Srikakulam
-
సర్వీసు వైర్లు చోరీ
రణస్థలం: లావేరు నుంచి ఇజ్జాడపాలెం వైపు వెళ్లే రహదారి మధ్యలో వ్యవసాయ విద్యుత్ మోటార్ సర్వీస్ వైర్ను గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి చోరీ చేశారు. అదే ప్రాంతంలోని సుమారు 10మంది రైతుల మోటార్లకు ఉన్న సర్వీస్ వైర్లను కట్ చేసి పట్టుకుపోయారు. శనివారం గమనించిన బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. కొందరి వైర్లు మోటార్ బోరు లోపల పడిపోవడం వల్ల కొత్తగా వేయాలంటే వేలల్లో ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాగి కోసం, ఇతరులకు సర్వీస్ వైరు అమ్మేందుకు ఇలా చేస్తున్నారని చెప్పారు. రెండు రోజుల క్రితం భరిణికాంలో కూడా కొంతమంది రైతుల మోటార్ సర్వీస్ వైర్లు, రాగి చోరీ చేశారని తెలిపారు. అనంతరం లావేరు ఎస్సై కె.అప్పలసూరికి రైతులు ఫిర్యాదు చేశారు. -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026●ఈ ఏడాది జనవరి 1న కంచిలి పద్మాతుల జాతీయ రహదారి దాటుతున్న ఈసురు పరదేశి అనే వృద్ధుడిని బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో మృతి చెందాడు. ●జనవరి 18న సంతబొమ్మాళి నుంచి టెక్కలి వచ్చే మార్గంలోఎదురెదురుగా ద్విచక్రవాహనాలు మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో గార మండలానికి చెందిన ఎల్.రాజశేఖర్ మృతి చెందాడు. ●జిల్లా కేంద్రంలో డే అండ్ నైట్ సమీపంలో మహిళా వీఆర్ఓను మత్తులో ఉన్న యువకుడు ఽఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. ●జిల్లా కేంద్రంలో ఉమెన్స్ కాలేజ్ సమీపంలో తోటి స్నేహితుడితో కలిసి బైక్ స్కిట్లు చేయడంతో అదుపుతప్పి వెనుక కూర్చున్న స్నేహితుడు మృతి చెందాడు. శ్రీకాకుళం కై ౖమ్ : తలకు హెల్మెట్ ఉండదు.. బండికి లైసెన్స్ ఉండదు.. వేగానికి పరిమితి ఉండదు.. చేతిలో బైక్ ఉంటే చాలు.. యూత్ రెచ్చిపోతున్నారు. రోడ్డుపై ఇతరులు కూడా వెళ్తారనే సోయి లేకుండా అతివేగంగా వాహనాలు నడుపుతూ అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారు. సరదాగా మొదలైన బైక్ రైడింగ్లు ఇప్పుడు ప్రమాదకరమైన ఆటలుగా మారుతున్నాయి. వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతుండడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోంది. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో యువత నిబంధనలు పాటించకుండా బైక్లు నడుపుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడానికి కూడా ఒప్పుకోవడం లేదు. దీనికి తోడు చిన్న వయసులోనే పెద్ద పెద్ద సీసీ వాహనాలను తీసుకుంటూ రయ్మంటూ దూసుకుపోతున్నారు. ఆ వేగాన్ని నియంత్రించలేక ప్రమాదాల్లో పడుతున్నారు. జిల్లా కేంద్రంలో అయితే బైక్ సైలెన్సర్లను మార్చి నగర వీధుల్లో శబ్దాలు చేస్తున్న దాఖలాలు అనేకం కనిపిస్తున్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో వేకువజామున హయాతినగరానికి చెందిన విద్యార్థి వేకువజామున వేగంగా వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ పెట్టుకుని ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవేమో. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం శ్రీపురం పరిధిలో జాతీయ రహదారికి కొద్ది దూరంలో వంశధార ఎడమ కాలువ గట్టుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, కాఫీ కలర్ రౌండ్ నెక్ టీ షర్టు ధరించి ఉన్నాడని, టీ షర్టు వెనుక వీఎల్ గోల్డు కలర్ అక్షరాలు ఉన్నాయని, లైట్ కాఫీ కలర్ కాటన్ జీన్ ఫ్యాంట్ ధరించి టక్ చేసుకొని ఉన్నాడని వివరించారు. నీలం రంగు బ్యాటరీ వాచ్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిసిన వారు కోటబొమ్మాళి పోలీసులు(63099 90861)కు సమాచారం అందించాలని కోరారు. పెంటిభద్రలో..పలాస : పెంటిభద్రలో శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సుమారు 45 ఏళ్లు వయస్సు కలిగి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. ఎండవేడికి డీహైడ్రేషన్కు గురై మూడు రోజులు క్రితమే చనిపోయ ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈదురుగాలుల బీభత్సం హిరమండలం: ఎల్.ఎన్.పేట మండలంలో శనివారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. పొడుగుపాడు, జాడిపేట, తురకపేట, కృష్ణాపురం, స్కాట్పేట గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనంతరం అధికారులు, సిబ్బంది స్పందించి సరఫరా పునరుద్ధరించారు. ఏసీఏ అతిచేయడం తగదు: ఎమ్మెల్యే కూన శ్రీకాకుళం న్యూకాలనీ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తన పరిధి దాటి ప్రవర్తిస్తే చేతులుకట్టుకుని కూర్చోరని, ఇబ్బందులు తప్పవని ఆమదాలవలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. జిల్లా క్రికెట్ సంఘం విషయం ఎంపికల్లో, నూతన కార్యవర్గం ఏర్పాటు విషయమై మితిమీరి వ్యవహరిస్తే.. కబడ్దార్ అంటూ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ వేదికగా జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవికుమార్ ఇటీవలి వెల్లువెత్తుతున్న అనేక ఆరోపనలు, అంశాలపై వివరణ ఇచ్చారు. ఇదే క్రమంలో ఏసీఏ వచ్చిన ఫీడ్బ్యాక్పై మండిపడ్డారు. లోధా కమిటీ నిబంధనలు, నియమాలు ప్రకారం క్రీడాసంఘాలు ఏర్పాటు అవుతున్నాయని, ఇందులో భాగంగానే కోర్టు ఆదేశాల మేరకే జిల్లా క్రికెట్ సంఘం ఏర్పాటైందన్నారు. ఏసీఏ సైతం ఆమోదించిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జిల్లా క్రికెట్ సంఘాలకు బాసులు ఎవరూ లేరన్నారు. జిల్లా అండర్–16 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలకు ఆరోపణలు ఉన్న వ్యక్తులను సెలక్టర్లగా ఎలా పంపించారని ఏసీఏను ప్రశ్నించారు. రెండు జట్లగా ఏర్పాటుచేసి సెలక్షన్ మ్యాచ్లను నిర్వహించాలని చూసిన రెండు జట్లలో 14 మంది ఇతర జిల్లాలకు చెందిన వ్యక్తులని జిల్లా క్రికెట్ పేరెంట్స్ కమిటీ, తల్లిదండ్రులు ఫిర్యాదులు చేశారని అంగీకరించారు. కొంతమంది ఏసీఏలో లేని ఆఫీస్బేరర్లు మితిమీరి వ్యవహరిస్తున్నారని కూన మండిపడ్డారు. మా జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికపై అతిచేస్తే.. ఏసీఏకు ఉన్న పరిమితులు, హద్దులు చెప్పాల్సిన పరిస్థితులు వస్తాయని, అంతవరకు తెచ్చుకోవద్దని హితవుపలికారు. సమావేశంలో జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి హసన్రాజా షేక్, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, ఉపాధ్యాక్షుడు టి.బాలమురళీకృష్ణ, విజయభాస్కర్, ఇతర సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రికెటర్లు పాల్గొన్నారు. -
19న రీజియన్ తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్: విశాఖపట్నం పోస్టల్ రీజియన్ పరిధిలో ఈనెల 19వ తేదీన తపాలా అదాలత్ నిర్వహణ ఉంటుందని పోస్టల్ సహా య సంచాలకులు కేవీడీ సాగర్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఆ రోజు ఉదయం 11 గంటలకు పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం, ఎంవీపీ బస్ కాంప్లెక్స్ పక్కన విశాఖపట్నం–530017లో పోస్టుమాస్టర్ జనరల్తో 122వ తపాలా అదాలత్ నిర్వహిస్తున్నట్లు సాగర్ తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు, ఫిర్యాదులు ఈనెల 15వ తేదీ లోగా ‘122వ తపాలా అదాలత్ ‘అనే శీర్షికతో కేవీడీ సాగర్, సహాయ సంచాలకులు, పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం విశాఖపట్నం –530017 అనే చిరునామాకు పంపాలని కోరారు. అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఈఆర్వో పరిధిలోని 15 సెక్షన్లలో విద్యుత్ వినియోగదారుల సర్వీసుల కోడ్ నంబర్లు మార్పు చేశామని, ఆన్లైన్లో బిల్లులు చెల్లించేవారు, కొత్త కోడ్ నంబర్లతో మార్పులు చేసుకోవాలని ఈఆర్వో ఏఏఓ ఎం.అప్పారావు సూచించారు. ఇటీవల జరిగిన మార్పులపై శనివారం ఆయ న మాట్లాడారు. ఈఆర్వో పరిధిలోని ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ, తొగరాం, పైడిభీమవరం, రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల, జి.సిగడాం, పొందూరు, గార, అరసవల్లి, పిఎన్ కాలనీ, బలగ, రాగోలు తదితర సెక్షన్లలో మొత్తం 2.76 లక్షల మంది గృహవిద్యుత్ వినియోగదారులు ఉన్నారని, వీరి పరిధిలో పనిచేస్తున్న విద్యుత్ లైన్మెన్లకు పరిధి ప్రకారం కొత్తగా కోడ్ నంబర్లను మార్చామని, దీన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఈపీడీసీఎల్ యాప్లో విద్యుత్ వినియోగ బిల్లులు చెల్లిస్తు న్న వారు తమ కొత్త కోడ్ నంబర్లను యాప్లో మార్పు చేసుకోవాలన్నారు. మందస: మీల గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని బాధిత రైతులు శనివారం సభ నిర్వహించారు. కానీ పోలీసులు నలువైపులా నిర్బంధించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధిత రైతులకు సానుభూతి తెలపడానికి వచ్చిన సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవింద్, సీపీఎంఏల్ జాయింట్ సెక్రటరీ వంకల మాధవరావు, పీఓడబ్ల్యూ కార్యదర్శి కుసుమ, కోనే రు రమేష్, పౌర హక్కుల సంఘం సభ్యులు పత్తిరి దానేష్, ఐఎఫ్టీయూ సభ్యులు జుత్తు వీరస్వామిలను అరెస్టు చేసి నిర్బంధించారని రైతులు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పంట భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. హిరమండలం: వంశధార కాలువల పరిధిలో శివారు ఆయకట్టుకు సైతం సాగునీరు అందిస్తామని బీఆర్ఆర్ వంశధార డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ అరవల రవీంద్రబాబు అన్నారు. శనివారం గొట్టా బ్యారేజీ యాఫ్రాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఖరీఫ్ సాగునకు సంబంధించి చివరి వరకూ సాగునీరు అందించడమే లక్ష్యమని చెప్పారు. వంశధార ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి ఈ ఏడాది 226 పనులకు ప్రతిపాదనలు పంపగా మంజూరయ్యాయని తెలిపారు. టెక్కలి సర్కిల్ పరిధిలో 76 పనులు మంజూరైతే 73 పనులు పూర్తయ్యాయన్నారు. నరసన్నపేట సర్కిల్కు సంబంధించి 116 పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గొట్టా బ్యారేజీ యాప్రాన్ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తిచేసినట్టు తెలిపారు. ఈ సీజన్ నాటికి రెండు యాప్రాన్లు, తర్వాత రెండు యాప్రాన్లు పూర్తిచేస్తామన్నారు. -
హత్య కేసులో అదుపులోకి మరో ఇద్దరు..?
● కుమారుడు, అల్లుడిపై అనుమానంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలో గురువారం అర్ధరాత్రి గాజులవీధి ప్రకాష్ నగర్లో భర్త ధర్మాన అసిరినాయుడుని భార్య జయలక్ష్మి అంతమొందించిన సంగతి విదితమే. అయితే ఈ హత్యకేసుకు సంబంధించి పోలీసుల విచారణ చేయగా అనేక విషయా లు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ హత్యతో మరో ఇద్దరికి సంబంధమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు ప్రయత్నాలతో హత్య..? పోలీసులు ఈ కేసుకు సంబంధించి కీలక సాంకేతిక ఆధారాలు శనివారం సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినప్పుడు కొన్ని ఆధారాలు లభించాయి. కత్తిపీట గాట్లు పెట్టే ముందే విషమిచ్చి చంపేందుకు య త్నించారని, మెడను తాడుతో నులిమినట్లు ఆధారాలుండటం గుర్తించారని సమాచారం. ఈ దిశగా పోలీసులు జయలక్ష్మిని ఇంటరాగేట్ చేసినట్లు, ఆమె మరో ఇద్దరికి సంబంధాలున్నట్లు తెలపడంతోనే మొత్తం తీగ లాగారు. కొడుకు, అల్లుడిపైనే.. ? హత్యకు గురైన అసిరినాయుడు నిత్యం భార్యను మద్యం మత్తుతో వేధించడం, ఇంటికొచ్చి భార్య వద్ద డబ్బులు లాక్కోవడం లేదంటే చితకబాదడంచేస్తుండేవాడు. కుమారుడు, అల్లుడితో బాధను పంచుకుని వారితోనే ఈ హత్యకు పన్నాగమేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి తగ్గట్టుగానే పోలీసు లు అసిరినాయుడు కుమారుడు మణికంఠ, అల్లుడి కి ఫోన్లు చేసినా స్విచ్చాఫ్ కావడం, ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లడంతో గాలించారు. శనివారం రాత్రి పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే హత్యలో పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తున్న మృతుని కుమారుడు మణికంఠే తన తండ్రి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. -
సీసీ ఫుటేజీల ద్వారా పరిశీలిస్తున్నాం
నిర్లక్ష్యంగా, మితిమీరిన వేగంతో వెళ్లేవారిని, స్పోర్ట్స్ బైక్స్తో ర్యాష్గా వెళ్లేవారిని సీసీ ఫుటేజీల ద్వారా పరిశీలిస్తున్నాం. జంక్షన్ నుంచి వేరే జంక్షన్ వెళ్లేలోపు వారిని ఆపుతున్నాం. నిబంధనలు మీరినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. డే అండ్ నైట్, అరవసల్లి మిల్లు జంక్షన్ల వద్ద హెల్మెట్ బ్యాంకులు పెట్టాం. మొన్నటి ప్రమాదంలో పేవ్మెంట్ ఢీకొని యువకుడు చనిపోవడంతో అలాంటివాటిపై దృష్టి పెట్టాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – వి.రామారావు, ట్రాఫిక్ సీఐ, శ్రీకాకుళం -
అసలే బెల్టు షాపు.. ఆపై విద్యుత్ చౌర్యం
వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడలో బెల్టు షాపు నిర్వాహకులు బరి తెగించారు. అక్రమంగా నడుస్తున్న బెల్టు షాపు కోసం పెద్ద ఎత్తున విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారు. ఫ్లడ్ లైట్ల మధ్య నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు చేప డుతున్నారు. గ్రామంలో బెల్టు షాపు వల్ల అక్రమ మద్యం ఏరులై పారుతున్నా.. అటు ఎకై ్సజ్ అధికారులు గానీ, విద్యుత్ చౌర్యం జరుగుతున్నా విద్యు త్ శాఖ అధికారులు గానీ చర్యలు తీసుకోవడం లేదు. బెల్టు షాపు, లైసెన్సు షాపు నిర్వాహకులు కూటమి నేతలు కావడంతో అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. -
చెరువులను చెరబట్టి..
సారవకోట: మండలంలోని చెరువులకు కీడు కాలం దాపురించింది. పెద్ద, పెద్ద చెరువుల్లో అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు చేపట్టి మట్టి, కొండలను తవ్వి గ్రావెల్ తరలిస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మండలంలో పర్లాకిమిడి రాజులు తవ్వించిన రంగసాగరంలో జేసీబీలను పెట్టి అందులో ఉన్న మట్టి తరలించుకు పోతున్నారు. ఇప్పటికే చెరువులో ఆక్రమణలు విపరీతంగా పెరిగి పోయాయి. 450 ఎకరాలు కంటే అధికంగా ఉండాల్సిన చెరువు విస్తీర్ణం సుమారు 80 ఎకరాలు వరకు తగ్గినట్లు ప్రాథమిక అంచనా. ఎన్నో వందల ఎకరాలకు సాగు నీటిని అందించే ఈ చెరువును అభివృద్ధి చేయాల్సి ఉన్నా చేయక పోవడంతో పలువురు మట్టి వ్యాపారులు రైతులకు, ఇళ్లు నిర్మాణ పనులు చేపట్టే వారికి మట్టిని తరలించి అమ్ముకుంటున్నారు. ఈ వ్యవహారం సచివాలయానికి కూత వేటు దూరంలోనే జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత ఏడాది ధర్మలక్ష్మిపురం గ్రామంలోని కలువల చెరువులో వందలాది ట్రాక్టర్ల మట్టి తరలించి అదే గ్రామానికి చెందిన జేసీబీ యజమాని సొమ్ము చేసుకున్నాడు. అధికారులు పట్టించుకోరా..? మండలంలోని జమచక్రం రెవెన్యూ గ్రామంలో జమచక్రం నుంచి సత్రాం పంచాయతీ గొల్లపేట గ్రామానికి రోడ్డు మార్గం గత ఏడాది నిర్మించారు. ఈ నిర్మాణానికి కావాల్సిన గ్రావెల్ను స్థానిక టీడీపీ నాయకులు పక్కనే ఉన్న కొండల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా తరలించి రోడ్డు నిర్మాణ పనులు చేట్టారు. ఆ కొండలకు ఆను కుని సర్వే నంబర్ 59లో ఉన్న మాలపల్లి కొండ అంచులో ఎలాంటి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా గ్రావెల్ తవ్వకాలు చేప ట్టి ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తన సొంత అవసరాలకు అవసరమైన రోడ్డు నిర్మాణం చేపట్టడంతో పాటు తన స్థలాన్ని ఈ గ్రావెల్ వేసి చదును చేసుకున్నాడు. అయినప్పటికీ రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం విచారకరం. సంబంధిత గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది ఇలాంటి అక్రమ తవ్వకాలను గుర్తించి ఉన్నతాధికారులతో పాటు మైన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నా నోరు మెదపడం లేదు. గత ప్రభుత్వం హయాంలో కొండ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణాలకు స్థలం కేటాయించారని, ఆ స్థలాలకు పేదలకు ఇవ్వకుండా కోర్టులకు వెళ్లిన నాయకులు ఇప్పుడు మాత్రం కొండలను తవ్వి వారి సొంత అవసరాలకు వాడుకుంటున్నా.. అడిగే నాథుడే కరువయ్యాడు. అంగూరు గ్రామంలోని సచివాలయానికి కూత వేటు దూరంలో గ్రావెల్తో ఉన్న చెరువు నుంచి ఎప్పటికప్పుడు రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీలతో తవ్వకాలు చేపట్టి ట్రాక్టర్లతో గ్రావెల్ తరలిస్తున్నా సంబంధిత రెవెన్యూ సిబ్బంది నోరు మెదపడం లేదు. ఆ ట్రాక్టర్లు నిలుపుదల చేసి ప్రశ్నించే దాఖలాలు లేవు. నౌతళ ఘాట్ రోడ్డుకు సమీపంలో ఉన్న కొండ నుంచి నిత్యం గ్రావెల్ తరలించి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఉపయోగిస్తున్నా ఇక్కడున్న రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ స్పాట్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం నుంచి మొదలు కానున్న ఇంటర్ సప్లిమెంటరీ స్పాట్ వాల్యుయేషన్కు ఇంటర్బోర్డు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సప్లిమెంటరీ పేపర్లను దిద్దుబాటు చేసేందుకు జిల్లాకు 55 వేల జవాబుపత్రాలు చేరుకున్నాయి. స్పాట్ వాల్యుయేషన్కు క్యాంప్ ఆఫీసర్గా ఆర్ఐఓ మొదలవలస కృష్ణవేణి వ్యవహరిస్తుండగా, జనరల్–1గా జి.వెంకటేశ్వరరావు, జనరల్–2 సత్యన్నారాయణ వ్యవహరించనున్నారు. మిగిలిన ఏసీఓలు, సీఈ లు, ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్ల నియామక పత్రాలు ఇప్పటికే కాలేజీల లాగిన్లో పొందుపర్చారు. ఆదివారం నుంచి తొలివిడతగా జరగనున్న దిద్దుబాటులో సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, హిస్టరీ, మాథ్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్ పేపర్లు జవాబుపత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. ఈనెల 9 నుంచి మొదలయ్యే రెండవ విడతలో ఎకనామిక్స్, కామర్స్, సివిక్స్, కెమిస్ట్రీ పేపర్ల జవాబుపత్రాలకు మూల్యాంకనం చేపట్టనున్నారు. -
బోయిన వ్యాఖ్యలు సరికాదు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు గొప్ప విజయంగా అభివర్ణించడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ కళింగ వైశ్య బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు అంధవరపు సూరిబాబు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ పాలనపై బోయిన గోవిందరాజులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. గ్రామ స్వరాజ్యం వల్లే రామరాజ్యం ఏర్పడుతుందన్న మహాత్ముడి కలలను నిజం చేసిన గొప్ప పరిపాలనాదక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని స్పష్టం చేశారు. సుమారు లక్షా నలభై వేల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని, దేశంలోనే అత్యుత్తమ సీఎంగా అనేక మంది జాతీయ స్థాయి ప్రముఖులు గుర్తించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దళారీ వ్యవస్థను రూపుమాపి ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలను అందించారని గుర్తు చేశారు. జగన్ను విమర్శించే స్థాయి గోవిందరాజులుకు లేదన్నారు. 56 మందిని కుల కార్పొరేషన్ చైర్మన్లుగా, 672 మందిని డైరెక్టర్లుగా నియమించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఇప్పటికై నా గోవిందరాజులు కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ పదవిని కుల శ్రేయస్సుకు వినియోగించి సేవ చేయాలని హితవు పలికారు. ఈ పదవితో పాటు రాష్ట్ర కళింగ వైశ్య సంక్షేమ సంఘ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అర్హత గల వేరొక అనుభవశాలికి ఇచ్చి కుల అభ్యున్నతికి దోహదపడాలని కోరారు. -
కూటమి నాయకుల దౌర్జన్యం
సంతబొమ్మాళి: మండలంలోని దండుగోపాలపురంలో పబ్లిక్ ప్లే గ్రౌండ్ ఆక్రమణకు కూటమి నాయకులు శుక్రవారం దౌర్జన్యం చేశారు. వి వరాల్లోకి వెళితే.. దండుగోపాలపురంలో పబ్లిక్ ప్లే గ్రౌండ్ కోసం గ్రామస్తులందరూ కొంత స్థలాన్ని ఇచ్చారు. ఆ స్థలంలో గ్రంథాలయం, ఆటస్థలం, కళామందిర్ ఏర్పాటు చేశారు. ఆ స్థలం చుట్టూ 1998లో ప్రహరీ నిర్మాణానికి పంచాయతీ అనుమతి ఇవ్వడంతో నిర్మాణం చేపట్టారు. ఈ స్థలంపై స్థానిక అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. లీజు దస్తా ఒప్పందం పత్రాలను సృష్టించి స్థలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో కేసు ఉన్నప్పటికీ శుక్రవారం కూటమి నాయకులు 20మందితో మారణాయుధాలతో వచ్చి ప్రహరీని కూల్చి సిమెంట్ బెంచీలను విరగ్గొట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన కొందరు గ్రామస్తులపై దాడికి ప్ర యత్నించారు. అడ్డుకుంటే కేసులు పెడతామని బెదిరించారు. ఫిర్యాదు చేస్తే కేసులు తప్పవని హెచ్చరించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ తతంగమంతా పోలీసుల సమక్షంలో జరగడం కొసమెరుపు. -
అలెర్ట్..!
● గ్యాస్ ఎవరి పేరుమీదో ఉందో సరిచూసుకోవాలి ● మృతుల పేరుతో జిల్లాలో 14 వేల కనెక్షన్లు ● ఈకేవైసీ చేయించుకోని వారు 10 వేల మంది ●కఠిన ఆంక్షలు పెడితే సరఫరా నిలిచిపోయే ప్రమాదం హిరమండలం: గ్యాస్ వినియోగదాలకు కీలక సూచన. గ్యాస్ సిలిండర్ ఎవరి పేరు మీద ఉందో స్పష్టంగా చూసుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. జిల్లాలో చాలా గ్యాస్ కనెక్షన్లు మృతుల పేరుతోనే ఉన్నాయి. దాదాపు ఇలా 14 వేల కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరో 10 వేల మంది వినియోగదారులు ఈకేవైసీ కూడా చేయించుకోలేదు. అయితే ప్రస్తుతం పశ్చిమా ఆసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్పై అనేక ఆంక్షలు ఉన్నాయి. ఈ తరుణంలో మృతుల పేరుతో కనెక్షన్లు, ఈకేవైసీ చేయించుకోని వారి కనెక్షన్లను తొలగించే అవకాశముంది. ఈ విషయంలో గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. మృతుడి సంబంధిత వివరాలు, కుటుంబ అనుబంధ ఫొటోలు, ఇతర ధ్రువపత్రాలతో వెళ్తే కుటుంబ సభ్యుల పేరుతో మార్చే అవకాశం ఉంది. జిల్లాలో హెచ్పీసీఎల్, భారత్, ఇండేన్ గ్యాస్ వినియోగదారులు అధికం. ప్రస్తుతం ఓటీపీ ఆధారిత సేవలు మాత్రమే అందుతున్నాయి. అందుకే ఏక్షణం అయినా కేంద్ర ప్రభుత్వం మృతుల పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్లు, ఈకేవైసీపీ పూర్తిచేయని వారి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందువలన సరైన ధ్రువపత్రాలు జతచేసి సరిచేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ సంస్థలు సూచిస్తున్నాయి. మృతుల పేరుతో ఉండే గ్యాస్ కనెక్షన్లు రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఈకేవైసీ చేయించకపోయినా సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే సంబంధిత పత్రాలతో వెళ్లి సరిచేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు. – సూర్యప్రకాశరావు, డీఎస్వో, శ్రీకాకుళం -
వంచనకు C/Oబాబు
శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు ధర్మాన రామ్మనోహర్నాయుడు తదితరులు ప్రజలకు వెన్నుపోటు హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఆడబిడ్డ నిఽధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్ వంటివి చెప్పి నిలువునా ముంచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయి. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు రెండేళ్ల పాలనపై వైఎస్సార్ సీపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఎర్రటి ఎండలో నినాదాలు చేస్తూ సర్కారు తీరును తూర్పారబట్టారు. 50 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి మాటేమిటని నిలదీశారు. ఆడబిడ్డ నిధి గురించి పట్టింపు ఉందా.. అని అడిగారు. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అంటూ జనాలకు గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. – సాక్షి నెట్వర్క్ పలాస నియోజకవర్గంలో.. పలాస నియోజకవర్గం పరిధిలోని పలాస, కాశీబగ్గ మున్సిపాలిటీలో జరిగిన నిరసన కార్యక్రమంలో అధికసంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మాజీమంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. నరసన్నపేట నియోజకవర్గంలో... జలుమూరు మండలంలోని చల్లవానిపేటలో, సారవకోటలో వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో చించివేసి నిరసన తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో.. వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకుడు ధర్మాన రామ్మనోహర్నాయుడు శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులతో కలిసి శుక్రవారం శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలి వద్ద ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చించివేసి ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ, ఎచ్చెర్ల నియోజకవర్గ పరిశీలకుడు పెనుమత్స సురేష్రాజు, ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ ఆధ్వర్యంలో రణస్థలం మండలం కోష్ట గ్రామంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జి.సిగడాం మండల కేంద్రంలోనూ వైఎస్సార్ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. టెక్కలి నియోజకవర్గంలో.. టెక్కలి నియోజకవర్గం పరిధిలోని సంతబొమ్మాళి మండలంలో కార్యక్రమం జరిగింది. టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టో చించివేసి నిరసన తెలియజేశారు. టెక్కలి పట్టణంలో కూడా నిరసన కార్యక్రమం జరిగింది. -
‘అనుకూల విత్తనాలు ఎంచుకోండి’
ఆమదాలవలస: ఎల్ నినో కారణంగా రానున్న ఖరీఫ్ కాలంలో వర్షాలు తక్కువగా కురుస్తాయని, వర్షాధారానికి అనుకూలమైన విత్తనాలను రైతులు ఎంపిక చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.శ్రీనివాసరావు సూచించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం దృష్ట్యా రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక, కొనుగోలు, విత్తన శుద్ధి వంటి అంశాలపై స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన ‘ఖరీఫ్ విత్తన దినోత్సవం’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విత్తన ఉత్పత్తిలో మెలకువలు, విత్తన శుద్ధి వంటి ప్రాథమిక అంశాలతో పా టు, భారత వ్యవసాయ శాఖ పిలుపు మేరకు, కేత్ బచావో అభియాన్(భూసార సంరక్షణ) అంశాల్ని ప్రతి రైతు పాటించాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ పథకం డైరెక్టర్ పి.సత్యనారాయణ మాట్లాడుతూ నేలను నిరంతరం అనేక రకాల పంటలతో కప్పి ఉంచడం వల్ల, నేల సారం పెరగడమే కాక రైతులకు నిరంతర ఆదాయం పొందవచ్చని తెలిపారు. పచ్చి రొట్ట పంటలు సాగు విధానాలు, నేల సంరక్షణ, వివిధ పంటలలో రకాల ఎంపిక వంటి అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జ్యోతి బసు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భూసార పరీక్ష కేంద్రం ఏడీఏ, రవి కుమార్, మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు పాల్గొన్నారు. ‘ఇంధన ధరలు తగ్గించాల్సిందే’ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పెంచిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని, మన రాష్ట్రంలోని కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్, చమురులో 50 శాతం వాటా మనకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో అంబేడ్కర్ జంక్షన్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు పాపం కేంద్రానిదేనని అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా లీటరు పెట్రోలు ధర రూ.118కి చేరిందన్నారు. ఏపీలో వ్యాట్ పేరుతో అదనపు భారం మోపుతున్నారన్నారు. దేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ రేటని అన్నారు. దీని వల్ల అన్ని వస్తువుల ధర లు పెరిగిపోయాయని తెలిపారు. భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యం : కలెక్టర్ వజ్రపుకొత్తూరు రూరల్: దీర్ఘకాలికంగా ఉన్న భూ సమస్యలను పరిష్కారం చేయడంతో పాటు భూ రికార్డుల సవరణ చేసి భూ వివాద రహిత రెవెన్యూ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్రామ స్థాయి కేంద్రంగా సేవలు అందిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలో గల నువ్వలరేవులో శు క్రవారం వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామంలో ఒక నెలలో 4 విడతలుగా అధికారులు పర్యటించి అర్జీదారుడి ఫిర్యాదు మేరకు భూ వివాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఉప్పుటేరు వంతెన నిర్మాణం కోసం అప్రోచ్ రోడ్డు పనులు వారం రోజుల్లోగా ప్రారంభం కాకపోతే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నువ్వలరేవు గ్రామానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి మువ్వల నగేష్ మృతిపై టీడీపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట ఇచ్చి ఇంత వరకు న్యాయం చేయలేదని బాధితులు కలెక్టర్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో అపశృతి నువ్వలరేవులో శుక్రవారం నిర్వహించిన వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్ కార్యక్రమంలో అపశృతి జరిగింది. ఈ కార్యక్రమంలో అధికారుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అధికారులు అప్రమ త్తమై టెంట్ను చేతితో పైకి ఎత్తారు. ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
అధిక దిగుబడులు సాధ్యం
విత్తనం సరైనది ఎంపిక చేసుకొని రైతులు పంట పొలాల్లో వేసి.. పంట యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి అధికంగా వస్తుంది. రైతులు ముంపు ప్రాంతాలు, మెరక ప్రాంతాలకు అనువైన రకాలు, విత్తనాలు విడివిడిగా ఎంపిక చేసుకొని విత్తన శుద్ధిచేసి జల్లుకోవాలి. దీంతో పాటు కలుపు నివారణకు సరైన సమయాల్లో శాస్త్రవేత్తలు సూచించిన మందులను వినియోగిస్తే రైతులకు తక్కువ ఖర్చుతో దిగుబడులు పెరుగుతాయి. – డాక్టర్ జి.చిట్టిబాబు, ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త, ఆమదాలవలస -
మేలైన విత్తనం.. దిగుబడి అనుకూలం..!
ఆమదాలవలస: ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లో కొంతమంది రైతులు పంట పొలాల్లో వరి విత్తనాలు వెదలు జల్లేందుకు సిద్ధం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 1.82,000 హెక్టార్లలో వరిసాగుకు రైతులు పంట పొలాలు సిద్ధం చేశారు. అయితే అనుకూలమైన, నాణ్యమైన వరి విత్తన ఎంపికతోనే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.చిట్టిబాబు, ఆమదాలవలస ఏవో ఎం.మోహన్రావులు సూచిస్తున్నారు. దీనిపై రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. స్వర్ణ (ఎంటీయూ 7029) స్వర్ణ (ఎంటీయూ 7029) ఖరీఫ్ సీజన్కు అనుకూలమైన విత్తనం. 150 రోజుల పంటకాలం. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ మూడు వారాలు. ఎండకు, తెగులును తట్టుకొని నిలబడగలదు. వివిధ రకాల భూముల్లో, ఇతర వాతావరణ పరిస్థితుల్లో, అలాగే రెండు పంటలు పండించు ప్రాంతాలకు స్థిరమైన దిగుబడి నిచ్చే సన్నని గింజ రకం ఇది. తక్కువ నత్రజని వినియోగంతో అధిక దిగుబడినిస్తుంది. ఇంద్ర (ఎంటీయూ 1061) ఇంద్ర (ఎంటీయూ 1061) రకం పంటకాలం 150 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు నుంచి మూడు వారాలు. సుడిదోమ పోటును తట్టుకోగలదు. సన్నని గింజ, చేను పడిపోదు. పది రోజుల వరకు ముంపును, కొద్దిపాటి చౌడును తట్టుకోగలదు. తినేందుకు బియ్యం అనుకూలంగా ఉంటాయి. సోనా మసూరి (బీపీటీ 3291) సోనామసూరి (బీపీటీ 3291) ఖరీఫ్ కాలానికి అనుకూలమైన విత్తనం. 135 నుంచి 140 రోజుల పంటకాలం. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. అగ్గి తెగులును తట్టుకొని నిలబడుతుంది. గింజ సన్నంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్ 2537) శ్రీకాకుళం సన్నాలు (ఆర్జీఎల్ 2537) ఖరీఫ్ కాలానికి ఈ విత్తనం అనుకూలం. పంటకాలం 165 రోజులు. ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉల్లి కోడును తట్టుకుని నిలబడుతుంది. సన్న బియ్యం 60 రోజుల వరకు నాటుకోవచ్చు. చేను గాలికి పడిపోదు. సాంబ మసూరి(బీపీటీ 5204) సాంబ మసూరి (బీపీటీ 5204) విత్తనం ఖరీఫ్, రబీ కాలానికి అనుకూలం. 145 నుంచి 150 రోజులు పంట కాలం. ఎకరాకు 25 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ 4 వారాలు. సన్న బియ్యం అన్నం మృదువుగా రుచిగా ఉండి మెతుకులు ఒకదానికొకటి అతుక్కోకుండా అన్నం తినేందుకు బాగుంటుంది. గ్లెసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా ఈ రకం ధాన్యం ద్వారా పండించే బియ్యాన్ని తినడానికి అనుకూలం. పుష్యమి (ఎంటీయూ 1075) పుష్యమి (ఎంటీయూ 1075) రకం ఖరీఫ్ సీజన్కు అనుకూలం. 135 రోజుల పంట కాలం. 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అగ్గి తెగులును, దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. సన్న బియ్యం అలాగే చేను పడిపోదు. అమర (ఎంటీయూ 1064) అమర (ఎంటీయూ 1064) పంటకాలం 150 రోజులు. ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ మూడు వారాలు. దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. బియ్యం సన్నగా ఉండి గింజ రాలదు, చేను పడిపోదు. ముంపును బాగా తట్టుకుని నిలబడుతుంది. శ్రీధృతి (ఎంటీయూ 1121) శ్రీధృతి (ఎంటీయూ 1121) పంటకాలం 120 నుంచి 125 రోజులు. ఎకరాకు 24 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుంది. అగ్గి తెగులు, దోమపోటును తట్టుకొని నిలబడుతుంది. కాండం ధృడంగా ఉండి చేను పడిపోదు. మధ్యస్థ సన్నరకం అన్నానికి బాగుంటుంది. నేరుగా విత్తే విధానంలో సాగుకు అనుకూలమైనది. సుజాత (ఎంటీయూ 1210) సుజాత (ఎంటీయూ 1210) రకం పంటకాలం 125 నుంచి 135 రోజులు. సార్వాలో 26 నుంచి 28 కింటాళ్ల దిగుబడి, దాళ్వాలో 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. దోమపోటు, అగ్గి తెగులును తట్టుకుని నిలబడుతుంది. కాండం ధృడంగా ఉండి చేను పడిపోదు. గింజ రాలడం తక్కువ. నేరుగా విత్తే విధానానికి అనుకూలం. మార్టేరు సాంబ (ఎంటీయూ 1224) మార్టేరు సాంబ (ఎంటీయూ 1224) రకం పంటకాలం 135 రోజులు. 26 నుంచి 28 క్వింటాళ్ల వరకు ధాన్యం దిగుబడి వస్తుంది. గింజ నిద్రావస్థ రెండు వారాలు. దోమపోటును తట్టుకుని నిలబడుతుంది. పంట చేను పడిపోదు. బియ్యం పారదర్శకంగా ఉండి అన్నానికి అనుకూలంగా ఉంటుంది. వరి విత్తనాలు -
తీర్థయాత్రలకు వెళ్లి వృద్ధుడు మృతి
సారవకోట: అన్నుపురం గ్రామానికి చెందిన తాడేల శ్రీరాములు (85) తీర్థయాత్రలకు వెళ్లి గురువారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. 15 రోజుల క్రితం గ్రామానికి చెందిన పలువురితో కలిసి శ్రీరాములు బస్సులో తీర్ధయాత్రలకు బయల్దేరాడు. గురువారం రాత్రి బద్రీనాథ్లో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో తోటి ప్రయాణికులు సపర్యలు చేశారు. అనంతరం కాసేపటకి ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి వివాహితులైన నలుగురు కుమారుల, ఇద్దరు కుమార్తెలున్నారు. మృతదేహాన్ని స్వగ్రామం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు రణస్థలం : జె.ఆర్.పురం పంచాయతీకి చెందిన కొయ్యాన తనీష్, తలే రాకేష్లు ద్విచక్రవాహనంపై విశాఖ వైపు నుంచి రణస్థలం వైపు వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున కోష్ట ఫ్లై ఓవర్పై అదుపు తప్పిపడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో తొలుత శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి ఒకరిని శ్రీకాకుళం, మరొకరికి విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు నేత్రాలు సజీవం శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని మొండేటి వీధికి చెందిన లంకపల్లి శ్రీనివాసరావు (58) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మృతుడి భార్య నాగమణి, ఎల్.చలపతిరావులు నేత్రదానానికి అంగీకరించి రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియచేశారు. నేత్రదాన మోటివేటర్ డి.వలసయ్య సమన్వయంతో మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు పూతి సుజాత, పి.చిన్ని కృష్ణలు శ్రీనివాసరావు కార్నియాలను సేకరించి వాటిని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. ఎవరైనా నేత్రదానం చేయాలనుకుంటే 78426 99321 నంబర్ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. -
శ్రీకాంత్ శిష్య బృందానికి ప్రత్యేక గుర్తింపు
శ్రీకాకుళం కల్చరల్: జిల్లాకు చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు డాక్టర్ రఘు పాత్రుని శ్రీకాంత్ శిష్యబృందం దూరదర్శన్ కేంద్ర హైదరాబాద్, దూరదర్శన్ కేంద్ర ఢిల్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళాకారుల గ్రేడ్ అక్రిడిటేషన్ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచారు. సీనియర్ విద్యార్థి రామ కౌండిన్య ‘ఏ’ గ్రేడ్ అక్రిడిటేషన్ పొంది, ఈ ఘనతను సాధించిన జిల్లా తొలి కళాకారుడిగా నిలిచారు. సీనియర్ విద్యార్థినులు డొంకాడ నేహ, డి. హిమబిందు, వోలేటి శాశ్వత ఐశ్వర్య ‘బి’ గ్రేడ్ అక్రిడిటేషన్ పొందారు. విద్యార్థుల కృషి, అంకితభావం, క్రమశిక్షణ, నిరంతర సాధన, గురువు మార్గదర్శకత్వం ఈ విజయానికి కారణమని పలువురు కళాభిమానులు అభినందించారు. రాష్ట్ర ఉత్తమ వసతి గృహాధికారిగా సునీత టెక్కలి: ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో టెక్కలి గిరిజన కళాశాల బాలికల వసతి గృహం విద్యార్థినులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచడంతో వార్డెన్ డి.సునీతను ఉత్తమ వసతి గృహం అధికారిగా గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో మంత్రి సంధ్యారాణి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేశారు. ఈమెతో పాటు విద్యార్థులు పి.శ్రీదేవి, జె.సౌజన్య తదితరులు అవార్డులు అందుకున్నారు. సీఏఏక్యూఎం స్టేషన్ ప్రారంభం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రతిఒక్కరూ చిన్న వయస్సు నుంచే పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటిన్యూయస్ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్(సీఏఏక్యూఎం) స్టేషన్ను కేంద్రమంత్రి శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. సిబ్బంది సంక్షేమానికి కృషి శ్రీకాకుళం క్రైమ్ : ఉద్యోగ రీత్యా, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేలా, పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషిచేసేలా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ప్రతి శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే డయల్ యువర్ ఎస్పీ (పోలీస్ గ్రీవెన్సు)కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందన్నారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది నేరుగా తన నెంబరు 6309990800కు డయల్ చేసి లీవులు, సర్వీసు అంశాలు, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. -
వరద కట్ట మాయం
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలోని మహేంద్రతనయ నది, శ్మశాన వాటిక పరిసర ప్రాంతంలో 2025 మార్చిలో వరదకట్ట పనులు చేపట్టారు. ఈ పనులను ఉపాధిహామీ సిబ్బంది సామాజిక తనిఖీ అధికారులకు చూపించాల్సి ఉంది. అయితే ఇక్కడ ఎటువంటి వరదకట్ట నిర్మాణం కానరావడం లేదు. పక్కనే మెళియాపుట్టి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. వరదకట్టను పూర్తిగా జేసీబీతో మహేంద్రతనయ నదిలోకి తోసేసి అక్కడ ఇటుకలు కాల్చడానికి ఉపయోగించే కట్టెలు ఇతర సామాగ్రి డంప్ చేస్తున్నాడు. మహేంద్రతనయ నదీగర్భంలో చెత్తాచెదారాలతో పాటు విరిగిన ఇటుకలు వేస్తుండటంతో కొంచెం కొంచెంగా నదీ గర్భం సన్నగిల్లుతోంది. దీనిపై క్షేత్రసహాయకుడు అధికారులకు సైతం తెలియజేశారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే సదరు వ్యక్తి కొద్దిరోజుల్లో నది గర్భాన్ని ఇటుకల ఫ్యాక్టరీలా మార్చుతారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వరద ఉధృతి నియంత్రణకు లక్షలాది రూపాయల కేంద్రప్రభుత్వ నిధులతో పనులు చేయిస్తూ ఉంటే.. ఓ ప్రయివేట్ వ్యక్తి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
రణస్థలం: కమ్మ సిగడాం సెంటర్లో శుక్రవారం శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ బి.రామారావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన పీడీఎస్ బియ్యాన్ని ఒక ఆటోలో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన కరిమిన ప్రసాదరావు రణస్థలం తీసుకొస్తుండగా కమ్మసిగడాం సెంటర్ దగ్గరలో పట్టుకున్నారు. కోళ్ల ఫారాలు, ఇటుక బట్టీ నిర్వాహకులకు అధిక ధరకు బియ్యం అమ్మకాలు జరిపేందుకు తీసుకొస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలింది. పట్టుకున్న 860 కేజీల బియ్యాన్ని సివిల్ సప్లయ్ డీటీ అరుణకుమారికి అప్పగించారు. ఆమె కమ్మసిగడాం రేషన్ దుకాణానికి తరలించారు. ఆటోను జె.ఆర్.పురం పోలీసు స్టేషన్కు అప్పగించారు. ప్రసాద్పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. -
వ్యర్థ రహిత పాఠశాలలుగా తీర్చిదిద్దాలి
శ్రీకాకుళం రూరల్: పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లాలోని విద్యాసంస్థలను నెట్ జీరో (కార్బన్ ఉద్గారాల రహిత) పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. పెదపాడు పంచాయతీ శాస్త్రులపేటలో మహాత్మాజ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నెట్ జీరో సాధన దిశగా అన్ని పాఠశాల్లో విద్యుత్ వినియోగాన్ని క్రమబద్ధీకరించాలని, ఎలాంటి చెత్త వ్యర్థాలు చేరకూడదని స్పష్టం చేశారు. తడిపొడి వ్యర్థాలను వేరుచేసి సేంద్రియ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతలు నిర్మాణం, హరిత ఇందనం వినియోగం వంటి పద్ధతులను అవలంబించుకోవాలన్నారు. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకం, గ్యాస్ ఉద్గారాల వల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలగడమే కాకుండా కార్బన్ డయాకై ్సడ్ విడుదలై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు. గురుకుల పాఠశాలలను నెట్ జీరోగా మారిస్తే అదనపు వనరులను కల్పిస్తామన్నారు. పాఠశాల్లో మైనర్ మరమ్మతుల కోసం రూ.70 లక్షలు మంజూరు చేశామన్నారు. అసంపూర్తిగా ఉన్న 500 మీటర్లు కాంపౌడ్ వాల్, స్కూల్ అప్రోచ్ రోడ్డు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బీసీ సంక్షేమ అధికారి అనురాధ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నెట్జీరో భావనను జిల్లాలోని ఎంపీజే గురుకులాల్లో అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా అటవీశాఖాధికారి జ్ఞాన ప్రసూన, పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.జయశ్రీ, సిబ్బంది పాల్గొన్నారు. -
సింగుపురంలో వైద్య బృందం పరిశీలన
కాలువల్లో రసాయనాలు స్ప్రే చేస్తున్న సిబ్బందిగ్రామంలో వైద్య సేవలపై ఆరా తీస్తూ.. శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో డయేరియాపై అధికారులు స్పందించా రు. వైద్యారోగ్యశాఖతో పాటు ఎంపీడీఓ కార్యాల య సిబ్బంది కలిసి ఆరు టీమ్లుగా గ్రామాన్ని శుక్రవారం జల్లెడ పట్టారు. 17 మంది ఏఎన్ఎంలు, 8 మంది ఆశ వర్కర్లు, ఇద్దరు డాక్టర్లతో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటిని పరిశీలించారు. ఇంటిలో ఎంత మంది ఉంటున్నారు. ఎవరైనా అనారోగ్యానికి గురయ్యారా..? వంటి వివరాలను ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పరిశీలించారు. పారిశుద్ధ్య పనులు గ్రామంలో 7 వీధుల్లో శానిటేషన్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. కాలువల్లో పూడికలు తీయడం, రోడ్ల వెంబడి చెత్త చెదారం లేకుండా క్లీన్ చేయడం చేస్తున్నారు. మంచినీటి పైపులు ఎక్కడైనా డ్రైనేజీలో మరమ్మతులకు గురైతే తక్షణమే వాటిని బాగు చేసే దిశగా సచివాలయ సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 30 మంది వరకూ వాంతులు విరేచనాలతో ఆస్పత్రిలో చేరగా.. కొందరిని డిశ్చార్జ్ చేశారు. నీటిని పరీక్షించాం సింగుపురం గ్రామానికి సంబంధించి మంచినీటి నమూనా పరీక్షలను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఒకసారి శ్రీకాకుళంలోనూ, మరోసారి టెక్కలిలో ల్యాబ్లకు పంపించారు. వచ్చిన రిపోర్టుల్లో కలు షిత ఆనవాళ్లు లేవు. మరోసారి వైజాగ్కు నీటి నమూనాలు పంపిస్తాం. – శ్యామ్, పంచాయతీ సెక్రటరీ -
అవయవదానంతో పునర్జన్మ
బూర్జ: బూర్జ గ్రామానికి చెందిన సూరి పుండరీకాక్షయ్య (44) రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో కిడ్నీవ్యాధితో చికిత్స పొందుతూ వైద్యం పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అవయవదానం చేసి మరొకరికి పునర్జన్మనిచ్చారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పుండరీకాక్షయ్య మూడేళ్ల కిందట అనారోగ్యానికి గురయ్యారు. రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. కొంతమంది మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ జీవన్ దాన్లో కిడ్నీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే అవయక దానం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో గురువారం అర్ధరాత్రి తరువాత మృతి చెందారు. ఆసుపత్రి యాజమాన్యం కుటుంబీకుల అంగీకారంతో అవయవదాన ప్రక్రియ పూర్తి చేసింది. అనంతరం మృతదేహాన్ని జెమ్స్ ఆస్పత్రి నుంచి బూర్జ గ్రామం వరకు బైక్ ర్యాలీగా తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్గా పనిచేసిన పుండరీకాక్షయ్యకు భార్య ప్రశాంతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
లైసెన్స్ లేకుండా మందుల విక్రయం
ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలో లైసె న్స్ లేకుండా అల్లోపతి మందులను విక్రయిస్తున్న ఆర్ఎంపీ వైద్యుడి ఇంటిపై ఔషధ నియంత్రణ శాఖాధికారులు దాడులు నిర్వహించి సుమారు రూ.లక్ష విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళితే... లొద్దపుట్టి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు ఎ.అమిత్రాజ్రెడ్డి తన నివాసంలో సరైన అనుమతులు, లైసెన్స్ లేకుండా అల్లోపతి మందులు నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు.. గురువారం ఔషధ నియంత్రణశాఖ సహాయ సంచాలకులు ఎం.చంద్రరావు, టెక్కలి డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎన్.యుగంధరరావులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి అల్లోపతి మందులను గుర్తించి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా మందుల నిల్వ, విక్రయాలు చేయడం ఔషధ చట్టం –1940 నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న మందులపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని వెల్లడించారు. -
పర్యావరణం.. ఎవరు కారణం..?
చట్టాలు అమలు చేయాలి పర్యావరణపరిరక్షణ కోసం ప్రభుత్వా లు చేస్తున్న చట్టాలు, కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేయాలి. ప్లాస్టిక్తో జరిగే అనర్థాలపై ప్రజలను చైతన్యపరచాలి. – బోనెల గోపాల్, గ్రీన్ ఆర్మీ సేవా సంస్థ వ్యవస్థాపకులు అమ్మితే కఠిన చర్యలు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ అమ్మకాలు చేపడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మా పరిధిలో ప్లాస్టిక్ని పట్టుకొ ని సీజ్ చేశాం. అమ్మకందారులపై జరిమానా వేశాం. – శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ వజ్రపుకొత్తూరు రూరల్: తీరాల్లో ప్లాస్టిక్ సంచులు, నదుల్లో ప్లాస్టిక్ డబ్బాలు, కాలువల్లో పాలిథీన్ క్యారీ బ్యాగులు, వీధుల్లో, మలుపులలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. అంతెందుకు పశువుల కడుపుల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఏటా ప్రజలు విని యోగించి విసిరి పారేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థా లు ఇలా మొత్తం విస్తరించేస్తున్నాయి. నియంత్రణ చర్యలు లేకపోవడం, స్వీయ నియంత్రణ పాటించకపోవడంతో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. చర్యలు ఉన్నాయా..? దుకాణాలు, ఇతర వ్యాపారాల్లో విచ్చల విడిగా ప్లాస్టిక్ వస్తువులు, సంచులు అమ్మకాలు చేపడుతుంటే ప్రజా ప్రతి నిధులు, అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నియంత్రణ చేయాలని, దీని కోసం ప్రభుత్వాలు ప్లాస్టిక్ అమ్మకందారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మున్సిపల్ కమిషనర్ ప్లాస్టిక్ అమ్మకాల షాపుపై దాడులు చేసి 3000 కిలోల ప్లాస్టిక్ సామగ్రిని సీజ్ చేశారు. అయితే ఆ ప్లాస్టిక్ని ఏం చేశారన్న విషయాన్ని ఇంత వరకు మీడియాకు అధికారులు చెప్పకపోవడంతో పాటు షాపు యజమానులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. అదే పలాస–కాశీబుగ్గలో ఉన్న ప్లాస్టిక్ దుకాణదారులు సిండికేట్గా భారీ మొత్తంగా డబ్బులు వసూలు చేసి అధికారులకు ఇచ్చినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. -
‘మ్యాపింగ్ వేగవంతం చేయండి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) – 2026 ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని, క్షేత్రస్థాయి మ్యాపింగ్ పనులను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, తహసీల్దార్లు, బీఎల్ఓలతో ప్రత్యేకంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆయన సర్ ప్రక్రియ ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,088 మంది బీఎల్ఓలలో అత్యధిక శాతం మంది మ్యాపింగ్ను సమర్థంగా పూర్తిచేశారని, మిగిలిన 60 మంది బీఎల్ఓలు కూడా తమ పరిధిలోని పనులను త్వరితగతిన పూర్తి చేసే లా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. రాబోయే ఇంటింటి సర్వే ప్రారంభానికి ముందే సాంకేతిక సమస్యలన్నింటినీ అధిగమించి, మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి పారదర్శకతతో పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఎచ్చెర్ల: ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెం గ్రామానికి చెందిన పి. రత్నకుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈమె భర్త, పిల్లలతో కలిసి విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ గత ఎనిమిదేళ్లుగా జీవనం సాగిస్తున్నా రు. వీరు బాటిల్స్ ఏరుకుంటూ జీవిస్తున్నారు. భర్త బయటకు వెళ్లి గురువారం తిరిగి వచ్చి చూస్తే భార్య చనిపోయి ఉంది. పోలీసులకు వి వరాలు తెలియపరచడంతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. జి.సిగడాం: పాలఖండ్యాం గ్రామానికి చెందిన డొప్ప అప్పన్నకు చెందిన గొర్రెల మందపై గురువారం వీధి కుక్కలు దాడి చేయడంతో 10 గొర్రెలు చనిపోయాయి. మరో ఆరు గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గ్రామంలో ఉన్న సు మారుగా 20 కుక్కలు ఒకేసారి గొర్రెలపై దాడి చేశాయని బాధితుడు వాపోయారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని అదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రణస్థలం: మండల కేంద్రంలోని జేఆర్ పురం పంచాయతీలో గల వెంకటేశ్వర కాలనీలో షేక్ సాజహన్ ద్విచక్ర వాహనం (గ్లామర్ బైక్) గుర్తు తెలియని వ్యక్తి బుధవారం తీసుకువెళ్లిపోయాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో అటూ ఇటూ చాలా సేపు తిరిగి ద్విచక్ర వాహ నం నడిపించుకుని వెళ్లిపోయాడు. ఈ దొంగత నం సమీపంలోని సీసీ పుటేజ్లో నమోదైంది. ఈ చోరీ గురువారం సోషల్ మీడియా ద్వారా బహిర్గతమైంది. దీనిపై జేఆర్ పురం పోలీసు లు ఇంకా కేసు నమోదు చేయలేదు. -
ఉద్యానానికి ఊతమేది..?
● ఉద్యాన పంటలపై ప్రభుత్వానికి ఉదాసీనత ● పెద్దపేట పరిశోధన కేంద్రానికి నిధులు మంజూరు చేయని వైనం ● అవస్థలు పడుతున్న శాస్త్రవేత్తలు బూర్జ: కొబ్బరి, మామిడి, జీడి వంటి పంటల మీద పరిశోధనలు చేసి.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనువైన కొత్త వంగడాల అభివృద్ధి, ఉద్యాన రంగానికి సంబంధించి రైతులకు శిక్షణలు ద్వారా అవగాహన కల్పించేందుకు మండలంలోని పెద్దపేటలో ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని 2022 ఆగస్టు 29వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. మొత్తం 77 ఎకరాలకు గా నూ సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో మేలైన కొబ్బరి, మామిడి, జీడి పంటలు తీసుకొచ్చేందుకు పరిశోధనలు చేయాలనేది ఉద్దేశం. దీనిలో భాగంగా ప్రస్తుతం 2 ఎకరాల్లో 160 కొబ్బరి మొక్కలపై పరిశోధనలు చేస్తున్నారు. కొత్త మొక్కలు రైతులకు అందజేయడం కోసం నర్సరీ తయారు చేశారు. నర్సరీలో మన ప్రాంతాలకు అనువైన రకాలు అభివృద్ధి చేసి రైతులకు సరఫరా చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలుపుతున్నారు. అయితే మరింత అభివృద్ధి కోసం సుమారు రూ.20 లక్షలు మంజూరు కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఉద్యాన శాఖ అధికారులు సమన్వయంతో ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం మూడు జిల్లాల రైతుల ప్రయోజనం కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, ఈస్ట్ కోస్టల్ టాల్ అనే రకం అభివృద్ధి చేసి రైతులకు అందజేయడం జరుగుతోంది. కొబ్బరి మొక్క రూ.100కు అందజేస్తున్నాం. నాణ్యమైన మొక్కల వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు. – జి.నరసింహమూర్తి, ప్రధాన శాస్త్రవేత్త, పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రం కొబ్బరి మొక్కలకు వర్షాలు బాగాపడి, గాలులు వీచినప్పుడు మొవ్వుకు కుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొబ్బరిలో కొమ్ము పురుగు ఆశించినప్పుడు మొవ్వు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అందువలన రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలి. జీడి, మామిడి పంట కోసే సమయంలో రైతులు చెట్ల మొదళ్లను గమనించాలి. తెగుళ్ల బారిన పడినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి. – టి.రాజశేఖరం, తెగుళ్ల విభాగం సీనియర్ శాస్త్రవేత్త, పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రం -
వ్యసనాలకు అలవాటు పడి.. దొంగలుగా మారి
నరసన్నపేట: ఉత్తరాంధ్రలో పలు చోరీ కేసుల్లో నిందితులైన విజయనగరం జిల్లా డెంకాడకు చెందిన మండూరి సంతోష్ కుమార్, బూర అశోక్ ఎట్టకేల కు నరసన్నపేట పోలీసులకు చిక్కారు. సత్యవరం సర్వీసు రోడ్డుపై అనుమానాస్పదంగా ఉన్న వీరిని పోలీసులు పట్టుకుని తమదైన శైలిలో ఆరా తీయగా పలు కేసుల్లో నిందితులుగా తేలింది. వీరి నుంచి రూ.23.64 లక్షల విలువైన 157 గ్రాముల బంగారం ఆభరణాలు, ఒక బజాజ్ పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావులు నరసన్న పేట సర్కిల్ స్టేషన్లో గురువారం విలేకరుల కు వివరాలు వెల్లడించారు. ఈ ఇద్దరు యువకులు కార్పెంటర్ వృత్తి చేసుకుంటూ కాలం గడుపుతూ వ్యసనాలకు బానిసలుగా మారారు. కార్పెంటర్ వృత్తిలో అంతగా డబ్బులు రాకపోవడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ప్రయత్నాల్లో భాగంగా దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖానికి మాస్క్లు పెట్టుకొని రోడ్డుపై ఒంటరి మహిళలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడ్డారని వివరించారు. వారిపై నరసన్నపేట, శ్రీకాకుళం రూరల్, పోలాకి, రామభద్రపురం, పెందుర్తి, గోపాలపట్నం పోలీసు స్టేషన్లలో 7 చోట్ల చోరీలకు పాల్పడగా కేసులు నమోదయ్యాయని అన్నారు. వీరిని గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. వీరిని అరెస్టు చేయ డంలో కృషి చేసిన నరసన్నపేట ఎస్ఐ బలివాడ గణేష్తో పాటు పలువురు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారని అన్నారు. సమావేశంలో నరసన్న పేట సీఐ మరడాన శ్రీనివాసరావులతో పాటు పలువురు ఎస్ఐలు పాల్గొన్నారు. -
నేటి నుంచే సర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల తయారీకి సంబంధించి భారత ఎన్నిక ల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ 5 నుంచి 11 వరకు ‘సర్’ నిర్వహణపై సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇస్తారు. 15 నుంచి బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తారు. ఓటర్ల జాబితా ప్రకారం ప్రస్తుతం అక్కడ ఓటర్లు ఉన్నదీ లేనిదీ పరిశీలిస్తారు. లేని ఓటర్లను తొలగింపు జాబితాలో చేర్చుతారు. అక్కడ ఓటు ఉంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుంటారు. ఒకే కుటుంబంలో ఉన్న వారి ఓట్లు ఒకే చోట ఉండేలా మ్యాపింగ్ చేస్తారు. మ్యాపింగ్ కాకపోతే.. ఓటరుగా మ్యాపింగ్ కాకపోతే ఇబ్బంది తప్పుదు. జిల్లాలోని ఎనిమిది నియోజవర్గాల పరిధిలో ప్రస్తు తం 18,91,782 మంది ఓటర్లు ఉన్నారు. ఎందులో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మంది ఓటర్లకు మాత్రమే మ్యాపింగ్ జరిగింది. ఇంకా 35 శాతం మంది ఓటర్లను మ్యాపింగ్ చేయాల్సి ఉంది. మ్యా పింగ్ కోసం ఈ నెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. మ్యాపింగ్ కాని వారు ఈ ప్రత్యే క డ్రైవ్లో మ్యాపింగ్ చేయించుకోవాలి. లేదంటే ఓటు పోయే ప్రమాదం ఉంది. ప్రధానంగా ఉద్యో గులు, స్థానికంగా ఉండని వారు, బీఎల్ఓలు వచ్చే సమయంలోనూ, ఈ మ్యాపింగ్ డ్రైవ్ సమయంలో లేని వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. బీఎల్ఓలే కీలకం ‘సర్’ విషయంలో బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలి. వీరికి రాజకీయ పార్టీలు నిజాయితీగా సహకరించాల్సి ఉంటుంది. ప్రతి ఓటరు మ్యాపింగ్ కావాలి. అందుకు కావాల్సిన డాక్యుమెంట్లు సరిచేసుకోవాలి. బీఎల్ఓలు ఇంటికి వచ్చినప్పుడు వారికి అందించాలి. ఓటరు స్థానికంగా లేనప్పుడు బంధువులు వారి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. పొరపాటున ఓటు తొలగిస్తే.. జూలై 21న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటిస్తారు. ఆ రోజు నుంచి ఆగస్టు 20 వరకు ఓటరుగా నమోదుకు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితాలో తప్పులు ఉండకూడదు తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రాజకీయ కోరారు. రాజకీయ పార్టీలతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)–2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026) ప్రక్రియపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. సర్ ప్రక్రియకు సన్నద్ధత, అధికారులు, సిబ్బందికి శిక్షణ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, ఎన్యూమరేషన్ ఫారాల (ఈఎఫ్) జనరేషనన్, ప్రింటింగ్, ఈఎఫ్ల అందజేత, బీఎల్ఓ కిట్లు, తదితరాల గురించి వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి జూన్ 5 నుంచి 14వ తేదీ వరకు సన్నద్ధత కార్యకలాపాలు జరుగుతాయని, ఆపై జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ద్వారా ఇంటింటి సర్వే జరుగుతుందని వివరించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జులై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఉంటుందని, ఆ తర్వాత వీటిని పరిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందని వివరించారు. ప్రతి పోలింగ్ కేంద్రం గరిష్టంగా 1200 మంది ఓటర్లకు మాత్రమే పరిమితం కావాలని, దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ జరగాలన్నారు. సర్ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నుంచి డి.మన్మధరావు, టీడీపీ నుంచి మొదలవలస రమేష్, పీఎంజేబాబు, బీజేపీ నుంచి బీఎల్ సింగ్, ఐటీ కుమార్, కాంగ్రెస్ నుంచి ఎస్.అన్నాజిరావు, కేవీఎల్ఎస్ ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
సుందర శ్రీకాకుళం ఏమైంది..?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నాగావళి నదిని మురికి నీటి నదిగా తయారుచేసి విధ్వంసానికి పాల్పడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు విమర్శించారు. శ్రీకాకుళం నాగావళి నదిలో కళ్లకు గంతలు కట్టుకొని జల కాలుష్యం నివారించాలని కోరుతూ బుధవా రం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో సుందర శ్రీకాకుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం అమలు చేస్తామన్న హామీని ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. మూడుసార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ఎందుకు నిధులు కేటాయించలేదని నిలదీశారు. నదిలో కలిసిన ము రుగునీరు తాగడం వల్లే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. నాగావళి జల కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామన్నారు. -
జాతీయ అప్రెంటిస్ మేళా
ఎచ్చెర్ల: జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్లలో ఈ నెల 8వ తేదీన సోమవారం జాతీయ అప్రెంటిస్ మేళాను నిర్వహించనున్నారు. ఈ మేళాకు జిల్లాలోని 7 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయి. 8వ తేదీ ఉదయం 9 గంటలకు జరిగే అప్రెంటిస్ మేళాకు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలలో వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందిన విద్యార్థులు మూడు బయోడేటాలతో పాటు ఐటీఐ, పదో తరగతి, ఆధార్ మూడు సెట్లు కలిగిన సర్టిఫికెట్లు, మూడు కలర్ ఫొటోలతో హాజరుకావాలని ప్రిన్సిపాల్ సుధాకర్ తెలిపా రు. జిల్లాలోని ప్రముఖ కంపెనీలు అరబిందో, శ్యాంపిస్టన్స్, బ్లూస్టార్, నోర్డిక్స్, స్మార్ట్కం, వరుణ్మోటార్స్ వంటి కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3.11 లక్షలు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం గురువారం లెక్కించారు. గడిచిన 71 రోజులకు గానూ రూ.3,11,196 వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడు కొండలు తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శివ ప్రసాద్ పాడి, ఆలయ పాలక మండలి సభ్యులు, పర్యవేక్షణ అధికారి ఎస్.నాగేశ్వరరావు, సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. ఎఫ్ఎన్ఓల జీతాల జాప్యంపై విచారణ అరసవల్లి: జిల్లా వైద్యారోగ్య శాఖలో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలకు ఈ ఏడాది మే నెల జీతాల చెల్లింపులో జాప్యం జరిగిందంటూ కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు, విభాగ బాధ్యులపై విచారణ చేపట్టారు. ఈమేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ సాయిప్రత్యూష, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, మైన్స్ ఏడీలతో కూడిన త్రిసభ్య కమిటీ స్థానిక డీఎంహెచ్ఓ కార్యాలయంలో గురువారం వి చారణ చేపట్టారు. మొత్తం జిల్లాలో 120 మందికి జీతాల చెల్లింపు జరగలేదని ఓ ఉద్యోగి కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో త్రిసభ్య కమిటీ డీఎంహెచ్ఓ అనిత, ఏఓ బాబూరావు, సూపరింటెండెంట్ల వద్ద సమాచారం సేకరించారు. విచారణ నివేదికను కలెక్టర్కు అందించనున్నారు. తదుపరి చర్యలపై కలెక్టర్ నుంచి ఆదేశాలు రానున్నాయని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. -
న్యూరాలజీలో గోల్డ్ మెడల్
ఆమదాలవలస: మున్సిపాలిటీ పరిధి రెండోవార్డు కృష్ణాపురానికి చెందిన యువ వైద్యురాలు డాక్టర్ చింతాడ మౌనిక న్యూరాలజీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. మౌనిక విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, అనంతరం అదే కళాశాలలో ఎండీ జనరల్ మెడిసిన్తో పాటు డీఎం సూపర్ స్పెషాలిటీ కోర్సు (న్యూరాలజీ)ను విజయవంతంగా పూర్తి చేశారు. తండ్రి రాజగోపాలరావు రాజమహేంద్రవరం జిల్లా లోక్ అదాలత్ చైర్మన్గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి భారతి గృహిణి. విజయవాడలో నిర్వహించిన స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతులమీదుగా మౌనిక గోల్డ్ మెడల్ అందుకున్నారు. -
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు
● నేడూ, రేపూ మండల కేంద్రాల్లో కూటమి మేనిఫెస్టో, సంతకాల బాండ్లు దహనం ● విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు కృష్ణదాస్ పిలుపు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: వెన్నుపోటుకు రెండేళ్లు.. ఇప్పుడు రాష్ట్రమంతా వినిపిస్తున్న మాట. మామను వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారని సాక్షాత్తు దివంగత ఎన్టీ ఆరే ఆనాడు చెప్పారు. ఎన్నుకున్న ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి ఆయన చేసేది ఇదే. ప్రతిపక్షంలో ఉండగా హామీలు ఇవ్వడం.. అధికారంలోకి వచ్చాక గాలికొదిలేయడం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాదు అధికారంలోకి కూడా వచ్చాక ఎడాపెడా హామీలు ఇవ్వడం.. అక్కడి నుంచి వెళ్లిపోయాక పట్టించుకోకపోవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పుడా వెన్నుపోటు పాలనను ప్రజలకు వివరించేందుకు వైఎస్సార్ సీపీ సిద్ధమైంది. నేటి నుంచి వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అంతా అరాచకమే.. ‘ఏరు దాటే వరకు ఏటి మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉంది సీఎం చంద్రబాబు తీరు. హామీల అమలు, కొత్త పథకాలు లేకపోగా ఉన్న వాటిని బొంద పెట్టేశారు. గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులను సైతం నీరు గార్చేస్తున్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో స్కామ్ల పాలన కొనసాగిస్తున్నారు. హామీల అమలేది? తాజాగా అధికారంలోకి వచ్చాక జిల్లాలో ఒక్కటంటే ఒక్క కొత్త కార్యక్రమం చేపట్టలేదు. పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఎ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు వాటికి అతీగతి లేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడపేట వద్ద నాగావళి నదిపై వంతెనల నిర్మాణాలు పూర్తి చేస్తామని, నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదు. నియోజకవర్గానికొక ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తామని, వంశధార ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని, జీడి పిక్కల 80 కిలోల బస్తాకు మద్దతు ధర రూ.16 వేలు ఇప్పిస్తామని, ఆఫ్షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేస్తామని, పలాసలో రైతు బజారును ఏర్పాటు చేస్తామని, వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, పలాసలో డిఫెన్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, వంశధార– బాహుదా నదుల అనుసంధానం చేస్తామని, కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతామని, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని, బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మాణం చేస్తామని ప్రజల్ని ప్రలోభ పెట్టారు. వీటిలో ఒక్కటంటే ఒక్కటీ అమలు కాలేదు. అధికారంలోకి వచ్చాక.. అధికారంలోకి వచ్చాక జిల్లాలో రెండు సార్లు పర్యటించి పలు హామీలిచ్చారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభోత్సవంలో పలు హామీల గుప్పించి మరిచిపోయారు. ఎంత దారుణమంటే జిల్లాలో ప్రారంభించిన ఉచిత సిలిండర్ల పథకం కింద ఒక సిలిండర్ ఇచ్చి మిగతావి ఇవ్వకుండా మొండి చేయిచూపారు. సినీ సెట్టింగ్లు, సినీమాటిక్ ఫోజులకే పర్యటనలు పరిమితమయ్యాయి. ఇటీవల జరిగిన నరసన్నపేట పర్యటన కూడా దాదాపు అంతే. పర్యటనలతో ఖర్చు తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదు. ఇచ్ఛాపురం పర్యటన హామీలివి.. ● బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులకు, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుకు రూ.30 కోట్లు. బెంతొరియాల పేరుతో స్థానికత ధ్రువపత్రాలు మంజూరు. ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు. పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు. ఇళ్ల నిర్మాణం. అరసవల్లి సూర్యదేవాలయం అభివృద్ధికి రూ.100 కోట్ల ప్రాజెక్టు. ● పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60 కోట్లు. పై వాటిలో ఏ ఒక్కటీ అమలు కాలేదు. బుడగట్లపాలెం పర్యటన హామీలివి.. ● మత్స్యకార సేవ కార్యక్రమం ప్రారంభోత్సవం చే సేందుకు ఎచ్చెర్లమండలం బుడగట్లపాలెంలో చం ద్రబాబు పర్యటించి పలు హామీలు గుప్పించారు. ● బుడగట్లపాలెంలో 18 మందికి ఇళ్లు. ● పర్యాటకంగా తీరం అభివృద్ధి. ● గ్రామంలో రహదారులు, మరుగుదొడ్లు, డ్రైనేజీలు నిర్మాణం. ● ఎచ్చెర్లలో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం. ● బుడగట్లపాలెం పిషింగ్ హర్బర్ నిర్మాణం పూర్తి. మూలపేట పోర్టు పనులు వేగవంతం ● ఇచ్ఛాపురం నుంచి విశాఖ వరకు కోస్టల్ కారిడార్ నిర్మాణం. ● నారాయణపురం ఆనకట్ట, మడ్డువలస స్టేజ్ 2, తోటపల్లి ప్రాజెక్టు పూర్తి. ● కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం నిర్వాసితులకు ధర్మవరంలో పునరావాస కాలనీ పూర్తికి చర్యలు. పైవాటిలో ఏ ఒక్కటీ అమలుకాలేదు. ఏళ్ల పాలనలో ప్రజలకు నిత్యం పాట్లు ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలు అధికారంలోకి వచ్చాక కూడాచంద్రబాబు వాగ్దానాలు పబ్లిసిటీ ఖర్చు తప్ప ప్రజలకు మేలు జరగని పరిస్థితి నాలుగోసారి మోసపోయిన జిల్లా ప్రజలు నరసన్నపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కి ప్రజలను వంచించిన చంద్రబాబు వైఖరికి నిరసనగా ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగు, ఐదు తేదీల్లో జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో కూటమి మేనిఫెస్టో, సంతకాల బాండ్లు దహనం చేసే కార్యక్రమాలు విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 8, 9 తేదీల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరిట సదస్సులు నిర్వహించి కూటమి పాలన చేసిన మోసాలు, అరాచకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 12న చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా జిల్లాలోని 8 నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ పరిశీలకులు, పార్టీ శ్రేణులంతా తప్పక పాల్గొనాలని కోరారు. సమావేశంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు అంధవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు పాలన పోస్టర్ ఆవిష్కరణ శ్రీకాకుళం రూరల్: సీఎం చంద్రబాబు రెండేళ్లపాటు వెన్నుపోటు పాలన సాగించారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దుయ్యబట్టారు. ఈ మేరకు బుధవారం పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలన పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం సర్ ప్రోగ్రాంకు సంబంధించి బూత్లెవల్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. పోలింగ్ బూత్లకు సంబంధించిన వివరాలను పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పట్టణ వైఎస్సార్సీపీ నాయకులు గేదెల పురుషోత్తం, సాధు వైకుంఠరావు, ఎం.తాతబాబు, మండవల్లి రవి, గద్దిబోయిన కృష్ణారావు, ఎంఏబేగ్ పాల్గొన్నారు. -
‘సూపర్’ మోసం
● అన్నదాత సుఖీభవలో కోత పెట్టా రు. తల్లికి వందనంతో దగా చేశారు. ● నిరుద్యోగ భృతికి ఎసరు పెట్టారు. సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చే లోపు నిరుద్యోగికి నెలకి రూ. 3వేలు చొప్పున ప్రకటించారు. రెండేళ్లలో 7లక్షల 28వేల 210మందికి రూ.437కోట్ల మేర ఇవ్వకుండా మోసం చేశారు. ● ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని బాకాలు ఊదారు. అమలు చేయకుండా జిల్లాలో 7లక్షల 28వేల 210మందిని మోసగించారు. ● మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు 19 ఏళ్లు నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. 7లక్షల 59వేల 692మంది మహిళలు ఆడబిడ్డ నిధి కోసం ఎదురు చూస్తున్నారు. ● 50ఏళ్లకే మహిళలకు పింఛన్ మంజూరు చేస్తామని చెప్పారు. పథకం అమలు చేయలేదు సరికదా ఉన్న పింఛన్లు తీసేస్తున్నారు. ● చంద్రబాబు హామీ ప్రకారం జిల్లాలో 3లక్షల 07వేల 537మంది పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ● తొలి సంతకం పెట్టిన మెగా డీఎస్సీలో అవకతవకలకు పాల్పడి అభ్యర్థులకు అన్యాయం చేశారు. -
13 మంది డీటీలకు పదోన్నతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో 13 మంది డిప్యూటీ తహసీల్దార్లకు తహసీల్దార్లుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీరిలో 8 మంది ప్రోడీటీలు, ఐదుగురు పదోన్నతిపై, ఒకరు పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరిని అల్లూరి సీతారామరాజు జిల్లాకు కేటాయించారు. పదోన్నతి పొందిన వారిలో బి శ్రీదేవి, ఎం.చక్రవర్తి, బి.హేమసుందర్రావు, పి.శ్రీనివాసరావు, ఆర్.వెంకటేశ్, ఎం.సరిత, ఎం.నలినాక్షి, డి.పద్మావతి, ఎల్ఎల్.నాయుడు, జీఎల్ఈ శ్రీనివాసరావు, బి.గోపాల్, రషీద్ అహ్మద్, ఎస్.రామకృష్ణ, కె.కవిత ఉన్నారు. డీపీఈ ఈఈగా సత్యనారాయణ అరసవల్లి: విద్యుత్ శాఖ సర్కిల్ డీపీఈ ఈఈగా ఎల్.సత్యనారాయణ బుధవారం విధుల్లో చేరారు. తాజాగా జరిగిన బదిలీల్లో విజయనగరం సర్కిల్ నుంచి స్థానిక సర్కిల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఈ జీఎన్ ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం స్థానిక డీపీఈ విభాగ సిబ్బందితో సమావేశమై విజిలెన్స్ విభాగంతో పాటుగా నిర్వర్తించాల్సిన విధులపై చర్చించారు. ఇంతవరకు సర్కిల్ డీపీఈ ఈఈగా విధులు నిర్వర్తించిన జి.శంకరరావు విజయనగరం సర్కిల్ టెక్నికల్ ఈఈగా బదిలీ అయ్యారు. మేడ పైనుంచి జారిపడి వ్యక్తి మృతి సంతబొమ్మాళి: కొల్లిపాడు గ్రామానికి చెందిన గొరుసు మోహన్ (41) అనే వ్యక్తి మేడపై నుంచి జారిపడి మృతి చెందాడు. మంగళవారం రాత్రి భోజనం చేసి మేడపైన నిద్రపోవడానికి మోహన్ వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జనకు కిందకు దిగే సమయంలో జారిపడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మోహన్, అతని భార్య లక్ష్మి నెల్లూరులో కూలిపని చేస్తుంటారు. నెల రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. మోహన్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సంతబొమ్మాళి ఎస్ఐ వై.సింహాచలం తెలిపారు. అర్హులందరికీ ‘మత్స్యకార సేవలో’ లబ్ధి అరసవల్లి: వేట నిషేధ కాలంలో ఉపాధికి ప్రత్యామ్నయంగా తీర ప్రాంత వేట మత్స్యకార లబ్ధిదారులందరికీ ‘మత్స్యకార సేవలో’ పథకం కింద రూ.20 వేలు చొప్పున జమ అయ్యేలా చర్యలు చేపడుతున్నట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.సుమలత బుధవారం తెలిపారు. ప్రస్తుతానికి వివిధ కారణాలతో న గదు జమ కాని అర్హులని గుర్తించే పనిలో ఉన్నా మని వివరించారు. జిల్లాలో 17635 దర ఖాస్తులు అప్లోడ్ చేయగా 16737 మందిని అర్హులుగా గుర్తించి నగదు జమ చేయించామన్నారు. ఇందులో 542 మంది దరఖాస్తులు ప్రోసెసింగ్లోనే ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పథకం లబ్ధి అందిందా లేదా అన్న అంశంపై సమాచార సేకరణ చేపడుతున్నామని, ఈ క్రమంలో ఫోన్లకు రెస్పాండ్ అవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2027’ అవార్డులకు అర్హులైన బాలబాలికల నుంచి దరఖాస్తులు, నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన చిన్నారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాలను అందిస్తోందని, ఇందుకోసం ఆన్లైన్ పోర్టల్ ప్రారంభమైందని పేర్కొన్నారు. ధైర్యసాహసాలు, సామా జిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు–సంస్కృతి, సరికొత్త ఆవిష్కరణలు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబరిచిన బాలలు అర్హులని వివరించారు. 2026 జూలై 31 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని, 18 సంవత్సరాల లోపు ఉన్న భారతీయ పౌరులు, దేశంలో నివసిస్తున్న బాలబాలికలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అర్హులైన బాలలు స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, లేనిపక్షంలో వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు, ఇతర ప్రముఖులు కూడా చిన్నారుల పేర్లను నామినేట్ చేయవచ్చన్నారు. పూర్తి వివరాలతో అధికారిక వెబ్సైట్ http://awards.gov.in ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. జూలై 31 ఆఖరు తేదీగా పేర్కొన్నారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, శిశు సంరక్షణ కేంద్రాలు విస్తృత ప్రచారం కల్పించి అర్హులైన చిన్నారులు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. -
ఈదురుగాలుల బీభత్సం
● గెడ్డకంచరాంలో పశువులశాల రేకులు పడి వ్యక్తి మృతి ● మరో మహిళకు తీవ్ర గాయాలు జి.సిగడాం : గెడ్డకంచరాంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బుధవారం సాయంత్రం గాలివాన ధాటికి పశువుల శాల రేకు ఎగిరిపడటంతో గ్రామానికి చెందిన నక్క సూరప్పడు (60) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన నక్క మంగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరూ పంట పొలంలో పశువులను మేతకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షంమొదలవ్వడంతో పశువులను ఇంటికి తోలుకువస్తున్న సమయంలో పశువుల శాల రేకులు ఎగిరిపడటంతో సూరప్పుడు రెండుకాళ్లు సగానికి తెగి పడ్డాయి. తీవ్రరక్త్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనకు భార్య మల్లెమ్మ, కుమారుడు సూర్యనారాయణ ఉన్నారు. ఇదే ఘటనలో మంగమ్మ సైతం తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం 108 వాహనంలో రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై తమకు ఎటువంటి సమాచారం రాలేదని పోలీసులు పేర్కొన్నారు. నక్క సూరప్పడు(ఫైల్) -
ఎరువుల అక్రమ విక్రయాలపై ఉక్కుపాదం
70 బస్తాల యూరియా స్వాధీనం నరస్ననపేట: జమ్ము పంచాయతీ దశుమంతపురంలో అక్రమంగా నిల్వ చేసిన 70 బస్తాల యూరియాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. వీటిని చల్లపేటలో ఎరువుల షాపు నిర్వహిస్తున్న ఎ.ధర్మరాజుకు చెందినవిగా గుర్తించామని విజిలెన్స్ ఎస్సై రామారావు తెలిపారు. సీజ్ చేసిన యూరియా బస్తాలను నరసన్నపేట వ్యవసాయాశాఖ ఏఓకి అప్పగించామన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల విక్రయాల్లో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, మార్క్ఫెడ్, డీసీఎంఎస్ ప్రతినిధులు, తయారీ కంపెనీల ప్రతినిధులు, హోల్సేల్, రిటైల్ వ్యాపారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. కృత్రిమ కొరత సష్టించినా, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, ఇతర ద్వితీయ శ్రేణి ఉత్పత్తులను అంటగట్టినా లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఎరువుల తయారీ కంపెనీలు తమ కోటాలో 50 శాతం వాటాను డీలర్లకు కేటాయించేటప్పుడు జిల్లా వ్యవసాయ అధికారికి ముందస్తు సమాచారం అందించాలన్నారు. పంట విస్తీర్ణం ఆధారంగా అవసరమైన మండలాలకే సరఫరా జరిగేలా చూడాలన్నారు. రిటైల్ దుకాణాల్లో ఉన్న భౌతిక స్టాక్ కచ్చితంగా ఈ–పోస్ మిషన్లలోని రికార్డులతో సరిపోలాలన్నారు. ధరా వ్యత్యాసాలను ఆశించి అడ్వాన్స్ బుకింగ్లు చేసుకోవడం, రైతుల గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. సంస్థాగత ఏజెన్సీలు సైతం ప్రైవేట్ డీలర్లకు సమానంగా, పారదర్శకంగా చట్ట నిబంధనలకు లోబడి వ్యాపారం సాగించాలని స్పష్టం చేశారు. మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నిరంతరం తనిఖీలు చేపట్టాలని, లబ్ధిదారులైన రైతులను స్వయంగా గుర్తించాలన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేలా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల సహకారంతో 40 శాతం సేంద్రీయ, 60 శాతం రసాయన ఎరువుల సమతుల్య వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వై.వి.మురళీకృష్ణ, జిల్లా సహకార అధికారి బి.మురళీకృష్ణ, జిల్లా మార్క్ఫెడ్ మేనేజర్ కె.యు.బి.పి.రమణి, ఏడీఏలు, మండల వ్యవసాయ అధికారులు, డీసీఎంఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
డైసీకి లాస్ట్ సెల్యూట్
● కేన్సర్తో బాధపడుతూ మృతిచెందిన పోలీసు జాగిలం డైసీ ● అధికార లాంఛనాలతో అంత్యక్రియలు శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల : పేలుడు పదార్థాలు కనిపెట్టడంలో నిపుణురాలైన పోలీసు జాగిలం డైసీ అనారోగ్యంతో కన్ను మూసింది. ఐదు నెలలుగా కేన్సర్తో బాధ పడుతున్న డైసీ మంగళవారం మృతి చెందింది. దీంతో పోలీసులు జాగిలానికి అధి కార లాంచనాలతో ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రమణ మాట్లాడుతూ వీఐ పీ, వీవీఐపీ పర్యటనలు, రైల్వే స్టేషన్లు, బస్కాంప్లెక్సులు, చెక్పోస్టు తనిఖీలు, భారీ బందోబస్తు విధుల్లో డైసీ కీలకపాత్ర పోషించిందన్నారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నిర్వహించే పోలీస్ పరేడ్లో తన విన్యాసాలతో అలరించేదన్నారు. భద్రతా తనిఖీల్లో తన సేవలు అమోఘమని జిల్లా పోలీస్ శాఖకు డైసీ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఎల్.శేషాద్రి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్ప్రసాద్, ఆర్ఎస్ఐలు, పోలీస్ డాగ్ హ్యాండ్లర్లు ఎస్ గోవిందరావు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
పలాస కిడ్నీ ఆస్పత్రిలో దొంగతనం
పలాస: పలాస కిడ్నీ ఆస్పత్రిలో మంగళవారం ఒక ఇన్ షేషెంట్ వద్ద గల పర్సులో ఉన్న ఆమె బంగారం పుస్తెలతో పాటు రూ.3వేలు నగదును గుర్తుతెలియని వారు అపహరించుకుపోయారు. ఈ వా ర్త కాశీబుగ్గలో పెద్ద సంచలనమైంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పాతపట్నం మండలం తెంబూరు గ్రామానికి చెందిన చెల్లిబోయిన నారాయణమ్మ అనారోగ్యంతో కిడ్నీ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత గర్భసంచిలో సమస్య ఉందని తెలిపారు. గర్భసంచిని శస్త్ర చికిత్స ద్వారా తొలగించాలని ఆమెకు వైద్యులు సూచించారు. ఆమె అందుకు అంగీకరించి ఆపరేషన్ చేయించుకున్నారు. ఐదు రోజుల కిందట ఆమెకు ఆపరేషన్ చేశారు. ఆమెకు ఒక ప్రత్యేక గది కూడా ఇచ్చారు. అయితే మంగళవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఆమె కుమార్తె వి.రాజేశ్వరి సహకారంతో టాయిలెట్కు వెళ్లారు. అటు నుంచి వచ్చి తమ అవసరాల కోసం బ్యాగులో ఉంచిన పర్స్ను చూడ గా అందులో ఉన్న బంగారు పుస్తెలు, రూ.3వేలు నగదు కనిపించకపోవడంతో లబోదిబోమన్నారు. కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ విషయం ఆస్పత్రి సిబ్బందికి తెలియజేశారు. వారి నుంచి తగిన సమాధానం లేకపోవడంతో కాశీబుగ్గ పోలీ సులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. కాశీబుగ్గ పోలీసులు కూడా తగిన విధంగా స్పందించలేదని, కనీసం ఆస్పత్రికి ఎవరూ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణమ్మ భర్త కూడా వారి ఇంటి వద్ద పెరాలసిస్ వ్యాధితో ఉంటున్నారని ఆమె కుమార్తె రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాశీబుగ్గ సీఐ రామకృష్ణను వివరణ కోరగా వారు ఫిర్యాదు చేశారని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. -
సంపద సృష్టి ఏమైంది..?
● సూటిగా ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు ● ‘చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు’ పుస్తకం, పోస్టర్ ఆవిష్కరణ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ‘నేను ఆర్థిక సంస్కర్తను.. సంపద ఎలా సృష్టించాలో నాకు తెలుసు’ అని గత ఎన్నికల సందర్భంగా చెప్పిన చంద్రబాబు ఆ మాట లు గాలికి వదిలేశారని వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కుంభా రవిబాబు అన్నారు. సూపర్ సిక్స్ పేరిట అనేక అబద్ధపు హామీలిచ్చి ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయడం చేతకాని నీకా ప్రజ లు ఓటేసి గెలిపించారు అని మండిపడ్డారు. ‘చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు’ అనే పుస్తకం, పోస్టర్ని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్.. సూపర్ సక్సెస్ పేరిట సంబరాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. 40 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, ఏడాదికి 10 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఒక్క నిరుద్యోగికై నా రూపాయి ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రూ.4వేలు పెన్షన్ అని మోసగించారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2024 ఎన్నికల నాటికి 66.34లక్షల మందికి పెన్షన్లు ఇస్తే కూటమి ఆ పెన్షన్లను 60.14లక్షల మందికి తగ్గించేసిందని తెలిపారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రెండేళ్లలో రూ 3.54 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదని పేర్కొన్నారు. సంపద సృష్టించి సంక్షేమం ఇస్తామన్న పెద్ద మనిషి చంద్రబాబు ముగ్గురు పిల్లల్ని కనండి రూ.30వేలు ఇస్తా, నలుగురుని కనండి రూ.40వేలు ఇస్తానని చెప్పడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వ మోసాల్ని ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన బాధ్యత వైఎస్సార్ సీపీ శ్రేణులపై ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్, మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, కాళింగకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు దుంపల లక్ష్మణరావు, తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, వెలమకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ, రాష్ట్రకార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, ఆమదాలవలస నియోజకవర్గ పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, టెక్కలి నియోజకవర్గ పరిశీలకులు చల్ల రవికుమార్, తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), ఎస్ఈసీ మెంబర్లు గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రుప్ప దివ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ముత్తా విజయ్కుమార్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శి జి.పురుషోత్తంలతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు సాధు వైకుంఠరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్, వి.మన్మధరావు, సీపాన రామారావు, కింజరాపు రమేష్, తంగి అప్పన్న స్వామి, టి.నాగేశ్వరరావు, కోణార్క్ శ్రీను, చీమల తారక్ పాల్గొన్నారు. -
మున్సిపల్ ఇంజినీర్ రవిశర్మ సరెండర్
శ్రీకాకుళం పీఎన్కాలనీ: శ్రీకాకుళం కార్పొరేషన్ మున్సిపల్ ఇంజినీర్ (ఎమ్ఈ) రవిశర్మ విధుల్లో అలసత్వం వహిస్తున్నారని ప్రభుత్వానికి సరెండర్ చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావు మంగళవారం తెలిపారు. కార్పొరేషన్లో అనేక అభివృద్ధి పనుల్లో పర్యవేక్షణ లోపం, పనుల్లో అలసత్వం వహించడం వల్లే సరెండర్ చేసినట్లు ఆయన తెలిపారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి విజయవాడ వైపు బొగ్గు లోడుతో లారీ వెళుతోంది. మంగళవారం మధ్యాహ్నం రణస్థలం సెంటర్లో హైవేపై లారీ ఆపి సమీపంలోని వైన్ షాప్కు వెళ్లి డ్రైవర్ మద్యం సేవించాడు. తిరిగి లారీ దగ్గర వచ్చినప్పటికే స్పృహ లేని స్థితిలో ఉన్నా డు. లారీ ఎక్కలేకపోవడం స్థానికులు గమనించి ఫుల్గా తాగి లారీ ఎందుకు ఎక్కుతున్నావని ప్రశ్నించగా తానే డ్రైవర్ను అని చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. ఓపిక లేని పరిస్థితిలో లారీ నడిపేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు నిలువరించి జేఆర్ పురం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి అతడిని స్టేషన్కు తరలించారు. కిడిమికి తాగునీటి సరఫరా సారవకోట: మండలంలో ని కిడిమి పంచాయతీ బుడితి గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ద్వారా మంగళవారం గ్రామస్తులకు తాగునీరు అందించారు. ఈ గ్రామంలో రక్షిత మంచినీటి పథకం పనిచేయకపోవడంతో నెల రోజులుగా తాగు నీరు రాలేదు. దీనిపై ‘సాక్షి’లో ఆదివారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన ఎంపీడీఓ మోహన్ కుమార్ పంచాయతీ కార్యదర్శి తేజేశ్వరరావుకు తగిన ఆదేశాలు జారీ చేశారు. దీంతో మోటార్ను మరమ్మతు చేయించి తాగునీటి సరఫరా చేపట్టారు. ఐటీఐలో ప్రవేశాలకు వేళాయె ● దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 30 ● జూలై 2వ తేదీలోగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలి ● డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వి.రఘురామ్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ఐటీఐ శిక్షణ సంస్థల్లో ప్రవేశాలు పొందేందుకు అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని శ్రీకాకుళం డీఎల్టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ వి.రఘురామ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను ఐటీఐ.అడ్మిషన్స్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్లో జూన్ 30లోగా పూర్తిచేసుకోవాలని సూచించారు. జూలై 2లోగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ సమీపలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలో జూలై 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని రఘురా మ్ కోరారు. టెన్త్క్లాస్, కుల ధ్రువీకరణ పత్రం, టీసీ, స్టడీ, ఆధార్కార్డు తదితర అన్ని ఒరి జినల్ ధ్రువీకరణ పత్రాలతో వెరిఫికేషన్కు హాజరుకావాల్సి ఉంటుందని సూచించారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ఐటీఐ ప్రవేశాలకుగాను మొదటి విడతకు సంబంధించిన కౌన్సెలింగ్ ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ శిక్షణ కేంద్రంలో జరుగుతుందని ఏడీ రఘురామ్ వెల్లడించారు. వివరాలు మొబైల్కే మెసేజీ రూపంలో వస్తాయన్నారు. -
తిరగబడ్డ.. సిక్కోలు బిడ్డ
● ఇసుక అక్రమ తవ్వకాలపై తిరగబడుతున్న జనం ● వందల కోట్లు దోచుకుంటున్న అధికార పార్టీ నాయకుల తీరుపై ధ్వజం ● ఎక్కడికక్కడ ఇసుక అక్రమాలను అడ్డుకుంటున్న పరిస్థితి ● రోడ్లు, ప్రజారోగ్యం దెబ్బతింటున్నాయని ఆవేదన ● ఇసుక వాహనాలకు అడ్డంగా నిలబడి నిరసనలు జిల్లాకు సరిహద్దు ప్రాంతమైన రేగిడి మండలం పెద్దపిర్లిలోని నాగావళి నదిలో మంగళవారం ఇసుక అక్రమంగా తవ్వేందుకు సిద్ధమవుతున్న యంత్రాలను మహిళలతో కలిసి స్థానికులు అడ్డుకుంటున్న దృశ్యం. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పంట పొలాలు, ప్రజలకు వరద రక్షణ కోసం కరకట్ట నిర్మిస్తే కూటమి ప్రభుత్వంలో దాన్ని తవ్వేసి ఇసుక తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీని వల్ల గ్రామానికి వరద ముప్పు ఉంటుందనే భయంతో తవ్వకాలకు ఉపయోగించే యంత్రాలను అడ్డుకున్నారు. హిరమండలం మండలం భగీరథపురం వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను మంగళవారం అడ్డుకుంటున్న దృశ్యమిది. ఎక్కడికక్కడ భారీగా గోతులు పెట్టడంతో వరద నీరు పంట పొలాల్లోకి వచ్చేస్తుందన్న భయంతో ఆందోళనకు దిగారు. రోడ్లు పాడవుతున్నాయని, పెద్ద గొయ్యిలో పడి ప్రజలు చనిపోతున్నారని మండిపడ్డారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం సిక్కోలు జనం తిరగబడుతున్నారు. ఇసుకా సురుల అకృత్యాలను నడి రోడ్డుపైనే ఎండగడుతున్నారు. ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేసి పాలకుల తీరును తూర్పారపడుతున్నారు. ముఖ్యంగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ప్రజలు మండి పడుతున్నారు. ఇసుక అక్రమ సొమ్ము కోసం గ్రామాలను, రోడ్లను ధ్వంసం చేస్తుండటంపై ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ఇచ్ఛాపురం నుంచి శ్రీకాకుళం జిల్లా సరిహద్దు రేగిడి మండలం వరకు ఇసుక అక్రమ తవ్వకాలపై ఎదురు తిరుగుతున్నా రు. నాగావళి, వంశధార, బాహుదా నదులను కబళించేసి అధికార పార్టీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నారని తిరగబడుతున్నారు. రూ.వందల కోట్ల అక్రమార్జన కోసం నదులను గుల్ల చేయడమే కాకుండా రోడ్లు, వరద కట్లను పాడు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అధికార పార్టీ నాయకులు ఇసుకపై పడ్డారు. ఉచిత ఇసుక పేరుతో నదుల్లో ఇసుకను మింగేస్తున్నారు. ఇష్టారీతిన నదుల్లో రోడ్లు వేసేసి, నదుల్లోకి భారీ వాహనా లు పంపించి, భారీ యంత్రాలతో లోడింగ్ చేసి, గ్రామాల మీదుగా తరలిస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ. 10వేల నుంచి రూ. 50వేల వరకు వసూలు చేస్తున్నా రు. 30,40 టన్నుల లోడ్తో రవాణా చేస్తుండటం వలన రోడ్లు ధ్వంసమవుతున్నాయి. నిత్యం ఇసుక లారీలు, ట్రక్కులు తిరుగుతుండటంతో దుమ్ము, ధూళి వెదజల్లి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గ్రా మాల్లో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. ఎక్కడికక్కడ ప్రమాదాలు చోటు చేసుకుని గ్రామాలు విలవిలలాడుతున్నాయి. నదుల్లోకి ఇసుక తరలించేందుకు కరకట్టలు తవ్వేసి రోడ్లు వేస్తుండటంతో వరదలకు గ్రామాలకు ముప్పు వాటిల్లుతోంది. పంట పొలాలు మునిగిపోయే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నదుల్లో భారీగా తీసిన గోతుల్లో పడి మరణాలు సంభవిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల అక్రమ సొమ్ము కో సం గ్రామాలు మూల్యం చెల్లించుకుంటున్నాయి, నదులు ధ్వంసమవుతున్నాయి. సమీప ప్రాంత ప్ర జలు ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు. నదుల్లో నీటి లభ్యత తగ్గిపోతోంది. మంచినీటి వనరులు దెబ్బతింటున్నాయి. తాగునీటి కోసం ఇబ్బందులు పడే దుస్థితి చోటు చేసుకుంది. వంతెనలకు ప్రమాదం పొంచి ఉంది. తవ్వకాలతో నదీ గమనం మారిపోయి ఎక్కడ కొట్టుకుపోతాయో తెలియని పరిస్థితి ఉంది. శ్రీకాకుళం, ఆమదాలవలస, ఎచ్చె ర్ల, పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో బరి తెగించి ఇసుక దోచుకుంటున్నారు. ప్రజలకు ఇబ్బందులను మిగుల్చుతున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషిస్తున్నారు. మరికొన్నిచోట్ల వారి అనుచరులు దందా సాగిస్తున్నారు. మంత్రులు, పెదబాబు, చినబాబు పేరు చెప్పుకుని విజయవాడ, రాజమండ్రి నుంచి వచ్చి ఇసుక తవ్వి, సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాలకు నష్టం రోజురోజుకీ ఇసుక అక్రమ తవ్వకాలు శ్రుతిమించడం, అక్రమ రవాణాతో గ్రామాలకు నష్టం వాటిల్లడంతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. భరించలేని పరిస్థితులు వచ్చేశాయి. ప్రజా జీవనానికి ముప్పు వాటిల్లే దుస్థితి ఏర్పడంతో ప్రజాగ్ర హం వెల్లువెత్తుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం ప్రజలు కాస్త భయపడే పరిస్థితి ఉండేది. బెదిరింపులు, దాడులు, కేసులతో మౌనంగా ఉన్నారు. అక్రమార్కులు ధనదాహం కోసం మరింత రెచ్చిపోతుండటంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. కేసులు, దాడులకు భయపడమంటూ రోడ్డెక్కుతున్నారు. అక్రమాలపై తిరగబడుతున్నా రు. ఎక్కడికక్కడ ఇసుక లారీలు అడ్డుకుంటున్నారు. తమ ప్రభుత్వంలో ఇసుక అక్రమాలు జరగడం లేదని, ఉచిత ఇసుక అందిస్తున్నామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్నదంతా అబద్ధమని, కూటమి ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యాలుగా జరుగుతున్న ఘటనలు నిలుస్తున్నాయి. -
చెరువు.. రక్షణ కరువు
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో గల గోపినాథపురం గ్రామానికి ఆనుకుని ఉన్న చెరువు అక్రమార్కుల పాలవుతోంది. ఇప్పటికే చెరువుకు ఆనుకుని వేసిన లేఅవుట్లతో ఒక వైపు నుంచి చెరువు ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో తా జాగా గ్రామానికి ఆనుకుని ఉన్న భాగంలో కొంత మంది అక్రమ కట్టడాలు చేయడంపై ఎంపీటీసీ స భ్యురాలు సత్తారు ఉషారాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. ధర్మనీలాపురం రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ చెరువు రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమారు 6.62 ఎకరాల విస్తీర్ణం ఉండేది. ఈ చెరువు వ్యవసాయ ఆయుకట్టుతో పాటు పశువులకు నీటి ఆధారంగా ఉండేది. అయితే కాలక్రమేణా చెరువుకు ఆనుకుని లేఅవుట్లు వేయడంతో కొంత భాగం ఆక్రమణలకు గురైంది. ఇప్పుడు కొంత మంది వ్యక్తులు చెరువు గర్భంలో కట్టడాలు చేయడంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి గోపీనాథపురం చెరువులో సర్వే నిర్వహించి హద్దులు కేటాయించాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలి గోపీనాథపురం చెరువులో ఇటీవల కాలంలో కొంత మంది వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం చెరువు గర్భాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాం. గ్రామస్తులకు, రైతులకు ఆధారంగా ఉన్న ఈ చెరువును కాపాడేలా అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలి. – సత్తారు ఉషారాణి, ఎంపీటీసీ సభ్యురాలు, గోపీనాథపురం -
ప్రగతి పనులపై దిశా నిర్దేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో పూర్తి సానుకూల దృక్పథం కల్పించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జా యింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి జిల్లాలోని తహసీల్దార్లు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో నిర్వహించిన వారాంతపు వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సమావేశంలో పలు ప్రగతి పనులపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అర్హులైన ప్రతి మ త్స్యకారునికి ‘మత్స్యకార భరోసా’ పథకం సక్రమంగా అందేలా చూడాలని అధికారుల ను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులకు తావుండకూడదన్నా రు. అదేవిధంగా, జిల్లాలో పంపిణీ అవు తున్న ఇసుక నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు నాణ్యమైన ఇసుక మాత్ర మే అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని, అంగన్వాడీ సేవల్లో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. -
అడ్వాన్స్డ్లో అంతంతమాత్రమే
● జేఈఈ అడ్వాన్స్డ్లో 100లోపు ర్యాంకులు లేకపోవడం ఇదే తొలిసారి ● కాస్త మెరుగైన ర్యాంకులతో ఐఐటీ, ఎన్ఐటీ సంస్థల్లో మనోళ్లకు సీట్లుశ్రీకాకుళం న్యూకాలనీ: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేదు. ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 100లోపు ర్యాంకు లేకపోవడం ఈ మధ్య కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. టాప్ ర్యాంకులు సాధించకపోయినా.. తమ వ్యక్తిగత ప్రతిభ ద్వారా మెరుగైన ఫలితాలతో ఫరవాలేదనిపించారు. గుర్తింపు పొందిన ఐఐటీ, ఎన్ఐటీ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ సీట్లను సాధించబోతున్నారు. నరసన్నపేట: మండలంలోని దూకులపాడుకు చెందిన అల్లు రోహిత్, నరసన్నపేట ఇందిరా నగర్కు చెందిన తండ్యాల పవన్ సాయిలు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో సత్తా చాటారు. రోహిత్ జాతీయ స్థాయి(ఓపెన్ కేటగిరీలో)102 వ ర్యాంకును ఓబీసీ కేటగిరీలో 14 వ ర్యాంకును కై వసం చేసుకున్నారు. రోహిత్ తల్లిదండ్రులు షణ్ముణరావు, లలితాంబలు ఆనందం వ్యక్తం చేశారు. షణ్ముఖరావు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి గృహిణి. అలాగే నరసన్నపేట ఇందిరా నగర్కు చెందిన తండ్యాల పవన్ సాయి ఓపెన్ కేటగిరీలో 702 వ ర్యాంకును ఓబీసీ కేటగిరీలో 118 వ ర్యాంకును సాధించాడు. పవన్సాయి తల్లిదండ్రులు జనార్దనరావు, పద్మావతిలు ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు పొందూరు: పొందూరు పట్టణానికి చెందిన కోరుకొండ శ్రావ్య ఆల్ ఇండియా 111వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 17వ ర్యాంకు సాధించింది. తండ్రి కోరుకొండ కృష్ణారావు ఉపాధ్యాయులు, తల్లి లక్ష్మికాంతం ప్రైవేటు ఉపాధ్యాయురాలు. పాతపట్నం: పాతపట్నం మండలం లాబర గ్రామానికి చెందిన కొండాల కనిష్క్ ఆల్ ఇండియా 221వ ర్యాంకు, ఓబీసీ కేటగిరిలో 36వ ర్యాంకు సాధించాడు. తండ్రి కొండాల చక్రపతి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. తల్లి పుష్పలత పాతపట్నం మండలంలోని తామర ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. రణస్థలం: లావేరు మండలంలోని పెద రొంపివలస గ్రామానికి చెందిన గొర్లె ప్రవీణ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 296వ ర్యాంక్ సాధించారు. ఓబీసీ కేటగిరిలో 48వ ర్యాంక్ సాధించాడు. తండ్రి శ్రీరాములు రైల్వే మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. తల్లి గొర్లె భారతి గృహిణి. రణస్థలం: జేఆర్ పురం గ్రామానికి చెందిన జ్యోతి ప్రకాష్ అమూజూరు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 622వ ర్యాంక్, ఓబీసీ కేటగిరిలో 104వ ర్యాంక్ సాధించాడు. తండ్రి అమూజూరు శ్రీనివాసరావు అర్మీలో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. తల్లి గంగ గృహిణి. ఎచ్చెర్ల: కుశాలపురం గ్రామానికి చెందిన పైడి దినేష్ జాతీయ స్థాయిలో 1006 ర్యాంక్ను సాధించాడు. తండ్రి లక్ష్మీపతి న్యాయవాది. తల్లి నిర్మల టీచర్. రణస్థలం: మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన మహంతి హర్షవర్ధన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో 1163వ ర్యాంక్ సాధించారు. ఓబీసీ కేటగిరిలో 199వ ర్యాంక్ సాధించాడు. తండ్రి మహంతి అప్పలనాయుడు అరబిందో పరిశ్రమలో ఉద్యోగి. తల్లి రమాదేవి గృహిణి. నరసన్నపేట: స్థానిక ఇందిరానగర్కు చెందిన పాగోటి సాత్విక్ 2401వ ర్యాంకు సాదించాడు. ఓబీసీ కేటగిరీలో 460 వ ర్యాంకు వచ్చింది. తల్లిదండ్రులు వాసుదేవరావు, ఝాన్సీ ఇద్దరూ ఉపాధ్యాయులే. స్వగ్రామం సారవకోట మండలం అలుదు. వజ్రపుకొత్తూరు: మండల కేంద్రంలో పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న మెట్ట పాపారావు కుమారుడు మెట్ట వెంకట సాయి సరాగ్ జేఈఈ అడ్వాన్స్లో ఓబీసీ కేటగిరీ ర్యాంక్ 466, ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంక్ 2418 సాధించాడు. స్వగ్రామం కోటబొమ్మాళి మండలం పొడుగుపాడు కాగా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. తల్లి పద్మలత పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్. -
శ్రీకాకుళం
● విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ ● అర్హులకు ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపాటు మంగళవారం శ్రీ 2 శ్రీ జూన్ శ్రీ 2026మండుటెండను లెక్క చేయలేదు. పోలీసు నిర్బంధాలకు వెరవలేదు. అక్రమాలపై నినదించారు. అన్యాయాలను ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అర్హులకు అన్యాయం జరిగిందని, అనర్హులను అందలం ఎక్కించారని కలెక్టరేట్ సాక్షిగా గళమెత్తారు. -
అధికారం అండగా.. సంపాదన దండిగా
● మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి అదనంగా రూ.10 నుంచి రూ. 30 వరకు వసూలు ● అడిగే నాథుడే కరువు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో దాదాపు 176 లైసెన్స్డ్ మద్యం దుకాణాలు ప్రైవేటు వ్యక్తులు నడుపుతున్నారు. 19 బార్ అండ్ రెస్టారెంట్లున్నాయి. ఏ దుకాణానికి వెళ్లినా, బార్ అండ్ రెస్టారెంట్కు వెళ్లినా ఎమ్మార్పీకి మించే సరుకు అ మ్ముతున్నారు. నిన్న మొన్నటి వరకు బాటిల్ ఎ మ్మార్పీపై రూ. 10 అదనంగా అమ్మిన వ్యాపా రులు ఇప్పుడు ఏకంగా రూ. 20 నుంచి రూ. 30 వరకు అదనంగా అమ్ముతున్నారు. పచ్చ సిండికేట్ అండతో.. పచ్చని సిక్కోలులో మద్యం దందా చేస్తున్నారు. వీరిని అడిగే నాథుడే లేకపోయాడు. శ్రీకాకుళం కార్పొరేషన్ పరిధిలో 12 బార్ అండ్ రెస్టారెంట్లు ఉండగా హయాతినగరం, డేఅండ్నై ట్, బలగ, రామలక్ష్మణ కూడలి, నవభారత్ జంక్షన్ పరిధి బార్ అండ్ రెస్టారెంట్లలో ఎమ్మార్పీకి అదనంగా రూ. 20 నుంచి రూ. 30 వసూలు చేస్తున్నారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రెండు బార్లలోనూ ఇదే పరిస్థితి. ఇచ్ఛాపురం, ఆమదాలవలసలో ఉన్న 4 బార్లలో రూ. 10 నుంచి రూ. 20 వసూలు చేస్తున్నారు. కొను గోలుదారులు ఇదేంటని ప్రశ్నిస్తే.. ఏసీ ఖర్చు లు, శనగపప్పు, సర్వీసింగ్ అంటూ దాటేస్తున్నా.. వాటికీ వసూలు చేయడం విశేషం. ఒడిశా మద్యం అంతా కాశీబుగ్గ, ఇచ్ఛాపురానికే.. ఒడిశా నుంచి అక్రమంగా వచ్చే మద్యం జిల్లా లోని బోర్డర్ ప్రాంతమైన ఇచ్ఛాపురం, ఏఓబీ ప్రాంతాలతో టచ్ ఉన్న పలాస–కాశీబుగ్గకే చేరుతోంది. అధికారుల నిఘా వైఫల్యం కారణంగా అక్కడి మద్యం ఏరులై పారుతోంది. కాశీబుగ్గలో సిండికేట్ నడుపుతున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు బహిరంగ టాక్. ఒడిశా ఎంజీ ప్యాకెట్లలో తీసుకొచ్చి ఆంధ్రా లిక్కర్లో కల్తీ చే స్తున్నట్లు వినికిడి. కాశీబుగ్గలో క్వార్టర్ రూ. 200 కు మించి ఉండే బాటిల్లో రూ. 150 చీప్ లిక్క ర్ కూడా కల్తీ చేస్తున్నారన్న సమాచారం ఉంది. 3 వేలకు పైగా బెల్టు షాపులు.. జిల్లాలో దాదాపు 3 వేలకు పైగా బెల్టుషాపులు నడుపుతున్నట్లు సమాచారం. గుడి, బడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్టు, ప్రైవేటు దుకాణాలు, బార్లు వెలుస్తున్నాయి. బెల్టు షాపుల్లో రూ. 30 నుంచి రూ. 70 వరకు సైతం అమ్మకాలు చేస్తున్నారు. -
ఉండేది ఒడిశాలో.. చోరీలు ఉత్తరాంధ్రలో
● పశ్చిమబెంగాల్ గజ దొంగల తీరిది ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : గజదొంగలు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. ఒడిశాలో ఉంటూ ఉత్తరాంధ్రలో దొంగతనాలు చేస్తున్న పశ్చిమ బెంగాల్ వాసులు మహమ్మద్ మీజాన్ (36) మహమ్మద్ హసన్ (26) లను ఖాకీలు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా జిల్లాలోని కాశీబుగ్గలో 3, టెక్కలిలో ఓ భారీ చోరీ చేశారు. మన్యం జిల్లా పార్వతీపురంలో ఓ చోరీ, ఒడిశా బరంపురంలో మరో చోరీ చేసి దాదాపు రూ. 80.55 లక్షల సొత్తు దోచేశారు. సీఐ వై.రామకృష్ణ ఆధ్వర్యంలోని కాశీబుగ్గ పోలీసులకు పట్టుబడటంతో సోమవారం కటకటాలపాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. మహమ్మద్ మీజాన్ బరంపురంలో ఉంటూ స్టీలు వ్యాపారినని చెప్పుకుని తిరుగుతూ రెక్కీ చేసి రాత్రి దొంగతనాలు చేసేవాడు. గత చోరీ కేసుల్లో జైలుకెళ్లిన మీజాన్ గత అక్టోబరులో విడుదలై మళ్లీ చోరీలకు స్కెచ్ వేసుకున్నాడు. తన గ్రామానికే చెంది న మహ్మద్ హసన్ను తోడు చేసుకున్నాడు. పట్టుబడ్డారిలా.. సీఐ రామకృష్ణకు వచ్చిన సమాచారంతో గరుడఖండి జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంటిలో ఇ ద్దరు నిందితులను ప్రత్యేక బృందాలతో కలసి సోమ వారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద 12 తులాల బంగారం, 20.349 కిలోల వెండి, రూ. 1,09,350 లు నగదు, రూ. లక్ష విలువ చేసే ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ మీజాన్పై శ్రీకాకుళం జిల్లాలో 7 కేసులు, విజయనగరం జిల్లాలో 7 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 2 పాత కే సులు, కొత్తగా మరో 6 కేసుల్లో ముద్దాయయ్యాడు. మాట్లాడుతున్న ఎస్పీ మహేశ్వర రెడ్డి -
కుడి ఎడమల దగా దగా
ఇదేనా హామీల అమలు నారా లోకేష్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేసే పద్ధతి ఇదేనా. అర్హులైన వారికి ఉద్యోగాలు వస్తాయని ఎంతోమంది కష్టపడి చదివితే అలాంటి వారికి తీవ్ర అన్యాయం జరిగింది. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వలేదు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు తప్ప యువగళంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలుకావడం లేదు. – పేరాడ తిలక్, పార్టీ టెక్కలి సమన్వయకర్త సీబీఐతో దర్యాప్తు చేయించాలి ఉద్యోగ పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని చేతకాని ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అక్రమాలపై సీబీఐ తో దర్యాప్తు చేయించాలి. పేపర్ లీక్కు కార ణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ని బర్తరఫ్ చేయాలి. చంద్రబాబుకు ప్రజా సంక్షేమం పట్టదు. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ లోకేష్ అనర్హుడు మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగులను మోసం చేసిన లోకేష్ విద్యాశాఖమంత్రి పదవికి అనర్హుడు. నిరుద్యోగుల వీక్నెస్తో కూటమి నేతలు ఆటలాడుకోవడం సరికాదు. సచివాలయాల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగలు ఇచ్చాం. ఆ పరీక్షలన్నీ పకడ్బందీగా నిర్వహించాం. ఈ అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేయాలి. అర్హులకు న్యాయం జరగాలి. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు నకిలీగాళ్లకు ఉద్యోగాలా..? నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. స్పోర్ట్స్ కోటా అనుమానాలను నివృత్తి చేయాలి. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా అనర్హుడు. – ఎంవీ స్వరూప్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్టేట్ ఫస్ట్ ఎలా..? డీఎస్సీ పేపర్ తయారుచేసే సంస్థలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నవీన్కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఎలా సాధ్యమైంది. ఏపీపీఎస్సీ విధానాలను అనుసరించకుండా అర్హులకి టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. – మార్పు పృథ్వీ, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
డైరెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ఖజానా శాఖలో ఏడుగురు ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ ఉద్యోగులకు పాత స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని రాష్ట్ర డైరెక్టర్ ఆదేశించినా జిల్లా ఖజానా అధికారి బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. ఏ ఇతర శాఖల్లో లేని ఇబ్బందులు, కక్ష సాధింపులు, వివాదాలు ఈ శాఖలో వస్తున్నా యి. రాష్ట్ర డైరెక్టర్ కలగజేసుకుని సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర్వులు జారీ చేసి నా ఈ వివాదం ఆగడం లేదు. ఖజానా శాఖలో ఏడుగురు ఉద్యోగుల సస్పెన్షన్, తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తివేయడం, రీ పోస్టింగ్ విషయంలో అవకతవకలు, వివక్షగా వ్యవహరించారని రాష్ట్ర డైరెక్టర్కు ఫిర్యా దులు వెళ్లాక.. వారికి పాత స్థానాల్లోనే పోస్టింగ్లు ఇవ్వాలని డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశా రు. అయితే జిల్లా ఖజానా అధికారి సెలవులో ఉండడంతో పోస్టింగ్లు ఇవ్వలేదు. ఆయన సోమవారం వచ్చినా రీ పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. పరిపాలన సమతుల్యం కోసం వారి పాత చోట్లతో పోస్టింగ్ ఇవ్వడం సాధ్యం కాదని ఆయన డైరెక్టర్కు తిరిగి లేఖ రాశారు. దీంతో కథ మొదటికి వచ్చింది. విధుల్లోకి చేరిన మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుమలత అరసవల్లి: జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్గా టి.సుమలత సోమవారం జిల్లా బాధ్యతలను స్వీకరించారు. తాజాగా పదోన్నతుల్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఏడీగా పని చేస్తూ జిల్లాకు డీడీగా వచ్చారు. సోమవారం ఉదయం ఆమె జిల్లా కార్యాలయాన్ని సందర్శించి ఒకింత ఆందోళనకు గురయ్యారు. పూర్తిగా కూలిపోయే దుస్థితిలో ఉండే ఈ కార్యాలయంలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారంటూ సిబ్బందిని అడిగినట్లుగా సమాచారం. అయితే కొత్తగా కలెక్టరేట్ నిర్మాణంలో భాగంగా మత్స్యశాఖకు కూడా కార్యాలయాన్ని కేటాయించనున్నారని సిబ్బంది ఆమెకు వివరించారు. మలేరియా నివారణకు జాగ్రత్తలు శ్రీకాకుళం అర్బన్: ప్రతి ఒక్కరూ మలేరియా నివారణకు తగు జాగ్రత్తలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత పిలుపునిచ్చారు. జూన్ మాసం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు మలేరియా నివారణపై అవగాహన ర్యాలీని సోమవారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 1 నుండి 30వ తేదీ వరకు మలేరియా నివారణకు మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే దోమల ఉత్పత్తిని అరికట్టడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల వల్ల కలిగే డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి మలేరియా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గండం శ్రీకాకుళం: జిల్లాలోని సుమారు పదివేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గండంగా మారింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సుప్రీం తాజాగా సమర్థించడంతో 2028 లోగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ కచ్చితంగా పాస్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 12,500 మంది వరకు ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో టెట్ పరీక్ష వచ్చిన తర్వాత విధు ల్లో చేరిన వారు పదివేలకుపైగా ఉన్నారు. మిగిలిన వారంతా అంతకుముందు సర్వీసులోకి వచ్చి ఉండడంతో వీరు మాత్రం టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. టెట్ ఉత్తీర్ణత సాధించే వరకు పదోన్నతులకు కూడా ఉపాధ్యాయులు నోచుకోరు. 2028 నాటికి కూడా టెట్ ఉత్తీర్ణత లేకుంటే స్వచ్ఛంద పదవీ విరమణ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
నేడు ‘దగా డీఎస్సీ’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీని ‘దగా డీఎస్సీ’గా మార్చారని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావుపూలే పార్కు వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశా రు. కార్యక్రమానికి జిల్లాలో ముఖ్య నాయకు లు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజులు ముఖ్య అతిథులుగా హాజరవ్వనున్నట్లు తెలిపారు. దగా డీఎస్సీ కార్యక్రమం పొన్నాడ వంతెన, మహా త్మా జ్యోతిరావుపూలే పార్కు వద్ద జరగనుందని, ఈ కార్యక్రమానికి జిల్లాలో వైఎస్సార్సీపీ నాయకులు, యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరవ్వాలని కోరారు. విమ్స్ డైరెక్టర్గా మందస వాసి మందస: విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) డైరెక్టర్గా మందసకు చెందిన డాక్టర్ వి.మన్మథరావు నియమితులయ్యారు. మన్మథరావు మండలంలోని డబారు గ్రామంలో జన్మించారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. హరిపురం పీహెచ్సీలో తొలి పోస్టింగ్ లభించింది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం కేజీహెచ్ సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. విమ్స్ డైరెక్టర్గా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు. నేటితో ముగియనున్న బీపీసీఎల్ టోర్నీ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న పురోహిత్ బ్రాహ్మణ క్రికెట్ లీగ్ టోర్నీ తుది దశకు చేరుకుంది. సోమవారంతో ఈ మెగా క్రికెట్ టోర్నీ ముగియనుంది. ఐదురోజులపాటు హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో ఫైనల్ పోరులో విశాఖపట్నం ఆచార్య జట్టు, మహావీర్ కింగ్స్ (మోదిదేవి విజయవాడ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం) జట్టు తలపడనున్నాయి. కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జరిగే ఈ ఫైనల్ మ్యాచ్కు పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, నగర ప్రముఖులు, బ్రాహ్మణ సంఘం రాష్ట్రస్థాయి నాయకులు హాజరు కానున్నట్టు నిర్వహణ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. విద్యుత్ శాఖ ఇన్చార్జి ఎస్ఈగా సురేష్కుమార్ అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సర్కిల్ ఎస్ఈగా జి.సురే ష్కుమార్కు ఇన్చార్జి బా ధ్యతలు అప్పగిస్తూ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఇంతవరకు ఎస్ఈగా విధుల్లో ఉన్న నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం పదవీ విరమణతో టెక్నికల్ ఈఈగా పనిచేస్తున్న సురేష్కుమార్కు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. మరో రెండు రోజుల్లోగా రెగ్యులర్ ఎస్ఈ నియామకాన్ని చేపట్టనున్నారని సమాచారం. శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నాడ బ్రిడ్జి వద్దగల పొన్నాడ గ్రామంలో గత 41 రోజులుగా నిర్వహించిన వేసవి తరగతులు ఆదివారం ముగిశాయి. శ్రీఅయ్యప్పపీఠం, శ్రీహరేరామ భక్త భజన బృందం ఆధ్వర్యంలో చిన్నారులకు భగద్గీత పఠనం, విష్ణుసహస్రనామ పారాయణ, లక్ష్మీ సహస్ర పఠనంపై తరగతులు జరిగాయి. ముగింపు సందర్భంగా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు దాతల సహకారంతో అందజేశారు. -
స్వర నివేదన
సంగీత సాధన..● సంగీతంలో ఆకట్టుకుంటున్న చిన్నారులు వేదికపై చిన్నారుల ప్రదర్శన సంగీతం అంటే నాకు ప్రాణం. గత నాలుగేళ్లుగా నేర్చుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ప్రదర్శనలో పాడడం చాలా సంతోషంగా ఉంది. – పి.కన్విత, 6వ తరగతి, శ్రీకాకుళం శ్రీకాకుళం కల్చరల్: నగరంలో తల్లిదండ్రులు తమ చిన్నారుల ఆసక్తి మేరకు వేసవి నేపథ్యంలో పలు రకాల శిక్షణల్లో చేర్చుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కువగా తమ పిల్లలకు సంగీతం నేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహం చూపిస్తున్నారు. అలా నేర్చుకున్న చిన్నారులు వేదికలపై ప్రదర్శనలు ఇచ్చేస్థాయికి చేరుతున్నారు. స్థానిక బాపూజీ కళా మందిర్లో ఆదివారం శ్రీచరణి సంగీత కళాక్షేత్రంలో సంగీత సాధన చేసి.. పలువురు చిన్నారులు ప్రదర్శన ఇచ్చి తమ తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందాన్ని నింపారు. సంగీతంలో రేడియో గ్రేడ్ ఆర్టిస్టుగా ఎదగాలని కోరిక ఉంది. కష్టపడి గత ఆరేళ్లుగా సాధన చేస్తున్నాను. ఇక్కడి వేదికపై ప్రదర్శన చేయడం సంతోషంగా ఉంది. – పి.జాన్విత, ఇంటర్మీడియట్, శ్రీకాకుళం ● -
● జేఎల్ఎంలుగా పదోన్నతుల్లో మొండిచేయి ● తక్కువ సంఖ్యలో మాత్రమే ప్రమోషన్లు ● నిరాశలో చిరుద్యోగులు
హిరమండలం: పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది గ్రేడ్–2 లైన్మెన్లుగా పిలిచే ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎదుగూబొదుగూ లేదు. విద్యుత్ సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నా.. అత్యవసర పరిస్థితుల్లో సేవలందిస్తున్నా పనికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు. దీంతో ఎనర్జీ అసిస్టెంట్లు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ఇటువంటి తరుణంలో కూటమి సర్కారు వీరికి పదోన్నతులు కల్పిస్తామంటూ ప్రకటన చేసింది. దీంతో జీతాలతో పాటు అన్ని అలవెన్సులు పెరుగుతాయని భావించారు. కానీ కేవలం జూనియర్ లైన్మెన్ పోస్టుల ఖాళీ ప్రాప్తికి మాత్రమే పదోన్నతులు ఇస్తామని చెప్పడంతో వారి ఆశలు నీరుగారిపోయాయి. దీంతో సగం మందికి కూడా పదోన్నతులు లేవని తేలిపోవడంతో వారు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. గ్రామ స్వరాజ్యానికి పెద్దపీట వేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రజలు విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కే విధంగా విధిగా ప్రతి సచివాలయానికి ఒక విద్యుత్ లైన్మెన్ ఉండాలని చెప్పి.. 2019 అక్టోబర్ 2న ఎనర్జీ అసిస్టెంట్లను నియమించారు. జిల్లాలో 750 మంది వరకు నియమితులయ్యారు. అప్పటినుంచి పల్లెల్లో విద్యుత్ కష్టాలు లేకుండా చూడడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరోనా సమయంలో సైతం వీరి నుంచి విశిష్ట సేవలు అందాయి. అయితే అనంతరం ప్రొబేషనరీ పీరియడ్ ముగియడంతో వీరిని వైఎస్సార్సీపీ సర్వారు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించింది. 2024 నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి కావడంతో పదోన్నతులకు సిద్ధపడింది. ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వ హయాంలో ఎనర్జీ అసిస్టెంట్ల పరిస్థితి తీసికట్టుగా మారింది. వీరిని గ్రేడ్–2 లైన్మెన్లుగా గుర్తించినా వీరి జీతం మాత్రం పెరగలేదు. అలవెన్స్లు లభించడం లేదు. వీరితో పనిచేయించుకునే విద్యుత్ శాఖ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా భారీ వేతనాలు లభిస్తున్నాయి. వారితోనే సమాన పనిచేస్తున్న గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లుకు మాత్రం వేతనం రూ.25 వేలు లోపే. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు అందరికీ పదోన్నతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జూనియర్ లైన్మెన్లుగా ప్రమోషన్లు ఇస్తామని చెప్పింది. దీంతో తమ కేడర్తో పాటు జీతాలు పెరుగుతాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయో.. అటువంటి చోట మాత్రమే పదోన్నతులు అని చెప్పడంతో నీరుగారిపోయారు. 700 మందికిపైగా ఉంటే కనీసం 200 మందికి కూడా పదోన్నతులు వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే మండలానికి రెండునుంచి నాలుగు పోస్టులు వరకూ మాత్రమే జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉంటాయి. అయితే ప్రభుత్వం తలచుకుంటే అందరికీ జూనియర్ లైన్మెన్లుగా పదోన్నతులు ఇవ్వొచ్చు. కానీ ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. ప్రమాదకరంగా పనిచేస్తున్న విద్యుత్ గ్రేడ్–2 ఎనర్జీ అసిస్టెంట్లు ఇది చాలా అన్యాయం. గ్రేడ్–2 లైన్మెన్లందరికీ పదోన్నతులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆ ప్రకటనకు కట్టుబడి ఉండాలి. అందరికీ పదోన్నతులు కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలి. తక్కువ జీతంతో పనిచేస్తున్న వారి విషయంలో కనికరం చూపాలి. – సిర్ల ప్రసాద్, సీఐటీయూ నాయకుడు -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం కల్చరల్: ఆంధ్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నియామకాలు చేపట్టింది. శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో పురోహిత క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఆదివారం జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో ఈ నియామక పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలని నినాదాలు చేశారు. సమాఖ్య వ్యవస్థాపకుడు యామిజాల నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సనాతన ధర్మ పరిరక్షణకు, పురోహిత సమాజ సర్వతోముఖాభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ఏకగ్రీవ తీర్మానం మేరకు నూతన నియామకాలు చేశారు. ఇదే నూతన కార్యవర్గం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా పొదిల నారాయణమూర్తి, రాష్ట్ర అధ్యక్షుడిగా తెన్నేటి విద్యాధర శాస్త్రి సునీల్, ప్రధాన కార్యదర్శిగా వారణాసి శ్రీధర్ శర్మలు ఎన్నికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్ పురోహిత ప్రముఖులు పురాణం శేషు, పెంటా శ్రీధర్ శర్మ, పొన్నాల నరసింహమూర్తి, వాహిణీపతి మణిశర్మ, మేడూరి సంతోష్, కూనపల్లి శ్రీనివాస్, భోగాపురపు సూర్యనారాయణ, పవన్ తదితరులు పాల్గొన్నారు. -
వినూత్న ఆలోచన.. విశిష్ట గుర్తింపు
● బొంతలకోడూరు విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు ఎచ్చెర్ల: ఉత్సవాలు, జాతరల సమయాల్లో జరిగే ప్రమాదాలను నివారించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు ప్రశంసలు అందుకుంది. ఈ అంశంపై అమెజాన్ ఫండింగ్ క్వెస్ట్ అలయన్స్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 24 పాఠశాలలు పాల్గొన్నాయి. విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కళాశాలలో ఐదురోజులు పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు శిక్షణ కూడా పొందారు. దేవాలయ జాతరలు, ఉత్సవాలు, పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వేలాది మంది భక్తులు ఒకే చోట చేరటం ద్వారా కొన్ని సార్లు ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు తక్కువగా ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి బొంతలకోడూరు విద్యార్థులు స్మార్ట్ గేట్ ఏ 1, ఎర్లీ డిటెక్షన్–ఇన్స్టెంట్ ప్రొటెక్షన్ వ్యవస్థను ఆవిష్కరించారు. కెమెరాలు, సెన్సార్ల సాయంతో జనసమూహాన్ని పర్యవేక్షించి రద్దీ ఎక్కువైతే అలర్ట్ ఇచ్చి గేట్లను మొబైల్ యాప్ ద్వారా నియంత్రించి తొక్కిసలాటను నివారణ చేసే విధంగా ఒక డివైస్ను రూపొందించారు. వీరి ప్రాజె క్ట్ స్టేట్ లెవెల్లో బెస్ట్ ఇన్నొవేషన్ ప్రాజెక్ట్గా నిలిచింది. కార్యక్రమంలో ఆర్జేడీ విజయ్బాస్కర్, విశాఖపట్నం సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జోగా చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులను ప్రశంసించారు. ప్రాజెక్టును డిజైన్ చేసిన విద్యార్థులు అఖిల్పట్నాయిక్, డిల్లీశ్వరి, కావ్య, చైతన్య, కుమారి, రోహిత్లను, వీరికి మార్గ దర్శకులుగా ఉన్న సైన్స్ ఉపాధ్యాయిని పూర్ణిమలను రాష్ట్ర స్కెర్ట్ ప్రొఫెసర్ నాగమణితో పాటు క్వెస్ట్ అలియన్స్ బృందంతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనందరావు, మాజీ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు, విద్యాకమిటీ చైర్మన్ మాడుగల సత్యానందం, చిన్నబాబు తదితరులు అభినందించారు. -
ఇచ్ఛాపురం.. గంజాయికి ప్రవేశ ద్వారం
ఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రానికి ప్రవేశ ద్వారంగా ఉన్న ఇచ్ఛాపురం గంజాయి అక్రమ రవాణాకు ప్రధాన మార్గంగా మారుతోంది. ఒడిశా, ఆంధ్ర సరిహద్దు ప్రాంతా ల నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు ఇక్కడి రైలు, జాతీయ రహదారి మార్గాలను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు వరుసగా వెలుగు చూస్తున్న కేసులు సూచిస్తున్నాయి. పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు తరచూ దాడులు నిర్వహించి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా.. అక్రమ రవాణా మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదని స్థానికులు అంటున్నారు. రెండేళ్లలో పెరిగిన కేసులు ప్రస్తుత టీడీపీ పాలన రెండేళ్ల కాలంలో ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాల్లో నమోదైన గంజాయి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. స్వాధీనం చేసుకున్న గంజాయి పరిమాణం కూడా గతంతో పోలిస్తే అధికంగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గంజాయి వంటి మత్తుపదార్థాల అక్రమ రవాణాకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఆంధ్రా–ఒడిశా పరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పా టు చేసింది. గంజాయి సాగు, రవాణాపై పోలీసులు, ఎకై ్సజ్ శాఖలు సంయుక్తంగా దాడులు చేసేవి. జాతీయ రహదారులు, చెక్పోస్టుల వద్ద వాహనాలు తనిఖీలు చేసేవారు. రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీసులతో సమన్వయం పెంచుకుని అంతర్రాష్ట్ర సమాచార మార్పిడి ద్వారా స్మగ్లర్లపై నిఘాతో గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు చేపట్టినట్లు అప్పట్లో అధికారులు ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఇచ్ఛాపురం మీదుగా వరుసగా గంజాయి కేసులు వెలుగు చూస్తుండటంతో నిఘా వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పర్యవేక్షణ బలోపేతం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, అక్రమ రవాణాను అరికట్టేందుకు మరింత కఠిన చర్యలు అవసరమని ప్రజలు కోరుతున్నారు. యువత భవిష్యత్కు ముప్పు గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మారుస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యా ర్థులు, యువకులు మాదక ద్రవ్యాల ప్రభావానికి లోనైతే వారి విద్య, ఉపాధి, కుటుంబ జీవితం దెబ్బతింటుందని చెబుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు యువకులు రవాణా ముఠాలకు సహకరిస్తుండటంతో మరింత ప్రమాదకరంగా మారింది. గత నెలలో ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందిన భుక్త బలరాం అనే యువకుడు 2.100 కిలోల గంజాయితో పట్టుపడటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి జిల్లా పోలీస్ స్టేషన్కు తరలించగా, మరుసటి రోజు ఏప్రిల్ 7న బాత్రూమ్ కిటికీకి తువ్వాలును మెడకు చుట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధి లోని పురుషోత్తపురం గ్రామానికి చెందిన 23 ఏళ్ల బుగ్గ చిరంజీవి ఒడిశా రాష్ట్రం చంద్రగిరి ప్రాంతానికి చెందిన మాన్యువల్ బీరా, టీన్ఫోరియా గ్రామానికి చెందిన రవీంద్రసేధి, సింహాచల్ సేధి తదితరుల దాడులు చేస్తున్నాం ఎస్పీ ఆదేశాలు మేరకు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాం. సరిహద్దులను రవాణా కేంద్రాలుగా చేసుకొని కొంత మంది అక్రమ వ్యాపారాలు సాగిస్తున్న నేపథ్యంలో ముఖ్య కూడళ్లలో, రైల్వే కూడళ్లలో నిఘా పెట్టి వరుస దాడులు చేస్తున్నాం. యువతకు పెద్ద మొత్తంలో డబ్బు ఆశ చూపి తెర వెనుక మాఫియా దందా సాగిస్తున్నట్లు సమాచారంతో వారిపై నిఘా ఉంచడం జరిగింది. కేవలం పట్టివేతలకే పరిమితం కాకుండా సరఫరా గొలు సును పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. అదే విధంగా రాపిడ్ టెస్ట్ల ద్వారా గంజాయి వినియోగదారులను గుర్తిస్తున్నాం. – మీసాల చిన్నంనాయుడు, సీఐ, ఇచ్ఛాపురం రైళ్లు, రహదారులే ప్రధాన మార్గాలు నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ లారీ డ్రైవర్లు తదితరులకు విక్రయిస్తుండటంతో పాటు తమిళనాడుకు చెందిన గంజాయి వ్యాపారి రమేష్ వేలాయుధంకు కూడా అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీటన్నింటిపై గతంలో ఇతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఐదేళ్లలో ఇచ్ఛాపురం సర్కిల్లో నమోదైన గంజాయి కేసులు సంవత్సరం కేసులు కిలోలు ఖరీదు వాహనాలు అరెస్టయిన వారు 2022 04 162.01 రూ.4,86,030 02 19 2023 05 112.390 రూ.2,84,370 03 20 2024 20 371.51 రూ.8,94,930 00 84 2025 42 642.870 రూ.21,58,790 07 79 2026 08 85.28 రూ.1,95,840 01 16 (నేటి వరకు)ఇచ్ఛాపురం మీదుగా వెళ్లే ప్రధాన రైల్వే మార్గం, జాతీయ రహదారి–16 గంజాయి రవాణాదారులకు అనుకూలంగా మారింది. రైళ్లలో ప్ర యాణికుల వేషంలో, బస్సులు, కార్లు, లారీలలో ప్రత్యేకంగా దాచి పెట్టి గంజాయిని తరలిస్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నా యి. 90 శాతం కేసులు స్థానిక రైలు మార్గంలో పోలీసులకు చిక్కినవే. -
ఏళ్లుగా పాతుకుపోయారు
సంతబొమ్మాళి: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణం. నిబంధనలకు అనుగుణంగా ప్ర తి మూడేళ్లకు ఒక సారి బదిలీలు జరుగుతుంటాయి. అయితే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో భాగంగా సంతబొమ్మాళిలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిబంధలేవీ వర్తించవు. ఏళ్ల తరబడి ఉపాధి హామీ పథకంలో పాతుకుపోయి ఇష్టానుసారంగా వ్యవహరించి ఆడిందే ఆట.. పాడిందే పాటగా కొనసాగుతున్నా రు. ఉన్నతాధికారులు ఎందరు మారినా మేనేజ్ చేసుకుని తమ స్థానాన్ని పదిలం చేసుకోవడంలో వీరు దిట్ట. రెండేళ్ల కిందట స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదికలో అప్పటి డ్వామా పీడీ సుధాకర్ ఏళ్ల తరబడి ఒకే చోట పని చేసిన ఉపాధి హామీ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసి బదిలీ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత పీడీ సుధాకర్ బదిలీ అయి వెళ్లిపోవడంతో మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చింది. మురపాకల మురళి 2013 జనవరిలో సంతబొమ్మాళి ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్గా జూయిన్ అయ్యారు. ఉప్పా డ ధర్మారావు 2013 మే నెలలో టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యారు. వీరిద్దరూ 13 ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నా ఇప్పటివరకు బదిలీలు జరగలేదు. 2019 సంవత్సరంలో టెక్నికల్ అసిస్టెంట్గా టి.రాజారావు, కంప్యూటర్ ఆపరేటర్గా గంగి జయకృష్ణరావు, జె.బాబూరావు, బి.జగదాంబ చేరారు. ఏడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారు. 2021 సంవత్సరం నుంచి జి.మురళీకృష్ణ, 2022 సంవత్సరం నుంచి బి.మన్మధరావు, జి.లక్ష్మణరావు, ఎస్.రమేష్కుమార్ టెక్నికల్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే చోట పని చేయడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇన్చార్జిలే దిక్కు మండలంలో సుమారు 15వేల మంది ఉపాధి వేతనదారులు పని చేస్తున్నా రెగ్యులర్ ఏపీఓ, ఈసీ పోస్టులకు నియామకాలు ఏళ్లుగా లేవు. ఇన్చార్జిలే దిక్కుగా మారారు. అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్న పంగ నరసింహమూర్తి ఉపాధి హామీ ఏపీఓగా వ్యవహరిస్తున్నారు. అలాగే మరో టెక్నికల్ అసిస్టెంట్ జి.లక్ష్మణరావు ఇంజినీరింగ్ కన్సల్టెంట్ (ఈసీ)గా పని చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ పో స్టులు వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఎంపీడీఓ జయంత్ ప్రసాద్ను అడుగగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తానని అన్నారు. -
యాదవులను బీసీ–ఏ కేటగిరిలోకి మార్చాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): యాదవులను బీసీ–డీ నుంచి బీసీ–ఏ కేటగిరిలోకి మార్చాలని ఎమ్మెల్సీ, యాదవ సంఘం అధ్యక్షుడు నర్తు రామారావు కోరారు. నగరంలోని ఒక ప్రైవేట్ భవనంలో యాదవ విద్యా వైజ్ఞానిక చైతన్య సదస్సు–2026, ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నర్తు రామారావు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ఫలాలు జనాభా ప్రాతిపదికన యాదవులకి దక్కాలన్నారు. యాదవ కులానికి చెందిన నిరుపేద విద్యార్థులు గ్రూప్–1, 2లకు ప్రిపేర్ అయితే ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐఐటీలో ఉత్తమ ఫలితాలు సాధించినవారికి ప్రోత్సాహకాలు అందించనున్నామన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో యాదవ ఉద్యోగుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు డొక్కరి ధనుంజయరావు, ప్రధాన కార్యదర్శి కొర్రాయి రామారావు, కూస వెంకటరమణ, నర్తు సోమేశ్వరరావు, మామిడి శ్రీనివాస్, దాసరి ఈశ్వరరావు, వంకల విజయకుమారి, పాలిన శ్రీనివాసరావు, కాళ్ల జయదేవ్, దాసరి రాజు, కుజ్జ తాతారావు, ఇప్పిలి జగదీష్, ఈ.వి.సత్యనారాయణ, కిల్లాన భోజ్కుమార్, వంజరాపు రాజులు, గద్దిబోయిన కృష్ణయాదవ్, కలగ గోపాల్, వెంకటరమణ, గజ్జి షన్ముఖ, వంజరాపు కసవయ్య, కిల్లాన శ్రీనివాస్, కిల్లాన ఫల్గుణరావు, ఇప్పిలి జగదీష్, సబ్సి జానకీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
నది రోదించేలా..
నరసన్నపేట: మండల పరిధిలోని వంశధార నదిలో అక్రమార్కుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతం ఆనవాళ్లు లేకుండా చేస్తున్నా రు. అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తూ చోద్యం చూస్తుండటంతో అక్రమార్కులు మరింతగా రెచ్చి పోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన రెండేళ్ల నుంచీ ఇసుక అక్రమార్కులు మరింత పెరిగారు. వీరికి స్థానిక కూటమి నాయకుల అండదండలు ఉండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. మండలంలో గోపాలపెంట, మడపాం, బుచ్చిపేట, చేనులవలస వద్ద నదిలోకి రహదారులు ఏర్పాటు చేశారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. రోజుకు వందల లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. పరిమితికి మించి ఇసుకను లోడ్ చేస్తుండటంతో రోడ్లు శిథిలమవుతున్నాయి. మడపాం వద్ద మూడు వంతెనలు ఉన్న చోట కూడా ఇసుక తవ్వకాల అక్రమ వ్యవహారం నిబంధనలకు విరుద్ధంగా సాగుతూనే ఉంది. దీంతో వంశధార నది స్వరూపం మారిపోతోంది. నదిలో ఎక్కడికక్కడ చెరువుల మాదిరిగా గోతు లు కనిపిస్తున్నాయి. నదిలో నీటి ప్రవాహ దిశను తమకు అనుకూలంగా మార్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అంతా అనధికారికంగా జరుగుతున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వాల్టా చట్టం ప్రకారం ప్రకృతి వనరులను కాపాడాల్సిన పొల్యూషన్ బోర్డు అధికారులు, పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు. దీంతో వందల క్యూబిక్ మీటర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది. నది ఒడ్డున వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను డంప్ చేస్తున్నారు. ఈ ఇసుక కుప్పలు కొండలను తలపిస్తున్నాయి. రోడ్డుపై ఇసుక మేటలు ఇసుక అక్రమ రవాణాతో మండల పరిధిలోని చేనులవలస, బుచ్చిపేట ఆర్అండ్బీ రోడ్డుపై ఇసుక మేటలు ప్రమాదాలను తెచ్చిపెడుతున్నాయి. వాహనాలు స్లిప్ అవుతున్నాయి. ఆటోలు అదుపు తప్పుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో చేనులవలస, బుచ్చిపేట గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక మేటలతో ధూళి రేగుతోందని, ఏదైనా వాహనం వెళ్తే వెనుక ఉండలేక పోతున్నామని, ప్రయాణం చేయలేకపోతున్నా మని వాపోతున్నారు. అలాగే ఇసుక తరలింపుతో గోపాలపెంట, పోతయ్యవలస రోడ్డు కూడా అధ్వానంగా మారింది. మడపాంలో కూడా ఇదే పరిస్థితి. అధికారులు చర్యలు తీసుకోవాలని ఇసుక అక్రమ తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతున్నారు. కాగా మండలంలో ఇసుక అక్రమ ర్యాంపులు అన్నింటినీ ఒకరే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఇసుక ద్వారా ఆ పెద్దాయనకు రోజుకు కనీసం రెండు లక్షల ఆదాయం వస్తున్నట్లు సమాచారం. వంశధార నదిలో అక్రమార్కుల విధ్వంసం పట్టించుకోని అధికార గణం నరసన్నపేట మండలంలో యథేచ్చగా ఇసుక దోపిడీ -
పెళ్లయిన 21 రోజులకే..
ఆరోగ్య రక్షణకు ఓఆర్ఎస్ మండు వేసవిలో ఓఆర్ఎస్ ఓ సంజీవని. ప్రతి ఇంటిలో ఉండాల్సిన పానీయం. –8లో● రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ● కన్నీరుమున్నీరైన భార్య, కుటుంబ సభ్యులు సంతబొమ్మాళి: కాళ్ల పారా ణి ఆరలేదు.. ఇంటికి కట్టిన తోరణాలు వాడలేదు.. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టి నెలయినా కాలేదు.. అప్పుడే ఆ యువకుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. కట్టుకున్న భార్యకు కన్నీళ్లు మిగిల్చి, కన్నవారి మదిలో శోకాన్ని రగిల్చి పెళ్లయిన 21 రోజులకే మృత్యుదేవత ఒడికి చేరుకున్నాడు. మండలంలోని మూలపేట గ్రామానికి చెందిన దారపు రాజు (27) ఆదివారం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈయనకు మే 10వ తేదీన వివాహమైంది. వివరాల్లోకి వెళితే.. మూలపేట గ్రామానికి చెందిన దారపు రమణరెడ్డి, ఎర్రమ్మ కుమారుడు దారపు రాజు సీమెన్గా పని చేస్తున్నాడు. రాజుకు కోటబొమ్మాళి గ్రామానికి చెందిన అమ్మాయితో మే నెల 10వ తేదీన వివాహం జరిగింది. కోటబొమ్మాళిలో ఉంటున్న తన అత్తవారి ఇంటికి తన భార్య దీపికతో కలిసి ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై రాజు వెళ్లాడు. అక్కడ కొద్ది సేపు ఉండి తిరిగి ద్విచక్రవాహనం మీద స్వగ్రామం మూలపేట రా వడానికి బయలు దేరగా సవరపేట జంక్షన్ వద్ద అతివేగంగా వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కాసేపటి కిందటే ఇంటి నుంచి బయల్దేరిన భర్త చనిపో యాడనే వార్త చెవిన పడడంతో ఆ నవ వధువు నిశ్చేష్టురాలైంది. భర్తను తలచుకుని గుండెలు అవిసిపోయేలా రోదించింది. ఇరు కుటుంబాలు, బంధువులు, గ్రామస్తుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహాన్ని కోటబొమ్మాళి సామాజిక ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సంతబొమ్మాళి ఎస్ఐ వై.సింహాచలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● ‘ఏమరపాటుగా ఉంటే ఓట్లు పోతాయి’
ఎన్నికల కమిషన్ అధికారికంగా నిర్వహిస్తు న్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఐఆర్) ప్రక్రియ చాలా కీలకమని, దీనిలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా మన ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోంపేట పట్టణంలోని వీబీఆర్ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ బూత్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఓటరును కాపాడుకోవాలని పార్టీ ‘సర్’ కార్యక్రమం రాష్ట్ర పరిశీలకుడు హర్షవర్ధన్రెడ్డి అన్నారు. మన ఓటుతోపాటు మన పార్టీ మద్దతుదారుల ఓటు కాపాడుకోవటమే మన పార్టీ 2029 గెలుపునకు నాంది అన్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా నియమించిన బూత్ లెవెల్ ఏజెంట్లు ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు సైనికుల్లా పనిచేయాలని పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. – కంచిలి, సోంపేట -
ఓఆర్ఎస్..!
ఆరోగ్య రక్షణకు.. ● జిల్లాలో మండుతున్న ఎండలు ● ఓఆర్ఎస్తో తక్షణ ఉపశమనం ● ఇంట్లోనే తయారు చేసుకునే అవకాశంపాతపట్నం: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. శరీరంలో నీరు ఆవిరైపోయి జనాలు నీరసించి పోతున్నారు. ఠారెత్తిస్తున్న ఎండల తీవ్రతను తట్టుకునేందుకు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకునేందుకు వేసవిలో ప్రతి ఒక్కరూ వైద్యుల సూచనలు పాటించడం అవసరం. సాధారణం కంటే అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఈ ఏడాది ఉన్నాయి. దీంతో శ్రామిక, ఉద్యోగ, వ్యాపారులు విధి నిర్వహణలో భాగంగా అనివార్య పరిస్థితుల్లో మండే ఎండల్లో తిరగక తప్పదు. ఉపాధి పనులు, ఇతరత్రా వ్యవసాయ పనులకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా మండుటెండలో పనులు చేయాల్సి వస్తుంది. అటువంటి వారు ఎండ ప్రభావానికి లోనుకాకుండా తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓఆర్ఎస్తో మేలు ఎండల్లో పనిచేసే సమయంలో శరీరంలో సహజంగా నీటిశాతం తగ్గిపోవడం వలన వడదెబ్బకు గురవుతుంటారు. ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ద్రావణం ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు. స్థలం, కాలాన్ని బట్టి శరీరాన్ని నిర్దేశించిన ఉష్ణోగ్రతలో ఉంచుకోవాలి. మెదడులో హైపోథలామస్ అనే భాగం శరీరంలోని వేడిని క్రమబద్ధీకరిస్తుంది. తగిన నీటిని తాగకపోయినా, ఎండలో ఎక్కువ తిరిగినా హైపోథలామస్ భాగమే అధిక ఉష్ణోగ్రతకు లోనై క్రమబద్ధీకరించే పని చేయలేదు. ఈ స్థితిలో తల తిరగడం, నీరసం, నిస్సత్తువ, తలనొప్పి, జ్వరం, చీకటి కమ్మినట్లు అనిపించడం, వాంతి అవుతున్న భావన కలగడం వంటి లక్షణాలు వడదెబ్బకు గురైనట్లు నిర్ధారిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్యారోగ్య కార్యకర్తల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అటువంటి సమయాల్లో వీటిని తీసుకోవడం వలన వెంటనే ఉపశమనం లభిస్తుంది. సమయానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ అందుబాటులో లేకపోతే ఇంటిలోనే ఉప్పు, పంచదార, నీరు సాయంతో ఈ ద్రావణాన్ని తయారు చేసుకోవచ్చు. లీటరు నీటిలో చిటికెడు ఉప్పు, అరస్పూన్ పంచదారను కలిపి తాగవచ్చు. ఎండ తీవ్రతకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తినా దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రిని సంప్రదించడం అవసరం. ఓఆర్ఎస్ తయారీ ఇలా... ఓఆర్ఎస్ అనేది వివిధ లవణాల మిశ్రమంతో కూడిన 20.5 గ్రాముల సోడియం క్లోరైడ్. దీనిలో 1.5 గ్రాముల పొటాషియం క్లోరైడ్, 2.9 గ్రాముల సోడియం సిట్రేట్, 13.5 గ్రాముల డెక్స్ట్రోజ్ ఉంటాయి. ఈ పౌడర్ ప్యాకెట్ను సురక్షితమైన లీటరు నీటిలో కలిపి రోజు మొత్తంలో వయస్సును బట్టి తగిన మోతాదులో తాగాలి. మితిమీరిన మోతాదులో తాగడమూ అనర్థాలు తెచ్చిపెడుతుంది. వడదెబ్బ బారిన పడినవారు డీ హైడ్రేషన్కు గురవుతారు. అటువంటి సమయంలో ముందుగా ఓఆర్ఎస్ ప్యాకెట్ను వినియోగించడం వల్ల కొంతవరకు కోలుకుంటారు. ఓఆర్ఎస్లో అన్ని రకాల మినరల్స్ ఉంటాయి. అవసరమైనవారు తీసుకోవచ్చు. – డాక్టర్ జి.వేణుగోపాల్, సూపరింటెండెంట్, పాతపట్నం సీహెచ్సీ -
జిల్లా కేంద్రంలో కార్డన్ సెర్చ్
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పోలీస్స్టేషన్ పరిధి పెద్దరెల్లివీధిలో ఆదివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. దాదాపు 70 మంది సిబ్బందితో 250 ఇళ్లను సెర్చ్ చేసి సరైన పత్రాలు, రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. సీఐ పి.ఈశ్వరరావు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, గంజాయి, మద్యం, ఇతర అనధికార పేలుడు పదార్థాల అక్రమ నిల్వలు, అపరిచిత, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా పెంచాలనే ఉద్దేశంతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు సెర్చ్ చేసినట్లు తెలిపారు. వ్యక్తుల ఆధార్కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు, వాహనాల రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్ఐలు హేమంత్ కల్యాణ్, చంద్రకళ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అరసవల్లి: జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు సత్వర సేవలందించడంలో ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఉత్తమ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారని విద్యుత్ శాఖ ఇంజినీర్లు ప్రశంసించారు. సర్కిల్ ఎస్ఈగా పనిచేసిన నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదివారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా స్థానిక విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ ఆవరణలో కృష్ణమూర్తి దంపతులను విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, సిబ్బంది సంయుక్తంగా ఘనంగా సత్కరించారు. జిల్లా సర్కిల్లో ఎస్ఈ హోదాలో ఉన్నతాధికారులతో ఎంతో గౌరవాన్ని పొంది.. తద్వారా జిల్లా సర్కిల్కు మంచి గుర్తింపు తెచ్చారని వక్తలు కొనియాడారు. అత్యధిక కాలం జిల్లా ఎస్ఈగా పనిచేసి, ఇక్కడే పదవీ విరమణ చేస్తూ రికార్డు సృష్టించారని ఇన్చార్జి ఎస్ఈ సురేష్కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పైడి యోగేశ్వరరావు, బయ్యన్నాయుడు, నరసింగ్కుమార్, యజ్ఞేశ్వరరావు, విష్ణుమూర్తి, విశ్రాంత విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు, ఎస్ఈవో శ్రీనివాసరావు, ఏఏవోలు మహంతి ప్రభాకరరావు, సుదర్శనరావు, జేఏవోలు సనపల వెంకటరావు, ఆర్.శ్రీనివాస్, ఏఈలు జె.సురేష్కుమార్, కె.జయరాం, కమల్హాసన్, జిల్లా విద్యుత్ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతి
రణస్థలం: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన కొమర లక్ష్మణ శనివారం చింతపల్లి సమీపంలో సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. దీంతో ఆదివారం రణస్థలం మండలంలోని కొవ్వాడ సముద్ర తీరంలో కొమర లక్ష్మణ మృతదేహం లభ్యమైంది. జే.ఆర్.పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.పీఆర్ ఏఈ కృష్ణారావుకు సన్మానం టెక్కలి: టెక్కలి డివిజన్ పంచాయతీరాజ్ ఏఈ కణితి కృష్ణారావు ఉద్యోగ విరమణ సందర్భంగా ఆదివారం పట్టణంలో ఆత్మీయులు, అధికారుల సమక్షంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కృష్ణారావు, సుబ్బమ్మ దంపతులను సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ సూర్యప్రకాశ్, ప్రదీప్కుమార్, విశ్రాంత ఎస్ఈ కేఎంవీ ప్రసాదరావు, కేసీహెచ్ మహంతి, మురళీమోహన్, మందస, కంచిలి ఎంపీపీలు డి.దానయ్య, పి.దేవదాస్రెడ్డి, కంచిలి ఎంపీడీవో వి.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. సత్ప్రవర్తనతో నడుచుకోవాలి శ్రీకాకుళం క్రైమ్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి, సత్ప్రవర్తనతో నడుచుకోవాలని జిల్లాలో రౌడీషీటర్లను పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్ఐ ఎం.హరికృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎవరైనా భూకబ్జాలు, ఆర్థిక లావాదేవీల్లో పాల్గొంటే సహించేది లేదని స్పష్టం చేశారు. విజయనగరం క్రైమ్: శ్రీకాకుళానికి చెందిన దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉంటున్న ఓ రూమ్లో ఫ్యాన్కు తన చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. దుర్గాభవాని విజయనగరంలోని రాజీవ్నగర్ కాలనీలో రూమ్ తీసుకుని గ్రూప్–2,పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. రూమ్ పక్కనే ఉన్న రీడింగ్ రూమ్కు చదువుకోవడానికి వెళ్లి తిరిగి రూమ్కు వచ్చి తనకు పని ఉందని సహచర స్నేహితురాలు మౌనికకు చెప్పి పై రూమ్లోకి వెళ్లింది. ఎంతకీ దుర్గాభవాని పై రూమ్లోనుంచి రాకపోవడంతో మౌనిక వెంటనే విజయనగరంలోనే ఉంటున్న దుర్గాభవాని సోదరుడికి ఫోన్లో విషయం తెలియజేసింది. దీంతో సోదరుడు వెంటనే వచ్చి పై రూమ్ తలుపులు పగలగొట్టి లోపల దుర్గాభవాని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించి ఆమెను కిందికి దించి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సీఐ శ్రీనివాస్ చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
శ్రీకాకుళం
హాయి చాటున అపాయంఏసీలు ప్రమాదకరంగా మారుతున్నాయి. అక్కడక్కడా పేలుతున్నాయి. –8లోనరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేట పరిధిలోని సంతపేట ఎదురుగా ఉన్న కొత్తకర్ర చెరువు పరిసరాల్లో సీఎం టూర్ సందర్భంగా వేసిన చెత్తను పంచాయతీ అధికారులు ఎట్టకేలకు తొలగించే పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్టర్లతో వందకు పైగా చెత్త లోడులు డంపింగ్ యార్డ్కు తరలించారు. ‘సాక్షి’లో శుక్రవారం ‘కోట్లు పోయాయి.. చెత్త మిగిల్చాయి’ అనే శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు వెంటనే స్పందించారు. శుక్ర, శనివారాల్లో కొత్త కర్ర చెరువు వద్ద వేసిన చెత్త తొలగించే పనులు చురుగ్గా చేపట్టారు. స్వయంగా జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి చెరువు వద్ద వేసిన చెత్తను పరిశీలించి స్థానిక ఈఓ ద్రాక్షాయినికి, పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశా రు. దీంతో ఆమె పంచాయతీ ట్రాక్టర్లు, జేసీబీ సహకారంతో చెత్తను తొలగించే పనులు చేయిస్తున్నారు. ఆదివారం నాటికి చెత్తను పూర్తిగా తొలగిస్తామని ఈఓ అన్నారు. మళ్లీ ఈ పరిసరాల్లో చెత్త వేయవద్దని ఆమె సూచించారు. ఈ మేరకు బోర్డులు పెడతామన్నారు. -
ఏపీపీ ఈసీఈ పరీక్ష పరిశీలకునిగా శ్రీనివాసరావు
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్సిటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్–1 డాక్టర్ ఎం.శ్రీనివాసరావు ఏపీపీ ఈసీఈ–2026కు పరీక్ష పరిశీలకునిగా నియమితులయ్యారు. రెండేళ్ల డీపీఈడీ, బీపీఈడీల్లో ప్రవేశానికి వచ్చే నెల 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ ఈ పరీక్షలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) క్యాంపస్ కేంద్రంగా నిర్వహించనుంది. ఈ పరీక్షల్లో భాగంగా నిర్వహించే శారీరక దారు ఢ్యం, క్రీడా నైపుణ్యాలు వంటి వాటిని పరిశీలించి పర్యవేక్షించేందుకు డాక్టర్ శ్రీనివాసరావును నాగార్జున వర్సిటీ నియమించింది. ఈ నియామకంపై వర్సిటీ వర్గాలు ఆయనకు అభినందనలు తెలిపాయి. రణస్థలం: రైతులకు ఇచ్చే యూరియాను పరిశ్రమల్లో అక్రమంగా నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరమని వ్యవసాయశాఖ జేడీఏ వైవీ మురళీకృష్ణ తెలిపారు. మండలంలోని యునైటెడ్ బ్రూవరీస్, లిక్వినాక్స్ గ్యాస్ పరిశ్రమలో యూరియా నిల్వలపై వ్యవసాయశాఖ, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగంతో కూడిన టాస్క్ ఫోర్స్ టీమ్ సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో సోదాలు చేసి అక్రమ నిల్వలు లేవని గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారం యూరియా అక్రమ నిల్వలు ఉంచి తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పొందూరు: పొందూరులో చేనేత, ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుతో నేత కార్మికులతో పాటు, వడుకు కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలో రాపాక కూడలికి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఖాదీ, చేనేత క్లస్టర్ల ఏర్పాటు కో సం రెవెన్యూ అధికారులు సూచించిన సర్వేనంబర్ 310–9లో స్థలాన్ని శనివారం పరిశీలించారు. క్లస్టర్కు 5 ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ స్థలానికి ఎలాంటి సాంకేతిక సమ స్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి స్థలాన్ని సిద్ధం చేయాలని తహసీల్దార్ ఆర్.వెంకటేష్ను ఆదేశించారు. క్లస్టర్ ఏర్పాటుతో ఖాదీ, చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాలకు విస్తృత మా ర్కెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని చెప్పారు. అనంతరం పొందూరులోని సాయి బాబా చేనేత సహకార సంఘం ఆవరణలో ఉన్న భవనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట ఎంపీఈడీఓ ఎస్.వాసుదేవరావు, మేజర్ పంచాయతీ ఈఓ పి.జగదీష్, ఏపీఓ శ్రీనివాసరావు ఉన్నారు. శ్రీకాకుళం అర్బన్: మలేరియా వ్యతిరేక మాసో త్సవ ర్యాలీ జూన్ నెల ఒకటో తేదీ సోమవారం నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె.అనిత తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం మలేరియా వ్యతిరేక మాసోత్సవ ర్యాలీ బ్యానర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ‘మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు’ సందర్భంగా శ్రీకాకుళం వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం నుంచి ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ర్యాలీకి సిబ్బంది మధ్యాహ్నం 3.30 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. -
అందెల రవమిది..
నృత్య పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రదర్శనతో గుర్తింపు పొందాలని ఆసక్తితో శిక్షణ తీసుకుంటున్నా.స్టేజ్పై నృత్య ప్రదర్శన ఇవ్వాలని కోరిక. నృత్య గురువు మంచి శిక్షణ ఇస్తున్నారు. – మోక్ష, 7వ తరగతి, దమ్మలవీధి డ్యాన్స్ అంటే ఇష్టం. అందుకే శిక్షణ పొందుతున్నా. నా సోదరితో పాటు క్లాస్కు వస్తున్నా. – తన్మయి, 6వ తరగతి, బాదుర్లపేట డ్యాన్సు నేర్చుకొని ప్రదర్శ నలు ఇస్తా. టీవీల్లో చూసి సి నిమా పాటలకు డ్యాన్సు చే స్తుంటే మా తల్లిదండ్రులు ఇక్కడ వేసవి శిక్షణలో చేర్పించారు. – యశశ్విని, 7వ తరగతి, హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీకాకుళం కల్చరల్: వేసవి సెలవులు ముగింపు దశకు వస్తున్నాయి. సరదాలు, షికార్లతో పాటు ఈ సెలవుల్లో కొందరు నృత్యాలు, గీతాలాపన, చిత్రాలు, శిల్పాల రూపకరణ నేర్చుకున్నారు. జిల్లా కేంద్రంలో నృత్య శిక్షణను చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు. పాతశ్రీకాకుళంలోని కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న లాఫింగ్ క్లబ్ ఆధ్వర్యంలో నృత్య గురువు టి.నీరజ సుబ్రహ్మణ్యం ఇస్తున్న శిక్షణకు హాజరవుతూ తమలోని టాలెంట్కు పదును పెడుతున్నారు. ఈ చిన్నారులు ప్రతి రోజూ ఉదయం భరత నాట్యం, కూచిపూడిలో శిక్షణ పొందుతున్నారు. జూన్ 4 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉచితంగా నేర్పుతున్న వేసవి శిబిరానికి ఎంతో మంది చిన్నారులు నేర్చుకునేందుకు వస్తున్నారు. వీరిలో కొందరితో వేసవి శిబిరం ముగింపు సమయంలో ప్రదర్శన ఇప్పించేందుకు తగిన తర్ఫీదు ఇస్తున్నా. చాలా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. – టి.నీరజ, నాట్య గురువు -
రైతు రుణాలపై అదనపు వడ్డీ వసూలు
● ఎల్ఎన్పేట పీఏసీఎస్లో గోల్మాల్ ● సీఈఓపై అధ్యక్షుడి ఆరోపణలు ● వడ్డీ వివరాలపై ప్రత్యేక కరపత్రం విడుదల హిరమండలం: ఎల్ఎన్పేట పీఏసీఎస్లో సరికొత్త అవినీతి అంశం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పీఏసీఎస్ అధ్యక్షుడు కాగాన మన్మధరావు వర్సెస్ సీఈఓ సింహాచలం అన్నట్టు పరిస్థితి ఉంది. రైతు లు తీసుకున్న రుణాలపై సీఈఓ అధిక వడ్డీ వసూ లు చేస్తున్నారన్న ఆరోపణలపై అధ్యక్షుడు మన్మధరావు మాట్లాడారు. పీఏసీఎస్ పరిధిలో లక్షల రూపాయలు అదనంగా వడ్డీ, డాక్యుమెంట్ చార్జీ రూపంలో వసూలు చేసినట్టు తెలిపారు. రైతుల వద్ద నుంచి వసూలు చేసిన వడ్డీకి ఇంతవరకు రైతులకు రశీదులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. రైతులు అదనంగా వడ్డీ చెల్లించాల్సిన పనిలేదని తేల్చిచెప్పారు. ఇంత రుణానికి ఇంతే వడ్డీ కట్టాలని, అంతకు మించి కట్టాల్సిన పనిలేదంటూ ఆయన ఒక కరపత్రాన్ని నేరుగా రైతులకు అందించారు. కట్టిన వడ్డీకి రశీదులు పొందాలని, రశీదులు ఇవ్వకుంటే తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. సీఈఓ సింహాచలంపై ఎప్పటి నుంచో అదనపు వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం అధ్యక్షుడు కాగాన మన్మధరావుకు తెలియడంతో ఆయన ప్రశ్నించినట్టు తెలుస్తోంది. రైతులకు రుణాలు, అదనపు వడ్డీల వసూలు రూపంలో భారీగా గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
సంగీత మహిమకు గిన్నిస్ దాసోహం
పోలాకి: మండలంలోని కొవిరిపేట గ్రామానికి చెందిన చోడిపిల్లి మహిమకు గిన్నిస్ రికార్డ్లో చోటు లభించింది. పుట్టుక నుంచి ప్రత్యేక అవసరాలు కలిగిన మహిమ ఏదైనా నైపు ణ్యాన్ని సంపాదించాలని పట్టుదలగా ఉండేది. కుమార్తె కోరిక మేరకు తల్లిదండ్రులు ఆమెకు కీ బోర్డు నేర్పించారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి విక్టరీ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన గిన్నిస్ అచీవర్స్ మీట్లో మహిమ కీబోర్డును గంటపాటు నిరంతరాయంగా వాయించి రికార్డు సృష్టించింది. హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 22 దేశాల నుంచి 2వేల మంది వాద్య కారులు పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చినందున నిర్వాహక సంస్థ వ్యవస్థాపకుడు అగస్టిన్ దండింగి ఆధ్వర్యంలో అవార్డు అందించారు. మహిమ తల్లిదండ్రులు స్టీఫెన్రావు, మార్తలు హర్షం వ్యక్తం చేశారు. -
డీఎస్సీ అక్రమాలపై నిరసన ర్యాలీ విజయవంతం చేయండి
నరసన్నపేట: డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాలో తీవ్ర అవకతవకలు జరిగాయని, మెరిట్ లిస్టు ప్రకటించకుండా నచ్చిన వారికి పోస్టులు అమ్ముకున్నారని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. దీన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ అభ్యర్థుల ఎంపికలో తీవ్ర అవకతవకలు జరిగాయని అన్నారు. ప్రధానంగా స్పోర్ట్స్ కోటాలో అర్హులైన అభ్యర్థులకు కాకుండా తమకు నచ్చిన వారికి డబ్బులకు ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్నారని తెలిపారు. స్పోర్ట్స్ కోటాలో మెరిట్ జాబితా విడుదల చేయకపోవడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఒక్కో పోస్టు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ అమ్ముకున్నారని విమర్శించారు. నరసన్నపేటలోనే అనిల్ అనే అభ్యర్థి తీవ్రంగా మోసపోయారని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ అనిల్ తిరుగుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని అన్నారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐతో ఎంకై ్వరీ చేయించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకల్లా జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: యువత భవిష్యత్ను నాశనం చేస్తున్న గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉక్కుపాదం మోపాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆయన అధ్యక్షతన ‘నార్కోటిక్స్ కోఆర్డినేషన్ సెంటర్’, రోడ్ సేఫ్టీ కమిటీలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, రవాణా, పోలీస్, ఎన్హెచ్ఏఐ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ గంజాయి కట్టడితో పాటు రహదారి ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరఫున పాల్గొన్న అదనపు ఎస్పీ కేవీ రమణ మాట్లాడుతూ.. జిల్లాలో గడిచిన మార్చి, ఏప్రిల్ నెలల్లో మొత్తం 18 కేసులు నమోదు చేసి, 119.53 కిలోల గంజాయిని, 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 40 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఏపీకి చెందిన వారు 17 మంది కాగా.. ఒడిశా, తమిళనాడు, తెలంగాణ, కేరళ, దిల్లీ రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. సమావేశంలో రణస్థలం వద్ద జాతీయ రహదారి. విస్తరణ పనులు, శ్రీకాకుళం బైపాస్ జంక్షన్ వద్ద త్వరలో చేపట్టనున్న అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. -
గంజాయితో వ్యక్తి అరెస్టు
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని సోంపేట రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని కంచిలి పోలీసులు శనివారం పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్ర పరిధి ఝార్సుగుడ జిల్లా గుమదెరా గ్రామానికి చెందిన అభినవ్ సింగ్ అనే యువకుడు మల్కన్గిరి జిల్లా సోమంతపూర్ గ్రామానికి చెందిన సుమన్ వద్ద తాను సేవించడానికి, అమ్ముకోవడానికి గానూ 3.370 కిలోల గంజాయిని కొనుగోలు చేశాడు. తర్వాత ఈ గంజాయిని నలుపు రంగు బ్యాగ్లో ప్యాక్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బెంగుళూరు తరలించేందుకు సిద్ధమయ్యాడు. దీనిలో భాగంగా సోంపేట రైల్వేస్టేషన్ దగ్గరలోని రైల్వే పార్కు ముందు ఉన్న బీటీ రోడ్డు వద్ద వేచి ఉండగా కంచిలి ఎస్ఐ పి.పారినాయడు, పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అతని వద్ద నుంచి గంజాయి నిల్వతో పాటు ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత దీనిపై సోంపేట సీఐ బి.మంగరాజు కేసు నమోదు చేశారు. -
ప్రభుత్వ బడుల్లో శతశాతం ప్రవేశాలే లక్ష్యం
● విద్యాశాఖ అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ బడుల్లో శతశాతం ప్రవేశాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించిన మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశానికి కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో బడి పిలుస్తోంది–2026 కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ప్రవేశాల నమోదు ఉత్సాహంగా సాగుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రానున్న విద్యా సంవత్సరంలో వంద శాతం ప్రవేశాల లక్ష్యాన్ని సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సరికొత్త వ్యూహాలతో, సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యాల సాధనలో అద్భుతమైన ప్రగతి కనబరుస్తున్న మండలాలను ప్రత్యేకంగా అభినందించారు. ఐదేళ్లు నిండిన పిల్లలను 1వ తరగతిలో చేర్పించడంలో బూర్జ, లక్ష్మీనర్సుపేట, మెళియాపుట్టి, సంతబొమ్మాళి, సారవకోట మండలాలు నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. అలాగే ఉన్నత తరగతుల నమోదులో జిల్లా సగటు అత్యంత మెరుగ్గా ఉందన్నారు. లావేరు, పలాస, బూర్జ మండలాలు మంచి ప్రగతిని సాధించి ముందు వరుసలో నిలిచాయని, మిగిలిన మండలాలు కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, లీప్ కార్యక్రమం ద్వారా అందిస్తున్న విద్యా ప్రమాణాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పించి బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో డీఈవో రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్షా ప్రాజెక్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నేతన్న నేస్తం అమలు ఎన్నడు..?
రణస్థలం: రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నేతన్న నేస్తం ఎప్పటిలోగా అమలు చేస్తారో సమాధానం చెప్పాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ డిమాండ్ చేశారు. శనివారం లావేరు పర్యటనలో నేతన్నలు తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంతవరకు హామీ అమలు చేయకపోవడంతో నేతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్న చేనేతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు. 50 ఏళ్లు దాటినవారికి పెన్షన్ అమలు చేస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికై నా చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు వెంటనే జరిపించాలని, కేంద్ర ప్రభుత్వం హ్యాండ్లూమ్ బోర్డు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్.అసిరప్పడు, కె.రామారావు, యు.కాశీ విశ్వేశరరావు, ఎన్.భద్రకాళి, కె.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని ఆవు మృతి పాతపట్నం: మండలంలోని గంగువాడ గ్రామ రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం గంగువాడ రైల్వే గేటు సమీపంలో ఆవు మేత మేస్తోంది. అదే సమయంలో విశాఖపట్నం నుంచి గుణుపూర్ వస్తున్న రైలు ఢీకొనడంతో ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. గంగువాడ గ్రామానికి చెందిన సత్రాపు అప్పన్న అనే రైతుకు చెందిన ఆవుగా గుర్తించారు. ఆవు విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందన్నారు. నష్టపోయిన పాడి రైతుకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
ప్రథమ చికిత్సపై అవగాహన
శ్రీకాకుళం కల్చరల్: సర్వశిక్ష అభియాన్ ఒకేషనల్ విభాగం ద్వారా అంపోలులో శిక్షణ పొందుతున్న వివిధ జిల్లాలకు చెందిన హెల్త్ ఇన్స్ట్రక్టర్లకు రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ద్వారా ప్రథమ చికిత్సపై శనివారం అవగాహన కల్పించారు. జిల్లా రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు పర్యవేక్షణలో మేనేజర్ కె.సత్యనారాయణ, జి.రమణలు ప్రథమ చికిత్స, గాయాలు, కట్లు, తరలింపు మార్గాలు, కృత్రిమ శ్వాస, సీపీఆర్, కాలిన గాయాలు తదితర వైపరీత్యాల నుంచి రక్షించుకోవడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ డి.చిట్టిబాబు, రెడ్క్రాస్ సిబ్బంది చిన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జూన్ 2న జాబ్మేళా శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలోని బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న ప్రభుత్వ ఐటీఐ/డీఎల్టీసీ శిక్షణా సంస్థ ప్రాంగణంలో జూన్ 2వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలిపారు. కేవీఆర్ ఇంజినీర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తుట్ మైక్రోఫిన్ లిమిటెడ్, 2050 హెల్త్కేర్ సంస్థల్లో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్మేళాను చేపట్టనున్నట్టు చెప్పారు. ఆకర్షణీయమైన వేతనంతో పాటు అనేక వసతి రాయితీలు ఉంటాయన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు హాజరవ్వాలని కోరారు. బయోడేటా, విదార్హత ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలు, రెండు పాస్ఫొటోలతో ఆరోజు ఉదయం 10 గంటలకు శ్రీకాకుళం డీఎల్టీసీ/ఐటీఐ శిక్షణా సంస్థ వద్దకు చేరుకోవాలని కోరారు. -
విధ్వంసకర ఎయిర్ పోర్టు మాకొద్దు
మందస: విధ్వంసకర ఎయిర్పోర్టు తమకు వద్దని, దీనికోసం భూములు ఇచ్చేది లేదని మండలంలోని భేతాళపురం గ్రామస్తులు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్పష్టం చేశారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదనను రద్దు చేయాలని ముక్తకంఠంగా తెలియజేశారు. కొబ్బరి, మామిడి, జీడి, పసస, మునగ వంటి పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజీ యూనిట్లు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో ఆర్.అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.ఎయిర్పోర్టు నిర్మాణంతో అభివృద్ధి వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్పోర్టుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలోని ఎయిర్పోర్టు బాధిత గ్రామమైన అనకాపల్లిలో శనివారం అయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంత ప్రజలు భూమిని త్యాగం చేస్తేనే సాధ్యమవుతుందని గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే 10వ తరగతి నుంచి ఐఐటీ వరకు చదువుకున్న యువతకు అదే ఎయిర్పోర్టులోనే ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే భూమిని కోల్పోయిన రైతులకు మెరుగైన లబ్ధిని చేకూర్చుతామన్నారు. ఈ విషయంలో కొంతమంది పడుతున్న అపోహలు నిజం కాదని స్పష్టం చేశారు. కాగా కొంతమంది రైతులు, మహిళలు మాట్లాడుతూ తమ భూములు, ఇళ్లు విడిచిపెట్టి ఎక్కడికీ వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. సమావేశంలో ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్ సీతారామయ్య, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అక్కడో చెరువుండాలి..!
అక్కడో చెరువుండాలి.. దాదాపు పదిహేను ఎకరాల భూమికి నీరిచ్చి పెంచే తల్లిగా వర్ధిల్లుతుండాలి.. కానీ ఇప్పుడు అక్కడ కేవలం స్థలం మాత్రమే కనిపిస్తోంది. యంత్రాలతో చెరువును ఛిద్రం చేసి సమాధి చేసిన ఆనవాలు తెలుస్తోంది. అధికారం ఉందనే అహంతో చెరువును చెరబట్టిన వికృత విన్యాసానికి సాక్షిగా ఈ స్థలం నిలుస్తోంది. దశాబ్దాల పాటు నీటితో కళకళలాడిన చెరువు ప్లాటుగా మారిపోయి మౌనంగా రోదిస్తోంది. జలుమూరు: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలు, గ్రామ కంఠాలు కనుమరుగైపోతున్నాయి. మండలంలోనూ ఈ ఆక్రమణలు పెచ్చుమీరిపోతున్నాయి. కొద్ది రోజుల కిందట తిమడాంలో మండల టీడీపీ నాయకుడు, అల్లాడ సొసైటీ అధ్యక్షుడు వెలమల చంద్రభూషణరావు, పల్లి రమణలు గ్రామ చెరువు, పంచాయతీ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు తాగునీటి ట్యాంకు నీటిని తన పొలాలకు మళ్లించాడు. ఇప్పుడు మండల కేంద్రం సమీపంలోని కెల్లివానిపేట–నామాలపేట గ్రామాల మధ్య రోడ్డును ఆనుకుని సర్వే నంబర్ 2–77లో ఉన్న సాగునీటి చెరువును గ్రామానికి చెందిన కెల్లి బాలకృష్ణతోపాటు మరి కొందరు యంత్రాలతో కప్పేశారు. ఈ చెరువుకు సుమారు 15 ఎక రాల ఆయకట్టు కూడా ఉంది. దీనికి ఆనుకొని ఉన్న వంశధార కాలువ గట్టు, చెక్డ్యామ్ను యంత్రాలతో ధ్వంసం చేసి మరీ కప్పేశారు. సుమారు ఐదు నుంచి ఏడు ఎకరాలు విస్తీర్ణం గల ఈ చెరువు ఇప్పడు పూర్తిగా కనుమరుగైపోయింది. రాత్రికి రాత్రి యంత్రాలతో మట్టిని తవ్వి చెరువును నామరూపాల్లేకుండా చేశారు. గతంలో ఈ చెరువు విస్తీర్ణం సుమారు 12 ఎకరాలు వరకూ ఉండేదని, ప్రస్తుతం చెరువు ఆనవాళ్లు కూ డా లేవని స్థానికులు చెబుతున్నారు. దీనిపై తహ సీల్దార్ జెన్ని రామారావుకు కూడా ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. జిల్లా నేత అండ చూసుకొని ఈ ఆక్రమణలకు స్థానిక టీడీపీ నాయకులు బరితెగిస్తున్నారని గ్రామానికి చెందిన మామిడి వరహాలు నాయుడు, రామిరెడ్డి, ధర్మారావు, మెట్ట ఆనంద్, బమ్మిడి దాలయ్యలు తెలిపారు. ఈ మేరకు తహసీల్దార్ జెన్ని రామారావుకు ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావును వివరణ కోరగా ఫిర్యాదు అందిందని బాలకృష్ణ అనే వ్యక్తి సుమారు 42 సెంట్లు ఆక్రమణలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. అలాగే మరి కొందరు కూడా ఆక్రమణలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆక్రమణ దారులు అందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని రికార్డులు ప్రకారం సర్వే చేసి ఆక్రమణలు తొలగిస్తామని తెలిపారు. -
టీచర్లపై ఒత్తిడి తగదు
శ్రీకాకుళం: మండు వేసవిలో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అడ్మిషన్ డ్రైవ్ పేరుతో ఒత్తిడి చేయడం తగదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేష న్ జిల్లా గౌరవాధ్యక్షులు పేడాడ కృష్ణారావు తెలిపారు. డీటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం శ్రీకాకుళం పెన్షనర్స్ భవన్లో శుక్రవారం జరిగింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చినప్పటి నుంచి ఎంతో నిబద్ధతతో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయ సిబ్బంది అడ్మిషన్ల కోసం సాయశక్తులా కృషి చేస్తున్నారని, అయినప్ప టికీ టార్గెట్ పూర్తి చేయాలని, ప్రైవేటు పాఠశాలల నుంచి పిల్లలను చేర్పించాలని ప్ర తిరోజూ ఒత్తిడి చేస్తూ ఇబ్బందులకు గురి చేయ డం తగదని అన్నారు. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు పూజారి హరిప్రసన్న మాట్లాడుతూ టెన్త్ మూల్యాంకనానికి సంబంధించి రెమ్యూనరేషన్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమదాలవలస: ఆమదాలవలస మండలంలో తోటాడ, అక్కివరం రెవెన్యూ గ్రామాల్లో కొత్తరోడ్డు సమీపంలో గల విలువైన బావాజీ మఠం భూములపై వైఎస్సార్సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ లోకాయుక్తను ఆశ్రయించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ భూములను అన్యాక్రాంతం చేసి ఆయన అనుచరులతో అక్రమ లే అవుట్లు వేసి వాటికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ సీసీ రోడ్లు, కాలువలు నిర్మించి భూ ములను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కర్నూలులో ఏపీ లోకాయుక్తకు గురువారం ఫిర్యాదు చేసినట్లు శుక్రవారం తెలిపారు. కూన రవికుమార్ తన అనుచరులతో ఆ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని, ఇప్పటికే ఆ భూములపై కోర్టులో పలు వివాదాలు నడుస్తున్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చింతాడ రవికుమార్ తెలిపారు. జస్టిస్ పి.లక్ష్మారెడ్డి చాంబర్లో ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. లోకాయుక్తను ఆశ్రయించడంతో నిజా నిజాలు బహిర్గతం అవుతాయని, దీంతో అక్రమార్కులకు చెక్ పడుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: మరో రెండు రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇంటర్మీడియెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవులను మరో ఐదు రోజులు పొడిగించింది. వాస్తవానికి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం జూనియర్ కళాశాలలు జూన్ ఒకటో తేదీన ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పబ్లిక్ పరీక్షలు జూన్ 5వ తేదీ వరకు జరుగుతుండటంతో ఇంటర్బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇటీవల బక్రీద్ కారణంగా ఈనెల 28న జరగాల్సిన పరీక్షలను జూన్ 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. దీంతో 6వ తేదీ నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఆదేశాలు అ న్ని ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్, ప్రైవేట్, కోఆపరేటివ్ జూనియర్ కాలేజీలన్నింటికీ వర్తిస్తాయని ఇంటర్బోర్డు పేరొంది. -
ఎరువు.. దరువు
నరసన్నపేట: కూటమి తన సంప్రదాయాన్ని కొనసాగించింది. గత ఖరీఫ్లో విత్తనాల నుంచి విక్రయాల వరకు ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోగా మద్దతు ధరలకు పంటను కొనుగోలు చేయక రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్ర నష్టాలకు గురి చే స్తోంది. తాము అధికారంలోకి వస్తే కేంద్రంతో సంబంధం లేకుండా ఏటా రూ.20వేలు అన్నదాత సుఖీభవ కింద ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన రూ.6 వేలుతో కలిపి రూ. 20 వేలు ఇస్తున్నారు. ఇలా ప్రతి పథకంలోనూ మెలికలు పెడుతూ రైతులను మోసగిస్తున్న సర్కారు వెనకా ముందూ చూడకుండా ఈ ఖరీఫ్కు ఎరువుల ధర లు పెంచేసింది. ఇప్పటికే ఇంధనం ధరల పెంపుతో సతమతమవుతుంటే.. ఎరువుల ధరలు కూడా పెంజిల్లాలో ఖరీఫ్లో 4.50 లక్షలు రబీలో 2.60 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో ఎక్కువగా వరి పండిస్తున్నారు. రబీలో అయితే మొక్కజొన్న, పత్తి, చెరకు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. కాంప్లెక్స్ ఎరువులు బస్తా ధర (50 కేజీలు) రూ. 125 నుంచి రూ. 700 వరకూ పెరిగింది. సగటున ఎకరాకు మూడు బస్తాలు ఎరువులు వినియోగిస్తే రైతులపై ఒక సీజన్కు రూ. 600 నుంచి రూ. 1400 వరకూ భారం పడుతుంది. ఈ లెక్కన చూస్తే ఖరీ ఫ్, రబీల్లో రైతులపై రూ. 40 కోట్లకు పైగా అదనపు భారం పడుతుంది. 20.20.0.13 ఎరువు అయితే ఏకంగా రూ. 700 పెంచారు. ఈ విషయం తెలియడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చడంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అధికంగా వాడే కాంప్లెక్స్ ఎరువుల ధర లను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా మండల కేంద్రాలకు చేరాయి. రానున్న ఖరీఫ్కు రైతులు ఎరువులు కావాలంటే కొత్త ధరలతోనే బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు రైతులకు సూచనలు చేస్తున్నారు. యూరియా, డీఏపీ మినహా మిగిలిన ఎరువులు అన్నింటి ధరలు పెరిగాయి. దీంతో రైతులు ఈ ఖరీఫ్లో అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతం డీఏపీ సరఫ రా తగ్గడంతో రైతులు వరికి కూడా కాంప్లెక్స్ ఎరువులనే వినియోగిస్తున్నారు. రూ. 40 కోట్ల వరకూ భారం -
●విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
డీఎస్సీ పరీక్ష పేపర్ లీకై ంది. దీని వెనుక కూటమి నాయకులు ఉన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలి. లీక్ వ్యవహారంతోనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి జిల్లా టాపర్ అయ్యారు. అవినీతి ఏ స్థాయిలో జరిగిందో చెప్పడానికి ఇదే ఉదాహర ణ. సాధారణంగా మెరిట్ లిస్టు, సెలెక్షన్ లిస్టు, రోస్టర్ వంటివి ఉంటాయి. కానీ ఈ డీఎస్సీలో ఇలాంటివి ఏవీ జరగలేదు. మెరిట్ జాబితా లేకుండా ఉద్యోగ నియామకాలు ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలి. అవినీతికి పాల్పడిన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – మెంటాడ స్వరూప్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు డీఎస్సీ పరీక్షల నుంచి నియామకాల వరకు అన్ని స్థాయిల్లో అవినీతి జరిగింది. స్పోర్ట్స్ కోటా లో టీచర్ పోస్టు రూ.15 లక్షలు వరకు అమ్ముడుపోయినట్టు వీడియోలు వెలుగు చూశాయి. ఇప్పటిౖకైనా ఉన్నత న్యాయస్థానం, గవర్నర్ సుమోటోగా తీసుకొని విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – ముత్తా విజయ్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు డీఎస్సీలో అవకతవకల వల్ల నష్టపోయిన వారిలో నేనున్నాను. నాకు ఇవ్వాల్సిన సోషల్ రిజర్వేషన్ లో టాపర్ని అయినా నాకు ఉద్యోగం ఇవ్వలేదు. అడిగితే సమాధానం చెప్పడం లేదు. మెరిట్ లిస్టు ఇవ్వకపోవడం వల్ల నాలా అభ్యర్థులంతా నష్టపోయారు. – కె.అనిల్కుమార్, డీఎస్సీ బాధితుడు -
జూన్ 1న దగా డీఎస్సీ విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం నిరుపేదలు మొదలుకుని నిరుద్యోగ యువత వరకు అందరినీ దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలో పెద్దపాడు ధర్మాన ప్రసాదరావు క్యాంప్ కార్యాలయంలో పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులతో సన్నాహక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జూన్ 1వ తేదీన నిర్వహించనున్న దగా డీఎస్సీ కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వ రూప్, రాష్ట్ర కార్యదర్శి, పలాస నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ముత్తా విజయ్కుమార్, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు మార్పు పృథ్వీ, బీసీ వి భాగం జిల్లా అధ్యక్షులు మార్పు అశోక్ చక్రవర్తిలతో పాటు నియోజకవర్గాల అధ్యక్షులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ శ్రీకాకుళం పాతబస్టాండ్: చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని దగా డీఎస్సీ అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన అనంతరం మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై ఏడాదిగా పీఈటీలు పోరాటం చేస్తున్నార ని గుర్తు చేశారు. డీఎస్సీ పద్ధతిగా నిర్వహించలేదని, అన్ని స్థాయిల్లోనూ అక్రమాలు జరిగాయని ఆ రోపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు వెన్నుపోటు పేరుతో ప్రజల్లోకి వెళ్తామని, జూన్ 4వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహించనున్నామని పే ర్కొన్నారు. మహానాడు అంతా జగన్ నామస్మరణతోనే గడిచిందని చురకలు అంటించారు. -
సర్వేశా.. ఇవేం కష్టాలు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే గందరగోళంగా మారుతోంది. భూముల సర్వేకి సంబంధించిన ఈ పనులు సక్రమంగా జరగడం లేదు. సిబ్బందితో పాటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క మండుటెండల్లో పనులు చేయలేక ఇబ్బందులు పడుతుంటే, అదే విధంగా రైతులు వారి పొలాలను ఎండలో చూపించడం, అందుబాటులో ఉండడం కూడా సమస్యగానే మా రుతోంది. ఇన్ని కష్టాలకు ఓర్చి, సర్వే చేయాలనుకున్నా వసతులు ఉండడం లేదు. మరోవైపు అధికారులు సర్వేయర్లకు గడువు పెట్టి మెడపై కత్తిపెడుతున్నారు. ఇది అన్యాయం అని అడిగితే సస్పెన్షన్తో భయపెడుతున్నారు. ఇటీవల ఇబ్బందులపై సర్వేయర్లు నిరసనకు దిగితే జిల్లాకు చెందిన ఇద్దరు గ్రామ సర్వేయర్లు సంఘం నాయకులను సస్పెండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరగడం, ఉన్నతాధికారులకు పిర్యాదులు చేరడంతో ఆ సస్పెన్షన్ను వాపసు తీసుకున్నారు. ఇలా ఇబ్బందు లు ఎన్నో ఉన్నాయి. రీ సర్వేలో పూర్తిగా పనులు సర్వేయర్లు చేయడం అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది సహకరించకపోవడం, కొన్ని సమస్యాత్యక గ్రామాల్లో భయంభయంగా సర్వేలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ‘మే’లో ఇబ్బంది ప్రస్తుతం జిల్లాలో ఫేజ్–3, ఫేజ్–4 గ్రామాలు అంటే ఫేజ్–3లో 85 గ్రామాలు, ఫేజ్–4లో 165 గ్రా మాల్లో రీ సర్వేలు జరుగుతున్నాయి. అయితే వసతులు లేక సర్వేయర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా స్టేషనరీ, కంప్యూటర్లు, ప్రింటర్లు వంటివి లేవు. రోవర్లు కూడా సరిపడినన్ని లేకపోవడంతో పని వేగంగా జరగడం లేదని సర్వేయర్లు వాపోతున్నారు. మే నెలలో ఈ సర్వేలు చేయడంతో సర్వే సమయంలో రైతులు అందుబాటులోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందుల మధ్య సర్వేలు జరిగితే మళ్లీ తప్పులతో కూడిన రికార్డులు తయారయ్యే ప్రమాదం ఉంది. వాస్తవానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే సగానికిపైగా సర్వే పూర్తయ్యింది. అప్పుడే బేస్ స్టేషన్లు, రోవర్లు, డ్రోన్ కెమెరాలు వంటివి సరఫరా చేశారు. మొత్తం 1465 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వీటిలో గత ప్రభు త్వం 738 గ్రామాల్లో సర్వేను మూడు దశల్లో పూర్తి చేసింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ రీ సర్వే అన్నారు. పైలెట్ సర్వేగా 40 గ్రామాల్లో సర్వే చేశారు. ఫేజ్–2 లో 49 గ్రామాలు, ఫేజ్–3లో 85 రెవెన్యూ గ్రామాలు, ఫేజ్–4లో 165 రెవెన్యూ గ్రామాల్లో సర్వేకు సిద్ధమయ్యారు. ప్ర స్తుతం ఫేజ్–3, ఫేజ్–4 సర్వేలు జరుగుతున్నాయి. డిప్యుటేషన్లతో సమస్యలు తాజాగా జరుగుతున్న రీ సర్వే కోసం చాలా మందిని డిప్యుటేషన్ పద్ధతిలో నియమించారు. ఉదాహరణకు శ్రీకాకుళం రూరల్ మండలం నుంచి 12 మంది గ్రామ సర్వేయర్లను రణస్థలం, ఇతర మండలాలకు గ్రామాలకు రీ సర్వేకి నియమించారు. దీంతో వారి సొంత గ్రామాల్లో సమస్యలు పెండింగ్ లో ఉండిపోతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం రైతులు గ్రామ సచివాలయం, మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. -
ఇలా అయితే ఎలా..?
● నగరంలోని రోడ్డుపై చెత్త ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం ● ఎంహెచ్వోకు చార్జి మెమో జారీ ● శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్కు ఆదేశాలు శ్రీకాకుళం: శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి డాక్టర్ సుధీర్కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చార్జి మెమో జారీ చేశారు. శుక్రవారం జిల్లాలోని వేరొక ప్రాంతానికి కలెక్టర్ తన వాహనంలో వెళ్తున్నారు. నగరంలోని అరంగ వీధికి వెళ్లేసరికి రోడ్డు పక్కన ఉన్న చెత్తను చూసి తన వాహనాన్ని నిలుపు దల చేశారు. అక్కడినుంచే ఎంహెచ్వోకు ఫోన్ చేసి రమ్మని పిలిచారు. అక్కడ చెత్తని చూపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అప్పటికే తన జేబులో ఉన్న చార్జ్ మెమోను అందజేశారు. కలెక్టర్ వార్డులోకి వచ్చిన విషయం తెలుసుకొని ఆ ప్రాంత శానిటరీ ఇన్స్పెక్టర్ కావ్య అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో కమిషనర్ కూడా వచ్చారు. కావ్యను పరిస్థితి ఇలా ఉండడానికి కారణమేమిటని ప్రశ్నించారు. ఉదయమే తాను శుభ్రం చేయించానని.. రెండు రోజుల క్రితం వరకు ఇక్కడ డస్ట్బిన్ ఉండేదని దానిని తొలగించారని చెప్పారు. ఉదయం శుభ్రం చేయిస్తే ఇంత చెత్త ఇక్కడ ఎందుకు ఉంటుందంటూ కలెక్టర్ నేరుగా తన చేతితో అక్కడ ఉన్న చెత్తను ఓ పేపర్లోనికి చూపించారు. డస్ట్ బిన్ ఎందుకు తొలగించారంటూ మండిపడుతూ శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయాలని కమిషనర్ కుర్మారావుకు ఆదేశించారు. నాలుగు నెలల్లో నాలుగో సారి ఎంహెచ్వో సుధీర్కు గడిచిన నాలుగు నెలల్లో సంజాయిషీ నోటీసులు జారీ చేయడం ఇది నాలుగోసారి. నగరంలో డయేరియా ప్రబలినప్పుడు కమిషనర్ను అకారణంగా సస్పెండ్ చేయగా, ఎంహెచ్వోకు మెమో జారీ చేశారు. ఆ తర్వాత అధికారులు విచారణ జరిపి మరోసారి నోటీసులు ఇచ్చి డయేరియా ప్రబలడానికి కారణంపై వివరణ కోరారు. దీనికి సమాధానం ఇవ్వగా అప్పట్లో నగరపాలక సంస్థ పర్యవేక్షణాధికారిగా నియమితులైన జేసీ ఎంహెచ్వో ఇచ్చిన వివరణకు సంతప్తి చెందలేదని పేర్కొంటూ పూర్తి ఆధారాలతో వివరణ ఇవ్వాలని నోటీసును జారీ చేశారు. ఈ మూడు నోటీసులకు ఆయనే ఏం సమాధానం చెప్పారో తెలియనప్పటికీ ఎంహెచ్వోపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా కలెక్టరే నేరుగా చార్జి మెమో జారీ చేయడం విశేషం. దీనిపై ఎంహెచ్వో ఎటువంటి వివరణ ఇస్తారో.. అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. డన్బిన్ల తొలగింపు నగరంలోని పలు ప్రాంతాల్లో డస్ట్బిన్లను ఎంహెచ్వో ఇటీవల తొలగింపజేశారు. దీనిపై పలువురు ఆయనను కలిసి డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని కోరగా కలెక్టర్ తొలగించాలని ఆదేశించారని.. డస్ట్బిన్ రహిత నగరంగా శ్రీకాకుళం తీర్చిదిద్దాలని కలెక్టర్ యోచిస్తున్నారని చెప్తూ వచ్చారు. అయితే శుక్రవారం జరిగిన ఘటనలో కలెక్టరే డస్ట్ బిన్ ఎందుకు తొలగించారని ప్రశ్నించడంతో కావాలనే ఎంహెచ్వో కొన్ని ప్రాంతాల్లో డస్ట్బిన్లు తొలగించారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ శుక్రవారం ఉదయం నగరంలోని ఒకచోటకు సొంత పనిమీద వెళ్లారు. ఆ సమయంలోనే కొన్నిచోట్ల చెత్తను చూశారు. దీనిపై ఎక్కడా ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోయారు. తిరిగి పలాస వెళ్తున్న క్రమంలో చెత్త ఉన్నచోట ఆగి ఎంహెచ్వోను పిలిచి చార్జి మెమో అందజేశారు. ముందుగానే చెత్తను పరిశీలించడం, తిరిగి వెళ్లేటప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే చార్జీ మెమో జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చి, మెమోను తన కార్యాలయంలోనే సిద్ధం చేసుకొని వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా కలెక్టర్ చెత్త ఉన్నచోట ఆగి చేతితో చెత్త ఎత్తుతున్న సమయంలో నగరపాలక సంస్థ అధికారులు గానీ.. మరెవరు గానీ లేకపోగా, అక్కడ ఒక ఇన్ఫ్లూయన్సర్ ఉండడంతో విషయం వెలుగులోకి వచ్చింది. -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 30 శ్రీ మే శ్రీ 2026మెరిట్ లిస్టు ఎందుకు విడుదల చేయలేదు.. సాక్షాత్తు పరీక్ష రాసిన ఉద్యోగార్థి ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదు.. డేటా డిలీట్ చేయాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘బేరాల’ సంభాషణలపై వివరణ ఎందుకు ఇవ్వడం లేదు.. యువత గళమెత్తింది. ప్రశ్నించడం తమ హక్కంటూ సర్కారు డొల్లతనాన్ని ఎలుగెత్తి చూపింది. డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై దుమ్మెత్తిపోసింది. వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ ప్రశ్నలను సూటిగా సంధించింది. -
రైతు బేల చూపులు
రొయ్య నేల చూపులు..● నష్టాల్లో ఆక్వా రైతులు ● ఆదుకోవాలని వేడుకోలు ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. రొయ్యల మేత, మెడిసిన్ ధరలు పెరిగిన రొయ్యల ధర మాత్రం తగ్గుతోంది. అదనపు పెట్టుబడితో నష్టాలు బాట పడుతున్నాం. – రాంబాబు, ఆక్వారైతు, మూలపేటరొయ్యల మేత రేట్లు, మెడిసిన్ రేట్లు, ఇతర సా మగ్రి రేట్లు పెరిగినా రొయ్యల ధర మాత్రం ఎప్పటికీ పెరగడం లేదు. కష్టాలు, నష్టాలే మిగు లుతున్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. – రవికుమార్, ఆక్వా రైతు, సీతానగరంసంతబొమ్మాళి: రొయ్య ధర పతనంలో ఆక్వా రైతు లు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఒడిదొడుకుల ను ఎదుర్కొంటూ సాగు చేస్తున్న రైతులకు మాత్రం కష్టనష్టాలు తప్పడం లేదు. ఆక్వా సాగులో పెట్టుబడులు రూ.లక్షల్లో ఉండగా లాభాలు మాత్రం రావడం లేదని అంటున్నారు. మరో వైపు రొయ్యల మేత, మెడిసిన్ ధరలు పెరుగుతున్నా రొయ్యల ధర లు తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో నౌపడ, సీతానగరం, సెలగపేట, మర్రిపా డు, భావనసాడు, మూలపేట, కె.లింగూడు, సున్నాపల్లి, వడ్డీతాంద్ర, పోతునాయుడుపేట, యామలపే ట, జగన్నాథపురం, ఉమిలాడ, ఆర్హెచ్పురం, మలగాం, కొల్లిపాడు, మరువాడ, మేఘవరం తదితర గ్రామాల్లో సుమారు 1500 ఎకరాల్లో ఆక్వా సాగును చేపడుతున్నారు. ప్రారంభంలో ఆక్వా సాగు ఆశాజనకంగా ఉన్నా తర్వాత పరిస్థితులు మారాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రొయ్యల మేత కిలోకు నాలుగు రూపాయిలు చొప్పన పెంచిన తయారీ సంస్థలు మరోసారి పెంచడానికి సిద్ధమ వుతుడడంపై ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు పెరుగుతుంటే.. రొయ్యల ధర మాత్రం నేల చూపు చూస్తోంది. 100 కౌంటు రొయ్య ధర రూ. 260లునుంచి రూ. 230కు దిగజారింది. 15 ఏళ్ల కిందట మేత బస్తా రూ. 850లు ఉంటే 100 కౌంటు కిలో రొయ్య ధర రూ. 260 నుంచి రూ. 230లు మధ్యన ఉండేది. ఇప్పుడు అదే మేత బస్తా రూ. 2500లు నుంచి రూ. 2700లకు పెరిగింది. 100 కౌంటు ధర మాత్రం రూ. 210 నుంచి రూ. 230లు మధ్యన ఉంది. రొయ్య మేత, మెడిసిన్ ధరలు అమాంతంగా పెరగడం రొయ్యల ధర మాత్రం పాతాళానికి పడిపోవడం రైతులు ఆందోళ న చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆక్వా రంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
‘భూ ఆక్రమణలను అడ్డుకోండి’
పొందూరు: ఆరు దశాబ్దాలుగా శ్మశానవాటికగా వినియోగిస్తున్న భూమిని గ్రామంలో ఇంతవరకు తాము చూడని వ్యక్తి ఆక్రమించుకోవడానికి చూస్తున్నాడని, తమ గ్రామ యువకులపై కేసులు పెట్టి వేధిస్తున్నాడని, తమకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు ఆర్.సీతారాంకు జోగ న్నపేటకు చెందిన మహిళలు విన్నవించుకున్నారు. కమిషన్కు వచ్చిన ఫిర్యాదు మేరకు సీతారాం శుక్రవారం జోగన్నపేటలో సంబంధిత భూములను పరిశీలించారు. జోగన్నపేట గ్రామానికి చెందిన ఎన్.రవీంద్రబాబు సర్వేనంబర్ 407–1, 402–6 సర్వే నంబర్లలో ఆరు ఎకరాలు భూముల వివాదంపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. సుమారు ఆరు దశాబ్దాలుగా లేని భూములు ఇప్పుడెలా వచ్చాయ ని వందలాది మంది మహిళలు అధికారులతో పా టు ఫిర్యాదుదారుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 407–1 సర్వే నంబరు భూములపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చిందని, న్యాయపరంగా పరిష్కరిస్తామని సీతారాం హామీనిచ్చారు. తమకు తక్షణమే న్యా యం జరగాలని స్థానికులు అధికారుల వాహనాల ను అడ్డుకున్నారు. ఎస్ఐ సత్యనారాయణ గ్రామస్తులతో మాట్లాడి శాంతింపజేశారు. కమిషన్ సభ్యుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడంతో మహిళలు అక్కడకు చేరుకున్నారు. అధికారులు లేకపోవడంతో నిరసన తెలిపారు. -
లెక్కల వేట.. అబాకస్ బాట..!
●వేసవిలో నేర్చుకుంటున్న విద్యార్థులు శ్రీకాకుళం కల్చరల్: చిన్నారులు ఎటువంటి విషయానైనా ఆటల రూపంలో నేర్చుకునేందుకు శ్రద్ధ చూపుతారు. సంఖ్యా శాస్త్రంలోని ప్రాథమిక విధానాలైన కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగహారం చేయడాన్ని ఆటల రూపంలో నేర్పుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు ఈ విధంగా లెక్కలు నేర్పించేందుకు ‘అబాకస్’ వేసవి క్లాసులకు పంపుతున్నారు. అబాకస్ నిర్మాణం అబాకస్ అనేది ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క లేదా ప్లాస్టిక్ చట్రం. ఈ చట్రంలో నిలువుగా సమాంతర కడ్డీలు ఉంటాయి. ఈ కడ్డీల గుండా కదిలే పూసలు ఉంటాయి. ఈ పూసలను పైకి, కిందకి జరపడం ద్వారా లెక్కలు చేస్తారు. దీనిలో ఒక అడ్డంగా ఉంచబడిన దండం లంబంగా ఉండి పూసలను రెండు వర్గాలుగా చేస్తుంది. నిలువుగా ఉన్న తీగలు స్థాన విలువలను, దశాంశ స్థానాలను తెలుపుతాయి. దీనిలో పూర్తిగా కుడివైపు గల నిలువు వరుస ఒకట్లో స్థానమును, దానికి పక్కనున్న స్థానం పదుల స్థానమును ఇలా స్థాన విలువలను తెలుపుతాయి. పిల్లల్లో గణిత సామర్థ్యం, ఏకాగ్రత, వేగవంతమైన మానసిక గణనలను మెరుగుపరచడానికి ఇది విస్తృతంగా ఉపయోగించబడుతుంది. -
గాదె వెంకటరెడ్డి మృతికి సంతాపం
నరసన్నపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రి గా పనిచేసిన గాదె వెంకటరెడ్డి మృతిపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సంతాపం వ్యక్తం చేశా రు. దీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉంటూ ప్రజలకు విశేష సేవలందించారని, ఆయన మృతి తీరని లోటని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఇచ్ఛాపురం: ఏపీ పీజీసెట్ 2026 ఫలితాల్లో తెలుగు విభాగంలో పట్టణానికి చెందిన తెన్నేటి శ్రీనిజ శర్మ సత్తాచాటింది. 82 మార్కులతో స్టేట్ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఈమె పట్టణంలోని ప్రముఖ పురోహితుడిగా అందరి కీ సుపరిచితులైన తెన్నేటి తేజేశ్వర శర్మ కుమా ర్తె కావడంతో అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ పీజీసెట్–2026 ఫలితాల్లో నౌపడకు చెందిన అంపలాం సుచిత్ర ప్రతిభ కనబర్చారు. బోటనీ సబ్జెక్టులో 59 మా ర్కులు సాధించడం ద్వారా 169వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఈమెను పలువురు అభినందించారు. గార: జిల్లా జైలు సూపరింటెండెంట్గా జి.మధుబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయనగరం జైలు డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేస్తూ శ్రీకాకుళం జిల్లా జైలు ఇన్చార్జి సూపరింటెండెంట్గా పనిచేసేవారు. అడిషనల్ సూపరింటెండెంట్గా పదోన్నతి రావడంతో జిల్లా జైలు సూపరింటెండెంట్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. సోంపేట: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలంలోని బుసాబద్ర గ్రామానికి చెందిన ఉపాధి హామీ వేతన దారురాలు పల్లి మహాలక్ష్మి (50) శుక్రవారం వడదెబ్బతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహాలక్ష్మి శుక్రవారం ఉదయం గ్రామంలోని ఉపాధి పనికి వెళ్లారు. పని ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. సాయంత్రం పని సమయానికి కుటుంబ సభ్యులు నిద్ర లేపినా లేవలేదు. చూస్తే ఆమె చనిపోయారు. ఆమె మృతితో కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆమెకు భర్త శ్యామ్ సుందర్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పలాస: మండలంలో కొబ్బరిచెట్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. సోంపేట మండలం తాళ భద్ర గ్రామానికి చెందిన సాయికుమార్ హరిపు రం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెను క నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడ ఉన్నవారు 108కి సమాచారం ఇవ్వగా వారు వెంటనే వచ్చి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి క్షతగాత్రున్ని తీసుకొని వెళ్లి మెరుగైన వైద్యం అందించారు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణను వివరణ కోరగా తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జా
సంతబొమ్మాళి: మూలపేట పోర్టుతో నౌపడలో భూములకు విలువ పెరగడంతో ప్రభుత్వ స్థలం కనబడితే చాలు వెంటనే అధికార పార్టీ నాయకులు కబ్జా చేసేస్తున్నారు. విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. తాజాగా మండలంలోని నౌపడ నుంచి వెంకటాపురం వెళ్లే ఆర్అండ్బీ రోడ్డుకు ఆనుకొని నౌపడ పోలీస్స్టేషన్ పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక టీడీపీ నాయకుడు ఆక్రమణ చేశారు. సర్వే నంబర్ 386లో రోడ్డుకు అనుకుని ఉన్న సుమారు 6 సెంట్ల ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమించుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆక్రమించిన స్థలం చుట్టూ పొడవైన కర్రలు పాతాడు. ఆక్రమించిన భూమి విలువ ప్రస్తుతం మార్కెట్లో రూ.50 లక్షల వరకు ఉంటుంది. పట్టించుకోని అధికారులు ఈ స్థలం పక్క నుంచే ప్రతిరోజూ అధికారులు రాకపోకలు సాగిస్తున్నా తమకేమి పట్టనట్లు వ్యవహరించారు. దీంతో ఆక్రమణలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో స్పందించారు. ఆక్రమణలు తొలగించాలని అధికారులు పలుమార్లు చెప్పినా సదరు టీడీపీ నాయకుడు పట్టించుకోలేదు. అది తమ ఆధీనంలో ఉన్న భూమి అని, దీనికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని అధికారులకు చెబుతున్నాడు. అయితే పత్రాలు చూపించమని అధికారులు అడిగితే సదరు టీడీపీ నేత ఇవ్వకపోవడం కొసమెరుపు. అందువలన ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి యు.ఉమాపతిని అడగగా ఆక్రమించినది ప్రభుత్వ భూమి అని, ఆక్రమణలు తొలగించాలని పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు. తొలగించకపోవడంతో శుక్రవారం నోటీసులు ఇచ్చామని తెలియజేశారు. -
ఉద్దానంలో విధ్వంసం వద్దు
● ఎయిర్పోర్టు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి ● బాధిత రైతుల ఆవేదన వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని చెట్లుతో కోనసీమను తలపించే ఉద్దాన ప్రాంతంలో అభివృద్ధి పేరిట విధ్వంసం చేయడానికి ప్రభుత్వం తలపెట్టిన ఎయిర్ పోర్టు ప్రతిపాదన వెంటనే ఉపసంహరించుకోవాలని బాధిత రైతులు కోరారు. మండలంలోని బాధిత గ్రామమైన వంకులూరులో శుక్రవారం సాయంత్రం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భూ సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం జరిగితే పిల్లల భవిష్యత్ బాగుంటుందని, పనుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలిపారు. దీంతో ఈ సమావేశానికి హాజరైన రైతులు కలెక్టర్ వద్ద తమ గోడును విన్నవించుకున్నారు. ఎన్నో ఏళ్లగా ఈ ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని, నేడు ఎయిర్పోర్టు కోసం ఈ భూములు ఇస్తే సర్వం కోల్పోయి వీధిన పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని.. అయితే విధ్వంసాన్ని కోరుకోవడం లేదని తెల్చి చెప్పారు. నిత్యం ఆహ్లాదకంగా ఉండే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్టు నిర్మాణం చేపడితే పర్యావరణానికి ముప్పు కలుగుతుందన్నారు. అనంతరం ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేసుకోవాలని కోరుతూ బర్రివానిపేట గ్రామ బాలాజీ సేవా సంఘం, వంకులూరు గ్రామ శ్రీఆదిబలిజ సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, పలాస ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్ సీతారామయ్య, డీటీ శ్రావణ్, రైతులు జోగి అప్పారావు, లండ రామస్వామీ, జోగి పురుషోత్తం, వల్లభరావు, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎం.గంగువాడలో రైతులతో సమావేశం మందస: మండలంలోని ఎం.గంగువాడ గ్రామంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కార్గో ఎయిర్పోర్టు గురించి బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టుకు తమ భూములు ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. పచ్చని ఉద్దానంలో ఎయిర్ పోర్టు కట్టి తమ పొట్టలు కొట్టవద్దని కోరారు. కాగా ఎయిర్పోర్టు బాధిత గ్రామాలైన భేతాళపురం, బీడిమి, తెలగ గంగువాడ, రట్టి గ్రామాల రైతులు కలెక్ట్రు వస్తారని వినతులతో ఎదురు చేశారు. కానీ ఆయన రాకపోవడంతో నిరాశ చెందారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.వేణుగోపాల్, ఆర్డీవో అప్పలరాజు, డిప్యూటీ తహసీల్దార్ కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేరేడు ఫలం.. పోషకాలు పుష్కలం
శ్రీకాకుళం కల్చరల్ : మార్కెట్లో నేరేడు పండ్లకు భలేగిరాకీ ఏర్పడింది. ఈ సీజన్లో లభించే అద్భు తమైన ఆరోగ్యకరమైన పండు కావడంతో కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని రక్షించడం, బరువు తగ్గడంలో సహాయపడటంలో నేరేడు పండు ముందంజలో ఉంటోంది. ఇవీ ప్రయోజనాలు.. నేరేడు పండు మధుమేహ నియంత్రణలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే జంబోలిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ బాధితులకు సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని పెంచి, మలబద్ధకం, విరేచనాలు వంటి ఉదర సమస్యలను నివారిస్తుంది. పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటును తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. విటమిన్–సి, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ కౌంట్ పెరిగి రక్తహీనత తగ్గుతుంది. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి చర్మం కాంతివంతంగా మారుతుంది. క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. అయితే, నేరేడు పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు.పాలు తాగిన వెంటనే వీటిని తీసుకోవడం మంచిది కాదు. -
టెక్కలిలో 25 కిలోల వెండి చోరీ
టెక్కలి: టెక్కలి పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంట్లో దుండగులు చోరీకు పాల్పడ్డారు. కాలనీకు చెందిన బొరిగి లక్ష్మినారాయణ కుటుంబం కొన్ని రోజులుగా స్థానికంగా లేకపోవడంతో మాటు వేసిన దుండగులు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ప్రవేశించి 25 కిలోల వెండి, సుమారు 4 తులాల బంగారం, కొంత మొత్తంలో నగదు పట్టుకుపోయారు. గురువారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు బెంగళూరులో తన కుమారుడి వద్ద ఉన్నటువంటి యజమానికి సమాచారం అందజేశారు. ఇదే సమయంలో పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ రాము సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ ఏఎస్పీ పి.శ్రీనివాసరావు నేతృత్వంలో క్లూస్టీమ్ ఆధారాలు సేకరించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పంటలకు మద్దతు ధర పెంచాలి
రణస్థలం: వ్యవసాయానికి పెరిగిన పెట్టుబడికి అనుగుణంగా పంటలు మద్దతు ధరలు పెంచాలని ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల రమణ, ఏపీ రైతు సంఘం నాయకులు మజ్జి రమణ డిమాండ్ చేశారు. వ్యవసాయ పంటల మద్ధతు ధరలు నిర్ణయించడంలో కేంద్ర ప్రభుత్వ మోసపూరిత వైఖరిని ఖండిస్తూ కొండములగాం గ్రామంలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ పంటల మద్ధతు ధరల జీవో కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ.2400 ఉండగా కేవలం పది రూపాయలు పెంచి రూ.2410 నిర్ణయించడం, వరికి క్వింటాలుకు రూ.2441గా నిర్ణయించడం రైతులకు అన్యాయం చేయడమేనని అన్నారు. 13 రకాల పంటలకు అతి తక్కువ ధరలు నిర్ణయించడం దారుణమన్నారు. ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయని, సాగు ఖర్చులు పెరిగాయని దానికి తగినట్లు మద్ధతు ధర పెంచలేదని విమర్శించారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకుండా, రసాయనిక ఎరువుల ధరలు మాత్రం 50 కిలోల బస్తాపై రూ.350 వరకు పెంచడం దుర్మార్గమన్నారు. యుద్ధం సాకుతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచడం పేద ప్రజలపైన, చిన్న, సన్నకారు రైతులపైన భారం మోపడమేనని అన్నారు. డాక్టర్ స్వామినాథన్ సిఫారసులను వెంటనే అమలు చేయాలని, రసాయనిక ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్ని రామినాయుడు, దన్నాన సూర్యనారయణ, పి.అప్పలరాము తదితరులు పాల్గొన్నారు. -
మండుటెండలోనూ ‘బడి పిలుస్తోంది’
హిరమండలంలో బడి పిలుస్తోంది ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు హిరమండలం: ప్రభుత్వ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించినా ఉపాధ్యాయులకు మాత్రం సెలవులు లేవు. మండుటెండల్లోనూ ప్రతి రోజూ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనాల్సిందేనని విద్యాశాఖ హెచ్చరిస్తోంది. మండు వేసవిలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు సూచిస్తున్న ప్రభుత్వం ఉదయం పది నుంచి సాయంత్రం 5గంటల వరకు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిస్తోంది. తమకు మాత్రం వేళాపాళా లేకుండా బడిపిలుస్తోంది ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించడం ఏమిటని ఉపాధ్యాయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పిల్లల్ని చేర్పించాల్సిందే.. ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలో పిల్లల సంఖ్య తగ్గకుండా చూసుకోవాలని టీచర్–విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఈ సంఖ్య లేకపోతే ఆ ఉపాధ్యాయుడిని వేరొక స్కూలుకు పంపుతామని ఇప్పటినుంచే విద్యాశాఖాధికారులు ఒత్తిడి పెడుతున్నారు. పాఠశాలల్లో తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉంటే ఆ పాఠశాలలను సమీప స్కూల్లో విలీనం చేస్తారని, ఆ పోస్టులు సైతం రద్దయ్యే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తుండటంతో ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు, రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న టీచర్లను సైతం బడి పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొనాలని ఒత్తిడి చేస్తుండడంతో మండుటెండలో తిరిగి అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు టార్గెట్లు లేకుంటే పోస్టులు రద్దవుతాయని హెచ్చరికలు -
చిన్న విషయాలకే.. చితికిపోతున్నారు!
● క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత ● చిన్న వయసులోనే ముగించేస్తున్న జీవితాలు ● వారం వ్యవధిలో జిల్లాలో 10 మంది ఆత్మహత్య ● ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందంటున్న మానసిక నిపుణులు శ్రీకాకుళం క్రైమ్/టెక్కలి: జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది.. అయితే కొందరు ప్రతి చిన్న విషయానికీ అతిగా ఆలోచిస్తూ చావే పరిష్కారంగా విలువైన జీవితాలను అర్ధాంతరంగా ముగించేస్తున్నారు.. క్షణికావేశంలో చేస్తున్న ఇటువంటి మరణాల వలన వారి కుటుంబాలు నడిరోడ్డున పడుతున్నాయి.. ప్రస్తుతం వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న ఎంతో మంది మేధావులు ఒకప్పుడు ఎన్నో కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్నాకే ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అటువంటి వారి జీవిత చరిత్రలను ప్రతి రోజూ చూస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఒంటరి తనంగా తీసుకునే నిర్ణయాలతో నిండు జీవితాలను కోల్పోతున్నారు. ఇటీవల కాలంలో జిల్లాలో ఈ తరహా ఘటనలు అధికమవున్నాయి. ముఖ్యంగా యువత చిన్న విషయాల కే ‘చితి’కిపోతున్నారు. ఈ తరుణంలో ఎటువంటి సమస్య ఎదురైనా ఒక్క క్షణం ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఘటనలు.. ● ఈ ఏడాది ఏప్రిల్ 10న జేఆర్ పురంలో నాగవరపు వీరబాబు (39) మతిస్థిమితం సరిగ్గా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తన ఇంటిని మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు పోలీసులు సమక్షంలో కూల్చేశారని పలాస సూదికొండ కాలనీకి చెందిన దళిత మహిళ ఏప్రిల్ 10న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ● మే 14న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో తల్లితో గొడవపడి రాజేష్, గార మండలం గిడిపేటలో భార్య మద్యం తాగొద్దన్నందుకు కర్రి త్రినాధరావు చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించారు. సారవకోట మండలం కురిడిలో భాస్కరరావు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● మే 10న సారవకోటలో కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి తిరుపతి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ● మే 5న వజ్రపుకొత్తూరు మండలం చిన్న పల్లివూరుకు చెందిన గర్తం ఇందు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది. ● టెక్కలి తలగాంకు చెందిన వీరఘట్టం అనూష మే 4న ఆత్మహత్య చేసుకుంది. ● మే4న జి.సిగడాంలో తన భర్త హోంగార్డు శ్యామ లరావు మద్యానికి, బెట్టింగ్లకు బానిసై బంగారాన్ని అమ్మేయడంతో భార్య ఉరి వేసుకుంది. ● మే 1న టెక్కలి ఆంధ్రావీధిలో డి.రామకృష్ణ తన భార్యపై దాడి చేసి ఆపై కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ● ఏప్రిల్ 12న బూర్జ మండలానికి చెందిన చుక్కర తవుడు అనే రైతు అకాల వర్షాలకు పంటలు నాశనమవ్వడంతో గడ్డి మందు తాగి బలవణ్మరణానికి గురయ్యాడు. ● అప్పు ఇస్తే తిరిగి అవతలివారే కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 11న పాతపట్నం చిన లోగిడికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో డ్రైవరు ఆత్మహత్య పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని జయరామచంద్రపురం గ్రామానికి చెందిన పూడి చిన్నబాబు(31) బుధవారం రాత్రి గ్రామ శివారులో ఉన్న టేకుతోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిన్నబాబు తాళబద్ర గ్రామ సంబరాలకు స్నేహితుడు శేఖర్తో కలిసి వెళ్లాడు. అక్కడ మద్యం సేవిస్తూ ఇద్దరు గొడవ పడ్డారు. శేఖర్ చిన్నబాబుపై చేయికోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అప్పుడే అతను తాను చనిపోతానని చెప్పాడు. చెప్పిన ప్రకారం మద్యం మత్తులో ఉన్న చిన్నబాబు అదే రోజు రాత్రి తన ఇంటికి వెళ్లకుండా ఊరు శివారులో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌన్సెలింగ్ అవసరం.. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినపుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేకపోతే మానసిక వైద్య నిపుణుల కౌన్సెలింగ్ అవసరం పడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయాన్ని కచ్చితంగా దూరం పెట్టవచ్చు. మనిషి సైకాలజీ ప్రకారం.. ఎంతటి పెద్ద సమస్యకై నా కచ్చితంగా సమాధానం ఉంటుంది. ఒక్క క్షణం ఆలోచిస్తే కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. – నిర్మల్ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి -
విజయన్ నివాసంపై దాడులు దారుణం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కేరళ మాజీ సీఎం, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్ నివాసంపై ఈడీ దాడులు చేయడాన్ని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేతిలో రాజకీయ సాధనంగా ఉన్న ఈడీతో విజయన్ను అప్రతిష్ట పాలు చేయాలనే దుర్బుద్ధితో దాడులకు పూనుకుందని విమర్శించారు. రాజకీయ ప్రత్యార్థులను వేటాడేందుకు కేంద్ర ఏజెన్సీలను వాడుకుంటున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేరళలోనూ అదే కుట్ర చేసిందని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు జి.సింహాచలం, పోలాకి ప్రసాద్, సీహెచ్ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, ఎస్.సూరీడమ్మ, కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్దన్రావు, ఎం.ఆదినారాయణమూర్తి, అల్లు సోమశేఖర్, బూర్లు సింహాచలం, ఎం.గణేష్, ఆర్.ప్రకాష్, ఎస్.నగేష్, జానీ, జ్యోతేశ్వరరావు, వాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. క్రికెట్ టోర్నమెంట్ విజేత పెద్దపాడు గార: తాళ్లవలస గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహించిన అసిరితల్లి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతగా ‘పెద్దపాడు’ జట్టు నిలిచింది. గురువారం జరిగిన ఫైనల్స్లో శ్రీకూర్మం జట్టుపై విజయం సాధించింది. 12 రోజులుగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 42 జట్లు పాల్గొనగా, మ్యాచ్లన్నీ హోరాహోరీగా జరిగాయి. విజేతలకు శ్రీ సత్యసాయి సేవా సంస్థల గార జోనల్ కన్వీనర్ బి.సింహాచలం మాస్టారు, బీసీవై పార్టీ అధ్యక్షుడు పానిని ప్రసాద్ చేతుల మీదుగా ట్రోఫీ, రూ.25 వేలు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహదపడతాయని పేర్కొన్నారు. మ్యాన్ ఆఫ్ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా దుంగ శ్రీను ఎంపికయ్యాడు. కార్యక్రమంలో టి.పమిడయ్య, కె.జగ్గారావు, కె.శేఖర్, కె.రాజారా వు, టి.లచ్చన్న, కలగ ఢిల్లీశ్వరరావు, కరగాన రమణ, నిర్వాహకులు టి.గణ, ఎస్.శ్రీను, ఏ.దుర్గాప్రసాద్, గ్రామ యువత పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా ఫ్లడ్లైట్లు శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నూతనంగా నిర్మించిన క్రికెట్ నెట్స్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. జిల్లా క్రికెట్ సంఘం రూ.17లక్షల నిధులను వెచ్చించిన ఈ నెట్స్ ఫ్లడ్లైట్ల వెలుతురులో ఆకర్షిస్తోంది. ఇందులోకి పశువులు, ఇతరులు/అపరిచితులు లోపలకు ప్రవేశించుకుండా రక్షణగా ఇనుప కంచె సైతం అమర్చారు. ప్రస్తుతం రక్షణ వలయంలో క్రీడా కారులు ముమ్మర సాధన చేస్తున్నారు. జెడ్సీఎస్ ప్రతినిధులు, కోచ్లు పర్యవేక్షిస్తున్నారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
● వేర్వేరు ఘటనల్లో 36 కేజీల గంజాయితో నలుగురు అరెస్ట్ ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ ఆవరణలో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 22 కేజీల 500 గ్రాముల గంజాయితో మహారాష్ట్ర రాష్ట్రం జల్నాకు చెందిన రాహుల్విష్ణు ఇంగ్లే అనే వ్యక్తి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. స్థానిక సీఐ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిందితుడు ఇంగ్లేకు.. జల్నా గ్రామంలో గంజాయి వ్యాపారం చేసే సురేష్ కై లాష్ఠాకూర్తో పరిచయం ఏర్పడింది. అతని వద్ద కొంత సొమ్ము అప్పుగా తీసుకున్నాడు. అప్పు తీర్చలేకపోవడంతో వ్యాపారి సూచించినట్లు గంజాయి అందజేస్తే రాకపోకల ఖర్చులు పోగా కేజీ గంజాయికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఒడిశాకు చెందిన రాజేష్ నిందితుడు ఇంగ్లేకు గంజాయిని అందజేశాడు. దానిని తీసుకొని ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ గుండా మహారాష్ట్రకు వెళ్లేందుకు సిద్ధమవ్వగా రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. గంజాయి పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పట్టణ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీల్లో పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్టు పొందూరు: పొందూరు రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు మహిళల నుంచి పొందూరు పోలీసులు 5 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. గురువారం జేఆర్పురం సీఐ ఎం.అవతారం, పొందూరు ఎస్సై వి.సత్యనారాయణలు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎస్సీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు పొందూరు ఎస్సైకు వచ్చిన సమాచారంతో పొందూరు రైల్వేస్టేషన్కు గురువారం పోలీసు సిబ్బంది చేరుకున్నారు. స్టేషన్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు మహిళలను గుర్తించి వారి సామాన్లు తనిఖీ చేశారు. వారి వద్ద 5 కేజీల గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మహిళలను విచారించగా మహారాష్ట్రకు చెందిన మంగళ దీపకజాదూ, మనోబై సంపత్తిలుగా గుర్తించారు. వీరిద్దరూ ఒడిశా రాష్ట్రం ఛత్రపూర్లో రాజేష్ అనే వ్యక్తి వద్ద రూ.25 వేలకు ఐదు కేజీల గంజాయి కొనుగోలు చేశారు. మహారాష్ట్ర చేరుకునేందుకు శ్రీకాకుళం స్టేషన్లో కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కాల్సి ఉంది. పొరపాటున శ్రీకాకుళం అనుకుని పొందూరులో రైలు దిగిపోయారు. దీంతో ఇద్దరూ పట్టుబడ్డారు. పొందూరు డీటీ రాధాకృష్ణ, వీఆర్వోలు సమక్షంలో మహిళలను పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్టు చేశారు. గంజాయి పట్టుకున్న ఎస్సైను సీఐ అవవతారం అభినందించారు. స్కూటీపై గంజాయి తరలిస్తూ.. ఇచ్ఛాపురం రూరల్: అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. గురువారం నిందితుడిని విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు గురువారం మధ్యాహ్నం ఎం.తోటూరు రైల్వే క్రాసింగ్ వద్ద తనిఖీలు చేపడుతుండగా ఒడిశాకు చెందిన లికు బెహరా అనే వ్యక్తి స్కూటీపై 8.430 కేజీల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే బెహరాను అదుపులోకి తీసుకొని గంజాయి, స్కూటీ, సెల్ ఫోన్ను స్వాఽధీనపరచుకున్నారు. విచారణలో ఒడిశా రాష్ట్రం ఖందమాల్ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి రైల్వే మార్గం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు నిందితుడు అంగీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అనుమానాస్పద వ్యక్తులు మత్తు పదార్థాలు, గంజాయిని తరలిస్తున్నట్లు అనుమానం వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. సమావేశంలో రూరల్ ఎస్ఐ ఆర్.జనార్దనరావు పాల్గొన్నారు. పొందూరు: పట్టుబడిన మహిళలతో పోలీసులు ఇచ్ఛాపురం: వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు -
చెత్త మిగిల్చాయి
సీఎం టూర్.. పారిశుద్ధ్యం పూర్! కోట్లు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి పర్యటన జిల్లాకు మేలు చేయాల్సింది పోయి కొత్త తలనొప్పులు తీసుకువచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నరసన్నపేటలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనతో ప్రజలకు ఇబ్బందులు, ప్రభుత్వానికి ఖర్చులు, పార్టీకి పబ్లిసిటీ తప్ప ఇంకేమీ మిగల్లేదు. స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర ప్రొగ్రామ్ అక్కరకు రాలేదు సరికదా కొత్త సమస్యలను సృష్టించింది. ఆయన పర్యటన కోసం చేసిన హడావుడి ఆ తర్వాత లేకపోవడంతో పరిస్థితులు దయనీయంగా తయారయ్యాయి. పారిశుద్ధ్యం నిర్వహణ పక్కన పెడితే ఆయన పర్యటన కోసం కొత్త కర్ర చెరువు వద్ద వేసిన చెత్త కొత్త ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సంతతోట ఎదురుగా ఉన్న ప్రాంతం తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. డంపింగ్ యార్డ్గా కొత్త కర్ర చెరువు.. ● సీఎం చంద్రబాబు పర్యటన కోసం నరసన్నపేటలో వార్డుకి 10 మంది చొప్పున 20 వార్డుల్లో 200 మందితో వారం రోజుల పాటు చెత్త, వ్యర్థ పదార్ధాలను జేసీబీ, ట్రాక్టర్లతో ఎత్తి సంత తోట ఎదురుగా ఉన్న కొత్త కర్ర చెరువు వద్ద డంప్ చేశారు. ● నరసన్నపేటలో డంపింగ్ యార్డు ఉన్నప్పటికీ సీ ఎం పర్యటన కోసం సమయం సరిపోదని దగ్గరలో ఉన్న కొత్త కర్ర చెరువు వద్ద రోడ్డుపై వేసేశారు. ● సీఎం పర్యటన ముగియగానే అక్కడున్న చెత్తను ఎత్తేస్తామని చెప్పారు. ● కానీ, రెండు వారాలు అవుతున్నా అక్కడ వేసిన చెత్తను తరలించలేదు. దీంతో దుర్గంధంగా తయారైంది. అటువైపు వెళ్లే వారంతా ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. సమీపంలో ఉన్న నివాసితులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. సంపద కేంద్రం వద్దనైతే.. సీఎం సందర్శన కోసం చెత్త నుంచి సంపద కేంద్రంలో అప్పటికప్పుడు రూ. 60లక్షలతో హంగులు సమకూర్చి ఆర్బాటం చేశారు. చంద్రబాబు వెళ్లిపోగానే సంపద కేంద్రాన్ని గాలికొదిలేశారు. చంద్రబాబు ఫొటో, వీడియో షూట్ చేసిన కార్యక్రమంగా మిగిలిపోయిందే తప్ప వర్కింగ్లో తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ‘చెత్త శుద్ధి ఇదేనా అని ‘సాక్షి’లో కథ నం వచ్చాక సంపద కేంద్రానికి తాళాలు తీశారు. కానీ,చంద్రబాబు చెప్పినట్టు సంపద సృష్టించే చర్య లు మొదలు కాలేదు. 2018లో ఎలాగైతే ఉత్సవ విగ్రహంగా వదిలేశారో.. ఈసారి కూడా అదే ధోరణి కనబరుస్తున్నారు. తమకు పబ్లిసిటీ తప్ప ఆచరణ ముఖ్యం కాదని మరోసారి చాటి చెప్పారు. రూ.కోట్లు ఖర్చు.. ప్రజలకు ఇబ్బందులు చంద్రబాబు కార్యక్రమానికి జనాలు తరలింపు, ఇతర త్రా ఖర్చులైతే రూ.కోట్లలో అయ్యాయి. ప్రజా ధనం ఖాళీ అయిపోయింది. ఇక చంద్రబాబు వస్తున్నారని సమీపంలో ఉన్నషాపులను మూసివేసి,వర్తకులు ఇబ్బం దులు పెట్టారు. పోనీ, ఇంత చేసి నా నరసన్నపేటకు ఏదైనా మేలు జరిగిందా? అంటే ఏమీ లేదు. అమలు చేయని పాత హామీలు ఇచ్చి చంద్రబాబు వెళ్లిపోయారు. ఆయన వెళ్లాక ప్రజలకు కష్టాలు మిగిల్చారు. నరసన్నపేట ప్రజలకు చెత్త ఇబ్బందులు రూ. కోట్లలో ఖర్చు ...ప్రజా ధనం ఖాళీ ఒక్క మేలు జరగని పరిస్థితి సీఎం పర్యటన కోసం ఊరి చెత్త అంతా కొత్త కర్ర చెరువు వద్ద డంపింగ్ తీవ్ర దుర్గంధంగా మారిన పరిసర ప్రాంతాలు -
టీడీపీ మహిళా నేతపై తెలుగు తమ్ముడు దాడి
● ఎస్ఎంపురంలో సంధ్య గణపతిరావు చౌదరి కారుపై రాళ్ల దాడి ● పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్న బాధిత టీడీపీ నాయకురాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : విజయనగరం జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి సంధ్య గణపతిరావు చౌదరిపై అదే పార్టీకి చెందిన నాగులు అనే వ్యక్తి దాడికి పాల్పడ్డారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం గ్రామంలో ఒకరిని పరామర్శించేందుకు వెళ్లి వస్తుండగా సంధ్య ప్రయాణిస్తున్న కారుపై రాళ్ల దాడి చేశారు. ఆ సమయంలో సంధ్య అనుచరులు రావడంతో అక్కడి నుంచి ఉడాయించిన నాగులు మరో టీడీపీ నేత ఇంటిలోకి వెళ్లి దాక్కున్నాడు. తనపై జరగిన దాడిపై సంధ్య గణపతిరావు చౌదరి పో లీసులకు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించలేదని సంధ్య గణపతిరావు ఆరోపించారు. పోలీసు వ్యవస్థ ఇలా తయారైందేంటని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం ఆందోళనకరమన్నారు. ‘భూములు పోతాయంటే పోరాటం తప్పదు’ సోంపేట: కవిటి మండలం శిలగాం గ్రామం వద్ద ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సుమారు 21 ఎకరాల ఉద్యాన శాఖ విలువైన భూములను బడాబాబులకు అప్పగిస్తే పోరాటం తప్పదని మహాత్మా జ్యోతిరావు పూలే రాష్ట్ర బీసీ సంఘం హెచ్చరించింది. గురువారం సోంపేట పట్టణంలోని విజయదుర్గ ఆలయం వద్ద రాష్ట్ర సంఘ అధ్యక్షుడు బీన ఢిల్లీరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఉద్దానమంతా కిడ్నీ వ్యా ధితో సతమతమవుతోందని, ఇలాంటి చోట వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సింది పోయి కాలుష్యం పెంచే కర్మాగారాలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. కోట్లాది రూపాయల విలువైన శిలగాం వద్ద గల ఉద్యాన శాఖ భూములను పప్పు బెల్లాల మాదిరిగా కార్పొరేట్లకు పంచి పెడితే పోరాటం తప్పదన్నారు. ‘ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభు త్వం పరిష్కరించాలని ఏఐటీయూసీ గౌరవాధ్యక్షుడు తిరుపతిరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం శ్రీకాకుళంలోని ఈయూ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐటీయూసీ గౌరవాధ్యక్షులు టి.తిరుపతిరావు ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలపై మాట్లాడారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఔట్సోర్సింగ్ కార్మికులకు రూ. 26,000 వేతనం ఇవ్వాలని, జీతాలు సకాలంలో ఇవ్వా లని డిమాండ్ చేశారు. జిల్లాకు చేరిన ఇంటర్ పుస్తకాలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పాఠ్యపుస్తకాలు చేరాయి. అయితే వీటిని తీసుకెళ్లడానికి మాత్రం ప్రభు త్వ యాజమాన్య విద్యాసంస్థలు అష్టకష్టాలు పడుతున్నాయి. గత ఏడాది పాఠ్యపుస్తకాల పంపిణీలో ఏర్పడిన లొసుగుల నుంచి ఇంటర్మీడియెట్ విద్య డైరెక్టరేట్ కార్యాలయం తేరుకుంది. ఈ విద్యా సంవత్సరం కాస్త ముందుగానే పాఠ్యపుస్తకాలను చేరవేసినప్పటికీ.. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంలో లోపభూయిష్టత కనిపించిందని విశ్రాంత విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో ఆయా విద్యా సంస్థల అధికారులు, సిబ్బంది పరీక్షల నిర్వహణ లో నిమగ్నమై ఉన్నారు. దీంతో పుస్తకాలు తీసుకెళ్లలేకపోతున్నారు. గతంలో మండల కేంద్రాలకే నేరుగా పాఠ్యపుస్తకాలను పంపించేవారు. పెద్దగా ఖర్చు అయ్యేదికాదు. ప్రస్తుతానికి పా ఠ్య పుస్తకాలు మాత్రమే వచ్చాయి. నోట్బుక్స్ గానీ, బ్యాగులు గానీ రాకపోవడం చర్చనీయాంశమవుతోంది. -
వరుసగా వాహనాలు ఢీ
● రణస్థలం వద్ద స్తంభించిన ట్రాఫిక్ రణస్థలం: రణస్థలం ఫ్లై ఓవర్ పనులు వాహనచోదకులకు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న క్రేన్ను అధిగమించే ప్రయత్నంలో క్రేన్ చివర భాగం బస్సుకు తగిలింది. దీంతో బస్సు అద్దం పగిలిపోయి ప్రయాణికులు కేకలు వేశారు. వెనుకనే వస్తున్న కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ కారు ఇసుక లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోయినా కారుకు, ప్రైవేటు బస్సు దెబ్బతిన్నాయి. ఈ రెండు ప్రమాదాలతో ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవే సెక్యూరిటి, స్థానిక పోలీసులు వచ్చి వాహనాలను క్రమబద్ధీకరించారు. ఈ ప్రమాదంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
ఆ ఊపిరి పదిలం
● భక్తిశ్రద్ధలతో బక్రీద్జిల్లా కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు గురువారం బక్రీద్ను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మత పెద్ద ఇమాం వహాబ్ ఆధ్వర్యంలో నమాజు కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు –శ్రీకాకుళం కల్చరల్● అవయవదానంతో ఐదుగురికి పునర్జన్మ ఇచ్చిన నాగార్జున నందిగాం: నందిగాంకు చెందిన బంగారు నాగార్జున (38) బ్రెయిన్ డెడ్తో మృతి చెంది మరో ఐదుగురికి అవయవ దానంతో ప్రాణం పోశారు. వివరాలను పరిశీలిస్తే.. నందిగాంకు చెందిన నాగార్జున మైక్ సెట్లు, లైటింగ్, డీజేలు అద్దెకు ఇస్తూ జీవనం సాగించేవాడు. మూడు రోజుల క్రితం పనిచేస్తూ ఒక్కసారిగా పడిపోవడంతో తోటివారు స్థానికంగా ఉన్న ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యు డు పరిశీలించి పరిస్థితి తీవ్రత దృష్ట్యా రాగోలు జెమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వివిధ పరీక్షలు చేసిన వైద్యులు బ్రెయిన్డెడ్గా గుర్తించారు. దీంతో జీవన్దాన్ వారు నాగార్జున కుటుంబ సభ్యులకు అవయవ దానంపై అవగాహన కల్పించడంతో వారు అంగీకరించారు. దీంతో నాగార్జున నుంచి లివర్, రెండు కిడ్నీలు, రెండు ఊపిరితిత్తులు, కార్నియా సేకరించి ఊపిరితిత్తులను హైదరాబాద్, ఒక కిడ్నీ విశాఖపట్నం, మరో కిడ్నీ, లివర్, కార్ని యాని శ్రీకాకుళం తరలించి మరో ఐదుగురికి ప్రాణదానం చేశారు. అంతటి శోకంలోనూ అవయవదానంకు అంగీకరించిన నాగార్జున తల్లిదండ్రులు తులసయ్య, బోడెమ్మ, భార్య దివ్య, తమ్ముడు చంటిను పలువురు కొనియాడారు. మృతుడికి ఆరో తరగతి చదువుతున్న ఒక కుమారుడు ఉన్నాడు. అయితే నిత్యం మైక్సెట్, డీజేలతో సందడిగా ఉండే నాగార్జున మృతిలో నందిగాంలో తీవ్ర విషాదం నెలకొంది. -
పారదర్శకంగా క్రికెట్ ఎంపికలు చేపట్టాలి
శ్రీకాకుళం న్యూకాలనీ :జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా ఎంపికలు చేపట్టాలని క్రికెట్ క్రీడాకారుల తల్లిదండ్రులు కోరారు. జిల్లా క్రికెట్ సంఘం కీలకంగా చక్రం తిప్పుతున్న ఓ వ్యక్తి ఇప్పటికై నా మారాలని.. మారకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని ఓ హోటల్లో జిల్లా పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ముందుగా జిల్లా స్థాయి పేరెంట్స్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని ఏకగ్రీవంగా ఏర్పాటు చేశారు. అనంతరం పలు తీర్మానాలు చేశారు. జిల్లా క్రికెట్ సంఘం జిల్లా తరఫున ఎంపిక చేయబడే జట్టును పూర్తిగా ఈ జిల్లాలో ఉంటూ.. సాధన చేస్తున్నటువంటి క్రీడాకారులతో భర్తీ చేయాలని, ఈ జట్టును మాత్రమే పైస్థాయి పోటీలకు ఆడించడానికి పంపించాలని కోరారు. ఇతర జిల్లాల నుంచి ఎవరైనా వచ్చి.. శ్రీకాకుళం జిల్లాకి రిప్రజెంట్ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కొందరు ఏకంగా ఆధార్ కార్డులను శ్రీకాకుళం జిల్లాకి మార్చి ప్రాతినిధ్యం వహించాలని చూస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్, ఎస్పీకి అభ్యర్థన పత్రం ఇవ్వాలని తీర్మానించారు. -
అసమానతలు ఉన్నంతవరకు ఉద్యమాలు ఆగవు
● బొడ్డపాడులో ఘనంగా అమరవీరుల స్మారక సభ పలాస: సమాజంలో అసమానతలు ఉన్నంతవరకు విప్లవోద్యమాలు ఉంటాయని, వాటిని ఎవరూ అరికట్టలేరని వివిధ విప్లవ ప్రజా సంఘాల నాయకులు అన్నారు. నాటి నక్జలబరి, శ్రీకాకుళ సాయుధ పోరాటాలు భవిష్యత్ తరానికి అవసరమని, వాటి స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలు కొనసాగుతాయని తెలిపారు. మండలంలో బొడ్డపాడులోని జిల్లా అమరవీరుల స్మారక మందిరంలో బుధవారం 37వ అమరవీరుల స్మారక సభ నిర్వహించారు. స్మారక సభ నిర్వాహక కమిటీ కన్వీనర్ పోతనపల్లి కుసుమ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు పోలా ఈశ్వరరావు, లిబరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు డి.హరనాథ్, జనశక్తి జిల్లా కార్యదర్శి కోనేరు రమేష్ తదితరులు మాట్లాడుతూ.. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని, ప్రజల జీవన వ్యవస్థ సంక్షోభంలో పడిందన్నారు. అంతకుముందు అరుణ పతాకాన్ని అమరజీవి పోతనపల్లి పారమ్మ జీవిత సహచరుడు జోగి కోదండరావు, జయక్క కుమారుడు మల్లేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం అరుణోదయ కళాకారులు ఓ అరుణ పతాకమా అనే పాటను పాడి వినిపించారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు తామాడ సన్యాసిరావు, మద్దిల రామారావు, కొర్రాయి నీలకంఠం, మురిపింటి గంగయ్య, సొర్ర రామారావు, జయలక్ష్మి, విరసం రాష్ట్ర కార్యదర్శి రివేరా తదితరులు పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబు జిల్లాకు చేసిన మేలేంటి..?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు జిల్లాకు చేసిన మేలేంటని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పి.తేజేశ్వరరావులు ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో అచ్చెన్నాయుడు చేస్తున్న అభివృద్ధి ఎరజ్రెండా ఉద్యమాలను అడ్డుకోవడమేనా అని ప్రశ్నించారు. ఎరజ్రెండా ఎల్లప్పుడూ శ్రమజీవుల పక్షాన ఉంటుందని తెలియజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా విధ్వంసకర ప్రాజెక్టులతో జిల్లాని ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. సముద్ర తీర ప్రాంతమంతా రేర్ ఎర్త్ మినరల్స్ కోసమే అప్పజెప్పడం ద్వారా సముద్ర తీరం తవ్వకాలకు గురై పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందన్నారు. పంట భూములు ఉప్పునీటి భూములుగా మారిపోయి వ్యవసాయం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం విస్మరించి వేలాది మంది మత్స్యకారులను వేటకు దూరం చేయడం సరికాదన్నారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో లక్షలాది చెట్లను నరికి ఉద్దానాన్ని ఎందుకు విధ్వంసాన్ని చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం ఒక్క పైసా కూడా నిధులు కేటాయించకుండా అభివృద్ధి కోసం మాట్లాడుతారా అని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా జిల్లాకు మేలుచేసే పనులు చేపట్టాలని సూచించారు. -
కందుకూరి విగ్రహం ఆవిష్కరణ
శ్రీకాకుళం అర్బన్: నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతివనంలో తెలుగు రచయితల వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, రఘుపాత్రుని వెంకటరమణమూర్తి పర్యవేక్షణలో ప్రముఖ విద్యావేత్తలు సురంగి మోహన్రావు, బలివాడ మల్లేశ్వరరావు, బరాటం లక్ష్మణరావుతో పాటు తెరవే బృందం సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడాచారాలతో కునారిల్లుతున్న సమాజ గతిని వితంతు పునర్వివాహం జరిపించి మలుపు తిప్పిన సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు అన్నారు. బాల్య వివాహాలను వ్యతిరేకించడంతో పాటు సీ్త్ర విద్యను ప్రోత్సహించిన మహనీయుడని పేర్కొన్నారు. సమాజంలో మార్పు కోసం వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించి వరకట్నం వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారన్నారు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడిగా నిలిచిన కందుకూరి స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా ఉంటుందని కొనియాడారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు వాడాడ శ్రీనివాసరావు, డాక్టర్ కోమలరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, ఇద్ది పాపయ్య, సోడవరం ఈశ్వరరావు, తలగాన లింగరాజు, చదువుల చలపతిరావు, కుప్పిలి త్రినాథరావు, బి.మోహన్గాంధీ, కనుగుల సత్యం, వావిలపల్లి రాజారావు, గాంధీ మందిర ప్రతినిధులు కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, మెట్ట అనంతంభట్లు, గుత్తు చిన్నారావు, పందిరి అప్పారావు, జి.నాగేశ్వరరావు, బీకే జయలక్ష్మి, శాస్త్రి పాల్గొన్నారు. -
బాక్సింగ్ క్రీడాకారులు జిల్లాకు గర్వకారణం
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంనకు చెందిన బాక్సింగ్ క్రీడాకారులు జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు కొనియాడారు. ఇటీవలి విశాఖపట్నంలో జరిగిన శాప్లీగ్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 12 పతకాలతో సత్తాచాటారు. వీటిలో మూడు బంగారు, ఏడు రజత, మరో రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాలు సాధించిన క్రీడాకారులను బుధవారం స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో డీఎస్డీవో అభినందించారు. వీరిని తీర్చిదిద్దుతున్న డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్దేవ్ (అను), బి.సీతారాం, వంగా మహేష్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
కోటపాలెంలో పూరిళ్లు దగ్ధం
రణస్థలం: మండలంలో కోటపాలెం పంచాయతీలోని యాతవీధిలో మంగళవారం అర్థరాత్రి నాలుగు పూరిళ్లు అగ్నికి అహుతయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక ఎస్ఐ డి.హేమసుందర్ తెలిపిన వివరాల మేరకు.. కాకర ఎరకయ్య, సీతారాములు, లక్ష్మణ, అసిరియ్య పూరిళ్లు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి. స్థానికులు నీళ్లతో అర్పినా అప్పటికే సగం కాలిపోయాయి. అగ్నిమాపక వాహనం వచ్చి మిగతా మంటలు ఆర్పివేశారు. ఇంట్లో బీరువాలు, సామగ్రి, విలువైన పత్రాలు బుడిదయ్యాయని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా అగ్ని ప్రమాద బాధితులను వైఎస్సార్సీపీ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకుడు పిన్నింటి సాయికుమార్ పరామర్శించి నిత్యావసర సరుకులు అందజేశారు. పక్కా ఇళ్లు మంజూరు చేయాలని తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్ను కోరారు. ఆయనతో పాటు జెడ్పీటీసీ టొంపల సీతారాం, నాయకులు మహంతి చిన రామునాయుడు, చిల్ల వెంకటరెడ్డి, సుంకరి కిషోర్ కుమార్, గొర్లె జగదీష్, మహంతి పెదరామినాయుడు, జోగ శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు. -
పింఛనో రామచంద్రా..!
హిరమండలం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా కొత్త పింఛన్ల మంజూరుపై నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు అందజేస్తామని చెప్పిన చంద్రబాబు ఆ ఊసెత్తడం లేదు. అర్హులైన వేలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టు తిరుగుతున్నా చంద్రబాబు సర్కార్ కనికరించడం లేదు. దాదాపు రెండేళ్లుగా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయకపోవడంతో అనేక మంది ఆపసోపాలు పడుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పక్కాగా పింఛన్లు అందించేవారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా వలంటీర్లు దరఖాస్తు పూర్తి చేసి, సచివాలయాల్లో ఇస్తే పింఛన్లు మంజూరయ్యేవి. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగింది. కానీ నేడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. దీంతో గత ప్రభుత్వంలో సాధ్యమైనది ఇప్పుడు ఎందుకు సాధ్యం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో 50 ఏళ్లు వయస్సు దాటినవారు సుమారు 1,45,440 మంది ఉన్నారు. 60 ఏళ్లు దాటినవారు, వితంతువులు, దివ్యాంగులు కూడా దాదాపు 20 వేల మందికి పైగా కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లపై రోజుకో మాటతో కాలం గడుపుతోంది. దీంతో ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హిరమండలం సచివాలయం చెప్పులు అరిగేలా తిరుగుతున్నా నా భర్త దాదాపు పది నెలలు క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. జీవనోపాధి కోసం కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నా. సచివాలయానికి కాళ్లరిగేలా తిరుగుతున్నా పింఛన్కు దరఖాస్తు తీసుకోవడం లేదు. కుటుంబ పోషణ కష్టమవుతోంది. దీన స్థితిలో ఉన్న మాపై ప్రభుత్వానికి కనికరం కలగడం లేదు. – మద్దిలి దేవి, తంప గ్రామం, హిరమండలం ఏడాదిన్నరగా ఎదురుచూపులు ఏడాదిన్నర క్రితం నా భర్త చనిపోయాడు. కూటమి ప్రభుత్వం వస్తే తనలాంటి వితంతువులకు వెంటనే పింఛన్ ఇస్తామన్నారు. ఒకటిన్నర సంవత్సరంగా సచివాలయానికి తిరుగుతున్నా.. కొత్త పింఛన్ మంజూరు చేయడం లేదు. ఉత్తర్వులు రాలేదని సిబ్బంది చెబుతున్నారు. తక్షణమే పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. – ముద్దాడ కనకమ్మ, హిరమండలం ఉన్నవాటిని తొలగించడం దారుణం కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలను గాలికి వదిలేశారు. అర్హులకు పింఛన్లు ఇవ్వకపోగా.. ఉన్న పింఛన్లు కూడా తొలగించే పనిలో బిజీగా ఉన్నారు. అనర్హత పేరుతో చాలామందిని పింఛన్ అర్హత జాబితా నుంచి తొలగించారు. దీంతో వారంతా ప్రస్తుతం జీవనోపాధికి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. – మీసాల వెంకట రామకృష్ణ, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు, హిరమండలం -
ల్యాబ్ లైసెన్సు ఇప్పిస్తానంటూ మోసంపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్: ల్యాబ్ లైసెన్సు ఇప్పిస్తానంటూ డబ్బులు తీసుకొని మోసం చేసిన శ్రీనిధి డాక్టర్స్ ప్లాజా మేనేజర్ బొడ్డేపల్లి సుధీర్పై డాక్టర్సు ప్లాజా యజమానులు డాక్టర్ జన్ని రమ్య, డాక్టర్ నాగేంద్రబాబులు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం బొడ్డేపల్లి సుధీర్కు ల్యాబ్ లైసెన్సు కోసం మార్చి 6, 2024 ఫోన్ పే ద్వారా రూ.3.20 లక్షలు, నెల రోజుల వ్యవధిలో ఎక్యూప్మెంట్ కోసం మరో రూ.6 లక్షలు చెల్లించారు. అయితే ఇప్పటివరకు లైసెన్సు, పరికరాలు రాకపోవడంతో అతన్ని నిలదీసినా స్పందన లేకపోవడంతో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. విద్యుత్ షాక్తో గాయాలు టెక్కలి: స్థానిక శ్రీనివాసానగర్లో ఒక విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కిషోర్ విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. విద్యుత్ సిబ్బంది పర్యవేక్షణలో మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గాయపడిన యువకుడిని పట్టణంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన ఎలక్ట్రీషియన్కు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
గడువులోగా పనులు పూర్తి చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్ పనులను బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాంప్లెక్స్ ప్రధాన ద్వారం పనులు, విశాలమైన పార్కింగ్ ఏరియా, పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న టైల్స్ పనులను ఆయన నిశితంగా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని, కాంప్లెక్స్ ఆవరణలో ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగిన వాలుతో నేరుగా డ్రెయిన్లలోకి వెళ్లేలా శాశ్వత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాహనదారుల సౌకర్యార్థం విశాలమైన పార్కింగ్ ఏరియాను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాహన డ్రైవర్ల కోసం పార్కింగ్ ఆవరణలోనే ప్రత్యేక విశ్రాంతి గదులు, ఆధునిక కేఫెటేరియాతో పాటు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను సూచించారు. -
తప్పిన పెను ప్రమాదం
జి.సిగడాం: మండలంలోని పెంట గ్రామంలో పొగిరి అరుణకుమారి ఇంట్లో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న ఫ్రిజ్, ఇన్వర్టర్, బియ్యంతో పాటు వివిధ రకాల సామగ్రి కాలిబూడిదయ్యాయి. దీంతో సుమారు రూ.లక్ష వరకు నష్టం వాటిళ్లిందని బాధితురాలు బోరున విలపించింది. ఇంట్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో గ్రామస్తులు పరుగులు తీసి మంటలను అదుపు చేశారు. ప్రమాదం సమాచారం తెలుసుకొని మాజీ సర్పంచ్ పున్నాన అక్కలనాయుడు, ఎంపీటీసీ మక్క శ్రీనివాసరావు, విశ్రాంత మేనేజర్ మక్క పెద్ద అప్పలనాయుడు, పున్నాన శ్రీనివాసరావు, మక్క గురినాయుడులు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలిచారు. పిడుగుపాటుకు మహిళ మృతి జి.సిగడాం: మండలంలోని జాడ గ్రామంలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన కోరాడ కళావతి(40) పొలంలో గొర్రెలు కాస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటు సంభవించింది. దీంతో కళావతి తీవ్రగాయాలు పాలయ్యింది. వెంటనే 108 వాహనంలో రాజాం అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త ఉన్నారు. అలాగే రెండు గొర్రెలు చనిపోయాయి. బుధవారం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెలిచేటి సందీప్కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్రైస్తవ హక్కులు కాపాడాలి సరుబుజ్జిలి: క్రైస్తవులు, దళిత హక్కులకు భంగం కలగకుండా రక్షణ కల్పించాలని క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ఫౌండర్ వైఎస్ చిన్నారావు, ప్రతినిధులు ప్రత్తిపాటి ప్రసాదరావు, పీటర్ కామేశ్వరరావు, రవికుమార్ కోరారు. ఛలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కేజీ బాలకృష్ణన్ను బుధవారం ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందించారు. రాజ్యాంగపరంగా కల్పించినటువంటి సంక్షేమం, హక్కులు రక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విన్నవించారు. హక్కుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ హమీ ఇచ్చారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి టెక్కలి: స్థానిక పెద్దబ్రాహ్మణ వీధిలో విద్యుత్ షాక్కు గురై దూపాన కామేశ్వర్రెడ్డి (63) అనే వ్యక్తి బుధవారం మృతి చెందారు. ఇంట్లో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ తగిలి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈయన మృతికి బీజేపీ మండల అధ్యక్షుడు జర్జాన రామ్జీతో పాటు పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. వడదెబ్బతో వృద్ధుడు మృతి సోంపేట: పలాసపురం గ్రామానికి చెందిన సింహాచలం పాిణిగ్రాహి(65) వడదెబ్బతో బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఉక్కపోతతో చనిపోయినట్లు పేర్కొన్నారు. అతడికి భార్య, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
ధ్యానంతో ప్రశాంతత
గార: పోలీసు అధికారులు, సిబ్బందిలో మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం ఏకాగ్రత పెంపొందించేందుకు ధ్యాన సాధన ఉపయోగపడుతుందని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. శ్రీకాకుళం నగర పరిధిలోని ఓ ఫంక్షన్లో హాలులో ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమం బుధవారంతో ముగిసింది. జిల్లాలో ఆర్మ్డ్ రిజర్వ్ విభాగం, శ్రీకాకుళం, టెక్కలి, కాశీబుగ్గ సబ్ డివిజన్లతో పాటు ఈగల్, ఇంటెలిజెన్సు విభాగాల అధికారులు, సిబ్బందికి ధ్యానం, శ్వాస వ్యాయామాలపై హార్ట్ ఫుల్నెస్ సంస్థ నిపుణులు అవగాహన కల్పించారు. ధ్యానం ద్వారా ఆలోచన శక్తి పెరగడంతో పాటు విధి నిర్వహణలో ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యం మెరుగుపడుతుందన్నారు. పింఛన్ల పంపిణీపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లాలో పెన్షన్ల పంపిణీ శతశాతం జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓలతో పింఛన్ల పంపిణీపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంపిణీలో ఆలస్యానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. సచివాలయాల సంక్షేమ అసిస్టెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. రమాబాయి జీవితం స్ఫూర్తిదాయకం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సతీమణి రమాబాయి జీవితం స్ఫూర్తిదాయకమని ఏఐఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తైక్వాండో శ్రీను, శ్రీకాకుళం జిల్లా దళిత సంఘాల జేఏసీ అధ్యక్షుడు డా.కంఠ వేణు, జేఏసీ నేతలు బడే కామరాజు, రాయి వేణుగోపాల్, బోనేల రమేష్లు అన్నారు. ప్రజల కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు అంబేడ్కర్ అయితే.. ఆయన సాధించిన విజయాలకి అన్నివిధాలుగా అండగా నిలిచిన ధీర వనిత రమాబాయి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కలెక్టర్ కార్యాలయం రోడ్డులో ఉన్న పూలే పార్క్లో తైక్వాండో శ్రీను ఏర్పాటు చేసిన రమాబాయి అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆమె వర్ధంతి సందర్భంగా బుధవారం నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఐఎం, దళిత, బహుజన జేఏసీ నాయకులు కొత్తూరు సత్యనారాయణ, పెయ్యల చంటి, అబ్బాస్, రాహుల్, గజ్జల తేజ, సంతు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిని గాలికొదిలేశారు!
పలాస సామాజిక ఆస్పత్రి (సీహెచ్సీ)లో చిన్నపిల్లల వార్డులో ఫ్యాన్లు తిరగకపోవడంతో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గర్భిణులు ప్రసవం అనంతరం ఇదే వార్డులోకి తల్లీబిడ్డలను ఉంచుతారు. అయితే ఈ వార్డులో కొన్ని ఫ్యాన్లు పని చేయకపోవడం, కొన్ని ఫ్యాన్ల నుంచి గాలి సరిగ్గా రాకపోవడంతో బాలింతలు అవస్థలు పడుతున్నారు.దీంతో కొందరు ఇంటి నుంచే ఫ్యాన్లు తెచ్చుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆస్పత్రులను గాలికొదిలేశారని మండిపడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. –వజ్రపుకొత్తూరు రూరల్ -
అనకొండలు మింగేశాయ్..
కొండపోరంబోకు భూములను జిరాయతీగా మార్చేందుకు ఆర్డీవో ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అసలే అది కొండ పోరంబోకు. గతంలో కొందరికి ప్రభుత్వం అసైన్డ్ చేసిన భూమి ఇది. అసైన్డ్దారుల పేరున ఉండాల్సిన భూమి ఒక ఆర్డీవో నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని చూపించి 2011లో జిరాయితీగా మార్చేశారు. దాని ఆధారంగా సెంట్లు లెక్కన విక్రయాలు చేపట్టారు. ఒకే భూమిని నలుగురైదుగురికి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ భూబాగోతమంతా ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో గ్రామంలో చోటుచేసుకుంది. కొందరు టీడీపీ నేతలు చేసిన నిర్వాకం కారణంగా అసైన్డ్దారులు, కొనుగోలుదారులు తిప్పలు పడుతున్నారు. కొండపోరంబోకు జిరాయితీగా ఎలా మార్చారు? ఒకే భూమిని నలుగురైదుగురికి ఎలా రిజిస్ట్రేషన్ చేశారు అన్నది ప్రస్తుత అధికారులకు అంతుచిక్కడం లేదు. ఎస్ఎంపురంలో ఆక్రమణల చరిత్ర ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో జరిగినన్ని భూ ఆక్రమణలు ఎక్కడా జరిగి ఉండవేమో. అక్కడున్న కొండలన్నీ కొందరు ఆక్రమించేశారు. కొండ పోరంబోకు కాస్త జిరాయితీ భూముల్లో రికార్డులో మార్పిడి చేయించారు. ఆపైన క్రయ, విక్రయాలు జరిపేశారు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీ నాయకుల పాత్ర వెలుగు చూస్తూనే ఉంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. జేసీ కోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. రికార్డుల్లో అక్రమంగా నమోదు చేసిన పేర్లు, భూమి స్వభావాన్ని సరిచేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇక్కడ ఘోరాలు చూసి అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. చివరికి, విద్యాలయాల భూములు కూడా ఆక్రమించేశారు. అసైన్డ్కు నో అబ్జక్షనా..! తాజాగా ఎస్ఎంపురంలోని పాత సర్వే నెంబర్ 112లో కొండపోరంబోకు భూములు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పలు విద్యా సంస్థలకు ప్రభుత్వాలు కేటాయించిన దాఖలాలు ఉన్నాయి. ఆ సర్వే నంబరే తర్వాత కాలంలో 630గా మారి, పలు సబ్ డివిజన్లతో కొందరు పేదలకు ప్రభుత్వం అసైన్డు చేసి కేటాయించింది. ఇలా 630–4లో ఎకరా 17సెంట్లు ఒకరికి, 630–5లో 93 సెంట్లు ఒకరికి, 630–7లో 97 సెంట్లు ఒకరికి, 630–8లో 82 సెంట్లు ఒకరికి, 630–9లో 99 సెంట్లు ఒకరికి, 630–10లో 34 సెంట్లు ఒకరికి, 630–11లో 21సెంట్లు చొప్పున ఒకరికి ప్రభుత్వం అసైన్డు భూమిగా ఇచ్చింది. పేదలకు ఇచ్చిన భూములు ఎప్పటికీ ప్రభుత్వ భూములుగానే ఉండాలి. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయిస్తే నిర్దేశిత కాల వ్యవధి తర్వాత విక్రయించుకోవడానికి వీలుగా కలెక్టర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటిదేమీ జరగలేదు. పక్కా గా పేద రైతులకిచ్చిన భూమి ఇది. కానీ, 2011లో దాదాపు 6.21 ఎకరాలకు ఓ ఆర్డీవో ఇచ్చిన నో అబ్జక్షన్ సర్టిఫికెట్ చూపించి, జిరాయితీగా మార్చి, ఆ పత్రాలు చూపించి అడ్డగోలుగా విక్రయాలు చేపట్టారు. అసైన్డుదారులకు సంబంధం లేకుండా ఎస్ఎంపురంలోని గణపతి, యుగంధర్, తదితర వ్యక్తులు విక్రయాలు చేపట్టి, రిజిస్ట్రేషన్లు చేసేశారు. సెంటు రూ.80వేలు చొప్పున సొమ్ము చేసుకున్నారు. ఒకే స్థలానికి నాలుగైదు రిజిస్ట్రేషన్లు.. గణపతి, యుగంధర్ తదితర వ్యక్తులు ఆ భూములను సెంట్లు లెక్కన విక్రయాలు చేపట్టడమే కాదు ఒకే భూమిని నలుగురైదుగురికి రిజిస్ట్రేషన్ చేసేశారు. బొడ్డేపల్లి శ్రీనివాసరావు భార్య నాగమణి ...సదరు యుగంధర్ నుంచి సెంటు రూ.80వేలు చొప్పున 11సెంట్లు రూ.8లక్షల 80వేలకు కొనుగోలు చేసి 2015లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఆ పత్రాలు పట్టుకుని భూమిలోకి వెళ్లారు. అదే భూమిపై మరికొందరు తమదంటూ వచ్చారు. దీంతో తనకు అమ్మకం చేసిన యుగంధర్ను అడగ్గా నాగమణిపై కొందరు దాడికి దిగారు. తాజాగా ఆ పత్రాలు పట్టుకుని రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లగా...అదే సమయంలో ఆ భూమికి చెందిన అసలు అసైన్డుదారు వచ్చి.. తనది ఆ భూమి అని పత్రా లతో చూపించడంతో నాగమణి అవాక్కయ్యారు. అదే భూమిని మరికొందరికి 2017, 2018, 2022లో విక్రయించినట్టు తేలడంతో ఆందోళనకు లోనయ్యారు. ఇంత దారుణమా అని ఆమె లబోదిబోమంటున్నారు. విక్రయించిన వ్యక్తి కూడా నాగమణికి బంధువు కావడం విశేషం. తాజాగా, కొండపోరంబోకు భూములను జిరాయితీగా ఎలా మార్చారు? అనే విషయమై కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రస్తుతం అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిసింది. తాత్కాలికంగా 22ఎలో పెట్టాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి. తనకు విక్రయించిన భూమినే మరికొందరికి విక్రయించారంటున్న బొడ్డేపల్లి నాగమణి జిరాయితీగా మారిన కొండపోరంబోకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్తో రికార్డుల మార్పిడి అసైన్డ్ భూములపై రిజిస్ట్రేషన్లు ఒకే భూమి నలుగురైదుగురికి అమ్మకం ఎస్ఎంపురంలో టీడీపీ నాయకుల భూ బాగోతం మోసపోయిన కొనుగోలుదారులు -
బతుకుల్ని బలిచేస్తున్న గంజాయి
ఆర్భాటానికే పోలీసులా..? శ్రీకాకుళం క్రైమ్: గంజాయి మత్తులో జిల్లా యువత చిత్తవుతున్నారు. ఏం చేస్తున్నారో సోయి లేనంతగా ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. ఎదురున్నది సామాన్య ప్రజలా.. పోలీసులా..అన్నది వీరికి అనవసరం.. ఎవరిని కొట్టాలో.. ఎవరిని హత్య చేయాలో.. ఎవరిపై అఘాయిత్యం జరపా లో వారే లక్ష్యంగా కనిపిస్తారు. ఖర్చులకు డబ్బు లు లేకపోతే నిర్మానుష్య మార్గాల్లో రాత్రివేళల్లో ఒంటరిగా వచ్చేవారిని అడ్డగిస్తారు. దారి దోపిడీ లు చేస్తారు. అవసరమైతే నగల కోసం గొంతుక లను సైతం కోయడానికి వెనకాడరు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, క్రయ విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనడానికి ఇటీవల చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలే నిదర్శనం. గంజాయి మత్తు యువత జీవితాన్ని ఎలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతోందనడానికి కొందరి జీవితాలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అమ్మ ఆవేదన.. పదహారేళ్ల నా కుమారుడు బాగా చదివేవాడు. తర్వాత చెడు స్నేహాలు మూలంగా గంజాయి బాట పట్టాడు. పూర్తిగా అదే జీవితం అయిపోయింది. 24 గంటలూ మత్తులో తేలుతూ ఉండేవాడు. ఆలస్యంగా మేము గమనించాం. అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. డ్రగ్ అడిక్షన్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్న నా కొడుకును చూసి తట్టుకోలేకపోతున్నా. వాడి జీవితంలో మార్పు అసాధ్యం. వాడి జీవితం అంధకారంగా మారింది. తల్లిదండ్రులకు నేను ఇచ్చే సలహా ఒక్కటే. అంగడిలో సరుకులా మారిన గంజాయికి మీ పిల్లలు బానిసలు కాకుండా వారిపై దృష్టిపెట్టాలి. వారు ఎటు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో అనే విషయాలను నిత్యం గమనిస్తేనే మన పిల్లలు మన పరిధిలో ఉంటారు. – రణస్థలంలో ఇటీవల పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఓ తల్లి ఆవేదన ఇది.. అరణ్య రోదన.. జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఓ గ్రామంలో ఓ యువకుడికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ప్రతిభావంతుడైన ఆ యువకుడు క్యారెక్టర్ సర్టిఫికేట్ కోసం పోలీసులను సంప్రదిస్తే అతనిపై అప్పటికే గంజాయి కేసు నమోదై ఉన్నట్లు తేలింది. గంజాయి సేవిస్తున్నట్లు వీడియోలు కలకలం సృష్టించిన ఘటనలో ఆ యువకుడు గతంలో పోలీసులకు చిక్కడంతో కేసు నమోదు చేశారు. సరదా, సందడి కోసం చేసిన ఆ పని యువకుడి జీవితంపై తీరని మచ్చగా మిగిలింది. అద్భుతమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గంజాయి సేవనం వల్ల దూరమైంది. ఆ యువకుడు జీవితం అంధకారబంధురమైంది. ఎవరైతే మాకేంటి..? ● విశాఖ రేంజి ఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగం యావత్తు ఇచ్ఛాపురంలో ‘మాదకద్రవ్యాలు రూపుమాపడంపై అభ్యుదయ సైకిల్ ముగింపు యాత్ర’ కార్యక్రమం భారీ ఎత్తున జరిపారు. జరిగి కొన్ని గంటలైనా కాలేదు.. ఆ కార్యక్రమానికి హాజరై వస్తున్న ఎస్ఐ డి.లోవరాజు, మరో కానిస్టేబుల్ సోంపేటలోని జామి ఎల్లమ్మ దేవాలయం సమీపానికి వచ్చేసరికి ముగ్గురు (వీరిలో యువకులు,బాలురు ఉన్నారు) గంజాయి మత్తులో గొడవపడుతున్నారు. గొడవెందుకుని ఎస్ఐ, కానిస్టేబుల్ ఆపడంతో చేతులతో దాడికి ఎగబడ్డారు. ఇదే అంశంలో ఎస్ఐని వీఆర్కు బదిలీ చేశారు. ● ఇదే సోంపేటలో మత్తులో ఇద్దరు యువకులు ఇంట్లో గొడవ చేస్తుండటంతో కుటుంబీకులే పోలీసులకు సమాచారమిచ్చారు. వారిని తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో తోసేయడం.. ఆ తర్వాత ఓ దుకాణాదారునిపై యువకులు దాడి చేస్తుండగా అక్కడే ఉన్న ఏఎస్ఐ సింహాద్రి, కానిస్టేబుళ్లు విజయ్, మురళీలు ప్రేక్షక పాత్ర పోషించారు. సోషల్మీడియాలో సంబంధిత వీడియోలు వైరల్ కావడంతో పోలీసులను ఎస్పీ సస్పెండ్ చేశారు. ● ఈ ఏడాది జనవరిలో జిల్లాకేంద్రంలో ఇద్దరు యువకులపై మరో ముగ్గురు యువకులు మద్యం, గంజాయి మత్తులోనే దాడి చేసి గాయపర్చారని స్థానికులు ఆరోపించారు. కుటుంబం మధ్య జరిగిన వ్యక్తిగత గొడవగా పోలీసులు పేర్కొన్నారు. ● జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఏఎస్ఐ రాత్రి వేళ విధులు ముగించుకుని దమ్మలవీధివైపు వస్తుండగా యువత మత్తులో న్యూసెన్సు చేస్తూ బండిని ఆపడంతో.. ఎందుకు ఆపారని ఏఎస్ఐ అన్నందుకు ఆయనపై దాడి చేశారు. దాడులు ఈ మత్తులోనేనా..? జిల్లాలో కొన్ని దాడులు.. హత్యలు జరిగే విధానాన్ని బట్టి స్థానికులు గంజాయి మత్తులోనే జరిగాయని, ఆరోపణలు ఎదుర్కొన్నవారు గంజాయి అతిగా వాడినవారు కావడంతో ఆ మత్తులోనే దాడులు, హత్యలు చేసి వుంటారని వ్యాఖ్యానించడం గమనార్హం. పోలీసులు మాత్రం మద్యం మత్తులోనే జరిగాయని కేసులను ముగించేయడం విశేషం. ● పాతపట్నంలో పోలీసులకు గంజాయి డెన్ల సమాచారాన్ని ఇచ్చిన ఓ వ్యక్తిని బస్సు దిగుతుండగానే అవే గంజాయి బ్యాచ్లు దాడి చేశాయి. సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామన్న పోలీసులే నేరస్థులకు ఉప్పందించడంతోనే ఇలా జరిగిందన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ● నరసన్నపేట కేంద్రంగా చేసుకుని ఓ వ్యాపారిపై ఇద్దరు యువకులు గంజాయి మత్తులో దాడికి ఎగబడ్డారు. ● జిల్లాకేంద్రంలోని టీడీపీ కార్యాలయానికి చెందిన వ్యక్తి రాత్రి సమయాన మహలక్ష్మినగర్వైపు వెళ్తూ తన మేనల్లుడు మత్తు బ్యాచ్తో వుండటం చూశాడు. వారితో ఎందుకున్నావ్ అన్నందుకు అందులో మత్తులో ఉన్న ఓ వ్యక్తి బండిపై నున్న టీడీపీ వ్యక్తిని తోసేయడంతో తలకు బలమైన గాయమై మృత్యువాత పడ్డాడు. ● జిల్లాకేంద్రంలోని ఓ వివాహితను మద్యం మత్తులో రూమ్కు పిలిపించుకున్న యువకుడు హత్యకు పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు. కాగా యువకుడు మూడు రోజులుగా మత్తు వీడకపోవడం గంజాయి సేవించే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. గంజాయి మత్తుతో యువత బతుకు చిత్తు జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా పల్లెలకూ విస్తరిస్తున్న జాఢ్యం గతంలో లేనంతగా మేం గంజాయిని పట్టుకుంటున్నాం.. లెక్కలేనన్ని కేసులు నమోదు చేస్తున్నాం.. భారీగా గంజాయిని సీజ్ చేస్తున్నాం. సరఫరా, క్రయ, విక్రయదారులను జైళ్లకు పంపిస్తున్నాం.. ఆస్తులను జప్తు చేస్తున్నాం.. అడిక్షన్ సెంటర్లకు సేవించేవారిని పంపిస్తున్నాం..ఇవీ పోలీసులతో కూటమి ప్రభుత్వం ఊదరగొట్టిస్తున్న మాటలు. ఇన్ని చేస్తున్నా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా ఇప్పటికీ ఎందుకు అరికట్టలేకపోతున్నారు..? చెక్పోస్టులు, సరిహద్దులు దాటి రైళ్లు, బస్సులు, టూవీలర్లు, ఇతర వాహనాల ద్వారా అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారులు ఎలా చొరబడుతున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం కరువైపోతుంది. ఇటీవల కొత్తగా డ్రగ్ డిటెక్షన్ కిట్లను జిల్లావ్యాప్తంగా ఉన్న పీఎస్లకు ఎస్పీ పంపించారు. మూత్ర పరీక్షలు ఆధారంగా నిమిషాల్లో గంజాయి, ఇతర మత్తుపదార్థాల సేవించేవారిని గుర్తించే ఈ కిట్ల ద్వారా శ్రీకాకుళం సబ్ డివిజన్లో ఒక్క రోజే 30 మంది అనుమానితులు పట్టుబడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా అర్ధం చేసుకోవచ్చు. -
29,30 తేదీల్లో ఎస్సీ కమిషన్ సభ్యుడి పర్యటన
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ఈ నెల 29, 30 తేదీలలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. 29న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శ్రీకాకుళం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు. మధ్యాహ్నం పలు భూ సమస్యలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టనున్నారు. 30న ఉదయం 10:30 గంటలకు మందస తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం భూవివాదాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులతో మాట్లాడతారు. వైభవంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో బుధవారం ఉదయం కల్యాణ సేవ ఘనంగా నిర్వహించారు. అధిక జ్యేష్ట శుద్ద ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉషా పద్మిని ఛాయాదేవేరులతో సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణమూర్తులుగా అలంకరించి కల్యాణం జరిపించారు. రూ.500 చెల్లించిన భక్త దంపతులకు స్వామి వారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు, కల్యాణ తలంబ్రాలు అందజేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ పాల్గొన్నారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ నరసన్నపేట: త్యాగాలకు ప్రతీకగా నిలిచే బక్రీద్ను ముస్లింలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒకప్రకటనలో కోరారు. దానంచేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం పండగ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. శ్రీకాకుళం క్రైమ్: బక్రీద్ పండగ మత సామరస్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని.. కుల, మతాలకు అతీతంగా సోదరభావంతో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండగ సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మసీదుల వద్ద బందోబస్తు, డ్రోన్స్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని తిరువీధి జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో బుధవారం సాయంత్రం మధుకేశ్వరుని తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనులుగా చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు నడు మ ఊరేగింపు నిర్వహించగా భక్తులు హారతులిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని జాతీయ రహదారి–16పై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. రహదారి భద్రతపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించడంతో పాటు ప్రమాదాలు తగ్గించే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర రహదారులు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ సంస్థలు 180 ట్రాఫిక్ స్టాపర్స్ (బారికేడ్లు), 25 సోలార్ బ్లింకర్లు సామాజిక బాధ్యతతో జిల్లా పోలీసు శాఖకు అప్పగించారు. వీటిని జిల్లాకేంద్రంతోపాటు ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి, కాశీబుగ్గ తదితర ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే కూడళ్లు, మార్కెట్టు ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాలు, ప్రధాన జంక్షన్లు వద్ద ఏర్పాటు చేయనున్నట్లు ఎస్పీ వెల్లడించారు. వీటి ద్వారా ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడం, వాహనాల పార్కింగ్ను నియంత్రించడం, రహదారులపై అనవసర రద్దీని తగ్గించడం, అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూడవచ్చన్నారు. ముఖ్యంగా పాదచారులు, వృద్ధులు, మహిళల భద్రతకు దోహదపడతాయన్నారు. ప్రజలకూ బాధ్యత ఉండాలి.. ప్రమాదాల నియంత్రణలో పోలీసులతో పాటు ప్రజల బాధ్యత కూడా అత్యంత ముఖ్యమని ఎస్పీ స్పష్టం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సీటుబెల్టు వినియోగించాలని, మద్యం సేవించి, అతివేగంతో నడపరాదని, మొబైల్ డ్రైవింగ్, ట్రిపుల్, ర్యాష్ రైడింగ్ ప్రమాదకరమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ ఉదయ్కుమార్సింగ్, హెచ్ఆర్ మేనేజర్ వి.శేఖర్, చీఫ్ మేనేజర్ ప్రసాద్, యూనియన్ జోనల్ సెక్రటరీ వి.వెంకటరమణ, ఆర్కే సోలార్ టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు ఎం.విజయ్చంద్, ఎ.చైతన్యప్రభు, ట్రాఫిక్ సీఐ వి.రామారావు, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్ఐ మెట్ట సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరిణి పనులపై పర్యవేక్షణ కరువు
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించే నాథుడే కరువయ్యారు. రాష్ట్ర దేవదాయ శాఖ ఆదేశాల మేరకు రూ.4 కోట్ల (రూ.2 కోట్లు ఆలయ నిధులు, రూ.2 కోట్లు సీజీఎఫ్ నిధులతో) ఇంద్రపుష్కరిణి ఆధునీకరణ అభివృద్ధి కోసం టెండర్లు ఖరారు కావడం విదితమే. అయితే రెండు నెలల నుంచి జరుగుతున్న ఈ పనుల్లో నాణ్యత పరిశీలనకు సంబంధిత దేవదాయ శాఖ ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ కూడా ఇటీవల కాలంలో పలు కారణాలతో సెలవులో వెళ్లిపోతుండటంతో నిర్మాణ పనుల్లో ఏ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది. కనీసం పనులు జరుగుతున్న సమయంలో ఏఈలు గానీ, డీఈలు గానీ మచ్చుకై నా కనిపించడం లేదు. కూటమి నేతల అండదండలతో సబ్ కాంట్రాక్టులు దక్కించుకున్న వారు సైతం అధికారుల వైపు చూడకుండా తమదైన శైలిలో కాంక్రీట్ వర్క్, పుష్కరిణి చుట్టూ ప్రధాన గోడను కూడా నిర్మించేశారు. రూ.4 కోట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టును నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాల్సి ఉండగా..ఇప్పటికి ఎర్త్ వర్కులు మాత్రమే జరుగుతున్నాయి. అయితే మట్టిని కప్పే పనులు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పుష్కరిణి అడుగున నింపే మట్టి కూడా ఎలాంటి పర్యవేక్షణ పరీక్షలు లేకుండానే వందలాది లోడ్లతో ట్రిప్పర్లతో కప్పేస్తున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం వీటితో పాటు ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలోనే కాంక్రీట్ వర్కులు జరగాల్సి ఉన్నప్పటికీ.. అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాణ్యత లోపాలతో పుష్కరిణి నిర్మాణం పూర్తయితే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి. -
అంపురంలో భూ బాగోతం!
● కోర్టులో కేసున్నా బరితెచించిన అక్రమార్కులు ● ఆక్రమణదారులకు అండగా అధికార పార్టీ నేతలు ● కొరడా ఝుళిపించిన రెవెన్యూ అధికారులు కంచిలి: అంపురం పంచాయతీ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని వివాదాస్పదంగా ఉన్న భూమిలో కొందరు అక్రమార్కులు ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారు. ఏకంగా హైకోర్టులో వ్యాజ్యం ఉన్న ప్రభుత్వ భూమిలోనే రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గేట్లు తెరిచారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి ఈ వ్యవహారానికి ఒడిగట్టారు. దీనికి కొందరు అఽధికార పార్టీ నేతలు అండగా నిలిచారు. దీనిపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం కొరడా ఝులిపించారు. కొద్ది నెలలుగా వివాదంగా ఉన్న ఈ వ్యవహరంపై తాజాగా చోటుచేసుకొన్న పరిణామాలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఎలాగైనా ఆక్రమించాలని.. జాతీయ రహదారికి ఆనుకొని కోట్లాది రూపాయలు చేసే ఈ విలువైన స్థలం పైన కొద్దిరోజులుగా అక్రమార్కుల కన్నుపడింది. కంచిలి మండలం అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బిలో 1.12 ఎకరాల డీ పట్టా భూమిని విచారించిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, వెంటనే ఆక్రమణలు తొలగించాలని లోకాయుక్త గత ఏడాది సెప్టెంబరులో తీర్పు వెలువరిచింది. సదరు భూమిపై వివాదాన్ని కొనసాగిస్తూ మరో వ్యక్తి తాను అసలైన వారసుడినంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానంలో వివాదం కొనసాగుతూనే ఉంది. జూన్ 16న దీనిపై విచారణ జరగాల్సి ఉంది. అప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులు గానీ, ఇతర వ్యక్తులు గాని ఈ వివాదాస్పద భూమిపై ఎటువంటి వ్యవహారాలు చేయడం కోర్టు ధిక్కారమే అవుతుంది. దీన్ని పక్కన పెట్టి కొందరు అక్రమార్కులు ఇటీవల సదరు భూమిని జేసీబీతో చదును చేయించి ఏకంగా వెంచర్ వేశారు. రాళ్లను కూడా పాతిపెట్టి ప్లాట్లుగా విభజించారు. ఈ బరితెగింపు వ్యవహారానికి మండలానికి చెందిన అధికార పార్టీ నేతలు సూత్రధారులుగా వెనుక ఉంటూ కథ నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టకుండా చూసుకొంటానని అక్రమార్కులకు భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. చేతుల మారుతూ.. వాస్తవానికి కొన్ని దశాబ్దాల క్రితం కంచిలి మండలానికి చెందిన అనుపోజు లక్ష్మి అనే మహిళకు రెవెన్యూశాఖ అంపురం రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి ఆనుకొని 1.12 ఎకరాల మెట్టు భూమికి బీడీఆర్ పట్టా మంజూరు చేశారు. సదరు భూమి పలు క్రయ విక్రయాల ద్వారా చేతులు మారింది. చివరికి కంచిలికి చెందిన ఒక ప్రభుత్వ అధికారి కొనుగోలు చేశారు. తర్వాత ఆయన మరణించారు. ఆ ఉద్యోగి కుటుంబీకులు ఆ స్థలం ముందు భాగంలో షాపులు నిర్మించారు. తర్వాత ఈ స్థలం సమీపంలో ఓ వ్యక్తి షాపు పెట్టడం, తర్వాత మరికొందరు ఆ భూమి హక్కుదారులు తామే అంటూ ముందుకు రావడం వంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. చివరికి ఈ వివాదం లోకాయుక్త వరకు వెళ్లింది. కేసు విచారణ జరిపిన లోకాయుక్త ఈ భూమి క్రయవిక్రయాలు వ్యవహారంలో జరిగిన మొత్తం గలీజును బయటకు తీసింది. 1987లో బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ద్వారా జరిపిన భూమి బదిలీలు కావడం గుర్తించారు. తర్వాత బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మిగానీ, ఆమె కుటుంబీకులు గానీ ప్రస్తుతం లేనందున సదరు భూమిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించాలని లోకాయుక్త జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ మేరకు కంచిలి తహశీల్దార్కు ఆదేశాలు వచ్చాయి. ఇక్కడే వివాదం మలుపు తిరిగింది. అంతవరకు లోకాయుక్త విచారణ జోలికి పోని, బీడీఆర్ పట్టా పొందిన అనుపోజు లక్ష్మి ఇంటి పేరుతో ఉన్న ఓ వ్యక్తి హైకోర్టుకు వెళ్లి తానే అసలైన వారసుడిని పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలతో రెవెన్యూ అధికారులు ఖంగుతున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వివాదం కొనసాగుతుండగా మరోవైపు కోట్లాది రూపాయలు విలువైన ఈ భూమిని ఆక్రమించేందుకు కొందరు అక్రమార్కులు అధికార పార్టీ నేతల అండగా నిలవడంతో ఈ స్థలంలో రాళ్లు పాతి రియల్ ఎస్టేట్ వెంచర్ వేశారు. ఆక్రమణ అడ్డగింత.. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అంపురం రెవెన్యూ పరిధిలో జాతీ య రహదారి పక్కన సర్వే నంబర్ 116–1బి లో 1.12 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో డబ్ల్యూపీ నంబర్ 27042/2025 వ్యాజ్యం పెండింగ్లో ఉన్నందున ఆక్రమణదారులు శిక్షార్హులు అంటూ కంచిలి తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్ బోర్డు పెట్టారు. అక్కడ స్థలంలో పాతిన రాళ్లను పెకిలించి పక్కన పడేశారు. ఆ స్థలాన్ని పూర్తిగా రెవెన్యూశాఖ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు ప్రకటించారు. -
బేరమే అర్హత..!
నాయకుడితో బొమ్మనాట సునీల్కుమార్.. వమవరల్లి గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్. వేట అంటే ఏంటో తెలియని ఈయనకు చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకార భృతికి అర్హుడిని చేసింది. వమరవల్లి గ్రామానికి చెందిన సుగ్గు శంకరనారాయణ.. కొన్నేళ్లుగా హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నాడు. బందరువానిపేట తీరంలో వేటకు వెళ్తున్నాడని పథకం డబ్బులు ఖాతాలో వేశారు. కళింగపట్నం పంచాయతీ సిలగాంకు చెందిన కొల్లి ధనరెడ్డి వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఈయన వేటకు వెళ్తున్నాడని పథకంలో చేర్చారు. పూజారి వెంకటరావు అనే యువకుడు విశాఖపట్నంలో ఎలక్ట్రికల్ పనులు చేస్తున్నాడు. వమరవల్లి గ్రామానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. ఈయన కూడా అర్హుడంటూ పథకం వర్తింపజేశారు. గార: బందరువానిపేట క్లస్టర్లో ఈ ఏడాది మత్స్యకార సేవలో పథకం 1181 మందికి ఇచ్చారు. వీరిలో దాదాపు యాభై మంది వరకు అనర్హుల పేర్లను ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాలో చేర్చిందని గ్రామ స్తులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన మత్స్యకా ర సేవలో పథకం అర్హుల జాబితా చూస్తే ఇంటి పేరు లేకుండా కొందరి పేర్లు కనిపించాయి. దీంతో స్థాని కుల అనుమానాలు బలపడ్డాయి. వమరవల్లి గ్రామానికి చెందిన మండల స్థాయి టీడీపీ నాయకుడి సిఫారసుతో వేటకు వెళ్లని వారి పేర్లు నమోదయ్యాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏటా చేపల పునరుత్పత్తి సమయమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు 61 రోజులు సముద్రంలో వేట నిషేధం అమలవుతోంది. ఈ నిషేధం సమయంలో వేటకు వెళ్లలేకుండా ఉండిపోయిన మత్స్యకారులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తోంది. వేటకు వెళ్లిన వారికి మాత్రమే అందాల్సిన నిషేధ భృతి బందరువానిపేటలో అనర్హుల చేతిలోకి వెళ్లింది. బందరువానిపేట తీరంలో వేరే గ్రామానికి చెందిన వారెవ్వరూ వేటకు వెళ్లే పరిస్థితి లేదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారే ఈ తీరం నుంచి వేటకు వెళ్తారు. కూటమి నాయకులు, బోటు యజమాను లతో కుమ్మకై ్క ఏకంగా మత్స్యకారులు కాని వారిని, జిల్లాలో ఉండని వారిని సైతం జాబితాలో చేర్చి నిధులను విడుదల చేసి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. లబ్ధిదారునికి వచ్చిన రూ.20 వేలులో నీకింత, నాకింత అంటూ పంపకాలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. నిబంధనలు ఇవి.. పథకం ఎంపిక చేసేందుకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న బోటు యజమాని తనతో పాటు మరో ఐదుగురు కళాసీలు (మత్స్యకారులు) పేర్లతో డిక్లరేషన్ ఫారమ్ ఇవ్వాలి. వాటి ఆధారంగా సచివాలయంలో పనిచేస్తున్న విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ బోటును పరిశీలించడంతో పాటు వారి ఆరుగురు వ్యక్తులనూ పరిశీలించాలి. ఇవేమీ జరగకుండా టీడీపీ నాయకుల ఒత్తిడితో ఎన్యుమరేషన్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై మండల మత్స్య అభివృద్ధి అధికారి ఎస్.ముసలినాయుడు వద్ద ప్రస్తావించగా బోటు యజమాని ఇచ్చిన పేర్లు ఆధారంగానే లబ్ధిదారుల ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. బందరువానిపేటలో వమరవల్లి, కళింగపట్నం గ్రామాల్లోని వేరే కులాలకు చెందిన వారు లబ్ధిదారులుగా ఉన్నారని స్థానిక మత్స్య సహకార సంఘం 26 మంది పేర్లు ఇవ్వడంతో, వారి పేర్లను ఉన్నతాధికారులకు అందించి పథకానికి అనర్హులుగా తేల్చామన్నారు. -
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రతిభావంతులను ప్రోత్సహిస్తే భవిష్యత్లో మరిన్ని అద్భుతాలు సాధిస్తారని ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ సురేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం ఆనందదాయకమన్నారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్స్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో చదువుతూ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.5వేలు, రూ.4వేలు, రూ.3వేలు చొప్పున నగదు బహుమతులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఎస్ఆర్ సంస్థ లక్ష్యమన్నారు. అనంతరం తల్లిదండ్రులకు ప్రత్యేకంగా సన్మానించారు.కార్యక్రమంలో ఎస్ఆర్ షాపింగ్మాల్స్ జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
విత్తన ఎంపికే కీలకం
● వరి సాగులో నకిలీలతో జాగ్రత్త ● కొనుగోలులో అప్రమత్తత అవసరం ● నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడి ఆమదాలవలస: వ్యవసాయంలో అత్యంత ప్రధానమైనది విత్తన ఎంపిక. ఇది పంట దశ, దిశను మార్చుతుంది. విత్తన ఎంపిక, కొనుగోలులలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అన్నదాతకు తీరని నష్టం తప్పదు. ప్రస్తుతం రైతన్నలు ఖరీఫ్ వరి సాగుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలో సుమారు 23,000 హెక్టార్లలో వరి పండించేందుకు సమాయత్తమవుతున్నారు. దుక్కి దున్ని విత్తనాలు చల్లే పనులకు సన్నద్ధమవుతున్నారు. ఈ తరుణంలో వరి విత్తనాల ఎంపికలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, విత్తనమే దిగుబడులను నిర్ణయిస్తుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగు జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడి వస్తుందని, లేకుంటే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు సొంత విత్తనాలు వాడుతున్నా శుద్ధి చేయడం తప్పనిసరని పేర్కొంటున్నారు. కొనుగోలులో జాగ్రత్త.. ● రైతులు బయట కొనుగోలు చేసే కంటే వ్యవసాయ శాఖ ద్వారా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని అధికారులు చెబుతున్నారు. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్ను నంబర్, గడువు తేదీ, నికర ధర, కంపెనీ పేరు, డీలర్ సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. ● గడువు దాటిన విత్తనాలు, లూజు, చిరిగి సంచుల నుంచి వచ్చిన ప్యాకెట్లు కొనుగోలు చేయకూడదు. ● కొనుగోలు చేసిన సరుకును డీలర్ వద్ద తూకం వేయించాలి. ● మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారిని గానీ, శాస్త్రవేత్తలను గానీ సంప్రదించాలి. ● బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కొనుగోలు చేసిన వెంటనే మొలక శాతాన్ని చూసుకోవాలి. ● చీడ పీడల ఉద్ధృతికి ఏదో రకంగా మందులు పిచికారీ చేస్తుంటారు. అలాకాకుండా శాస్త్రవేత్తల సూచనల మేరకు పురుగు మందులు కొనుగోలు చేయాలి. ● పురుగు మందులు రెండు, మూడింటిని కలిపి వాడకూడదు. వాడిన పురుగు మందు డబ్బాలు, సీసాలు ధ్వంసం చేసి భూమిలో పాతి పెట్టాలి. మెషీన్ కుట్టుతో ఉన్న మందుల బ్యాగులనే వాడాలి. ఒకవేళ బ్యాగుకు చేతి కుట్టు ఉంటే సీసం సీలు ఉందో లేదో గమనించాలి. కంపెనీల ప్రచారంతో మోసపోవద్దు.. పలు మందులు కంపెనీలు ప్రచారంతో రైతులను అయోమయానికి గురిచేస్తుంటాయి. ఖరీదైన ఆకర్షణీయమైన కవర్లలో విత్తలు, ఎరువులను ప్యాకింగ్ చేసి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇలాంటి విత్తన ప్యాకెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలపై రసాయన మందులు పిచికారి చేస్తుంటారు. అవి పనిచేయడం లేదని, మరో కంపెనీ మందులు వాడుతుంటారు. దీనివల్ల సాగులో పెట్టుబడులు పెరిగి ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో అప్పులపాలు కావాల్సి వస్తోంది. జాగ్రత్తలు తీసుకోవాలి.. విత్తనాలు, ఎరువుల కొనుగోలు విషయంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగు మందులను కొనుగోలు చేయాలి. కంపెనీలు ఇచ్చే ఆఫర్లకు ఆశపడొద్దు. ఎరువులు, పురుగు మందుల కొనుగోలు చేసేటప్పుడు రశీదులు తప్పకుండా తీసుకోవాలి. మోతాదుకి మించి వాడొద్దు. సరైన విత్తనాల ఎంపికలపైనే పంట దిగుబడులు ఆధారపడతాయి. – మెట్ట మోహన్రావు, వ్యవసాయాధికారి, ఆమదాలవలస మండలం -
జాబుకు దండం!
హడలిపోతున్న అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో మరో కీలక వికెట్ పడిపోయేది. ముఖ్య నేత టార్చర్ భరించలేక ఏకంగా కీలక ఉద్యోగి దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయినట్టు సమాచారం. బడానేత తీరుతో విసిగి వేసారిపోయిన ఉద్యోగి.. ఆయన చెప్పినదంతా చేయాలంటే కష్టమని, ఇక్కడ పనిచేయడం కంటే తప్పుకోవడమే మంచిదన్న ఆలోచనకు వచ్చేసి, నాలుగు నెలల సెలవు పెట్టేసి, కార్యాలయం సిబ్బందికి ఫోన్ ఇచ్చేసి వెళ్లిపోయినట్టు తెలిసింది. సమాచారం తెలుసుకున్న బడా నేత మంగళవారం రాత్రి రంగంలోకి దిగి సదరు అధికారిపై ఒత్తిడి తేవడంతో సెలవును రద్దుచేసుకున్నట్టు సమాచారం. ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఎందరో బాధితులు.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో బడా నేత సతాయింపులు భరించలేక అధికారులు వెళ్లిపోవడం కొత్తేమీ కాదు. గతంలో ఇక్కడ మున్సిపల్ ఇంజినీర్లుగా పనిచేసిన దక్షిణామూర్తి, కమలాకర్ ఏకంగా స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) వెళ్లిపోగా, మున్సిపల్ ఇంజినీర్గా పనిచేసిన మరో అధికారి శ్రీనివాసులు కూడా దీర్ఘకాలిక సెలవు పెట్టేసి వెళ్లిపోయారు. మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన పీవీవీడీ ప్రసాదరావు కూడా బడా నేత ఒత్తిళ్లు, ఇబ్బందులు భరించలేక బదిలీపై వెళ్లిపోయారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన వేధింపులే కారణమన్నది ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఇక్కడితో ఆగుతుందనుకుంటే పొరపాటే. సిటీ ప్లానింగ్లో పనిచేస్తున్న మరో ఇద్దరు కూడా బదిలీ కోసం యత్నిస్తున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో మరో ఇంజినీర్ పి.కమలాకర్ బడా నేత చెప్పిన పనులన్నీ చేయలేక, అడ్డగోలుగా బిల్లులు చెల్లించలేక, నోటి దురుసును తట్టుకోలేక తప్పుకున్నారు. అంతకుముందు దక్షిణామూర్తి, శ్రీనివాస్లు కూ డా అదే రకమైన బాధితులు. ఇక గతంలో మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన ప్రసాదరావైతే రథసప్తమి వేడుకల కోసం కార్పొరేషన్ నిధులను తోడేస్తున్నారని, తానైతే ఖర్చు పెట్టలేనని చెప్పి హుటాహుటిన బదిలీపై వెళ్లిపోయారు. చెప్పినట్టి చేస్తేనే.. ప్రతీదీ తనకు తెలిసే జరగాలని, ఫైలు కూడా తన దృష్టికి వచ్చాకే కదలాలని, ఎవరినైనా మార్చాల న్నా తన అనుమతితో జరగాలని, ఇలా రక రకాలుగా టార్చర్ చేయడంతో తట్టుకోలేకనే కీలక ఉద్యోగి క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచా రం. కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి, తా త్కాలిక ఉద్యోగుల సీట్ల మార్పు గురించి పేచీ ఏర్పడినట్టు తెలిసింది. ముఖ్యంగా హెడ్ వాటర్ ట్యాంక్ వద్ద పనిచేసిన ఓ వికలాంగ ఉద్యోగి బాధ లు చూసి కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకురావడాన్ని ఆ బడా నేత జీర్ణించుకోలేకపోయారు. అలాగే, ఆరోపణలతో గతంలో బదిలీ అయిన ఓ ఉద్యోగిని వెనక్కి తీసుకురావాలన్న ఒత్తిళ్లను అమలు చేయలేదన్న అక్కసు కూడా కారణమని తెలుస్తోంది. అలాగే, పాలన పరమైన నిర్ణయాల్లో వేలు పెట్టి ఇబ్బంది పెట్టడం, తన అభిప్రాయం మేరకే నడుచుకోవాలన్న ఆంక్షలు కీలక ఉద్యోగిని అంతర్మథనంలో పడేసినట్టు తెలిసింది. ఆత్మాభి మానాన్ని చంపుకుని ఎన్నాళ్లు పనిచేయగలమని సెలవుకు సిద్ధమయ్యారని ప్రచారం. శ్రీకాకుళం నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు భయపడిపోతున్నారు. బడానేత టార్చర్ భరించలేక హడలెత్తిపోతున్నారు. చెప్పినట్టు చేయాలని నేత హుకుం జారీ చేస్తున్నారు. సూచించినట్టు బిల్లులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఆదేశించిన వారి పై చర్యలు తీసుకోవాలని పీకమీద కత్తి మీద పెడుతున్నారు. ఇవన్నీ అధికారులకు ప్రాణ సంకటంగా మారాయి. చర్యలు తీసుకోకపోతే బడా నేత పోరు పడలేకపోతున్నారు. చర్యలు తీసుకుంటే పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి నోటికి పనిచెబుతున్నారు. కొంతమందైతే ఆ బూతులు భరించలేక ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్పొరేషన్లో బడా నేత టార్చర్ భరించలేక సెలవు పెట్టిన కీలక ఉద్యోగి ఆత్మాభిమానం చంపుకోలేక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం బయటకు పొక్కడంతో రంగంలోకి బడా నేత.. మంగళవారం రాత్రి కార్పొరేషన్లో రసవత్తర పరిణామాలు బడా నేత ఒత్తిడితో సెలవును రద్దు చేసుకున్న కీలక ఉద్యోగి మున్సిపల్ కార్పొరేషన్లో ఆగని వేధింపులు, సతాయింపులు, బూతు పురాణాలు వరుసగా వీఆర్ఎస్, సెలవుపై వెళ్లిపోతున్న మున్సిపల్ అధికారులు రోజురోజుకీ పెరుగుతున్న బడా నేత బాధితులు -
అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ టైమ్టేబుల్లో మార్పు
శ్రీకాకుళం: అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్లో చిన్న మార్పు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ. రవిబాబు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మే 28వ తేదీన ప్రభుత్వం బక్రీద్ సెలవుగా ప్రకటించినందున ఆ రోజున జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షను జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం డైరెక్టర్ తెలియజేశారని ఆయన తెలిపారు. మే 28వ తేదీన జరగాల్సిన ఓపెన్ స్కూల్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలు కూడా జూన్ 2కు మార్చినట్లు పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్ష జూన్ 2 నుంచి జూన్7కు మార్చారని తెలిపారు. -
800 లీటర్ల గడ్డి మందు విక్రయాలు నిలుపుదల
నరసన్నపేట: మండలంలో వివిధ పురుగు మందుల షాపుల్లో ఉన్న 800 లీటర్ల పారా క్వాట్ డైక్లోరైడ్ 24 శాతం ఎస్ఎల్, దాని అన్ని ఫార్ములేషన్లపై నిషేధం ఉన్నందున ఈ మందు విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వ్యవసాయాధికారి వై.సూర్యకుమారి తెలిపా రు. వారం రోజులుగా పురుగుల మందుల దుకాణాల్లో తనిఖీలు చేసి 800 లీటర్లు ఉన్నట్లు గుర్తించి ఆయా షాపుల యజమానులకు అమ్మకాల నిలుపుదల ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపా రు. ఈ మేరకు ఆమె తన కార్యాలయంలో మంగళవారం వివరించారు. దీన్ని డీలర్లు అమలు చేయాలని, ఆదేశాలు పాటించక విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్తూరు ిసీహెచ్సీ తనిఖీ కొత్తూరు: కొత్తూరు సీహెచ్సీని డీహెచ్ఎస్ విజయలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్సీలో అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది వైద్యం సక్రమంగా అందిస్తున్నప్పటికీ వసతులు కొరవడంతో అవస్థలు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె వైద్యులతో మాట్లాడారు. అదనపు భవన నిర్మాణాలు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సూపరింటెండెంట్ కిశోర్ కుమార్, పలువురు వైద్యసిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ డ్రైవర్కు వడదెబ్బ మెళియాపుట్టి: మండలకేంద్రంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాంబాబు వడదెబ్బకు గురవడంతో బస్సు అదుపు తప్పింది. అయినా డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. హిరమండలం నుంచి పలాస వెళ్లే ఆర్టీసీ బస్సు మెళియాపుట్టి గ్రామం వద్దకు వచ్చే సరికి డ్రైవర్కు వడదెబ్బ తగలింది. అయినా ముందు బస్సును అదుపు చేశారు. వెంటనే స్థానికులు ఆయనను స్థానిక పీహెచ్సీకి తరలించారు. బస్సును రెండు గంటల పాటు నిలిపివేశారు. పరిశ్రమ పైపులైన్ తవ్వేశారని రైతులపై ఫిర్యాదు రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో వల ఎపీటోరియా పరిశ్రమ వాటర్ పైపులైన్ను స్థానిక రైతులు తవ్వేశారని పోలీసులకు పరిశ్రమ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లగానే స్థానిక రైతులు నీలాపు రమణ, అప్పలరాజు, బావిశెట్టి గోవింద, కాజా కన్నయ్య, నాగరాజు, దంగుడువీపు వెంకటప్పారావు, సతీష్లు తమ భూముల్లో పనులు చేసుకుంటూ ఉండగా పైప్లైన్ జేసీబీకి తగిలి పగిలిందని, తాము పగలగొట్టలేదని వివరించారు. తమ భూముల్లో పైపులు వేసి తిరిగి తమపైనే ఫిర్యాదు చేయ డం సరికాదన్నారు. పైప్లైన్ వేసినప్పుడు ఉపాధి కల్పిస్తామని చెప్పి మాట తప్పారని, ఉపాధి ఇవ్వలేకుంటే తమ భూముల్లో వేసిన పైపులైన్లు తొలగించాలని తెలిపారు. నేడు బొడ్డపాడులో జిల్లా అమరవీరుల స్మారక సభ పలాస: పలాస మండలం బొడ్డపాడు జిల్లా అమరవీరుల స్మారక మందిరం వద్ద బుధవారం ఉదయం జిల్లా అమరవీరుల స్మారక సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు మంగళవారం స్మారక మందిరం వద్ద స్మారక కమిటీ నిర్వాహక కమిటీ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో ఈ విషయం చెప్పారు. 1969లో జరిగిన శ్రీకాకుళం జిల్లా గిరిజన సాయుధ రైతాంగ పోరాటంలో మొత్తం 360 మంది అశువులు బాసారని తదనంతరం కూడా ఎంతో మంది మృతి చెందారని వారిని స్మరించుకోవడానికి ప్రతి ఏడాది మే 27న అమరవీరుల స్మారక సభను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు. ఉద్దానం ప్రజలంతా హాజరై విజయవంతం చేయాలని కోరారు. -
955 ఫిర్యాదులు.. 680 గుర్తింపు.. 518రికవరీ
● 2026 ఏడాదికి సంబంధించి పోగొట్టుకున్న మొబైళ్లు బాధితులకు అందజేత ● 2023 నుంచి 2,718 ఫోన్లు అప్పగింత ● వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : అనుకోని పరిస్థితుల్లో ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించడం తమ బాధ్యతని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ ఏడాదిలో బాధితుల నుంచి వచ్చిన 955 ఫిర్యాదులకు గాను 680 ఫోన్లను ట్రేస్ చేశామని రూ. కోటి విలువైన 518 ఫోన్లను అప్పగించామన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. 2023 నుంచి 2,718 మొబైళ్లు... 2023 నుంచి ఇప్పటివరకు ఇక్కడి పోలీసులు 2718 మొబైళ్లు ఫోన్లను రికవరీ చేశారన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్లేషించి జిల్లాలోనే కాక దూరప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు మళ్లించిన ఫోన్లను కూడా గుర్తించి స్వాధీనం చేసుకోవడంలో సైబర్ సెల్ నిపుణులు, ఐటీకోర్ బృందాల కృషి ఎనలేనిదన్నారు. 2023లో 518, 2024లో 622, 2025లో 1060, 2026లో 518 ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. ఫిర్యాదు చేయండిలా. మొబైళ్లను పోగొట్టుకున్న బాధితులు తక్షణమే ఆ పరిధి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పా టు సిఇఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా కూడా ఫోన్ బ్లాక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ వెబ్సైట్లో మొబైల్ వివరాలతో బ్లాకింగ్ రిక్వెస్ట్ నమోదు చేసుకోవాలన్నారు. పోర్టల్ ద్వారా ఫిర్యాదులు, పోలీస్స్టేషన్లలో అందిన సమాచారాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లా సైబర్, ఐటీ కోర్ బృందాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫోన్లను గుర్తిస్తారన్నారు. ఫోన్ పోగొట్టుకున్న తక్షణమే ఫిర్యాదు చేస్తే 90శాతం దొరికే చాన్స్ ఉంటుందని, పోర్టల్లో బ్లాక్ చేయకపోతే అదే మొబైల్తో సైబర్ కేటుగాళ్లు నేరాలకు పాల్పడే వీలుంటుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, సీసీఎస్ సీఐ సూర్యచంద్రమౌళి, సైబర్ సెల్ సిబ్బంది పైలా శరత్చంద్ర, గిరి తదితరులు ఉన్నారు. -
నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగు అప్పగింత
శ్రీకాకుళం క్రైమ్ : దాదాపు నెలక్రితం పోగొట్టుకున్న బ్యాగును ట్రాఫిక్ పోలీసులు ఆధార్కార్డు సహాయంతో ట్రేస్ చేసి జిల్లాకేంద్రానికి చెందిన కొల్లేటి అమూల్యకు సోమవారం అప్పగించారు. అమూల్య సారవకోట మండలంలోని వెంకటాపురం పుట్టింటికి వెళ్లేందుకు ఆటోలో ఆర్టీసీ కాంప్లెక్సుకు బయల్దేరి బ్యాగును మరిచిపోయింది. ఆటోవాలా ఆ బ్యాగును సమీప ట్రాఫిక్ పాయింట్లో అప్పజెప్పడంతో కానిస్టేబుల్ అన్నెపు సత్యనారాయణ అందులో ఉన్న ఆధార్కార్డును చూసి సారవకోట పోలీసులకు సమాచారమివ్వడంతో చిరునామాను బట్టి అమూల్య బ్యాగుగా గుర్తించారు. విద్యుత్ లైన్పై ఒరిగిన టవర్ రణస్థలం: పైడిభీమవరం జాతీయ రహదారి పక్కన ఉన్న బీఎస్ఎన్ఎల్ పాత టవర్ మంగళవారం 33 కేవీ హెచ్టీ విద్యుత్ లైన్పై వాలింది.ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడం, టవర్ కింద పడకుండా వైర్లపై నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతు చర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యసేవలు అందించాలి పాతపట్నం: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీసీహెచ్ఎస్ డాక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. పాతపట్నం సీహెచ్సీని మంగళవారం తనిఖీ చేశారు. ఆస్పత్రి పరిసరాలు, ఓపీ విభాగం, రోగుల వార్డులు, చిన్నపిల్లల వార్డు, బ్లడ్ బ్యాంక్ యూనిట్, రక్త పరీక్షల గదిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బంది సక్రమంగా వైద్య సేవలు అందించి ఆస్పత్రికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డి.లీలాకుమార్, డాక్టర్లు జి.వేణుగోపాల్, జి.అనిత, హెచ్.సునీత, షణ్ముఖరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
గొట్టా..
హిరమండలం: గొట్టా బ్యారేజీ యాప్రాన్ నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. జనవరిలో నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. కానీ జూన్ సమీపిస్తున్నా ఇంకా పనులు ప్రారంభం కాలేదు. జూలైలో కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సి ఉంది. మరోవైపు వర్షాకాలం ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పనులు ప్రారంభించకపోవడంతో ఈ ఏడాది యాప్రాన్ నిర్మాణ పనులు పూర్తవుతాయా? లేదా? అన్నది అనుమానమే. దశాబ్దాల కిందట గొట్టా బ్యారేజీ నిర్మాణం జరిగింది. 1977లో నిర్మించిన ఈ ప్రాజెక్టు జిల్లాను సస్యశ్యామలం చేస్తూ వస్తోంది. అయితే బ్యారేజీకి ఆయవు పట్టుగా ముందు భాగంలో యాప్రాన్ (రాతికట్టు) అస్తవ్యస్తంగా మారింది. గేట్ల ద్వారా విడుదలయ్యే నీటి ప్రవాహాన్ని ఇది నియంత్రిస్తుంది. అలాంటి రాతికట్టు అస్తవ్యస్తంగా మారింది. భారీ నీటి ప్రవాహానికి పూర్తిగా దెబ్బతింది. భారీ బండరాళ్లు తేలిపోయి ప్రమాదకరంగా మారింది. దీంతో బ్యారేజీకి ముప్పు తప్పదని నీటిపారుదల శాఖ అధికారులు భావించి ప్రభుత్వానికి నివేదించారు. డ్రాయింగ్స్ సమర్పణలో జాప్యం ఇక్కడ యాప్రాన్ పునర్నిర్మాణానికి గాను జనవరి లో రూ.16.49 కోట్లు మంజూరు చేశారు. కానీ దీని నిర్మాణానికి సంబంధించి డ్రాయింగ్స్ సమర్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాలా జాప్యం జరిగినట్టు తెలుస్తోంది. దాని ప్రభా వం పనుల ప్రారంభంపై పడింది. ప్రభుత్వం పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన వెంటనే చీఫ్ ఇంజినీర్ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కు డ్రాయింగ్ అప్రూవల్ పంపాలి. అది మంజూరయ్యాక టెండర్లు ఖరారు చేయాలి. కానీ అలా చేయలేదు. పాత డ్రాయింగ్ ప్రకారం టెండర్లను ఆహ్వానించేశారు. కానీ ప్రస్తుత పరిస్థితికి తగ్గట్టు యాప్రాన్ నిర్మాణం జరగకపోతే ఇబ్బందులు వస్తావని చెప్పి మళ్లీ కొత్త డ్రాయింగ్తో అప్రూవల్కు పంపారు. ఇదంతా జిల్లా మంత్రి ఆదేశాలతో జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు నాలుగు నెలల సమయం పట్టింది. ఇటీవల పనులు ప్రారంభించారు. మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కానీ జూలైలో ఖరీఫ్నకు తాగునీరు విడుదల చేయాలి. మరోవైపు వర్షాలు ప్రారంభమైతే యంత్రాలతో పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది. పనులు చాలా కష్టం ఈ యాప్రాన్ దాదాపు 45 మీటర్ల పొడవు ఉంటుంది. మధ్యలో భారీ బండరాళ్లు తేలిపోయాయి. వా టిని యంత్రాలతో తొలగించాలి. కాంక్రీటుతో పటి ష్టం చేయాలి. రెండు వరసల్లో ఉన్న బ్లాక్స్ తొలగించి అడ్డుగా గోడ కట్టాలి. మధ్యలో మళ్లీ రాళ్లు పేర్చా లి. ఇదంతా చేసేందుకు కనీసం మూడు నెలల సమయం పడుతుంది. అది కూడా వాతావరణం సహకరిస్తేనే. ఈ పనుల పేరు చెప్పి బ్యారేజీలో ఉన్న నీటిని బయటకు వదిలేశారు. డెడ్ స్టోరేజీకి చేర్చారు. కనీస సమాచారం ఇవ్వకుండా అప్పట్లో అలా చేయడంతో రబీ పంటలు వేసుకున్న వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంటలు వేసుకొని పెట్టుబడులు పెట్టిన తర్వాత నీటిని వృథాగా కిందకు విడిచిపెట్టడంతో రైతులు ఆందోళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఖరీఫ్కు కూడా యాప్రాన్ నిర్మాణం పేరుతో నీటి విడుదలను జాప్యం చేస్తారన్న అనుమానాలు రైతుల్లో ఉన్నాయి. ఒకవేళ సగం పనులు పూర్తయిన తర్వాత వర్షాలతో నిలిచిపోతే మాత్రం నిధులంతా బూడిదలో పోసిన పన్నీరు కాక తప్పదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గొట్టా బ్యారేజీ యాప్రాన్ నిర్మాణంలో నిర్లక్ష్యం జనవరిలో రూ.16.49 కోట్ల నిధుల విడుదల పనులు మాత్రం మే రెండో వారంలో ప్రారంభం జూలైలో వంశధార నీటి విడుదల సాధ్యమేనా? రానున్నది వర్షాకాలం.. పనులపై నీలినీడలు -
నెలలో ఎట్టా..?
వేగంగా చేస్తాం యాప్రాన్ నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తాం. వీలైనంత త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నాం. 45 మీటర్ల పొడవు ఉన్న యాప్రాన్కు సంబంధించి తొలి దశలో మొదటి సగం చేస్తాం. రెండో దశలో మిగతాది పూర్తి చేస్తాం. – ఎం.మురళీమోహన్, ఈఈ, బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు, మెయింటెనెన్స్ డివిజన్ నరసన్నపేట రెండేళ్లుగా హడావుడి.. గత రెండేళ్లుగా యాప్రాన్ నిర్మాణ పేరుతో హడావుడి నడుస్తుందే తప్ప పనులు మాత్రం జరగడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టిపెట్టాలి. యాప్రాన్ పనులు పేరు చెప్పి రబీకి సాగునీరు లేకుండా చేశారు. ఇప్పటివరకూ పనులు ప్రారంభించలేదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అనాలోచిత చర్య. – మీసాల భాస్కరరావు, ఆయకట్టు రైతు, భగీరథిపురం -
అభివృద్ధి పేరిట భూముల దోపిడీ
మందస : అభివృద్ధి ముసుగులో కార్పొరేట్లకు రైతుల భూములు కట్టబెట్టడానికి కార్గో ఎయిర్పోర్టు పేరిట పక్కా స్కెచ్ వేశారని రైతు సంఘం నాయకుడు బత్తిన లక్ష్మణ్ మండిపడ్డారు. మందస మండలం హరిపురంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల జరిగిన సభలో చేసిన వ్యాఖ్యలకు పలు ప్రశ్నలు సంధించారు. ఉద్దానం ప్రాంత రైతాంగం సమస్యలు మీకు తెలియవా? తరతరాలుగా కొబ్బరి, జీడితోటలపైనే ఆధారపడి బతుకుతున్నామని, అలాంటి భూములను లాక్కుంటే తమ బతుకులు వీధిన పడవా? అని ప్రశ్నించారు. కొబ్బరి చెట్టు ఫలసాయం ఇవ్వాలంటే కనీసం ఏడేళ్లు పడుతుందని, జీడి చెట్టు కాపు కాయాలంటే ఐదేళ్లు పడుతుందని, అలాంటి భూములను లాక్కుంటే కుటుంబ పోషణ ఎలా సాధ్యమన్నారు. జిల్లాలో 12 వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు ఖాళీగా ఉన్నాయన్నారు. వజ్రపుకొత్తూరు మండలం సీతానగరంలో 1875 ఎకరాలు, పలాస వద్ద 800 ఎకరాలు, భావనపాడులో 5000 ఎకరాలు, మూలపేట వద్ద 1500 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నా తమ భూములపై కన్ను పడటం వెనుక కార్పొరేట్ కుట్ర దాగుందని ఆరోపించారు. సమావేశంలో దున్న హరికృష్ణ, బెలమర జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
గార: మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో విజిలెన్సు, వ్యవసాయాధికారులు సోమవారం తనిఖీలు చేపట్టారు. తూలుగు జంక్షన్లోని శ్రీశివపార్వతి ఎంటర్ప్రైజెస్, శ్రీ వేంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ దుకాణాలను విజిలెన్సు ఎస్ఐ బి.రామారావు, ఏవో డి.పద్మావతిలు తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం ఇటీవల నిషేధించిన పారాక్వాట్ కలుపు మందు 287 లీటర్లు ఉండడంతో వాటి అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తనిఖీల్లో ఏఈవోలు బి.దుర్గాప్రసాద్, జె.శ్రీదీప్తి తదితరులు పాల్గొన్నారు. -
పక్క రాష్ట్రానికి పరుగులు
● ఒడిశాలో తక్కువ ధరకు పెట్రోల్, డీజిల్ పర్లాకిమిడిలో పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు పాతపట్నం సమీపంలోని వెలవెలబోతున్న పెట్రోల్ బంక్ ధర తక్కువే.. ఆంధ్రాలో కంటే ఒడిశాలోని పర్లాకిమిడిలో పె ట్రోల్ ధర తక్కువ. లీటర్ పెట్రోల్కు రూ.7 తక్కువగా ఉంటుంది. అందుకే పర్లాకిమిడి వెళ్లినప్పుడు పెట్రోల్ వేయిస్తాను. – కొరాడ జగదీష్, వాహనదారుడు, పాతపట్నం పాతపట్నం: ఒడిశా సరిహద్దు ప్రాంత వాసులు పెట్రోల్, డీజిల్ కోసం పక్క రాష్ట్రానికి పరుగులు పెడుతున్నారు. కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం వాసులు పర్లాకిమిడి వెళ్లి పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. ఆంధ్రా కంటే ఒడిశాలో తక్కువ ధరకు వస్తుండడంతో అంతా అటే క్యూ కడుతున్నారు. తరచూ ఒడిశాకి వెళ్లలేని కొందరు వాహనదారులు పది లీటర్ల క్యాన్లలో పెట్రోల్, డీజిల్ తీసుకుని వచ్చి ఇంటి వద్ద నిల్వ ఉంచుకుంటున్నారు. -
బెధరగొడుతున్నారు
● మళ్లీ పెరిగిన ఇంధనం ధరలు ● వారంలో నాలుగుసార్లు పెంపు ● తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.117.50 ● డీజిల్ ధర రూ.105.15 ● సగటున లీటరుపై రూ.8 పెంపు ● జిల్లా వాసులపై రోజుకు రూ.16.72 లక్షలు అదనపు భారం శ్రీకాకుళం పాతబస్టాండ్: పాలకులు సగటు జీవిని బెదరగొడుతున్నారు. మళ్లీ మళ్లీ పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్యుడికి భయం పుట్టిస్తున్నాయి. ముందుగా రూ.3లు పెంచిన కంపెనీలు, తర్వాత మరో 45 పైసలు పెంచాయి. ఇలా వారం రోజుల్లో నాలుగు సార్లుగా సుమారుగా లీటరు డీజిల్, పెట్రోల్లపై రూ.8లు వరకు పెంచారు. ఇలా రోజూ పెంపు జరుగుతోంది. ఇలాంటి ఆపత్కాలంలో కొంత రాయితీ ఇచ్చి కొనుగోలుదారులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసి చోద్యం చూస్తోంది. వారం కిందటి వరకు జిల్లాలో పెట్రోల్ లీటరు ధర రూ.109. 46 పైసలు ఉండేది. ప్రస్తుతం లీటర్ ధరను రూ.117.50కు పెంచారు. అలాగే డీజిల్ లీటరు ధర రూ. 97.26 ఉండేది. దీన్ని రూ.105.15కి పెంచారు. ఇలా రోజువారీ ఈ ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులపై భారీగా భారం పడుతోంది. జిల్లాలో ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకు చెందిన బంకులు 143 ఉన్నాయి. వీటితో పాటు ప్రైవేటు బంకులు మరో 20 వరకు ఉన్నాయి. సగటున ప్రతి రోజు డీజిల్ 1.10 లక్షల లీటర్ల వరకు జిల్లాలో వినియోగం జరుగుతుంది. ప్రస్తుతం రేటు ప్రకారం లీటరుపై రూ.7.89 పెరిగింది. అంటే సుమారుగా సగటున జిల్లా విని యోగదారులపై రూ.8,67,900లు అదనపు భారం పడుతోంది. అలాగే పెట్రోల్ రోజుకి జిల్లాలో సుమారుగా లక్ష లీటర్లు వినియోగం ఉంటుంది. ప్రస్తుతం లీటరుపై రూ.8.04 పెరిగింది. అంటే సగటున రోజుకి రూ.8,04,000 లు అదనపు భారం పడుతోంది. సగటునా జిల్లాలో రోజుకి డీజిల్, పెట్రోల్ కలిపి వినియోగదారులపై రూ.16,71,900 అదనపు భారం పడుతోంది. చార్జీలు, ఇతర వసతులపై ప్రభావం డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో వాహనాల ద్వారా రవాణా జరిగే వాటిపై ధరల ప్రభావం ఉంటుంది. ప్రధానంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కూరగాయలు, నిత్యావసరాలు, వాహన చార్జీలు పెరిగే అవకాశం ఉంది. హామీ ప్రకారం ధరలు తగ్గించాలి యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల వ్యవధిలో రూ. 8 వరకూ పెంచింది. ఇది దారుణం. దీని ప్రభావం సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై అధికంగా పడుతుంది. ఎన్నికల ముందు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ అప్పటి ధరలపై రాద్ధాంతం చేసింది. తాము అధికారంలోకి వచ్చాక తగ్గిస్తామని చెప్పింది. ఆ హామీ నిలబెట్టుకోవాలి. – వైశ్యరాజు కేశవరాజు, మండల పరిషత్ విప్, నరసన్నపేట పెట్రోల్, డీజల్ ధరల్లో తేడాలు ఇలా.. ఇంధనం ఆంధ్రాలో ఒడిశాలో తేడా పెట్రోల్ రూ.117.50 రూ.110.48 రూ.7.00 డీజిల్ రూ.105.15 రూ.102.19 రూ.3.00 -
జనగణన లెక్కింపు వేగవంతం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో జనగణన గృహ జాబితా లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు జనగణన ఎంతో కీలకమైందని, ప్రతి ఇంటి వివరాలను కచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ప్రజలతో స్నేహపూరిత వాతావరణంలో మెలుగుతూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ఇంటింటికీ వెళ్తున్న సిబ్బందికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి, సరైన వివరాలు అందించాలని కోరారు. డేటా నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావుండకూడదని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. -
గుక్కెడు నీరు.. ఇచ్చేవారు లేరు
బిందెడు నీటిని తెచ్చుకోవడానికి రెండు బిందెల చెమట్లు కార్చాల్సిన పరిస్థితి వస్తే..? ఆర్చుకుపోయిన గొంతును తడిపేందుకు కంట నీరు తప్ప నీటి చుక్క దొరక్కపోతే..? ఓ చేతిలో పసిబిడ్డ మరో చేతిలో బిందెతో కొండ దిగాల్సిన దుస్థితి వస్తే..? అంత దూరం నడిచాక ఖాళీ బావి వెక్కిరిస్తే..? పాలకుల దయ వల్ల స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా సిక్కోలు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. పాతపట్నం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంత వాసులకు వేసవి వస్తే భయం. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సిన దీన స్థితి వారిది. కొత్తూరు మండలంలోని చీపురుపల్లి, పెద్దరాజపురం, చిన్నరాజపురం, దాపాకులగూడ, జెన్నోడు గూడ, దొండమామిడి గూడ, అద్దాయి గూడ, పాండురమానుగూడ, కూడహ గూడ, గ్యాసరగూడ, అడ్డంగి అబలాసింగి వాసులకు ఈ కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. గుప్పెడు రేషన్ తీసుకునేందుకు కొండంతా నడిపిస్తున్న సర్కారు.. గుక్కెడు నీటిని కూడా ఇవ్వలేక ఇలా వేధిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం కొండలెక్కి దిగితేనే నీరు -
ఎందుకీ మౌనం..?
బడా నేత జోక్యమే కారణమా..! సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆమదాలవలస–శ్రీకాకుళం మార్గంలో తోటాడ–అక్కివరం రెవెన్యూ పరిధిలోని బావాజీ మఠం భూములు కళ్ల ముందే ఆక్రమణకు గురవుతున్నాయి. సర్వే నంబర్ 121లో ఉన్న భూములు హారతి కర్పూరంలా కబ్జాలతో కరిగిపోతున్నాయి. భూములు ఎవరివి అన్నదానిపై రకరకాల భాష్యాలు చెబుతున్నా.. నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయని మాత్రం అధికారులే ధ్రువీకరిస్తున్నారు. సెక్షన్ 22–ఎ(1)(ఈ) కింద నాట్ టేకింగ్ ఓవర్ భూములుగా నమోదై ఉన్నాయని, ఆక్రమించడం కుదరదని అధికార వర్గాలు అంటున్నాయి. సమాధానాలన్నీ అధికారుల దగ్గరే ఉన్నాయి. కానీ కబ్జాకు గురవుతున్న భూములను కాపాడే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. నిషేధిత జాబితాలోని భూముల్లో లేఅవుట్, ఆపై లావాదేవీలు, దానికి తోడు ప్రభుత్వ నిధులతో ఆ భూముల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం జరుగుతుంటే చోద్యం చూడటం వెనకున్న రాజకీయ శక్తి ఎవరు? అసలు ఆ భూముల్ని జిల్లా యంత్రాంగం పరిరక్షించలేదా? కలెక్టర్ ఉంటున్న జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న భూముల్లో జరుగుతున్న కబ్జాలను ఆపలేరా? అంటూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్రమాలకు రాచ‘బాట’ బావాజీ మఠం భూముల వివాదం రోజురోజుకి తీవ్రమవుతోంది. చినికి చినికి గాలివానగా మారినట్టు ఆక్రమణదారులు ఏకంగా తమవే అని సవాల్ విసురుతుంటే.. అధికారులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. గతంలో ఇదే అధికారులు సర్వే నంబర్ 121లో ఉన్నవన్నీ నిషేధిత భూములే అని ఽధ్రువీకరించడమే కాకుండా కలెక్టరేట్ ప్రజా పరిష్కార వేదికలో ఇచ్చిన ఫిర్యాదుకు లిఖిత పూర్వక సమాచారం కూడా ఇచ్చారు. నాట్ టేకింగ్ ఓవర్ భూములుగా నిర్ధారిస్తూ, ఆ భూముల్లోకి ఎవరు వెళ్లకూడదని, ఆక్రమించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కానీ, వారిచ్చిన నివేదికకు వారే తూట్లు పొడుస్తున్నారు. ఆ సర్వే నంబర్ 121లో తెలుగు తమ్ముళ్లు కొందరు 3.50 ఎకరాల్లో అక్రమంగా లేఅవుట్ వేస్తే పట్టించుకోలేదు. ఆ భూములేవైనా అనుమతి లేకుండా లేఅవుట్ వేస్తే వెంటనే తొలగించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ, అక్రమంగా లేవుట్ వేసిన వారి జోలికే వెళ్లలేదు. అక్కడ జరుగుతున్న బాగోతంపై ప్రేక్షక పాత్ర పోషించి చూస్తున్నారు. అలాగని, వదిలేశారా అంటే కాదు. పక్కనున్న కాలనీలకు ఉపయోగపడుతుందని బూచిగా చూపించి లేవుట్కు లబ్ధి చేకూరేలా రూ.1.45 కోట్ల ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నారు. అంటే, ఆక్రమణదారులకు సహకరిస్తూ రాచబాట వేసినట్టు అయింది. సవాళ్లు, ప్రతి సవాళ్లు అసలే అక్రమ లేవుట్... ఆపై సదరు భూములపై వివాదం, జిల్లా, హైకోర్టుల్లో నడుస్తున్న వ్యాజ్యాలు, అధికారులు సైతం నిషేధిత జాబితాలో ఉన్న భూముల ధ్రువీకరణ.. ఇన్ని ఉన్న భూముల్లో ఉపాధి నిధులతో రోడ్లు, కాలువల నిర్మించడం వెనక కారణమేంటి? వెనకున్నదెవరు? బరి తెగించి, కోట్లాది ఉపాధి నిధులు ఉపయోగించడమేంటి? దీనికి అధికారులు బాధ్యులు కారా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? అన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఈ భూములపై సవాళ్లు, ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. బెదిరింపులకు సైతం దిగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇదే సమయంలో తాజాగా సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో ఆ భూముల పర్య వేక్షణకు సంబంధించిన జగన్నాథ స్వామి మఠం ప్రతినిధులు నేరుగా ఫిర్యాదు చేశారు. మఠం భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, మా భూముల్లో లేఅవుట్ వేసి, రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా దీని వెనక బడా వ్యక్తుల ప్రమేయం ఉందని, మఠం భూ ములను కాపాడాలని ఫిర్యాదులో ప్రస్తావించారు. గతంలో బెదిరించిన దాఖలాలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఆక్రమణలకు గురైన వెంటనే, లే అవుట్ వేస్తున్న సమయంలోనే అడ్డుకుని ఉంటే మరో ఫిర్యాదుకు అవకాశం ఉండేదా? కనీసం అధికారులు ఇప్పుడైనా మౌనం విడిచి, చర్యలకు ఉపక్రమిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. బావాజీ మఠం భూములపై చోద్యం చూస్తున్న అఽధికారులు నిషేధిత జాబితాల్లో ఉన్నాయంటున్న అధికార వర్గాలు అక్రమ లేఅవుట్, ఆపై అమ్మకాలు సాగుతున్నా పట్టించుకోని పరిస్థితి కబ్జాదారులకు వంతపాడేలా చర్యలు తాజాగా గ్రీవెన్స్లో మరో ఫిర్యాదు ఆక్రమణల నుంచి మఠం భూములు కాపాడాలంటూ వేడుకోలు -
వీధి మధ్యలో బోర్వెల్
పలాస: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి పలాస బజారు వీధికి వెళ్లే రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే ఆ రోడ్డులోని కొత్వాల్ వీధి మధ్యలో ఒక వ్యక్తి తన సొంత అవసరాల కోసం బోరువెల్ వేయించుకుంటున్నాడు. తన అవసరం కోసం ఎక్కడైనా బోర్వెల్ మున్సిపాలిటీ అధికారుల అనుమతితో వేసుకోవచ్చు. అయితే కోత్వాల్ వీధిలో రోడ్డుకు మధ్యన బోర్వెల్ను సోమవారం వేయించాడు. దీంతో ఆ రోడ్డు పూర్తిగా బ్లాక్ అయింది. రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్డు మధ్యలో బోరు వేయడమేంటని, ఇది ప్రజలకు చాలా ఇబ్బందని మున్సిపల్ కమిషనర్కు చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేశామని, అతను కూడా తగిన చర్యలు తీసుకోకపోతే ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రేమ జంటను రక్షించిన శక్తి టీమ్ ఆమదాలవలస: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్పై ఆత్మహత్యకు యత్నించిన ప్రేమ జంటను శక్తి టీమ్ పోలీసులు సమయస్ఫూర్తితో రక్షించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మన్యం జిల్లా పాలకొండ ప్రాంతానికి చెందిన వీరు గత నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియజేసినప్పటికీ.. వారు అంగీకరించకపోవడంతో ఈనెల 19వ తేదీన ఇంటి నుంచి పారిపోయారు. అనంతరం వారి వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఖర్చయిపోవడంతో తీవ్ర నిరాశకు గురై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో సోమవారం ఆమదాలవలస రైల్వే పట్టాలపై నిల్చున్నారు. అదే సమయంలో అక్కడ గస్తీ నిర్వహిస్తున్న శక్తి టీమ్ ఇన్చార్జి ఉమెన్ హెచ్సీ తమ్మినేని అమ్మాజీ, మహిళా కానిస్టేబుల్ ధనలక్ష్మి వారిని గమనించి, వెంటనే అప్రమత్తమై రక్షించారు. అనంతరం పట్టణ పోలీస్స్టేషన్కు తెలియజేసి, ప్రేమ జంటను పాలకొండ పోలీస్స్టేషన్కు తరలించారు. సమయానికి స్పందించి ఇద్దరి ప్రాణాలు కాపాడిన శక్తి టీమ్ సిబ్బందిని జిల్లా పోలీసు యంత్రాంగం అభినందించింది. -
ఇదేం పద్ధతి..?
● పంచాయతీ రిజర్వు స్థలంలో టీడీపీ నాయకుడి ఇంటి నిర్మాణం ● అడ్డుకునేందుకు వెళ్లిన స్థానికులపై పోలీసులకు ఫిర్యాదు గార: విలువైన భూములను టీడీపీ నాయకులు ఆక్రమించుకుంటున్న ఘటనలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. మండలంలో శ్రీకూర్మం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో సర్వే నంబరు 600లో 0.12 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ స్థలాన్ని పంచాయతీ తీర్మానం ద్వారా గత ప్రభుత్వం శ్రీకూర్మనాథుని దర్శనం కోసం వచ్చే దూరప్రాంత భక్తుల కోసం ఉచిత గదులతో పాటు కల్యాణ మంటపం నిర్మించాలన్న ఆలోచనతో ఢిల్లీకి చెందిన ఆదిలీలా ఫౌండేషన్కు అప్పగించింది. దీనికోసం అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. అప్పట్లో స్థానికుడు రిజర్వు స్థలంలో తనకు కొంత భూమి ఉందని కోర్టుకు వెళ్లగా, ఆ స్థలమంతా పంచాయతీ రిజర్వు స్థలమని తీర్పు వచ్చింది. అయితే అనంతరం ఎన్నికలు రావడంతో ఆదిలీలా ఫౌండేషన్ పనులు ప్రారంభించలేదు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకుడు పొజిషన్ సర్టిఫికెట్ తెచ్చుకొని నిర్మాణ పనులను మొదలుపెట్టాడు. వీరికి నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారం ఉండడంతో అధికారులు కన్నెత్తి చూడడం లేదు. గతేడాది పనులు ప్రారంభించగా సాక్షితో పాటు పలు పత్రికల్లో వార్తలు రావడంతో అధికారులు నోటీసులిచ్చి పనులు నిలిపేశారు. మరలా గత నెల 14వ తేదీన పనులు చేపట్టడంతో స్థానికులు వెళ్లి పనులు ఆపేయాలని చెప్పడం జరిగింది. అయితే ఇటీవల గత రెండు రోజులుగా పనులు చేపట్టడంతో సోమవారం స్థానికులు మరలా వెళ్లి పనులు ఆపమని చెప్పారు. అయితే స్థానికులు తమపై దాడి చేశారంటూ నిర్మాణ దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ నిర్మాణాలు ఆపమని చెప్పడం కూడా ఈ ప్రభుత్వంలో తప్పేనా అంటూ గ్రామస్తుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. -
పట్టాలు ఇవ్వాలని గిరిజనుల ధర్నా
టెక్కలి: ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగ ప్రభాకర్ డిమాండ్ చేశారు. సో మవారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎల్ఎన్ పేట మండలానికి చెందిన బెన్నాడిగూడ, కొత్తగూడ, గోలుకొప్ప గ్రామాల గిరిజన రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ గిరిజన రైతులు కొన్ని దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, కార్పొరేట్ కంపెనీలకు ఎకరా భూ మి 99 పైసలకే ఇవ్వడం కాదని, అర్హులైన గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజను లు సాగు చేస్తున్న భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. గిరిజనులను కాదని ఇతరులకు అప్పగించాలని చూస్తే ఉద్యమం తప్పదని వారు హెచ్చరించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలనాధికారి రషీద్ అహ్మద్కు వినతిపత్రం అందజేశారు. -
వినతులను సత్వరమే పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 143 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కి వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ను సోమవారం నిర్వహించారు. అర్జీదారుల నుంచి మొత్తం 143 వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఎస్డీసీ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే... ● ఆమదాలవలస మండలం తోటాడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 121లో భూములు అన్యాక్రాంతమవ్వకుండా చర్యలు తీసుకోవాలని సదావర్తి మఠం (జగన్నాథ దేవాలయం) సేవకుడు పిట్ట మహేశ్వరరావు కోరారు. ఈ భూములు ప్రభుత్వ జాబితాలో 22–ఏ కింద ఉన్నాయన్నారు. అయితే ఆ భూముల్లో రాజకీయ పలుకుబడితో అక్రమ లేఅవుట్లు వేసి విక్రయిస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. ● జిల్లాలో అక్రమ మైనింగ్కి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు సోమవారం గ్రీవెన్సులో కోరారు. గార మండలం అంపోలు పంచాయతీ ఎరుకు అంబటివానిపేట గ్రామంలో కూటమి నాయకులు చెరువులో అక్రమ మైనింగ్ చేస్తున్నారని తెలిపారు. ● తనకు రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనుల బిల్లులు చెల్లించాలని సరుబుజ్జిలి మండలం తెలుకిపెంట పంచాయతీ పర్వతాలపేట గ్రామానికి చెందిన బెవర మల్లేశ్వరరావు కోరారు. పనులకు సంబంధించిన బిల్లులు తీసుకునేందుకు అనుమతి ఇవ్వకుండా పంచాయతీ ప్రత్యేక అధికారి, ఎంపీడీవో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తదితరులు ఉన్నారు. ● ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురం పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను అక్రమంగా అమ్మేస్తున్నారని ఆ గ్రామానికి చెందిన రైతు ఫిర్యాదు చేశారు. భూములు అన్యాక్రాంతమవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం: ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. రెండు రోజులుగా శ్రీకాకుళంలో జరుగుతున్న జన సమితి రాష్ట్ర మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. 12వ పీఆర్సీని 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీ సంబంధిత బకాయిలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు మాట్లాడుతూ వెంటనే ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వాలని, బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా శాఖ అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు, రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ కొప్పల భానుమూర్తి, పూర్వ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ సంపాదకుడు ఎస్వీ అనిల్ కుమార్, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజల ప్రగతికే రచన’
శ్రీకాకుళం కల్చరల్: నిజమైన ప్రజాస్వామ్యం, సమానత్వం, శ్రామిక ప్రజల జీవితాల్లో అభివృద్ధి కోసం రచనలు సాగాలని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రెండు రోజులుగా జరుగుతున్న జనసాహితీ 13వ మహాసభలు సోమవారంతో ముగిశాయి. జనసాహితీ అధ్యక్షులు కామ్రేడ్ దివి కుమార్ మాట్లాడుతూ కుల వివక్ష, లింగ వివక్ష ఇంకా సమాజం మీద దాడి చేస్తూనే ఉందని అన్నారు. జనసాహితి సహాయ కార్యదర్శి ఓవీవీఎస్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సాహిత్య సభలో అఖిల భారత ప్రజా సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షులు గౌతమ్ ముఖర్జీ, అరసం నాయకులు చింతాడ కృష్ణారావు, విర సం అధ్యక్షులు అరసవల్లి కృష్ణ, సాహితీ స్రవంతి నాయకులు చీకటి దివాకర్, సీ్త్ర విముక్తి సంఘటన కార్యదర్శి కామ్రేడ్ లక్ష్మి, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ ప్రధాన కార్యదర్శి సురేష్ తమ సందేశాలను అందించారు. ‘పరిశ్రమల ఏర్పాటుకు భూములివ్వండి’ టెక్కలి: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రజ లు స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికి ముందుకు రావాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు శంకు స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేట్పరం కాకుండా నిధులు కేటాయించామని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నేరడి బ్యారేజీకు అడ్డంకులు తొలగాయని, రానున్న ఏడాదిన్నర లోగా బ్యారేజీను పూర్తి చేస్తామని తెలిపారు. -
రాళ్ల గుట్టలో ఆక్రమణలు
టెక్కలి: జాతీయ రహదారికి ఆనుకుని బొప్పాయిపురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 1–1లోని రాళ్లగుట్టలో సుమారు 5 సెంట్ల ఆక్రమణలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఆక్రమణలు జరిగినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించినప్పటికీ.. తొలగింపు విషయంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు జోక్యం చేసుకుని అడ్డుపడుతున్నారని తెలుస్తోంది. ఇదే రాళ్లగుట్టకు ఆనుకుని జాతీయ రహదారి వరకు ఇటీవల సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీంతో దీని విలువ పెరగడంతో ఆక్రమణలు మరింత జోరందుకున్నాయి. వీటితో పాటు సమీపంలో సుమారు ఎకరా వరకు డీ–పట్టా స్థలం ఉంది. దీనిని ఎలాగైనా కై వసం చేసుకునేందుకు అధికార పార్టీ కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొంతమేరకు అమ్మకాలు చేపట్టడంతో రూ.లక్షల్లో చేతులు మారినట్లు సమాచారం. కాగా జాతీయ రహదారికి అనుకుని బహిరంగంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. ఒకప్పుడు మారుమూల ప్రాంతంగా ఉన్న ఈ స్థలాల్లో ఇప్పుడు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా వీటి విలువ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో పంచాయతీ స్థాయిలో ఉన్న అధికార పార్టీ కార్యకర్తల కన్ను పడింది. ఎలాగైనా వాటిని కై వసం చేసుకుని గుట్టుగా అమ్మకాలు చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. అందువలన ఈ ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. -
టీడీపీ.. ఓ వెన్నుపోటు పార్టీ
నరసన్నపేట: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుంటోందని, దీన్ని తట్టుకోలేక వైఎస్సార్ సీపీని గొడ్డలి పార్టీ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వాస్తవానికి టీడీపీ.. ఓ వెన్నుపోటు పార్టీ అని ఎద్దేవా చేశా రు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను ఆనాడు వైశ్రాయ్ హొటల్లో నీచాతినీచంగా అవమానించడం, చెప్పులతో కొట్టడం మరిచిపోయారా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని ఆయనకే వెన్నుపోటు పొడిచి లాక్కోవడం ఎవ రికి తెలీదు అంటూ నిప్పులు చెరిగారు. ‘అధికారం వచ్చాక ఎంతో దారుణంగా పాలన చేస్తున్నారు. ఎంతో మంది వైఎస్సార్ సీపీ నాయకులను, కార్యకర్తలను తప్పుడు కేసులతో జైల్లో పెట్టారు. మాది గొడ్డలి పార్టీ అంటున్నారు. ఇది మీకు తగదు.’ అని హితవు పలికారు. ప్రతీదీ లెక్క వేసుకుంటూనే ఉన్నామని, వైఎస్ జగన్ అధికారంలోకి వస్తారనే భయం ఇప్పటి నుంచే టీడీపీ నాయకుల్లో మొదలైందని, అందుకే కువిమర్శలు చేస్తున్నారని అన్నారు. నరసన్నపేటకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ప్రజలను తప్పు దోవ పట్టించేలా ఆయన మాటలు ఉన్నాయన్నారు. మీరెన్ని తప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తున్నా.. జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరని కృష్ణదాస్ అన్నారు. ‘అచ్చెన్నా.. నువ్వు కూడా వైఎస్సార్సీపీని గొడ్డలి పార్టీ అని అంటున్నావు. మీ ఇంట్లో జరిగిన వ్యవహరాలు జిల్లా ప్రజలకు తెలీంది కాదు.’ అని కృష్ణదాస్ అన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకులు అంధవరపు సూరిబాబుతదితరులు పాల్గొన్నారు. ● నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
అర్హులకు అందేనా..?
నరసన్నపేట: వైఎస్సార్సీపీ హయాంలో ఐదేళ్ల పాటు ప్రతీ పథకం అర్హులకు అందిస్తూ వచ్చారు. పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు మంజూరు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. టీడీపీ కార్యకర్తలకే పథకాలు ఇవ్వా లని అనధికారంగా కూటమి ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. గడిచిన 23 నెలలుగా ఇదే జరుగుతోంది. ఈ దశలో రైతులకు యంత్ర సాయం పేరిట ప్రభుత్వం సబ్సిడీపై యంత్ర పరికరాలు ఇస్తామని ప్రకటించింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో రైతులు ఆశగా ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 4,052 మంది రైతులు దరఖాస్తులు చేశారు. ఈనెల 24తో గడువు ముగిసింది. అర్హులకు అందేనా.. పంటకోత, నూర్పిడి పరికరాలు 19, మొక్కల సంరక్షణ పరికరాలు 894, పంట కోత అనంతరం ప్రాసెసింగ్, విలువ జోడించు యంత్రాలు 18, పవర్ టిల్లర్స్ 63, అవశేషాల నిర్వహణ/ఎండుగడ్డి, పశుగ్రాసం పరికరాలు 42, స్వీయ చోదక యంత్రాలు 106, విత్తనాలు నాటడం, మొక్కలు నాటడం, తవ్వే యంత్రాలు 14, ట్రాక్టర్ పవర్ టిల్లర్ నడిచే పరికరాలు 129, ట్రాక్టర్లు 43 మొత్తం 1,328 యంత్ర పరికరాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.4.84 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేదా కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా.. అనేక మంది దరఖాస్తులు చేశారు. అయితే అర్హులకు కాకుండా అన్నీ టీడీపీ వారికే ఇచ్చారు. ఇలా ఏ పథకం అమలు చేసినా వారికే ఇస్తున్నారు. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది. చేసిన దరఖాస్తులు నిశితంగా పరిశీలించిన అనంతరం.. జేసీ పర్యవేక్షణలో లాటరీ తీసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారట. ఇక్కడే మతలబు ఉంటుంది అని రైతులు అంటున్నారు. లాటరీ పేరున తమకు నచ్చిన వారికి యంత్ర పరికరాలు మంజూరు చేసుకుంటారని అర్హులకు అందవనే అనుమానం బలపడుతోంది. సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు 50 శాతం, మిగిలిన విభాగాల వారికి 40 శాతం రాయితీపై యంత్రాలు మంజూరు చేస్తారు. వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు ఎంతో ఉపయోగకరం. వీటిని అర్హులకు ఇవ్వాలి. కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పేవారికే ఇవ్వకూడదు. అలాగే కౌలు రైతులనూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు రైతులకు రైతు భరోసా కూడా అందడం లేదు. కౌలు రైతులకు కార్డులు ఇచ్చి, వారి పంటలను నమోదు చేసి సబ్సిడీ యంత్ర పరికరాలు అందజేయాలి. – వెలమల రమణ, కౌలు రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి రైతులు ఎంతో ఆశతో సబ్సిడీ యంత్ర పరికరాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు. అయితే ఈ కూటమి పాలనలో అర్హులకు పథకాలు అందడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. కూటమి ప్రభుత్వం కూడా దానిని పాటించాలి. అర్హులైన రైతులకు యంత్ర సాయం చేయాలి. – కింతలి చలపతి, రైతు, కానుకర్తివానిపేట వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై ఇచ్చేందుకు వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్లో దరఖాస్తులను పరిశీలించి జేసీ పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక చేస్తాం. వచ్చిన దరఖాస్తుల్లో అర్హులకు యంత్ర పరికరాలు ఇస్తాం. – ఎల్వీ మధు, వ్యవసాయ శాఖ ఏడీ, నరసన్నపేట యంత్ర సాయం కోసం ఆశగా నమోదు చేసుకున్న రైతులు లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామంటున్న అధికారులు అధికార పార్టీ వారికే కట్టబెట్టే వ్యూహమని రైతుల అనుమానం ముగిసిన దరఖాస్తుల గడువు ట్రాక్టర్తో పొలం దుక్కి చేస్తున్న రైతు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
టెక్కలి: జాతీయ రహదారి టెక్కలి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి భూలోకమాత వీధికి చెందిన రిషి, కార్తీక్ అనే ఇద్దరు యువకులు గాయపడ్డారు. జాతీయ రహదారిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులను శ్రీకాకుళం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన యువకులను టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారిలో కార్తీక్కు తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు. రైలు ప్రమాదంలో గుర్తు తెలియని మహిళ మృతి వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి – పలాస రైల్వేస్టేషన్ల మధ్య రైలు ప్రమాదంలో సోమవారం గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 50 నుంచి 55 ఏళ్లు వయస్సు ఉన్న మహిళ ఎగువకు వెళ్లే రైలుమార్గంలో మృతి చెందినట్లు తెలిపారు. శరీరం సన్నగా, జుట్టు తెలుపు రంగులో ఉన్నట్లు పేర్కొన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. మృతురాలి బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే 92475 85743 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
భర్తను హత్య చేసిన భార్య
తగరపువలస: భర్తను భార్య హతమార్చిన ఘటన విశాఖ జిల్లా భీమిలి పోలీస్స్టేషన్ పరిధిలోని వలందపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాగమణి(26)కి వలందపేట రజక వీధికి చెందిన తాపీ మేస్త్రి బోర సూరితాత(35)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. నాగమణి నూడిల్స్ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో సూరితాత ఆమెను తరచూ నిలదీసేవాడు. ఈ విషయమై దంపతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఆదివారం భవన నిర్మాణ పనులకు వెళ్లిన సూరితాత మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. వీరి మధ్య మళ్లీ వాగ్వాదం జరిగింది. దీంతో నాగమణి తన చున్నీని భర్త మెడకు గట్టిగా బిగించి శ్వాస ఆడకుండా చేసి హతమార్చింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు..భర్త ఆరోగ్యం క్షీణించిందని బంధువులకు ఫోన్ చేసింది.అపస్మారక స్థితిలో ఉన్న సూరితాతను బంధువులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి మెడపై ఉన్న గాయాలను చూసి బంధువులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి తమదైన శైలిలో నాగమణిని విచారించడంతో తానే చున్నీని బిగించి సూరితాతను హతమార్చానని ఒప్పుకుంది. ఈ హత్యలో ఆమెకు ఇంకెవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇక పని సరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రైతులకు మేలు చేసే భూములపై పెద్దల కన్ను పడింది. ఉద్దానం ఏరియాలోని ప్రధాన ప్రదర్శన క్షేత్రం భూములను కాజేసేందుకు వ్యూహాత్మక అడుగులు పడుతున్నాయి. ఆ భూములను ఏపీఐఐసీ ద్వారా సేకరించి, ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి, తద్వారా పరిశ్రమల పేరుతో కీలక నేత అనుయాయులకు కట్టబెట్టేందుకు పావులు కదులుతున్నా యి. దానికోసం జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నా రు. మూడు సార్లు వరుసగా గెలిపించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఉద్దానం కొబ్బరికి ఎసరు.. కవిటి మండలం రాష్ట్రంలో రెండో కోనసీమగా కొబ్బరిసాగులో గుర్తింపు పొందింది. జిల్లా తలసరి ఆదాయంలో ఉద్దానం కొబ్బరి ముఖ్యభూమిక పో షిస్తోంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న కొబ్బరిపంట సాగులో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కొబ్బరి రైతుకు ఆందోళన కలిగించేలా ఉన్నా యి. జిల్లాలో 35,000 హెక్టార్లలో సాగులో ఉండగా కవిటి పరిసర మండలాల్లోనే సుమారు 17,000 హెక్టార్ల వరకు సాగవుతోంది. కొబ్బరి, జీడి రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం పనిచేయడం లేదు. మద్దతు ధర ఇచ్చేలా ప్రయత్నించడం లేదు. కానీ ఆ రైతులకు ఉప యోగపడే ఉద్యాన ప్రదర్శన క్షేత్రం భూములను మాత్రం బదలాయించేందుకు యత్నిస్తోంది. చరిత్రను కనుమరుగు చేసే యత్నం ఉద్యానవన రైతులకు మేలైన రకాల మొక్కలు అందించాలనే లక్ష్యంతో 1994లో కవిటి మండలం శిలగాం సమీపంలో ప్రదర్శన క్షేత్రం(నర్సరీ)ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శన క్షేత్ర భూములన్నీ ఉద్యానవన శాఖ కంట్రోల్లోకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి కొబ్బరి, జీడి, మామిడి, పనస, జామ, సపోట మొక్కలను రైతులకు అందజేస్తూ వస్తోంది. వచ్చిన ఫలసా యాన్ని కూడా వేలం వేసి, ఉద్యానవన శాఖకు ఆదాయం తీసుకొచ్చేది. 20.95 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ ఉద్యాన క్షేత్రంలో 335 కొబ్బరిచెట్లు, 360 జీడిచెట్లు, 405 మామిడిచెట్లు, 30 పనసచెట్లు, 100 జామ చెట్లు, 12 సపోటా చెట్లు ఫలసాయం అందించే విధంగా ఉన్నాయి. తాజాగా ఈ ప్రదర్శనా క్షేత్రం భూములను ఏపీఐఐసీ ద్వారా భూమిని పారిశ్రామికీకరణకు బదలాయించేందుకు గుట్టు చప్పుడు కాకుండా శరవేగంగా పావులు కదులుతున్నాయి. హామీకి భంగం–కొత్త ప్లాన్కు సిద్ధం గతంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడే కోకోనట్ ఫుడ్పార్క్ను ఏర్పాటుకు హామీ ఇచ్చిన విషయం విధితమే. కానీ ఆ వాగ్దానం అమలు చేయలేదు. కానీ, ఇప్పుడా భూములనే ఏకంగా బదలాయించేందుకు ప్రయత్నిస్తోంది. పరిశ్రమల విభాగానికి బదలాయించి తర్వాత దీన్ని గుంపగుత్తగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే దురాలోచన స్పష్టంగానే కనిపిస్తోంది. ఇదే ఉద్యాన క్షేత్రంలో భూగర్భ ఊటబావి కూడా ఉంది. భూగర్భ జలవనరుల శాఖ అధికారులు గతంలో చేయించిన ప్రాప్తికి రెండు చెట్ల విస్తారంగా భూగర్భజలాలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించిన విష యం కూడా అప్పట్లో అధికారుల నివేదికలు సిద్ధం చేశారు. ఈ ప్రదేశాల్లో బోర్లు వేస్తే రోజుకు 2500 లీటర్ల నీరు అందించే వీలుందని అంచనాలు కూడా వేయడం జరిగింది. ఇంతటి ప్రాధాన్యత కల ఉద్యా న కొబ్బరి ప్రదర్శన క్షేత్రాన్ని రైతుల ప్రయోజనాలకు తిలోదకాలిచ్చి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రక్రియ ఇక్కడ రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయదలిస్తే.. ప్రభుత్వం నియోజకవర్గానికొక ఎంఎస్ఎంఈ పా ర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట మండలాలతో పాటు కవిటి మండలంలోని కరాపాడు టోల్ప్లాజా సమీపంలో ప్రభుత్వ భూములు ఉన్నాయి. వాటిని సేకరించి, పారిశ్రామికీకరణ కోసం పార్క్లు ఏర్పాటు చేయవచ్చు. వాటిని వదిలేసి నియోజకవర్గ కీలక నేతకు చెందిన వ్యక్తుల కన్ను పడిందని శిలగాం ఉద్యానవన క్షేత్రం భూములను ఏపీఐఐసీకి అప్పగించి, వాటిలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేసి, తద్వా రా సదరు భూములను కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పూరితంగా అడుగులు వేస్తున్నా యి. ఈ 20.95 ఎకరాల స్థలాన్ని ఏపీఐఐసీకి బదలాయింపు ప్రక్రియ పూర్తిచేసి అప్పగించేస్తే దాన్ని 99 ఏళ్లకు ఎకరం రూ.రూపాయి వంతున లీజుకు అందించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వాదనలు ఉన్నాయి. ఉద్యానవన శాఖ భూములు.. ప్రైవేటు వ్యక్తుల పాలు ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అత్యంత శ్రేష్టమైన వ్యవసాయ యోగ్యమైన భూమిని కాజేయాలని చూడడం వెనుక కీలక నేత హస్తం ఉందనేది బహిరంగ రహస్యం. ఇదిలా ఉండగా కవిటి మండలం రాజపురం సబ్స్టేషన్ వెనుక ఉన్న ప్రదేశంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో ఇచ్చిన డీపట్టా భూములపై కూడా కన్నేస్తే, అక్కడి రైతులు ఎదురుతిరిగారు. ఇప్పుడు ఆ భూములకు సమీపంలోని శిలగాం సమీపంలోని అత్యంత విలువైన ఉద్యాన క్షేత్రంపై దృష్టి పడడం సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. ఉద్యానవన శాఖ భూములు ప్రైవేటు వ్యక్తుల పాలవ్వడం తప్ప రైతులకు మేలు జరిగేది ఉండదనే వాదనలు ఉన్నాయి. ఉద్దానం ఏరియాలోని ప్రధాన నర్సరీ భూములను ఏపీఐఐసీకి కట్టబెట్టేందుకు యత్నం ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా కావాల్సిన వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు పావులు ఆ దిశగా చక్రం తిప్పుతున్న కీలక నేత 20,95 ఎకరాల క్షేత్రం కనుమరుగయ్యే ప్రమాదం -
సూరీడు భగభగ
● మరో రెండు రోజులు ఇదే పరిస్థితి అంటున్న శాస్త్రవేత్తలు ● జిల్లాలో 40డిగ్రీలకు పైబడిన ఉష్ణోగతలు ఎండ తీవ్రతతో ఆమదాలవలసలో నిర్మానుష్యంగా ఉన్న రహదారిఆమదాలవలస: జిల్లాలో భానుడు భగభగలాడుతూ ప్రతాపం చూపుతున్నాడు. గత 5 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుండగా రెండు రోజుల క్రితం సాయంత్రం సమయంలో వీచిన చల్లగాలులు కాస్త జిల్లా ప్రజలకు ఊరటనిచ్చాయి. అయితే ఆదివారం మళ్లీ జిల్లాలో పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో 40 డిగ్రీలకు ఉష్ణోగత చేరుకుంది. ఉక్కపోతతో తమ ఇళ్లలో ఉండ లేక, బయట తిరగలేక నానా ఇక్కట్లు పడ్డారు. నైరుతి రుతుపవనాలు జిల్లాను తాకే వరకు ఎండ తీవ్రత కొనసాగక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్ర భావంతో అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకశాలు బలంగా ఉన్నప్పటికీ ఎండల తీవ్రత కూడా కొనసాగుతుందని తెలిపారు.అలాగే మరో రెండు రోజుల్లో రోహిణీ కార్తెలు రాబోతున్నాయని దీంతో మరింత ఎండ ప్రభావం ఎక్కువ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని వారు చెబుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది ఉష్ణోగ్రతల ప్రభావం జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన వారం రోజుల్లో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. గత ఏడాది కూడా మే నెలలో ఇన్ని రోజుల పాటు ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు. శ్రీకాకుళం, రణస్థలం, పాతపట్నం, ఆమదాలవలస, కొత్తూరు ప్రాంతాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెరిగిన తేమశాతం వాతావరణంలో వారం రోజులుగా భారీ మార్పు లు కనిపిస్తున్నాయి. పగటిపూట గాలిలో తేమ శాతం 60–65 మధ్య నమోదవుతోంది. ఉష్ణోగ్రతలు కూడా 41 డిగ్రీలు దాటుతున్నాయి. గాలిలో తేమ శాతం పెరగడం, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి పూట కూడా గాలిలో తేమ శాతం 70–75 మధ్య ఉంటోంది. దీనివల్ల రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల పైనే నమోదువుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
విద్యార్థి మిత్రకు డీజిల్ మరక!
● బడులు తెరిచే నాటికి విద్యార్థులకు కిట్లు ఇవ్వలేమని ప్రకటన ● విద్యా కానుకకు అంతర్జాతీయ పరిణామాలతో ముడిపెట్టిన ప్రభుత్వం యుద్ధానికి ముడిపెట్టడం సరికాదు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విషయంలో ప్రభు త్వం శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కాను క కిట్ల విషయంలో అంతర్జాతీ య పరిస్థితులకు ముడిపెట్టడం సరికాదు. ప్రభుత్వ పాఠశాలలు తెరిచేనాటికి కచ్చితంగా పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి. – టి.చందనరావు, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి. చంద్రబాబు ఎప్పుడూ నిర్లక్ష్యమే ప్రభుత్వ పాఠశాలలు, అందులో చదువుతున్న పేద, సామాన్య వర్గాలకు చెందిన వారిపై చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ నిర్లక్ష్యమే చూపుతుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయి. అప్పట్లో విద్యా కానుక కిట్లు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే పూర్తి స్థాయిలో కిట్లు అందజేయలేమని చెబుతున్నారు. – ఎం.గణపతిరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు, టెక్కలి. ప్రభుత్వ పాఠశాలలంటే చులకన ప్రభుత్వ పాఠశాలలంటే చంద్రబాబుకు చులకన. విద్యా కానుక కిట్లు పూర్తిగా ఇవ్వలేమని చెబు తూ, అంతర్జాతీయ పరిణామాలను ముడిపెడుతున్నారు. మంత్రులు, అధికార పార్టీ నాయకులకు మాత్రం ఇలాంటి ఆంక్షలు వర్తించవా. తక్షణమే పూర్తి స్థాయిలో విద్యా కానుక కిట్లు అందజేయాలి. – పి.వైకుంఠరావు, వైఎస్సార్ టీఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు, టెక్కలి శ్రీకాకుళం, టెక్కలి: విద్యార్థి మిత్రకు సర్కారు డీజిల్ మరక అంటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందజేస్తున్న ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ ఒక్కో విద్యార్థికి సుమారు రూ. 2,279 ఖరీదు చేస్తుంది. ఈ కిట్లో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, 3 జతల యూనిఫాం, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్ట్ వంటి ప్రాథమిక విద్యా సామగ్రిని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. కుట్టుకూలి దీని కి అదనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి కొనసాగిస్తోంది. ఈ ఏడాది కూడా జూన్ 19వ తేదీన జరగబోవు మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమంలో ఆర్భాటంగా విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ప్రస్తుతం నెలకొని ఉన్న ఆయిల్ కొరత కారణంగా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి విద్యార్థి మిత్ర పంపిణీ మరింత ఆలస్యం అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది. విద్యా శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఇది ఒక నెపం మాత్రమేనని వెండార్స్తో కుదుర్చుకున్న ఒప్పందాల్లో తేడా వచ్చిందని, గత ఏడాదితో పోల్చుకుంటే సుమారు రెండు లక్షల 40 వేల మంది విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలకు దూరమయ్యారని, విద్యార్థుల సంఖ్య ప్రోగ్రెసన్ రూపంలో ఇండెంట్ పెట్టడం, ప్రస్తుతం ఇండెంట్ కంటే రెండున్నర లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, మ్యానుఫ్యాక్చర్స్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్ ప్రాప్తికి హిట్ల తయారీ పూర్తయిందని, మొత్తం కిట్లు కొని తీరాల్సిందేనని పట్టు పట్టడంతో రూ.60 కోట్లకుపైగా అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇదే అసలు కారణమని విద్యాశాఖలో పనిచేస్తున్న వారే లీకులిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మే నెల మూడోవారా నికే మండల స్టాక్ పాయింట్లకు విద్యా కానుక కిట్లు పూర్తిస్థాయిలో చేరేవి. పాఠశాల పునః ప్రారంభం నాటికి పాఠశాల పాయింటుకు కిట్లు చేరవేసి విద్యారంగ పునర్నిర్మాణంపై నిబద్ధతను చాటుకుంది. కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యార్థి మిత్రకు డీజిల్ మరకలు అంటిస్తోంది. -
రోడ్డు చెంతనే తవ్వకాలు
హిరమండలం: వంశధార పనుల పేరుతో కాంట్రాక్టర్లు లోకొండ గిరిజన గ్రామం రహదారిని ధ్వంసం చేస్తున్నారు. ఇటీవల వంశధార ఎత్తిపోతలు, కరకట్టలు, ఇతరత్రా నిర్మాణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కంకర, మట్టి అవసరం. ఇదే అదనుగా లోకొండలో వ్యవసాయ భూములు, ప్రభుత్వ స్థలాల్లో కంకర, మట్టి తవ్వకాలు చేపట్టి తరలిస్తున్నారు. అయితే రహదారి చెంతనే, కల్వర్టుల వద్ద తవ్వకాలు చేపడుతుండడంతో నిర్మాణాలు దెబ్బతింటున్నాయి. 2022లో ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించారు. అయితే ఇది కేవలం ద్విచక్ర వా హనాలతో పాటు చిన్నపాటి వాహనాలు నడిపేందుకు సామర్థ్యం ఉన్న రోడ్డు మాత్రమే. అయితే రహదారికి ఆనించి మట్టి, కంకర తవ్వకాలతో పూర్తిగా బలహీనం అవుతోంది. ఆపై భారీ వాహనాలు రోడ్డుపై వెళుతుండడంతో పూర్తిగా ధ్వంసం అవుతోంది. ఇదేమని అడుగుతుంటే సంబంధిత కాంట్రాక్టర్లు వంశధార పనుల పేరు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రహదారి మాత్రం దారుణంగా దెబ్బతింటోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని లోకొండ గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. వడదెబ్బతో మాజీ ఎంపీటీసీ మృతి గార: అంపోలు గ్రామానికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు అంబటి తౌడు (77) వడదెబ్బతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం తౌడు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఇంటి వద్దనే అస్వస్థతకు గురయ్యారని, కొద్ది నిమిషాల్లో మృతి చెందారని తెలిపారు. తౌడు మృతిపై వైఎస్సార్ సీపీ స్టేట్ ఎస్ఈసీ మెంబర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ, పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గొండు రఘురాం, మాజీ సర్పంచ్ గొండు జయరాం సంతాపాన్ని తెలియజేశారు. వజ్రపుకొత్తూరు: మండువేసవిలో చుక్కనీరు దొరక్క చాలా చోట్ల ప్రజలు అల్లాడిపోతుండగా.. మరికొన్నిచోట్ల మాత్రం వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే లేదు. కొండవూరులో జలజీవన్ మిషన్ ద్వారా పంపిణీ చేస్తున్న శుద్ధ జలాలు వృథా అవుతున్నాయి. రోజూ వందల లీటర్ల నీరు కుళాయిల ద్వారా వృథాగా పోతున్నా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. పక్కనే ఆ పథకం ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండడంతో నిత్యం కుళాయిలకు నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ ట్యాప్లు సక్రమంగా అమర్చక పోవడంతో నీరంతా వృథా అవుతుంది. కేవలం వెయ్యి రూపాయలు ఖర్చు చేసి ట్యాప్లను బాగు చేస్తే నీటి వృథాను అరికట్టవచ్చు. కానీ పట్టించుకునే వారే కరువయ్యారు.


