breaking news
Srikakulam
-
హామీలపై మంత్రి అచ్చెన్న సమాధానమివ్వాలి
టెక్కలి: ఎన్నికల ముందు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యుడు కె.మోహన్రావు డిమాండ్ చేశారు. టెక్కలి మండలం జక్కరపేటలో ఆదివారం సమావేశం నిర్వహించి అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు అప్పులు తప్ప ప్రయోజనం ఏమీ లేదన్నారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుపై కనీస ప్రస్తావన లేదని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని, జీడి బోర్డు ఏర్పాటు చేయలేదని, వంశధార నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి శివారు భూములకు నీరు అందజేస్తామని చెప్పినా అమలు కావడం లేదన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం ఎందుకు అందజేయలేకపోతున్నారో మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కె.ఎల్లయ్య, హెచ్.ఈశ్వరరావు, బి.వాసుదేవరావు, యు.లక్ష్మణరావు, దుర్గాప్రసాద్, బి.అప్పారావు, బి.రవి, హరీష్, బి.నరసమ్మ, సుబ్రహ్మణ్యం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్ కౌన్సెలింగ్కు 403 మంది హాజరు
ఎచ్చెర్ల : పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం స్థానిక పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఆదివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్ – 2025 వెబ్ కౌన్సెలింగ్కు 403 మంది విద్యార్థులు హజరయ్యారు. 15001 నుంచి 32000 వేలు ర్యాంక్ మధ్య ధ్రువపత్రాలు పరిశీలన చేయగా.. ఓసీ, బీసీ విద్యార్థులు 371 మంది, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 32 మంది హాజరయ్యారు. మూడోరోజు సోమవారం 32001 నుంచి 50,000 ర్యాంక్ వరకు విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. కార్యక్రమంలో సహాయ కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణరావు, సీనియర్ అధ్యాపకులు మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ సహాయ కేంద్రం వద్ద కోచింగ్ సెంటర్, ప్రైవేటు కళాశాలల ప్రతినిధులు, మధ్యవర్తుల తాకిడి ఎక్కువైంది. వేలకు వేలు కమీషన్లు తీసుకుని వారికి నచ్చిన కళశాలల్లో చేరేలా విద్యార్థులను మభ్యపెడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి విద్యార్థితో పాటు తల్లిదండ్రులు, సంరక్షకులు మాత్రమే రావాల్సి ఉండగా.. బయట వ్యక్తులు పెద్ద ఎత్తున చేరి విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్ సుబ్బారెడ్డి
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఏపీ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుబ్బారెడ్డి శెట్టి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనివెట్టి మండపంలో వేదాశీర్వచనాన్ని చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రధానార్చకులు శంకరశర్మ ఆలయ విశిష్టతను జస్టిస్కు వివరించారు. కార్యక్రమంలో కోర్టు ప్రోటోకాల్ సిబ్బంది, ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు. గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి ఎస్.సుబ్బారెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. మూలవిరాట్కు గోత్ర నామాలతో పూజలు జరిపించుకున్నారు. ఆల య ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహత్యాన్ని వివరించారు. భూ తగాదాలో వ్యక్తికి గాయాలు జి.సిగడాం: నాగులవలసలో ఆదివారం జరిగిన భూ తగాదాలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శశిధర్ ట్రాక్టర్తో సొంత పొలంలో దున్నేందుకు వెళుతుండగా అదే గ్రామానికి చెందిన వెంకట అప్పారావు తన పొలంలో నుంచి వెళ్తావా అంటూ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో శశిధర్ తలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని రాజాం ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదు మేరకు ఎస్సై వై.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిక్కోలుకు సముచిత స్థానంశ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాకు సముచితస్థానం లభించింది. దశాబ్దకాలంలో సాఫ్ట్బాల్ క్రీడలో చెరగని ముద్రవేసుకున్న శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శితోపాటు కన్వీనర్ వంటి కీలకమైన మూడు స్థానాలు వరించాయి. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఆదివారం ఏపీ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఏఐ) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అనోకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సాఫ్ట్బాల్ సంఘ పురోగాతికి, క్రీడా టోర్నమెంట్ల నిర్వహణ, వివిధ జిల్లాకు స్పోర్ట్స్మీట్ల కేటాయింపు, క్రీడాకారులకు ప్రోత్సాహాకాలు, స్పోర్ట్స్ కిట్ల పంపిణీకి ప్రతిపాదనలు వంటి అంశాలపై చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికల అధికారిగా రిజైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, అన్నెపు భువనేశ్వరరావు, పరిశీలకులగా శాప్ తరఫున డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు, మెట్ట తిరుపతిరావు, గురుగుబెల్లి రాజశేఖర్, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, ఎం.ఆనంద్కిరణ్, ఢిల్లేశ్వరరావు, మహంతి, స్టేట్ సాఫ్ట్బాల్ కోచ్ బద్రి, 13 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సూర శ్రీనివాసరావును ఎన్నుకున్నారు. వందలాది మంది క్రీడాకారులను రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేలా చేసి.. సాఫ్ట్బాల్కు కేరాఫ్ సిక్కోలు అనేలా చేసిన మొజ్జాడ వెంకట రమణకు కీలకమైన రాష్ట్ర కన్వీనర్ పోస్టు లభించింది. కార్యవర్గ సభ్యులగా మరికొంతమందికి అవకాశం కల్పించారు. -
బాత్రూమ్ క్లీనర్ తాగి వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: టెక్కలి శ్రీనివాసనగర్కు చెందిన రొక్కం రాజారావు(65) బాత్రూం క్లీనర్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజారావు కొన్నేళ్లుగా స్థానిక తెంబూర్ రోడ్డులోని రైల్వే గేటు వద్ద నిమ్మకాయల వ్యాపారం చేస్తుండేవాడు. కొద్ది రోజులుగా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మనస్థాపానికి గురై శనివారం తన ఇంట్లో ఉన్న బాత్రూం క్లీనర్ (లైజాల్) తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రిజర్వాయర్లో పడి ఇంటర్ విద్యార్థి దుర్మరణం
మందస: కొంటాసాయి గిరిజన గ్రామానికి చెందిన సవర థ్రిల్లర్ మంజు(16) అనే ఇంటర్మీడియెట్ విద్యార్థి రిజర్వాయర్లో ప్రమాదశాత్తుపడి దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంటాసాయి గ్రామానికి చెందిన సవర సుబ్బారావు కుమారుడు థ్రిల్లర్ మంజు పలాస జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం సెలవు దినం కావడంతో పశువులను మేపేందుకు డబార్సింగి జలాశయం ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ స్నానానికి దిగి ఈత రాక మునిగిపోయాడు. ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి జలాశయం వైపు వెళ్లి వెతకగా నీటిలో విగతజీవిగా కనిపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గాలికొదిలేస్తారా?
ఊరిని వదిలేసి వస్తే.. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సొంత ఇల్లు, భూములు.. ఇలా సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులకు కూటమి పాలకులు చుక్కలు చూపిస్తున్నారు. కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా గాలికొదిలేస్తున్నారు. తమ గోడు పట్టించుకునే వారే లేకపోవడంతో నిర్వాసిత కాలనీవాసులు కుమిలిపోతున్నారు. తరతరాలుగా జీవిస్తున్న ఇళ్లు, భూములను వదులుకుంటే తమనే నట్టేట ముంచుతారా?అంటూ సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం గ్రామస్తులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. సంతబొమ్మాళి : మూలపేట పోర్టు నిర్మాణానికి భూములతో పాటు గ్రామాన్నే త్యాగం చేసిన విష్ణుచక్రం గ్రామస్తులు తమకు కేటాయించిన పునరావాస కాలనీలో కనీస స్థాయిలో కూడా మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాగునీరు, మురుగు కాలువలు, మరుగుదొడ్లు నిరుపయోగంగా ఉండటం, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవిస్తున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం గ్రామానికి నౌపడలో పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. ప్రతి కుటుంబానికి ఐదు సెంట్ల భూమి ఇచ్చారు. ఇందులో తాత్కాలిక షెడ్లను వేసుకొని జీవనం సాగిస్తున్నారు. 57 రేషన్ కార్డులు ఉండగా 45 మందికి మాత్రమే తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయడంపై మిగిలిన వారు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కాలనీలో మౌలిక వసతులు కొరవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీటి పథకం నిర్మాణంలో ఉండటంతో తలగాం నుంచి పైపులైన్ ద్వారా వస్తున్న నీరు ఎప్పుడు వస్తుందో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస కాలనీలో ఎర్త్పిల్లింగ్ పూర్తిస్థాయిలో చేయకుండా వదిలేయడంతో చిన్నపాటి వర్షాలకు నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. మురుగునీరు ప్రవహించేందుకు కాలువలు లేకపోవడంతో వాడుక నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. దీంతో రోడ్డు బురదమయంగా తయారై దోమలకు నిలయంగా మారింది. మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరు బయటకు వెవెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. రాత్రి వేళల్లో పాములు సంచరించడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగించాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. పెండింగ్లో పరిహారం.. గ్రామంలో ఉన్న మరిడమ్మ తల్లి ఆలయానికి, అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన పరిహారం ఇంతవరకు చెల్లించలేదు. పోర్టు రైల్వేలైన్, రోడ్డు మార్గానికి మధ్యన ఉన్న 40 ఎకరాల గ్యాప్ ఏరియాకి ఇంతవరకు పరిహారం అందజేయలేదని గ్రామస్తులు అంటున్నారు. రౖడైనేజీ వ్యవస్థ లేదు.. పునరావాస కాలనీలో వసతులు లేవు. డ్రైనేజీ వ్యవస్థ లేక వాడుక నీటితో పాటు చిన్నపాటి వర్షాలకు ఎక్కడికక్కడే నీరు నిలిచిపోతోంది. ఇల్లు చుట్టూ నీరు చేరి బురదమయంగా మారుతోంది. ఈగలు, దోమలకు నిలయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పునరావాస కాలనీలో గుడి నిర్మాణం చేపట్టాలి. ఇప్పటికై నా అధికారులు స్పందించాలి. – గిన్ని శ్యామ్సుందర్రావు, విష్ణుచక్రం గ్రామం, సంతబొమ్మాళి మండలం ఇబ్బంది పడుతున్నాం.. పునరావాస కాలనీలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆరు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. మట్టివేసి ఎత్తు చేయకపోవడంతో చిన్నపాటి వర్షాలకే ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండి చెరువులను తలపిస్తున్నాయి. అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలి. – గిన్ని ముత్తమ్మ, విష్ణుచక్రం గ్రామం, సంతబొమ్మాళి మండలం విష్ణుచక్రం నిర్వాసిత కాలనీలో కనీస సౌకర్యాలు కరువు మూలపేట పోర్టు కోసం సర్వం వదులుకున్న గ్రామస్తులు కాలువలు, తాగునీరు వంటి సదుపాయాలు లేక ఇక్కట్లు పట్టించుకోని కూటమి సర్కారు -
పాపం.. ఎంటీఎస్ టీచర్లు!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఎన్నో అవాంతరాలు, ఆవేదనలు, ఆక్రందనల నడుమ జిల్లాలో ఎట్టకేలకు మినిమం టైమ్ స్కేల్(ఎంటీఎస్) టీచర్లకు సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్ పూరయ్యింది. పాఠశాలలు పునఃప్రారంభమై రెండు వారాలు కావొస్తున్నా.. ఇప్పటికీ ఎంటీఎస్ టీచర్లకు పోస్టింగులు ఇవ్వకపోవడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున నేపథ్యంలో ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. ఇటీవల ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లో సమీప ప్రాంతాల్లోని స్కూళ్లలో పోస్టులను ఎంపికచేసుకున్నారు. దీంతో జిల్లా సరిహద్దు ప్రాంతాలు, సదూర ప్రాంతాల్లోని పాఠశాలల్లో మాత్రమే పోస్టులు ఖాళీగా మిగిలాయి. దీంతో గత్యంతరం లేక ఆ పోస్టులనే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమకు వచ్చే అరకొర జీతాలతో.. సుదూరంతాలకు రాకపోకలు ఎలా సాగించగలమని, ఎలా పనిచేయగలమని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 371 మందికి కౌన్సెలింగ్ పూర్తి.. జిల్లాలో 1998, 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్ ముగిసింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాల వేదికగా అదివారం ఉదయం 8 గంటలకు మొదలుకావాల్సిన ఈ ప్రక్రియ మధ్యాహ్నం వరకు ప్రారంభం కాలేదు. సాంకేతిక సమస్యల కారణంగా జాప్యం జరిగిందని అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం మొదలైన కౌన్సెలింగ్ ప్రక్రియ రాత్రి 7.30 గంటల వరకు కొనసాగింది. ఉదయం 8 గంటలకే పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న ఎంటీఎస్ టీచర్లు నానా అవస్థలు పడ్డారు. ప్రస్తుతం పాఠశాల్లో ఖాళీలు బట్టి వీరికి స్థానాలు ఖరారు చేశారు. జిల్లాలో 1998 డీఎస్సీ బ్యాచ్కు చెందిన 261 మంది, 2008 డీఎస్సీ బ్యాచ్ 110 మంది కలిపి మొత్తం 371 మంది ఎంటీఎస్ టీచర్లు పనిచేస్తున్నారు. వీరందరికీ కౌన్సెలింగ్ పూర్తిచేశారు. ఇద్దరు గైర్హాజరైనప్పటికీ.. వారికి ఫోన్లోనే పలు స్కూళ్ల ఖాళీలను తెలియజేసి కౌన్సెలింగ్ కానిచ్చారు. జిల్లాలో 371 మందికి 410 ఖాళీ పోస్టులను చూపించారు. మాన్యువల్ పద్ధతిలో జరిగిన ఈ కౌన్సెలింగ్ ప్రక్రియను డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, శ్రీకాకుళం ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి తదితరులు పర్యవేక్షించారు. విభజించి.. పాలించేలా.. ఎంటీఎస్ టీచర్ల పరిస్థితి ముందుగొయ్యి.. వెనుక నుయ్యి అన్న చందంగా తయారైంది. వారిలో వారికే తగాదాలు సృష్టించి.. విభజించి, పాలించూ అన్న చందంగా తయారుచేసింది కూటమి ప్రభుత్వం. గ్రూపు తగాదాలు సృష్టించి, తారతమ్యాలు వచ్చేలా చేసింది. తమకే ముందు కౌన్సెలింగ్ నిర్వహించాలని ఈ రెండు బ్యాచ్ల ఉపాధ్యాయులు పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో కొన్ని గంటలసేపు కౌన్సెలింగ్ నిలిచిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం 2008 డీఎస్సీ ఎంటీఎస్లకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తవ నేపథ్యం అందుకు భిన్నంగా ఉంది. 1998 బ్యాచ్ ఎంటీఎస్లే సీనియారిటీలో ముందుంటారనేది వారి వాదన. మొత్తమ్మీద విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు నిర్వహించి చివరకు 2008 ఎంటీఎస్లకు, ఆ తరువాత 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఎంటీఎస్ టీచర్ల ఇంటి చిరునామాకు సమీపంలోగానీ, వారి మండల పరిధిలోని పాఠశాలల్లో పోస్టింగులు ఇచ్చి బాసటగా నిలిచారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాత్రం సుదూర ప్రాంతాలకు బదిలీలు చేయడంతో వారంతా లబోదిబోమంటున్నారు. ఉన్న చోటు నుంచి సుదూర ప్రాంతాలకు బదిలీ అరకొర జీతాలతో అంతదూరం వెళ్లి ఎలా పనిచేయగలమని ఆవేదన న్యాయం చేయాలని వేడుకోలు జిల్లాలో 371 మందికి కౌన్సెలింగ్ పూర్తి -
వైభవంగా కూర్మనాథుని జయంతి
గార: శ్రీకూర్మనాథుని జయంతోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఏటా జ్యేష్ఠ శుద్ధ బహుళ ద్వాదశి నాడు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలో మూలవిరాట్కు వేకువజామున పంచామృతాభిషేకం జరిగింది. బాలభోగం అనంతరం స్నపన తిరుమంజనం సేవ నిర్వహించి ప్రధాన కలశాన్ని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. బేడా మండపంలో ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు ఉత్సవమూర్తికి వసంత కలశాభిషేకం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి శీతల నైవేద్యం సమర్పించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వాములను అనివెట్టి మండపంలో వేంచింపజేసి ధర్మకర్త గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్థాన మంటపంలో తీర్థ జలాలు, క్షీరాభిషేకం, కుంకుమలతో అభిషేకం నిర్వహించారు. స్వామికి నూతన వస్త్రాలంకరణ జరిపి కూర్మనాథుని ఆవిర్భావ చరిత్ర వివరించారు. అనంతరం మంగళాశాసనం, ప్రసాద వితరణ జరిగింది. కార్యక్రమంలో ఈవో కె.నరసింహనాయుడు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, దాసుబాబు, శ్రీనివాసాచార్యులు, లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ మృతి
శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పలాసకు చెందిన జి.కాంతారావు (28) అంపోలు సమీపంలోని కేశవరెడ్డి స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నారు. వ్యక్తిగత పనిమీద మిత్రుడితో కలిసి నరసన్నపేట నుంచి శ్రీకాకుళం ద్విచక్ర వాహనంపై వస్తుండగా కొత్త రోడ్డు జంక్షన్ వద్ద ఓ బిచ్చగాడు అడ్డంగా రావడంతో డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో కాంతారావు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రిమ్స్ ఔట్ పోస్టుకు తరలించారు. -
● ఫీజు రీయింబర్స్మెంట్ ఏదీ..?
ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల కోసం వేలాదిగా విద్యార్థులు నిరీక్షిస్తున్నారు. ఈ రెండింటిపైనే ఆధారపడి చదువుకుంటున్న వారి సంఖ్య జిల్లాలో వేలలో ఉంది. వీరిని కూటమి సర్కారు ఘోరంగా వంచించింది. 2023–24 విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉపకార వేతనం, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 45,657 మంది విద్యార్థులకు ఒక విడత రూ.34 కోట్లు గత ప్రభుత్వం విడుదల చేసింది. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మూడు విడతలకు సంబంధించి రూ.107 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. దీనిపై మాటైనా మాట్లాడడం లేదు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 47,153 మంది వివిధ కోర్సుల్లో చదువుతున్నారు. వీరికి కూడా నాలుగు విడతల్లో డబ్బులు వేయాలి. ఒక విద్యా సంవత్సరం ముగిసి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాత బకాయిల ఊసు లేదు. కేవలం ఒక విడత మాత్రమే విడుదల చేసి మూడు విడతల డబ్బు బకాయి పెట్టారు. దీంతో చదువులు పూర్తి చేసిన విద్యార్థులు సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి పూర్తి డబ్బు చెల్లించాల్సి వస్తోంది. పన్నెండు నెలలు గడిచిపోయాయి.. ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. 365 రోజులు అయిపోయాయి. నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఒక విద్యా సంవత్సరం ముగిసిపోయింది. విద్యా దీవెన, వసతి దీవెన విధివిధానమేంటో ఎవరికీ తెలీదు. కూటమి ఏడాది పాలనలో యువత ఘోరంగా మోసపోయింది. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు, నిరుద్యోగ భృతిపై ఊరూరా తిరిగి ప్రచారం చేసిన కూటమి నాయకులు.. ఇప్పుడు ఆ మాటెత్తడానికి కూడా ఇష్టపడడం లేదు. యువత సమస్యలపై గళమెత్తడానికి వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి యువత పోరును నిర్వహించనుంది. నరసన్నపేట: కూటమి ప్రభుత్వం యువతకు వెన్నుపోటు పొడిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. యువత పక్షాన నిలుస్తూ వారికి జరుగుతున్న అన్యాయాలను ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని, అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ వరకూ శాంతి ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం ఇస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలో ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే విగ్రహం వద్దకు కార్యకర్తలు యువకులు, నిరుద్యోగ యువత చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు యువతకు బోలెడు హామీలిచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ అధికారంలోకి వచ్చాక ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని కృష్ణదాస్ విమర్శించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వారు ఏడాది పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వక పోగా వేలాది మంది చిరుద్యోగులను తొలగించారని అన్నారు. నిరుద్యోగ భృతి నెలకు రూ. 3 వేలు ఇస్తామంటూ వాగ్దానం చేశా రని, ఒక్కరికై నా ఇచ్చారా అని ప్రశ్నించా రు. కూటమి నాయకులు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకూ యువతకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఉంటుందన్నారు. సోమవారం యువత పోరులో అందరూ పాల్గొనాలని పిలుపు నిచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: యువతను అధికార పక్ష నాయకులు నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందు మాటలు కోటలు దాటించి.. అధికారం దక్కాక హామీలు మర్చిపోయారు. యువతకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండానే కూటమి ప్రభుత్వం ఏడాది గడిపేసింది. ● విద్యా దీవెన, వసతి దీవెన కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు ● ఏడాది పాలనలో ఊసే లేని నిరుద్యోగ భృతి ● ఒక్క ఉద్యోగమూ ఇవ్వని కూటమి ● హామీలకు, అమలుకు పొంతన లేకుండా పాలన ● కొలువులేమయ్యాయి..? ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కూటమి నాయకులు ఎన్నికల ముందు హామీలిచ్చారు. ఈ ఏడాదిలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీనిపై జిల్లా యువత మండిపడుతున్నారు. ● జాబ్ క్యాలెండర్ గుర్తుందా..? ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. వీడియో రికార్డు చేసుకోండి.. రాసి పెట్టుకోండి.. అని గొప్పలకు పోయారు. కానీ 2025 జనవరి దాటి జూన్ వరకు వచ్చేశాం. కానీ జాబ్ క్యాలెండర్ మాటే ఆయనకు గుర్తు రాలేదు. కనీసం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల జోలికి కూడా పోలేదు. డీఎస్సీ ప్రకటించినా వివాదాలు వీడడం లేదు. వైఎస్ జగన్ హయాంలో ఉద్యోగాల విప్లవమే వచ్చింది. 2019–24 మధ్య సచివాలయం ఉద్యోగాలు, పోలీస్, పాత డీఎస్సీలతో టీచర్ల పోస్టులు భర్తీ చేశారు. ● నిరుద్యోగ భృతి నిరుద్యోగ యువతను వంచించడంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. 1999 నుంచి 2024 వరకు ఎన్నికల వేళ అధికారం కోసం ఉద్యోగాలు ఇస్తా లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పడం ఆయనకే చెల్లింది గత ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని పోస్టర్లు వేసి మరీ ప్రచారం చేశారు. పాలనలో రెండో ఏడాదికి చేరినా భృతిపై ఎక్క డా ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు. నేడే యువత పోరు యువతకు కూటమి వెన్నుపోటు పొడిచింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
అన్న చేతిలో తమ్ముడు హతం
నందిగాం: ఆర్థిక కారణాలు మానవ బంధాలను ధ్వంసం చేస్తున్నాయి. ఆస్తి కోసం అన్న తన సొంత తమ్ముడినే కొట్టి చంపిన ఘటన నందిగాం మండలం బోరుభద్ర పంచాయతీ కామధేనువు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కిల్లి లక్ష్మణనాయుడు, ఊర్మిల దంపతులకు ముగ్గురు కుమారులు ధర్మారావు, నీలకంఠం, తవిటయ్యతో పాటు ఒక కుమార్తె రమాదేవి ఉన్నారు. అందరికీ వివాహా లు చేశారు. తమ పోషణ కోసం కొంత భూమిని ఉంచుకొని మిగతా పొలం ముగ్గురు కుమారులకు పంచిపెట్టారు. అయితే తనకు ఎక్కువ భూ మి కావాలని ధర్మారావు తన తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. పెద్దవాడైన ధర్మారావు మండలంలోని నౌగాంలో భార్యతో నివాసం ఉంటూ, నర్సిపురంలో వెల్డింగ్ షాపు పెట్టుకొని పనిచేస్తూ, అప్పుడప్పుడు కామధేనువు వచ్చి తన వాటా పొలంలో వ్యవసాయ పనులు చేసేవాడు. రెండో వాడైన నీలకంఠం తిరుపతిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య గ్రామంలో ఉంటుంది. చిన్నవాడైన తవిటయ్యకు వివాహం అయినప్పటికీ భార్యతో విడాకులు కావడంతో తల్లిదండ్రులతో కలిసి కామధేనువులోనే ఉంటున్నాడు. పీజీ వరకు చదివిన తవిటయ్య గతంలో పలు ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్గా పనిచేసే వాడు. కానీ ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే ఉంటున్నాడు. అయితే పొలం వాటాలు పంచుకున్నప్పటికీ తల్లిదండ్రులు చిన్నవాడి దగ్గర ఉండటంతో వారి వాటా కూడా చిన్నవాడికి వెళ్లిపోతుందనే అపోహతో పలు మార్లు ధర్మారావు తండ్రి, తమ్ముడితో గొడవ పడేవాడు. ఈ గొడవల నేపథ్యంలో కలెక్టర్ గ్రీవెన్స్లో అర్జీ పెట్టడంతో వారు తహసీల్దార్ను పంపించారు. తహసీల్దార్ పంచాయతీ చేసి పెద్దల సమక్షంలో పంచుకోవాలని సూచించినా ధర్మారావు ఒప్పు కోలేదు. దీంతో తండ్రి ఎకరా 28 సెంట్లు అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడంతో నీలకంఠం భార్య రాములమ్మ ఆదివారం తన భర్త వాటాగా వచ్చి న పొలంలో విత్తనాలు వేయిస్తుండగా ధర్మా రావు వచ్చి అడ్డుకొని గొడవకు దిగాడు. దీంతో చిన్న తమ్ముడు తవిటయ్య వదినతో గొడవ ఎందు కని అడగ్గా ఆవేశంతో తమ్ముడి తలపై గడ్డపారతో కొట్టడంతో అతడుఅక్కడికక్కడే కు ప్పకూలిపోయాడు. అనంతరం ధర్మారావు అక్క డి నుంచి పారిపోయాడు. వదిన రాములమ్మ ఇచ్చిన సమాచారంతో 108 టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తవిటయ్యను తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నీలకంఠం భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నందిగాం ఎస్ఐ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొలం గొడవలే కారణం గడ్డపారతో తలపై కొట్టిన అన్న -
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు
అరసవల్లి, శ్రీకాకుళం న్యూ కాలనీ: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల ఆధ్వర్యంలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఆప్టెడ్ న్యూట్రిషన్ కేంద్రం (తిరుపతి)లో పలు హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తుల ను ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా పర్యాటక శాఖా ధికారి ఎన్.నారాయణరావు, తిరుపతి కేంద్ర అడ్మిషన్ ఇన్చార్జి కె.శివరామకృష్ణ సంయుక్తంగా తెలియజేశారు. గురువారం ఓ హోటల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2025–26 విద్యాసంవత్సరానికి బీఎస్సీ (హెచ్హెచ్ఎ) మూడేళ్ల కాలపరిమితి కోర్సునకు ఇంటర్ 40 శాతం మించిన మార్కు లు సాధించిన అభ్యర్థులు అర్హులని, అలాగే క్రాఫ్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెటిసరీ (సిసిఎఫ్పిపి) కోర్సునకు, అలాగే సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ (సిసిఎఫ్బిఎస్) కోర్సుల్లో చేరేందుకు కనీస అర్హతగా 10వ తరగతి అని పేర్కొన్నారు. తిరుపతి కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ కోర్సుల్లో ఆసక్తి గల అభ్యర్థులకు బ్యాంకు రుణ సదుపాయం కూడా ఉందని, వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్ఐహెచ్ఎంటిపిటి.ఓఆర్జి వెబ్సైట్ను సంప్రదించాలని మరిన్ని వివరాలకు 9701343846, 9700440604 నంబర్లకు సంప్రదించాలని, పూర్తి చేసిన దరఖాస్తులను వచ్చే నెల 4వ తేదీలోగా తిరుపతి కేంద్రానికి చేరేలా పంపించాలని కోరారు. జూలై 9 సార్వత్రిక సమ్మెకు ‘పెన్షనర్ల ఐక్యవేదిక’ మద్దతు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెకు పెన్షనర్లు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ఎన్జీఓ హోమ్లో ఆదివారం వివిధ పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో కన్వీనర్ ఎం.ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ ఉద్యోగులకు, కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని డిమాండ్ చేశా రు. సుదీర్ఘ పోరాటం చేసి కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేయడం ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర నష్టం చేయడమే అన్నారు. ప్రభుత్వం అమలు చేయదలుచుకు న్న పని గంటల పెంపు, మహిళలకు నైట్ షిఫ్ట్ లు, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ విధానం, జాతీయ ఆస్తులను ప్రైవేటీకరణ తదితర విధానాలు ఉద్యోగులు, కార్మికులు, సామాన్య ప్రజలకు నష్ట దాయకమని ఫలితంగా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లు తమ నిరసన తెలియజేస్తూ జూలై 9 సమ్మెకు మద్దతు తెలియజేయడానికి నిర్ణయించుకున్నారని తెలియజేశారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు వీఎస్ఎస్ కేశవరావు(శ్యామ్) (రాష్ట్ర ప్రభుత్వం), డి.పార్వతీశం (ఎడ్యుకేషన్), ఎం.గోవర్ధన్ రావు (బిఎస్ఎన్ఎల్ ), కె.చంద్రశేఖర రావు, కె.వెంకటరావు (పోస్టల్), ఎం.ప్రభాకర్ రావు (ఎల్ఐసి), పి.సుధాకర రావు (బ్యాంక్ ), ఎస్.వెంకటరావు(రాష్ట్ర ప్రభుత్వం) తదితరులు పాల్గొన్నారు. భారీగా పోలీసులకు స్థానచలనం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీస్ శాఖలో ఐదేళ్లకు పైగా ఒకే చోట పాతుకుపోయిన ఉద్యోగుల పీఠం ఎట్టకేలకు కదిలినట్టు సమాచారం. రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉత్తర్వులతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఏఎస్ఐలు, హెడ్కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. జిల్లావ్యాప్తంగా 221 మంది స్థానచల నం చెందగా వీరిలో 19 మంది ఏఎస్ఐలు, 53 మంది హెచ్సీలు, మిగతావారిలో కానిస్టేబు ళ్లు, ఎస్టీఎఫ్ పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. కాశీబుగ్గ సబ్డివిజన్ పరిధిలో విధులు నిర్వర్తించిన వారికి రెండు చోట్ల (శ్రీకాకుళం, కాశీబుగ్గ) కౌన్సిలింగ్లో అవకాశం ఇవ్వగా వారిలో ఎక్కువ శాతం అదే డివిజన్లో వేరే చోట ఉండేందుకు ఇష్టపడ్డారు. టెక్కలి సబ్ డివిజన్ వారికి ఇలానే అవకాశం వచ్చిన ట్టు భోగట్టా. శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధిలో ఉన్నవారికి మాత్రం కాశీబుగ్గ సబ్డివిజన్ పరిధి దూరప్రాంతాలకు బదిలీ చేయడంతో అంతా ఆవేదన చెందుతున్నారు. విద్యాసంస్థలు తెరిచి పిల్లలకి ఇప్పటికే నిర్ణయించిన స్కూళ్లు, కళాశాలలకు ఫీజులు కట్టి.. పుస్తకాలు కొనేయడంతో కుటుంబాలతో ఏం చేయాలో తెలియని స్థితి అంటూ ఏకరువు పెడుతుండటం విశేషం. -
‘జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలి’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసే విధానాలను మానుకోవాలని, ఎన్ఈపీ–2020 రద్దు చేయాలని వక్తలు డిమాండ్ చేశారు. కేరళలో జరగనున్న ఎస్ఎఫ్ఐ 18వ అఖిలభారత మహాసభల సందర్భంగా ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎస్సార్ జూనియర్ కాలేజ్లో విద్యాసదస్సు నిర్వహించారు. తొలుత ఎస్ఎఫ్ఐ జెండాను ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ వెంకటేష్ ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.పవిత్ర అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య వక్తలుగా డిప్యూటీ డీఈఓ కొత్తకోట అప్పారావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సీహెచ్ వెంకటేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి.చందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో వి ద్యారంగంలో వచ్చే సమస్యలపై నిస్వార్థంగా పోరాటం చేసే ఏకై క విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు విద్యావ్యతిరేక విధానాలు తీసుకొస్తున్నాయని, ప్రధానంగా నూతన జాతీయ విద్యావిధానం పేరు తో విద్యను పూర్తిగా కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె. ఖగేష్, జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ రాజు, జిల్లా కమిటీ సభ్యులు జైరాం, టౌన్ కమిటీ మెంబర్స్ భరత్, శివ తదితరులు పాల్గొన్నారు. -
రన్.. అదిరెన్
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో ఒలింపిక్ డే రన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ను ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ జెండా ఊపి ప్రారంభించారు. శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవీ పద్మావతి క్రీడాజ్యోతిని వెలిగించారు. నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాతబస్టాండ్ నుంచి వైఎస్సార్ సర్కిల్, పాలకొండా రోడ్, డే అండ్ నైట్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణం వరకు సాగింది. యువ, వర్ధమాన క్రీడాకారులతోపాటు క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాభిమానులు, పీడీలు, కోచ్లు, వెటరన్ ఆటగాళ్లు పాల్గొన్నారు. విశ్వవ్యాప్త గుర్తింపు క్రీడాకారులకే సొంతం: దాసన్న అనంతరం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సమావేశంలో క్రీడాకారులను ఉద్దే శించి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడారు. క్రీడలు చదువులో భాగంగానే చూడాలనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు. జిల్లాలో క్రీడాకారుల ప్రతిభకు కొదవలేదని, వారిని మరింతగా ప్రోత్సహించాలన్నారు. ఈరోజు విశ్వవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం దక్కేది క్రీడాకారులకేనని పేర్కొన్నారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా క్రీడాకారుల ఖిల్లాగా గుర్తింపు పొందిందని, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతోపాటు దాతలు సైతం ముందుకు రావాలని కోరారు. కోడిరామ్మూర్తి స్టేడియం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని వక్తలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంవీ పద్మావతి, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు మాస్టారు, ఎండీ కాసీంఖాన్, చిట్టి నాగభూషణం, కేఎన్ఎస్వీ ప్రసాద్, జిల్లా పీఈటీ సంఘ అధ్యక్షుడు ఎంవీ రమణ, ఎస్జీఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, గ్రిగ్స్ జిల్లా కార్యదర్శి కె.మాధవరావు, చల్లా జగదీష్, శ్రీనివాసరావు, గాలి అర్జున్రావురెడ్డి, ఆనంద్కిరణ్, భాస్కరరావు, సతీ ష్రాయుడు, రవికుమార్, వెంకటరమణ, ఆనంద్, లక్ష్మీనారాయణ, డీఎస్ఏ కోచ్లు, పీడీ, పీఈటీలు, క్రీడాసంఘాల ప్రతినిధులు, వాకర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖం చాటేసిన అధికార పార్టీ నాయకులు ఒలింపిక్ డే రన్కు కూటమి పార్టీల నాయకులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మరోసారి దూరంగా ఉన్నారు. గతంలో 2014–18 మధ్య కాలంలోనూ టీడీపీ నాయకులు ఇదే వైఖరి అవలంబించారు. దీనిపై క్రీడాకారులు, క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్ పాల్గొన్న క్రీడా సంఘాల నాయకులు, క్రీడాభిమానులు, అధికారులు, పీడీలు, ప్లేయర్లు ముఖం చాటేసిన పాలకపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులు -
విద్యా శాఖ.. వింత పోకడ
● ఒక వైపు పాఠశాలల్లో తరగతుల విలీనంతో రగడ ● మరోవైపు ఏక ఉపాధ్యాయులతో బడుల్లో అవస్థలు ● ఇంతలో నేటి నుంచి ‘సాల్ట్’ పేరిట ఎస్జీటీలకు శిక్షణ తరగతులు శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యా శాఖ వింత పోకడలు పోతోంది. ఇప్పటికే ఒకవైపు పాఠశాల విద్యాశాఖలో.. బడుల్లో తరగతుల విలీనం పంచాయితీ రచ్చ లేపుతోంది. మరోవైపు ఏక ఉపాధ్యాయులతో బడు లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఇంకొంతమంది బదిలీలు జరిగినప్పటికీ ఇప్పటికీ విధుల్లో చేరలే దు. ఇంతలోనే సెకండరీ గ్రేడ్ టీచర్లకు వృత్యంతర శిక్షణ పేరిట వారం రోజులపాటు శిక్షణ తరగతుల కు సన్నాహాలు చేశారు. సోమవారం నుంచి మొదలయ్యే పాఠశాల విద్య– సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ర్మేషన్ (ఎస్ఏఎల్టీ) ప్రొగ్రాం నిర్వహణ కు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాన్ రెసిడెన్షియల్ విధానంలో ఈనెల 23 నుంచి మొదలయ్యే ఈ మొదటి స్పెల్ శిక్షణ తరగతులు ఈనెల 28వ తేదీ వరకు ఆరు రోజులపాటు కొనసాగనున్నాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లో శిక్షణా..? పాఠశాల విద్యను బలోపేతం చేయడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి, అభ్యాస ఫలితాలను మెరుపర్చడానికి, ఉపాధ్యాయులు బోధనా నైపుణ్యాలను పెంచడానికి సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమికస్థాయిలో అనగా పునాది అభ్యసనాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయ–విద్యార్థి పరస్పర సంబంధాలను, బోధన నైపుణ్యాలను మెరుగుపర్చడం, సంస్థాగత సామర్థ్యాలను పెంచడం కోసం సెకెండరీ గ్రేడ్ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణకు అనువైన సమ యం ఇది కాదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు లేక వెలవెల.. ఇప్పుడిప్పుడే బడిబాట పడుతున్న ఉపాధ్యాయుల కు, కొత్త స్కూళ్లతో పరిచయాలు లేకపోవడం, మరోవైపు అడ్మిషన్లపై దృష్టి పెట్టే సమయం లేకపోవడంతో పాఠశాలలు బోసిపోతున్నాయి. పాఠశాలలకు సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లో ఉపాధ్యాయులు అడ్మిషన్ డ్రైవ్ల కోసం క్యాంపెయినింగ్లు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ఈ ఏడాది గణనీయంగా అడ్మిషన్లు తగ్గిపోయాయి. కొన్నిచోట్ల వెలవెలబోతున్నాయి. దీనికితోడు 3,4,5 తరగతులు, 6,7,8 తరగతులు సమీప ప్రాంతాల్లోని పాఠశాలల్లో విలీనం చేయడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో చదువులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏక ఉపాధ్యాయ బడుల్లో తీరు మరీ అధ్వానం తయారైందంటే అతిశయోక్తి కాదు. -
● ఫీజుల బాదుడు
కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రైవేటులో ఫీజుల బాదుడు పెరిగింది. ఏడాది కాలంలో సగటున 10 నుంచి 30 శాతం పైగా స్కూల్ ఫీజులు పెంచేయడంతో మధ్య తరగతి జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఓ కార్పొరేట్ స్కూల్లో 3వ తరగతి ఫీజు రూ.45 వేలు ఉంటే, ఇప్పుడు రూ.55 వేలకు పెరిగింది. పుస్తకాల ధర రూ.7 వేల నుంచి రూ.8,500కి చేరింది. ఏడాది కాలంలో వందకుపైగా కొత్త ప్రైవేట్ స్కూళ్లకు విద్యాశాఖ అనుమతి ఇచ్చినట్టు అంచనా. సాధారణ బడ్జెట్ పాఠశాలల్లో ఒకటో తరగతికి రూ.12 వేలు ఫీజు, పుస్తకాలకు మరో రూ.3 వేలు వసూలు చేస్తుండగా, ఆరో తరగతికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు తీసుకుంటున్నారు. పుస్తకాలకు మరో రూ.5 వేలు వెరసి రూ.30 వేలు అవుతోంది. కార్పొరేట్ పాఠశాలలు నాన్ ఏసీ, ఏసీ తరగతులు అంటూ ఫీజులు బాదుతుండడం గమనార్హం. -
●జాబ్మేళా రేపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న ఎచ్చెర్లలోని టీటీడీసీలో జాబ్మేళా నిర్వహించనున్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫైనాన్స్ లిమిటె డ్ కంపెనీలో బ్రాంచి మేనేజర్ పోస్టులు 8 ఉన్నాయని, ఎంపికై న వారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. 18–35 ఏళ్ల వయసు గల సీ్త్ర, పురుష అభ్యర్థులు అర్హులని ఎంబీఏ, మార్కెటింగ్ ప్రత్యేక సబ్జెక్టు కలిగి ఉండాలని తెలిపారు. ఇంటర్వ్యూలు సోమవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. -
శ్రీకాకుళం
ప్రయాణికుల కస్సు‘బస్సు’యోగాంధ్ర కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సరిపడా సర్వీసులు లేక ఇక్కట్లు పడ్డారు. –8లోఆసనం వేస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విలీన గందరగోళం పాఠశాలల విలీనం గందరగోళం సృష్టిస్తోంది. పలు పాఠశాలలకు తాళాలు పడ్డాయి. –8లోఆదివారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2025యోగా నిరంతర అభ్యాసం శ్రీకాకుళం కల్చరల్: యోగాను నిరంతర అభ్యాసంగా మార్చుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ గత నెల 21 నుంచి జిల్లాలో 6500 ప్రదేశాల్లో యోగాసనాల శిక్షణ నిర్వహించామన్నారు. ఆర్ట్స్ కళాశాల మైదానంలో పడేసిన బాటిల్స్, పాలిథిన్ కవర్లు శుభ్రం చేశారు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని యువతకు సందేశం ఇచ్చారు. 1972 టోల్ఫ్రీ నంబరుకు వీటిపై సమాచారం ఇవ్వాలన్నా రు. కార్యక్రమంలొ జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.అనిత, నెహ్రూయువ కేంద్రం ఉపసంచాలకులు వెంకట్ ఉజ్వ ల్, ఆయూష్ వైద్యులు జగదీష్, ఉత్తమరాజ్రాణా తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ న్యూస్రీల్ -
‘యోగాంధ్ర కాదు.. ఉద్యోగాంధ్ర కావాలి’
నరసన్నపేట: రాష్ట్రాన్ని యోగాంధ్రగా కాదని ఉద్యోగాంధ్రగా మార్చాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ఏడాది గడిపేసిందని విమర్శించారు. వీరు శనివారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఒక వైపు అప్పులు చేస్తూ మరో వైపు గొప్పల కోసం తిప్పలు పడుతోందన్నారు. విశాఖలో యోగాంధ్ర పేరిట కోట్లాది రూ పాయలు వెచ్చించి ప్రజాధనం వృధా చేశారని మండిపడ్డారు. గిరిజన స్కూల్స్లో నాణ్యమైన విద్య, మంచి భోజనం అందించినప్పుడే యోగాంధ్ర లాంటి కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు. మన జిల్లాలో నిరుద్యోగులకు ఎలా ఉపాధి కల్పిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే పరిస్థితి కొనసాగి తే యువత, నిరుద్యోగుల తరఫున ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు ఆర్. అరవిందు, వై. వేణు, జి. వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఆహ్వానించి అవమానించారు’
టెక్కలి: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యో గా దినోత్సవం కార్యక్రమానికి ఆహ్వానించి అ వమానించారని ఎంపీటీసీ సభ్యురాలు, యో గా నిర్వాహకురాలు సత్తారు ఉషారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రోజు తమను ఆహ్వానించి కళాశాలలో యోగా దినోత్సవ కార్యక్రమానికి సహకరించాలని కోరారని, తీరా కళాశాలకు వెళితే...రాజకీయ పార్టీ పేరు ను ఆపాదించి అవమానించారని ఆమె వాపోయారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పీఎం, సీఎం ప్రకటనలు చేశారని ఇక్కడ మాత్రం ఆ పరిస్థితులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యోగాంధ్రకు వెళ్లి వస్తూ.. రణస్థలం: మండలంలోని రణస్థలం జాతీయ రహదారిపై యోగాంధ్ర వెళ్లి వస్తుండగా గనగళ్ల నూకరాజు అనే వ్యక్తికి కోళ్ల వ్యాను ఢీకొని గాయాలయ్యాయి. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు యోగాంధ్రకు వెళ్లిన రెండు బస్సుల్లోని వ్యక్తులు మండల కేంద్రంలోని గాయత్రి హాటల్ వద్ద భోజనాలకు దిగా రు. మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో నూకరాజు రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న కోళ్ల వ్యాను ఢీకొట్టి వెళ్లిపోయింది. నూకరాజుకు కాలు విరగడంతో అదే బస్సులో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు హైవే సీసీ కెమెరాల సాయంతో వ్యాన్ను పట్టుకున్నారు. క్షత్రగాత్రుడి స్వగ్రామం శ్రీకాకుళం రూరల్ మండలంలోని పుక్కళ్లవానిపేట. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏపీ పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్ 2025 తొలివిడత వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ మండలంలోని కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం ప్రారంభమైంది. తొలి రోజు ఒకటి నుంచి 15 వేలు ర్యాంక్ మ ధ్య విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. పత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న వారు 25వ తేదీ నుంచి కళాశాలలు, బ్రాంచ్ల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ప్రారంభించనున్నారు. రెండో రోజు 15001 నుంచి 32000 ర్యాంక్ వరకూ గల విద్యార్థులు ధ్రువీకరణ పత్రాల పరిశీలనలకు హాజరు కావాలని అధికారులు తెలిపా రు. పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యులు, సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు, సీనియర్ అధ్యాపకులు మురళీకృష్ణ పర్యవేక్షణలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. హెచ్సీ జగదీష్ కుటుంబానికి సాయం సోంపేట: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ పి.జగదీశ్వరరావు కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ కింద రూ.లక్ష నగదు చెక్కును పోలీస్ అసోసియేషన్ సభ్యులు శనివారం అందజేశారు. వీరు మృతుడు జగదీష్ స్వగ్రామం మండలంలోని ఎర్రముక్కాం గ్రా మం వెళ్లి సాయాన్ని అందించారు. జగదీష్ ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించేవారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదే శాల మేరకు మృతుడు జగదీష్ కుటుంబ సభ్యులను శనివారం కలిసి రూ.లక్ష చెక్కును సతీమణి పుష్పలతకు జిల్లా పోలీసు యూని యన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణంనా యుడు,ట్రెజరర్ కె.భుజంగరావులు అందజేసి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేడు శ్రీకాకుళంలో ఒలింపిక్ డే రన్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఒలింపిక్ డే రన్ ఆదివారం ఉదయం జరగనుంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సంయుక్తంగా ఏటా నిర్వహించే ఈ ఒలింపిక్ డే రన్ ర్యాలీ నేడు ఉదయం 6.30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని పొట్టిశ్రీరాములు జంక్షన్ నుంచి మొదలుకానుంది. అక్క డ నుంచి కళింగరోడ్, వైఎస్సార్ సర్కిల్, పాలకొండ రోడ్, కృష్ణాపార్క్, డే అండ్ నైట్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు సాగుతుంది. కార్యక్రమంలో క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మా న కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సీఈఓ పి.సుందరరావు, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు సంయుక్తంగా కోరారు. -
దుకాణాలు సర్దేశారు..!
ఆమదాలవలస రూరల్: ఆమదాలవలస బస్టాండ్ కు సమీపంలో ఏర్పాటు చేసిన రైతు బజార్ ఖాళీగా దర్శనమిస్తోంది. కొనుగోలుదారులు అంతగా రాకపోవటంతో రైతులు తమ దుకాణాలను పూర్తిగా ఖాళీ చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి నేరుగా విక్రయించుకునేందుకు గతంలో రైతు బజార్లను ఏర్పాటు చేశారు. ఆమదాలవలస రైతు బజారులో 48 దుకాణాలను ఏర్పాటు చేశారు. అయితే ఒకటి రెండు దుకాణాల్లో కిరాణా, బియ్యం వంటివి విక్రయించుకొని రైతులు తమ వ్యాపారం సాగిస్తున్నారు. అయితే పట్టణానికి దూరంగా ఈ రైతు బజారును నిర్మించడం వల్ల కొనుగోలుదారులు అంత దూరం వెళ్లడానికి సుముఖత చూపడం లేదు. మున్సిపాలిటీ పరిధిలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కొత్తగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసి అనేక దుకాణాలు నిర్మించి వ్యాపారులకు అద్దెలకు ఇవ్వటంతో వ్యాపారమంతా అక్కడే కొనసాగుతోంది. దీంతో విక్రయదారులు రైతు బజారుకు వచ్చే అవకాశం లేకపోవటంతో రైతులంతా ఒక్కసారిగా ఖాళీ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు సంబంధించిన పంటలను కొనుగోలు చేసి ఉల్లి, టమాటా వంటి వస్తువులు రైతు బజార్ల ద్వారా రాయితీపై అందించాల్సి ఉంది. అసలు రైతు బజా రే లేకపోతే రాయితీపై సరుకులు ఎలా ఇస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. తుఫాన్, వరదలు వంటి సమయంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు రైతు బజార్ల ద్వారానే ప్రభుత్వం అందిస్తుంది. అయితే ఆమదాలవలసలో పూర్తిగా రైతు బజారే మూతపడే పరిస్థితి ఉంటే ప్రజలను కూటమి ప్రభుత్వం విపత్తుల సమయంలో ఎలా ఆదుకుంటుందో ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటిౖకైనా కూటమి ప్రభుత్వ పాలకులు, అధికారులు రైతులకు ఎంతో మేలు కల్పించే ఈ రైతు బజార్ను తెరిపించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఎంటీఎస్ టీచర్లకు సర్దుపోటు
శ్రీకాకుళం న్యూకాలనీ: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నియామకమైన మినిమమ్ టైమ్స్కేల్ ఉపాధ్యాయులకు ఎట్టకేలకు సర్దుబాటు బదిలీల కౌన్సెలింగ్కు అధికారు లు చర్యలు తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 2008 బ్యాచ్ టీచర్లకు, ఉదయం 10 నుంచి 1998 బ్యాచ్ టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్ చేప ట్టాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారులు ఇప్పటికే జారీ చేశారు. ఉద్యోగాలు కల్పించి ఆదుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. సాధారణ ఉపాధ్యాయ బదిలీల్లో 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీ మినిమమ్ టైం స్కేల్ టీచర్లు తీవ్ర అన్యాయానికి గురయ్యారు. ఎంటీఎస్ టీచర్లు పనిచేస్తున్న పోస్టులను ఖాళీల జాబితాలోకి తీసుకురావడంతో వారి పోస్టులు గల్లంతయ్యాయి. దీంతో వీరందరికీ కౌన్సెలింగ్ అనివార్యంగా మారింది. ఇదిలా ఉంటే 1998 డీఎస్సీతో పాటు 2008 డీఎస్సీలో అన్యాయానికి గురై న్యాయస్థానాల్లో దశాబ్దాలపాటు కేసులతోను, అనేక ప్రభుత్వాల ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులు చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో 2023లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీరి పాలిట దేవుడయ్యారు. వీరందిరికీ మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) పద్ధతిన ఉద్యోగాలు కల్పించి ఆపద్బాంధవుడిగా నిలిచారు. వీరిలో 70 శాతం మంది పదవీ విరమణ దశకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా అన్యాయం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో వీరి పరిస్థితి బాగానే ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన తర్వాత అడుగడుగునా అన్యాయం జరుగుతోంది. వేధింపులు సైతం ఎక్కువయ్యాయి. గతంలో ఉన్న 12 నెలల జీతాన్ని కూటమి ప్రభు త్వం 11 నెలలకు మార్చివేసింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ సాధారణ బదిలీల్లోను అన్యాయం జరిగింది. వీరి భార్య లేదా భర్త ప్రభుత్వ ఉద్యోగి అయితే వారికి కచ్చితంగా బదిలీల్లో స్పౌజ్ పాయింట్లు కేటాయించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఎంటీఎస్ టీచర్లను ఇప్పటికీ తమ వ్యతిరేకులుగానే చూస్తోంది. కేజీబీవీల్లోని టీచర్లకు స్పౌజ్ పాయింట్లు కేటాయిస్తున్నప్పటికీ ఎంటీఎస్ టీచర్లకు మా త్రం మొండిచేయి చూపడాన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. జిల్లాలో ఎంటీఎస్ టీచర్లు 371 మంది.. శ్రీకాకుళం జిల్లాలో 1998 డీఎస్సీ టీచర్లు 260 మంది, 2008 డీఎస్సీ టీచర్లు మంది 111 కలిపి మొత్తం 371 మంది మినిమమ్ టైం స్కేల్ విధానంలో వివిధ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లగా పనిచేస్తున్నారు. వీరిలో మెజారిటీ టీచర్లు ఈ రెండు మూడేళ్లలో రిటైర్ కానున్నారు. ఈ జూన్ నెలలోనే 8 మంది వరకు పదవీ విరమణ చేయనుండడం గమనార్హం. ఈ నెలలోనే పదవీ విరమణ చేయనున్న ఎంటీఎస్ టీచర్లు సైతం నేడు జరిగే సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్కు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా బదిలీల్లో ప్రాధాన్యం ఎవరికి..? ఇవ్వాలన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తమ వృద్ధాప్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరు తూ 1998 ఎంటీఎస్ టీచర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం జరగనున్న బదిలీల్లో తమ ను దూర ప్రాంతాలకు పంపిస్తే.. అరకొర జీతాల తో ఎలా వెళ్లగలమని వారంతా వాపోతున్నారు. ప్రభుత్వం కూడా బదిలీల్లో 2008 డీఎస్సీ ఎంటీఎస్లకు తొలి ప్రాధాన్యమివ్వాలని భావిస్తోంది. అదే జరిగితే తాము అన్యాయమైపోతామని 1998 ఎంటీఎస్ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే బదిలీలకు సంబంధించిన సీనియారిటీ జాబితాను ప్రకటించారు. మిగిలి ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకుని మానవతా దృక్పథంతో స్థాన చలనానికి అవకాశం కల్పించాలని ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకులు విన్నవిస్తున్నారు. మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్లకు అడుగడుగునా అవమానాలు, అన్యాయాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వడంతోనే ఈ దుస్థితి జిల్లాలో 1998 టీచర్లు 260 మంది, 2008 టీచర్లు 111 మంది నేడు జిల్లా కేంద్రంలో మినిమమ్ టైమ్ స్కేల్ టీచర్లకు సర్దుబాటు బదిలీ కౌన్సెలింగ్ -
గ్రామంలో ఒంటరి జీవితం
సంతబొమ్మాళి : మూలపేట పోర్టు నిర్మాణంలో భాగంగా విష్ణుచక్రం ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. కానీ ఆ వృద్ధ దంపతులు మాత్రం గ్రామాన్ని వదిలి వెళ్లలేదు. పగలు, రాత్రి బిక్కుబిక్కుమంటూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మూలపేట, విష్ణుచక్రం గ్రామస్తులు తమ భూ ములతో పాటు గ్రామాన్ని కూడా పోర్టు నిర్మాణానికి త్యాగం చేశారు. నష్టపరిహారంతో పాటు నౌపడలోని 58 ఎకరాల్లో ఈ రెండు గ్రామాలకు పునరావాస కాలనీ గత ప్రభుత్వ హయాంలోనే మొదలైంది. అయితే మొదటి విడతగా విష్ణు చక్రం గ్రా మానికి చెందిన 57 మందికి లాటరీ ద్వారా పునరావాస కాలనీలో ప్రతి కుటుంబానికి ఐదు సెంట్లు ఇంటి స్థలాన్ని కేటాయించారు. దీంతో విష్ణుచక్రం గ్రామాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. గ్రా మంలో అందరూ ఖాళీ చేసినా గ్రామానికి చెందిన గిన్ని ఈశ్వరరావు, మహాలక్ష్మి అనే వృద్ధ దంపతులు మాత్రం ఊరిని విడిచి వెళ్లలేదు. పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, నౌపడలో పునరావాస కాలనీలో ఇంటి స్థలం ఇవ్వలేదని, కన్న ఊరును విడిచి వెళ్లకుండా బిక్కుబిక్కుమంటూ పగలు, రాత్రి జీవనం సాగిస్తున్నారు. ఇంటి స్థలం ఇవ్వకపోతే తాము ఎక్కడికి వెళ్లినా ఎలా బతకగలమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో మనుషులు ఎవరూ లేకపోవడంతో భయాందోళనతో బతుకుతున్నామని, తాగునీటి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన దారపు కనకరత్నం కూడా పీడీఎఫ్ పరిహారం, పునరావాస కాలనీలో ఇంటి స్థలం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం ఉదయం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందినట్లు హెచ్సీ ఎం.సోమేశ్వరరావు తెలిపారు. రైలు పట్టాలు దాటుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. మృతుడు తెలుపు, నలుపు గీతల షర్టు, నల్లని నిక్కరు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. వివరాలకు 9110305494 నంబర్ను సంప్రదించాలని కోరారు. యువకుడు ఆత్మహత్య కాశీబుగ్గ : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు సూదికొండ ప్రాంతంలో సూర్యకాలనీకి చెందిన కొవిరి నూకరాజు (22) అనే యువకుడు శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడి కార్మికుడు నారాయణరావు రెండో కుమారుడు నూకరాజు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శనివారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి ఎచ్చెర్ల : లావేరు మండలం అదపాక సమీపంలోని పంట పొలాల్లో విశాఖపట్నం జిల్లా తాటిచెట్లపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పి.జగన్నాథం(35) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. అదపాక వీఆర్వో ఎన్.వెంకటరమణ ఫిర్యాదు మేరుకు లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. లావేరు హెచ్సీ జోగారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ అంబేడ్కర్ ఆలోచన ఫౌండేషన్ రాష్ట్ర చైర్మన్, సీనియర్ అడ్వకేట్ పినిపే వెంకట రామకృష్ణ అన్నారు. నగరంలోని ఇలిసిపురం అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఎస్సీ, ఎస్టీ అడ్వకేట్స్ క్యాడర్ క్యాంపు శనివారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 158 బార్ కౌన్సిల్లు ఉన్నాయని, వాటిలో ఏఎఎఫ్ క్యాడర్ కూడా ఉందన్నారు. ఎనిమిది వేల మంది ఎస్సీ, ఎస్టీ న్యాయవాదులున్నారని, మనమంతా ఐక్యతను చాటి చెప్పాలన్నారు. ఏఏఎఫ్ అనేది నిరంతర ప్రక్రియ అని, ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు. అంబేడ్కర్ మూమెంట్ నడపాలంటే కఠోర దీక్ష ఉండాలని, నాయకునికి ఎటువంటి బలహీనతలు ఉండకూడదని చెప్పారు. రాజకీయ పార్టీలు ఎస్సీ, ఎస్టీలను విభజించి పాలిస్తున్నాయన్నారు. ఈసారి రాష్ట్ర బార్ కౌన్సిల్ పోటీల్లో ముగ్గురు న్యాయవాదులు తప్పనిసరిగా గెలవాల్సిన అవసరం ఉందన్నారు. మనకు ఎవ్వరూ ఎటువంటి పదవులు ఇవ్వరని, పోరాటాల ద్వారానే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బతికినంత కాలం అంబేడ్కర్ విధానంతో బతకాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పొన్నాడ రాము, బి.మురళీకృష్ణ, రుంకు అప్పారావు, గంజి ఆర్.ఎజ్రా, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు, అడ్వకేట్ దండాసి తదితరులు పాల్గొన్నారు. -
మా పిల్లలను వేరే స్కూల్కు పంపించలేం
● వనుమువానిపేట పాఠశాల వద్ద తల్లిదండ్రుల నిరసన గార : మా పిల్లలను కిలోమీటరు దూరంలో ఉన్న వేరే పాఠశాలకు పంపలేమంటూ గార మండలం వనుమువానిపేట పాఠశాల వద్ద తల్లిదండ్రులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మాధవి, మాజీ చైర్మన్ రమణలు మాట్లాడుతూ పాఠశాలలో మొత్తం 26 మంది విద్యార్థులుండగా, ఆదర్శ పాఠశాల పేరు చెప్పి తండ్యాలపేట పాఠశాలకు 3, 4, 5వ తరగతుల విద్యార్థులను కలిపేందుకు నిర్ణయించారని, పాఠశాల నుంచి 12 మంది విద్యార్థులు ప్రతీ రోజు పుస్తకాల బరువుతో ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. దారిలో కుక్కల గుంపులు వంటి సమస్యలున్నాయని, ఈ విషయాన్ని అధికారులు పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరూ రోజువారీ వ్యవసాయం, కూలి పనులుకు వెళ్లకపోతే బతకలేని పరిస్థితి ఉందని, చిన్నారులను రోజు తీసుకువెళ్లి, తీసుకురావడం ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గొండు శంకర్, విద్యాశాఖ అధికారులు స్పందించి సమస్య పరిష్కారించాలని కోరారు. -
నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో నిత్యాన్నదాన పథకానికి జిల్లాకు చెందిన ప్రగడ రామ్నాయుడు, గజలక్ష్మి దంపతులు, వారి కుమారుడు బాలాదిత్య రూ.1,00,001 విరాళంగా సమర్పించారు. ఈమేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ వెంకటరమణకు శనివారం విరాళం అందజేశారు. అంతకుముందు ఆదిత్యున్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ బాలభాస్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు. 49 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అరసవల్లి: జిల్లాలో ఖాళీగా ఉన్న 49 ఆశావర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత ప్రకటించారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో వివరాల ప్రకారం.. జిల్లాలో ఈ పోస్టులకు ఆసక్తి గల అర్హులు ఈ నెల 23 నుంచి 30వ తేదీలోగా ఆయా ప్రాంతాల్లో ఉన్న సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి ఉత్తీర్ణత, 25 నుంచి 45 ఏళ్ల లోపు వయస్సున్న అదే గ్రామానికి చెందిన మహిళలు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. జిల్లాలో అక్కులపేట, బూర్జ, ఎచ్చెర్ల, బాతువ, జి.సిగడాం, గార, కొలిగాం, బొరివంక, తిలారు, నిమ్మాడ, రెంటికోట, తాడివలస, పాతర్లపల్లి, రావాడ, బోరుబద్ర, డి.జి.పురం, నౌపడ, సంతబొమ్మాళి, సింగుపురం, శ్రీకాకుళం రూరల్, అక్కుపల్లి, కంచిలి, నందిగాం, నౌగాం, బైదలాపురం, బొంతు, సారవకోట, కె.కొత్తూరు, లింగాలవలస, ఎల్ఎన్.పేట తదితర ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ అలాగే అరసవల్లి, ఫాజుల్బాగ్పేట, కాకివీధి, డీసీసీబీ కాలనీ, ఆదివారంపేట అర్బన్ పిహెచ్సీ పరిధిలోనూ అలాగే సచివాలయాల పరిధిలో మొత్తం 49 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లుగా డీఎంహెచ్ఓ అనిత ప్రకటించారు. జెమ్స్లో యోగా డే శ్రీకాకుళం రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రాగోలు జెమ్స్ ఆస్పత్రి ఆవరణలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, అకడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా, బొల్లినేని మెడిస్కిల్స్ బీఎస్సీ పారామెడికల్ కళాశాలలోనూ యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఫిజికల్ డైరెక్టర్ కుసురాజు, జగదీష్, అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మీ పద్మజ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మిగులు సీట్లు నిరుపేద దళితులకు ఇవ్వాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీఆర్డబ్ల్యూర్ఈఐ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న డాక్టర్ బి.అర్.అంబేడ్కర్ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ప్రవేశాల్లో భర్తీ చేయగా మిగిలిన సీట్లలో ప్రవేశ పరీక్ష రాయని నిరుపేద దళిత విద్యార్థులను చేర్పించుకోవాలని కులనిర్మూలనా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
ప్రయాణికుల కస్సు‘బస్సు’
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శనివారం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమానికి జనాలను తరలించేందుకు జిల్లా నుంచి 220 బస్సులు వేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా రూట్లలో బస్సులు తిరగకపోవడంతో ముఖ్య ప్రాంతాలతోపాటు గ్రామీణ ప్రాంత ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో వింత పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం నుంచి దూరప్రాంతాలకు వెళ్లేందుకు కాంప్లెక్స్లో బస్సులు ఉన్నప్పటికీ ప్రయాణికులు ఎవరూ కనిపించలేదు. ముఖ్యంగా విశాఖ వెళ్లే నాన్స్టాప్ కౌంటర్ ఖాళీగా కనిపించింది. మధ్యాహ్నం 12గంటల వరకూ బోసిపోయి కనిపించింది. ప్రయాణికులు రాక ఆ బస్సులు అలాగే ఉండిపోయాయి. ఇక ఇచ్ఛాపురం, పాతపట్నం, బత్తిలి, రాజాం, బొబ్బిలి, విజయనగరం, పాలకొండ తదితర ప్రాంతాలకు వెళ్లే బస్టాప్ల వద్ద ప్రయాణికులు కూడా అంతంత మాత్రంగానే ఉండటం కనిపించింది. తప్పని పడిగాపులు.. శనివారం మధ్యామ్నం సమయంలో ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉండటం కనిపించింది. యోగాంధ్ర కార్యక్రమం పూర్తయి బస్సులు వచ్చేస్తాయని భావించి అనేక మంది ప్రయాణికులు రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకూ అధిక సంఖ్యలో ప్రయాణికులు కాంప్లెక్స్కు చేరుకున్నా బస్సులు లేక గంటల తరబడి నిరీక్షించారు. మారుమూల గ్రామాలకు వెళ్లేందుకు సైతం బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వచ్చింది. ముందస్తు సమాచారం లేకే.. విశాఖపట్టణంలో జరిగిన యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులను తరలించిన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు తిరగవని అధికారులు ముందస్తు సమాచారం చేరవేస్తే బాగుండేదని, తమ ప్రయాణాలను వాయిదా వేసుకునేవారమని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం పూట బస్సులు ఉన్నా కానరాని ప్రయాణికులు మధ్యాహ్నం పూట ప్రయాణికులు ఉన్నా లేని బస్సులు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపాటు -
విలీన గందరగోళం.. పాఠశాలలకు తాళం
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యలో ప్రభుత్వ బడులను 9 రకాల స్కూళ్లగా విభజించి అటు ఉపాధ్యాయులను, ఇటు విద్యార్థులను కూటమి ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టింది. విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ పిల్లలకు ప్రాథమిక విద్యను ‘దూరం’ చేస్తోంది. ఒకప్పుడు సొంత ఊరిలోనే ఉండి చదువుకున్న పరిస్థితుల నుంచి.. నేడు సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువు కొనాల్సిన దుస్థితి కల్పిస్తోంది. పునర్విభజన జరిగిన శ్రీకాకుళం జిల్లాలో తరగతుల విలీనమైన బడుల సంఖ్య 338 ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 6,7,8 తరగతులు సమీపంలో విలీనమైన స్కూళ్లు 93 ఉండగా.., 3,4,5 తరగతుల విలీనం జరిగిన స్కూళ్లు ఏకంగా 245 ఉండటం గమనార్హం. ఒక్క పొందూరు మండలంలోనే సుమారు 12 ప్రాథమికోన్నత తరగతులను పొరుగున ఉన్న హైస్కూళ్లలో కలిపేశారు. జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లోను ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలల్లో తరగతులు విలీనం కావడంతో విద్యార్థులతో కలిపి తల్లిదండ్రులు బడుల వద్ద నిరసన చేస్తున్నారు. కొన్నిచోట్ల తాళం వేస్తున్నారు. అలవెన్సులు ఇస్తారట.. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య (6–14సంవత్సరాలు) అనేది రాజ్యాంగం బాలలకు ఇచ్చిన హక్కు. దానిని కూడా ట్రాన్స్పోర్ట్ అలవెన్సు పేరిట ప్రత్యమ్నాయ దిశగా హరించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను బాలల హక్కుల సంఘాలు, మహిళా శిశుసంక్షేమ శాఖ, మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. తక్షణమే బాలలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక హక్కును కల్పించాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. పాఠశాలల విలీనం తరువాత సింగిల్ టీచర్ స్కూళ్లే అధికమయ్యాయి తప్పిస్తే.. పిల్లలకు ఏవిధంగా మేలు జరిగిందో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఒకటి నుంచి పది తరగతులు నడపడానికి ప్రపంచంలో ఎక్కడా తొమ్మిది రకాల స్కూళ్లు లేవని.. ఒక్క ఏపీలోనే ఈ దుస్థితి ఉందని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ స్కూల్కు పంపించాలో.. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 9 రకాల స్కూళ్లతో తమ పిల్లలను ఏ స్కూల్కు తమ పిల్లలను పంపించాలో తెలియక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు, శిక్షణా తరగతలు పూర్తిచేసుకుని.. ఇప్పుడిప్పుడే ఉపాధ్యాయులు బడిబాట పడుతున్నారు. కొత్త పాఠశాలల్లో చేరిన టీచర్లకు సైతం స్థానిక పరిస్థితులు, స్థితిగతులు తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఇదీ పరిస్థితి.. శ్రీకాకుళం జిల్లాలో ఈ కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 2955 పనిచేయనున్నాయి. గత విద్యా సంవత్సరం ప్రకారం 1,62,554 మంది చదువుతున్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యపు విధానాలు, ఏకపక్ష నిర్ణయాలతో విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుండటంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించడానికి మొగ్గుచూపుతున్నట్టు ఉపాధ్యాయులే బాహాటంగా చెబుతున్నారు. 400 ప్రైవేటు పాఠశాలల్లో 95వేల మంది వరకు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన మోడల్ ప్రైమరీ స్కూళ్ల పేరిట ప్రభుత్వం నయవంచన సుదూర ప్రాంతాలకు వెళ్లలేక ఆవేదన కూటమి సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు -
సాధ్యమయ్యేనా?
విద్యాహక్కు చట్టానికి విరుద్ధంగా రెండు, రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప పాఠశాలల్లో ఉన్న 3,4,5 తరగతులను చేసేశారు. 4 లేదా 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల పిల్లలను విలీనం చేసేశారు. ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం మాత్రం వెనిక్కి తగ్గలేదు. ఇదేంటని ప్రశ్నిస్తే రవాణా (ట్రాన్స్పోర్ట్) అలవెన్సు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా ? – ఎండ ఉమాశంకర్, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ● -
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే..
ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే బడులను విభిజించాం. విద్యాహక్కు చట్టానికి లోకబడే చర్యలు తీసుకున్నాం. కొన్నిచోట్ల విద్యార్థుల సంఖ్య ఆధారంగా తప్పని పరిస్థితుల్లో సమీప పాఠశాలల్లో తరగతుల విలీనం చేపట్టాల్సి వచ్చింది. కొన్ని స్కూళ్ల వద్ద తల్లిదండ్రులు ఆందోళన చేపడుతున్నట్టు తెలిసింది. వాటి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తాం. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, డీఈఓ శ్రీకాకుళం ● -
అరసవల్లిలో సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి
● ఆర్జిత సేవల్లో ఫ్యాషన్ దుస్తులకు అనుమతి నిరాకరణ ● రోజూ సాయంత్రం వరకు ఆదిత్యుని అంతరాలయ దర్శనాలు ● ఆదివారాల్లో రూ.300 టిక్కెట్తో అంతరాలయ దర్శనం ● అరసవల్లి ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ప్రకటన అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే క్రమంలో ఆలయ సంప్రదాయాలను కాపాడేలా పలు కీలక నిర్ణయాలను ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో ఇకపై క ల్యాణోత్సవాలు, క్షీరాభిషేక సేవలు, సూర్యనమస్కారాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు ఫ్యాషన్ దుస్తులు వేసుకుంటే అనుమతి నిరాకర ణ తప్పదని, కచ్చితంగా సంప్రదాయ వస్త్రధారణ నియమాలను పాటించాల్సిందేనని వివరించారు. సేవల్లో పాల్గొనే భక్తుల్లో పురుషులు పంచె, చొ క్కా, సీ్త్రలు చీర లేదా చుడీదార్లతో వస్తేనే ఈ సేవల్లో కూర్చునేందుకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అలాగే ఈ ఆర్జిత సేవల టిక్కెట్లు ధరలు పెంచేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదించనున్నామని, ఈ మేరకు అనుమతి రాగానే కల్యాణ సేవ, క్షీరాభిషేక సేవలు, సూర్యనమ స్కారాల పూజల రుసుములు పెంచుతూ టిక్కెట్ల విక్రయాలు జరపనున్నట్లుగా ఆయన ప్రకటించారు. అలాగే ఆదిత్యుని అంతరాలయ దర్శనాల వేళలను ఇక మీదట సాయంత్రం వరకు ఉండేలా సమయం పెంపు చేస్తున్నామని, ఈ మేరకు ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మతో సంప్రదించే నిర్ణయాన్ని ప్రకటిస్తున్నామని వివ రించారు. సోమవారం నుంచి ఽశనివారం వరకు ప్రతి రోజూ ఉదయం 7 నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.100 టిక్కెట్లు కొను గోలు చేసుకుని ఆదిత్యుని అంతరాలయ దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రూ.300 దర్శన టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తు లను ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనాలకు అనుమతిస్తారని, అలాగే మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రూ.300 టిక్కెట్ల ద్వారా అంతరాలయ దర్శనాలకు అవకాశం కల్పించనున్నట్లుగా ఈఓ ప్రకటించారు. -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025కొత్తమ్మ తల్లి హుండీ ఆదాయం లెక్కింపు టెక్కలి రూరల్: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ హుండీ కానుకల లెక్కింపు శుక్రవారం నిర్వహించినట్లు కార్యనిర్వహణాధి కారి వాకచర్ల రాధాకృష్ణ తెలిపారు. అలయాని కి సంబంధించి ఆలయ ప్రాంగణంలోని హుండీలను లెక్కించగా 86రోజులకు రూ. 5,59,597 అదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు శ్రీకాకుళం దేవదాయ శాఖ సీనియర్ అసిస్టెంట్ జి.వి.బి.ఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. సరిహద్దులో గట్టి నిఘా ఇచ్ఛాపురం: నవోదయం 2.0లో భాగంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఒడిశా మ ద్యం, నాటుసారా, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అరికట్టడానికి నిఘా పెంచాలని డిప్యూటీ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ డి.శ్రీకాంత్రెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురంలో గల ప్రొహిబిషన్ ఎకై ్సజ్ చెక్పోస్టుని శుక్రవారం పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రొహిబిషన్ ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సము ద్ర తీర ప్రాంతాల్లో తరచుగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ సారా నివారణ కృషి చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల్లోని నిందితులపై చార్జిషీట్లు వేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ సీఐ పి.దుర్గాప్రసాద్, ప్రొహిబిషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘మెనూ ప్రకారం భోజనం పెట్టాలి’ పాతపట్నం: మండలంలోని సవర సిద్ధమణుగు బాలుర ఆశ్రమ పాఠశాలను సీతంపేట ఐటీడీఏ ఏపీఓ జి.చిన్నబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో 10, 9వ తరగతి విద్యార్థులతో కలిసి తరగతి గతిలో కూర్చుని పాఠాలు విన్నారు. అనంతరం విద్యార్థులతో కాసేపు మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని వార్డెన్ జీవనరావుకు సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కె.అబ్బాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ●యోగ సాధకులు నరసన్నపేట: నరసన్నపేటకు చెందిన సుమా బాలబాల, సదాశివుని రవి, వండాన సుప్రజలు ఒక వైపు యోగా సాధన చేస్తూ శిక్షణ ఇస్తున్నారు. స్థానిక సూరజ్ నగర్కు చెందిన వి. సుమాబాల యోగా టీచర్గా నరసన్నపేటలో మంచి గుర్తింపు పొందారు. 2007లో యోగాలో పీజీ డిప్లమా పూర్తి చేసిన సుమాబాల నరసన్నపేటకు యోగా శిక్షణ పరిచయం చేశారు. నరసన్నపేటలోనే ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉచితంగా మహిళలకు యోగా నేర్పిస్తున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక జీసీ హోంలో ప్రత్యేక యోగా క్లాసులు నిర్వహిస్తున్నారు. చిన్న వయసు నుంచి.. స్థానిక జగన్నాథపురానికి చెందిన సదాశివుని రవి యోగాను ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చారు. ఆంధ్రా యూనివర్సిటీలో యోగాలో పీజీ డిప్లమా పూర్తి చేసిన రవి 2010 నుంచి శిక్షణలు ఇస్తున్నారు. 2017 వరకూ విశాఖలో క్లాసులు నిర్వహించగా తర్వాత నరసన్నపేటకు వచ్చి యోగా శిక్షణలు ఉచితంగా స్థానిక యోగా భవన్లో ఇస్తున్నారు. మహిళలకు శిక్షణ నిస్తూ.. స్థానిక శ్రీరాంనగర్కు చెందిన వండాన సుప్రజ ఆర్ట్ఆఫ్ లివింగ్లో పూర్తి శిక్షణ పొంది యోగా టీచర్గా పనిచేస్తున్నారు. పలు ప్రైవేటు స్కూల్స్లో పనిచే స్తూ మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. 2018 నుంచి యోగా శిక్షణలు ప్రారంభించారు. పలు పోటీల్లోనూ పాల్గొన్నారు.ఆసనాల్లో శ్రీకాంతులు ఇచ్ఛాపురం: యోగా సాధన చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు పేరుప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవచ్చని పట్టణానికి చెందిన శ్రీకాంత్ మహంతి రుజువు చేస్తున్నారు. పట్టణానికి చెందిన శ్రీకాంత్మహతి శరీరాన్ని రబ్బరులా వంచుతూ ఆసనాలు వేస్తారు. బడి ఈడు లోనే ఆయనలోని ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయురాలు జయలక్ష్మి, స్థానిక యోగా సాధకుడు మధుసూదన్ బెహరా శ్రీకాంత్ను ప్రోత్సహించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం ఆయన యోగాసనాల పోటీలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. 2010 నుంచి 2025 వరకు పదుల సంఖ్యలో బంగారు పతకాలు గెలుచుకున్నారు. సాధన చేస్తున్న శ్రీకాంత్మహంతి ●40 ఏళ్లుగా యోగా సాధన నేను 40 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. మూడేళ్లుగా హైదరాబాద్లోని ప్రీ గురుకుల్ సే వా సంస్థలో యోగా, ప్రాణాయామం తరగతులను ఆన్లైన్లో నిర్వహిస్తున్నాను. 77 ఏళ్ల వయసు వచ్చిన యువకులతో సమానంగా కొన్ని వందల మంది సాధకులతో 108 సూర్యనమస్కారాలు మాఘమాసంలో వేయిస్తుంటాను. – ఎంవీ రామారావు, విశ్రాంత ఏఈ, బీఎస్ఎన్ఎల్, శ్రీకాకుళంన్యూస్రీల్ -
●23 ఏళ్లుగా..
నేను 23 ఏళ్లుగా యోగాభ్యాసం చేస్తున్నాను. శ్రీకాకుళంలోని యోగాచార్య రామారావు వద్ద యోగా నేర్చుకున్నా ను. తర్వాత బెంగళూరు అంతర్జాతీయ యోగా యూనివర్సిటీలో డిప్లమో చేశాను. నా శిష్యులు కూడా చాలా యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. – మావురి నాగేశ్వరరావు, యోగా గురువు ●మహిళలకు ఉచితంగా యోగా ఇక్కడ కేవలం మహిళలకు మాత్రమే ఉచితంగా నేర్పుతున్నాను. ఈ పార్కులో ఉదయం 5గంటల నుంచి యోగాభ్యాసం జరుగుతుంది. కొన్ని ఆసనాలు ప్రదర్శించడం ద్వారా 16 ఏళ్ల వయసు నుంచి తరచూ వచ్చే పీరియడ్స్ సమస్యలు కూడా తొలగిపోతాయి. – పిండి శారద, ఎల్బీఎస్ కాలనీ యోగా కేంద్రం -
23న యువత పోరులో గళమెత్తుదాం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి పార్టీలు ఎన్నికల ముందు యువతకు, విద్యార్థులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించడం సరికా దని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు అన్నారు. ఫీజు రీ యింబర్స్మెంట్కు రూ.4200 కోట్లు, వసతి దీవెన కు రూ.2200 కోట్లు అవసరమైతే కనీసం సగం ని ధులు కూటా కేటాయించకపోవడం దారుణమన్నా రు. ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు ఫీజు లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నెల 23న నిర్వహించనున్న యువత పోరు కార్యక్ర మం విజయవంతం చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ విద్యార్థుల్ని, యువతను మోసం చేసిన చంద్రబాబు, పవన్కల్యాణ్లకు తగిన బుద్ధి చెప్పేందు కు ఈ నెల 23న నిర్వహించబోయే ‘యువత పోరు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లాలో యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు ఇవ్వాల్సిన భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుంటే భవిష్యత్లో ఉద్యమించక తప్పదన్నారు. మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని ప్రగల్బాలు పలికే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నా రు. చంద్రబాబు మోసాలు, పవన్కల్యాణ్ ప్రశ్నించే గొంతు మూగబోయిందన్న విషయం ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. మొన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు టీడీపీకి చెందిన వారే రప్పా రప్పా అంటూ ప్లకార్డులతో వస్తే దాన్ని వైఎస్సార్సీపీ వాళ్లపై ఆపాదించడం దారుణమన్నారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 1.90కోట్ల మంది నిరుద్యోగులకు రూ.3వేలు చొప్పున బకాయి పడ్డారన్నారు. కార్యక్రమంలో పా తపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్టీ తూర్పుకాపు, కాళింగ, కళింగవైశ్య కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, అంధవ రపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమా ర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, జెడ్పీటీసీ రుప్ప దివ్య, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్య క్షులు రౌతు శంకరరావు, అంబటి శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, యువజన విభాగం నగర, ని యోజకవర్గ అధ్యక్షులు గుండ భాస్కర్, భరద్వాజ్, నక్క రామరాజు, పిల్లల రామకృష్ణ, సీపాన వెంకటరావు, టి.కామేశ్వరి, మట్ట నీలంయాదవ్, సీపానా రామారావు, మూకళ్ల తాతబాబు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు పిలుపు చంద్రబాబు యువతకు న్యాయం చేయాలి: ధర్మాన కృష్ణదాస్ 20 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి? : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ -
ఆశా కార్యకర్తల సమ్మె నోటీసు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆశా కార్యకర్తలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు మంజూరు చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయా లని కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జూలై 9న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో అంతా పాల్గొనా లని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయు డు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కె.అనితకు సమ్మె నోటీసు అందజేశారు. పేదలకు ఆరోగ్యసేవలు అందిస్తున్న తమకు కార్మికులుగా గుర్తించి సౌకర్యాలు కల్పించాల ని విన్నవించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశాలుగా మార్పు చేయాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. -
తాపీమేసీ్త్ర నుంచి సంగీత గురువుగా..
శాసీ్త్రయ సంగీతానికి పేదరికం అడ్డుకాదు అని ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన సంగీత కళాకారుడు ఆశికృష్ణారెడ్డి నిరూపించారు. బెల్లుపడ గ్రామంలో వ్యవసాయకూలీ కుటుంబానికి చెందిన ఆశి వాసు సరోజిని దంపతుల చిన్న కుమారుడు ఆశి కృష్ణారెడ్డి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో తాపీపని, కూలిపనులు చేసుకొంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచారు. సంగీతంపై మక్కువతో కె.ముఖలింగం, మావుడూరి జగన్నాథశర్మ, మావుడూరి సత్యనారాయణ శర్మ వద్ద సంగీతంలో మెలకువలు నేర్చుకున్నారు. మావుడూ రి జగన్నాథశర్మ పేరిట సంగీత కళాశాలను ప్రారంభించి 22 మంది చిన్నారులకు ఉచితంగా సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. -
టీడీపీ అరాచకాలకు మూల్యం చెల్లించక తప్పదు
సరుబుజ్జిలి : టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలకు ప్రజాక్షేత్రంలో మూల్యం చెల్లించుకోకతప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ హెచ్చరించారు. రాజకీయ కారణాలతో చిగురువలస కాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త జరుగుళ్ల రాజారావు ఇంటిని కూటమి నేతలు కక్షకట్టి కూల్చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రవికుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కూల్చివేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు తుంగలోకి తొక్కిందని, ఇదేంటని ప్రశ్నిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార పక్ష ప్రధాన నేతలు లిక్కర్, ఇసుక, భూదందాలతో అక్రమంగా సంపదిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై అక్రమ కేసులు, ఉద్యోగాలు, పింఛన్ల తొలగింపు తప్ప నియోజకవర్గానికి ఒరిగిందేమిలేదన్నారు. ఇప్పటికై నా అధికార పక్షనేతలు కక్షపూరిత రాజకీయాలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవుపలికారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, డకరవలస సర్పంచ్ సురవరపు తిరుపతిరావు, పార్టీ నేతలు అత్తులూరి రవికాంత్, కొవిలాపు చంద్రశేఖర్, మెట్ట నందేశు, కెప్టెన్ రామారావు, చల్ల యర్రయ్య, పల్లి శాంతారావు, ముద్దాడ రంజిత్, దనాల చిరంజీవి, బేపల రవి పాల్గొన్నారు. -
సంగీతమే జీవితం..
మూడు తరాలనుంచి మా కుటుంబం సంగీతంతో అల్లుకుపోయింది. మూడేళ్ల వయస్సులో మృదంగం నేర్చుకోవాలనే అభిరుచి కలిగింది. అమ్మ శ్రీలక్ష్మి, నాన్న సుసరాపు లక్ష్మీగణపతిశర్మ నా ఆలోచనకు సహకరించారు. ఇప్పటి వరకు పదులసంఖ్యలో కర్నాటక సంగీత కళాకారులతో కచేరీలకు మృదంగసహకారం అందించాను. –సుసరాపు కుమార్ విఘ్నేశ్, మృదంగ కళాకారుడు,శ్రీకాకుళం నాన్న ప్రోత్సాహంతో.. సంగీతం నేర్చుకోమని నాన్న ప్రోత్సహించారు. వయోలిన్ సాధన చేశాను. 2023లో జరిగిన కళా ఉత్సవ్ పోటీలో జ్ఞాపిక సాధించడం మరపురాని అనుభూతి. సంగీత రంగంలో స్థిరపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. –చెన్నూరు వరుణ్సాయి, వయోలీన్ కళాకారుడు, సిలగాం, కవిటి -
చిన్నతనంలో ఆడుతూ పాడుతూ తిరిగే అల్లరి పిల్లల్ని మందలించే తల్లిదండ్రులు చదువు సంగీతం ఏమీ లేదేంట్రా అంటూ పిల్లలకు బుద్ధి చెప్పెవారు...కానీ వారు మాటవరుసకు పలికే ఆ చదువు సంగీతం అనే మాటలోనే ఆ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం అర్ధం అవుతోంది. ప్రస్తుతం సమాజంలో ఎం
● విద్యతో పాటు సంగీతం నేర్చుకోవడంపై ఆసక్తి పెంచుకుంటున్న చిన్నారులు ● అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సీనియర్ కళాకారులు ● నేడు ప్రపంచ సంగీత దినోత్సవం శ్రీకాకళం కల్చరల్/కవిటి/ఇచ్ఛాపురం: ఒత్తిడితో కూడిన జీవనానికి సంగీతం సాంత్వన కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. మానసిక ఆందోళనతో ఉండేవారికి ఔషధంలా పనిచేస్తుంటుంది. అందుకే సంగీతానికి ఎప్పటికీ ఆదరణ కొనసాగుతునే ఉంటుంది. నాటితరమే కాకుండా నేటి యువతరం కూడా సంగీతంపై మక్కువ పెంచుకుంటోంది. క్రమం తప్పకుండా సాధన చేస్తూ వాయిద్యాలపై పట్టు సాధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక చోట్ల సంగీత శిక్షణ కేంద్రాల్లో చిన్నారులు తర్ఫీదు పొందుతున్నారు. అనురాగ నిలయంలో.. జిల్లా కేంద్రంలోని అనురాగ నిలయంలో రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు సూచనల మేరకు చిన్నారులకు రెడ్డి సత్యనారాయణ నేతృత్వంలో సంగీతం తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి అనాథ చిన్నారులు వేదికపై ప్రదర్శనలు కూడా ఇచ్చే స్థాయికి చేరుకున్నారు. తల్లిదండ్రులు లేనివారిని అక్కున చేర్చుకుని బాగోగులు చూడటంతో పాటు వారి అభిరుచి మేరకు సంగీతం నేర్పిస్తుండటంతో సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యం.. సంగీతం ఓవైపు వైద్య వృత్తిలో ఎంత బిజీగా ఉన్నా సంగీత రంగంలోనూ రాణిస్తున్నారు జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ చిట్టి రామకృష్ణ. ప్రస్తుతం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో నేత్రవైద్యులుగా పనిచేస్తున్న ఈయన వీణా వాయిద్యంలో అద్భుత ప్రద ర్శనతో ఆకట్టుకుంటున్నారు. విజయనగరం సంగీ త కళాశాలలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా కెనడా, మలేషియా, బెంగళూరు లోని విద్యార్థులు సంగీత తరగతులు నిర్వహిస్తున్నారు. ఇతని సతీమణి శ్రీసౌమ్య రేడియేషన్ అంకాలజిస్టుగా జెమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆది త్యా మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ లోన్ లీ సినిమాకు వీణ ప్రదర్శన చేశారు. ఆల్ ఇండియా రేడియో ఏ–గ్రేడ్ ఆర్టిస్టుగా నమోదయ్యారు. ఎస్బీవీసీ ఛానల్లో కూడా వీణ ప్రదర్శన ఇచ్చారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించారు. తండ్రి స్ఫూర్తితో.. తన తండ్రి బండారు చిట్టిబాబు స్ఫూర్తితో తనకంటూ ప్రత్యేకతను చాటుకోడానికి తబలా విద్యను అభ్యసించారు బండారు రమణముర్తి. సినీ నేపథ్య గాయకులు పి.సుశీల, ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ మంగళం పల్లి బాలమురళీకృష్ణ, లతామంగేష్కర్, సత్యసాయిబాబా తదితర ఉద్ధండులైన గాయనీ గాయకులకు తబలా సహకారాన్ని అందించారు. అనేక టీవీ షోలలో ప్రాతినిధ్యం వహించారు. బ్యాంకు ఉద్యోగం చేస్తూనే.. నగరానికి చెందిన మండా శ్రీనివాస్ యూనియన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ మృదంగంలోనూ రాణిస్తున్నారు. ఔత్సాహిక శాసీ్త్రయ, లలిత, సినీ సంగీత కళాకారులందరిని ఒకే వేదికపై ప్రదర్శన అవకాశం కల్పించేందుకు తరుణి కృష్ణస్మారక ధార్మిక ట్రస్టు 2019లో ఏర్పాటు చేసి సంగీత రంగంలో కృషి చేస్తున్నారు. కీబోర్డు రాజు.. నగరంలొ కీబోర్డు రాజుగా తనకంటూ ప్రత్యేక పేరు సాధించారు ముంజేటి రాజు. బండారు రమణమూర్తి సంగీత సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీ, కోల్కతా, జంషెడ్పూర్, నాగపూర్ వంటి నగరాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తున్నారు. సినీ నేపథ్య గాయకులు గోపికాపూర్ణిమ, మల్లికార్జున్ ప్రోగ్రామ్స్లో కీబోర్డు సహకారం అందించారు. అమ్మవారి సేవలో.. ఓవైపు రాజరాజేశ్వరీ మహాత్రిపుర సుందరీ దేవిపీఠంలో అమ్మవారి ఉపాసన చేస్తునే మరోవైపు ఆ అమ్మవారి పేరుతో సంగీత విద్యాలయాన్ని నడిపిస్తూ సంగీత సేవలందిస్తున్నారు సుసరాపు లక్ష్మీగణపతి శర్మ. తన తండ్రి దుర్గాప్రసాద్ శర్మను స్ఫూర్తిగా తీసుకొని పీఠాన్ని నిర్వహిస్తునే వైణీకుడిగా, గాయకుడిగా ప్రదర్శనలు ఇస్తూ ఎంతోమంది చిన్నారులకు, యువకులకు సంగీత విద్యను అభ్యసింపజేస్తున్నారు. శాక్సోఫోన్ శ్రీనివాస్ హయతినగరానికి చెందిన సుందరపల్లి శ్రీనివాస్ శాక్సోఫోన్, క్లారినెట్ ప్రదర్శనలో రాణిస్తున్నారు. కర్నాటక సంగీతంలో దిట్ట. ఇప్పటికీ ప్రతి రోజు ఆరుగంటల పాటు సాధన చేస్తుంటారు. మైసూరు గురుదత్త ఆశ్రమం, విశాఖ, హైదరాబాద్, తిరుపతి తదితర పుణ్యక్షేత్రాల్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. -
మొగదాలపాడులో పూరిల్లు దగ్ధం
గార: వత్సవలస పంచాయతీ మొగదాలపాడులో గనగళ్ల లక్ష్మమ్మకు చెందిన పూరిల్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విద్యుత్ మీటరు వద్ద మంటలు చెలరేగి ఇంటి మొత్తం వ్యాపించాయని బాధితురాలు తెలిపారు. గ్రామస్తులు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్క లేదు. శ్రీకాకుళం నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 2 లక్షలు వరకు ఆస్తి నష్టం ఉంటుందని రెవెన్యూ సిబ్బంది అంచనా వేశారు. జూలై 9న అఖిలభారత సమ్మె శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షణ కోరుతూ కేంద్ర కార్మిక సంఘాలు పిలుపు మేరకు జూలై 9న అఖిల భారత సమ్మె జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు పిలుపునిచ్చా రు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం సీఐటీ యూ జిల్లా సమావేశం కార్యాలయంలో సమ్మె పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 9న అన్ని మండల కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు జరుగుతాయని, కార్మికులు, స్కీం వర్కర్లు పాల్గొనాలని కో రారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ, కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఎన్. గణపతి, ఎస్.లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం నగ ర కన్వీనర్ ఆర్.ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఊరికి ఊపిరి
యువత భాగస్వామ్యంతోనే.. హరిత సొసైటీ, బుడుమూరు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా సామాజిక కార్యక్రమాలు చేపట్టాం. యువత భాగస్వామ్యంతో మొక్కలు నాటడం, యోగా శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. – జి.కనకరాజు యూత్ అసోసియేషన్ సెక్రటరీ, బుడుమూరు మొక్కవోని దీక్షతో కార్యక్రమాలు పర్యవరణ పరిరక్షణకు మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్నాను. స్థాపించిన రెండేళ్లలో ఉత్తరాంధ్రలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్లో పని చేస్తూనే ఖాళీ సమయాల్లో పర్యావరణ పరిరక్షణలో నా వంతు కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నాను. నన్ను చూసి ఒక్కరైనా మారుతారనే ఆశ ఉంది. – ఆర్. హరిబాబు, సంఘం వ్యవస్థాపకుడు ● సత్ఫలితాలు ఇస్తున్న హరిత సమగ్ర గ్రామీణాభివృద్ధి సంఘం ప్రయత్నాలు ● యువతకు పచ్చదనంపై చైతన్య పరిచే కార్యక్రమాలు ● వేలాదిగా మొక్కలను నాటుతున్న సంస్థ ● ఉత్తరాంధ్రలో సేవా కార్యక్రమాలు రణస్థలం: కొందరు స్నేహితులు కలిశారు.. వారికి మరికొందరు సన్నిహితులు చేయూతనిచ్చారు.. వీరికి గ్రామ పెద్దలు, యువత సహకారం అందించారు.. ఇంకేముంది ఊరిలో పచ్చటి మొక్కలు కళకళలాడుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్లో పని చేస్తూ ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా కొంతమందిసన్నిహితులు,స్నేహితులు కలిసి హరిత సమ గ్ర గ్రామీణాభివృద్ధి సంఘంను ఏర్పాటు చేసుకున్నారు. మానవాళి కోల్పోతున్న పచ్చదనాన్ని మళ్లీ పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్న రంగొలి హరిబాబు పర్యావరణ పరిరక్షణలో ప్రత్యేకతను చాటుకున్నారు. రెండేళ్లలో వేలాది మొక్కల ప్రాణప్రతిష్ట వాతావరణ మార్పులను తట్టుకోవాలంటే మొక్క లు పెంచడం ఒక్కటే దారి. అందుకే రెండేళ్లుగా ఈ సంస్థ ప్రతినిధులు సత్సంకల్పంతో వేలాదిగా మొక్కలు నాటారు. ప్రతి వేడుకలో ప్లాసిక్ కానుక బదులు బహుమతిగా మొక్కలు ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పాటు రిటర్న్ గిఫ్ట్గా అందించే ప్లాస్టిక్ కానుకలకు బదులు సుమారు 8,500 మొక్కలు అందించారు. ప్లాస్టిక్, పాలిథిన్ వద్దంటూ.. ఒక్కసారి వాడి పారేసే పాలిథిన్, ప్లాస్టిక్ వల్ల భవిష్యత్ తరాలకు జరగబోయే నష్టంపై ప్రజలకు అవగాహన కలిగిస్తూ సొంత నిధులతో క్లాత్ సంచులను తయారు చేయించి స్థానిక మార్కెట్లలో, వ్యాపార సముదాయాలలో వాటిని పౌరులకు పంపిణీ చే స్తున్నారు. వేసవి కాలంలో చెట్ల నుంచి విత్తనాలు సేకరించి తదుపరి వర్షాకాలానికి అవసరమయ్యే మొక్కలతో నర్సీరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏ డాది వేప, నేరేడు, పనస, తరాయి, గంగరావి, ఏ నుగు పాదం, బాదం, దేవకాంచన వంటి సుమారు 5600 విత్తనాలు సేకరించారు. -
మేమేం చేయలేం!
జీడి పిక్కల ధరలా.. పలాస: పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో ఉద్దానం ప్రజల జీవనాధారమైన జీడి రైతులు కూటమి సర్కారు తీరుతో ఉసూరుమన్నారు. జీడిపిక్కల కొనుగోలు, ధరల విషయమై జీడి రైతాంగ పోరాట కమిటీ నాయకులు గురువారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉద్దానం జీడి రైతుల సమస్యలు, గిట్టుబాటు ధరల విషయంపై జీడి రైతాంగ కమిటీ కన్వీనర్ తెప్పల అజయ్కుమార్, రైతు నాయకులు అంబటి రామకృష్ణ, కోనేరు రమేష్, మడ్డు రాఘవరావు, అర్లి దానేసు తదితరులు ఎమ్మెల్యేకు వివరించారు. గత ఎన్నికల సమయంలో బస్తా జీడి పిక్కలను రూ.16వేలుకు కొనుగోలు చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికి బస్తా పిక్కలు ధర రూ.13,500 ఉందని చెప్పారు. అదే ధరకు రైతులంతా తప్పని పరిస్థితిలో జీడి పిక్కలను పలాస వ్యాపారులకు అమ్ముకున్నారని తెలిపారు. ఈ ఏడాది మే నెలలో కూడా రూ.13,500 మాత్రమే ఉందని, పెరుగుతుందని ఆశించినా రైతులకు నిరాశ తప్పలేదన్నారు. జూన్లో పెరగడం పోయి ధరలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ ప్రతినిధులు ఎంత వేడుకున్నా.. ఈ ధరలు తమ చేతుల్లో లేవని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఒక్క మాట చెప్పి చేతులెత్తేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో రైతాంగ ప్రతినిధులు నిరాశతో తిరిగి వచ్చేశారు. సమావేశంలో చేతులెత్తేసిన పలాస ఎమ్మెల్యే శిరీష నిరాశతో బయటకు వచ్చేసిన జీడి రైతాంగ కమిటీ ప్రతినిధులు అధికార పార్టీ తీరుపై మండిపాటు ఎమ్మెల్యే తీరుపై విమర్శలు.. జీడి వ్యాపారులు జీడి పిక్కలను కొనుగోలు చేయాల్సిన సమయంలో పరిశ్రమలను ఎందుకు బంద్ చేశారని అటు జీడి కార్మికులతో పాటు జీడి రైతులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, మార్కెట్లో జీడి పప్పు ధర ఏమాత్రం తగ్గడం లేదు. పలాస కాష్యూలేబర్ యూనియన్, పలాస కాష్యూ అసోసియేషన్ రెండు సంఘాలు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల చేతుల్లో ఉన్నాయి. గత 20 రోజులుగా జీడి కార్మికులకు ఉపాధిలేదు. ఉద్దానం ప్రాంతంలో జీడి పిక్కలు కొనడానికి జీడి వ్యాపారులు ముందుకు రావడం లేదు. వారు కొనుగోలు చేయలేకపోవడానికి వారి వద్ద తగిన డబ్బులు లేవని ఆ వ్యాపారస్తులు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు జీడి కార్మికులకు , అటు జీడి రైతులకు తగిన న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే శిరీష తన చేతుల్లో ఏమీ లేదని చెప్పడంపై రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటూ చట్టసభలు, వివిధ రూపాల్లో పోరాటాలు చేయాల్సింది పోయి ఈ విధంగా తాము ఏమీ చేయలేమని చెప్పడం సరికాదని చెబుతున్నారు. -
యోగా దినోత్సవం విజయవంతం చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న జరిగే యోగాలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్’ అనే థీమ్తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సుబ్బారెడ్డి సత్తి ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అదే విధంగా, అలాగే రానున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కులగణన హర్షనీయం శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశవ్యాప్తంగా జనగణనతో పాటే సమగ్ర కుల గణన జరిపించేందుకు షెడ్యూల్ ప్రకటించి ఈ నెల 16న గెజిట్లో కేంద్ర ప్రభుత్వం ప్రచురించడంపై ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు కొమ్ము రమణమూర్తి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. 16 ఏళ్ల తర్వాత ప్రజలందరి ఆర్థిక– సామాజిక వివరాలతో సమగ్రంగా జనగణన జరపాలనుకోవడం అభినందనీయమన్నారు. తొలిసారిగా జనగణనలో పౌరులే స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా కేంద్రం కల్పించిందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా కచ్చితంగా తెలిసేలా వెనుకబడిన తరగతులకు చెందిన జాతీయ స్థాయిలోని 3,746 కులాలు, రాష్ట్రస్థాయిలోని 139 కులాలకు చెందిన కుటుంబాల వారందరూ, తమ జనాభా లెక్కలతో పాటు కుల వివరాలు కూడా స్పష్టంగా తెలియజేయాలన్నారు. -
ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం రెండో డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులో పి.గౌరి అనే ప్రయాణికురాలు గురువారం సాయంత్రం విజయనగరం నుంచి పూసపాటిరేగకు ప్రయాణం చేసింది. ఈ సమయంలో తన బ్యాగ్లో ఉన్న 6 తులాల బంగారం బాక్స్ను బస్సులో జారవిడుచుకుంది. విషయం గమనించక పూసపాటిరేగలో దిగిపోయింది. ఇంటికెళ్లి చూసేసరికి బాక్స్ లేకపోవడంతో ఆందోళనకు గురైంది. బస్సులో పడిపోయి ఉంటుందని భావించి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకుంది. జరిగిన విషయాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎస్ఎం ఎం.పి.రావు దృష్టికి తీసుకువెళ్లింది. ఇంతలో కండక్టర్ వి.వి.ఆర్.మూర్తి, డ్రైవర్ రాంబాబులకు బాక్సు దొరకడంతో తీసుకొచ్చి అధికారులకు అందజేశారు. బాక్సులో బంగారు వస్తువులు గౌరివేనని గుర్తించి ఆధార్కార్డు ఆధారంగా అందజేశారు. కండక్టర్ వి.వి.ఆర్ మూర్తి, డ్రైవర్ రాంబాబుల నిజాయితీని అధికారులు అభినందించారు. యోగాంధ్రకు ట్రాఫిక్ ఆంక్షలు శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నంలో ఈ నెల 21 జరిగే యోగాంధ్రకు భారీ ఎత్తున జనం హాజరయ్యే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా నుంచి వెళ్లే వాహన రాకపోకలకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శ్రీకాకుళం నుంచి వెళ్లే బస్సులు శ్రీకాకుళం, రణస్థలం, తగరపువలస, చిలకపేట మీదుగా భీమిలి బీచ్ రోడ్డు వద్దకు చేరుకోవాలి. వారికి నిర్దేశించిన పార్కింగ్ / డ్రాపింగ్ పాయింట్లలో మాత్రమే బస్సులు దిగి కేటాయించిన కంపార్ట్మెంట్లకు చేరుకోవాలి. -
మా బడి మాకు కావాలి
మందస: తమ బడి తమకు కావాలని మందస మండలం హొన్నాళి గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. హొన్నాళి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాల నుంచి 6, 7, 8 తరగతులను సిరిపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం పాఠశాల ఎదురుగా ఆందోళన నిర్వహించారు. ఎలాంటి బస్సు సౌకర్యం లేని పరిస్థితుల్లో పిల్లలను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి ఎలా పంపించాలని ప్రశ్నించారు. సిరిపురం వెళ్లే దారిలో రిజర్వ్ ఫారెస్టు ఉందని, సాయంత్రం, చీకటి పడే సమయాల్లో అడవి జంతువులు తిరుగుతాయని అలాంటి దారిలో పిల్లలు ఎలా రాకపోకలు సాగించగలరని అన్నారు. ఇదే దారిలో మహేంద్ర తనయ నది ఉందని, దానిపై రక్షణ లేని వంతెన ఉందని, దాన్ని దాటడం పిల్లలకు ప్రమాదకరమని వివరించారు. హొన్నాళి గ్రామంలో ఎంపీయూపీ విద్యార్థులు దాదాపు 100 మంది ఉన్నారు. అందులో యూపీ విద్యార్థులు 42 మంది ఉన్నారు. వీరితో పాటు నారాయణపురం స్కూల్ను కూడా హరిపురం హైస్కూల్లో విలీనం చేశారు. ఈ రెండు స్కూళ్ల మధ్య దూరం ఐదు కిలోమీటర్లు. దారిలో జీడితోటలు ఉన్నాయి. ఎలుగు బంట్ల సంచారం ఉంటుంది. దీనిపై నారాయణపురం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హొన్నాళిలో రోడ్డెక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూళ్ల విలీనంపై ఆగ్రహం ఎలా పంపించగలం..? 6, 7, 8 తరగతుల వారు సిరిపురం వరకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఎలాంటి బస్సు సదుపాయం లేదు. విద్యా ర్థులు సైకిళ్లపైనే వెళ్లాలి. ఆ దారిలో వంతెనపై నుంచి వానాకాలంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎలా స్కూల్కు పంపించగలం. – నోయానో శెట్టి, హొన్నాళి విలీనం సరికాదు గ్రామంలో ఉన్న బడిని వేరే పాఠశాలలో విలీనం చేయడం సరికాదు. పిల్లలను బయటకు పంపాలంటే మాకు భయంగా ఉంటుంది. మా బడి మాకు కావాలి. – జ్యోతి మాలిక్, విద్యార్థి తల్లి హొన్నాళి -
వరదొస్తే పల్లెలకు ముప్పు
● అడ్డుకట్టలతో నీటి మళ్లింపుఈ చిత్రం చూడండి. ఇసుకను లారీల్లో రవాణా చేసేందుకు నదిలో ప్రవహిస్తున్న నీరు అడ్డొస్తుందని పెద్ద పెద్ద పైపులను కింద పెట్టి, పైన గ్రావెల్తో గట్టు నిర్మించారు. ఆ గట్టు కింద నున్న పైపుల ద్వారా నీరు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా నదిలో యంత్రాలతో ఎలాంటి పనులు చేపట్టకూడదు. కానీ పట్టించుకోకుండా ఇష్టారీతిన ఇసుక నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వానలు పడుతున్నా.. నదుల్లోకి నీరు వస్తున్నా జిల్లాలో ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. తరలింపు ఆగడం లేదు. ప్రభుత్వం అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. ఇసుక డబ్బుల కోసం గ్రామాలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. నేతల జేబులు నింపడానికి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేస్తోంది. ఎవరేమైనా ఫర్వాలేదు తమ ఖజానా నిండితే చాలు అన్నట్టుగా పచ్చనేతలు చెలరేగిపోతున్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలోకి వరద నీరు వస్తోంది. దీంతో నీటి ప్రవాహం మొదలైంది. ఈ పరిణామం ఇసుక అక్రమార్కులకు రుచించడం లేదు. వరదలొచ్చి తమకొచ్చే ఆదాయాన్ని గండికొడుతోందని, ఊరకనే వచ్చే సొమ్మును కోల్పోతున్నామని తెగ బాధపడిపోతున్నారు. నదిలోకి నీరొస్తే తవ్వకాలకు ఇబ్బందని, లారీలతో తరలించేందుకు కష్టమవుతుందని మదనపడిపోతున్నారు. ఏం జరిగినా ఇసుక తవ్వకాలు ఆగకూడదు, రవాణా ఆపకూడదన్న నిర్ణయానికొచ్చి బరితెగింపునకు దిగారు. తవ్వకాలు జరిగే చోటుకి వరద నీరు రాకుండా ఉండటానికి నదీ ప్రవాహానికి మధ్యలో యుద్ధ ప్రాతిపదికన గట్టు నిర్మించారు. అంతేకాకుండా భారీ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసేందుకు ఇబ్బంది వస్తుందని నదిలోనే నీటి ప్రవాహానికి అడ్డంగా పైపులతో మరో గట్టు నిర్మించారు. ఇవన్నీ యంత్రాలతోనే చేసేశారు. వాస్తవంగా నదిలో యంత్రాల ద్వారా ఎలాంటి పనులు చేపట్టకూడదు. పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, ఇక్కడి నిర్వాహకులు తమకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక లెక్కా తాము చేసిందే న్యాయం అన్నట్టుగా నదిలో అడ్డంగా నిర్మాణాలు చేపట్టారు. వరద ఉద్ధృతి పెరిగితే ఆ గ్రామాలకు ముప్పే.. నదిలో అడ్డంగా పొడవైన గట్లు నిర్మించడం వలన భారీ వర్షాల కారణంగా వరదలొస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది. వరద ఉద్ధృతికి ఆ గట్లు తెగిపడితే తీర ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడక తప్పదు. ఇప్పటికే ఇసుక తవ్వకాలతో నదీ గమనం మారిపోయింది. పైపెచ్చు నదిలో అడ్డంగా పొడవైన గట్లు నిర్మించడం వల్ల ప్రవాహ గమనం మారిపోతుంది. అదే జరిగితే పెను ప్రమాదం చోటు చేసుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. గార వద్ద జరుగుతున్న ఇసుకాసురుల దుశ్చర్యల వల్ల లోతట్టు ప్రాంతాలైన వమరవల్లి, తోనంగి, క ళింగపట్నం, మత్స్యలేశం, బందరవానిపేట, కొర్ని పంచాయతీలకు ముప్పు ఉండే అవకాశం ఉంది. ఇసుక అక్రమ తవ్వకాలతో ముప్పులో తీర ప్రాంత గ్రామాలు అక్రమ సొమ్ము కోసం గార తీరంలో అడ్డదారులు వరదల వేళ వంశధార నదిలో అడ్డంగా కరకట్ల నిర్మాణం తవ్వకాలు జరిపే చోటుకి నీరు రాకుండా గట్లు వేసిన అక్రమార్కులు వర్షాకాలం నేపథ్యంలో భయాందోళనలో తీర ప్రాంత గ్రామ ప్రజలు -
గురుకులాల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలలో 2025–26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకుల సమన్వయకర్త గ్రేస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 19 నుంచి జిల్లాలోని 8 పాఠశాలల్లోనూ దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బాలురుకు దుప్పలవలస, బాలికలకు ఎచ్చెర్ల గురుకులంలో ఈ నెల 25న ఉదయం 10 నుంచి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆరో తరగతిలో 279 సీట్లు, ఏడో తరగతిలో 155 సీట్లు, ఎనిమిదో తరగతిలో 92 సీట్లు, 9వ తరగతిలో 96 సీట్లు ఖాళీగా ఉన్నాయని వివరించారు. పూర్తి వివరాలకు 9701736862 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. కలప అక్రమ రవాణా అడ్డగింత ఎచ్చెర్ల : మండలంలోని కేశవరావుపేట, కింతలమిల్లు జంక్షన్ వద్ద విజిలెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్త తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమతులు లేకుండా లారీ, బొలెరో వాహనాల్లో తరలిస్తున్న కలపను గుర్తించారు. రూ.39,405 విలువైన తొమ్మిది క్యూబిక్ మీటర్లు కలిగిన అకేషియా కలప దుంగలను పట్టుకున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు సతీష్కుమార్, రవిప్రసాద్, సీఐలు రామారావు, అశోక్, ఎస్ఐలు పీసీలు ఈశ్వరరావు, కన్నబాబు, లక్ష్మీనారాయణ, శేషగిరి, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా సురేష్కుమార్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా కూటికుప్పల సురేష్కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్లో బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో సంఘ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నాగళ్ల మురళీధర్, జిల్లా కార్యదర్శిగా కవిటి దేవరాజ్, జిల్లా ప్రచార కార్యదర్శిగా కిల్లి కుమారస్వామిని నియమించారు. ఈ సందర్భంగా సురేష్కుమార్ మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. పాత జిల్లా ఆస్పత్రిలో సామగ్రి చోరీ టెక్కలి రూరల్ : టెక్కలి పాత జిల్లా ఆస్పత్రిలో విలువైన ఇనుప సామగ్రీ చోరికి గురవుతోంది. ఇప్పటికే సిల్వర్ పైపులు, ఫైబర్ ఫ్రేమ్లు మాయం కాగా, తాజాగా కిటికి గోడలు సైతం ధ్వంసం చేసి వాటికి ఉన్న ఐరన్ ఫ్రేమ్లు పట్టుకుపోయారు. విలువైన సామగ్రి చోరీకి గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపరేం? శ్రీకాకుళం అర్బన్: కేంద్రం, రాష్ట్రంలోనూ బీజేపీకి ధీటైన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అన్నారు. గురువారం శ్రీకాకుళం పర్యటనకు వచ్చిన ఆమె ఇందిరా విజ్ఞాన్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. బీజేపీ 11 ఏళ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నోరు మెదపడం లేదన్నారు. అన్ని పథకాల్లోనూ కోతలు పెడుతున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టును 45మీటర్లు నుంచి 41 మీటర్లకు తగ్గిస్తున్నా, విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు తొలగిస్తున్నా కూటమి ఎమ్మెల్యేలు స్పందించకపోవడం అన్యాయమన్నారు. -
‘పరిహారం ఇప్పించండి మహాప్రభో’
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయినా ఇంతవరకు తమకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని, పరిహారం ఇప్పించాలని విష్ణుచక్రం గ్రామానికి చెందిన దంపతులు గిన్ని ఈశ్వరరావు, మహాలక్ష్మి కోరుతున్నారు. గురువారం విలేకరులతో మాట్లాడారు. పీడీఎఫ్ లిస్టులో తమ పేరు ఉన్నా ఇంతవరకు పరిహారం ఇవ్వలేదన్నారు. పోర్టు పునరావాస కేంద్రంలో ఐదు సెంట్లు భూమి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశా రు. అందరూ ఊరు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారని, తాము మాత్రమే ఊరిలో ఉండి ఏం చేయ గలమని అన్నారు. ప్రభుత్వం స్పందించి న్యా యపరంగా నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. కల్తీ పదార్థాలు విక్రయిస్తే చర్యలు వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి వర్తక, వ్యాపార కేంద్రంలోని కిరాణా షాపుల్లో కాలం చెల్లిన, కల్తీ పదార్థాలు విక్రయించే షాపుల ఆట కట్టిస్తామని శ్రీకాకుళం ఫుడ్ సేఫ్టీ అధికారి జి.శ్రీరాములు హెచ్చరించారు. ఆయన గురువారం పూండి కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర సూపర్ మార్కెట్, సంతోషి కిరాణా, మరి కొన్ని షాపు ల్లో తనిఖీలు చేపట్టి కల్తీ జరిగినట్లు అనుమానించి నెయ్యి, కందిపప్పు, మినప గుళ్లు శాంపిల్స్ సేకరించారు. పూండి పరిసర ప్రాంతాల వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో తని ఖీలు చేశారు. అయితే వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ అధికారులపై తిరగబడి, కొంత మంది టీడీపీ నేతలను పిలిచి విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా బెదింపులకు సైతం దిగడం స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ విషయమై ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు మాట్లాడుతూ పూండిలోని కిరాణా షాపుల్లో కల్తీ జరిగినట్లు అనుమానించి శాంపిల్స్ సేకరించామని, వాటిని హైదరాబాద్లోని సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి పంపించామని తెలిపారు. ఈ విషయం జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టి సైతం తీసుకెళుతున్నట్లు ఆయన తెలిపారు. అకడమిక్ సిలబస్లపై దృష్టి శ్రీకాకుళం రూరల్: అకడమిక్ సిలబస్లపై ఎంఈఓలు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ విజయరామరాజు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మునసబుపేటలో గల గురుజాడ కళాక్షేత్రంలో గురువారం 38 మండలాల ఎంఈఓలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా పూర్తి చేసినందుకు ఎంఈఓలను అభినందించారు. రానున్న మూడు నెలల్లో అకడమిక్లపై దృష్టి పెట్టాలన్నారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న భాషోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ పిసిని వసంతరావు రాష్ట్రవిద్యాశాఖ కమిషనర్ను కోరారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుల పోస్టులను పునరుద్ధరించాలని, మాన్యువల్ బదిలీల కౌన్సెలింగ్ చేయాలని కోరారు. -
గిరిశిఖర గ్రామానికి వెళ్లి.. కష్టాలు తెలుసుకుని..
గ్రామస్తుల సమస్యలు తెలుసుకుంటున్న మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిమెళియాపుట్టి: సుమారు 1300 అడుగుల ఎత్తులో, ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిశిఖర గ్రామం గొట్టిపల్లి పంచాయతీ చందనగిరి గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి పర్యటించారు. గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సుమారు ఏడు కోట్ల రూపాయల నిధులతో గిరిజన గ్రామాలకు రహదారులు వేశామని గుర్తు చేశారు. చందనగిరి గ్రామానికి రహదారి, తాగునీటి సదుపాయం కల్పించడమే కాకుండా.. ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక నిధులతో ట్రాక్టర్ ద్వారా కొండపైకే రేషన్ సరుకులు అందించామని చెప్పారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని మండిపడ్డారు. కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. చందనగిరి గ్రామం నుంచి రేషన్ సరుకులు తీసుకోవడానికి కాలినడకన కొండదిగి నేలబొంతు గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, మహిళలు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలుకాని హామీలు ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని దుయ్యబట్టారు. నేడు గిరిజన గ్రామాలకువెళ్తే ఎక్కడచూసినా జగనన్న ఇచ్చిన తాగునీరు, రహదారులు, భవనాలు కనిపిస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏం చేసిందని ప్రశ్నించారు. జగనన్న మళ్లీ ముఖ్యమత్రి అవుతారని, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. అంతకుముందు గ్రామానికి వస్తుండగా.. మార్గమధ్యలో గౌరమ్మ అనే వృధ్ధురాలు బియ్యం మూట పట్టుకుని కొండ ఎక్కుతున్న సమయంలో రెడ్డిశాంతి ఆమెను ఆటో ఎక్కించి పంపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సవర ఆదినాయుడు, సర్పంచ్ డొలిబేరు జమ్మయ్య, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ పోలాకి జయమునిరావు, కో ఆప్షన్ సభ్యుడు భాస్కరదాస్, నాయకులు బైపోతు ఉదయ్కుమార్, కరణం శశిభూషణరావు, అలికాన మాధవరావు, సవర సుభాస్, గొల్ల జనార్దన, జన్ని నాగేశ్వరరావు, పెద్దబొంతు అప్పారావు, ఢిల్లీ, సలాన చిట్టి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన కొండపైకి మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గిరిశిఖర గ్రామం చందనగిరిలో పర్యటన గిరిజన మహిళలతో మాటామంతీ -
లాసెట్లో సిక్కోలు హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ లాసెట్–2025 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మెరిశారు. జిల్లా నుంచి యూజీ, పీజీ మూడు విభాగాల్లో న్యాయ కోర్సులకు కలిపి మొత్తం 594 మంది పరీక్షలకు హాజరుకాగా గురువారం విడుదలైన ఫలితాల్లో 558 మంది ఉత్తీర్ణత సాధించి ప్రవేశాలకు అర్హత సాధించారు. మూడేళ్ల యూజీ న్యాయవిద్యకు జిల్లా నుంచి 551 మంది దరఖాస్తు చేసుకోగా 406 మంది పరీక్ష రాశారు. వీరిలో 394 మంది అర్హత సాదించారు. ఐదేళ్ల యూజీ న్యాయవిద్యకు 146 మంది దరఖాస్తు చేసుకోగా 117 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 111 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండేళ్ల పీజీ లాసెట్కు జిల్లా నుంచి 71 మంది దరఖాస్తు చేసుకోగా.. 53 మంది పరీక్ష రాశారు. వీరంతా అర్హత సాధించినట్టు లాసెట్ కన్వీనర్ పేర్కొన్నారు. పీజీ రెండేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షలో నగరంలోని ఏపీహెచ్బీ కాలనీలో నివాసం ఉంటున్న ఎం.విజయమణికంఠ 107 మార్కులతో రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించాడు. ప్రస్తుతం విశాఖపట్నం ఏయూ క్యాంపస్లో మూడేళ్ల యూజీ న్యాయ కోర్సులో చివరిదైన 6వ సెమిస్టర్ పరీక్షలు రాశాడు. మంచి యూనివర్సిటీలో పీజీ లా పూర్తిచేసి, న్యాయాధికారి పోటీపరీక్షలపై దృష్టిసారించినట్టు చెబుతున్నాడు. కేతనకు 29వ ర్యాంకు పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన తమ్మినైన కేతన ఏపీ పీజీ లాసెట్లో రాష్ట్రస్థాయిలో 29వ ర్యాంకును సాధించింది. 120 మార్కులకు గాను 100 మార్కులతో సత్తాచాటింది. ఈమె సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేసింది. తండ్రి తమ్మినైన గోపాలరావు ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా, తల్లి కమలకుమారి, గృహిణి. 6వ ర్యాంకుతో మెరిసిన విజయమణికంఠ జిల్లా నుంచి 558 మంది అర్హత -
220
యోగాంధ్రకు ఆర్టీసీ బస్సులు ప్రైవేటు సర్వీసులు డౌటే ఆర్టీసీ బస్సులే కాదు ప్రైవేటు బస్సులు కూడా జిల్లాలో ఉండే అవకాశం తక్కువే. దాదాపు 20వేల మందిని జిల్లా నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడంతో ప్రైవేటు బస్సులు కూడా యోగా డే సేవలో తరించనున్నాయి. అదే జరిగితే ప్రైవేటు బస్సులు నడిచే రూట్లలో కూడా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇప్పటివరకై తే వాటి విషయంలో క్లారిటీ లేదు. ఏ క్షణంలోనైనా సర్వీసులు రద్దు అయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులు ముందస్తు సమాచారంతో రాకపోకలు సాగించడం మేలు. ● ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ యాజమాన్యం కేటాయింపు ● జిల్లాలో 80 రూట్లలో 164 బస్సులతోనే సేవలు ● నేడు,రేపు ప్రజలకు తప్పని ప్రయాణ కష్టాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో 80 వరకు రూట్లలో 384 ఆర్టీసీ బస్సులు ప్రతి రోజూ తిరుగుతాయి. అయినప్పటికీ చాలా రూట్లలో బస్సులు దొరకని పరిస్థితి ఉంది. ప్రైవేటు బస్సులు, ఆటోలు, ఇతరత్రా వాహనాలను పట్టుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. ఉన్న 384 బస్సులే అరకొర అనుకుంటే, వాటిలో 220 బస్సులు విశాఖలో జరిగే యోగాంధ్ర కోసం తరలిస్తే జిల్లాలో ప్రయాణికుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడదే జరుగుతోంది. ఎలాగైనా జనాన్ని తీసుకెళ్లాల్సిందే.. విశాఖలో యోగాంధ్ర పుణ్యమా అని ప్రయాణికులకు కష్టాలు తప్పవు. శుక్రవారం, శనివారం రాకపోకలకు ఇబ్బందులు పడాల్సిందే. అత్యధిక బస్సులు యోగాంధ్ర కోసం విశాఖ వెళ్లిపోతుండటంతో ఇక్కడ ప్రయాణికులు అవస్థలు పడకతప్పదు. యోగా డే కొత్తేమి కాదు. ఏటా జూన్ 21న చేస్తుంటారు. ఎక్కడికక్కడ యోగా డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ చంద్రబాబు తన మార్క్ పబ్లిసిటీ కోసం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర మార్కులు కొట్టేసేందుకు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తమకున్న బలమేంటో తెలిపేందుకు, లక్షల్లో జనాలను చూపించేందుకు చంద్రబాబు అండ్కో తెగ ఆరాట పడుతున్నారు. అందులో భాగంగా టార్గెట్లు ఇచ్చి జన సమీకరణ చేయిస్తున్నారు. ఎవరికెన్ని ఇబ్బందులు ఉన్నా నయానోభయానో విశాఖపట్నంకు జనాలను తీసుకురావాల్సిందేనని అధికారులకు హుకుం జారీ చేశారు. ఇంకేముంది ఉద్యోగులకు సంకటంగా మారింది. భయపెట్టో, బతిమాలో.. జనాలు తరలించేందుకు ఆపసోపాలు పడుతున్నారు. 220 ఆర్టీసీ బస్సుల తరలింపు జిల్లా నుంచి జనాలను తరలించేందుకు అధిక సంఖ్యలో బస్సులు కేటాయించారు. మనకున్నవి 384 బస్సులైతే, వాటిలో 220 బస్సులు యోగాంధ్ర కోసం సమకూర్చారు. ఈ లెక్కన జిల్లాలో మిగతా 164 బస్సులు మాత్రమే ప్రయాణికులకు సేవలందిస్తాయి. దీన్నిబటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రెండు రోజుల పాటు ప్రయాణికుల రాకపోకలకు ఎంత ఇబ్బంది ఉంటుందనేది, ఇప్పుడున్న 80 రూట్లలో ఎన్ని బస్సులు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రత్యామ్నాయం చూసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే 60 బస్సులు ఇతర జిల్లాలకు వెళ్లిపోయాయి. ఆ బస్సులు నడవాల్సిన రూట్లో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. శుక్రవారం, శనివారం మిగతా బస్సులు వెళ్లిపోనున్నా యి. దీంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపవుతాయి. -
సమస్యలపై స్పందించాలి
అరసవల్లి: జిల్లాలో వివిధ శాఖాధికారులంతా సమస్యలపై తక్షణమే స్పందన చూపాలని, అలాగే ‘స్థానిక’ సంస్థల ప్రజాప్రతినిధుల సూచనలను ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే స్పందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ సూచించారు. జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో 1, 2, 4, 7వ స్థాయి సంఘ సమావేశాలకు ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ శాఖల ప్రగతి నివేదికలపై సమీక్షించారు. విద్యుత్ శాఖలో ప్రభుత్వ పథకాల లబ్ధికి సంబంధించి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, సంబంధం లేని వ్యక్తుల ఫోన్ నంబర్లకు మీటర్లు కనెక్షన్లు ఉన్నట్లుగా చూపిస్తున్నారని గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వ పథకాల లబ్ధికి దారుణమైన నిబంధనలు పెట్టారని, దీంతో పేద సామాన్య వర్గాలకు అవస్థలు తప్పడం లేదన్నారు. అధికారులు వీరి విషయంలో శ్రద్ధ వహించి అర్హులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అలాగే మంచినీటి పైపుల లీకులపై చాలావరకు ఫిర్యాదులు వస్తున్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించాలన్నారు. ఇదిలావుంటే జెడ్పీ స్థాయి సంఘ సమావేశాలకు పలు ప్రభుత్వ శాఖల నుంచి సకాలంలో ప్రగతి నివేదికలు రావడం లేదని, అలాగే పలు శాఖాధికారులు హాజరుకావడం లేదని, వీరిపై చర్యలు చేపట్టేలా జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజాకు ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా, విద్యుత్ శాఖ ఈఈ పైడి యోగేశ్వరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ పి.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 3, 5, 6వ స్థాయీ సంఘ సమావేశాలు జెడ్పీ వైస్ చైర్మన్లు పాలిన శ్రావణి, సిరిపురపు జగన్మోహనరావు, వీరఘట్టం జెడ్పీటీసీ జంపు కన్నతల్లిల అధ్యక్షతన జరిగాయి. కార్యక్రమంలో సంబంధిత కమిటి సభ్యులుగా జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
ఇంటిని తీసుకుంటే బతికేదెలా?
సారవకోట: కుమార్తెలు ఆదరించడం లేదంటూ సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు శిమ్మ చిన్నమ్మి వాపోయింది. తనకు ముగ్గురు కుమార్తెలున్నా ఎవరూ ఆదరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త నుంచి సంక్రమించిన ఇంటిని సైతం చిన్న కుమార్తె ఆధీనంలో తీసుకుని ఇంటి నుంచి పంపించేందుకు చూస్తోందని ఆరోపించింది. దీనిపై తహశీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చిన్న కుమార్తె తన ఇంటిని తనఖా పెట్టి రూ.3 లక్షలు అప్పు తీసుకుని చెల్లంచనందున, అప్పు ఇచ్చిన వారు ఆ ఇంటిని తీసుకోడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఆ ఇంటిని తీసుకుంటే తనకు నిలువు నీడ కూడా ఉండదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. -
బిల్లూ లేదు!
ఇల్లూ లేదు.. ● పేదలకు ఇళ్లు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం ● సొంత స్థలంలో నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు చెల్లించని వైనం ● లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు ● జగనన్న కాలనీలో కానరాని వసతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం పేదలకు రిక్తహస్తం చూపిస్తోంది. ఎన్నికల హామీలు నెరవేర్చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. ఏ ప్రభుత్వమైనా పేదలకు ప్రధానంగా కూడు, గూడు, గుడ్డ అందించాలని భావిస్తుంటుంది. కూటమి సర్కారు మాత్రం అందుకు భిన్నంగా పేదల ఆశలపై నీళ్లు చల్లుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ జిల్లాలో ఒక్క పేద కుటుంబానికి కొత్తగా ఇల్లు మంజూరు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడా ఎవరికీ సెంటు భూమి ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇల్లు నిర్మాణాలు, బిల్లుల విషయం సైతం పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. నెరవేరని హామీ.. ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్లకు తక్కువ లేకుండా ఇళ్ల స్థలం, కనీసం రూ.4 లక్షల నిధులు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే.. ఇంకా సమయం ఉందని, అన్నీ అమలు చేస్తామని అడ్డగోలు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో.. గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్ రెడ్డి వలంటీర్లు ద్వారా ఇంటింటా సర్వేలు నిర్వహించి, అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు మంజూరు చేశారు. స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణం చేసేందుకు, స్వంత స్థలం లేని పేదలకు ప్రభుత్వం రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి వారికి పట్టాలను అందజేసి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. జిల్లాలో 30 మండలాలు, నాలుగు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 80,691 ఇళ్లు మంజూరు చేశారు. ఇందుకు గాను 784 లేఅవుట్లను ఏర్పాటు చేశారు. ఇల్లు కట్టుకున్నందుకు స్థలం లేని పేదలకు ఆ లేఅవుట్స్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి, నిర్మాణానికి నిధులు కూడా విడుదల చేసింది. ఇలా నిరుపేదలకు గూడుని ఇచ్చి వారికి సమాజంలో హోదా ఉండేలా చేసింది. జిల్లాలో 33,123 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. మిగిలిన వారికి నిర్మాణం చేసుకొనేందుకు మూడు ఆప్షన్లు ఇచ్చి స్వయంగా కట్టుకునేవారికి కావాల్సిన మెటీరియల్, నగదు సైతం అందజేశారు. కట్టుకోలేని పేదలకు నేరుగా ప్రభుత్వమే ఏజెన్సీలను ఏర్పాటు చేసి వారి ద్వారా నిర్మాణాలు చేయించి గృహ ప్రవేశాలు సైతం పూర్తి చేసింది. ఇక స్థలం ఉండి కట్టుకునే వారికి జిల్లాలో 43,568 ఇళ్లు మంజూరు చేసింది. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. ఇలా గత ప్రభుత్వంలో 36,780 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, నిర్మాణదారులకు రూ.863.19 కోట్లు అందజేసింది. కూటమి పాలనలో.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. జిల్లాలో ఒక్క నిరుపేద కుటుంబాలనికి మచ్చుకై నా ఒక్క ఇల్లు మంజూరు కాలేదు. ఇక లే అవుట్ల సంగతి సరేసరి. ఎక్కడా పేదల ఇళ్ల కోసం సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదు. అంతా కక్షసాధింపులు, నాయకుల ఆర్భాటాలు తప్ప సంక్షేమం ఊసేలేదు. స్థలం ఉంది ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వసతులేవీ? గత ప్రభుత్వం చివరిలో నిర్మాణాలు చేసిన వారికి కూడా ఈ ప్రభుత్వం బిల్లులు అందజేయలేదు. దీంతో లబ్ధిదారులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జిల్లాలో ఏర్పాటు చేసి అన్ని లేఅవుట్ కాలనీకు విద్యుదీకరణ చేశారు. అవసరం మేరకు కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కాలనీలో బోరు బావులు వేయించారు. మోటారుని ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడటంతో రోడ్లు, కాలువల నిర్మాణానికి బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆయా కాలనీవాసులు జిల్లా అధికారులకు, కూటమి నాయకులను వేడుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. -
సాగు మీది.. సాయం మాది
ఖరీఫ్ పనులు మొదలయ్యాయి. జిల్లాలో మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం వరి 1.50లక్షల హెక్టార్లుగా లక్ష్యం నిర్ణయించారు. ఈ ఏడాది రైతులకు అందించే విత్తనాలు, ఎరువుల పంపిణీ విషయంలో సందిగ్ధత ఇంకా వీడలేదు. ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధత ఎలా ఉందో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.త్రినాథ స్వామి వివరించారు. ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – శ్రీకాకుళం పీఎన్ కాలనీ సాక్షి: ఈ ఏడాది సాగు లక్ష్యం ఎంత..? విత్తనాల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? జేడీ: ఈ ఏడాది ఖరీఫ్ వరి సాగు లక్ష్యం 1.50లక్షల హెక్టార్లుగా నిర్ణయించాం. గత ఏడాది కంటే 6421 హెక్టార్లు పెంచాం. విత్తనాలు వరి 38,499 క్వింటాళ్లు లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటివరకు ఏపీ సీడ్స్ ద్వారా దాదాపు 30వేలు క్వింటాళ్ల పైచిలుకు విత్తనాలు రైతు సేవా కేంద్రాల ద్వారా పంపిణీ చేశాం. సాక్షి: అధిక దిగుబడులు రావాలంటే పాటించాల్సిన సూత్రాలు? జేడీ: విత్తన ఎంపిక అనేది చాలా కీలకం. నాట్లు వేసే పద్ధతి అయితే అధిక దిగుబడులకు అవకాశం ఉంటుంది. వరిపూత దశకు వచ్చే సమయంలో కాలిబాటలు తీయాలి. సాక్షి: రైతు సేవా కేంద్రాల పరిస్థితి ఏమిటి? జేడీ: జిల్లాలో 838 రైతుసేవా కేంద్రాలు ఉన్నాయి. రైతు వివరాలు నమోదు చేసుకుంటే అన్ని సేవలు ఈ కేంద్రాల నుంచే అందిస్తున్నాం. సేవలు అంతంతమాత్రమే అన్న ఆరోపణలు సరికాదు. సాక్షి: ఈ ఏడాది తుఫాన్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా..? జేడీ: మన జిల్లాకు ఎప్పుడూ తుఫాను ముప్పు పొంచి ఉంటుంది. జూన్లోనే నాట్లు వేయ డం మొదలైతే ముందస్తుగా పంటకాలం పూర్తయ్యి తుఫాన్ల బారిన పడకుండా రైతులు గట్టెక్కవచ్చు. తుఫాన్లకు తట్టుకునే రకాల విత్తనాలు 1210–సుజాత, 1061 –ఇంద్ర, 1064–అమర, స్వర్ణ–7029, శ్రీదృతి–1121, సాంబ–5204, శ్రీకాకుళం సన్నాలు–2531లు వంటి విత్తనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సాక్షి: ఎరువులు వాడకం తగ్గిందా. పెరిగిందా? జేడీ: ఎరువుల వాడకం తగ్గిస్తేనే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. శక్తివంతమైన ఆహారం అందుతుంది. వ్యవసాయ పనులు సులువుగా చేసుకునేందుకు రైతులు ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీంతో నాణ్యమైన దిగుబడులు రాకపోగా చీడపీడలు అధికమవుతాయి. సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రాధాన్యతనివ్వాలి. సాక్షి: వరితో పాటు ప్రత్యామ్నాయ పంటల పరిస్థితి ఎలా ఉంది..? జేడీ : ప్రజల ఆహార అలవాట్లు మారాయి. దాన్ని బట్టి వరికి ప్రత్యామ్నాయంగా రాగు లు, గంటెలు, సామలు, కొర్రలు, కందులు, మొక్కజొన్నలు వేసేలా ప్రోత్సహిస్తున్నాం. వరికి సుమారు 150రోజులు పంట కాలం ఉంటుంది. మిగిలిన పంటలకు 90నుంచి 120 రోజుల్లోపే మంచి దిగుబడులు వస్తాయి. లాభాలు ఎక్కువగా వస్తాయి. సాక్షి: సేంద్రియ వ్యవసాయంపై రైతులకు ఆసక్తి ఉందా? జేడీ: జిల్లాలో 35వేల ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. కానీ వరుసగా మూడేళ్లు సేంద్రియ వ్యవసాయం చేస్తేనే దా న్ని లెక్కలోకి తీసుకుంటాం. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సాక్షి: కౌలు రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎలా ఉంది? జేడీ: భూ యజమానులతో పాటు సమానంగా కౌలు రైతులకు అన్ని రకాల పథకాలు అందిస్తున్నాం. ఇప్పటికే 9800 మందికి సీసీఎల్ఏ కార్డులు అందించాం. ఉచిత పంటల భీమా కూడా వర్తించేలా చేస్తాం. కౌలు పత్రం ఉంటే ఈ–పంట నమోదు చేసుకుంటేనే పరిహారాలన్నీ అందుతాయి. భూయజమాని కౌలుదారుని అగ్రిమెంట్ రెన్యువల్ ఏటా చేయాలి. సాక్షి: జిల్లాలో అగ్రిల్యాబ్ల పరిస్థితి ఎలా ఉంది? జేడీ: జిల్లాలో జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్తో కలిపి మొత్తం 9 ఉన్నాయి. అందులో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అగ్రిల్యాబ్కి మిషనరీ రాలేదు. జిల్లా కేంద్రంలో ల్యాబ్ ఇంకా ప్రారంభం కాలేదు. మిగిలిన 7 ల్యాబ్ల్లో విత్తనాలు, ఎరువుల నాణ్యతా ప్రమాణాలు తెలుసుకునేందుకు అన్ని రకాల సేవలు అందిస్తున్నాం. వ్యవసాయశాఖ జేడీ కె.త్రినాధస్వామి సాక్షితో ముఖాముఖి ఈ యేడు సాగు విస్తీర్ణం పెంచినట్లు వెల్లడి సేంద్రియ ఎరువులు వాడాలని సూచన సాక్షి: యంత్రాల వాడకం ఎలా ఉంది? జేడీ: సులువుగా వ్యవసాయం చేసుకునేందుకు కావాల్సిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. సీడ్డ్రిల్, దుక్కుదున్నే యంత్రాలు, నారు యంత్రాలను సబ్సిడీపై అందిస్తున్నాం. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. సాక్షి: రైతులకు వ్యవసాయ రుణాలు సకాలంలో అందిస్తున్నారా? జేడీ: ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం అందేది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ డబ్బులు త్వరలోనే పడతాయి. రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. గత ఏడాది తీసుకున్న రైతులకే కాకుండా మరో 10శాతం మంది రైతులకు అదనంగా రుణాలు మంజూరు చేస్తాం. -
రాత్రి 2గంటలకు జనాలను తరలించాలట..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అమరావతి రాజధాని పునఃప్రారంభోత్సవ కార్యక్రమ జనసమీకరణ కోసం అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడ్డారు. నయానోభయానో చేసి, సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని జనాలను తీసుకెళ్లారు. ఇప్పుడేమో విశాఖపట్నంలో ఈ నెల 21 జరిగే యోగా డే కోసం జన సమీకరణ చేసి తీసుకెళ్లాలని ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మెప్పు కోసం రెండు కార్యక్రమాలకు జనా లు తరలించే బాధ్యతను అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి అప్పగించారు. ప్రభుత్వం కేటాయిస్తామనేది తక్కువ, ఖర్చు అయ్యేది ఎక్కువ కావడంతో అధికారులు నలిగిపోతున్నారు. దానికి తోడు యో గా డే కోసం ముందు రోజు రాత్రి 2 గంటలకు జనాలను తరలించే బాధ్యతను తీసుకోవాలని ఉన్నతా ధికారులు ఆదేశించారు. ఆ సమయంలో మహిళలను ఎలా తీసుకెళ్లాలో అని సచివాలయ ఉద్యోగు లు తలలు పట్టుకుంటున్నారు. బయలుదేరిన వాళ్లకు డబ్బుల సంగతి పక్కన పెట్టి, వారికి అవసరమైన స్నాక్స్ అందజేసే బాధ్యత తీసుకోవాలని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు అప్పగించారు. ముందు డబ్బులివ్వకుండా ఖర్చు పెడితే వెనక్కి వస్తాయో రావో తెలియని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. మొన్నటి స్నాక్స్ సొమ్మే రాలేదు... మళ్లీనా? అమరావతిలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో రాజధాని పునఃప్రారంభోత్సవ కార్యక్రమం రోజున జిల్లా నుంచి పెద్ద ఎత్తున బస్సులు ద్వారా జనాలను తరలించారు. ఆ సమయంలో బస్సులు, భోజనాలు కోసం చేసిన ఖర్చు ప్రభు త్వం వెనక్కి ఇచ్చిందో లేదో తెలీదు గానీ వెళ్లిన వారికి అందజేసిన స్నాక్స్ ఖర్చు ఇంతవరకు ఇవ్వలేదు. సీ్త్ర, శిశు సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగులే స్నాక్స్ భారాన్ని మోశారు. ఒక్కొక్కరికీ రూ.వేలల్లో ఖర్చయ్యింది. ఆ సొమ్ము ఇంతవరకు జమ చేయలేదు. తాజాగా విశాఖలో జరిగే యోగా డే కోసం తరలించే వారికి కూడా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులు(సూపర్వైజర్లు) స్నాక్స్ ఖర్చులు భరించాలని ఉన్నతాధికారులు సెలవిచ్చారు. దీంతో సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారులు బుధవారం జూమ్ మీటింగ్ పెట్టి స్నాక్స్ ఖర్చులు పెట్టుకోవా లని ఆదేశించారు. ఈ మీటింగ్లో కొంతమంది సూపర్వైజర్లు జోక్యం చేసుకుని అమరావతికి తరలించిన జనాలకు ఖర్చు పెట్టిన స్నాక్స్ సొమ్మే ఇంతవరకు రాలేదని, యోగా డేకు తరలించే జనాలకు ఎలా ఖర్చు పెట్టగలమని అడిగితే.. డబ్బులు సంగతి తర్వాత చూద్దాం, ముందు ఖర్చు పెట్టండని ప్రాజెక్టు అధికారి దాటవేయడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్టు నుంచి 3వేల మందిని తరలించడమే లక్ష్యంగా పెట్టారు. ఈ లెక్కన ఒక్కో ప్రాజెక్టుకు స్నా క్స్ ఖర్చు రూ.80వేల వరకు, జిల్లా వ్యాప్తంగా చూస్తే దాదాపు రూ.11లక్షల వరకు ఖర్చవుతుంది. ఇదంతా సూపర్వైజర్లు భరించాల్సి ఉంటుంది. యోగాంధ్ర కోసం అధికారుల పాట్లు జనసమీకరణ చేసి తీసుకురావాల్సిందే అని ఉన్నతాధికారుల హుకుం ‘అమరావతి సభ’ ఖర్చులే నేటికీ రాని పరిస్థితి యోగా డే కార్యక్రమానికి వెళ్లేవారికి స్నాక్స్ పెట్టాలంటూ ఐసీడీఎస్ సూపర్వైజర్లకు ఆదేశం రాత్రి 2గంటలకు జనాలను తరలించాలంటూ సచివాలయం ఉద్యోగులకు ఆదేశం ఏం చేస్తారో తెలీదు గానీ జనాలను తీసుకురావల్సిందేనని హుకుం జారీ చేయడంలో అధికారుల దగ్గరి నుంచి సిబ్బంది వరకు తలలు పట్టుకుంటున్నారు. జన సమీకరణ చేయడమే కష్టమనుకుంటే రాత్రి 2గంటలకు బయలుదేరించి, బస్సుల ద్వారా తీసుకురావాలని సచివాలయ ఉద్యోగులకు బాధ్యత అప్పగించారు. ఆ సమయంలో జనాలను బయలుదేరించడమంటే కష్టమేనని ఉద్యోగులు అంటున్నారు. కానీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలు కావడంతో కక్కలేక, మింగలేక సచివాలయ ఉద్యోగులు సతమతమవుతున్నారు. వాస్తవంగా, ప్రభుత్వం చేప ట్టే కార్యక్రమాలకు స్వచ్ఛందంగా జనాలు వచ్చే పరిస్థితి లేదు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కార్యక్రమాల పేరుతో జనాలు తరలించడం, వారికయ్యే ఖర్చులు భరించడం తలకుమించిన భారమే కాదు కత్తిమీద సాములా తయారైంది. -
రిక్వెస్ట్ బదిలీలకు ఛాన్స్..!
శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్యాశాఖకు అనుబంధమైన సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల రిక్వెస్ట్ బదిలీలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి విధివిధానాలు లేకుండా రిక్వెస్ట్ బదిలీలకు సంబంధించి అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. ఈ ప్రకటన సారాంశం ప్రకారం ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ కార్యాలయం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు మెయిల్ ద్వారా కేజీబీవీలకు చేరవేయడం జరిగిందని, అలాగే ఎంఈవో, డీఈవో కార్యాలయాల్లో సైతం అందుబాటులో ఉంచారని, అదేవిధంగా శ్రీకాకుళం డీఈవో అధికారిక వెబ్సైట్ డీఈవోఎస్కేఎల్.ఓఆర్జీ వెబ్పోర్టల్లో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. గతంలో పారదర్శకం జిల్లాలో సమగ్ర శిక్ష పరిధిలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు 1,210 మంది వరకు పనిచేస్తున్నారు. వీరిలో ఖాళీలు ఉన్న చోటుకు, ఉద్యోగులు పరస్పర (మ్యూచువల్) అంగీకార పద్ధతిలో బదిలీలు నిర్వహించేందుకు స్టేట్ ఎస్పీడీ అవకాశం కల్పించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్దేశిత సీనియారిటీ ప్రకారం కోరుకున్న చోటుకు 2020, 2023లో అత్యంత పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల జేబులు చింపేందుకు, ఉద్యోగులతో అనేక రకాలుగా పైరవీలు చేసుకునేందుకు రిక్వెస్ట్ బదిలీలకు తెరితీసినట్టుగా సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పది కేటగిరిల్లో దరఖాస్తులు పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 30 మండలాల పరిధిలో 10 కేటగిరిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులుకానున్నారు. జిల్లాలోని కేజీబీవీల్లో టీచింగ్, నాన్టీచింగ్, ఇన్క్లూసీవ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ (ఐఈఆర్పీస్), పార్ట్టైం ఇన్స్ట్రక్టర్లు (పీటీఐలు), క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్స్ (సీఆర్ఎంటీలు), మండల్ స్థాయి అకౌంటెంట్లు, సైట్ ఇంజినీర్లు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, కార్యాలయ సబార్డినేటర్లు పోస్టులకు రిక్వెస్ట్ ప్రాతిపదికపై బదిలీలు జరపనున్నారు. అవకాశం కల్పించిన రాష్ట్ర సమగ్ర శిక్ష ఉన్నతాధికారులు నేటి నుంచి దరఖాస్తులకు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి సమగ్ర శిక్ష పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హ్యూమానిటీస్ గ్రౌండ్లో రిక్వెస్ట్ బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఖాళీలు ఉన్నచోట, మ్యూచువల్ అంగీకార పద్ధతిలో స్థాన చలనం జరిపించేలా రాష్ట్ర అధికారులు నిర్ణయించారు. జిల్లాలో సమగ్రశిక్షా పరిధిలో పనిచేస్తున్న 10 కేటగిరి ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈనెల 21లోగా దరఖాస్తులు నేరుగా జిల్లా ఏపీసీ కార్యాలయంలో సమర్పించాలి. – డాక్టర్ సంపతిరావు శశిభూషన్, సమగ్రశిక్షా జిల్లా ఏపీసీ, శ్రీకాకుళం -
రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్రగాయాలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కేటీరోడ్డులో విద్యుత్ కార్యాలయం ఎదురుగా బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీతో అతివేగంగా వచ్చిన స్థానిక యువకుడు రోడ్డుపక్కన పనసతొనలు అమ్ముకుంటున్న కంచిలి మండలం కంచిలి గ్రామానికి చెందిన సిమ్మ ఆదమ్మను ఢీకొనడంతో తలకు వెనుకభాగంలో తీవ్రగాయమై రక్తస్రావమైంది. స్థానికులు యువకుడు, అతని వాహనాన్ని పట్టుకుని కాశీబుగ్గ పోలీసులకు అప్పగించారు. మహిళను పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో నర్సులు అత్యవసర వైద్య సేవలు అందించారు. పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పోలీసుల పర్యవేక్షణ లేకపోవడంతో పట్టణంలో మితిమీరిన వేగంతో యువకులు ప్రయాణించడం, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు, కాలం చెల్లిన వాహనాలతో ప్రయాణిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్షన్ ప్లీజ్..!
ఇచ్ఛాపురం రూరల్: డప్పు కొడితే గానీ డొక్కలు నిండని బతుకులు వారివి. అమ్మవారి సంబరాలు, పెళ్లిళ్లు ఇలా వేర్వేరు సందర్భాల్లో డప్పు దరువు వినిపించాల్సిందే. అవే దళిత డప్పు కళాకారుల కుటుంబాల కడుపులు నింపేవి. అనాది వాయిద్య కళకు ప్రాణం పోసే ఈ కళాకారులు కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్కు నోచుకోని అభాగ్యులుగా మారారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 50 ఏళ్లు నిండిన డప్పు కళాకారులు ఐదేళ్ల కాలంలో ప్రతీ ఏడాది జనవరి, జూన్ నెలల్లో పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకొని పింఛన్లు పొందేవారు. అయితే 2024 జనవరి నుంచి మే నెల వరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన డప్పు కళాకారులకు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. ఇప్పటికీ గ్రామ సచివాలయాల్లో వారి దరఖాస్తులు మూలుగుతున్నాయి. ఏడాదిలో జిల్లాలో మరో వంద మంది వరకు పింఛన్కు అర్హత సాధించినవారు దరఖాస్తులు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుతం జిల్లాలో 1984 మంది డప్పు కళాకారులు పింఛన్ పొందుతున్నారు. ప్రాచీన కళను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందున ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి అర్హులైన డప్పు కళాకారులకు పింఛన్లు మంజూరు చేయాలని, ప్రతీ డప్పు కళాకారుడికి గుర్తింపు కార్డులు, వయో పరిమితి లేకుండా ఆరువేల పింఛన్ మంజూరు చేయాలంటూ జిల్లా డప్పు కళాకారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సంబంధం లేకుండా గ్రామ, వార్డు సచివాలయం ద్వారానే అర్హులుగా గుర్తించాలని డప్పు కళాకారులు కోరుతున్నారు. గతేడాది దరఖాస్తు చేసుకున్నాను మాకు డప్పు వాయిస్తే గానీ జీవనం సాగదు. నాకు 50 ఏళ్లు నిండడంతో గతేడాది జనవరిలో డప్పు కళాకారుల పింఛన్ కోసం మా గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. జూన్ నెలలో కొత్త పింఛన్ వస్తుందని అధికారి చెప్పడంతో ఎంతగానో సంతోషించాను. అయితే ఈలోపు ఎన్నికలు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొత్త పింఛన్లు ఇవ్వడం లేదంటూ సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో ఏడాదిగా పింఛన్ కోసం ఎదురు చూస్తున్నాను. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి నాకు మంజూరు చేస్తుందని ఎదురు చూస్తున్నాను. – కల్యాణి గున్నయ్య, డప్పు కళాకారుడు, బొడ్డబడ, ఇచ్ఛాపురం మండలం కొత్త పింఛన్ల కోసం డప్పు కళాకారుల ఎదురుచూపులు కూటమి హయాంలో కలగని మోక్షం ఏడాదిగా నిరీక్షిస్తున్న వందలాది మంది పట్టించుకోని అధికారులు, నాయకులు తక్షణమే మంజూరు చేయాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతున్నా జిల్లాలో అర్హులైన ఒక్క డప్పు కళాకారుడికి కూడా నూతనంగా పింఛన్లు మంజూరు చేయకపోవడం దారుణం. అర్హులైన డప్పు కళాకారులకు నెలకు రూ.6 వేల పింఛన్ అందజేయాలి. అదేవిధంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలి. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకున్న డప్పు కళాకారులకు తక్షణమే పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. – డి.గణేష్, గౌరవ అధ్యక్షుడు, డప్పు కళాకారుల సంఘం, శ్రీకాకుళం ఎదురుచూస్తున్నాం నా వయస్సు ప్రస్తుతం 52 సంవత్సరాలు. నా చిన్నతనం నుంచి డప్పు కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్నాను. డప్పు కళాకారులకు ప్రభుత్వం పింఛన్ ఇస్తుందని ఏడాది క్రితం దరఖాస్తు చేశాను. అయితే ప్రస్తుతం సైట్ ఆగిపోయిందని చెప్పడంతో ఏడాది నుంచి ఎదురు చూస్తున్నాను. నాలాంటి కళాకారులు జిల్లాలో వందలాది మంది దరఖాస్తు చేసేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం డప్పు కళాకారుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. – కొప్పల భీమారావు, డప్పు కళాకారుడు, కేశుపురం, ఇచ్ఛాపురం మండలం -
రొంపివలస విద్యార్థికి గోల్డ్ మెడల్
పాతపట్నం: ప్రభుత్వ పాఠశాలల్లో టాటా కంపెనీ(టీసీఎల్) ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్లాస్టిక్ పొల్యూషన్ రెమెడీస్ బ్యూడింగ్ మోడ్రన్ ఇండియా వ్యాస రచన పోటీల్లో పాతపట్నం మండలంలోని రొంపివలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థిని లూకలాపు చాందిని జాతీయ స్థాయిలో మొదటి స్థానం కై వసం చేసుకుంది. దీంతో ఈనెల 15వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చాందినికి గోల్డ్ మోడల్, ప్రశంసా పత్రం, ధ్రువీకరణ పత్రం, రూ.35 వేల విలువ గల బహుమతిని అందజేశారు. అనంతరం ఈనెల 16వ తేదీన దేశవ్యాప్తంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ము అభినందించారు. అలాగే ఎంఈవోలు ఎ.గోవిందరావు, సీహెచ్ తిరుమలరావు, హెచ్ఎం ఎన్.కుమారస్వామి, ఉపాధ్యాయులు అభినందించారు. -
చెవిరెడ్డిని అరెస్టు చేయడం అరాచకం
నరసన్నపేట: లేని మద్యం స్కామ్ను చూపించి చంద్రబాబు ప్రభుత్వం అనేక మంది వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరావును అరె స్టు చేయడం అన్యాయమన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం అరాచకానికి చెవిరెడ్డి అరెస్టు పరాకాష్ట అని అన్నారు. ఆయన అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి సిట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరు లో అదుపులోనికి తీసుకున్న వరకూ చెవిరెడ్డి ఈ కేసులో నిందితుడిగా నమోదు కాలేదని పేర్కొన్నారు. ఈ కేసులకు భయపడేది లేదని తెలిపారు. ‘జనగణనతో పాటు కుల గణన చేపట్టాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జనగణనతో పాటు కుల గణన తప్పనిసరిగా చేపట్టాలని సీపీఐ జిల్లా సమితి సభ్యులు టి.తిరుపతి రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభు త్వం సోమవారం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్లో కులగణన చేస్తామని స్పష్టత లేకపోవడం, మోదీ ప్రభుత్వం యూ టర్న్ తీసుకున్న ట్లు కనిపిస్తోందన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కులగణన చే యడం ద్వారా ప్రభుత్వానికి మరింత సామా జిక అంశాలలో జవాబుదారీతనం ఉంటుందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ కార్యక్రమానికి సిద్ధం కావడం అభినందనీయమని తెలిపారు. 2020లో జరగాల్సిన ప్రక్రియను, కరో నా కారణంగా వాయిదా వేశారని గుర్తుచేశారు. కులగణనలో భాగంగానే ఆయా కులాల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక తదితర అంశాలను పరిశీలన చేసి గణన చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది కాబట్టే కుల గణన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతి పదేళ్లకు జరగాల్సిన జన గణన, స్వాతంత్య్రం వచ్చి ఇప్పటికి 7 సార్లు మాత్రమే చేశారని గుర్తుచేశారు. ‘నిరుద్యోగ భృతి ఇవ్వాలి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చే యడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ విమర్శించారు. శ్రీకాకుళం పట్టణంలో ఉన్న పలు కోచింగ్ సెంటర్లలో జూన్ 15 నుంచి జులై 15 వరకు ఏఐవైఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ/ ఉపాధి/నిరుద్యోగ భృతి సాధనకై ఐదు లక్షల అర్జీలను రాష్ట్ర గవర్నర్, సీఎంకు పంపించే దరఖాస్తును నిరుద్యోగులకు అందించి పూరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ 2024 ఎన్నికలకు ముందు ప్రతి పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తానని మాటిచ్చారని, ఆ మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. కేవలం 16 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి మిగతా శాఖల ఉద్యోగాల గురించి, నిరుద్యోగ భృతిని మర్చిపోయారని విమర్శించారు. దీన్ని ప్రభుత్వానికి గుర్తు చేయడానికి గవర్నర్, సీఎంకు అర్జీలు పంపించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, ఏఐవైఎఫ్ నాయకులు వై.వేణు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం నరసన్నపేట: ఈ వర్షాకాలంలో జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ మేరకు లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా ఫారెస్టు అధికారి వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక అర్అండ్బీ అతిథి గృహంలో బుధవారం ఆయన అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు మొక్కలను సిద్ధం చేస్తున్నామని, వివిధ శాఖల అధికారుల సహకారంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో సబ్డివిజనల్ డీఎఫ్ఓ బి.నాగేంద్ర, ఫారెస్టు రేంజ్ అధికారులు జగదీశ్, రాజశేఖర్, వెంకటరమణ,, శ్రీనివాసరావు, నరేంద్ర, జనప్రియ పాల్గొన్నారు. -
విద్యార్థుల భవిష్యత్ ఏమవ్వాలి..?
● రవీంద్రభారతి యాజమాన్యాన్ని నిలదీసిన తల్లిదండ్రులు టెక్కలి: ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారం వ్యవహరిస్తే పిల్లల భవిష్యత్ ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు రవీంద్రభారతి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు. ఇటీవల రవీంద్రభారతి పాఠశాలను అధికారులు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ స్థానికంగా ఉన్నటువంటి మరో ప్రైవేటు పాఠశాలలో తరగతులు నిర్వహించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బుధవారం విద్యార్థులతో పాటు తల్లిదండ్రులంతా ఆ పాఠశాల వద్దకు వెళ్లి రవీంద్రభారతి పాఠశాల ప్రిన్సిపాల్తో పాటు సిబ్బందిని గట్టిగా నిలదీశారు. నిన్నటివరకు ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాలను ఎలా నిర్వహించారని, ఇప్పుడు మరో పాఠశాలలో తరగతులు నిర్వహిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. దీంతో కొంత సమయం గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది. పాఠశాలను మూసివేయడం, నిన్నటి వరకు మరలా పాఠశాలను తెరుస్తామని తల్లిదండ్రులకు బుజ్జగించడం, ఇప్పుడు మరో పాఠశాలలో తరగతులు నిర్వహిస్తామని చెప్పడంతో రవీంద్రభారతి పాఠశాలలో చదివిన విద్యార్థుల పరిస్థితి అయోమయంగా మారింది. చివరగా విద్యార్థులకు సంబంధించిన టీసీలు ఇస్తామని యాజమాన్యం చెప్పడంతో తల్లిదండ్రులు వెనుదిరిగారు. -
ప్రతినెలా 10వ తేదీలోపు జీతాలు చెల్లించాలి
శ్రీకాకుళం అర్బన్: ఏపీపీటీడీ ఆర్టీసీ నందు శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు డిపోల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు ప్రతినెలా 10వ తేదీలోపు జీతాలను చెల్లించాలని ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికశాఖ అధికారికి ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్టీసీ శ్రీకాకుళం–1, 2 డిపోలతో పాటు టెక్కలి, పలాస డిపోల్లో దాదాపుగా 220 మంది కార్మికులు ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నారన్నారు. వీరికి ఆర్టీసీ యాజమాన్యం ద్వారా వచ్చే వేతనాలను కాంట్రాక్టర్లు ద్వారా చెల్లిస్తున్నారని. కాంట్రాక్టర్లు తీసుకునే సెవెన్ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ కాకుండా, అదనంగా రూ.2 వేల నుంచి రూ.3 వేలు వరకూ కార్మికులకు ఇచ్చే జీతాల్లో కాంట్రాక్టర్లు కార్మికుల కష్టాన్ని దోచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సమస్యను గతంలో పలుమార్లు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్కుమార్, లేబర్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఆదేశాలు పట్టించుకోవడం లేదు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్కుమార్ ఫిబ్రవరిలో కాంట్రాక్టర్లు, కార్మికుల మధ్య సయోధ్య కుదిర్చినా కాంట్రాక్టర్లు అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘం తరపున 23వ తేదీ సోమవారం నుంచి ప్రత్యక్ష ఆందోళన, నిరసన కార్యక్రమాలు, ధర్నాలను నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ప్రజా రవాణా అధికారి విజయ్ కుమార్కు, అకౌంట్స్ ఆఫీసర్ సీహెచ్ రాజు, శ్రీకాకుళం 1 డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు, శ్రీకాకుళం 2 డిపో మేనేజర్ కేఆర్ఎస్ శర్మ, టెక్కలి డిపో మేనేజర్ శ్రీనివాసరావు, పలాస డిపో మేనేజర్ ఆర్.ఎస్.నాయుడు తదితరులకు తెలియజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏపీపీటీడీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దాసరి కిరణ్, జిల్లా ట్రెజరర్ ఆర్.నవీన్కుమార్, ఏపీపీటీడీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. -
ఉద్దానంలో సినీ సన్నివేశాలు చిత్రీకరణ
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని ఉద్దాన ప్రాంతంలో సైలార్ క్రియేషన్ బ్యానర్పై ఆర్.రాముడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కలియుగ ధర్మరాజు’ చలన చిత్ర సన్నివేశాలను బుధవారం చిత్ర యూనిట్ చిత్రీకరించారు. యదార్థ సంఘటనలపై ఓటీటీ వేదికగా చలనచిత్రాన్ని చిత్రీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ప్రముఖ నటుడు డాక్టర్ కుమార్ నాయక్ ప్రధాన ప్రతి నాయకుడిగా, నటీనటులుగా సంజయ్, రజిని, రమ్య నటిస్తున్నారు. షూటింగ్ చూసేందుకు పరిసర ప్రాంతాల ప్రజలు తరలి వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఎల్.రమణ, పీఆర్వో శ్రీనివాస్, మడ్డు జశ్వంత్, నటీనటులు క్రాంతి, భారతి తదితరులు ఉన్నారు. -
ముప్పును గుర్తించి కలెక్టర్కు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం ఒక సమగ్ర రక్షిత నీటి సరఫరా స్కీమ్(సీపీడబ్ల్యూఎస్) నిర్మించలేదు. పబ్లిసిటీతో కాలం గడిపేసి ఉన్న స్కీమ్లను ధ్వంసం చేసే పరిస్థితులను తీసుకొస్తోంది. తమ నేతల జేబులు నింపడానికి ఉన్న వనరు లను అర్పించేస్తోంది. నీటి వనరులు పోతే ఏంటి? గ్యాస్ పైపులైన్కు ముప్పు వాటిల్లితే మాకేంటి? కాలువ గట్లు ఛిద్రమైతే నష్టమేంటి? అని ప్రభుత్వ మే విధ్వంసానికి సహకరిస్తోంది. నైర దగ్గర వంశధారలో జరుగుతున్న అడ్డగోలు కార్యకలాపాలతో భవిష్యత్లో ప్రమాదం పొంచి ఉన్నట్టే కనబడుతోంది. దోపిడీకి బాటలు.. జిల్లాలో ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలందరికీ తెలుసు. నదీ తీర ప్రాంతం లేని నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇసుకను దోచేస్తున్నారు. అడ్డగోలుగా తవ్వకాలు జరిపి, అక్రమంగా తరలించి రూ.వేల కోట్లు వెనకేసుకున్నారు. ఉచిత ఇసుక ముసుగులో ఒక్కో నాయకుడు రూ. కోట్లలో సంపాదించుకున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా, రక్షిత మంచినీటి పథకాలు, వంతెనలు, కరకట్టలు అని చూడకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రోడ్లు ఛిద్రమవుతున్నా, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నా లెక్క చేయకుండా భారీ ట్రక్కుల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. యంత్రాంగం జారీ చేసే బిల్లులను పోలిన బిల్లులను నకిలీ డివైజ్లతో సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు. నదీ తీర ప్రాంతాలను ఇసుక తవ్వకాలతో ధ్వంసం చేస్తున్నారు. లోతైన గోతులతో ప్రమాదకరమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వర్షాలు పడి వరదలు వస్తే ఎక్కడ ఏ ప్రమాదం చోటు చేసుకుంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తవ్వకాలు చేయగా, తాజాగా నైరపై పడ్డారు. నైరలోని వంశధార నదిలో అనుమతి లేకుండానే అన్నీ జరుగుతున్నాయి. కానీ, అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వంశధార నదిలో ఇసుక అక్రమాల కోసం అడ్డంగా వేసిన రోడ్డిది. అనుమతుల్లేకుండా రోడ్డు వేశారు. ఆ రోడ్డుకు దగ్గరలో రక్షిత మంచినీటి పథకం, గెయిల్ గ్యాస్ పైపు లైన్ ఉంది. ఇక్కడ తవ్వకాలు చేపట్టి, రవాణా చేస్తే ముప్పు తప్పదు. ఇక్కడే బైరిదేసి గెడ్డ కాలువ గట్టును కూడా ధ్వంసం చేసి, ఇసుక లారీల రవాణా కోసం తాత్కాలిక రోడ్డు నిర్మించారు. వాస్తవానికి 40టన్నుల సామర్థ్యం గల లారీల రవాణాకు కాలువ గట్టులు పనికి రావు. కానీ, అధికారులు చోద్యం చూస్తున్నారు. తాగునీటి ప్రాజెక్టు, గెయిల్ గ్యాస్ పైపు లైన్, బైరిదేసి గెడ్డ గట్టు తదితర వాటికి ఇసుక అక్రమార్కులు తలపెడుతున్న హానిని ముందే గుర్తించిన శ్రీకాకుళం రూరల్ వైఎస్సార్సీపీ నాయకులు అప్రమత్తమై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు బుధవారం ఫిర్యాదు చేశారు. జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇసుక రవాణాకు ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దని, ఇస్తే వనరులు ధ్వంసమవుతాయని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీపీ ప్రతినిధి అంబటి శ్రీనివాసరావు, జెడ్పీటీసీ ప్రతినిధి ఎచ్చెర్ల శ్రీధర్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ మూకాళ్ల తాతబాబు, వైస్సార్సీపీ గ్రీవెన్స్ విభాగం జిల్లా అధ్యక్షులు రౌతు శంకరరావు, సానివాడ ఎంపీటీసీ రుప్ప అప్పలసూరి, శ్రీకాకుళం అసెంబ్లీ యువజన విభాగం అధ్యక్షులు గొండు హరీష్, ఊటపల్లి కృష్ణారావు, శిమ్మ భగవాన్ దాస్ తదితర నాయకులతో పాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. -
ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం రూరల్ మండలంలోని కల్లేపల్లిలో ఉన్న సంప్రదాయ కూచిపూడి గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురుకులం డైరెక్టర్ స్వాతీ సోమనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కూచిపూడి నృత్యంలో శిక్షణ కోసం 2025–26 ఏడాదికి గాను జూలై 1 నుంచి ప్రవేశశాలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు 98491 07426 నంబరును సంప్రదించాలని కోరారు. యోగాంధ్ర పోటీల్లో మూడో స్థానం టెక్కలి: యోగాంధ్ర పోటీల్లో భాగంగా ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పాటల పోటీలు, యోగా పోటీల్లో టెక్కలి సాయికృష్ణా యోగా కేంద్రం గురువు గేదెల చంద్రశేఖర్ రాష్ట్రస్థాయిలో మూడవ స్థానంలో నిలిచారు. విజయవాడలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో భాగంగా ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, టూరిజం శాఖా మంత్రి దుర్గేష్ చేతులమీదుగా చంద్రశేఖర్ బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ మేరకు యోగా కేంద్రం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ముగ్గురు జేఎల్స్కు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం జిల్లా నుంచి ముగ్గురు జూనియర్ లెక్చరర్లను ప్రిన్సిపాళ్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 28వ తేదీన సీనియారిటీ జాబితా ప్రకారం పదోన్నతలకు అర్హత సాధించిన జేఎల్స్ జాబితాను ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా వారి ఆప్షన్ ప్రకారం కౌన్సెలింగ్ జరిపి ప్రిన్సిపాళ్లగా నియామక ఉత్తర్వులను బుధవారం జారీ చేశారు. జిల్లా నుంచి బి.చంద్రమౌళి (ఫిజిక్స్ లెక్చరర్–ప్రభుత్వ జూనియర్ కళాశాల,ఆమదాలవలస)ను మెళియాపుట్టి జీజేసీ ప్రిన్సిపాల్గా, పి.సౌజన్య (కామర్స్ లెక్చరర్– ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల,శ్రీకాకుళం)ను బారువ జీజేసీ ప్రిన్సిపాల్గా, చింతాడ శరత్బాబు (జువాలనీ లెక్చరర్– ప్రభుత్వ జూనియర్ కళాశాల,మందస)ను ఇచ్ఛాపురం జీజేసీ బాలురు ప్రిన్సిపాల్గా నియమించారు. వీరిని పలువురు లెక్చరర్లు, ఉద్యోగులు అభినందించారు. గ్రంథాలయం అభివృద్ధికి చర్యలు ● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గ్రంథాలయాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (అఅఐ) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను అందించేందుకు ముందుకు వచ్చిందని వెల్లడించారు. రాష్ట్రంలోనే ఒక ప్రముఖ మోడల్ గ్రంథాలయంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు, పాఠకులకు ఉపయోగపడే సౌకర్యాలతో ఇది స్టేట్ ఆఫ్ ఆర్ట్ గ్రంథాలయంగా అభివృద్ధి చేయబడుతుందన్నారు. ఈ నిధులను జిల్లా పాలనా యంత్రాంగమే వినియోగించనుందని, ఎలాంటి ప్రైవేటీకరణ అంశం ప్రస్తావనకే రాలేదని స్పష్టం చేశారు. గ్రంథాలయం పూర్తిస్థాయిలో ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉంటుందని, ఇప్పటికే ప్రజా ఆస్తిగా ఉన్న ఈ గ్రంథాలయం భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతుందన్నారు. గ్రంథాలయం ప్రైవేటీకరణ చేస్తారనే అసత్య ప్రచారాలు నమ్మవద్దని తేల్చి చెప్పారు. గ్రంథాలయ అభివృద్ధి పూర్తయిన తర్వాత విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఇది ఎంతో ఉపయోగపడే కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
యోగాంధ్రకు ముమ్మర సన్నాహాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే యోగాంధ్ర–2025 కార్యక్రమం రాష్ట్రానికి గొప్ప గౌరవమని, ఎలాంటి లోపం లేకుండా దీన్ని విజయవంతం చేయాలని, ప్రతి శాఖ సమన్వయంతో, సమగ్ర పర్యవేక్షణతో ముందుకు సాగాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివి ధ శాఖల అధికారులు, ఎమ్మెల్యేలు, యోగాంధ్ర ఇన్చార్జిలు సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచ రికార్డు లక్ష్యం... గిన్నిస్ బుక్లో స్థానం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మంత్రులు తెలిపారు. జిల్లా నుంచి విశాఖకు వెళ్లే ప్రణాళికలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా నుంచే 20 వేల మంది విశాఖ కార్యక్రమానికి వెళతారని కలెక్టర్ తెలిపారు. 150 ఆర్టీసీ, 400 ప్రైవేట్ బస్సులు ఇందుకోసం ఏర్పాటు చేశామన్నారు. వీరిలో 15 వేల మంది సా మాన్య ప్రజలు కాగా, మిగతా 5 వేల మంది ఇంటర్ ఆపై చదువుతున్న విద్యార్థులు ఉంటారన్నా రు. భీమిలి స్పాట్ జిల్లాకు కేటాయించగా, అక్కడే వేదిక వద్ద అల్పా హారం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తిరుగు ప్రయాణంలో ప్యాకేజ్డ్ భోజనం అందజేయాలని మంత్రులు ఈ సందర్భంగా సూచించారు. మరుగు దొడ్లు–ట్రాఫిక్ కీలకం ట్రాఫిక్ నియంత్రణ, మరుగుదొడ్ల ఏర్పాటు విషయంలో ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. 9 పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేశామని, పైడి భీమవరం దాటి జిల్లాలోని ప్రజలకు దాబాలు, పెట్రోల్ బంకులు, నేషనల్ హైవే టాయిలెట్ల వద్ద శుభ్రమైన వసతులు కల్పించనున్నట్టు వివరించారు. యోగాంధ్ర 2025 కోసం జిల్లాలో 6,500 వేదికలు గుర్తించగా, అందులో 3,500 పాఠశాలలు ఉన్నాయన్నారు. జిల్లాలో కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే 9.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ పూర్తయ్యిందని, రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ నెల 21న కార్యక్రమంలో పాల్గొంటారని, మొత్తం 10 లక్షల మందిని కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలన్నదే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, నడుకుదిటి ఈశ్వరరావు, ఎరగ్రొండపాలెం ఎమ్మెల్యే నారాయణరెడ్డి, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, పలు శాఖలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బుధవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.శ్రీరాములు పేర్కొన్నారు. ఎంఎస్ఎన్ లేబొరేటరీస్లో అసిస్టెంట్ కెమిస్ట్ పోస్టుల ఉ ద్యోగాలకు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 2020 నుంచి 2025 మధ్యలో డిగ్రీ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ అర్హులేనని తెలిపారు. జాబ్మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ బయోడేటాతోపాటు ఆధార్కార్డు, సర్టిఫికెట్లు, రెండు పాస్ ఫొటోలతో హాజరై జేకేసీ కోఆర్డినేటర్ వై.మణికుమార్ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరాములు సూచించారు. అగ్ని ప్రమాదం దురదృష్టకరం ిహరమండలం: ఆధ్యాత్మిక కూర్మ గ్రామంలో అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యు రాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డిశాంతి అన్నారు. మంగళవారం కూర్మ గ్రామాన్ని సందర్శించి హరేకృష్ణ ప్రార్ధన పర్ణశాలను పరిశీలించారు. కృష్ణ భక్తులతో మాట్లాడి ప్ర మాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నా రు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎల్ఎన్పేట ఎంపీపీ రెడ్డి జ్యోతిలక్ష్మి, వైఎస్సార్ సీపీ నాయకులు లుకలాపు ప్రసాద్, శ్రీనివాసరావు, నక్క ఆనందరావు, గోళ్ల నాగేశ్వరరావు, చింతాడ సూర్యనారాయణ, ఈగల చిన్నారావు, బి.గోవిందరావు పాల్గొన్నారు. ‘జీడి పరిశ్రమలు వెంటనే తెరిపించాలి’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అక్రమంగా బంద్ చేసిన జీడి పరిశ్రమల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెరిపించాలని లేకుంటే జూన్ 21న పలాసలో కార్మికులతో మహాధర్నా చేస్తామని సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, కె.సూరయ్య హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పలాస పారిశ్రామిక ప్రాంతంలో జీడి పరిశ్రమల యాజమాన్యాలన్నీ పరిశ్రమల బంద్ ప్రకటించడం చట్టవ్యతిరేకమైన చర్య అని అన్నారు. పరిశ్రమలు బంద్ చేసి రెండు వారాలు పూర్తయినా నేటికీ తెరవకపోవడంతో సుమారు 20వేల మంది కార్మికులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూసివేసిన పరిశ్రమలు వెంటనే తెరిపించాలని, బంద్ కాలానికి కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ కట్టాలని వారు యాజమాన్యాలను డిమాండ్ చేశారు. -
మాటల్లో డాబు.. పైకమేదీ బాబూ!
● 15వ ఆర్థిక సంఘ నిధులు జమ చేయని ప్రభుత్వం ● జిల్లాకు రెండో విడతగా రూ.39 కోట్లు కేటాయించిన కేంద్రం ● పంచాయతీలకు డబ్బులు చేరని వైనం ● నిధుల కోసం ఎదురుచూస్తున్న పంచాయతీలు నిధులు దారి మళ్లించారు రాష్ట్రంలో కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గ్రామ పంచాయతీలకు కేటాయించిన 15వ ఆర్థిక సంఘ రెండో విడత ని ధులను కూడా దారి మళ్లించేసి తల్లికి వందనం పథకానికి వాడేశారు. గ్రామ పంచాయతీలకు నిధులివ్వకపోవడంతో పల్లెల్లో నిత్యం పారిశుద్ధ్య పనులను కూడా చేయలేకపోతున్నాం. కేంద్రం ఇస్తున్న నిధులను కూడా పంచాయతీలకు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుండడం దారుణం. – మార్పు పృథ్వీరాజ్, సర్పంచ్, గార ●అరసవల్లి: పంచాయతీలు నిధుల కోసం ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రం ఊరికి డబ్బులివ్వడం లేదు సరి కదా..కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులు సైతం పంచాయతీలకు చేరకుండా ‘మళ్లింపు’ మంత్రం పఠిస్తోంది. కూట మి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయతీల దశ దిశ మార్చేస్తామని ఓ పక్క చంద్రబాబు, మరో పక్క పవన్ కల్యాణ్ గుప్పించిన ప్రకటనలన్నీ గాలి మాటలేనని తేలిపోయింది. పల్లె ఖజానాకు నిధులు చేరకపోవడంతో ఊళ్లలో పారిశుద్ధ్యం క్షీణిస్తోంది. కూటమి నేతలు కుట్ర రాజకీయంజిల్లాలో ప్రస్తుతం సర్పంచ్ల బాధ వర్ణణాతీతంగా మారింది. అత్యధికంగా వైఎస్సార్ సీపీకి మద్దతిచ్చిన సర్పంచ్లు జిల్లాలో ఉండడంతో.. ఆయా పంచాయతీల్లో అభివృద్ధికి ఏమాత్రం ఆస్కారమివ్వకుండా కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో కేంద్రమిచ్చి, నేరుగా జమ కావాల్సిన నిధులను కూ డా దారి మళ్లించేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ‘తల్లికి వందనం’ పేరిట అమలు చేసిన పథకానికి ఇవే నిధులు మళ్లించి జనాలకు అందజేశారనే ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి. ‘తల్లికి వందనం’ పథకానికి రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ల పిల్లలు అనర్హులని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అమ లు చేయడం మరింత దురదృష్టకరమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాకు అందని రూ.39 కోట్లు నిధులు జిల్లాలో మొత్తం 30 మండలాల్లో 912 గ్రామ పంచాయతీలుంటే..ఇందులో ఎన్నికలు నిర్వహించని 16 పంచాయతీలు మినహా మిగిలిన 896 పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘ నిధుల కేటాయింపులు జరగాల్సి ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘ నిధులు తొలివిడతగా రూ.38,66,19,415 వరకు జమ చేశారు. రెండో విడతగా గత రెండు నెలల కిందట కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.39.16 కోట్ల నిధులు జిల్లాకు కేటాయింపు చేశారు. అయితే జిల్లా లో 896 పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దీనిపై గ్రామ సర్పంచ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల మళ్లింపుతో పల్లెలు అవస్థలు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంపద సృష్టిస్తా అంటే.. ఇలా కేంద్ర నిధులను మళ్లింపు చేసి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు వర్తింపజేయడమా అని ప్రశ్నిస్తున్నారు. పల్లెకు సుస్తీ.. జిల్లాలో దాదాపుగా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు సాధారణ పంచాయతీల్లోనూ అపరి శుభ్ర వాతావరణమే కనిపిస్తోంది. పల్లెల్లో ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ మురుగునీరు నిల్వలుండిపోయాయి. కాలువల్లో పూడిక తీత పనులు పెద్దగా జరగకపోవడంతో చెత్త చెదారాలతో పల్లె రహదారులు నిండిపోయాయి. టెక్కలి డివిజన్లో పంచాయతీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇక జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీకాకుళం రూరల్, గార, ఎచ్చెర్ల, లావేరు తదితర మండలాల్లోని పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో అంటు వ్యాధులు ప్రబలడంతో పా టు స్థానికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. నిధుల లేమితో పంచాయతీల్లో రోజూ జరగాల్సిన పరిశుభ్రత పనులు కూడా జరగడం లేదు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా అధికారులు మిన్నకుండిపోతున్నారు. ఎక్కడా నిధుల లేమి ప్రస్తావన రాకుండా చూడాలని కూటమి పాలకులు హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో అధికారులు నోరు మెదపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీలకు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి పది మంది బాడీబిల్డర్లను ఎంపికచేశారు. స్థానికంగా జరిగిన జిల్లాస్థాయి ఎంపికల్లో రాణించిన బాడీబిల్డర్లు ఈ నెల 22న నెల్లూరులో జరిగే రాష్ట్రపోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు మంగళవారం పేర్కొన్నారు. కార్యక్రమంలోస్టార్ బాడీబిల్డర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి.విజయ్కుమార్, ది ఆంధ్రా బాడీబిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.గౌరీశంకర్, వి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
స్థలం కబ్జాకు యత్నం
● టీడీపీ కార్యకర్తపై బాధితుడి ఫిర్యాదు ఆమదాలవలస: పట్టణ నడిబొడ్డున ప్రధార రహదారి పక్కనే ఉన్న శివాలయం ఎదురుగా తన స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ కార్యకర్త బొడ్డేపల్లి విజయ్కుమార్ ప్రయత్నిస్తున్నాడని స్థల యజమాని పుల్లేటికుర్తి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వేకువజామున విజయ్ తన అనుచరులతో కలిసి జేసీబీ సాయంతో స్థలాన్ని చదును చేసేందుకు యత్నించగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని తెలిపారు. తమ్మినేని ప్రసాద్ అనే వ్యక్తి పేరుతో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి స్థలాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ విషయమై ప్రసాద్ను ప్రశ్నించగా తనకేమీ సంబంధం లేదని తెలిపాడని పేర్కొన్నారు. ఈసీ, లింక్ డాక్యుమెంట్లు అన్నీ తన పేరుపై (వెంకటరమణ) ఉన్నప్పటికీ కబ్జాదారుడిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. విజయ్పై ఇప్పటికి మూడు సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఆయన వల్ల ప్రాణహాని ఉందని వాపోయారు. ఎస్పీ, కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో సైతం ఫిర్యాదు చేశానని, సమస్య పరిష్కారం కాకుంటే చావే శరణ్యమన్నారు. -
మస్తర్లలో మాయాజాలం!
సంతబొమ్మాళి: ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురంలో పలు అవకతవకలు జరిగినట్లు వేతనదారులు చెబుతున్నారు. మస్తర్లలో మాయాజాలం నడిపించి పనికిరాకపోయిన వారికి సైతం హాజరు నమోదు చేసి వేల రూపాయలు కాజేశారని ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. దండుగోపాలపురంలో 15 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్గా పని చేసిన వరదరాజులను రాజకీయ కక్షతో తొలగించి అధికార పార్టీ నేతలు తమకు అనుకూలమైన వడ్డితాండ్ర నారాయణ అనే వ్యక్తితో నిబంధనలకు విరుద్ధంగా ఉపాధి పనులను చేయించారు. పనికి రాకపోయినప్పటికీ సుమారు 30 మంది పేర్లను మస్టర్లలో నమోదు చేసి ఒక్కొక్కరి అకౌంట్లో వేల రూపాయలను జమ చేయించి దోచుకున్నారు. బెండి సూర్యనారాయణ (జాబ్ కార్డు నెంబర్ 10446) ఒక్క రోజు కూడా ఉపాధి పని చేయకుండా తొమ్మిది వారాలు ఉపాధి పని చేసినట్లు మస్టర్లలో నమోదు చేశారు. అతని అకౌంట్లో రూ.13వేలు జమ అయ్యాయి. ఇదే తరహాలో బెండి విష్ణుమూర్తి, బాలక కృష్ణారావు, బాలక చంద్రశేఖరరావు, ఆరంగి జగన్నాధరావు, పొందర ప్రసాదరావు, పొందర మధు, కుమ్మరి రామారావు తదితర అకౌంట్లలో నిధులు జమయ్యాయి. ఉపాధి పని చేయిస్తున్న వడ్డితాండ్ర నారాయణ, అతని భార్య హేమలతకు నిబంధనలకు విరుద్ధంగా వేరువేరు జాబ్ కార్డులు ఉన్నాయి. నారాయణ(జాబ్కార్డు–10415)కు రూ.15.900, అతని భార్య హేమలత(జాబ్కార్డు–10686) ఉపాధి పనికి వెళ్లకపోయినా రూ.6.349 అకౌంట్లో నమోదయ్యాయి. ఇలా 30 మంది వరకు ఉపాధి పనికి వెళ్లకుండా మస్తర్లలో నమోదు చేశారని, దీనిపై దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని వేతనదారులు కోరుతున్నారు. ఈ విషయమై ఉపాధి ఏపీవో నరసింహమూర్తి వద్ద ప్రస్తావించగా.. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్కడ ఎవరినీ ఫీల్డ్ అసిస్టెంట్గా నియమించలేదని తెలిపారు. పనికి రాకుండానే హాజరు నమోదు భార్యాభర్తలకు వేర్వేరు జాబ్కార్డులు దండుగోపాలపురం ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయంటున్న వేతనదారులు -
చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలోని తెలగవీధిలో గొరిజల్లి శేఖర్ ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి సుందరాపురం గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణను అరెస్టు చేశామని ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. నిందితుడు బాలసీమ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశామన్నారు. చోరీ సొత్తు తులం చైన్, చెవి దుద్దులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రత్యేక శ్రద్ధతో బోధిస్తేనే సత్ఫలితాలు జలుమూరు: విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో బోధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని డీఈఓ ఎస్.తిరుమల చైతన్య అన్నారు. మంగళవారం చల్లవానిపేట ఉన్నత, జలుమూరు ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల క్రితం తొమ్మిది మందికే పరిమితమైన విద్యార్థుల సంఖ్య నేడు 86 మందికి చేరుకోవడంలో విశేష కృషి చేశారని జలుమూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెండ రామారావును ప్రత్యేకంగా అభినందించారు. రామారావు మాస్టారు ఓ క్రియేటర్ అని కితాబునిచ్చారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్కు నివేదించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కొర్లాంలో పూరిల్లు దగ్ధం గార : కొర్లాం గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కొర్లాపు అప్పన్నకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. మంగళవారం ఉదయం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి కారణం తెలియడం లేదు. ఇటీవలే మేకలు అమ్మగా వచ్చిన సుమారు రూ.లక్ష నగదు కాలి బూడిదయ్యాయి. ఆధార్, రేషన్కార్డు, దుస్తులు, తిండిగింజలు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలార్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వీఆర్వో సన్యాసిరావు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయగా, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. నిధులు విడుదల చేయాలని వినతి శ్రీకాకుళం పాతబస్టాండ్: కళాశాల విద్యార్థులకు సంబంధించి 2024–2025 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ, ఇతర కోర్సుల పోస్టుమెట్రిక్ స్కాలర్షిప్లు, విద్యా దీవెన, వసతి దీవెన నిధులు కళాశాలలకు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాలల మేనేజ్మెంటు అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాన జయరాం కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. స్కాలర్షిప్ నిధులలో 25 నుంచి 30 శాతం మాత్రమే ప్రిన్సిపాల్ ఖాతాలకు జమయ్యాయని తెలిపారు. నిధులు విడుదల కాక సిబ్బంది జీతాలు, అద్దె, విద్యుత్ బిల్లులు వంటి ప్రాథమిక ఆర్థిక బాధ్యతలను తీర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ షాక్తో భవన నిర్మాణ కార్మికుడి మృతి నందిగాం: దేవళభద్ర పంచాయతీ జల్లపల్లిలో విద్యుత్ షాక్కు గురై భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రమైన నందిగాంకు చెందిన కొర్లాపు శంకరరావు(42) మంగళవారం తోటి భవన నిర్మాణ కార్మికుడు అగురు బాలకృష్ణ, దేవళభద్రకు చెందిన మేసీ్త్ర ప్రసాద్ కలిసి జల్లపల్లిలో గొనప కారయ్య ఇంటి సెంటరింగ్ పనికి వెళ్లాడు. ఇనుప గజాలను తీస్తుండగా ఇంటికి ముందు ఉన్న 11 కేవీ హైటెన్షన్ వైరు తగలడంతో షాక్కు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి కార్మికులు సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. శంకరరావుకు భార్య గౌరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య గౌరి ఇచ్చిన పిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ జి.వి.రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేలకు రక్ష
మట్టి పరీక్ష..● భూసార పరీక్షలతో బహుళ ప్రయోజనాలు ● ఫలితాల ఆధారంగా సాగు చేస్తే అధిక దిగుబడులు కవిటి: అధిక దిగుబడులు సాధించాలనే క్రమంలో కొందరు రైతులు పరిమితికి మించి రసాయన ఎరువులు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పంటకు అవసరం లేకపోయినా ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా వాడుతున్నారు. దీంతో దిగుబడులు రాకపోగా.. భూమి సారవంతం కోల్పోతోంది. ఈ సమస్యను అధిగమించాలంటే భూసార పరీక్షలు ఒక్కటే మార్గమని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలు పండాలంటే నేలలో ఖనిజ లవణాలు, పోషకాలు సమృద్ధిగా ఉండాలి. దీనిపై దృష్టి పెట్టకుండా అధిక దిగుబడులు సాధించాలనే ఆశతో కొందరు రైతన్నలు రసాయనిక ఎరువులు భారీగా వినియోగిస్తున్నారు. దీంతో భూమి సమతుల్యత కోల్పోతోంది. మొక్కకు సరైన పోషకాలు అందక పంట దిగుబడులపై పెను ప్రభావం పడుతోంది. మట్టి నమూనా పరీక్షలు చేయించి ,ఆ ఫలితాలకు అనుగుణంగా పంట సాగు చేస్తే మేలైన దిగుబడులతో సాగుఖర్చులు తగ్గే అవకాశముంటుంది. భూసార పరీక్షలు కీలకం.. భూమిలో ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం పరిమాణాల్లో మార్పులను భూసార పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. సూక్ష్మ పోషకాల లోపాలను తెలుసుకోవడమే కాకుండా భూమిలో ఏ పోషకాలు తగ్గాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. సేంద్రియ కర్బనం తగ్గితే పచ్చిరొట్ట పంటలను సాగు చేసి నష్టాలను నివారించవచ్చు. నేల పోషణ సామర్ాధ్యన్ని తెలుసుకోవడం ద్వారా ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో రైతులు గ్రహించే అవకాశం ఉంటుంది. మోతాదు మించితే.. పంటల సాగులో అధిక దిగుబడులు సాధించాలని తపనతో మోతాదుకు మించి వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల భూమిలో పోషకాలు నశించిపోతున్నాయి. పొటాషియం ఎక్కువగా వాడటం వల్ల మెగ్నీషియం, జింక్, ఇనుము వంటి పోషకాలు మొక్కలకు అందకుండాపోతున్నాయి. జింక్ లోపం కారణంగా మొక్క ఎదుగుదల తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. సూక్ష్మ పోషకాలతో పాటు నైట్రోజన్, సేంద్రియ కర్బనాల స్థాయి చాలా కీలకం. సేంద్రియ కర్బనం లోపిస్తే భూమి సహజ స్వభావాన్ని కోల్పోతుంది. దీంతో ఆ భూమిలో ఎంత ఎరువు వేసినా భూమి గ్రహించకుండా నిస్సారమవుతుంది. ప్రయోగశాలలో.. భూమిలో సేంద్రియ కర్బనం 0.5 నుంచి 0.7 శాతం వరకు ఉంటే సాధారణంగా పరిగణిస్తారు. మట్టిని ప్రయోగశాలలో విశ్లేషించి ఆ నేల స్వభావం లక్షణాలు పోషక విలువలు స్థాయిలను గుర్తిస్తారు. ఈ ఫలితాల ఆధారంగా ఏ పంటకు ఎంత మోతాదులో పోషకాలు అవసరమో తెలుస్తుంది. ప్రతి మూడేళ్లకోసారి భూసార పరీక్షలు చేయించడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రోత్సహిస్తున్నాం కవిటి మండలంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 745 క్వింటాళ్ల వరి విత్తనాలు సరఫరా చేశాం. ఇప్పటి వరకు 1237 మంది రైతుల నుంచి భూసార పరీక్షలకు కోసం శాంపిల్స్ తీసుకున్నాం. ఫలితాలు త్వరలో రానున్నాయి. సేంద్రియ కర్బనం, సూక్ష్మ పోషకాల పెంపుదలే లక్ష్యంగా పచ్చిరొట్ట వాడకంపై విస్తృత ప్రచారం కల్పించి జీలుగ ఎరువు వాడకం పెంచాం. రసాయనిక ఎరువుల వాడకంపై రైతులకు ఎప్పటికప్పుడు మా సాంకేతిక సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. – పి.శ్రీదేవి, మండల వ్యవసాయాధికారి, కవిటి మూడేళ్లకోసారి పరీక్ష వ్యవసాయశాఖ అధికారుల తోడ్పాటుతో ఏటా ఆధునిక వ్యవసాయ విధానాలపై దృష్టిసారించా. కొత్తరకం వరివంగడాలు సాగుకు ఆసక్తిచూపుతున్నాను. ప్రధానంగా పశువుల గెత్తం వేయడం, పచ్చిరొట్ట పైర్ల సాగు, జింక్ తదితర సూక్ష్మపోషకాల సాగు అన్నిటినీ భూసారపరీక్ష ఫలితాలకు లోబడే వినియోగిస్తున్నాను. – ఉప్పాడ వాసుదేవరెడ్డి, రైతు, పాతకొజ్జీరియా, కవిటి మండలం ప్రయోజనాలివే.. మట్టి పరీక్షల్లో ఆమ్ల క్షార లవణాల స్థాయి, సేంద్రియ కర్బనం, భాస్వరం, పొటాషియం ఎంత నిష్పత్తిలో ఉన్నాయో తెలుసుకోవచ్చు. పంట వయసు కాలాన్ని అనుసరించి ఎరువులను సమపాళ్లలో అందించవచ్చు. ఆమ్లగుణం ఉన్న నేలల్లో సున్నం, క్షార గుణం ఉన్న నేలల్లో జిప్సంతో నేలను బాగు చేసుకోవచ్చు. నేలలో సహజంగా ఉన్న పోషకాల స్థాయిని తెలుసుకొని సాగు చేసే పంటలకు ఎరువుల మోతాదు నిర్ణయించవచ్చు. నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకొని దిగుబడులు పెంచుకునే అవకాశం ఉంది. -
నిచ్చెన వేసి..చోరీ చేసి!
సోంపేట: పలాసపురంలోని ఓ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సోంపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాసపురం గ్రామానికి చెందిన బెందాళం అశోక్ ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేస్తున్నారు. రెండున్నర తులాల బంగారం, ఎల్ఐసీ కలెక్షన్ నగదు లక్ష రూపాయలు బీరువాలో ఉంచారు. సోమవారం రాత్రి ఎప్పట్లాగే కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం లేచి చూసేసరికి వేరే గదిలో ఉన్న బీరువా పగలగొట్టి ఉండటం గమనించారు. అందులో బంగారం, నగదు కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి బయట నిచ్చెన ఉండటంతో దాని ద్వారా దొంగలు లోపలికి ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోంపేట ఎస్ఐ లోవరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. -
సిట్ అధికారుల తీరు సరికాదు
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ టెక్కలి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్బుక్ పాలనకు సిట్ అధికారులు రెడ్ కార్పెట్ వేస్తూ తప్పుడు వాంగ్మూలం కోసం చేసిన తప్పుడు ప్రయత్నాలు బయటపడ్డాయని వైఎస్సార్ సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లిక్కర్ స్కాం జరిగిందంటూ వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమంగా కేసులు నమోదు చేయాలని కుట్రలు పన్నడం తగదన్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డిని జైలుకు పంపించాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు సిట్ అధికారులను పావులుగా వాడుకుని గన్మెన్లను సైతం చిత్రహింసలకు గురి చేయడం విస్మయానికి గురి చేస్తోందన్నారు. తప్పుడు కేసులకు అధికారులు వత్తాసు పలికితే భవిష్యత్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. -
అక్రమాలకు ‘అడ్డు’ లేకుండా!
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి చెందిన వాడాడ కూడలి వద్ద ఉన్న భూముల్లో అక్రమంగా నిర్మించిన రహదారిపై ‘సాక్షి’ పలుమార్లు ప్రచురించిన కథనాలకు దేవదాయ శాఖాధికారులు స్పందించి గత నెల 26న ఐరన్ మెస్ బారికేడ్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని అంతా భావించారు. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ మంగళవారం ఉదయానికి బారికేడ్లు మాయమయ్యాయి. పక్కనున్న పొలాల్లో మెస్లను తోసేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారికి అడ్డంగా కట్టుదిట్టంగా బారికేడ్లు వేయడం గానీ, ఏకంగా అక్రమ రహదారిని జేసీబీతో తొలగించడం గానీ చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. -
మున్సిపల్ కార్మికులకు పథకాలు వర్తింపజేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మున్సిపల్ కార్మికులందరికి (ఇంజనీరింగ్, పారిశుధ్య) తల్లికి వందనంతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం నగర కమిషనర్ పి.వి.వి.డి ప్రసాదరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆప్కాస్ ఉద్యోగి అనే పదాన్ని తొలగించి మున్సిపల్ కార్మికులందరికీ తల్లికి వందనంతో పాటు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కోరారు. అప్పట్లో 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు స్పందిస్తూ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలన్నీ ఎలాంటి షరతులు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని కార్మికులు, ప్రజలు ఆశించారని, అందుకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సూరయ్య, టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, నగర అధ్యక్షులు ఎ.గణేష్, కమిటీ సభ్యులు ఎ.గురుస్వామి, ఆర్జి.శేఖర్, ఎ.జనా తదితరులు పాల్గొన్నారు. -
ఈదుపురంలో ఇరువర్గాల కొట్లాట
ఇచ్ఛాపురం రూరల్: ఈదుపురం గ్రామంలో మంగళవారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కొట్లాటకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిలి జగన్నాథం, అంబటి శంకర్కు చెందిన అనుచరుల మధ్య మూడు రోజుల క్రితం పిక్కాట వద్ద ఘర్షణ చెలరేగింది. గ్రామపెద్దలు కలగజేసుకొని సోమవారం గ్రామంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. మంగళవారం వేణుగోపాల కాలనీ వద్ద మరోసారి ఇరువర్గాలు ఘర్షణ ఏర్పడటంతో కొట్లాటకు దారితీసింది. కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో దాసరి పుణ్యావతి, మద్దిలి జగన్నాథం, అంబటి శంకర్, అంబటి కుమార్, మురళీ, దువ్వు ఎల్లయ్య, దువ్వు ప్రశాంత్, బోర యువరాజులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఈ.శ్రీనివాస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
తల్లికి వేదన
ఇచ్ఛాపురం రూరల్: ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానంటూ గత ఎన్నికల ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత తొలి ఏడాది ఎగ్గొట్టారు. రెండో ఏడాది ప్రారంభమయ్యాక తొలిసారి అమల్లోకి తెచ్చిన తల్లికి వందనాన్ని నిబంధనల చట్రంలో ఇరికించారు. ఆచరణలోకి వచ్చేసరికి కొర్రీలతో కోతలు పెట్టారు. 300 యూనిట్లు విద్యుత్ వినియోగిస్తే అనర్హత వేటు వేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 300 యూనిట్లు కంటే తక్కువ ఉన్నప్పటికీ గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించిన తల్లికి వందనం జాబితాలో అనర్హత ఉండటంతో లబోదిబోమంటున్నారు. తమకు తక్కువ బిల్లు వచ్చినప్పటికీ తల్లికి వందనం పథకంలో తమ పిల్లల పేర్లు అనర్హతగా నమోదయ్యాయని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అటు గ్రామ సచివాలయాలు, ఇటు విద్యుత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘తల్లికి వందనం’ పథకం అందక పాట్లు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు -
● కదంబ పుష్పార్చన
జిల్లా కేంద్రంలోని పాలకొండ రోడ్డులో విజయగణపతి ఆలయం వద్ద స్వామివారికి సోమవారం కదంబ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. – శ్రీకాకుళం కల్చరల్ ● డాబాపై డ్రాగన్ ఫ్రూట్ జిల్లా కేంద్రంలోని దండివీధిలో నివాసముంటున్న ప్రసాద్ తన డాబాపై డ్రాగన్ ఫ్రూట్ పండించారు. కొన్నాళ్లుగా మొక్కను శ్రద్ధగా పెంచడం వల్ల ఎట్టకేలకు ఫలితం లభించిందని ఆనందం వ్యక్తం చేశారు. – శ్రీకాకుళం కల్చరల్ ● పులి కాదు పునుగు పిల్లి టెక్కలి మండలం జయకృష్ణాపురం గ్రామ సమీప పొలాల్లో సోమవారం వింత జంతువు సంచరించింది. చిరుత పులి పిల్లను పోలి ఉండటంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై అటవీ శాఖాధికారులు స్పందిస్తూ చిరుత పులిని పోలి ఉండే ఈ జంతువును నీటి పిల్లి, పునుగు పిలి, ఫిస్సింగ్ క్యాట్గా పిలుస్తాంటారని చెప్పారు. దీని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని, చేపల వేట కోసం చెరువులు వద్దకు వస్తుంటాయని తెలిపారు. ఇలాంటి జీవులకు ఎటువంటి హాని కలిగించవద్దని కోరారు. – టెక్కలి రూరల్ ● ఒకే ఒక్కడు! కూటమి సర్కారు తీసుకున్న చర్యలతో సచివాలయాలు నిర్వీరమైపోయాయి. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం–2 గ్రామ సచివాలయంలో ప్రస్తుతం వెల్ఫేర్ అసిస్టెంట్ పులకల ఉమాపతి ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. తల్లికి వందనం సమస్యలు, భూ శిస్తులు, ఆధార్ సీడింగ్, కుల, నివాస ధ్రువ పత్రాల కోసం సోమవారం పదుల సంఖ్యలో లబ్ధిదారులు చేరుకోవడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయం చేసేందుకు మరో ఉద్యోగి లేక సాయంత్రం వరకు ఆకలితో అలమటిస్తూ విధులు నిర్వహించారు. ఇక్కడ మరో ఇద్దరు సిబ్బంది ఉండేవారు. వారిలో ఒకరు డీఎస్సీ పరీక్ష కోసం సెలవు పెట్టగా, మరొకరు బూర్జ పాడులో ఇన్చార్జి విధులు నిర్వర్తిస్తున్నారు. –ఇచ్ఛాపురం రూరల్ -
నాణ్యత పరీక్షలపై నీలినీడలు
గతంలో అనేకసార్లు సబ్సిడీపై అందించిన విత్తనాలు మొలక శాతంలో తేడాలు రావటంతో రైతులకు రాయితీ విత్తనాలపై నమ్మకం సన్నగిల్లింది. ఈ ఏడాది వ్యవసాయశాఖలో అధికారులు, సిబ్బంది బదిలీలు నేపథ్యంలో ఎక్కడా నాణ్యత పరీక్షలు చేసిన దాఖలాలు లేవు. మండలాల వారీగా టార్గెట్ పెట్టి నాణ్యత పరీక్షలు చేయాలి. ప్రైవేటు దుకాణాల్లో కూడా పరీక్షలు చేయాలి. కానీ ఆ స్థాయిలో నాణ్యతా పరీక్షలు జరగలేదని తెలుస్తోంది. ముఖ్యంగా రైతుసేవాకేంద్రాల్లో పంపిణీ చేస్తున్న విత్తనాలను స్థానికంగా శాంపిల్స్ తీసి వాటి నాణ్యతను నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడా పని జరగకపోవడంతో విత్తనాలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనివల్ల విత్తనం నాటిన తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. నష్టపరిహారం డిమాండ్ చేయటం, మళ్లీ విత్తనాల కోసం ప్రైవేటు దుకాణాల వద్ద క్యూకట్టడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. నష్టపోయాక హడావుడి నాణ్యతపరీక్షలు జరిపి కాకిలెక్కలు చెప్పడం కన్నా ముందే విత్తన నాణ్యత పరీక్షలు చేయాల్సి అవసరం ఉంది. -
జీడి కార్మికుల పొట్టకొట్టొద్దు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో రెండు వారాలుగా మూతబడిన జీడి పరిశ్రమలు వెంటనే తెరవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాష్యూ లేబర్, రైస్ మిల్లర్స్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో పలాస కాష్యూ అసోసియేషన్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక సంఘ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి మాట్లాడుతూ రెండు వారాలుగా కార్మికులకు ఉపాధి లేక రుణాలు, డ్వాక్రా వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కలాశీలు, పిక్కలు ఒలిచేవారు, బాయిలింగ్ తదితర కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కష్టంతో పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ప్రభుత్వ రాయితీలు పొంది నేడు కార్మికులకు ఆకలితో ఉంచడం సమంజసం కాదన్నారు. పరిశ్రమలు తెరవకపోతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో సంఘ కార్యదర్శి సానా ఈశ్వరరావు, కోశాధికారి కోనారి రాము, బొంపల్లి సింహాచలం, కోనారి భీమారావు, జోగి మోహనరావు పాల్గొన్నారు. విచారణలో గోప్యమెందుకో? ఆమదాలవలస: రామచంద్రపురం పంచాయతీ పొన్నాంపేటలో ఉపాధి హామీ పనుల నిర్వహణ, అక్రమాలపై వచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం అధికారులు విచారణ చేపట్టారు. ముందుగా రామాలయం బయట బహిరంగంగా విచారణ నిర్వహించగా ఫీల్డ్ అసిస్టెంట్పై వేతనదారులు ఫిర్యాదులు గుప్పించారు. దీంతో పూర్తి అక్రమాలు బయటపడతాయనో.. మరో కారణమో తెలియదు గానీ ఏపీడీ లోకేష్, ఇతర అధికారులు రామాలయం లోపలికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, గ్రామ మాజీ సర్పంచ్ లోపలికి వెళ్లగా సదరు అధికారి కేకలు వేస్తూ బయటకు వెళ్లిపోవాలని చెప్పడం చర్చనీయాంశమైంది. కాగా, గ్రామానికి చెందిన జి.ఎర్రంనాయుడు, హేమలత దంపతులకు రెండు జాబుకార్డులు ఉండటం, అదే గ్రామానికి చెందిన జి.రామారావు కో ఆపరేటివ్ ఉద్యోగిగా పనిచేస్తున్నా అతనికి భార్య ఎర్రమ్మ పేరిట మస్తర్లు వేయడం తదితర అంశాలపై గ్రామానికి చెందిన ఇప్పిలి రామచంద్రరావు, మరికొందరు ఇటీవల కలెక్టర్ ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఫీల్డ్ అసిస్టెంట్ సరస్వతి మాట్లాడుతూ తనకు ఆరోగ్యం సరిగా లేని కారణంగా కొన్ని రోజులపాటు ఎర్రంనాయుడుతో మస్తర్లు వేయించానని, ఆ సమయంలో తప్పులు జరిగి ఉండవచ్చని చెప్పారు. సామాజిక ఆడిట్ సమయంలో ఆ మొత్తాలను చెల్లిస్తానని అంగీకరించారు. ఈ విషయమై ఏపీడీ మాట్లాడుతూ ఒక కుటుంబంలో రెండు జాబు కార్డులు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎం లక్ష్మీనరసమ్మ, ఈసీ రాము, టెక్నికల్ అసిస్టెంట్ నరేష్ పాల్గొన్నారు. ‘కూర్మ’ ఘటన దర్యాప్తు వేగవంతానికి కృషి హిరమండలం: కూర్మ గ్రామంలో అగ్నిప్రమాదానికి సంబంధించి దర్యాప్తు వేగవంతం చేసేందుకు కృషిచేస్తానని సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ అన్నారు. సోమవారం కూర్మ గ్రామాన్ని సందర్శించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.పర్ణశాల పునఃనిర్మాణానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో గేదల చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
పలాసలో మద్యం దందా
దిగజారుడు రాజకీయాలెందుకు..కాశీబుగ్గ: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేపడుతున్న అభివృద్ధి, అవినీతిపై డిబేట్ పెడితే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. పలాసలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గౌతు లచ్చన్న మనవరాలిగా, మాజీ ఎమ్మెల్యే గౌతు శివాజీ కుమార్తెగా శిరీష దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలపై చేసిన సర్వేలో ఆ పార్టీలో ఉన్న 72 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలిందని, అందులో పలాస ఎమ్మెల్యే శిరీష ఒకరని ఉదహరించారు. పలాస నియోజకవర్గంలో ప్రతి లిక్కర్ బాటిల్పై రూ.10 నుంచి రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో పలాస అల్లుడు టాక్స్ అని విమర్శించారని, మళ్లీ అదే తంతు జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యే సహకారం లేకపోతే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శిరీష పద్ధతిగా రాజకీయాలు చేయడం నేర్చుకోవాలని హితవుపలికారు. 40 ఏళ్లుగా పలాస నియోజకవర్గానికి మీరు చేసిన అభివృద్ధి ఏంటో.. వైఎస్సార్ సీపీ పాలనలో ఐదేళ్ల పాటు మంత్రిగా తాను చేసిన అభివృద్ధి ఏంటో నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అభివృద్ధి, అవినీతిపై చర్చకు సిద్ధం ఎమ్మెల్యే శిరీషకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సవాల్ -
ఎస్పీ గ్రీవెన్స్కు 56 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణకు 56 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో అదనపు ఎస్పీ (అడ్మిన్) కేవీ రమణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ కాల్స్ ద్వారా తక్షణమే తెలియజేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీసు కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
సోంపేట/మందస: మందస మండలంలోని కొత్తపేట గ్రామ సముద్ర తీరంలో సోంపేట మండలంలోని పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల రాజేశ్వరి అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది. మందస పోలీసులు, రాజేశ్వరి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పాలవలస గ్రామానికి చెందిన రాజేశ్వరి ఈనెల 11వ తేదీన పాలవలస నుంచి కన్నవారి గ్రామం పిడిమందస వెళ్లింది. ఐదు నెలల పాపను పాలవలసలో విడిచిపెట్టి ఉండడంతో రాజేశ్వరి బంధువులు పిడిమందస నుంచి హరిపురం వరకు ద్విచక్ర వాహనంలో తీసుకొచ్చి, మరలా పాలవలస చేరుకోవడానికి హరిపురంలో రాజేశ్వరిని బస్సు ఎక్కించారు. అయితే రాత్రి అవుతున్నా రాజేశ్వరి పాలవలస చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు పిడిమందస ఫోన్చేసి సమాచారం కనుక్కున్నారు. రాజేశ్వరి ఇంటికి చేరుకోలేదనే విషయం తెలియడంతో ఇరు కుటుంబాల సభ్యులు ఆందోళన చెందారు. హరిపురం నుంచి పాలవలస మధ్య గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో మందస పోలీసుస్టేషన్లో వివాహిత అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు. ఇదీ విషయం... మందస మండలంలోని కొత్తపేట గ్రామ సముద్ర తీరంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఆదివారం రాత్రి స్థానికుల కంటబడింది. సగం కాలిన స్థితిలో మృతదేహం ఉండడంతో స్థానికులు ఆందోళనతో మందస పోలీసులకు సమాచారం అందించారు. మందస పోలీసుస్టేషన్ పరిధిలో అప్పటికే మహిళ మిస్సింగ్ కేసు నమోదై ఉండడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అయతే మహిళ మృతదేహం పాలవలస గ్రామానికి చెందిన రాజేశ్వరిదిగా సోమవారం ఉదయం నిర్ధారించారు. పిడిమందస గ్రామానికి చెందిన రాజేశ్వరికి పాలవలస గ్రామానికి చెందిన గోకర్ల చంద్రశేఖర్తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం అయ్యింది. చంద్రశేఖర్ ఉపాధి నిమిత్తం విదేశాల్లో విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి మూడు సంవత్సరాలు, ఐదు నెలలు వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే రాజేశ్వరి మృతికి గల కారణాలు తెలియడం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో హత్యచేసి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. రాజేశ్వరి మృతి చెందిందని తెలియడంతో పాలవలస, పిడిమందస గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సోంపేట సీఐ బి.మంగరాజు, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, మందస ఎస్ఐ కె.కృష్ణ, శ్రీకాకుళం క్లూస్ టీమ్ సభ్యులు పరిశీలించారు. పాలవలసలో ఏం జరుగుతోంది.. సోంపేట మండలంలోని పాలవలస గ్రామంలో అలజడి నెలకొంది. గ్రామంలో వరుస హత్యలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 18వ తేదీన అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో గ్రామానికి చెందిన గోకర్ల ఈశ్వరరావును గుర్తు తెలియని వ్యక్తులు సమీప జీడితోటల్లో హత్య చేశారు. కాగా ఇప్పటికీ హత్యకు గల కారణాలు, దోషులు తెలియలేదు. ఈ ఘటన మరువకముందే ఈశ్వరరావు ఇంటికి ఎదురుగా ఉన్న గోకర్ల రాజేశ్వరి(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త గ్రామంలో కలకలం సృష్టించింది. పాలవలసలో కలవరపెడుతున్న వరుస హత్యలు..? -
ఉపాధి కల్పన
ఉచిత శిక్షణ.. ఎచ్చెర్ల: మండల కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో నిరుద్యోగ మహిళా యువతకు వివిధ ఉపాధి రంగాల్లో శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రవేశపెట్టిన డీడీయూజీకేవై పథకం ద్వారా డొమైన్ (హోటల్ మేనేజ్మెంట్) రంగంలో శిక్షణ ఇస్తూ, అనంతరం మెరుగైన ఉపాధి అందిస్తున్నారు. ఆ ట్రేడ్కు సంబంధించిన శిక్షణ మాత్రమే కాకుండా, పలు నైపుణ్యాలను అందిస్తున్నారు. శిక్షణలో కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్పై అవగాహన, ఇంగ్లిష్లో ప్రావీణ్యం కల్పిస్తున్నారు. హోటల్ మేనేజ్మెంట్ రంగానికి మంచి డిమాండ్ ఉండడంతో శిక్షణ పూర్తి చేసిన వెంటనే ఉపాధి లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. పదో తరగతి చదువుకుని 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు వారిని ఈ శిక్షణలో చేర్పించుకుంటున్నారు. బ్యాచ్లుగా శిక్షణ ఇక్కడ మూడు బ్యాచ్లుగా విడదీసి శిక్షణ ఇస్తున్నారు. మొత్తం బ్యాచ్కు 30 మంది చొప్పున 90 మందికి శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, ప్రస్తుతం 72 మంది ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. హోటల్ మేనేజ్మెంట్లో ఎలా విధులు నిర్వర్తించాలి, ఎలా మెలగి ఉండాలనే విషయాలను ప్రాక్టికల్గా చేయించి చూపిస్తున్నారు. అంతేకాకుండా కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్ ఆపరేటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ వంటివి నేర్పిస్తున్నారు. ఈ శిక్షణలో మూడు నెలలు పాటు భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఈ సమయంలో 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో ఆయా రంగాలకు సంబంధించి రెస్టారెంట్లకు తీసుకెళ్లి ప్రాక్టికల్గా శిక్షణ ఇస్తున్నారు. అనంతరం శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాల్లో పలు రెస్టారెంట్లలో, కంప్యూటర్ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్నారు. అద్భుతమైన అవకాశం పై చదువులు చదువుకోలేని వారికి ఈ శిక్షణ అద్భుతమైన అవకాశంగా మారింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకూ చదువుకుని, ఇంటివద్ద పరిస్థితులు బాగాలేని నిరుపేదలకు ఈ శిక్షణలు తోడుగా ఉంటున్నాయని పలువురు చెబుతున్నారు. ఈ శిక్షణలో చేరడానికి 18 సంవత్సరాలు నిండి పదో తరగతి వరకు చదువుకున్న మహిళలు అర్హులు కావడం వలన చదువు మధ్యలో ఆపివేసిన వారు ఎక్కువగా ఈ శిక్షణలో చేరుతున్నారు. ఉపాధితో ఆర్థికంగా ఇంటికి చేదోడుగా ఉండటానికి ఈ శిక్షణలు ఉపయోగకరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఉపాధి కోసం ఉద్యోగం సంపాదించి ఇంటికి చేదోడుగా ఉండడానికి ఈ శిక్షణలో చేరాను. హోటల్ మేనేజ్మెంట్ రంగంలో శిక్షణ పొందుతున్నాను. ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్తో పాటు ఇంగ్లిష్, కంప్యూటర్పై అవగాహన కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ చదువుకున్నాను. పై చదువులు చదవలేక ఖాళీగా ఉన్న సమయంలో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారని తెలుసుకుని జాయిన్ అయ్యాను. శిక్షణ అనంతరం ఉపాధి పొంది ఇంటికి నావంతు తోడుగా నిలుస్తాను. – ఎ.జ్యోత్స్న, పెద్దరావుపల్లి, లావేరు మండలం మహిళల ఉపాధికి ఊతం ఎచ్చెర్ల మహిళా ప్రాంగణంలో తర్పీదు ప్రస్తుతం హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ కమ్యూనికేషన్ స్కిల్స్పై సైతం అవగాహన శిక్షణ బాగుంది ఇక్కడ ఉపాధి కోసం శిక్షణలో చేరాను. సంబంధిత శిక్షణతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఉపాధితో పాటు ఈ శిక్షణ చాలా రకాలుగా మాకు ఉపయోగపడుతోంది. శిక్షణ అనంతరం ఉపాధికి వెళ్లి కుటుంబానికి తోడుగా నిలవాలన్నదే నా కోరిక. – బి.సౌజన్య, లింగాలపేట, ఎచ్చెర్ల మండలం సౌకర్యాలతో కూడిన శిక్షణ ఇక్కడ విద్యార్థులకు అన్నివిధాలుగా సౌకర్యాలతో కూడిన శిక్షణ అందిస్తున్నాము. ఉచిత భోజన, వసతి సౌకర్యాలతో పాటు కంప్యూటర్ ల్యాబ్లతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోంది. శిక్షణ అనంతరం వివిధ కంపెనీలు, పెద్దపెద్ద హోటళ్లలో ఉపాధి కల్పించడం జరుగుతుంది. – దన్నాన సంతోష్, హోటల్ మేనేజ్మెంట్ శిక్షకులు -
విన్నపాలు వినవలె..!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శ్రీకాకుళంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈవో ఎల్.ఎన్.వి.శ్రీధర్ రాజా నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై మొత్తం 114 వినతులు అందజేశారు. వీటిలో భూమి సమస్యలు, పింఛన్లు, నివాస స్థలాలు, రేషన్ కార్డులు, మౌలిక వసతులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి. వాటిని సంబంధిత శాఖల అధికారులకు అప్పగిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు సూచించారు. ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. పాఠశాల విలీనం ఆపాలి ఎచ్చెర్ల మండలంలో ధర్మవరం బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల విలీనం వెంటనే నిలుపుదల చేయాలని ఆ గ్రామానికి చెందిన పలువురు పీజీఆర్ఎస్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఆ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆమోదం లేకుండా, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించకుండా అడ్డదారిలో పాఠశాలను ఎత్తివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివలన నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని అందోళన తెలిపారు. ఫిర్యాదు చేసినవారిలో అల్లు కన్నబాబు, చల్ల పద్మ తదితరులు ఉన్నారు. పీహెచ్సీ ప్రారంభించండి శ్రీకాకుళం రూరల్ మండలం కళ్లేపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన పీహెచ్సీని వెంటనే ప్రారంభించి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవలందించాలని కళ్లేపల్లి, సమీప ప్రాంతాల ప్రజలు, నాయకులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కళ్లేపల్లి పీహెచ్సీ పరిధిలో కిల్లిపాలెం, కనుగులవానిపేట, ఇప్పిలి, గనగళ్లవానిపేట, కుందువానిపేట, బలరాంపురం, సానివాడ, ఒప్పంగి తదితర గ్రామాలు ఉన్నాయని తెలిపారు. తాత్కాలిక భవనంలో సదుపాయాలు లేకపోవడంతో రోగులు నానా అవస్థలు పడుతున్నారని వెల్లడించారు. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన భవనం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, జెడ్పీటీసీ మోకాళ్ల శ్రీధర్, ఎంపీటీసీ చిట్టి జనార్దన్రావు, మోకాళ్ల తాతబాబు, గంగు నరేంద్ర, కనుగుల అప్పలనాయుడు, మాజీ ఎంపీటీసీ పుక్కల శ్రీరాములు, సర్పంచ్లు వారాధి ఆదినారాయణ, సూరాడ సూర్యం, లోలుగు శ్రీనివాసరావు, గంగు నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు వినతుల వెల్లువ అర్జీదారుల నుంచి 114 వినతుల స్వీకరణ మురుగునీటి సమస్య పరిష్కరించండి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 1వ వార్డు పాత్రునివలస హైటెక్ పారడైజ్ నివాసాల మురుగునీటి సమస్య పరిష్కరించాలని హైటెక్ పారడైజ్ అపార్టుమెంట్ ప్రతినిధి వి.కృష్ణమూర్తి పీజీఆర్ఎస్లో కోరారు. ఇదే విషయమై మే 26న ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలియజేశారు. శ్రీకాకుళం పట్టణ నడబొడ్డున గేటెడ్ కమ్యూనిటీ పేరున కొన్ని సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ అపార్టుమెంట్లో ఇప్పటికీ మురుగునీటి పారుదల వ్యవస్థ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదని వివరించారు. దీనివల్ల ఇక్కడ ఉన్న నాలుగు బ్లాకుల్లో (ఒకటి నిర్మాణంలో ఉంది) నివాసితులు వినియోగించే నీరు అపార్టుమెంట్ ఆవరణలోనే చేరుతోందని పేర్కొన్నారు. మురుగునీరు చేరడం వలన రోగాలు బారినపడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. -
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి
మెళియాపుట్టి: రేగులపాడు ఆప్షోర్ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు గంగారపు సింహాచలం డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద చీపురుపల్లి, దాసుపురం తదితర గ్రామాలకు చెందిన నిర్వాసితులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని సోమవారం చేపట్టారు. అనంతరం డీటీ రాము, ఎంపీడీవో నరసింహప్రసాద్ పండాకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ.. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు, గ్రామాలను సైతం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేసి, వారి న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు దృష్టిసారించాలని విన్నవించారు. ఒకటే నిర్వాసిత కాలనీతో ఇబ్బందులు నిర్వాసితులకు మొత్తం ఏడు నిర్వాసిత కాలనీలు నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేవలం ఒక్కటే నిర్మించారని, దీనివల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. ప్రాజెక్టు ప్రారంభించి 16 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రతీ ఏడాది పెరుగుతున్నా.. నిర్వాసితుల సమస్యలు మాత్రం ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయని వాపోయారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం హిరమండలం వంశధార నిర్వాసితులకు ఇచ్చిన ప్రాప్తికి ప్యాకేజీలు అందించాలని, నేటికీ నిర్వాసితులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటికీ కూడా ప్రాజెక్ట్ పరిధిలో 132 మందికి ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయన్నారు. పునరావాస కాలనీల్లో రహదారులు, వీధి దీపాలు, మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్ యవ్వారి ఈశ్వరరావు, దొర విజయ్ కుమార్, కిరణ్, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు సింహాచలం -
నీలమణిదుర్గకు హైకోర్టు జడ్జి పూజలు
పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణీ దుర్గ అమ్మవారిని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి గేదెల తుషార్రావు సోమవారం దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు అశీర్వాదాలు అందజేశారు. ముందుగా ఆలయ మర్యాదలతో ఆలయంలోకి పూర్ణకుంభంతో ఆహ్వానించారు. ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని జడ్జికి అందజేశారు. ఆయనతో పాటు పాతపట్నం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి ఎం.రోషిణి, ఎస్ఐ బి.లావణ్య, ఆలయ గుమస్తా కె.సుదర్శనరావు, అర్చకులు టి.సతీష్, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి టెక్కలి రూరల్: మండలంలోని తిర్లంగా గ్రామానికి చెందిన పొందర కోదండరావు(36)అనే తాపీమేసీ్త్ర పురుగుల మందు తాగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. మృతుడు గత కొంతకాలంగా మూలవ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఆదివారం ఆ బాధ మరింత ఎక్కువ కావడంతో తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహూటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్థరాత్రి మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు సోంపేట: ఇచ్ఛాపురం రూరల్ పోలీసుస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదంలో ఇటీవల మరణించిన పొట్టి జగదీష్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. మండలంలో ఎర్రముక్కాం గ్రామంలోని శ్మశానవాటికలో అశ్రునయనాలతో సోమవారం పూర్తి చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ వెంకట అప్పారావు, సోంపేట సీఐ బి.మంగరాజు, ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ శ్రీనివాసరావు మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగదీష్ మరణం పోలీసు డిపార్ట్మెంట్కు తీరని లోటన్నారు. ఆయన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేశారు. ఎస్ఐ శ్రీనివాసరావు జగదీష్ పాడెమోసి తన అభిమానాన్ని చాటుకున్నారు. అంతిమయాత్రలో గ్రామంలోని యువత, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
రాష్ట్ర ప్రజలను మోసం చేశారు
● వైఎస్సార్సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ కంటే మిన్నగా అన్ని రకాల పథకాలు ఇస్తామని, అభివృద్ధి చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబునాయుడు, అధికారం చేతికొచ్చాక రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ అన్నారు. కూటమి పాలన వైఫల్యాలపై సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండడం దారుణమన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా పాలన అందించారన్నారు. కానీ చంద్రబాబుకు మాత్రం తెలుగు తమ్ముళ్లు, పెత్తందారుల అభివృద్ధే ముఖ్యమన్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమైనా నేటికీ అన్నదాత సుఖీభవ డబ్బులు వేయకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఇంకా విత్తనాలు పంపిణీ చేయకపోవడం అన్యాయమన్నారు. కూటమి పాలనలో అక్రమాలను ప్రజలంతా గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో సమాధానం చెప్తారని పేర్కొన్నారు. -
రెండు ఇళ్లలో చోరీ
నరసన్నపేట: మేజరు పంచాయతీ పరిధిలోని సౌభాగ్యలక్ష్మి కల్యాణ మండపం వెనుక సాయినగర్లో ఉన్న రెండు ఇళ్లల్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. విశ్రాంత ఉపాధ్యాయుడు దుంగ రామారావుతో పాటు గనగళ్ల రాంబాబుకు చెందిన ఇళ్లల్లో చోరీ జరిగింది. ఈ రెండు ఇళ్లకు చెందినవారు విశాఖలో ఉంటున్నారు. డోర్లాక్ చేసిన విషయాన్ని గమనించి దొంగలు చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగి రెండు మూడు రోజులు అయినట్లుగా తెలుస్తోంది. సోమ వారం ఉదయం స్థానికులు అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ దుర్గాప్రసాద్ పరిశీలించి ఇంటి యజమానులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చిన తర్వాత క్లూస్ టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించారు. ఈ చోరీలో తమ ఇంట్లోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 44 తులాల వెండి వస్తువులు, రూ.35 వేల నగదు అపహరణకు గురైందని దుంగ రామారావు తెలిపారు. అలాగే కేజీన్నర వెండి వస్తువులు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయని గనగళ్ల రాంబాబు తెలిపారు. ఈ మేరకు నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు తెలిపారు. చోరీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. ● బంగారు, వెండి ఆభరణాల అపహరణ -
రైలు నుంచి జారిపడి వృద్ధుడు మృతి
పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడి పెద్దకోట నాగేశ్వరరావు(56) అనే వృద్ధుడు మృతి చెందినట్లు సోమవారం జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడిది కోటబొమ్మాళి మండలంలోని పెద్ద బమ్మిడి గ్రామం. విశాఖపట్నం నుంచి రైలులో స్వగ్రామం వస్తుండగా పొందూరు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు నుంచి జారిపడినట్లు పేర్కొన్నారు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. రైలు ఢీకొని వ్యక్తి మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని హరిశ్చంద్రపురం రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి వయస్సు 45 సంవత్సరాలు ఉండవచ్చునని, నీలం రంగు టీషర్టు, ఆకుపచ్చ రంగు లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతనిపై ఉన్న గాయాలు ఆధారంగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు ఎవరికై నా తెలిసిస్తే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ షరీఫ్ కోరారు. -
వెంటాడిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ● మహిళను బైక్తో ఢీకొట్టడంతో ప్రమాదం ● మృతుల్లో ఇచ్ఛాపురం హెడ్ కానిస్టేబుల్ టెక్కలి రూరల్/ఇచ్ఛాపురం రూరల్/సోంపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. టెక్కలి మండలం ఒలేసాగరం సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన పాత్ర రవీంద్ర నాయకో కుటుంబ సభ్యులతో కలిసి సింహాచలం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శనివారం అర్థరాత్రి టెక్కలి మండలం ఒలేసాగరం సమీపంలో జాతీయ రహదారిపై బస్సుదిగారు. ముందుగా భార్యాపిల్లలను రోడ్డు దాటించారు. అనంతరం తల్లి సుభద్రా నాయకో(58)ను రోడ్డు దాటిస్తుండగా ఇచ్ఛాపురం పోలీస్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పొట్టి జగదీశ్వరరావు(45) ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొట్టారు. ఈ ఘటనలో సుభద్రా నాయకోతో పాటు జగదీశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే గాయపడిన వారిని టెక్కలి జిల్లాఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిక్షణ కోసం వెళ్తూ.. కాగా, హెడ్ కానిస్టేబుల్ జగదీశ్వరరావు మృతితో విషాదఛాయలు అలముకున్నాయి. ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఈయన విజయనగరంలో శిక్షణ ఉండటంతో శనివారం రాత్రి తన ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో ప్రమాదానికి గురయ్యారు. స్వగ్రామం సోంపేట మండలం ఎర్రముక్కాం. భార్య పుష్ప, ఇంజనీరింగ్ చదువుతున్న కుమారుడు సాయి ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు తెలిపారు. జగదీశ్వరరావు మృతి పట్ల సీఐ ఎం.చిన్నంనాయుడు, రూరల్ ఎస్ఐ. ఈ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. -
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో ఆదివారం గ్రాడ్యుయేషన్ (జెనిత్స్–2020)డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెమ్స్ చీఫ్ మెంటార్ బొల్లినేని భాస్కరరావు బీఎస్సీ పారామెడికల్ విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలన్నారు. పదేళ్లలో బొల్లినేని మెడిస్కిల్స్ ద్వారా పది వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో వారంతా ఉద్యోగంలో రాణిస్తున్నట్లు తెలిపారు. బీవీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని శీనయ్య మాట్లాడుతూ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జెమ్స్ అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ కె.సుధీర్ మాట్లాడుతూ వైద్య రంగంలో పారామెడికల్ టెక్నీషియన్స్ కీలక పాత్ర పోషిస్తారన్నారు. జెమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఆర్.అశోక్రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు నడుచుకోవాలన్నారు. జెమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీలలిత మాట్లాడుతూ అంకితభావంతో పనిచేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా ఇప్పటివరకూ పదివేల మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ లక్ష్మీపద్మజ, జెమ్స్ సీఈఓలు ఆద్విక్, రామ్మోహన్ పాల్గోన్నారు. -
ఓపెన్గా చదివేద్దాం!
● ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● వయస్సుతో నిమిత్తం లేకుండా చదువుకునేందుకు అవకాశం ● టెన్త్, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● దరఖాస్తులకు తుది గడువు జూలై 30 శ్రీకాకుళం న్యూకాలనీ : చదువుకోవాలని ఆసక్తి ఉండి అవకాశాలు లేక, కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, రోజువారీ స్కూల్/కాలేజీకి వెళ్లలేక.. ఇలా కారణమేదైనా విద్యకు దూరమైన వారికి బాసటగా నిలుస్తోంది ఓపెన్ స్కూల్. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నామమాత్రపు ఫీజుతో సార్వత్రిక విద్యాపీఠం ద్వారా (ఏపీ ఓపెన్ స్కూల్) దూరవిద్యను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పకడ్బందీగా అందించింది. ప్రస్తుతం అవే ఫీజులు, నిబంధనలను కూటమి ప్రభుత్వం అమలుచేస్తోంది. రెగ్యులర్ సర్టిఫికెట్తో సమానమైన ఈ విద్యను వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ చదువుకునేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. చదువుకు దూరమైన వారికి.. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం అండగా నిలుస్తోంది. రెగ్యులర్గా పదో తరగతి, ఇంటర్ ఫెయిలైన వారు, వివిధ కారణాలతో మధ్యలో చదువు ఆపేసిన వారు, తక్కువ విద్యార్హతతో ఏళ్ల తరబడి చిరుద్యోగం చేస్తున్న వారు, వ్యాపారులు, బాలికలు, గృహిణులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు, దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు ఇలా ఎవరైనా చేరవచ్చు. గతంలో ఈ దూర విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండేది. ప్రస్తుతం సమీపంలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల్లో చదువుకోవచ్చు. రెండేళ్ల ఇంటర్ విద్య అయినా, పదో తరగతైనా ఏడాదిలోనే పూర్తి చేసుకోవచ్చు. ప్రవేశాలకు వేళాయె.. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువరించింది. దరఖాస్తులు ప్రక్రియ మొదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సమీపంలోని ప్రభుత్వ స్టడీ సెంటర్ దగ్గర వద్ద గానీ, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఓపెన్స్కూల్.ఓఆర్జీ వెబ్పోర్టల్లో జూలై 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.200 ఆలస్య అపరాధ రుసుంతో ఆగస్ట్ 15 వరకు చెల్లించేందుకు గడువు ఉంటుంది. ఈ ఏడాది ఆగస్ట్ 31 నాటికి 14 ఏళ్లు వయస్సు నిండిన అభ్యర్థులు పదో తరగతిలో ప్రవేశానికి అర్హులు. 15 ఏళ్లు పూర్తయి పదో తరగతి పాసైనవారు, ఇంటర్ మధ్యలో ఆపేసినవారు/ఫెయిలైనవారు ఇంటర్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రెగ్యులర్ సర్టిఫికెట్తో సమానం.. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్కు విలువ ఉంటుందో లేదోననే అపోహ చాలా మందిలో ఉంది. అయితే అది పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఓపెన్ స్కూల్ సొసైటీ జారీ చేసే ఉత్తీర్ణత సర్టిఫికెట్లు సాధారణ పాఠశాల విద్య, కళాశాల విద్య సర్టిఫికెట్లతో సమానం. వీటితో ఉన్నత విద్యకు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని విద్యాశాఖాధికారులు, యూనివర్సిటీ అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఓపెన్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పాస్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు నేరుగా అభ్యర్థుల చిరునామాకే పంపించేలా గత ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంది. బాలికా విద్యకు ప్రోత్సాహం.. బాలికా విద్యను ప్రోత్సహించేలా ఓపెన్ స్కూల్ సొసైటీ అనేక చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక కారణాలు, సమీపంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్య అందుబాటులో లేక వేలాది మంది బాలికలు, గృహిణులు ఉన్నత చదువులకు దూరమయ్యారు. అలాంటి వారు చదువుకునేందుకు ప్రభుత్వం ఫీజులో రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. వీరితోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు, మాజీ సైనికుల పిల్లలకు కూడా ప్రవేశ రుసుం ఫీజులో రాయితీ కల్పిస్తుస్తున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో ఎస్ఎస్సీకి 45 స్టడీ సెంటర్లు, ఇంటర్మీడియెట్కు 30 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ప్రతి మండలంలో దాదాపుగా అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఆసక్తి గల వారికి ప్రవేశాలు కల్పించి ప్రతి ఆదివారం తరగతులు నిర్వహిస్తారు. ఎంచుకున్న మీడియం ప్రకారం పాఠ్యపుస్తకాలు, మెటీరియల్ అందజేస్తారు. అడ్మిషన్ పొందిన వారు 30 తరగతులకు కచ్చితంగా హాజరు కావాలి. అలాగైతేనే పరీక్ష రాసేందుకు అర్హత కల్పిస్తారు. అడ్మిషన్ పొందిన వారికి ఉత్తీర్ణత సాధించేందుకు ఐదేళ్ల వరకు అవకాశం ఇస్తారు. టెన్త్, ఇంటర్ కోర్సుల్లో చేరాలనుకునే వారు తెలుగు, ఇంగ్లీషుతోపాటు ఇతర మీడియంలో కూడా కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇంటర్లో సైన్స్ ఎంపీసీ, బైపీసీ, ఆర్ట్స్ సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ ఇతరత్ర గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఓపెన్ స్కూల్ సొసైటీ ముఖ్యమైన సమాచారం తెలియజేసేందుకు, పాఠాల కోసం ‘జ్ఞానధార’ పేరిట ప్రత్యేక యూట్యూబ్ చానెల్ను గత ప్రభుత్వం ప్రారంభించింది. దరఖాస్తు చేసుకోవాలి.. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. జూలై 30 వరకు గడువు ఉన్నప్పటికీ ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. అంగన్వాడీలు, గ్రామ సచివాలయం సిబ్బంది, ప్రిన్సిపాళ్లు, హెచ్ఎంలు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చొరవ తీసుకోవాలి. – లియాకత్ ఆలీఖాన్, ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్రెగ్యులర్ విద్యతో సమానం వివిధ కారణాలతో చదువు మధ్యలో చదువు ఆపేసినవారికి ఓపెన్ స్కూల్ వరం లాంటిది. టెన్త్, ఇంటర్ పూర్తి చేయడానికి మంచి సదావకాశం. దిగువశ్రేణి ఉద్యోగులు, గృహిణిలు, వ్యాపారులు, అంగన్వాడీలు, ఆయాలు, ఆశా కార్యకర్తలకు ఉపయుక్తమైంది. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్ రెగ్యులర్ విద్య సర్టిఫికెట్తో సమానం. – డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య, జిల్లా విద్యాశాఖాధికారి శ్రీకాకుళం -
పూర్తిగా వస్తే ఒట్టు!
స్టూడెంట్ కిట్టు.. ● బూట్లు, యూనిఫాం రాకపోవడంతో చాలాచోట్ల నిలిచిన పంపిణీ ● అరకొర వస్తువులు రావడంతో చేతులెత్తేస్తున్న ఉపాధ్యాయులు ● కొన్నిచోట్ల ప్రజాప్రతినిధుల సమక్షంలో హడావుడిగా పంపిణీ ● ప్రశ్నిస్తారనే భయంతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జూలై 5కి వాయిదా! శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప.. చేసిందేమి లేదన్న విషయాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడులు తెరిచిన మొదటి రోజే విద్యార్థులకు 8 రకాల వస్తువులతో కూడిన జగనన్న విద్యా కానుక కిట్లు అందజేసేవారు. గత ఏడాది మాత్రం.. అప్పటికే జగన్ ప్రభుత్వం ఇండెంట్ ప్రకారం సమకూర్చిన విద్యాకానుక(విద్యార్థి మిత్రగా పేరు మార్చి పంపిణీ చేశారు.)ను మొదటి రెండు రోజుల్లో పంపిణీ పూర్తిచేశారు. ఈ ఏడాది కూటమి ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట స్టూడెంట్ కిట్ను అందజేయడంలో ఘోరంగా విఫలమైంది. పుస్తకాలు, బూట్లు, సాక్సులు, బ్యాగులు, యూనిఫాం ఇలా ఏ వస్తువులు పూర్తిస్థాయిలో రాకపోవడంతో కిట్లను అందజేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. దీంతో విద్యార్థులకు పంపిణీ చేయకుండా బాక్సుల్లోనే ఉంచేస్తున్నారు. అక్కడక్కడ ప్రజాప్రతినిధుల చేతులమీదుగా ఒకటి రెండు వస్తువులతో పంపిణీచేసి ‘కిట్లు అందజేసేశాం’ అని సామాజిక మాధ్యమాల్లోల్లో ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకొన్ని చోట్ల వచ్చిన కొన్ని వస్తువులనే పంపిణీ చేద్దామంటే.. ప్రజాప్రతినిధులు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం లేదని ఉపాధ్యాయులే చెబుతున్నారు. విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్ ఐటమ్స్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు తర్వాత అత్యంత కీలకమైనవి బూట్లు, బట్టలు. జిల్లాలో 30 మండలాలు ఉండగా నేటికి 10 మండలాలకు బూట్లు, యూనిఫాం చేరలేదు. పేరెంట్స్ మీటింగ్ వాయిదా.. సర్కారీ బడుల్లో పేరెంట్స్ మీటింగ్ తల్లిదండ్రులుతో బడులు పునఃప్రారంభమైన మొదటివారంలోనే నిర్వహించాల్సి ఉంది. అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వాయిదా వేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తాజాగా తల్లికి వందనం పథకం పథకాన్ని సవాలక్ష ఆంక్షల నడుమ వేలాది మంది అర్హులను.. అనర్హులుగా మార్చేశారు. ఇంకా చాలా మందికి నగదు జమకాలేదు. మరోవైపు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు రాలేదు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత క్షీణించింది. వీటన్నింటిని తల్లిదండ్రులు పశ్నిస్తారనే భయంతో ఇప్పుడు సమావేశం నిర్వహించకుండా జూలై 5వ తేదీ నాటికి పేరెంట్ టీచర్ మీటింగ్ వాయిదా వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు తగ్గారు.. బడ్జెట్ పెరిగింది.. కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా విద్యాశాఖలో అవకతవకలు తీవ్ర చర్చనీయాంశమౌతున్నాయి. గతంలో 46 లక్షల మంది విద్యార్థులకు మన్నిక, నాణ్యమైన విద్యా సామగ్రితో కూడిన జగనన్న విద్యాకానుక కోసం రూ.650 కోట్ల మేర బడ్జెట్ వెచ్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత విద్యా సంవత్సరంలో 40లక్షల మంది విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర కోసం దాదాపు రూ.వెయ్యి కోట్లకు బడ్జెట్ పెంచారు. 6లక్షల మంది విద్యార్థులు తగ్గితే రూ.350 కోట్ల బడ్జెట్ పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారికి నో యూనిఫాం. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది నుంచి మార్చిన కొత్త యూనిఫాంను ఇంటర్ విద్యార్థులకు ఇవ్వడంలేదు. ఇప్పటికే మాజీ సీఎం జగన్ సమకూర్చిన పాత యూనిఫాం ఎక్కడా కనిపించడానికి వీల్లేదని అధికారులకు హుకుం జారీ చేశారు. తాజాగా మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, హైస్కూల్ ప్లస్ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థులు పాత యూనిఫాం ధరించాలని ప్రభుత్వమే నిర్ణయించిందని విద్యాశాఖ అధికారులు చెబుతుండటం కొసమెరుపు. -
సర్పంచ్ల పిల్లలకు తల్లికి వందనం ఎందుకివ్వరు?
● వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పాతపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామ సర్పంచ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తున్నారా..? వారి పిల్లలకు తల్లికి వందనం ఇవ్వకపోవడానికి కారణమేంటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. పాతపట్నంలో ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. సర్పంచ్లకు గౌరవ వేతనంగా ప్రభుత్వం కేవలం రూ.3వేలు అందజేస్తుందని, ఆ మాత్రం దానికి ఏకంగా తల్లికి వందనం వంటి పథకాలు నిలిపివేస్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలకు దగ్గరై కార్యక్రమాలు చేపట్టినంత మాత్రాన సర్పంచ్లు ధనికులో, ఉద్యోగులో కారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో జరిగితన గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 90 శాతం మంది వైఎస్సార్సీపీ మద్దతుదారులు సర్పంచ్లుగా ఎన్నిక కావడమే దీనికి కారణంగా భావిస్తున్నామని, ఇది కక్షపూరిత చర్య అని చెప్పారు. గ్రామ పంచాయతీలకు నేరుగా చెల్లించాల్సిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి మళ్లించిందని ఆరోపించారు. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించడాన్ని తప్పు పడుతూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు.అంతకుముందు పాతపట్నం ఎగువ కండ్రవీధిలో ఉంటున్న నవతల సర్పంచ్ పల్లి శ్రీహరిను కృష్ణదాస్ పరామర్శించారు. శ్రీహరి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు యరుకోల వెంకటరమణ, వరుదు దేవిప్రసాద్, బొంగు కొండయ్య, ఎల శ్యామ్, గల్లంగి వెంకటరావు, కొండాల బాబురావు, ప్రశాంత్, కాళ్ల సింహాచలం, పల్లి క్రిష్ణ, యడ్ల రంగారావులు పాల్గొన్నారు. దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ● భీమ్ సేన ఉత్తరాంధ్ర యువ సమ్మేళనంలో వక్తలు డిమాండ్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటుచేయాలని భీమ్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు రవి సిద్ధార్థ డిమాండ్ చేశారు. భీమ్ సేన ఉత్తరాంధ్ర యువ సమ్మేళనం మూడో సదస్సు శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ఆదివారం నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాలు లేకపోవడం వల్లే అసెంబ్లీ, పార్లమెంటులో హక్కుల కోసం పోరాటం చేసే అవకాశం దక్కడం లేదన్నారు. సదస్సులో పాల్గొన్న ప్రతినిధులంతా దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజకవర్గాల కోసం తగిన కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల జేఏసీ నాయకులు కల్లేపల్లి రాంగోపాల్, డాక్టర్ అంబేడ్కర్, నగిరి మోహన్రావు, డాక్టర్ కంఠ వేణు, బడియా కామరాజు, డి.గణేష్, బోయిడి మురళీకృష్ణ, బోనెల రమేష్, బత్తిన మోహన్రావు, లింగాల అప్పన్న, శరత్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఆమదాలవలస: ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న పంట ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని అలాగే వాటికి మార్కెట్లో అధిక ధర కూడా ఉంటుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ పూజారి సత్యనారాయణ తెలిపారు. మండలంలోని చేపేనపేట, నిమ్మతొర్లాడ గ్రామాల్లో క్షేత్ర పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం పర్యటించారు. డీపీఎం మాట్లాడుతూ రైతులు విత్తనం నాటిన నుంచి మళ్లీ కోత వరకు ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరించే రైతులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇస్తుందని అన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను తమ సిబ్బంది ద్వారా విక్రయించి ప్రోత్సహిస్తామన్నారు. చేపేనపేటలో క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తున్న డీపీఎం పూజారి సత్యనారాయణ తదితరులు -
కిమ్స్లో అత్యాధునిక వైద్యసేవలు
అరసవల్లి: జిల్లాలో కిమ్స్ ఆసుపత్రితోనే కార్పోరేట్ వైద్యం పరిచయమయ్యిందని..ఇప్పుడు అదనపు బ్లాక్ ద్వారా మరింత ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన వైద్యాన్ని అందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కిమ్స్ ఆసుపత్రి నూతన బ్లాక్ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యులకు అందించేలా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పనిచేస్తుందని..రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఏమాత్రం తగ్గిపోకుండా ప్రైవేటు, కార్పోరేట్ ఆసుపత్రులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియ విజయ, ఎమ్మెల్యేలు గొండు శంకర్, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, కిమ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, శీనయ్య, కృష్ణయ్య, మెడికల్ డైరక్టర్ డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ డాక్టర్ రవిసంతోష్, క్వాలిటీ మేనేజర్ డాక్టర్ వేద తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులతో సంక్షేమానికి తూట్లు
కంచిలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పక్కన పెట్టి అక్రమ అరెస్టులతో ప్రజానీకం దృష్టి మరల్చుతున్నారని జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నర్తు రామారావు ఆరోపించారు. ఆదివారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ హామీలు నెరవేర్చకుండా కప్పదాటు ధోరణి అవలంబిస్తున్నారని దుయ్యబట్టారు. తాజాగా తల్లికి వందనం పథకంలో ప్రతి తల్లికి రూ.2వేలు కోతపెట్టి రూ.13వేలు మాత్రమే తల్లుల ఖాతాల్లో జమ చేయడం తగదన్నారు. పూర్తిగా రూ.15వేలు ఇస్తామని చెప్పిన కూటమి పెద్దలు ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజానీకం దృష్టి మరల్చడానికే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేయించారని, ఈ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం చూస్తే కూటమి ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరుగుతుందో ప్రజలకు అర్ధం అవుతోందన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టులపై కేసులు పెట్టడం, సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడటం శోచనీయమన్నారు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధిచెప్పడానికి ప్రజలు సిద్ధమవుతున్నారని చెప్పారు. -
మోసం కేసులో వ్యాపారికి జైలుశిక్ష
ఇచ్ఛాపురం : పట్టణానికి చెందిన పెయింటింగ్ వ్యాపారి కాళ్ల శ్రీనివాసరావు 2017లో నకిలీ ఏషియన్ పెయింట్స్ తయారుచేసి అమ్ముతుండగా పట్టుబడటంతో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసుకు సంబంధించి స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నిందితునికి రెండున్నరేళ్లు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించిందని పట్టణ ఎస్సై ముకుందరావు ఆదివారం తెలియజేశారు. గొల్లగండి తీరంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోంపేట: గొల్లగండి సముద్రతీరానికి ఆదివాయం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహం చేరింది. స్థానికులు గమనించి బారువ పోలీసులకు సమాచారం తెలియజేశారు. పోలీసులు ఘటనా స్థలానికి మృతదేహాన్ని పరిశీలించారు. బారువ ఏఎస్ఐ కృష్ణారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. జిల్లాలో టీచర్ల బదిలీలు పూర్తి శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో సాధారణ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అన్ని కేటగిరిల్లో మొత్తం 6392 మంది ఉపాధ్యాయుల దరఖాస్తు చేసుకోగా 3546 మంది బదిలీ అయ్యారు. వీరిలో అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు 1967 మంది ఉన్నారు. హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఇప్పటికే విధుల్లో చేరిపోగా.. తాజాగా ముగిసిన ఎస్జీటీల బదిలీలతో రెండు మూడు రోజుల్లో వీరంతా వారు ఎంపికచేసుకున్న స్థానాల్లో చేరనున్నారు. జిల్లాలో 124 మంది ఎస్ఏలు, ఎస్జీటీలు పదోన్నతులు పొందినట్టు డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య ధృవీకరించారు. మరోవైపు, కూటమి ప్రభుతం అస్పష్టత విధానాలు వల్ల నష్టపోయామని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
పైడితల్లి అమ్మవారి పండుగలు ప్రారంభం
పొందూరు: మండలంలోని పొందూరు, కృష్ణాపురం, జోగన్నపేట, లక్ష్మీపేట, ఎరుకులపేట, అలబోయినపేట, ఎరుకుల కాలనీ గ్రామాల్లో పైడితల్లి అమ్మవారి పండుగలు ఆదివారంతో ప్రారంభమయ్యాయి. మూడు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును అందుకున్న డాక్టర్ తిమ్మరాజు నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందం పొందూరు నెహ్రూ పార్కు ఆవరణలో నృత్య ప్రదర్శన చేసి అలరించింది. రండి పరిగెడదాం..! శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ఈ నెల 23న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించే ఒలింపిక్ డే రన్లో ప్రతి ఒక్కరూ భా గస్వామ్యం కావాలని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కోరారు. పార్జీలకు, రాజకీయాలకు అతీతంగా క్రీడలను చూడాలని కోరారు. ఈనెల 23వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించతలపెట్టిన ఒలింపిక్ డే రన్ నిర్వహణ కోసం విధివిధానాలు, ఏర్పాట్ల కోసం నగరంలోని డీఈఓ కార్యాలయానికి ఆనుకుని ఉన్న జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి, సీఈఓ పి.సుందరరావు, జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి తదితరులు మాట్లాడుతూ ఈనెల 23వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద మొదలయ్యే ఒలింపిక్ డే రన్ ర్యాలీ కళింగ రోడ్, వైఎస్సార్ సర్కిల్, పాలకొండా రోడ్, కృష్ణాపార్క్, డేఅండ్నైట్, అంబేద్కర్ జంక్షన్ మీదుగా కోడిరామ్మూర్తి స్టేడియం వరకు కొనసాగుతుందన్నారు. ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వా మిని ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు. ఆలయ పరిసరాల్లో చాలా మంది వ్యాపారులు తోపుడు బళ్లపై వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఇంతవరకు ఆలయం తరఫున అధికారికంగా ఎలాంటి రుసుములు వసూళ్లు చేయనప్పటికీ దీనిపై ఆలయ ఈఓ ప్రసాద్ జోక్యం చేసుకుంటూ ఆదివారం ఒక్క రోజున ఒక్కో వ్యాపారాల బండి నుంచి రూ.500, మిగిలిన రోజుల్లో రూ.300 వరకు వసూలు చేసేలా చర్యలు మొదలుపెట్టారు. వ్యాపారులు ఈ తాజా పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివిధ దర్శనాల టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.5,24,200, పూజలు, విరాళాల ద్వారా రూ.1,08,120, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.05 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ ప్రసాద్ ప్రకటించారు. ఆదిత్యుని సన్నిధిలో జస్టిస్ తుషార్రావు సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదెల తుషార్కుమార్ ఆదివారం దర్శించుకున్నారు. ఈయనకు ఆల య సంప్రదాయం ప్రకారం ఆలయ ఈఓ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేదాశీర్వచనాన్ని అందజేసి తీర్థప్రసాదాలను అందజేశారు. పేకాట శిబిరంపై దాడి నరసన్నపేట: దేవాది వద్ద కొనసాగుతున్న పేకాట శిబిరంపై నరసన్నపేట పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేసి పది మందిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.6890 నగదు, ఆరు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. -
● చైన్ స్నాచర్.. కేరాఫ్ కంచరపాలెం..
ఒంటరిగా రోడ్డుపై వెళ్తున్న మహిళలే లక్ష్యం.. పక్క నుంచే బైక్ పోనిచ్చి మెడలో చైన్లు తెంపేస్తాడు. విశాఖపట్నం కంచరపా లేనికి చెందిన భీమరశెట్టి కమల్నాధ్ తీరిది. 30 చోరీల్లో నిందితుడైన కమల్ పదిసార్లు జైలుకు వెళ్లాడు. ఏడో తరగతితో చదువు మానేసి తండ్రి మె కానిక్ షాపులో పనిచేస్తూ తాళాలు లేకుండా వాహనాలు తీయడం నేర్చుకున్న కమల్నాద్ 2009 నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. రాజస్థాన్ దొంగలు: రాజస్థాన్కు చెందిన ఆదిత్య పవార్ కుటుంబ సభ్యులు మూడేళ్లుగా దారి దోపిడీలు చేస్తున్నారు. జూన్ 6న అరెస్టయ్యారు. రాత్రిపూట లారీల్లో నిద్రిస్తున్న వారే వీరి టార్గెట్. ఈ గ్యాంగులో ఒక బాలుడు కూడా ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా 30 చోరీల్లో ప్రధాన నిందితుడు అరెస్టు : 20 అక్టోబరు 2024 -
సంక్షేమం నిల్.. అవాస్తవాలు ఫుల్
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వంలో సంక్షేమం నిల్.. అబద్ధాలు ఫుల్ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. ‘జగన్ అంటే నమ్మకం....చంద్రబాబు అంటే మోసం’ అనే పుస్తకాన్ని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కృష్ణదాస్ మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పక్కనపెట్టేసి లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలుచేసి ప్రజలకు నరకం చూపించడం సరికాదన్నారు. రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించి పాలన చేశామని, చంద్రబాబు వచ్చాక కూటమి నాయకులు దోచుకో దాచుకో అన్న చందంగా పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ హాయాంలో విద్య, వైద్యం, వ్యవసాయానికి పె ద్ద పీట వేశామని గుర్తు చేశారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా నేటికి రైతులకు రుణాలు లేవని, విత్తనాలు రాలేదని, రైతుభరోసా కేంద్రాలు తలుపులు తీసేవారే లేరని అన్నారు. నాడు–నేడుతో స్కూళ్లను బాగు చేసి పేదలకు ఇంగ్లిష్ మీడియం అందించిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందని అన్నారు. అభివృద్ధి ఒక్క చోట ఆగిపోకూడదనే వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని, కానీ చంద్రబాబు దానిపై లేనిపోని దుష్ప్రచారాలకు ఒడిగట్టారని విమర్శించారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, వేధింపు లు కూటమి పాలనలో ఎక్కువైపోయాయన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తే, కూటమి పాలనలో తెలుగు తమ్ముళ్లకు మాత్రమే పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ తేడాలన్నీ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కూడా ఈ వి షయాలను వివరించాలన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, వైఎస్సార్ సీపీ తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, పార్టీ కాళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల రామారావు, పార్టీ రాష్ట్ర కార్య దర్శి కేవీజీ సత్యనారాయణ, ఆమదావలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, డీసీసీబీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు కరిమి రాజేశ్వరరావు, గొండు కృష్ణమూర్తి, తంగుడు నాగేశ్వరరావు, చల్ల రవి, చంద్రభూషణ్ గుప్తా, ఆరంగి మురళి, రాజాపు అప్పన్న, చింతు రాము, మన్మధ పాల్గొన్నారు. కూటమిపై దుమ్మెత్తి పోసిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ‘జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే మోసం’ పుస్తకావిష్కరణ -
● వీరు పుస్తెల దొంగలు
ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్కుమార్ పాడి, బాలకృష్ణ సాహు జిల్లాలోని నాలుగు చోట్ల చోరీలకు పాల్పడి ఏడున్నర తులాల బంగారంతో కొత్తూ రు పోలీసులకు చిక్కారు. సుజిత్ గొడవల్లో జైలుకి వెళ్లి బాలకృష్ణకు పరిచయమయ్యాడు. బెయిల్పై విడుదలైన ఇద్దరూ మద్యం, పేకాట వ్యవసనాలకు బానిసై చోరీలకు నెట్టుకున్నారు. బైక్పై వెళ్తూ పుస్తెలు తెంపేసి పారిపోతారు. జిల్లాలో 2016 నుంచి 2024 వరకు 32 నేరాలుచేశారు. పశువులమేత మేపేవాళ్లు, పొలం చూడ టానికి వెళ్లే ఒంటరి మహిళలే వీరి టార్గెట్. 32 కేసులు.. నిత్యం జైలు జీవితమే అరెస్టు : 10 జనవరి 2025 -
● గప్చుప్ దొంగలు
విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన వున్నాన రాంబాబు, శ్రీకాకుళం జి.సిగడాంకు చెందిన గిడిజాల కోటేశ్వరరావుల చోరీ తీరు విభిన్నం. షూ ర్యాక్ల్లోను, ఎలక్ట్రికల్ మీటర్ రీడింగ్ బోర్డుపై, పూల కుండీల్లో, కిటికీ లోపల దాచిన తాళాలను తీసి సులువుగా ఇంట్లోకి చొరబడటం వీరి ప్రత్యేకత. ఇంటిలో ఎక్కడా ఏ వస్తువును టచ్ చేయకుండా.. ఫింగర్ప్రింట్స్ దొరక్కుండా జాగ్రత్త పడతారు. నాలుగైదు తులాలకు మించి దొంగతనం చేయరు. ఏడాది వ్యవధిలో 32 చోరీలకు పాల్పడి మొత్తం 112 తులాల బంగారాన్ని కాజేశారు. వీరిపై 30 కేసులున్నాయి. వీరిలో ఇంటర్ చదవిన రాంబాబుకు మొబైల్ అప్లికేషన్లు, హార్డ్వేర్ వంటి సాంకేతిక పరిజ్ఞానంలో ప్రావీణ్యముంది. మంచి క్రికెటర్ అయిన రాంబాబు రంజీ సెలెక్షన్లలో కోచ్ మోసం చేశాడన్న బాధతో దొంగతనాల వైపు మళ్లినట్టు సమాచారం. 112 తులాలు కొట్టేసిన ఘనులు అరెస్టు: 18 జనవరి 2025 -
మేజర్ రామ్గోపాల్నాయుడుకు సత్కారం
శ్రీకాకుళం కల్చరల్: రాష్ట్రపతి చేతుల మీదుగా కీర్తిచక్ర అవార్డు స్వీకరించి తొలిసారి జిల్లాకు విచ్చేసిన సంతబొమ్మాళి మండలం నగరిపెంట గ్రామానికి చెందిన మేజర్ మల్ల రామ్గోపాల్నాయుడును జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లివీధిలో ఉన్న జిల్లా మా జీ సైనికుల కమ్యూనిటీ హాలులో ఆదివారం ఘ నంగా సత్కరించారు. ఈ సందర్భంగా సంఘ జి ల్లా అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు మాట్లాడు తూ మేజర్ నాయుడు తన జట్టును చాకచక్యంగా ముందుకు నడిపించి ఉగ్రవాదులను మట్టికరిపించారని పేర్కొన్నారు. అనంతరం నాయుడు మాట్లాడుతూ యువత దేశభక్తి అలవర్చుకున్ననాడే మనం సరికొత్త భారతావనిని చూడగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ చైర్మన్ పి.ఈశ్వరరావు, మెండ నారాయణరావు, పి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
● జైలు శిక్ష పడినా..
పార్వతీపురం–మన్యం జిల్లా, సీతానగరం, జోగంపేటకు చెందిన పోలా భాస్కర్ శ్రీకాకుళం, పార్వతీపురం–మన్యం జిల్లా ల్లో తొమ్మిది చోట్ల 17 చోరీలకు పాల్ప డ్డాడు. ఎచ్చెర్ల మండలం ముద్దాడకు చెందిన ముద్దాడ నర్సింగరావుతో కలిసి ఈ చోరీలు చేశాడు. వీరిద్దరిదీ సెంట్రల్ జైలు పరిచయం. కాశీబుగ్గ పోలీసులు వీరిని పట్టుకుని 37 తులాల బంగారం, 21 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్పై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 37 చోరీ కేసులుండగా 8 సార్లు జైలు శిక్ష అనుభవించాడు. నర్సింగరావు మూడుసార్లు జైలు శిక్ష అనుభవించాడు. ఒకరు 8 సార్లు జైలుకు.. మరొకరు 3 సార్లు జైలుకు అరెస్టు : 3 ఏప్రిల్ 2025 -
పట్టపగలే ఇసుక దందా
పాతపట్నం: ఒడిశాకు ఇసుక యథేచ్ఛగా తరలి వెళ్లిపోతోంది. అక్రమార్కులు పట్టపగలే ఇసుక దందా ను యథేచ్చగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రా నుంచి ఒడిశాకు పట్టపగలే ట్రాక్టర్లు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా పాతపట్నం, బైదలాపురం మీదుగా పర్లాకిమిడి(ఒడిశా)లోకి తరలిస్తున్నారు. అయినప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గడంతో పాటు అవినీతి కి పాల్పడుతూ అధికారులు పట్టించుకోవడం లేద నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కువ శాతం టాక్టర్ల ద్వారా ప్రతి రోజు తెల్లవారు జామున 4 గంటల నుంచి రాత్రి 8 గంటల అక్రమంగా తరలిస్తున్నారు. హిరమండలం మండలం భగీరథపురం, రుగడ, కొత్తూరు మండలం నివగాం, పొట్నూరు వంశధారలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తీసుకెళ్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఒడిశాలో ఇసుక ట్రాక్టర్ రూ. 4 నుంచి రూ.4,500 వేలు పలుకుతోంది. ఆంధ్రాలో ఇసుక ట్రాక్టర్ (పాతపట్నం)రూ.1,500 నుంచి రూ.2 వేలు ఉంది. పాతపట్నం జాతీయ రహదారి మీదుగా సరిహద్దు చెక్పోస్ట్ మీదుగా, రుగడ, బైదలాపురం మీదుగా పర్లాకిమిడిలోకి ఇసుక అక్రమంగా వెళ్తోంది. ఇప్పటికై నా మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
భాస్కరరావుకు ‘బాలు’ స్మారక పురస్కారం
శ్రీకాకుళం కల్చరల్: నగరానికి చెందిన ఫిల్మ్ డబ్బింగ్ ఆర్టిస్టు, ఆల్ ఇండియా రేడియో బి–గ్రేడ్ గాయకుడు కె.భాస్కరరావు డాక్టర్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. ఘంటసాల, బాలు, ఆనంద్ (జి.బి.ఎ) స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ నిర్వాహకులు ఈ నెల 16న బాపూజీ కళామందిర్లో జరిగే జయంత్యుత్సవ కార్యక్రమంలో సత్కరించనున్నారు. భాస్కరరావు మూడు దశాబ్దాలుగా గాయకునిగా, సామాజిక సేవకుడిగా అందిస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. గతంలో ఈయన హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత సంగీతం డిప్లమో కోర్సులో ఉత్తమ విద్యార్థి పురసస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా కొనసాగుతూనే పార్ట్ టైం ప్రాతిపదికన కోటబొమ్మాళి జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. భాస్కరరావుకు పురస్కారం ప్రకటించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పాతపట్నం మండల కేంద్రంలో రెండు రోజులపాటు జరిగిన సీపీఐ 25వ జిల్లా మహాసభలు ఘనంగా ముగిశాయని పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ తెలిపారు. శనివారం జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పేదల సమస్యలపై పోరాటేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం పార్టీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా చాపర వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శిగా లండ వెంకటరావు, కార్యవర్గ సభ్యులుగా చాపర సుందర్లాల్, కొన్న శ్రీనివాస్, ఎస్.నారాయణస్వామి, పి.అరేలమ్మ, ఎస్.హరికృష్ణ, బి.సంతోష్లను, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. వీరితోపాటు 31 మంది సమితి సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల ఎచ్చెర్ల: పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నికల్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి ఉద్దేశించిన ఏపీ పాలిసెట్ –2025 వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు సహాయ కేంద్రం జిల్లా సమన్వయకర్త, శ్రీకాకుళం పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.జానకిరామయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు ఈ నెల 20లోగా ప్రోసెసింగ్ ఫీజు చెల్లించాలన్నారు. ఓసీ, బీసీలు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చొప్పున ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ప్రోసెసింగ్ ఫీజు రసీదు, ఫీజు, పాలిసెట్ హాల్టికెట్, ర్యాంక్ కార్డు, పదో తరగతి ధ్రువపత్రం, నాలుగు నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, టీసీ సర్టిఫికెట్లతో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. ఈ నెల 21 నుంచి 28 వరకూ ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్ నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రత్యేక కేటగిరి వారికి ఈ నెల 25 నుంచి 28 వరకూ విజయవాడలో బెంజి సర్కిల్ సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. తొలివిడత కౌన్సిలింగ్కు సంబంధించి బ్రాంచ్లు, కళాశాలల కేటాయింపు జాబితాలు వచ్చే నెల 3న విడుదలవుతాయన్నారు. ఈ నెల 21న 1 నుంచి 15 వేల ర్యాంకు, 22న 15,001 నుంచి 32000 వరకు, 23న 32001 నుంచి 50000 వరకు, 24న 50001 నుంచి 68,000 వరకు, 25న 68,001 నుంచి 86000 వరకు, 26న 86,001 నుంచి 1,04,000 వరకు, 27న 1,04,000 నుంచి 1,20,000 వరకు 28న 1,20,000 నుంచి చివరి ర్యాంక్ వరకూ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుందని వివరించారు. జూలై 1న వెబ్ ఆప్షన్ల మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. -
పోలీసులకు చిక్కిన డిజిటల్ కేటుగాళ్లు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లాకేంద్రం సమీపంలోని రాగోలు జెమ్స్ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న మహిళా వైద్యురాలు ప్రొఫెసర్ రేవతిని మోసగించిన డిజిటల్ కేటుగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. వైద్యురాలికి ఫోన్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ బెదిరించి సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట రూ.13.5 లక్షలకు టోకరా వేయడంతో బాధితురాలు గత నెల 14న ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి సూచనలతో డీఎస్పీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో సీఐ సీహెచ్ పైడపునాయుడు ఎస్ఐలు హరికృష్ణ, రాజేష్లు బృందాలుగా విడిపోయి కేసును ఛేదించారు. ఈ మేరకు డీఎస్పీ వివేకానంద శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. వైద్యురాలికి బెదిరింపు ఫోన్కాల్స్తో.. గత నెల 14న ఉదయం పది గంటల సమయంలో వైద్యురాలికి గుర్తు తెలియని నెంబర్ల నుంచి పదే పదే ఫోన్లు వచ్చాయి. బెంగళూరులోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ ఆధార్ నంబర్తో లింక్ అయిన ఫోన్ నంబర్కు హ్యూమన్ ట్రాఫికింగ్(మహిళలను, యువతులను బ్లాక్మెయిలింగ్ చేస్తూ అక్రమంగా తరలించడం)కు సంబంధం ఉన్నట్లు తేలిందని, దాని వల్ల మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు పడుతున్నాయని, చట్టరీత్యా ఇది నేరమని, సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారని, డిజిటల్ అరెస్టు చేస్తారని భయపెట్టారు. కోర్టులో మీ తరఫున వాదించడానికి కొంత సొమ్ము డిపాజిట్ చేస్తే డిజిటల్ అరెస్టు ఆగుతుందంటూ మాయమాటలు చెప్పి రూ. 13.5 లక్షలను ఏపీలోని జగ్గంపేట అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. తర్వాత కాల్స్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన వైద్యురాలు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ రాజేష్, వెంకటరమణ, ఈశ్వరరావు, ధనలక్ష్మిల బృందం పదిరోజులు బయట రాష్ట్రాల్లోనే ఉంటూ దర్యాప్తు చేపట్టారు. వీరికి జిల్లా సైబర్ సెల్ పోలీసులు సహకారమందించారు. జగ్గంపేట అకౌంట్ ఫేక్దని గుర్తించారు. పెట్రోల్ కొట్టడంతో దొరికిపోయి.. కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరం వెంబడి ఉన్న కోజికోడ్ (కాలికాట్) నగరం ఓజీపాడుకు చెందిన నౌఫలా షెరీన్(24) తన బాయ్ఫ్రెండ్కు స్కూటీలో పెట్రోల్ కొట్టించడానికి బంక్ వద్దకు వెళ్లి తన ఖాతానుంచి రూ.120 డ్రా చేయడం..అక్కడి సీసీఫుటేజీ ఆధారంగా బండిని గుర్తించి చిరునామా తెలుసుకోవడంతో సూత్రధారులెవరన్నది తెలిసింది. దుబాయ్కు చెందిన సలీమ్ అనే వ్యక్తి ఖాతా నుంచి నౌఫలా షెరీన్కు రూ. 6 లక్షలు పడినట్లు తేలడంతో మొత్తం తీగ లాగారు. కర్ణాటక రాష్ట్రం మైసూర్కు చెందిన రూమన్ షరీఫ్, రెయాన్ అహ్మద్ ఖురేషిలు వాయినాడ్ కేంద్రంగాను, నౌఫలా షెరీన్, నిజాముద్దీన్ సీపీ (కేరళ), ఫహద్ అహ్మద్లు కేరళలోని కోజికోడ్ కేంద్రంగాను రెండు బ్యాచులుగా వీడి ఈ నేరాన్ని లింక్సిస్టమ్లా చేశారని పసిగట్టారు. వీరికి దుబాయ్లో ఉన్న సలీమ్ మంచి స్నేహితుడు కావడంతో అంతా పథకం ప్రకారం చేశారని, అయాన్ అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారని, హర్యానాకు చెందిన మరికొందరు ఉండొచ్చని విచారణలో తెలుసుకున్నారు. పైన పేర్కొన్నవారంతా స్నేహితులు కావడం.. వారి సంపాదన విలాసాలకు చాలకపోవడంతో అక్రమ మార్గంలో డబ్బులు సాధించాలనే లక్ష్యంతోనే ఈ నేరం చేశారు. బాధితులు వేసే సొమ్ము వారి అకౌంట్లలో పడ్డాక క్షణాల్లో అమౌంట్ను డ్రా చేసి ఖాతాలను క్లోజ్ చేసి వారి వారి వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఈ విధంగానే సలీమ్ నౌఫలాకు రూ. 6 లక్షలు, రెయాన్ అహ్మద్ ఖురేషి రూమన్షరీఫ్కు రూ.5.80 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. రూ.13.5 లక్షలతో మహిళా వైద్యురాలిని బురిడీ కొట్టించిన వైనం జిల్లాలో తొలిసారి డిజిటల్ అరెస్టు కేసు ఛేదించిన పోలీసులు పట్టుబడ్డారిలా.. ఈ క్రమంలో ఈ నెల 13న కొందరి నుంచి బ్యాంకు అకౌంట్లు కొనే నిమిత్తం రూమన్షరీఫ్, నౌఫలా షెరీన్, నిజాముద్దీన్ సీపీ విశాఖపట్నం వస్తున్నట్లు ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడుకు సమాచారం వచ్చింది. మధ్యాహ్నం ఒంటిగంటకు విశాఖ రైల్వే స్టేషన్లలోసిబ్బందితో మాటువేసి పట్టుకున్నారు. అనంతరం రూమన్ షరీఫ్ నుంచి రూ.లక్ష, నౌఫలా షెరీన్ నుంచి రూ. 2.5 లక్షలు, నిజాముద్దీన్ నుంచి రూ. 2.5 లక్షలు మొత్తంగా రూ. 6 లక్షల నగదు, మూడు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. సీఐ పైడపునాయుడు కేసును చాకచక్యంగా ఛేదించారని, మైసూర్, కోజికోడ్ ప్రాంతాలు తిరిగి కేసును ఛేదించిన ఎస్ఐ రాజేష్ బృందాన్ని, ఎస్ఐ హరికృష్ణలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
వేట మొదలు!
జిల్లాలో 11 మండలాల్లో మత్స్యకార కుటుంబాలు సముద్రపు వేటతో జీవనాధారంగా సాగిస్తున్నారు. ఇందులో ఈ ఏడాది వేట నిషేధ కాలంలో భృతిగా 15548 మందికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.31.09 కోట్ల భృతిని ఏప్రిల్ 26న జమ చేశారు. ఇందులో అర్హులైన చాలా మంది వేటదారులకు భృతి ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. రాజకీయ కారణాలు ఒకవైపు కాగా.. విద్యుత్ వినియోగం తదితర నిబంధనలతో భృతి అందకుండా చేశారు. భృతి పొందిన వారికి ప్రభుత్వ ఇతర పథకాలు లబ్ధి ఉండదని కూడా స్పష్టం చేయడంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఈ ఏడాది వేట నిషేధ భృతికి మొత్తం 511 మందిని అనర్హులుగా మత్స్యశాఖాధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం రూరల్లో 31, గారలో 106, ఎచ్చెర్లలో 60, రణస్థలంలో 106, కవిటిలో 61, వజ్రపుకొత్తూరులో 35, పోలాకిలో 41, సోంపేటలో 32, సంతబొమ్మాళిలో 27, ఇచ్ఛాపురంలో 08, మందసలో 04 చొప్పున మత్స్యకారులు అనర్హులుగా గుర్తించారు. వాస్తవానికి ఈ లెక్క 1200 మంది వరకు ఉన్నట్లుగా మత్స్యకార సంక్షేమ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అరసవల్లి: గంగపుత్రులు సముద్రంలో వేటకు సిద్ధమయ్యారు.. రెండు నెలలుగా వేటకు దూరమై.. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధ సమయం అర్థరాత్రితో ముగిసింది. దీంతో యధావిధిగా ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా సముద్రంలోకి వేటకు మరబోట్లతో వెళ్లేందుకు అనుమతులు వచ్చేశాయి. ఏపీ మైరెన్ యాక్ట్ 1994 ప్రకారం ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ అర్థరాత్రి వరకు వేట నిషేధ కాలంగా అమల్లో ఉండడంతో ఉపాధి కోల్పోయిన క్రమంలో వీరికి భృతిగా నగదు, డీజిల్ సబ్సిడీలను గత ప్రభుత్వం వరుసగా ఐదేళ్లుగా చెల్లించింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఒక ఏడాది భృతి ఎగ్గొట్టేసింది. ఈ ఏడాదికి మాత్రం భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లుగా ప్రకటించి...అర్హులకు కాకుండా కూటమి నేతల సిఫారసులున్నవారికి మాత్రమే భృతి జమ చేసింది. అయితే గతేడాది చెల్లించాల్సిన సుమారు రూ.31.72 కోట్ల మేరకు చెల్లించాల్సిన భృతిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పెండింగ్ భృతిని కూడా చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ ఎలాంటి చెల్లింపులు ఇంతవరకు జరగలేదు. దీంతో బాధిత మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు ప్రభుత్వం పాలన ఉంటుందని.. అలాంటిది వేటనిషేధ భృతిని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పెండింగ్లో పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భృతి చెల్లించాల్సిందే... జిల్లాలో గత ప్రభుత్వం వరుసగా ఐదేళ్ల పాటు వేట నిషేధ భృతి చెల్లించింది. అర్హులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చెల్లించింది. కూటమి ప్రభుత్వం మాత్రం అనవసర నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్యను కుదించేసింది. దీంతో పాటు గతేడాది చెల్లించాల్సిన వేట నిషేధ భృతిని కూడా రూ.20 వేల చొప్పున అందించాలి. – కోనాడ నర్సింగరావు, మాజీ అధ్యక్షుడు, డీఎఫ్సీఎస్ ఆంక్షలతో అవస్థలు.. ముగిసిన వేట నిషేధ కాలం సముద్ర తీరంలో వేటకు అనుమతులు 61 రోజులుగా ఉపాధి కోల్పోయిన వేటమత్స్యకారులు గతేడాది నిషేధ భృతిపై ఇంకా నీలినీడలు పెండింగ్లో 15860 మందికి భృతి చెల్లింపులు గత ఏడాది భృతికి మంగళం! గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014–19 మధ్యకాలంలో కూడా వేటనిషేధ సమయంలో కేవలం రూ.4 వేలు చొప్పున ఉపాధి భృతిగా ఇచ్చేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ, డీజిల్ సబ్సిడీని కూడా అందించింది. మొత్తం ఐదేళ్లలో 70,611 మందికి రూ.70.61 కోట్లను వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా జగన్ సర్కార్ అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో వేటనిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు భృతిని గాలికొదిలేసింది. గతేడాది అర్హులుగా సర్వేలో గుర్తించిన 15,860 మందికి రూ.31.72 కోట్ల మేరకు వేట నిషేధ భృతి పెండింగ్లో పడినట్లయ్యింది. ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా, కనీస స్పష్టత ఇవ్వకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
టీడీపీలో వర్గపోరు
ఎచ్చెర్ల: తెలుగుదేశం పార్టీలో వర్గపోరు బహిర్గతమైంది. శుక్రవారం నిర్వహించిన లావేరు మండల టీడీపీ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన పలు పంచాయతీల తెలుగు తమ్ముళ్ల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. కొందరు పాత కమిటీనే కొనసాగించాలని కోరగా, మరికొందరు కొత్త కమిటీను నియమించాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఎంపీ జోక్యం చేసుకుని ఇలా గొడవ చేస్తే సహించేది లేదని చెప్పినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తోపులాట జరగడంతో లావేరు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. చేసేదేమీ లేక ఎంపీ వెనుదిరిగారు. కాగా, ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా ముప్పిడి సురేష్ కొనసాగుతున్నారు. ఈయన బదులుగా కొత్తపల్లి సర్పంచ్ ఆరవెళ్లి కృష్ణను ఎన్నుకునేందుకు పలు పంచాయతీల టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. దీంతో ఇరువరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి ఎటూ తేల్చలేక ఎంపీ వాయిదా వేశారు. లావేరు మండల టీడీపీ కమిటీ ఎన్నిక రసాభాస తెలుగు తమ్ముళ్ల తోపులాట రంగంలోకి దిగిన పోలీసులు -
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు బాబు?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే మంత్రుల కార్యాలయాలు, కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్రాంతిభవన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువత ఓట్లతో అధికారం చేజెక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు వారి ఆశలపై నీళ్లు చల్లారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదికాలంలో ఏం సాధించారని సంబరాలు చేసుకుంటున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఏ ఉపాధి లేనివారు 1.56 కోట్లు మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని గుర్తు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు అరవింద్, వేణు, రాము, రామోజీ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద ఘటనలో దురుద్దేశం లేదు : ఎస్పీ శ్రీకాకుళం క్రైమ్ : హిరమండలంలోని ఆధ్యాత్మిక కేంద్రం కూర్మ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఎలాంటి దురుద్దేశం లేదని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ మేరకు శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న కూర్మ వద్ద అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో వ్యక్తిగతంగా, అల్లరిమూకల ప్రమేయం లేదని, గ్రామస్తులు నిత్యం దీపాలు వెలిగించి పూజ చేసిన అనంతరం దీపాలు ఆర్పేసి వెళ్లిపోతాం అని చెప్పారని.. అయినప్పటికీ ఏదైనా దీపం పొరపాటున పూర్తిగా ఆరకుండా ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రస్తుతం భావిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఘటనాస్థలిలో భౌతికాధారాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ విజయవాడకు పంపామని, సాంకేతిక ఆధారాలను బట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు అవాస్తవాలు, వదంతులు నమ్మవద్దని, ఎవరైనా ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
నాన్న త్యాగశీలి
మా అన్నదమ్ముల ఉన్నత భవిష్యత్ కోసం మా తండ్రి చంద్రరావు ఎన్నో త్యాగాలు చేశారు. మా కోసం ఆయన జీవితాన్ని ధారబోశారు. మా తల్లిదండ్రులు రోహి ణి, చంద్రరావు పెద్దగా చదువుకోలేదు. మాది వ్యవసాయ కుటుంబం. అయినా మా తమ్ముడు బా న్న వంశీ, నేను ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్న ప్పటి నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివించారు. మేం ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్నప్పుడు మాకంటూ ఓ గుర్తింపు రావాలని నాన్న ఎంతో తపించేవారు. మా తమ్ముడు వంశీకి లాంగ్టెర్మ్ కోచింగ్ ఇప్పించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజి త్రివేండ్రంలో ఇంజినీరింగ్ చదివించారు. అతను శ్రీహరి కోటలో శాస్త్రవేత్తగా స్థిరపడ్డాడు. నేను ఐపీఎస్ శిక్షణ తీసుకుంటూ మరోవైపు ఐఏఎస్ సాధించాను. – బాన్న వెంకటేష్, సివిల్స్ విజేత -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025నీట్లో మేటిగా.. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ–2025 ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మెరుగైన ర్యాంకులు సాధించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే దిశగా మొదటి అడుగు వేశారు. 64వ ర్యాంకు శ్రీకాకుళం న్యూకాలనీ: అరసవల్లి సమీపంలో నివాసంటున్న పొదిలాపు అవినాష్ ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 64వ ర్యాంకు సాధించాడు. మొత్తం 720 మార్కులకుగాను 652 మార్కులు సాధించి రాష్ట్రంలో టాప్ 5 జాబితాలో చోటు దక్కించుకున్నాడు. విద్యార్థి తల్లిదండ్రులు పొదిలాపు శ్రీనివాసరావు, భారతి. తండ్రి మెడికల్ ఫీల్డ్లో బిజినెస్ చేస్తుండగా, తల్లి గృహిణి. మానాన్న పొగిరి జగన్నా థం స్కూల్ టీచర్. నాకు చిన్నతనం నుంచి చదు వు ప్రాముఖ్యత చెబుతూ పెంచారు. సమాజాన్ని కూడా చదవాలని చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే నా 45వ ఏట పీహెచ్డీ పూర్తి చేశాను. మా నాన్న నేర్పి న పాఠాలే నన్ను ఇంతవాడిని చేశాయి. మా గ్రా మం వెళితే ఇప్పటికి మా నాన్న నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు. అంత మంచి నాన్న ఉండడం నా అదృష్టం అని అందుకే అంటాను. – పొగిరి సుగుణాకరరావు, సూపరింటెండెంట్ ఇంజినీర్, సుడా, శ్రీకాకుళంపొదిలాపు అవినాష్ పాతపట్నం: పాతపట్నం శాంతినగర్కు చెందిన విద్యార్థి ఎర్ర సమీర్కుమార్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 70వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 17వ ర్యాంకు సాధించాడు. తండ్రి ఎర్ర ధర్మారావు ఒడిశా లో ఉపాధ్యాయుడిగా, తల్లి జగదాంబ ఏఎన్ఎంగా పనిచేస్తున్నారు. సోంపేట: సోంపేట పట్టణాని కి చెందిన రొబ్బి మేఘ సాయివర్ధన్కు నీట్లో ఆలిండియా 942 ర్యాంకు వచ్చింది. సాయివర్ధన్ తల్లిదండ్రులు ముప్పన ఈశ్వరి, రొబ్బి ధర్మారావు ఇద్దరూ టీచర్లే. పోలాకి: మండలంలోని తోటాడ గ్రామానికి చెందిన తర్ర మైత్రి శనివారం విడుదలైన నీట్ ఫలితాల్లో సత్తాచాటింది. ఓబీసీ కేటగిరీలో ఆల్ ఇండియా 948 ర్యాంక్ సాధించింది. ఇటీవల విడుదలైన ఈఏపీసెట్లో అగ్రికల్చర్ విభాగంలో 33వ ర్యాంక్తో టాపర్గా నిలిచిన సంగతి తెలిసిందే. మైత్రి తల్లిదండ్రులు ప్రభావతి, వైకుంఠరావులు ఉపాధ్యాయులు. సారవకోట: మండలంలోని అలుదు గ్రామానికి చెందిన పాగోటి జుహిత జాతీయ స్థాయిలో 2744వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 979 ర్యాంకు సాధించింది. తండ్రి పాగోటి మురళీధర్ ఎయిర్ ఫోర్స్లో రిటైర్ ప్రస్తుతం బ్యాంకులో పనిచేస్తున్నారు. తల్లి హేమలత గృహిణి. నరసన్నపేట: స్థానిక మారుతీ నగర్కు చెందిన సూరపు ఝా న్సీ లక్ష్మి శృతి నీట్లో జాతీ య స్థాయిలో 3202వ ర్యాంకును, ఓబీసీ కేటగిరీలో 1150వ ర్యాంకు సాధించింది. శృతి తల్లిదండ్రులు సూరపు కృష్ణారావు, సుధారాణి వైద్యులు. శృతి తాత మెండ యయాతి కూడా వైద్యుడే. కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన లఖినాన శ్రీకర్కశ్యప్ ఆల్ ఇండి యా స్థాయిలో 7205, ఓబీసీ లో 2936వ ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రులు లఖినాన వెంకటాచలం, శ్రీదేవి ఇద్దరూ టీచర్లు. -
17 ఏళ్ల కుమారుడికి అన్నీ తానై..
నరసన్నపేట మండలం జమ్ముకు చెందిన ఎలమంచి రోహిత్కు 17 ఏళ్లు. పుట్టుకతోనే దివ్యాంగత్వం ఉంది. కదల్లేని స్థితిలో ఉన్న రోహిత్కు తండ్రి గణపతి అన్నీ తానై చూసుకుంటున్నారు. 17 ఏళ్లుగా ఇదే ఆయన దినచర్య. మెకానిక్గా పనిచేసుకుంటూనే కుమారుడికి అనునిత్యం సపర్యలు చేస్తున్నారు. ●ఇంటి ఆవరణలో తండ్రి విగ్రహం జి.సిగడాం మండలం ధవళపేట గ్రామానికి చెందిన పీవీఎస్ సంస్థల ఫౌండర్ పీవీఎస్ రామ్మోహన్ తండ్రి వెంకట స్వామిని నిరంతరం స్మరించుకుంటున్నారు. ఇంటి ముందే తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. -
వందకొర్రీల వందనం
ఇద్దరుంటే ఒకరికే.. కోటబొమ్మాళికి చెందిన డీవీ రమణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఒకరు ఏడో తరగతి, మరొకరు ఆరో తరగతి చదువుతున్నారు. ఇద్దరు పిల్లల్లో ఒకరికే పథకం వచ్చింది. మరొకరికి వస్తుందో రాదో కూడా తెలియడం లేదు. గతంలో జవాబుదారీతనం ఉండేది. ఇప్పుడు ఎవరిని అడిగినా సమాచారం లేదంటూ దాట వేస్తున్నారని ఆ తండ్రి వాపోతున్నారు. ● ఆంక్షల ముసుగులో తల్లికి వందనం ఎగనామం ● రూ.3వేల జీతం తీసుకునే సర్పంచ్, ఎంపీటీసీలకు మొండిచేయి ● అంగన్వాడీ తదితర చిరుద్యోగులకు పంగనామం ● పథకం ఎగ్గొట్టడమే లక్ష్యంగా నిబంధనలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తల్లికి వందనం పథకం లబ్ధిదారులను కుదించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. ఇప్పటికే ఏడాది అయిపోవడంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండటంతో తల్లికి వంద నం పథకాన్ని కొంతమందికి ఇచ్చి, అమలు చేసేశా మని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది. రూ. 3వేల జీతం తీసుకునే సర్పంచ్లు, ఎంపీటీసీల దగ్గరి నుంచి రూ.12వేల లోపు జీతం తీసుకునే చిరుద్యోగుల వరకు కోత పెట్టింది. 300యూనిట్ల విద్యుత్ బిల్లు వచ్చే వారికి కూడా మొండి చేయి చూపింది. అంతా గోప్యత.. తల్లికి వందనం లబ్ధిదారుల విషయంలో కూటమి ప్రభు త్వం గోప్యత పాటిస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎంతమంది అ ర్హులో క్లారిటీ ఇవ్వడం లేదు. డీఈఓను అడిగితే తనకేం రాలే దని అంటుండగా, సచివాలయం కో ఆర్డినేటర్ను అడిగినా అదే సమాధానం వస్తోంది. పంచాయతీల వారీగా అర్హులు, అనర్హుల జాబితాను విడుదల చేశారే తప్ప జిల్లా యూనిట్ గా లబ్ధిదారులు ఎంతన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారు. కొందరికే లబ్ధి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తామని, లబ్ధి చేకూర్చే విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టేది లేదని, గత ప్రభుత్వంలా రూ.13వేలు కా కుండా పూర్తి స్థాయి మొత్తాన్ని అందజేస్తామని జిల్లా పర్యటనలో చంద్రబాబు, లోకేష్, ఆ పార్టీ ప్రస్తుత మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆంక్షలతో పథకాలకు పంగనామం పెడుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చిరుద్యోగులకు సంక్షేమ పథకాలు అందించారు. ఇప్పుడీ కూటమి రూ.3వేల జీతం తీసుకుంటున్న ప్రజాప్రతినిధులతో పాటు చిరుద్యోగులకు మొండి చేయి చూపారు. జిల్లా వ్యాప్తంగా 6,017మంది అంగన్వాడీలకు తల్లికి వందనం అందలేదు. వీరంతా ఈనెల 18న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం మోసం చేసింది గత ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో మమ్మల్ని ఉద్యోగులుగా చూపించి తల్లికి వందనం కట్ చేసేశారు. ప్రభుత్వం మోసం చేసింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి ఇచ్చారు. రేషన్కార్డులు అందించారు. ఇప్పుడీ ప్రభుత్వం సంక్షేమ పథకాలే కాదు రేషన్కార్డులు కూడా తొలగిస్తామని చెబుతోంది. పనిభారం చాలా ఎక్కువగా ఉంది. దీనిపై ఈ నెల 18న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తాం. – మహంతి కల్యాణి, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలుసర్పంచ్ పదవి ఉద్యోగమా..? వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు సర్పంచ్లకు అమ్మ ఒడి డబ్బులు వచ్చేవి. కానీ కూటమి ప్రభుత్వం సర్పంచ్లను ఉద్యోగులుగా భావించి తల్లికి వందనం పథకానికి అనర్హులను చేసింది. పథకాల డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడం చంద్రబాబుకు తెలిసినంతగా మరే రాజకీయ నాయకునికి తెలియదనడానికి ఇదో నిదర్శనం. – ముద్దాడ మోహిని, సర్పంచ్, దబ్బపాడు, ఎల్.ఎన్.పేటఆంక్షలు అన్యాయం అమలు చేయడానికి వంద కొర్రీలు పెట్టి మళ్లీ దానికి తల్లికివందనం అనే పేరు పెట్టడం అన్యాయం. మా పంచాయతీలో సర్పంచ్గా ఉన్న నాకు, ఎంపీటీసీగా ఉన్న కై బాడ సుజాతతో పాటు మరో ఇరవై నాలుగు మందికి అనేక కొర్రీలతో డబ్బులు వేయలేదు. తల్లికి వందనం.. కొంతమందికే.. అని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటే బాగుంటుంది. – చింతు ప్రమీల, సర్పంచ్, బెలమరపాలవలస -
మద్యం షాపు తొలగించండి.. విద్యార్థుల నిరసనలు
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి పాలనలో మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం షాపులు వెలిశాయి. గుడి, బడి అనే తేడా లేకుండా.. మద్యం షాపులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తరగతులను బహిష్కరించి.. నిరసనలు చేపట్టారు.శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం మండలం ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు నిరసనలకు దిగారు. మద్యం షాపు ఎత్తివేయాలని తరగతులు బహిష్కరించి విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు.. మద్యం దుకాణం నిర్వాహకులపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి మద్యం షాప్ తొలగించేంత వరకు తమ పిల్లలను బడికి పంపమని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తొలగించాలని గత కొన్ని రోజులుగా గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
పరికరాలు ఉన్నా.. ప్రయోజనం సున్నా
టెక్కలి రూరల్: స్థానిక జిల్లా కేంద్రాస్పత్రి సమస్యలతో కునారిల్లుతోంది. నిత్యం 700 వరకు ఓపీ ఉన్న ఈ ఆస్పత్రిలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చర్మవ్యాధి నిపుణులు లేకపోవడంతో చాలా మంది ఇక్కట్లు పడున్నారు. ఆస్పత్రిలో ప్రధానంగా స్టాఫ్ నర్సుల కొరత వేధిస్తోంది. గత ప్రభుత్వంలో స్టాఫ్ నర్సులు 43 మంది ఉండగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 కంటే తక్కువ మందే పనిచేస్తున్నారు. దీంతో ట్రామాకేర్, గైనిక్ వార్డు, జనరల్ వార్డులు, ఆర్థో వార్డుల్లో రోగులకు సరైన సమయంలో వైద్యం అందించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధాన సమస్యలివే.. ● ఆస్పత్రిలో రేడియోలజిస్టు లేక అల్ట్రా సౌండ్ స్కానింగ్ విభాగం మూతపడింది. ● రూ.లక్షలు విలువ గల వెంటిలేటర్లు ఉన్నా, వినియోగించేందుకు నిపుణులు లేక అవి కూడా మూలకు చేరాయి. ● రూ.లక్షలు విలువ గల హార్మోన్ ఎనలైజర్ యంత్రం ఉన్నా, దానికి సంబంధించిన రసాయనాలు లేక వినియోగంలో లేకుండా పోయింది. ● ఈసీజీ టెక్నీషియన్ లేకపోవడంతో ఉన్న సిబ్బందితో పూర్తిస్థాయి అవగాహన లేకుండా ఈసీజీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ● థైరాయిడ్ పరీక్షలకు సంబంఽధించిన యంత్రం ఉన్నా దానికి సంబంధించిన కెమికల్స్ లేకపోవడంతో థైరాయిడ్ పరీక్షలకు అక్కడ ఉన్న కొంతమంతి సిబ్బంది బయట ల్యాబ్లతో మాట్లాడి చేయిస్తున్న పరిస్థితి నెలకొంది. ● ట్రామాకేర్కు సంబంధించిన అంబులెన్స్ పాతజిల్లా ఆస్పత్రి ఆవరణలో మూలకు చేరింది. ● ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగి నెలలు గడుస్తున్నా నేటికీ నిర్వహించడం లేదు. దీంతో చాలా వరకు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ● ఆస్పత్రికి పూర్తిస్థాయిలో దోబీ వర్కర్ లేకపోవడంతో శానిటేషన్ వర్కర్లతో పనిచేయిస్తున్నారు. ● ఆస్పత్రిలో సరిపడా వీల్చైర్లు, స్ట్రెచర్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ● ఆస్పత్రిలో ఉన్న లిఫ్ట్ తరుచూ పాడైపోతోంది. ● రోగులకు అవసరమైన తాగునీరు, వాడుకనీరు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదు. ● కాలువ వ్యవస్థ కూడా సరిగా లేదు. ● ఫ్రీజర్లు సరిగా లేకపోవడంతో మృతదేహాలను కిందనే ఉంచాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. స్టాఫ్నర్సుల కొరత వాస్తవమే.. ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుల కొతర వాస్తవమే. 17 మంది తక్కువగా ఉన్నారు. బదిలీలు జరిగాక కొత్త వారు వస్తారు. థైరాయిడ్, వెంటిలేటర్ పరికరాలు త్వరలోనే వినియోగంలోకి తీసుకువస్తాం. – బొడ్డేపల్లి సూర్యారావు, టెక్కలి జిల్లా ఆస్పత్రి సూపరిండెంటెంట్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో సమస్యల కొలువు వేధిస్తున్న స్టాఫ్ నర్సుల కొరత -
‘ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణం’
టెక్కలి: కూటమి ప్రభుత్వం అరాచకవాదానికి సుప్రీంకోర్టు తీర్పు చెంప పెట్టులాంటిదని న్యాయవాది, వైఎస్సార్సీపీ నాయకుడు సింగుపురం మోహనరావు అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కేసులో పోలీసులు, కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని తెలిపారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ కొమ్మినేనిని తక్షణమే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కావాలన్నారు. మీడియా స్వేచ్ఛపై ఆంక్షలెందుకు..? టెక్కలి: మీడియా, జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛకు ఎలాంటి ఆంక్షలు ఉండకూడదని సీనియర్ న్యాయవాది డీవీ వివేకానంద తెలిపారు. ఎక్కడైనా తప్పు చేస్తే చట్టపరమైన చర్యలకు న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప అరెస్టులు, దాడులు చేయకూడదని తెలిపారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును తప్పు పడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీడియా, పత్రికా స్వేచ్ఛపై గౌరవంగా భావించవచ్చని పేర్కొన్నారు. వృద్ధురాలి మెడలో చైన్ చోరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో చైన్ తెంపేసి బైక్పై ఉడాయించాడు ఓ యువకుడు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీఎన్ కాలనీ మూడో లైన్ కమల నివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్న కల్లేపల్లి ఈశ్వరమ్మ (62) తన సోదరితో కలసి ఫ్రెండ్స్ కాలనీలో బంధువులు చనిపోవడంతో పరామర్శకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి పీఎన్కాలనీ రెండో లైన్ చేరేసరికి ఓ 30 ఏళ్ల యువకుడు తలకు హెల్మెట్ ధరించి రయ్మని దూసుకొచ్చి నడుస్తున్న వృద్ధురాలి మెడలో మూడున్నర తులాల చైన్ తెంపేసి వెళ్లిపోయాడు. దీంతో ఆమె మెడకు గాయమైంది. దీనిపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పీఎన్ కాలనీలో వరుసగా చోరీలు, చైన్ స్నాచింగ్లు జరుగుతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుస్తెలతాడు చోరీకి విఫలయత్నం మెళియాపుట్టి: మండలంలోని గోకర్ణపురం గ్రామానికి సమీపంలో అదే గ్రామానికి చెందిన గేదెల మహాలక్ష్మి అనే మహిళ రహదారి నుంచి గ్రామానికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెలతాడు తెంపుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. శుక్రవారం మహాలక్ష్మీ పెద్దలక్ష్మీపురం గ్రామానికి తన తండ్రి పెద్దకర్మకు వచ్చి తిరుగు ప్రయాణంలో గోకర్ణపురం గ్రామానికి వెళ్తుండగా..ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం పై వచ్చి మెడలో పుస్తెలతాడు లాగే ప్రయత్నం చేశారు. మహిళ కేకలు వేయడంతో వారు పారిపోయారు. అనంతరం మహిళ మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించారని తెలియజేశారు. ఆలిండియా బ్యాడ్మింటన్ పోటీలకు అంపైర్గా మోహన్సాయి శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ బ్యాడ్మింటన్ అంపైర్ సంపతిరావు మోహన్సాయినాథ్ మరో ప్రతిష్టాత్మక పోటీలకు అంపైర్గా వ్యవహరించనున్నాడు. మహారాష్ట్రలోని పూణే వేదికగా ఈ నెల 14 నుంచి 22 వరకు ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2025 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు జిల్లాలోని ఎచ్చెర్ల మండలం షేర్ మహ్మద్పురం గ్రామానికి చెందిన మోహన్సాయి అంపైర్గా నియామకమయ్యా రు. ఈ మేరకు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నాడు. ఈ పోటీల కోసం శుక్రవారం ఇక్కడ నుంచి పయనమై పూణే చేరుకున్నాడు. మోహన్సాయి తండ్రి సంపతిరావు సూరిబాబు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్కు మూడు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు. -
ఆటో గ్యాంగ్ ఆటకట్టు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలో ఇటీవల రెచ్చిపోయిన ఆటో గ్యాంగ్ ఆటను పోలీసులు కట్టించారు. ఈ గ్యాంగ్కు సంబంధించి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వృద్ధదంపతులను ఏమార్చి.. ఈ నెల 5న ఎచ్చెర్ల మండలం కొత్తపేట పంచాయ తీ సాకివానిపేటకు చెందిన వృద్ధ దంపతులు కోరా డ రమణ, రామలక్ష్మిలు శ్రీకాకుళంలో ఆటోలో ప్రయాణిస్తుండగా పుస్తెలతాడు దొంగిలించారు. అదే రోజు వృద్ధ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ రామారావు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా తోటపాలెం జంక్షన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రామారావు, సిబ్బందికి సరిగ్గా ఉద యం పది గంటల సమయంలో ఏపీ 30విడి440 నంబరు గల బజాజ్ మాక్సిమా ఆటో మీద వస్తున్న మహిళలపై అనుమానం కలగడంతో వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విచారణలో విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెట్టాడ గ్రామానికి చెందిన గొర్లె మౌనిక, గొర్లె పెద్దింట్లమ్మ, అదే జిల్లా కొత్తవలస మండలం చీడివలసకు చెందిన ఆటో డ్రైవర్ మేకల హరిలుగా పోలీసులు గుర్తించారు. పెద్దింట్లమ్మ, మౌనికలు తల్లీ కూతుళ్లు కాగా, హరి పెద్దింట్లమ్మకు మేనల్లుడు అవుతాడు. లెక్కకు మించి కేసులు.. వీరిపై ఇతర జిల్లాల్లో, మన జిల్లాలోని రూరల్తో కలిపి పదికి మించి కేసులున్నాయని ఎస్ఐ రామారావు తెలిపారు. వీరిదో గ్యాంగు అని, ఈ కేసుకు సంబంధించి వీరే నిందితులని, గ్యాంగులో మరికొందరు ఉండొచ్చని ఎస్ఐ పేర్కొన్నారు. నిందితు ల నుంచి ఆటోను, బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరించామన్నారు. పోలీసులకు దొరికిన ఆటో గ్యాంగ్ నిందితులు విజయనగరం వాసులు -
ఎన్పీసీఐ లింకు తప్పనిసరి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లికి వందనం పథకం ప్రయోజనాలను విద్యార్థులు సకాలంలో పొందాలంటే తమ బ్యాంకు ఖాతాలను జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్పీసీఐ)తో అనుసంధానం చేయించుకోవడం అత్యవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. షెడ్యూల్డు కులాల 9వ, 10వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు అందే నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అంతేకాక, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిధులు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ కానున్నాయి. తల్లులు, విద్యార్థులు తమ ఖాతాలను వెంటనే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేయించుకోవాలని ఆయన సూచించారు. ఖాతా లేకపోతే తపాలా కార్యాలయంలో పోస్ట్ కార్యా లయ ఖాతా తెరిచి, దాన్ని కూడా తగిన విధంగా అనుసంధానం చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికీ 1360 మంది విద్యార్థులు ఖాతాలను అనుసంధానం చేయించుకోలేదని కలెక్టర్ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖాతా అనుసంధానం తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కూటమికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు సుప్రీం కోర్టు తీర్పు చెంప పెట్టు వంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొమ్మినేనిని అకార ణంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందని మండిపడ్డారు.ఎల్లో మీడియా గ్యాంగుతో కలిసి కొమ్మినేనిపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారం చేశారని అన్నారు. కొమ్మినేనికి బెయి ల్ ఇచ్చి సుప్రీం కోర్టు తగిన బుద్ధి చెప్పిందన్నా రు. ‘సాక్షి’ మీడియా ఆస్తులను కూటమి నాయ కులు ధ్వంసంపై చేయడాన్ని ఖండించారు. కూటమి హామీలన్నీ ఏమయ్యాయి..? శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయ ని వైఎస్సార్సీపీ కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల రామారావు (లక్ష్మణరావు) ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లికి వందనంలో కోత పెట్టడం సరికాదన్నారు. పేద విద్యార్థుల చదువు కోసం దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభు త్వం పంగనామం పెట్టిందని ఆరోపించారు. ఉచిత బస్సు లేదు, అన్నదాత సుఖీభవ లేదు, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ లేదని మండిపడ్డారు. చేసిన తప్పులు ఎత్తిచూపే సాక్షి మీడియా, సాక్షి కార్యాలయాలపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. ‘ఏడాది పాలనంతా మోసం’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా మోసమేనని వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 5.32లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పేరు మార్చినా నగదు రాలేదన్నారు. ఇప్పటికే ఒక ఏడాది ఎగ్గొట్టేశారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఈ ఏడాది తొలి విడత డబ్బులు కూడా ఇవ్వకపోవడం అన్యాయయమన్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర సంక్షేమానికి ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వెన్నుపోటు చంద్రబాబుకి కొత్తేమీ కాదని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇలానే మోసం చేయడం, ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. -
● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు
ఇన్ని ఆంక్షలా..? ఖాతాలో రూ.15 వేలు వేస్తామని, ఇప్పుడు రూ.13 వేలు వేయడం అన్యాయం. నిబంధనలు పెట్టి తల్లుల ఖాతాలో నగదు వేయకపోవడం, భూములు, విద్యుత్ బిల్లులతో అనేక కొర్రీ లు పెట్టాలనుకోవడం దారుణం. ఇప్పటికై నా చదువుకునే విద్యార్థులందరికి తల్లికి వందనం వర్తింపు చేయాలి. – దాంపురం రాజ్యలక్ష్మి, రంకిణి గ్రామం, పాతపట్నం తల్లికి వందనం అందలేదు నా పిల్లలు ఇంటర్ చదువుతున్నారు. నా భర్త మదన్ సర్పంచ్ కావడంతో మాకు తల్లికి వందనం ఇవ్వలేదు. మాకు భూములు లేవు, పెద్దగా ఇతర ఆస్తులు లేవు. అయినా ఎందుకో మా మీద కక్ష గట్టి ఆపినట్టు ఉంది. – తామాడ జ్యోత్స్న, గృహిణి, బొడ్డపాడు, పలాస మండలం గతంలో ఈ నిబంధన లేదు కూటమి ప్రభుత్వం సర్పంచ్ ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించి తల్లికి వందనం అనర్హత జాబితాలో సర్పంచ్ల పేర్లు పెట్టింది. గత ప్రభుత్వంలో ఇలాంటి నిబంధన లేదు. – సంది సోనియా, రుషికుడ్డ సర్పంచ్ ● తల్లికి వందనం ఆంక్షలపై లబ్ధిదారుల్లో వ్యతిరేకత ● సర్పంచ్లుగా ఉన్న తల్లులను సైతం అనర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం ● మొదటి ఏడాది బకాయిలపై లేని స్పష్టత శ్రీకాకుళం న్యూకాలనీ: కూటమి సర్కారు సంక్షేమానికి ఆంక్షల సంకెళ్లు విధించింది. ఎలాగోలా లబ్ధిదారుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా తల్లికి వందనంపై సవాలక్ష ఆంక్షలు పెట్టింది. ఒక చేత్తో డబ్బులు ఇస్తూ.. రెండో చేత్తో లబ్ధిదారుల సంఖ్యను కుదించేస్తోంది. ఎన్నికల సమయంలో నీకు రూ.15వేలు నీకు రూ.15వేలు అని ప్రచారం చేసి ఇప్పుడు రూ.13వేలకు పరిమితం చేశారు. వైఎస్ జగన్ హయాంలో స్కూలు బాగోగుల కోసం అమ్మ ఒడి నిధులు కేటాయిస్తే మైకు పట్టుకుని విమర్శించిన నాయకులు ఇప్పుడు మౌనంగా అదే పనిచేస్తూ దొరికిపోయారు. కోతల కోసం ఎన్నో కుయుక్తులు.. జిల్లాలో గత ఏడాది ఒకటి నుంచి ఇంటర్(+2) వరకు 3.05లక్షల మంది చదువుకున్నారు. వీరిందరికి కలిపి మొదటి ఏడాది రూ.457 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం బాకీ పడి ఉంది. ప్రస్తుతం యూ–డైస్ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,76,593 మంది, అలాగే ఇంటర్మీడియెట్ 46,761 మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఇంటర్ మొత్తం కలిపి 3,02460 మంది ఉన్నా రు. వీరిలో బాలురు 1,54,966 మంది, బాలికలు 1,47,494 మంది ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఎంత మందికి డబ్బులు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనల చిట్టా విడుదల చేయడంతో డబ్బులు పడని అర్హులంతా ఆందోళన చెందుతున్నారు. ని‘బంధనాలు’ ● కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచిపోయింది. తాజాగా రెండో ఏడాదికి సంబంధించి తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి జీఓ మాత్రమే విడుదల చేశారు. అంటే మొదటి ఏడాదికి ఇక లేనట్టే. ● వింతగా గత విద్యా సంవత్సరం డేటా తీసుకున్నప్పటికీ.. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని మాత్ర మే పరిగణనలోకి తీసుకున్నారు. ● ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే ఇటీవల టెన్త్ పరీక్షలు రాసి ఇంటర్లో చేరిన విద్యార్థులకు మాత్ర మే లబ్ధి చేకూరనుంది. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో చేరినవారు అనర్హులు కానున్నారు. అలాగే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులను కూడా అనర్హులుగా పరిగణించారు. ● వేసవిలో కాసింత ఎక్కువ కరెంటు వాడి ఉంటే ఇక అంతే సంగతి. 300 యూనిట్లు దాటిన వారిని అనర్హులుగా ప్రకటించారు. ● ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్లను సైతం అనర్హులుగా ప్రకటించారు. ● వారికి నెలవారీ జీతాలు సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో వారిందరినీ అనర్హులుగా ప్రకటించారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి కోతలు లేవు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల సమయంలో తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తానని చెప్పిన నాయకులు పాఠశాల అభివృద్ధి పేరుతో రూ.2వేలు కోత పెట్టడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్య దర్శి డి.చందు అన్నారు. దీనిపై నిరసన తెలుపుతూ శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు 200 మంది విద్యార్థులతో శుక్రవారం భారీర్యాలీ నిర్వహించారు. కుటుంబఆదాయం గ్రామాల్లో నెలకు రూ. 10వేలు, పట్టణాల్లో రూ.12వేల లోపు ఉండాలని, రైస్ కార్డు ఉండాలని, ఫ్యామిలీకి 3 ఎకరాల్లోపు మాగాణి, లేదా 10 ఎకరాల్లోపు పొడి భూమి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలని, ఫోర్ వీలర్స్ ఉండకూడదని నిబంధనలు పెట్టడం అన్యాయమన్నారు. చాలా మందికి సాంకేతిక సమస్యలంటూ ఎగ్గొట్టే ప్రయ త్నం చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
పిడుగుపాటుకు నాలుగు ఆవులు మృతి
ఎచ్చెర్ల: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామంలో శుక్రవారం ఒంటిగంట సమయంలో ఉరుములతో కూడిన వర్షానికి చెట్టుమీద పిడుగుపడి కిందనున్న నాలుగు ఆవులు మృతి చెందాయి. ఇదే గ్రామానికి చెందిన పిట్ట అప్ప య్య ఓ చెట్టు కింద ఆవులు కట్టి ఉంచారు. ఒక్కసారిగా పిడుగుపడి ఆవులు మృతిచెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. రెవెన్యూ సిబ్బంది, పశువైద్యాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తనను ఆదుకోవాల ని రైతు కోరుతున్నారు. విద్యుత్ షాక్తో వృద్ధుడు మృతి రణస్థలం: మండలంలోని కొచ్చెర్ల గ్రామానికి చెందిన గురువిల్లి అసిరయ్య (79) ఈ నెల 11వ తేదీన చెరువు పనికి వెళ్లి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు జేఆర్ పురం పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. అసిరయ్య బుధవారం చెరువు పనికి వెళ్లి ఉదయం 11 గంటలకు చెరువు పని ముగించుకుని బహిర్భూమికి వెళ్లారు. తదుపరి చెరువు తుప్పలో పడి ఉన్న విద్యుత్ వైరును గమనించకుండా తొక్కడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎవరూ గమనించకపోవడంతో ఆయన కోసం రెండు రోజులు వెతికారు. శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వృద్ధుడు విద్యుత్ షాక్తో చనిపోయినట్లు గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. భార్య అప్పయ్యమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్ఐ ఎస్. చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
బంగారం కోసమే వృద్ధురాలి హత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఈ నెల 9వ తేదీన జరిగిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వృద్ధురాలి మెడలో ఉన్న బంగారం కోసమే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. దుంపల దాలమ్మ తన ఇంటిలో మోటార్ పాడైపోవడంతో ఈ నెల 8న దా న్ని బాగుచేసేందుకు అదే గ్రామానికి చెందిన బల్లి రాము అనే వ్యక్తిని పిలిచింది. రిపేర్ చేసేందుకు వచ్చిన రాము వృద్ధురాలు ఒంటరిగా ఉండటం గమనించి, ఆమె మెడలో విలువైన బంగారు తాడు ఉండటం గుర్తించి మరుసటి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు రాత్రి 8గంటల సమయంలో మోటార్ మరమ్మతులు చేసేందుకు వృద్ధురాలి ఇంటికి వచ్చి ఆమెను టీ పెట్టమని చె ప్పాడు. ఆమె టీ పెడుతుండగా వెనుక నుంచి వచ్చి న రాము తనతో తెచ్చుకున్న ఇనుపరాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టి మెడలో ఉన్న రెండున్నర తు లాల బంగారం గొలుసుతో అక్కడ నుంచి పారిపోయాడు. వృద్ధురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం హరిశ్చంద్రపురం బస్టాప్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి బంగారం గొలుసు, ఇనుపరాడ్డు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించారు. -
టీసీలు తీసుకోమంటారా..?
షాపు తొలగిస్తారా.. ఇచ్ఛాపురం రూరల్: 280 మందికి పైగా విద్యా ర్థులు, 15 మంది ఉపాధ్యాయులు ఉన్న ఈదుపురం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఒక్క విద్యార్థి కూడా కనిపించలేదు. ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు నుంచి మండల విద్యాశాఖాధికారి వరకు అంతా ఆందోళన చెందారు. ఒకే సారి వందలాది మంది విద్యార్థులు బడికి రాకుండా బాయ్కాట్ చేయడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు పరుగులు తీసి ఆరా తీశారు. అందరి తల్లిదండ్రులదీ ఒకటే మాట... ‘మా పిల్లలు బడిలోకి అడుగు పెట్టాలంటే.. బడికి ఆనుకొని ఉన్న మద్యం షాపును తొలగించాలి. అంత వరకు సాక్షాత్తు కలెక్టర్ మా దగ్గరికి వచ్చినా పిల్లల్ని బడికి పంపించేది లేదు’. అంటూ తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు బడికి తిరుగు ముఖం పట్టారు. ఈదుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆమడ దూరంలో నాలుగు రోజుల కిందట ఎకై ్సజ్ అధికారులు అనుమతులు ఇచ్చి కొత్త ప్రభుత్వ మద్యం షాపును తెరిచారు. దీంతో ఈదుపురం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు నీలాపుట్టుగ, కేశుపురం, ఈదుపురం, సన్యాసిపుట్టుగ గ్రామ ప్రజలు అభ్యంతరం తెలిపారు. పోలీసులతో పాటు ఎకై ్సజ్ సిబ్బంది సైతం మద్యం షాపు నిర్వాహకులకే వత్తాసు పలకడంతో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు మద్యం షాపును తొలగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ప్రజా ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించకుండా బాయ్కాట్ చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి–2 ఎస్.విశ్వనాథం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడగా.. మద్యం షాపును తొలగించే వరకు తమ పిల్లల్ని బడికి పంపించేది లేదని, సోమవారం నుంచి బడి నుంచి టీసీలు తీసుకువెళ్లిపోతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. బడికి రాని ఈదుపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు మద్యం షాపు తొలగిస్తేనే స్కూలుకు పంపిస్తామన్న తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు నివే దించా.. మద్యం షాపును తొలగించే వరకు విద్యార్థులను బడికి పంపించేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాను. – తమ్మయ్య, హెచ్ఎం -
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో జీఎస్టీ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వాణిజ్యపన్నుల వాఖ జాయింట్ కమిషనర్ బుడుమూరు నాగార్జున పాల్గొని సమావేశాన్ని సమన్వయపరిచారు. కొన్ని సంస్థలు జీఎస్టీలో నమోదు కాలేదని, వాటిని పన్ను పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. లీడ్ బ్యాంక్, ఇతర బ్యాంకు అధికారులకు ఆదేశాలిస్తూ జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులో జారీ అయిన పన్ను బకాయి దారులకు సంబంధించిన ఖాతా వివరాలను అందించాలన్నారు. అక్రమ రవాణా నిరోధించడానికి మైనింగ్ అధికారులు, రవాణా శాఖ అధికారులు, వాణిజ్య పన్నుల శాఖతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. -
ఉద్దానంలో ‘జీడి బోర్డు’ ఏర్పాటు చేయాలి
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన రైతులు జీవనాధారమైన జీడి పంటకు మద్దతు ధర కల్పించి స్థానికంగా జీడి బోర్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బాతుపురంలో శుక్రవారం రైతు సంఘ నాయకులు, ఉద్దాన రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.మోహన్రావు, జీడి రైతు సంఘ జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీలను విస్మరించి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం సిగ్గు చేటన్నారు. జీడి పప్పు ధరలు మార్కెట్లో బాగానే ఉన్నప్పటికీ జీడి వ్యాపారులు దురాశతో జీడి పరిశ్రమలకు లాకౌట్ ప్రకటించడం దారుణమని అన్నారు. జీడి రైతులను ఆందోళనకు గురి చేసి వారి నుంచి కారుచౌకగా జీడి పిక్కలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అసెంబ్లీలో పలు మార్లు జీడి మద్దతు ధర అంశంపై లేవనెత్తినప్పుడు సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎలాంటి సమాధానం చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో జీడి రైతు సంఘ నాయకులు కె.రమేష్,ఎం.కామేశ్వరరావు,మడ్డు రాఘవరావు,అర్లి దానేస్, ఉప్పరపల్లి ఢిల్లీరావు, రెయ్యి మంజు, దాసరి మోహన్రావు, సీహెచ్ భాస్కరరావు, చిరంజీవి తదితరులు ఉన్నారు. -
ఆర్తులను కాపాడుదాం
అపోహలు వీడుదాం.. శ్రీకాకుళం కల్చరల్: దాతలు కావాలి.. రక్త దాతలు ముందుకు రావాలి. జిల్లాలో రక్తల నిల్వలు నానాటికీ తక్కువైపోతున్నాయి. దాతలు ముందుకు రాకపోతే గర్భిణుల దగ్గర నుంచి ప్రమాద బాధితుల వరకు చాలా మంది ప్రాణాపాయ స్థితిలో పడతారు. రక్తదానంపై అవగాహన విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో రెడ్క్రాస్తో పాటుగా ప్రభుత్వ ఆస్పత్రులు, జిల్లా కేంద్రంలో 3 ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు, నరసన్నపేట, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో బ్లడ్బ్యాంకులు ఉన్నాయి. వాటన్నింటి ద్వారా రక్త సేకరణ ఏడాదిలో కేవలం 16వేల యూనిట్లు మాత్రమే జరుగుతోంది. జిల్లాకు దాదాపు 60వేల యూనిట్లు అవసరం ఉంటుంది. దీనిపై రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సి ఉందని చెప్పారు. తమ బ్లడ్బ్యాంకులో కూడా కూడా రక్తం అందడం కష్టంగా ఉందన్నారు. అపోహలు వద్దు.. ● చాలా మంది రక్తదానం అంటే భయపడతారు. దీనిపై చాలా అపోహలు ఉన్నాయి. ● రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మిల్లీలీటర్లు మాత్రమే సేకరిస్తారు. ● సాధారణంగా మనిషిలో సరాసరి 5లీటర్ల నుంచి 6లీటర్ల రక్తం ఉంటుంది. కేవలం 300 మిల్లీలీటర్ల రక్తం దానం చేయడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు. సుఖప్రసవంలో తల్లి 700 మిల్లీలీటర్ల రక్తం కోల్పోతుంది. నేడు రక్తదాతల దినోత్సవం రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు రక్తదానంపై ఆవశ్యకత కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తారు. రక్తదానం ఆవశ్యకత తెలియజేస్తున్నా రక్తదానంపై స్కూళ్లకు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాను. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కుడా వెళ్లి వారిని రక్తదాన శిబిరాల కోసం ప్రోత్సహిస్తున్నాను. ఇప్పటికి లక్షకుపైగా మోటివేషన్ చేశాను. నేను కూడా ఇప్పటికి 25 సార్లు రక్తదానం చేశాను. – పెంకి చైతన్యకుమార్, రెడ్క్రాస్ మోటివేటర్ జిల్లాకు ఏడాదికి దాదాపు 60వేల యూనిట్ల రక్తం అవసరమవుతుంది. కానీ సేకరిస్తున్నది మాత్రం కేవలం 16 యూనిట్లే. ఈ వ్యత్యా సాన్ని సరిదిద్దడం చిటికెలో పని. కానీ ఎందుకనో ఆ పని జరగడమే లేదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకువచ్చి రక్తదానం చేస్తే కొరతను ఇట్టే అధిగమించవచ్చు. కానీ అవగాహన లేమి, భయం, సమాచార లోపం కారణంగా రక్తదానం చేసేందుకు చాలా మంది ముందుకు రావడం లేదు. ఈ భయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం అందకుండాపోతోంది. ఎవరు రక్తదానం చేయవచ్చు.. కాసింత దయాగుణం.. మరికాసింత ఆరోగ్యం.. ఈ రెండూ ఉంటే చాలు.. 18–60 ఏళ్ల వారెవరైనా 45 కిలోలకు పైగా బరువు ఉండి, 12 పాయింట్లు హిమోగ్లోబిన్ ఉంటే ఎంచక్కా రక్తదానం చేయవచ్చు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం జిల్లాలో తగ్గుతున్న రక్త నిల్వలు దాతలు ముందుకు రావాలని స్వచ్ఛంద సంస్థల పిలుపు సాటి మనిషిని కాపాడాలనే.. నేను 49 సార్లు రక్తదానం చేశాను. ఏటా ఆగస్టు 15, మే 1, రిపబ్లిక్ డే, డిసెంబరు 25 పుట్టిన రోజున ఇస్తుంటాను. – కేకేవీ పురుషోత్తమరావు(కల్యాణ్), విశ్రాంత మెడికల్ రిప్రజెంటేటివ్, శ్రీకాకుళం ప్రతి మూడు నెలలకు ఇస్తాను.. నేను ప్రతి మూడు నెలలకు ఓ సారి రక్తదానం చేస్తుంటాను. మొ దట్లో నాకూ భయం ఉండేది. మా మేనేజర్ను చూసి స్ఫూర్తి పొందాను. రెడ్క్రాస్ పలుసార్లు అవార్డులు, సత్కారాలు కూడా చేశారు. – సీహెచ్ రమణమూర్తి, శ్రీకాకుళం అపోహలు వదలండి రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి. ఎ వరైనా రక్తదానం చేయవ చ్చు. ఆపద సమయంలో రక్తం ఎంతో అవసరం. దాన్ని గుర్తించండి. – పి.జగన్మోహనరావు, చైర్మన్, రెడ్క్రాస్ -
ట్రెండింగ్లో లోకేష్ వ్యాఖ్యలు..
తల్లికి వందనంలో రూ.2వేలు కోత విధించినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ పాత వీడియోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. వైఎస్ జగన్ హయాంలో బడి బాగు కోసం రూ.వెయ్యి తగ్గిస్తే.. నారా లోకేష్ తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఏకంగా రూ.2వేలు కోత పెట్టడంతో అంతా పాత వీడియోలను గుర్తు చేస్తూ విమర్శలు చేస్తున్నారు. నాడు దుమ్మెత్తిపోసిన నోరు ఇప్పుడేమైందని ప్రశ్నిస్తున్నారు. అమ్మఒడి విధివిధానాలు వెల్లడిచేసిన సమయంలో ట్విట్టర్ వేదికగా 2022 ఏప్రిల్ 15వ తేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై లోకేష్ చేసిన ఆరోపణలు -
పోషకాల రేడు.. నేరేడు
● కిలో నేరేడు రూ.200 వరకు విక్రయం ● మితంగా తీసుకోవాలంటున్న వైద్యులు పాతపట్నం: నేరేడు మార్కెట్లో మిలమిలలాడుతూ ఆకర్షిస్తోంది. నేరేడు పండుతో పాటు ఆకులు, చెట్టు, బెరడు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. నేరేడు పండ్లను కోయడం కొంత కష్టంతో కూడుకున్న పని అందువల్లే ధర కూడా అధికంగానే ఉంటుంది. రైతు నుంచి దళారులు కిలో రూ.80కు కొనుగోలు చేస్తున్నట్లు తెలిసింది. దళారులు వ్యాపారులకు రూ.130 కు విక్రయిస్తున్నారు. వ్యాపారులు వినియోగదారులకు రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం నేరేడు పండ్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. నేరేడు పండ్లను ఇక్కడి వ్యాపారులు ఒడిశా (గుణుపూర్) నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తున్నారు. ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ● నేరేడు పండ్లలో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు ఏ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధుల బారీ నుంచి రక్షణ కులుగుతుంది. ● మూత్ర సమస్యల నియంత్రణతో పాటు మధుమేహం అదుపులో ఉంటుంది. అలాగే కిడ్నీలను శుభ్రపరుస్తుంది. ● మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాలేయం పనితీరు మెరుగుపరచడంతో పాటు శుభ్రపరుస్తుంది. ● నేరేడు పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు, మెదడుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. ● దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోటిలో చెడు బ్యాక్టీరియా నశించి దుర్వాసన రాకుండా చేస్తుంది. ఇమ్యునిటీ పెరుగుతుంది నేరేడు పండ్లులో ఐరన్, కాల్షియం, పొటాషియంతో పాటు విటమిన్లు ఉంటాయి. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యానికి మంచింది. శరీరంలో చిగుళ్లు బాగుంటాయి, ఔషధ లక్షణాలు మెండుగా ఉన్నాయి. – డాక్టర్ జి.వేణుగోపాల్, సీహెచ్సీ, సూపరింటెండెంట్, పాతపట్నం -
సుసంపెన్మైన ఆలోచన
కాశీబుగ్గ: భూమి వేడెక్కిపోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడుతోందని ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. కానీ ఎవరూ ప్లాస్టిక్ నిషేధం, పునర్వినియోగంపై దృష్టి సారించడం లేదు. ఈ విషయంలో కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓ అడుగు ముందుకు వేసింది. వాడి పడేసిన పెన్నులను సేకరించి వాటిని రీసైక్లింగ్కు ఇచ్చేలా ఓ వ్యవస్థను రూపొందించింది. పెన్నులతో సుసంపన్నమైన ఆలోచన చేసింది. కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు సుమా రు 1038 మంది చదువుతున్నారు. పాఠశాలలో ఇంకు అయిపోయి పనికిరాని పెన్ను లను ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఇవి పిల్లల కాళ్లకు గుచ్చుకుంటూ ఇబ్బంది పెట్టేవి. ఇప్పుడు మాత్రం అలా కాకుండా పాఠశాలలో ఓ పచ్చని చెట్టుకు ‘యూజ్ మి’ అని ఓ బాక్సును ఏర్పాటు చేశారు. దానిపై ప్లాస్టిక్ పెన్నులు వాడిన అనంతరం ఇందులో వేయాలని రాశారు. అక్కడితో ఆగకుండా ప్రధానోపాధ్యాయులు పాఠశాల సర్క్యులర్లో పొందుపరిచి దానికి ప్రతి తరగతి గదికి అమలు చేసే బాధ్యత క్లాస్ లీడర్లకు అప్పగించారు. ఇంకేముంది పాఠశాలలో వెయ్యి మంది విద్యార్థులు ఉండడంతో రోజుకు పదుల సంఖ్యలో పెన్నులు బాక్సులోకి చేరుతున్నాయి. నిండిన బా క్సును మరి కొంతమంది కమిటీ సభ్యులు సేకరించి బస్తాల్లో వేస్తున్నారు. అలా ప్లాస్టిక్ పెన్నులు బస్తాలుగా మారుతున్నాయి. వాటితో ప్రాజెక్టులు చేయ డానికి, రీసైక్లింగ్కు ఉపయోగించాలని ప్రత్యక్షంగా నేర్పిస్తున్నారు. దీంతో పాటు ప్లాస్టిక్ దుకాణాలకు అమ్మి వాటితో మొక్కలు కొనుగోలు చేయడం వంటి పనులు కూడా చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకే పరిమితం కాకుండా ఉపాధ్యాయులకు సైతం అలవాటైంది. ఈ పాఠశాలలో జరుగుతున్న ఈ విధానం అన్ని పాఠశాలలకు తెలిస్తే ఇంకా సంతోషిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. వ్యర్థానికి అర్థం నేను హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఎక్కడ చూసినా వాడిన పెన్నులు కనిపించాయి. వాటిని నేను సేకరించి బయట పారవేసేవాడిని. రోజు గడిచాక మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చేది. అప్పుడే ఉపాధ్యాయుల సహకారంతో వాడిన పెన్నులు రీసైక్లింగ్కు ఇవ్వాలనే ఆలోచనతో ఇలా బాక్సును పెట్టాం. పనికిరాని వస్తువంటూ ఏమీ ఉండదని, అన్ని ఉపయోగపడతాయని పిల్లలకు చెబుతున్నాం. అన్ని పాఠశాలలు మాలా చేస్తూ ఇంకా సంతోషిస్తాం. – చిన్నంనాయుడు, ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్న పాఠశాల, కాశీబుగ్గ వాడిపడేసిన పెన్నుల సేకరణ వాటిని రీసైక్లింగ్ చేసేలా విద్యార్థులకు తర్ఫీదు కాశీబుగ్గ హైస్కూల్ వినూత్న ప్రయోగం -
నవోదయ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు
సరుబుజ్జిలి: వెన్నెలవలస వద్ద గల జవహర్ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ఎంట్రన్స్ కోసం జూలై 29లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ బేతనసామి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎంట్రన్స్ పరీక్ష 2025 డిసెంబర్ 13న జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ప్రభుత్వ లేదా ప్రభుత్వంతో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలని తెలిపారు. ప్రధానమంత్రి బాల పురస్కార్ దరఖాస్తుకు గడువు పెంపు శ్రీకాకుళం అర్బన్: జాతీయ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ ఆ ధ్వర్యంలో నిర్వహించే ప్రధాన మంత్రి రాష్ట్రీ య బాల పురస్కార్–2025కి సంబంధించి దరఖాస్తుల గడువును జూలై 31 వరకు పొడిగించారని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ తెలిపారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సాంస్కృతికం, సమాజ సేవ, విజ్ఞానం, సాంకేతికం, పర్యావరణం వంటి రంగాలలో అసాధారణ ప్రతిభ కనబర్చిన 5–18 ఏళ్ల లోపు బాలలు ఈ అవార్డుకు అర్హులని తెలిపారు. బాలలు స్వయంగా గానీ సంస్థల ద్వా రా గానీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నా రు. దరఖాస్తు చేసేందుకు అవసరమైన వ్యక్తిగత వివరాలు, ప్రతిభకు సంబంధించిన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లు, పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్స్ వంటి ఆధారాలతో పాటు http://awards.gov.in/registration/ signUp పోర్టల్ ద్వారా జూలై 31లోపు నమోదు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి బి.శాంతిశ్రీ తెలిపా రు. అవార్డు కోసం అర్హులైన బాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమం వాయిదా శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అహ్మదాబాద్లో జరిగిన విషాదకర విమాన ప్రమాదం నేపథ్యంలో, శుక్రవారం శ్రీకాకుళం పట్టణంలో ని కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరుద్యోగ భృతి, ఫీజు బకాయిలపై నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. విద్యార్థులు, యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం తాత్కాలికంగా ఆపిన ట్లు తెలిపారు. కొత్త తేదీ త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. విషాద ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు గౌరవం తెలుపుతూ నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించామని తెలిపారు. సాక్షి కార్యాలయంపై దాడి హేయం ● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): టీడీపీ నాయకులు సాక్షి కార్యాలయంలోకి చొరబడి దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ప్రభు త్వం అధికారంలోకి వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పత్రికలపై దాడు లు, పార్టీ నాయకులపై వేధింపులకు పాల్పడి గొంతు నొక్కాలని చూడడం సరికాదన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
పాతపట్నం: జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, పనులను పూర్తి చే యాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పాతపట్నం బాలాజీ నగర్లో ఉన్న ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో గురువారం సీపీఐ జిల్లా 25వ మహాసభలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు, విద్యార్థులు, యువకులు అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గిరిజనులు పండించే పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, సనపల నర్సింహులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొ న్న శ్రీనివాసరావు, మండల కార్యదర్శి దూసి శారద, దూసి భాస్కరరావు, నాయకులు ఆదినారాయణ ఆచారి, మోహనరావు, సింహాచలం, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఎన్నిక సీపీఐ జిల్లా కార్యదర్శిగా చాపర వెంకటరమణ, అదనపు కార్యదర్శిగా లండ వెంకటరావు, కార్యవర్గ సభ్యులుగా చాపర సుందర లాల్, పలింగ నారాయణ స్వామి, పుక్కల్ల ఆరెల్లమ్మ, కే.సంతోష్ కుమార్లను ఏక్రగీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర సహాయ కార్యవర్గ సభ్యులు తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ -
ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదు
● మీడియా సమావేశంలో సీపీఎం నాయకులు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిలో ప్రజలకు చేసిందేమీ లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, పి.తేజేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పాలన ఏడాదిలో ఏ మాత్రం సంతృప్తికరంగా లేదని, ప్రజలకు అప్పులు తప్ప ఆదా యం లేని పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని, జీడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని, వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి చివరి భూముల వరకు నీరు అందిస్తామని, జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవ లు అందిస్తామని చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గిరిజనుల భూములను గిరిజనేతరులు తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్రంగా దోపిడీకి గురవుతున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. వంశధార రిజర్వాయర్ పూర్తిచేసి చివరి భూముల వరకు రెండు పంటలకు నీరివ్వాలని, నేరడి వద్ద బ్యారేజీ నిర్మించాలని డిమాండ్ చేశా రు. జిల్లాలో అక్రమ మైనింగ్ రద్దు చేయాలని డి మాండ్ చేశారు. కార్గో ఎయిపోర్టు పేరుతో భూ దోపిడీ ఆపాలని, సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టపెట్టొద్దని వారు డిమాండ్ చేశారు. కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. -
బాలలను పనిలో చేర్చుకుంటే చర్యలు
శ్రీకాకుళం అర్బన్: బాలలను కార్మికులుగా పనిలో చేర్చుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని బాలల సంరక్షణ అధికారి కేవీ రమణ అన్నారు. శ్రీకాకుళంలోని నెహ్రూ యువజన కార్యాలయం వద్ద జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్, బ్రెడ్స్ సంస్థ, జిల్లా కార్మిక శాఖ, ఏహెచ్టీయూ, ఐసిపిఎస్, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నుంచి డే నైట్ జంక్షన్ వరకు బాల కార్మికుల నియంత్రణపై అవగాహన ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ బాలలను కార్మికులుగా పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని, అలాగే ఎక్కడైనా అలాంటి పిల్లల్ని గుర్తిస్తే 1098 లేదా 112 కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు. జిల్లా యాక్సిస్టు జస్టిస్ ప్రోగ్రాం మేనేజర్ మజ్జి సింహాచలం మాట్లాడుతూ మన దేశాన్ని బాల కార్మిక రహిత దేశంగా తీర్చిదిద్దాలని జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వ్యవస్థాపకులు భువన్ రిబ్బు ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లాని బాల కార్మిక రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, వివిధ ప్రభుత్వ ఇతర సంస్థలు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందన్నారు. కార్మిక శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 ఏళ్ల పిల్లలను పనిలో చేర్చుకోవద్దని సూచించారు. -
గొట్టాను పరిశీలించిన ఒడిశా అధికారి
హిరమండలం: స్థానిక గొట్టా బ్యారేజీ స్థితిగతులను భువనేశ్వర్కు చెందిన చీఫ్ ఇంజనీర్ నాగమోహన్ గురువారం పరిశీలించారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు జలాల వివాదాల నేపథ్యంలో ఒడిశా చీఫ్ ఇంజినీర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గొట్టా బ్యారేజీలో ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ఈ బ్యారేజీ ద్వారా సాగునీటి ప్రవాహంతో పాటు కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిస్థితిపై ఆరా తీశారు. ఏటా ఖరీఫ్, రబీ సాగు లక్ష్యాన్ని సైతం తెలుసుకున్నారు. స్థానిక వంశధార అధికారులు ఇక్కడి పరిస్థితిని వారికి వివరించారు. ఆయన వెంట నరసన్నపేట వంశధార డీఈ ప్రదీప్, ఇతర వంశధార సిబ్బంది పాల్గొన్నారు. -
‘విద్రోహ చర్యపై నిజాలు నిగ్గు తేల్చాలి’
హిరమండలం: కూర్మ వైదిక గ్రామంలో ఇస్కాన్ ఆశ్రమం అగ్నిప్రమాదంలో దగ్ధమైన సంగతి తెలిసిందే. బుధవారం అర్ధరాత్రి తర్వాత ప్రమాదంలో ప్రధాన ఆశ్రమం కాలిబూడిదైంది. 2018లో ఇక్కడ వైదిక గ్రామం ఏర్పాటైంది. విద్యుత్ వంటి ఆధునిక సదుపాయాలకు దూరంగా.. సనాతన ధర్మంతో పాటు ప్రాచీన సాగు విధానంతో ఇక్కడ కూర్మ గ్రా మం గత ఏడేళ్లుగా విరాజిల్లుతోంది. ఈ క్రమంలో ఇక్కడ అగ్నిప్రమాదం సంభవించి ప్రధాన ఆశ్రమం దహనం కావడం సంచలనంగా మారింది. దీనిపై ఆశ్రమ నిర్వాహకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూర్మ ఆధ్యాత్మిక గ్రామాన్ని పరిరక్షించాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో గురువారం అగ్నిప్రమాదం జరిగిన ఘటనా స్థలాన్ని కొత్తూరు సీఐ ప్రసాద్, హిరమండలం ఎస్ఐ మహ్మద్ యాసిన్ పరిశీలించారు. విశ్వహిందూ పరిషత్తో పాటు ధార్మిక సంఘాల ప్రతినిధు లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజానిజాలను బయటకు వెలికితీయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి
మెళియాపుట్టి: రేగులపాడు ఆఫ్షోర్కు గ్రామాన్ని ఇచ్చిన చీపురుపల్లి నిర్వాసితులలకు న్యాయం జరగాలంటే ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆఫ్షోర్ నిర్వాసితులు చేపట్టిన నిరాహార దీక్షలు 22వ రోజుకు చేరుకోవడంతో గురువారం చీపురుపల్లిలోని దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడు తూ హిరమండలం నిర్వాసితులకు ఇచ్చిన 460 జీఓ ప్రాప్తికి పూర్తిస్థాయి ప్యాకేజీలు ఇవ్వాలని కోరా రు. వలస కూలీలుగా పలు ప్రాంతాలకు వెళ్లిన 132 మంది నిర్వాసితులకు ప్యాకేజీలు లేవని అన్నారు. డీ పట్టా భూములకు సొమ్ములు చెల్లించాలని అన్నా రు. చెల్లింపుల్లో తేడాలు ఉన్నాయని వాటిని సవరించి ఇళ్లకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. నిర్వాసితులందరూ ఏకతాటిపై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఈశ్వరరావు, కొక్కిరి కిర ణ్, ఉమాశంకర్, వెంకటరమణ పాల్గొన్నారు. -
కాటేసే కాలం
● ఖరీఫ్లో విషసర్పాలతో జాగ్రత్త ● వానాకాలంలో పాముల సంచారం ఎక్కువ హిరమండలం: పొలం పనులు మొదలైపోయాయి. వానలు పడుతుండడంతో రైతులకు పొలాలకు వెళ్తున్నారు. అయితే ఈ కాలంలో రైతులు పాముకాటుకు గురవుతుంటారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఈ నెల నుంచి దాదాపు నవంబర్ వరకు పాములు, ఇతర విష కీటకాల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించాలి ●పొలాల గట్లమీద వెళ్లేటప్పుడు కర్రతో చప్పుడు చేస్తూ నడవడం మంచిది. ●రాత్రిపూట పొలాలకు నీరు కట్టడానికి వెళ్లినప్పుడు టార్చిలైట్ తీసుకుని వెళ్లాలి. ●ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచాలి. ●పాము కాటు కంటే చాలామంది షాక్తోనే ప్రాణం మీదకు తెచ్చుకుంటారు. ●ఇంట్లో వారు ధైర్యం చెప్పాలి. ●పాముకాటు వేయగానే కొందరు ఆ గాయాన్ని మరింతగా కోస్తే రక్తం తో పాటు విషం వచ్చేస్తుందని కత్తితో, బ్లేడుతో గాటు పెడతారు అలా చేయకూడదు. ఒక్కోసారి పాము కాటు కన్నా ఆ గాయం ప్రమాద కరంగా మారవచ్చు. పాముకాటు లక్షణాలు ●పాము కాటు వేసిన ప్రదేశంలో రెండు కోరల గాయం స్పష్టంగా కనిపించి నొప్పి తీవ్రంగా ఉంటుంది. ●నొప్పి క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షిక పక్షవాతం కారణంగా నాలుక మందమైనట్టు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు అనిపిస్తాయి. ●కళ్లు మగతగా శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు పాములు విష ప్రభావం కట్ల పాము: ఇది కాటేసిన క్షణాల్లోనే విషం రక్త కణా ల్లో కలుస్తుంది. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. నాగుపాము: ఇది కాటేసిన 15 నిమిషాల్లో శరీరంలోకి విషం ఎక్కుతుంది. రక్తపింజర : ఇది కాటేసిన రెండు గంటల తర్వాత విషం శరీరంలోకి ఎక్కుతుంది. జెర్రిపోతు, నీరుకట్ట: ఇది కాటేసినా విషం ఉండదు. కానీ చికిత్స తీసుకోవడం అవసరం. అందుబాటులో ఇంజెక్షన్లు పాముకాటు బారిన పడిన వారికి పీహెచ్సీల్లో చికిత్స అందుబాటులో ఉంటుంది. వారికి కావాల్సిన యాంటీ స్నేక్వీనం ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. పాటుకాటుకు గురైన వ్యక్తి ఆందోళన, భయం చెంద కుండా నిర్భయంగా ఉండాలి. గాయంపై భాగాన్ని వస్త్రంతో గట్టిగా లాగి కట్టి ఉంచాలి. వెంటనే ప్రథమ చికిత్స చేసి గాయాన్ని బట్టి రెండు సార్లు స్నేక్వీనం డోస్ తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. పాము కరిచిన వెంటనే ఏదైనా వాహనంలో ఆరోగ్య కేంద్రానికి చేర్చాలి. నడిపించకూడదు. – ఫారుక్ హుస్సేన్, వైద్యాధికారి, పీహెచ్సీ, హిరమండలం -
మెగా ఉద్యోగ మేళాలో 263 మంది ఎంపిక
కాశీబుగ్గ: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ సూర్యతేజ జూనియర్ కళాశాల ఆవరణలో గురువారం మెగా జాబ్మేళా నిర్వహించారు. 763 మంది హాజరుకాగా అందులో 263 మంది వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పలాస నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్నచౌదరి మాట్లాడుతూ జాబ్ మేళాకి హాజరైన ప్రతి నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళాశాల ప్రి న్సిపాల్ కరస్పాండెంట్ పద్మాజీ కామేశ్వరరావు మాట్లాడుతూ యువతలో ఉండాల్సిన నైపుణ్యాల ప్రాముఖ్యత గురించి వివరించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఉరిటి సాయికుమార్ మాట్లాడు తూ దూరంతో సంబంధం లేకుండా అభ్యర్థులు అ వకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో ఎల్.కామేశ్వరరావు, పి.విఠల్రావు, బి.నాగరాజు, గాలి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
పశువుల తరలింపు అడ్డగింత
నరసన్నపేట: జాతీయ రహదారిపై అక్రమంగా గేదెలను తరలిస్తుండగా నరసన్నపేట పోలీసులు అడ్డుకున్నారు. బరంపురం నుంచి రాజమండ్రికి బొలెరే వ్యాన్లో ఐదు గేదెలను తరలిస్తుండగా మడపాం టోల్గేట్ వద్ద తనిఖీలు చేస్తుండగా టాస్క్ఫోర్స్ పోలీసులు గుర్తించా రు. ఎలాంటి అనుమతులు లేకపోవడంతో వాహనాన్ని సీజ్ చేశారు. గేదెలను అలమండ గోశాలకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్ తెలిపారు. నీలమణి దుర్గ హుండీ ఆదాయం రూ.4.95 లక్షలు పాతపట్నం: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి హుండీ కానుకల ద్వారా రూ.4,95,520 ఆదాయం లభించింద ని ఆలయ ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. 30 రోజులకు ఈ ఆదాయం వచ్చిందన్నారు. ఆలయ హుండీని గురువారం లెక్కించామని, టెక్కలి గ్రూపు దేవాలయాలు కార్యనిర్వహణా ధికారి టి.పి.మనస్వి పర్యవేక్షించారన్నారు. కా ర్యక్రమంలో సుదర్శన్, శ్రీ వెంకటేశ్వరస్వామి సేవా సమితి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. తప్పిన ప్రమాదం కొత్తూరు: కొత్తూరులోని పాలకొండ రోడ్డులో త్రినాథ స్వామి ఆలయం వద్ద ఏర్పడిన భారీ గోతిలో గురువారం ఓ ఆటో దిగబడింది. వ ర్షం కారణంగా గోతుల్లో నీరు చేరడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పడిపోయిన సమయంలో ఆటో వెనుక ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ముగ్గురు తహసీల్దార్లకు బదిలీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లకు బదిలీ చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టరే ట్ జి–సెక్షన్ సూపరింటెండెంట్ జి.ఎల్.శ్రీనివాస్ను లావేరు తహసీల్దార్గా నియమించారు. పాతపట్నం తహసీల్దార్ సన పల కిరణ్కుమార్ రణస్థలం మండలం బదిలీ చేశారు. రణస్థలం తహసీల్దార్గా పనిచేసిన ఎం.ప్రసాదరావును పాతపట్నం తహసీల్దార్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు ఆలయాల్లో చోరీ శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కనుగులవానిపేట గ్రామంలో గల పొదిలాపు అమ్మ వారి గుడితో పాటు పక్కనే గల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత దొంగతనం జరిగింది. గురువారం ఉదయం ఆలయానికి వెళ్లిన పురోహితుడు తలుపులు బార్లా తెరిచి ఉండడడంతో గ్రామస్తులకు విషయం చేరవేశారు. వారు వెంటనే శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దొంగతనంలో రూ.2వేలు నగదుతో పాటు ఇతర త్రా వస్తువులు దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. గ్రామస్తులురాలు కనుగుల అశ్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు టెక్కలి రూరల్: స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోదండరామ వీధికి చెందిన బలగ కృష్ణారావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇందిరాగాంధీ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వైపు కృష్ణారావు సైకిల్పై వెళ్తుండగా అదే మార్గంలో వస్తున్న లారీ సైకిల్ హ్యాండిల్కు తగలడంతో కృష్ణారావు తుళ్లి పడిపోయాడు. దీంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ వెళ్లిపోయాడు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరించి కేసునమోదు చేయనున్నట్లు తెలిపారు. -
రాజకీయ క్రీడకు కోచ్ బలి
●ఎందరినో తీర్చిదిద్దాను నేను ఎందరో క్రీడాకారులను హాకీ క్రీడలో తీర్చి దిద్దాను. 8 మందిని జాతీయ స్థాయిలోనూ, రాష్ట్రస్థాయిలో 70 మందిని ఆడించాను. జిల్లా కేంద్రంలో కూడా పాత్రునివలస మినీ స్టేడియంలో నా అధ్యక్షతన ఆడించాను. పాత్రునివలసలో స్టేడియం అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. ఇప్పుడు జిల్లా కేంద్రంలోని ఏ మైదానానికి వెళ్దామన్నా నన్ను రానీయడం లేదు. స్థానికంగా గల స్పోర్ట్స్ అధికారులు తమపై రాజకీయ ఒత్తిడి ఉందని, స్టేడియంకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. – అల్లు అనిల్ కుమార్, హాకీ కోచ్ శ్రీకాకుళం రూరల్: ఆయన మారుమూల ప్రాంతానికి మైదానం తీసుకువచ్చారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి నిఖార్సయిన హాకీ క్రీడాకారులుగా తయారు చేశా రు. జాతీయ స్థాయి పోటీలకు అంపైర్గా వ్యవహరించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. కానీ ఇప్పుడు ఆయనను ఆ మైదానానికే రానివ్వడం లేదు. వైఎస్సార్ సీపీపై అభిమానం చూపించారనే కారణంతో కక్ష సాధిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండల పరిధిలోని చాపురం పంచాయతీ అదే గ్రా మానికి చెందిన అల్లు అనిల్కుమార్ హాకీ క్రీడాకారుడు. 15 ఏళ్లుగా ఇదే క్రీడలో ప్రావీణ్యం పొంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. జాతీయ స్థాయి పోటీలకు అంపైర్గా, టెక్నికల్ అధికారిగా కూడా ఎంపికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనపై కక్ష సాధింపులకు దిగారు. దీంతో ఆయన ఇప్పుడు ఏకంగా ఆటకే దూరమయ్యారు. తనను ఏ మైదానంలోకి రానివ్వకుండా టీడీపీ నేతలు అధికారుల సాయంతో కుట్రలు పన్నుతున్నారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. జాతీయ స్థాయి హాకీ క్రీడాకారుడిపై టీడీపీ నేతల కక్ష సాధింపు స్టేడియంకు రాకుండా అడ్డుకుంటున్న వైనం -
ఆదిత్యాలయ ఈఓ బాధ్యతల స్వీకరణ
అరసవల్లి: రాష్ట్ర దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయాలకు కొత్తగా ఆస్తులను సమకూర్చేలా చర్యలు చేపడతామని, త ద్వారా ఆలయాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని ఆలయ ఈఓ కేశవమఠం నాగవెంకట దుర్గా వరప్రసాద్ స్పష్టం చేశారు. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వా మి ఆలయానికి కొత్త ఈఓ (డిప్యూటీ కమిషనర్)గా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆల య సిబ్బంది కలిసి గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం కొత్త ఈఓ ప్రసాద్ మా ట్లాడుతూ అరసవల్లి ఆలయానికి కూడా పరిసర ప్రాంతాల్లో భూముల కొనుగోలు అంశం పెండింగ్లో ఉన్నట్లుగా సమాచారం ఉందని, దీన్ని త్వరితగతిన పూర్తి చేయించి తద్వారా ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తామని ప్రకటించారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో ఎక్కడైనా అసౌకర్యం కలిగితే నే రుగా తనను సంప్రదించవచ్చునని స్పష్టం చేశారు. -
డ్వాక్రా డబ్బు స్వాహా..?
ఆమదాలవలస: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 12వ వార్డు లక్ష్మీనగర్ వీధికి చెందిన మెప్మా ఆర్పీ లక్షల రూపాయల్లో డ్వాక్రా సంఘాల మహిళలకు చెందిన పొదుపు మొత్తాలను స్వాహా చేసిన ట్లు సమాచారం. ఆ వార్డు పరిధిలో సుమారు 50 గ్రూపులకు చెందిన పొదుపు మొత్తాలను గత కొన్నేళ్లుగా వసూళ్లు చేసినట్లు సమాచారం. అయితే ఆ మొత్తాలను బ్యాంకు ఖాతాలకు జమ చేయకుండా ఆమె సొంతానికి వాడుకున్నారని గ్రూపు సభ్యులు ఆరోపిస్తున్నారు. రూ.6–7లక్షల వరకు వసూలు చేసి ఉండవచ్చని సమాచారం. మహిళలు కొంతమంది నిలదీస్తుండడంతో ఇటీవల ఆమె ఇంటికి తాళం వేసుకొని వేరే చోటుకు వెళ్లిపోయినట్లు తెలి సింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు మహిళా సంఘాల సభ్యు లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై మెప్మా పీడీ ఎస్వీ రమణను సంప్రదించగా దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. ఏటీఎం కార్డు మార్చి రూ.29 వేలు లూటీ టెక్కలి రూరల్: తన ఏటీఎం కార్డు మార్చి తన అకౌంట్లో నగదు కాజేశారని ఓ మహిళ టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అయితే నాలుగు రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె వాపోతున్నారు. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని భగవాన్పురం గ్రామానికి చెందిన నార లోలాక్షి అనే మహిళ గత నెల 20 వ తేదీన టెక్కలిలో గల ఓ ఏటీఎంలో డబ్బులు తీసేందుకు వెళ్లారు. డబ్బులు ఎలా తీయాలో తెలియకపోవడంతో వెనుక ఉన్న గుర్తు తెలియని వ్యక్తికి తన ఏటీఎం కార్డు ఇచ్చి రూ.7000 నగదును తియ్యమని తన పిన్ నంబర్ చెప్పారు. ఆ వ్యక్తి ఏటీఎం నుంచి నగదు తీసి కార్డు మార్చేశాడు. అనంతరం ఈ నెల 6వ తేదీన కార్డులో రూ.7వేలు తీసినట్లు మెసేజ్ రావడంతో ఆమె ఆందోళనకు గురై బ్యాంకుకు వెళ్లారు. అకౌంట్ నుంచి మొత్తం రూ.29వేల నగదును పలాసలో ఓ ఏటీఎం నుంచి తీశారని చెప్పడంతో ఆమె ఈ నెల 8న టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు. ఇదే విషయమై టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ వద్ద ప్రస్తవించగా ఈ విషయం తన దృష్టికి రాలేదని, వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
మండుటెండలో రెండు గంటలు..
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాల, ఆస్పత్రిలోని సెక్యూరిటీ, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఏజెన్సీ ప్రతినిధులను మండుటెండలో రెండు గంటల పాటు నిలబెట్టి సమావేశం నిర్వహించడం వివాదానికి తావిచ్చింది. వారం రోజుల కిందట కొత్త ఏజెన్సీకి ఔట్సోర్సింగ్, సెక్యూరిటీ గార్డుల నిర్వహణ బాధ్య త అప్పగించారు. ఈ ఏజెన్సీ ప్రతినిధులు బుధవారం మండుటెండలో సిబ్బందినందరినీ నిలబెట్టి సుమారు రెండు గంటల పాటు సమావేశం నిర్వహించి వీళ్లందరిలో క్రమశిక్షణ లేదని, వైద్యులు ఇతర ఉద్యోగులకు నమస్కరించడం లేదని, సమయపాలన పాటించడం లేదని చెప్పారు. దీంతో సెక్యూరిటీ గార్డులంతా తమ ఎంఓయూలో రూ.18వేలు జీతాన్ని నమోదు చేశారని, గత ఏజెన్సీ రూ.పది వేలు మాత్రమే చెల్లిస్తూ వచ్చిందని, ప్రస్తుతం మీరెంతో చెల్లిస్తారో చెప్పాలని పట్టుబట్టారు. ఇలా మాటకు మాట పెరిగింది. అయితే ఏజెన్సీ ప్రతినిధులు ముగ్గురిపై రెండో పట్టణ పోలీసులుకు ఫిర్యాదు చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది. గురువారం ఉదయం పోలీసులు నుంచి ఆ ముగ్గురిని స్టేషను వద్దకు రావాలని కబురురావడంతో సెక్యూరిటీ గార్డులంతా విధులకు హాజరుకాకుండా కాసేపు నిరసన తెలిపారు. అనంతరం విధులకు హాజరయ్యారు. కొందరు నాయకులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. -
28.550 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు
కంచిలి: మండల కేంద్రంలోని సోంపేట రైల్వేస్టేషన్ క్వార్టర్స్ సమీపంలో బీహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు 28.550 కిలోల గంజాయిని తరలిస్తుండగా కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ఉదయం చాకచక్యంగా పట్టుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం ఈ విషయమై సోంపేట సీఐ బి. మంగరాజు, స్థానిక ఎస్ఐ ిపి.పారినాయుడులు విలేకరులతో మాట్లాడారు. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం.. బీహార్ రాష్ట్రం రఘునాథ్పూర్ గ్రామాని కి చెందిన అమెరికన్ పాశ్వాన్, కామేంద్ర రామ్లు గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఒడి శా రాష్ట్రం గజపతి జిల్లా మీరాపల్లి గ్రామానికి చెందిన సంజిట్ అలియాస్ బబ్లు అనే వ్యక్తి నుంచి 28కిలోల 550 గ్రాముల గంజాయిని కొనుగోలు చేసి బీహార్ బయల్దేరారు. అక్కడ గయా రైల్వేస్టేషన్కు తీసుకెళ్లి సాహిద్ ఆలం అలియాస్ అర్జున్కు అప్పగించడానికి వీరు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. దీని కోసం గురువారం వేకువజామున 4 గంటలకు ఇచ్ఛాపురం వద్ద సుమండి వరకు వచ్చి అక్కడి నుంచి హైవేలో గల లారీ ఎక్కి కంచిలి ఫ్లై ఓవర్ వద్ద దిగి, అక్కడి నుంచి కంచిలిలో రైల్వేస్షేన్ చివరన గల రైల్వే క్వార్టర్స్ వద్ద గల రైల్వేపార్క్కు ఎడమ పక్కన గల బీటీ రోడ్డుపైకి 7.30 గంటలకు చే రుకుని గంజాయితో గల నాలుగు బ్యాగులతో హౌరా మెయిల్ ట్రైన్ కోసమై వేచి ఉండగా పోలీసులకు అనుమానం వచ్చి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 28 కిలోల 550 గ్రామలు గంజాయిని, ఒక కీ ప్యాడ్ మొబైల్ ఫోన్ను సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించినట్లు సీఐ మంగరాజు ఈ సందర్భంగా తెలిపారు. -
కొమనాపల్లి ఫీల్డ్ అసిస్టెంట్పై విచారణ
జలుమూరు: కొమనాపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ కనుసు ఉమారావుపై పూర్తి విచారణ చేసి డ్వామా ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించనున్నామని నరసన్నపేట క్లస్టర్ ఏపీడీ కె.లోకేశ్ తెలిపారు. గురువారం కొమనాపల్లి సచివాలయంలో వేతనదారులతో విచారణ చేపట్టారు. ఫిర్యాదుదారులు కనుసు రవి, గొల్లంగి సోమేశ్వరి, ఉమా, వాన శాంతమ్మ, పల్లి రమణమ్మ తదితరులను విచారించారు. ఫిర్యాదు చేసిన అంశాలలో ఎంత వాస్తవమో, రికార్డుల ప్రకా రం ఉన్న వాటిని సరిచూస్తామన్నారు. విచారణ బహిరంగంగా నిర్వహిస్తామని నోటీసు ఇచ్చి రహస్యంగా నిర్వహించడంపై సర్పంచ్ కనుసు సీతమ్మ, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు కనుసు సీతారాం అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా ఫీల్డ్ అసిస్టెంట్ తప్పు చేస్తే అందరి సమక్షంలో విచారణ చేసి చేసిన తప్పులు రుజువైతే చర్యలు తీసుకోవాలే గానీ వారికి అనుకూలంగా ఉన్న వారితో ఉపాధి పనులలో తప్పులు చేసినట్లు చెప్పించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. క్లస్టర్ ఏపీడీ లోకేశ్ మాట్లాడుతూ బహిరంగ విచారణలో గొడవలు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇలా రహస్య విచారణ చేస్తున్నామని తెలిపారు.