breaking news
Srikakulam
-
రెండు కేజీల గంజాయితో యువకుడు అరెస్టు
ఇచ్ఛాపురం: ఉత్తరప్రదేశ్కి చెందిన అనూజ్కుమార్ రెండు కేజీల గంజాయితో పట్టణ పోలీసులకు పట్టుబడిన ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక సర్కిల్ పోలీస్ కార్యాలయం ఆవరణంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ యువకు డు రేణిగుంటలో ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నా డు. ఒడిశాకు చెందిన గంజాయి సరఫరాదారుడు సాగర్తో పరిచయం ఏర్పడింది. రేణిగుంటలోనే గంజాయి వ్యాపారం చేసే అమిత్ జైస్వాల్ అలియా స్ అమిత్చౌదరితో గంజాయి సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 18న అనూజ్ ఒడిశాలో 2.070 కేజీల గంజాయిని కొనుగోలు ఇచ్ఛాపురం చేరుకున్నాడు. అనుమానాస్ప దంగా కనిపించడంతో పోలీసులు తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్కి తరలించా రు. కార్యక్రమంలో పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఎస్సై రవివర్మ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వినాయక మండపం పెడుతున్నారా..?
శ్రీకాకుళం క్రైమ్ : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మండపాలను ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేకంగా హెచ్టీటీపీఎస్:జిఎఎన్ఈస్హెచ్యూటీఎస్ఎవి.ఎన్ఇటీ అనే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. గురువారం ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత పోలీస్స్టేషన్ ఎస్హెచ్ఓకు చేరాక పురపాలక, అగ్నిమాపక, విద్యుత్ శాఖల సిబ్బంది ఓ బృందంగా ఏర్పడి ఆ ప్రదేశాన్ని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారన్నారు. వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్లో దరఖాస్తుదారుని ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే నో అబ్జక్షన్కు సంబంధించి నిబంధనలతో కూడిన క్యూఆర్కోడ్ డౌన్లోడ్ అవుతుందని, నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తక్షణమే మంజూరవుతుందన్నారు. -
మంత్రి అచ్చెన్నను విచారించాల్సిందే..
● మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమదాలవలస: కూటమి పాల న అవినీతికి కేంద్ర బిందువులా మారిందని, కోట్ల రూపాయల స్కాం చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెగబడ్డారని మాజీ స్పీకర్, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమయన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన గురువారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను దోపిడీకి సాధనాలుగా మలుచుకోవడం సరికాదన్నారు. వ్యవసాయ పరికరాల కొనుగోళ్లలో కమీషన్ల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికే మచ్చ అని తెలిపారు. ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక ఆగ్రోస్ జీఎం రాజమోహన్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం మంత్రి పేషీలోని అవినీతికి నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి, ఓఎస్డీపై నిఘా సంస్థలు విచారించాలన్నారు. మంత్రిపై ఆరోపణలు చేస్తూ ఓ ఉన్నతాధికారి ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. మంత్రి నిర్వాకంతో కూటమి ప్రభుత్వ పరువు బజారులో పడిందన్నారు. సీఎం చంద్రబాబు ఈ విషయంలో తన ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సంక్షోభంలో సాగు.. రాష్ట్రంలో వ్యవసాయశాఖ తీవ్ర సంక్షోభంలో కూరు కుపోయిందని తమ్మినేని మండిపడ్డారు. వానలు ఆలస్యమయ్యాయని, సాగు ప్రారంభించిన వారికి సరిపడా విత్తనాలు, ఎరువులు అందించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మార్కెట్లో ఎరువులు లభించడం లేదన్నారు. సబ్సిడీతో అందించాల్సిన ఎరువులు కూట మి నేతల ఆధీనంలోని ప్రత్యేక గోడౌన్లకు వెళ్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. పింఛన్దారుల కుదింపు అన్యాయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4,50,000 మంది అర్హులైన వారిని పింఛన్ల జాబితా నుంచి తొలగించారని, ఇది అన్యాయమని అన్నా రు. మానవతా కోణంలో ఆలోచించి, తొలగించిన లబ్ధిదారులందరినీ తిరిగి పింఛన్ల జాబితాలో చేర్చేలా పునఃపరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. -
గణపతి దేవా.. మా గోడు వినవా..!
శ్రీకాకుళం కల్చరల్ : మట్టినే నమ్ముకుని దేవుడి విగ్రహాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్న కళాకారులకు పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా సంప్రదాయ మట్టి తో తయారు చేసే వినాయక విగ్రహాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే శ్రీకాకుళం మహిళా కళాశాల రోడ్డు లోని కుమ్మరివీధి, పెద్దమార్కెట్టు వెనుక ఉన్న కుమ్మరివీధి, బలగ ప్రాంతంలో కళాకారులు స్థలా భావ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా నలుమూలల నుంచి వినాయక కమిటీలు ఇక్కడి నుంచి విగ్రహాలను తీసుకెళ్తుంటాయి. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ ప్రాంతంలో వర్షాలు సమయంలో ఇబ్బందిపడకుండా విగ్రహాలను భద్రపరిచే అవకాశం లేకపోవడంతో కళాకారులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. వినాయక విగ్రహం తయారు చేసేందుకు అవసరమైన మట్టి, గడ్డి గతంలో ఉచితంగా లభ్యమయ్యేది. ఇప్పుడు వాటి లభ్యత తక్కువ కావడంతో కొను గోలు చేయాల్సి వస్తోందని తయారీదారులు చెబు తున్నారు. ప్రస్తుతం ట్రాక్టరు మట్టి కొనుగోలు చేయాలంటే రూ.2వేలు నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతోంది. దానిపై గడ్డి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. ఇంకా రంగుల కోసం ఖర్చు కలుపుకొ ని ఒక బొమ్మ తయారీకి రూ.500 నుంచి రూ.3 వేలు వరకు ఖర్చు అవుతోంది. దీనిపై వారు తయా రీ కూలి వేసుకొని అమ్మితే వారు పడిన కష్టానికి నష్టం లేకుండా ఉంటుంది. ఈ సీజన్లో కుటుంబ సభ్యులంతా తయారీలో పాలుపంచుకుంటారు. బొమ్మలు చేసుకోడానికి స్థలం మంజూరు చేయాల ని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వచ్చే ఏడాదైనా ఈ అవకాశం కల్పించాలి. వర్షా లు వస్తే బొమ్మలను కాపాడుకోవడానికి నానా పాట్లు పడుతున్నాం. టార్పాలిన్ కప్పుకొని, అద్దె ఇళ్లలో ఉంచాల్సి వస్తోంది. – వెంకటరావు, తయారీదారుడు, కుమ్మరివీధి, శ్రీకాకుళం తాతముత్తాల నుంచి బొమ్మలు తయారు చేస్తున్నాం. 30 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాను. ఇంట్లో బొమ్మలు పెట్టడం వల్ల నిద్ర పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్రభు త్వం మాకోసం ఈ మూడు నెలలకై నా ఒక చోట షెడ్లు కేటాయిస్తే బాగుంటుంది. – పి.రాజేశ్వరరావు, విగ్రహ తయారీదారుడు, బలగ -
మూడు గంటల పాటు గేటు బంద్
ఇచ్ఛాపురం రూరల్: కేదారిపురం–పురుషోత్తపురం మధ్యనున్న రైల్వే ఎల్సీ గేట్ను రైల్వే సిబ్బంది మూడు గంటల పాటు మూసివేశారు. ట్రాక్ మరమ్మతుల పేరిట ముందస్తు సమాచారం లేకుండా గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గేట్ మూసి వేయడంతో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు.‘దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి’ సోంపేట: రాష్ట్రం ప్రభుత్వం ఇటీవల తొలగించిన దివ్యాంగ పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలని దివ్యాంగుల సంఘం హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శులు మల్లారెడ్డి భాస్కర్, దశముఖ రమేష్ డిమాండ్ చేశారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గు రువారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 1458 మంది దివ్యాంగుల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. మళ్లీ అప్పీలు చేసుకోవాలని దివ్యాంగులను కార్యాలయాల చుట్టూ తిప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఇచ్ఛాపురం, పలాస నియోజక వర్గాల్లోని ది వ్యాంగులకు ఉపకరణాలు అందలేదని, ప్రభుత్వం స్పందించి ఉపకరణాలు అందేలా కృషిచేయాలన్నారు. సమావేశంలో పోకల మోహనరావు, ఎం.పీతాంబరం తదితరులు పాల్గొన్నారు.నేడు జిల్లా స్థాయి జానపద పాటల పోటీలువజ్రపుకొత్తూరు రూరల్: ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మందస మండలం బహడపల్లిలో శుక్రవారం జిల్లా స్థాయి సామాజిక జానపద పాటల పోటీలు నిర్వహించనున్నారు. సిక్కోలు జానపద సాహిత్య కళావేదిక ఆధ్వర్యంలో పోటీలను విజయవంతం చేయా లని కళావేదిక అధ్యక్షుడు మామిడి కృష్టారావు, ప్రతినిధి రాపాక ధనరాజు,కార్యదర్శి లబ్బ రుద్రయ్య కోరారు. అలాగే అదే గ్రామంలో ఉ న్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 2 గంటలకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేర్లను అదే రోజు ఉదయం లోగా నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 9440861442 ఫోన్ నంబర్ను సంప్రదించాలని వారు సూచించారు.రణస్థలం సబ్స్టేషన్ ఆకస్మిక తనిఖీరణస్థలం: రణస్థలం సబ్ స్టేషన్ను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృథ్వీతేజ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఫీడర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమస్యలు రాకుండా విద్యుత్ అందించాలని సూచించారు. ఏవైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలని తెలిపారు. కమ్మసిగడాం పరిధిలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా వేసిన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పనితీరుపై ఆరా తీశారు. నూతనంగా నిర్మిస్తున్న బంటుపల్లి సబ్ స్టేషన్ నిర్మాణ పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆపరేషన్ డైరెక్టర్ పీవీ సూర్య ప్రకాశ్, జిల్లా ఎస్ఈ కృష్ణమూర్తి, డీఈ పైడి యోగేశ్వరరావు, ఈఈ బయ్యంనాయుడు, రణస్థలం ఏడీ ఎం.రాజేష్, ఏఈ జి.తిరుపతిరావు ఉన్నారు.అంతర్ జిల్లా బదిలీలకు పచ్చ జెండాశ్రీకాకుళం: ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ కావాలనుకునే ఉపాధ్యాయులు ఈనెల 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించారు. స్పౌజ్, మ్యూచువల్ కేటగిరీల్లో మాత్రమే బదిలీలు జరుపుతామని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం వా రు పనిచేస్తున్న జిల్లా, బదిలీ కావాల్సిన జిల్లా వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. కొత్త ప్రొఫార్మాలో ఈ వివరాలను పొందుపరిచి డీఎస్సీ ఏపీ ద్వారా ధ్రువీకరించుకోవాలి. వేరొ క జిల్లాకు బదిలీ అయినప్పుడు ప్రస్తుత జి ల్లాలోని సీనియార్టీని కోల్పోయి, అక్కడ చివరి ర్యాంకుల్లో చేరుతారు. ఈ ఏడాది జూలై 31 నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. -
ఆదాయమే పరమావధా..?
● శ్రీముఖలింగంలో సంప్రదాయాలకు విరుద్ధంగా హుండీ ఏర్పాటు ● భక్తులు విన్నవించుకున్నా పట్టించుకోని అధికారులు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం దక్షిణ కాశీగా పేరొందింది. ఇక్కడ స్వామిని దర్శించుకునేందుకు దేశ నలుమూలలు నుంచి భక్తులు, విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. అయితే ఎంతో చరిత్ర, విశిష్టత ఉన్న ఉన్న ఈ దేవాలయంలో దేవదాయ శాఖ అనాలోచిత నిర్ణయాలు భక్తుల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. ఆదాయ మే పరమావధిగా ఆలయ అధికారులు వ్యవహరిస్తున్నారని భక్తులు విమర్శిస్తున్నారు. ఎక్కడైనా శైవ దేవాలయాల్లో శివలింగం(స్వామివారు)కి దగ్గరలో కొన్ని అడుగులు దూరంలో నందిని ప్రతిష్టిస్తారు. పూజలు, అభిషేకాలు, దర్శనాలు అర్చనలు తదితరవి నిర్వహించే సమయంలో ముందుగా నందిని పూజించి తర్వాత శివునికి అభిషేకం చేస్తారు. శివునికి నందికి మధ్యలో ఎవరూ అడ్డంగా రాకూడదు. ఇది శాస్త్ర ప్రమాణం. అలాంటిది కేవలం ఆదాయ మే ధ్యేయంగా ప్రధాన దేవాలయంలో స్వామికి నందికి మధ్యలో మూడు చోట్ల నాలుగైదు హుండీలు ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈఓకు విన్నవించామని, అయినా చర్యలు తీసుకోలేదని విశాఖకు చెందిన ఓ భక్తుడు తెలిపాడు. దీనిపై ఈఓ టి.వాసుదేవరావును వివరణ కోరగా హుండీలు తొలగిస్తానని తెలిపారు. -
ఒత్తిడిని అధిగమించేందుకే క్రీడలు
అరసవల్లి: విధి నిర్వహణలో ఒత్తిళ్లు ఎదుర్కొంటు న్న విద్యుత్ ఉద్యోగులకు బ్యాడ్మింటన్ పోటీలు ఉపశమనం ఇస్తాయని తూర్పు ప్రాంత విద్యుత్ పంపి ణీ సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు. గురువారం స్థానిక శాంతినగర్ కాలనీలోని ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి విద్యుత్ ఉద్యోగుల బ్యాడ్మింటన్ పోటీలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు సర్కిల్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 వరకు జరిగే పోటీలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్స్) టీవీఎస్ సూర్య ప్రకాష్, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్, సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి, డివిజనల్ ఈఈ పైడి యోగేశ్వరరావు, కార్యదర్శి మహంతి ప్రభాకరరావు, స్పోర్ట్స్ ఆఫీసర్ వడివేళు, డిప్యూటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, జేఏఈ సనపల వెంకటరావు, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘ అధ్యక్షు డు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. కాగా తొలిరోజు పోటీల్లో ఆతిథ్య శ్రీకాకుళం జట్టు బాపట్లపై గెలుపొంది నెల్లూరు జట్టుతో జరిగిన పోరులో ఓటమి పాలైంది. కాగా, సర్కిల్ కార్యాల యం వద్ద సీఎండీ ఫృథ్వీతేజ్, డైరెక్టర్ సూర్యప్రకాష్ లు మొక్కలు నాటారు. -
ఇంట్లోనే తయారీ..
ఈ సీజన్లో ఇంట్లోనే బొమ్మలు తయారు చేస్తుంటారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు దీటుగా ఆకర్షణీయంగా మట్టి బొమ్మలు చేసేందుకు కుమ్మర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నా రు. కొందరు చదువుకున్న యువకులు కూడా ముందుకు వచ్చి వాటిని నేటి తరాన్ని ఆకర్షించేలా బొమ్మలు రూపొందిస్తున్నారు. బొమ్మల తయారీకి షెడ్లు అవసరం ఉంది. విగ్రహాలు పెద్దఎత్తున చేయాల్సి ఉంటుంది. దీంతో అధిక సంఖ్యలో బొమ్మలు తయారు చేసి వర్షానికి తడవకుండా ఉండేందుకు ఇళ్లు తాత్కాలికంగా అద్దెలకు తీసుకుంటారు. మూడు నెలల ముందు నుంచి అద్దెకు తీసుకొని బొమ్మల తయారీ మొదలుపెడతారు. ఏడాదిలో వినా యక చవితికి, దసరా సందర్భంగా బొమ్మలు తయారు చేసి అమ్ముతుంటారు. వాటిని తయా రు చేసేందుకు ప్రత్యేక షెడ్లు వేయించాలని తయారీదారులు కోరుతున్నారు. అవి లేకపోవడంతో తాము ఉంటున్న ఇంట్లోనే ఉంచాల్సి వస్తోందని చెబుతున్నారు. రుణాలు సైతం మంజూరు చేయాలని విన్నవిస్తున్నారు. -
● శిరస్త్రాణం..
గుబ్బగొడుగుగా వ్యవహరించే తాటాకుల ఛత్రం.. శ్రమజీవులకు శిరస్త్రాణం. ఎండైనా.. వానైనా.. నిరంతరం తలకు ధరించి స్వేదజీవి నిశ్చింతంగా పనిచేసుకునే సౌలభ్యం దీని సొంతం. దీనిని ధరించి మహిళలు రోజూ ఉపాధి పనులకు వెళ్లడం పరిపాటి. పై రెండు చిత్రాలు బుధవారం కనిమెట్ట– రాపాక రూట్లో ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. – పొందూరు నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. రోడ్డు ప్రమాదాలు జరిగే సమయంలో తలకు బలమైన గాయాలు కాకుండా కొంత వరకు నిరోధించవచ్చు. పూర్తిగా పాడై ఉన్న దారుల్లో దీని ప్రయోజనం కచ్చితంగా ఉంటుంది. అటు ప్రమాదాల నివారణతో పాటు దుమ్ము.. ధూళి కళ్లలో పడకుండా కాపాడుకోవచ్చు. -
బార్లా తెరిచారు!
● మద్యం అమ్మకాలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం మందుబాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాగినోడికి తాగినంత అన్నట్టు కొత్త బార్లతో ముందుకొచ్చింది. జిల్లాలో ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం ప్రవాహం ఇకపై మరింత ఉద్ధృతంగా ప్రవహించనుంది. ఒకవైపు విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి.. మరోవైపు నాటు సారా.. ఎక్కడికక్కడే అందుబాటులోకి వచ్చిన మద్యం వెరసి రాత్రి పూట గొడవలు, న్యూసెన్స్ పెరిగే అవకాశం ఉండటం పోలీసులకు సవాల్గా మారింది. తాగించడమే పనిగా.. కూటమి ప్రభుత్వం మందుబాబులను పూర్తిగా తాగించడమే పనిగా పెట్టుకుంది. ఎంత ఎక్కువగా మత్తులో ముంచితే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని భావిస్తోంది. దానికోసం అన్ని రకాల వెసులుబాట్లు కల్పిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 176 మద్యం దుకాణాలను ఏర్పాటు చేసింది. లైసెన్సు షాపులతో సరిపోదని బెల్ట్షాపులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే వీధికి ఐదు, పది బెల్ట్షాపులు నడుస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్యం దాహం తీరడం లేదు. లైసెన్స్ షాపుల వద్దే తాగేందుకు ఏర్పాట్లు చేసింది. పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చింది. దీంతో లైసెన్సు షాపుల వద్ద మందుబాబుల సందడే సందడి. ఇప్పుడు లైసెన్సు దుకాణాలకు, పర్మిట్ రూమ్లకు, బెల్ట్షాపులకు అనుబంధంగా బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాలో 19 బార్లు ఏర్పాటుకు, వాటికి అనుబంధంగా రెస్టారెంట్లకు క్లియరెన్స్ ఇచ్చింది. శ్రీకాకుళం, పలాస, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాల్టీల్లో అత్యధిక బార్లు ఏర్పాటు కాబోతున్నాయి. అర్ధరాత్రి వరకు మద్యం సరఫరా.. గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఏటా మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్య తగ్గిస్తూ వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కఠినంగా వ్యవహరించింది. బార్లు కూడా ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే మూసివేయాలని ఆదేశించింది. కానీ, కూటమి ప్రభుత్వం ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12గంటల వరకూ బార్లు తెరుచుకునేలా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విచ్చలవిడితనం మరింత పెరిగిపోనుంది. ఇప్పటికే మద్యం దుకాణాల వద్ద గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దాడులు పెరిగాయి. చాలా చోట్ల మద్యం దుకాణాలు న్యూసెన్స్గా తయారయ్యాయి. ఇక, బెల్ట్షాపుల కారణంగా గ్రామాల్లో చెప్పనక్కర్లేదు. మందుబాబుల జాతరే కనబడుతోంది. పల్లెల ప్రశాంతతకు చిచ్చు పెట్టింది. విచ్చలవిడిగా నాటుసారా.. ఒకవైపు ప్రభుత్వమే మందుబాబుల వద్దకు మద్యం సరఫరా చేస్తుండగా, ఇంకోవైపు ఒడిశా సరిహద్దు ప్రాంతంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాటుసారా కూడా తయారవుతోంది. పలాస, నరసన్నపేట, పాతపట్నం, ఆమదాలవలస, ఇచ్ఛాపురం, టెక్కలి నియోజకవర్గాల్లో నాటు సారా ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం కంటే తక్కువ ధరకు దొరకడంతో చాలా మంది ఆకర్షితులవుతున్నారు. వైన్కు వెచ్చించేంత స్థోమత లేని వారంతా నాటుసారా బారిన పడుతున్నారు. గుప్పుమంటున్న గంజాయి.. గంజాయి విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. ఇందుకు నిత్యం దొరుకుతున్న గంజాయి కేసులే నిలువెత్తు సాక్ష్యాలు. విక్రయాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్యాకెట్, లిక్విడ్, చాక్లెట్ రూపంలో విక్రయిస్తున్నారు. ఒడిశా, పాడేరు నుంచి జిల్లాకు ఎక్కువగా గంజాయి దిగుమతి అవుతోంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, జిల్లాలకు రవాణా అవుతోంది. ఇచ్ఛాపురం, పలాస, శ్రీకాకుళం , ఆమదాలవలస, పాతపట్నం తదితర ప్రాంతాల్లో గంజాయి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నట్టు నమోదవుతున్న కేసులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పోలీసులకు కష్టతరమే.. ఒకవైపు గంజాయి, మరోవైపు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో జిల్లాలో చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణ పడిన వారు ఏ మైకంలో ఉన్నప్పటికీ గంజాయి మత్తు అని చెబితే ఇబ్బంది అని మద్యం ఖాతాలో వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదేమైనా అటు మద్యం, ఇటు గంజాయితో ఇబ్బందికరంగా తయారైంది. తాజాగా పర్మిట్ రూమ్లు, అర్ధరాత్రి వరకు బార్లు తెరిచి ఉంచే అవకాశం ఇవ్వడంతో విచ్చలవిడితనం మరింత పెరిగిపోవడం ఖాయం. ప్రభుత్వమే అధికారికంగా అర్ధరాత్రి 12గంటల వరకు తాగే అవకాశం ఇవ్వడంతో ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించలేని పరిస్థితి నెలకొంది. ఆ సమయం వరకు మందుబాబులపై నిఘా పెట్టాలి. లేదంటే మత్తులో ఏ దుశ్చర్యకు పాల్పడతారో చెప్పలేం. మొత్తానికి కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ పోలీసులకు సవాల్గా మారిందనే చెప్పాలి. ఇకపై ఉదయం 10 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లకు అనుమతి ఇప్పటికే మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్లు విచ్చలవిడిగా బెల్ట్షాపులు జిల్లాలో పెరగనున్న న్యూసెన్స్ పోలీసులకు సవాల్గా కూటమి మద్యం పాలసీ -
గీత కులాలకు రెండు బార్లు
శ్రీకాకుళం క్రైమ్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో భాగంగా గీత కులాలకు జిల్లాలో రెండు బార్లు కేటాయించనట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి సీహెచ్ తిరుపతినాయుడు బుధవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరోషన్లో శ్రీశయన కులానికి ఒకటి, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సొండి కులస్తులకు మరో బార్ కేటాయించినట్లు తెలిపారు. దరఖాస్తులు ఈ నెల 29లోగా అందించాలని, దరఖాస్తు రుసుం రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఏడాది కాలానికి రూ.27.50 లక్షలు లైసెన్సు ఫీజు కట్టాలని, లాటరీ పద్ధతిన ఈ నెల 30న కలెక్టర్ కార్యాలయం వద్ద డ్రా తీస్తామని తెలిపారు. ఐటీఐలో మిగులు సీట్ల భర్తీకి నోటిఫికేషన్ ఎచ్చెర్ల : ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి మూడో విడత నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు బుధవారం తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 26 లోగా ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పత్రంతో పాటు విద్యార్హతల సర్టిఫికెట్లతో ఈ నెల 27న నిర్దేశిత ఐటీఐలో వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో 29న, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో పనిచేయండి అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ అన్నారు. బుధవారం జెడ్పీ బంగ్లా వద్ద పలువురికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. కొండగొర్రి రాహుల్(భామిని మండల పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్), తీడ తేజేశ్వరరావు(జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్), సూరవజ్జల రాజ్యలక్ష్మి(హరిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్), వేమూరి నాగమణి(జెడ్పీలో జూనియర్ అసిస్టెంట్)లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్, డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణ తదితరులున్నారు. 24న ఇచ్ఛాపురంలో జానపద సంబరాలు ఇచ్ఛాపురం రూరల్: ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా మహతీ సాంస్కృతిక కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న జానపద సంబరాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఈదుపురం రామాలయం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 24న ఇచ్ఛాపురం రోటరీ క్లబ్ వద్ద జానపదం, కోలాటం, సంబల్పురీ భూం బాగోతం, కోయనృత్యం వంటి ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రంగాల జానకిరామ్, వ్యవస్థాపక కార్యదర్శి తిప్పన ధనుంజయరెడ్డి, ఉపాధ్యక్షుడు నర్తు గంగయ్య, ప్రచార కార్యదర్శి చలపరాయి వినోద్, కోశాధికారి కొప్పల హేమంత్, కారంగి త్రినాధ్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
సుందరీకరణే ముద్దు
సౌకర్యాలు వద్దు..శ్రీకాకుళం : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది జిల్లా కేంద్రంలోని రిమ్స్ సర్వజన ఆస్పత్రి పరిస్థితి. 930 పడకలతో పెద్దాసుపత్రిగా కొనసాగుతున్నా వాస్తవానికి మాత్రం ఇక్కడ ఉన్నవి 650 మాత్రమే. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో ఈ పడకలు ఏ మూలకూ సరిపోవు. దీంతో పలువురు రోగులు గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో నిర్వహణకు నోచుకోని వందలాది మంచాలు ఉన్నాయి. వీటిని భవనాల టెర్రస్పై, కొన్ని వార్డు గదుల్లో పడేసి వినియోగంలో లేకుండా చేసేశారు. ఇటు రిమ్స్ అధికారులు గానీ, అటు ఇంజినీరింగ్ అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. వీటిని జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారుల అనుమతితో పాత సామాన్లుగా విక్రయిస్తే ఆ మొత్తంతో 300కు పైగా మంచాలను కొనుగోలు చేయవచ్చని వైద్యులే చెబుతుండటం గమనార్హం. ఇదేం తీరు.. ఇంజినీరింగ్ అధికారులు సుమారు రూ.12 లక్షలను రిమ్స్ ప్రాంగణంలో సుందరీకరణ పేరిట మొక్కలు నాటడం వంటి పనులకు ఖర్చు చేస్తున్నారు. ఈ మొత్తాన్ని వెచ్చిస్తే 300 పడకలతో పాటు నిరుపయోగంగా ఉన్న కొత్త హాస్టల్ భవనాలు వినియోగించుకునేందుకు అవసరమైన ఫర్నిచర్ను కొనుగోలు చేసుకోవచ్చు. అయితే మంత్రి, కలెక్టర్ సుందరీకరణ చేయాలని చెప్పినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొనడం గమనార్హం. రోగులకు అవ సరమైన వాటిని పక్కన పెట్టి సుందరీకరణ కోసం అంచనాల రూపొందించి వాటిని రిమ్స్ అధికారులతో ఆమోదింప చేయడం పట్ల ఆసుపత్రి వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సౌకర్యాల కోసం కాకుండా సుందరీకరణ కోసం రిమ్స్ సూపరింటెండెంట్ ఏ విధంగా అంగీకరించారో అర్థం కావడం లేదని వైద్యులే చెబుతున్నారు. గదులూ కొరతే.. రిమ్స్లో చదువుతున్న ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులకు వసతి సమస్య వేధిస్తోంది. కొత్త భవనాలు నిర్మించినా ఫర్నిచర్ లేదన్న కారణంగా వాటిని రిమ్స్ అధికారులు రెండేళ్లుగా స్వాధీనం చేసుకోవడం లేదు. పలు వార్డు గదుల్లో పాత ఫర్నిచర్ పడేయడం వల్ల అవి కూడా నిరుపయోగంగా మారాయి. చాలా భవనాల్లో గదులను కొందరు ఇతర శాఖల అధికారులు, రిమ్స్లోని కొన్ని విభాగాల ఉద్యోగులు తమ ఆధీనంలో ఉంచుకోవడం కూడా గదుల కొరతకు కారణంగా నిలుస్తోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, కుష్టు నివారణ అధికారితో పాటు శానిటేషన్ ,సెక్యూరిటీ ఇలా ఎంతోమంది గదులను తమ ఆధీనంలో ఉంచుకున్నారు. ఇదే సమయంలో హెచ్ఆర్ఏను మాత్రం జీతంతో పాటు తీసుకోవడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి పేద రోగులకు, వైద్య విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. రిమ్స్ లో వింత పరిస్థితి పడకల కొరత ఉన్నా పట్టించుకోని అధికారులు సుందరీకరణ పేరిట మొక్కలు ఏర్పాటు చేస్తున్న వైనం సరిపడా మంచాలు లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న బాధితులు మంత్రి ఆదేశాల మేరకే.. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రిమ్స్ ఆవరణను సుందరీకరణగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అందుకోసమే పది లక్షల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఈ అంచనాలకు అడ్మినిస్ట్రేటర్పాటు సూపరింటెండెంట్ ఆమోదించారు. – సత్య ప్రభాకర్, ఈఈ ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ -
రచ్చగా మారిన అచ్చెన్న పేషీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఒకే ఒక్క లేఖ.. మన జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేషీని వేలెత్తి చూపించింది. ఇప్పుడది జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్గా పనిచేసిన రాజమోహన్ ప్రభుత్వానికి రాసిన లేఖతో అచ్చెన్నాయుడు పేషీ అవినీతికి కేంద్రంగా మారిందన్న ఆరోపణలకు తావిచ్చింది. ఇప్పుడంతా ఆయన దగ్గర పనిచేస్తున్న ఓఎస్డీపైనే చర్చ నడుస్తోంది. ఎవరా ఓఎస్డీ.. ఏంటా కథ.. అని ఆరా తీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.చెప్పిన మాట వినలేదని..వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులు, వ్యవసాయ శాఖ మంత్రి పేషీకి మధ్యవర్తిగా వ్యవహరించాలని ఓఎస్డీ కోరినట్టు ఏపీ ఆగ్రోస్ జనరల్ మేనేజర్ రాజమోహన్ ఏకంగా చీఫ్ సెక్రటరీతో పాటు ఏపీ ఆగ్రోస్ వైస్ చైర్మన్, ఎండీకి లేఖ రాశారు. ఓఎస్డీ చెప్పినట్టు వినలేదన్న అక్కసుతో తనను వేధించినట్టు.. ఆ ఒక్క కారణంతో తనను నెల్లూరుకు బదిలీ చేశారని లేఖలో ప్రస్తావించారు. సెలవుపై వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించడం లేదని వెల్లడించారు. తన స్థానంలో కేసులు పెండింగ్లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కేడర్ గల వారిని నియమించారని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ లేఖ బయటకు రావడమే తరువాయి.. మంత్రి అచ్చెన్నాయుడిపైన, ఆయన పేషీ పైన, సదరు ఓఎస్డీపైన విస్తృత చర్చ జరుగుతోంది.సూత్రధారిగా..అచ్చెన్నాయుడు మంత్రి అయిన ప్రతీసారి ఓఎస్డీగా, వ్యక్తిగత సిబ్బందిగా ఉన్న ఒక ‘నాయుడు’ పాత్రపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఆయన చేసే ప్రతీ కార్యక్రమంలో వచ్చే ప్రయోజనాలు చివరికి ఎవరికి వెళ్తున్నాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదని.. కానీ అన్నింటికీ సూత్రధారి ఆ ఓఎస్డీయే అని మాట్లాడుకుంటున్నారు. జిల్లాలో ఆయన కోసం తెలిసిన ప్రతీ ఒక్కరూ పేషీలో ఏదో చేసే ఉంటాడని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఆ ఓఎస్డీపై ఎల్లోమీడియాలో కూడా కథనాలు వచ్చాయని, ఆయన ఎంత బరితెగించకపోతే ఆ మీడియాలో తప్పని పరిస్థితుల్లో కథనాలు ఇచ్చి ఉంటారో అర్ధం చేసుకోవచ్చని, అయినప్పటికీ వెనక్కి తగ్గడం లేదని విస్తృత చర్చ నడుస్తోంది. ఇక, అచ్చెన్నాయుడిపై ఆరోపణలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ఈఎస్ఐ స్కామ్ ప్రత్యేకమైనది. -
చోరీకి యత్నించిన మహిళ అరెస్టు
మెళియాపుట్టి: ఈనెల 14వ తేదీన పట్టపగలే ఒక మహిళ చోరీకి ప్రయత్నించడమే కాకుండా.. మరో మహిళపై దాడిచేసి పారిపోయిన ఘటన మండలంలోని పట్టుపురం గ్రామంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే మంగళవారం సాయంత్రం దాడికి పాల్పడిన మహిళను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో పాతపట్నం సీఐ వి.రామారావు, ఎస్ఐ పి.రమేష్ బాబు మీడియాకు వివరాలు బుధవారం వెల్లడించారు. మెళియాపుట్టి మండలంలోని వసుంధర గ్రామానికి చెందిన మనుజ మల్లిక్ అనే 41 ఏళ్ల మహిళ పట్టుపురం గ్రామానికి చెందిన అంబల లచ్చయ్య ఇంట్లో ఈనెల 14వ తేదీన చొరబడింది. అదే సమయంలో లచ్చయ్య భార్య అంబలి కాంచన మెళియాపుట్టి గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయంలో సేవకు వెళ్లి కార్యక్రమం ముగించుకుని ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి చూసేసరికే, తలుపు చాటున గుర్తు తెలియని మహిళ (మనుజ మల్లిక్) కాంచన తలపై బలంగా కర్రచెక్కతో కొట్టి పారిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనిలో భాగంగా మనుజ మల్లిక్ స్కూటీ, ఆమె వేసుకున్న బుర్ఖా, ఇతర ఆనవాళ్లు సీసీ కెమెరాలో గుర్తించారు. మంగళవారం వసుంధర చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన ద్విచక్ర వాహనం గమనించి ఆమెను పట్టుకున్నారు. దొంగతనానికి వచ్చి, అంతలోనే ఇంటి యజమాని రావడంతో దొరికిపోతానేమోనన్న భయంతో దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పక్కా ప్లాన్తోనే.. ఒడిశాలోని ఖైటడ గ్రామంలో బాధితురాలు, ముద్దాయి మునుజ పక్కపక్క ఇళ్లల్లో కొన్నేళ్లు కలిసి ఉండేవారు అదే క్రమంలో పరిచయం ఏర్పడింది. పలుమార్లు పట్టుపురం వచ్చి అంతా గమనించి దొంగతనానికి పాల్పడింది. మనుజ మల్లిక్ ప్రస్తుతం పర్లాకిమిడిలో బ్యూటీపార్లర్ నడుపుతుంది. అక్కడి ఆర్టీవో కార్యాలయం అధికారులతో చనువు పెంచుకుని పలువురికి లైసెన్సులు చేయిస్తూ ఉంటుంది. ఆమె విలాసాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతుందని, ఆమె ఉన్న ఏరియాలోనే దొంగతనాలు జరుగుతున్నాయని, వాటి వెనుక ఈమె హస్తం ఉందని ఒడిశా పోలీసులు సైతం అనుమానిస్తున్నట్లు సమాచారం. వారు కూడా ఈమె కదలికలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. -
సత్తాచాటిన ప్రజ్ఞామణి
సోంపేట: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) నీట్ పీజీ ఫలితాల్లో సోంపేటకు చెందిన విద్యార్థిని గేదెల ప్రజ్ఞామణి జాతీయ స్థాయిలో 1,039వ ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఈమె ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. పీజీ ఫలితాల్లో సత్తా చాట డంతో తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.బదిలీల సమస్య పక్కదారి పడుతోంది డీటీఎఫ్ నాయకుడు పేడాడ కృష్ణారావుశ్రీకాకుళం: జిల్లాలో ఇటీవల జరిగిన ముగ్గురు కేజీబీవీ ప్రిన్సిపాల్స్ బదిలీల సమస్య పక్కదారి పడుతోందని, రాజకీయ సమస్యగా మారుస్తున్నారని డీటీఎఫ్ నాయకుడు పేడాడ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోలుగు కేజీబీవీ నుంచి కంచిలికి బదిలీ అయిన ప్రిన్సిపాల్ సౌమ్య, ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ నాయకుల మధ్య జరుగుతున్న ఆరోపణలతో అసలు విషయం మరుగున పడుతోందన్నారు. జిల్లా అధికారులు, అధికార పార్టీ నాయకులు చెబుతున్నట్లుగా లోలుగు కేజీబీవీ నుంచి కంచిలికి బదిలీ అయిన సౌమ్య అక్రమాలకు పాల్పడితే సుదూర ప్రాంతానికి బదిలీ చేయడం మంచిదేనన్నారు. అయితే కంచిలి కేజీబీవీ ప్రిన్సిపాల్ను జిల్లా కేంద్రం సమీపంలోని కేజీబీవీకి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో అధికారులు, అధికార పార్టీ పెద్దలు చెప్పకపోవడం విచారకరమన్నారు. అలాగే గారలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ను పొందూరు ఎందుకు బదిలీ చేశారని ప్రశ్నించారు. సౌమ్య నిజంగానే అవినీతి చేసి ఉంటే, విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టి ఇద్దరిని మాత్రమే బదిలీ చేస్తే సమంజసంగా ఉండేదని, ముగ్గురుని ఎందుకు బదిలీ చేశారో కారణాలను ఎస్ఎస్ఏ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బదిలీలకు గల కారణాలను వెల్లడించి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరారు. -
మేలుకోకుంటే నష్టం
ముంచేసిన వర్షం..ఆమదాలవలస: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పొలాల్లో నీరు కనిపిస్తోంది. కాలువల ద్వారా పొలాల్లోకి సాగునీరు చేరింది. అయితే వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే వెద పద్ధతిలో వరి సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని, పంట నీట మునిగితే ఎదుగుదలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు తెలిపారు. ఈ తరుణంలో వరితోపాటు వివిధ పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు వరి పంట 1.30 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అలాగే మొక్కజొన్న 9,000 హెక్టార్లు, పత్తి పంట 850 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఈ పంటల్లో జాగ్రత్తలు పాటిస్తే నష్ట నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. వరి పంటలో... జూన్, జూలై నెలల్లో ముందుగా వెదజల్లిన వరిపంట పిలక దశకు చేరుకుంది. ఇంద్ర(ఎంటీయూ 1061), అమర ఎంటీయూ (1064) వంటి రకాలు కొంతవరకు ముంపును/అధిక నీటిని తట్టుకోగలవు. ● పొలాల నుంచి నీరు బయటకు పోయేలా మార్గాలు ఏర్పాటు చేయాలి. పంట పాక్షికంగా దెబ్బ తిన్నట్లయితే పంటలో ఒత్తుగా ఉన్న పిలకలను తీసి పలుచగా ఉన్నచోట నాటుకోవాలి. అలాగే పంట ఎదుగుదలకు ఎకరాకు 20 – 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలి. లేదా నానో యూరియా ఎకరానికి అరలీటర్ చొప్పున పిచికారీ చేసుకోవాలి. ● పంటమీద తెగుళ్లు రాకుండా ఉండేందుకు కార్బండిజం ఒక గ్రాము లేదా మాంకోజెబ్ రెండు గ్రాము లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● నాట్లు వేసే రైతులకు ఈ వర్షాలు అనుకూలం కాబట్టి 30 నుంచి 35 రోజుల ఆరోగ్యవంతమైన నారు నాటుకోవాలి. నారు ముదిరితే దగ్గర దగ్గరగా కుదురుకు ఎక్కువ పిలకలు ఉండేటట్లు చూసుకోవాలి. ● నాట్లువేసిన వారం రోజులు లోపు తప్పనిసరిగా 50 కిలోల డీఏపీతో పాటు పది కిలోల పొటాష్ ఎరువును వేసుకోవాలి. ● అలాగే నాట్లు వేసిన వారం రోజులకు ప్రతీ రెండు మీటర్లకు 20 సెంటీ మీటర్లు చొప్పన కాలిబాటలు తీయాలి. మొక్కజొన్న పంటలో... జూన్ మాసంలో విత్తుకున్న మొక్కజొన్న పైరు పూత దశలో, జూలై నెలలో విత్తుకున్న పైరు మోకాలు ఎత్తు దశలో ఉంటుంది. – పూత దశలో ఉన్న పైరుకు ఎకరాకు 50 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను పైపాటుగా వేయాలి. ● 25 నుంచి 30 రోజుల వయసున్న పైరులో అంతర కృషి జరిపి, ఎకరాకు ఒక బస్తా యూరియాను పైపాటుగా వేసుకొని, మట్టిని మొక్కల వేర్లుకు ఎగదోయాలి. ● ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు లేత పైరు అధిక తేమను తట్టుకోలేదు. ఈ పరిస్థితిని నివారించుటకు పొలం నుంచి వర్షపు నీటిని మురుగు నీటి కాలువల ద్వారా బయటకు తీయాలి. ● ఎకరాకి 25 కిలోల యూరియా, పది కిలోల పొటాష్ ఎరువులను అదనంగా వేయాలి. పత్తి పంటలో... ప్రత్తి పంట అధిక తేమను తట్టుకోలేదు. ఆకులు మొదట గులాబీ రంగుకు మారి, తర్వాత పూర్తిగా ఎర్రబడి, ఎండిపోయి రాలిపోతాయి. ● పొలంలో కాలువలు తీసుకొని నీటిని బయటకు పంపించాలి. ● నెలరోజులు దాటిన పంట అధిక వర్షాలకు గురైతే, పంట ఎదుగుదలకు ఎకరాకు 25 కిలోలు యూరియా, 10 కిలోల పొటాష్ ఎరువులను అదనంగా వేయాలి. ● లేదా లీటరు నీటికి 10 గ్రాములు మెగ్నీషియం సల్ఫేట్ మరియు 10 గ్రాముల యూరియా/డీఏపీ కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. ● వేరుకుళ్లు తెగులు ఆశించకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లును తడపాలి పంటల్లో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు వరి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు -
దేశానికి మోదీనే బ్రాండ్
● ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శ్రీకాకుళం న్యూకాలనీ: భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పెద్ద బ్రాండ్ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. ఏపీ బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి శ్రీకాకుళంలో బుధవారం పర్యటించిన మాధవ్కు జిల్లా నాయకులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో పార్టీ శ్రేణులతో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఉమ్మడిగా పోటీ చేసేవిధంగానే చర్యలు తీసుకుంటామన్నారు. బీజేపీ నాయకులంతా పోటీ చేసేందుకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచపటంలో శ్రీకాకుళం జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు ఉందని కొనియాడారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాధవ్ మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ను సైల్లో మెర్జ్ చేయాలని బీజేపీ రాష్ట్ర శాఖ తరుపున సూచించినట్లు పేర్కొన్నారు. దేశంలో స్టీల్ ప్లాంట్లు కాపాడిన ఘనత బీజేపీదేనని, కొత్త పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని, మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టు త్వరితగతిన పూర్తిచేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, ముఖ్య నాయకులు పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాలం, శవ్వాన ఉమామహేశ్వరి, అట్టాడ రవిబాబ్జి, బిర్లంగి ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పోక్సో కేసు నమోదు రణస్థలం: మండలంలోని పైడిభీమవరం గ్రామానికి చెందిన బాలికపై ఇప్పిలి సతీష్ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడంతో జేఆర్పురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరం హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న బాలిక మంగళవారం రాత్రి ఇంటి వద్ద ఉన్న సమయంలో, కనిమెట్ట గ్రామానికి చెందిన ఇప్పిలి సతీష్ అనే వ్యక్తి మద్యం తాగి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ఈ ఘటనపై ఎస్ఐ ఎస్.చిరంజీవి పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామ పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు అనే వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. ఒడిశాలోని రాధా సాగరంలో రామారావు గల్లంతైన విషయం తెలిసిందే. బుధవారం మృతదేహం ఒడ్డుకు కొట్టుకురావడంతో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఒడిశా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పర్లాకిమిడి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృత్యువాతపడడంతో భార్య లక్ష్మి రోదనలు మిన్నంటాయి. అక్రమంగా మూగజీవాలు తరలింపు కంచిలి: ఒడిశా రాష్ట్ర పరిధి గొలంత్ర గ్రామం నుంచి విజయనగరం జిల్లా అలమంద సంతలో అమ్మేందుకు తరలిస్తున్న 12 గేదెలను కంచిలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం కంచిలి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక వాహనంలో ఈ గేదెలను ఆక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న నలుగురుపైన కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. ఎచ్చెర్ల: మండలంలోని జరజాం గ్రామ సచివాలయంలో పశుసంవర్ధక సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న తమ్మినేని అయ్యప్ప(సంతోష్కుమార్) జోన్–1 నుంచి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు. బుధవారం విజయవాడలోని డైరెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఆ శాఖ రాష్ట్ర సంచాలకుడు డాక్టర్ డి.దామోదరనాయుడు ఈ అవార్డును అందించారు. పశుసంవర్ధక శాఖకు సంబంధించి పలు కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి, పాడి రైతులకు మేలు చేసినందుకు ఈ అవార్డును ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. -
పొగురు తెచ్చిన చేటు..!
ఇచ్ఛాపురం రూరల్: అల్పపీడనం ప్రభావంతో గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు బూర్జపాడు పంట పొలాలు నీట మునిగిపోయాయి. స్థానిక డొంకూరు ఉప్పుటేరుకు ఆనుకొని ఉన్న పంట పొలాల రైతులకు పొగురు వలన తీవ్ర నష్టం కలిగింది. కురిసిన వర్షాలకు వరద నీరు ఉప్పుటేరు గుండా సముద్రంలో కలవాల్సి ఉండగా.. సముద్రంలో ఉప్పుటేరు కలిసే చోట ఇసుక మేట వేయడంతో వరద నీరు పంట పొలాల్లోకి చొచ్చుకుపోయింది. దీంతో సుమారు 50 ఎకరాల వరకు పంట నీట మునిగిపోయింది. సోమ, మంగళవారం రోజున నాటిన వరినాట్లు వరద ఉద్ధృతికి నీటిపైకి తేలిపోవడంతో రైతులు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం వరినారు ఎక్కడా దొరకని పరిస్థితి ఉండగా.. ఇటువంటి పరిస్థితుల్లో మరల నాట్లు ఎలా వేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి డొంకూరు సముద్రం – ఉప్పుటేరు మధ్య ఇసుక మేటలు(పొగురు) తొలగిస్తే పంటలను రక్షించుకోవచ్చని, లేకుంటే వందల ఎకరాలకు నష్టం వాటిళ్లుతుందని వాపోతున్నారు. ముంచెత్తిన వరద నీటిలోనే పంట పొలాలు -
తాగునీటికి చింత..!
వంశధార చెంత.. కొత్తూరు: తరాలు మారుతున్నా ఆ గ్రామ ప్రజల తలరాత మారడం లేదు. వంశధార నది నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఉద్దానం ప్రాంత గ్రామాలకు తాగునీటిని తరలిస్తున్న ఈరోజుల్లో, నది చెంతనే ఉన్నా గొంతెండుతున్న పరిస్థితి వారిది. పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో గుక్కెడు నీటికోసం చెలమ వైపు చూస్తున్నారు మండలంలోని ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో ఉన్నటువంటి కడుము గ్రామం ప్రజలు. ఈ గ్రామంలో సుమారు 2,500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మహిళలు వంశధార నది వద్దకు వెళ్లి చెలమ నీటిని బిందెల్లో తోడుకొని ఇళ్లకు తీసుకొని వెళ్తుంటారు. నదికి వరదలు వచ్చినట్లయితే చెలమ నీటికి సైతం అవకాశం ఉండదు. అటువంటి సమయంలో గ్రామానికి రెండు కి.మీ దూరంలో ఉండే ఒడిశా రాష్ట్రంలోని కిడిగాం గ్రామం బోరు నుంచి తాగునీటిని తీసుకు రావాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ బోర్లు నుంచి వచ్చే నీరు తాగేందుకు ఉపయోగపడడం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెలమ నీటినే తాగడం వలన అనారోగ్యాల బారిన పడుతున్నామని వాపోతున్నా రు. తమ గ్రామానికి సుజల ధార పథకంలో భాగంగా పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పట్టించుకోవడం లేదు మా గ్రామానికి తాగునీటి కోసం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఊట నీరు కలుషితమైనప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో ఆ నీరే తాగుతున్నాం. గ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు బాగులేకపోవడంతో ఊట నీరే మాకు దిక్కవుతోంది. అధికారులు స్పందించి తాగునీటి ఏర్పాట్లు చేయాలి. – లంక పార్వతి, కడుము గ్రామం, కొత్తూరు మండలం వరదలు వస్తే ఒడిశా వెళ్లాలివర్షాకాలంలో వంశధార నదికి వరద వచ్చినట్లయితే ఊట నీరు ఉండదు. అప్పుడు మా గ్రామం నుంచి ఒడిశా రాష్ట్రం కిడిగాం గ్రామం సమీపంలో ఉన్న బోరు నుంచి తాగునీరు తీసుకొస్తాము. మేము తాగునీటి కోసం పడుతున్న కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా మాకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. – బూరాడ స్వాతి, కడుము గ్రామం, కొత్తూరు మండలంచర్యలు తీసుకుంటాం కడుము గ్రామంలో ఇంటింటా కుళాయిలు వేసేందుకు ఉద్దానం ఫేజ్–2 పథకం నుంచి నిధులు మంజూరయ్యాయి. కాంట్రాక్టర్తో మాట్లాడి పనులు త్వరలో చేయించేందుకు చర్యలు తీసుకుంటాం. – సాగర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈఈ, కొత్తూరు మండలం రెండు కి.మీ నడుస్తున్నాంగ్రామంలో ఉన్న బోర్లు నుంచి వస్తున్న నీరు తాగేందుకు పనికి రావడం లేదు. దీంతో రానుపోను రెండు కి.మీ నడిచి నది వద్దకు నీటికోసం వస్తాము. వర్షాలు కురుస్తున్నా తాగునీటి కోసం నదికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. – కొల్లారి శ్రీదేవి, కడుము గ్రామం, కొత్తూరు మండలం -
బ్లాక్ మార్కెట్లో ఎరువులు
టెక్కలి: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల వాటాలో 50 శాతం మాత్రమే తీసుకుని మిగిలినది నగదు రూపంలో కూటమి ప్రభుత్వం లాగేసుకుందని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటబొమ్మాళి మండలంలో మంత్రి అచ్చెన్నాయుడికి అనుకూలంగా ఉన్న బ్రోకర్ల వద్ద బ్లాక్ మార్కెట్లో ఎలా ఎరువులు దొరుకుతున్నాయో మంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2018లో తిత్లీ తుఫాన్ సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని అప్పటి మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినా ఇంతవరకు సాయం అందలేదన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అప్పటి కమీషనర్ అరుణ్కుమార్ స్పందించి జిల్లాకు రూ.83 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని, అందులో ఒక్క టెక్కలి నియోజకవర్గానికే రూ.39 కోట్లు ఇచ్చారని వివరించారు. దీనిపై కనీస అవగాహన లేక టీడీపీ నాయకులు విమర్శలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టెక్కలిని జిల్లా కేంద్రంగా మారుస్తానని, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి చివరకు రైతులే సొంత డబ్బులతో బీమా కట్టించుకునే పరిస్థితికి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. కింజరాపు కుటుంబ పాలనలో టెక్కలిలో ఒక్క శాశ్వతమైన పథకం ఇచ్చారా అని తిలక్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడికి సత్తా ఉంటే ఆఫ్షోర్, విత్తనోత్పత్తి కేంద్రాన్ని పూర్తి చేయాలని, రైతులకు రెండో విడతగా పూర్తి స్థాయిలో ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, సంతబొమ్మాళి జెడ్పీటీసీ పాల వసంత్ రెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు హెచ్.వెంకటేశ్వరరావు, ఎస్.హేమసుందర్రాజు, టి.ఫాల్గుణరావు, బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి జి.గురునాథ్ యాదవ్, నాయకులు కె. అజయ్కుమార్, కె.జీవన్, పి.వైకుంఠరావు, డి. కూర్మారావు, పేడాడ వెంకటరావు పాల్గొన్నారు. టెక్కలి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ -
దబ్బపాడు.. బాహ్య ప్రపంచానికి దూరం
హిరమండలం: ఎల్ఎన్ పేట మండలం దబ్బపాడు గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగి పోయాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కడపలవానిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో దబ్బపాడు గ్రామ ప్రజలు బయటకు రావడానికి కూడా వీల్లేకుండాపోయింది. ఏటా కడపలవానిగెడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో వరద ఉన్న సమయంలో ఆ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇక్కడ వంతెన నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. పనులు కూడా అప్పటి ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రారంభించారు. కానీ ఆ పనులను కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. -
జీవనాధారం నీవేనయ్య..!
ఓ బొజ్జ గణపయ్య.. ● విగ్రహాల తయారీనే నమ్ముకున్న కళాకారులు ● స్థానికులతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి రాక ● ట్రెండ్కు తగ్గట్టు రూపుదిద్దుకుంటున్న విగ్రహాలు ● వారం రోజుల్లో నవరాత్రి ఉత్సవాలు వజ్రపుకొత్తూరు రూరల్ : వినాయక చవితి సందడి మరో వారం రోజుల్లో మొదలుకానుంది. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు ప్రారంభమై నవరాత్రులు ఎంతో వైభవంగా జరుపుకునే ఈ ఉత్సవం ఈ నెల 27న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కళాకారులు విగ్రహాలకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. విగ్రహాలు తయారు చేసే కళను నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. ఏడాదికి ఒకసారి వచ్చే వినాయక చవితి ఉత్సవాలకు అవసరమైన బొజ్జ గణపయ్య విగ్రహాలను కళాకారులు తయారు చేసి ఏడాదికి సరిపడ ఆదాయాన్ని అర్జించి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ప్రధానంగా ఈ సీజన్లో రాజస్థాన్, కోల్కత్తా, రాజమండ్రి తదితర ప్రాంతాలలో పాటు జిల్లాలో ఉన్న పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, కాశీబుగ్గ, హరిపురం తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 200 విగ్రహా తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది కళాకారులు, వ్యాపారులు, కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఉత్సవాలకు మూడు నెలల ముందు విగ్రహాల తయారీ కేంద్రాలను ఎంపిక చేసుకొని అవసరమైన ముడి సామగ్రిని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కోనుగోలు చేసుకొని సేకరించి నిల్వపెట్టుకున్నారు. రెండు నెలల ముందు విగ్రహాలను తయారీ చేయడం ప్రారంభించారు. ఉత్సవానికి సమయం దగ్గర పడటంతో విగ్రహాలకు తుది మెరుపులు దిద్దుతున్నారు. ఏటా ట్రెండింగ్లో ఉన్న వినాయక విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది. పూజా కమిటీ నిర్వాహకుల అభిరుచికి తగ్గట్టుగా రకరకాల ఆకృతిలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. 2 అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలను తయారీ చేసి మార్కెట్లో అమ్మకాల కోసం సిద్ధం చేస్తున్నారు. విగ్రహాల మోడల్, సైజ్ బట్టి ఒక్కొక్క విగ్రహాన్ని రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మకాలు చేస్తున్నారు. కళాకారులు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి విగ్రహాలు తయారీ చేస్తున్నారు. అయితే తాము ఆశించిన స్థాయిలు విగ్రహాలు అమ్ముడుపోతేనే తమ కుటుంబ పోషణకు భరోసా దొరుకుతుందని, లేదంటే నష్టాలు చవిచూడాల్చిన పరిస్థితి ఏర్పడుతుందని కళాకారులు చెబుతున్నారు. -
నీరు.. కన్నీరాయె..
రెండున్నరేళ్ల పిల్లాడు.. ఆ నీటి లోపల మునిగిపోతూ అమ్మను ఎంత తలచుకున్నాడో.. నాన్నను ఎంతగా పిలిచాడో. ఊపిరి అందక ఎంత విలవిలలాడిపోయాడో.. ఇంటి పక్కన తీసిన పెంట గొయ్యి ఆ పిల్లాడికి మృత్యు కుహరంలా మారింది. వాన నీటికి నిండిన గోతిలో దాగున్న మృత్యుదేవత చిన్నారిని అమాంతం మింగేసింది. బద్రి గ్రామంలో జరిగిన ఈ విషాద సంఘటనతో ఊరుఊరంతా శోకంలో మునిగిపోయింది. సారవకోట: మండలంలోని బద్రి గ్రామంలో మంగళవారం పెంట గొయ్యిలో పడి ఆ గ్రామానికి చెందిన శిమ్మ లోకేష్ అనే బాలుడు మృతి చెందా డు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివ రాలు ప్రకారం.. బద్రి గ్రామానికి చెందిన శిమ్మ దాలినాయుడు, హేమలతలకు మౌళి, లోకేష్ ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడైన లోకేష్కు 2 ఏళ్ల 4నెలల వయసు ఉంటుంది. మంగళవారం ఉదయం తల్లి హేమలత కుళాయి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లగా ఆమె వెంట బాలుడు కూ డా వెళ్లాడు. ఆ ఇంటి పక్కనే జాతీయ ఉపాధిహా మీ పథకంతో కంపోస్టు ఎరువుల తయారీ కోసం తీసిన పెంట గొయ్యి వాన నీటితో నిండి ఉంది. అమ్మతో వెళ్లిన బాలుడు అటుగా వెళ్లి గోతిలో పడిపోయాడు. దీన్ని ఎవరూ గమనించలేదు. తల్లి నీళ్లు పట్టుకుని కుమారుడి కోసం వెతకగా ఆ గోతిలో మృతదేహం తేలడంతో ఆమె దిగ్భ్రాంతి కి గురయ్యారు. వెంటనే బాలుడిని బయటకు తీ సి బుడితి సీహెచ్సీ తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు అక్కడి సిబ్బంది చెప్పడంతో గుండెలవిసేలా రోదించారు. గంట క్రితం వరకు ఇంటిలో అల్లరి చేస్తూ ఆడిన పిల్లాడు అలా చలనం లేకుండా పడి ఉండడం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 120 పెంట గొయ్యిలను మూడు నెలల కిందట తవ్వించారు. ప్రస్తుతం వర్షాలకు ఈ పెంట గొయ్యిలు నీటితో నిండి ఉన్నాయి. పిల్లలు అటు గా తిరిగేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నారు. పెంట గోతిలో పడి బాలుడి మృతి కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు -
‘దళిత మహిళకు న్యాయం జరిగే వరకు పోరాటం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పొందూరు కేజీబీవీ నుంచి కంచిలి కేజీబీవీకి ప్రిన్సిపాల్ సౌమ్యను అక్రమంగా బదిలీ చేశారని, ఆమెకు న్యాయం జరిగే వరకూ దళిత సంఘాలు ఐక్యంగా పోరాటం చేస్తాయని పలువురు వక్తలు అన్నారు. స్థానిక అంబేడ్కర్ విజ్ఞాన భవన్లో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కొన్ని అసత్య ఆరోపణలతో బదిలీ చేయడమే కాకుండా, అనేక విధాలుగా వేధించినట్లు సౌ మ్య వెల్లడించిన నుంచి ఆమదాలవలస ఎమ్మె ల్యే కూన రవికుమార్ అనుచరులు సోషల్ మీ డియాలో సౌమ్యపైన ఆమె కుటుంబ సభ్యుల పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మానసిక క్షో భకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. హోం మంత్రి తక్షణం జిల్లాకు వచ్చి వాస్తవాలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జిల్లా నాయకులు కంఠ వేణు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకులు రానా శ్రీనివాస్, బొడ్డేపల్లి కృష్ణా, గరికివాడు, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, దళిత ప్రజా సంఘాల జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, బడే కామరాజు, వైఎస్సార్ సీపీ నాయకుడు పొన్నాడ రుషి తదితరులు పాల్గొన్నారు. పడిగాపులే మిగిలాయి నరసన్నపేట: ‘మాకేంటీ బాధలు.. మాపై ఎందుకు ఈ కక్ష.. ఇలా ఎన్నాళ్లు తిరుగుతాం. ఇంకెన్నాళ్లు తిరగాలి..’ అని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైకల్యం నిరూపించుకోవడానికి రీ వెరిఫికేషన్ కోసం ప్రభుత్వం నోటీసులు పంపిస్తుండడంతో దివ్యాంగులు శ్రమకోర్చి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతో కష్టపడి ఇంటి నుంచి ఆస్పత్రికి వస్తుంటే.. ‘ఇప్పుడు మీకు వైకల్య శాతం తక్కువగా ఉంది. మీ పింఛన్ కట్ చేస్తున్నాం. మీరు అర్హులైతే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోండి. మళ్లీ మీకు సదరంకు పిలుస్తాం. అందులో మళ్లీ సర్టిఫికెట్ జనరేట్ అవుతుంది. అప్పుడు అర్హులైతే పింఛన్ వస్తుంది’ అని అధికారులు చెబుతున్నారు. మంగళవారం నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో దివ్యాంగులు మడపాం, రావులవలస, సత్యవరం గ్రామాల నుంచి వచ్చారు. కళ్లనీళ్లు పెట్టుకుంటూ ప్రభుత్వాన్ని నిందించారు. -
uuవంశధారలో పెరిగిన వరద
హిరమండలం: హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద మంగళవారం ఉదయానికి వరద నీరు పెరిగింది. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాతో పాటు రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు వంశధారలో వరద నీరు వచ్చి చేరుతోంది. గొ ట్టా బ్యారేజీ వద్ద గరిష్ట నీటి మట్టం 38.10 మీటర్లు కాగా ప్రస్తుతానికి 38.08 మీటర్ల వరకు నీరు ఉంది. సోమవారం సాయంత్రానికి 10,357 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా.. మంగళవారం నాటికి 22వేలకు పెరిగింది. వచ్చిన నీటిని 11 గేట్లు 20 సెంటీమీటర్ల మేర పైకి ఎత్తి 20651 క్యూసెక్కులు దిగువకు విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి తెలిపారు. ఎడమ ప్రధా న కాలువ ద్వారా 1430 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు డీఈ తెలిపారు. -
దళితులంటే ఎందుకంత చులకన..?
అంత పిరికి కాదు.. మా అక్కను తీవ్రంగా బాధ పెట్టారు. ఆమె తప్పు లేకపోయినా ఇబ్బంది పెట్టడంతోనే ఆత్మహత్య ఆలోచన చేసింది. మా అమ్మ,నాన్న బాగా చదువుకున్న వారు. సమాజంలో గౌరవం కోసమే సౌమ్య ఉద్యోగం చేస్తోంది. మాకు, మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. మాకు రక్షణ కల్పించాలి. – యువరాజు, సౌమ్య సోదరుడు శ్రీకాకుళం: దళిత సామాజిక వర్గానికి చెందిన పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను వేధించిన ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, ఆయన అనుచరుల పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. దళితులన్నా, దళిత మహిళలన్నా చంద్రబాబు అండ్ కోకు చిన్నచూపు అని మండిపడ్డారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సౌమ్యను రిమ్స్లో వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం పరామర్శించారు. సౌమ్యకు న్యాయం జరిగేంతవరకు అండగా ఉంటా మని భరోసానిచ్చారు.ఈసందర్భంగా మేరుగ నాగా ర్జున మాట్లాడుతూ.. టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే గుంటూరులో ముస్లిం మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుందని తెలిపారు. ఆర్అండ్బీ ఉద్యోగి కొరప కల్యాణిని మంత్రి అచ్చెన్నాయు డు బూటుకాలితో తన్నారని గుర్తుచేశారు. ఆమదాలవలసలో కోటిపల్లి రాజు అనే వ్యక్తి ఓ చిన్నారిపైన అఘాయిత్యం చేస్తే కేసు కూడా లేదన్నారు. పలాస–కాశీబుగ్గలో ఓ విద్యార్థినిపై దాడి చేస్తే వారిపైనా కేసులు నమోదు చేయలేదన్నారు. పెందుర్తి నియోజకవర్గం జెర్రిపోతులపాలెంలో ఓ మహిళను వివస్త్రను చేస్తే నేషనల్ ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశాక స్పందించారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో జన సేన ఎమ్మెల్యే దళిత డాక్టర్ని చెంపదెబ్బ కొడితే కేసు లు పెట్టలేదన్నారు. నెల్లూరు జిల్లాలో రాంపుర్లో పల్లెలో వెలివేసి కొడితే వందల మంది ఊరు వదిలి వెళ్లిపోయారన్నారు. నెల్లూరులో మాజీ శాసన సభ్యు డి ఇంటి మీద దాడి చేస్తే అడిగేవారే లేరన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలోనూ దళితులను చిన్నచూపు చూస్తున్నారని తెలిపారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే ప్రకారం రాష్ట్రం 4వ స్థానంలో ఉంటే ఇప్పుడు అదే సర్వేలో ఒకటి రెండు స్థానాల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. సౌమ్యకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని భరోసానిచ్చారు. చంద్రబాబు చోద్యం చూస్తున్నారు వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు మాట్లాడుతూ జరుగుతున్న సంఘటనలపై సీఎం చంద్రబాబునాయుడు చోద్యం చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకున్న సందర్భాలు లేవన్నారు. రాష్ట్రంలో దళిత అధికారులు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సైతం వదలకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కూ టమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి దళిత, గిరిజన వర్గాల వారంతా సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ దళితులకు అగ్రపీఠం వేశారని, ఏనాడూ చిన్నచూపు చూడలేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తమ హయాంలో దళితులకు అన్ని రకాలుగా మేలు చేశామని తెలిపారు. పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ ఓ మహిళగా సౌమ్య పరిస్థితి చూ స్తుంటే బాధగా ఉందన్నారు. దళిత మహిళే హోంమంత్రిగా ఉన్నా దళిత మహిళలకు అన్యాయం జరిగితే కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పో యి తిరిగి తప్పుడు ప్రచారాలు చేయడం తగదన్నా రు. కూన రవి తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేయాలని డిమాండ్ చేశారు. సౌమ్యను పరామర్శించిన వారిలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, వైఎస్సార్సీపీ తూర్పుకాపుకుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగ వైశ్య కుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పోలినాటి వెలమ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, మాజీ అధ్యక్షుడు పొన్నాడ రుషి, గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, ఎస్సీ సెల్ శ్రీకాకుళం నియోజకవర్గం ఇన్చార్జి యజ్జల గురుమూర్తి, శ్యామ్ప్రసాద్రెడ్డి, బొడ్డేపల్లి రమేష్, గొండు రఘురాం, వైవీ శ్రీధర్, మూకళ్ల తాతబాబు, పీస గోపి, కంఠ వేణు, బోసు మన్మధరావు, జలగడుగుల శ్రీనివాసరావు, పర్రి రాజారావు, పంకు ప్రసాద్, సురారపు త్రినాథ, యలమల కృష్ణ తదితరులు ఉన్నారు. -
తెంచుకెళ్లిపోతారు!
● వెనకే వస్తారు.. మహిళలు అప్రమత్తంగా ఉండాలి.. ఒంటరిగా మహిళలు నడిచి వెళ్లేటప్పుడు, ప్రయాణించేటప్పుడు చున్నీ గానీ, చీరకొంగు గానీ కప్పుకునే వెళ్లాలి. ఆభరణాలు కనిపించేలా ఉండరాదు. వెనక, ముందు ఎవరు వస్తున్నారన్నది ఎప్పటికప్పుడు గ్రహించాలి. 45 ఏళ్ల పైబడ్డ మహిళలనే చైన్స్నాచర్లు టార్గెట్ చేస్తారు. శ్రీకాకుళం పీఎన్కాలనీయే కాక పలు చోట్ల విద్యుత్ దీపాలు వెలగకపోవడమే కాక సీసీ కెమెరాలు సైతం నివాసగృహాలవారు పెట్టుకోకపోవడంతో దొంగతనాలు జరుగుతున్నాయి. – పి.ఈశ్వరరావు, సీఐ, శ్రీకాకుళం టూటౌన్ శ్రీకాకుళం క్రైమ్ : ఒంటరిగా రోడ్డుపై నడిస్తే భయం.. తోడు లేకుండా పొలానికి వెళ్లాలన్నా వణుకే.. మెడలో బంగారం వేసుకుని బయటకు రావాలంటే సంశయించాల్సిన పరిస్థితి. ఒడిశా గ్యాంగ్ చేతివాటానికి సిక్కోలు వాసులు టార్గెట్ అవుతున్నారు. నిన్న రణస్థలం.. మొన్న బురిడి కంచరాం.. ఇలా హైవే పక్కన ఉన్న గ్రామాలే లక్ష్యంగా గొలుసు చోరులు రెచ్చిపోతున్నారు. ఈ గొలు సు దొంగతనాలకు పాల్పడుతున్నది ఒడిశాకు చెందిన గ్యాంగ్గా ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్కు చెందిన ఇద్దరిపై అనుమా నం ఉన్నట్లు, జిల్లాలో పలు గొలుసు దొంగతనాల్లో వీరి హస్తమున్నట్లు.. వీరికి మరికొందరితో లింకులున్నట్లు అనుమానిస్తున్నారు. వీరి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ● ఈ నెల 11న రణస్థలం మండలం అర్జునవలస పంచాయతీ గిడిజాలపేటరహదారిపై ఓ విద్యార్థిని మెడలో చైన్ తెంపి పరారయ్యారు. ● ఈ నెల 8న పొందూరు మండలం బురిడి కంచరాం గ్రామానికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు ఎస్ఎంపురం రోడ్డులో పొలాన్ని చూడటానికి వెళ్తుండగా వెనుకగా వచ్చిన అగంతకుడు మూడు తులాల తాడు తెంపేసి పారిపోయాడు. ● ఈ నెల 4న ఎచ్చెర్ల మండలం ఫరీద్పేట పంచాయతీ వరం కాలనీలో మార్నింగ్ వాక్ చేస్తున్న వరలక్ష్మి మెడలో రెండున్నర తులాల పుస్తెల తాడు తెంపి ఓ వ్యక్తి పరారయ్యాడు. ● గత నెల 15న శ్రీకాకుళం మండలం సింగుపురానికి చెందిన ఓ మహిళ ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసుకొని వస్తుండగా ముఖానికి మాస్కులు పెట్టిన వ్యక్తులు నంబర్ ప్లేట్లు లేని ద్విచక్రవాహనంపై వచ్చి 3 తులాల బంగారు తాడు తెంపేసి పరారయ్యారు. జైలు నుంచి విడుదలై.. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్కుమార్ పాడి, బాలకృష్ణ సాహులు జిల్లాలో నాలుగుచోట్ల పుస్తెల తాడుల చోరీలకు పాల్పడి ఈ ఏడాది జనవరి 10న కొత్తూరు పోలీసులకు చిక్కి జైలుకెళ్లారు. అప్పటికే జిల్లాలో 2016 నుంచి 2024 వరకు 32 నేరాలు చేసిన ఘనత వీరిది. మళ్లీ బెయిల్పై బయటకొచ్చారో లేదో.. ఇదే ఏడాది జూన్లో మెళియాపుట్టి మండలం శేఖరాంపురం గ్రామంలోని పొలం పనుల్లో ఉన్న ఓ మహిళ మెడలో పుస్తెల తాడు తెంపేసి బైక్పై పరారయ్యా రు. అదేరోజు బరంపురంలో సైతం ద్విచక్రవాహనం దొంగిలించారు. నేరాలు చేసి జైలుకెళ్లినా మళ్లీ దర్జాగా బయటకొచ్చి చోరీలు చేస్తుండటం జిల్లావాసులను విస్మయపరుస్తోంది. బ్యాగులను తెంపేస్తారు.. ● గత నెలలో గార మండలం దీపావళి గ్రామానికి చెందిన ఓ మహిళ పలాసకు బస్సులో వెళ్తుండగా అనకాపల్లికి చెందిన ఓ మహిళ బ్యాగు కొట్టేసింది. అందులో నాలుగున్నర తులాల చైన్, తులంన్నర చైన్ నెక్లెస్ ఉన్నాయి. ఈమె పలు చోరీకేసుల్లో నిందితురాలు. ● గత నెలలోనే జేఆర్ పురం మండలకేంద్రంలో వస్త్రదుకాణంలో డ్వాక్రా సభ్యుల వద్ద డబ్బులున్న బ్యాగులను కోసేసి పరారయ్యారు. ● జూన్లో ఆటోల్లో ఎక్కే వృద్ధ దంపతులే లక్ష్యంగా ఎచ్చెర్ల, శ్రీకాకుళం రెండో పట్టణ పీఎస్ల పరిధిలో కొందరు మహిళలు బ్యాగులు కోసేసి పారిపోయారు. అనంతరం వీరిని పట్టుకున్నారు. జిల్లాలో మళ్లీ రెచ్చిపోతున్న గొలుసు దొంగలు నిందితుల్లో చాలా మంది ఒడిశా వాసులే ఒంటరిగా వెళ్లే వారే టార్గెట్ -
లారీ డ్రైవర్కు జైలుశిక్ష
ఎచ్చెర్ల : మద్యం మత్తులో లారీని నడుపుతూ ప్రమాదానికి కారణమైన విజయవాడకు చెందిన డ్రైవర్ నాగరాజుకు జిల్లా సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 60 రోజుల జైలు శిక్ష విధించారు. ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నాగరాజు రాంగ్రూట్లో డ్రైవ్ చేస్తూ విశాఖ నుంచి ఒడిశా వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒడిశా లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ నాగరాజుపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించగా 60 రోజులు జైలు శిక్షను విధించారని ఎస్సై సందీప్కుమార్ మంగళవారం తెలిపారు. పోలీసుల అదుపులో నిందితురాలు మెళియాపుట్టి: పట్టుపురంలో కాంచనే అనే మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటనలో అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పాతపట్నం సీఐ వి.రామారావు తెలిపారు. పూర్తి వివరాలు బుధవారం తెలియజేస్తామన్నారు. రాత్రిపూట యూరియా అమ్మకాలా? నరసన్నపేట: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటైన సొసైటీల్లో చీకటి పడ్డాక యూరియా అమ్మకాలు చేస్తుండటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నరసన్నపే ట సొసైటీకి మూడు రోజుల కిందట 400 బస్తా ల యూరియా వచ్చింది. ఆదివారం రైతులు అధికంగా చేరడం.. వాగ్వాదం జరగడంతో యూరియా పంపిణీ చేయలేదు. రెండో రోజు కొంత మంది రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చారు. మిగిలిన యూరియాను మంగళవారం రాత్రి విక్రయాలు చేపట్టారు. ఆటోలు, లగేజి వాహనాల్లో బస్తాలను ఇష్టానుసారంగా సరఫరా చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన యూరియా పక్కతోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో సొసైటీకి వచ్చిన యూరియా పక్క దారి పట్టిందని, కావాల్సిన వారికి లెక్కకు మించి పంపిణీ చేశారని పలువురు రైతులు అంటున్నారు. ‘కానిస్టేబుళ్లుగా ఎంపికై న వారు నేడు హాజరుకావాలి’ శ్రీకాకుళం రూరల్: గత డిసెంబర్, జనవరి నెలల్లో ఎచ్చెర్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన కానిస్టేబుళ్ల ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్, ఏపీఎస్పీ ఉద్యోగాలకు ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులంతా ఈ నెల 20న బుధవారం శ్రీకాకుళం రూరల్ మండలం తండేంవలసలోని పోలీసు శిక్షణా కేంద్రం (ఆర్టీ ఓ కార్యాలయం దరి) ఉదయం 9 గంటలకల్లా హాజరుకావాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు సెలక్షన్ ప్రక్రియలో దరఖాస్తుతో జతపర్చిన అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లు, గెజిటెడ్ అధికారితో చేయించిన మూడు సెట్ల జిరాక్స్ కాపీలు, ఇటీవలే తీయించిన మూడు పాస్పోర్టు సైజ్ కలర్ ఫొటోలు, హాజరైన అభ్యర్థి అటస్టేషన్ ఫారం పూర్తి వివరాలతో పాటు గెజిటేడ్ అధికారితో ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని పేర్కొన్నారు. -
దళితుల ఐక్యతపై కుట్ర
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎస్సీ వర్గీకరణ పేరిట దళితుల ఐక్యతపై ప్రధాని మోదీ, ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిలు రాజకీయ కుట్ర పన్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.రత్నాకర్ అన్నారు. కులగణన జరగకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు హోటల్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాల సామాజికవర్గంపై చంద్రబాబు పగతీర్చుకుంటున్నారని, మాలలకు అన్యాయం జరుగుతున్నా ఈనాటికీ స్పందించలేదన్నారు. ప్రజల తలుచుకుంటే ఏ చట్టాలైన ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని తొక్కేస్తుంటే మాల ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం అన్యాయమన్నారు. రిజర్వేషన్లతో లబ్ధి పొందిన మాల ఉద్యోగులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ పోరాటానికి మద్దతిస్తే మన రిజర్వేషన్లు కాపాడుకోగలుగుతామన్నారు. శాంతియుత పోరాటానికి మనమంతా సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు అలికాన మహేష్కుమార్, యామల కృష్ణ, బొచ్చా శశిభూషణ్రావు, కాకర రవితేజ, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, నూకరాజు, కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు. -
సహాయక చర్యలు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజారోగ్యం దృష్ట్యా ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమల నివారణకు గంబూషియా చేపలు వదలాలని, నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించి క్లోరిన్ టాబ్లెట్లు ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి కార్యాలయాన్ని ఈ నెల 23లోగా శుభ్రం చేసుకోవాలని స్పష్టం చేశారు. పి–4 పథకం అమలులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలిచిందని తెలిపారు. 64,166 బంగారు కుటుంబాలకు గాను 61,552 కుటుంబాలను దత్తత తీసుకున్నామని, 1,55,804 లబ్ధిదారులకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో కూడా జిల్లా మంచి పురోగతి సాధించిందని కలెక్టర్ చెప్పారు. 65,569 ఫిర్యాదులకు గాను 64,074 పరిష్కరించామని, 1,365 మాత్రమే పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రజాభిప్రాయ సర్వేలో విద్యుత్, ఇసుక స్టాక్ పాయింట్, ఎకై ్సజ్ శాఖలపై సానుకూల స్పందన వచ్చిందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా భూఆక్రమణ!
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ ఆక్రమణలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడా లేకుండా కబ్జాల పర్వం కొనసాగుతోంది. తాజాగా కాశీబుగ్గలో కోట్ని విజయ్కు చెందిన జిరాయితీ ఖాళీ స్థలంపై ఆక్రమణదారుడి కన్నుపడింది. కాశీబుగ్గ కె.టి.రోడ్డుకు ఆనుకొని ఉన్న రూ.కోట్ల విలువైన ఈ స్థలాన్ని తెలుగు దేశం పార్టీ నాయకుల అండదండలతో తాళాసు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని బాధితుడు కోట్ని విజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాత మూత్తాల నుంచి సంక్రమించిన జిరాయితీ భూమిలో నీలాపురం గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టరు ప్రొక్లెయినర్ తెచ్చి పునాదులు తవ్విస్తున్నాడని, దీనిపై ప్రశ్నిస్తే భవనం నిర్మాణం చేయడానికి కాంట్రాక్టు ఇచ్చారని, అందుకే పునాదులు తీస్తున్నానంటు బెదిరిస్తున్నారని లబోదిబోమంటున్నాడు. స్థలం వ్యవహారం కోర్టులో ఉందని, తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని తెలిసి దౌర్జన్యంతో అక్రమంగా నిర్మాణాలు చేయడానికి పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశాడు. నిర్మాణానికి మున్సిపాలిటీ అనుమతులు కూడా లేవని, అయినా అధికార పార్టీ అండతో ఈ విధంగా తనకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని విజయ్ వాపోయాడు. పోలీసు స్టేషన్లో కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు బెదిరించాడని, తన భూమిని కాపాడాలని పోలీసులను, మున్సిపల్ అధికారులను వేడుకుంటున్నాడు. -
స్కాన్ చేస్తే ఇంటి వద్దకే విగ్రహాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: వినాయక చవితికి మట్టి విగ్రహాలను పూజిద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోస్టర్లను మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి పోస్టర్లు రూపొందించామన్నారు. కాలుష్య మండలి వారు క్యూఆర్ కోడ్ను తయారు చేశారని, కోడ్ని స్కాన్ చేస్తే ఇంటి వద్దకే విగ్రహాలు అందించే ఏర్పాటు చేయనున్నామని ఆమె తెలిపారు. అలానే 26వ తేదీన సూర్యమహల్ జంక్షన్ వద్ద స్టాల్ని ఏర్పాటు చేసి విగ్రహాలు పంపిణీ చేస్తామని తెలిపారు. -
అమ్మవారి ఆలయాల్లో చోరీ
నందిగాం : నరేంద్రపురంలోని రెయ్యిబోడెమ్మ, భూలోకమాత అమ్మవారి ఆలయాల్లో సోమవారం రాత్రి పూజా సామగ్రి చోరీకి గురైంది. ఈ ఏడాది మార్చి 9న గ్రామ శివారులో గ్రామదేవతల ఆలయాలకు ప్రతిష్టాపన చేశారు. నిత్య పూజలకు అవసరమైన వెండి, ఇత్తడి సామాన్లు సమకూర్చుకున్నారు. సోమవారం సాయంత్రం పూజ కార్యక్రమాలు పూర్తయ్యాక తలుపులు వేసి గ్రామస్తులు వెళ్లిపోయారు. మంగళవారం ఉదయం వచ్చి చూసే సరికి రెండు ఆలయాల్లో రెండు వెండి శఠగోపాలు, రెండు ఇత్తడి బిందెలు, నాలుగు ఇత్తడి పల్లేలు, నాలుగు దీపస్థంభాలు, రెండు గంటలు, రెండు పూలసజ్జలు చోరీకి గురయ్యాయి. హుండీలో ఉన్న డబ్బులు సైతం పట్టుకుపోయారు. గ్రామస్తులు నందిగాం పోలీసులకు సమాచారం తెలియజేయగా సిబ్బంది వచ్చి పరిశీలించారు. -
సీపీఎస్ రద్దుకు ఉద్యమబాట
శ్రీకాకుళం పాతబస్టాండ్: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 1న చేపట్టనున్న ఉద్యోగుల వెన్నుపోటు దినం విజయవంతం చేయాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలో జరగనున్న ఉద్యమానికి సంబంధించి మంగళవారం కలెక్టరేట్ వద్ద పోస్టర్ ఆవిస్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు వెన్నుపోటు పొడించిన దినం సెప్టెంబర్ 1న పురస్కరించుకొని గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ అంబేడ్కర్ విగ్రహం వరకు నలుపు వస్త్రాలు ధరించి భారీ నిరసన పాదయాత్ర చేపట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ చల్ల సింహాచలం, నగర నాయకులు సూర్య, వంశీ, అనిల్ శ్రీనివాస్ పద్మ ప్రియా తదితరులు పాల్గొన్నారు. -
అభ్యంతరాల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ–డివిజనల్ మేనేజర్ పోస్టు రాత పరీక్ష ఆగస్టు 10న నిర్వహించగా.. ఫలితాలు, ప్రొవిజనల్ జాబితా జిల్లా వెబ్సైట్ srikakulam.a p.gov.inలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 22లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. మార్కులపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నిర్దేశిత తేదీ సాయంత్రం 5 గంటల లోగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారికి నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు. రాధాసాగరంలో వ్యక్తి గల్లంతు మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం పంచాయతీ చినహంస గ్రామానికి చెందిన లండ రామారావు(49) ఒడిశా రాష్ట్రంలోని రాధాసాగరంలో గల్లంతయ్యాడు. రామారావు సోమవారం సాయంత్రం ముగ్గురు స్నేహితులతో కలిసి చేపలు పట్టడానికి వినియోగించే ఓ చిన్న నాటు పడవలో సాగరంలోకి వెళ్లారు. ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో నలుగురు నీటిలో పడిపోయారు. మిగిలిన ముగ్గురూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా రామారావు గల్లంతయ్యాడు. అయితే ఈ విషయాన్ని గ్రామంలో ఎవరికీ చెప్పలేదు. మంగళవారం ఉదయం విషయం తెలియడంతో గ్రామస్తులు అందించిన సమాచారంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చేపట్టారు. చీకటిపడేవరకు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గాలింపు నిలిపి వేశారు. ఒడిశా పరిధి కావడంతో గారబంద పోలీసులు కేసు నమోదు చేశారు. లండ రామారావుకు భార్య లక్ష్మీ ఒక కుమారుడు ఉన్నారు. -
భద్రతకు భరోసా ఏదీ?
● చారిత్రక పద్మనాభుని కొండపై పాడైన సీసీ కెమెరాలు ● నిర్వహణ లేక మూలకు చేరిన పరికరాలు ● పట్టించుకోని దేవదాయ, పోలీస్ శాఖలు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి కరకవలస గ్రామ సమీపాన అనంత పద్మనాభ కొండపై కృష్ణార్జానులుగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. వీటితో పాటు గణపతి, లక్ష్మీదేవి, మహిషాసురమర్దిని తదితర దేవతా విగ్రహాలు కరనకవలస, అనుపురం, పరిసర గ్రామాల ప్రజలు నిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనలు చేస్తుంటారు. ఏటా ధనుర్మాసంలో జిల్లా నలుమూల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కనుమ పర్వదినాన కొండపై స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి పెద్ద జాతర నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో రాష్ట్రం నలుమూలలు నుంచి వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి స్వామిసేవలో తరిస్తారు. ఆదాయం కూడా అధికంగానే ఉంటుంది. ఈ స్వామివారికి నిత్యం ఒక సర్పం రక్షిస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇంతటి ప్రాశస్త్యమైన ఈ ఆలయానికి రక్షణ కరువైంది. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలు ధ్వంసం చేసి హుండీ కూడా ఎత్తుకెళ్లారు. అప్పటి ఎస్పీ అమిత్ బర్దార్ పరిశీలించి రక్షణకు సంబంధించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. దేవదాయ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిపై శ్రీముఖలింగంలోని దేవదాయ శాఖ కార్యాలయం అధికారులు, జలుమూరు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పట్టించుకోని అధికారులు.. విగ్రహాల ధ్వంసం సమయంలో హడావుడి చేసిన అధికారులు తర్వాత పూర్తిగా విస్మరించారు. సీసీ కెమెరాలు, సెటాప్ బాక్స్, విజన్స్, మోనిటర్ తదితర పరికరాల్లో కొన్ని చోరీకి గురి కాగా, మరికొన్ని నిర్వహణ లోపంతో పాడైపోయాయి. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇటీవల కాలంలో చోరీలు ఎక్కువయ్యాయని, ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడంతో పాటు నిఘా పెంచాలని భక్తులు కోరుతున్నారు. -
శిక్షణతో ఖ్యాతిపొందూరు ఏఎఫ్కేకేకు చక్కటి అవకాశం వచ్చింది. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చాన్స్ దొరికింది. –8లో
ప్రాణహాని ఉందంటూ.. ఆమదాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలు, అడ్డగోలు రవాణాపై మొదటి నుంచి టీడీపీలో ఉంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్పై సనపల సురేష్ అనే కార్యకర్త పోరాడుతున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాను అడ్డుకోవడమే కాకుండా సమాజానికి తెలియజేస్తున్నాడ ని గతంలో బూర్జ మండలం నారాయణపురం వంతెన వద్ద సనపల సురేష్పై కొంతమంది దాడి చేశారు. వీరంతా ఎమ్మెల్యే కూన రవి అనుచరులేనని సురేష్ అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత ఆమదాలవలస మండలం దూసిలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించాడని సనపల సురేష్ను అక్కడి నుంచి శ్రీకాకుళం నగరంలోని బలగ వరకు వెంబడించి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులే తనను చంపడానికి దాడి చేశారని సురేష్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా పొందూ రు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్యను ఎమ్మె ల్యే రవికుమార్ వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ద్వారా తెలుసుకుని, ఆమెను పరామర్శించి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు వ్యక్తులు ఆయన్ని కారులో వెంబడించడ మే కాకుండా మార్గమధ్యలో అడ్డుగా నిలిచారు. భయాందోళనకు గురైన సురేష్ నగరంలోని పలు వీధుల గుండా టూటౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని, ఎమ్మెల్యే రవికుమార్ నుంచి ప్రాణ హాని ఉందని, తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసు స్టేషన్లో రక్షణ కోరారు. వెంటనే ఆయన భార్య, తన ఇద్దరు పిల్లలు కూడా పోలీసు స్టేషన్కు చేరుకుని రక్షణ కోసం ఇక్కడే ఉంటామని చెప్పి వేచి ఉన్నారు. దీంతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. -
● కూలిన ప్రసాదాల విక్రయ శాల
శ్రీకాకుళంలోని పాత బ్రిడ్జి వద్ద నాగావళి పరవళ్లుఅరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయం ముందు ఆదివారం వంటి పర్వదినాల్లో భక్తులకు ప్రసాదాలను విక్రయించే జింకు పైపుల శాల ఒక్కసారిగా కూలిపోయింది. భారీ వర్షం కారణంగా శాలపై వేసిన పై కప్పుపై అధికంగా వర్షపునీరు నిలిచిపోవడంతో పాటు గాలులకు పైపులన్నీ వంగిపోయి పైకప్పు కుంగిపోవడంతో మొత్తం శాల (షెడ్) కూలిపోయింది. అయితే ఆ సమయంలో భక్తులెవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఈమేరకు పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు పనులు సోమవారం సాయంత్రం నుంచి మొదలయ్యాయి. –అరసవల్లి -
ఆదిత్యుని సన్నిధిలో న్యాయమూర్తి తుహిన్ కుమార్
అరసవల్లి: ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుహిన్ కుమార్ సతీసమేతంగా సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు గౌరవంగా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలను చేయించి, ఆలయ విశిష్టతను శంకరశర్మ వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. వారితో పాటు జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి హరిబాబు, ఆర్డీవో సాయి ప్రత్యూష తదితరులు ఉన్నారు. రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలో జలుమూరు మండలంలోని గోటివాడ గ్రామానికి చెందిన ముక్త పవన్ కుమార్ (25) విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. గత రెండు రోజులు సెలవులు కావడంతో ఇంటికి వచ్చి ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం తిరుగు ప్రయాణమయ్యాడు. జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 10 గంటల సమయంలో లావేరు మండలంలోని తాళ్లవలస వచ్చేసరికి ముందు వెళ్తున్న ఆటో సడన్గా రోడ్డుపై నీరు ఉందని తిప్పాడు. దీంతో ఆటోను తప్పించి అధిగమించే క్రమంలో వెనువెంటనే వెనుక వచ్చిన వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి తండ్రి నరిసింగరావు, తల్లి ఉషారాణి, సోదరుడు సాయి ఉన్నారు. రోడ్డు ప్రమాదంపై లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రిమ్స్లో యువకుడి అనుమానాస్పద మృతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన మురపాక అక్కయ్య (30) పచ్చ కామెర్ల వ్యాధితో ఇటీవల చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రిలో చేరాడు. సోమవారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ వార్డు సమీపంలో ఉన్న బాత్రూమ్ వైపు అక్కయ్య వెళ్లాడు. తిరిగి వస్తుండగా జారిపడి స్పృహ కోల్పోయాడు. అక్కడికి కొద్ది సమయంలోనే వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించినా మృతికి గల కారణాలు తెలియరాలేదు. రోగి కుటుంబ సభ్యులు బాత్రూమ్కు వెళ్లక ముందు బాగానే ఉన్నాడని, ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని వాపోతున్నారు. ఇదే విషయమై అవుట్ పోస్టు పోలీసుల వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా వైద్యులు సాధారణ మరణంగా ధ్రువీకరించి పంపించేశారన్నారు. బాత్రూమ్లో పడిపోవడం వాస్తవమేనని పేర్కొన్నారు. -
కీచక పర్వం!
● ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించారంటూ కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నం ● టీడీపీ శ్రేణుల దుష్ప్రచారంతో మనస్తాపానికి గురై చనిపోవాలని నిర్ణయం ● చావు బతుకుల మధ్య రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స ● రవికుమార్ నుంచి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించిన మరో బాధితుడు సురేష్ ● రక్షణ కోసం కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు స్టేషన్లోనే సురేష్ -
ఇంకేం అర్హత కావాలి..?
దివ్యాంగులకు ఇచ్చే పింఛన్లపై సర్కారు కన్ను పడింది. ఎలాగైనా లబ్ధిదారుల సంఖ్య తగ్గించాలని రీవెరిఫికేషన్పెడుతోంది. ఈ రీ వెరిఫికేషన్కు హాజరు కాలేని దివ్యాంగులు తమ పింఛన్ పోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. –నరసన్నపేటనరసన్నపేట మండలం సత్యవరానికి చెందిన బెండి అక్షిత్ స్కూల్లో నాల్గో తరగతి చదువుతున్నాడు. రెండు కాళ్లూ వంకర తిరిగి ఉంటాయి. కొద్ది క్షణాలైనా నించోలేడు. ఈ బాలుడికి ఇదివరకు పింఛన్ వచ్చేది. రీ వెరిఫికేషన్లో ఈ బాలుడికి పింఛన్కు అర్హత లేదని తేల్చేశారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఒకరి సాయం ఉంటే గానీ ముందుకు కదల్లేని తమ బిడ్డ పింఛన్కు అర్హుడు కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఇక గొట్టిపల్లి పంచాయతీ రెడ్డికి పేటకు చెందిన కోరెడ్డి మాధవరావుకు పింఛనే జీవనాధారం. ఇతనికి ఒక చెయ్యి, కాలు సక్రమంగా పనిచేయవు. ఏ పనికీ వెళ్లలేరు. ఇంటి పట్టునే ఉంటే పింఛన్ డబ్బుతో బతుకుతున్నారు. గతంలో జెమ్స్ ఆస్పత్రి వైద్యులు గతంలో 57 శాతం వైకల్యం ఉందని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు రీ వెరిఫికేషన్లో తీసేశారు. మాధవరావుకు ఆధారం ఎలా అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. -
సౌమ్యకు పరామర్శ
శ్రీకాకుళం: రిమ్స్లో చికిత్స పొందుతున్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యను శ్రీకాకుళం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు బి.మురళి, సీఐటీయూ జిల్లా కోశాధి కారి అల్లు సత్యనారాయణ, టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు సోమవారం సాయంత్రం పరామర్శించారు. బాధితురాలిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ను తక్షణమే ఆపాలని కోరారు. అలాగే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు లోపింటి తేజేశ్వరరావు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నగర అధ్యక్షుడు కానుకూర్తి గోవిందలు కూడా ఆమెను పరామర్శించారు. -
‘ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం’
శ్రీకాకుళం క్రైమ్ : తండ్రి పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మహిళా ఉద్యోగిని, అందునా దళితురాలిని మానసికంగా వేధిస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చింతాడ రవికుమార్ ప్రశ్నించారు. దీన్ని బట్టే చంద్రబాబు ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వమని చెప్పొచ్చన్నారు. సోమవా రం ఉదయం జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో నివాసముంటున్న పొందూరు కేజీబీబీ మహిళా ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. విషయం తెలిసి రిమ్స్కు చేరుకున్న చింతాడ రవి బాధితురాలు సౌమ్యను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ ఎమ్మె ల్యే కూన రవికుమార్ ఒంటరి దళిత మహిళపై ఇంతటి అరాచకం చేస్తుంటే చంద్రబాబు ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నా రు. దళితులంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు మొదటి నుంచీ చిన్న చూపేనని.. అసెంబ్లీ సాక్షిగా దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న చంద్రబాబు మాటలే అందుకు నిదర్శనమన్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె పోరాడుతుంటే ఎమ్మెల్యే ఇలా వేధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఐదురోజులుగా ఆమె కలెక్టర్కు, ఎస్పీకి విన్నవించుకుంటున్నా పట్టించుకోలేదని అన్నారు. ఇప్పటికై నా తమ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణ మాట్లాడుతూ దళిత మహిళా ఉద్యోగినిపై ఎమ్మెల్యే కూన రవి కార్యకర్తలు అసభ్యంగా ట్రోల్స్ చేస్తున్నారని, జిల్లా టీడీపీ నాయకులు, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరవాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకుడు పొన్నాడ రుషి మాట్లాడుతూ కూన రవి పాలన నీచాతినీచమని అన్నారు. -
పీజీఆర్ఎస్కు 78 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు సోమవారం నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా అందిన ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షిస్తూ, సమస్యల తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు కారణంగా ఈ వారం తక్కువగా వినతులు వచ్చాయి. ఈ వారం మొత్తం 78 ఫిర్యాదులు వివిధ శాఖలకు అందగా, వాటిలో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 14 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగానికి సంబంధించి 11, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘానికి చెందిన 10, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి 7, వ్యవసాయ శాఖకు చెందిన 6, మున్సిపల్ పరిపాలన శాఖకు సంబంధించి 6 ఫిర్యాదులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని ధర్మక్షేత్రనగర్లో నివాస గృహాలకు బదులుగా, ప్రైవేటు మెడికల్ కళాశాలకు సంబంధించిన తరగతి గదుల నిర్మాణం గుట్టుచప్పుడు లేకుండా చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో తక్షణమే స్పందించిన జేసీ శ్రీకాకుళం కార్పొరేషన్ అధికారులు యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు బకాయిపడ్డ వేతనాలు చెల్లించాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్కు రిమ్స్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. -
పొందూరు ఖాదీ... శిక్షణతో ఖ్యాతి..!
కేవీఐసీ డిప్యూటీ సీఈవో మదన్మోహన్రెడ్డి పొందూరు ఏఎఫ్కేకే సంఘాన్ని సందర్శించి హామీలివ్వడం వాస్తవమే. కొత్తవారికి వడుకు, నేత ప్రక్రియలపై శిక్షణలు ఇచ్చేందుకు కేవీఐసీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణలిచ్చేందుకు ఏఎఫ్కేకే సంఘం సిద్ధంగా ఉంది. – దండా వెంకటరమణ, సెక్రటరీ, ఏఎఫ్కేకే సంఘం, పొందూరు ఖాదీ వస్త్రాలు తయారు చేసేందుకు పొందూరు ఏఎఫ్కేకే సంఘాన్ని కేవీఐసీతో ట్రైనింగ్ పార్టనర్గా ఉండమని సూచించాం. పొందూరు ఖాదీని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దీనివలన కొత్తతరం వారు ఈ వృత్తిలో కొనసాగేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా వడుకు, నేత ప్రక్రియలో శిక్షణ ఇచ్చేందుకు పొందూరు ఖాదీ సంస్థకు దరఖాస్తు చేయమని చెప్పాను. శిక్షణ ముగించుకున్న వారికి సర్టిఫికెట్లు సైతం అందజేస్తాం. ఏ జిల్లా నుంచైనా శిక్షణలకు పొందూరుకు రావచ్చు. వడుకు, నేత పని నేర్చుకోవచ్చు. – మదన్కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఈవో, బెంగుళూరు, కేవీఐసీ ● పొందూరు ఏఎఫ్కేకేకు సువర్ణావకాశం ● శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కేవీఐసీ సుముఖం ● అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీ పొందూరు: వేసవిలో చల్లదనం.. శీతాకాలంలో వెచ్చదనం ఇవ్వడం పొందూరు ఖాదీ వస్త్రాల ప్రత్యేకత. ఈ దుస్తులు ఎంతో సౌకర్యవంతంగా, హుందాగా ఉంటాయి. అతి సామాన్యుల నుంచి ఉన్నతవర్గాల వరకూ ప్రతి ఒక్కరూ ధరించేందుకు వీలుగా అందుబాటు ధరల్లో లభిస్తాయి. మహాత్మాగాంధీ నుంచి ప్రస్తుత రాజకీయ నాయకుల వరకు ఎంతోమంది పొందూరు ఖాదీకి అభిమానులు ఉన్నారు. ఈ ఫైన్ ఖాదీ(సన్నఖాదీ) తయారీకి ప్రత్యేకంగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే పండించే కొండ పత్తిని ఇక్కడ ఉపయోగిస్తారు. దశాబ్ధాల కాలం నుంచి పొందూరు ఏఎఫ్కేకే సంఘం అనేది ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్(కేవీఐసీ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఈ సంఘాన్ని కేవీఐసీ సౌత్జోన్ డిప్యూటీ సీఈవో మదన్కుమార్ రెడ్డి ఇటీవల సందర్శించారు. దీనిలో భాగంగా సంప్రదాయ ఖాదీ వ స్త్రాల తయారీ కేంద్రం మరిన్ని కాలాలు విరజిల్లాలని ఆకాంక్షిస్తూ తన పరిధిలో హామీలనిచ్చారు. ఖాదీ ప్రమోషనల్ గ్రాంట్ నుంచి అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. వర్క్షెడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నామని, పొందూరు ఏఎఫ్కేకే సంఘంతో కేవీఐసీ కలిసి కొత్తగా నైపుణ్యాలపై శిక్షణా కేంద్రం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కేవీఐసీ, జీఎంఆర్ సంయుక్తంగా విలేజ్ ఇండస్ట్రీస్ కింద శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ఖాదీని ముందు తరాలకు అందించేందుకు ఆ అవకాశాన్ని పొందూరు ఏఎఫ్కేకే సంఘం దక్కించుకోవాలని సూచించారు. శిక్షణతో ఉపాధి చేనేత వస్త్ర తయారీలో శిక్షణ ఇవ్వడం వలన నిరుద్యోగులకు ఉపాధి చేకూరుతుంది. నెలకు దాదాపు రూ.15 వేలు నుంచి రూ.25 వేలు వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. స్పిన్నింగ్, వీవింగ్లో శిక్షణ పొందిన వారంతా సంఘాలకు, సొసైటీలకు దుస్తులు నేస్తూ ఉపాధి పొందుతారు. వాస్తవానికి స్పిన్నర్లు, వీవర్లు, సంఘం ఉద్యోగులకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. కేవీఐసీ ఎండీఏ సిస్టంలో ఉత్పత్తిపై 35 శాతం మొత్తాన్ని ప్రతీ మూడు నెలలకు ఒకసారి స్పిన్నర్లు, వీవర్లు, ఉద్యోగులకు అందిస్తుంది. ఇదేకాకుండా సంఘాలు మజూరీని అందజేస్తున్నాయి. కొత్త కార్మికులు సంఘంలో చేరి దుస్తులు నేస్తే మరింత ఆదాయం పొందే అవకాశం మెండుగా ఉంది. సొసైటీలకు సహకారం అందాలి అయితే వాస్తవానికి సొసైటీలు, సంఘాలకు దుస్తులు నేసే వారికంటే మాస్టర్ వీవర్స్ దగ్గర ఎక్కువ కార్మికులు ఉండడం గమనార్హం. మాస్టర్ వీవర్స్ నేసే వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. సొసైటీలు, సంఘాలకు నేసేవారికి ప్రభుత్వ సహకారం అందించాలి. ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలి. ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా, ఈపీఎఫ్, ఈఎస్ఐ వంటివి సౌసైటీలు, సంఘాలకు నేసే కార్మికులకు వర్తింపజేయాలి. దుస్తులు నేసే వారికి షరతులు ఉండకూడదు. ఉదాహరణకు పొందూరు ఏఎఫ్కేకే సంఘంలో ఏఎంసీ, ఎన్ఎంసీ వస్త్రాలు మాత్రమే లభిస్తున్నాయి. సీమనూలుతో నేసే వస్త్రాల తయారీ ఇక్కడ లేదు. అందువలన ఏరకమైన నూలుతోనైనా వస్త్రాలు తయారు చేయోచ్చన్న అనుమతి కేవీఐసీ నుంచి రావాలి. తద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కార్మికులకు ఆదాయం పెరుగుతుంది. కొత్తవారు ఈ రంగంలోకి వచ్చేందుకు మొగ్గు చూపుతారు. -
రోడ్డెక్కితే.. చలానా వాతే..!
వజ్రపుకొత్తూరు: రోడ్డెక్కుతున్న వాహన చోదకులను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల పేరుతో రూ.కోట్లను ఖజానాలో వేసుకుంటోంది. వాస్తవానికి ఈ కార్డులు సక్రమంగా జారీ అవ్వడం లేదు. దీంతో వాహనదారులు డిజిటల్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. ఈ కారణంగానే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాహనదారులకు కార్డుల భారం లేకుండా డిజిటల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఫిజికల్గా కార్డు లేకపోయినా.. డిజిటల్ కార్డులతో ఎటువంటి ఇబ్బందీ లేకపోయేది. అయితే టెక్నాలజీకి తానే ఆధ్యుడునని చెప్పుకునే సీఎం చంద్రబాబు తిరిగి ఫిజికల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. కార్డుల కోసం డబ్బులు చెల్లించినా... డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల విషయంలో వాహనదారుల పరిస్థితి సంకటంగా మారింది. కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా జారీ చేయని పరిస్థితి ఉంది. రవాణా శాఖలో సేవలను సులభతరం చేశామని, కార్యాలయానికి రాకుండానే అన్ని సేవలు పొందవచ్చునని చెబుతున్న కూటమి ప్రభుత్వం, లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం రవాణా కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటోంది. వాహనం రోడ్డెక్కితే చాలు లైసెన్సు, ఆర్సీలు చూపించమని అటు రవాణా శాఖ, ఇటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారు. కార్డుల కోసం డబ్బులు చెల్లించామని, కార్డులు ఇంకా ఇవ్వలేదని చెప్పినా చలానా రాసి చేతిలో పెడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. కొంతమంది డిజీ వ్యాలెట్ యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న కార్డును చూపిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫిజికల్ కార్డు ఉంటే చూపించు వదిలేస్తామని స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో... జిల్లాలోని పెద్దపాడు ప్రాంతంలో ప్రధాన రవాణా శాఖ కార్యాలయంతో పాటు శ్రీకాకుళం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురంలలో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా సగటున 350కు పైగా వాహన రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ లైసెన్సులు జారీ చేస్తుంటారు. ఫిజికల్ కార్డుల కోసం ప్రభుత్వం అదనంగా ప్రతీ కార్డుకు రూ.235 వసూలు చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాహనదారులపై కార్డుల భారం తొలగించి డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డులను సెల్ఫోన్ వ్యాలెట్ యాప్లో అందుబాటులో ఉంచింది. పోలీసు, రవాణా అధికారులు అడిగినపుడు సేవ్ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుంది. పొరపాటును కార్డును మరిచిపోతే వాహన చోదకులపై చలానాలు రాసే పరిస్థితి ఉండకుండా డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు విజయవాడలో ముద్రించి రావాల్సి ఉంది. 2024 నవంబర్ నుంచి పెండింగ్లో ఉన్నాయి. కార్డుకు రూ.235 వసూలు చేస్తున్నాం. సగటున రోజుకు జిల్లావ్యాప్తంగా 250 వరకు కార్డులు నమోదు అవుతున్నాయి. కార్డులు వచ్చిన వెంటనే వారి చిరునామాలకు పంపిస్తాం. కార్డుల కోసం రవాణా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. – విజయసారధి, డీటీసీ, శ్రీకాకుళం సంపద సృష్టిస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు ఇలా వాహన చోదకులను దోచుకోవడం ద్వారా ఖజానా నింపేందుకు స్కెచ్ వేశారు. టెక్నాలజీకి తానే ఆధ్యుడునని గొప్పలు చెప్పుకునే ఆయన గత ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ విధానానికి స్వస్థి పలికి వాహనదారులను దోచుకుంటున్నారు. గతేడాది నవంబర్ నుంచి కార్డుల జారీ కోసం ప్రత్యేక డబ్బులు తీసుకోవడం ప్రారంభించారు. లైసెన్సు జారీ, రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ చలానాతో పాటు కార్డుకు ప్రత్యేకంగా రూ.235 ప్రత్యేకంగా చెల్లిస్తున్నారు. గతేడాది నవంబర్ నుంచి డబ్బులు చెల్లించిన వాహనదారులకు ఇంతవరకు కార్డులు అందలేదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా లైసెన్సు, ఆర్సీ కార్డులు రావాల్సిందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు డైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డుల కోసం రూ.1.766 కోట్లుకు పైగా డబ్బులు చెల్లించడం గమనార్హం. జిల్లాలో లక్షకు పైగా డెలివరీ కాని ఆర్సీ, లైసెన్స్ కార్డులు డిజిటల్గా చూపించినా కేసులు నమోదు లబోదిబోమంటున్న వాహన చోదకులు -
జోనల్ స్థాయి క్రీడా పోటీలు వాయిదా
శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో విశాఖపట్నంలో జరగాల్సిన జోనల్స్థాయి క్రీడాపోటీలు వాయిదా పడ్డాయి. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా పోటీలను అధికారులు వాయిదా వేసినట్టు డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు తెలిపారు. తదుపరి తేదీలను త్వరలో వెల్లడిస్తామని, ఎంపికై న క్రీడాకారులంతా విషయాన్ని గుర్తించాలని ఆయన సూచించారు. డీపీటీఓగా అప్పలనారాయణ శ్రీకాకుళం అర్బన్: జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారిగా సీహెచ్ అప్పలనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం అమ లు చేసిన శ్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సకాలంలో బస్సులు నడుపుతామని అన్నారు. కురుడు పశువైద్యాధికారికి రాష్ట్రస్థాయి అవార్డు టెక్కలి: రాష్ట్ర స్థాయిలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ అవార్డుకు కోటబొ మ్మాళి మండలం కురుడు పశు వైద్య కేంద్రం పశు వైద్యాధికారి లఖినేని కిరణ్కుమార్ ఎంపికయ్యారు. క్షేత్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్య సేవలు అందజేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 20న విజయవాడలో నిర్వహించనున్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో జోన్–1 విభాగంలో కిరణ్కుమార్ అవార్డు అందుకోనున్నారు. ఈ మేరకు టెక్కలి డివిజన్ పశు వైద్య సిబ్బంది అభినందించారు. ‘దళారులను నమ్మి మోసపోవద్దు’ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కోర్టుల పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందని, ఈ నియామక పరీక్షల విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా హెచ్చరించారు. ఈ మేరకు సోమ వారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్–ఐఐఐ, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, కాపీయిస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే కంప్యూటర్ ఆధారిత పరీక్షల షెడ్యూల్ విడుదల చేశా మని తెలిపారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయని వివరించారు. అభ్యర్థులు కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక అవుతారని, డబ్బు లేదా సిఫారసుతో ఉద్యోగాలు సాధ్యం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కొంతమంది దళారులు తప్పుడు హా మీలు ఇస్తూ అభ్యర్థులను మోసం చేసే ప్ర యత్నం చేస్తున్నారని, అలాంటి మోసపూరిత చర్యలకు ఎవరైనా పాల్పడితే ఫిర్యాదు చేయా లని సూచించారు. ఈ పరీక్షలు జీఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాం, శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ చిలకపాలెం, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఎచ్చెర్ల, కోర్ టెక్నాలజీస్ గొట్టిపల్లి నరసన్నపేట కేంద్రాల్లో జరుగుతాయని తెలియజేశారు. -
ఈసీ తీరు బాధాకరం
● కొవ్వొత్తులతో కాంగ్రెస్ నాయకుల ర్యాలీ శ్రీకాకుళం అర్బన్: దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ఎలక్షన్ కమిషన్, కేంద్రంలో బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుండడం బాధాకరమని, ప్రజాస్వామ్యాన్ని పాతరేసేలా పనిచేస్తున్న ఎన్నికల కమిషన్ తీరును దేశ పౌరులంతా గుర్తించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాదం వెంకట త్రినాథరావు, అంబటి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా విజ్ఞాన్ భవన్ నుంచి మున్సిపల్ ఆఫీస్ గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ద్వారా పౌరులకు సంక్రమించిన ఓటుహక్కును కేంద్రంలో ఉన్న బీజేపీ దొంగలించి దొడ్డిదారిలో అధికారం చేపట్టడం శోచనీయమన్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయ స్వలాభం కోసం కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సైదుల్లాఖాన్, అంబటి లక్ష్మణరావు, తెంబూరు మధుసూదనరావు, అంబటి దాలినాయుడు, చాన్ భాష, మామిడి సత్యనారాయణ, ఆబోతుల వెంకట నాయుడు, బొచ్చ వెంకటరమణ, ఆదినారాయణ, బగ్గు రాము, సురియా బేగం తదితరులు పాల్గొన్నారు. -
సమయం ఆసన్నమైంది
అంతరించిపోతున్న ప్రాచీన, సంప్రదాయ వస్త్ర తయారీ ప్రక్రియను బతికించేందుకు ఏఎఫ్కేకే సంఘం వడుకు, నేత ప్రక్రియలను నేర్పే శిక్షణా సంస్థగా అవతరించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆ మేరకు ఏఎఫ్కేకే సంఘం త్వరగా కేవీఐసీ సాయంతో శిక్షణలు ఇచ్చేందుకు భాగస్వామ్యం కోసం అడుగులు వేయాలి. పొందూరులో గతంలో 1,200 మంది స్పిన్నర్లు ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 520 మందికి చేరింది. గతంలో 300 మంది నేత కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం కేవలం 80 కుటుంబాలు మాత్రమే నేత కా ర్మికులుగా మిగిలారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ కార్మికులు తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్తవారు ఈ రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడింది. దీనికోసం శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. -
మరో 17 బార్ల ఏర్పాటుకు సన్నాహాలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 17 బార్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశానుసారం తమ విభాగం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టిందని శ్రీకాకుళం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ (డీసీ) దోసకాయల శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని మెడికవర్ ఆస్పత్రి సమీపంలో ఉన్న కార్యాలయంలో డీసీ విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల కాలపరిమితికి లోబడి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైందని, శ్రీకాకుళం కార్పోరేషన్ (11), పలాస మున్సిపాలిటీ (2)ల పరిధిలోని 13 బార్లకు ఏడాది రీటైల్ ఎకై ్సజ్ ట్యాక్స్ (లైసెన్సు) ఫీజుగా రూ. 55 లక్షలుగా నిర్ణయించామన్నారు. ఆమదాలవలస(02), ఇచ్ఛాపురం(02) మున్సిపాలిటీలకు రూ. 35 లక్షలు లైసెన్సు ఫీజు అని ఆరుదఫాలుగా ఫీజును చెల్లించవచ్చన్నారు. దరఖాస్తులు నేటినుంచి ఆన్లైన్, హైబ్రిడ్, ఆఫ్లైన్లో స్వీకరిస్తామని, ఈ నెల 26 సాయంత్రం 5 గంటల వరకు చివరి గడువు అన్నారు. దరఖాస్తు రుసుం రూ. 5 లక్షలని, ప్రాసెసింగ్ ఫీజు మరో రూ.10 లక్షలని, డీడీ చలానాల ద్వారా చెల్లించేవారు, సంబంధిత కార్యాలయానికి వచ్చేవారు డీపీఈఓ ఆఫీస్ పేరిట చలానా కట్టాలన్నారు. ఒక్కో బార్కు కనీసం నాలుగు దరఖాస్తులు రావాలని, లేదంటే తదుపరి నోటిఫికేషన్ వరకు వేచి ఉండాల్సిందేనన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని, ఎన్ని బార్లకై నా పెట్టుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలోని శ్రీకాకుళం, పలాస పరిధిలో ఉన్న లైసెన్సుదారుల మద్యం దుకాణాలకు వచ్చే అక్టోబరు నుంచి రూ. 79 లక్షల లైసెన్సు ఫీజుగా ఉంటుందని, ఇచ్ఛాపురం, ఆమదావలస మున్సిపాలిటీల పరిధి దుకాణాలకు రూ. 65.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించిందని, వాటితో పోల్చుకుంటే బార్లకు తక్కువ ఫీజేనన్నారు. ఈ నెల 28న జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటరియంలో లాటరీ పద్ధతిన బార్లు కేటాయిస్తామన్నారు. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ముగింపు ఈనెల 26న, లాటరీ 28న ఎకై ్సజ్ కొత్త మద్యం పాలసీ ప్రకారం ఏర్పాటు వివరాలు వెల్లడించిన జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డి కొత్త బార్ల పాలసీ మొదలయ్యాక ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 వరకు అమ్మకాలకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. బార్లకు అనుసంధానంగా రెస్టారెంట్లను పెట్టుకునేందుకు 15రోజులు అదనంగా లైసెన్సుదారులకు గడువిస్తామని అన్నారు. జిల్లాలో ఉన్న 176 మద్యం దుకాణాలకు ఇప్పటికే పక్కనే పర్మిట్ రూమ్లకు అనుమతిలిచ్చామని దీని ప్రకారం నీరు, ఫుడ్ప్యాకెట్లు అమ్మకాలు, మద్యం తాగేందుకు వీలుంటుందన్నారు. సమావేశంలో డీసీతో పాటు జిల్లా ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు, సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేతో పోరాడే శక్తి లేదు.. చనిపోతా!
శ్రీకాకుళం క్రైమ్: ‘‘ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్లే నాకీ పరిస్థితి వచ్చింది. రెండు నెలలుగా రకరకాలుగా ఇబ్బందిపెడుతున్నారు. ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. మీడియా ముందుకురావడంతో నాపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. నేను ఆరోపణలు చేస్తున్న వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో... నన్నే దోషిగా చిత్రీకరిస్తున్నారు. ప్రశాంతంగా బతకనివ్వడం లేదు. సరిగానే పనిచేస్తున్నానని చెబుతున్నా, అందరితో సంతకాలు పెట్టిస్తూ... నాకు మద్దతిచ్చినవారిని భయపెడుతున్నారు.ఇక పోరాడే శక్తి లేదు. చనిపోదామని నిర్ణయించుకున్నా’’ అని శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య వాపోయారు. తన బాధను బయటకు చెప్పడమే తప్పా? అని ప్రశ్నించారు. దళిత మహిళా ఉద్యోగి అయిన సౌమ్య... సోమవారం శ్రీకాకుళం తిలక్నగర్లోని నివాస గృహంలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే కూన, ఆయన అనుచరుల వేధింపులు తాళలేక జీవితాన్ని చాలించాలని అనుకున్నట్లు తెలిపారు. బాధితురాలు సౌమ్య, వారి కుటుంబ సభ్యులు, రిమ్స్ వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... ఓ టీవీ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాక బెడ్రూమ్లోకి వెళ్లిన సౌమ్య బీపీ స్టెరాయిడ్ ట్యాబ్లెట్లు మింగారు.బయటకు వచ్చిన ఆమె కళ్లు తిరిగి పడిపోయారు. పనిమనిషి అప్పన్న నీళ్లు తాగమని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్లి చూశారు. మందులు చెల్లాచెదురుగా పడి ఉండడంతో సౌమ్య తల్లి సద్విలాసిని, డ్రైవర్ శివకు చెప్పారు. రిమ్స్లో గైనిక్ ప్రొఫెసర్, సౌమ్య సోదరి రేజేటి శిరీషకు ఫోన్ చేశారు. అప్పన్న, శివ తక్షణమే కారులో ఆస్పత్రికి తీసుకెళ్లారు. చాలాసేపు అపస్మారక స్థితిలో ఉన్న సౌమ్యకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించారు. స్పృహలోకి వచ్చాక సౌమ్య మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వెళ్లగక్కారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ రాము వెల్లడించారు. ఎమ్మెల్యేతో మాకు ప్రాణహాని సౌమ్యతో పాటు టీడీపీ కార్యకర్త సనపల సురేష్ కూడా ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఆస్పత్రిలో సౌమ్యను చూద్దామని వెళ్తే కొందరు వెంబడించారని, తాను తప్పించుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపారు. సురేష్తో పాటు భార్యాపిల్లలు కూడా స్టేషన్కు వెళ్లి ఎమ్మెల్యే మనుషులతో తమకు ప్రాణహాని ఉందని కాపాడాలని కోరారు.అమ్మను రాత్రి 10 వరకు ఎమ్మెల్యే ఆఫీస్లో ఉంచారు..‘‘రాత్రిళ్లు ఎమ్మెల్యే వీడియో కాల్లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎమ్మెల్యే కార్యాలయంలో నా తల్లిని రాత్రి 10 వరకు ఉంచారు. విపరీతంగా ట్రోల్స్ చేస్తుండటంతోనే మా అమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు’’ అని రేజేటి సౌమ్య కుమారుడు రాహుల్ తెలిపారు.నాన్న పోయిన బాధలో ఉంటే..‘‘మా నాన్న రిటైర్డ్ ఎంఈవో. ఆర్నెల్ల క్రితం మరణించారు. పుట్టెడు శోకంలో ఉన్నాం. మా కుటుంబానికి సౌమ్యనే పెద్ద దిక్కు. ఆమె ఆత్మహత్యాయత్నం కలచివేసింది. అమ్మ హెచ్ఎంగా రిటైరయ్యారు. కుటుంబమంతా బాగా చదువుకుని సెటిల్ అయ్యాం. అలాంటి మాపై ఆరోపణలు చేయడం తగదు’’ అని సౌమ్య సోదరి, గైనిక్ ప్రొఫెసర్ శిరీష వాపోయారు. -
టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నా.. నావల్ల కావట్లే!
శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఎమ్మెల్యే తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ వాపోయిన కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య.. బలవనర్మణానికి ప్రయత్నించారు. టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ‘‘టీడీపీ నేతల వేధింపులు భరించలేకపోతున్నా. గత మూడు రోజులుగా నన్ను, నా కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. నా వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని ఆస్పత్రి బెడ్ మీద కన్నీళ్లు పెట్టున్నారు. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా ఆమెపై నెగెటివ్గా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ నేతలు వాళ్ల సంబంధిత అకౌంట్లలో ఆ పోస్టులు చేయిస్తున్నారని ఆమె అంటోంది. ఆమదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వ్యవహారం రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఆ ఆరోపణలు సంచలనంగా మారాయి. మూడు రోజుల నుంచి బాధితురాలు కేజీబీవీ ప్రిన్సిపాల్ రేజేటి సౌమ్య మీడియా ముఖంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని కూడా ఆమె అన్నారు. ఎమ్యెల్యే వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. నావల్ల కావడం లేదంటూ.. మీటింగుల పేరుతో రాత్రి 11 గంటల వరకు ఇబ్బంది పెడుతున్నారని మీడియా ముందు కన్నీరుపెట్టుకుంది. ఉన్నతాధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పిందే వింటున్నారని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు తనపై అవినీతి ఆరోపణలు చేసి ఇచ్చాపురం ట్రాన్స్ఫర్ చేశారని మండిపడిందామే. ఇదే విషయంపై SC కమిషన్కు కూడా ఆమె ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్యే రవి ఆ ఆరోపణలను ఖండించారు. ఆమెపై మరోసారి అవినీతి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. సౌమ్యపై టీడీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయగా.. తీవ్ర మనస్థాపంతో ఆమె బలవన్మరణానికి ప్రయత్నించింది. -
‘కేజీబీవీ ప్రిన్సిపాళ్ల అక్రమ బదిలీలు నిలిపివేయాలి’
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేజీబీవీల ప్రిన్సిపాళ్ల అక్ర మ బదిలీలు నిలిపివేయాలని, ఏపీసీని తొలగించా లని ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిశోర్కుమార్, సీనియర్ నాయకులు కె.విజయగౌరి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి. శ్రీరామ్మూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రక టన విడుదల చేశారు. జిల్లాలోని పొందూరు, కంచిలి, గార కేజీబీవీ స్కూల్ ప్రిన్సిపాల్స్పై ఎలాంటి విచారణ జరపకుండా, కేవలం స్థానిక ఎమ్మెల్యే ల లేఖల ఆధారంగా బదిలీ చేయడం అన్యాయమన్నా రు. స్థానిక ఎమ్మెల్యేల లేఖల ఆధారంగా విచారణ లేకుండా బదిలీలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రిన్సిపాల్స్ బదిలీకి రాష్ట్ర కార్యాలయం అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ఉల్లంఘించారని, బదిలీకి ‘అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్’ అని చూ పించడం వాస్తవాలను దాచే ప్రయత్నమని తీవ్రంగా విమర్శించారు. అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. -
‘ఉద్యోగినులపై దురుసు ప్రవర్తన సరికాదు’
నరసన్నపేట: గౌరవ ప్రదమైన ఎమ్మెల్యే హోదాలో ఉన్న వారు మహిళల పట్ల, మహిళా ఉద్యోగుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, స్థాయి మరిచి దుర్భాషలాడటం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తాము మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న కూటమిలో ఉన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కేజీబీవీ ప్రిన్సిపాల్తో ఫోనులో అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదన్నారు. ఈ విషయంపై భేషరతుగా ఆయన ఉద్యోగినికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు మహిళా ఉద్యోగులకు తగిన గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా ఉండాలే తప్ప ఇలా చేయకూడదని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెక్కలి: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ బాధితురాలు పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్యకు న్యాయం చేయాలని దళిత జనోద్ధరణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేవీ రమణ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. దళితులు, దళిత మహిళా ఉద్యోగులపై వేధింపులు పెచ్చుమీరిపోతున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రవికుమార్ పూర్తిగా దిగజారిపోయి దళిత మహిళా ఉద్యోగినిపై నోటికి ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడడం రా జ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇలా వ్యవహరించడం ప్రజా ప్రతినిధులకు తగదని పేర్కొన్నారు. బాధితురాలు సౌమ్యకు మద్దతుగా ఈ నెల 20న అంబేడ్కర్ విజ్ఞాన భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి దళిత నాయకులంతా హాజరు కావాలని కేవీ రమణ కోరారు. -
విద్యుత్ లోడ్.. క్రమబద్ధీకరణకు చాన్స్
● కిలోవాట్పై 50 శాతం రాయితీ ● డిసెంబర్ 31 వరకు గడువు పెంపు ● సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు హిరమండలం: గృహవిద్యుత్ వినియోగదారులు అదనపు విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణకు విద్యుత్ శాఖ మరో అవకాశం కల్పించింది. కిలో వాట్ విద్యుత్కు 50 శాతం రాయితీతో తగ్గించుకునేందుకు తొలుత మార్చి 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు అవకాశం కల్పించింది. అయినా వినియోగదారుల నుంచి అంతంత మాత్రమే స్పందన వచ్చింది. దీంతో డిసెంబర్ 31 వరకు గడువు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అఽధికారులు కోరుతున్నారు. వాస్తవానికి గృహ వినియోగదారుల్లో చాలామంది సర్వీస్ పొందే సమయంలో తక్కువ లోడు సామర్థ్యంతో కనెక్షన్ పొందుతారు. తర్వాత ఇంట్లో గృహోపకరణాలు పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం, లోడ్ రెండూ పెరుగుతాయి. ఆ మేరకు విద్యుత్ లోడ్ పెంచుకోకుంటే ఆ ప్రాంతంలో లోవోల్టేజీ సమస్య తలెత్తతుంది. క్షేత్రస్థాయిలో సర్వీసులు, లోడ్ ఆధారంగానే ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తుంటారు. లో ఓల్టేజీ సమస్య తలెత్తినా అక్కడ లోడ్ ఎంత ఉందనే అధికారిక లెక్కల ప్రకారం కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలో వినియోగదారులంతా తప్పనిసరిగా గృహోపకరణాల మేరకు లోడ్ పెంచుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు పెరుగుతున్న వినియోగం.. సాధారణంగా కనెక్షన్ ఇచ్చే సందర్భంలో కిలో వాట్ విద్యుత్ వినియోగానికి గృహాలకు రూ.2 వేలు, దుకాణాలకు రూ.2500 చొప్పున వసూలు చేస్తారు. చాలామంది గృహ వినియోగదారులు ఈ మొత్తానికి సంబంధించి తమ వినియోగం 1 నుంచి 2 కిలోవాట్ లోపలే చూపిస్తున్నారు. వినియోగంలో అంతకు రెట్టింపు కేటగిరీలో చేరిపోతున్నారు. వాణిజ్య కనెక్షన్లకు సంబంధించిన వినియోగమైతే చూపించిన దానికంటే ఏకంగా నాలుగింతలు ఉంటోంది. ఇటువంటి వారంతా అదనపు లోడు క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని విద్యుత్ శాఖాధికారులు చెబుతున్నారు. జరిమాన పడకుండా.. ● ఇప్పటివరకు అధిక లోడ్ నియంత్రణలో భాగంగా విద్యుత్ అధికారులు, సిబ్బంది తరుచూ ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేసేవారు. అధిక లోడ్ వినియోగిస్తున్న వారిని గుర్తించి రుసుంతో పాటు జరిమానా వసూలు చేసేవారు. ● జిల్లాలో సుమారు 6.71 లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలోని వినియోగదారుల్లో 50 శాతానికి మంచి కనెక్షన్ తీసుకున్న సమయంలో చూపించిన వినియోగం కంటే అధికంగానే విద్యుత్ వాడుతున్నారు. ● గత ఐదేళ్లుగా ప్రతి నెలా తమకు కేటాయించిన లక్ష్యాల మేరకు రీడింగులు తనిఖీ చేసి అధిక లోడ్ వినియోగిస్తున్న వారికి అపరాధ రుసుం విధిస్తున్నారు. తీరనున్న లోఓల్టేజ్ సమస్య గృహాలు, దుకాణాలకు విద్యుత్ కనెక్షన్లు తీసుకునే సమయంలో లైట్లు, ఇతర గృహోపకరణాల వినియోగాన్ని సగటున అంచనా వేసి లోడ్ను కిలోవాట్లలో లెక్కించి సెక్యూరిటీ డిపాజిట్ డెవలప్మెంట్ చార్జీలు వేస్తారు. అధిక శాతం గృహాలకై తే 1 నుంచి 2 కిలోవాట్లు, దుకాణాలకు 2 నుంచి 3 కిలోవాట్లకు మాత్రమే అనుమతి తీసుకుంటారు. ఈ లెక్క ప్రకారమే ఆయా ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తారు. ● ఇంటిలో అవసరాలు పెరగడం, దుకాణాలకు సంబంధించి వ్యాపార లావాదేవీలు పెరగడం, వాతావరణ పరిస్థితుల వల్ల అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా విద్యుత్ వినియోగం ఉంటుంది. ● వినియోగం అంచనాకు మించడంతో ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ ఎక్కువై తరచూ ట్రిప్ కావడంతో లోఓల్టేజ్ సమస్యలు పెరిగిపోతున్నాయి. విద్యుత్ వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదనంగా వినియోగిస్తున్న లోడ్ను క్రమబద్ధీకరించుకోవాలి. వినియోగదారులే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకోవాలి. ఇలా చేసుకుంటే అదనపు రుసుములు , జరిమానా బెడద ఉండదు. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు. – జి.వి.ఎస్.ప్రసాదరావు, ఏడీ, విద్యుత్ శాఖ ప్రతి అదనపు కిలోవాట్కి సెక్యూరిటీ డిపాజిట్గా రూ.200 నిర్ణయించారు. ఇదే సమయంలో డెవలప్మెంట్ చార్జీ రూ.1500 ఉంటుంది. కిలోవాట్లు పెరిగే కొద్దీ ఈ రుసుం మారుతుంది. దరఖాస్తుల స్వీకరణ గడువు డిసెంబర్ వరకు పొడిగించారు. కిలోవాట్ చొప్పున డెవలప్మెంట్ చార్జీలలో 50 శాతం రాయితీ లబిస్తుంది. -
శ్రీకాకుళం
నరక ప్రాయంగా..శ్రీకాకుళం ట్రాఫిక్ నరక ప్రాయంగా మారుతోంది. పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. –8లోఎండనక, వాననక కష్టపడే ఓ రోజు కూలీకి సాయంత్రం కూలి డబ్బుగా దొంగనోట్లు చేతిలో పడితే..? పొద్దంతా రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికుడి కష్టానికి నకిలీ నోట్లు వేతనం రూపంలో అందితే..? చదువు రాని కష్టజీవికి ఈ అబద్ధపు సొమ్మును అంటగడితే.. వారి బతుకు మరింత దుర్భరమవుతుంది కదా.. జిల్లా కేంద్రంలో ఎప్పటికప్పుడు కొత్త తరహా నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఒక తరహా నేరాన్ని అరికట్టామని అనుకునేలోపే మరో పద్ధతిలో దుండగులు రెచ్చిపోతున్నారు. తాజాగా నకిలీ నోట్లు ముద్రించి చెలామణీకి తీసుకురావడం విస్మయపరిచింది. పెరుగుతున్న ఈ నేర సంస్కృతి పోలీసులకు సవాల్గా మారింది. శ్రీకాకుళం పాతబస్టాండ్: అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్ట ర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. విద్యార్థుల రక్షణ, భద్రత దృష్ట్యా ముందస్తుగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు అన్ని యాజమా న్యాల పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవే ట్ పాఠశాలల యాజమాన్యాలకు సంబంధిత జిల్లా అధికారుల ద్వారా ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జోనల్స్థాయి క్రీడా పోటీలు ఈనెల 19,20 తేదీల్లో జరగనున్నాయని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు తెలిపారు. విశాఖపట్నంలో జరిగే ఈ పోటీల్లో ఇప్పటికే ఆర్చరీ, అథ్లెటిక్స్, బాస్కెట్బాల్, కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారులు/జట్లను బాలబాలికల రెండు విభాగాల్లోను ఎంపిక చేశామని చెప్పారు. ఇప్పటికే జిల్లా స్థాయి పోటీలను నిర్వహించి, ఎంపికై న బాలబాలికల జాబితాను వెల్లడించారు. జోనల్స్థాయి విజేతలు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారని అన్నారు. జిల్లా నుంచి రెండు విడతలుగా విశాఖపట్నం పయనమవుతారని, 19వ తేదీన ఉదయం 5 గంటలకు శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు తమ లగేజీతో చేరుకోవాలని పేర్కొన్నారు. ఆర్చరీకి ఎల్.రాజశేఖర్, అథ్లెటిక్స్కు జి.శ్రీనివాసరావు, రాజేష్, బాస్కెట్బాల్కు జి.అర్జున్రావురెడ్డి, పీఎస్ మణికుమార్, కబడ్డీకి ఎస్.సింహాచలం, పి. ఝాన్సీ, వాలీబాల్కు కె.హరికృష్ణ, మేనకాబిశ్వాల్ కోచ్, మేనేజర్లుగా వ్యవహరిస్తారని డీఎస్డీఓ శ్రీధర్ చెప్పారు. మరిన్ని వివరాలకు సంబంధిత క్రీడా కోచ్లను లేదా వి.ఉపేంద్ర (సెల్: 9885096734)ను సంప్రదించాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సోమవారం నుంచి రెండో యూనిట్ పరీక్షలు మొదలుకానున్నాయి. అన్ని యాజమాన్య జూనియర్ కాలేజీల్లో యూనిట్ టెస్ట్ పరీక్షల క్వశ్చన్ పేపర్లను ఇంటర్బోర్డు అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కాలేజీల్లో అనగా ప్రభుత్వ, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్పేర్, గురుకులాలు, మోడల్ కాలేజీలు, కేజీబీవీలు, హైస్కూల్ ప్లస్ కాలేజీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకే ప్రశ్నపత్రం అందజేయనున్నారు. పరీక్షకు కొన్ని నిమిషాల వ్యవధిలో ప్రశ్న పత్రాన్ని ఇంటర్ బోర్డు వెబ్సైట్లో పొందుపర్చనుంది. ఈ పేపర్లను ప్రింటవుట్ తీసే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలేజీల నిర్వాహకులు మొత్తుకుంటున్నా ఎవరూ వినడం లేదు. గత సారి కూడా ఈ పద్ధతి వల్ల ఇబ్బందులు ఎదుర య్యాయి. నకిలీ నోట్ల ముద్రణ ఎక్కడ జరుగుతుందనే విషయంపై పోలీసులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. జిల్లా కేంద్రంలోని ఓ లాడ్జీలో దొంగనోట్ల ముఠా బస చేసినప్పటికీ ఇటు లా అండ్ఆర్డర్ పోలీసులకు గానీ, స్పెషల్బ్రాంచి పోలీసుల కు గానీ ఇంటిలిజెన్స్కుగానీ సమాచారం లేకపోవడం ఆలోచించదగ్గ విషయం. పైడి భీమ వరం, పాతపట్నం చెక్పోస్టులు దాటి మరీ ఈ ముఠాలు జిల్లాకు వస్తుండడం కూడా అనుమానించాల్సిన విషయమే. ఓ పెద్ద స్థాయి వ్యక్తే ఈ ముఠాలకు ఆశ్రయం కల్పిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోలీసులు వీరిపై దృష్టి సారించి ముఠా ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు. నకిలీ నోట్ల చెలామణీ కేసు విచారణ చేస్తుండగానే పోలీసులు విస్తుపోయేలా కొన్ని అంశా లు వెలుగులోకి వచ్చాయి. లాడ్జిలో దొరికిన వారిలో ఒకరి ఇంటిలో జరిపిన సోదాల్లో రెవె న్యూ అధికారులకు సంబంధించిన నకిలీ ప త్రాలు, స్టాంపులు లభించినట్లు తెలుస్తోంది. వీటి ద్వారా పలు బ్యాంకుల్లో కమిషన్ పేరిట రుణాలు ఇప్పించినట్లు తెలుస్తోంది. ఓ మీడి యా ప్రతినిధి కూడా వెనక ఉన్నట్లు భోగట్టా. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రం.. అందులో ఓ లాడ్జి.. ఆ లాడ్జిలో నకిలీ నోట్ల ముద్రణ, చెలామణీ.. దాదాపు 20 రోజులుగా ఓ ముఠా ఈ కార్యకలాపాల్లో తలమునకలై ఉంది. ఇన్ని రోజుల తర్వాత గానీ పోలీసులకు వీరి గురించి సమాచారం అందలేదు. మన నిఘా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. దొంగలు తెలివి మీరుతున్నారో, ఖాకీలు అలసత్వం వహిస్తున్నారో గానీ నేరాలు మాత్రం ఆగడం లేదు. రోజుకో రూపం మార్చుకుని ఖాతాలు ఖాళీ చేస్తున్నాయి. ఈ ముఠా జిల్లాకు రావడం వెనుక ఓ అజ్ఞాత వ్యక్తి హస్తముందని.. వాటాల్లో తేడా వల్లనే వీరిలో ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కొసరు వ్యక్తులు పట్టుబడి అసలు వ్యక్తులు తప్పించుకున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కొద్దికాలంలోనే చిక్కుతున్న ముఠాలు.. ●2023లో జూలైలో కాశీబుగ్గ కేంద్రంగా అంబటి సంతోష్ అనే రౌడీషీటర్ మరికొందరితో కలసి నరసన్నపేటకు చెందిన వ్యాపారిని రూ.50 లక్షలకు పైగా మోసం చేశాడు. రూ. 500 నోట్ల కట్టలు అందిస్తే అంతకు పదిశాతం రూ. 2 వేల నోట్ల కట్టలు అందిస్తానని మభ్యపెట్టాడు. ఇదే అంబటి సంతోష్ ఈ ఏడాది జూన్లో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట లో మరికొందరితో కలిసి రూ. 2.5 కోట్ల డీల్ ఓ వ్యక్తితో కుదుర్చుకుని రూ. 1 కోటి గుంజేశాడు. ●2024లో డిసెంబరు 12న ఒకేరోజు మెళియాపు ట్టి మండలం పట్టుపురం, జి.సిగడాం మండలం పెనసాం గ్రామాల వద్ద పోలీసులకు రెండు ముఠా లు పట్టుబడ్డాయి. వీరి వద్ద నుంచి సుమారు రూ. 90.25 లక్షల వరకు నకిలీ కరెన్సీతో పాటు రూ. 1.50 లక్షల బ్లాక్ కరెన్సీ కలర్ప్రింట్ మిషన్లు, కెమికల్స్, కలర్ ఇంక్బాటిల్స్, బ్లేడ్, గమ్ముబాటిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గనే అడ్డానా..? ఈ ఘటనల్లో భాగంగా పట్టుబడిన నిందితులు ఎక్కువగా కాశీబుగ్గ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు కావడం గమనార్హం. పోలీసులు ఆ ప్రాంతంపై బాగా దృష్టి సారించడంతో ఇప్పుడా ముఠాలు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న కొన్ని లాడ్జీలను అడ్డాగా ఎంచుకుంటున్నాయి. దొంగ పేర్లతో లాడ్జీలు బుక్ చేయడం, ముఠాలను అడ్డదారుల్లో రప్పించడం, ఆపై నోట్ల చెలామణీ విషయం బయటకు పొక్కకుండా ఉండేందు కు కొంతమొత్తంలో డీల్ కుదర్చడం ఇక్కడి వ్యక్తు లు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఘటనలో దాదా పు రూ.50 లక్షల పైన తమకు ఇవ్వాలని దొంగనోట్ల ముఠాను డిమాండ్ చేయడంతో వారు ససేమిరా అన్నారు. దీంతో పోలీసులతో టచ్లో ఉన్నవారే సమాచారం అందించినట్లు భోగట్టా. ఈ తతంగమంతా 20 రోజులు సాగినట్లు చర్చ సాగుతోంది. మరికొందరు దొరక్కపోవడంతో ఇంకా బయట గ్యాంగు ఉందనే అనుమానాలు ఇక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. మా కాలువలు మేమే బాగుచేసుకుంటున్నాం. సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయి. నారుమడ్లు పూర్తిగా ఎండిపోయాయి. అక్కడక్కడ నారు ఉన్నచో ట తీసుకొచ్చి ఉభాలు చేద్దామంటే నీరు లేదు. ఎన్నిసార్లు ఇంజినీర్లకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. – లండ సీతారాం, కొండవూరు, వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వరుణ దేవుడు కరుణించినా పూజారి వరం ఇవ్వడం లేదన్న చందంలా.. జిల్లాలో ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ ఇంజినీర్ల నిర్లక్ష్యానికి శివారు ప్రాంతాల రైతులు బలైపోయారు. వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాకు చెందిన వారే అయినా ఆయన కేవలం తన నియోజకవర్గానికే పరిమితం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గంలో వజ్రపుకొత్తూరు మండలంతో పాటు పలు గ్రా మాలకు సాగునీరు అందడం లేదని, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో ఉండే ప్రజాప్రతినిధులు శివారుకి సాగునీరు రాకుండా అడ్డుకట్ట వేస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గత సోమవారం నేరు గా కలెక్టర్కు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సాగు లక్ష్యం 1.50 లక్షల హెక్టార్లు. దీనికి ప్రధాన నీటి వనరులు వంశధార కుడి, ఎడమ కాలువలు, తోటపల్లి కాలువలు. బీఆర్ఆర్ వంశధార సర్కిల్కు, ఇరిగేషన్ సర్కిల్కు రెగ్యులర్ ఎస్ఈలు లేరు. ఇన్చార్జిలు ఉండటం వల్ల ప్రాజెక్టుల పనులు, కాలువల్లో పూడికలు తీసే పనులు చేయకపోవడంతో రైతులకు శాపంగా మారింది. పనులు చేయాల్సిన సమయంలో అంచ నాలు తయారు చేసి సరిగా ఇవ్వకపోవడంతో కాలు వలు దీనిస్థితిలో ఉండిపోయాయి. జిల్లాలో వంశధార కుడి కాలువ శివారు ప్రాంతాలైన శ్రీకాకుళం రూరల్, గార ప్రాంతాల్లో 10వేలు ఎకరాలు, ఎడమ కాలువకు శివారు ప్రాంతాలైన పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం మండలాల్లో 30 వేల ఎకరాలున్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలో కొండవూ రు, కూర్మనాథపురం, పెద్దబొడ్డపాడు, బెండి, తేరపల్లి, రెయ్యపాడు, తుంబవానిపేట, గర్తంవాటిపేట గ్రామాల్లో రైతులు కాలువల్లో పూడికలు తీసుకుంటున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు చేరడంతో ఆయిల్ ఇంజిన్లు పెట్టి తోడుకుంటున్నారు. తోటపల్లి నుంచి రణస్థలం, జి.సిగడాం, లావేరు ప్రాంతాల్లో 30 వేల ఎకరాలు శివారు ప్రాంతాలుగా ఉన్నాయి. నేటికీ ఈ కాలువల్లోకి సాగునీరు రాకపోవడంతో రైతులు వర్షంపైనే ఆధారపడుతున్నారు. గత ఏడాది ఖరీఫ్ సీజన్లో పడిన గండ్లు పూడ్చకపోవడంతో ఈ ఏడాది రైతుల పాలిట శాపంగా మారింది. ఇంజినీర్లు లేకుండా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు ఎలా పరుగులు పెట్టిస్తారో, సాగు నీరు ఎలా అందిస్తారో కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులే సమాధానం చెప్పాలని రైతులు ప్రశ్నిస్తున్నారు.గర్తంపాడు సమీపంలో రాయగుడ్డి కాలువలో పూడికలు తీసుకుంటున్న గ్రామస్తులు -
వాన సందేశం
మందస: గెడ్డవూరులో సముద్రంలోకి కొట్టుకుపోతున్న బోట్లు జిల్లాలో శనివారం 398.6 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఆదివారం నాటికి వర్షం మరింత ఎక్కువైంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు 178.6 మిల్లీమీటర్ల వర్షం పడగా, ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు 339.2 మిల్లీమీటర్లు కురిసింది. సాయంత్రానికి జిల్లా వ్యాప్తంగా 517.8 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఎక్కువగా హిరమండలం, మందస, ఇచ్ఛాపురం, వజ్రపుకొత్తూరు, సోంపేట, గార, సరుబుజ్జిలి, నరసన్నపేట, పొలాకి, శ్రీకాకుళం, రణస్థలం మండలాల్లో కురిసింది. హిరమండలం: హిరమండలం వంశధార గొట్టా బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రం స్వల్పంగా వరద నీరు పెరిగింది. బ్యారేజీవద్ద 38.10మీటర్ల నీటిమట్టం ఉంది. బ్యారేజీలోకి ఇన్ఫ్లో 8577 క్యూసెక్కులు వస్తోంది. వచ్చిన నీటిని స్పిల్వే తోపాటు 9 గేట్లు 20సెంటీమీటర్లు పైకి ఎత్తి దిగువకు అవుట్ఫ్లో 8577 క్యూసెక్కులు విడిచిపెట్టినట్లు డీఈ సరస్వతి తెలిపారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా 1771 క్యూసెక్కులు, కుడి ప్రధాన కాలువ ద్వారా 308 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టినట్లు చెప్పారు. క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు విస్తారంగా పడితే వరద పెరిగే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాకు వాన సందేశం అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా మరో రెండు రోజులపాటు జిల్లాలో భారీ, అతి భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం 19వ తేదీ ఉదయం నాటికి ఆంధ్రా–ఒడిశా మధ్య ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వర్షాలతో పాటు 40 నుంచి 60 కిలోమీటర్లు వరకు బలమైన ఈదురుగారులు వీస్తాయని తెలిపారు. సోమ, మంగళ, బుధవారా ల్లో జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉది. కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూమ్(08942 220557)ను కొనసాగించింది. కలెక్టరేట్ ఆర్డీవో కార్యాలయం మండల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కొన సాగుతున్నాయి. నదుల తీరప్రాంతాల్లోనూ, సముద్ర తీర మండలాల్లోనూ మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉద్యోగులకు సెలవులు లేవు: కలెక్టర్ జిల్లాలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కలె క్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అవుట్స్టేషన్ సెలవులు మంజూరు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. సాగునీటి చెరువుల నీటి మట్టాలను పర్యవేక్షించాలని, నదులు–కాలువల గట్లను బలోపేతం చేయాలని, నిత్యావసర వస్తువులను నిల్వ ఉంచి, పునరావాస కేంద్రాలను శుభ్రపరిచి రె వెన్యూ శాఖకు అప్పగించాలని సూచించారు. తక్కు వ ఎత్తులో ఉన్న రహదారులు, వంతెన పైనుంచి వరద నీరు ప్రవహించే కాజ్వేలు మూసివేయాలని రెవెన్యూ, పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని హెచ్చరికలు జా రీ చేయాలన్నారు. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు ఫోన్లో ఆదేశించారు. మందస: గెడ్డవూరు గ్రామం సమీపంలో ఉన్న సముద్ర తీరం కోతకు గురి కావడంతో పడవలు సముద్రం లోపలకు వెళ్లిపోయాయి. మత్స్యకారులు స్పందించడంతో పడవలు, వలలను కాపాడుకున్నారు. కానీ బోట్లు కొంత మేర దెబ్బ తిన్నాయని వారు తెలిపారు. -
నరకప్రాయంగా.. నగర ట్రాఫిక్
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య పనుల నిమిత్తం వచ్చే ప్రజలు శ్రీకాకుళం నగరంలో తిరగలాంటే తీవ్రంగా చెమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేక పర్వదినాలు వస్తే వాహనాల పరిస్థితి దేవుడెరుగు.. పాదచారులు కూడా నడవలేని దుస్థితి ఏర్పడుతోంది. ఇక ఉదయం స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం, సాయంత్రం విడిచిపెట్టే వేళల్లో ట్రాఫిక్తో రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి. ముఖ్యంగా కార్లు, ద్విచక్ర వాహనాలు, ఇతరత్రా పార్కింగ్ చేయాలంటే సరైన చోటు లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్కడికక్కడే నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేయడమే కాక ట్రాఫిక్ పోలీసులు విధించే జరిమానా చలానాలు కట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. తోపుడు బళ్లు వర్తకం చేసేవారికి మున్సిపాలిటీ అధికారులతో కలసి నోటీసులిచ్చి నియంత్రిస్తున్నాం. అటువంటి చోట్ల (నోపార్కింగ్) బళ్లు పెడితే రూ.వెయ్యి చొప్పున జరిమానా వేస్తున్నాం. కళింగ రోడ్డులో అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలను టోయింగ్ వెహికల్పై స్టేషన్కు తీసుకెళ్లి జరిమానా విధిస్తున్నాం. వాహనదారులు పార్కింగ్ పెట్టుకునేందుకు ఎప్పటినుంచి స్థలాభావం ఉంది. ఆటోలు అడ్డదిడ్డంగా తిప్పేవారిపై సీసీ ఫుటేజీలో చూసి స్టేషన్కు పిలిపిస్తున్నాం. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీస్స్టేషన్ బాటిల్ నెక్ ప్రాంతాల్లో.. నగరంలో రోడ్డు విస్తరణకు నోచుకోని బాటిల్ నెక్ప్రాంతాలైన చినబరాటం వీధి ఇరుకుగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రైతుబజారు రోడ్డు, డేఅండ్నైట్ సమీప సెయింట్జోసెఫ్ స్కూల్, సింధూర ఆసుపత్రి రోడ్లు వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతుంటాయి. ఆటోవాలాలు సైతం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడం, అడ్డదిడ్డంగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసేయడంతో తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చిన్నబరాటం వీధి: పాతబస్టాండు–జీటీరోడ్డుకు లింక్గా ఉండటం.. పాతబస్టాండ్ వెళ్లేందుకు దగ్గరకావడంతో అధికంగా వాహనదారులు ఇటుగా వెళ్లేందుకు మొగ్గుచూపుతారు. సాయంత్రం 6 గంటలనుంచి విపరీతంగా ట్రాఫిక్ ఉంటోంది. రైతుబజారు రోడ్డు: జీటీరోడ్డు స్టేట్బ్యాంకు మెయిన్ బ్రాంచి నుంచి ప్రకాష్బాబు ఓల్డ్ బుక్స్టాల్ మీదుగా రైతుబజారుకు వెళ్లే మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. రోడ్డు మీదే ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసేయడం, అదే దారిలో మూడు సిమెంట్గొడౌన్లు ఉండటంతో లోడ్లు దింపి, ఎక్కించే లారీలు రోడ్డుమీదే ఆపేస్తుండటం, తోపుడు బళ్లపై టిఫిన్లు, స్నాక్స్, ఫాస్ట్ఫుడ్ లాంటివి అధికంగా ఉండటంతో వాటి ఎదురుగానే వచ్చేపోయేవారు వాహనాలు నిలుపుతున్నారు. ఉదయం 11 నుంచి ఈ ట్రాఫిక్ తాకిడి ముద్దాడ చిన్నబాబు ఆసుపత్రి వరకు వుంటుంది. రాత్రి 9 గంటల వరకు ఇదే పరిస్థితి. కళింగరోడ్డు: పాతబస్టాండ్, ఏడురోడ్ల కూడలి, కళింగరోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ మార్గంలో స్టీల్సామాన్లు, నిత్యావసర సరుకుల దుకాణాలు, పండ్లు, పూల దుకాణాలు ఎక్కువగా ఉండటంతో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపేస్తూ ఉంటారు. పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్టు ఆనుకొని ఉండటం, సమీపంలోనే ఫైర్, ఒకటో పట్టణస్టేషన్, సబ్డివిజనల్ కార్యాలయాలు ఉండటంతో నిత్యం రద్దీయే. స్కూల్జోన్: రామలక్ష్మణ కూడలి సమీపంలో కార్పొరేట్ కళాశాల, డేఅండ్నైట్ సమీపంలో మిషనరీస్ స్కూల్ దారిలో విపరీతంగా రద్దీ ఉంటుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం నరకమే. బలగరోడ్డులో సైతం సాయంత్రం 5 గంటల నుంచి ట్రాఫిక్ మొదలవుతుంది. జిల్లా కేంద్రంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు ప్రత్యేక పర్వదినాలు, సాయంత్రాల్లో నడవలేని పరిస్థితి ఇష్టారాజ్యంగా వాహనాల పార్కింగ్.. స్కూల్ జోన్లలో పరిస్థితి మరింత దారుణం -
జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు
శ్రీకాకుళం కల్చరల్: భారత ప్రజాస్వామ్య వ్యవస్థను జర్నలిజం అనేది ఫోర్త్ ఎస్టేట్గా నడిపిస్తోందని, అటువంటి జర్నలిజానికి నిజమే ప్రాణవాయువు కావాలని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పూర్వపు వైస్ చాన్సలర్ డాక్టర్ ఆచార్య హనుమంతు లజపతిరాయ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీవో హోంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వ్యవస్థాపక దినోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం సాక్షి బ్యూరో చీఫ్ కందుల శివశంకర్కు డీకే అవార్డు, జనదీపిక పత్రిక సంపాదకుడు సున్నపు చిన్నారావుకు శృంగారం ప్రసాద్ స్మారక అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీకే ట్రస్టు కార్యదర్శి దుప్పల రవీంద్రబాబు మాట్లాడుతూ ఎన్నో సేవలు అందించిన దుప్పల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఏటా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లి ధర్మారావు, అవార్డు జ్యూరీ సభ్యులు సురేష్బాబు, న్యాయవాది బొడ్డేపల్లి మోహనరావు, వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు గేదెల ఇందిరా ప్రసాద్, యూనియన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెండి నర్సింగరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొంచాడ రవిశంకర్, జి.శ్రీనివాసరావు, ఎంహెచ్ అవార్డు గ్రహీత గేదెల మాధవరావు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సీహెచ్ జగదీష్, సనపల రమేష్, గరిమెళ్ల ప్రెస్క్లబ్ అధ్యక్షుడు ఎన్నేశ్వరరావు, సామ్నా నాయకులు చౌదరి సత్యనారాయణ, చైతన్య మల్లేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు మహారాణ, యోగి, నవీన్, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
కర్మయోగి పాఠాలపై ఒత్తిడి తగదు
పొందూరు: గత మే నుంచి ఐగాట్ కర్మయోగి పాఠాలు వీక్షించి తీరాలని ఉపాధ్యాయులపై అధికారులు ఒత్తిడి తేవడం సమంజసం కాదని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న అన్నారు. పొందూరులోని డీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వీడియోలు వీక్షించి ఎసెస్మెంట్లను పూర్తి చేసి సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, తొలుత నాలుగు పాఠాలని చెప్పి ప్రస్తుతం సుమారు 20 పాఠాలు వినాలని కలెక్టర్ కార్యాలయం నుంచి సందేశాలు పంపుతున్నారని తెలిపారు. 6 పాఠాలకు మించని ఉపాధ్యాయుల పేర్లను వాట్సాప్లో పంపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇంత వరకు ఏ ఒక్క అధికారి ఐగాట్ కర్మయోగి అంటే ఏమిటి? ఎందుకు ఇందులో వీడియో పాఠాలు వినాలి? అనే దానిపై స్పష్టత ఇవ్వలేదన్నారు. ఒక్క పాఠం పది నిమిషాలు వినేసరికే 2జీబీ ఇంటర్నెట్ అయిపోతుందని, రోజంతా యాప్ల్లోనే పనిచేయాల్సిన పరిస్థితి తీసుకొస్తూ ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. యువకుడిపై కేసు నమోదు శ్రీకాకుళం రూరల్: ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువకుడు మోసం చేశాడంటూ మోపసుబందరు గ్రామానికి చెందిన ఓ యువతి శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మోపసుబందరు గ్రామానికి చెందిన యువతి సరసన్నపేట మండలం ఊటపేటలోని తాతయ్య ఇంటి వద్ద ఉంటూ ఇంటర్మీడియట్ చదివింది. ఆ సమయంలో పక్క గ్రామమైన ముసిడిగట్టుకు చెందిన సింహాద్రితో పరిచయం ఏర్పడింది. ఇంటర్ పూర్తయ్యాక కూడా ప్రేమ కొనసాగించారు. కొన్ని నెలల క్రితం సింహాద్రికి ఉద్యోగం రావడంతో పెళ్లి ప్రస్తావన తీసుకురాగా నిరాకరించడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్ఐ రాము ఆదివారం కేసు నమోదు చేశారు. వ్యక్తి ఆత్మహత్య పొందూరు: కనిమెట్ట పంచాయతీ రాందాసుపురం గ్రామానికి చెందిన పేడాడ అప్పలనాయుడు(60) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు భార్య అప్పలనరసమ్మతో కలిసి హైదరాబాద్లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. తాగుడుకు బానిసయ్యాడు. వారం కిందట గ్రామానికి వచ్చి మద్యం తాగుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. హైదరాబాద్ వచ్చేయాలని భార్య చెప్పినా వినకుండా మద్యం తాగుతూ తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంటి ముందు తాడుతో ఉరేసుకుని మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. న్యాయం చేయాలని ఫిర్యాదు పలాస : పలాస సూదికొండ కాలనీకి చెందిన ఓ జీడి కార్మికురాలు ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. తాను పనిచేసే జీడిపిక్కల బడ్డీలో గుమస్తాగా పనిచేసిన పలాస అన్నపూర్ణాశ్రమ వీధికి చెందిన జామి నరేష్ పెళ్లి చేసుకుంటానని నాలుగేళ్లుగా నమ్మించి మోసం చేస్తున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు న్యాయం చేయాలని కోరింది. -
అత్యాధునిక సౌకర్యాలతో డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్
అరసవల్లి : జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటులో సింహద్వారం ప్రధాన రహదారిలో మహిళలు, చిన్నారుల వైద్యం కోసం డాక్టర్ శ్రీధర్ ఆస్పత్రి అందుబాటులోకి వచ్చిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం స్థానిక మెడికవర్ ఆసుపత్రి పక్కన నూతనంగా నిర్మించిన డాక్టర్ శ్రీధర్ హాస్పిటల్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి నేడు అత్యంత ప్రావీణ్యత ఉన్న వైద్యునిగా శ్రీధర్ గుర్తింపు పొందారని కొనియాడారు. శ్రీధర్ వంటి అనుభవజ్ఞులైన వైద్యులు ఐవీఎఫ్, ఫెర్టిలిటీ సెంటర్లో వైద్య సేవలను పరిచయం చేయడం జిల్లా ప్రజలకు శుభపరిణామమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ దానేటి శ్రీధర్, ఆయన కుమారుడు డాక్టర్ దానేటి రూపాంక్, భార్య దానేటి రాధ, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎచ్చెర్ల, నరసన్నపేట ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, అరకు మాజీ ఎంపీ జి.మాధవి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కిమ్స్ అధినేత డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, మెడికవర్ గ్రూప్ ఈడీ హరికృష్ణ, ప్రముఖ వైద్యులు పి.జె.నాయుడు, గూడేన సోమేశ్వరరావు, కె.అమ్మన్నాయుడు, పోలాకి జెడ్పీటీసీ డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, టీడీపీ నేత మెండ దాసునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో ఇద్దరికి గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధికి చెందిన ఓ వ్యక్తి పుట్టిన రోజు సందర్భంగా అదే వీధికి చెందిన జోగి చందు, దేవాది లోహిత్లు కడుతుండగా విద్యుత్ వైర్లు తాకడంతో ఇద్దరూ షాక్కు గురయ్యారు. ఇద్దరూ గాయపడటంతో వెంటనే స్థానికులు టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. ఆయిల్ ట్యాంకర్ బోల్తా టెక్కలి రూరల్: స్థానిక మెళియాపుట్టి రోడ్డు సమీపంలో జాతీయ రహదారి వద్ద ఆదివారం వేకువజాము ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. కాకినాడ నుంచి పశ్చిమబెంగాళ్ వైపు వెళ్తున్న ట్యాంకర్ టెక్కలి సమీపంలో ముందు వెళ్తున్న లారీని తప్పించే ప్రయత్నంలో అదుపుతప్పి అప్రోచ్ రోడ్డు మీదుగా సమీపంలో పొలంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ జి.సూరిబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎచ్చెర్లలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఐటీఐ, స్కిల్ హబ్ సెంటర్లలో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు శిక్షణను అందించనున్నారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కోర్సులకు శిక్షణ ఇవ్వనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు తెలిపారు. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు కలిగిన యువకులు అర్హులని చెప్పారు. శిక్షణ పూర్తిచేసినవారికి సర్టిఫికెట్తోపాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని సుధాకర్ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హత తెలుపు సర్టిఫికెట్లు, ఆధార్కార్డు, 2 పాస్ఫొటోలతో ఆగస్ట్ 20వ తేదీలోపు ఎచ్చెర్ల స్కిల్హబ్ సెంటర్లో సంప్రదించాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 7989177887 నంబర్ను సంప్రదించాలన్నారు.షాపు తెరవనే లేదు.. అయినా రూ.7వేల బిల్లు టెక్కలి: తాను షాపు తెరవకపోయినా రూ.7,240ల విద్యుత్ బిల్లు వచ్చిందంటూ టెక్కలి పాత పెట్రోల్ బంక్ ఎదురుగా వాటర్ సర్వీసింగ్ సెంటర్ యజమాని కురుమోజు తేజ వాపోయాడు. తన చేయి విరిగిపోవడంతో గత రెండు నెలలుగా షాపు తెరవడం లేదని, అయినప్పటికీ స్మార్ట్ మీటర్ పుణ్యమా అని వేల రూపాయల విద్యుత్ బిల్లు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతకు మునుపు ప్రతి నెల రూ.700 లోపు బిల్లు వచ్చేదని వివరించాడు. స్మార్ట్ మీటర్ అమర్చిన కొత్తలో రూ.78 వేల బిల్లు వచ్చిందని, దీనిపై అధికారుల ఫిర్యాదు చేయగా రూ.700 బిల్లుకు అదనంగా మరో రూ.700 వేసి రూ.1400 వసూలు చేశారని తెలిపారు. అత్యధికంగా బిల్లుల మోత మోగిస్తున్న స్మార్ట్ మీటర్ను తక్షణమే తొలగించి తనకు వచ్చిన బిల్లును తగ్గించాలని కోరాడు.విజిలెన్స్ కమిషనర్కు సత్కారంశ్రీకాకుళం కల్చరల్: రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ అనిలచంద్ర పునేఠా శనివారం కలెక్టర్ బంగ్లా వద్ద పంచముఖ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్కుమార్, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, ఆలయ కమిటీ సభ్యులు ఎల్.నందికేశ్వరరావు, రామలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళులుశ్రీకాకుళం (పీఎన్కాలనీ): స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న పోరాటాలు భావితరాలకు తెలియాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా శనివారం శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలి వద్ద ఆయన విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజిలతో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గౌతు లచ్చన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకలుగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి, చౌదరి బాబ్జీ, రమణమాదిగ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీబీసీడబ్ల్యూఓ అనురాధ తదితరులు పాల్గొన్నారు.రైలు ఢీకొని వ్యక్తి మృతివజ్రపుకొత్తూరు: పూండి రైల్వే స్టేషన్ యార్డు సమీపంలో పట్టాలపై శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. మృతుడు గులాబీ టీ షర్టు, సిమెంట్ కలర్ షార్టు ధరించిన ఉన్నాడని, గుర్తు తెలియని రైలు ఢీకొట్టడంతో మృతిచెంది ఉంటాడని చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని, వివరాలు తెలిసిన వారు పలాస జీఆర్పీ నెంబరు 9440627537కు తెలియజేయాలని కోరారు. -
డ్రై‘లేజీ’..!
అధికారులకు తెలియజేశాం డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామని, విద్యుత్ స్తంభాలు మార్చాలని విద్యుత్శాఖ అధికారులకు తెలియజేశాం. స్తంభాలు మార్చడానికి ఖర్చవుతుందని సమాధానం చెప్పారు. దీంతో డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టాం.. రెండు రోజులు వర్షాలు పడడంతో విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. – కూచెట్టి కాంతారావు, కాంట్రాక్టర్, సంతబొమ్మాళి ముందు చెప్పలేదు డ్రైనేజీ తవ్వక ముందు మాకు చెప్పలేదు. తవ్విన తర్వాత తెలియజేశారు. దీంతో వెంటనే పరిశీలించాను. ఆ తర్వాత వర్షాలు రావడంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పునరుద్ధరించాం. – శశిభూషణరావు, మండల విద్యుత్శాఖ ఏఈ, సంతబొమ్మాళి సంతబొమ్మాళి: కాంట్రాక్టర్ అత్యుత్సాహం, అధికారుల నిర్లక్ష్యం కలగలిపి ప్రజలకు శాపంగా మారింది. మురికి కాలువల నిర్మాణానికి ఇష్టానుసారం తవ్వేయడంతో విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సంతబొమ్మాళిలో అర్అండ్బీ రోడ్డుకు ఆనుకొని మురికి కాలువ నిర్మాణానికి రూ.కోటి 80 లక్షల ఉపాధి హామీ నిధులు మంజూరయ్యాయి. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ కాలువ నిర్మాణ పనులు చేపట్టారు. కాలువ నిర్మాణానికి అడ్డంగా 33 కేవీ, 11 కేవీ విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. విద్యుత్ స్తంభాలు మార్చాలని విద్యుత్ శాఖ అఽఽధికారులకు సంబంధిత కాంట్రాక్టర్, పంచాయతీ రాజ్ అధికారులు తెలియజేశారు. విద్యుత్ స్తంభాలు మార్చడానికి ప్రస్తుతం ఫండ్ లేదని, ఆ ఖర్చులు మీరే భరించాలని చెప్పడంతో అందుకు వారు అంగీకరించలేదు. దీంతో సంబంధిత కాంట్రాక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించి కాలువల నిర్మా ణంలో భాగంగా విద్యుత్ స్తంభాలను ఆనుకుని ఉన్న మట్టిని కూడా తీసేశారు. దీనికి తోడు వర్షాలు పడడంతో నాలుగు 33 కేవీ విద్యుత్ స్తంభాలు, నాలుగు 11 కెవీ విద్యుత్ స్తంభాలు శుక్రవారం రాత్రి నేలకూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. కోటబొమ్మాళి ఫీడర్ ద్వారా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా అందించారు. ట్రాఫిక్ కూడా నిలిచిపోవడంతో ఇతర మా ర్గాల ద్వారా రాకపోకలను సాగించారు. శనివారం ఉదయం విద్యుత్ శాఖ డీఈ పర్యవేక్షణలో పనులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. విద్యుత్ స్తంభం చుట్టూ మట్టిని తవ్వేసి చేపడుతున్న డ్రైన్ నిర్మాణం డ్రైనేజీ నిర్మాణంతో రోడ్డుకు అడ్డంగా కూలిన విద్యుత్ స్తంభాలు ఇష్టానుసారంగా డ్రైనేజీ నిర్మాణం కూలిన విద్యుత్ స్తంభాలు కాంట్రాక్టర్ అత్యుత్సాహం.. అధికారుల నిర్లక్ష్యమే కారణం -
సీపీఎస్ను తక్షణమే రద్దు చేయాలి
శ్రీకాకుళం: ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం విధానం రద్దు చేసి పాత పింఛన్ విధానం అమలుచేయాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ సలహాదారు పోతల దుర్గారావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీ ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు. యాప్ల విధానాన్ని రద్దు చేసి ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలన్నారు. పీఆర్సీని ప్రకటించాలని, విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ను విడుదల చేయాలని, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, ఇతర లీవ్లు మంజూరు చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గం.. అధ్యక్షుడిగా ఎండీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అన్ను వెంకటరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా కొప్పల డేనియల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొంత సుబ్బారాయుడు, రాష్ట్ర కోశాధికారిగా ఆవల అప్పన్న, రాష్ట్ర మీడియా కన్వీనర్గా అంబటి ఆదినారాయణ, రాష్ట్ర సహాధ్యక్షుడిగా భూపతి రవికుమార్, కింజరాపు నూకరాజులను ఎన్నుకున్నారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ఆవల అప్పన్న, ప్రధాన కార్యదర్శిగా కింజరాపు నూకరాజులు ఎంపికయ్యారు. -
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీన జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలన్నారు. అర్హత గల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారుల ద్వారా దరఖాస్తులు సమర్పించా లని సూచించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను సంబంధిత ఉప విద్యాశాఖాధికారులకు మాత్రమే సమర్పించాలన్నారు. నిర్ణీత దరఖాస్తుల న మూనాలు అన్ని మండల విద్యాశాఖ అధికారుల వద్ద ఉన్నాయని, మరిన్ని వివరాలకు 9492423420 సంప్రదించాలని సూచించారు.వైఎస్సార్సీపీ పోలినాటి వెలమ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా అంబటిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ సీపీ పోలినాటి వెలమ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా శ్రీకాకుళం నియోజకవర్గం సీనియర్ నేత అంబటి శ్రీనివాసరావు నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం శనివా రం సాయంత్రం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. అంబటి ఇదివరకు వైఎస్సార్ సీపీ పంచాయతీ రాజ్ జిల్లా అధ్యక్షుడిగా, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. గతంలో రెండు సార్లు ఎంపీపీగానూ పని చేశారు. సర్పంచ్గా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం ఈయన భార్య ఎంపీపీగా కొనసాగుతున్నారు. అధినాయకుడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సహకారంతో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని ఆయన తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకుని వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేసుకునేంతవరకు అలుపెరగకుండా శ్రమిస్తానని, తనకు పదవి రావడానికి దోహద పడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాన ని పేర్కొన్నారు.వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గురునాథ్ యాదవ్టెక్కలి: వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా టెక్కలికి చెందిన గద్దిబోయిన గురునాథ్ యాదవ్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. టెక్కలిలో యాదవ సామాజిక వర్గానికి చెందిన గురునాఽథ్ యాదవ్ యాదవ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షునిగా, అహిర్ సంఘానికి అధ్యక్షునిగా ప్రస్తుతం సేవలు అందజేస్తున్నారు. బీసీ సెల్ విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
బాక్సింగ్ భార్గవ్
● జూనియర్ ఇండియన్ బాక్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన సత్యభార్గవ్ ● ఇండియన్ కోచింగ్ క్యాంపునకు ఎంపిక ● భారత జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు యువ బాక్సింగ్ సంచలనం గంధం సత్యభార్గవ్ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నాడు. ఇప్పటికే అనేక టోర్నమెంట్లలో సత్తాచాటిన భార్గవ్ ప్రతిష్టాత్మక ఆలిండియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో హర్యానాలోని రోతక్ వేదికగా ఆగస్ట్ 2 నుంచి 15వ తేదీ వరకు జరిగిన ఇండియన్ కోచింగ్ క్యాంప్కు ఎంపికయ్యాడు. రెండు వారాలపాటు శిక్షణ పాఠాలు నేర్చుకున్న భార్గవ్ క్యాంప్ ముగించుకుని జిల్లాకు పయనమయ్యాడు. ఇండియన్ బాక్సింగ్ జట్టుకు ఎంపిక కావడమే లక్ష్యంగా సాధన చేస్తున్నాడు. బలగలోని జంగమ వీధిలో నివాసముంటున్న భార్గవ్ తండ్రి గంధం వీరకుమార్ పురోహితుడు, తల్లి పుష్పలత గృహిణి. పురోహితమే వీరి జీవనాధారం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇద్దరు పిల్లలు ఢిల్లేశ్వర్, భార్గవ్ ఆటలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇద్దరూ డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావు వద్ద శిక్షణ పొంది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఇండియన్ క్యాంప్కు ఎంపిక.. భార్గవ్ 2019లో బాక్సింగ్లో ప్రవేశం పొందాడు. కోవిడ్తో టోర్నీలు లేక.. ప్రాక్టీసుకే పరిమితమయ్యాడు. 2022లో విశాఖపట్నంలో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్లో రజత పతకం, ఆ తర్వాత వరుసగా 2023 రాజమండ్రిలో, 2024లో విశాఖపట్నంలో జరిగిన స్టేట్మీట్లో బంగారు పతకాలు సాధించాడు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లోఅద్భుతంగా రాణించి బంగారు పతకంతో మెరిశాడు. బాక్సింగ్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో హర్యానాలోని రోతక్లో జూలై 18 నుంచి 24 వరకు జరిగిన ప్రతిష్టాత్మక 6వ జూనియర్ నేషనల్స్ బాక్సింగ్ మీట్లో 80–85 కేజీల విభాగంలో కాంస్య పతకంతో మెరిశాడు. ఫైనల్ బెర్త్ కోల్పోయినా సెలక్టర్లను ఆకర్షించి ఇండియన్ క్యాంప్కు ఎంపికయ్యాడు. హర్యానాలోని రోతక్ వేదికగా శిక్షణ ముగించుకుని జిల్లాకు తిరుగుముఖం పట్టాడు. అక్టోబర్లో మరోసారి జరిగే ఇండియన్ కోచింగ్ క్యాంప్లో పాల్గొనాలని బీఎఫ్ఐ ఎన్ఐసీ కోచ్లు సూచించినట్టు భార్గవ్ చెబుతున్నాడు. భార్గవ్ ప్రస్తుతం ఇంటర్మీడియెట్ సెకెండియర్ చదువుతున్నాడు. భార్గవ్ను బాక్సింగ్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి బీఏ లక్ష్మణ్దేవ్, వంగా మహేష్, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, జిల్లా బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు అభినందించారు. తల్లిదండ్రులు, అన్నయ్య స్ఫూర్తితో బాక్సింగ్లో ప్రవేశం పొందాను. కోచ్ ఉమామహేష్, సంఘ పెద్దలు, కాలేజ్ ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో నిరంతరం సాధన చేస్తున్నాను. నేషనల్ మెడల్ సాధించి, ఇండియన్ కోచింగ్ క్యాంప్కు ఎంపికై నందుకు గర్వంగా ఉంది. భారత జట్టుకు ఎంపిక కావడం, ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించడమే నా జీవిత ఆశయం. – గంధం సత్యభార్గవ్, బాక్సింగ్ ప్లేయర్ -
జిల్లాలో జోరుగా వానలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు 365.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఉదయం 8 గంటలకు 203.8 మిల్లీమీటర్లు, 8 నుంచి ఒంటి గంటల వరకు మరో 35.4 మిల్లీమీటర్లు, ఒంటి గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు 128.4 మిల్లీమీటర్ల వాన పడింది. ఎక్కువగా సరుబుజ్జిలి, ఎల్ఎన్పేట, హిరమండలం, కంచిలి, కవిటి, ఇచ్ఛాపురంలో వర్షం కురిసింది. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్.. జిల్లాలో కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. నదీతీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో 08942 220557 నంబర్ను ఉంచారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్లతో పాటు 30 మండలాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. -
భోజనాలకు అప్పులు.. నిర్వాహకులకు తిప్పలు
కొత్తూరు: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు అందక వంట ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నా బిల్లులు మంజూరు కావడం లేదని, కనీసం గౌరవ వేతనం సైతం అందడం లేదని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది జనవరి నుంచి జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదీ పరిస్థితి.. జిల్లాలోని 30 మండలాల్లో 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో భోజన పథకం అమలు చేస్తున్నారు. విద్యార్థులకు వంట చేసి భోజనం పెట్టేందుకు 150 మంది మధ్యాహ్న భోజన కార్మికులను నియమించారు. వీరు సుమారు 12800 మంది విద్యార్థులకు భోజనాలు వండి పెడుతున్నారు. ఒక్కో విద్యార్థి భోజనానికి ప్రభుత్వంరూ.9.27 పైసలు చెల్లించాల్సి ఉంది. అదే విధంగా, నిర్వాహకులకు గౌరవ వేతనం కింద ఒక్కొక్కరికి నెలకు రూ.3వేలు చెల్లించాల్సి ఉంది. అయితే పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతవరకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి పప్పుకూడు.. బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించకపోవడంతో అప్పులు చేసి వండి పెట్టాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. కూరగాయలు, పప్పు, నూనె, కిరాణా సామగ్రితో పాటు వంట చెరుకులు నిత్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఎప్పటికై నా ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందని ఆశతో అప్పులు చేస్తున్నామని, అయితే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం సబబు కాదని ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకులు ఆకాశాన్నంటుతుండటంతో వాటిని కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎనిమిది నెలలుగా బిల్లులు చెల్లించక పోవడంతో అప్పులు చేసి వంటలు చేయాల్సి వస్తోంది. గౌరవ వేతనాలు కూడా ఇంతవరకు చెల్లించలేదు. అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నాం. ఇతర పనులకు వెళ్లలేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. – ఎ.సుందరమ్మ, వంట ఏజెన్సీ సభ్యురాలు, కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల వంట ఏజెన్సీ సభ్యులుగా చేరడం వల్ల ఉపాధి పనులకు రానివ్వడం లేదు. వంట సభ్యులుగా చేరి ఎనిమిది నెలలు గడుస్తున్నా బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించడం లేదు. అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నాం. బిల్లులు ప్రభుత్వం చెల్లించిన వడ్డీలకు సరిపోయేలా లేవు. – కె.కన్నెమ్మ, వంట ఏజెన్సీ సభ్యురాలు, కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు అందని బిల్లులు గౌరవ వేతనాలు సైతం చెల్లించని పాలకులు ఎనిమిది నెలలుగా తప్పని అవస్థలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బడ్జెట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరో వారం రోజుల్లో వంట ఏజెన్సీ సభ్యులకు బిల్లులతో పాటు గౌరవ వేతనాలు జమవుతాయి. – పి.దుర్గారావు, ఆర్ఐఓ, శ్రీకాకుళం -
అయ్యో.. హోమియో!
హోమియో వైద్యంతో నమ్మకంతో ఆస్పత్రికి వస్తున్నాం. వైద్యులు సేవలందిస్తున్నప్పటికీ అవసరమైన మందులు లేక వేరేచోట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచితే మంచిది. – పొన్నాన హరిప్రసాద్, లక్ష్మిపురం, సారవకోట మండలం మందుల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఏయే మందులు ఆస్పత్రికి అవసరమో వాటి వివరాలు పంపించాం. ఆయుష్ శాఖ మందులు పంపిస్తే రోగులకు అందుబాటులో వస్తాయి. – ఉమాగౌరి, హోమియో వైద్యులు, తెంబూరు, పాతపట్నం మండలం ● వైద్యులు లేక మూతపడుతున్న వైద్యశాలలు ● ఏడాదిగా సరఫరా కాని మందులు సారవకోట: జిల్లాలో పలు హోమియో వైద్యశాలల పరిస్థితి దయనీయంగా మారింది. ఓవైపు మందులు కొరత, మరోవైపు వైద్యులు లేక పలు ఆస్పత్రులు తెరుచుకోవడం లేదు. దీంతో హోమియో మందులు వాడుతున్న రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. జిల్లాలో ఆయుష్ విభాగంలో చీడిపూడి, శ్రీముఖలింగం, పాతపట్నం, తెంబూరు, పొన్నాడ, కింతలి, తొగరాం, బ్రాహ్మణతర్ల, తోటవాడ, శ్రీకాకుళం, జగతి, సంతవురిటి గ్రామాల్లో హోమియో వైద్యశాలలు ఏర్పాటు చేశారు. వీటిలో శ్రీముఖలింగం, తొగరాం, పాతపట్నం, బ్రహ్మణతర్ల ఆస్పత్రుల్లో వైద్యులు లేరు. పాతపట్నం, బ్రహ్మణతర్ల ఆస్పత్రుల్లో కాంపౌండర్లే ఆస్పత్రులు తెరుస్తున్నారు. శ్రీముఖలింగం, తొగరాంలలో వైద్యులు, సిబ్బంది లేక తెరుచుకోవడం లేదు. దీంతో ఆయా ప్రాంతాలలో హోమియో వైద్యం నమ్ముకున్న వారికి సేవలందని పరిస్థితి. వీరంతా శ్రీకాకుళం, ఇతర ప్రాంతాలలో ప్రైవేట్ హోమియో వైద్యులపై ఆధారపడుతున్నారు. వెంటాడుతున్న మందుల కొరత.. జిల్లాలోని హోమియో ఆస్పత్రులకు రెండేళ్లుగా మందులు సరఫరా కావడం లేదు. అందుబాటులో ఉన్న అరకొర మందులను రోగులకు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని చోట్ల అవసరమైన మందులు ప్రయివేట్ మందుల దుకాణాలలో కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. సంవత్సరాల తరబడి మందులు సరఫరా చేయకపోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు పలు చోట్ల ఆస్పత్రుల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి హోమియో ఆస్పత్రులపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
డీఈఓ పోస్ట్ .. భర్తీ ఎప్పుడో..?
శ్రీకాకుళం: శ్రీకాకు ళం జిల్లా విద్యాశాఖ అధికారి నియామకం చేపట్టకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. గత నెల 31న జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టు ఖాళీ అయింది. అప్పటి నుంచి ఏ ఒక్కరినీ నియమించేందుకు రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోలేదు. వాస్తవానికి జిల్లా స్థాయి అధికారి పదవీ విరమణ చేస్తున్నప్పుడు ఓ రోజు ముందుగాను, అదే రోజున వేరొకరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీలు చేయడం పరిపాటి. అలాంటిది అత్యంత కీలకమైన విద్యాశాఖ అధికారి పోస్టును 17 రోజులుగా భర్తీ చేయకుండా ఉంచేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తుండగా కీలక దశలో డీఈఓ పోస్టు ఖాళీగా ఉండడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. వేరొకరిని నియమించే వరకు పూర్తి అదనపు బాధ్యతలతో మరొకరిని నియమించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా కూడా చర్యలు చేపట్టలేదు. బీఈడీ డిగ్రీ లేని ఓ ఏడీకి నామమాత్రంగా బాధ్యతలు ఇచ్చేశారు. డైట్లో సీనియర్ లెక్చరర్లతో పాటు బీఈడీ పూర్తి చేసిన ఉప విద్యాశాఖాధికారులు ఉన్నా వారిని నియమించలేదు. జిల్లాలో కీలక భూమిక పోషి స్తున్న ఓ ప్రజా ప్రతినిధి తనకు కావాల్సిన వారిని నియమించేందుకే ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించకుండా, కొత్తవారిని నియ మించకుండా అడ్డుకుంటున్నారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. ఆ నాయకుడు ఆలోచిస్తున్న వ్యక్తి బీఈడీ పూర్తి చేయకపోవడంతో ఆ డిగ్రీ పూర్తయ్యే వరకు ఇలా అడ్డుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఆ వ్యక్తి ఇటీవలే బీఈడీ పరీక్షలు రాయగా, ఫలితాలు వచ్చేందుకు మరో వారం పది రోజులు పడుతుందని అప్పటివరకు విద్యాశాఖ అధికారి పోస్టు భర్తీ జరగదని విద్యాశాఖ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నా యి. కీలకమైన జిల్లా విద్యా శాఖ అధి కారి పోస్టు ఇన్ని రోజులు భర్తీ చేయకుండా ఉండడం జిల్లా చరిత్రలో ప్రథమ మని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారిని నియమించని ప్రభుత్వం కీలక సమయంలో కొరవడిన పర్యవేక్షణ పేరుకు పోతున్న ఫైళ్లు -
25న డీఎస్సీ–2003 టీచర్ల మహాధర్నా
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వ మెమో 57ను రాష్ట్రంలోనూ వర్తింపజేసి డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ మంజూరు చేయాలని 2003 డీఎస్సీ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం ఎన్జీవో హోంలో శనివారం ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అధ్యక్షతన మహాధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ పాత పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ ఈ నెల 25న విజయవాడ ధర్నా చౌక్లో నిర్వహించనున్న మహాధర్నాకు డీఎస్సీ–2003 ఉపాధ్యాయులు, బాధిత ఉద్యోగులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు 2004 సెప్టెంబర్ ఒకటికి ముందే నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ.. పోస్టింగులు మాత్రం ప్రభుత్వ విధానాల వల్ల జాప్యం జరిగిందన్న విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోవద్దని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాన్చుడి ధోరణి ప్రదర్శిస్తు జాప్యం చేస్తుండటంతో గత్యంతరం లేని పరిస్థితులలో ధర్నా చేపట్టాల్సి వస్తోందన్నారు.రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ దాదాపు 16 రాష్ట్రాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మెమోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు దుప్పల శివరాం ప్రసాద్ (ఆపస్), ఎస్వీ రమణమూర్తి(ఎస్టీయూ), దానేటి కేశవరావు (పీఆర్టీయూ), కూన రంగనాయకులు (ఎస్ఎల్టీఏ), పూజారి హరిప్రసన్న(డీటీఎఫ్), సూర పాపారావు (ఎన్టీఏ), కరిమి రాజేశ్వరరావు (ఏపీ సీపీఎస్ఈఏ), గురుగుబెల్లి భాస్కరరావు (ఏపీ సీపీఎస్యూఏ), ఫోరం జిల్లా కో కన్వీనర్లు ఏ.తిరుమలేశ్వరరావు, ఏ.లక్ష్మణ్, జి.గోవిందరావు, నారాయణరావు, ఫల్గుణరావు, తదితరులు పాల్గొన్నారు. -
దైవ కార్యక్రమానికి అడ్డంకులు
గార: తనకు ప్రాధాన్యం కల్పించడం లేదని ఏకంగా గ్రామ దేవత ప్రతిష్టాపన ఉత్సవాన్నే అడ్డుకున్నాడు ఓ టీడీపీ నాయకుడు. గార మండలం వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెంలో ఘటన జరిగింది. ఇక్కడ గాంధే అమ్మ(వేప చెట్టు) వద్ద కొన్నేళ్లుగా పూజలు జరుగుతున్నాయి. స్థానికుడు బంటుపిల్లి నాగేశ్వరరావు ఆలయాన్ని కొందరు దాతల సహకారంతో నిర్మించారు. అమ్మవారి ప్రతిష్ట జరపాలని తలచి గ్రామస్తుల్లో కొందరిని సంప్రదించి 17వ తేదీ ప్రతిష్టతో పాటు అన్నదానం చేయాలని నిర్ణయించారు. అయితే స్థానిక టీడీపీ నాయకుడు శిమ్మ శ్రీను తనకు సమాచారం ఇవ్వలేదనే నెపంతో కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి రాకపోయినా, ప్రతిష్టాపన కరపత్రాన్ని ఇచ్చేందుకు వెళ్లిన యువకుడి ని చెంపదెబ్బ కొట్టినా ఓర్చుకున్నామని తెలిపారు. కానీ పోలీసులకు ఫిర్యాదు చేసి ప్రతిష్టాపనను అడ్డుకునేందుకు ప్రయత్నించాడని, స్టేషన్కు రెండు సార్లు పిలిస్తే వెళ్లామని, అక్కడ పోలీసులు అధికార పార్టీ వ్యక్తులకే మద్దతు తెలపడంతో వచ్చేశామని గ్రామస్తులు తెలిపారు. శనివారం ఉద యం పోలీసులు గ్రామంలోకి వచ్చిన తర్వాత సమావేశం నిర్వహించే సమయంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో కార్యక్రమాన్ని వాయిదా వేయాలని, ఇరు పక్షాలు సర్కిల్ కార్యాలయంలో సమావేశానికి రావాలని శ్రీకాకుళం సర్కిల్ సీఐ పైడపునాయుడు కోరారు. గ్రామంలో పోలీస్ పికెట్ నడుస్తోంది. ఎస్పీకి ఫిర్యాదు శనివారం సాయంత్రం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి అచ్చెన్నపాలెం గ్రామస్తులు, వీహెచ్పీ, భజరంగదళ్ సభ్యులు కలసి ఫిర్యాదు చేశారు. దైవ కార్యక్రమాలను నిలిపేయడం బాధాకరమని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అచ్చెన్నపాలేం గ్రామదేవత ప్రతిష్టాపన నిలిచిన వైనం టీడీపీ నాయకుడి విపరీత ధోరణే కారణం -
గుండెపోటుతో హెచ్ఎం మృతి
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని గోపీనగర్లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.స్వప్న (45) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. పని ఒత్తిడితోనే ఆమె చనిపోయారని సహోద్యోగులు చర్చించుకుంటున్నారు. బుధవారం విధులకు హాజరైన ఆమెకు అదే రోజు రాత్రి తీవ్ర గుండె నొప్పి రావడంతో రాజాంలో ఉన్న తన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. స్వప్నకు భర్త నాగరాజు, కుమార్తె హనీ ఉన్నారు. భర్త నాగరాజు శ్రీకాకుళం ఎస్బీఐ ఏడీబీలో మేనేజర్గా విధులు నిర్వహిస్తుండగా కుమార్తె ఇంటర్ చదువుతోంది. ఉపాధ్యాయురాలు 2023లో ఆమదాలవలస మండలానికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఒకరు వెళ్లిపోగా ఈమె ఒక్కరే పాఠశాలలో ఉన్నారు. పని ఒత్తిడి, యాప్లలో నిత్యం అప్లోడ్ చేయాల్సిన అంశాలు తదితర విషయాల్లో ఆమె ఒత్తిడికి గురైనట్లు తోటి ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు. -
ప్రియుడితో సుఖం కోసం భర్తను దారుణంగా..
శ్రీకాకుళం జిల్లా: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు (34) మృతి కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడు, మరొకరి సాయంతో భార్యే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో గుర్తించి ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం పాతపట్నం పోలీస్స్టేషన్లో టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మొండిగలవీధికి చెందిన నల్లి రాజుకు మౌనికతో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. మౌనికకు పాతపట్నం మాదిగవీధికి చెందిన గుండు ఉదయ్కుమార్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలియడంతో గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాజును హత్య చేయాలని మౌనిక.. తన భార్యకు విడాకులు ఇవ్వాలని ఉదయ్కుమార్ నిర్ణయించుకున్నారు. తర్వాత ఎక్కడికై నా పారిపోయి వివాహం చేసుకోవాలని భావించారు.పక్కా పథకం ప్రకారం..మౌనిక, ఉదయ్కుమార్ కలిసి రాజు హత్యకు పథకం వేశారు. కొత్త ఫోన్ నంబరుతో అమ్మాయిలా చాటింగ్ చేసి ఉదయ్కుమార్ను ఎక్కడికైనా రప్పించి చంపాలని నిర్ణయించుకున్నా సాధ్యం కాలేదు. దీంతో నిద్రమాత్రలు ఇచ్చి చంపాలని కుట్ర పన్నారు. ఇందుకు ఉదయ్కుమార్ తన బావ మాదిగవీధికి చెందిన చౌదరి మల్లికార్జున్ అలియాస్ మల్లికార్జునరావు సహాయం కోరాడు. కుట్రలో భాగంగా ఉదయ్కుమార్ పర్లాకిమిడిలో ఆర్ఎంపీ వైద్యుడి వద్ద పది నిద్రమాత్రలు కొని మౌనికకు ఇచ్చాడు. మౌనిక ఈ నెల 5న రాత్రి భోజనంలో నాలుగు నిద్రమాత్రలు కలిపి పెట్టింది. భర్త వెంటనే నిద్రలోకి వెళ్లడం గమనించి చంపవచ్చని నిర్ధారణకొచ్చింది. ఈ నెల 6న రాత్రి భోజనంలో ఆరు మాత్రలను కలపడంతో రాజు గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. మౌనిక వెంటనే ప్రియుడు ఉదయ్కుమార్, చౌదరి మల్లికార్జునరావులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. రాత్రి 11.30 సమయంలో ఇద్దరూ వీధి లైట్లు ఆపేసి మౌనిక ఇంటికి వెళ్లారు. రాజు కాళ్లు, చేతులను మౌనిక, మల్లికార్జునరావు పట్టుకోగా.. ఛాతి పై ఉదయ్కుమార్ కూర్చుని తలగడతో ఊపిరి ఆడకుండా చంపేశారు. అనంతరం రాజు మృతదేహంతో పాటు బైక్, చెప్పులు, మద్యం బాటిల్ను హరిజనవీధికి దిగువన పడేసి వెళ్లిపోయారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మౌనిక తన భర్త ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. మరుసటి రోజు ఉదయాన్నే మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మౌనిక ఏడుస్తున్నట్లు నటిస్తూ భర్త మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురినీ నిందితులుగా గుర్తించారు. దీంతో మౌనిక, ఉదయ్కుమార్, మల్లికార్జునరావులు రెవెన్యూ అధికారుల వద్ద లొంగిపోయారు. ఈ మేరకు నిందితులను అరెస్టు చేసి నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపా రు. కేసును చాకచక్యంగా దర్యాప్తు చేసిన సీఐ వి. రామారావు, ఎస్ఐ బి.లావణ్య, పీసీలు బి.జీవరత్నం, డి.గౌరీశంకర్రావు, పరమేష్లను అభినందించి, రివార్డులను అందజేశారు. -
తప్పిన పెను ప్రమాదం
పొందూరు : మండల కేంద్రంలోని పొందూరులో మానసవేణి పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో శుక్రవారం ప్రమాదానికి గురైంది. 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కించడంతో ఒరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బోల్తా కొట్టుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు. పుస్తెలతాడు చోరీ టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నరసాపురం జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం ఓ మహిళ మెడలో పుస్తెలతాడును దుండగులు తెంచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం బడేకుప్పన్నపేటకు చెందిన బొమ్మాళి దాలమ్మ కోటబొమ్మాళిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యారు. బాధితురాలు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 20 కేజీల గంజాయి స్వాధీనం పలాస: ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. నిందితులు మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన అనిసెంటు నాయక్ , రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్గా గుర్తించామని, వీరి వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపించామన్నారు. -
సూర్యఘర్ ప్రగతికి అవార్డులు
అరసవల్లి: పీఎం సూర్యఘర్ పథకం అమలులో శ్రీకాకుళం డివిజన్ ఉత్తమ ప్రగతి సాధించినందుకు గాను తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) ఉత్తమ అవార్డులు ప్రకటించింది. శ్రీకాకుళం డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ పైడి యోగీశ్వరరావు, డిప్యుటీ ఈఈ చల్లా వెంకటేశ్వరరావు, డీ–1 ఏఈ సురేష్కుమార్లు శుక్రవారం విశాఖ కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో సీఎండీ పృథ్వీతేజ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. డిప్యూటీ ఈఈ వెంకటేశ్వరరావు, ఏఈ సురేష్కుమార్లకు అవార్డు అందజేస్తున్న సీఎండీ -
చిన్నారులకు మాజీ సైనికుల చేయూత
శ్రీకాకుళం కల్చరల్ : ఇటీవల నరసన్నపేట మండలం దేవాది గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు చిన్నారులు మోహిని, యోగితలకు మాజీ సైనికులు, వీరనారీమణులు అండగా నిలిచారు. చిన్నారులు ప్రస్తుతం అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలో ఉన్నారని తెలుసుకుని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తమ వంతు సాయంగా రూ.1,02,232 సేకరించి ఇరువురి పేరిట సుకన్య ఖాతాలను తెరిచి పాస్ పుస్తకాలను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ సమాజాహితాన్ని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడి రాజా మాజీ సైనికులు, వీరనారీమణులకు వాటర్ డిస్పెన్సెర్ను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో విశ్రాంత కెప్టెన్ పి.ఈశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు, తర్ల కృష్ణారావు, ఎస్.రామకృష్ణ, ఎం.సింహాచలం, కె.కన్నారావు, పైడి విశ్వేశ్వరరావు, క్యాంటీన్ మేనేజర్ పప్పల గోవిందరావు, సభ్యులు బి.రాంబాబు, డి.వాసుదేవరావు, పి.శ్రీనివాసరావు, జి.రామారావు, డి.వరాహ నరసింహులు, ఎన్.లక్ష్మీనారాయణ, ఎం.రాములు, ఎ.వి.జగన్మోహన్రావు, కె.అప్పారావు, సీహెచ్.రామారావు, నాగభూషణరావు, అప్పలసూరి, శ్రీను, సురేష్, నారాయణ, వీరనారీమణులు కె.జగ్గమ్మ, జి.అమ్మన్నమ్మ, పి.పద్మావతి, ఎ.లక్ష్మీ, పి.అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ పోలీసులకు రాష్ట్ర అవార్డులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ విభాగానికి చెందిన ఏడుగురు పోలీసులకు 79వ స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులు దక్కాయి. మంగళగిరి కార్యాలయంలో రాష్ట్ర ఎకై ్సజ్ కమిషనర్ నితీష్కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) రాహుల్దేవ్ శర్మ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావుకు అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు సోంపేట, పాతపట్నం ఇన్స్పెక్టర్లు జి.వి.రమణ, కె.కృష్ణారావు, ఆఫీస్ సూపరింటెండెంట్ వి.రవిశేఖరరావు, ఎస్ఐ జె.సుజాత, కానిస్టేబుళ్లు పి.రమణ, బి.విఠలేశ్వరరావుకు అవార్డులు దక్కాయి. -
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
పలాస: మోదుగులపుట్టి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం చెప్పారు. నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కంబకాయల దుర్యోధన టెక్కలిపట్నం బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా మోదుగులపుట్టి వద్ద వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బలమైన గాయాలు కావడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. దుర్యోధన కుమారుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు. -
ఇంత నీచానికి దిగజారుతారా..?
● ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వైఖరిపై వైఎస్సార్సీపీ నేత చింతాడ మండిపాటు ● కూన బాధితురాలు సౌమ్యకు పరామర్శ ● బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఆమదాలవలస: పొందూరు కేజీబీవీ ఎస్ఓ (ప్రిన్సిపాల్) సౌమ్యను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధించడం సబబు కాదని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆయన శుక్రవారం శ్రీకాకుళంలో ఉన్న ఆమె గృహానికి వెళ్లి పరామర్శించారు. కూన రవికుమార్ చేసిన దాష్టీకాలను ఆమె చెప్పుకున్నారని, ఎంత నరకం చూడకపోతే ఇలా బయటకు వచ్చి చెబుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 11.30 గంటల వరకు ఆఫీస్లో ఉంచడం, రాత్రి సమయంలో వీడియో కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎమ్మెల్యేకు ఏం ఉందని ప్రశ్నించారు. ఇలాంటి పనులు చేస్తే కూనకు తగిన బుద్ధి చెబుతామన్నారు. వైఎస్సార్ సీపీ మొత్తం ఉద్యోగినికి అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి ఆమెకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు. గతంలో కూడా కూన రవికుమార్పై ఇలాంటి అభియోగాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయన కోరుకున్నది జరగకపోతే ఉద్యోగులను బదిలీలు చేసే కూన నీచ బుద్ధికి సాక్ష్యాలు ఉన్నాయన్నారు. -
కంది.. అందేనా..?
● రేషన్ షాపుల్లో పంపిణీ నిల్ ● ఎక్కడా సరఫరా కాని వైనం పప్పు సరఫరా చేయాలి ఎన్నికల ముందు అన్ని సరుకులు రేషన్ షాపుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ప్లేటు ఫిరాయించారు. మా లాంటి పేదలకు అవసరమైన కందిపప్పు సరఫరా చేసేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలి. – దీర్ఘాశి చిన్నమ్మడు, పాతహిరమండలం కంది పప్పు లేదట రేషన్ షాపుల్లో బియ్యం,చక్కెర మాత్రమే ఇస్తున్నారు. కందిపప్పు అడిగితే ప్రభుత్వం నుంచి రాలేదని డీలర్లు చెబుతున్నారు. గతంలో రేషన్ షాపులలో రూ.70 లకే కందిపప్పు ఇచ్చేవారు. – గులివిందల లలిత, తంప గ్రామం హిరమండలం: రేషన్ దుకాణాల్లో కందిపప్పు ఇవ్వడం మానేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా కందిపప్పు సరఫరాను పునరుద్ధరించలేదు. గత ప్రభుత్వ హయాంలో నిరంతరం కందిపప్పు పంపిణీ జరిగేదని, అయితే ప్రస్తుతం ప్రభు త్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని నెలలు మాత్రమే ఇచ్చిందని, ఇప్పుడు అది కూడా ఇవ్వడం లేదని కార్డుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1603 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. వాటి పరిధిలో 6,57,758 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 19,60,651 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరంతా ప్రతి నెలా రేషన్ షాపుల్లో ఇచ్చే కందిపప్పు కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నారు. కందిపప్పు గురించి సమాధానం చెప్పేవారే కరువైపోయారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు రూ.120 నుంచి రూ.140 వరకు పలుకుతోంది. కొన్ని చోట్ల తక్కువ ధరకు విక్రయిస్తున్నా.. రేషన్ పంపిణీలో భాగంగా ఇస్తే తమకు అనుకూలంగా ఉంటుందని కార్డుదారులు కోరుతున్నారు. -
స్వేచ్ఛా గీతిక
శ్రీకాకుళంతప్పిన ప్రమాదంపొందూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పిల్లలతో ఉన్న ఆటో బోల్తా పడింది. –8లోసమరయోధుల స్ఫూర్తితో సంక్షేమం ప్రదర్శనలు అద్భుతః ● ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు ● ఆకట్టుకున్న ప్రదర్శనలు● మంత్రి అచ్చెన్నాయుడు పట్ట పగలు మూడు రంగుల వెన్నెల కురిసింది. ‘వందేమాతరం’ అని విన్న ప్రతి సారీ జనం గుండె ఝల్లుమన్నది. ‘జనగణమన’ జనగళమున సగర్వంగా పలికింది. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పంద్రాగస్టు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. విద్యార్థుల ప్రదర్శనలు, శకటాల రాకపోకలు, స్టాళ్ల ఏర్పాటుతో ఉత్సవం ఉత్సాహంగా జరిగింది. శ్రీకాకుళం పాతబస్టాండ్: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగస్ఫూర్తితో రాష్ట్రంలో ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్థక, డైరీ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ పతాకం ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రసంగించారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని, నేటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమ లు చేస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. దీపం–2 కింద మొదటి విడతగా 4,35,037 మందికి రూ.33.34 కోట్లు, రెండో విడత కింద 4,08,740 మందికి రూ.36.41 కోట్లు ఖాతాలో జమ చేశామన్నారు. అరసవల్లి రథసప్తమి, కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి వైభవంగా జరుపుకున్నామని తెలిపారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించుకున్నామని పేర్కొన్నారు. జిల్లా రైతులను వాణిజ్య పంటల వైపు మరల్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యాంత్రీకరణతో పాటు బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఖరీఫ్–2025కు 1,62,995 హెక్టార్లు సాగు లక్ష్యం కాగా నేటి వరకు 1,28,411 హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు తెలిపారు. తీర మత్స్యకార గ్రామాల పథకం కింద మన జిల్లాలో పెదగనగళ్లవానిపేట, ఇద్దివానిపాలెం, దేవునల్తాడ గ్రామాలను ఎంపిక చేసి ఒక్కో గ్రామానికి రూ.2 కోట్ల చొప్పున మంజూరు చేశామని తెలిపారు. 3.10 లక్షల ఆలివ్ రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టామని, తేలినీలాపురం, తేలుకుంచి వంటి కీలక విదేశీ వలస పక్షుల సంరక్షణ కేంద్రాల్లో 5,133 వలస పక్షులను, 2,215 పక్షి పిల్లల గూళ్లను సంరక్షించామన్నారు. జిల్లాలో 11 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచామని, విజయనగరం, విశాఖ అవసరాలకు కూడా తరలిస్తున్నామని వివరించారు. 2025–26లో ఇప్పటి వరకు రూ.38 కోట్ల పెట్టుబడితో 1231 పరిశ్రమల ద్వారా 4563 మందికి ఉపాధి కల్పించామన్నారు. జిల్లాలో 543 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి చర్యలు తీసుకొని మెరిట్ లిస్టును కూడా ప్రకటించామని చెప్పారు. జిల్లాలో 2 లక్షల 50 వేల మంది పిల్లలకు తల్లికి వందనం జమచేశామని తెలిపారు. యోగాంధ్ర సందర్భంగా జిల్లాలో 2,72,677 మంది విద్యార్థులు, 11,976 మంది ఉపాధ్యాయులతో కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పామని గుర్తు చేశారు. జిల్లాలో 3129 గ్రామాల్లో 12,808 చేతి పంపులు ఉండగా 1909 గ్రామాలకు పైప్ లైన్ ద్వారా తాగునీరు అందిస్తున్నామని వివరించారు. జిల్లాలోని మొత్తం 912 గ్రామ పంచాయతీలు బహిరంగ మలవిసర్జన రహిత స్థాయిని చేరుకున్నాయని చెప్పారు. జిల్లాలో 4.41 లక్షల ఉపాధి హామీ వేతనదారులకు ఈ ఏడాది రూ.318 కోట్ల వేతనాలు చెల్లించి వారికి 135 లక్షల పని దినాలు కల్పించి రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి , జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, డీఆర్ఓ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్ రావు, ఎన్.ఈశ్వరరావు, బగ్గు రమణమూర్తి, జిల్లా అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ పై విద్యార్థుల ప్రదర్శనశనివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2025శ్రీకాకుళం పాతబస్టాండ్, శ్రీకాకళం పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ (పురుషుల) కళాశాల మైదానంలో శుక్రవారం జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పీఎన్ కాలనీలోని న్యూ సెంట్రల్ స్కూల్ విద్యార్థులు ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన ప్రదర్శన అబ్బురపరిచింది. ఆర్సీఎం లయోలా విద్యార్థులు ప్రదర్శించిన నమో నమః భారత ప్రదర్శన ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జయతు జయతు భారతం అలరించింది. ఐటీడీఏ పోస్టు మెట్రిక్ హాస్టల్ విద్యార్థుల థింసా నృత్యం, గార కేజీబీవీ విద్యార్థుల నృత్య విన్యాసం ఆకట్టుకున్నాయి. అరసవల్లి బాల సదనం విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శన ఆలోచింపజేసింది. వీరిలో న్యూసెంట్రల్ స్కూల్కు మొదటి బహుమతి దక్కగా, శ్రీచైతన్య టెక్నో స్కూల్ రెండో బహుమతి, ఆర్సీఎం లయోలా, గార కేజీబీవీ విద్యార్థులకు మూడో బహుమతి సంయుక్తంగా లభించాయి. శకటాల ప్రదర్శనలో విద్యాశాఖ శకటానికి మొదటి బహుమతి, వ్యవసాయ శాఖకు రెండో బహుమతి రాగా, మూడో బహుమతిని వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. స్టాల్స్ ఆకట్టుకున్నాయి. -
‘ముద్దు’ల ముచ్చట.. ‘కూన’ నైట్ కాలింగ్..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం పట్నం బజారు (గుంటూరు), కళ్యాణదుర్గం: దేశమంతా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకొంటున్న వేళ.. రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించి ప్రవర్తిస్తుండటంతో మహిళలు రక్షణ కరువై అల్లాడుతున్నారు. పైశాచిక వేధింపులతో గుండె బరువై రాలిపోతున్నారు. బాధ్యత మరిచిన టీడీపీ ప్రజాప్రతినిధుల విశృంఖల వైఖరితో మహిళలు బెంబేలెత్తుతున్నారు. కాపాడాల్సిన పోలీసు యంత్రాంగం టీడీపీ నేతల అడుగులకు మడుగులొత్తుతోంది. విద్యాధికులైన మహిళలను సైతం కామ పిశాచాలు వేధిస్తుంటే కట్టడి చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు కళ్లు మూసుకుని కూర్చున్నారు! కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకులు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధుల ఆగడాలు మితిమీరిపోవడంతో మహిళా ఉద్యోగులు కార్యాలయాలకు రావాలంటే వణికిపోతున్నారు. రాత్రిపూట పార్టీ కార్యాలయాలకు పిలుస్తూ.. వీడియో కాల్స్ చేసి వేధింపులకు దిగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వెలుగులోకి వచ్చిన అఘాయిత్యాలు.. గుంటూరు ఎమ్మెల్యే ‘ముద్దు’ వీడియోలు మహిళల పట్ల ఏడాది పాలనలో జరుగుతున్న దుశ్చర్యలకు మచ్చు తునకగా నిలుస్తున్నాయి. ‘కూన’ వీడియో కాల్స్...!‘ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమా ర్ రాత్రి 10 గంటల తర్వాత పార్టీ కార్యాలయాలకు రావాలని తన అనుచరులతో పిలిపిస్తారు. చాలాసేపు అక్కడే ఉంచుతారు. రాత్రి 10.30 దాటిన తర్వాత వీడియో కాల్ చేసి వేధిస్తుంటాడు. శారీరకంగా, మానసికంగా వేధించాడు. సాధారణ కాల్స్ చేయరు. వీడియో కాల్ అయితేనే మాట్లాడతారని అనుచరులతో చెప్పిస్తారు. దుర్బుద్ధితోనే ఇదంతా... దారికి రాలేదని వేధింపులకు గురి చేస్తున్నారు. నాలా నియోజకవర్గంలో అనేక మంది మహిళా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలను కున్నా...!’టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులు ఎదుర్కొన్న పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్ సౌమ్య ఆవేదన ఇదీ! దళితురాలిని తీవ్రంగా వేధించారంటూ బాధితురాలు కన్నీరు మున్నీరవుతున్నారు. కూన రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు చెబుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే ఇద్దరు మనుషులను పంపించి కేజీబీవీలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో తనకు వ్యతిరేకంగా బలవంతంగా సంతకాలు చేయించినట్లు తెలిపారు. అధికారులు తనకు అండగా ఉండకపోగా ఎమ్మెల్యేకు కొమ్ము కాస్తున్నారని వాపోయారు. కాగా గార, కంచిలి కేజీబీవీల ప్రిన్సిపాళ్లపై కూడా వ్యూహాత్మకంగా ఫిర్యాదులు చేయించి బదిలీలు చేయించారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.బలిపశువుని చేస్తున్నారు..!గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ ‘ముద్దు’ దృశ్యాల వీడియో వైరల్ అయిన ఘటనలో తనని బలిపశువుని చేస్తున్నారంటూ పార్టీ మహిళా నేత షేక్ సూఫియా పురుగుల మందు తాగడం కలకలం రేపింది. ఎమ్మెల్యే, పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ శుక్రవారం ఆమె గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పార్టీ నాయకురాలు గుడిపల్లి వాణితో ఎమ్మెల్యే వివాహేతర సంబంధం గురించి ప్రతి ఒక్కరికీ తెలుసని సూఫియా మీడియాతో పేర్కొన్నారు. ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్త నవీన్కృష్ణ స్వయంగా రికార్డ్ చేసి వైరల్ చేశారని ఆరోపించారు. తాను ఈ విషయాన్ని ఎమ్మెల్యే నసీర్కు చెప్పడంతో రెండు రోజులు మాట్లాడకుండా ఉండమన్నారని చెప్పారు. గుడిపల్లి వాణి కుటుంబంతో ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేసుకుని తనని ఇరికించే యత్నం చేస్తున్నారని చెప్పారు. నవీన్కృష్ణ ఫోన్లో ఉన్న వీడియోలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, తనకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు. కళ్యాణదుర్గంలో గర్భిణి బలవన్మరణం..‘భర్త, అత్త మామల వేధింపులు తాళలేక పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా నాకు న్యాయం జరగలేదు. నా ఫిర్యాదును పోలీసోళ్లు మార్చేశారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నాకు అన్యాయం చేశారు..’ అని విలపిస్తూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిండు గర్భిణి శ్రావణి (22) ఉరి పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తన దయనీయ పరిస్థితిని ఫోన్లో ఆడియో రికార్డ్ చేసి తనువు చాలించింది. ఈ ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకోగా... శుక్రవారం ఉదయం మృతురాలి ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదా..?కళ్యాణదుర్గానికే చెందిన శ్రీనివాసులుతో మూడేళ్ల క్రితం శ్రావణికి వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త,అత్త మామలు తరచూ వేధించడంతో కళ్యాణదుర్గం పోలీస్లకు ఫిర్యాదు చేసినట్లు శ్రావణి పేర్కొంది. స్థానిక టీడీపీ నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ వైపీ రమేష్, మాజీ వైస్ చైర్మన్ శర్మస్ వలి ఒత్తిళ్లతో సీఐ దీన్ని మరో రకంగా మార్చేసి భర్త, అత్తమా మలకు అనుకూలంగా వ్యవహరించారని ఆడియోలో మృతురాలు కన్నీరు మున్నీరైంది. కడుపులో పెరుగుతున్న బిడ్డతో పాటు తాను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నామని, కనీసం తన మొదటి బిడ్డకైనా (రెండేళ్ల చిన్నారి) న్యాయం చేయాలని వేడుకుంది. ఈ ప్రభుత్వంలో ఇక న్యాయం జరగదా? అని ఆక్రోశించింది. ఈమేరకు ఫోన్లో వాయిస్ రికార్డ్ చేసి పుట్టింట్లో ఉరేసుకుని తనువు చాలించింది. దీనిపై పట్టణ సీఐ యువరాజును వివరణ కోరగా.. మృతురాలు ఆరోపించినట్లుగా తాము నిర్లక్ష్యం చేయలేదని చెప్పారు. -
● గుండెపోటుతో రైతు మృతి ● లావేరులో విషాదం
ప్రజాస్వామ్యం అపహాస్యం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, కూటమి నాయకులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ గురువారం అన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లు మరీ దారుణంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. పక్క మండలాలకు చెందిన టీడీపీ గూండాలను తీసుకొచ్చి రిగ్గింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ఇంతటి దారుణమైన ఘటనలు జరిగినా ఎన్నికలు కమిషన్, పోలీసు యంత్రాంగం ఏమీ తెలియనట్లు వ్యవహరించడం సరికాదన్నారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రులు గుర్తించి అక్రమాలకు ఒడిగట్టారన్నారు. హిరమండలం: టీడీపీ కూటమి ప్రభుత్వ తీరు పై ఉద్యోగులు గురువారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగు ల సంఘం పిలుపు మేరకు గాంధేయవాదం ప్రదర్శించారు. హిరమండలంలోని వంశధార ప్రాజెక్టు కట్టడాల విభాగం వద్ద ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. హిరమండలం, ఎల్ఎన్పేట మండలాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు, న్యాయబద్ధ చెల్లింపులు, ప్రభుత్వ హామీలపై చర్చించా రు. ప్రభుత్వం స్పందించే వరకూ ఐక్య పోరాటాలు చేద్దామని నిర్ణయించుకున్నారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం హిరమండలం తాలుకా యూనిట్ అధ్యక్షుడు మీసా ల వరప్రసాదరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగ్గి లి కళ్యాణ్, జాయింట్ సెక్రటరీ పైడి రవికుమా ర్, పిసిని రమేష్, టింగ మనోజ్, పైల వెంకట రమణ, రామకృష్ణ, నడిమింటి షన్ముఖరావు, వసంతరావు,రేగేటి ఆదిలక్ష్మి పాల్గొన్నారు. రణస్థలం: లావేరుకు చెందిన ఎచ్చెర్ల గొల్ల (50) అనే రైతులు గుండెపోటుకు గురై పొలంలోనే మృత్యువాతపడ్డాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. లావేరు చెందిన గొల్ల అనే రైతు తాను కౌలుకు తీసుకున్న పొలానికి నీరు కడదామని గురువా రం మధ్యాహ్నం వెళ్లాడు. వ్యవసాయ బోరు రిపేర్ కావడంతో మెకానిక్ ను పిలిపించి బాగు చేయించాడు. మధ్యాహ్నం 3గంటల సమయంలో వరి పొలానికి నీరు కడుతుండగా గుండెపోటు వచ్చి వరిచేనులో పడిపోయాడు. విగత జీవిగా పడి ఉన్న రైతును స్థానికులు గుర్తించి లావేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు అందరితో కలిసి మెలిసి ఉండే గొల్ల ఆకస్మాత్తుగా చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈయన వ్యవసాయ పను లు లేనప్పుడు రణస్థలం జాతీయ రహదారిపై బస్టాప్ వద్ద చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య భాగ్యలక్ష్మి కుమార్తె స్వరూప, కుమారుడు రామకృష్ణ ఉన్నారు. సెప్టెంబర్ 13న లోక్ అదాలత్ శ్రీకాకుళం పాతబస్టాండ్ : కక్షిదారులు వివాదాలను త్వరగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. సెప్టెంబర్ 13న జరగబోయే లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ కేసులు రాజీ చేయడానికి బీమా సంస్థలు, న్యాయవాదులు చొరవ తీసుకోవాలని సూచించారు. మంగళవారం జిల్లా కోర్టు భవనంలో బీమా సంస్థల ప్రతినిధులు, న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు. వివాదాలు త్వరగా పరిష్కరించడానికి అదాలత్ మేలు చేస్తుందన్నారు. సమావేశంలో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.సువర్ణ రాజు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి కె.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి
● అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి ● స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ శ్రీకాకుళం న్యూకాలనీ: అధికార యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ పిలుపునిచ్చారు. గురువారం జెడ్పీ సమావేశ మందిరంలో 1వ, 2వ, 4వ, 7వ స్థాయీ సంఘాల సమావేశాల్లో పలు శాఖల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచు కుని అధికారులు పనిచేయాలన్నారు. సీజనల్ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నందున ముందస్తుగా సమాయత్తం కావాలన్నారు. కవిటి, సోంపేట ప్రాంతాల్లో కిడ్నీ రోగులకు డయాలసిస్ సౌకర్యాలు పెంచడం, అవసరమైన బెడ్లను కల్పించడం వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పించన్లను వెంటనే మంజూరు చేయాలని ఎంపీడీవోల కు సూచించారు. డీడబ్ల్యూఎంఏ ద్వారా పూర్తయిన పనుల బిల్లులు తక్షణం చెల్లించాలని, పంచాయతీ రాజ్శాఖ కాలం చెల్లిన పనుల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఉద్దానం పైప్లైన్ లీకేజీలను సరిచేయాలన్నారు. లోవోల్టేజి సమస్యలను పరిష్కరించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం జరిగిన 3వ, 5వ, 6వ స్థాయీ సంఘాల సమావేశాల్లో కూడా పలు అభివృద్ధి పనుల ప్రగతిని సమీక్షిస్తూ, ప్రజా అవసరాల తీర్చడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశాల్లో జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
అల్పపీడనంతో విద్యుత్ శాఖ అప్రమత్తం
శ్రీకాకుళం న్యూకాలనీ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, ఈ నెల 17 వరకు భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులు వేసే అవకాశం ఉన్నందున విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని ఏపీఈడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి సూచించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. తడి విద్యుత్ స్తంభాలను తాకవద్దని, వేలాడుతున్న వైర్లను పట్టుకోవద్దని, వాటి కింద నడవవద్దని, చెట్లపై పడిన విద్యుత్ వైర్లకు దగ్గరగా పోవద్దని సూచించారు. మూడు డివిజన్లలో హెల్ప్డెస్కులు.. రానున్న మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కలగవచ్చని, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగదారుల అవసరార్ధం హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం డివిజన్(9490610045), టెక్కలి డివిజన్(8332843546), పాతపట్నం డివిజన్(7382585630) ప్రజలు ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు. విద్యుత్ సరఫరాలో లోపాలు, విద్యుత్ వైర్లు పడిపోయిన/వేలాడుతున్న విద్యుత్ స్తంభాలు కనిపించిన వెంటనే సంబంధిత హెల్ప్ డెస్క్కి సమాచారం అందించాలని కోరారు. 255 మంది సిబ్బంది.. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా 255 మంది సిబ్బందిని నియమించినట్టు నాగిరెడ్డి చెప్పారు. 15 వాహనాలు, 13 క్రేను, ఆరు పోల్ డ్రిల్లింగ్ మెషీన్లు, 30 పవర్ సాస్, 150 ట్రాన్స్ఫార్మర్లు, 500 విద్యుత్ స్తంభాలను సిద్ధం చేసినట్లు వివరించారు. పూర్తి వివరాలకు శ్రీకాకుళం సర్కిల్ హెల్ప్ డెస్క్: 9490612633, ఏపీఈపీడీసీఎల్ టోల్ ఫ్రీ: 1912 నంబర్లను సంప్రదించవచ్చని ఎస్ఈ పేర్కొన్నారు. -
మహాత్ముడి పేరు
ఆమదాలవలస రూరల్: స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం సమయంలో దూసి రైల్వేస్టేషన్లో జాతిపిత మహాత్మా గాంధీ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో దూసి రైల్వేస్టేషన్కు మహాత్మాగాంధీ పేరు పెట్టేందుకు నేతలు హామీ ఇచ్చి నా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. దూసి రైల్వేస్టేషన్ను గాంధీజీ రైల్వేస్టేషన్గా పేరు మార్చేందుకు 2002లో అప్పటి కేంద్ర సహాయ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరికొందరు నాయకులు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర రైల్వేశాఖ నుంచి అనుమతులు వస్తాయని ఆశించారు. అయినా ఫలితం లేకపోయింది. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్నాయుడు పలుమార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందట మే కాకుండా ప్రస్తుతం కేంద్రంలో పౌరవిమయా న శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. తన తండ్రి ఇచ్చిన హామీ నెరవేర్చటంలో పూర్తిగా విఫలమయ్యారు. వీరే కాకుండా కాంగ్రెస్ పాలనలో కిల్లి కృపారాణి కూడా కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. మరికొందరు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. అయినా గాంధీజీ నామకరణం చేయటంలో మాత్రం విఫలమయ్యారు. పేరు తొలగించినా... రైల్వేశాఖ నుంచి అప్పట్లో అనుమతులు వస్తాయని నాయకులు ఎంతో నమ్మకంగా చెప్పటంతో స్థానిక రైల్వేశాఖ అధికార్లు దూసి రైల్వేస్టేషన్ పేరును తొలగించారు. తర్వాత ఏ విషయం చెప్పకపోవడంతో పేరు లేకుండానే స్టేషన్ దర్శనమిస్తోంది. అదే విధంగా, స్టేషన్ పరిధిలో గాంధీజీ విగ్రహాం ఏర్పాటు చేసేందుకు రైల్వే ప్లాట్ఫాంలో గోతులు తవ్వారు. అయితే నామకరణానికి అనుమతి రాకపోవటంతో పతాక ఆవిష్కరణ, రచ్చబండ నిర్మాణంతో సరిపెట్టుకున్నారు. మారని స్టేషన్ దుస్థితి.. దూసి రైల్వేస్టేషన్ అభివృద్ధికి ఆమడ దూరంగానే నిలిచిపోయింది. ప్రయాణికులకు కనీస సౌకరా లు లేక అవస్థలు పడుతున్నారు. ఫ్లై ఓవర్, కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి దూసిస్టేషన్కు గాంధీ పేరు పెట్టడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
పట్టపగలే తల పగలగొట్టి..
● పట్టుపురంలో మహిళపై దాడి ● బురఖా ధరించి చోరీకి ప్రయత్నించిన మరో మహిళ మెళియాపుట్టి : పట్టపగలే ఓ మహిళ చోరీకి ప్రయత్నించడ మే కాకుండా.. మరో మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటన మెళియాపుట్టి మండ లం పట్టుపురంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. పట్టుపురం గ్రామానికి చెందిన అంబల కాంచన ఎప్పటిలాగే గురువారం మెళియాపుట్టిలో ఉన్న సాయిబాబా ఆలయంలో సేవకు వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చింది. ఆ సమయంలో తలుపులు తెరిచి ఉండటంతో లోపలికి వచ్చి చూసేసరికే తలుపు చాటున బురఖా ధరించి ఉన్న గుర్తు తెలియని మహిళ ఇనుపరాడ్డుతో మహిళపై దాడికి పాల్పడింది. బాధితురాలు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీసింది. గ్రామస్తులు వచ్చేసరికే గుర్తు తెలియని మహిళ ఒడిశా స్కూటీపై గారబంద వైపు వెళ్లిపోయింది. గ్రామస్తులు వెంబడించి నా ఆమె ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న పాతపట్నం సీఐ వి.రామారావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నగదు, విలువైన వస్తువులు ఏవైనా చోరీకి గురయ్యాయా?లేదా? అనేకోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, బాధితురాలి భర్త ఆర్టీసీలో డ్రైవర్ గా విధుల్లో ఉండగా.. ఇద్దరు కుమారులు ఉపాధి నిమి త్తం వలస వెళ్లారు. -
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం
● గోడకు రంధ్రం పెడుతుండగా గమనించిన స్థానికుడు ● పారిపోయిన దుండగులు ● శ్రీకూర్మంలో ఘటన గార : శ్రీకూర్మం యూనియన్ బ్యాంకులో దోపిడి చేసేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో బ్యాంకు గోడకు రంధ్రం పెట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. పశ్చిమ వైపునున్న మేనేజర్ గది కిటికీపై సన్స్లేడ్ సమీపంలో మూడు ఇంచీల మేర రంధ్రం చేయడంతో పాటు పక్కనే ఉన్న ఇంటర్గ్రిల్ తొలగించేందు కు ప్రయత్నం చేశారు. ఆ సమయంలో బ్యాంకుపైన నివసిస్తున్న ఓ వ్యక్తి కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. కన్నం పెట్టేందుకు ఉపయోగించిన, సుత్తి, కత్తవ, సన్నిగొడ్డ (రాయి)ని అక్కడే వదిలేశారు. వెంటనే స్థానికులు బ్యాంకు సిబ్బందికి తెలియజేశారు. గురువారం ఉదయం బ్యాంకు మేనేజర్ చినరామయ్య గార పోలీసులకు సమాచా రం అందించారు. ఒకటో పట్టణ స్టేషన్ సీఐ పైడపునాయుడు, ఎస్ఐ గంగరాజు, సీసీటీఎస్ సిబ్బంది బ్యాంకు పరిసరాలను పరిశీలించారు. శ్రీకూర్మం గ్రామంలో రాత్రి 11 గంటల నుంచి 4 గంటల వర కు విద్యుత్ సరఫరా లేకపోవడం, ఆ సమయంలో దొంగతనానికి పాల్పడటం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శ్రీకూర్మం మెయిన్ రోడ్డులో ఉన్న ఈ బ్యాంకుపై ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, ఎదురుగా కొన్ని కుటుంబాలున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కనిమెట్ట
పోరాటయోధుల పురిటిగెడ్డ.. పొందూరు: జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధుల గురించి మాట్లాడేటప్పుడు ముందుగా గుర్తుకొచ్చే గ్రామాల్లో పొందూరు మండలం కనిమెట్ట ఒకటి. ‘స్వాతంత్య్రం నా జన్మహక్కు.., మా కొద్దీ తెల్లదొరతనం’ వంటి స్వరాజ్య గీతాలతో హోరెత్తించిన ఆ పల్లె స్వాతంత్య్ర యోధుల ఖిల్లాగా ప్రసిద్ధి చెందింది. ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచింది. పది మంది స్వాతంత్య్ర సమరయోధులకు జన్మనిచ్చిన పల్లెగా కనిమెట్ట చరిత్ర పుటల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంది. నంద కృష్ణమూర్తి, నంద ఆదినారాయణ, కూన ఎర్రయ్య, కూన అప్పలసూరి, కూన బుచ్చయ్య, గురుగుబెల్లి సత్యనారాయణ, బొడ్డేపల్లి రాములు, బొడ్డేపల్లి నారాయణ, అన్నెపు అప్పయ్య, నంద నర్సయ్యతో పాటు వారి ప్రధాన అనుచరులు 1942 ఆగష్టు 9 నుంచి ఆ ఏడాది చివరి వరకు జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గోని అరెస్టయ్యారు. కనిమెట్ట స్వాతంత్య్ర యోధులు కళింగపట్నం తపాలా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. విజయనగరం, పలాస, బ్రాహ్మణ తర్ల తదితర చోట్ల నిర్వహించిన సత్యాగ్రహ ఉద్యమాల్లో పాల్గొని లాఠీదెబ్బలు తిన్నారు. విజయనగరం, చీపురుపల్లి, నరసన్నపేట, బళ్లారి జైళ్లలో నిర్బంధానికి గురయ్యారు. గాంధీజీ దూసి రైలు నిలయంలో బహిరంగ సభ నిర్వహించినపుడు జన సమీకరణ చేసి తమ వంతు బాధ్యత నిర్వహించారు. చౌదరి సత్యన్నారాయణ సారధ్యంలో వీరంతా ఉద్యమానికి బాసటగా నిలిచారు. గౌతు లచ్చన్నను నిర్భందించేందుకు ఆంగ్లేయులు సమాయత్తం కావడంతో ఈ యోధులంతా తోలాపి, షేర్ మహ్మద్పురం గ్రామాల్లోని రహస్య స్ధావరాల్లో దాచిపెట్టారు. అలాగే ఆచార్య ఎన్జి రంగాకు కూడా కొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో రహస్యంగా ఆశ్రయం కల్పించారు. -
ఉత్సాహంగా వజ్రోత్సవ పోటీలు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయి న సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డిబేట్, చిత్రలేఖనం పోటీలు గురువారంతో ముగిశాయి. నియోజకవర్గ స్థాయిలో 75 మందిని ఎంపిక చేసి తుది పోటీలు ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించారు. విజేతలు వీరే.. వ్యాసరచన: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని కె.నక్షత్ర ప్రథమ, టెక్కలి విశ్వ జ్యోతి జూనియర్ కళాశాల విద్యార్థిని జె.ఇందు ద్వితీయ, ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థి ఎం. మేఘరాజ్ తృతీయ స్థానాలు సాధించారు. డిబేట్: చాపర ఎస్కేకే జూనియర్ కళాశాల విద్యార్థి ని ఏ.ప్రియాంక, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి జి.శ్రావణి, సారవకోట కార్మెల్ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎన్.రుతో తొలి మూడు స్థానా లు సాధించారు. చిత్రలేఖనం: ఆమదాలవలస ఎంజేపీ ఏపీబీసీ డబ్ల్యూ కళాశాల విద్యార్థిని పి.ధనశ్రీ ప్రథమ, పలా స శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని టి. జ్యోత్స్న ద్వితీయ, నౌపడా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బి.దీపిక తృతీయ బహుమతి గెలుచుకున్నారు. విజేతలను రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ప్రగడ దుర్గారావు, జిల్లా ఉపాధి కల్పనాధికారి కొంతలెంక సుధ అభినందించారు. -
మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు షరతులు
● అరకొర బస్సులతో ఇప్పటికే అవస్థలు ● కొత్తగా బస్సులు సమకూర్చని ప్రభుత్వం ● కొన్ని బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి అనుమతి బస్సుల సంఖ్య పెంచాలి జిల్లాలో ప్రయాణికులకు సరిపడా బస్సులు లేవు. దీనికి తోడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే ప్రయాణం కోసం మహిళలు మరింత ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని బస్సులకూ ఈ సౌకర్యం క ల్పించాలి. ఉచిత ప్రయాణం జిల్లాకు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా చూడాలి. – ఉలాల భారతి దివ్య, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఆంక్షలు వద్దు ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేని ఉచిత ప్రయాణం అమలు చేయాలి. కేవలం పల్లెవెలుగు బస్సులకు మాత్రమే ఉచిత ప్రయాణం కాకుండా అన్ని బస్సులకూ వర్తింపజేయాలి. – గుంట జ్యోతి, శ్రీకాకుళం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘మీరు ఎక్కడకు కావాలంటే అక్కడకు ఆర్టీసీ బస్సులో వెళ్లండి.. ఎవరైనా టికెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని చెప్పండి..’ అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు హామీలు గుప్పించారు. తీరా అమలు సమయానికి వచ్చాక సవాలక్ష ఆంక్షలు పెట్టి ఉచితానికి కూడా పరిమితులు విధించారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15 నుంచి అమలు కానుంది. కానీ ఈ ప్రయాణాలకు షరతులు వర్తిస్తాయి. వైజాగ్ వెళ్దామనిశ్రీకాకుళంలో నాన్స్టాప్ ఎక్కితే కుదరదు.. కాస్త కుదురుగా కూర్చుందామని ఆల్ట్రా డీలక్స్ ఎక్కితే ఉచితం ఉండదు.. పోనీ అన్నవరం వరకు వెళ్దామని సూపర్ డీలక్స్లో కూర్చుంటే టికెట్ తీసుకోవాల్సిందే. కాస్త అటూ ఇటూగా పేరు మార్చిన ‘పల్లె వెలుగు’లకు మాత్రమే ఉచితం పరిమితం కానుంది. మెలికలు...షరతులు కూటమి ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ మాదిరిగానే దీనికి కూడా షరతలు పెట్టారు. ఆడవాళ్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల మెలికలు పెట్టి పిల్లి మొగ్గలు వేస్తున్నారు. జిల్లా వరకు నేరుగా ప్రయాణం చేయవచ్చని, అది కూడా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సాధారణ ఎక్స్ప్రెస్ సర్వీసులకే మాత్రమే అని ఆంక్షలు పెట్టారు. ఒకవేళ ఇతర ప్రాంతానికి వెళ్లాలంటే సరిహద్దులో దిగి, ఆ పక్క జిల్లా బస్సు డిపోకి వెళ్లి మళ్లీ పల్లె వెలుగు బస్సులే ఎక్కాలని మెలిక పెట్టారు. ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం, విజయవాడ... ఇలా ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా వెళ్లి రావచ్చనుకుని మహిళలు భావించారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఇప్పటికే ఆర్టీసీ కష్టాలు.. జిల్లాకు సంబంధించి ప్రధానంగా పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో మహిళలు ఎక్కువగా ప్రయాణిస్తారు. పైడి భీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిపై ప్రయాణించే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. విద్యార్థులు పుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణం చేస్తున్నారు. తగిన సంఖ్యలో బస్సులు లేకపోవడంతో ప్రయాణ కష్టాలు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఉచితం కావడంతో దాదాపుగా మహిళలు బస్సుల కోసం ఎదురు చూడవచ్చు. ఉదయం 10లోపు, సాయంత్రం నాలుగు తర్వాత మహిళల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బస్సులు అరకొరగా ఉన్న నేపథ్యంలో సమస్యగా మారనుంది. జిల్లాలో లక్షా 30వేల కిలోమీటర్ల మేర బస్సులు ప్రయాణం చేస్తున్నాయి. లక్షకు పైబడి జనం ప్రయాణిస్తున్నారు. మహిళలు 40వేల వరకు ఉన్నట్టు అంచనా. ఉచిత బస్సు అమలు కావడంతో ఈ సంఖ్య 50వేల నుంచి 60వేలకు పెరిగే అవకాశం ఉంది. మహిళల సంఖ్యకు తగ్గ బస్సులు లేకపోవడం వల్ల మిగతా ప్రయాణికులకు ఇబ్బంది తప్పేలా లేదు. సిబ్బంది కొరత జిల్లాలో ఆర్టీసీ పరిధిలో సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. ఇటీవల కాలంలో జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద ఎత్తున పదవీ విరమణ పొందారు. దీంతో ఆయా డిపోల్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని విభాగాల్లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంటున్నప్పటికీ డ్రైవర్, కండక్టర్ పోస్టులలో మాత్రం ఖాళీలు అలాగే ఉండిపోయాయి. ఇప్పుడున్న ఉద్యోగుల్లో అధిక శాతం మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆన్కాల్ సిబ్బంది మాత్రమే ఉన్నారు. ఉచిత ప్రయాణం అమలు చేస్తే దీని ప్రభావం ప్రయాణికులు, బస్సులపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. షరతులు వర్తిస్తాయి – ఉచిత బస్సు ప్రయాణాలకు షరతులు– అరకొర బస్సులతో ఇప్పటికే అవస్థలు– కొత్తగా బస్సులు సమకూర్చని ప్రభుత్వం – కొన్ని బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి అనుమతి అరకొర బస్సులు.. జిల్లాలో 324 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవి ఎప్పుడు పనిచేస్తాయో తెలియని పరిస్థితి ఉంది. వర్కింగ్లో ఉన్న వాటిలో ప్రభుత్వం చెప్పిన షరతులతో 204 బస్సులు మాత్రమే వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. వీటిలో 30 వరకు డొక్కు బస్సులు ఉన్నాయి. ఈ లెక్కన అందుబాటులో ఉన్న బస్సుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు ఉచిత ప్రయాణం అంటే మరింత రద్దీ పెరిగి సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. -
● స్వేచ్ఛా కవనం
శ్రీకాకుళం కల్చరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీకాకుళం శాంతినగర్ కాలనీలో గాంధీ స్మారక నిధి బృందం పర్యవేక్షణలో గాంధీ గుడి, స్వాతంత్య్ర సమరయోధుల స్మృతి వనం రూపుదిద్దుకుంది. గాంధీజీ మందిరంతో పాటు 40 మంది స్వాతంత్య్ర యోధుల ప్రతిరూపాలను ప్రతిష్టించారు. ఆ ప్రాంతంలో అడుగు పెడితే ఓ వైపు గాంధీ గుడిలో ధ్యానముద్రలో మహాత్ముడు, గుడి పైభాగాన భరతమాతతో పాటు 15 అడుగుల బాపూ జీ విగ్రహం, గుడి స్తంభాలపై మూడు మతాల చిహ్నాలు కనిపిస్తాయి. గుడి నలుమూలలా గాంధీజీ జీవితంలో జరిగిన ముఖ్య ఘట్టాలు ఉన్నా యి. ఇక్కడ జాతీయ జెండాను 105 అడుగుల ఎత్తులో ప్రతిష్టించుకోవడం మరో విశేషం. -
169 మందికి అవార్డులు
శ్రీకాకుళం పాత బస్టాండ్: స్వాతంత్య్ర వేడుకలు ఉదయం 8.30 నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా 169 మందికి ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు ఇవ్వనున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి కలెక్టర్ జాబితా విడుదల చేశారు. ఇంకేం అర్హత కావాలి..? చిత్రంలో కనిపిస్తున్న దివ్యాంగుడి పేరు దాసరి కరువయ్య. పొందూరు మండలం కోడూరు గ్రామానికి చెందిన ఈయన చిన్నతనం నుంచి పోలియోతో బాధ పడుతున్నాడు. తన ఎడమ చేయి పూర్తిగా పనిచేయదు. ప్రభుత్వం ఇచ్చే పింఛన్పైనే ఆధారపడి బతుకుతున్నాడు. ఇటీవల ఆయనకు ప్రభుత్వం ఓ నోటీసు పంపించింది. పింఛన్ ఇచ్చేంత వైకల్యం లేదని అందులో పేర్కొంది. ఇకపై పింఛన్ కూడా రాదంటూ సచివాలయ సిబ్బంది చెప్పేశారు. దీంతో ఆయన ఎంపీడీఓ వద్దకు వచ్చి ఇలా ఆవేదన వెలిబుచ్చారు. ఈ వైకల్యం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. – పోలాకి లోలుగు కేజీబీవీలో ఆర్జేడీ విచారణ పొందూరు: మండలంలోని లోలుగు కేజీబీవీలో ఇటీవల బదిలీ అయిన ప్రిన్సిపాల్ ఆర్.సౌమ్యపై, పాఠశాలపై వచ్చిన పలు ఆరోపణలపై గురువారం కాకినాడ రీజనల్ జాయింట్ డైరెక్టర్ జి.నాగమణి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని టీచింగ్, నాన్టీచింగ్ స్టాఫ్ని ఒక్కొక్కరుగా పిలిచి విచారణ జరిపారు. ఒక ప్రశ్న పత్రాన్ని ఇచ్చి వాటికి సమాధానాలను రాతపూర్వకంగా తీసుకున్నారు. అలాగే పాఠశాలలో గల భోజన, వసతి సౌకర్యాలతో పాటు ఉపాధ్యాయులు, బోధనకు సంబంధించి పాఠశాలలోని సుమారు 287 మంది విద్యార్థినులకు తెల్ల కాగితాలను ఇచ్చి వారితో సమాధానాలు రాయించారు. అనంతరం రికార్డులను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానం వేదికగా శుక్రవారం జరగనున్న జిల్లాస్థాయి వేడుకలకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గురువారం వాన పడడంతో శకటాల సన్నద్ధత పనులకు కాస్త ఆటంకం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ ప్రకటనతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాన వేదికతోపాటు వీఐపీలు, వీవీఐపీలు, ప్రెస్అండ్ మీడియా, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వా తంత్య్ర సమరయోధులు, వీక్షకులు ఇలా వేర్వేరుగా షామియానాలను సిద్ధం చేస్తున్నారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ నిబంధనలను ఏర్పాటు చేశారు. -
ప్రభుత్వం మా కడుపు కొడుతోంది
కొత్తూరు: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేయడంతో ఆటోలు, మాక్సీ పికప్ వాహనాల డ్రైవర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ప్రభుత్వం తమ కడుపు కొడుతోందని ఆటో యూనియన్ నాయకులు నీలయం నాయుడు, వాసు, ప్రసాద్, జమ్మయ్యలతో పాటు పలువురు అన్నారు. ఆటో డ్రైవర్ల యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో కొత్తూరులో గురువారం ఆందోళన నిర్వహించారు. ర్యాలీ చేసి తమ సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్ కె.బాలకృష్ణకు వినతి పత్రం అందజేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాదరావు మాట్లాడుతూ వాహన మిత్ర పథకం అమలు చేశాకే ఉచిత బస్సు పథకం అమలు చేయాలని కోరారు. ఆటోడ్రైవర్లకు నష్టదాయకమైన 21 జీఓను రద్దు చేయాలన్నారు. -
● కవర్పై కంచుమోగింది..
జిల్లాలోని సారవకోట మండలం బుడితిలోని కంచు, ఇత్తడి వస్తువుల తయారీ పరిశ్రమలపై పోస్టల్ శాఖ దృష్టి సారించింది. 2022 ఏప్రిల్ 12న బుడితి వస్తువుల ప్రత్యేకతలపై కవర్ను విడుదల చేసింది. దీనికి ‘బుడితి బెల్ అండ్ బ్రాస్మెటల్ క్రాఫ్ట్’ అని నామకరణం చేసింది. కంచుగంట, ఇత్తడి, ఇతర లోహాలకు చెందిన దేవతా విగ్రహాలు, కొన్ని చిహ్నా లు, పాత్రల ఫొటోలను కవర్పై ముద్రించింది. ● నేతగాళ్ల సృజనను కవర్ చేస్తూ.. గాంధీజీ నుంచి నవతరం వరకు అందరూ ఆ‘ధరించి’న.. విశ్వఖ్యాతి గాంచిన పొందూరు ఖాదీపై 2019 డిసెంబర్ 5న ప్రత్యేక కవర్ విడుదల చేసింది. దానిపై రాట్నంతో పాటు గాంధీ మహాత్ముని ఫొటోను ప్రచురించారు. నిపుణులైన నేతగాళ్లు సృజించిన అద్భుతాల ఆనవాళ్లకు దక్కిన గొప్పగౌరవం ఈ కవర్. ‘ప్రైడ్ ఆఫ్ పొందూరు.. గాంధీజీస్ చెరఖా’ అని పోస్టల్ శాఖ నామకరణం చేసింది. -
కడుపు కొడుతున్నారు
ఉచిత బస్సు పథకం అమలు చేయడం వల్ల ఆటో డ్రైవర్ల కడుపుపై కొట్టినట్టవుతుంది. ఉపాధి లేక డ్రైవర్లు వీధిన పడే ప్రమాదం ఉంది. ఆటో డ్రైవర్లను మరోవిధంగా ఆదుకోవాలి. – జి.నీలంనాయుడు, ఆటో డ్రైవర్, కుంటిభద్ర వాహన మిత్ర అమలు చేయాలి.. వాహన మిత్ర అమలు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తక్షణమే వాహన మిత్ర అమలు చేసి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి. – సీహెచ్ వెంకటరమణ, ఆటోడ్రైవర్, కొత్తూరు అప్పులు తీర్చడం కష్టం.. మహిళలకు బస్సులో ఉచితం వల్ల ఆటోలు ఎవరూ ఎక్కరు. అప్పులు చేసి వాహనాలు కొన్నాం. ఆ అప్పులు తీర్చడం కష్టమవుతుంది. – కె.మిన్నారావు, ఆటోడ్రైవర్, కోసలి గ్రామం -
గంజాయితో నలుగురు అరెస్టు
నరసన్నపేట: జాతీయ రహదారిపై మండలంలోని మడపాం టోల్గేట్, సత్యవరం ఫ్లై ఓవరు వంతెన కూడలి వద్ద నరసన్నపేట పోలీసులు నిర్వహించిన సోదాల్లో 21 కేజీల గంజాయిని సీజ్చేసి, నలుగురు వ్యక్తులను అరెస్టు చేశామని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. స్థానిక సర్కిల్ స్టేషన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరసన్నపేటలోని సూరజ్ నగర్లో గంజాయి సేవిస్తూ నరసన్నపేటకు చెందిన సూర కీర్తన్(మణి), గరక మోహన్లు పట్టుబడ్డారన్నారు. వీరు ఇచ్చిన సమాచారంతో సత్యవరం ఫ్లై ఓవరు వంతెన వద్ద తనిఖీలు చేస్తుండగా పర్లాకిమిడికి చెందిన సంజు అనే వ్యక్తి పట్టుబడ్డాడని, అతడి వద్ద నుంచి 21.750 కేజీల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే సంజు స్నేహితుడు తేజను కూడా గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలతో సంబంధం ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశామని వెల్లడించారు. నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించారని అభినందించారు. సమావేశంలో సీఐ ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
జోడూరు కొండపై పురాతన విగ్రహాలు
మెళియాపుట్టి: జోడూరు గ్రామ పరిధిలోని కొండపై బుధవారం పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన రాయలహర్ష అనే 7వ తరగతి విద్యార్థి చెప్పిన సమాచారం మేరకు గ్రామస్తులు వెళ్లి పరిశీలించగా రెండు రాతి విగ్రహాలు గుర్తించారు. అయితే ఆ విద్యార్థి తనకు కలలో సంతోషిమాత ఈ విషయం చెప్పిందని పేర్కొనడం గమనార్హం. పాఠశాలకు కుళ్లిన కోడిగుడ్లు పొందూరు: మండలంలోని కోటిపల్లి ప్రాథమిక పాఠశాలకు సరఫరా చేసిన కోడిగుడ్లు పూర్తిగా కుళ్లిపోయి దుర్వాసన రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. క్వాలిటీ గుడ్లు కాకుండా నాణ్యత లేని గుడ్లు అందించడంతో కుళ్లిపోతున్నాయని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. గుడ్లు కుళ్లిపోయిన విషయాన్ని మండల విద్యాశాఖాధికారులకు తెలిపారు. దరఖాస్తులు ఆహ్వానం సరుబుజ్జిలి: మండలంలోని వెన్నెలవలస జవహార్ నవోదయ విద్యాలయంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ బి.బేతనసామి బుధవారం ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి చదివిన విద్యార్థులు ప్రవేశాలకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థులు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జనావాసాల్లోకి ఎలుగు పిల్లలు టెక్కలి: కోటబొమ్మాళి మండలం చలమయ్యపేట గ్రామానికి ఆనుకుని బుధవారం రెండు ఎలుగు బంటి పిల్లలు దారి తప్పి గ్రామ సమీపంలోని గోతుల్లో పడ్డాయి. ఇది గమనించిన స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీశాఖ, అగ్నిమాపక శాఖాధికారులు గ్రామానికి చేరుకుని గోతుల్లో పడిన ఎలుగు బంటి పిల్లలను చాకచక్యంగా బయటకు తీసి సమీపంలోని కొండ ప్రాంతాల్లో విడిచిపెట్టారు. అయితే ఎలుగు బంటి పిల్లలు గ్రామ సమీపంలోకి చేరుకోవడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా భయాందోళన చెందారు. -
అక్రమ బదిలీలు రద్దు చేయాలి
ఆమదాలవలస ఎమ్మెల్యే వేధిస్తున్నారు నిరసన కార్యక్రమంలో భాగంగా పొందూరు కేజీబీవీ ఎస్వో ఆర్.సౌమ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీకాకుళం: కేజీబీవీ ఎస్వో (ప్రిన్సిపాల్స్)ల అక్రమ బదిలీలు రద్దు చేయాలని, నిబంధనలు పాటించని ఏపీసీని విధుల నుంచి తొల గించాలని ఏపీ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, యూటీఎఫ్ సీనియర్ నాయకురాలు కె.విజయగౌరిలు డిమాండ్ చేశారు. జిల్లాలోని కంచిలి, గార, పొందూరు కేజీబీవీల ప్రిన్సిపాల్స్ను స్థానిక ఎమ్మెల్యేల లేఖల ఆధారంగా బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద సమగ్ర శిక్షా ఎంప్లాయీస్ జేఏసీ, యూటీఎఫ్, సీఐటీయూ సంయుక్తంగా 3 సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేలు లేవనెత్తిన అంశాలపై విచారణ జరపకుండానే చర్యలు తీసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ప్రిన్సిపాల్స్ బదిలీకి రాష్ట్ర కార్యాలయం అనుమతి తప్పనిసరి అనే నిబంధనను ఉల్లంఘించడమే కాకుండా, బదిలీలకు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ అని కారణాన్ని పేర్కొనడం ద్వారా వాస్తవాలను దాచే ప్రయత్నం కనిపిస్తోందని విమర్శించారు. అధికారి అత్యుత్సాహం సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ అధికారి రాజకీయ ఆశీస్సుల కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ, సెలవు రోజుల్లో కూడా ఆదేశాలు జారీ చేశారని మండిపడ్డారు. మహిళా ఉద్యోగులను స్థానిక రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా దూషించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం, వేధింపులపై ఫిర్యాదు చేయడంతో పాటు ఫోన్ ఆడియో రికార్డింగ్స్ను ఏపీసీకి అందజేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. బాధిత ముగ్గురు ప్రిన్సిపాల్స్ కూడా ఒంటరి మహిళలని, వీరి కుటుంబాలు వీరిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ధర్నాకు యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు హాజరై అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, యూటీఎఫ్ కోశాధికారి బి.రవికుమార్, జిల్లా కార్యదర్శి జి.సురేష్, కె.సురేష్, జి.విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. -
వడ్డీ వ్యాపారి అదృశ్యం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో గత కొంతకాలంగా వడ్డీలకు డబ్బులిచ్చే వ్యాపారి, తిరిగి కొందరు వ్యక్తులకు బకాయి పడి ఆర్థిక ఇబ్బందులు భరించలేక అదృశ్యమైనట్లు రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు వెల్లడించారు. సీఐ చెప్పిన వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలానికి చెందిన వారణాసి చిరంజీవి (38)కి ఏడేళ్ల క్రితం వివాహమైంది. అప్పటికే చిరంజీవి ఒక ఫార్మా కంపెనీలో పనిచేస్తుండేవాడు. సంవత్సరం పాటు విధుల్లోకి వెళ్లినా ఆ తర్వాత సెలవులు ఎక్కువగా పెట్టేయడంతో కంపెనీ తొలగించేసింది. దీంతో శ్రీకాకుళం నగరంలోని పుణ్యపువీధిలో ఒక అద్దె ఇంట్లో నివాసముంటూ కొంత మొత్తాన్ని వడ్డీలకు తిప్పుతూ మొదట్లో బాగానే సంపాదించాడు. ఇదిలా ఉండగా ఈనెల 12వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో భార్య జయశ్రీకి బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటినుంచి చిరంజీవి వెళ్లిపోయాడు. అయితే భార్య తన భర్తకు పలుమార్లు ఫోన్లు చేసినా ఎత్తకపోవడం, అనంతరం భర్త ఫోన్ ఇంట్లోనే దొరకడంతో ఆందోళనకు గురయ్యింది. అతడి ఫోన్ చెక్ చేయగా ఇతరుల నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉండడం, అవే నంబర్లు నుంచి డబ్బులు ఎప్పుడిస్తావంటూ మెసేజ్లు ఉండడంతో బంధువుల వద్ద వాకబు చేసింది. అయినా అతని జాడ తెలియకపోవడంతో బుధవారం ఫిర్యాదు చేసిందని సీఐ తెలియజేశారు. -
రైతన్నా.. జాగ్రత్త..!
నకిలీలు విక్రయిస్తే లైసెన్స్ రద్దు ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు మా పరిశీలనలో గుర్తిస్తే దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తాం. మందులు కొనుగోలు చేసిన రైతులకు డీలర్, దుకాణ యజమాని సంతకాలతో కూడిన బిల్లులను అందజేయాలి. క్రిమి సంహారక మందులను కొనుగోలు చేసే సమయంలో డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి. సంబంధిత ఎరువులు ఏ కంపెనీవో నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలి. డబ్బాపై చూపించిన వివరాల ప్రకారమే మందులు పిచికారీ చేయాలి. – బి.సంధ్య మండల వ్యవసాయాధికారి, హిరమండలం ●హిరమండలం: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో పంట పొలాల్లో రైతులు అధికంగా ఎరువులు వినియోగిస్తారు. అయితే మార్కెట్లోకి నకిలీ ఎరువులు, పురుగు మందులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో ఎరువులు కొనుగోలు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నా రు. అధికారుల సూచన మేరకు ఎరువులు, పురుగు మందులు తీసుకోవాలని, లేకుంటే నిలువునా మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దళారుల వద్ద కొనుగోలు చేయవద్దు నిషేధిత పురుగుల మందులు కొనుగోలు చేస్తే రైతులు నష్టపోతారని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఎరువుల వ్యాపారులు పంట దిగుబడి అధికంగా వస్తుందని నమ్మించి అనుమతిలేని వివిధ కంపెనీల కల్తీ ఎరువులు, పురుగు మందులు రైతులకు అంటగట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా అనుమతిలేని దుకాణాలు, దళారుల వద్ద కనుగోలు చేయవద్దని సూచిస్తున్నారు. వాటిని కొనుగోలు చేస్తే పంట దిగుబడి తగ్గడంతో పాటు భూసారం దెబ్బతింటుందని అంటున్నారు. మందుల లేబుల్స్ మొదట పరిశీలించి, అవి కంపెనీ ఎరువులా లేక స్థానికంగా తయారు చేసి విక్రయిస్తున్నారా అనే విషయాలు రైతులు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. మందులు కొనుగోలు చేసిన తర్వాత తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలంటున్నారు. ఫిర్యాదు చేయండి దుకాణాల వద్ద లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి. మందుల లాట్ నంబర్ ఆధారంగా తయారు చేసిన తేదీని గుర్తించడంతో పాటు ఏ కంపెనీ.. ఏ రకం వంటి విషయాలను చూడాలి. దుకాణ యజమాని, డీలర్ సంతకాలతో కూడిన బిల్లులను తప్పక తీసుకోవాలని, ముఖ్యంగా విత్తనాలకు సంబంధించిన సంచులపై సీలు తొలగించినట్లు గుర్తిస్తే వాటిని కొనుగోలు చేయకుండా నకిలీపై సత్వరం రైతులు ఫిర్యాదు చేయాలి. అధికారుల పరిశీలనలో అది వాస్తవమని తేలితే సంబంధిత డీలర్పై కేసు నమోదు చేసి రైతులకు న్యాయం జరగడానికి అవకాశం ముందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో నకిలీ ఎరువులు కొనుగోలు సమయంలో అవగాహన అవసరం మందులకు రశీదు తప్పనిసరి -
బంగారం పేరుతో బురిడీ
● సగం ధరకే ఇప్పిస్తామంటూ రూ.12 లక్షలతో ఉడాయించిన కేటుగాళ్లు ● లబోదిబోమంటున్న బాధితురాలు పార్వతీపురం రూరల్: సగం ధరకే పావుకిలో బంగారం ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ మహిళ వద్ద రూ.12 లక్షలతో దుండగులు పరారైన ఘటన పార్వతీపురం పట్టణ శివారులో చోటుచేసుకుంది. బాధిత మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మిని తన వద్ద గతంలో విద్యనభ్యసించిన విద్యార్థిని భర్త రిషి అనే వ్యక్తి గతనెల జూలైలో కలిశారు. సగం దొరకే బంగారం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. పావుకిలో బంగారాన్ని రూ.12 లక్షలకు ఇప్పిస్తామని, డబ్బులు సిద్ధం చేసుకోవాలని చెప్పాడు. ఆ మేరకు ఆమె ఈ నెల 11న డబ్బులు సిద్ధం చేశారు. ఆయన సూచన మేరకు బంగారం విక్రయించే వారి వద్దకు వెళ్లేందుకు బుధవారం పాలకొండకు ద్విచక్ర వాహనంపై చేరుకున్నారు. బంగారం విక్రయిస్తామని చెప్పిన ఇద్దరు వ్యక్తులతో మాట్లాడారు. బంగారాన్ని బహిరంగంగా చూపించడం కుదరదంటూ పార్వతీపురం శివారులో ఉన్న వాటర్పంప్ హౌస్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ మాట్లాడుతున్న సమయంలో మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి శ్రీలక్ష్మి ముఖంపై మత్తు పౌడర్ చల్లారు. ఆమె అపస్మారక స్థితిలోకి చేరాక రూ.12 లక్షలతో ఉడాయించారు. తనతో పాటు వచ్చిన రిషి అనే వ్యక్తి కూడా కనిపించకపోవడంతో పార్వతీపురం రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రిషి అనే వ్యక్తిని విచారణ చేసి కేసు నమోదు చేశామని పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి తెలిపారు. -
మందుల్లేవ్..!
● పశు ఆరోగ్య సంచార వాహనాల్లో వింత పరిస్థితి ● మందులు లేకుండానే పల్లెలకు వెళ్తున్న వాహనాలు ● పాడి రైతులకు తప్పని అవస్థలు పాతపట్నం: పాడి రైతులు ఫోన్ చేసిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి వైద్యసేవలందించాల్సిన పశు ఆరోగ్య సంచార వాహనాలు రోజురోజుకూ నిర్వీర్యమైపోతున్నాయి. పశువుల చికిత్సకు మందులు లేకుండానే గ్రామాలకు వెళ్తున్నాయి. దీంతో పాడి రైతులు ప్రైవేటున మందులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పశువుల వైద్యానికి సత్వర సేవలు అందించేందుకు సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 1962 ట్రోల్ ఫ్రీ నంబర్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. నియోజవర్గానికి రెండు వాహనాలు ఉంచారు. రెండు మండలాలకు ఒక వాహనం చొప్పున వైద్య సేవలు అందించేవి. శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తే దగ్గరలోని ప్రాంతీయ పశు వైద్యశాలకు తరలించి, అక్కడ చికిత్స అందించి అనంత రం గ్రామానికి పంపించేవారు. శ్రీకాకుళం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు రెండు చొప్పున సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలు 16 ఉన్నాయి. ప్రైవేటుగా మందుల కొనుగోలు మూగ జీవాల చికిత్స కోసం వచ్చిన సంచార పశు ఆరోగ్య సేవ వాహనాల్లో మందులు లేకపోవడంతో పాడి రైతులు పశు వైద్యుడు చెప్పిన మందులు రౖపైవేటు మందుల దుకాణంలో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. దీంతో రైతులకు చేతి చమురు వదులుతోంది. సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను గతంలో జీవీకే సంస్థ నిర్వహించేది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భవ్య హెల్త్ ప్రోవైడర్స్ సంస్థకు అప్పగించింది. గతానికి భిన్నంగా... సంచార పశు ఆరోగ్య సేవ వాహనాలను గతానికి భిన్నంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాహనంలో ఒక పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్ కం అటెండర్ మొత్తం ముగ్గురు సిబ్బంది ఉంటారు. గతంలో నెలకు 8 వేల నుంచి 9 వేల కిలోమీటర్ల వరకు ఒక్కో వాహనం సేవలు అందించేవి. ఇప్పుడు వాహనాలు నెలకు 3 వేల కిలోమీటర్లు కూడా తిరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా రోజుకు రెండు మూడు గ్రామాల్లో వాహనం పెట్టి సేవలు అందిస్తున్నారు. అలాగు కొన్ని గ్రామాలకు వాహనాలు వెళ్లడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సొంతంగానే మందులు మా ఆవులకు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఫోన్ చేయగానే సంచార పశు ఆరోగ్య సేవ వాహనంలో వచ్చారు. వైద్యులు ఆవులకు వైద్యం చేసి మందులు రాశారు. వాహనంలో మందులు లేవని చెప్పారు. ఆ మందులను పాతపట్నం వెళ్లి బయట కొన్నాం. – మహంతి జీవిశ్వరరావు, ప్రహారాజపాలేం, పాతపట్నం మండలం మందులు వచ్చాయి సంచార పశువైద్యశాలల్లో మందుల కొరత ఉంది. ఇదివరకే ఇండెంట్ పెట్టాం. అయితే ప్రస్తుతం మందులు వచ్చాయి. వాటిని సంచార పశు వైద్యశాలలకు అందిస్తాం. ఇకపై పాడి రైతులకు ఇబ్బంది ఉండదు. – డాక్టర్ ఎం.కరుణాకరరావు, సహాయ సంచాలకుడు, ప్రాంతీయ పశువైద్యశాల, పాతపట్నంజిల్లాలో పశువుల సంఖ్య ఆవులు 4,56,291 గేదెలు 40,477 గొర్రెలు 6,23,641 మేకలు 2,77,268 కోళ్లు 13,19,100 -
● వజ్రోత్సవ ఎగ్జిబిషన్
జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఎనిమిది నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రత్యేకతలతో కూడిన స్టాల్స్(ఎగ్జిబిషన్)ను బుధవారం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ప్రారంభించారు. స్వాతంత్య్రకాలం నాటి గుర్తులు, స్థానికంగా లభించే తినుబండారాలు, ఆ ప్రాంత స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులు, సాహిత్యకారులు, చారిత్రక భవనాలు, కళాఖండాలు, చేనేత ఉత్పత్తులు, కనువిందు చేశాయి. కాగా ఎగ్జిబిషన్ ప్రారంభం సమయానికి టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన స్టాల్ రెడీ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, డీఆర్డీఏ పీడీ పి.కిరణ్కుమార్, డీఐసీ జనరల్ మేనేజర్ జి.ఎం.శ్రీధర్, ఇంటాక్ అదనపు కన్వీనర్ వి.జగన్నాథనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
● పరిశ్రమల స్థాపనకు సహకారం
జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో బుధవారం ఇండస్ట్రియల్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అనేక వనరులు ఉన్నాయని, వాటి ద్వారా ఉత్పత్తులు తయారు చేసి వ్యాపారం చేసుకునేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలో బీచ్ కారిడార్ ప్రారంభం కాబోతోందని, మూలపేట వద్ద పోర్టు దాదాపు పూర్తయ్యిందని, భోగాపురం ఎయిర్పోర్టుతో పరిశ్రమలు మరింతగా అభివృద్ధి కానున్నాయని వివరించారు. అనంతరం పలువురు ఇన్వెస్టర్లు స్థలం, విద్యుత్, కార్మికుల సమస్యలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్, డీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
● ఉత్సాహ తరన్గం
శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు జరుగుతున్న ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి ఏడురోడ్ల కూడలి వరకు వాక్ థాన్ పేరిట చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని వర్గాల వారు ముఖ్యంగా విద్యార్థులు, యువత జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం వరకు జరిగే ఉత్సవాలు, సాంస్కృతిక ప్రదర్శనలను విజయవంతం చేయాలని కోరారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సగర్వంగా జరుపుకొందామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
అపురూప ప్రస్థానం గురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన వాక్థాన్లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులుఉత్సాహంగా మొదలైన జిల్లా ఆవిర్భావ వేడుకలుఒక జిల్లా చరిత్రలో 75 ఏళ్ల ప్రస్థానం ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోతుంది. శ్రీకాకుళం జిల్లా అటువంటి ప్రత్యేక సందర్భాన్ని ఇప్పుడు ఆస్వాదిస్తోంది. సంబరం చేసుకుంటోంది. ఇది కచ్చితంగా సెలెబ్రేట్ చేసుకోవాల్సిన సందర్భమే. అయితే సంబరాలతో పాటు బలమైన సంకల్పం తీసుకోవాల్సిన సందర్భం కూడా ఇదే. వజ్ర సంకల్పం పూనడం ద్వారా గతానికి, భవిష్యత్తుకు మధ్య వారధి వేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని జిల్లావాసులందరూ వజ్ర సంకల్పం పూనాలి. – శ్రీకాకుళం కల్చరల్ -
ఎందరో మహానుభావులు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్వాతంత్య్ర పోరాటంలో మన జిల్లా నుంచి ఎంతో మంది పాల్గొన్నారు. వివిధ ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్య్రం రాకలో భాగస్వాములయ్యారు. వారిలో కొందరు ప్రముఖంగా నిలిచారు. వారిలో గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, చౌదరి సత్యనారాయణ, మార్పు పద్మనాభం, వీరగున్నమ్మ, స్వామిబాబు పొట్నూరు తదితరులు ఉన్నారు. వారి గురించి ఒక్కసారిగా స్మరించుకోవల్సిన అవసరం ఉంది. చౌదరి సత్యనారాయణ ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురానికి చెందిన చౌదరి సత్యనారాయణ 1921లో అప్పటి జాతీయ కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహ పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 13వ ఏటనే స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న చౌదరి సత్యనారాయణ పోలీసుల లాఠీ దెబ్బలకు తీవ్ర గాయాలపాలై కోలుకోవడానికి 6 నెలల సమయం పట్టింది. సత్యాగ్రహం చేసిన సత్యనారాయణను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేయగా 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమ ప్రచార కార్యక్రమం సందర్భంగా వచ్చిన గాంధీని దూసి రైల్వే స్టేషన్లో కలిసి పొందూరు ఖద్దరు పంచెను బహుకరించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా అరైస్టె జైలు శిక్ష అనుభవించారు. గరిమెళ్ల సత్యనారాయణ స్వాతంత్రోద్యమ కవుల్లో గరిమెళ్ల సత్యనారాయణది విశిష్ట స్థానం ఉంది. గరిమెళ్ల గేయాలు పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను రాసిన మాకొద్దీ తెల్ల దొరతనం పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువ, ఉత్తేజాన్ని కలిగించింది. దండాలు దండాలు భారత మాత అనే గీతం కూడా ప్రజలను జాగృతం చేసింది. గౌతు లచ్చన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకై క వ్యక్తి గౌతు లచ్చన్న. వి.వి.గిరి, నేతాజీ, జయంతి ధర్మతేజ తదితర జాతీయ నాయకులతో కలిసి భారత దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలు కెళ్లారు. 1930లో ఉప్పు సత్యాగ్రహం జరిగిన సమయంలో లచ్చన్న ఇక్కడ ఉద్యమాన్ని నడిపారు. ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల్లో పాల్గొని జైలు కెళ్లారు. మార్పు పద్మనాభం మందస మండలంలోని భిన్నళ మదనాపురం గ్రామంలో జన్మించిన మార్పు పద్మనాభం 1930లో గాంధీజీ పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తర్వాత జరిగిన ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. పలు పర్యాయాలు జైలుకెళ్లారు. మందస కాల్పుల ఘటన తర్వాత ఆయనను అఖిత భారత కాంగ్రెస్ కమిటీ సర్దార్ బిరుదు ఇచ్చి సత్కరించింది. 1944లో జైలు నిర్బంధం నుంచి బయటికొచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో అరుణ పతాక ఆశయాలను ప్రచారం చేసి కట్టుబడిన తొలితరం కమ్యూనిస్టుగా చరిత్రలో నిలిచారు. వీరగున్నమ్మ బ్రిటిష్ ముష్కరుల చర్యలను ఎదిరించిన సామాన్య మహిళగా వీరగున్నమ్మ నిలిచారు. ఆంగ్లేయులతో పోరాటానికి సై అన్న ఽధీశాలి. రైతులు పండించే పంటలో మూడో భాగాన్ని కప్పం కింద ఆంగ్లేయులు వసూలు చేయడం, అటవీ ఉత్పత్తులను తెచ్చుకునేందుకు బ్రిటిష్ పోలీసులు అడ్డుకున్న సమయంలో రైతులకు, పోలీసుల మధ్య జరిగిన పోరాటంలో పోలీసుల తుపాకీ కాల్పుల తూటాలకు గురై మృతి చెందారు. స్వామిబాబు పొట్నూరు నరసన్నపేటకు చెందిన పొట్నూరు స్వామి దేశభక్తుడిగా, దాతగా, సంఘ సేవకుడిగా, కవిగా తనదైన ముద్ర వేసుకున్నారు. వందేమాతరం ఉద్యమంలో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. స్వరాజ్య ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కొత్తపల్లి పున్నయ్య సోంపేట మండలం బారువలో జన్మించిన కొత్తపల్లి పున్నయ్య క్విట్ ఇండియా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారత ప్రభుత్వం రాజ్యాంగ సమీక్షా సంఘంలో పున్నయ్యను సభ్యుడిగా నియమించారు. జాతీయోద్యమంలో కీలక పాత్ర పోషించిన సిక్కోలు ప్రముఖులు -
అమానుషం!
● షాపులో పనిచేస్తున్న యువకుడిపై దాడికి పాల్పడిన యజమాని ● చికిత్స పొందుతూ యువకుడు మృతి ● ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన శ్రీకాకుళం క్రైమ్ : తన వద్ద పనిచేసిన యువకుడిని మద్యం మత్తులో మరో వ్యక్తితో కలసి దాడికి పాల్పడ్డాడో యజమాని. లెక్కల్లో తేడా వచ్చిందని కొట్టి ఇంటి ముందు పడేసి నిర్లక్ష్యంగా ఇద్దరూ వెళ్లిపోయారు. ఈ నెల 3వ తేదీ రాత్రి జిల్లా కేంద్రంలోని పొట్టిశ్రీరాములు మార్కెట్లో బాధితుడు ఉల్లాకుల రాజేష్ (32)పై జరిగిన ఈ దాడి ఘటన అప్పట్లో బయటకు పొక్కకుపోయినా కేజీహెచ్లో యువకుడు చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందడంతో వెలుగులోకి వచ్చింది. ఒకటో పట్టణ పోలీసులు హత్యకేసుగా నిర్ధారించి దాడికి పాల్పడిన యజమాని చీకటి వంశీ, సహకరించిన పుక్కళ్ల రామకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ హరికృష్ణ, బాధిత కు టుంబీకులు, స్థానికు లు తెలిపిన వివరాల మేరకు.. అరసవల్లికి చెందిన ఉల్లాకుల రాజేష్ కొంతకాలంగా పొట్టి శ్రీరాములు మార్కెట్లో చీకటి వంశీ నిర్వహిస్తున్న పండ్ల దుకాణంలో రోజువారీ కూ లీకి పనిచేస్తున్నాడు. ఎప్పట్లాగే ఈ నెల 3న రాజేష్ దుకాణం తెరిచి వ్యాపారం చేశాడు. అదే రోజు రాత్రి మద్యం పూటుగా సేవించి వచ్చిన యజమాని వంశీ ఎంత వ్యాపా రం జరిగిందని రాజేష్ను ప్రశ్నించడంతో రూ.24 వేలుగా లెక్క చూపించాడు. ఆదివారం కావడంతో పెద్దగా వ్యాపారం జరగలేదని చెప్పిడబ్బులు అప్పగించి ఇంటికి వెళ్లిపోయేందుకు రాజేష్ ప్రయత్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన వంశీ ఒక్కసారిగా రాజేష్పై దాడికి పాల్పడ్డాడు. అతికష్టమ్మీద అక్క డి నుంచి రాజేష్ పారిపోయాడు. అనంతరం వంశీ నగరానికి చెందిన మిత్రుడు పుక్కళ్ల రామకృష్ణను రప్పించాడు. తర్వాత రాజేష్కు పలుమార్లు ఫోన్చేసి కౌంటర్లో మాయం చేసిన డబ్బులు తిరిగివ్వకపోతే చంపేస్తామంటూ దుర్భాషలాడుతూ బెదిరించాడు. అనంతరం అరసవల్లి జంక్షన్లో రా జేష్ ఉన్నాడని తెలుసుకుని రామకృష్ణ ద్వారా మా ర్కెట్టుకు రప్పించాడు. ముఖం, తలపై పిడిగుద్దుల వర్షం కురిపించి రోడ్డుపైకి నెట్టేశారు. తీవ్ర గా యాలపాలైన రాజేష్ను అర్ధరాత్రి 12:30 గంటలకు అతని ఇంటిముందు పడేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున భార్య ధరణి తన భర్త అపస్మారక స్థితిలో ఉండటాన్ని చూసి రిమ్స్కు తరలించింది. పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్లో చేర్పించగా అక్కడ మంగళవారం మృతిచెందాడు. కాగా, దాడి జరిగి దాదాపు పదిరోజులు కావస్తు న్నా పోలీసులు విషయాన్ని బయటకు పొక్కనీయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
డిగ్రీ అధ్యాపకుల నిరసన
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బందికి వెంటనే బదిలీలను చేపట్టాలని జీసీజీటీఏ, జీసీటీఏ జేఏసీ జిల్లా అధ్యక్షుడు సింగూరు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి రోణంకి రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో నాలుగో రోజు నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలియజేశారు. బదిలీలతో పాటుగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పేరు మార్పు, జీఓ నంబర్ 42 రద్దుపై ప్రభుత్వం స్పందించాలని నినదించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. సదరం పత్రాల వివాదంపై దర్యాప్తు నరసన్నపేట: నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ఆర్థో స్పెషలిస్టుగా పనిచేసిన రవికిరణ్ జారీ చేసిన సదరం సర్టిఫికెట్ల వ్యవహారంపై సీఐ శ్రీనివాసరావు తన కార్యాలయంలో మంగళవారం విచారణ నిర్వహించారు. సర్టిఫికెట్లపై కౌంటర్ సంతకాలు చేసిన ముగ్గురు వైద్యుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. పలువురికి వికలాంగత్వం లేకపోయినా ఉన్న ట్లు డాక్టర్ రవికిరణ్ సదరం పత్రాలు జారీ చేయడంపై ఎస్పీ ఆదేశాల మేరకు నరసన్న పేట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డీసీహెచ్గా పనిచేసి ప్రస్తుతం రాజాం సివిల్ సర్జన్ స్పెషలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మిని విచారించారు. మంగళవారం డాక్టర్ జయశ్రీ, డాక్టర్ నాగమల్లేశ్వరి, డాక్టర్ నవీన్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
‘ఉద్దానంలో విధ్వంసం సహించబోము’
మందస: కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ఉద్దానంలో విధ్వంసం చేస్తే సహించేది లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా ఎం.గంగువాడ నుంచి రాంపురం వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కె.నారాయణ మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు పేరుతో బలవంతంగా భూములు తీసుకోవడం వల్ల ఇక్కడి ప్రజలు నిరాశ్రయులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అతిపెద్ద ఎయిర్పోర్టు అయిన ఢిల్లీ కార్గో ఎయిర్ పోర్టుకి కేవలం 150 ఎకరాలు మాత్రమే ఉందని ఇక్కడ కార్గో ఎయిర్ పోర్టుకి 1400 ఎకరాలు ఎవరి ప్ర యోజనం కోసం కేటాయిస్తున్నారని ప్రశ్నించారు. దేశంలో ప్రముఖ ఎయిర్పోర్టులకు అనుంబంధంగానే కార్గో ఎయిర్పోర్టులు ఉన్నాయని, ఇక్కడెందుకు ప్రత్యేకంగా కార్గోను నిర్మిస్తున్నారని నిలదీశారు. -
ఏడు కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
కొత్తూరు: ఒడిశా రాష్ట్రం గుణుపూర్ నుంచి చైన్నెకి అక్రమంగా ఏడు కిలోల గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావు తెలిపారు. కొత్తూ రు సర్కిల్ కార్యాలయంలో మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం మధురైకు చెందిన మహలింగం సూర్య గుణుపూర్ నుంచి ఏడు కిలోల గంజాయిని బ్యాగ్లో పెట్టుకొని ఒడిశా రాష్ట్రం హడ్డుబంగి నుంచి కొత్తూరు మండలం మాతల వైపు కాలినడకన బయలుదేరాడు. మాతల వద్ద ఎస్ఐ ఎండీ అమీర్ ఆలీ సిబ్బందితో తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాడు. గంజాయిని స్వాధీనం చేసుకొని సూర్యపై కేసు నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. సమావేశంలో సీఐ చింతాడ ప్రసాదరావు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి డిబేట్లో ‘గంగోత్రి’కి ప్రథమస్థానం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్)కళాశాలకు చెందిన బీకాం ఒకేషనల్ ఫైనలియర్ విద్యార్థిని జె.గంగోత్రి రాష్ట్రస్థాయి డిబేట్లో ప్రథమ స్థానంలో నిలిచింది. సమాచార హక్కు చట్టం–2005 ప్రారంభించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ పోటీల్లో.. కాలేజీ స్థాయి నుంచి ఎన్ఆర్సీ, జోనల్ స్థాయిల్లో విజయం సాధించిన గంగోత్రి రాష్ట్రస్థాయిలోనూ మొదటిస్థానంలో నిలిచి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పి.శామ్యూల్ చేతుల మీదుగా బహుమతిని అందుకుంది. ఈ సందర్భంగా కళాశాలకు చేరుకున్న విద్యార్థినిని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు అభినందించారు. కార్యక్రమంలో కామర్స్ శాఖాధిపతి లబ్బ కృష్ణారావు, అధ్యాపకులు లలితబాయి, సంతోషి, ఎస్.మాధవీలత, వాణీ కుమారి తదితరులు పాల్గొన్నారు. 5,03,800 డోసుల పంపిణీకి చర్యలు అరసవల్లి: జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు నులిపురుగుల నివారణకు గాను ఆల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా వేసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలియజేశారు. డీవార్మింగ్ డే సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన స్వయంగా మాత్రలను పంపిణీ చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా శారీరక, మానసిక ఎదుగుదల లోపాలకు గురవుతారని గుర్తుచేశారు. డీఎంహెచ్ఓ అనిత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 5,03,800 డోసులు మాత్రల పంపిణీకి చర్యలు చేపట్టామని వివరించారు. బడిబయట ఉన్న వారికి కళాశాలకు వెళ్లని వా రికి ఈనెల 20న మాప్అప్ డే నిర్వహిస్తున్నామని ఆమె ప్రకటించారు. -
ప్రాణదాతలకు సలాం!
పునర్జన్మ అవయవదానం మహోన్నతమైనది. ఒకరు దానం చేస్తే 8 మందికి పునర్జన్మ దక్కుతుంది. జిల్లాలో అవయవదానాలు పెరుగుతుండడం శుభపరిణామం. అయితే చాలామందిలో అపోహలు ఉన్నాయి. అయితే ఆపదకాలంలో ఉన్నవారికి తమవారి అవయవాలు దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపవచ్చు. – ఫారుక్ హూస్సేన్, వైద్యాధికారి, హిరమండలం పీహెచ్సీ ● జూలై 29న కోటబొమ్మాళి మండలం నిమ్మాడ జంక్షన్కు చెందిన పినిమింటి శ్రీరామ్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే రాగోలు జెమ్స్కు తీసుకొచ్చారు. ఆయన బ్రెయిన్డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను తరలించారు. ● ఈ నెల 7న ఒడిశాలోని రాణిపేట గ్రామానికి చెందిన లెంక రవణమ్మ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు రాగోలు జెమ్స్కు తీసుకురాగా బ్రెయిన్డెడ్గా చెప్పారు. వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు ఆమె అవయవదానానికి అంగీకరించారు. దీంతో గ్రీన్చానెల్ ద్వారా అవయవాలను ఇతర ప్రాంతాలకు తరలించారు. -
జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలి
ఆమదాలవలస: పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిందని మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయార ని అన్నారు. ఆయన మంగళవారం ఆమదాలవలసలో విలేకరులతో మాట్లాడారు. పక్క నియోజకవర్గాల నుంచి టీడీపీ గూండాలను దించి ఓటు వేయకుండా చేశారని విమర్శించారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాల్సిన పోలీస్ ఉన్నతాధికారులు ప్రేక్షక పాత్ర వహించటం దారుణమని అన్నారు. కడప వైఎస్సార్ సీపీలో కీలకంగా ఉన్న వై ఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం దారుణమన్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నికలను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు జరిగిన తీరును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యా న్ని పరిరక్షించాలంటే, ఉప ఎన్నికలను రద్దుచేసి, మరోసారి ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించాలని తమ్మినేని డిమాండ్ చేశారు. -
అవినీతి అనకొండలు
పొందూరులో పైడికొండ దుస్థితి ఇది. కూట మి ప్రభుత్వం వచ్చాక జరిపిన తవ్వకాలతో ఎలా అయిపోయిందో చూడండి. అక్రమార్కులకు దోపిడీ కొండగా మారిపోయింది. రాత్రి పగలు తేడా లేకుండా ఎర్ర మట్టి, గ్రావెల్ తరలించుకునిపోతున్నారు. పక్కనున్న కాలనీలు ఏమైపోయినా ఫర్వాలేదు...మా జేబులు నిండితే చాలు అని రెచ్చిపోతున్నారు. ● కొండలకు గుండు కొడుతున్నారు ● కూటమి ప్రభుత్వం వచ్చాక రెచ్చిపోయిన గ్రావెల్ మాఫియా ● అధికారం అడ్డం పెట్టుకుని దర్జాగా తవ్వకాలు ● సొమ్ము చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు ● కరిగిపోతున్న కొండలు ఈ కొండ చూడండి.పలాస–కాశీబుగ్గలో ఉన్న సూదికొండ పరిస్థితి. కొండ దాదాపు కనుమరుగై శిఖరమే మిగిలి ఉంది. అధికార యంత్రాంగం మరికొంత కాలం చోద్యం చూస్తే ఆ శిఖరం కూడా పూర్తిగా కనుమరుగు కానుంది. పొక్లెయినర్లతో తవ్వి పట్ట పగలే గ్రావెల్, కంకర తరలించుకుపోతున్నారు. రణస్థలం మండలం సంచాం కొండ ఇది. కొండ చుట్టూ గొరికేశారు. ఒక ఎమ్మెల్యే ఏకంగా తన కళాశాల ముందు ఉన్న ప్రాంగణం చదును చేసేందుకు ఈ కొండను పూర్తిగా వాడుకున్నారు. ఇక్కడ తవ్వకాలు జరిపి తన కళాశాల లోతట్టు ప్రాంగణాన్ని సరిచేసుకున్నారు. ఆ ఎమ్మెల్యే బాటలోనే మిగతా తమ్ముళ్లు తవ్వకాలు జరుపుకుని సొమ్ము చేసుకుంటున్నారు. కొండ ములగాం పంచాయతీలోని ముక్తుంపురం కొండ ఇది. దర్జాగా తవ్వుకుని తీసుకెళ్లిపోతున్నారు. ఇప్పటికే ఒకవైపు మింగేశారు. మిగతాది కూడా తవ్వేసే పనిలో ఉన్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి నాయకుల దెబ్బకు కొండలు కరిగిపోతున్నాయి. రణస్థలం మండలంలోని అక్కయ్యపాలెం కొండ, లావేరు మండలంలోని సూర్యనారాయణపురంలో గల తామరకొండ, పలాస, కాశీబుగ్గలోని నెమలి కొండ, కోటబొమ్మాళికి ఆనుకుని కొత్తపేట కొండ.. ఇలా ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఏ కొండనూ తెలుగు తమ్ముళ్లు వదలటం లేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కొండలపై వాలిపోయారు. అధికారం అడ్డం పెట్టుకుని ఎక్కడికక్కడ కొండలను చెరబట్టారు. జిల్లాలో ఎటు చూసినా కొండలు, గుట్టలకు గుండు కొట్టే కార్యక్రమం కొనసాగుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. పర్యావరణానికి హాని తలపెడుతూ.. మరో వైపు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ.. తమ జేబులు నింపుకుని ప్రకృతి మాతకు మానని గాయాలు మిగుల్చుతున్నారు. భావితరాలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ప్రకృతి పరిరక్షణలో కొండలూ కీలకం. ఇప్పుడా కొండల్నే కూటమి పాలనలో లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజలకు చెందాల్సిన సహజ వనరులను కొందరు నిరంతరాయంగా నమిలి మింగేస్తున్నారు. వీరి ధాటికి సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి అక్రమార్కులు దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. జిల్లాలో గ్రావెల్ మాఫియా బరి తెగించింది. సహజ వనరులను ధ్వంసం చేస్తోంది. తమకెవరూ అడ్డు రారనే చందంగా వ్యవహరిస్తోంది. దీంతో కంకర రాశులతో ఉండే కొండలు కరిగిపోతున్నాయి. వందలాది టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ తవ్వి తరలిస్తుండటంతో కొండలు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఇన్ని కుతంత్రాలా..?
నరసన్నపేట: కడప జిల్లాలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కూటమి నాయకుల వైఖరిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తీవ్రంగా ఖండించారు. దౌర్జన్యాలు, అక్రమాలు, ఓటర్లను భయపెట్టడాలు, వైఎస్సార్సీపీ నాయకుల అక్రమ అరెస్టులపై ఆయన ధ్వజమెత్తారు. ‘ఎన్నికలు ఎందుకు నిర్వహించడం.. జెడ్పీటీసీలను నామినేట్ చేసుకోండి.. ఎన్నికల పేరిట ఇంతకు దిగజారాలా’ అని ప్రశ్నించారు. ఆయన మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తీవ్రంగా విమర్శించారు. జెడ్పీటీసీ అభ్యర్థిని కూడా ఓటు వేయనీయకుండా అడ్డుకోవడం దిగజారిన పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. చంద్రబాబు పాలన హిట్లర్ నియంత పాలన ను మరిపిస్తోందన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం, పోలీసు బలగాలు టీడీపీ నాయకులకు కొమ్ము కాయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఎరువు అందక, నీరు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతుంటే కూటమి నాయకులు సంబరాల ర్యాలీలు చేయడం వారి పైత్యానికి నిదర్శనమన్నారు. -
ఆగిన ఆశల సౌధం..!
జిల్లాలో గత ప్రభుత్వంలో... ● మంజూరైన మొత్తం ఇళ్లు – 81,262 ● జగనన్న కాలనీ లే అవుట్లు – 784 ● జగనన్న కాలనీల్లో మంజూరైన ఇళ్లు – 33,295 ● పలు స్కీముల ద్వారా మంజూరైన ఇళ్లు – 47,967 ● నిర్మాణం పూర్తయిన ఇళ్లు – 44,930 ● పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు – 36,332 ● పనులు ప్రారంభం కాని ఇళ్లు – 17,268 ● బేస్మెంట్ లెవెల్లో ఉన్న ఇళ్లు – 7,921 ● ఆర్ఎల్ స్థాయిలో ఉన్న ఇళ్లు – 4,434 ● గుంతల తవ్వి వదిలేసిన ఇళ్లు – 3,930 ● శ్లాబ్ పూర్తయిన ఇళ్లు – 2,772 వజ్రపుకొత్తూరు రూరల్: ప్రతి పేదవాడికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదలకు ఇంటిస్థలం అందించి జగనన్న కాలనీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందజేయడంతో పాటు నిర్మాణాలకు సంబంధించి మహిళలకు రుణ సదుపాయం సైతం అప్పటి ప్రభుత్వం కల్పించింది. దీంతో కాలనీల్లో వేగవంతంగా నిర్మాణాలు చేపట్టారు. చాలామంది ఇళ్లను నిర్మించుకొని సొంతిట్లో ఆనందంగా గడుపుతున్నారు. అలాగే సొంత స్థలాల్లో సైతం పలువురు ఇళ్ల నిర్మాణాలకు పూనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదల ఇళ్లపై శీతకన్ను వహిస్తోంది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కొంతమంది లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న తరుణంలో ఎన్నికలు వచ్చాయి. అయితే అనంతరం వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లుల చెల్లింపుల్లో మోకాలడ్డుతోంది. దీంతో ప్రస్తుతం లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో... వైఎస్సార్సీపీ హయాంలో జిల్లావ్యాప్తంగా 81,262 మంది లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేశారు. ప్రభుత్వం గృహ నిర్మాణశాఖ ద్వారా రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసింది. అలాగే ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.1.80 లక్షలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. అంతేకాకుండా మహిళా సంఘాల నిధుల్లో మహిళ లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా మరో రూ.35 వేల రుణ సదుపాయం కల్పించింది. అలాగే ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ను తక్కువ ధరలో అందించారు. నాణ్యమైన ఇంటి సామాగ్రిని సైతం అందించి లబ్ధిదారులకు అండగా నిలిచింది. దీంతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపి, శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు. వెబ్సైట్లో మార్పు.. లబ్ధిదారుల నిట్టూర్పు గత ప్రభుత్వం వినియోగించిన గృహ నిర్మాణశాఖ వెబ్సైట్ను అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం లాక్ చేసింది. వెబ్సైట్ను సైతం మార్పులు చేసి లబ్ధిదారులకు నిట్టూర్పు మిగిల్చింది. లబ్ధిదారుల దరఖాస్తు, ఎంపిక, బిల్లు చెల్లింపులో జాప్యం కలిగేలా ప్రభుత్వ వైఖరి ఉందని, దీంతో తమ సొంతింటి కల నెరవేరడం లేదని పలువురు అందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి కొత్త ఇళ్లను మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న బిల్లును అందించాలని కోరుతున్నారు. డిసెంబర్లోగా పూర్తి చేయాలి ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు డిసెంబర్లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి. ఇళ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం అందించిన రూ.1.80 లక్షలతో పాటు అదనంగా బీసీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.50 వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75 వేలను ప్రస్తుత ప్రభుత్వం అందిస్తుంది. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇళ్లు నిర్మాణం చేస్తే బిల్లులు అందిస్తున్నాం. – అప్పారావు, గృహ నిర్మాణశాఖ పీడీ, శ్రీకాకుళం కూటమి ప్రభుత్వంలో ఆగిన ఇళ్ల నిర్మాణాలు కొత్త ఇళ్ల మంజూరుకు మోకాలడ్డు నిర్మాణాలకు బిల్లుల చెల్లింపులు నిలిపివేత జగనన్న కాలనీలపై వివక్ష లబోదిబోమంటున్న లబ్ధిదారులు కాలనీలపై కూటమి కక్ష జగనన్న కాలనీల్లో కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి చేపడుతున్న నిర్మాణాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బిల్లుల చెల్లింపులు లేకపోవడంతో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేకపోవడంతో ఇంటి నిర్మాణాలు ప్రస్తుతం మొండి గోడలతో దర్శనమిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఇంటి నిర్మాణాలు జరగని కొన్నిచోట్ల ఆ స్థలంపై కూటమి నాయకుల కన్ను పడింది. వాటిని కబ్జా చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కొంతమంది లబ్ధిదారుల నుంచి చౌకగా ఇంటి స్థలాన్ని లాక్కొనే ప్రయత్నాలు కుడా జరుగుతున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించుకుండా కూటమి ప్రభుత్వం వివక్ష చూపుతోంది. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని నర్శిపురం గ్రామానికి వెళ్లే అప్రోచ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలి నుంచి నర్శిపురం గ్రామం వైపు కె.రాజా, ఎ.రాము అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెళ్తూ నర్శిపురం అప్రోచ్ రోడ్డులోకి తిరుగుతున్న సమయంలో, అదే మార్గంలో మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న పి.సుమంత్, ఆర్.రోజాలను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్ర వాహనాలపై ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతదేహం కలకలం పలాస: పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలోని పెంటభద్ర గ్రామానికి వెళ్లే దారిలో కుంకుమ సాగరం వద్ద సోమవారం గుర్తు తెలియని ఒక మృతదేహాన్ని స్థానికులు చూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి పలాస ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసి కాశీబుగ్గ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. -
అర్జీలు సత్వరమే పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీలు పెండింగ్లో లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో 86 వినతులు స్వీకరించారు. వీటిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, రెవెన్యూ (సీసీఎల్ఏ) విభాగం, వ్యవసాయ శాఖ, ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్, సర్వే, ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్, మున్సిపల్ యాజమాన్యం, సామాజిక సంక్షేమం, ఎండోమెంట్స్, నీటిపారుదల, పరిశ్రమలు, గృహ నిర్మాణం, సమగ్ర శిక్ష, ప్రజారోగ్యం, నైపుణ్యాభివద్ధి, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామ వలంటీర్లకు సంబంధించిన వినతులు ఉన్నారు. స్వీకరించిన అన్ని వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదులను పరిశీలిస్తే... ● వంశధార కాలువ ద్వారా పలాస నియోజకవర్గంలోని శివారు ప్రాంతాలకు సాగునీరు రావడం లేదని, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కాలువ నీరు ఎంతో అవసరం ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. తమ నియోజకవర్గానికి కాలువ ద్వారా సాగునీరు అందించాలని కోరారు. ఎగువనున్న నరసన్నపేట, టెక్కలి ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో కాలువ గేట్లు రాత్రికి రాత్రి ఎత్తివేసి, పలాస నియోజకవర్గానికి సాగునీరు రాకుండా చేస్తున్నారని ఆమె వాపోయారు. ● శ్రీకాకుళం పట్టణంలోని సర్వే నంబర్ 190/2లో ప్రభుత్వ పురుషుల డిగ్రీ రోడ్డులో వికాస్ స్కూల్ దగ్గర బలగ వార్డు స్థలంలో డాక్టర్ గొండు గంగాధర్ అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని, నిర్మాణ పనులు ఆపమని ఉన్నత న్యాయస్థానం చెప్పినా పట్టించుకోవడం లేదని శాంతి నగర్కు చెందిన లోతుగెడ్డ కృష్ణవేణి భర్త లోతుగెడ్డ శ్రీరామ దూతం గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. గంగాధర్ స్థానిక ఎమ్మెల్యే సోదరుడు కావడంతో అధికారులు సహకరిస్తున్నారని, అందువలన నిర్మాణ పనుల నిలుపుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. ● శ్రీకాకుళం మండలం బలగ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 1/4, 1/5 లో ఉన్న కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బలగకు చెందిన బోనెల చిరంజీవి గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. సుమారు 1.80 ఎకరాల నాగావళి వరద గట్టు (ప్రభుత్వ భూమి)కి కంచె వేసి కబ్జా చేశారని తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పీజీఆర్ఎస్కు 86 వినతులు సామాన్యులకు ఇబ్బందులు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు నేరుగా జిల్లా పరిషత్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వచ్చి వారి ఫిర్యాదులు ఇచ్చి వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ వారు నేరుగా జెడ్పీ సమావేశ మందిరంలోని వెయిటింగ్ హాల్లో కలెక్టర్, జేసీను ఉంచి వారి ఫిర్యాదులను వివరిస్తే.. ప్రజాప్రతినిధుల కోసం గంటల సమయం కేటాయిస్తే మిగిలిన సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పవు. అదే పరిస్థితి ఈ సోమవారం పీజీఆర్ఎస్లో చోటు చేసుకుంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పలు ఫిర్యాదులతో గ్రీవెన్స్ జరుగుతున్న సమయంలో జిల్లా పరిషత్కు రావడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వెయిటింగ్ హాల్కు ఆయన కోసం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు వెళ్లి సుమారుగా గంట కాలం వెచ్చించారు. దీంతో వచ్చిన అర్జీదారులు ద్వితీయ స్థాయి అధికారులకు వారి సమస్యలు విన్నవించుకునేందుకు ఇష్టపడక గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సైతం అర్జీ ఇచ్చేందుకు వచ్చి దాదాపు 30 నిమిషాలు పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. -
బైకు అడ్డగించి దాడి
గార: మండలంలోని నిజామాబాద్ గ్రామానికి చెందిన బుగత రాజారావు సోమవారం తెల్లవారుజామున సతివాడ శివాలయానికి వెళ్లి వస్తుండగా కొందరు వ్యక్తులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజారావు దర్శనం పూర్తి చేసుకొని బైక్పై వస్తుండగా సతివాడ జంక్షన్ సమీపంలో అదే గ్రామానికి చెందిన కాళ్ల వరాలు, కాళ్ల శేఖర్, మరో ఇద్దరు వ్యక్తులు కత్తి, కర్రలతో దాడి చేశారు. ఆ సమయంలో గుడికి వెళ్లేందుకు భక్తులు రావడం గమనించి వదిలేశారు. బాధితుడికి చెవి, ఎడమ కన్ను, ముఖంపై గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత రెండేళ్లుగా భూమి విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నడుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్ గంగరాజు తెలిపారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి హిరమండలం: రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ఎకరాకు 25 కిలోల యూరియా అందించాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం ఏంటని ప్రశ్నించారు. గొట్టా బ్యారేజీలో నీటి స్థిరీకరణలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులకు ఇబ్బంది లేకుండా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులను కూటమి ప్రభుత్వ దారుణంగా వంచించిందని విమర్శించారు. ఇప్పటికై నా పూర్తిస్థాయిలో ఎరువులు అందించకపోతే, వైఎస్సార్సీపీ తరుపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మెరుగైన వైద్య సేవలు అందజేయాలి టెక్కలి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. సోమవారం టెక్కలి జిల్లా ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అన్ని విభాగాలను పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై రోగులతో మాట్లాడారు. అలాగే వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మెరుగైన వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో సిబ్బందితో మాట్లాడారు. ఆయనతో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యారావు, నాయకులు బి.శేషగిరి, కె.లవకుమార్, ఎం.రాము తదితరులు ఉన్నారు. ‘27లోగా దరఖాస్తు చేయండి’ అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో ధర్మకర్తల పాలకమండలి నియామకాలకు దేవదాయ శాఖ నోటిఫికేషన్ను ఈనెల 7న విడుదల చేసిందని, ఈ మేరకు ఆసక్తి గలవారు ఈనెల 27లోగా తమ దరఖాస్తులను ఆలయానికి సమర్పించాలని ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ తెలియజేశారు. ధర్మకర్తలకు కచ్చితమైన అర్హతలుంటాయని, వీటి ప్రొఫార్మా–2 ప్రకారం దరఖాస్తులను అన్ని ధ్రువపత్రాలతో సహా కార్యాలయానికి స్వయంగా గానీ పోస్టల్ రూపంలో గానీ అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయ కార్యాలయ అడ్రస్కు పంపించాలని కోరారు. మరిన్ని వివరాలకు 9491000708, 8978914660 నంబర్లకు సంప్రదించాలని ఆయన తెలియజేశారు. తాడేపల్లిలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య సంఘం ధర్నా రేపు శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 13న తాడేపల్లిలోని సోషల్ వెల్ఫేర్ కార్యాలయం వద్ద శాంతియుత ధర్నా నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి.జయరాం, ప్రధాన కార్యదర్శి పి.పెద్దిరాజు, గౌరవాధ్యక్షుడు కె.గుండారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండేళ్లుగా మూడు విడతల ఆర్టీఎఫ్, 2024–25 విద్యాసంవత్సరానికి గాను మూడు విడతల ఆర్టీఎఫ్ కలిపి మొత్తంగా ఆరు విడతల ఆర్టీఎఫ్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం విచారకరమన్నారు. ఈ విషయమై కూటమి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేని పక్షంలో బుధవారం ధర్నా చేయనున్నామని తెలిపారు. మహిళ మెడలో చైన్ చోరీ రణస్థలం: మండలంలోని అర్జునవలస పంచాయతీ పరిధి గిడిజాలపేట పరిధిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో గుర్తు తెలియని వ్యక్తి చైన్ లాక్కొని పరారైనట్లు జేఆర్పురం పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి చెందిన అలిగిరి శ్రీజ విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మహారాజ కళాశాలలో హోమియోపతి నర్సింగ్ చదువుతోంది. శ్రీకాకుళంలోని ఇంటి నుంచి స్కూటీపై బయల్దేరిన శ్రీజ రణస్థలం మండలంలోని అర్జునవలస పంచాయతీ పరిధి గిడిజాలపేట రహదారిపై వెళ్తుండగా, సాయంత్రం 5 గంటల సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి మెడలోని తులం బంగారం చైన్ లాక్కొని నెల్లిమర్ల వైపు పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలియజేశారు. -
పోలీసుల అదుపులో నిందితులు..?
సాక్షి టాస్క్పోర్స్: పాతపట్నం మేజర్ పంచాయతీ మొండిగల వీధికి చెందిన నల్లి రాజు మృతదేహం ఈనెల 7వ తేదీన అనుమానాస్పద స్థితిలో దొరికిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు గత ఐదు రోజులుగా పలు కోణాల్లో దర్యాప్తు చేయడంతో కేసు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పోలీసు అదుపులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఒక మహిళతో పాటు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గంజాయితో ఇద్దరు అరెస్టు టెక్కలి రూరల్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకులను సోమవారం టెక్కలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గుణుపూర్కు చెందిన విశాల్ కేశరి సమాల్, మూనలిమ్మ అనే ఇద్దరు వ్యక్తులు కొరాపుట్కు చెందిన ముఖేష్ బాగ్ అనే వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేశారు. అనంతరం గుణుపూర్ నుంచి ట్రైన్లో టెక్కలి వచ్చి అక్కడి నుంచి విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ముందస్తు సమాచారం మేరకు సీఐ తన సిబ్బందితో కలిసి రైల్వేగేటు సమీపంలోని బాపినాయుడు కాలనీ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వారి వద్ద నుంచి 9.25 కేజీల గంజాయి పట్టుబడింది. వీరు గోవాకు చెందిన వినాయక్ బాలచంద్ర చౌహాన్ అనే వ్యక్తికి ఈ గంజాయి అప్పగించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కిక్ బాక్సింగ్లో సత్తా పొందూరు: మండలంలోని రాపాక గ్రామానికి చెందిన ఎచ్చెర్ల కీర్తన కిక్ బాక్సింగ్లో సత్తా చాటింది. ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ బాక్సింగ్ హాల్లో హెచ్సీజీ క్యాన్సర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–10 బాలికల విభాగంలో కీర్తన ప్రతిభ కనపరిచి రెండో స్థానం కై వాసం చేసుకుంది. ఈ బాలికకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మెడల్, బహుమతులను సోమవారం శ్రీకాకుళంలో అందించారు. చిన్నారి ఎచ్చెర్ల గురుకులంలో 5వ తరగతి చదువుతోంది. -
ఎస్పీ గ్రీవెన్సుకు 43 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 43 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ కాల్ ద్వారా తక్షణమే తెలియజేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకూడదని, వాటిపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక అందజేయాలని ఆదేశించారు. -
అనాథల దత్తతపై అవగాహన
కళకళలాడిన ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సోమవారం ప్రయాణికులతో కళకళలాడింది. శుక్రవారం వరలక్ష్మి వ్రతం, రెండో శనివారం, ఆదివా రం వరుసగా మూడు రోజులపాటు సెలవులు కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులు తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో కాంప్లెక్స్ కిటకిటలాడుతూ కనిపించింది. –శ్రీకాకుళం అర్బన్శ్రీకాకుళం పాతబస్టాండ్: అనాథ పిల్లలకు కుటుంబ సంరక్షణ కల్పించే ఉద్దేశంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దత్తతపై అవగాహన పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమాన్ని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత శాఖ మిషన్ వాత్సల్య పథకం కింద నిర్వహిస్తోంది. జిల్లా పరిషత్ సమా వేశ మందిరంలో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ ఈ పోస్టర్ను విడుదల చేశారు. తల్లిదండ్రులు లేని లేదా సంరక్షణ అవసరమైన పిల్లలకు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కుటుంబ పెంపకం అందించే విధానమే పోస్టర్ కేర్ అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వివరించారు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా స్థిరంగా ఉన్న దంపతులు లేదా ఒంటరి మహిళలు/పురుషులు ఈ పిల్లలకు తమ ఇంట్లో ఆశ్రయం కల్పించి, వారికి ప్రేమ, ఆప్యాయత, భద్రత ఇవ్వవచ్చని తెలిపారు. దత్తత విధానం పోస్టర్ కేర్లో కనీసం రెండేళ్ల పాటు పెంచిన పిల్లలను, నిర్దేశిత ప్రభుత్వ నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం శాశ్వతంగా దత్తత తీసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. భారతీ య పౌరులైన దంపతులు లేదా ఒంటరి మహిళ/పురుషులు అర్హులని తెలిపారు. దరఖాస్తుదారులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని, ఎలాంటి నేర చరిత్ర ఉండరాదని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా బాలల రక్షణ అధికారి 7901597211, రక్షణాధికారి (ఎన్.ఐ.సి.) 9849530982, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 లను సంప్రదించాలని సూచించారు. -
శ్రీకాకుళం
ఆగిన ఆశల సౌధంపేదల కల కలగానే మిగిలిపోతోంది. కూటమి ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. –8లోకొండను కొల్లగొడుతున్నారు మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025● 75 ఏళ్ల శ్రీకాకుళం జిల్లా ●సరిగ్గా స్వాతంత్య్ర దినోత్సవం నాడే జిల్లా అవతరణ ఈ నేలకు గర్జించడం తెలుసు. ఈ మట్టికి శాంతి ప్రబోధించడం తెలుసు. ఈ గడ్డకు రోదించడం తెలుసు. ఈ భూమికి ఎదురించడమూ తెలుసు. శ్రీకూర్మ క్షేత్ర వైభవాన్ని ఈ ప్రాంతం చూసింది. శ్రీకాకుళం సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. అపురూప ఆదిత్య ధామంగా విరాజిల్లింది. జనం అమాయకులనే అపవాదును తరాల తరబడి మోసింది. గిడుగు వారి హయాం నుంచి అక్షరాన్ని కాపాడుతోంది. 75 ఏళ్లకు పూర్వం ఓ సూర్యాస్తమయాన ‘శ్రీకాకుళం’ పురుడు పోసుకుంది. 75 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఉత్థానపతనాలు చూసింది. కాలం రాసిన శ్రీకాకుళం కథ ఎప్పటికీ నిత్య నూతనమే. ఆ కాలాన్ని ఓ సారి వెనక్కి తిప్పితే.. – అరసవల్లి నాటి జిల్లా కలెక్టర్ కార్యాలయం (ప్రస్తుతం జిల్లా కోర్టు ఆవరణలో ఉన్న పాత భవనం) దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రత్యేక జిల్లాల కోసం ఉద్యమాలు పలు చోట్ల జరిగాయి. ప్రత్యేకంగా ఆంఽధ్ర ప్రాంతంలో అప్పటి వరకు వైజాగ్ జిల్లాలో భాగంగా ఉన్న శ్రీకాకుళంను ప్రత్యేక జిల్లా చేయాలంటూ 1948 నాటికే ఈ ప్రాంత నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. 1948 ఫిబ్రవరిలో శ్రీకాకుళం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా..జిల్లా కేంద్రం ఎంపికలో మాత్రం జాప్యం జరిగింది. ఈ క్రమంలో 1950 జులైలో అప్పటి రెవెన్యూ మంత్రి హెచ్.సీతారామ రెడ్డి శ్రీకాకుళంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 1950 ఆగస్టు 15న సూర్యాస్తమయ సమయంలో పెట్రో మాక్స్ లైట్ల వెలుగులో శ్రీకాకుళం అవతరించింది. 1950 ఆగస్టు 15న సాయంత్రం 4.30 గంటల సమయంలో జిల్లా అవతరణ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ అహ్మద్ తన నివాసం నుంచి ప్రస్తుతం జిల్లా కోర్టు భవన సముదాయంలో ఉన్న కలెక్టర్ కార్యాలయానికి బయల్దేరారు. దారి మధ్యలో ఆయన వాహనం చెడిపోవడంతో మరో వాహనంలో ఎక్కి వచ్చేసరికి సూర్యాస్తమయమై చీకటి అలముకుంది. అప్పటికప్పుడు పెట్రోమాక్స్ లైట్లలో అవతరణ కార్యక్రమాన్ని నాటి కలెక్టరేట్ (నేడు జిల్లా కోర్టు పాత భవనం) వద్ద ఘనంగా జరిపించారు. వేలాది మంది శ్రీకాకుళం వాసులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవంతో పాటు జిల్లా ఆవిర్భావ దినోత్సవం జరిపే అపురూప అవకాశం దక్కింది. ఉద్యమాల గడ్డగా ప్రసిద్ధి గాంచిన శ్రీకాకుళం జిల్లా అవతరించి 75 వసంతాలు పూర్తయ్యాయి. సామాజికంగా, రాజకీయంగా ఎంతో చరిత్ర కలిగిన శ్రీకాకుళం జిల్లా అవతరణ వెనుక ఎంతో ఘన చరిత దాగుంది. ●కుతుబ్షాహీల పాలనలో ‘చికాకోల్’ ఫౌజ్దారీ కేంద్రంగా ఏర్పాటైంది. దీని పరిధిలో ప్రస్తుత శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలుండేవి. 1758లో విజయనగర జమిందార్ ఒత్తిడిపై ఇంగ్లిష్ సైన్యం తొలిసారి విశాఖపట్నంలో అడుగు పెట్టింది. ●1759లో ఫౌజ్దారీ పాలనను అంతం చేసి బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైంది. ●1769 జూలై 27న ‘వైజాగ్ పట్నం’ పేరుతో వారు ఒక జిల్లాను ప్రకటించి, జిల్లా కేంద్రంగా విశాఖపట్నాన్ని ప్రకటించుకున్నారు. ఈ కొత్త జిల్లాలో ప్రస్తుత ఉత్తరాంఽధ్రతో పాటు ఒడిశాలోని గంజాం జిల్లా దక్షిణ భాగం కూడా చేర్చారు. ●అప్పట్లో దేశంలోనే ఇదో అతి పెద్ద జిల్లాగా గుర్తింపు పొందింది. 1801లో కలెక్టర్ల పాలన జిల్లాలో ప్రారంభమైంది. భాష పేరుతో దేశాన్ని విభజించి పాలించడానికి బ్రిటిష్ పాలకులు నిర్ణయించి, 1936లో ఉమ్మడి మద్రాస్–ఒడిశా రాష్ట్రాలను విభజించారు. ●అయితే ఆంధ్రా, ఒడిశాల మధ్య సరిహద్దుల నిర్ణయం అప్పట్లో చర్చనీయాంశమైంది. ●విశాఖ, గంజాం జిల్లాలను ఒడిశాలో కలపాలని ప్రతిపాదించారు. దీనికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతంలో ‘వందేమాతరం–మనదే రాజ్యం’ అనే నినాదంతో ప్రత్యేక ఉద్యమం మొదలైంది. ●ప్రత్యేకంగా బరంపురం, పర్లాఖిమిడి ప్రాంతాలు తెలుగు వారివే అని, వాటిని ఒడిశాలో చేర్చకుండా అడ్డుకోవాలని ఆంధ్రా నాయకులు నిశ్చయించుకున్నారు. ●‘శ్రీకాకుళం నుంచి శ్రీ పర్వతం దాకా తెలుగు వీర పవిత్ర తీర్థాలు సేవింప..’ అంటూ మహాకవి వెంకటరత్నం ఒక పాటను రచించి, తెలుగు వారి ఉద్యమాన్ని ఉత్తేజపరిచారు. ●పర్లాఖిమిడి జమిందార్, బ్రిటిష్ అధికారులతో చేతులు కలిపినట్లు తెలియగానే, తెలుగు వారి ఆందోళన తీవ్రమైంది. ●పర్లాఖిమిడి, బరంపురంలను ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించకపోతే, కటకం (కటక్) వరకు అడుగుతామని పేచికి దిగారు. ●వాడుక భాష కోసం పోరాటం జరిపిన గిడుగు రామ్మూర్తి పంతులు పోరాటానికి నడుం కట్టారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన ‘ఓడొనెల్ కమిటీ’ ముందు పర్లాఖిమిడితో పాటు ఆ పరిసరాలన్నీ ఆంధ్రాకు చెందాలంటూ రామ్మూర్తి పంతులు గట్టిగా వాదించారు. ●దీంతో జమిందార్ ఆగ్రహించి 1932 ఫిబ్రవరిలో పంతులు కుమారుడు సీతాపతిని ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ పంతులు సీతాపతిని ఎన్నికల్లో దించి పర్లాకిమిడి జమిందార్ బలపరిచిన అభ్యర్థులపై గెలిపించారు. ●సీతాపతి అప్పట్లో లండన్ వెళ్లి మరీ బ్రిటిష్ వారి ముందు తన వాదన వినిపించారు. కానీ జమిందార్లతో బ్రిటిష్ వారికి ఆ రోజుల్లో ఉన్న అవగాహన వల్ల పర్లాఖిమిడితో పాటు ఆ తాలూకాలోని మూడో వంతు ప్రాంతాన్ని ఒడిశాలో ఉంచుతూ నిర్ణయించారు. ●1936లో ఒడిశా రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైన తర్వాత రామ్మూర్తి పంతులు కలత చెంది వచ్చేశారు. హైకోర్టులో కేసు వేశారు కింజరాపు కుటుంబీకుల కనుసన్నల్లోనే గ్రావెల్ను అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలించుకుపోతున్నారు. లీజుదారుడైన నన్ను సంప్రదించకుండా దౌర్జన్యంగా గ్రావెల్ను తీసుకువెళ్తున్నారు. జిల్లా మైన్స్ విజిలెన్స్, రెవెన్యూ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనిపై హైకోర్టులో కేసు వేశాను. – మండపాక నర్సింగరావు, లీజు దారుడు, వల్లే వలస ●ఇంటింటా తిరంగా..!న్యూస్రీల్ఆ రోజే ప్రత్యేకం.. -
మహిళల పాలిట శాపంగా కూటమి పాలన
శ్రీకాకుళం(పీఎన్కాలనీ ) /ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రా న్ని చంద్రబాబు ప్రభుత్వం మద్యాంధ్రప్రదేశ్గా మార్చేసి గుడి, బడి, నివాస గృహాలు అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు మద్యం అమ్మకాలు సాగిస్తూ లక్షలాది కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతిదివ్య ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశా రు. విచ్చలవిడిగా మద్యం తాగేవారు ఎక్కువ కావడంతో మహిళలు రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో 33 శాతం మద్యం షాపులు తగ్గించడంతో పాటు అనుబంధంగా ఉన్న పర్మిట్ రూమ్లు సైతం తగ్గించేశారని గుర్తు చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఆంక్షలు విధించడం సరికాదన్నారు. అన్ని బస్సుల్లోనూ ప్రయాణానికి ఆంక్షలు కల్పించాలని కోరారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం సీఎం చంద్రబాబు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొన్నారు.తీరంలో మృతదేహం కలకలంసరుబుజ్జిలి : వంశధార నదీ తీరప్రాంతంలోని తెలికిపెంట బ్రిడ్జి వద్ద ఆదివారం గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడికి తెచ్చి పాతిపెట్టినట్లు పుకార్లు వ్యాపించాయి. ఈ సమయంలో సమయంలో పోలీసులు రావడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. జలుమూరు మండలం కొండకామేశ్వరపేటకు చెందిన ఓ బిచ్చగాడు అనారోగ్యంతో మృతిచెందాడు. వంశధార ఆవలి ప్రాంతం సక్రమంగా లేకపోవడంతో తెలికిపెంట బ్రిడ్జి సమీపంలో దహనక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈలోగా తెలికిపెంట గ్రామస్తులకు సమాచారం వెళ్లడంతో అక్కడ శవాన్ని ఇక్కడ తెచ్చి ఎలా దహనం చేస్తారని అభ్యంతరం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరుపక్షాలతో మాట్లాడారు. ఎవరికీ ఇబ్బందిలేని స్థలంలో దహన క్రియలు చేయించడంతో పరిస్థితి సద్దుమణిగింది.బలగలో చోరీశ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలో బలగలోని బండారువీధిలో ఓ వివాహిత ఇంట్లో చోరీ జరిగింది. శ్రీకాకుళం రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. బండారు వీధిలో సీపాన కోమలి తన కుమారునితో కలిసి ఉంటోంది. ఈ నెల 8న సాయంత్రం సత్యవరం నర్సంపేటలో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి కుమారునితో కలిసి వెళ్లింది. ఆదివారం ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నాయని పొరుగింటి వారు చెప్పడంతో కోమలి వెంటనే ఇంటికి వచ్చి చూసింది. బీరువా తలుపులు పగులగొట్టి ఉండటంతో పాటు అందులో 6 తులాల బంగారం, రూ.50వేలు నగదు లేకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఈశ్వరరావు పర్యవేక్షణలో క్లూస్ టీంతో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.బాలియాత్రకు పూర్వ వైభవంజలుమూరు: కార్తీక పౌర్ణమి అనంతరం జరగనున్న బాలియాత్రకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు తెలిపారు. ఆదివారం శ్రీముఖలింగంలో బాలియాత్ర నిర్వహణపై కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం పాటు జరిగే ఈ వేడుకలకు త్వరలోనే తేదీలు ఖరారు చేస్తామన్నారు. శ్రీముఖలింగంలో అన్ని కులాలను కలుపుకొని యాత్ర నిర్వహణపై చర్చించనున్నామన్నారు. సమావేశంలో సర్పంచ్ టి.సతీష్ కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ టి.బలరాం, వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామపెద్దలు బి.వి.రమణ, తేజేశ్వరరావు, వేణు, చింతాడ వెంకటరావు, హెచ్వీ దొర, శేషాద్రి వేంకటాచలం, ఉపాధ్యాయులు, అర్చకులు పాల్గొన్నారు. -
కుడ్యచిత్రాలు వారసత్వ సంపద
గార: శ్రీకూర్మనాథ దేవస్థానంలోని ప్రాచీన కుడ్య చిత్రాలు వారసత్వ సంపదని, వీటిని పరిరక్షించి భావితరాలకు అందించేలా చర్యలు చేపడతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఆదివారం దేవాలయంలో పునఃసృష్టి చేయబడిన కుడ్య చిత్రాలు ఫొటో ప్రదర్శన, మ్యూరల్స్ ఆఫ్ శ్రీకూర్మం టెంపుల్ పుస్తకావిష్కరణ జరిగింది. కుడ్య చిత్రాలను కాకినాడకు చెందిన చిత్రకారులు సుబ్రహ్మణ్యేశ్వరరావు నాలుగు సంవత్సరాలు పరిశోధన చేసి పుస్తక రూపంలోకి తీసుకురావడంతో వీటిని ప్రభుత్వ అనుమతితో ప్రదర్శన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వీటిని ఆర్కీయాలజీ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పునరుజ్జీవానికి చర్యలు చేపడతామన్నారు. ఇండిగో విమాన సంస్థ సీఎస్ఆర్ కింద రూ. 50 లక్షల నిధులతో శ్వేతపుష్కరిణి అభివృద్ధి చేస్తోందన్నారు. ముందుగా రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఈవో కె.నరసింహనాయుడు, ప్రముఖ శిల్పి దివిలి అప్పారావు, కోరాడ వెంకటరావు, వి.సింహాగిరి, మైగాపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రిమ్స్లో అరుదైన చికిత్స
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న రోగికి చికిత్స అందించి ప్రాణాలు నిలబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఇలాంటి క్లిష్టమైన చికిత్స జరగలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే... జూలై 8వ తేదీన సీతంపేటకు చెందిన సిద్ధమంగుల బారికి అనే 58 ఏళ్ల గిరిజన వృద్ధుడు తీవ్రమైన ఆయాసం, తలనొప్పితో పాటు చర్మం, నాలుక నీలం రంగులోనికి మారి రిమ్స్లో చేరాడు. అప్పటికే అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో రిమ్స్ వైద్యులు రోగికి వెంటిలేటర్ను అమర్చి ఆక్సిజన్ అందిస్తూ చికిత్స ప్రారంభించారు. రోగిని అప్పటికే చాలా ఆస్పత్రుల్లో చూపించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పడంతో రిమ్స్కు తీసుకువచ్చారు. అతనికి అప్పటికి రక్తంలో ఆక్సిజన్ శాతం 53 మాత్రమే ఉంది. రిమ్స్లోని వైద్యులు ఐసీయూలో ఉంచి మందులు ఇస్తూ ప్రయత్నం చేశారు. ఓ దశలో రక్తంలో ఉన్న ఆక్సి జన్ శాతం 87కు చేరినప్పటికీ, అది ఎక్కువ రోజు లు నిలబడలేదు. అప్పుడు రక్తాన్ని పరీక్ష నిమిత్తం విశాఖపట్నం పంపించారు. అక్కడ పరీక్షల్లో అతనికి ఉన్న వ్యాధి ‘మెథెమోగ్లోబినిమియా’గా నిర్ధారణ అయింది. అయితే అప్పటికే అతని పరిస్థితి కష్టతరంగా మారడంతో రిమ్స్లోని ఐదు విభాగా ల వైద్యులు పరస్పరం చర్చించుకున్నారు. రోగికి శరీరంలో ఉన్న రక్తమంతా తీసి వేస్తూ, మరో వంక కొత్త రక్తాన్ని ఎక్కించడం ద్వారా రోగి ప్రాణా న్ని రక్షించవచ్చునని భావించారు. అయితే ఈ సమయంలో రోగి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉండే అవకాశాలు ఉండడంతో, రోగి బంధువులతో మాట్లాడారు. పరిస్థితిని వారికి వివరించారు. ఏ రకమైన చికిత్స చేయకపోయినా వారం పది రోజుల్లో మృతి చెందే అవకాశం ఉండడంతో, బంధువులు చికిత్స జరపాలని వైద్యులను కోరారు. దీంతో వైద్యులు రంగంలోకి దిగి ఓ పక్క రక్తం ఎక్కిస్తూనే మరో వంక శరీరంలో ఉన్న రక్తాన్ని తొలగిస్తూ వచ్చారు. సుమారు 17 యూ నిట్ల రక్తం అంటే 4.2 లీటర్ల రక్తాన్ని ఎక్కించారు. అదే స్థాయిలో పాత రక్తాన్ని తొలగించారు. అటు తర్వాత రక్తంలో ఆక్సిజన్ శాతం పరీక్షించగా 97 శాతం చేరుకోవడం అది నిలకడగా ఉండడంతో, క్రమేపి వెంటిలేటర్ను అటు తర్వాత ఆక్సిజన్ తొలగించి పరీక్షించారు. అప్పుడు కూడా ఆక్సిజన్ శాతం తగ్గకపోవడంతో పూర్తిగా ఆక్సిజన్ తీసివేశారు. మళ్లీ పరీక్షించగా రక్తంలో ఆక్సిజన్ శాతం 97 ఉండడం పల్స్, బీపీ రేటు నిలకడగా ఉండటంతో జూలై 24న రోగిని డిశ్చార్జ్ చేశారు. జూలై చివరివారంలో రోగిని మరోసారి రప్పించి పరీక్షలు చేయగా అప్పుడు కూడా నిలకడగానే ఉండడంతో మళ్లీ ఇంటికి పంపించేశారు. ఈ నెల 5వ తేదీన మళ్లీ తనిఖీ చేయగా అతను ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు. మళ్లీ 15 రోజుల తర్వాత తనిఖీలకు రావాలని చెప్పి పంపించేశారు. రోగి మృతి చెందుతాడని భావించగా రిమ్స్ వైద్యులు విశేష సేవలు అందించి ప్రాణం నిలబెట్టారని వారికి బంధువులు ఆనందం వ్యక్తం చేస్తూ వైద్యు లకు కృతజ్ఞతలు తెలిపారు. రోగికి వైద్య సేవలు అందించి ప్రాణం నిలబెట్టిన ఎమర్జెన్సీ విభాగం పేథాలజీ విభాగం, నెఫ్రాలజీ విభాగం జనరల్ మెడిసిన్ విభాగం, బ్లడ్ బ్యాంక్ విభాగం వైద్యులను పలువురు అభినందించారు. ఐదు విభాగాల వైద్యుల కృషితో నిలబడిన ప్రాణం -
పట్టాదారులు.. ముగ్గురు
● స్థలం.. ఒకటి పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో భూ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉంది. ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్కడ పాగా వేసేస్తున్నారు. పాత జాతీయ రహదారి సమీపంలోని జీఎంఈ కాలనీ ఎదురుగా సుమారు రూ.కోటి 50లక్షలు విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీ డంపింగ్ యార్డుకు వెళ్లే రోడ్డు పక్కన ఇంగిలిగాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 292లో సుమారు 50 సెంట్లు భూమి ఉంది. కొన్నేళ్లుగా ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో పనికి రాని విధంగా ఉండేది. ఇటీవల ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు తొలగించి నేలను చదును చేసి దాని చుట్టూ గోడ నిర్మించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పాత జాతీయ రహదారికి ఆనించి ఉన్న ఈ భూమి నేడు కోట్లాది రూపాయలు విలువ చేస్తుండడంతో ఓ ముగ్గురు దానిపై కన్నేసినట్లు సమాచారం. వారంతా తమకు ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టాలు ఉన్నా యని చెబుతూ అక్కడ తగువులు పడుతుండటంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో తెలుగు దేశం పార్టీకి అనుకూలమైన నాయకుడు కూడా ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు పలాస తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అది తన స్థలమని, తన వద్ద పట్టా ఉందని చెబుతుండటం గమనార్హం. ఈ విధంగా ముగ్గురు వ్యక్తులు ఆ స్థలం కోసం గొడవలు పడి రోడ్డున పడటంతో అధికారులు కూడా స్థల పరిశీలన చేశారు. అయితే అక్కడ నిర్మాణంలో ఉన్న గోడ ఇప్పటికీ అలాగే ఉంది. ఆ స్థలం ఎవరిదన్నది నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. ఒక వేళ ఎవరికై నా ప్రభుత్వం పట్టా ఇచ్చి ఉంటే ఇంత వరకు ఆ స్థలాన్ని అలాగే పిచ్చి మొక్కలతో ఎందుకు వదిలేశారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలే అది ప్రభుత్వం భూమి. ముగ్గురికి పట్టాలు ఎలా ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పలాస సీతంతల్లి గుడికి వెళ్లే తోవలోని శ్రీనివాస్నగర్లో ఒక చెరువును పూర్తిగా ఆక్రమించి తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఇళ్లను నిర్మించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో కూడా రెవెన్యూ అధికారులు గానీ, మున్సిపల్ అధికారులు గానీ పట్టించుకోకపోవడం విశేషం. అలాగే రామకృష్ణాపురం వద్ద గల జగనన్న కాలనీ వద్ద గల కొండను తవ్వేసి సుమారు 60 సెంట్లు స్థలాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక నాయకుడు ఆక్రమించుకున్నట్టు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇక పోతే పద్మనాభపురం కాలనీ వద్ద గల శనీశ్వర దేవాలయం సమీపంలో మరో ఇద్దరు తెలుగు దేశం పార్టీ నాయకులు సుమారు 20 సెంట్లు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నాయి. ఈ విధంగా మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములను అడ్డు అదుపు లేకుండా ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు వీటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. పలాస కాశీబుగ్గలో భూ బాగోతం స్థలం విలువ రూ.1.50 కోట్లు పట్టించుకోని అధికారులు -
అక్టోబర్లో సీఐటీయూ జిల్లా మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సోంపేటలో అక్టోబర్లో జరిగే సీఐటీయూ జిల్లా 12వ మహాసభలు విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ధరల పెరుగుదల, అవసరాలు దృష్టిలో పెట్టుకొని కార్మికుల కనీస వేతనం నెలకు రూ.26,000గా అమలు చేయాలని, కనీస పెన్షన్ రూ.10,000 ఇవ్వాలని, కాంట్రాక్టు కార్మికులను, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు తదితర స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. శ్యాంపిస్టన్ ప్లాంట్–2, రెడ్డీస్ లేబొరేటరీస్ పరిశ్రమల్లో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించి వేతన ఒప్పందాలు చేయాలని, అక్రమంగా నిలుపుదల చేసిన కార్మిక నాయకులను విధుల్లోకి తీసుకోవాలని, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు, పరిశ్రమల ప్రైవేటీకరణ చర్యలను మానుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా నాయకులు అల్లు మహాలక్ష్మి, జి.అమరావతి, ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు.సత్యన్నారాయణ, కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఎన్.గణపతి, ఎస్.లక్ష్మీనారాయణ, బండారు మురళి, ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బంది కొరత
రవాణా శాఖలో.. ● కీలక ఏవో, ఆర్టీవో పోస్టులు ఖాళీ ● డీటీసీపైనే పనిభారం ● క్షేత్రస్థాయి తనిఖీలపై ప్రభావం శ్రీకాకుళం రూరల్: జిల్లా ఉప రవాణా శాఖాధికారి కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏఓ, ఆర్టీఓ వంటి కీలకమైన పోస్టులు కొన్ని నెలలుగా భర్తీ కాకపోవడంతో ఆ ప్రభావం ప్రస్తుత సిబ్బందిపై పడుతోంది. డీటీసీ విజయసారధి కార్యాలయానికి వచ్చిన ఫైల్స్ను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా సిబ్బంది కొరత కారణంగా క్షేత్రస్థాయిలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇన్చార్జులుగా ఏఓ స్థానంలో ఓ గుమస్తా, ఆర్టీవో స్థానంలో ఓ ఇన్స్పెక్టర్ను ఏర్పాటు చేసుకొని వచ్చిన ఫైల్స్ను అప్డేట్ చేయిస్తున్నారు. ఈ ఏడాది 2025–26కు సంబంధించిన ప్రభుత్వ టార్గెట్ రూ.142.75 కోట్లు ఇవ్వగా ఉన్న సిబ్బందితోనే గడిచిన నాలుగు నెలల్లో రూ.37.16 కోట్లకు చేరుకున్నారు. గత ఏడాది రూ.163 కోట్లు టార్గెట్ కాగా రూ.36.89 కోట్లతో సరిపెట్టుకున్నారు. తనిఖీలు అంతంత మాత్రమే.. ప్రధానంగా ఆర్టీవో కార్యాలయంలో వాహనాలు తనీఖీలకు సంబంధించిన ప్రక్రియ మోస్తారుగానే కొనసాగుతోంది. జిల్లావ్యాప్తంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు 17 మంది ఉండాలి. ప్రస్తుతం ఒక్క అధికారి మాత్రమే ఉన్నారు. ఇన్సెక్టర్లు 10 మందికి గాను నలుగురు మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన ఆరుగురు డిప్యూటేషన్పై ఇతర జిల్లాల్లో విధులు నెరవేరుస్తున్నారు. ఇక రోడ్డు సేఫ్టీలు, డ్రైవర్లకు అవగాహన సదస్సులు, వాహనాల తనిఖీలు ఆయా ఇన్స్పెక్టర్లు పర్యవేక్షణలోనే కొనసాగాలి. సిబ్బంది కొరత కారణంగా వీటి ఊసే లేదు. కార్యాలయంలోనూ అంతే.. ఆర్టీఓ జిల్లా ప్రధాన కార్యాలయంలోనూ సిబ్బంది కొరత వెంటాడుతోంది. మొత్తం 68 మంది సిబ్బంది వివిధ సెక్షన్లలో పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 27 మంది మాత్రమే ఉన్నారు. కొంతమంది డిప్యూటేషన్పై బయట విధులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్పోర్టు వాహనాలతో పాటు నాన్ ట్రాన్పోర్టులు, రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీలు, ఫైనాన్స్ క్లియరెన్సులు, ఈకేవైసీలు వంటి పనులన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆ పనులన్నీ డీటీసీ పర్యవేక్షణలో చేయిస్తున్నారు. లేఖ రాశాం.. సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రధానమైన ఏవో, ఆర్టీవో పోస్టులు కొన్ని నెలలుగా ఖాళీగా ఉన్నాయి. ఉన్న సిబ్బందితో పనులు చేయించుకుంటున్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటి ఫైల్స్ అప్పుడే క్లియర్ చేస్తున్నాం. – ఎ.విజయసారథి, జిల్లా ఉప రవాణా శాఖాధికారి -
అక్కుపల్లి తీరం
అభివృద్ధికి దూరం.. ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా శివసాగర్ బీచ్ ● కోట్లాది రూపాయల నిధులు నీటిపాలు వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రాల్లో అక్కుపల్లి శివసాగర్ బీచ్ ఒకటి. నిత్యం పర్యాటకుల తాకిడితో సందడిగా ఉండే ఈ తీరం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది. శివసాగర్ తీరాన్ని పర్యాటకేంద్రంగా తీర్చిదిద్దేందుకు 2018లో కోటి రూపాయలు నిధులు మంజూరయ్యాయి. పనుల నిర్మాణంలో నాణ్యత లోపంతో రక్షణ గోడ కూలిపోయింది. అప్పట్లో సంభవించిన తిత్లీ తుఫాన్ ప్రభావంతో రెస్టారెంట్, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల కోసం ఏర్పాటు చేసిన షెడ్లు ధ్వంసం కావడంతో నిధులు నీటిపాలయ్యాయి. అప్పటి నుంచి అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సువిశాల తీరం.. విశాలమైన సముద్ర తీరం, పచ్చని చెట్లు, నీటిపై తేలియాడేలా కనిపించే పెద్ద పెద్ద రాళ్లు.. ఇలా అనేక ప్రకృతి అందాలు శివసాగర తీరం సొంతం. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలలోని పర్లాకిమిడి, పాతపట్నం, టెక్కలిపట్నం, గొప్పిలి, టెక్కలి, కాశీబుగ్గ, పలాస, సూదూర ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పర్యాటకులు నిత్యం తీరానికి చేరుకుని ఆనందంగా గడుపుతుంటారు. రథసప్తమి, మహాశివరాత్రి లాంటి ప్రత్యేక పర్వదినాల్లో పర్యాటకుల తాకిడితో తీరం జనసంద్రంగా మారుతుంది. సమస్యలు ఇవే.. తీరంలో అనేక సమస్యలు తిష్ఠ వేశాయి. ప్రధానంగా మంచినీరు, మరుగుదొడ్లు, స్నానాల గదులు, దుస్తులు మార్చుకునేందుకు గదులు, విశ్రాంతి గదులు, వాహనాలు పార్కింగ్ వంటివి లేక సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. బీచ్ రోడ్డులో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టకపోవడం, తీరం ప్లాస్టిక్, మందుబాటిళ్లు, ఇతర వ్యర్థాలతో అధ్వానంగా దర్శనమిస్తోంది. అసాంఘిక కార్యక్రమాలు.. తీరం వెంబడి పచ్చని కొబ్బరి, జీడి తోటలు ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు సైతం అడ్డాగా మారింది. ఆకతాయిలు, మందుబాబులు తీరంలో వెకిలి చేష్టలు చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ మద్యం సీసాలు పడేస్తుండటంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. తోటలు పేకాట రాయుళ్లకు అడ్డాగా మారాయని స్థానికులు వాపోతున్నారు. అభివృద్ధి చేయాలి.. విశాలమైన సముద్ర తీరాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం తీరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం పేరుకుపోయి అధ్వానంగా ఉంది. – పి.దేవయ్య, వజ్రపుకొత్తూరు వసతులు లేవు.. కుటుంబ సభ్యులతో సరదాగా తీరంలో గడుపుదామని వస్తే సరైన సదుపాయాలు లేవు. ప్రధానంగా మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పాలకులు స్పందించి వసతులు ఏర్పాటు చేయాలి. – పి.మోహన్, సారవకోట -
ఉపాధ్యాయ సంక్షేమమే ధ్యేయం
శ్రీకాకుళం: ఉపాధ్యాయ సంక్షేమంతోపాటు సామాజిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) మాజీ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరధర్ అన్నారు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ కార్యాలయంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ముందుగా యూటీఎఫ్ పతాకాన్ని జిల్లా సహ అధ్యక్షురాలు బి.ధనలక్ష్మి ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ 1974 ఆగస్టు 10న ప్రాంతాలకు కేడర్లకు యాజమాన్యలకు అతీతంగా ఉపాధ్యాయ సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ, సామాజిక అభివృద్ధి లక్ష్యంగా ఉపాధ్యాయ నేత అమర జీవి చెన్నుపాటి లక్ష్మయ్య ఆశయాల వారసత్వంగా స్థాపించినట్లు పేర్కొన్నారు. జిల్లా కోశాధికారి బి.రవి కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ పి.అప్పారావులు మాట్లాడుతూ విద్యారంగం సంస్కరణలతో ప్రభుత్వ విద్యారంగం నాశనమవుతోందని, చరిత్రను వక్రీకరించడం శాసీ్త్రయ భావనలను తొలగించడం సమాజానికి తీవ్ర నష్టాన్ని కలిస్తుందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి వసుందర దేవి, నాయకులు కోదండ రామయ్య, తంగి ఎర్రమ్మ, అరుణ, సౌజన్య, వైకుంఠరావు, తవిటి బాబు, రామారావు, వెంకటేష్, రమేష్ పాల్గొన్నారు. -
పేకాట రాయుళ్లు అరెస్టు
పొందూరు: మండలంలోని లోలుగు–వీఆర్గూడెం రహదారిలోని తోటలో పేకాట ఆడుతు న్న తొమ్మిది మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. వారి నుంచి రూ.1,02,360ల నగదు, ఆరు సెల్ఫోన్లు, ఆరు మోటారు సైకిళ్లను సీజ్ చేశా మని చెప్పారు. తొమ్మిది మందిలో ముగ్గురు లోలుగు గ్రామానికి చెందిన వారని, ఆరుగురు శ్రీకాకుళానికి చెందిన వారని తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అర్హత కలిగిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ టెక్కలి: అర్హత కలిగిన రైతులందరికీ అన్నదాత సుఖీభవ అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయాధికారులతో కలిసి రైతులకు ఉపయోగకరమైన సేవలపై కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో 2,74,208 మంది రైతులకు సుమారు రూ.186 కోట్ల మేరకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం అందజేశామని పేర్కొన్నారు. రైతు లకు ఆదాయం పెంచే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు త్రినాథస్వామి, జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో భూమి పూజ సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులకు నౌపడ ఆర్అండ్ఆర్ కాలనీలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ తదితర విభాగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 32 కోట్లతో పనులు చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం సాయంత్రం భూమి పూజ చేశారు. నిర్వాసితులకు సౌకర్యాలతో కాలనీలో ఏర్పాటు చేస్తామన్నారు. నౌపడ 3 రోడ్లు జంక్షన్కు చెందిన పలువురు పోర్టు బాధితులు ఇళ్ల నిర్మాణానికి భూమిని కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్ హేమ సుందర్రావు, తదితరులు పాల్గొన్నారు. రైతులు లేకుండానే రైతు సంబరం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పలు పంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య వాహనాలతో రైతు సంబరం సభ ర్యాలీను ఆదివారం సాయంత్రం నిర్వహించారు. స్థానిక శిమ్మపేట నుంచి వప్పంగి, అరసవల్లి మీదుగా ఈ ర్యాలీ నిర్వహించారు. కానీ రైతులు లేకుండానే పారిశుద్ధ్య కార్మికులు, వాహన డ్రైవర్లతోనే కార్యక్రమాన్ని మమ అనిపించేశారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
పాతపట్నం: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం జాజ్పూర్ గ్రామానికి చెందిన రవీంద్ర ప్రధాన్తో పాటు పాతపట్నం మండలం కాగువాడ గ్రామానికి చెందిన నవీన్ బరోడా, లావాటి నీలకంటూలను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఆదివారం పాతపట్నం పోలీస్ స్టేషన్లో సీఐ వి.రామారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయ సమీపంలోని మామిడి తోట వద్ద రవీంద్ర ప్రధాన్ కాగువాడకు చెందిన నవీన్ బరోడా, లావాటి నీలకంటూలకు 3.250 కిలోల గంజాయిని అమ్ముతుండగా ఎస్ఐ బి.లావణ్య నేతృత్వంలో సిబ్బంది పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పలాస: ఒడిశా రాష్ట్రం అంబుగాన్ గ్రామానికి చెందిన రాహుల్ బూరో అనే వ్యక్తిని 4 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్టు పలాస జి.ఆర్.పి ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులకు వివరాలు వెల్లడించారు. పలాస రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ హెచ్సీ సోమేశ్వరరావు తనిఖీలు చేస్తుండగా రాహుల్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతని వద్ద సంచిని పరిశీలించగా రెండు బ్యాగుల్లో ఉన్న 4కిలోల గంజాయి గుర్తించారు. తనది ఒడిశా రాష్ట్రమని, తన సోదరుడు పిపిన్ బూరో గంజాయి పండిస్తుంటాడని చెప్పారు. హైదరాబాద్లో అమ్మేందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈ ఘటనలో రాహుల్ సోదరుడు తప్పించుకున్నాడు. గంజాయిని సీజ్ చేసి రాహుల్ను కోర్టుకు తరలించి రిమాండ్కు పంపించామని ఎస్ఐ చెప్పారు. -
ఓటమి భయంతోనే టీడీపీ దాడులు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కడప జిల్లా పులివెందులలో ఏ ఎన్నిక నిర్వహించినా గెలుపు వైఎస్సార్ సీపీదేనని, చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసిన గెలవలేడని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని యాదవ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు రెచ్చిపోతూ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, రామలింగారెడ్డిపై దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడిగా ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి రమేష్యాదవ్ అని పేర్కొన్నారు. కూటమి పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుని దాడులు చేసి భయపెట్టి ఉప ఎన్నికలో గెలవాలనుకోవడం తగదన్నారు. ప్రజా సంక్షేమ పాలన వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. చంద్రబాబు, లోకేష్లకు ఓటమి భయం పట్టుకుందన్నారు. బూత్ నెంబర్లు, పోలింగ్స్టేషన్లు మార్చేసి వారికి అనుకూలంగా చేసినంతా మాత్రాన ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడం భ్రమ అని పేర్కొన్నారు. ఇప్పటికై నా కూటమి నేతలు తీరు మార్చుకోక పోతే భవిష్యత్తులో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందన్నారు. సమావేశంలో యాదవ సంఘ నాయకులు గద్దిబోయిన కృష్ణయాదవ్, రాపాక చిన్నారావు, చిన్ని జోగారావు, నక్క దేవానంద, సీమల తారక్, సెలగల శ్యామ్, మురపాల రామారావు, ఇప్పిలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు -
మాజీ సైనికుల నూతన భవనం ప్రారంభం
ఎచ్చెర్ల : ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఆదివారం మాజీ సైనికుల నూతన భవనం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లా మాజీ సైనికుల సంక్షేమ శాఖ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ప్రస్తుతం సైనిక విధుల్లో ఉన్న వారు, మాజీ సైనికులు 110 మంది సహకారంతో భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విశిష్ట అతిథిగా విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మాజీ సైనికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ సీపాన అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ సువ్వారి రంగనాధం, కార్యదర్శి పైడి నారాయణమూర్తి, జాయింట్ సెక్రటరీ పైడి వెంకటనారాయణ, కోశాధికారి పైడి రంగనాథం, చైర్మన్ పైడి రామారావు, వైస్ చైర్మన్ సనపల ఫల్గుణరావు, వి.సూర్యనారాయణ, మురళీధరరావు, తర్ర కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
యూరియా.. సరిపోతాయా..?
కొత్తూరు: ఎరువుల కొరత రానురాను తార స్థాయికి చేరుకుంటోంది. నిన్న మొన్నటి వరకు అరకొర స్టాకుతో రైతులకు ఇబ్బంది తప్పలేదు. తాజాగా రైతుకు ఒక ఒకరాకు 25 కిలోల యూరియా మాత్రమే ఇవ్వాలని వ్యవసాయాధికారులు నిర్ణయించడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వరి నాట్లు మొదలైన వెంటనే రైతులకు అవసరమైన యూరియా రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేవారు. ప్రస్తుతం కూటమి పాలన తో రైతులకు అవసరమైన యూరియా రైతు సేవా కేంద్రాలకు కేటాయించలేదు. సరిపడా యూరియాను సరఫరా చేయకుండా ప్రభుత్వం సరికొత్త నిబంధనను తీసుకువచ్చింది. ఒక ఎకరాకు వినియోగించే యూరియాను మూడు భాగాలుగా విభజించింది. ఎకరాకు యూరియా 75 కిలోలు అవసరంగా గుర్తించిన ప్రభుత్వం మొదటి విడతగా 25 కిలోలు మాత్రమే పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రామ సచివాలయానికి వచ్చిన యూరియాను ఇద్దరు రైతులకు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. అయితే ఎకరా కంటే ఎక్కువ వరి సాగు చేస్తున్న రైతులకు, పత్తి, చెరుకుతో పాటు కూరగాయలు సాగు చేసే రైతులకు 25 కిలోల యూరియా చాలకపోవడంతో వారికి పాట్లు తప్ప డం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కేంద్రాలకు యూరియా ఇస్తే కొరత ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పు డు యూరియా చాలకపోవడంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. యూరియా ప్రభుత్వ ధర రూ. 280 ఉండగా ప్రైవేట్ డీలర్లు బస్తా రూ. 350 నుంచి రూ. 400లకు అమ్ముతున్నారు. అదనంగా డీఏపీ గానీ, దుబ్బు గుళికలు గానీ కొనుగోలు చేస్తే తప్ప యూరియాను విక్రయించడం లేదు. రైతుకు 25 కిలోల యూరియా మాత్రమే ఇవ్వాలని నిర్ణయం ఇద్దరు రైతులకు ఒక బస్తా పంపిణీ చేయాలంటూ ఆదేశాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రైతులు మూడు విడతలుగా అందిస్తాం వరి సాగు చేస్తున్న రైతులు ఎకరాకు 75 కిలోల యూరియా వినియోగించాలి. కాబట్టి ఈ మొత్తంను మూడు విడతలుగా విభజించి మొదటి విడతగా 25 కిలోలు ప్రతి రైతుకు అందిస్తాము. యూరియా సర్దుబాటు కోసం రైతులందరికీ అందించాలన్న భావంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ అవసరం అయితే ప్రైవేట్ డీలర్ల వద్ద కొనుగోలు చేసుకోవచ్చు. ఇతర పంటలు సాగు చేస్తుంటే అయితే వాటికి యూరియా అందిస్తాము. – రాజగోపాలరావు, ఏడీఏ వ్యవసాయ సబ్ డివిజన్, కొత్తూరు పంపిణీ చేయలేకే ఈ నిర్ణయం రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం పంపిణీ చేయలేక పోవడం వల్లనే 25 కిలోల యూరియా అంటూ పరిమితి పెట్టింది. ఒక్కో రైతు పదుల ఎకరాల్లో పత్తి, ఇతర పంటలు సాగు చేస్తారు. ఈ పంటలకు సరిపడిన యూరియా లభించడం లేదు. – వి.సంజీవరావు, రైతు, కుడుము, కొత్తూరు మండలం -
సై'డర్'..!
మన ఇంట్లో బంగారం పోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మన కుటుంబంపై ఎవరైనా దాడికి పాల్పడినా.. ఆడపిల్లలను ఏడిపించినా.. ఎవరైనా మోసగించినా వెంటనే స్పందిస్తాం. అంతేవేగంగా పోలీసులు సైతం విచారణ చేపడతారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే రూ.కోట్లలో మోసాలకు పాల్పడే కంటికి కనిపించని, పరిచయం లేని సైబర్ మోసగాళ్లపై పరువు అనే సమస్యకు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మాత్రం అంతా వెనకడుగు వేస్తారు.ఎందుకంటే టెక్నాలజీ పరంగా, సామాజిక మాధ్యమాల పరంగా కొన్ని బలహీనతలకు లోబడి చేసే తప్పులు బయటపడితే ఇబ్బందులు వస్తాయని ఆగిపోతున్నారు. కుటుంబంలో తెలిస్తే బాధపడతారని రూ.లక్షల్లో మోసపోతున్నారు. కొంతమంది ఎవరికీ చెప్పుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. – శ్రీకాకుళం క్రైమ్గత కొన్ని నెలలుగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు సైబర్ చక్రబంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన సైబరాసురులు హనీట్రాప్, డిజిటల్ అరెస్టు, ట్రేడింగ్, పార్ట్టైం జాబ్ల పేరిట రెచ్చిపోతున్నారు. రూ.లక్షల్లో పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదులతో సుమారు ఏడెనిమిది కేసులు నమోదయ్యాయని, స్టేషన్ మెట్లెక్కని బాధితులు మరింతమంది ఉండొచ్చని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మోసపోయినవారిలో ఉన్నత ఉద్యోగ వర్గాలే ఉండడం విశేషం. హనీ ట్రాప్లో పడి.. జిల్లాకేంద్రం సమీపంలోని సంపన్న వర్గానికి చెందిన ఒక వ్యక్తికి ఇటీవల ఒక అమ్మాయి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టింది. ప్రొఫైల్ పిక్లో అమ్మాయి ఫొటో ఉండడంతో ఆకర్షితమైన సదరు వ్యక్తి వెంటనే హాయ్ అని రిప్లయ్ ఇచ్చాడు. ఆ తర్వాత నిత్యం చాటింగ్ చేయడం రివాజైంది. కొన్నాళ్లకు వాట్సాప్ కాల్లో మాట్లాడడం.. వీడియో కాల్స్ చేయడం ఆరంభించింది. అలా ఆ వ్యక్తిని ముగ్గులోకి దింపిన యువతి వీడియో కాల్స్లో న్యూడ్ కాల్స్ చేయడం ప్రారంభించింది. కొద్దిరోజులు తానే న్యూడ్గా కనిపించి ఆ తర్వాత సదరు వ్యక్తిని సైతం న్యూడ్గా కనిపించాలని కోరిక కోరడంతో, అతడు కూడా నగ్నంగా మాట్లాడడం ఆరంభించాడు. దీంతో ఆ వ్యక్తి నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్ను రికార్డింగ్ చేసిన ఆ యువతి అక్కడి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేయడం ఆరంభించింది.ఆమె తరపున మరికొంతమంది సైతం వీడియోలు బయటపెడతామంటూ బెదిరించడంతో ఇంట్లో తెలిస్తే పరువు పోతుందేమోనని భయపడి, చేసేదేమీలేక వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు దఫదఫాలుగా రూ.28 లక్షల వరకు పంపించేశాడు. అయినప్పటికీ డబ్బుల కోసం పీడిస్తుండడంతో చేసేదేమీలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డిజిటల్ అరెస్టు పేరిట.. విశాఖపట్నంలోని ఒక అకౌంటింగ్ సెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న శ్రీకాకుళం నగరవాసి డిజిటల్ అరెస్టు పేరిట రూ.11 లక్షలను సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయారు. మీ పేరిట కొరియర్లో డ్రగ్స్ ప్యాకెట్ వచ్చిందని.. మీ ఆధార్ లింక్ నంబర్తో కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయని సీబీఐ, కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసే వీలుందని ఒక వ్యక్తి బెదిరించడంతో నిజమేనని నమ్మాడు. దీనినుంచి బయటపడాలంటే ముందుగా రూ.30 వేలు తాము చెప్పిన ఖాతాలో వేయాలని చెప్పడంతో ఎందుకొచ్చిన గొడవలే అనుకుని ఉద్యోగి వేశాడు. మళ్లీ ఆ వ్యక్తి ఫోన్ చేసి పై అధికారులను మేనేజ్ చేయడం కుదరడం లేదని.. వారే మీకు లైన్లోకి రావొచ్చని మెల్లగా జారుకున్నాడు. కొన్ని గంటల్లోనే పోలీసు సెటప్తో ఉన్న ఓ రూంలో యూనిఫాంతో ఓ వ్యక్తి వీడియో కాల్లో ప్రత్యక్షమై తాను ఢిల్లీ సీబీఐ అసిస్టెంట్ డైరెక్టర్నని పరిచయం చేసుకున్నాడు. మేం నిన్ను నమ్మాలంటే మీ బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నంబర్, ఫోన్ నంబర్లు వెరిఫికేషన్ చేయాలన్నాడు. వాటి ఆధారంగా ఇటీవల జరిగిన ఆన్లైన్ లావాదేవీలు పరిశీలించాలని.. కొంత అమౌంట్ను కూడా వెరిఫికేషన్లో భాగంగా తీయాల్సి వస్తుందని చెప్పాడు. అందులో జెన్యూనిటీ ఉంటే తిరిగి మీ ఖాతాలో అమౌంట్ వేయడం జరుగుతుందని చెప్పడంతో సదరు ఉద్యోగి ఓకే చేశాడు. అడిగిన వివరాలు అన్నీ ఇచ్చేయడంతో పాటు ఓటీపీలు చెప్పడంతో రూ.11 లక్షలను కొట్టేశారు. దీంతో తాను మోసానికి గురయ్యానని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇదే తరహాలో జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న జేఈ రూ.3 లక్షలు, నగరానికి చెందిన ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ రూ.3 లక్షలు పోగొట్టుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ వీరిని సైబరాసురులు అధికారుల పేరిట బెదిరించడం విశేషం.పార్ట్టైం జాబ్ ఫ్రాడ్స్.. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్ల్లో పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఇంట్లోనే ఉంటూ పార్ట్టైం జాబ్ చేసే వీలుందని చెప్పడంతో నగరంలో నలుగురు చిరుద్యోగులు ఈ ఉచ్చులో పడ్డారు. ముందుగా వారు క్రియేట్ చేసిన గ్రూపుల్లో మెంబర్లుగా చేరారు. మొదటి టాస్్కలో రూ.5 వేలుకు రూ.1000లు అదనంగా రూ.6 వేలు, రెండో టాస్్కలో రూ.10 వేలకు రూ.2 వేలు అదనంగా రూ.12 వేలు వేయడంతో విత్డ్రా చేసుకున్నారు. అనంతరం అత్యాశకు పోయి తర్వాత టాస్క్ల్లో రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.1 లక్ష, రూ.2 లక్షలకు అదనపు సొమ్ము ఖాతాల్లో ఉన్న ఆప్షన్లో చూపించినా విత్డ్రా చేయడానికి వీలుకాకపోవడం.. ఆ తర్వాత అవతలివాళ్లు వీరి నంబర్లు బ్లాక్ చేయడంతో మోసపోయామని గ్రహించారు. పోలీసులకు ఆసక్తి ఉన్నా.. పోలీసులు కూడా కేసులు నమోదు చేస్తున్నా మోసం చేసే సైబర్ కేటుగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి విదేశాల్లో సైతం ఉండడం.. తెలియని ప్రాంతాల్లో రిస్క్ చేసి పట్టుకోవడానికి వెళ్లే ఆసక్తి ఉన్నా.. రాను పోను ఖర్చులు, వసతి ఖర్చులకు చేతి చమురు తగులుతుండటం.. ఆపై ఎక్కువ రోజుల సమయం వెచ్చించాల్సి రావడంతో వెనకడుగు వేస్తున్నారు. అలా కేసుల్లో అధికశాతం పెండింగ్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అందువలన ప్రభుత్వాలు కాస్తా చొరవ తీసుకుని ఆర్థికంగా చేయూతనిస్తే కేసుల ఛేదన సులభమేనంటూ పోలీసులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడికి టోకరా నగర పరిసరాల్లో ఉండే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఉన్నత చదువుల నిమిత్తం విదేశాల్లో ఉన్న తన కుమారుడు ఓ నేరం చేశాడని.. సీబీఐ, ఈడీ విభాగాల అధికారులు అరెస్టు చేసే వీలుందని సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. దానికి తగ్గ ఆధారాలు తమ వద్దనున్నాయని చెబుతూనే ఫేక్ వివరాలు వాట్సాప్లో పంపడంతో ఉపా«ధ్యాయుడు ఖంగుతిన్నాడు. మీ అబ్బాయి నేరం నుంచి బయటపడి, విదేశాల నుంచి రావాలనుకుంటే అధికారులకు అమౌంట్ కట్టాల్సి ఉంటుందన్నారు.పత్రికలు, మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం బయటకు తెలిస్తే మీ పరువు పోతుందని అనడంతో చేసేదేమీలేక రూ.35 లక్షలు వారు చెప్పిన వివిధ ఖాతాల్లోకి పంపించాడు. ఎక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనని గంట గంటకు ఉపాధ్యాయునికి వాట్సాప్ వీడియో కాల్ నేరస్తులు చేసేవారు. తర్వాత వాళ్ల నంబర్లకు ఫోన్ కాకపోవడంతో బాధిత ఉపాధ్యాయుడు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. క్షణాల్లో మోసాన్ని గ్రహించాలి సహజంగా జరిగే చోరీలు.. ప్రస్తుతం ట్రెండ్లో ఉన్న సైబర్ మోసాలను పరిశీలిస్తే 1:10 నిష్పత్తిలో నగదు మోసానికి గురవుతోంది. సైబర్ నేరగాడు బాధితుడి ఆర్థిక స్థితిని చూడడు. అత్యాశనే చూస్తాడు. వారు చేసే మోసాన్ని క్షణాల్లో మనం గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే నష్టాన్ని పూడ్చవచ్చు. ఈవిధంగానే ఇటీవల డిజిటల్ అరెస్టు వలలో పడి రూ.13.5 లక్షల పోగొట్టుకున్న జెమ్స్ వైద్యురాలి కేసు ఛేదించాం. కోచిగూడ్, మైసూర్ వెళ్లి నిందితులను పట్టుకున్నాం. రాష్ట్రంలో రోజుకి రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లు బాధితులు నష్టపోతున్నారు. – సీహెచ్ పైడపునాయుడు, సీఐ, శ్రీకాకుళం రూరల్ -
కింజరాపు వారి బంధుప్రీతి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా అన్నీ వచ్చి చేరుతాయనే సామెత అందరికీ తెలిసిందే. అయితే ఆ కేటాయింపులో సైతం పూర్తిగా బంధు ప్రీతి చూపిస్తూ మిగిలిన వారిని పక్కన పెట్టేయడం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకే చెల్లుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు జిల్లాలో కోట»ొమ్మాళి మండలం నిమ్మాడ పంచాయతీ సర్పంచ్ కింజరాపు సురేష్ను ఎంపిక చేశారు. అయితే ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా..? ఆయన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుకు సొంత అన్న కుమారుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుకు సొంత బాబాయ్ కుమారుడు. జిల్లాలో ఎంతో మంది ఆదర్శవంతంగా సేవలు అందజేసిన సర్పంచ్లు ఉన్నప్పటికీ కేవలం బంధుప్రీతిని చూపించుకుంటూ సొంత కుటుంబ సభ్యుడిని స్వాతంత్య్ర వేడుకలకు ఎంపిక చేయడంపై సొంత పారీ్టకి చెందిన వారే విస్తుపోతున్నారు. అటు రాజకీయాల్లోనూ అవకాశం ఇవ్వకపోగా, కనీసం ఇలాంటి సామా జిక కార్యక్రమాల్లో సైతం ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడంపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ఏడాది ఇదే మాదిరిగా ఢిల్లీలో ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు కేంద్రమంత్రికి వరుసకు మామ, రాష్ట్ర మంత్రికి వరుసకు మేనత్త కొడుకైన దోమ మోహన్రావు, ఆయన భార్య పుణ్యవతిని ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి అప్పట్లో విమర్శలపాలయ్యారు. వేడుకల ఎంపిక సిఫార్సులో పూర్తిగా పక్షపాతం.. ఢిల్లీలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలకు గ్రామ స్థాయిలో సర్పంచ్ల ఎంపిక విషయంలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు పూర్తిగా పక్షపాత వైఖరి చూపించా రు. వాస్తవంగా ప్రతి పంచాయతీలో అభివృద్ధికి సంబంధించి ఆయా సర్పంచ్లు చేసిన కృషి, నిధుల వినియోగంలో అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని వేడుకలకు సిఫార్సులు చేస్తారు. ఇక్కడ పూర్తిగా విరుద్ధమైన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో తమకు అడ్డే లేదన్న మాదిరిగా మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధులను పక్కన పెట్టి మరీ కింజరాపు కుటుంబం బంధు ప్రీతిని చూపించుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇదే సురేష్ పై పోటీకి సిద్ధమైన వైఎస్సార్సీపీ సర్పంచ్తో పాటు కొంత మంది వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసిన సంఘటనల్లో నిమ్మాడ సర్పంచ్ సురేష్ కీలకంగా వ్యవహరించారు. అలాంటి వ్యక్తికి అవార్డుకు ఎంపిక చేయడంపై విమర్శలు వస్తున్నాయి. -
ట్రస్ట్ బోర్డులకు గ్రీన్ సిగ్నల్
అరసవల్లి: జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ స్వామివారి ఆలయాల్లో పాలక మండలి నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు దేవదాయశాఖ ఉన్నతాధికారులు పలు సూచనలు, నిబంధనలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రూ.కోటి నుంచి రూ.5 కోట్లలోపు వార్షికాదాయం ఉన్న శ్రీకూర్మం ఆలయంలో 9 మంది, రూ.5 కోట్లు నుంచి రూ.20 కోట్ల లోపు వార్షికాదాయం ఉన్న అరసవల్లి సూర్యక్షేత్రంలో 12 మంది సభ్యులతో పాలకమండలి సభ్యులను నియమించనున్నారు. అయితే అరసవల్లి ఆలయానికి వంశపారంపర్యంగా ఇప్పిలి జోగిసన్యాసిరావు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా, శ్రీకూర్మం ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా విజయనగరానికి చెందిన గవర్నర్ పూసపాటి అశోక్గజపతిరాజు ట్రస్టు బోర్డు చైర్మన్గా కొనసాగనున్నారు. దీంతో పాలకమండలి సభ్యుల స్థానాలు మాత్రమే భర్తీ కానున్నాయి. గురువారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో, ఆసక్తి ఉన్నవారు తమ అర్హతలతో రానున్న 20 రోజుల్లోగా ఆయా ఆలయాల కార్యనిర్వహణాధికారులకు దరఖాస్తులను సమర్పించాలని జిల్లా దేవదాయ శాఖాధికారి ప్రసాద్పట్నాయక్ తెలియజేశారు. -
మత్స్యకారులపై కేసులు ఎత్తివేయాలి
అరసవల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద కెమికల్ ఫ్యాక్టరీ వల్ల మత్స్య సంపద నాశనమవుతోందని పోరాటం చేస్తున్న మత్స్యకారులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించిందని, ఈ కేసులను తక్షణమే ఎత్తివేయాలని జిల్లా మత్స్యకార ఎస్టీ సాధన సమితి అధ్యక్షుడు మైలపల్లి పోలీసు డిమాండ్ చేశారు. నగరంలోని భూపాలరావువీధిలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మత్స్య సంపదను కాపాడాల్సిన ప్రభుత్వం.. కెమికల్ కార్పొరేట్ శక్తులతో చేతులుకలిపి మత్స్యకారులను బెదిరించడం సరికాదన్నారు. అక్రమ కేసులు బనాయించడాన్ని జిల్లా శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు. అక్రమ కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు కార్యచరణ సిద్ధం చేస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు జిల్లా సంఘ ముఖ్య నేతలు ఇద్ది పాపయ్య, గుండాల గణేష్కుమార్, కొండా సింహాచలం, మైలపల్లి పోలీస్, సూరాడ లక్ష్మణ, మోసా ఫల్గుణరాజు, మైలపల్లి నర్సింహమూర్తి, మూగి శ్రీరామమూర్తి ఉన్నారు. -
విద్యుత్ షాక్తో మహిళ మృతి
సోంపేట: మండలంలోని జింకిభద్ర గ్రామానికి చెందిన కూనే సీతమ్మ (58) శుక్రవారం ఉదయం బెంకిలి సాదుమెట్ట వద్ద విద్యుత్ షాక్తో మృతి చెందింది. సోంపేట పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సీతమ్మ ప్రతిరోజూ ఉదయం సాదు మెట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం పరిసరాలు శుభ్రం చేసి, స్వామివారికి దీపం పెట్టి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్లేటప్పుడు పూజకు పనికొచ్చే పూలను తీసుకెళ్లి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో పలువురికి ఇచ్చేది. ప్రతిరోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో సీతమ్మ సాదు మెట్టకు చేరుకుంది. స్వామివారికి దీపం పెట్టడానికి ముందు పూలు కోయడానికి చెట్టు వద్దకు వెళ్లింది. అయితే అక్కడ విద్యుత్ దీపాలంకరణ కోసం ఏర్పాటు చేసిన చిన్న ఫోల్ను పట్టుకోవడంతో కేకలు వేస్తూ కుప్పకూలింది. అక్కడ యోగా నేర్చుకుంటున్నవారు వచ్చి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించి ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే విద్యుత్ షాక్తోనే మహిళ మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి విద్యుత్ అధికారులు, పోలీసులు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని సోంపేట ఎస్ఐ వి.లోవరాజు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. సీతమ్మకు వివాహ బంధంలో చిన్నపాటి గొడవలు రావడంతో, తన మేనల్లుడి ఇంటి వద్దనే గత 30 సంవత్సరాలుగా ఉంటోంది. అందరికీ చేదోడు, వాదోడుగా ఉండే సీతమ్మ మృతితో బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో విషాద చాయలు అలముకున్నాయి. -
● ఉత్సాహంగా 5కే రన్
ఇచ్ఛాపురం: స్థానిక రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో 5కే రన్ పోటీలను శుక్రవారం నిర్వహించారు. పోటీల్లో యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు డా.మోహన్వెంకటేష్ మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు 5కే రన్ పోటీలు నిర్వహించామన్నారు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో జి.యామిని, ఎం.హారిక, సీహెచ్ పుష్ప, బాలురు విభాగంలో ఆర్.సాయి, ఆర్.పవన్, పి.రాకేష్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు కె.రామ్మూర్తి, డా.త్రినాథ్రెడ్డి, బి.షణ్ముఖ, కె.రామారావు, డి.కృష్ణమూర్తి, గోపి చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
క్విట్ కార్పొరేట్ డే జయప్రదం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలకు నిరసనగా ఆగస్టు 13న నిర్వహించనున్న క్విట్ కార్పొరేట్ డేను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ తాండ్ర ప్రకాష్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి.చందు, పి.ఖగేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని సీఐటీయూ కార్యాలయంలో కరపత్రాలు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడోసారి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దయిన 3 నల్లచట్టాల కన్నా ప్రమాదకరమైన విధానాలను ప్రకటించిందని విమర్శించారు. వ్యవసాయ మార్కెట్ల చట్టాన్ని విదేశీ, స్వదేశీ కంపెనీల ఎగుమతి, దిగుమతి వ్యాపారుల ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేసిందని దుయ్యబట్టారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు కాపాడాలని, జీడి పంటకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రీపెయిడ్ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఉపసంహరించుకోవాలని కోరారు. -
వెరీ లేజీ..!
పీజీ... బీఆర్ఏయూలో సీట్లు కోర్సులు సీట్లు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎం.కాం 40 0 ఎంఏ ఎకనామిక్స్ 32 8 ఎంఏ ఇంగ్లిష్ 32 8 ఎంఎల్ఐఎస్సీ (లైబ్రరీయన్, ఇన్ఫర్మేషన్ సైన్సెస్ 32 8 ఎంఏ సోషల్ వర్క్ 32 8 ఎంఏ తెలుగు 32 8 ఎంఏ రూరల్ డవలప్మెంట్ 32 8 ఏఈడీ 32 8 ఎంజేఎంసీ 24 6 ఎంఏ ఫిలాసఫీ 0 20 ఎంఎస్సీ బయోటెక్నాలజీ 24 6 ఎంఎస్సీ మైక్రో బయాలజీ 16 4 ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 16 4 ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 32 8 ఎంఎస్పీ అప్లయిడ్ మ్యాథమెటిక్స్ 16 4 ఎంఎస్సీ ఫిజిక్స్ 32 8 ఎంఎస్సీ జియోఫిజిక్స్ 12 3 ఎంఎస్సీ జియాలజీ 12 3 ఎచ్చెర్ల: డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించాలనే ఉద్దేశంతో పీజీ ప్రవేశ పరీక్షలు రాశారు. అయితే పీజీతో చక్కని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో రారష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యంతో వీరంతా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జూన్ 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పీజీ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. జూన్ 25 తేదీన ఫలితాలు కూడా వెల్లడించారు. అయితే తదుపరి చర్యలను చేపట్టలేదు. వెబ్ ఆప్సన్పై ఉన్నత విద్యా మండలి స్పష్టత ఇవ్వడం లేదు. దీంతో ఎప్పుడు ప్రవేశాలు కల్పిస్తారో తెలియక విద్యార్థులు ఆయోమయ పరిస్థితిలో ఉన్నారు. అగమ్యగోచరం ఏపీ పీజీసెట్ రాసిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ఈ పరీక్ష రాసి పీజీలో చేరతామనే ఉద్దేశంతో మరే పరీక్ష రాయని వీరంతా పీజీ ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఆగస్టు నుంచి తరగతులు ప్రారంభమవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ వెబ్ ఆప్సన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇచ్చినా మొదటి కౌన్సిలింగ్, రెండు, మూడో కౌన్సిలింగ్ అని చాలా కాలం పట్టే అవకాశం ఉంది. దీనివలన విద్యార్థులతో పాటు విద్యాసంస్థలు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించింది. విద్యా సంవత్సరం టైం టేబుల్ వేయడానికి విద్యాసంస్థలు కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. వీసీలతో సమావేశాలేవీ..? సాధారణంగా ప్రతీ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. వర్సిటీల్లో ఉన్న సమస్యలు, కోర్సులు, అవసరమైన నిధులపై చర్చించాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒకసారి కూడా వీసీలు, రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించిన దాఖలాలు లేవు. ఉన్నత విద్యా మండలి ముఖ్య కార్యదర్శి, చైర్మన్, విద్యాశాఖ మంత్రి, వీసీలతో ప్రతీ ఏడాది సమావేశం నిర్వహించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా ఇటువంటి సమావేశాలను ఇప్పటివరకూ నిర్వహించలేదు. రాష్ట్రంలో 18 వర్సిటీలు ఉండగా వీరిలో ఎచ్చెర్ల మినహా 17 మంది వీసీలు రాజీనామాలు కూడా చేశారు. వీరిలో 9 మందిని కొత్తగా రిక్రూట్ చేయగా, మిగిలన చోట్ల ఇన్చార్జి వీసీలు కొనసాగుతున్నారు. వీసీలతో సమావేశం నిర్వహిస్తే, వారు సమస్యలు చెబితే నిధులు కేటాయించాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం సమావేశాలను నిర్వహించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నారు. వేంకటేశ్వర వర్సిటీకి బాధ్యతలు పీజీ ప్రవేశాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని వర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు తిరుపతి వేంకటేశ్వర వర్సిటీకి బాధ్యతలు అప్పగించారు. ఇదివరకు ఎచ్చెర్ల, రాజమండ్రి, ఏయూ కలిపి ఏయూకు ప్రవేశాల బాధ్యతను అప్పగించేవారు. తర్వాత ఏ వర్సిటీకి సంబంధించి ఆ వర్సిటీ ప్రవేశాలను కల్పించేది. కాగా ఇప్పుడు రాష్ట్ర మొత్తంగా ఒకే వర్సిటీ ప్రవేశాలను కల్పిస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ ప్రవేశాలను నిర్వహిస్తున్నారు. అయితే వీరు స్పందించకపోవడంతో ఇంతవరకూ ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ విడుదల చేయలేదు. మరిన్ని సెట్లలో ఆలస్యం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఏపీపీజీ సెట్తో పాటు లా సెట్, ఎడ్ సెట్ విద్యార్థులకు కూడా ప్రవేశాలకు సంబంధించి ఎటువంటి స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు. వీరంతా ప్రవేశ పరీక్షలను రాసి ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లాలో రెండు లా కళాశాలలు ఉన్నాయి. 15 బీఈడీ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో చేరేందుకు ఈ విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు. ఐసెట్, ఇంజినీరింగ్ సెట్ ప్రవేశాలను మాత్రమే పూర్తి చేశారు. మిగతా సెట్ పరీక్షలన్నీ అలానే ఉన్నాయి. ఫలితాలు విడుదలైనా.. ప్రవేశాలు జరగని వైనం ఇప్పటికీ వెబ్ ఆప్షన్లు ఇవ్వని ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు వెబ్ ఆప్సన్స్ ఇంకా ఇవ్వలేదు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ ప్రవేశాలను నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించి ఇంకా వెబ్ ఆప్సన్స్ ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద ఈ సమస్య ఉంది. ఈ నెలలో ఇచ్చే అవకాశం ఉంది. ప్రవేశాలకు అనుగుణంగా విద్యా సంవత్సరం క్యాలెండర్ తయారు చేయనున్నాము. ప్రవేశాల జాప్యం సమస్య లేకుండా విద్యార్థులకు విద్యను అందించేందుకు ప్రయత్నిస్తాం. – పి.సుజాత, రిజిస్ట్రార్, బీఆర్ఏయూ -
ఐటీడీఏ సాధనే లక్ష్యం
సారవకోట: జిల్లాలోని మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు సాధనే శనివారం జరగనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవ లక్ష్యమని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ముఖ్య ఉద్దేశాన్ని ప్రస్తుత పాలకులు మరచిపోయి దీనిని ఒక జాతర, లేదా పండుగా నిర్వహిస్తున్నారని, అయితే అసలైన లక్ష్యం నెరవేర్చడం లేదని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసం ఆదివాసీల జీవితాల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్ధాలు గడుస్తున్నా నేటికీ కనీస మౌలిక వసతులు లేని గిరిజన గ్రామాలున్నాయన్నారు. సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాలో విలీనం చేసిన తర్వాత, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 16 మండలాల్లోని 2 లక్షల మంది గిరిజనులకు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి మెళియాపుట్టి మండలంలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని కోరారు. రైతు బిడ్డకి డాక్టరేట్ శ్రీకాకుళం న్యూకాలనీ: కాకినాడ జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూకే) నుంచి జిల్లాకు చెందిన లింగాల ప్రసాదరావు పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ‘శ్రీకాకుళం జిల్లా బ్యాంకింగ్ రంగంలో మానవ మూలధనం మరియు పనితీరుపై ఒక అంచనా’ అనే శీర్షికతో ఆయన చేసిన పరిశోధన విజయవంతంగా పూర్తి చేశారు. జేఎన్టీయూకే మేనేజ్మెంట్ స్టడీస్ మాజీ డైరెక్టర్ డాక్టర్ పి.విజయ్కుమార్, అదే వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి.చార్వక్ మార్గదర్శకత్వంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రసాద్ విజయనగరంలోని లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ప్రసాదరావు స్వగ్రామం పొందూరు మండలంలోని కేశవదాసుపురం గ్రామం. తల్లిదండ్రులు లింగాల ఆసిరప్పుడు, పార్వతి, భార్య శాంతి ప్రోత్సాహం, మద్దతను మర్చిపోలేనన్నారు. తన పీహెచ్డీ పట్టాను తమ కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నట్టు తెలియజేశారు. గూడ్స్ గోదాం పరిశీలన ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలోని గూడ్స్ గోదాం, అవేజ్ రాక్ గోదాంను శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పరిశీలించారు. సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించి ఎరువుల పక్కదారిపై ఆరా తీశారు. అవేజ్ ర్యాక్ గోదాంకు సంబంధించి అధికారులను ప్రశ్నించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు సంబంధించి 1,320 మెట్రిక్ టన్నుల ఎరువులు వచ్చాయని తెలియజేశారు. ప్రైవేటు డీలర్లకు 660 మెట్రిక్ టన్నులు, మార్క్ఫెడ్కు 660 మెట్రిక్ టన్నులు పంపించినట్లు లెక్కలు చూపించారు. అయితే ప్రైవేటు డీలర్లకు ఎవరెవరికి ఎన్ని బస్తాలు వెళ్లాయో వివరాలు పంపించాలని డీఏవో త్రినాథస్వామికి సూచించారు. రాక్, మార్క్ఫెడ్ అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిశీలనలో మార్క్ఫెడ్ డీఎం రమణి, తహసీల్దారు రాంబాబు, ఏవో మెట్ట మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. బంగారు కుటుంబాలకు వైద్యుల సాయం శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీ–4 కార్యక్రమానికి డాక్టర్లు మద్దతు పలికారు. జిల్లాలోని బంగారు కుటుంబాలకు అండగా నిలుస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను శుక్రవారం వారి కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన 85 మంది వైద్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని 2,580 బంగారు కుటుంబాలకు తాము మార్గదర్శకులుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. దీంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వైద్యులను అభినందిస్తూ, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సనపల నర్సింహమూర్తి, డీసీహెచ్ఎస్ డాక్టర్ నూర్తి కల్యాణ్ చక్రవర్తి, డాక్టర్ భవానీ, డాక్టర్ శిరీష, డాక్టర్ అరవింద్, డాక్టర్ రేవతి, పిల్లల వైద్యుడు డాక్టర్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.