరిన్ని వీడియోలు ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకొని సమగ్ర విచారణ జరపాలని అధికారులను కోరుతున్నారు. అంతా తానై.. తహశీల్దార్ వద్దకు ఏ ఫైల్ వెళ్లాలన్నా తన వద్దకు రావాల్సిందేనన్న స్థాయికి సన్యాసిరావు వెళ్లిపోయాడని కొందరు చెబుతున్నారు. రికార్డులు తారుమారు చేసి మ్యుటేషన్లు జరిపించడం కోసం రూ.లక్షల్లో లంచాలను రియల్టర్లు నుంచి తీసుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. 1–బీ ద్వారా బ్యాంకు నుంచి వ్యవసాయ రుణాలు పొందే సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని కొంత మందికి లేని భూములకు 1–బీ సృష్టించేవాడని, వీటి ద్వారా రుణాలు పొందడంలో అక్రమాలకు సహకరించేవాడని సమాచారం. దేవదాయ భూముల రికార్డులు మార్చి అక్రమార్కులకు రెవెన్యూ పత్రాలు కట్టబెట్టడంలో ప్రధాన కారకుడు సన్యాసిరావు అనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వస్తాయని పలువురు అంటున్నారు. అవార్డుకు అర్హుడా? గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉద్యోగులకు ఇచ్చే అవార్డును సన్యాసిరా వు తీసుకోవడం గమనార్హం. అవినీతి ఆరోపణ లు ఉన్నప్పటికీ సన్యాసిరావు పేరు జాబితాలో చేర్చడంతో అప్పట్లో అంతా విస్తుపోయారు. ప్రస్తుతం మహిళల పట్ల అసభ్య వీడియోలు చిత్రీకరిస్తూ పట్టుబడటంతో అవార్డును వెనుక్కు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వెలుగులోకి వస్తున్న సన్యాసిరావు లీలలు వీడియో ఘటనపై భయాందోళనలో మహిళా ఉద్యోగులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ -
ప్రహసనంగా పదోన్నతుల కౌన్సెలింగ్
● 83 హెచ్ఎం పోస్టులను ఎస్ఏలతో భర్తీ చేసేందుకు నిర్ణయం ● ఉదయం పిలిచి సాయంత్రం మొదలుపెట్టిన ప్రక్రియ ● కూటమి ప్రభుత్వం, అధికారుల తీరుపై మండిపడిన ఉపాధ్యాయులు శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి ప్రభుత్వం విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనువనువునా వారిని అవమానించేలా వ్యవహరిస్తోంది. తాజాగా గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా ప్రధానోపాధ్యాయులు పదోన్నతుల కౌన్సెలింగ్ పేరిట ఉదయం పిలిచి, సాయంత్రం వరకు మొదలుపెట్టకపోవడంతో వారు అల్లాడిపోయారు. తమ పట్ల ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అసలేం జరిగిందంటే..! జిల్లా పరిషత్లో 80, మున్సిపల్ 2, మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి కలిపి మొత్తం 83 ప్రధానోపాధ్యాయుల ఖాళీ పోస్టులను అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి సీనియారిటీ జాబితాను తయారుచేసి, అభ్యంతరాలను స్వీకరించి, ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాను రూపొందించారు. 1:2 నిష్పత్తిలో 166 మంది ఉపాధ్యాయుల ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ రిజిష్టర్లను ఈనెల 27న డీఈఓ నేతృత్వంలో వెరిఫికేషన్ చేశారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకని చెబుతూ.. శుక్రవారం పదోన్నతల కౌన్సెలింగ్ కోసం ఉదయం 8 గంటలకు శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్దకు చేరుకోవాలని డీఈఓ తిరుమల చైతన్య సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు. సాయంత్రం వరకు నిరీక్షణ.. ఉదయమే పాఠశాలకు చేరుకున్న ఉపాధ్యాయులు వేచి ఉండక తప్పలేదు. ఆన్లైన్లో సాంకేతిక సమస్యల పేరిట సాయంత్రం వరకు నిరీక్షించేలా చేశారు. ఈ మధ్యలో పలు సూచనలు పేరిట డీఈఓ, ఇతర అధికారులు కాలక్షేపం చేస్తూ వచ్చారు. కనీసం భోజనం చేసేందుకు కూడా అర్ధగంట సమయం ఇవ్వకుండా పాఠశాలకే వారిని పరిమితం చేయడంతో ఆకలితో తల్లడిల్లిపోయారు. ఎట్టకేలకు సాయంత్రం 6 గంటల తర్వాత మొదలైన ఈ పదోన్నతి కౌన్సెలింగ్ ప్రక్రియ రాత్రి 9.15 వరకు కొనసాగింది. ఆన్లైన్లో చేపట్టాల్సిన పదోన్నతి కౌన్సెలింగ్ను మాన్యువల్గా చేపట్టారు. అధికారులు తీరుపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఉదయం పిలిచి రాత్రి 9 వరకు తమను నాలుగు గోడలకు పరిమితం చేసి, వేధించడం ఎంతమాత్రం తగదని మహిళా ఉపాధ్యాయినులు ఆక్రోశం వెల్లగక్కారు. కాగా, 83 హెచ్ఎం ఖాళీ పోస్టులకు కౌన్సెలింగ్ చేపట్టి, నియామక ఉత్తర్వులు ఆన్లైన్లో చేరవేసేలా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీవైఈఓ ఆర్.విజయకుమారి, జి.రాజేంద్రప్రసాద్, పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సమర్థంగా డి–అడిక్షన్ కేంద్రాల నిర్వహణ
● ఎకై ్సజ్ అధికారుల సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అక్రమంగా తయారవుతున్న మద్యం(ఐడీ లిక్కర్) వల్ల తలెత్తుతున్న ఆరోగ్య, ఆర్థిక సమస్యలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, మద్యం బారిన పడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పనపై ఎకై ్సజ్ శాఖ అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్రమ మద్యం వల్ల బలహీన వర్గాలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. దీని తయారీకి ఉపయోగించే ముడి సరుకులపై నియంత్రణ పెట్టాలన్నారు. ఇందులో ప్రధాన పాత్ర పోషించే వ్యక్తులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డీ–అడిక్షన్ కేంద్రాల సమర్థ వినియోగంపై జిల్లాలో ఏర్పాటు చేసిన కేర్ కమిటీ (కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్నెస్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్) ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యకలాపాలను సమీక్షించారు. ఇప్పటివరకు ఈ కమిటీ ద్వారా 16 అవగాహన కార్యక్రమాలు నిర్వహించగా 595 మంది పాల్గొన్నట్లు గుర్తించారు. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డీ–అడిక్షన్ కేంద్రాన్ని ఒకసారి సందర్శించినట్లు కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. ఇందులో తొమ్మిది మంది చేరగా ఏడుగురు విజయవంతంగా పునరావాసం పొందినట్లు అధికారులు వెల్లడించారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఐడీ మద్యం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 2, 4వ శనివారాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషన ర్ రామచంద్రరావు, అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
టోల్ప్లాజాలో దందా..
లక్ష్మీపురం టోల్ప్లాజా వద్ద కాశీబుగ్గ పోలీసులకు ప్రతి నెలా రూ.50వేలు లంచం ఇస్తున్నారు. పలాస–కాశీబుగ్గ పట్టణంలోకి లారీ వెళ్తే రూ.వందలలో వసూళ్లు చేస్తున్నారు. టోల్ప్లాజా వద్ద లారీలలో అదనపు లోడ్ ఉందని ఎక్కడా లేని విధంగా రశీదు లేకుండా నగదు వసూలు చేస్తున్నారు. ఏ ఒక్కరు ప్రశ్నించినా కొట్టడానికి వస్తున్నారు. ప్రస్తుతం లక్ష్మిపురం టోల్ప్లాజా కాంట్రాక్ట్ రద్దు చేయాలని కోరుతున్నాం. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తాం. ఆపదలో పోలీసుల సాయం కోరితే తిరిగి మాకే ఫైన్ వేస్తారా. ఇది ఇక్కడితో విడిచిపెట్టం. రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతాం. – పీజేఆర్ఎస్ మహారధ, న్యూలారీ అసోసియేషన్ అధ్యక్షుడు, విజయవాడ -
మెళియాపుట్టి క్రీడాకారుడికి గోల్డ్మెడల్
మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టికి చెందిన పొట్నూరు అనిరుథ్ రోల్బాల్ (స్కేటింగ్)లో సత్తాచాటాడు. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తాచాటడంతో శ్రీలంక దేశంలోని మినువాంగోడలో జరుగుతున్న అంతర్జాతీయ పోటీలకు అవకాశం కలిగింది. గురువారం జరిగిన పోటీల్లో భారత్ తరఫున బంగారు పతకం సాధించాడు. అనిరుద్ధ్కు తల్లిదండ్రులు నవీన్కుమార్, మీనాక్షి, గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. మహిళ ఆత్మహత్య సారవకోట : వాండ్రాయి గ్రామానికి చెందిన రాడ పార్వతమ్మ (59) అనారోగ్యంతో బుధవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.భర్త ఆనందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఆస్పత్రికి తరలించారు. పార్వతమ్మకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. చోరీ కేసులో ఇద్దరు అరెస్టు రణస్థలం: పాతర్లపల్లి పంచాయతీలోని వెంకటేశ్వర కాలనీలో రేగాన ఉత్తరమ్మ ఇంట్లో ఈ నెల 25న బంగారం వస్తువులు చోరీకి గురయ్యాయ ని జె.ఆర్.పురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అదే ఇంట్లో ఉన్న శైలు, అతని ప్రియుడు డి.దుర్గా ప్రసాద్లే దొంగతనం చేసినట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. నిందితులకు వచ్చే నెల 11 వరకు కోర్టు రిమాండ్ విధించిందని చెప్పారు. బంగారాన్ని రికవరీ చేశామని తెలిపారు. బాడీబిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కాశీబుగ్గ: అండమాన్ నికోబార్ దీవుల్లోని ల్యాండ్ పోర్టుబ్లెయిర్లో నిర్వహించిన జాతీ య స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో పలాస–కాశీబుగ్గకు చెందిన ఎం.శివకుమార్ సత్తాచాటాడు. మిస్టర్ అండమాన్ హంట్ విభాగంలో 170 కేటగిరీలో ద్వితీయ స్థానం కై వసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా విజేతలను సిల్వర్ మెడల్తో సత్కరించారు. ఈ సందర్భంగా జంటపట్టణాల బాడీబిల్డర్స్ గురువారం అభినందనలు తెలిపారు. హెచ్ఎంలకు బదిలీ ఉత్తర్వులు శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో భాగంగా గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయింది. ఆప్షన్ ప్రకారం ఎంచుకున్న స్కూళ్లకు బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు అందుకున్న హెచ్ఎంలు విధుల్లో చేరాలని డీఈఓ తిరుమల చైతన్య ఆదేశించారు. హెడ్ కానిస్టేబుల్పై దాడి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మంగువారితోట లెప్రసీ కాలనీ వద్ద మత్తులో ఉన్న యువకులు ఓ హెడ్కానిస్టేబుల్పై దాడి చేశారు. వారు గంజాయి మత్తులో ఉన్నారా.. లేదంటే మద్యం మత్తులోనే దాడికి పాల్పడ్డారా అన్నది తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్ఐ రాంబాబు, స్థానికులు చెప్పిన వివరాల మేరకు.. జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో (డీసీఆర్బీ) విభాగంలో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న త్రినాథ్ గురువారం రాత్రి విధులు ముగించుకుని లెప్రసీ కాలనీలో ఉన్న తన ఇంటికి బయల్దేరాడు. మంగువారి తోట వద్ద కాలనీలో వెళ్తుండగా నలుగురు యువకులు మత్తులో రోడ్డుపై న్యూసెన్సు చేస్తున్నారు. ఈ క్రమంలో బండిపై వెళ్తున్న హెచ్సీ త్రినాథ్కు ఓ యువకుడి చేయి తగలడంతో ‘ఈ సమయంలో ఇలా చేస్తున్నారేంటి’ అని ప్రశ్నించారు. దీంతో నలుగురు యువకులు హెచ్సీతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా దాడికి ఎగబడ్డారు. ఈ పరిణామం నుంచి తేరుకునేలోపే హెచ్సీకి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. గాయపడిన త్రినాథ్ను రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై ఎంఎల్సీ అయ్యిందని రిమ్స్ ఔట్పోస్ట్ అధికారులు నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
దశాబ్దాల కలకు ప్రతిరూపం..
పీహెచ్సీ కోసం లింగాలవలస గ్రామం దశాబ్దాల తరబడి ఎదురు చూసింది. వైఎస్సార్సీపీ హయాంలో గానీ ఆ ఊరి ఆశలు నెరవేరలేదు. టెక్కలి మండలం లింగాలవలసలో సుమారు రూ.2.30 కోట్లతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్న సమ యానికి ఎన్నికలు రావడం...ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. ఇటీవలే ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. లింగాలవలసతో పాటు సొర్లిగాం, సవరసొర్లిగాం, రంగాపురం, మెట్టపేట, ఏనేటిపేట, సతివాడ, సన్యాసిపేట, ఆర్.వి.పురం, లక్ష్మీపురం, పోలవరం, గంగాధరపేట, నీలాపురం, వీఆర్కె.పురం, బొరిగిపేట, తిర్లంగి, సీతాపురం తదితర గ్రామాల ఆరోగ్య సేవలకు ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసరాగా నిలుస్తోంది. – టెక్కలి -
రేపటి నుంచి పర్యావరణ వారోత్సవాలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రపంచ పర్యావరణ దినోత్సవం – 2025 సందర్భంగా ఈ నెల 31 నుంచి జూన్ 5 వరకు ‘ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన, భవిష్యత్ తరాల సంరక్షణ, పుడమి సంరక్షణ’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ కాలు ష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజినీర్ కరుణశ్రీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శనివారం 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు శ్రీకాకు ళం న్యూ సెంట్రల్ స్కూల్ వేదికగా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు జూన్ 4న శ్రీకాకుళం ప్రభు త్వ జూనియర్ కళాశాల (బాలురు), ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు) వేదికగా వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిరక్షణలో భాగంగా పైడిభీమవరం, టెక్కలి తదితర గ్రా మాల్లో 5000 మొక్కలు నాటనున్నట్లు పేర్కొ న్నారు. జూన్ 5న గ్రీన్ ర్యాలీ సమావేశాలను నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు.24 కేజీల గంజాయి స్వాధీనంనరసన్నపేట: మడపాం టోల్గేట్ వద్ద శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గంజాం ప్రాంతం నుంచి విశాఖ వైపు అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా పోలీసులు నిఘా వేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఓ మహిళ నుంచి 14 కేజీలు, ఇదే ప్రాంతానికి చెందిన రంజిత్ అనే మరో వ్యక్తి నుంచి 10 కేజీలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న గంజాయిని నరసన్నపేట పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది.‘మద్యం విక్రయాలతో రూ.811 కోట్లు ఆదాయం’శ్రీకాకుళం క్రైమ్ : మద్యం విక్రయాల్లో అక్రమాలకు తావులేకుండా ప్రతి నిత్యం నిఘా పెడుతున్నామని, బెల్టుషాపులు పెడితే కేసులు నమోదు చేస్తామని, నవోదయం 2.0లో భాగంగా సారారహిత జిల్లాగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) పి.రామచంద్రరావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని 80 ఫీట్ రోడ్డు సమీపంలోని తన కార్యాలయంలో విలేకరులతో ఏసీ మాట్లాడారు. సగటున రూ.110 కోట్లు నెలకు టార్గెట్గా పెట్టుకున్నామని, రూ.104 కోట్లతో రీచ్ అయ్యి అక్టోబరు నుంచి రూ.811 కోట్లు ఆదాయం సంపాదించామన్నారు. ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించి 1537 కేసులు నమోదు చేసి 1462 మందిని అరెస్టు చేసి, 28 వాహనాలు సీజ్ చేశామన్నారు. సారాకు సంబంధించి 385 కేసుల్లో 270 మందిని అరెస్టు చేసి 4,133 లీటర్ల సారాయిని ధ్వంసం చేసి 15 వాహనాలు సీజ్ చేశామన్నారు. బెల్టుషాపుల వెనక లైసెన్సు దుకాణాదారులున్నారని బయటపడితే రూ. 5 లక్షలు అపరాధ రుసుం కట్టిస్తామన్నారు. అనధికార పర్మిట్ రూమ్లు లేవని, మద్యం దుకాణాల వద్ద బహిరంగంగా మ ద్యం సేవించిన వారివల్ల న్యూసెన్సు జరుగుతోందని, అలాంటివారిపై 111 కేసులు నమోదు చేశామన్నారు. ఎమ్మార్పీకి మించి అమ్మిన దుకాణాలపై చర్యలు తీసుకుంటామని, బార్లు సమయపాలన పాటించాలని అన్నారు. ఫిబ్రవరి 19 తర్వాత 130 కేసుల్లో 270 లీటర్ల నాటుసారా స్వాధీనం, 25000 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామని, 114 మందికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించామన్నారు. గంజాయి కేసులు 3 నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసి 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. -
తప్పిన మాటకు నిదర్శనం
నీటిలోనే నడక జగనన్న కాలనీలోని మా ఇంటికి ముడుకు లోతు నీటిలో నడుచుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షం పడితే చాలు మా రోడ్డు చెరువులా తయారవుతుంది. దీంతో పాములు సైతం అక్కడికి చేరిపోతుండడంతో భయం పుడుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మా బాధలు తెలుసుకుని రోడ్లు, కాలువలు నిర్మించాలని కోరుతున్నాం. – సాహుకారి లక్ష్మి, జగనన్న కాలనీ, టెక్కలి ●నిర్లక్ష్యం ఎలా ఉంటుందని అడిగి తే.. ఈ కాలనీపై కూటమి సర్కారు చిత్తశుద్ధిని ఉదాహరణగా చెప్పొచ్చు. టెక్కలి జగతిమెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ ఇది. కూటమి ప్రభుత్వంలో ఈ కాలనీకి గ్రహణం పట్టింది. కాలనీలో జనం నివాసం ఉంటున్నా.. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. రోడ్డు, మంచినీరు, వీధి దీపాల ఏర్పాటు ఊసు లేదు. – టెక్కలి రూరల్ -
అంతిమ సంస్కారాలకు అవస్థలు
పాతపట్నం: మండలంలోని సింగుపురం గ్రామంలో ఉంటున్న దళితులు స్మశాన వాటిక లేక ఇబ్బంది పడుతున్నారని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు కోళ్ల చిన్నరావు, యడ్ల గోపి అన్నారు. గురువారం సింగుపురం గ్రామంలో డప్పు కళాకారుడు మీసాల వెంకటరావు (38) అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పంట పొలాల మీదుగా అంత్యక్రియలకు తీసుకువెళ్లాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులకు విన్నవించామని, అయినా ఫలితం లేదని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్మశాన వాటికకు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. -
వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖ వాతావారణ కేంద్రం నుంచి జిల్లాకు సమాచారం వచ్చింది. బాలాసోర్కు తూర్పు గా 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రానికి తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నా రు. సాయంత్రం బెంగాల్–బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. సాగర్ ఐలాండ్ ఖేపుపరా వద్ద తీరం దాటే అవకాశం ఉంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోతకు గురైన తీరం వజ్రపుకొత్తూరు : అల్పపీడన ప్రభావంతో తీరం అల్లకల్లోలంగా మారింది. ఎగసి పడుతున్న కెరటాల ధాటికి తీరం కోతకు గురవుతోంది. వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద సముద్రం దాదాపు 90 మీటర్లు వరకు ముందుకు రావడంతో ఇసుక దిబ్బలు కరిగిపోయి సంప్రదాయ తెప్పలు, వలలు మునిపోయాయి. తీరం వెంబడి ఉన్న ఈత, ఇతర చెట్లు అలల ఉధృతికి కూలిపోతున్నాయి. దీంతో మత్స్యకారులు తమ వలలు, తెప్పలు, పడవలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. పూడిలంక ఉప్పుటేరు వద్ద పడవలను లంగరు వేసి ఉంచారు. వలలు, సంప్రదాయ తెప్పలు, తీరంలోనే ఉండిపోవడం.. మరోవైపు చేపల వేట నిషేధం అమలవుతుండడంతో మత్యకారులు అవస్థలకు గురవుతున్నారు. ప్రభుత్వం స్పందించి అధిక వర్షాలు, తుఫాన్ల సమయంలో తమను ఆదుకోవాలని మత్స్యకారులు జి.శంభూరావు, మోహనరావు, లక్ష్మయ్య, రాజు తదితరులు కోరుతున్నారు. నైరుతిపై సన్నద్ధత: కలెక్టర్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో నైరుతి రుతు పవనాలు వారం ముందుగానే ప్రవేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి గురువారం నిర్వహించిన సన్నద్ధత సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి మరింత సమగ్రంగా, పటిష్టంగా ప్రణాళికలు రూ పొందించాలని కలెక్టర్ ఆదేశించారు. విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి) ప్రకారం కార్యాచరణను రూపొందించుకొని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి, వాటి ఫోన్ నంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ సూచించారు. రైతు సేవా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు పంపిణీకి ఏర్పాట్లు ముమ్మరం చేయాలని తెలియజేశారు. గత ఏడాది హిరమండలం–కొత్తూరు మధ్య రోడ్డు పైకి వరద నీరు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, అలాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. ● ఎగసి పడుతున్న అలలు ● తీరానికే పరిమితమైన సంప్రదాయ తెప్పలు, వలలు -
కబ్జా చేసి కల్యాణ మండపం ?
ఆమదాలవలస మండలంలోని అక్కులపేట గ్రామంలో 1973లో ఫ్యామిలీ ప్లానింగ్ సబ్ సెంటర్ ప్రారంభించారు. ఈ సెంటర్ సుదీర్ఘ కాలం సేవలు అందించింది. కొన్నేళ్ల కిందట అక్కుల పేట గ్రామంలో పీహెచ్సీ కట్టాక.. ఈ భవనాన్ని విడిచిపెట్టి పీహెచ్సీలోకి వైద్య సిబ్బంది వచ్చేశారు. అయితే ఈ భవనంపై ఆ గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకుల కన్ను పడినట్లు సమాచారం. ఈ భవనాన్ని తొలగించి ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రైవేటు కల్యాణ మండపం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు చెబుతున్నారు. ఈ ప్రక్రియకు ముహూర్తం కూడా పెట్టేశారు. దీన్ని ప్రభుత్వ రెవెన్యూ అధికారులు అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు.– ఆమదాలవలస -
త్రుటిలో తప్పిన ప్రమాదం
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కొత్తపేట పంచాయతీ కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కాలనీలో కొండకు ఆనుకుని ఉన్న నీలాపు రామకృష్ణకు చెందిన ఇంట్లోకి మంగళవారం రాత్రి సమయంలో కొండమీద నుంచి వరదనీటితో పాటు కంకర ఒక్కసారిగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. ఇదే కాలనీలో నివాసముంటున్న వైస్ ఎంపీపీ దుక్క రోజారాణి ఇంటి వద్దకు వెళ్లి జరిగిన ఘటన వివరించారు. దీంతో రోజారాణితో పాటు ఆమె భర్త రామకృష్ణారెడ్డి వారి ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం బుధవారం ఉదయం పంచాయతీరాజ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈ సుధాకర్తో పాటు ఇతర అధికారులు ఇందిరమ్మ కాలనీ వద్దకు చేరుకుని మట్టిని తొలగించే చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా ఇందిరమ్మ కాలనీలో నివాసాలకు ఆనుకుని కొండమీద అభివృద్ధి పేరుతో రోడ్డు పనులు చేస్తున్నారు. అయితే ముందస్తుగా అధికారులు సరైన ప్రణాళిక చేపట్టకపోవడంతో ఇటువంటి సంఘటన జరిగినట్లు కాలనీవాసులు చెబుతున్నారు. కొండపైకి రోడ్డు కోసం ఇప్పటికే రెండు ప్రాంతాల్లో పనులు ప్రారంభించారని, ఇప్పుడు ఇళ్లకు ఆనుకుని కొత్తగా రోడ్డు పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. కాలనీవాసులు నివసిస్తున్న ఇళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రక్షణ గోడ నిర్మాణం చేపట్టి తదుపరి పనులు చేయాలని కోరుతున్నారు. -
మహిళా కార్యాలయానికి రక్షణ కరువు
మెళియాపుట్టి: విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు, వీవోఏలు, డ్వాక్రా మహిళలు అధికంగా వస్తూపోతూ ఉండే మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య వెలుగు కార్యాలయానికి ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి, వెలుగు కార్యాలయాలు గ్రామ శివార్లలో ఉండడం వలన పక్కనే ఉన్న మద్యం దుకాణంలో మద్యం కొనుక్కుని, సాయంత్రం 7 గంటలు దాటాక కొంతమంది మందుబాబులు కార్యాలయాల వరండాల్లో మద్యం సేవిస్తున్నారు. అనంతరం సీసాలు పగలగొట్టడం వంటి వికృత చేష్టలు చేస్తున్నారు. కనీస ఆలోచన లేకుండా మందుబాబులు చేస్తున్న అసభ్య కార్యకలాపాలు ఉద్యోగులను విస్మయానికి గురి చేస్తున్నాయి. సెలవు రోజుల్లో అయితే కార్యాలయాల వద్ద వాహనాలు నిలిపి అక్కడే తిష్ట వేస్తున్నారు. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులకు వరండాలపై పగలగొట్టిన మద్యం బాటిళ్లు, అసభ్యమైన చెత్త ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంటాయని ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి కార్యాలయాల పక్కనే ఉన్న మద్యం దుకాణం ఒక కారణమైతే, ప్రహరీ లేకపోవడం మరో కారణమని చెబుతున్నారు. ప్రహరీ నిర్మించాలని ఇదివరకే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ప్రహరీ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్న ఉద్యోగులు పక్కనే మద్యం దుకాణం ఉండడంతో అవస్థలు -
● 39 నిమిషాల్లో ఆరోగ్యశ్రీ కార్డు
● ఏడాదిగా తిరుగుతున్నా.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య పోరాటం చేస్తున్న యువకుడు విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రిలో స్ట్రక్చర్పై అచేతనంగా పడి ఉన్నాడు. శస్త్ర చికిత్స చేయాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలి. కానీ ఆ కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో రూ.లక్షా 30వేలు చెల్లిస్తేనే ఆపరేషన్, చికిత్స ప్రారంభిస్తామని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యు లు హతాశుతులయ్యారు. వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లారు. దరఖాస్తు చేసుకున్న 39 నిమిషాల్లో ఉచిత శస్త్ర చికిత్సకు అవసరమైన ‘డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ’ కార్డు మంజూరు కావడంతో ఆ కుటుంబ సభ్యులకు కొండంత అండగా లభించినట్లయ్యింది. 2023 జనవరి 23న జరిగిన ఈ సంఘటనను తలచుకొని ఇప్పటికీ అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాడు ఇచ్ఛాపురం పట్టణం ఫకీరుపేట వార్డు సచివాలయానికి చెందిన వలంటీర్ వర్రి సింహాచలం. ఇదీ ప్రజారోగ్యమే పరమావధిగా సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తీరుకు మచ్చుతునక. – ఇచ్ఛాపురం రూరల్ కనుగులవలస గ్రామానికి చెందిన సీపాన ఆనందరావుకు రెండు కళ్లు కనిపించవు. 2019 నుంచి దివ్యాంగ పింఛన్ అందుకునేవాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక నాయకులు కక్షపూరిత చర్యలకు దిగారు. ఆనందరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఓటు వేశాడన్న కక్షతో 2024 ఆగస్టు నుంచి పింఛన్ నిలిపివేశారు. ఇదేంటని ప్రశ్నించినా పట్టించుకునే వారే కరువయ్యారు. శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి నుంచి 100 శాతం బ్లైండ్ అని సదరం సర్టిఫికెట్ తెచ్చుకున్నా ఫలితం లేకపోయింది. ఎంపీడీఓ కార్యాలయ అధికారులపై ఒత్తిడి పెంచి పింఛన్ అందకుండా తాత్సారం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్లో రీ వెరిఫికేషన్ చేస్తామని బాధితుడికి చెప్పగా రిమ్స్ ఆసుపత్రి నుంచి ఆ నెలలోనే వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని అందించినా ఫలితం శూన్యం. ఎప్పటికప్పుడు కలెక్టర్ గ్రీవెన్స్సెల్కు వెళ్లి వినతిపత్రాలు అందిస్తునే ఉన్నారు. ఇటీవల కోర్టును సైతం ఆశ్రయించాడు. ఇప్పటికైనా పింఛన్ పునరుద్ధరించాలని కోరుతున్నాడు. ఇదీ చంద్రబాబు ఏడాది పాలన మార్కు. – ఆమదాలవలస ఎంత తేడా బాబూ! నాడు క్షణాల్లోనేడు కక్షలతో.. -
● జపాన్లో జుగల్బందీ
శ్రీకాకుళం కల్చరల్ : సిక్కోలు కళాకారులు జపాన్లో అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన శివశ్రీ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున విదేశాలలో భారతీయ సంస్కృతి వైభవాలు చాటిచెప్పేలా మూడు రోజులుగా ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ సమగ్రతలో భాగంగా థాయిలాండ్ బృందంతో ప్రదర్శించిన జుగల్బందీ ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ బృందంలో నగరానికి చెందిన రామకౌండిన్య, నేహా, వర్ణిత, నేహా థామస్, లలిత, చాందిని ఉన్నారు. -
నేడు హెచ్ఎంలకు పదోన్నతి కౌన్సెలింగ్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్లలో ఖాళీగా ఉన్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసేందుకు అర్హత కలిగిన, ప్రొవిజినల్ సీనియారిజీ జాబితాలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు/తత్సమాన అర్హత కలిగిన ఉపాధ్యాయులకు గురువారం పదోన్నతి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత (బాలురు)పాఠశాల వేదికగా ఉదయం 8 గంటలకు ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలో ఉన్న టీచర్లు సర్టిఫికెట్లు, సర్వీస్ రిజిస్టర్తో హాజరుకావాలని కోరారు. ఆస్పత్రిలో సేవలపై ఆరా నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలను మరింత మెరుగుపరచాలని జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి కల్యాణ్బాబు సూచించారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిని బుధవారం సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని.. ఇదే సమయంలో పిల్లలు నొప్పులకు భరించలేకపోతున్నారని, వెంటనే ఆపరేషన్ చేయాలని వైద్యులపై ఒత్తిడి తీసుకురావద్దన్నారు. నరసన్నపేటలో 21 మంది వైద్యులు ఉన్నారని, వీరి సేవలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనుబాబు, ఏఓ రమణమూర్తి, ఆఫీస్ సూపరింటెండెంట్ కాళీచరణ్, వైద్యులు పాల్గొన్నారు. దివ్యాంగులకు తప్పని పాట్లు నరసన్నపేట: దివ్యాంగులకు సదరం పాట్లు తప్పడం లేదు. సారవకోట మండలంలోని వివిధ గ్రామాల దివ్యాంగులు బుధవారం వ్యయప్రయాసలకు ఓర్చి ఉదయం 9 గంటల కే నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి చేరుకున్నా రు. అయితే వీరి అటెండెన్స్ తీసుకోవాల్సిన గుప్పెడుపేట సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ను సాధారణ విధులకు కేటాయించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు వేచి ఉండక తప్పలేదు. విషయం తెలుసుకున్న డీసీహెచ్ఎ స్ కల్యాణ్బాబు డిజిటల్ అసిస్టెంట్ను రప్పించి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేయించారు. ఉత్సాహంగా బల ప్రదర్శన పోటీలు పొందూరు: బురిడికంచరాం బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి బలప్రదర్శన పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి. 46 అడుగుల అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్టాపన సందర్భంగా జిల్లా స్పోర్ట్స్ అథారిటీ వెయిట్ లిఫ్టర్ ఇప్పిలి అప్పన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో వెయిట్ లిఫ్టింగ్ మహిళా విభాగంలో డి.హేమశ్రీ, పురుష విభాగంలో ఆవాల గోవిందరావు విజేతలుగా నిలిచారు. సంగిడీ పోటీల్లో ఒప్పంగి సత్యనారాయణ, విసురుగుండు పోటీల్లో ఆవాల గోవిందరావులు విజయం సాధించి బహుమతులు గెలుచుకున్నారు. శిక్షణతో స్వయం ఉపాధి ఆమదాలవలస: యువతకు అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి సాధించాలని కె.వి.కె. ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. ఆమదాలవలసలో కృషి విజ్ఞాన కేంద్రం, సీతంపేట గిరిజన అభివృద్ధి సంస్థ సంయుక్తంగా ‘ప్రోట్రే’ విధానంలో నారు మొక్కల విధానంపై గిరిజన యువ రైతులకు నైపుణ్య శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఉద్యానవన శాస్త్రవేత్త డాక్టర్ వి.హరికుమార్, కె.వి.కె.శాస్త్రవేత్తలు అనూష, బాలకృష్ణ, జి.ఎస్.రాయ్, సునీత, కిరణ్, కొత్తూరు, భామిని, సీతంపేట మండలాల గిరిజన రైతులు,పాల్గొన్నారు. -
రూపురేఖలు మార్చి.. రాష్ట్రస్థాయికి చేర్చి..
పనులు పూర్తి చేశాక ఆనందపురం యూపీ పాఠశాల ఇలాఒకప్పుడు జి.సిగడాం మండలం ఆనందపురం ప్రాథమికోన్నత పాఠశాల అంటే అందరికీ గుర్తొచ్చేది.. చుట్టూ మురుగునీరు నిండిన ఓ సర్కారు బడి మాత్రమే. ఎంతమంది పాలకులు వచ్చినా పాఠశాల దుస్థితిని, వర్షం పడిన తర్వాత బడిని చుట్టుముట్టే మురుగును తప్పించలేకపోయారు. ఈ సమస్యకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే పరిష్కారం చూపారు. నాడు–నేడు పథకం కింద బడి రూపురేఖలు సమూలంగా మార్చేశారు. అంతేకాకుండా 2022లో రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు 68 పాఠశాలలను ఎంపిక చేయగా ఓవరాల్ ఫెర్ఫార్మెన్స్ విభాగంలో ఇదే పాఠశాల అవార్డు సైతం దక్కించుకుంది. ఈ ఒక్క పాఠశాలే కాదు జిల్లాలోని వందలాది ప్రభుత్వం పాఠశాలల తలరాతలను మార్చిన ఘనత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సర్కారుదే. – జి.సిగడాం -
టీచర్లకు బదిలీ కష్టాలు
● వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు ● కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఉపాధ్యాయ సాధారణ బదిలీలు గందరగోళంగా మారాయి. ఆదరాబాదరాగా నిర్వహిస్తున్న బదిలీల ప్రక్రియతో టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తులు మొదలుకొని సాఫ్ట్వేర్ మొరాయింపు, ధ్రువపత్రాల అప్లోడింగ్ కష్టాలు, స్టేషన్ పాయింట్ల కేటాయింపులో తేడాలు, 5/8 సంవత్సరాలకు మెరిట్ పాయింట్ల కేటాయింపు సరిగాలేకపోవడం, ఎంపికచేసుకునే పాఠశాలలు కనిపించకపోవడం, ఇతర సాంకేతిక సమస్యల కారణంగా మెజారిటీ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇదే విషయమై పలువురు ఉపాధ్యాయులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 83 గ్రేడ్–2 హెడ్మాస్టార్ల పోస్టులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్లు/తత్సమాన ఉపాధ్యాయులతో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. -
ధీమా ఇవ్వని బీమా
ఆమదాలవలస: కూటమి ప్రభుత్వం వచ్చాక సాధారణ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదానికి రూ.10 లక్షలు ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. గతేడాది మార్చి నుంచి ఇప్పటివరకు చిల్లు గవ్వ కూడా విదల్చలేదు. దీంతో సుమారు 3500 కుటుంబాలు ఇంటి పెద్ద దిక్కు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. చంద్రన్న బీమా కోసం బాధిత కుటుంబాలు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు తప్ప చిల్లిగవ్వ కూడా విదల్చడం లేదు. ఇదీ పరిస్థితి.. 2014–19 హయాంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చింది. కుటుంబ పెద్దను కోల్పోతే సహజ మరణమైతే రూ.రెండు లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 5లక్షలు ఇచ్చేలా పథకాన్ని రూపొందించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ బీమా పేరిట 2021–22లో జిల్లాలో ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన సుమారు 1600 మంది కుటుంబాలకు, 2022–23లో 1650 కుటుంబాలకు, 2023–24లో 1200 కుటుంబాలకు వైఎస్సార్ బీమా కింద సొమ్ము అందించింది. హామీ అమలుకు మోక్షమెప్పుడో? తాము అధికారంలోకి వస్తే చంద్రన్న బీమా మళ్లీ అమల్లోకి తెస్తామని ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు సహజ మరణానికి(50 ఏళ్లలోపు) రూ.ఐదు లక్షలు, ప్రమాద మరణాలకు రూ.పది లక్షలు బీమా పరిహారం ఇస్తామని కూటమి నేతలు తమ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటికి అధికారంలో కొచ్చి ఏడాది కావస్తున్నా చంద్రన్న బీమా అమలుకు నోచుకోలేదు. పథకం అమలుకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలను విడుదల చేయలేదు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ బీమా కింద నమోదైన మరణాలను బట్టి చూస్తే జిల్లాలో ఏడాదికి సుమారు 15 వందలకు పైబడి ఉంటాయని అధికారులు అంచనాలు వేస్తున్నారు. గత ఏడాది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి నుంచి ఇప్పటివరకు ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన ఏ ఒక్క కుటుంబానికి బీమా పరిహారం అందలేదు. దీంతో ఆయా ఇళ్ల మహిళలు పిల్లలతో కుటుంబాన్ని నెట్టుకురాలేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రన్న బీమా అమల్లోకి వచ్చి ఉంటే కుటుంబానికి కొంత ఆర్థిక సాయం అందేది. ఈ విషయమై సచివాలయాలకు వెళ్తే ఇంకా ప్రభుత్వం విధి విధానాలు విడుదల చేయలేదని, వచ్చిన తర్వాతే ఆన్లైన్ చేయడం కుదురుతుందని ఉద్యోగులు చెబుతుండడంతో బాధితులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. జాప్యం ఎందుకో? కూటమి నేతలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి చంద్రన్న బీమాపై ఆర్భాటంగా ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక అమలులో తాత్సారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా పేదలకు తీవ్ర అన్యాయం చేస్తోంది. పది నెలలు కాలంగా చంద్రన్న బీమాకు అర్హులైన నిరుపేదలకు అన్యాయం జరిగింది. వారికి వెంటనే అమలు చేసి న్యాయం చేయాలి. – బొడ్డేపల్లి రమేష్కుమార్, వైఎస్సార్ సీపీ మున్సిపల్ మాజీ ఫ్లోర్లీడర్, ఆమదాలవలస మున్సిపాలిటీ అమల్లోకి రాని చంద్రన్న బీమా పథకం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదవుతున్నా పట్టించుకోని పాలకులు పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్న కుటుంబాలు -
సర్టిఫికెట్ల పరిశీలన
హెచ్ఎంల పదోన్నతులకుశ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా పరిషత్, మున్సిపల్ హైస్కూల్స్లో ఖాళీ (మొత్తం 83)గా ఉన్న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ మొదలైంది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా సీనియారిటీ జాబితాలో ఉన్న ఉపాధ్యాయులకు 1:2 రేషియోలో మొదటిరోజు 166 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తిచేశారు. డీఈఓ సదాశివుని తిరుమల చైతన్య నేతృత్వంలో డిప్యూటీ డీఈఓలు ఆర్.విజయకుమారి, పి.విలియమ్స్ ఆధ్వర్యంలో సీనియర్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, డీఈఓ కార్యాలయ సిబ్బందితో కూడిన స్క్రూటినీ కమిటీలు ఉద్యోగ పదోన్నతి పొందనున్న స్కూల్ అసిస్టెంట్ల అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను, సర్వీస్ రికార్డులను క్షున్నంగా పరిశీలించారు. కొన్ని రిమార్కులను గుర్తించారు. కాగా హెచ్ఎంల సర్టిఫికెట్ల వెరిఫికేషన్తోపాటు 3142 మంది స్కూల్ అసిస్టెంట్లు, 2550 సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ పోస్టుల వెరిఫికేషన్ సైతం పూర్తి చేయడం గమనార్హం. బుధవారం మిగిలిన ఉపాధ్యాయుల సర్టిఫికెట్ల తనిఖీతోపాటు బదిలీలకు సంబంధించి 131 ఎస్జీటీల పోస్టుల వెరిఫికేషన్ పూర్తి చేయనున్నట్టు డీఈఓ తెలిపారు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి.. గ్రేడ్–2 హెచ్ఎం పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ బహుజన టీచర్స్ అసోసియేషన్తో కలిపి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ జిల్లాశాఖ ప్రతినిధులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమకు 15 శాతం హక్కుగా రావాల్సిన 12 పోస్టులను ఎస్సీ,ఎస్టీలకు మాత్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం బోనెల రమేష్, వడమ శరత్, దార్ఘాశి గణేష్, పడాల ప్రతాప్కుమార్, షన్ముఖరావు, కృష్ణమోహన్ తదితరులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. -
తండ్రి ఉసురు తీసిన కొడుకు ప్రేమ
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రం సమీపంలో గార మండలం వత్సవలస వద్ద ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఓ దళిత కుటుంబం ఈ నెల 22న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భర్త యండా మోహనరావు (47) రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి దాటాక మృతిచెందాడు. భార్య రేణుక, కుమార్తె అంజలిలు రిమ్స్ ఐసీయూలో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా వారి పరిస్థితీ విషమంగానే ఉంది. తమ లాంటి దళిత పేద కుటుంబం మొత్తం ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం వెనక తమ కుమారుడు విజయవాడకు చెందిన ఓ బాలికను ప్రేమించి పరారవ్వడం, బాలిక తరపువాళ్లు విజయవాడ పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఉపాధి నిమిత్తం శ్రీకాకుళం నగరం గుజరాతీపేట సాయిబాబా గుడి సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్న తమ వద్దకు పెనమలూరు పోలీసులు శ్రీనివాసరావు, వీరయ్యలు వచ్చి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు పాల్పడటమే కారణమని, అంతే కాకుండా పోలీసులు విజయవాడ తీసుకెళ్లి నానా ఇబ్బందులకు గురిచేసేవారని.. పరారైన కుమారుని జాడ కూడా లేకపోవడంతో ఇలా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామంటూ బాధితులు లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇవన్నీ మోహనరావు సుమారు 15 నుంచి 18 పేపర్లలో ఎచ్చెర్ల పోలీసులకు రాసిన లేఖలో ఉన్నవే కాక.. భార్య రేణుక మంగళవారం రిమ్స్ ఆసుపత్రి వద్ద విలేకరుల వద్ద తన గోడు వినిపించింది. తమ ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసి ఆధార్కార్డు, పాన్కార్డు, బ్యాంకు అకౌంట్లు, బైక్ తీసుకెళ్లిపోయారని, మతిస్థిమితం లేని తన కుమార్తెను, తనను ఇకనైనా విడిచిపెట్టాలని వేడుకుంది. యువకున్ని పిలిపిస్తే స్థానిక పోలీస్స్టేషన్లో ఇరు వర్గాలతో మాట్లాడి వివాదాన్ని సద్దుమణిగించాలనుకున్నామని.. ఈలోగానే ఇలా జరగడం బాధాకరమని ధర్మవరం సర్పంచ్ అల్లు కన్నబాబు, గ్రామస్తులు మీడియాకు చెప్పారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు:సీఐ ఈ విషయమై పెనమలూరు సీఐ వెంకటరమణ ‘సాక్షి’తో మాట్లాడుతూ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నారు. ఈ వ్యవహారమంతా యువకుడి తల్లికి తెలిసినా భర్త మోహనరావుకు చెప్పలేదన్నారు. అబ్బాయి, అమ్మాయిని తెచ్చిస్తే ఎటువంటి కేసు ఉండదని చెప్పామని, లేకుంటే ముద్దాయిలవుతారని చెప్పడంతో భయంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడివుంటారని పేర్కొన్నారు. పోలీసులు ఎటువంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని, బాలిక అదృశ్యం కేసు సున్నితాంశం ఇలా చేయాల్సివచ్చిందని స్పష్టం చేశారు. కేసు నమోదు గార: వత్సవలస సమీపంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో ధర్మవరం గ్రామానికి చెందిన ఎండ మోహనరావు(47) రిమ్స్లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడని, భార్య రేణుక ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఏఎస్ఐ ఎం.చిరంజీవి తెలిపారు.● ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దళిత కుటుంబంలో తండ్రి మృతి ● తల్లీ, సోదరి పరిస్థితి విషమం ● విచారణ పేరుతో విజయవాడ పోలీసులు టార్చర్ పెట్టారని ఎచ్చెర్ల పోలీసులకు లేఖ -
అదుపు తప్పిన ఆటో
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గూనపాలెం డీఎస్పీ కార్యాలయం సమీపంలో సెంటర్ డివైడర్ స్తంభాన్ని ఆటో ఢీకొట్టింది. ఆ సమయంలో వెనుకగా వస్తున్న ద్విచక్రవాహనాలు అదే ఆటోను ఢీకొనడంతో ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. గార మండల కేంద్రానికి చెందిన లక్ష్మణరావు తన ఆటోలో కళింగపట్నానికి చెందిన దీర్ఘాసి రత్న, కృష్ణవేణి, దీర్ఘాసి నరసమ్మ, శాలిహుండంకు చెందిన తోట రాజులమ్మ, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కళింగపట్నం నుంచి పాతబస్టాండ్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటోడ్రైవర్ లక్ష్మణరావు తలకు గాయమవ్వగా, రాజులమ్మ చేతికి గాయమైంది. ఈ ఘటనలో రూ.5 వేలు నగదున్న పర్సు, సెల్ఫోన్ పోయిందని రాజులమ్మ తెలిపారు. ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, ద్విచక్ర వాహనదారులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని ట్రాఫిక్ సీఐ నాగరాజు పేర్కొన్నారు.● ఇద్దరికి గాయాలు -
గిన్నిస్బుక్లోకి శామ్యూల్
పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ రామమందిరం వీధికి చెందిన సైన్స్ ఉపాధ్యాయుడు విక్టర్ శామ్యూల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. విజయవాడకు చెందిన హలెల్ మ్యూజిక్ స్కూల్ తరఫున పాస్టర్ ఆగస్టిన్ దండింగి ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ ఒకటో తేదీన 18 దేశాలకు చెందిన 1090 మంది ఒకేసారి ఆన్లైన్ వేదికగా గంట వ్యవధిలో కీబోర్డ్ ప్లే చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు. దీనిని గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు గుర్తించి 1046 మందికి బుక్లో స్థానం కల్పించారు. అందులో శామ్యూల్ ఒకరు. ఇటీవల విజయవాడలోని గుణదలలో జరిగిన కార్యక్రమంలో శామ్యూల్కు ధ్రువీకరణపత్రం ప్రదానం చేశారు. -
‘టీచర్ల బదిలీ సమస్యల్ని పరిష్కరించాలి’
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ బదిలీల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని యూటీఎఫ్ జిల్లాశాఖ అధ్యక్షుడు లండ బాబూరావు, ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారిని ఆర్.విజయకుమారిని యూటీఎఫ్ జిల్లా శాఖ పక్షాన కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రేడ్–2 హెచ్ఎం ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు ఒక్క పోస్ట్ కూడా లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఈ మధ్యన సంఘాలతో చేసిన చర్చలలో 120 స్టూడెంట్ రోలు దాటిన పాఠశాలలకు వన్ ప్లస్ ఫైవ్ పోస్టులు కేటాయిస్తూ ఆపై ప్రతి 30 మందికి ఒక పోస్ట్ కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. డీఈఓను కలిసిన వారిలో యూటీఎఫ్ జిల్లా కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శి ఏ.అన్నాజీరావు, బి.సుభాష్బాబు, పి.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా క్రికెట్ జట్ల ఎంపికలకు వేళాయెశ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా క్రికెటర్లకు జిల్లా క్రికెట్ సంఘం శుభవార్త చెప్పింది. కొత్త సీజన్లో ఏసీఏ అంతర్జిల్లాల క్రికెట్ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం వహించనున్న జిల్లా అండర్–14, అండర్–16 బాలుర క్రికెట్ జట్ల ఎంపికలకు కసరత్తులు చేస్తోంది. చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల క్రికెట్ మైదానం వేదికగా జూన్ ఒకటో తేదీన ఉదయం 8 గంటల నుంచి అండర్–14 ఎంపికలను, అదేరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అండర్–16 ఎంపికలను నిర్వహించాలని నిర్ణయించారు. ఎంపికల్లో పాల్గొనే క్రీ డాకారులకు తాగునీటితోపాటు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించేలా జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.కటాఫ్ తేదీ పక్కా..జిల్లా క్రికెట్ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకా రులు కటాఫ్ తేదీలు పక్కాగా పాటించాల్సిందేనని జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు స్పష్టం చేస్తున్నారు. అండర్–14 ఎంపికలకు హాజర య్యే బాలురు 2011 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించి ఉండాలి. అండర్–16 విభాగానికి హాజరయ్యే బాలురు 2009 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. గత ఆరోపణల నేపథ్యంలో సెలెక్షన్ కమిటీలను నియమించి అత్యంత పారదర్శకంగా జిల్లా జట్లను ఎంపిక చేసేలా ప్రణాళికాబద్ధంగా సన్నద్ధమవుతున్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు విధిగా తమ జనన ధ్రువీకరణ పత్రం ఫారమ్–5, ఒరిజినల్ ఆధార్కార్డుతో హాజరుకావాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్య క్షుడు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ తెలిపారు. -
● ఉత్సాహంగా యోగాంధ్ర
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని చారిత్రక డచ్ బిల్డింగ్ వద్ద యోగాంధ్ర–2025 కింద యోగా శిబిరం మంగళవారం ఉదయం జరిగింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో అధికారులు సమన్వయంతో నిర్వహించారు. వెయ్యిమంది హా జరు కావడానికి వీలుగా పది విభాగాలుగా విభజించారు. ప్రతి బ్లాకు ఎదుట ఒక యోగా గురు వును ఏర్పాటు చేశారు. మొత్తం 45 మంది యోగా గురువులు శిబిరాన్ని విజయవంతంగా నడిపించా రు. మాజీ సైనికులు కూడా భాగస్వాములయ్యారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటే శ్వరరావు, ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్, సెట్శ్రీ సీఈఓ ప్రసాదరావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, డీఎంహెచ్ఓ అనిత యోగా శిక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అమరుల స్మారక సభ నిర్వహణపై నిషేధాజ్ఞలు
పలాస: శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి గుర్తుగా స్మారక సభ నిర్వహణపై కాశీబుగ్గ పోలీసులు ఉక్కుపాదం మో పారు. కాశీబుగ్గ డీఎస్పీ ఆదేశాల మేరకు నిషేధాజ్ఞలు విధించారు. దీంతో మంగళవారం ఉదయం పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద జరగాల్సిన ఈ సభను రద్దు చేశా రు. 1969లో జరిగిన జిల్లా గిరిజన రైతాంగ సాయుధపోరాటంలో సుమారు 360 మంది అప్పటి పోలీసు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. జిల్లా ఉద్యమ నిర్మాత పంచాది కృష్ణమూర్తి కలకత్తాలో జరిగిన కేంద్రకమిటీ సమావేశం నుంచి తిరిగి వస్తుండగా 1969 మే 27న పోలీసుల చేత చిక్కి మృతి చెందారు. ఆయనతో పాటు మరో ఆరుగురు కూడా మృతి చెందారు. జిల్లా సాయుధ పోరాటం ముగిసిన తర్వాత అమరవీరుల జ్ఞాపకార్థం 1990లో గ్రామస్తులు, వివిధ విప్లవ పార్టీల ఆధ్వర్యంలో కూడిన స్మారక మందిరం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం నిర్మించారు. ఏటా మే 27న అమరుల స్మారక సభ నిర్వహిస్తున్నారు. ఈ యేడు మాత్రం పోలీసులు అడ్డు చెప్పారు. సోమవారం రాత్రి నుంచి బొడ్డపాడులో పోలీసులు నిఘా వేశారు. మంగళవారం ఉదయం గ్రామానికి కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో వచ్చి అమరవీరుల స్మారక మందిరం వద్ద తిష్టవేశారు. దీంతో బొడ్డపాడు మాజీ సర్పంచ్ తామాడ త్రిలోచనరావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు దాసరి శ్రీరాములు, మద్దిల రామారావు, వంకల మాధవరావు, తామాడ సన్యాసిరావు తదితరులు కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు వద్దకు అనుమతి కోసం వెళ్లారు. కానీ ఆయన అనుమతి నిరాకరించారు. సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు కూడా స్మారక మందిరంలో ఉన్న ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలను బయటకు పంపేశారు. -
మంత్రి అచ్చెన్నాయుడు తీరు బాధాకరం
టెక్కలి: మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకువచ్చే విషయంలో కుటుంబ సభ్యులను బెదిరిస్తూ, అధికార దర్పంతో ఆంక్షలు విధించిన మంత్రి అచ్చెన్నాయుడు తీరు బాధాకరమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. ప్రజా ఉద్యమాల్లో కేశవరావు అగ్రనేతగా మారినప్పటికీ కుటుంబ సభ్యులకు అభిమానం ఉంటుందన్నారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేయకూడదనే ఆంక్షలతో కుటుంబ సభ్యులను మంత్రి అచ్చెన్నాయుడు బెదిరించడం కేవలం ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేసేలా ప్రవర్తించడం మంచిదికాదన్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు ఇలా ఆ కుటుంబాలను మానసికంగా హింసించడమే కాకుండా బెదిరించడం మానవత్వం కాదని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి తిలక్ మండిపాటు -
ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఈఏపీ సెట్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2025 జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. సీబీటీ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో ఈనెల 19 నుంచి మొదలైన ఈ పరీక్షలు మంగళవారం సాయంత్రంతో ముగిశాయి. జిల్లాలో ఏపీఈఏపీసెట్కు మొత్తం 13,298 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 95 శాతం హాజరుతో 12633 మంది పరీక్షలకు హాజరయ్యారు. 655 మంది వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. వీరిలో ఈనెల 19, 20 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్, ఫార్మశీ పరీక్షలకు 3864 మంది దరఖాస్తు చేసుకోగా 3571 మంది పరీక్ష రాశారు. మరో 293 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు జరిగిన ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలకు 9434 మంది దరఖాస్తు చేసుకోగా 9062 మంది పరీక్షను రాశారు, మరో 372 మంది డుమ్మా కొట్టారు. మొత్త ఏడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. జిల్లాలో ఏడు కేంద్రాల్లో జరిగిన ఆన్లైన్ పరీక్షలకు 95 శాతం హాజరు దరఖాస్తు చేసిన 13,298 మందిలో 655 మంది గైర్హాజరు విభాగం దరఖాస్తు పరీక్షకు గైర్హాజరు హాజరు చేసింది హాజరు శాతం ఇంజినీరింగ్ 9434 9062 372 96.17 అగ్రికల్చర్, ఫార్మసీ 3864 3571 293 92.42 మొత్తం 13298 12633 95.00 -
నా భర్త దుర్గలక్ష్మి అనే అమ్మాయితో వెళ్లిపోయాడు..!
శ్రీకాకుళం క్రైమ్: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని.. తనతో ఒక బిడ్డను కన్నాక దళిత మహిళ అని ఒకే ఒక్క కారణంతో తనను వదిలించుకోవాలని చూసి, అంతకుముందే నిశ్చితార్థం చేసుకున్న మరో అమ్మాయితో పరారయ్యాడని ఒక బాధితురాలు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు యర్ర మంగ మ్మ ఇచ్చిన ఫిర్యాదులో మేరకు.. ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తనని 2019లో లావేరు మండలం శిగిరి కొత్తపల్లి గ్రామానికి చెందిన యర్ర శంకరరావు ప్రేమిస్తునానని చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో మగబిడ్డను కన్నాక తనది దళిత కులమనే ఒక్క కారణంతో అయిష్టత పెంచుకుని హింసించడం ప్రారంభించాడు. దానికి శంకరరావు కుటుంబ సభ్యు లు అతనికి మద్దతు పలికేవారు. కొన్నిరోజులు మళ్లీ ప్రేమను చూపించి హైదరాబాద్ నుంచి శిగిరి కొత్తపల్లి గ్రామంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. పైడి భీమవరం ఫార్మా కంపెనీలో డ్యూటీ చేసేందుకు అక్కడే ఈ ఏడాది ఏప్రిల్లో ఇల్లు అద్దెకు తీసుకొని విధులకు వెళ్లేవాడు. మరో అమ్మాయితో పరారీ తన భర్త శంకరరావును పైడి భీమవరం నుంచి తమ ఇంటికి తీసుకెళ్లమని ఎన్నిసార్లు చెప్పినా తీసుకెళ్లేవాడు కాదని మహిళ పేర్కొంది. కారణం అడిగితే తన తల్లిదండ్రులు, అన్నదమ్ము లు దళిత మహిళను తీసుకురావడానికి వీళ్లేదని కుల పెద్దల సమక్షంలో తేల్చి చెప్పారని సమాధానమిచ్చాడని తెలిపింది. అంతేకాక అంతకు ముందు తన భర్తతో నిశ్చితార్థం జరిగిన దుర్గలక్ష్మి అనే అమ్మాయితో ఎటైనా వెళ్లిపోమని కుటుంబసభ్యులు సలహా ఇవ్వడంతో ఆమెతో కలిసి పరారయ్యాడని పేర్కొంది. ఇదే విషయ మై లావేరు పోలీసులకు నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదని, న్యాయం చేయమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని ప్రాధేయపడింది. -
అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ లాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, సర్వశిక్షా అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, ఎకై ్సజ్, ఏపీఈపీడీసీఎల్ తదితర శాఖలపై 186 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్ రాజ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శాఖల వారీగా ఒక్కో శాఖలో పెండింగులో ఉన్న అర్జీలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమీక్షించారు. పెండింగులో ఉన్న అర్జీలు ఎందుకు పెండింగులో ఉన్నది అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మీకోసంలో 186 అర్జీల స్వీకరణ బీసీ సంక్షేమ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి అనురాధపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుమంది అవుట్ సోర్సింగ్ బాధిత కారుణ్య నియామక అభ్యర్థులు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి కలెక్టర్ ఆరు నెలలుగా కారుణ్య నియామకాలకు సంబంధించిన అభ్యర్థులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారిపై అసహనం వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ కారుణ్య నియామకాలు మానవతా దృక్పథంతో చేపట్టాలని సూచించారు. ఒక నెల జీతం ఆపితే అప్పుడు బాధ తెలుస్తుందని విరుచుకుపడ్డారు. వెంటనే ఈ జాప్యంపై పరిశీలించి తనకు వివరించాలని కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణకి ఆదేశించారు. -
ఎస్పీ స్పందనకు 62 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు – పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో అర్జీదారుల నుంచి 62 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి సకాలంలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అర్జీదారులతో మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి నమ్మించి.. నట్టేట ముంచి..! ● పెళ్లి చేసుకొని దళిత యువతికి మోసం ● ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు శ్రీకాకుళం క్రైమ్: ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్మించి పెళ్లి చేసుకున్నాడని.. తనతో ఒక బిడ్డను కన్నాక దళిత మహిళ అని ఒకే ఒక్క కారణంతో తనను వదిలించుకోవాలని చూసి, అంతకుముందే నిశ్చితార్థం చేసుకున్న మరో అమ్మాయితో పరారయ్యాడని ఒక బాధితురాలు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు యర్ర మంగమ్మ ఇచ్చిన ఫిర్యాదులో మేరకు.. ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన తనని 2019లో లావేరు మండలం శిగిరి కొత్తపల్లి గ్రామానికి చెందిన యర్ర శంకరరావు ప్రేమిస్తునానని చెప్పి హైదరాబాద్ తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈక్రమంలో మగబిడ్డను కన్నాక తనది దళిత కులమనే ఒక్క కారణంతో అయిష్టత పెంచుకుని హింసించడం ప్రారంభించాడు. దానికి శంకరరావు కుటుంబ సభ్యులు అతనికి మద్దతు పలికేవారు. కొన్నిరోజులు మళ్లీ ప్రేమను చూపించి హైదరాబాద్ నుంచి శిగిరి కొత్తపల్లి గ్రామంలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. పైడి భీమవరం ఫార్మా కంపెనీలో డ్యూటీ చేసేందుకు అక్కడే ఈ ఏడాది ఏప్రిల్లో ఇల్లు అద్దెకు తీసుకొని విధులకు వెళ్లేవాడు. మరో అమ్మాయితో పరారీ తన భర్త శంకరరావును పైడి భీమవరం నుంచి తమ ఇంటికి తీసుకెళ్లమని ఎన్నిసార్లు చెప్పినా తీసుకెళ్లేవాడు కాదని మహిళ పేర్కొంది. కారణం అడిగితే తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు దళిత మహిళను తీసుకురావడానికి వీళ్లేదని కుల పెద్దల సమక్షంలో తేల్చి చెప్పారని సమాధానమిచ్చాడని తెలిపింది. అంతేకాక అంతకుముందు తన భర్తతో నిశ్చితార్థం జరిగిన దుర్గలక్ష్మి అనే అమ్మాయితో ఎటైనా వెళ్లిపోమని కుటుంబసభ్యులు సలహా ఇవ్వడంతో ఆమెతో కలిసి పరారయ్యాడని పేర్కొంది. ఇదే విషయమై లావేరు పోలీసులకు నెల రోజుల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు పట్టించుకోలేదని, న్యాయం చేయమని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని ప్రాధేయపడింది. -
సర్టిఫికెట్ల పరిశీలన నేడు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఖాళీగా ఉన్నటువంటి హెచ్ఎం పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన టీచర్ల సర్టిఫికెట్లను మంగళవారం పరిశీలించనున్నారు. జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీ(పదవీ విరమణ, మరణం, రీ అపోర్షన్ కారణంగా)గా ఉన్న హెచ్ఎం పోస్టులను అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో భర్తీ చేయనున్నట్లు డీఈవో డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 83 హెచ్ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సీనియారిటీ జాబితాను శ్రీకాకుళం డీఈఓ.ఓఆర్జీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చినట్టు చెప్పారు. సీనియారిటీ జాబితాలో పేర్కొన్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు, తత్సమాన కేటగిరి ఉపాధ్యాయులు మాత్రమే 27వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం ప్రభుత్వ(బాలుర) ఉన్నత పాఠశాల వేదికగా జరిగే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించారు. వారి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు సర్వీస్ రిజిస్టర్ తమవెంట తీసుకురావాలని స్పష్టం చేశారు. జిల్లాలో చిన్నారులకు వ్యాక్సినేషన్ ● జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి అనిత వెల్లడి అరసవల్లి: జిల్లాలో చిన్నారులకు ఆటలమ్మ, రూబెల్లా వ్యాధులు సంక్రమించకుండా అన్ని ఆరోగ్య కేంద్రాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల వద్ద మీజిల్స్ రూబిల్లా వ్యాక్సినేషన్ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత తెలియజేశారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో ప్రత్యేక శిబిరాల ఏర్పాటు చేసి మూడు విడతలుగా వ్యాక్సినేషన్ చేసేలా చర్యలు చేపట్టనునట్లు వివరించారు. మొదటి విడతగా ఈనెల 26 నుంచి 31 వరకు, రెండో విడతగా వచ్చే జూన్ 23 నుంచి 28 వరకు, అలాగే మూడో విడతగా జూలై 21 నుంచి 26 వరకు ఈ ప్రత్యేక శిబిరాలను నిర్వహించనున్నట్లుగా వివరించారు. ఈ ప్రక్రియను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ రామదాస్ పర్యవేక్షణలో చేపతామని వివరించారు. నిద్రమత్తులో లారీ బోల్తా కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 10వ వార్డు పారసాంబ గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ బోల్తాపడింది. ఇచ్ఛాపురం నుంచి టెక్కలి వైపు వెళ్తుండగా పలాస దాటిన అనంతరం డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడంతో రోడ్డుపక్కకు వెళ్లిపోయింది. అప్రమత్తమైన లారీ డ్రైవర్ ఒక్కసారిగా అదుపుచేసినప్పటికీ తవుడు లోడుతో ఉన్నటువంటి లారీ పల్టీలుకొట్టింది. లారీ డ్రైవర్, క్లీనర్ గాయాలతో బయటపడ్డారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోశాధికారిగా శ్రీనివాసరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీ ఎన్జీవోస్ విజయవాడ కార్యాలయంలో నిర్వహించిన ఏపీటీఎస్ఏ రాష్ట్ర కార్యవర్గం ఎన్నికల్లో జిల్లాకు చెందిన బొత్స శ్రీనివాసరావుని ఆ సంఘం కోశాధికారిగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలు విజయవాడలో ఆదివారం జరిగాయి. రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై శ్రీకాకుళం జిల్లా ఏపీటీఎస్ఏ అధ్యక్షుడు దొడ్ల శ్రీరామ్కుమార్, జిల్లా కార్యదర్శి డేవిడ్ మాదారపు ఇతర కార్యవర్గం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల అదుపులో బెట్టింగ్ రాయుళ్లు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో బెట్టింగ్ మాఫియా మూలాలు పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే అటు సీసీఎస్ స్టేషన్లోను, ఇటు టాస్క్ఫోర్స్ కార్యాలయంలోను, రూరల్, ఎచ్చెర్ల, వన్టౌన్ పీఎస్ల్లో సుమారు 13 మందిని విచారించినట్లు తెలుస్తోంది. వీరిలో ప్రధాన బుకీ డి.శ్రీనివాస్ కూడా ఉండటం విశేషం. దొరికిన వారికి విశాఖలోని పెద్ద బుకీలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
కారుని ఢీకొన్న ద్విచక్ర వాహనం
● ఇద్దరికి తీవ్రగాయాలు రణస్థలం: మండలంలోని దన్నానపేట కొత్త పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై మలుపు తిరుగుతున్న కారును అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. జేఆర్పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒక ఫంక్షన్ కోసం శ్రీకాకుళం వెళ్లి అటునుంచి ద్విచక్ర వాహనంపై అన్నదమ్ములు సున్నపల్లి బోయోడు, బుల్లోడు వస్తున్నారు. దన్నానపేట పెట్రోల్ బంకు సమీపంలో కొత్తగా జంక్షన్ ఏర్పాటు చేయడంతో సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో మలుపు తిరుగుతున్న కారును వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ ఎగిరిపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఇరువురినీ 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరి అన్నదమ్ములు పూసపాటిరేగ మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందినవారు. సరికొత్త స్పోర్ట్స్ బైక్ కావడం అతివేగంగా వచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఇంకా బైకు నంబర్ కూడా రాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాగునీరు రాదు
దారి లేదు.. తాగేందుకు నీరులేదు గోటితో పోయేదాన్ని గొడ్డలిదాక తెచ్చుకున్నట్లు అధికారుల సమన్వయ లోపంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో నాలుగు రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడటమే కాకుండా, సమీప ప్రాంత ప్రజలు తాగేందుకు నీరు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. – సత్తారు సత్యం, గోపినాథపురం ఇబ్బంది పడుతున్నారు రహదారి మరమ్మతుల్లో భాగంగా పైపులైన్లు తవ్వేయడంతో నేటికి నాలుగు రోజులుగా కుళాయిలు ద్వారా తాగునీరు రావడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తాగేందుకు నీటిని కోనుగోలు చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయాలి. – తమ్మన్నగారి కిరణ్, రోణంకి అప్పలస్వామి వీధి, టెక్కలి సమస్య పరిష్కరిస్తాం రహదారి మరమ్మతులతో ప్రజలకు ఏర్పడిన సమస్యను పరిష్కరించారు. మంగళవారం రాత్రిలోపు మరమ్మతులు పూర్తిచేసి బుధవారానికి రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తాం. – మోహన్, జేఈ, టెక్కలి ● ప్రజలకు శాపంగా అధికారుల సమన్వయ లోపం ● నాలుగు రోజులైనా పూర్తవ్వని రోడ్డు పనులు ● ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు టెక్కలి రూరల్: నాలుగు రోజుల క్రితం స్థానిక గోపినాథపురం సమీపంలో రహదారి మధ్యలో ఏర్పడిన రంద్రాన్ని పూడ్చేందుకు నిర్వహించిన పనుల్లో సంబంధిత అధికారులు మధ్య ఏర్పడిన సమన్వయ లోపం ప్రజలకు శాపంగా మారింది. రహదారి మరమ్మతుల్లో భాగంగా రహదారి కింద ఉన్న పైపులైన్లను తొలగించారు. దీంతో అధికంగా తాగునీరు వృథాగా పోయిన విషయం తెలిసిందే. అయితే అధికారులు పైపులైన్లు మరమ్మతులు చేసేందుకు గాను రాకపోకలు నిలిపివేసి నాలుగు రోజులు అవుతున్నప్పటికీ ఆ పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదీ విషయం... గోపినాథపురం సమీపంలో రోడ్డు మధ్యలో చిన్నపాటి రంద్రం ఏర్పడింది. అయితే ఆ రంద్రం మరమ్మత్తులు చేసేందుకు పోర్టుకు సంబంధించిన సిబ్బంది స్థానిక అధికారులతో చర్చించకుండా రహదారిని జేసీబీ సాయంతో తవ్వేశారు. దీంతో కింద నుంచి వెళ్తున్న ప్రధాన పైపులైన్లతో పాటుగా పంచాయతీ పైపులైన్లు సైతం మరమ్మతులకు గురవ్వడంతో ఈ సమస్య ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు. తాగునీటి కష్టాలు రహదారి పనుల్లో భాగంగా రోడ్డు కింద నుంచి వెళ్తున్న పైపులైన్లు తవ్వేయడంతో అటు పంచాయతీ, ఇటు ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించిన రెండు పైపులైన్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో నాలుగు రోజులుగా ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా గోపినాథపురం, ఆర్డీవో కార్యాలయం సమీప ప్రాంతాలు, బర్మాకాలనీ, జయకృష్ణపురం, మునసబుపేట, చిన్ననారాయణపురం, ధర్మానీలాపురం, రావివలస, బీసీ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిలిచిన రాకపోకలు మరమ్మతుల్లో భాగంగా రహదారి మొత్తం తవ్వేయడం వలన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గం గుండా రాత్రి, పగలు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. అలాంటి ఈ మార్గంలో నాలుగు రోజులుగా రాకపోకలు నిలిపి వేయడంతో వాహనదారులతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టెక్కలి నుంచి సంతబొమ్మాళి, నౌపడ, నౌపడ ఆర్ఎస్, మూలపేట, పూండీ తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఈ మార్గంలో బస్సు సౌకర్యం నిలిపివేయడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మిగిలిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు సమీపంలోని చెరువు గట్టుమీదుగా ప్రమాదకరంగా నడుపుతున్నారు. -
ప్రైవేటీకరణ ప్రతిపాదన ఆపాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించొద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు కోరారు. స్టీల్ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ పుండ్కర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తన కుట్రలు మానుకోవాలని సూచించారు. 32 మంది ప్రాణ త్యాగాలతో, వామపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలతో విశాఖ స్టీల్ప్లాంట్ను సాధించుకున్నారని గుర్తు చేశారు. 64 గ్రామాల ప్రజలు 24 వేల ఎకరాల భూములను త్యాగం చేశారని పేర్కొన్నారు. స్టీల్ప్లాంట్ను రక్షిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి పార్టీలు తమ హామీని నిలుపుకోవాలన్నారు. పోరాడి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేసేందుకు ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రారావు, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు చిక్కాల గోవిందరావు, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ, కె.సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఎండీఎం యూనియన్ నాయకురాలు తూతిక ప్రవీణ, బీఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు ఎం.గోవర్ధనరావు, పెన్సనర్స్ యూనియన్ నాయకులు పార్వతీశం, నాగార్జున అగ్రికెమ్ యూనియన్ నాయకులు ఎ.సత్యనారాయణ, ఎల్.రామప్పడు, ఎం.రమణ, కేదారేశ్వరరావు, పి.సుధాకర్ బాబు, టి.రవికుమార్, వైఎస్సార్ జిల్లా మేధావుల విభాగం ఎస్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం నీకే..!
లక్షలిస్తేఅరసవల్లి: ‘మెడికల్ ఇన్వాలిడేషన్..’ జిల్లా వైద్యారోగ్య శాఖలో గత కొన్ని రోజులుగా నలుగుతున్న పేరు. వాస్తవానికి మెడికల్ ఇన్వాలిడేషన్ కోటా కింద అంటే ఒక ఉద్యోగి అనారోగ్య కారణాల రీత్యా పని చేయలేకపోతే అర్హతలు ఉన్న వారసులకు కొలువు లభిస్తుంది. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖలో మాత్రం అర్హతలతో సంబంధం లేకుండా ‘ఆదాయం’ లెక్కలతో ఉద్యోగం ఇప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైద్యారోగ్య శాఖలో పనిచేసి అనారోగ్యానికి గురైన ఉద్యోగి తన వారసుడికి ఉద్యోగం ఇప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య ఇదే శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. అయినా కూడా సర్వీస్ రిజిస్టర్లో భార్య పేరు మార్పు చేస్తూ ఉన్నతాధికారులను మేనేజ్ చేసి ఎలాగైనా ఉద్యోగం వారసునికి ఇప్పిస్తామంటూ ఓ కీలక ‘గ్యాంగ్’ ప్రయత్నాలు మొదలుపెట్టింది. రెండేళ్ల కిందటే ఈ అక్రమ వ్యవహారానికి శ్రీకారం చుట్టినప్పటికీ 2023లో నాటి కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ దీన్ని నిర్ద్వందంగా తోచిపుచ్చేశారు. ఇప్పుడు అదే ఫైల్ను రన్ చేసి ఎలాగైనా ఉద్యోగం వచ్చేలా చేసేందుకు జిల్లా వైద్యా రోగ్య శాఖకు చెందిన ఓ కీలక ఉద్యోగి రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడన్న వార్త దావానంలా వ్యాపించింది. జిల్లా వైద్యారోగ్య శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ అనారోగ్యానికి గురైన ఒక వ్యక్తి ఇంటికి వెళ్లి ఈ కీలక అధికారి పరామర్శించారు. ఇదే తడవుగా మెడికల్ ఇన్వాలిడేషన్ కోటా కింద మీ అబ్బాయికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ చెప్పారు. రూ.5 లక్షలకు బేరం కూ డా కుదుర్చుకున్నాడు. అడ్మిన్ పరంగా ఎలాంటి అడ్డులేకుండా అక్రమంగా మెడికల్ ఇన్వాలిడేషన్ ఫైల్ను నడిపి తుది దశకు చేర్చాడు. అయితే ఇక్కడ నుంచే సీన్ మారిపోయింది. గత కలెక్టర్ ఇదే ఫైల్పై మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధమంటూ తిప్పిపంపించారనే అంశం బయటకు వచ్చింది. దీంతో స్థానిక వైద్యారోగ్య శాఖలో కొందరు ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులను ఆశ్రయించేందుకు అడుగు లు వేస్తున్నారు. డీఎంహెచ్ఓ స్థాయి అధికారి తొలిసారిగా ఏసీబీకి దొరికినా ఈ శాఖలో ఎలాంటి మార్పులు రావడం లేదని కొందరు తెలిపారు. ఈ అక్రమ పోస్టింగ్ ప్రక్రియపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు పంపించారు. రూ.నిబంధనలకు తూట్లు ఎవరైనా ప్రభుత్వ శాఖ ఉద్యోగి మెడికల్గా అన్ఫిట్ అయితే ముందుగా ఆ పరిస్థితి నిజానిజాలపై అధికారులు ముందుగా మెడికల్ బోర్డుకు రిఫర్ చేస్తారు. అక్కడ ధ్రువీకరించిన తర్వాత మెడికల్లీ అన్ఫిట్ సర్టిఫికెట్ పొందాక.. ఈ సర్టిఫికేషన్ కింద వలంటరీ రిటైర్మెంట్ చేయాలని సదరు ఉద్యోగి శాఖ ఉన్నతాధికారికి విన్నవించువాల్సి ఉంటుంది. అనంతరం నియామకానికి సంబంధించి కమిటీకి కలెక్టర్ చైర్మన్, డీఎంహెచ్ఓ మెంబర్ కన్వీనర్గా ఉండగా అన్ని అర్హతలను పరిశీలించాక అర్హత ఉన్న వారసునికి ఉద్యోగం ఇవ్వాలి. అయితే తాజా వ్యవహారంలో నిబంధనలకు తూట్లు పడేలా వ్యవహారాన్ని సదరు కీలక అధికారి అన్నీ తానై నడిపించారు. ఇప్పటికే రూ.లక్షల్లో చేతులు మారిపోవడంతో ఉద్యోగం గ్యారంటీ అంటూ మళ్లీ అదనంగా డబ్బులు నొక్కేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నట్లుగా సమాచారం. -
యోగాంధ్రకు భారీ ప్రణాళికలు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘యోగాంధ్ర’ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమవుతోంది. మే 24 నుంచి జిల్లా స్థాయిలో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇప్పటికే ప్రారంభం కాదా, మే 27 నుంచి మండల స్థాయి లో ట్రైనర్లకు శిక్షణలు ప్రారంభం కానున్నాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ప్రతి మండలంలో 200 మంది యోగా ట్రైనర్లను తయారు చేయడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. శిక్షణలో పాల్గొన్న మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్లు, సాధకులకు ఆయుష్ శాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ద్వారా ధ్రువపత్రాలు జారీ చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. చారిత్రక ప్రదేశాల్లో.. మే 27న డచ్ బిల్డింగ్లో, జూన్ 3న అరసవల్లి సూర్యదేవాలయంలో, జూన్ 7న శాలిహుండం బౌద్ధ స్థూపాల వద్ద, జూన్ 10న కళింగపట్నం బీచ్లో యోగా శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రానికి వెయ్యిమంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్ను మొత్తం కార్యక్రమానికి సమన్వయాధికారిగా నియమించారు. డచ్ బిల్డింగ్ వద్ద ఉత్సాహం యోగాంధ్ర–2025 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీకాకుళం జిల్లా అధికారులు మరింత ఉత్సాహంతో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం డచ్ బిల్డింగ్ వద్ద వెయ్యిమందితో భారీ యోగా శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. శిబిరాన్ని పదిభాగాలుగా విభజించి, ప్రతి బ్లాక్ ఎదురుగా ఒక యోగా నిపుణుడితో ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. మొత్తం 38 నుంచి 45 మంది యోగా ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ఏర్పాట్లపై సోమవారం జిల్లా ముఖ్య అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు చేశారు. యోగాంధ్ర షెడ్యూల్ విడుదల యోగాంధ్ర షెడ్యూల్ను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సోమవారం వెల్లడించారు. విభిన్న కేటగిరీల్లో ప్రదర్శనలు ఉంటాయని పాల్గొనాలనుకునే వారు తప్పనిసరిగా యోగాంధ్ర యాప్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఒక్కో వయస్సు గ్రూప్కి ప్రత్యేక ఆసనాలు సూచించారు. గ్రామస్థాయిలో పోటీలు మే 26 నుంచి 30 వరకూ, మండలస్థాయిలో జూన్ 2 నుంచి 7 వరకు, జిల్లాల్లో జూన్ 9 నుంచి 14 వరకు, రాష్ట్రస్థాయి ఫినాలే జూన్ 16 నుంచి 18 వరకు జరగనున్నట్లు తెలిపారు. -
నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారు
నరసన్నపేట: వైఎస్సార్ సీపీ నాయకు డు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డిని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేయడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం ధర్మా న కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్కు తెగబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మె ల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు వెంకట్రామిరెడ్డిలపై కూడా తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. వీరిపై జంట హత్యల కేసు నమోదు చేయడంతో రెడ్బుక్ రాజ్యాంగం పరాకాష్టకు చేరిందన్నారు. ఇంత దారుణమైన పాలన గతంలో ఎప్పుడూ రాష్ట్రంలో లేదని, ఇలాంటి అరాచక పాలన కూటమి నాయకులకే చెల్లిందని విమర్శించారు. కూటమి నాయకులకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
హైకోర్టు ఆదేశించినా పాటించరా..?
పలాస: మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు మిగతా వారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించకపోవడంపై పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద సోమవారం వివిధ ప్రజాసంఘాలకు చెందిన నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. హైకోర్టు తీర్పు చెప్పినా.. ఆంధ్రా తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు బేఖాతరు చేస్తూ నంబాల కేశవరరావు మృత దేహాన్ని వారి కుటుంబానికి అప్పగించక పోవడం చాలా అన్యాయమని, ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం దీనిపై స్పందించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు పత్తిరి దానేసు, దాసరి శ్రీరాములు, జోగి కోదండరావు, వంకల మాధవరావు,పుచ్చ దుర్యోధన, మద్దిల ధర్మారావు, మద్దిల రామారావు, కోనేరు గురయ్య, సాలిన వీరాస్వామి, పోతనపల్లి కుసుమ తదితరులు ఉన్నారు. -
వ్యవసాయ డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆమదాలవలస రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించే వ్యవసాయ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీపాన నీలవేణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 16వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www.angrau.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. సందేహాల నివృత్తికి పట్టణ శివారులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పనివేళల్లో సంప్రదించాలని తెలిపారు. దూర ప్రాంతాల వారు 7702394824 ఫోన్ నంబర్కు సంప్రదించాలని ప్రిన్సిపాల్ నీలవేణి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్కు పీహెచ్సీలు ఎంపిక అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖ పరిధిలోని 24 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లతో పాటు ఆరు అర్బన్ పీహెచ్సీ కేంద్రాలు నేషనల్ క్వాలి టీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్కు ఎంపికయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశమందిరంలో ఆయా ఆస్పత్రుల అధికారులను ఘనంగా సత్కరించారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డోల (పీహెచ్సీ పోలాకి), ధర్మవరం (పీహెచ్సీ పొన్నాడ), తండ్యాంవలస (పీహెచ్సీ సింగుపురం), తూలుగు (పీహెచ్సీ గార), తిమడాం (పీహెచ్సీ సైరిగాం) తదితర ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగం భూములకు 29న సాగు వేలం జలుమూరు: శ్రీముఖలింగం భూములకు 29న సాగు వేలం వేయనున్నామని ఈఓ పి.ప్రభాకరరావు సోమవారం తెలిపారు. మొత్తం ఆరు బిట్లుగా విడదీసి వేలంపాట నిర్వహించనున్న ట్లు తెలిపారు. వేలం పాటలో దక్కించుకున్న వారు ఒక ఏడాది మొత్తం ముందుగా చెల్లించాలన్నారు. సాగు కాలం మూడేళ్లకు హక్కులు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రభుత్వాల వైఖరి దుర్మార్గం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): చత్తీస్గఢ్ దండకారణ్యంలో 27 మంది మావోయిస్టులను కాల్చి చంపడం, బంధువులకు మృతదేహాలను అప్పగించకపోవడం దారుణమని సిపిఐఎంఎల్ మాజీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, ఎస్కే గౌష్, పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, న్యాయవాది కూకలకుంట్ల రవి, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో ఏపీ ఎన్జీఓ హోమ్లో వారు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఆర్టికల్ 14,21,19 లను ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయన్నారు. మావోయిస్టు లేదా దేశపౌరులు ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షించాలని, ఒక మనిషిని వేరే మనిషి చంపే హక్కు భారత చట్టాల్లో ఎక్కడా లేదన్నారు. మావోయిస్టులను ఆదివాసీలను చంపడానికి ప్రత్యేక సాయుధ బలగాలను ఆపరేషన్ కగార్ పేరుతో ఏర్పాటు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమని పేర్కొన్నారు. అంతర్గత పోరాటంగా ఉన్న కగార్ ఆపరేషన్లో చనిపోయిన బంధువులకు అప్పగించకపోవడం న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధమన్నారు. ఈ సమావేశంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ నాయకులు రేపల్లె రాజా నందం తదితరులు పాల్గొన్నారు. -
ఆ తీగే ప్రాణాలు తీసింది..
ఆదివారం రాత్రి ఆ ఊరికి అమ్మవారిని తీసుకువచ్చారు. మంగళవారం గ్రామదేవత ఉత్సవం ముగించనున్నారు. జనమంతా ఆ వేడుకల్లోనే తలమునకలై ఉన్నారు. చివరి అంకానికి వచ్చిన సంబరాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ పండుగల వేళ ఊరంతా ఉలిక్కిపడేలా ఓ విద్యుత్ తీగ యమపాశం విసిరింది. మేనమామను మేనల్లుడిని కలిపి తీసుకెళ్లిపోయి ఆ కుటుంబానికి ఆధారం లేకుండా చేసింది. ఉత్సవం చూసేందుకు వచ్చిన అమ్మాయి ఆయువును ఆపేసి ఆ ఇంట చీకటి నింపింది. ఈ దుర్ఘటనతో సామంతపుట్టుగ పుట్టెడు దుఖంలో మునిగిపోయింది. మృతదేహాల వద్ద కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులుగోప్యంగా ఉంచేందుకు..సోమవారం ఉదయం 8గంటలకు ఈ సంఘటన జరిగినప్పటికీ బయటకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచేందుకు గ్రామ స్తులు ప్రయత్నించారు. విద్యుత్ శాఖ అధికారులను రానీయకుండా, మీడియా వాళ్లను కూడా ఏమార్చి ఏమీ జరగనట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. పోలీసులు, మీడియా వారు గ్రామానికి చేరుకోవడంతో విషయం బయట ప్రపంచానికి తెలిసింది. సోంపేట సీఐ బి.మంగరాజు, కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటలకు సోంపేట విద్యుత్శాఖ ఏడీ ఎం.రవికుమార్, కంచిలి ఏఈ ఎన్.గురవయ్య, మిగతా సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొన్నారు. తర్వాత ఎస్ఈ ఎన్.కృష్ణమూర్తి చేరుకొని సమీక్షించారు. అదేవిధంగా పలాస ఆర్డీఓ వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్దార్ ఎన్. రమేష్కుమార్, ఆర్ఐ కృష్ణచంద్ర రౌళో, వీఆర్ఓ దుద్ది మురళి కూడా వచ్చి పరిశీలించారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు వచ్చి ఆరా తీశారు. ● విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి ● సామంతపుట్టుగలో ఘటన ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ● గ్రామ ఉత్సవాలకు వాడిన విద్యుత్ అలంకరణ తీగే ప్రమాదానికి కారణం కంచిలి: సామంతపుట్టుగ(చిల్లపుట్టుగ)లో సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో విద్యుత్ షాక్కు గురై ముగ్గురు చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. గ్రామదేవత ఉత్సవాల చివరి అంకంలో జరిగిన ఈ విషాద సంఘటనతో గ్రామమంతా శోకమయమైంది. వివరాల్లోకి వెళితే.. సామంతపుట్టుగ గ్రామంలో గ్రామదేవత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు జరిగింది. గ్రామంలోకి అమ్మవారు వచ్చి వెళ్లిన తర్వాత ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణను సోమవారం ఉదయం తొలగించారు. కానీ ఒక జీఏ వైరును మాత్రం విడిచిపెట్టేయగా.. అది తెగి కింద పడింది. ఆ స్థలంలో ఆడుకుంటున్న చిన్నారులు ఆ తీగను తాకడంతో విద్యుత్ షాక్కు గురయ్యారు. ఈ ఘటనలో మొదట బాడపల్లి నందిని (12) అనే బాలిక తెగిపడిన జీఏ వైరు చుట్టు కుని షాక్కు గురి కాగా.. ఆ బాలికను కాపాడబోయి చిల్ల ఈశ్వర్(28) విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకనే ఉన్న నాలుగేళ్ల బాలుడు నొళియా కృష్ణకు కూడా షాక్ తగిలింది. వీరు ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కూడా విద్యుత్ షాక్కు గురై తీవ్రగాయాలపాలయ్యారు. మరికొందరు చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఆ కుటుంబానికి దిక్కేదీ.? ఘటనలో మృతి చెందిన చిల్ల ఈశ్వర్ కుటుంబానికి తనే ఆధారం. ఈశ్వర్ డిగ్రీ వరకు చదువుకొని, గ్రూప్స్ ప్రిపరేషన్ కోసం శ్రీకాకుళం వెళ్లి అక్కడ ఒక హోటల్లో చెఫ్గా పనిచేస్తున్నాడు. ఈశ్వర్కు కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన యువతితో రెండేళ్ల కిందటే వివాహం నిశ్చయమైంది. ఏడాది కిందట ఈశ్వర్ చెల్లెలి భర్త మృతి చెందడంతో వివాహం వాయిదా పడింది. ఈశ్వర్ తండ్రి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. చెల్లెలికి కూడా భర్త లేకపోవడంతో రెండు కుటుంబాలను ఈశ్వర్ ఒక్కడే చూ స్తున్నాడు. 42 ఏళ్ల తర్వాత గ్రామదేవత ఉత్సవాలు జరుగుతుండడంతో ఆదివారం మధ్యాహ్నమే అతను స్వగ్రామానికి వచ్చాడు. ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొన్నాడు. కానీ విధి వక్రీకరించి సోమ వారం ఉదయం ప్రమాదానికి గురై విగతజీవిగా మారాడు. మరో నెల రోజుల్లో ఈశ్వర్కు పెళ్లి ము హూర్తం ఖరారు చేయాలని అనుకుంటుండడంగా ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. మృతుల్లో ఒకడైన నాలుగేళ్ల బాలు డు నొళియా కృష్ణ ఈశ్వర్ చెల్లెలి లక్ష్మి కుమారుడు. వీరిది బంజిరి నారాయణపురం గ్రామం. ఉత్సవా లు చూసేందుకు రాగా.. ఈ ప్రమాదం జరిగింది. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాడపల్లి నందిని స్వగ్రామం పురుషోత్తపురం గ్రామం. ఈ బాలిక కంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి పూర్తిచేసుకుంది. ఉత్సవాలు చూసేందుకు శుక్రవారం తన పిన్ని ఇంటికి వచ్చింది. ఇంతలో చావు ఎదురైంది. మృతురాలి తల్లిదండ్రులు రాజేశ్వరి దీనబంధు బాలిక మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదించారు. గ్రామదేవత ఉత్సవాల సందర్భంగా తమంతట తామే విద్యుత్ అలంకరణ చేసుకోడానికి స్థానిక కమిటీ యువత బరంపురం వెళ్లి విద్యుత్ అలంకరణ చేసే సీరియల్ సెట్లు గుత్తులు తీసుకొచ్చారు. వారే సొంతంగా అమర్చుకున్నారు. సంబరాలు మంగళవారంతో ముగియనుండటంతో విద్యుత్ అలంకరణను సోమవారం ఉదయం తొలగించేశారు. కానీ ఈ లైటింగ్ కోసం కరెంటు సరఫరా చేసిన లైన్ను మాత్రం తొలగించలేదు. అదే ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైంది. విద్యుత్ ఉపకరణాలకు ఏర్పాటు చేసిన జీఏ వైరు తీగ కింద పడిపోవడం, అక్కడే వీధిలో ఆటలాడుకుంటున్న చిన్నారులు గమనించకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటనలో తీవ్రంగా గాయాలపాలైన పొడియా మనోజ్ను సోంపేట ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం బరంపురం మెడికల్కు తరలించారు. గాయపడిన చిల్ల తరుణ్ అనే మరో వ్యక్తి నాలుగు రోజుల కిందటే బయటి దేశం నుంచి గ్రామానికి వచ్చాడు. ఇతను సోంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
తీవ్ర నిరాశ
నంబాల కుటుంబ సభ్యులకుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు కుటుంబ సభ్యులకు తీవ్ర నిరాశే మిగిలింది. నంబాల మృతదేహం కోసం చత్తీస్గఢ్ వరకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయాసలు పడ్డారు. అక్కడి అధికారుల తీరుతో విసిగిపోయి నారాయణపూర్ వీధుల్లో ప్రజా సంఘాల నేతలతో కలిసి నిరసన ర్యాలీలు కూడా చేశారు. ఏకంగా నారాయణపూర్ ఎస్పీ కార్యాలయం ఎదురుగా నిల్చొని ఆందోళన చేశారు. కానీ ఖాకీలు కారుణ్యం చూపలేదు. మృతదేహం ఇస్తే స్వగ్రామం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించుకుంటామన్న విజ్ఞప్తిని పెడ చెవిన పెట్టారు. నంబాల మృతదేహానికి పోలీసులు చత్తీస్గఢ్లోనే అంత్యక్రియలు పూర్తి చేసేశారు. మృతదేహాన్ని అప్పగిస్తే ఊరేగింపులు నిర్వహిస్తారు, స్వగ్రామాల్లో ర్యాలీలు చేస్తారు, అంత్యక్రియలు చేసిన చోట స్తూపాలు నిర్మిస్తారు, ఏదైనా సందర్భం వస్తే అక్కడ నివాళుల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు, ఇలాంటి చర్యలు మళ్లీ కొందరిని నక్సలిజం వైపు ఆకర్షించే ప్రమాదం ఉందంటూ చత్తీస్గఢ్ పోలీసులు మృతదేహం ఇవ్వడానికి ముందు నుంచే నిరాకరిస్తూ వచ్చారని కేశవరావు సోదరుడు రాంప్రసాద్ వెల్లడించారు. -
నంబాల ఫ్యామిలీకి మంత్రి అచ్చెన్న బెదిరింపులు
శ్రీకాకుళం, సాక్షి: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడిపై మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు దిగారు. ఆయన తమను బెదిరించారని, తమ సోదరుడి మృతదేహాన్ని పోలీసులు అప్పగించకుండా అడ్డుపడుతున్నారని ఢిల్లీశ్వరరావు సాక్షి టీవీతో వాపోయారు. పోలీసులు ముందు నుంచే మమ్మల్ని బెదిరిస్తున్నారు. నంబాల మృతదేహం(Nambala Dead body) కోసం వెళ్ళిన మమ్మల్ని బలవంతంగా ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్ర బోర్డర్కు పంపించేశారు. మా సోదరుడు నంబాల రాజశేఖర్కు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ఫోన్ చేసి బెదిరించారు. ‘నా అనుమతి లేకుండా ఛత్తీస్గఢ్ ఎవరు వెళ్ళమన్నారు? వెంటనే వెనక్కి వచ్చేయండి. లేకపోతే మీరే సమస్యల్లో చిక్కుకుంటారు’ అని మా కుటుంబ సభ్యులను అచ్చెన్నాయుడు బెదిరించారు. .. దీంతో మా వాళ్లు భయపడ్డారు. అచ్చెన్నాయుడు నాకు ముందు నుంచే తెలుసు కానీ ఇలా మా సోదరుడి మృతదేహాం విషయంలో ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదు’’ అని నంబాల సోదరుడు ఢిల్లీశ్వరావు అన్నారు. హైకోర్టు కూడా మృతదేహాన్ని అప్పగించాలని ఆదేశించినా కూడా మంత్రి, పోలీసులు అడ్డుకుంటున్నారు. .. ఫ్యామిలీ ఫోటో చూపించండి, ఆధార్ కార్డ్ చూపించమంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు(Chhattisgarh) ఇబ్బంది పెట్టారు. మృతదేహాన్ని అప్పగించండి అని అడిగితే మమ్మల్ని మావోయిస్టు ఫ్యామిలీ గా చూస్తూ ఇవ్వట్లేదు. అలా చూస్తే మమ్మల్ని కూడా కాల్చి చంపేయండి. నా సోదరుడి మృతదేహం చూసేందుకు కుటుంబం మొత్తం ఎదురు చూస్తోంది. దయచేసి మా తమ్ముడి మృతదేహం మాకు అప్పగించండి అని కోరుతున్నారాయన.ఇదీ చదవండి: నంబాల మృతదేహం అప్పగింతలో జాప్యమెందుకు? -
Nambala: నంబాల మృతదేహాన్ని అప్పగించరా?
సాక్షి, ఛత్తీస్ఘడ్: మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబాల కేశవరావు(Nambala Keshava Rao) కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారా?. కావాలనే మృత దేహం అప్పగింతకు జాప్యం చేస్తున్నారా?. అసలు మృతదేహాన్ని అప్పగిస్తారా? లేదా?. ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ఆర్డర్తో వెళ్లినా కూడా పోలీసులు తాత్సారం చేస్తుండడంపై ఇప్పుడు విమర్శలు వినవస్తున్నాయి.ఛత్తీస్ఘడ్(Chhattisgarh)లోని నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో ఈనెల 21 న జరిగిన ఎన్ కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజు తో పాటు మరో 26 మంది మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే..ఆయన మృతదేహాన్ని(Nambala Dead Body) అప్పగించాలని ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశించింది. అయినా కూడా మృతదేహాల అప్పగింత విషయంలో ఛత్తీస్ఘడ్ పోలీసులు వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటిదాకా కేవలం ఆ రాష్ట్రానికి చెందిన మృతదేహాలను మాత్రమే కుటుంబ సభ్యులకు అప్పగించడం గమనార్హం.మరోవైపు.. కేశవరావు కుటుంబ సభ్యులను పోలీసులు నానా ఇబ్బందులు పెడుతున్నారు. తమ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని, కోర్టు ఆర్డర్ ఉన్నా అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగి ఆరు రోజులు కావడం.. మృత దేహం కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నందున సత్వరమే నంబాల మృతదేహాన్ని అప్పగించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఛత్తీస్ఘడ్ పోలీసులు(Chhattisgarh Police) ఇదే రీతిలో వ్యవహరిస్తే ఆందోళన చేపతామని హెచ్చరిస్తున్నారు.నంబాల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో.. మృతదేహాన్ని ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. నాలుగున్నర దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో కొనసాగిన నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజును కడసారి చూపు చూసేందుకు లేకుండా చేస్తారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
మాజీమంత్రి సీదిరిపై సీఐ బూతుపురాణం
వజ్రపుకొత్తూరు రూరల్/వజ్రపుకొత్తూరు: టీడీపీ కూటమి పాలనలో పోలీసుల ఓవరాక్షన్ రోజురోజుకీ శృతిమించుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకులపట్ల ఇష్టారాజ్యంగా ప్రవరి్తస్తున్నారు. తాజాగా.. మాజీమంత్రి సీదిరి అప్పలరాజుపై కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు దురుసుగా ప్రవర్తించి బూతుపురాణం అందుకున్నారు. మాజీమంత్రి అని కూడా చూడకుండా ఆయనపై వేళ్లు చూపిస్తూ ‘తమాషా దె...’ అంటూ నోటికొచ్చినట్లు దుర్భాషలాడారు. దీంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పోలీసుస్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలివీ.. వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజ్ ఇటీవల కురిసిన గాలివానకు పశువుల షెడ్ పాడైపోవడంతో మళ్లీ నిర్మించుకున్నాడు.అయితే, గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగత కక్షతో ఆయన భార్య లక్ష్మితో వాగ్వాదానికి దిగి దానిని కూల్చే ప్రయత్నం చేశారు. దీంతో.. బాధితులు ప్రతిఘటించగా వారిపై దాడిచేశారు. ఈ విషయంపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు స్పందించలేదు. అయితే, నిందితులు అంతకుముందే ఫిర్యాదు ఇవ్వడంతో బాధితులను పిలిచి రోజంతా స్టేషన్లో ఉంచారు. తమ గొర్రెలను అపహరించారని.. తాను వేసుకున్న షెడ్ను కూల్చడానికి యత్నించారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని బాధితుడు వాపోయాడు.విషయం తెలుసుకున్న మాజీమంత్రి సీదిరి అప్పలరాజు పోలీసుస్టేషన్కు వెళ్లి బాధితుల పక్షాన పోలీసులను నిలదీశారు. బాధితులిచ్చిన ఫిర్యాదును తీసుకుని రశీదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు మాజీమంత్రిపట్ల దురుసుగా ప్రవర్తించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాసేపటి తర్వాత బాధితుల నుంచి పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన పోలీసులు టీడీపీ కూటమి నాయకులకు వంత పాడడం సరికాదని, అధికారం శాశ్వతం కాదనే సంగతి గుర్తుంచుకోవాలని హెచ్చరించి బాధితులకు అండగా ఉంటామని స్పష్టంచేశారు. మరోవైపు.. సీఐ ప్రవర్తనపై స్థానిక మహిళలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా సేతుమాధవన్
రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ ఐటీ ఇండోర్ స్టేడి యంలో రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 160 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ నువ్వా..నేనా అనే విధంగా ఏడు రౌండ్లలో క్రీడాకారులు పోటీపడ్డారు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో శ్రీకాకుళంకు చెందిన ఫిడే మాస్టర్ వేలుమహంతి సేతుమాధవన్ ఆరున్నర పాయింట్లు సాధించి రాష్ట్ర స్థాయి చెస్ చాంపియన్గా నిలిచాడు. అలాగే విశాఖపట్నంకు చెందిన అభిరామ్ ఆరు పాయింట్లతో ద్వితీయ, విజయవాడకు చెందిన సీనియర్ క్రీడాకారుడు మల్లేశ్వరరావు తృతీయ స్థానంలో నిలిచారు. ఎస్.కోటకు చెందిన వినీల్కార్తీక్ నాలుగో స్థానం, విశాఖపట్నంకు చెంది న జయనాగరాజు ఐదవ స్థానంలో నిలిచారు. ఓపెన్లో పది మందికి, అండర్–17 విభాగంలో పది మందికి, వివిధ కేటగిరీల్లో మొత్తం 30 మంది క్రీడాకారులకు రూ.1.30 లక్షలు నగదు బహుమతి తో పాటు మెమోంటోలు, ప్రశంసా పత్రాలు జీఎంఆర్ ఐటీ తరఫున అందించారు. ఈ టోర్నమెంట్కు చీఫ్ ఆర్బిటార్గా కేవీ జ్వాలాముఖి వ్యవహరించగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి.అరుణ్కుమార్ వ్యవహ రించారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముఖ్య అతిథిగా హాజరైన జీఎంఆర్ ఐటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్ అన్ని ఏర్పాట్లు చేశారు. -
పీజీ సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి
ఎచ్చెర్ల క్యాంపస్: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ పీజీసెట్ – 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు ఆదివారంతో ముగింది. ఏపీ పీజీసెట్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 31 నుంచి దరఖాస్తులు స్వీకరణ మొదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 30 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం కల్పించారు. జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. సాహితీమూర్తి పులఖండం గార: గొప్ప సాహితీమూర్తి డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు అని గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు అన్నారు. ఆదివారం గార మండలం వాడాడ జంక్షన్లోని కల్యాణ మండపంలో విద్వాన్ బంకుపల్లి రమేష్శర్మ అధ్యక్షతన జరిగిన పులఖండం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఐఎస్వో, నాక్ వంటి సంస్థల గుర్తింపు వెనుక ఆయన కృషి ఉందన్నారు. అనంతరం కరస్పాండెంట్ రంగారావు, వైస్ ప్రిన్సిపాల్ కె.వి.సత్యనారాయణ, డాక్టర్ ఎం.కృష్ణ, విశ్రాంత డీఎస్పీ భార్గవరావునాయుడు, డాక్టర్ డి.విష్ణుమూర్తి, మేజర్ వంగ మహేష్, ఉపనిషన్మందిరం కార్యదర్శి నిష్టల నరసింహమూర్తి మాట్లాడుతూ పులఖండంతో గల అనుబంధాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గురజాడ సంస్థల ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు శ్రీకాకుళం క్రైమ్ : నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ఉన్న పాత నేరస్థులు, సస్పెక్ట్ షీటర్లకు వివిధ పోలీస్స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతుండటంతో పాటు పేకాట శిబిరాలు ఎక్కడ పడితే అక్కడ నడుస్తుండటంతో వారం వ్యవధిలో రెండోసారి కౌన్సిలింగ్ ఇచ్చారు.ఎస్పీ ఆదేశాలతో టాస్క్ఫోర్స్ దాడులు సైతం ముమ్మరం అయ్యాయి. జిల్లాకేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ పైడపునాయుడు షీటర్లకు అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్నారు. సేవలు మరింత విస్తృతం చేయాలి శ్రీకాకుళం కల్చరల్: సత్యసాయి సంస్థల సేవలు మరింత విస్తృతం కావాలని రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రుని లక్ష్మణరావు కోరారు. జిల్లా కేంద్రంలోని బ్యాంకర్స్ కాలనీలో సత్యసాయి మందిరంలో జిల్లా స్థాయి సత్యసాయి సేవా సంస్థల పదాధికారులు, కన్వీనర్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. నారాయణసేవ, గ్రామ సేవా మహాయజ్ఞం, కోటి మొక్కల పెంపకం, రిమ్స్, టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రులలో నిర్వహిస్తున్న నిత్య నారాయణ సేవలపై సమీక్షించారు. కార్యక్రమంలో సమితి, భజన మండలి కన్వీనర్లు, సమన్వయకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడిశ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కిల్లిపాలెంలో ఆదివారం ఓ గృహంలో పేకాడుతున్న ఆరుగురిని శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.79,700 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు నాలుగు బైక్లు, మూడు సెల్ఫోన్లు కుడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలో ఇటీవల కాలంలో పేకాట, బెట్టింగ్ వంటి వ్యవహారాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రూరల్ పోలీసులు మాత్రం వీటిపై నోరు మెదపడం లేదు. టాస్క్ఫోర్స్ పోలీసులు ముందస్తుగా సమాచారం సేకరించడంతో పాటు నేరస్తుల కదలికలు పసిగట్టడం, పేకాడుతున్న వారిని పట్టుకోవడంలో దూకుడుగా ఉంటున్నారు. రూరల్ పోలీసులు మాత్రం ఇటువంటి కేసుల్లో చాలా గోప్యత పాటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, ఆదివారం పేకాటరాయుళ్లు పట్టుబడిన విషయమై రూరల్ ఎస్ఐ వద్ద ప్రస్తావించగా అటువంటి కేసులు ఏమీ నమోదు కాలేదని, టాస్క్ఫోర్స్ సిబ్బంది వెళ్లారని, వారు పట్టుకొని వస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. -
ఆదిత్యాలయం.. భక్తజన సంద్రం
శ్రీకాకుళం అర్బన్: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో వైశాఖ మాసం సందడి కొనసాగుతోంది. మూడో ఆదివారం సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు, మొక్కుల్లో భాగంగా తలనీలాలు, వైశాఖ మాస ప్రత్యేక సంప్రదాయ పూజల్లో భాగంగా గ్రామీణ మహిళల ప్రసాదాల నివేదన తదితర ప్రత్యేక పూజలు విశిష్టతతో అరసవల్లి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ భారీగా భక్తులు తరలిరావడంతో ఈ సౌకర్యాలు పెద్దగా సరిపడలేదనే విమర్శలు వినిపించాయి. భానుడి ప్రతాపం తీవ్రంగా ఉండడంతో కేశఖండనశాల, ఇంద్రపుష్కరిణి పరిసరాలలో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అంతరాలయంలో ప్రత్యేక అలంకరణతో స్వామివారిని సర్వదర్శనాలకు అనుమతించారు. ఒక్కరోజులోనే రూ.12,29,751 ఆదాయం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం ఒక్క రోజు ఆదాయం రూ.12,29,751 లభించింది. టికెట్ల రూపంలో రూ.8,84,100, పూజలు, విరాళాల రూపంలో రూ.81,496, ప్రసాదాల రూపంలో రూ.2,64,155 కలిపి మొత్తంగా రూ.12,29,751 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. -
ఆన్లైన్ వైద్యంతో అనర్థం
● కోటబొమ్మాళి మండలానికి చెందిన సుమారు 55 ఏళ్ల వ్యక్తి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జాయినై తనిఖీ చేయించుకుంటే హార్ట్లో బ్లాక్ ఉందని తేలింది. అతనికి స్టంట్ వేయాలని వైద్యులు నిర్ధారించారు. ఈ శస్త్రచికిత్స జరుపుతుండగానే అతను మృత్యువాతపడ్డాడు. అంతకుముందు అతను ఐదు రోజుల పాటు ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. గ్యాస్ వల్ల కావచ్చని ఆన్లైన్లో వెతికి అక్కడ సూచించిన మందులు వాడి తగ్గకపోవడంతో ఆస్పత్రిని ఆశ్రయించాడు. అప్పటికే చేయిదాటిపోయింది.● నరసన్నపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి జ్వరం, కళ్లు మంటలు, తలనొప్పితో బాధపడ్డాడు. ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడికి ఈ విషయం చెప్పగా అతను ఆన్లైన్లో వెతికి మందులను వాడాలని కొన్నింటిని సూచించాడు. వారం రోజులు వాడినా తగ్గకపోవడంతో వైద్యుల వద్దకు వెళ్లగా అతనికి మెదడులో సమస్య ఉన్నట్లు పరీక్షల అనంతరం నిర్ధారించి విశాఖపట్నం తీసుకెళ్లారు. శ్రీకాకుళం: జిల్లాలో చాలా మంది ఆన్లైన్ వైద్యం వైపు మొగ్గుచూపుతూ మరింతగా అనారోగ్యానికి గురవుతున్నారు. గతంలోనే ఈ జాఢ్యం ఉండగా ఏఐ లాంటి సైట్లు వచ్చిన తరువాత ఇది మరింత పెరిగిపోయింది. ఆన్లైన్ వైద్యాన్ని నమ్మి, వైద్యులు చెబుతున్న దాన్ని కూడా అనుమానించే పరిస్థితికి కొందరు యువత చేరుకుంటున్నారు. జిల్లాలో రెండు వేలు వరకు మెడికల్, హోల్సెల్, రిటైల్ షాపులు ఉన్నాయి. 10 వేల మంది వరకు ఎంబీబీఎస్, స్పెషాలిటీ, సూపర్ స్పషాలిటీ వైద్యులు ఉన్నారు. 10 పైగా పెద్ద ఆసుపత్రులు ప్రైవేటుగా, ప్రభుత్వ పరంగా వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇవి కాకుండా గ్రామస్థాయిలో 1000 మంది వరకు ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు ఉన్నారు. ఇది వరకు వీరిలో ఎవరినో ఒకరిని సంప్రదించి, వైద్యం చేయించుకునేవారు. ఇటీవల కాలంలో యువత ఈ విధానాన్ని విడిచిపెట్టి ఆన్లైన్ బాటపడుతున్నారు. తమకు, తమ బంధువులకు ఉన్న రోగాలను నిర్ధారించుకొని, ఆన్లైన్లో సూచించినట్లు మందులను వాడేస్తున్నారు. కొందరు లేని జబ్బులకు వైద్యం చేసుకోవడం, మరి కొందరు ఉన్న జబ్బును కూడా అది కాదనుకొని ఆన్లైన్లో సూచించిన మందులను వాడేయడం వల్ల రోగాన్ని ముదర పెట్టుకుని కష్టాలు పాలవుతున్నారు. ఇటువంటి వైద్యం అనార్థదాయకమని వైద్యులు చెబుతుండగా, దానిని కూడా పెడ చెవిన పెడుతున్నారు. వైద్యులు డబ్బు కోసమే అలా చేస్తున్నారని, వాదిస్తున్నారు. వాస్తవానికి, వైద్యులు రోగిని స్వయంగా పరిక్షించి, అవసరమైతే రక్త పరీక్షలు ఇతర తనిఖీలు చేసి రోగాన్ని నిర్ధారించిన తర్వాతే చికిత్సలు ప్రారంభిస్తారు. ఇవేవీ లేకుండా వైద్యం చేయించుకోవడం వల్ల తీవ్ర నష్టాలు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లక్షణాలను బట్టి నిర్ధారణ కష్టం రోగికి ఉన్న లక్షణాలను బట్టి వ్యాధిని నిర్ధారించలేం. ఒకే రకమైన లక్షణాలు అనేక రోగాల్లో ఉంటాయి. రోగిని పరీక్షించి మరికొన్ని తనిఖీలు చేసిన తర్వాతే వాధిని నిర్ధారించగలుగుతాం. ఆన్లైన్ చూసి సొంతంగా వైద్యం చేసుకోవడం సరైన పద్ధతి కాదు. – డాక్టర్ డి.పార్వతి, శ్రీకాకుళం ప్రమాదకరం ఆన్లైన్లో సూచించినట్లు వైద్యం చేసుకోవడం అత్యంత ప్రమాదకరం. జబ్బు తగ్గుతుందో లేదో అటుంచితే కాలాన్ని వృథా చేయడం వల్ల వ్యాధి ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. వైద్యులను నేరుగా సంప్రదించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం. – డాక్టర్ ఎల్.ప్రసన్నకుమార్, శ్రీకాకుళం నెట్లో చూసి సొంత వైద్యం చేసుకుంటున్న జిల్లావాసులు సొంత వైద్యంతో అనర్థాలను కొని తెచ్చుకుంటున్న వైనం -
ఫుట్బాల్ టోర్నీ విజేత శ్రీకాకుళం
తగరపువలస: విశాఖపట్నం జిల్లా మధురవాడలోని శాప్ గ్రౌండ్లో ఈ నెల 23న గ్రాస్ రూట్స్ డే సందర్భంగా నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్–2025లో శ్రీకాకుళం ఫుట్బాల్ క్లబ్ జట్టు విజేతగా నిలిచింది. అండర్ బాయ్స్ జట్టు రన్నరప్ సాధించింది. ఉత్తరాంధ్ర జోనల్ అండర్–14 బాయ్స్ అండ్ గర్ల్స్ టోర్నమెంట్లో మొత్తం 16 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు ఆదివారం ట్రోఫీలు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్డీవో జూన్ గాలియట్, లోసో సుష్మిత, రాకేష్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్స్ ఎగ్జిక్యూటివ్ శరత్, వీడీఎఫ్ కార్యదర్శి అక్కరమాని చినబాబు, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎస్జీ రామకృష్ణ, స్టార్ ఫెక్స్ సన్నిబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఐటీఐ దరఖాస్తుల స్వీకరణ
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలోని మూడు ప్రభుత్వ, 20 ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 24తో ముగిసింది. వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఉన్నతాధికారుల సూచనలు మేరకు కౌన్సెలింగ్ షెడ్యూల్ సిద్ధం చేస్తామని ప్రవేశాల కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్.సుధాకర్ ఆదివారం చెప్పారు. మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా పారదర్శకంగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. మత్స్యకారుడు మృతి పోలాకి: మండలంలోని రాజారాంపురం గ్రామానికి చెందిన మత్స్యకారుడు దౌలపల్లి గురుమూర్తి(52) వేటకు వెళ్లి మృతిచెందాడు. ఉప్పుగెడ్డ సంగమంలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గ్రామానికి ఆనుకుని ఉన్న వంశధార నదిలోకి ఆదివారం వేకువజామున వేటకు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎం.శ్రీనివాసరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సాధకుడికి స్వాగతం
అమ్మమ్మ ఊరిలోనూ సత్కారం వెంకటేష్కు గజమాలతో సన్మానంతన ముద్దుబిడ్డను అల్లాడపేట ఆత్మీయంగా స్వాగతించింది. జనమంతా తోడు రాగా సాధకుడికి జేజేలు పలికింది. దేశ అత్యున్నత సర్వీసుకు ఎంపికై న సందర్భంగా అల్లాడపేట వాసులంతా బాన్న వెంకటేష్కు ఆదివారం సాదరంగా ఆహ్వానం పలికి సగౌరవంగా సత్కరించారు. మొదటి ప్రయత్నంలో విజయం అంచులు వరకూ వెళ్లి, రెండో ప్రయత్నంలో ఐపీఎస్, మూడో ప్రయత్నంలో ఏకంగా జాతీయస్థాయిలో 15వ ర్యాంక్ను వెంకటేష్ సాధించా రు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ తీసుకుంటూనే మరో వైపు ఐఏఎస్ సాధనే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా చదివారు. ఆయన సాధించిన అపురూప విజయంపై అల్లాడపేట పులకరించి పోయింది. ఆయన ఆది వారం గ్రామానికి రావడంతో ఊరూవాడా ఒక్కటై మంగళవాయిద్యాల నడుమ పూల వర్షం కురిపించారు. పూర్ణకుంభంతో వెంకటేష్కు ఊరిలోకి స్వాగ తం పలికారు. ఊరివారందరినీ వెంకటేష్ వరసలు పెట్టి పిలుస్తూ ఆత్మీయంగా పలకరించారు. రామాలయం, అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నా విజయం మా తల్లిదండ్రులకు అంకితం అల్లాడపేట గ్రామస్తులు చేసిన పౌర సన్మానంలో వెంకటేశ్ మాట్లాడుతూ అత్యున్నత సర్వీసైన ఐఏఎస్కు ఎంపికయ్యానని, దీని వెనుక తన తల్లిదండ్రులు రోహిణి, చంద్రరావుల కష్టం ఎంతో దాగి ఉందని వినమ్రంగా చెప్పారు. తాను ఎంత పెద్దస్థాయికి ఎదిగినా ఎల్లకాలం వారికి రుణపడి ఉంటా నని చెప్పారు. ఈ విజయం తల్లిదండ్రులకు అంకి తం అని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కల్యా ణం చిన్నమ్మడు, జెడ్పీటీసీ మెండ విజయ శాంతి. గ్రామ పెద్దలు మెండ రాంబాబు,కల్యాణం శ్రీనువాసరావు, రిటైర్డ్ జడ్జి ఎం.రామకృష్ణ, వెలమ సంక్షేమ ప్రతినిధులు డాక్టర్ చక్క నారాయణరావు, ధర్మాన రఘునాథరావు, దుంగ సుధాకర్ బట్నా, కృష్ణ మూర్తి, ముద్దా అప్పలనాయుడు, వెలమల సత్యనారాయణ, ముద్దాడ వెంకట అప్పల నాయుడు, నక్క లక్ష్మణరావు, వెలమల మురళీ, ముద్దాడ జోగారావు తదితరులు పాల్గొన్నారు. ఇష్టంతో చదివితే ఏదైనా సాధ్యమే గ్రామానికి వచ్చిన అనంతరం వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. గ్రామీణ యువత సివిల్స్ సాధించాలంటే ముందుగా తల్లిదండ్రులకు భారం కాకుండా ఉపాధి వెతుక్కోవాలని మార్గనిర్దేశం చేశా రు. తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని, జాతీయ స్థాయిలో ఆడేందుకు కూడా ప్రయత్నించానని తెలిపారు. కానీ క్రికెట్ ఆడి డబ్బులు సంపాదించడం కంటే సివిల్స్ సాధించి పేదలకు సేవ చేయడం మంచిదని నమ్మి ఈ మార్గం ఎంచుకున్నానని వివరించారు. మన జిల్లా వ్యవసాయాధారిత జిల్లా అని, మన వెనుకబాటు రూపుమాపాలంటే చదువు ఒక్కటే మార్గమని సూచించారు. ఇష్టంతో ప్రణాళికాబద్ధంగా చదివితే సాదైనా సాధ్యమేనని అన్నారు. –జలుమూరు సివిల్స్ విజేత బాన్న వెంకటేశ్ను ఆత్మీయంగా స్వాగతించిన అల్లాడపేట ‘అల్లాడ ముద్దుబిడ్డ’ అంటూ ఘనంగా సత్కారం నరసన్నపేట: సివిల్స్ ర్యాంకర్ బాన్న వెంకటేష్ను తన అమ్మమ్మ ఊరు బసివలసలో సత్కరించారు. గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆరంగి శ్రీను, వెంకటేష్ మేనమామలు ఢిల్లీశ్వరరావు, రుద్రడులు, అమ్మమ్మ నర్సమ్మ , పాగోటి గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
బొడ్డపాడులో అమరవీరుల స్మారక సభ రేపు
పలాస: పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరం వద్ద మంగళవారం ఉద యం 10గంటలకు జిల్లా అమరవీరుల స్మారక సభ నిర్వహిస్తున్నట్టు అమరవీరుల స్మారక సభ నిర్వాహక కమిటీ కన్వీనరు జోగి కోదండరావు ఓ ప్రకటనలో తెలిపారు. 1969 మే 27న అప్పటి జిల్లా నాయకులు పంచాది కృష్ణమూర్తితో పాటు ఆరుగురు విద్యార్థి యువజన నాయకులు పోలీసు బూటకపు ఎన్కౌంటర్లో కంచిలి మండలం జలంత్రకోటలో మృతి చెందారన్నారు. 55 ఏళ్ల తర్వాత ఇదే జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుకూడా ఇదే నెల లో పోలీసుల బూటకపు ఎన్కౌంటర్లో మృతి చెందారని తెలిపారు. అమరవీరులకు నివాళులర్పించడం ఈ ప్రాంత ప్రజల కనీస ధర్మమని, అందుకే ఈ స్మారక సభ నిర్వహిస్తున్నామని, సభను విజయ వంతం చేయాలని కోదండరావు కోరారు. మృతదేహాలు అప్పగించకపోవడం అన్యాయం కాశీబుగ్గ: చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా ఏపీకి చెందిన మరో ఇద్దరి మృతదేహాల్ని వారి బంధువులకు ఆదివారం సైతం అప్పగించకపోవడం అన్యాయమని సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ అధికార ప్రతినిధి పి.ప్రసాద్, జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఆదివారం ఓ ప్రకటన విడుద ల చేశారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు కాపీ తో మృతదేహాల కోసం శనివారం కేశవరావు సోదరుడు నారాయణపూర్ వెళ్లారని, ఆదివా రం రాత్రి 6 గంటల వరకు నిరీక్షించినా ఫలితం లేదన్నారు. ఏపీ పోలీసు అధికారుల ఒత్తిళ్ల కా రణంగానే మృతదేహాలు ఇవ్వడం లేదనే విషయం అర్థమవుతోందన్నారు. ఈ వైఖరిని ఖండిస్తున్నామని వారు తెలిపారు. వెంటనే ఏపీ హైకోర్టు స్పందించి మృతదేహల్ని వారి బంధువులకు అప్పగించడానికి చొరవ తీసుకోవాలని కోరారు. బదిలీపై టీచర్ల నిరసన శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ బదిలీల్లో సీలింగ్ కోత వల్ల తమకు తీవ్రమైన నష్టం జరుగుతోందని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ పనిచేసిన గరిష్ట కాలానికి మొత్తం స్టేషన్ పాయింట్లను ఎలాంటి సీలింగ్ లేకుండా ఇప్పించాలని కోరారు. ఇదే విషయమై డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే అంతా జరుగుతుందని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మేలు జరిగేలా చూస్తామని డీఈఓ హామీ ఇచ్చినట్టు టీచర్లు తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీ దారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి సమాచారం తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీగ లాగారు.. డొంక కదిలింది శ్రీకాకుళం క్రైమ్ : బెట్టింగ్ మాఫియా తీగ పోలీసుల చేతికి చిక్కడమే కాదు.. డొంక కూడా కదిలింది. ఇప్పటికే టాస్క్ఫోర్స్ పోలీసుల సాయంతో శ్రీకాకుళం రూరల్, ఎచ్చెర్ల, ఒకటో పట్టణ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వీరితో నగదు లావాదేవీలు, ఫోన్ సంభాషణలు, సంక్షిప్త సందేశాలు చేసిన మరో ముగ్గురితో పాటు ప్రధాన బుకీగా ఉన్న విశాఖపట్నానికి చెందిన డి.శ్రీనివాసరావు (శ్రీను) ఆచూకీ పోలీసులకు చిక్కింది. బెట్టింగ్ ద్వారా జరిగిన నగదు లావాదేవీలన్నీ శ్రీను భార్య ద్వారానే జరిగిందని కనిపెట్టడమే కాకుండా ఆదివారం ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులకు విచారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి శ్రీను ఒడిశాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. -
ఎందుకంత ఆదరాబాదరా..?
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియను ఆదరాబాదరాగా చేపడుతుండటంతో టీచర్లకు పా ట్లు తప్పడంలేదు. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే ప్రక్రియ ఆఖరిదశకు చేరుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్లకు కౌన్సెలింగ్ తీరుపై స్పష్టత రాకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీలింగ్లో నాడు మేలు–నేడు కీడు.. చాలా మంది టీచర్లు ప్రస్తుతమున్న పాఠశాలలో అనేక ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ గరిష్టంగా 8 ఏళ్లకు మాత్రమే ప్రభుత్వం పాయింట్లు కేటాయిస్తుంది. మిగిలిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ అనేక ఏళ్లుగా మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు కూటమి సర్కారు తీరని అన్యాయం చేస్తోంది. వీరంతా సుమారు ఆరేడు పాయింట్లు కోల్పోతున్నారు. 2023లో ఇలాంటి సమస్య తలెత్తినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయంతో సీలింగ్ విధానాన్ని ప్రభు త్వం ఎత్తి వేసింది. దీంతో నాడు ఎంతోమంది టీచర్లకు మేలు జరిగింది. నేడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తయారైంది. బదిలీ దరఖాస్తు గడువు పొడిగించాలని టీచర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వర్ సరిగా పనిచేయడం లేదని, అనేక సాంకేతిక సమస్యలతో ఆన్లైన్లో డాక్యుమెంట్లు అప్లోడింగ్ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. 2014 డీఎస్సీ అభ్యర్థులకు పాయింట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్జీటీల కౌన్సెలింగ్ తీరుపై సందేహాలు.. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ మొదలైనప్పటికీ సెకండరీ గ్రేడ్ టీచర్లకు (ఎస్జీటీ) కౌన్సెలింగ్ ఎలా నిర్వహించాలన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరించినప్పటికీ బదిలీల కౌన్సెలింగ్ మాత్రం ఆఫ్లైన్ ద్వారానే చేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎస్జీటీలు అనేక అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఎస్జీటీలు జూన్ 7 నుంచి 10వ తేదీ లోపు ఆప్షన్ ఇచ్చుకుంటే జూన్ 11వ తేదీన బది లీ ఉత్తర్వులు ఆన్లైన్ ద్వారానే వెలువడతా యని మార్గదర్శకాల్లో ఉండటం గమనార్హం. ఎంటీఎస్ టీచర్లకు తీవ్ర అన్యాయం.. తాజా సాధారణ ఉపాధ్యాయ బదిలీల్లో 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీ మినిమం టైమ్ స్కేల్ టీచర్లు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. వారు పనిచేస్తున్న పోస్టులను ఖాళీల జాబితాలోకి తీసుకురావడంతో వారి పోస్టులు గల్లంతయ్యాయి. అలాగే దంపతులిద్దరూ ఉద్యోగులైతే బదిలీల్లో ఎవరో ఒకరికి స్పౌజ్ పాయింట్లు ఇస్తారు. అయితే 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీలో అన్యాయానికి గురైన టీచర్లకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో మినిమం టైమ్ స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిన వారికి ఉద్యోగాలు కల్పించారు. వీరిలో 70 నుంచి 80 శాతం మంది పదవీ విరమణ దశకు చేరుకున్నారు. అయితే వీరి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి కచ్చితంగా బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లను ఇప్పటికీ తమ వ్యతిరేకులుగానే చూస్తోంది. కేజీబీవీల్లోని టీచర్లకు స్పౌజ్ పాయింట్లు కేటాయిస్తున్నప్పటికీ, ఎంటీఎస్ టీచర్లకు మాత్రం మొండిచేయి చూపుతుండటాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. సీనియారిటీ పాయింట్లను సరి చేయాలి బదిలీల్లో అన్ని కేటగిరీ టీచర్లకు మాన్యువల్గానే కౌన్సెలింగ్ చేపట్టాలి. 8 ఏళ్లు పూర్తి చేసుకున్నవారికి సీనియారిటీ పాయింట్లను కేటాయించాలి. 117 జీఓ ద్వారా పదోన్నతిపై వెళ్లిన టీచర్లకు న్యాయం చేయాలి. – బమ్మిడి శ్రీరామ్మూర్తి, యూటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలాంటి అపోహలు అవసరం లేదు జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు అత్యంత పారదర్శకంగా నిర్వహించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఖాళీల జాబితాలను సిద్ధం చేశాం. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేస్తున్నాం. ఎవరికీ ఎలాంటి అనుమానాలు, అపోహాలు అవసరం లేదు. నిర్దేశించిన గడువులోపు టీచర్లు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, డీఈఓ శ్రీకాకుళం ఆదరాబాదరాగా బదిలీలు సరికాదు.. అంతా గందరగోళంగా ఉంది. ఆగమేఘాల మీద చేస్తున్నారు. ఉపాధ్యాయులకు ఎన్నో సందేహాలు, సమస్యలు ఉన్నాయి. బదిలీలకు సంబంధించి సాఫ్ట్వేర్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. రీ–అపోర్షన్ ప్రక్రియలో ఎవరు మిగులు టీచర్లుగా ఉన్నారో తెలియడంలేదు. ఆదరాబాదరాగా బదిలీలు చేపడుతుండటం సరికాదు.– మజ్జి మదన్మోహన్, ఏపీటీఎఫ్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ● దరఖాస్తు మొదలు.. అన్నింటా టీచర్లకు తప్పని పాట్లు ఎంటీఎస్ టీచర్లకు తీవ్ర అన్యాయం -
నీ కీర్తి.. మాకు స్ఫూర్తి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సంతబొమ్మాలి: సిక్కోలు సంబరపడింది. జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్గోపాలనాయుడు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా దేశ రాజధానిలో ‘కీర్తి చక్ర’ అవార్డును అందుకున్నారు. ఈ క్షణాలు చూసి జిల్లా యావత్తు మురిసిపోయింది. ఈయన స్వగ్రామం సంత»ొమ్మాళి మండలంలోని నగిరిపెంట గ్రామం. 2023 అక్టోబర్ 26న జరిగిన ఓ ఆపరేషన్లో మేజర్ రామ్ కీలకంగా వ్యవహరించారు. ఆ పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించారు. రామ్గోపాల నాయుడు తల్లిదండ్రులు నగిరి పెంటకు చెందిన రైతు మళ్ల అప్పలనాయుడు, హేమమాలిని. కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన రామ్ 2012లో యూపీఎస్సీ నిర్వహించిన స్టాఫ్ సెలెక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఎగ్జామ్ రాసి పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడ మూడేళ్లు అభ్యసించి, 2015–16లో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో క్యాడెట్గా చేరారు. అక్కడ శిక్షణ తీసుకున్న 900మందిలో గోల్డ్మెడలిస్ట్గా నిలిచి, ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా బాధ్యతలు స్వీకరించా రు. లెఫ్టినెంట్గా పనిచేసిన రెండేళ్లలో(2018)నే కెప్టెన్గా పదోన్నతి సాధించారు. అక్కడికి నాలుగేళ్లలో (2022)లో మేజర్గా ప్రమోషన్ లభించింది. ఆ రోజు ఏం జరిగిందంటే..? 2023 అక్టోబర్ 26 ఉదయం 10.10గంటలకు ఐదుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారని ఓ జవాన్ ద్వారా తెలుసుకున్నారు. 10.25 గంటలకు రంగంలోకి దిగిన రామ్గోపాలనాయుడు తోటి జవాన్లకు మార్గనిర్దేశం చేసి, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. తన దళాలకు ప్రమాదాన్ని గ్రహించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరొక ఉగ్రవాదిని గాయపరిచినప్పటికీ ఆ ఉగ్రవాది భారీ కాల్పులు జరిపాడు. ఆ భీకర కాల్పుల మధ్య జవాన్లతో కలిసి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది ఒక గుహలో దాగి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆర్మీ బృందంపై గ్రనేడ్ కూడా విసిరాడు. దాని నుంచి తప్పించుకుని భయçపడకుండా ఆ ఉగ్రవాదిని పట్టుకుని హతమార్చారు. తన పోరాటంలో భాగంగా జవాన్లను కాపాడుకోవడం కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించారు. దేశంలోనే గుర్తింపు వచ్చింది ఆర్మీ మేజర్ రామ్గోపాల్ నాయుడు వల్ల దేశంలోనే మా గ్రామానికి గుర్తింపు వచ్చింది. ఉగ్రవాదులను అంతం చేయడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోవడం మా అందరికీ గర్వంగా ఉంది. – ఎం.రాజు, నగిరిపెంట గ్రామం, సంతబొమ్మాళి మండలం సంతోషంగా ఉంది మా గ్రామానికి నిజమైన పండగ వచ్చింది. మేజర్ రామ్గోపాల్ నాయుడు వల్ల మా గ్రా మానికి ప్రత్యేకత వచ్చింది. కీర్తి చక్ర అవార్డు అందుకోవడం మాకు సంతోషంగా ఉంది. – ఎం.సోమేశ్వరరావు, నగిరిపెంట గ్రామంస్ఫూర్తిగా తీసుకోవాలి.. మేజర్ రామ్గోపాల్ నాయుడును యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. కీర్తి చక్ర అవార్డు అందుకున్న రామ్గోపాల్నాయుడు మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. – ఉల్లాస లోకేశ్వరరావు, రిటైర్ నాయక్ సుబేదార్ -
మా కేశవుడు అంత పెద్దోడా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మావోడు అంత పెద్దోడా.. పోలీసు కాల్పుల్లో మరణించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్షా స్పందించారంటే అంత ఎత్తుకు ఎదిగిన నాయకుడా? పత్రికల్లో, టీవీల్లో చూస్తుంటే మా కేశవరావు స్థాయి ఏంటో తెలుస్తోంది. ఇక్కడ చదువు కున్నంత కాలం అందరితో సరదాగా ఉండేవాడు. రోజూ వ్యవసాయం చేసేవాడు. బాగా చదువుకునేవాడు. కబడ్డీ బాగా ఆడేవాడు. అలాంటి వ్యక్తి వరంగల్లో ఇంజినీరింగ్లో చేరాక.. ఏం జరిగిందో తెలియదు గాని నక్సలిజంలోకి వెళ్లిపోయాడు. దేశంలో ఉద్యమ శిఖరంగా, మావోయిస్టుల సుప్రీం కమాండర్గా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారంటే ఆశ్చర్యంగా ఉంది. 45 ఏళ్ల కిందట ఊరి నుంచి వెళ్లిపోయాడు. ఇప్పుడెలా ఉంటాడో తెలియ దు. పేపర్లలో ఫొటోలు చూసి ఈయనే కేశవరావా అనుకోవాల్సి వస్తోంది. మృతదేహం సొంతూరికి వస్తే తప్ప కేశవరావును కళ్లారా చూసే అవకాశం లేదు. చివరి చూపు లేకపోతే ఆయన ఎలా ఉంటాడో నేటికీ తెలుసుకోలేని పరిస్థితిలో మేమంతా ఉన్నాం.ఇదీ మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు స్వగ్రామం జియ్యన్నపేటలో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఈ గ్రామంలో కేశవరావుకు సంబంధించి దాదాపు 15 కుటుంబాలు ఉన్నాయి. ఆయన చిన్నతనంలో కలిసి తిరిగిన వ్యక్తులు ఉన్నారు. వరసకు సోదరుడైన నంబాళ్ల సూరయ్య, మరికొంతమంది వ్యక్తులు కేశవరావు బాల్యం గురించి చెబుతున్నారు. కష్టపడి వ్యవసాయం చేయడమే కాకుండా బాగా చదివేవాడని, కబడ్డీ మంచిగా ఆడేవాడని, ఈ మూడు తప్ప కేశవరావుకు ఇంకేమి తెలియవని, అలాంటి వ్యక్తి వరంగల్ వెళ్లాక ఉద్యమం బాట పట్టారని చెబుతున్నారు. తర్వాత గ్రామస్తులు, కుటుంబీకులు ఇబ్బంది పడకూడదని ఊరికి రాకపోయి ఉంటాడని అంటున్నారు. వీరంతా కేశవరావు బాల్యం కోసం చెబుతున్నారే తప్ప ఇప్పుడెలా ఉంటారో గుర్తించలేమంటున్నారు. ఆయన ఆనవాళ్లు ఎలా ఉంటాయో చెప్పలేమంటున్నారు. మరికొందరైతే 45 ఏళ్ల కిందట ఊరు వదిలి వెళ్లిపోయిన కేశవరావును తర్వాత ఎప్పుడూ చూడలేదని, విశాఖపట్నంలో జైలులో ఉన్నప్పుడు తన తండ్రితో పాటు కొందరు కలిశారని, ఉద్యమంలోకి వెళ్లొద్దని చెప్పినట్టు కూడా ప్రచారం ఉందని అంటున్నారు. మా కేశవరావు ఇప్పుడెలా ఉంటాడో చూడాలని ఉందని, చనిపోయాకైనా చూసిన భాగ్యం కలుగుతుందని అంటున్నారు. గతంలో కూడా రెండు మూడు పర్యాయాలు కేశవరావు చనిపోయారని వార్తలు వచ్చాయని, కానీ నిజం కాదని తర్వాత తర్వాత తెలిసిందని అంటున్నారు. ఇప్పుడేకంగా ప్రధానమంత్రి, హోంమంత్రి కేశవరావు చనిపోయాడని స్టేట్మెంట్ ఇచ్చారని, అసలేం జరిగిందో తెలియకపోయినా మృతదేహాన్ని ఇస్తే కళ్లారా చూసి, అంత్యక్రియలు చేసుకుంటామని అంటున్నారు. కాకపోతే, తమ పేర్లు రాయవద్దని గతంలో ఇలాగే మీడియాతో మాట్లాడితే విచారణకని విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తిప్పారని, ఇప్పుడు తమకు ఇదంతా అవసరమా అని అంటున్నారు. ప్రస్తుతానికైతే మృతదేహం కోసం గ్రామం ఎదురు చూస్తోంది. కేశవరావు ఇంటికి ప్రజా సంఘాల తాకిడి జియ్యన్నపేటలో తాళం వేసి ఉన్న కేశవరావు ఇంటికి ప్రజా సంఘాల తాకిడి ఎక్కువైంది. జిల్లా నుంచే కాదు మిగతా ప్రాంతాల నుంచి పలు సంఘాల నాయకులు వచ్చి చూస్తున్నారు. చుట్టు పక్కల ఉన్న వారితో మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా ప్రతినిధుల వద్ద భుక్తి కోసం, భూమి కోసం చేసిన పోరాటంలో శిఖరంగా కేశవరావు నిలిచాడని, దోపిడీ రూపం మార్చుకుందే తప్ప పూర్తిగా పోలేదని, చర్చలతో సమస్యలు పరిష్కరించుకుందామని మావోయిస్టులు కోరుతున్నా పట్టించుకోకుండా ఆపరేషన్ కగార్ పేరుతో హతమారుస్తుందని కేంద్ర ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు. వెనక్కి వచ్చేసిన కుటుంబీకులు కేశవరావు మరణించారని, వెళ్లి చూడొచ్చని జిల్లా పోలీసులే సమాచారమిచ్చారు. మృతదేహాన్ని తీసుకోవచ్చని చెప్పి పంపించారు. జగదల్పూర్ వరకు వెళ్లాక ప్రొసీజర్ అవ్వలేదని, ప్రస్తుతానికి మృతదేహం ఇవ్వడం కుదరదని అక్కడ పోలీసులు చెప్పేశారు. ఇంతలో పోస్టుమార్టమైతే అక్కడే ఖననం చేసేయండని, ఇక్కడికి తీసుకురావద్దని పోలీసులు చెప్పారంటూ అక్కడికి వెళ్లిన కేశవరావు సోదరుడు రామ్ ప్రసాద్ బృందం చెబుతోంది. మృతదేహాన్ని తీసుకొస్తే దేశం నలుమూలల నుంచి విప్లవ సంఘం నాయకులు, అభిమానులు వస్తారని, వారి ప్రభావం ఈ ప్రాంతంపై పడుతుందని, ఉద్యమాల పుట్టిన గడ్డపై మళ్లీ కొంత పుంతలు తొక్కుతుందేమో అన్న అనుమానంతో అడ్డుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.పలాసలో ఉద్రిక్తత కాశీబుగ్గ: నంబాళ్ల కేశవరావుతో పాటు 27 మంది మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లో చంపారని శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ మున్సి పాలిటీలో శుక్రవారం ప్రజా సంఘాల నాయకులు పలువురు నిరసన తెలిపారు. కాశీబుగ్గలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఉదయం పది గంటలకు శాంతిపూర్వక నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాశీబుగ్గ సీఐలు సూర్యనారాయ ణ, తిరుపతిరావులు తమ సిబ్బంది వచ్చి వారిని అడ్డుకున్నారు. సుమారు 15 మందిని అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు తరలించారు. దీంతో కాశీబుగ్గ బస్టాండ్ పరిసర ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సీపీఐ ఎంఎల్ న్యూడెమెక్రసీ, లిబరేషన్ పార్టీ నాయకులు, పౌరహక్కుల సంఘం, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమ నాయకులు, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజాకళామండలి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, సీపీఎం పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. -
తప్పిన పెనుప్రమాదం
జి.సిగడాం: వాండ్రంగి రైల్వే వంతెనపై అతివేగంతో వస్తున్న కారు ట్రాక్టర్ను ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైపోయింది. స్థానిక ఎస్ఐ వై.మధుసూదనరావు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం రాగోలు సమీపంలో ఉన్న గూడెం గ్రామం నుంచి రాకేష్ అనే వ్యక్తి కారుతో రాజాం వైపు వెళ్తున్నాడు. రైల్వే వంతెనపై ముందు ఉన్న టాక్టర్ను ఢీ కొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమైపోయింది. రాకేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 108 సాయంతో ఆయనను పొందూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. విషం తాగి యువకుడు మృతి రణస్థలం: మండలంలోని కమ్మసిగడాం పంచాయతీలో గల లోచర్లపాలెం గ్రామానికి చెందిన సింక శ్యామలరావు(29) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా శ్యామలరావు గురువారం సాయంత్రం లోచర్లపాలెం గ్రామ సమీపంలో విషం తాగేశాడు. అపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో స్థానికులు కొండములగాం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందాడు. మృతుని అన్నయ్య వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఆటో బోల్తా: నలుగురికి గాయాలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలో పాత జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీకాకుళం వైపు వెళుతున్న ఆటో ప్రయాణికులను ఎక్కిస్తుండగా వెనుక నుంచి మరో ఆటో వచ్చి ఢీకొట్టింది. దీంతో ఢీ కొట్టిన ఆటో బోల్తా పడగా.. ముందు ఉన్న బండి ఓ వైపునకు ఒరిగిపోయింది. రెండు ఆటోల్లో పది మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వారిలో లక్ష్మమ్మ, భాగ్యవతి, అమ్మన్నమ్మ, శోభామణి గాయపడ్డారు. వీరిని 108 అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిది పొందూరు మండలం తాడివలస గ్రామం. -
రెడీగా భవనాలు.. అయినా మీనమేషాలు
సమస్యల పరిష్కారానికి చర్యలు రిమ్స్లో ఉన్న సమస్యలు అన్ని వర్గాల వారి నుంచి తెలుసుకుంటున్నాను. ఇటీవలే బాధ్యతలు స్వీకరించాను. అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాను. – డాక్టర్ అమూల్య, సూపరింటెండెంట్, రిమ్స్ ఆస్పత్రి, శ్రీకాకుళం శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో పలు భవన నిర్మాణాలు పూర్తయినా సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకోవడం లేదు. 200 మందికి సరిపడా హాస్టల్ భవనం నిర్మాణం పూర్తయి ఏడాదిన్నర అవుతున్నా రిమ్స్ అధికారులు ఇప్పటికీ భవనాన్ని స్వాధీనం చేసుకోలేదు. ఏపీ హెచ్ఎంహెచ్ఐడీసీ అధికారులు ఎన్ని సార్లు లేఖ లు రాసినప్పటికీ వసతి గృహ నిర్వహణకు అవసరమైన సామగ్రి లేదని తిరుగు టపాలో రిమ్స్ అధికారులు లేఖలు రాస్తున్నారు. ఈ భవనాలను ఇలాగే వదిలేయటంతో మరుగుదొడ్లు, వాష్ బేసిన్ల వద్ద బిగించి ఉన్న 300కు పైగా కుళాయిలు చోరీకి గురయ్యాయి. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ లబోదిబోమంటూ భవనాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో కుళాయిలను మరోసారి అమర్చుతానని తెలిపారు. రిమ్స్లో ఎంబీబీఎస్ విద్యార్థులు 650 మంది, పీజీ విద్యార్థులు 650 మంది, హౌస్ సర్జన్లు 150 మంది వరకు ఉన్నారు. వీరికి సరైన వస తి సౌకర్యం లేకపోవటం వల్ల 275 మంది ప్రైవేటు గా అద్దె గదుల్లో ఉంటూ చదువుతున్నారు. 275 మందిలో 117 మంది మహిళలు కాగా 158 మంది పురుషులు ఉన్నారు. పీజీ విద్యార్థుల సంఖ్య 180 మంది కాగా వీరిలో 115 మంది ప్రైవేటుగా అద్దె భవనాల్లో ఉండి చదువుతున్నారు. వసతి గృహాల్లో ఉన్నవారు కూడా ఒక్కో గదిలో 5 నుంచి 10 మంది వరకు ఉండి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇవేమీ రిమ్స్ అధికారులకు పట్టడం లేదు. క్యాంటీన్దీ ఇదే పరిస్థితి.. రిమ్స్ ఆవరణలో క్యాంటీన్ భవన నిర్మాణం కూడా పూర్తయి నాలుగు నెలలకు పై బడుతుంది. దీన్ని కూడా రిమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోలేదు. ఎవరికి వారు తమకెందుకులే అనే పద్ధతిలో ఉన్నా రు. హాస్టల్స్లో భోజనాలు సరిగా లేవన్న పంచాయతీ కలెక్టర్ వరకు వెళ్లిన విషయం పాఠకులకు తెలిసినదే. కనీసం క్యాంటీన్ ఉన్నా అక్కడైనా భోజనం చేసుకుంటామని విద్యార్థులు భావిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు రిమ్స్ అధికారులు కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఇటీవలి రిమ్స్లో పర్యటించిన కలెక్టర్ తాగునీటి ఆర్వో ప్లాంట్, లిఫ్ట్లు పనిచేయకపోవటాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ విషయాలను తనకు ఎందుకు తెలియజేయలేదని అధికారులపై మండిపడ్డారు. మరమ్మతులు చేపట్టాలని సూచించి రెండు నెలలు దాటుతున్నా పట్టించుకోలేదు. సలహా మండలి సమావేశాలు కూడా నిర్వహించటం లేదు. ఉన్నత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. పూర్తయిన భవనాలు స్వాధీనం చేసుకోని రిమ్స్ అధికారులు వసతికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు క్యాంటీన్ లేక అవస్థలు -
విద్యుదాఘాతంతో ఆవు మృతి
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని తాళ్లవలస పంచాయతీ బొడ్డపాడు గ్రామంలో కాలారి నారాయణరావుకు చెందిన సుమారు రూ. 80 వేలు విలువ చేసే చూడి ఆవు శుక్రవారం విద్యుదాఘాతంతో మృతి చెందింది. వ్యవసాయ మోటారుకు వెళ్లే విద్యుత్ లైన్ ట్రాన్సఫార్మర్ గ్రామం మధ్యలో కిందకు ఉండడం వల్ల ఆవుకు విద్యుత్ షాక్ కొట్టిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఫుడ్ పాయిజన్తో రెండు గేదెలు మృతి కంచిలి: మండలంలోని మండపల్లి గ్రామానికి చెందిన బెందాళం గణపతి అనే రైతుకు చెందిన రెండు ముర్రా జాతి గేదెలు శుక్రవారం ఉదయం హఠాత్తుగా మృతిచెందాయి. ఎప్పటిలాగే ఉదయం ఆహారంగా పాలిష్ తౌడు కలిపి పెట్టారు. ఆహారాన్ని తింటూ అనారోగ్యానికి గురయ్యాయి. దీంతో అప్పటికప్పుడే మృతిచెందినట్లు రైతు గణపతి వాపోయాడు. రోజుకు 5 లీటర్లు చొప్పున పాలు ఇచ్చేవని రైతు తెలిపాడు. -
ఉపాధ్యాయులకు బదిలీ కష్టాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు విద్యాశాఖ సమాయత్తమైంది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జీఓ నంబర్ 22తో షెడ్యూల్తోపాటు, మార్గదర్శకాలు జారీ చేసి న విషయం తెలిసిందే. రెండేళ్ల వ్యవధిలోనే జరుగుతున్న ఈ బదిలీలకు సంబంధించి దరఖాస్తులు చేసుకునే పనిలో ఉపాధ్యాయులు నిమగ్నమయ్యారు. ఒకేచోట 8 ఏళ్లు పనిచేస్తే తప్పనిసరి బదిలీ.. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు 5 ఏళ్లు, స్కూ ల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు ఇతర కేటగిరీ టీచర్లు 8 ఏళ్ల పాటు ఒకే స్టేషన్ (ఒకే పాఠశాల)లో పని చేస్తూ ఉంటే.. కచ్చితంగా బదిలీ కావాల్సి ఉంది. అలాగే రిక్వెస్ట్ బదిలీ కోసం సైతం దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ ఉన్నత చదువులు (పీజీ, బీఈడీ, ఎంఈడీ, ఎంఫిల్లు, పీహెచ్డీలు) పేరిట స్టడీ లీవ్ పేరుతో సెలవుల్లో ఉన్న ఉపాధ్యాయులు(ఆగస్టులోపు) 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకుంటే బదిలీ కానున్నారు. బదిలీల కోసం 4198 పోస్టులు సిద్ధం.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రెగ్యులర్ టీచర్లు 12,121 మంది, మినిమమ్ టైం స్కేల్ టీచర్లు 364 మంది పని చేస్తున్నారు. జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా 458 మంది టీచర్లను భర్తీ చేసేందుకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చారు. బదిలీలకు ఉమ్మడి జిల్లాలో 4198 పోస్టులను ఖాళీగా విద్యాశాఖ చూపిస్తోంది. ఇందులో క్లియర్ వెకేన్సీలు 567, 8/5 అకడమిక్ ఈయర్స్ పూర్తి చేసుకున్నవారు 2,092 మంది ఉన్నారు. ఫారిన్ సర్వీసు టీచర్లు ఏడుగురు ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఖాళీలు (రీ–అపోర్సిమెంట్ ఖాళీలు) 1,521, స్టడీలీవ్లో 10 మంది టీచర్లు ఇలా మొత్తం అన్నీ కలిపి 4198 పోస్టులను ఖాళీలు పాఠశాల విద్యాశాఖ చూపించింది. ఎన్నో సందేహాలు.. ● ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో జరిపిన చర్చల ప్రకారం ఇవ్వాల్సిన బదిలీ మార్గదర్శకాల్లో అనేక అంశాలపై స్పష్టత లోపించిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ● సర్వర్ డౌన్లో ఉంటుండటంతో ఆన్లైన్ చేయడంలో తీవ్రజాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ● ఇంగ్లిష్ మీడియంతో సమానంగా తెలుగు మీడియంను నిర్వహించాలన్న అంశంపై స్పష్టత లేదు. ● మిగులు స్కూల్ అసిస్టెంట్లను ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయాలన్న అంశంపై స్పష్టత లేదు. ● ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు పోస్టులు కొనసాగింపుపై స్పష్టత లేదు. ఆన్లైన్లో చూపించడంలేదు. ● ఎస్జీటీలతోపాటు హెచ్ఎంలు, ఎస్ఏలకు మా న్యువల్గా కౌన్సిలింగ్ జరపాలన్నదానిపై స్పష్టత లేదు. ● ఖాళీలను బ్లాక్ చేయకుండా ఉంచాలని, స్టడీ లీవ్ ఖాళీల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. ● ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం (పీఎస్హెచ్ఎం) పోస్టులను ఎస్జీటీలతోనే భర్తీ చేయాలన్న డిమాండ్పై స్పష్టత లేదు. పారదర్శకంగా చేస్తాం.. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరిపించేలా కసరత్తులు చేస్తున్నాం. వివిధ ఖాళీల జాబితాలను రూపొందించాం. హెచ్ఎంలు, ఎస్జీటీలు, ఎస్ఏల ఖాళీలను ప్రదర్శిస్తాం. ఎస్ఏల బదిలీలు ఆన్లైన్లో చేపట్టనున్నాం. ఎస్జీటీలకు సంబంధించి మార్గదర్శకాలు ఇంకా రావాల్సి ఉంది. బదిలీలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే హెల్ప్లైన్ నంబర్లు 9703148269, 8143142450, 9000907101ను సంప్రదించవచ్చు. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారి, శ్రీకాకుళం -
25న రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో ఈనెల 25వ తేదీన జరిగే ఏపీ రాష్ట్రస్థాయి ఓపెన్ చెస్ పోటీలను విజయంతం చేయాలని ఆలిండియా చెస్ ఇన్ స్కూల్ ట్రైనర్ సనపల భీమారావు కోరారు. రాజాంలోని జీఎంఆర్ ఐటీ కాలేజ్ వేదికగా పోటీలు జరుగుతాయన్నారు. కళాశాల ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, మీట్ కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ బి.అరుణ్కుమార్ పోటీలకు సంబంధించి దగ్గరుండి ఏర్పాట్లను కల్పిస్తున్నట్టు తెలిపారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు రూ. 1,30,000 నగదు బహుమతులతో పాటు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలను అందజేయనున్నట్టు చెప్పారు. వివరాలకు 99125 59735 నంబర్ను సంప్రదించాలని కోరారు. సదరం.. అవస్థలు పదిలం నరసన్నపేట: దివ్యాంగ పింఛన్ల ఏరివేతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా స్థానిక ఏరియా ఆస్పత్రిలో సదరం పరిశీలన కొనసాగుతోంది. నాలుగు నెలల క్రితం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించారు. ఇప్పటి వరకు నరసన్నపేట, పోలాకి, జలుమూరు, ఆమదాలవలస మండలాలకు చెందిన దివ్యాంగుల సర్టిఫికెట్లు పరిశీలించారు. శుక్రవారం నుంచి సారవకోట మండలానికి చెందిన దివ్యాంగుల పత్రాల పరిశీలన ప్రారంభమైంది. సుదూరమైనా నరసన్నపేట ఆస్పత్రికే వెళ్లాలని చెబుతుండడంతో దివ్యాంగులు అవస్థలు పడుతున్నారు. పరిశీలన కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు ఉండటం లేదని వాపోతున్నారు. ఒక్కో రోజు సర్వర్ డౌన్ అవుతుండటంతో మళ్లీ మరుసటి రోజు రావాల్సి వస్తుందని అంటున్నారు. సిబ్బందికి కూడా భోజన సదుపాయాలు సైతం కల్పించడం లేదు. -
టీడీపీ నాయకులకు భలే ‘ఉపాధి’
సంతబొమ్మాళి: ఉపాధి హామీ పథకాన్ని టీడీపీ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుని జేబులు నింపుకుంటున్నారు. కాపుగోదాయవలస గ్రామంలో జరుగుతున్న తంతు గమనిస్తే అధికార పక్ష నేతల తెలివి అర్థమవుతుంది. గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనుల్లో పనికి రాకుండానే స్థానిక టీడీపీ నాయకుల పేర్లు మస్టర్లలో నమోదు చేసి డబ్బులను దోచుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ అంగ ధనుంజయ దొంగ మస్టర్లు వేస్తూ చేతివాటం చూపిస్తున్నాడు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కుత్తమ శివప్రసాద్ (జాబ్ కార్డు నంబర్ 010220) ఉపాధి పనికి వెళ్లకుండానే 36 రోజుల పాటు ఆయ న పేరిట మస్టర్ను నమోదు చేసి తొమ్మిదివేల రూ పాయలు అకౌంట్లో వేసుకున్నారు. సైనా భీష్మారావు, అతని భార్య ఈశ్వరమ్మ (జాబ్ కార్డు నెంబర్ 010153) పేరున కలిపి సుమారు 72 రోజులు మస్టర్లు నమోదు చేసి సుమారు రూ.18వేలు లాగేశారు. దున్న చంద్రయ్య, అతని భార్య నరసమ్మ (010122) పేరున 42 రోజులు మస్టర్లు నమోదు చేసి సుమారు రూ. 14వేలు వారి ఖాతాలో జమ చేసుకున్నారు. వాడరేవు తారకేశ్వరరావు (జాబ్ కార్డు నంబర్ 10313), కారాడ ప్రభ (జాబ్కార్డు నంబర్ 010262) పేరున మస్టర్లు నమోదు చేసి వారి అకౌంట్లోనూ డబ్బులు వేసుకున్నారు. టీడీపీ నాయకుడు కుత్తమ శివప్రసాద్ అక్క సైనా ఉమా దేవికి (జాబ్ కార్డు నంబర్ 010174) సుమారు 70 ఏళ్లు ఉంటాయి. ఆమె కిడ్నీ పేషెంట్. అయినా ఆమె పేరున కూడా 36 రోజులు మస్టర్లు నమోదు చేసి తొమ్మిది వేలు పైచిలుకు డ్రా చేశారు. ఇలా టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతోనే కా కుండా వలస వెళ్లిన వారు, విదేశాల్లో ఉన్న వారి పేర్లతో కూడా మస్టర్లు నమోదు చేస్తున్నారని ఉపా ధి వేతన దారులు ఆరోపిస్తున్నారు. చింతల ట్యాంక్, చింతలచెరువు, జగన్నాథసాగరం, యర్రా ట్యాంక్ చెరువుల్లో పనిచేసినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ అంగ ధనుంజయ నమోదు చేశారు. నిరుపేదలకు వెళ్లాల్సిన డబ్బులు ఇలా టీడీపీ నాయ కులు వారి బంధువుల ఖాతాల్లోకి వెళ్లడంపై వేతన దారులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తప్పవు ఉపాధి పనికి వెళ్లని వారి పేరిట బినామీ మస్టర్లు నమోదు చేయకూడదు. విచారణ చేపట్టి వాస్తవమని తెలితే చర్యలు తప్పవు. – శైలజ, డ్వామా ఏపీడీ, టెక్కలి -
సైనికుల్లా పనిచేద్దాం..
మళ్లీ అధికారం సాధిద్దాం సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కటీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. 50 ఏళ్లకు ఇస్తామన్న పెన్షన్ ఊసే లేదు. వైఎస్సార్ సీపీ వర్గాలన్నీ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ అధికారం సాధించాలి. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు జన హృదయాలు గెలిచేది జగన్ మాత్రమే.. కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. పార్టీకి శక్తివంతంగా తీర్చిదిద్దాలంటే కార్యకర్తలు, నాయకుల సహకారం అవసరం. ప్రజల హృదయాలను గెలిచే నేత ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. – తమ్మినేని సీతారాం, పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ సమన్వయకర్త జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంజూన్ 4న వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే కలెక్టరేట్ వద్ద నిరసనలు చేస్తూ వినతి పత్రాలు అందిస్తూ ఈ ప్రభుత్వానికి సాగనంపాలి. అలాగే జూన్ 12న చీకటి రోజుగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపడుతూ గతంలో మనం చేసిన అభివృద్ధిని వివరిద్దాం. – సీదిరి అప్పలరాజు, పార్టీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు కుట్ర జరుగుతోంది కూటమి ప్రభుత్వ నాయకుల మాటలు వింటే రక్తం మరిగిపోతుంది. రాష్ట్రంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తామనడంలో ఏదో కుట్ర జరుగుతోంది. – పేరాడ తిలక్, టెక్కలి సమన్వయకర్త తేడా జనమే గమనించారు పాలనలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబు 15 ఏళ్ల పాలనకు జగన్ ఐదేళ్ల పాలనకు తేడాను ప్రజలు గమనించారు. – చింతాడ రవి, ఆమదాలవలస సమన్వయకర్త సమన్వయంతో సాగుదాం..శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని, రానున్న రోజుల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ధ్వజమెత్తా రు. జిల్లా కేంద్రంలోని పాత్రునివలస జాతీయ రహదారి వద్ద గల పార్టీ కార్యాలయంలో ఆయన పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పగ్గాలు చేపట్టిన 11 నెలల్లోనే లక్షా నలభై వేల కోట్లు అప్పు చేశారని, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చి అమరావతిలో పెడితే ప్రజలపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సంపద సృష్టించడం అంటే అప్పు చేయడమేనా అని సూటిగా ప్రశ్నించారు. ఆరు నెలల్లోనే కూటమి పాలనపై జనాల్లో అసంతృప్తి కనిపిస్తోందన్నారు. అధికారం స్వీకరించినపు డు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ వర్గాలకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదని సాక్షాత్తు సీఎం బహిరంగ సభల్లో చెప్పడం సబబు కాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 16 మంది ముఖ్యమంత్రుల హయాంలో కేవలం 58 ఏళ్లలో రూ.1.26 లక్షల కోట్లు అప్పు ఉంటే చంద్రబా బుహయాంలో మాత్రం అప్పు కుప్పలైందన్నారు. 2014– 19లో చంద్రబాబు పరిపాలనలో రూ.2లక్షల 50వేల కోట్లు అప్పు చూపించారన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు 70 లక్షల ఎకరాలకు సాగునీరు అవసరం ఉంటుందని, పోలవరం నుంచి ఇక్కడకు సాగునీరు రాకుండా ఎత్తును తగ్గించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా ఎన్నికై న పాతపట్నం సమన్వయకర్త రెడ్డి శాంతికి పార్టీ కేడర్ అంతా అభినందలు తెలుపుతూ సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ కళింగ వైశ్య, తూర్పు కాపు కుల విభాగ రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, ఎంపీపీ గొండు రఘరామ్, అంబటి శ్రీనివాస్రావు, పోలాకి జెడ్పీటీసీ ధర్మాక కృష్ణ చైతన్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎచ్చెర్ల శ్రీధర్, ఎం.స్వరూప్, గొండు కృష్ణ, జిల్లా పార్టీ గ్రీవెన్స్ విభాగపు అధ్యక్షుడు రౌతు శంకరావు, మార్పు పృథ్వీ, తమ్మినేని చిరంజీవినాగ్, చిట్టి జనార్దన రావు, మూకళ్ల తాతబాబు, గంగు నరేంద్ర, గుండ హరేష్, ముంజేటి కృష్ణ, ఎన్ని ధనుంజయ పాల్గొన్నారు. హామీలు తుంగలోకి తొక్కారు టీడీపీ ఏడాది పరిపాలనలో ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కింది. రాను న్న రోజుల్లో కూటమి పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారు. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్ అభివృద్ధి గురించి చెప్పాలి టీడీపీ అరాచకాలు బయట పెట్టాలంటే ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయాలి. వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని చాటి చెప్పాలి. – నర్తు రామారావు, ఎమ్మెల్సీ ప్రజలతోనే ముందుకు.. కూటమి ప్రభుత్వం తప్పులను ప్రజల్లోకి తీసుకెళదాం. ప్రజా సమస్యలపై పోరాడదాం. అందరం కలిసికట్టుగా పనిచేసి మందుకు సాగుదాం. –గొర్లె కిరణ్ కుమార్, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే సంపద సృష్టి అంటే అప్పు చేయడమేనా..? 11 నెలల బాబు పాలనలోనే రూ.1.40 లక్షల కోట్లు అప్పు అప్పు చేసి అమరావతికి పెడితే ప్రజలపై పెనుభారం ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు కూటమిది అరాచక పాలన అంటూ మండిపాటు సమష్టిగా పనిచేయాలని పార్టీశ్రేణులకు పిలుపు టీడీపీ విఫలమైంది 2019–24లో జగన్ హయాంలో అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు తెలుసు. టీడీపీ పూర్తిగా విఫలమైంది. – రెడ్డి శాంతి, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే -
నీ కీర్తి.. మాకు స్ఫూర్తి
దేశంలోనే గుర్తింపు వచ్చింది ఆర్మీ మేజర్ రామ్గోపాల్ నాయుడు వల్ల దేశంలోనే మా గ్రామానికి గుర్తింపు వచ్చింది. ఉగ్రవాదులను అంతం చేయడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించారు. కీర్తి చక్ర అవార్డును రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోవడం మా అందరికీ గర్వంగా ఉంది. – ఎం.రాజు, నగిరిపెంట గ్రామం, సంతబొమ్మాళి మండలం సంతోషంగా ఉంది మా గ్రామానికి నిజమైన పండగ వచ్చింది. మేజర్ రామ్గోపాల్ నాయుడు వల్ల మా గ్రా మానికి ప్రత్యేకత వచ్చింది. కీర్తి చక్ర అవార్డు అందుకోవడం మాకు సంతోషంగా ఉంది. – ఎం.సోమేశ్వరరావు, నగిరిపెంట గ్రామం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సంతబొమ్మాళి: సిక్కోలు సంబరపడింది. జిల్లాకు చెందిన మేజర్ మళ్ల రామ్గోపాలనాయుడు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా దేశ రాజధానిలో ‘కీర్తి చక్ర’ అవార్డును అందుకున్నారు. ఈ క్షణాలు చూసి జిల్లా యావత్తు మురిసిపోయింది. ఈయన స్వగ్రామం సంతబొమ్మాళి మండలంలోని నగిరిపెంట గ్రామం. 2023 అక్టోబర్ 26న జరిగిన ఓ ఆపరేషన్లో మేజర్ రామ్ కీలకంగా వ్యవహరించారు. ఆ పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారాన్ని అందించారు. రామ్గోపాల నాయుడు తల్లిదండ్రులు నగిరి పెంటకు చెందిన రైతు మళ్ల అప్పలనాయుడు, హేమమాలిని. కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివిన రామ్ 2012లో యూపీఎస్సీ నిర్వహించిన స్టాఫ్ సెలెక్షన్ బోర్డు (ఎస్ఎస్బీ) ఎగ్జామ్ రాసి పూణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీకి ఎంపికయ్యారు. అక్కడ మూడేళ్లు అభ్యసించి, 2015–16లో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో క్యాడెట్గా చేరారు. అక్కడ శిక్షణ తీసుకున్న 900మందిలో గోల్డ్మెడలిస్ట్గా నిలిచి, ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా బాధ్యతలు స్వీకరించా రు. లెఫ్టినెంట్గా పనిచేసిన రెండేళ్లలో(2018)నే కెప్టెన్గా పదోన్నతి సాధించారు. అక్కడికి నాలుగేళ్లలో (2022)లో మేజర్గా ప్రమోషన్ లభించింది. ఆ రోజు ఏం జరిగిందంటే..? 2023 అక్టోబర్ 26 ఉదయం 10.10గంటలకు ఐదుగురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారని ఓ జవాన్ ద్వారా తెలుసుకున్నారు. 10.25 గంటలకు రంగంలోకి దిగిన రామ్గోపాలనాయుడు తోటి జవాన్లకు మార్గనిర్దేశం చేసి, ఉగ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. తన దళాలకు ప్రమాదాన్ని గ్రహించి పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఒక ఉగ్రవాదిని హతమార్చారు. మరొక ఉగ్రవాదిని గాయపరిచినప్పటికీ ఆ ఉగ్రవాది భారీ కాల్పులు జరిపాడు. ఆ భీకర కాల్పుల మధ్య జవాన్లతో కలిసి ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఓ ఉగ్రవాది ఒక గుహలో దాగి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆర్మీ బృందంపై గ్రనేడ్ కూడా విసిరాడు. దాని నుంచి తప్పించుకుని భయపడకుండా ఆ ఉగ్రవాదిని పట్టుకుని హతమార్చారు. తన పోరాటంలో భాగంగా జవాన్లను కాపాడుకోవడం కోసం ధైర్యసాహసాలు ప్రదర్శించారు. మేజర్ రామ్ కీర్తి చక్ర పురస్కారం అందుకున్న మేజర్ మళ్ల రామ్గోపాల నాయుడు సంబరపడుతున్న జిల్లా వాసులు అద్భుత సాహసంతో ఉగ్రవాదులను మట్టుబెట్టినందుకు పురస్కారం స్ఫూర్తిగా తీసుకోవాలి.. మేజర్ రామ్గోపాల్ నాయుడును యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. కీర్తి చక్ర అవార్డు అందుకున్న రామ్గోపాల్నాయుడు మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. – ఉల్లాస లోకేశ్వరరావు, రిటైర్ నాయక్ సుబేదార్ -
సజావుగా ఏపీ ఈఏపీసెట్
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ ఈఏపీ సెట్–2025 సజావుగా సాగుతోంది. ప్రస్తుతం ఎంపీసీ స్ట్రీం పరీక్షలు జరుగుతున్నాయి. చిలకపాలెంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మొదటి షిఫ్టులో 280 మందికి, 268, రెండో షిఫ్టులో 280 మందికి 266 మంది హాజరయ్యారు. ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్లో జరిగిన పరీక్షల్లో మొదటి షిఫ్టులో 170 మందికి 160, రెండో షిఫ్టులో 170 మందికి 163 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఘనంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం శుక్రవారం ఉదయం ఆలయ అనివెటి మండపంలో ఘనంగా జరిగింది. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీ ఉషా పద్మినీ ఛాయా సమేత సూర్యనారాయణస్వామి కల్యాణమూర్తులకు ఆగమ శాస్త్రం ప్రకారం కల్యాణ ప్రక్రియను పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఈ కల్యాణాన్ని జరిపించారు. యోగాతో శారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం శ్రీకాకుళంఅర్బన్: యోగాతోశారీరక ఆరోగ్యం, మానసిక దృఢత్వం లభిస్తుందని సీ్త్ర, మహిళా శిశు సంక్షేమశాఖ పథక సంచాలకులు బగాది శాంతిశ్రీ అన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనల మేరకు శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రోడ్డులో సీ్త్ర, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యోగా శిబిరం నిర్వహించారు. శిబిరంలో ఐసీడీఎస్ సిబ్బంది, చిల్డ్రన్ హోమ్స్కు చెందిన చిన్నారులు మొత్తం 700 మందికి పైగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ సమన్వయ అధికారి జగదీ ష్, నోడల్ అధికారి మనెమ్మ పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణ స్థల పరిశీలన
కవిటి: ‘సర్కారు వారి జాగాలో.. ’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. శుక్రవారం సంబంధిత అక్రమ నిర్మాణం జరుగుతున్న స్థలాన్ని పరిశీలించారు. కలెక్టర్ కార్యాలయంలో ఓ సమావేశానికి ఈఓ వీరభద్రస్వామి హాజరైన నేపథ్యంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భూపతి, సిబ్బంది సుదర్శన్, నూకరాజు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఎలాంటి నిర్మాణం చేసినా చట్టపరమైన కేసులు ఎదుర్కో వాల్సి ఉంటుందని నిర్మాణదారుడిని హెచ్చరించారు. వీఆర్ఓ ఎస్.నారా యణ, వీఆర్ఏ కాళిదాస్లు సైతం నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ చూపాలని కోరారు. పత్రం చూపిన తర్వాత ఇందులో ఆర్అండ్బీ స్థలం ఎంత, జిరాయితీ స్థలం ఎంత అనే అంశాలను లెక్కచూస్తామని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని సూచించారు. నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఎకై ్సజ్ పోలీసులుశ్రీకాకుళం క్రైమ్ : జిల్లావ్యాప్తంగా ఉన్న 176 మద్యం దుకాణాలు, 18 బార్ అండ్ రెస్టారెంట్లలో అక్రమాలకు తావులేకుండా పూర్తిస్థాయి లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ నిఘా పెట్టనుందని సంబంధిత శాఖ డిప్యూటీ కమిషనర్ దోసకాయల శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఉన్న 12 స్టేషన్ల పరిధిలో స్టేషన్ అధికారి, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు రొటేషన్ పద్ధతిలో ప్రతిరోజూ నైట్ పెట్రోలింగ్ విధుల్లో పాల్గొనేలా కార్యాచరణ చేశామని శుక్రవారం ‘సాక్షి’కి తెలిపారు. బార్ అండ్ రెస్టారెంట్ల వద్ద రాత్రి 9 నుంచి 11 గంటల వరకు, దుకాణాల వద్ద 8 నుంచి 10 గంటల వరకు ఈ విధులుంటాయన్నారు. ఎకై ్సజ్ ‘ఐ’ అనే మొబై ల్ అప్లికేషన్ కూడా త్వరలో వెబ్సైట్లో పెట్టనున్నామని తెలిపారు. ఎకై ్సజ్ నేరాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులుంటే టోల్ఫ్రీ నంబర్ 14405 కి కాల్ చేసి తెలియజేయాలన్నారు. -
ఆర్టీసీ బస్టాండ్లలో షాపులకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లాలో గల ఆర్టీసీ బస్ స్టేషన్లలో షాపులకు దర ఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం 1, 2వ డిపోలు, టెక్కలి, పలాస తదితర డిపోల పరిధిలోకి వచ్చే ఆర్టీసీ బస్ స్టేషన్ల పరిధిలోని 66 షాపులలో అనుమతించిన వ్యాపా రం నిర్వహించేందుకు, ఔత్సాహిక వ్యాపారవేత్తలు టెండర్ ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీలోగా శ్రీకాకుళం జిల్లాలో గల శ్రీకాకుళం 1, 2వ ఆర్టీసీ డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపో మేనేజర్ల కార్యాలయాలలో టెండరు ఫారాలు అన్నీ పని దినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా కొనుగోలు చేయవచ్చునని పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలలోపు టెండర్ ఫారాలను టెండరు బాక్స్ లో వేయాలని, మధ్యాహ్నం 3 గంటలకు టెండరు దారుల సమక్షంలో బాక్సులను తెరుస్తారని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. -
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
ఎల్ఎన్ పేట: మండలంలోని చొర్లంగి గ్రామానికి చెందిన అగతముడి వెంకటేష్ (23) రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేష్ హైదరాబాద్లోని తన అక్క ఇంటికి వెళ్లేందుకు మంగళవారం రాత్రి ఫలక్నుమా రైలు ఎక్కాడు. మంగళవారం రాత్రి ఫలక్నుమా రైలు సుమారు నాలుగు గంటలకు పైగా ఆలస్యంగా వచ్చింది. అయితే ప్రమాదవశాత్తు విజయనగరం జిల్లా అంతకాపల్లి సమీపంలో వెంకటేష్ రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. బుధవారం తెల్లవారు జామున స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేసి విచారణ చేశారు. ఫలక్నుమా రైలు హైదరాబాద్ చేరుకున్న తర్వాత జనరల్ బోగీలో మిగిలి ఉ న్న లగేజీ బ్యాగులను గుర్తించారు. అప్పటికే గుర్తు తెలి యని వ్యక్తిగా కేసు నమోదు చేసిన విజయనగరం రైల్వే పోలీసులు లగేజీలో ఉన్న సమాచారం ప్రకారం వెంకటే ష్ కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం తెలియజేశారు. మృతుని తండ్రి తిరుపతిరావు ఇతర కుటుంబ సభ్యులు విజయనగరం చేరుకుని తన కొడుకేనని గుర్తించారు. గురువారం సాయంత్రం మృతదేహాన్ని గ్రామానికి తీసుకుని వచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ఉద్యోగం సాధిస్తాడనుకుంటే.. మృతి చెందిన వెంకటేష్ బ్యాంక్ ఉద్యోగం సాధించేందుకు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే నంధ్యాలలో కోచింగ్ తీసుకుంటున్నాడు. వారం రోజుల కిందటే నంధ్యాల నుంచి చొర్లంగి గ్రామానికి చేరుకున్నాడు. ఇటీవల జరిగిన బ్యాంక్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడని, ఇంటర్వ్యూ ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. మరి కొన్ని రోజుల్లో ఉద్యోగం వస్తుందనుకున్నంతలోనే ఇలా జరిగిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం గ్రామానికి చెందిన యువకులు ఏబీ ప్రధాన రహదారి రావిచంద్రి నుంచి చొర్లంగి గ్రామం వరకు మృతదేహాన్ని ర్యాలీ గా తీసుకుని వెళ్లారు. మృతునికి తండ్రి, అమ్మ సుశీల, అక్క, తమ్ముడు ఉన్నారు. -
బంగారం దుకాణంలో గొలుసుల చోరీ
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డులో ఉన్న తాళాసు నాన్నారావు బంగారు దుకా ణంలో బుధవారం దొంగతనం జరిగింది. కాశీబుగ్గ పోలీసులు గురువారం విడుదల చేసిన సీసీ పుటేజీ ఆధారంగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి తాళాసు నాన్నారావు బంగారు దుకాణంలోకి టోపీ, మాస్కు పెట్టుకుని వచ్చాడు. బంగారం గొలుసు కావాలని అడగ్గా మూడు గొలుసులు అతడికి చూపించారు. అవి చూస్తున్నట్టుగా నటించి రెండు చైన్లను పట్టుకు ని ఒక్కసారిగా పరిగెత్తాడు. షాపు నుంచి బయటకు వచ్చి షర్టు తీసేసి టీ షర్టుతో పరుగులు పెట్టినట్టు ఫుటేజీలో ఉంది. కాశీబుగ్గ పోలీసుస్టేషన్ ఎస్ఐ నర్సింగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడి పనులు అక్కడే ఆపండి..
● ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ అక్రమ నిర్మాణం ● పరిశీలించిన అధికారులు నరసన్నపేట: స్థానిక శివనగర్ కాలనీలో జోగి చెరువు గర్భాన్ని ఆక్రమించి స్థానిక ఎమ్మెల్యే ప్రైవే టు పీఏ రావాడ గణపతి చేపట్టిన అక్రమ నిర్మాణ పనులను అధికారులు గురువారం పరిశీలించి అడ్డుకున్నారు. జోగి చెరువు గర్భాన్ని ఆక్రమించుకొని స్థానికులు అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్నారని ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. అయితే ఈ నిర్మాణం ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ రావాడ గణపతి చేస్తుండటంపై శివనగర్ వాసులు అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో గురువారం తహసీల్దార్ టి.సత్యనారాయణ, ఎంపీడీఓ బి.మధుసూదనరావు, ఈఓ ద్రాక్షాయిని, వీఆర్వో అలేఖ్య తదితరులు అక్రమ నిర్మాణాన్ని పరిశీలించారు. సుమారు రూ. కోటి విలువ చేసే ఈ స్థలాన్ని ఆక్రమించి తన సోదరుడితో పాటు తనకూ సరిపోయే విధంగా ఇళ్లు కట్టుకుంటున్నారు. దీన్ని పరిశీలించిన అధికారులు అవాక్కయ్యారు. స్పష్టంగా చెరువు గ ర్భం కనిపిస్తుండడంతో పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్ తీసుకున్నారా అని రావాడ గణపతి అన్నయ్యను ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి ఈ స్థలం తమ స్వాధీనంలో ఉందని ఆయన వివరించారు. ఆధా రాలు చూపించాలని అధికారులు అడిగితే తెల్లమొఖం వేశారు. ఆధారాలు చూపించేంత వరకు పనులు ఆపాల్సిందేనని తహసీల్దార్, ఎంపీడీఓలు రావాడ గణపతి అన్నయ్యకు చెప్పారు. పనులు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. కాగా ఎమ్మెల్యే ప్రైవేటు పీఏ ఈ విధంగా అక్రమ నిర్మాణానికి పాల్పడడంపై శివనగర్ వాసు లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువును కాపాడాలని కోరుతున్నారు. -
జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మె ల్యే, రాష్ట్ర పీయూసీ కమిటీ చైర్మన్ కూన రవికుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు, కోశాధికారిగా జీవీ సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా మొజ్జాడ వెంకటరమణతోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం నగరంలోని క్రిస్టల్ ప్యాలెస్ వేదికగా పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు, సాఫ్ట్బాల్ సంఘ ముఖ్య ప్రతినిధి ఎంవీ రమణ అధ్యక్షతన గురువారం జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశంతోపాటు నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు. ఆమదాలవలసలో ఉన్న స్టేడియాన్ని సాఫ్ట్బాల్ స్టేడియంగా రూపొందిస్తామని కూన తెలిపారు. జిల్లా నూతన కార్యవర్గం.. సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్గా కలిదిండి నరసింహారాజు, అధ్యక్షునిగా కూన రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా సూర శ్రీనివాసరావు, కన్వీనర్గా బడగల హరిధరరావు, కోశాధికారిగా జీవీ సత్యనారాయణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా మొజ్జాడ వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా ఎం.తిరుపతిరావు, బి.సురేష్, సంయుక్త కార్యదర్శులగా ఏ.ఢిల్లేశ్వరరావు, ఎం.ఆనంద్కిరణ్, కార్యవర్గసభ్యులుగా పేడాడ బాబురావు, ఎస్వీ రమణ, డి.పెంటయ్య, ఎస్.రామరాజు, కె.వరలక్ష్మి, జి.దుర్గాప్రశాంతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
మినీ మహానాడు వెలవెల
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మినీ మహానాడు వెలవెలబోయింది. సాయంత్రం 4గంటలకు ప్రారంభం కావాల్సిన మినీమహానాడును రెండు గంటల పాటు ఆలస్యంగా ప్రారంభించారు. జనా లు లేకపోవడంతో అప్పటికప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 6.30గంటలకు సభ ప్రారంభం కాగా 8.30గంటల వరకూ కొనసాగింది. కేంద్రమంత్రి వచ్చే సమయానికి ఆయనతో పాటు కొందరు కార్యకర్తలు, నాయకులు వస్తారని భావించినప్పటికీ అది కూడా జరగకపోవడంతో ఉన్న వారితోనే చర్చ ప్రారంభమైంది. కార్యాలయ ప్రాంగణంలో సగానికి పైగా కుర్చీలు ఖాళీగా ఉండిపోయాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీని వాస్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు మినీ మహానాడుకు గైర్హాజరయ్యారు. అలాగే ప్రభు త్వ విప్ బెందాళం అశోక్, పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీషలు సైతం సమావేశానికి హాజరుకాలేదు. -
యోగా దినోత్సవానికి ప్రత్యేక కార్యాచరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21న విశాఖపట్నంలో జరిగే ముఖ్య కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నెల రోజుల పాటు గ్రామస్థాయి వరకు యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గురువారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశమైన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ విషయాలను వెల్లడించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి మండలానికి ఓ మాస్టర్ ట్రైనర్ను నియమించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా కేంద్రం, మండల కేంద్రాల తో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాల్లో రోజువారీగా యోగా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారుల కు ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకతతో యోగా కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీకాకు ళం జిల్లాలో మత్స్యకారులతో ఒకరోజు ప్రత్యేకంగా యోగా శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. -
వ్యక్తిపై గృహహింస కేసు నమోదు
ఎచ్చెర్ల క్యాంపస్: కొయ్యాం పంచాయతీ కొత్తకూర్మినాయుడుపేట గ్రామానికి చెందిన బోర పైడిరాజు పై ఎచ్చెర్ల పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. తనను వేధిస్తున్నట్లు భార్య భారతి ఫిర్యా దు చేసింది. వీరికి పదేళ్ల క్రితం వివాహమైంది. రో జూ మద్యం తాగి కొట్టటం, హింసించటం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. చనిపోయిన వృద్ధుని వివరాలు లభ్యం ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళంలోని సింహద్వారం సమీపంలో ఈ నెల 17న ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండగా 108లో శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. ఆ వృద్ధుడు ఆస్పత్రిలో చనిపోయా డు. ఆయన వివరాలు గురువారం దొరికాయి. ఈ వ్యక్తిని సరుబుజ్జిలి మండలం గోనెపాడు గ్రామాని కి చెందిన బిర్లంగి రామ్మూర్తిగా గుర్తించి, మృత దేహాన్ని బంధువులకు పోలీసులు అప్పగించారు. ఏఎంసీలో మెడికో ఆత్మహత్య డాబాగార్డెన్స్: ఆంధ్ర మెడికల్ కళాశాల(ఏఎంసీ) పీజీ హాస్టల్లో గురువారం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మోతీలాల్ (25) రేడియాలజీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలలో చేరి కేవలం మూడు నెలలే అయింది. మెరిట్ విద్యార్థి అయిన మోతీలాల్ వ్యక్తిగత కారణాల వల్ల మృతి చెందాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ప్రొఫెసర్ల వేధింపుల కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్నేహితులు ఆరోపిస్తున్నారు. వన్టౌన్ పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైలు ఢీకొని వృద్ధుడు మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో గురువా రం రైలు ఢీకొని బి.మల్లేష్ (79) అనే వృద్ధుడు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ మ ధుసూదనరావు తెలిపా రు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం మండలం తండేవలస గ్రామానికి చెందిన మల్లేష్ బమ్మిడివానిపేట రైల్వే గేటు వద్ద పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొ న్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
కొనసాగుతున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: జిల్లాలో ఏపీ ఈఏపీ సెట్ –2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎచ్చెర్ల మండల పరిధిలో రెండు పరీక్ష కేంద్రాల్లో గురువారం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించారు. చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్టులో 279 మందికి 270, రెండో షిఫ్టులో 280 మందికి 265 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్టులో 169 మందికి 162, రెండో షిఫ్టులో 170 మందికి 164 మంది హాజరయ్యారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానవత్వం చాటుకున్న బ్యాంకు ఉద్యోగి రణస్థలం: మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన బొంతు అప్పలనాయుడు అనే బ్యాంకు ఉద్యోగి మానవత్వం చాటుకున్నాడు. బుధవారం చీపురుపల్లి మండలంలోని కర్లాం గ్రామదేవత పండుగకు వెళ్లిన అతనికి ఒక పర్సు దొరికింది. అందులో రూ.16,500 నగదు, ఆధార్, పాన్కార్డు, ఓటర్, డ్రైవింగ్ లైసెన్సు కార్డులతో పాటు వివిధ ఏటీఎంలు ఉన్నాయి. అందులో వివరాలు ప్రకారం ము ద్దాడ గోవింద అనే వ్యక్తివిగా గుర్తించి ఆయన కు సమాచారం అందించారు. అతను గురువారం రణస్థలం రావడంతో పోగొట్టుకున్న పర్సును అప్పలనాయుడు అందజేశారు. మానవత్వం చాటుకున్న బ్యాంకు ఉద్యోగి అప్పలనాయుడును స్థానికులందరూ ప్రశంసించారు. హైదరాబాద్లో గూనభద్ర వాసి మృతి కొత్తూరు: కొత్తూరు మండలం గూనభద్రకు చెందిన నక్క శ్రీనివాసరావు(41) హైదరాబాద్లో గురువారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయన కుటుంబంతో పాటు హైదరబాద్లో నివాసం ఉంటున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. ఒక ఇంటిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య కృష్ణకుమారి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాసరావు మృతి చెందడంతో గూనభద్ర గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. శ్రీనివాసరావు మృతదేహాన్ని స్వగ్రామం గూనభద్ర తీసుకు వస్తున్నారు. చిత్రలేఖనం పోటీల్లో బ్రాహ్మణతర్లా విద్యార్థికి ప్రథమ స్థానం పలాస: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం పురస్కరించుకొని గురువారం నిర్వహించిన రాష్ట్ర జీవ వైవిధ్య సదస్సులో పలాస మండలం బ్రాహ్మణతర్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలకు చెందిన సైన్సు ఉపాధ్యాయుడు నేషనల్ గ్రీన్ కోర్ క్లస్టర్ కోఆర్డినేటరు కొయ్యల శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో విద్యార్థులు పాల్గొన్నారు. ‘ప్రకృతితో సామరస్యం స్థిరమైన అభివృద్ధి’అనే అంశంపై చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ఇంజినీరింగ్ విభాగంలో పుచ్చ అక్షర కుమార్ ప్రథమ స్థానం సాధించాడు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేతులు మీదుగా ప్రశంశాపత్రం, జ్ఞాపికను అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర జీవ వైవిద్య మండలి చైర్మన్ ఎన్.విజయకుమార్, మెంబర్ సెక్రటరీ పి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు వారి జాగాలో..
● ఎస్కేఈ రోడ్డు పక్కనే కూటమి నేత అక్రమ నిర్మాణాలు ● కనీస నిబంధనలు పాటించని వైనం ● నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం కవిటి: అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులకు ప్రభుత్వ స్థలాలు కూడా సొంత జాగాలైపోతున్నా యి. మొన్నటికి మొన్నే రాజపురం వెళ్లే మార్గంలో ప్రభుత్వ స్థలాన్ని మట్టివేసి చదును చేయించి కాజే సే ప్రయత్నం చేశారు. ఆ సంగతి మరువక ముందే మళ్లీ సోంపేట–కవిటి–ఈదుపురం (ఎస్కేఈ రోడ్డు) పక్కనే మరో టీడీపీ నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపడుతున్నా రు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఎస్కేఈ రోడ్డు నుంచి నెలవంక వెళ్లే రోడ్డు మలుపులో పంచాయతీ విశ్రాంతి భవనానికి ఆనుకునే ఓ అక్రమ నిర్మాణానికి ఓ టీడీపీ నేత పూనుకున్నాడు. వాస్తవానికి గతంలోనూ ఇలాగే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఓ భవనం కట్టేశాడు. సుడా అనుమతులు కూడా తీసుకోకుండా కరెంటు కనెక్షన్ కూడా తెప్పించుకున్నాడు. తాజాగా ఇప్పుడు విశ్రాంతి భవనానికి ఉద్దానం మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకుకు మధ్యన ఉన్న తన స్థలంలో ప్రభుత్వ స్థలం కలిపేసి నిర్మాణం చేసేందుకు పనులు ప్రారంభించేశాడు. పనుల్లో భాగంగా ఇక్కడున్న మర్రిచెట్టును కూల్చగా.. దాని కింద ఉన్న ఉద్దానం నీటిపథకం పైప్లైన్ ధ్వంసమైంది. దీంతో ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాళం అశోక్ సొంత ఊరు (జంట గ్రామాలు) ప్రగడ పుట్టుగ, రామయ్య పుట్టుగలకు నీటిసరఫరా ఆగిపోయింది. విషయం తెలు సుకున్న పంచాయతీ అధికారులు హుటాహుటిన నష్టనివారణ చర్యలు చేపట్టారు. పైప్లైన్ బాగుచేసే పనులు చేయిస్తావా లేక పోలీసులకు ఫిర్యాదు చే యమంటావా అంటే మరమ్మతులు పనులు చేయించాడు. దీంతో ఆ సమస్య సద్దుమణిగింది. కానీ అక్రమ నిర్మాణం మాత్రం ఒకటి పూర్తి కావ చ్చింది. ఇక్కడ వ్యవసాయ భూమిని వాణిజ్య అవసరాలకు వినియోగించినా నాలా కన్వర్షన్ చేసుకోలేదు. అయినా అధికారులు కిమ్మనడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేవు.. ఎస్కేఈ రోడ్డుకు అనుకుని ఉన్న స్థలాల్లో ప్రగడపుట్టుగ జంక్షన్ విశ్రాంతి భవనం పక్కన కట్టిన నిర్మాణాలకు సుడా అనుమతుల కోసం ఎలాంటి దరఖాస్తులు రాలేదు. నిర్మాణదారుకు నిబంధనలను అనుసరించి శాఖాపరమైన చర్య లు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేస్తాం. – జి.వీరభద్రస్వామి, కవిటి పంచాయతీ ఈఓ దరఖాస్తులు లేవు ఎస్కేఈ రోడ్డులో వ్యవసాయ భూమిలో వ్యవసాయేతర అవసరాలకు ఉద్దేశించి వినియోగించే నిమిత్తం రైతుల నుంచి కానీ, నిర్మాణదారుల నుంచి కానీ నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తులు అందలేదు. ఆ స్థలంలో వ్యవ సాయ భూమిలో ఏవైనా కట్టడాలు కడితే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేసే వ్యక్తులకు నోటీసులు జారీ చేస్తాం. – ఎస్.నారాయణ, వీఆర్ఓ, కవిటి రెవెన్యూ -
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా టెక్కలి భవానీ థియేటర్లో గురువారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్గా నిర్వహించిన మన ఊరి కోసం మాటామంతీ కార్యక్రమం కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం ఆయనేనని తెలుస్తోంది. ఎవరిని థియేటర్లోకి అనుమతించాలి? ఏం మాట్లాడాలో ముందే శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఈ కార్యక్రమానికి రావివలస గ్రామాన్ని ఎంపిక చేశారు. వర్చువల్ పద్ధతి ద్వారా ఉప ముఖ్యమంత్రి గ్రామస్తుల సమస్యలు తెలుసుకోవాలి. అయితే ఆ గ్రామస్తులనే లోపలకు వెళ్లనివ్వకుండా రెవెన్యూ అధికారుల ఆదేశాలతో పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ప్రతినిధులనూ అనుమతించలేదు. దీంతో మీడియా ప్రతినిధులు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా టీడీపీ, జనసేనకు చెందిన మండల స్థాయి నాయకులనూ థియేటర్లోకి అనుమతించకపోవడం గందరగోళానికి దారి తీసింది. కొందరు పాస్లు ఉన్న వారినీ పోలీసులు అత్యుత్సాహంతో ఆపేశారు. ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్క్ విజయవాడ: అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్క్, ప్రతి గ్రామంలో పల్లె వనం ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చెప్పారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
Nambala Keshava Rao: శ్రీకాకుళం టు సుప్రీం కమాండర్
సొంతూరికి దూరంగా దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత వాసం ముగిసిపోయింది. ఎంటెక్ చదివినా ఏళ్లకు ఏళ్లు చేసిన అరణ్య వాసం పూర్తయ్యింది. కలాన్ని వదిలి తుపాకీ చేతబట్టిన ఆయన జీవితం ఆ తుపాకీ గుళ్లకే బలైపోయింది. జియ్యన్నపేటలో పుట్టి.. టెక్కలిలో చదివి.. వరంగల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లి.. ఆపై అడవిలో అన్నగా మారిన నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రస్థానం ముగిసిపోయింది. చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కేశవరావు హతమయ్యారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కిపడింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, పలాస: నలభై ఏళ్ల కిందట ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి.. తన వాటా ఆస్తి రాసిచ్చేయాలని టీచరైన తండ్రిని కోరారు. ఎందుకని అడిగితే ఆస్తి ఇస్తే.. పేదలకు పంచేస్తా అని చెప్పారు. ఆ విద్యార్థే నంబాళ్ల కేశవరావు. విద్యారి్థగా ఊరి నుంచి, కు టుంబం నుంచి వెళ్లిన కేశవరావు విగతజీవిగా మా రారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాత వాసం చేసి అడవిలోనూ ఊపిరి వదిలేశారు. చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కి పడింది. నంబాళ్ల స్వగ్రామమైన కోట»ొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నప్పుడు తెలివైన విద్యార్థి, మెరుగైన కబడ్డీ ప్లేయర్గా మన్ననలు అందుకున్న కేశవరావు కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామానికి చెందిన నంబాళ్ల వాసుదేవరావు (ఉపాధ్యాయుడు) లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లో విద్యనభ్యసించారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి 1971 లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ కోర్సులో చేరారు. ఏడాది తర్వాత వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరారు. ఆ తర్వాత అక్కడే ఎంటెక్లో చేరారు. అటు నుంచి అటే అడవి బాట పట్టారు. కేశవరావు మరణంతో కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం ప్రస్తుతం గుంభనంగా ఉంది. గతంలో ఒకటి రెండు మార్లు కేశవరావుమృతి వదంతులపై కొందరు స్పందించడంతో వారిని పోలీసులు విచారించారు. దీంతో ప్రస్తుతం ఎవరూ బయట పడడం లేదు. ఉద్దానంలో.. నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్త ఉద్దానంలో దావానలంలా వ్యాపించింది. టెక్కలికి చెందిన ఆయనకు ఈ ప్రాంతం ఉద్యమాలతో నేరుగా సంబంధం లేకపోయినా ఈ ప్రాంతం మావోయిస్టు కేడరుకు, నాటి పీపుల్స్ వార్ పార్టీ కేడరుకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కావడంతో మృతి వార్తతో ఉద్దానం ఉలిక్కిపడింది. పోలీసు వర్గాలు ముందుగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి ఈ సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకొని రావడానికి ఎవరైనా వెళ్తున్నారా అని అడిగారు. తమ గ్రామానితో ఎలాంటి బంధుత్వం లేదని, రాజకీయ బంధుత్వం మాత్రమే ఉందని వారు చెప్పారు. ఒక నాటి పీపుల్స్ వార్లో, నేటి మావోయిస్టు పారీ్టలో పనిచేసి ఈ ఉద్దానం ప్రాంతంలో సుమారు 60మంది వరకు కార్యకర్తలు, నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు మృతితో ఇక నాయకత్వ స్థానాల్లో ఈ జిల్లా నుంచి ఎవరూ లేరనే తెలుస్తోంది. ఆయన మృతదేహం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, మాజీ మావోయిస్టు నాయకులు బయల్దేరి వెళ్తున్నట్టు ఉద్దానం వాసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్కు ఖండన చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ మఢ్ అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ను సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఖండించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు కోరినా వాటిని తిరస్కరించి మన దేశపౌరులైన మావోయిస్టులను ఉగ్రవాదులపై దాడుల కన్నా ఎక్కువగా దాడి చేసి దండకారణ్యంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిండచం అప్రజాస్వామికమని, పౌర సమాజం వీటిపై తీవ్రంగా స్పందించాలని కోరారు. -
45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్వార్ 7వ కాంగ్రెస్లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్గా..పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది. -
జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి
కాశీబుగ్గ: జీడి పిక్కలు 80 కేజీల బస్తాకు రూ.16 వేలు ధర కల్పించి ప్రభుత్వమే రైతు సేవా కేంద్రాలు వద్ద కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం కాశీబుగ్గ సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన జీడి రైతుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీడికి గిట్టుబాటు ధర, జీడి కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సమావేశంలో జీడి రైతు సంఘం నాయకులు బత్తిని లక్ష్మీనారాయణ, టి.రాజు, డి.తారకేశ్వరరావు, జె.సంతోష్, టి.తాతారావు, సీఐటీయూ నాయకులు ఎన్.గణపతి తదితరులు పాల్గొన్నారు. -
27న అమరవీరుల స్మారక సభ
పలాస: శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధరైతాంగ పోరాటంలో అమరులైన అమర వీరుల స్మారక సభను విజయవంతం చేయాలని ప్రజాసంఘాల నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద బుధవారం స్మారక సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా మే 27న బొడ్డపాడులో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు జోగి కోదండరావు, వంకల మాధవరావు, దుష్యంతు, రామారావు, వీరాస్వామి, ధర్మారావు, పుచ్చ దుర్యోధన, బాలకృష్ణ, త్రిలోచనరావు, శ్రీరాములు, మోహిని, జగన్,అప్పయ్య, బాలరాజు, అప్పారావు,మాధవరావు, ముసలయ్య పాల్గొన్నారు. -
అవగాహనతోనే నకిలీలకు అడ్డుకట్ట
ఎల్.ఎన్.పేట: ఖరీఫ్ సమీపిస్తుండటంతో రైతులు పొలం పనులకు సమాయత్తమవుతున్నారు. పంట దిగుబడి చేతికి అందివచ్చే వరకు ప్రతి రోజు పొలంలో ఏదో ఒక పనిచేస్తునే ఉంటారు. రానున్న జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ విత్తనాలు చల్లే పనులు ప్రారంభం అవుతాయి. రైతుల అవసరాన్ని ఆసరాగా తీసుకుని కొందరు వ్యాపారులు నకిలీ విత్తనాలు అంటగట్టి అందినంత దోచుకునేందుకు అదునుగా ఎదురుచూస్తున్నారు. వీరి బారిన పడకుంటా ఉండాలంటే రైతులు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే వ్యాపారులు చేస్తున్న అక్రమాలను గుర్తించి ప్రశ్నించగలరని అధికారులు చెబుతున్నారు. అన్నింటా మోసం.. విత్తనాలు కోనుగోలు చేసి పొలంలో వేసుకున్న తరువాత మొలకలు పూర్తిగా రాకపోవడం, తక్కువ శాతం మొలకలు రావడం జరిగితే నాశిరకం విత్తనాలు ఇచ్చి వ్యాపారి తనను మోసం చేశారని రైతులు అనుకుంటారు. ఒక్క విత్తనాలే అనుకుంటే పొరపాటే. విత్తనాలతో పాటు ఎరువులు, పురుగుల మందులు.. ఇలా ప్రతి వ్యాపారంలోనూ మోసాలు జరుగుతుంటాయి. పరిశీలన తప్పనిసరి.. ప్రభుత్వ అనుమతి పొంది వ్యాపారం చేస్తున్న డీలర్ వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. రశీదులు (బిల్లులు) ఇవ్వని దుకాణాల్లో విత్తనాలు కొనుగోలు చేయకపోవడమే మంచిది. కొనుగోలు చేసిన విత్తనాల సంచుల(బ్యాగ్)కు సీల్ వేసి ఉన్నాయో? లేదో? చూసుకోవాలి. సీల్ వేసి ఉన్న సంచులనే కొనుగోలు చేయాలి. సంచులపై కంపెనీ పేరు, తయారీ, గడువు తేదీలు, నికర బరువు, విత్తన రకం, తేమ శాతం.. తదితర అంశాలను సరిచూసుకోవాలి. పొలంలో విత్తనాలు వేసుకున్న తరువాత సంచులను, రశీదులను, సంచులపై ఉన్న సమగ్ర వివరాలను తెలియజేసే పత్రాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. విత్తనాలు కొనుగోలు సమయంలో మోసం జరిగితే వినియోగదారుల చట్టం ప్రకారం పరిహారం పొందేందుకు ఇవే కీలకమవుతాయి. విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి కొనుగోలు చేసేటప్పుడు రశీదు తప్పనిసరినకిలీలను గుర్తిస్తే.. పొలంలో వేసిన విత్తనాలకు మొలకలు రాకపోతే నకిలీ విత్తనాలుగా భావిస్తారు. దిగుబడి పూర్తిగా రాకపోయినా నకిలీ విత్తనాలుగానే భావించవచ్చు. వెంటనే వ్యవసాయ శాఖ ఏఓ, ఏడీ, పోలీసులకు అన్ని రకాల రశీదులతో రైతుకు జరిగిన నష్టాన్ని, విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారో తెలియజేస్తూ ఫిర్యాదు చేసి రశీదు ఉంచుకోవాలి. పంటను పరిశీలించి ధృవీకరించేందుకు శాస్త్రవేత్తలను అధికారులు తీసుకొస్తారు. పోలీసుల, వ్యవసాయాధికారులు ఇచ్చిన నివేదికల మేరకు వినియోగదారుల ఫోరంలో కేసు వేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది. – పైడి లతశ్రీ, మండల వ్యవసాయాధికారి, ఎల్.ఎన్.పేట -
ఎందుకీ తెలుగు ద్వేషం?
తీవ్ర అన్యాయం.. రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమానికి పాతరేసేలా కూటమి ప్రభుత్వం దుందుడుకు చర్యలు చేపడుతోంది. విద్యాశాఖ తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వ బడుల్లో తెలుగు మాధ్యమం లేదంటూ పేర్కొనడం విచారకరం. కూటమి ప్రభుత్వం ఆనాడు చేసిన ప్రకటనలకు ప్రస్తుతం పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం తగదు. – పిపిసి వసంతరావు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్షుడుతెలుగుకు వెలుగేదీ? నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడుకూటమి పార్టీల పెద్దలు, నాయకులు.. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లీషుమీడియం, సీబీఎస్సీ సిలబస్ పట్ల.. అనరాని మాటలు అన్నారు. ఆ వాఖ్యలు, ప్రకటనలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. తీరా అధికారంలోకి వచ్చాక తెలుగు మాధ్యమాన్ని అధఃపాతాలానికి తొక్కేయాలని చూస్తున్నారు. ఇది ఎంతమాత్రం సరికాదు. ప్రభుత్వం తక్షణమే పునరాలోచన చేయాలి. – కూన రంగనాయకులు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శిశ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ బడులలో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ల పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగు మాధ్యమానికి తూట్లు పొడుస్తోందని గత ఐదేళ్లగా అక్కసు వెళ్లగక్కిన కూటమి నాయకులు.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు మాధ్యమానికి మంగళం పాడేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేదంటూ విద్యాశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు కలిపి 2,638 ఉండగా.. అందులో 1,61,151 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్లోనూ తెలుగును ఐచ్ఛికం చేస్తూ.. ఇంటర్మీడియెట్లో సైతం ఇన్నాల్లు తప్పనిసరిగా ఉన్న తెలుగు సబ్జెక్టును.. ఐచ్ఛికం చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి తెలుగు అధ్యాపకులంతా ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్న రోజుల్లో తెలుగు మాధ్యమానికి అన్యాయం చేస్తున్నారని.. తెలుగులోనే బోధన, చదువులు కొనసాగాలని గగ్గోలు పెట్టిన కూటమి పార్టీల పెద్దలు, నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ స్వరం మార్చుకుంటున్నారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ తెలుగుమాధ్యమం లేదంటూ ఉత్తర్వులు ఇవ్వడం పట్ల తెలుగుభాషాభిమానులు, ఏపీ రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లాశాఖ ప్రతినిధులు మండిపడుతున్నారు. నాడు తెలుగుకు అన్యాయం జరగకుండా.. తెలుగు సబ్జెక్టుకు అన్యాయం జరగకుండా.. తెలుగును సబ్జెక్టును తప్పనిసరి చేస్తూనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను తీసుకొచ్చింది. పేద, మధ్య తరగతి పిల్లలు పోటీ ప్రపంచంతో పోటీపడి రాణించాలని ఆనాడు ఇంగ్లీషుమీడియంలో చదువు, సీబీఎస్సీ సిలబస్ అమలు విషయంలో ఎవరెన్ని చెప్పినా ఆనాటి గత సర్కారు వెనక్కి తగ్గలేదు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఐఐటీ, ఎంబీబీఎస్ వంటి కోర్సులను కూడా తెలుగు మాధ్యమంలో బోధించాలని పేర్కొంటే.. రాష్ట్రంలో మాత్రం పాఠశాలల్లో ఆ నిబంధనలను ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. తమిళనాడు, కర్నాటక తదితర రాష్ట్రాలు తమ మాతృభాషకు అగ్రతాంబూలమిస్తుంటే మన రాాష్ట్రంలో మాత్రం మాతృభాషను పట్టించుకునే వారే లేకపోవడం బాధాకరమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా శాఖ అధ్యక్షులు పిసిని వసంతరావు, ప్రధాన కార్యదర్శి కూన రంగనాయకులు, ముఖ్య ప్రతినిధులు పూడి లక్ష్మిపతి, పట్నాన వెంకటరమణ, కుప్పన్నగారి శ్రీనివాసరావు, గోడబ మేరీప్రసాద్, సీహెచ్ జనార్ధన్ తదితరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునర్వ్యవస్థీకరణలో తీవ్ర అన్యాయం.. పాఠశాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 1 నుంచి 8 తరగతులు ఉండే ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు బోధించే ఉపాధ్యాయుల పోస్టులను తీసేయడం తీవ్ర అన్యాయమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులు మండిపడుతున్నారు. 8వ తరగతి తర్వాత రాబోయే పదో తరగతిలో తెలుగు ఉత్తీర్ణత ప్రభావితం కానుందని గుర్తుచేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి పార్టీ నాయకులు మాటలు, ప్రకటనలు విని నిలువునా మోసపోయామని తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉపాధ్యాయులు, లెక్చరర్లు తమ ఆక్రోశం వెల్లగక్కుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. తెలుగుభాష పట్ల గౌరవం ఉంటే తక్షణం పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలి. విద్యార్థుల రేషియో ఆధారంగా బడుల్లో తెలుగు ఉపాధ్యాయులను నియమించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు పొందేందుకు 2% రిజర్వేషన్ కల్పించాలి. డిగ్రీ వరకు తెలుగును ఐచ్ఛికం కాకుండా.. తప్పనిసరి సబ్జెక్టుగా తీసుకురావాలి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ కళాశాల స్థాయి వరకు తెలుగు మాధ్యమంలో విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలి. -
ఆర్టీసీ బస్సు– ఆటో ఢీ
గార: కళింగపట్నం నుంచి బందరువానిపేటకు వెళ్లే రోడ్డులో ఆర్టీసీ బస్సు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్తో సహా 12 మందికి గాయాలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బందరువానిపేటలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది కుందువానిపేట పండగకి వెళ్లి తిరిగి ఇంటికి ఆటోలో బయలుదేరారు. అదే సమయంలో కె.మత్స్యలేశం గ్రామశివారులోని మలుపు వద్ద బందరువానిపేట నుంచి వస్తున్న ఆర్టీసీ బస్ను ఢీకొట్టారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను రెండు అంబులెన్సుల ద్వారా తొలుత కళింగపట్నం పీహెచ్సీకి, అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. వీరిలో గనగళ్ల లక్ష్మీ, దేవిశ్రీ కాలుకు గాయాలవ్వగా.. అప్పారావుకు బలమైన గాయమైంది. డ్రైవర్తో పాటు మరో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. గార ఏఎస్ఐ ఎం.చిరంజీవులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపారు. డ్రైవర్తో సహా 12 మందికి గాయాలు -
9.2 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్ట్
ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్కు 9.2 కిలోల గంజాయి తరలిస్తున్న గమేష్నాయిక్ అనే వ్యక్తిని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్టు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఇచ్ఛాపురం పట్టణ పొలీసులు రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు జరుపుతుండగా గమేష్నాయిక్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతనిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 9.2 కిలోల గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం గేరేగేడి గ్రామానికి చెందిన ఈయన కుటుంబ పోషణకు డబ్బులు చాలక గంజాయి రవాణాకు దిగాడు. కంధమల్ జిల్లా తిలోరి గ్రామానికి చెందిన అజిత్ప్రధాన్, సుభాష్ల వద్ద కిలో గంజాయి రూ.రెండు వేలకు కొని మైసూర్లో బబ్లూకుమార్కు కిలో రూ.పది వేలకు అమ్మడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో గంజాయి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ తనిఖీలలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, సిబ్బంది పాల్గొన్నారు. గడ్డివాములు దగ్ధం కాశీబుగ్గ: పలాస మండలం అమలకుడియా పంచాయతీ పూర్ణభద్ర గ్రామ సమీపంలో గడ్డివాములను గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం తగలబెట్టారు. గ్రామానికి చెందిన కాయల హరికృష్ణతో పాటు మరో రైతుకు చెందిన ఐదెకరాల గడ్డివాములు ఈ ఘటనలో కాలిబూడిదయ్యాయి. పశువులకు ఏడాదిపాటు సరిపడా గడ్డివాములు దగ్ధం కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.సిక్కోలు విద్యార్థులకు షైనింగ్ స్టార్ అవార్డులు బూర్జ/మందస/జలుమూరు: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున షైనింగ్ స్టార్ అవార్డులు అందుకున్నారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన వీరంతా మంగళవారం రాత్రి విజయవాడలో జరిగిన కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి లోకేష్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. అవార్డులు అందుకున్న వారిలో మందస మండలం హరిపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని కంచరాన జ్యోషిత(597), బూర్జ మండలం ఓ.వి.పేట మోడల్ స్కూల్ విద్యార్థి బుడుమూరు ఉదయకిరణ్(593), జలుమూరు మండల కరవంజ మోడల్ స్కూల్ విద్యార్థిని రావాడ హేమశిరీష(592) ఉన్నారు. వీరిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు. -
అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు
నందిగాం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జవాన్ పిన్నింటి దొరబాబు అంత్యక్రియలు స్వగ్రామం పెంటూరులో పోలీస్ లాంఛనాలతో మధ్య ముగిశాయి. మంగళవారం సాయంత్రం నరసన్నపేట వద్ద జాతీయ రహదారి వంతెనపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దొరబాబు మృతి చెందిన విషయం విదితమే. బుధవారం నరసన్నపేటలో పోస్ట్మార్టం అనంతరం స్వగ్రామానికి చేరుకున్న దొరబాబు మృతదేహానికి కుటుంబసభ్యులు, గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి సదానందం తలకొరివి పెట్టగా పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అనంతరం భార్య కాంచనకు జాతీయ పతాకం అందజేశారు. -
ఎండీయూ ఆపరేటర్ల తొలగింపు తగదు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజలకు ఐదేళ్లుగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న ఎండీయూ ఆపరేటర్లను కూటమి ప్రభుత్వం తొలగించడం తగదని ఎండీయూ ఆపరేటర్ల రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ అన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి బుధవారం ఎన్జీవో హోంలో విలేకరులతో మట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,260 మంది ఎండీయూ ఆపరేటర్లు, 9,200 సహాయకులు పనిచేస్తున్నట్లు చెప్పారు. వీరు విధుల్లో చేరిన సమయంలో 72 నెలలు అగ్రిమెంట్ ఉందన్నారు. ప్రస్తుతం మరో రెండేళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం ఉందన్నారు. రాత్రికి రాత్రి ఉన్న ఫలంగా తొలగించడం సబబు కాదన్నారు. ఈ నిర్ణయాల వల్ల 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఒక్కో ఆపరేటర్ 1500 నుంచి 2000 ఇళ్లకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసర సరుకులు అందించారని గుర్తు చేశారు. బ్యాంకుల ద్వారా వాహనాలకు తీసుకున్న రూ.1,90,000 బకాయిలు ఉందని, వీటిని ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తప్పక తొలగించాల్సి వస్తే కార్మిక చట్టం ద్వారా ఆరు నెలలు జీతాలను ముందే చెల్లించాలని, లేనిపక్షంలో ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా ఎండీయూ ఆపరేటర్ల సంఘం ప్రతినిధులు హేమసుందర్, వరహా నర్సింహులు, వెంకట్రావు, అప్పలనాయుడు, రవి, వాసు గోపి, రామారావు పాల్గొన్నారు. -
నా పోర్టు పరిహారం ఏమైంది..?
● టీడీపీ కార్యకర్త ఆవేదన సంతబొమ్మాళి: మూలపేట పోర్టుకు సంబంధించి రెండోసారి ఎకరాకి రూ.12లక్షల 50వేలు చొప్పున ఇచ్చిన పరిహారం ఏమైందంటూ టీడీపీ కార్యకర్త జీరు ధర్మారావు ప్రశ్నించారు. ఆయన బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని తాను వ్యతిరేకించానని, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో భూములు ఇవ్వడానికి సంతకం కూడా చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత స్థానిక టీడీపీ నాయకుల ఒత్తిడి మేరకు చివరలో సంతకం చేశానని అన్నారు. తనకు ఎకరా 30 సెంట్లు భూమి ఉంటే 83 సెంట్లకే రూ. 21లక్షల 25వేలు పరిహారం మొదటి విడతగా ఇచ్చారని తెలిపారు. రెండోవిడతగా 23 టీడీపీ కుటుంబాలకు ఎకరాకి రూ.12లక్షల50వేల పరిహారం ఇచ్చారని, తన పరిహారం ఏమైందని స్థానిక టీడీపీ నాయకులను అడిగితే నీ చెక్కు ఫలానా టీడీపీ నాయకుడి దగ్గర ఉంది తీసుకో అని చెప్పి వాళ్ల ఇళ్ల చుట్టూ పలు దఫాలు తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. టెక్కలి ఆర్డీఓ, నౌపడ ఎస్ఐలను బుధవారం కలిసి తన బాధను చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో పోర్టుకు మన భూములు ఇవ్వద్దు మన భూముల్లో అందరం కలిసి వరినాట్లు వేద్దాం, ధర్నాలు చేద్దామని తన కుటుంబం దగ్గర రూ. 7వేలు చొప్పున తీసుకున్నారని, ఆ డబ్బులు కూడా ఇచ్చి వరి నాట్లు వేశానని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండో విడతగా వచ్చిన పరిహారాన్ని కలెక్టర్ స్పందించి ఇప్పించాలని ధర్మారావు కోరారు. -
శ్రీకాకుళం
ఎందుకీ తెలుగు ద్వేషం?తెలుగు భాషపై ప్రభుత్వ వైఖరిని టీచర్లు దునుమాడుతున్నారు. భాషాభిమానులు కూడా మండిపడుతున్నారు. –8లోసొంతూరికి దూరంగా దాదాపు నాలుగు దశాబ్దాల అజ్ఞాత వాసం ముగిసిపోయింది. ఎంటెక్ చదివినా ఏళ్లకు ఏళ్లు చేసిన అరణ్య వాసం పూర్తయ్యింది. కలాన్ని వదిలి తుపాకీ చేతబట్టిన ఆయన జీవితం ఆ తుపాకీ గుళ్లకే బలైపోయింది. జియ్యన్నపేటలో పుట్టి.. టెక్కలిలో చదివి.. వరంగల్లో ఉన్నత విద్యాభ్యాసానికి వెళ్లి.. ఆపై అడవిలో అన్నగా మారిన నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రస్థానం ముగిసిపోయింది. చత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కేశవరావు హతమయ్యారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కిపడింది. గురువారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2025సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం, పలాస : నలభై ఏళ్ల కిందట ఓ విద్యార్థి అకస్మాత్తుగా ఇంటికి వచ్చి.. తన వాటా ఆస్తి రాసిచ్చేయాలని టీచరైన తండ్రిని కోరారు. ఎందుకని అడిగితే ఆస్తి ఇస్తే.. పేదలకు పంచేస్తా అని చెప్పారు. ఆ విద్యార్థే నంబాళ్ల కేశవరావు. విద్యార్థిగా ఊరి నుంచి, కు టుంబం నుంచి వెళ్లిన కేశవరావు విగతజీవిగా మా రారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు అజ్ఞాత వాసం చేసి అడవిలోనూ ఊపిరి వదిలేశారు. చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో నంబాళ్ల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనతో సిక్కోలు ఉలిక్కి పడింది. నంబాళ్ల స్వగ్రామమైన కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. చిన్నప్పుడు తెలివైన విద్యార్థి, మెరుగైన కబడ్డీ ప్లేయర్గా మన్ననలు అందుకున్న కేశవరావు కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట గ్రామానికి చెందిన నంబాళ్ల వాసుదేవరావు (ఉపాధ్యాయుడు) లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలో ప్రాథమిక విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లో విద్యనభ్యసించారు. టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంపీసీ పూర్తి చేసి 1971 లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ కోర్సులో చేరారు. ఏడాది తర్వాత వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కళాశాలలో చేరారు. ఆ తర్వాత అక్కడే ఎంటెక్లో చేరారు. అటు నుంచి అటే అడవి బాట పట్టారు. కేశవరావు మరణంతో కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం ప్రస్తుతం గుంభనంగా ఉంది. గతంలో ఒకటి రెండు మార్లు కేశవరావుమృతి వదంతులపై కొందరు స్పందించడంతో వారిని పోలీసులు విచారించారు. దీంతో ప్రస్తుతం ఎవరూ బయట పడడం లేదు. ఉద్దానంలో.. నంబాళ్ల కేశవరావు ఎన్కౌంటర్లో మృతి చెందారన్న వార్త ఉద్దానంలో దావానలంలా వ్యాపించింది. టెక్కలికి చెందిన ఆయనకు ఈ ప్రాంతం ఉద్యమాలతో నేరుగా సంబంధం లేకపోయినా ఈ ప్రాంతం మావోయిస్టు కేడరుకు, నాటి పీపుల్స్ వార్ పార్టీ కేడరుకు దిశానిర్దేశం చేసిన వ్యక్తి కావడంతో మృతి వార్తతో ఉద్దానం ఉలిక్కిపడింది. పోలీసు వర్గాలు ముందుగా పలాస మండలం బొడ్డపాడు గ్రామానికి ఈ సమాచారం అందించి మృతదేహాన్ని తీసుకొని రావడానికి ఎవరైనా వెళ్తున్నారా అని అడిగారు. తమ గ్రామానితో ఎలాంటి బంధుత్వం లేదని, రాజకీయ బంధుత్వం మాత్రమే ఉందని వారు చెప్పారు. ఒక నాటి పీపుల్స్ వార్లో, నేటి మావోయిస్టు పార్టీలో పనిచేసి ఈ ఉద్దానం ప్రాంతంలో సుమారు 60మంది వరకు కార్యకర్తలు, నాయకులు పోలీసు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. నంబాళ్ల కేశవరావు మృతితో ఇక నాయకత్వ స్థానాల్లో ఈ జిల్లా నుంచి ఎవరూ లేరనే తెలుస్తోంది. ఆయన మృతదేహం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు, మాజీ మావోయిస్టు నాయకులు బయల్దేరి వెళ్తున్నట్టు ఉద్దానం వాసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్కు ఖండన చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ మఢ్ అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్ను సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు ఖండించారు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. మావోయిస్టు పార్టీ శాంతి చర్చలు కోరినా వాటిని తిరస్కరించి మన దేశపౌరులైన మావోయిస్టులను ఉగ్రవాదులపై దాడుల కన్నా ఎక్కువగా దాడి చేసి దండకారణ్యంలో ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టిండచం అప్రజాస్వామికమని, పౌర సమాజం వీటిపై తీవ్రంగా స్పందించాలని కోరారు. న్యూస్రీల్నారాయణపూర్ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు హతం -
జూన్ 21 వరకు యోగాంధ్ర
అరసవల్లి: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర పేరిట ప్రత్యేక యోగాసనాల కార్యక్రమాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించనున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూన్ 21న ప్రధాని మోదీ విశాఖ రానున్నారని తెలిపారు. ఇక బుధవారం నుంచి గ్రామ స్థాయి, మండల, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకోసం ఒక్కో యోగాట్రైనర్ను నియమిస్తామన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ యోగా మాస్టర్గా తన అనుభవాన్ని వివరించారు. అంతకుముందు జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రముఖులంతా స్వయంగా పాల్గొని యోగాసనాలను వేశారు. అయితే మంగళవారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడంతో బుధవారం ఉదయం భక్తులు దర్శనాలకు ఇబ్బందులు పడ్డారు. అయితే పరిస్థితిని గమనించిన ఆల య అధికార సిబ్బంది శివాలయం మీదుగా దర్శనానికి పంపించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారిఎం.వెంకటేశ్వరరావు, ఆర్డీఓ సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్రావు, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత, యోగా టీచర్లు పాండ్రంకి మురళికృష్ణ, తంగి స్వాతి, ఎ.గాయత్రి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికులతో కాంప్లెక్స్ కిటకిట
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించింది. బుధవారం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అమ్మవారి పండగలు కావడంతో వాటికి హాజరయ్యేందుకు దూరప్రాంతాలు నుంచి ప్ర యాణికులు రాకపోకలు సాగించారు. అయితే రద్దీకి తగ్గట్టు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రధానంగా సాలూరులో అమ్మవారి పండగలు జరుగుతుండడంతో అక్కడకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి సగానికి పైగా బస్సులు వెళ్లిపోవడంతో స్థానికంగా కొరత ఏర్పడింది. కొత్తూరు, బత్తిలి, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం తదితర సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో విపరీతమైన రద్దీ కనిపించింది. -
రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి
● రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి మృతి ● పెంటూరులో విషాదఛాయలు నరసన్నపేట: సత్యవరంలో జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వంతెనపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగి పిన్నింటి దొరబాబు(38) మృతి చెందారు. శ్రీకాకుళం మండలంలోని ఓ గ్రామంలో అమ్మవారి పండగలకు వెళ్లి స్వగ్రామం నందిగాం మండలం పెంటూరుకు ద్విచక్ర వాహనంపై మామయ్య సనపల సీతారాంతో కలిసి అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే దొరబాబు మృతి చెందగా.. సీతారాంకు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్లో నరసన్నపేట ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు.మూడు రోజుల్లో విధుల్లోకి..దొరబాబు అస్సాం రైఫిల్ విభాగంలో పదేళ్లుగా పనిచేస్తున్నారు. బంధువుల కుమార్తె పెళ్లికి వారం రోజులు సెలవుపై వచ్చారు. వివాహ వేడుక రెండు రోజుల కిందటే కాగా, శ్రీకాకుళంలో బంధువుల ఇంట్లో అమ్మవారి పండగలకు వెళ్లారు. మరో మూడు రోజుల్లో తిరిగి విధుల్లో చేరాల్సి ఉంది. ఇంతలో మృత్యువు వెంటాడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దొరబాబుకు భార్య కాంచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇవేం ‘పనులు’!
● ఉపాధి కూలీలు చేసిన పనులకే కొత్తగా మళ్లీ ప్రతిపాదనలు ● సాగునీటి సంఘాల పేరుతో అక్రమాలకు దిగిన కూటమి నాయకులు ● ఆమదాలవలసలో కొనసాగుతున్న అధికార పార్టీ దందా ఆమదాలవలస రూరల్: కూటమి పాలనలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. అక్రమ సంపాదనకు ఎంతకై నా వెనుకాడరని ఉపాధి హామీ పథకం, నీటిపారుదల శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ఆమదాలవలస మండలంలో ఉపాధి హామీ వేతనదారులు చేసిన పనులకే మళ్లీ నీటిపారుదల శాఖ ద్వారా కొత్తగా ప్రతిపాదనలు చేసి అరకొరగా మెరుగులు దిద్ది అక్రమాలకు పాల్పడటం విమర్శలకు తావిస్తోంది. మండలంలోని నారాయణపురం ఎడమ కాలువ ద్వారా జంబోదీపం నుంచి దూసి వరకు పిల్ల కాలువలో ఇటీవల ఉపాధి పనులు చేపట్టారు. కలివరం, దూసి పంచాయతీలకు చెందిన ఉపాధి వేతనదారులు ఈ పనుల్లో పాల్గొన్నారు. ఈ పనులు చేసేందుకు మూడు బిట్లుగా విభజించి ఒక్కో బిట్కు సుమారు రూ.8.5 లక్షల చొప్పున ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి సుమారు రూ.20 లక్షలు వరకు ఉపాధి కూలీలకు వేతనాలు కింద వారి ఖాతాల్లో జమ చేశారు. పట్టుమని నెల రోజులు గడవ ముందే నీటిపారుదల శాఖ ద్వారా సుమారు రూ.10 లక్షలు వరకు అంచనాలు తయారు చేయించారు. అదే కాలువలో కూటమి కాంట్రాక్టర్లు సాగునీటి సంఘాల పేరుతో జేసీబీతో పనులు చేయిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇక్కడే కాకుండా, మండలంలో పలు చెరువుల వద్ద కూడా ఇదే తరహాలో అక్రమాలు జరుగుతున్నాయి. ఉపాధి నిధులు దుర్వినియోగం.. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేసిన ఉపాధి నిధులు కూటమి నాయకులు దుర్వినియోగం చేస్తున్నారు. ఆమదాలవలస మండలంలోని రామచంద్రపురం, కొల్లివలస, చిట్టివలస, కలివరం తదితర గ్రామాల్లో అవసరం లేని చోట పనులు ప్రతిపాదన చేయటమే కాకుండా నాయకులు సొంత స్థలాలకు, పంట పొలాలకు కూడా రహదారులు వేయించుకుంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి మండలంలో ఉపాధి పనులు చేసిన చోట కొత్త ప్రతిపాదనలు రద్దు చేయటమే కాకుండా ఉపాధి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. మాకు సంబంధం లేదు.. మండలంలోని జంబోదీపం పిల్ల కాలువ పనులతో పాటు అనేక చోట్ల ఉపాధి కూలీలు చేసిన పనులకే సాగునీటి సంఘాలు ద్వారా కొత్త ప్రతిపాదనలు రావడంపై ఏపీఓ ఎం.అప్పలనరసమ్మ వద్ద ప్రస్తావించగా మండలంలో అన్ని సాగునీటి కాలువల పనులు చేసి కూలీలకు వేతనాలు కూడా చెల్లించామని చెప్పారు. ఇప్పుడు అదే చోట పనులుకు ప్రతిపాదనలకు రావడం మాకు సంబంధం లేదని, మా శాఖ ద్వారా చేసిన పనుల వివరాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు అందించామని చెప్పారుఅక్రమాలు అడ్డుకోవాలి.. అధికార పార్టీ నాయకుల అక్రమాలకు అడ్డుకట్టు లేకుండా పోయింది. నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలో ఉపాధి నిధులు దారి మళ్లిస్తున్నారు. ఉపాధి కూలీలు చేసిన పనులకు మరలా కొత్త ప్రతిపాదనలు చేసి బిల్లులు పొందుతుండటం దారుణమన్నారు. అధికార పార్టీ నాయకులు సొంత స్థలాలకు, పంట పొలాలకు రహదారులు అక్రమంగా వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. దీనిపై కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశాం. – చింతాడ రవికుమార్, వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త -
సముద్రంలో వ్యక్తి గల్లంతు
రణస్థలం : మెంటాడ పంచాయతీ దోనిపేట వద్ద సముద్రంలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. సరదాకు స్నానానికి వెళ్లి ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రణస్థలం మండలం నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి సంతోష్ (31), ఆళ్ల సూర్యనారాయణ, నీలాపు రమణ కలిసి కందివలస గెడ్డలో స్నానానికి వెళ్లారు. అక్కడ నీరు బాగోలేదని సమీపంలోని దోనిపేటలో సముద్ర స్నానానికి దిగారు. కెరటాల ఉద్ధృతికి తొలుత నీలాపు రమణ మునిగిపోతుండగా గమనించిన సూర్యనారాయణ, సంతోష్లు కాపాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సూర్యనారాయణ, రమణ ఒడ్డుకు చేరుకున్నా సంతోష్ మాత్రం మునిగిపోయాడు. చాలాసేపు వెతికినా సంతోష్ జాడ కానరాకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించారు. జె.ఆర్.పురం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి వెళ్లి గాలించినా సంతోష్ ఆచూకీ దొరకలేదు. సంతోష్కు భార్య భవాని, ఇద్దరు కుమారులు సిద్దార్ధ, హర్షవర్దన్ ఉన్నారు. పెద్ద కుమారుడు సంతోష్ గల్లంతయ్యాడని తెలిసి తల్లిదండ్రులు రాము, సరస్వతి, భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి గతంలో పైడిభీమవరం డాక్టర్ రెడ్డీస్లో కెమిస్ట్గా పని చేసి హైదరాబాద్ వెళ్లాడు. మళ్లీ స్థానిక పరిశ్రమల్లోనే ఉద్యోగం సాద్ధిద్దామనే ఉద్దేశంతో నెల రోజుల కిందట గ్రామానికి వచ్చి ఇంటి వద్దనే ఉంటున్నాడు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన బైపీసీ స్ట్రీం పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీఈఏపీ సెట్ –2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన పరీక్షలు సెలవు రోజుల్లో మినహా 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఎచ్చెర్ల మండల పరిధిలో రెండు కేంద్రాల్లో మంగళవారం పరీక్షలు జరిగాయి. బైపీసీ స్ట్రీం పరీక్షలు ముగియగా, ఎంపీసీ స్ట్రీం పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభంకానున్నాయి. చిలకపాలెంలోని శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో మొదటి షిఫ్టులో 280 మందికి 256 మంది, రెండో షిఫ్టులో 280 మందికి 255 మంది, ఎచ్చెర్ల వెంకటేశ్వరా ఇంజినీరింగ్ కాలేజ్లో మొదటి షిఫ్టులో 171 మందికి 159 మంది, రెండో షిఫ్టులో 170 మందికి 160 మంది పరీక్షకు హాజరయ్యారు. -
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ పథకంలో పనిచేస్తున్న కెప్టెనన్(డ్రైవర్లు)ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ వద్ద సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, దశరథ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలకు సైతం సురక్షితంగా తల్లీబిడ్డలను చేర్చుతున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని కోరారు. వాహనాల సంఖ్యను బట్టి అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య,టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, సిబ్బంది కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, ఎల్.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్, ఎస్.రాజశేఖర్, బి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎండీయూ వాహనాల రద్దు అన్యాయం’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో బండిలో ఉన్న కంప్యూటర్ కాటా సర్వీస్ ఇంజినీర్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఇంజినీర్ బి.అనంతకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినా డ, ఒంగోలు, ఏలూరు తదితర జిల్లాలకు ఎంవిఆర్ టెక్నాలజీ తరఫున నాలుగేళ్లుగా పనిచేస్తున్న తమ బతుకుల్లో నీళ్లు చల్లడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో కుటుంబాలతో రోడ్డున పడతామన్నారు. అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రి మరోమారు ఆలోచన చేయాలని కోరారు. చిత్తడి నేలల్లో జీవ వైవిధ్యం సోంపేట: సోంపేట ప్రాంతంలోని చిత్తడినేలల్లో వెలకట్టలేని జీవవైవిధ్యం ఉందని పర్యావరణ పరిరక్షణ సంఘ అధ్యక్షుడు డాక్టర్ యారడి కృష్ణమూర్తి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం సందర్భంగా సోంపేట చిత్తడి నేలల జీవవైవిధ్యంపై ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని లోకానాథేశ్వర కళాసీ సంఘ భవనంలో మంగళవారం నిర్వహించారు. అంతరించిపోతున్న పక్షులు, సీతాకోక చిలుకలు, మత్స్య సంపద, వివిధ రకాల పాములు, మత్స్యకారులు, రైతుల జీవన విధానం ఫొటో లు పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ సోంపేట మండలంలోని చిత్తడి నేలలు మానవాళికి వెలకట్టలేని సంపద అని అన్నారు. ఈ నేలలను రక్షించుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ సంఘం, మత్స్యకార ఐక్యవేదిక నాయకులు బార్ల సుందరరావు, నాగు, కోదండ, గంగాదర్ తదితరులు పాల్గొన్నారు. పక్కాగా సర్వే చేపట్టాలి నరసన్నపేట: గ్రామాల్లో భూముల రీసర్వేను పక్కాగా చేపట్టాలని సర్వే విభాగం డిప్యూటీ డైరెక్టర్ (విజయవాడ) డీఎల్డీఎల్ కుమార్ సూచించారు. మండలంలోని నడగాంలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. సర్వే జరుగుతున్న తీరుపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. డీటీ కృష్ణారావు మాట్లాడుతూ నడగాంలో 1,679 ఎకరాలు ఉన్నాయన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా సర్వే చేయాలని, తప్పులు ఉండకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల సర్వేయర్ అప్పలస్వామి పాల్గొన్నారు. ‘తెలుగు మీడియం లేకుంటే ఎలా?’ శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా దేశం అంతటా మాతృభాషలకు ప్రాధాన్యత పెంచుతూ ఉంటే తెలు గు రాష్ట్రంలో మాత్రం తెలుగుభాషకు మంగళం పాడేటట్టుగా ఇక్కడ పాలకులు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారని ఎస్టీయూ జిల్లా అధ్యక్షు డు ఎస్వీ రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ ఆరోపించారు. ఏ భాషలో చదువుకోవాలన్నది విద్యార్థి ఇష్టమని.. తెలుగు రాష్ట్రంలో తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నా రు. ఈ మేరకు మంగళవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. మాతృభాషలో చదివితే పిల్లల సృజనాత్మకత పెరుగుతుందని, మనో వికాసం అభివృద్ధి చెందుతుందని ఎన్నో పరిశోధనలు నిరూపిస్తున్నప్పటికీ మన తెలుగు రా ష్ట్రంలో మాత్రం తెలుగు మీడియం లేకపోవ డం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంగ్లిష్తో పాటు తెలుగు మీడి యం కూడా సమాంతరంగా ఉండటం వల్ల ఎక్కువ టీచర్ పోస్టులు నియమించాల్సి వ స్తుందని.. తద్వారా ఆర్థిక భారం పెరుగుతుందని భావించి, పాలకవర్గం ఒక్క ఇంగ్లిష్ మీడియంను మాత్రమే కొనసాగిస్తూ తెలుగు మీడియంను అటకెక్కించే కార్యాచరణ చేస్తుందని ఇది ఎంత మాత్రం తగదని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియం కచ్చితంగా ఉండేలా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుబాటులోకి సీటీ స్కాన్ సేవలు టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రిలో సోమవారం సీటీ స్కాన్ సేవలకు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. మంగళవారం మరమ్మతులు నిర్వహించి మళ్లీ సీటీ స్కాన్ సేవలను రోగులకు అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు అక్కడి సిబ్బంది తెలిపారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ‘ఐవీఆర్ఎస్ ద్వారా ప్రభు త్వం నుంచి ప్రజలకు నేరుగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ప్రభుత్వ సేవలపై ప్రజలు ఇచ్చే సమాధానం విలువ కలిగి ఉంటుంది. అందుకే ప్రతి శాఖ బాధ్యతతో స్పందించాలి’ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించి జిల్లా అభివృద్ధిపై ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి విస్తృత స్థాయిలో సమీక్ష నిర్వహించారు. ● జిల్లాలో ఇప్పటివరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా 61,048 ప్రజా ఫిర్యాదులు నమోదుకాగా, వాటిలో 343 ఫిర్యాదులు గడువు మించాయని కలెక్టర్ పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ శాఖల్లో పెండింగ్ సమస్యలు అ ధికంగా ఉన్నాయని, పరిష్కరించాలన్నారు. ● మండలాల వారీగా ఉపాధి పనుల పురోగతిలో తేడాలు కనిపిస్తున్నాయని, కొన్ని మండలాల్లో 90 శాతం పనులు పూర్తవుతుండగా మరికొన్నింటిలో 50 శాతం కూడా చేరలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ● రెవెన్యూకు సంబంధించి 22(ఎ) రికార్డుల స్వ చ్ఛీకరణ, వివిధ శాఖలతో పెండింగ్లో ఉన్న భూ సమస్యల స్థితిగతులు, ముఖ్యంగా వంశధార నదిపై హై లెవల్ బ్రిడ్జి నువ్వలరేవు–మచినీళ్లపేట రహదారి నిర్మాణాలకు సంబంధించిన అడ్డంకులపై చర్చించారు. లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో యూనివర్సిటీ స్థాపనకు 30–40 ఎకరాలు, హైడ్రో కార్బన్ కంపెనీ స్థాపనకు 2000 ఎకరాల భూమిని గుర్తించాలని, అలాగే ఏపీఐఐసీ భూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణా, నియంత్రణ లేని గ్రానైట్ తవ్వకాలపై కలెక్టర్ స్పందించారు. జిల్లా మైనింగ్ శాఖ కలిసి వచ్చి అక్రమ మైనింగ్ను గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ● జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆయుష్ శాఖ, అరసవల్లి ఎండోమెంట్ అధికారి సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమగ్ర సమీక్ష -
జెడ్పీలో పదోన్నతులు
శ్రీకాకుళం అర్బన్: జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ తన అధికార నివాసమైన జెడ్పీ బంగ్లాలో ఐదుగురు సీనియర్ సహాయకులకు అడ్మినిస్ట్రేటివ్ అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ మంగళవారం నియామక ఉత్తర్వుల పత్రాలను సంబంధిత ఉద్యోగులకు అందజేశారు. సంతబొమ్మాళి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు డి.నరసింగరావును పదోన్నతిపై సంతబొమ్మాళిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీ సర్గా నియమించారు. అలాగే హిరమండలం మండల ప్రజాపరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు ఎన్.సోమశేఖర్ను పదోన్నతిపై వంగర మండలంలోని ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అదేవిధంగా కొత్తూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ సీనియర్ సహాయకులు ఎ.మార్కండేయరావును పదోన్నతిపై రణస్థలం మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అదేవిధంగా శ్రీకాకుళంలోని జిల్లా ప్రజాపరిషత్ సీనియర్ సహాయకులు కె.ఉమామహేశ్వరరావును పదోన్నతిపై శ్రీకాకుళంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. అలాగే ఎస్సీఎస్సీఎస్ లిమిటెడ్లో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న జి.మధుసూధనరావును పదోన్నతిపై పొందూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించారు. కార్యక్రమములో జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వీ శ్రీధర్రాజా, జెడ్పీ డిప్యూటీ సీఈఓ డి.సత్యనారాయణ, జెడ్పీ సి–సెక్షన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమేష్, సి–సెక్షన్ సిబ్బంది, పదోన్నతులు పొందిన ఉద్యోగులు పాల్గొన్నారు. -
రోడ్డున పడనున్న ఎండీయూ ఆపరేటర్లు
వీధివీధితోనూ ఐదేళ్లుగా అనుబంధం పెనవేసుకున్న రేషన్ బళ్లు ఆగిపోనున్నాయి. సామాన్యుడి ఇంటి వద్దకే వచ్చి సరుకులు అందించిన ఈ వాహనాలను కూటమి సర్కారు రద్దు చేసింది. ఇక రేషన్ కోసం డిపో ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇప్పటికే వలంటీర్లను తీసేయడంతో పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు.. రేషన్ బళ్ల రద్దుతో మళ్లీ పాత విధానంలో రేషన్ డీలర్ల ముందు నిలబడక తప్పదు. ● ఎండీయూ వాహనాలను రద్దు చేసిన ప్రభుత్వం ● ఇకపై డిపోల వద్దే సరుకులు తీసుకోవాలని ఆదేశం ● వలంటీర్లను తీసేయడంతో ఇప్పటికే నిలిచిపోయిన ఇంటింటికీ సేవలు ● తాజాగా సరుకుల పంపిణీకి బ్రేక్ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రేషన్ సరుకులు ఇక ఇంటికి రావు. ప్రభుత్వ సేవలు ‘ప్రజల వద్దకు’ ఇక చేరవు. వలంటీర్లను తీసేసి ‘పేదోడి సేవ’ తమ పద్ధతి కాదని సంకేతాలు ఇచ్చిన కూటమి సర్కారు.. ఇప్పుడు రేషన్ వాహనాలను రద్దు చేసి తన అజెండాలో పేదవాళ్లు లేరని స్పష్టం చేసేసింది. ఐదేళ్లుగా సేవలు అందించిన రేషన్ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. వాటిపై ఆధారపడి జీవిస్తున్న బతుకులు కూడా పో తాయి. ఈ నిర్ణయంతో చంద్రబాబు నైజమేంటో మరోసారి ప్రజలకు తెలుస్తోందని రాజకీయ వేత్తలు అంటున్నారు. ఇంటింటికీ సేవలు నిలిపివేత కూటమి ప్రభుత్వం సంక్షేమాన్నే కాదు ప్రజలకు ఇవ్వాల్సిన సేవలను కూడా వదిలేస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. సేవలు అందుకోవడం ప్రజల హక్కు అని భావించి.. సామాన్యుడి ఇంటి వద్దకే అనేక సేవలు అందజేసింది. వలంటీర్ల ద్వారా ప్రజలకు ఏం అవసరమో గుర్తించి, వాటిని నేరుగా అందజేసింది. సంక్షేమ పథకాలతో పాటు అధికారిక సేవలను ఇంటి చెంతకే చేర్చింది. 15వేల మందికి పైగా వలంటీర్ల ద్వారా ప్రజలకు 539 సేవలు అందించింది. రేషన్ అందించడం కోసం వాహనాలను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి చూపించింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చీ రావడంతోనే వలంటీర్ వ్యవస్థను తీసేసింది. ఫలితంగా ప్రతి పౌర సేవకు ప్రజలు మళ్లీ అధికారుల చుట్టూ తిరగడం తప్పనిసరైంది. ఇప్పుడు రేషన్ వాహనాలను కూడా రద్దు చేయడంతో వాహన డ్రైవర్లు ఉపాధి కోల్పోవడమే కాకుండా.. ప్రజలకు మళ్లీ పాత కష్టాలు మొదలు కానున్నాయి. ఇప్పటికే సర్కారు రేషన్ కోత పెట్టింది. కార్డుదారులందరికీ రేషన్ ఇవ్వడం లేదు. బియ్యంలో భారీగా కోత పెట్టడంతో అందరికీ అందడం లేదు. ఇక, కందిపప్పు, పంచదార ఊసేలేదు. ఆ రెండు సరుకులను అటకెక్కించింది. చంద్రబాబు మార్క్ కష్టాలు హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం చంద్రబాబుకు పరిపాటి. తాజాగా ఇంటింటికి సరుకులు అందించే ఎండీయూ వాహనాలను రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతిలో సరుకులు ఇస్తామని ప్రకటించారు.జిల్లాలో 3129 గ్రామాలు ఉన్నాయి. వాటిలో 6,60,7430 కార్డుదారులు ఉన్నారు. వారందరికీ 10,670మెట్రిక్ టన్నుల మేర రేషన్ను పంపిణీ చేయాలి. దానికోసం వైఎస్ జగన్ ప్రభుత్వం 422 ఎండీయూ వాహనాలను పెట్టి ఇంటింటికి స రుకులు పంపిణీ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడా వాహనాల భారాన్ని భరించలేక ఏకంగా రద్దు చేసేసి పాత పద్ధతిలో పంపిణీ చేస్తామంటోంది. అంటే ప్రజలు రేషన్ డిపోల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. జిల్లాలో ఎండీయూ వాహనాలపై ఆపరేటర్లతో పాటు సిబ్బంది ఆధారపడి ఉన్నారు. ఒక్కో వాహనానికి నెలకి రూ. 18వేల వరకు వచ్చేది. 1500నుంచి 2000 ఇళ్ల వరకు సరుకులు నేరుగా పంపిణీ చేసేవారు. వీరంతా ఇప్పుడు రోడ్డున పడాల్సిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారి భవిష్యత్ ఆగమ్య గోచరమైంది. వాస్తవంగా ప్రభుత్వంతో చేసుకున్న అగ్రిమెంట్ గడువు ఉంది. కానీ, ఉన్న ఫలంగా వాహనాలను ఆపేయడంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది. వారంతా ఆందోళన చెందుతున్నారు. రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నారు. -
కండల ప్రదర్శనలో కుర్రకారు జోరు
శ్రీకాకుళం క్రైమ్ : అమ్మవారి ఉత్సవాలతో సందడిగా గడుపుతున్న కుటుంబానికి పిడుగుపాటు తీరని శోకం మిగిల్చింది. జిల్లా కేంద్రంలో నాగావళి నదీ తీరాన మంగళవారం పిడుగు పడడంతో గేదెల రాజారావు (55) మృత్యువాత పడగా.. ఆయన కుమారుడు నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ధాటికి మరో ఇద్దరు కూడా స్వల్పంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని బలగ బూబమ్మ నగర్ లో గేదెల రాజారావు తన భార్య, కుమారుడు నాగార్జునతో కలిసి నివసిస్తున్నారు. మంగళవారం భద్రమ్మ తల్లి వారాల సంబరాలుండటంతో ఉదయాన్నే రాజారావు కుటుంబీకులు గొర్రెపోతును చూపించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గొర్రె పొట్టు మాంసం కడిగేందుకు గుడికి కిలోమీటరు దూరంలో ఉన్న నాగావళి నదీ తీరానికి తండ్రీకొడుకులు వెళ్లారు. వీరికి ఓ రెండు మీటర్ల దూరంలో బుచ్చిపేటకు చెందిన దేళెళ్ల రాజారావు, భైరి రామారావు మరికొందరు కూడా పొట్టు శుభ్రం చేయడానికి వచ్చారు. వీరు పనిలో ఉండగా వర్షం మొదలైంది. సరిగ్గా 7:40 గంటలకు పెను శబ్దంతో పిడుగు పడడంతో రాజారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాగార్జునకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వీరికి సమీపంలో ఉన్న మరో ఇద్దరికి కాలిన గాయాల య్యాయి. భద్రమ్మ గుడి సిబ్బందికి సైతం పిడుగు శబ్దం వినిపించడంతో స్థానికులతో కలసి ఘటనా స్థలికి వచ్చి చూశారు. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి క్షతగాత్రులను రిమ్స్లో చేర్పించారు. గత 70 ఏళ్లుగా వారాలు జరుగుతున్నా ఏ సందర్భంలోనూ ఇలా ఉదయం పూట వర్షాలు పడలేదని స్థానికులు చెప్పారు. అనంతరం రిమ్స్కు చేరిన రెండో పట్టణ ఎస్ఐ–2 రామారావు క్షతగాత్రు లను, మార్చురీలో మృతదేహాన్ని పరిశీలించడమే కాక ఘటనాస్థలికి స్థానిక వీఆర్వోతో కలిసి వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామారావు చెప్పారు. భారీ వర్షాలతో పాటు అత్యధికంగా పిడుగులు పడతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ గత రెండురోజులుగా హెచ్చరిస్తూనే ఉంది. మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాల్లో బయటకు వెళ్లకపోవమే మంచిదని రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు ప్రజలను కోరారు. శ్రీకాకుళం న్యూకాలనీ: కుర్రకారు కండల ప్రదర్శనలు కోలాహలంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో మంగళవారం ఉత్తరాంధ్ర జోనల్స్థాయి బాడీబిల్డింగ్ చాంపియన్షిప్–2025 పోటీలు కన్నులపండువలా జరిగాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఈ శరీర సౌష్టవ పో రులో అండర్– 50 నుంచి 85 కేజీల విభాగం, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో పో టీల ప్రదర్శనలో కుర్రకారు జోరు ప్రదర్శించారు. స్టార్ బాడీబిల్డింగ్ అసోసియేషన్ నిర్వహణ కమిటీ ముఖ్య ప్రతినిధులు వి.విజయ్కుమార్, బి.ప్రసాద్ నేతృత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 80 మంది వరకు క్రీడాకారులు హాజరయ్యారు. శ్రీకాకుళానికి చెందిన దివ్యాంగ బాడీబిల్డర్ తుపాకుల అనీల్కుమార్ విశేషంగా ఆకట్టుకున్నాడు. జాతీయ పోటీలకు వెళ్లేందుకు అవసరమైన సాయాన్ని అందిస్తామని రిఫరీలు భరోసా ఇచ్చారు. పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం మండలంలోని కలివరంలో మంగళవారం పిడుగు పడడంతో కొబ్బరి చెట్టు దగ్ధమైంది. జన నివాసాల నడుమ ఈ పిడుగు పడటంతో జనం భయాందోళన చెందారు. అంతే కాకుండా పలువురు ఇళ్లకు సంబంధించి ఇంటిగోడలు కూడా చిన్న చిన్న గా బీటలు బారాయి. దీంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. గ్రామంలో అనేక మంది ఇళ్లకు సంబంధించి కరెంట్ ఇన్వెర్టర్లు, తదితర విద్యుత్ సామగ్రి కూడా దెబ్బతింది. ఒక్కసారిగా నివాస గృహాల నడుమ పిడుగు పడటంతో గ్రామంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. – ఆమదాలవలస రూరల్ జిల్లా కేంద్రంలో నాగావళీ నదీ తీరాన పిడుగుపాటు ఘటనా స్థలంలోనే తండ్రి మృతి.. కుమారుడికి తీవ్ర గాయాలు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు -
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధ తెలియకూడదనేనా.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్చైర్లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డయాలసిస్ కేంద్రం ప్రారంభం
ఇచ్ఛాపురం టౌన్ : ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి ఆవరణలో కిడ్నీ రోగుల కోసం వైఎస్సార్సీసీ ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రారంభించారు. డయాలసిస్ గదితో పాటు తాగునీటి ఆర్ఓ ప్లాంట్, స్టెమీ యూనిట్, అత్యవసర రోగుల యూనిట్, ల్యాబ్లను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం గత వైఎస్సార్ సీపీ పాలనలోనే రూ.ఏడు వందల కోట్లతో తాగునీటి పథకం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డీసీహెచ్ కళ్యాణ్ బాబు మాట్లాడుతూ హెచ్ఐవీ రోగులకు ఇప్పటి వరకు విశాఖ కేజీహెచ్లోనే ప్రత్యేక వైద్యసేవలు అందించే వారని, ఇకపై ఇచ్ఛాపురంలోనూ సేవలు అందిచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కవిటిలో డయాలసిస్ కోసం 20 బెడ్లు, సోంపేటలో 19 ఉండగా అదనంగా మరో 3 బెడ్లు పెంచినట్లు చెప్పారు. పలాసలో 20 బెడ్లు ఉండగా మరో 10 పెంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ దేవేంద్ర రెడ్డి, దాసరి రాజు, ఎన్.కోటి, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్లపై దాడి
నందిగాం: మండలంలోని పెద్దతామరాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి అలజడి నెలకొంది. లారీలు ఆపి నిద్రిస్తున్న డ్రైవర్లుపై కొంతమంది దాడి చేసి అలజడి సృష్టించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన సుజిత్కుమార్రాయ్, అమర్జీత్ చౌహాన్, పురుషోత్తంసింగ్, విజయ్కుమార్ యాదవ్లు చైన్నె నుంచి కోలకత్తా మార్గంలో వెళ్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు నందిగాం మండలం పెద్దతామరాపల్లి వద్ద ఉన్న డాబా వద్ద ఆగారు. లారీలను సర్వీస్ రోడ్డువైపు పార్కింగ్ చేసి భోజనాలు అనంతరం తమ లారీల్లో నిద్రపోయారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఐదుగురు వ్యక్తులు మొదటగా విజయ్కుమార్ యాదవ్ను లేపి కత్తి చూపించి బెదిరించారు. సకాలంలో అప్రమత్తమైన విజయ్కుమార్ ఒక్కసారిగా లారీ స్టార్ట్ చేసి వెళ్లిపోయాడు. తర్వాత సుజిత్కుమార్ రాయ్, అమర్జీత్ చౌహాన్, పురుషోత్తం సింగ్లను లేపి రాళ్లతో లారీ అద్దాలు పగులగొట్టి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా కొట్టి కత్తితో బెదిరించి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, రూ.28వేలు నగదు లాక్కొని తామరాపల్లి వైపు పొలాల గుండా వెళ్లిపోయారు. అనంతరం డ్రైవర్లు కేకలు వేయడంతో డాబా సిబ్బంది వచ్చి గాయాల పాలైన వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించారు. దాడి లో పాల్గోన్న వారంతా తెలుగు, హిందీ మాట్లాడుతున్నారని, అందరూ 30 ఏళ్లలోపు వారేనని బాధితులు చెబుతున్నారు. అనంతరం నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. నగదు, సెల్ఫోన్లతో పరారైన దుండగులు పెద్ద తామరాపల్లిలో అర్ధరాత్రి అలజడి వాహనదారుడినీ వదల్లేదు.. నందిగాం: సుభద్రాపురం సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బైక్పై వస్తున్న ఓ వ్యక్తి మూత్ర విసర్జన కోసం బైక్ ఆపి ఉండగా కొంతమంది దాడి చేశారు. తన వద్ద ఉన్న డబ్బులు తీసుకొని వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పెట్రోల్ అపహరణ.. నందిగాం మండలంలోని సుభద్రాపురం పరిధి గుండా వెళ్తున్న ఐఓసీఎల్ పైపులైన్ నుంచి కొంత మంది పెట్రోల్ దొంగతనం చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. పైపులైన్కు ఉండే ఓపెన్లో చిన్న పాటి మోటార్ ఇంజన్ పెట్టి పెట్రోల్ తోడేసినట్లు తెలుస్తోంది. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు అందగా హెచ్సీ రమణ కేసు నమోదు చేశారు. గతంలో కాశీరాజుకాశీపురం వద్ద ఇలాగే పెట్రోల్ చోరీ జరిగినట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే నందిగాం మండలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక శాంతిభద్రతలు ఘోరంగా వైఫల్యం చెందాయని, లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ తీరుకు తాజా ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 75 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి 75 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఏపీ హౌసింగ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణాభివృద్ధి, వాటర్ రిసోర్సెస్, ఎడ్యుకేషన్, వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించి.. పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్ రాజా, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ గ్రీవెన్స్కు 50 వినతులు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/శ్రీకాకుళం క్రైమ్ : ప్రజా ఫిర్యాదులకు ప్రాధాన్యమిస్తూ జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. 50 మంది నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ● పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి అంబుసోలిలో వాయలపల్లి మనీషా, శ్రీనివాసులుకు వారి బంధువులకు చిన్న తగాదా జరిగిందని, ఈ విషయమై స్టేషన్కు వెళ్లే అక్కడ సీఐ కులంపేరుతో దూషించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫిర్యాదు చేశారు. బందువుల మధ్య వ్యక్తిగతమైన గొడవల్ని రాజకీయం చేసి వారిపై కేసులు బనాయించడం దారుణమన్నారు. ఎస్సీ సెల్ పలాస నియోజకవర్గ అధ్యక్షుడు లక్ష్మణరావు అక్కడ లేనప్పటికి అన్యాయంగా కేసు బుక్చేయడం అన్యాయమన్నారు. ఈ విషయంలో పోలీసులపై సరైన చర్యలు తీసుకోవాలని, లేదంటే ప్రతి శుక్రవారం పలాస ఎస్పీ వచ్చిప్పుడు కలిసి విన్నవిస్తామన్నారు. అప్పటికి న్యాయం జరగకుంటే దళితులకు న్యాయం జరిగేవరకు ఎంత దూరమైనా వెల్తామని వెనక్కి తగ్గభోమని స్పష్టం చేశారు. -
98 ఏళ్ల వృద్ధుడు అదృశ్యం
కాశీబుగ్గ: పలాస మండలం పెదంచల పంచాయతీ మరదరాజపురం గ్రామానికి చెందిన 98 ఏళ్ల వృద్ధుడు నర్సింగ పండా (98) కనిపించడం లేదని కుమారుడు జగన్నాథ పండా సోమవారం కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేషన్ డీలర్గా పనిచేస్తున్న నర్సింగ పండా షుగర్ బాధపడుతున్నారు. సమయానికి భోజనం పెట్టలేదని భార్య జయంతి పండాపై కోపంతో ఈ నెల 12న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. పరిసర ప్రాంతాలు, బంధువులు ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలు తెలిస్తే 94937 90587 నంబర్కు తెలియజేయాలని కోరారు. -
చెరువు.. రక్షణ కరువు!
కొత్త కర్ర (తమ్మయ్య) చెరువులో.. బొడ్డవలస రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 44/2ఏలో 6.92 ఎకరాల విస్తీర్ణంలో కొత్తకర్ర చెరువు ఉంది. దీంట్లో కొందరు రైతులు గతంలోనే పొలాలుగా మార్చి ఆక్రమణలకు పాల్పడ్డారు. తాజాగా ప్రశాంతనగర్ వైపు నుంచి ఆక్రమణలు జోరందుకున్నాయి. ముందుగా వ్యర్థాలు చెరువులో వేసి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కొందరు చెరువు గర్భంలో కంచెలు పెట్టి చీరలు హద్దులుగా పెట్టడం గమనార్హం. ఆ స్థలంలో భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరికొందరు ఇప్పటికే చెరువును ఆక్రమంచి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. నరసన్నపేట: కూటమి ప్రభుత్వం వచ్చాక చెరువులకు కూడా రక్షణ లేకుండాపోతోంది. నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో చెరువు గర్భాల్లో యథేచ్చగా ఆక్రమణలు జరుగుతున్నా.. కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. అసలు రెవెన్యూ యంత్రాంగం ఉందా.. అనే సందేహం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఆక్రమణల గురించి పంచాయతీ సిబ్బందికి తెలిసినా రెవెన్యూ వాళ్లకి పట్టనిది తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. నరసన్న చెరువులో.. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న గొట్టిపల్లి రెవెన్యూలో 94/3లో 8.16 సెంట్ల విస్తీర్ణంతో నరసన్న చెరువు ఉంది. దీంట్లో ఆక్రమణలు అధ/కంగా జరుగుతున్నాయి. కాంప్లెక్స్ నుంచి జాతీయ రహదారికి వెళ్లేదారిలో చెరువు భాగం మొత్తం కప్పేస్తున్నారు. తాజాగా ఆటో స్టాండ్ పేరిట చెరువును కప్పేశారు. ఇక్కడ ఆటో స్టాండ్కు అనుమతులు లేకపోయినా చెరువు కప్పి షెడ్ వేశారు. దానికి ముందు, వెనుక భాగాల్లో చెరువు గర్భాన్ని కప్పేశారు. ఇండోర్ స్టేడియానికి కేటాయించిన స్థలంలో కూడా పట్టణంలో శిథిల భవన వ్యర్థాలు వేసి ఆక్రమణలు సాగిస్తున్నారు. మరోవైపు ఇదే చెరువు గర్భంలో పచూరీ కాలనీకి ఆనుకొని ఉన్నవారు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. కోట్ల విలువైన చెరువు అన్యాక్రాంతమవుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. తగ్గుతున్న భూగర్భజలాలు.. నరసన్నపేట పట్టణానికి చుట్టుపక్కల చెరువులు ఉండటం వల్ల భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండేవి కాదు. ఇప్పుడు చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతుండటం, భనవాలు నిర్మాణం కావడంతో చెరువుల్లో నీరు నిల్వకు అవకాశం లేకుండాపోతోంది. ఫలితంగా ఏటా భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరింతగా భూగర్భ జలాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణలు అడ్డుకోవాలి.. చెరువులు కప్పవద్దని స్టాండింగ్ జీఓ ఉంది. దీనిని రెవెన్యూ యంత్రాంగం విధిగా అమలు చేయాలి. సుప్రీం కోర్టు ఆర్డర్ కూడా ఉంది. ఇవేవీ నరసన్నపేటలో చెరువుల ఆక్రమణలకు అడ్డుకోవడం లేదు. కేవలం రెవెన్యూ యంత్రాంగం అసమర్థత, నిర్లక్ష్యం వల్లే చెరువులు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలి. – ఎస్.ప్రభాకరరావు, విశ్రాంత తహసీల్దార్, మారుతీనగర్, నరసన్నపేట నరసన్నపేటలో యథేచ్చగా ఆక్రమణలు నరసన్న, కొత్తకర్ర చెరువుల్లో అక్రమ కట్టడాలు పట్టించుకోని రెవెన్యూ యంత్రాంగంచర్యలు తీసుకుంటాం.. నరసన్న చెరువు, కొత్తకర్ర చెరువుల్లో ఆక్రమణలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. వీఆర్వోలను పంపి ఆక్రమణల గురించి వివరాలు తెలుసుకుంటాం. చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడటం సరికాదు. – టి.సత్యనారాయణ, తహసీల్దార్, నరసన్నపేట -
ఆరేళ్లకే ఆయువు తీరింది
పొందూరు: పొందూరు–చిలకపాలెం రహదారిలోని ఎరుకులపేట కూడలి వద్ద సోమవారం సాయంత్రం ద్విచక్ర వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం గోకర్నపల్లి పంచాయతీ రంగనాథపేట గ్రామానికి చెందిన పేడాడ హరిబాబు, ఈశ్వరమ్మ దంపతులకు వెంకటసూర్య యువంత్(6) అనే కుమారుడు ఉన్నాడు. యువంత్ తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేటలో చిన్న తాతయ్యను చూసేందుకు వచ్చాడు. అక్కడి నుంచి చిలకపాలెం వెళ్లేందుకు తల్లిదండ్రులతో కలిసి ఎరుకులపేట బస్టాప్కు బయలుదేరాడు. బస్టాప్ నుంచి రహదారి అవతలవైపు ఆటో ఆపేందుకు తండ్రి హరిబాబు వెళ్లాడు. తండ్రి దగ్గరకు వెళ్లాలనే ఆతృతతో తల్లి ఈశ్వరమ్మ చేయిని వదిలి బాలుడు పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వెళ్లాడు. అదే సమయంలో చిలకపాలెం నుంచి పొందూరు వైపు వస్తున్న ద్విచక్ర వాహనం బాలుడి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడిని పొందూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ లేకపోవడంతో 108 వాహనంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రిమ్స్కు తీసుకెళ్లాలని వైద్యసిబ్బంది సూచించారు. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యలోనే బాలుడు మృతి చెందాడు. తండ్రి హరిబాబు విశాఖపట్నంలోని ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కాగా, బాలుడి మృతితో రంగనాథపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ● ద్విచక్ర వాహనం ఢీకొని బాలుడి మృతి ● ఎరుకులపేట వద్ద ఘటన -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నరసన్నపేట: కోమర్తి వద్ద జాతీయ రహదారి ఫ్లై ఓవరుపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి ఏమీ చెప్పలేని స్థితిలో ఉండటంతో మృతుడి పూర్తి వివరాలు తెలియలేదు. నరసన్నపేట వైపు నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో వీరి ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు ప్రమాద సంఘటన బట్టి పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే ప్రదేశంలో వద్ద ఇసుక ఉండటంతో ఇసుక ట్రాక్టర్ ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనంపై ఓడీ 33ఏ డీ2053 నంబరు ఉంది. దీంతో ప్రమాదానికి గురైన వారు ఒడిశావాసులుగా పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు.సర్పాల సయ్యాటపొందూరు రూరల్ : మండల కేంద్రం పొందూరులోని అఫీషియల్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగి బేత కృష్ణారావు ఇంటి పక్కన సోమవారం సాయంత్రం నాగుపాము, జెర్రిపోతులు సయ్యాట ఆడాయి. ఒక్కసారిగా పాములు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
సరుబుజ్జిలి: మండలంలోని కూనజమ్మన్నపేటకు చెందిన రోజువారీ కూలీ హనుమంతు వెంకటరావు(60) అనుమానాస్పదంగా మృతిచెందాడు. వెంకటరావు ఎప్పటిలాగానే ఆదివారం సరుబుజ్జిలి కూలీ పనులకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనతో ఎదురుచూస్తున్న సమయంలో సరుబుజ్జిలికి చెందిన ఓ వ్యక్తి సమాచారం ఇస్తూ సరుబుజ్జిలి, కూనజమ్మన్నపేట గ్రామాల మధ్య రహదారి పక్కన వెంకటరావు పడి ఉన్నట్లు చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్సు సాయంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్థారించారు. భార్య నారాయణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోస్టుమార్టమ్ నిర్వహించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసినట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. -
దేవాలయాలపై దాడులు బాధాకరం
గార: కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై దాడులు ఎక్కువకావడం బాధాకరమని ఎంపీపీ గొండు రఘురామ్ అన్నారు. కళింగపట్నం కోదండ రామాలయంలో ఏడు దేవతా విగ్రహాలను ధ్వంసం జరిగిన ఘటన స్థలాన్ని సోమవారం పరిశీలించారు. ఆలయ ఈవో మాధవి, అర్చకులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడులు పాల్పడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. మనల్ని రక్షించే దేవతలకే రక్షణ లేకుండా పోతుందన్నారు. ఇలాంటి దాడుల వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి తమ్మిన అప్పలరాజు, గుంటు రామచంద్రరావు, వీరస్వామి, గుజ్జల అప్పలరాజు, ఉదయభాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు. అంబులెన్సులో ప్రసవం మందస: బుడార్సింగి గ్రామానికి చెందిన నిండు గర్భిణి ఆరికి ఢిల్లేశ్వరికి సోమవారం పురిటినొప్పులు మొదలవ్వడంతో బంధువులు 108 వాహనానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న మందస అంబులెన్సు ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలట్ ఎస్.రాజేంద్రప్రసాద్లు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు ఎక్కువ కావడంతో సుఖప్రసవం చేయించడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం వారిని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సంఘ బలోపేతానికి కృషి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గొర్రెలు, మేకలు పెంపకందార్ల సహకార సంఘం అధ్యక్షుడిగా కుజ్జు తాతయ్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం నగరంలోని పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తాతయ్య మాట్లాడుతూ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘాన్ని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం తాతయ్యను పశుసంవర్ధకశాఖ జేడీ కె.రాజగోపాల్రావు, ఈడీ బమ్మిడి యోగేశ్వరరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు కలగల జగదీష్ యాదవ్లు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పల్ల నరహరి, బూర పాపారావు, గద్దిబోయిన కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు ఏప్రిల్ నెల కరెంటు బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గత నెల కంటే చార్జీలు రెట్టింపు కావడంతో మండిపడుతున్నారు. సంతబొమ్మాళి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న టీ కొట్టు యజమాని జమునకు సాధారణంగా నెలకు రూ.1000లు లోపు బిల్లు వచ్చేది. కానీ ఏప్రిల్ నెల బిల్లు రూ. 4502 రావడంతో ఆమె అవాక్కయ్యారు. ఏం చేయాలో తెలీక విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లి అడిగితే ఎవరూ స్పందించలేదని ఆమె తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి బిల్లు సరి చేయాలని ఆమె కోరుతున్నారు. – సంతబొమ్మాళి -
పిడుగు.. అప్రమత్తతే గొడుగు!
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రస్తుతం మండుతున్న ఎండలకు భూమి వేడెక్కిపోవడంతో ఉక్కపోత ఎక్కువవుతోంది. ఈ క్రమంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు సైతం పడుతుండటంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఎక్కువగా పొలం పనికి వెళ్లే రైతులు, గొర్రెలు, మేకలు, పశువులకాపర్లు పిడుగుపాటుకి గురై మరణిస్తుంటారు. పిడుగులనుంచి రక్షణ పొందాలంటే జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ● ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతున్నప్పుడు ఇంట్లోనే ఉండటం మేలు. ● సముద్రం, కొలనులు, సరస్సులు, చెరువుల దగ్గర ఉంటే వెంటనే దూరంగా వెళ్లాలి. రేకు, లోహం కలిగిన నిర్మాణాలకు దూరంగా ఉండాలి. ● ఉరుముల శబ్ధం వినగానే పొలాల్లో పనిచేసే రైతులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు, పశువుల కాపరులు, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలి. ● కారు/బస్సు లోపల ఉంటే అన్ని డోర్స్ మూసి ఉంచాలి. ● చర్మం జలదరింపు ఉంటే మెరుపు, పిడుగు రావడానికి సూచనగా భావించాలి. సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లేకుంటే రబ్బరు చెప్పులు ధరించి చెవులు మూసుకుని తలను నేలకు తగలకుండా మోకాలిపై కూర్చోవాలి. ● పిడుగు బాధితులను తాకవచ్చు. సత్వరమే వారికి సహాయం అందించాలి. బాధితులను సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలి. అందని సాయం.. పిడుగు పాటుకి గురై వ్యక్తులు మరణించినా కార్మికశాఖ, పశుసంవర్ధకశాఖ నుంచి ఎటువంటి ఎక్స్గ్రేసియా ఇవ్వడం లేదు. మరణించిన వ్యక్తికి ఏదైనా ఇన్సురెన్స్ పాలసీ ఉంటే తప్ప ఆ వ్యక్తి కుటుంబానికి ఎటువంటి పరిహారం అందించడం లేదు. ఈ మరణాలను ప్రత్యేక కేసులుగా భావించి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సకాలంలో వైద్యం అందాలి.. పిడుగు పడే వ్యక్తులకు (ఏబీసీ) తప్పనిసరిగా ఉండాలి. ఏ–ఎయిర్వే, బి–బ్లడ్ సర్క్యులేషన్, సి–కార్డియాక్ ఫంక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. సీపీఆర్ చేసి దగ్గరలో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాలి. పిడుగు పడిన వ్యక్తి గుండె కొట్టుకునే శాతం పెరిగిపోయి మరణించే ప్రమాదం ఉంటుంది. ఎముకలు, మజిల్ ప్రోటిన్ అంతా కరిగిపోతాయి. పిడుగు ధాటికి వెలువడే కరెంట్ మెదడుకు చేరితో ఫిట్స్ వంటివి వచ్చి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. – డాక్టర్ సనపల నర్సింగరావు, జనరల్ ఫిజీషియన్, శ్రీకాకుళం ఇవి చేయవద్దు.. ఉరుములు, మెరుపులు సంభవించినపుడు చెట్ల కింద, టవర్లు, చెరువులు దగ్గర ఉండరాదు. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర పరికరాలు చార్జ్డ్ ఫోన్లు/ మొబైల్స్ వినియోగించరాదు. పిడుగుల సమయంలో స్నానం చేయడం, చేతులు కడగటం, నీటిలో ఉండడం లాంటివి చేయరాదు. మోటారు సైకిళ్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు వేలాడుతున్న విద్యుత్ తీగలకు, విద్యుత్ స్తంభాలకు, ఇతర ఇనుప వస్తువులకు దూరంగా ఉండాలి. వాహనంలో ఉండే లోహపు భాగాలను తాకరాదు. అకాల వర్షాల్లో ఉరుములు, మెరుపులతో పిడుగుపాట్లు అప్రమత్తం లేకుంటే ప్రాణాలకే ప్రమాదం మృత్యువాత పడుతున్న రైతులు, పశుపెంపకందారులు -
రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): చంద్రబాబు సీఎం కుర్చీలో కూర్చున్నాక రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జె న్సీ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గత రెండు వా రాలుగా లిక్కర్ స్కామ్ అంటూ ఎల్లోమీడియాలో హోరెత్తిస్తున్నారని, ఆ పేరుతో మాజీ ఐఏఎస్లు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ హ యాంలో ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మద్యం షాపులు ప్రభుత్వమే నడిపించిందన్నారు. విక్రయాలు తగ్గిస్తే స్కామ్ ఎలా సాధ్యమవుతుందన్నారు. ఆయన సోమవారం శ్రీకాకుళంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చి విలేకరులతో మాట్లాడారు. కూటమిలో స్కామ్లు జరుగుతున్నాయో, వైఎస్సా ర్సీపీ జరిగియో ప్రజలందరికీ తెలుసన్నారు. పలాసలో ఎమ్మెల్యే శిరీష ప్రత్యేకంగా ఒక్కో బాటిల్పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారని పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేది అనుమానంగా ఉందన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురే ష్ను అన్యాయంగా అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయుల్ని సైతం అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పెట్టుబడులన్నీ వైఎస్సార్సీపీ హయాంలో వచ్చినవే.. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని వచ్చేవారిని సైతం కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు బ్లాక్మెయిల్ చేసి కమీషనర్లకు కక్కుర్తి పడుతున్నారని సీదిరి విమర్శించారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలోనే పెట్టుబడులు వచ్చాయని, ఆ సమయంలోనే భూమి సేకరించి, ఆ సమయంలో ఎంఓయూలు తెచ్చుకున్నారని వివరించారు. రి న్యూ కంపెనీ, గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ, శ్రీసిటీ, గ్రీన్ ఎనర్జీ కంపెనీలన్నీ వైఎస్ జగన్ హయాంలో వచ్చినవేనని గుర్తు చేశారు. టీసీఎస్ కంపెనీని కూడా వైఎస్ జగన్ తీసుకువచ్చారని, అన్ని రకాల పూర్తి చేస్తే కూటమి నాయకులు గొప్పలు చెప్పు కుంటున్నారని ఎద్దేవా చేశారు. విద్యుత్ ఒక్కో యూనిట్ రూ 2.50కి కొనుగోలు చేస్తేనే స్కామ్ అన్నారు, ఇప్పుడు రూ.4.50 కొనుగోలు చేస్తున్నారు దీనిలో ఎంత స్కామ్ ఉంటుందో చెప్పాలని ప్రశ్నించారు. స్కామ్లు చేసే చంద్రబాబుకి అన్నీ స్కామ్లుగా కనిపిస్తాయన్నారు. తిరుపతిలో, సింహాచలంలో ఇలా అనేక దేవాలయాల్లో మృతి చెందుతున్న సంఘటనలు చూస్తే రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం చంద్రబాబు చేసిన పాపమే ప్రజలకు శాపంగా మారిందన్నారు. మాజీ ఐఏఎస్, ఐపీఎస్ల అరెస్ట్లు అప్రజాస్వామికం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు -
ట్రస్ట్ బోర్డు నియామకాలకు గ్రీన్సిగ్నల్
అనర్హులకు చోటు లేకుండా నియామకాలు జిల్లాలో 16 ఆలయాల కు ట్రస్ట్ బోర్డు నియామకాలు చేపట్టనున్నాం. ఈ మేరకు ఈనెల 28లోగా దరఖాస్తులను స్వీకరించనున్నాం. అయితే దేవదాయ శాఖకు, హిందూ ఆలయాల వ్యవస్థకు, సంస్థలకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, సంస్థకు చెందిన భూములను లీజులు, కౌలు కింద అనుభవిస్తున్న వారు, వరుసగా రెండు సార్లు ధర్మకర్తలుగా పనిచేసిన వారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, క్రిమినల్ కేసులున్న వారు, మద్యం సేవించిన వారు ఈ ధర్మకర్తల పోస్టులకు అనర్హులు. ఇలాంటి వారు లేకుండా నియామకాలను చేపట్టేలా చర్యలు చేపడతాం. – బి.ప్రసాద్ పట్నాయక్, జిల్లా దేవదాయశాఖాధికారి అరసవల్లి: జిల్లాలో దేవదాయ శాఖ పరిధిలోని 6–బి హోదా ఆలయాల్లో పాలక మండలి నియామకాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 16 ఆలయాలకు మరికొద్ది రోజుల్లోనే పాలకమండలి సభ్యులు కొలువుతీరనున్నారు. నిబంధనల ప్రకా రం పక్కాగా హిందువై ఉండి.. ఎలాంటి కోర్టు లావాదేవీలు, క్రిమినల్ కేసులు లేని వారిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యతలను దేవదాయశాఖ కమిషనర్ నిర్వర్తించనున్నారు. ఆయా ఆలయాల్లో పాల క మండలి సభ్యుల స్థానాలకు దరఖాస్తులను స్వ యంగా జిల్లా దేవదాయ శాఖ కార్యాలయానికి సమర్పించాల్సి ఉంది. ఇందుకు ఈనెల 28వ తేదీ సాయంత్రం 5 వరకు గడువు ఖరారు చేశారు. అయితే పూర్తి రాజకీయ అండదండలతోనే దాదాపుగా పాలకమండలి సభ్యుల ఎంపిక ఉంటుందన్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికార పార్టీ అగ్రనేతల చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు మొదలు పెట్టేశారు. గార మండలం శాలిహుండం కొండపై వేంచేసి ఉన్న శ్రీ కాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయంపై ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో పాటు ఇక్కడి ఆలయ వ్యవహారాలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఆలయ పాలకమండలి నియామకాలపై స్థానిక గార మండల టీడీపీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సా రించారని తెలుస్తోంది. జిల్లాలో 16 దేవాలయాల్లో ట్రస్టీలు దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న (6–బి) ఆలయాల్లో తొలిదశగా 16 ఆలయాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కాళీయ మర్దన వేణుగోపాలస్వామి ఆల యం (శాలిహుండం), ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయం(గుడివీధి–శ్రీకాకుళం), శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం (పాలకొండ రోడ్డు–శ్రీకాకు ళం), వెంకటేశ్వర స్వామి ఆలయం (చిన్నబజార్–శ్రీకాకుళం), ఏవీపీ చౌల్ట్రీ (జిల్లా దేవదాయ శాఖ కార్యాలయ ప్రాంగణం), వేంకటేశ్వర స్వామి ఆలయం (ఫాజుల్బాగ్పేట–శ్రీకాకుళం), కనకదుర్గ ఆలయం (బ్రిడ్జి రోడ్డు–శ్రీకాకుళం), భీమేశ్వర స్వామి ఆలయం (కొన్నావీధి–శ్రీకాకుళం), లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (తుమ్మావీధి–శ్రీకాకుళం), గోపాల–జగన్నాథస్వామి వారి ఆలయం (టెక్కలి), లక్ష్మీ నరసింహ స్వామి ఆల యం(టెక్కలి), శ్రీ లక్ష్మణ బాలాజీ ఆలయం (టెక్క లి), రఘునాధ స్వామి ఆలయం (సిరిపు రం–మందస), వెంకటేశ్వర స్వామి వారి ఆలయం (నరసన్నపేట), కోదండరామ స్వామి వారి ఆల యం (సోంపేట), పెద్ద జగన్నాథ స్వామి వారి ఆలయం (ఇచ్ఛాపురం)లో పాలకమండలి సభ్యుల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే నియామకాలు దేవాలయాల్లో పాలకమండలి సభ్యుల నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని ఇప్పుడు కూడా అమలు చేసేందుకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రకారం రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాల్లో గరిష్టంగా 9 మంది పాలకమండలి సభ్యులు ఉండాలి (చైర్మన్తో సహా). వంశపారం పర్యంగా ధర్మకర్తలుంటే వారే చైర్మన్లుగా వ్యవహరించనున్నారు. మిగిలిన సభ్యుల స్థానాలకు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ స్థాయి (6–బి) ఆలయాల్లో మొత్తం 9 మంది సభ్యుల్లో కచ్చితంగా మహిళల కోటా 50 శాతం అంటే కనీసం నలుగురు మహిళా సభ్యుల (ఓపెన్) నియామకం తప్పనిసరి అనే నిబంధన ఉంది. అ లాగే మొత్తం సభ్యుల సంఖ్యలో నలుగురు ఓసి కేటగిరిలో (ఇందులో ఒకరు కచ్చితంగా బ్రాహ్మణులై ఉండాలి), మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎస్సీ లేదా ఎస్టీకి చెందిన వారు, మిగిలిన నలుగురు బీసీ కేటగిరికి చెందిన వారు (ఇందులో ఒకరు కచ్చితంగా నాయీ బ్రాహ్మణుడు ఉండాలి) ఉండాలనే నిబంధనలను అమలు చేయాల్సి ఉందని మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 28లోగా దరఖాస్తులకు గడువు జిల్లాలో మొత్తం 16 ఆలయాల్లో ట్రస్ట్బోర్డులకు నోటిఫికేషన్ విడుదల -
వర్చువల్ ల్యాబ్కు కలెక్టర్ గ్రీన్ సిగ్నల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యకు నాంది పలికేలా ‘జీరో సైన్స్ ల్యాబ్’ వర్చువల్ ప్రయోగశాలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. మొదటిగా స్మార్ట్ డిస్ప్లేలు ఉన్న ఐదు పాఠశాలల్లో ఈ ల్యాబ్ను ప్రారంభించి, విద్యార్థులపై ప్రభావా న్ని విశ్లేషించనున్నామని అన్నారు. ఈ ప్రాజెక్టు కార్యాచరణపై కలెక్టర్ను సోమవారం కలిసిన ఈడీజెడ్వన్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు రామ్కుమార్ రామదేవు, సంతోష్ కొత్తకోట ప్రాజెక్టు వివరాలను తెలియజేశారు. కలెక్టర్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు, సాంకేతిక మద్దతు కల్పించేందుకు సమగ్ర చర్య లు తీసుకోవాలని సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శశిభూషణ్కు సూచించారు. నిలిచిన సీటీ స్కాన్ సేవలు టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో సోమవారం సీటీ స్కాన్ సేవలు నిలిచిపోయా యి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం ఉదయం రోగులకు స్కాన్ చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రావడం జరుగుతుండటంతో సీటీ స్కాన్ ఒక్కసారిగా మరమ్మతులకు గురైంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిస్టంలో ఉన్న డేటా సైతం కనిపించకపోవడంతో ఇక్కట్లు తప్పలేదు. అత్యవసర కేసులను శ్రీకాకుళం రిఫర్ చేయాల్సి వచ్చింది. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారు లు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు ప్రజా ఫిర్యాదుల నమోదు, ప రిష్కార వేదికలో గ్రీవెన్స్కు ముందు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్తో కలిసి జిల్లా అధికారులతో ఆయన మాట్లాడారు. పిడుగు పాటు కు సంబంధించి వాతావరణ శాఖ నుంచి సమాచారం అందిన వెంటనే గ్రామ స్థాయిలో చేరే విధంగా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని తద్వారా జిల్లా అధికారులు తెలుసుకోవాలన్నారు. వ్యవసాయ, పశు సంపద, తోటలు, చెట్లు పడిపోవడం, విద్యుత్ లైన్లు దెబ్బ తినడం వంటి సమాచారం పై సంబంధిత జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఇంటర్ సప్లిమెంటరీ స్పాట్ ప్రారంభం శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకేంద్రం వేదికగా జరుగుతు న్న స్పాట్ వాల్యుయేషన్లో భాగంగా మొదటి స్పెల్లో సంస్కృతంతోపాటు తెలుగు,ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సివిక్స్, తెలుగు పేపర్లను దిద్దుతున్నారు. ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు, ఏసీవో జనరల్–1 గణపతి వెంకటేశ్వరరావు, జనరల్–2 శివరాంప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. పదోన్నతులతో ఖాళీల భర్తీ సారవకోట: జిల్లా పరిషత్ పరిధిలో వివిధ మండల పరిషత్లలో ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నామని జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా తెలిపారు. సోమవారం ఆయన స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ కార్యాలయాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలత్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హత కలిగిన వారితో పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
నోటికి ప్లాస్టర్ చుట్టుకుని..
● యువకుడి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకున్నాడు. ఊపిరి ఆడకుండా ముక్కులో దూది పెట్టుకున్నాడు. చేతులను కుర్చీ వెనక్కి కట్టుకున్నాడు. ఇలా ప్రాణం పోకపోతే.. ఎలాగైనా చనిపోవాలని నాలుగు రకాల కత్తులను రెడీగా ఉంచుకున్నాడు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో దాసరి ఉమామహేశ్వరరావు (26) అనే యువకుడు సోమవారం రాత్రి జిల్లాకేంద్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం రూరల్ మండ లం రాగోలు గ్రామం షిర్డీ సాయినగర్లో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దాసరి ఉమామహేశ్వరరావు హైదరాబాద్లో ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చిరంజీవి ఎకై ్సజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుటుంబంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లినట్లు సమాచారం. తమ్ముడు బెంగళూరులో ఓ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. ఉమామహేశ్వరరావుకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో ఒక్కడే ఇంటిలో ఉంటున్నాడు. ఏమైందో గానీ సోమవారం రా త్రి తలుపునకు గడియ పెట్టి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. భోజనం కోసం బంధువులు ఎంత తలుపు తట్టినా తీయకపోవడంతో బలవంతంగా తలుపు తెరిచి.. కుర్చీలో విగతజీవిగా పడి ఉన్న యువకుడిని చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాధ తెలియకూడదనేనా.. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించా రు. మృతుడు యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నా రు. నొప్పి తెలియకుండా ఉండడానికే ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని తెలిపారు. ముందుగా వీల్చైర్లో కూర్చుని నోటికి పది రౌండ్ల టేపును చుట్టుకున్నాడని, ముక్కులో దూది పెట్టుకుని, రెండు చేతులను కుర్చీ వెనక్కి కట్టుకునేలా ఏ ర్పాట్లు చేసుకున్నాడని పోలీసులు వివరించారు. ఈప్లాన్ సక్సెస్ కాకపోతే మరోలాగైనా చనిపోవడానికి నాలుగు రకాల కత్తులు ఉంచుకున్నాడని పేర్కొన్నారు. మృతుడి చిన్నాన్న దాసరి ప్రభాకర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోజుకు రూ.కోటి
టెక్కలితో పోటీ.. ● పొందూరు మండలంలో అడ్డగోలుగా మైనింగ్ దందా ● టెక్కలి నియోజకవర్గంతో పోటీ పడి దోచేస్తున్న పరిస్థితి ● కీలక నేత కనుసన్నల్లో తవ్వకాలు ● ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మైనింగ్ దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. అడ్డు చెప్పే వారు లేకపోవడం, అడ్డుకునే వారు రాకపోవడంతో ఓ కీలక నేత ఆధ్వర్యంలో మైనింగ్ దందా విజయవంతంగా సాగుతోంది. ఇప్పటివరకు టెక్కలి నియోజకవర్గంలో మాత్రమే ఈ దందా జరిగేది. ఇప్పుడు ఆమదాలవలస నియోజకవర్గం కూడా అడ్డాగా మారింది. అక్కడెలాగైతే ఓ కీలక నేత కనుసన్నల్లో మైనింగ్ అక్రమాలు జరుగుతున్నాయో ఇక్కడ కూడా ఒక కీలక నేత దందాను నడిపిస్తున్నారు. రోజుకి రూ.కోటికి పైగా అక్రమ మార్గంలో ఆర్జిస్తున్నట్టు సమాచారం. మైనింగ్ దోపిడీలో కొంత అధికారులకు ముడుతుండడంతో చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో మైనింగ్ అంటే గుర్తుకొచ్చేది పొందూరు మండలమే. ఒక ప్పుడు కొన్ని కుటుంబాల వారు బతుకుతెరువు కోసం రాళ్లు కొట్టుకుని జీవించేవారు. రాను రాను ఆ రాళ్లకు డిమాండ్ పెరగడంతో అక్రమార్కుల కన్ను అక్కడున్న కొండలు, గుట్టలపై పడింది. యంత్రాలు, బ్లాస్టింగ్ ద్వారా తవ్వకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గ కీలక నేత కనుసన్నల్లో ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఆయనకు రూ.కోట్లలో ముడుపులందగా, క్వారీలు నడు పుతున్న వారు అంతకుమించి సంపాదిస్తున్నారు. అంతా కలిసి విలువైన బ్లాక్ స్టోన్ను దోచేస్తున్నారు. పొందూరు మండలంలో రాపాక, ఇల్లయగారిపేట, గారపేట, పుల్లాజీపేట, లోలుగు, పొందూరు తదితర ప్రాంతాలు అక్రమ మైనింగ్ కేరాఫ్ అడ్రస్గా నిలిచాయి. పొందూరు మండలంలోని సర్వే నంబర్లు 335, 244, 223, 198, 71లతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో వేల హెక్టార్లలో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నారు. కృష్ణాపురం సమీపంలోని సర్వే నంబర్ 335లో అత్యధికంగా అక్రమ మైనింగ్ జరుగుతోంది. కీలక నేత ఆధ్వర్యంలో కె.రమేష్, కె.రామినాయుడు, కె.అప్పారావు, జి.రమణ, వి.రామారావు, కె.గౌరీనాయుడు, కె.అక్కలనాయుడు, కె.శశి, పి.రమణ, కె.అప్పలనాయుడు, పి.రమణమూర్తితో మరో 20మంది వరకు అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు రెండు, మూడు క్వారీలకు పరిమితమై నడవగా ఇప్పుడవి 26కు పైగా నడుస్తున్నాయి. వీటిలో ఐదు క్వారీలకు మాత్రమే లీజు అనుమతులు ఉన్నాయి. మిగతా 21 క్వారీలకు అనుమతుల్లేవు. ఇక లీజు అనుమతులు ఉన్న క్వారీల్లో కూడా పరిమితికి మించి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క క్వారీలే కాదు 25వరకు అక్రమ క్రషర్లు కూడా నడుస్తున్నాయి. గత ఐదేళ్లు అక్రమాలకు చెక్ వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అక్రమాలకు చెక్ పడింది. విశ్వసముద్ర కంపెనీకి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడంతో ప్రభుత్వానికి భారీ గా ఆదాయం రావడంతో అక్రమ క్వారీలకు అవకాశం ఉండేది కాదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్లు విచ్చలవిడిగా అక్రమ మైనింగ్కు పాల్పడ్డారు. ఆ తర్వాత విశ్వసముద్రకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఎక్కడ చెడిందో గానీ విశ్వసముద్రను తప్పించి ఏఎంఆర్ సంస్థకు అప్పగించారు. అయితే, ఈ సంస్థతో కూడా లోపాయికారీ ఒప్పందాలు అమల్లోకి రాకపోవడమో, అడిగినంత ఇవ్వలేదనో గానీ ఏఎంఆర్ సంస్థను కూడా హోల్డ్లో పెట్టేశారు. దీంతో ఎవరికి నచ్చినంత వారు దోచే స్తున్నారు. ప్రస్తుతం ఇసుక, మట్టి, గ్రావెల్తో పాటు మైనింగ్ కూడా తెలుగు తమ్ముళ్లకు కనకవర్షం కురిపిస్తోంది. విశేషమేమిటంటే, ఇటీవల పోలీసు, రెవెన్యూ అధికారులు తనిఖీలకు వెళ్లినాక కూడా అక్కడ అక్రమ మైనింగ్ ఆగలేదు. -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
శ్రీకాకుళం క్రైమ్: శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా ప్రవర్తించినా.. అల్లర్లు, అలజడులు సృష్టించేందుకు యత్నించినా పీడీ యాక్టులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, జిల్లా నుంచి బహిష్కరిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి రౌడీషీటర్లకు హెచ్చరించారు. నేరాల కట్టడిలో భాగంగా జిల్లావ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని ఎస్పీ పోలీసు అధికారులను ఆదేశించారు. దీనిలో భాగంగా ఆదివారం వివిధ పోలీస్స్టేషన్లలో షీట్లు నమోదైనవారిని ఎస్హెచ్వోలు పిలిపించి మాట్లాడారు. నేర ప్రవృత్తి మాని సత్ప్రవర్తనతో మెలగాలని, కబ్జాలకు, బ్లాక్మెయిలింగ్లకు పాల్పడరాదని హితవుపలికారు. పేకాట డెన్లు నిర్వహించరాదని, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు వినియోగించరాదని, అక్రమ రవాణా చేయరాదని చెప్పారు. కాగా, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్లో 39 మంది రౌడీషీటర్లుండగా, ఒకటో పట్టణ పరిధిలో 36 మంది ఉన్నట్లు సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి కృషి శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యావ్యవస్థలో ఉన్న టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్ల వెన్నెంటే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికై న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీఆర్టీయూ ఆధ్వర్యంలో వివిధ ఉపాధ్యాయ సంఘాలు, అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు భైరి అప్పారావు, తంగి మురళీమోహన్రావు, పప్పల రాజశేఖరరావు, దానేటి కేశవరావు, దుప్పల శివరాంప్రసాద్, సురేస్సింగ్, వెంకటరమణ, శ్రీనివాస్, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ప్రశాంతంగా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష చిలకపాలేంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కాలేజ్ ఆదివారం నిర్వహించారు. మొదటి షిఫ్టులో 242 మందికి 239 మంది, రెండో షిఫ్టులో 242 మందికి 239 మంది హాజరయ్యారు ఐక్యవేదిక ఉద్యమాన్ని విజయవంతం చేయండి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి చేపట్టనున్న ఉద్యమాలలో ఉపాధ్యాయులంతా స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (ఏపీ ఎస్టీఏ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినాన చందనరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మజ్జి చిన్నబాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సప్పటి మల్లేసు, పంచాది గోవిందరాజులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ కొన ఊపిరితో కొనసాగుతోందన్నారు. తొమ్మిది రకాల స్కూల్ వ్యవస్థతో గందరగోళంగా తయారైందని మండిపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ విధానాన్ని అనేక మంది తల్లిదండ్రులు వ్యతిరేకిస్తున్నారని, పాతపద్ధతిలోనే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వ్యవస్థలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. బదిలీలు, రేషనలైజేషన్లలో అసంబద్ధమైన విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. స్కూల్ అసిస్టెంట్లను ఎలిమెంటరీ పాఠశాలకు కేటాయించడం, రెండు మూడుసార్లు రేషనలైజేషన్కు గురైన ఉపాధ్యాయులకు సరైన న్యాయం జరగకపోవటం, హైస్కూల్లో సెక్షన్కు 54 మందిని పరిగణించడం తగదన్నారు. ఐక్య వేదిక ఇచ్చిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర విద్యాశాఖలో జరుగుతున్న అసంబద్ధమైన, అస్తవ్యస్త నిర్ణయాల పట్ల అటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గందరగోళానికి గురవుతున్నారని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగు మాధ్యమం లేకుండా కేవలం ఇంగ్లిష్ మీడియంలోనే విద్యను కొనసాగిస్తామని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల విద్యార్థుల మానసిక, సృజనాత్మక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడంలో వెనుకబాటకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. గత ఐదేళ్లలో ఇంగ్లిష్ మాధ్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి నాయకులు ఇప్పుడు మాటమార్చడం తగదన్నారు.