Srikakulam
-
మడపాంలో రైస్మిల్లు సీజ్
● లెవీ బియ్యంలో రేషన్ బియ్యం కలుపుతున్నట్లు నిర్ధారణ ● 160 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం నరసన్నపేట: సివిల్ సప్లయ్కు ఇస్తున్న లెవీ బియ్యంలో రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేసి కలుపుతు న్నట్లు నిర్ధారణ కావడంతో నరసన్నపేట మండలం మడపాం వద్ద శ్రీ వేంకటేశ్వర మోడరన్ రైస్మిల్లును అధికారులు శనివారం సీజ్ చేశారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాలరావు, డీఎస్ఓ సూర్యప్రకాశరావులు శుక్ర, శనివారాల్లో రైస్మిల్లును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్ఓ మాట్లాడుతూ మిల్లులో 160 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించామన్నారు. లెవీ బియ్యంలో రేషన్ బియ్యం కలుపుతున్నట్లు నిర్ధారణ కావ డంతో జేసీ ఆదేశాల మేరకు మిల్లుపై సిక్స్ ఎ కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. కొంతకాలంగా ఈ మిల్లు నుంచి సివిల్ సప్లయ్కు వస్తున్న లెవీ బియ్యంలో కోటా బియ్యం కలుపుతున్నట్లు అనుమానం వచ్చి నిపుణులతో పరిశీలన చేయించగా వాస్తవమని నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో మిల్లులో ఉన్న 1200 టన్నుల ధాన్యాన్ని సమీపం మిల్లులకు తరలిస్తున్నామని డీఎస్ఓ వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి మిల్లులపై నిఘా వేస్తున్నామని చెప్పారు. పీడీఎస్ బియ్యం మిల్లుల్లో ఉంటే కఠిన చర్యలు తప్పవని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. డీఎస్ఓ వెంట తహసీల్దార్ సత్యనారాయణ, సీఎస్డీటీ రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
మూడెకరాల్లో అగ్ని కీలలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రం సమీపంలో నవభారత్ కూడలి హైవే రహదారిని ఆనుకొని పల్లపు ప్రాంతంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు మూడు ఎకరాల్లో నీలగిరి మొక్కలున్న ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తకుప్పలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు జిల్లా అగ్నిమాపక సహాయాధికారి శ్రీనుబాబు తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం ఏమీ జరగలేదన్నారు. మధ్యాహ్నం 1.35 గంటలకు హైవేలో వెళ్తున్న ఓ వ్యక్తి కాల్ చేయడంతో ఘటనాస్థలికి సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేశామన్నారు. అప్పటికే దట్టమైన పొగలు అలుముకోవడంతో వాహనచోదకులకు ఇబ్బంది కలిగిందన్నారు. దాదాపు రెండు గంటల పాటు మంటలు వ్యాపించాయని స్థల యజమాని మొదలవలస కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేశామని చెప్పారు. -
అలరించిన నాటిక ప్రదర్శనలు
కవిటి : సమకాలీన సమాజంలో కుటుంబ వ్యవస్థలో నెలకొన్న పలు ప్రతికూల అంశాల్ని కళ్లకు కట్టినట్టు తెరకెక్కించిన నాటిక ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆద్యంతం చైతన్యపరిచాయి. కవిటి మండలం బొరివంకలో కళింగసీమ కళాపీఠం ఆధ్వర్యంలో రెండో రోజు జరిగిన ఉభయ తెలుగురాష్ట్రాల నాటిక పోటీ లు ఆలోచింపజేశాయి. అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించిన ‘సహాన’ నాటిక ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అన్యాయంపై తిరుగుబాటు చేస్తూ అలుపెరుగని ప్రయాణం చేయాలనే ఇతివృత్తంగా సా గింది. రెండో ప్రదర్శనగా ‘మా ఇంటి మహాభారతం’ నాటికలో వంద ఎకరాల భూస్వామి విలాసా ల బారిన పడి ఉన్నదానిలో అరవై ఎకరాలు అమ్ము కోవడం, తల్లి శపథం ఇతివృత్తంగా ఆద్యంతం అలరించింది. చివరి ప్రదర్శనగా ఆలీతో సరదాగా అనే హాస్యనాటిక సమాజంలో యువతీ యువకుల మధ్య ఆధునిక స్నేహసంబంధాల్లో వస్తున్న తాజా సన్నివేశాల సమాహారంగా తెరకెక్కించారు. -
జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: జిల్లా పరిషత్ సీఈఓగా వెంకట్రామన్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరంలో ఇన్చార్జి సీఈఓ గా పనిచేస్తున్న వెంకట రామన్ను పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈఓగా ప్రభుత్వం మూడు రోజుల కిందట నియమించిన విష యం పాఠకులకు విధితమే. ఆయన శనివారం బాధ్యతలు తీసుకున్నారు. మెళియాపుట్టి: మెళియాపుట్టి పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న చాపర గ్రామంలో అర్ధరాత్రి ద్విచక్రవాహనాలు దొంగతనం చేసే వ్యక్తులు తిరుగుతున్నారంటూ శనివారం సీసీ ఫుటేజ్ వీడియో సోషల్మీడియాలో చక్కర్లు కొట్టింది. బైక్ చోరీ చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు కుక్కలు మొరగడంతో పారిపోయా రు. ఇదిలా ఉండగా శనివారం అదే గ్రామానికి చెందిన కిల్లంశెట్టి జగదీశ్వరావు తన ద్విచక్ర వాహనం చోరీకి గురైందంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ తెలిపారు. చాపర గ్రామంలో నెల క్రితం కూడా రెండు ద్విచక్రవాహనాలు చోరీకి గురయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఎచ్చెర్ల : స్థానిక ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థినులకు పాలిసె ట్ పరీక్ష కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ విక్టర్పాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం నుంచి శిక్షణ ప్రారంభమౌతుందని, ప్రతి రోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డు, పదో తరగతి హాల్ టికెట్, పాలిసెట్ ఫీజు రసీదుతో వచ్చి పేర్లు నమోదు చేయించుకోవాలని సూచించారు. పాలిసెట్కు అప్లయ్ చేసేందుకు ఈ నెల 9 వరకు గడువు పొడిగించారని చెప్పారు. పూర్తి వివరాలకు 9440951078 నంబరును సంప్రదించాలని కోరారు. -
భర్తకు డయాలసిస్ చేయిద్దామని వచ్చి..
శ్రీకాకుళం క్రైమ్ : భర్తకు కిడ్నీ వ్యాధి ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించేందుకొచ్చి ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృత్యువాత పడింది. ట్రాఫిక్ సీఐ వి. రామారావు తెలిపిన వివరాల మేర కు.. లావేరు మండలం వెంకటపురానికి చెందిన అంధవరపు మార్కండేయులు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందా రు. భార్య జయలక్ష్మి(70), వివాహాలైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. లావేరు పరిధిలోనే ఫెర్టిలైజర్ షాపు నడుపుతున్నారు. మార్కండేయులకు కొంతకాలంగా కిడ్నీ వ్యాధి ఉంది. శుక్రవారం డయాలసిస్ నిమిత్తం నగరంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి భార్య జయలక్ష్మి తీసుకొచ్చింది. మార్కండేయులును ఐసీయూలో ఉంచడంతో ఎవరూ ఉండకూడదన్న నిబంధనతో ఆమదాలవలసలోని తన సోదరి కుమార్తె ఇంటికి జయలక్ష్మి శుక్రవారం రాత్రి వెళ్లిపోయింది. శనివారం సాయంత్రం ఆమదాలవలసలో పల్లె వెలుగు బస్సులో శ్రీకాకుళం చేరి కాంప్లెక్సులో దిగింది. నడుచుకుంటూ నాన్స్టాప్ బస్సులు, ఆటోస్టాండ్ మధ్య ఖాళీ స్థలం వైపు వెళ్తూ ఆగింది. ఔట్గేట్ వైపుగా వస్తున్న అదే పల్లెవెలుగు బస్సు వృద్ధురాలిని గమనించక పైనుంచి వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని అంబులెన్సులో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్ఐ దండపాణి దాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
130కు చేరిన బాదంపాలు బాధితులు
శ్రీకాకుళం రూరల్ : సింగుపురంలో రెండు రోజుల క్రితం జరిగిన హాటకేశ్వరస్వామి, కొండమ్మ తల్లి యాత్రలో బాదంబాలు తాగి అస్వస్థతకు గురైన వారి సంఖ్య 130 మందికి చేరింది. ఇప్పటికే బాధి తుల్లో కొందరికి సింగుపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. మరికొంతమంది ఇప్పటికే కోలుకుంటున్నారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మామిడివలసకు చెందిన ఓ వ్యక్తి పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ల్యాబ్లకు శాంపిళ్లు.. ఇదే విషయమై కలెక్టర్ స్వప్నిల్ స్పందిస్తూ బాధితులంతా సురక్షితంగానే ఉన్నారని, బాదం పాలు, కస్టర్డ్ పౌడర్ నమూనాలను పరీక్షల నిమిత్తం విశాఖ, హైదరాబాద్ పంపించామని చెప్పారు. డీఎంహెచ్ఓ, ఆహార భద్రతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమీక్షిస్తున్నారని తెలిపారు. బాదంపాలు విక్రయించిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పరిధిలో బాదం పౌడర్ విక్రయించే పలు దుకాణాల్లో ఆహార తనిఖీ అధికారులు పోలీసులతో కలిపి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం సింగుపురంలో బాదంపాలు తాగి కొంతమంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఫుడ్ ఇన్స్పెక్టర్ కోట లక్ష్మి ఆధ్వర్యంలో తనిఖీలు జరిపారు. -
కళంకితుడికి అందలమా..?
కళంకితుడిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కుర్చీలో కొనసాగించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. అర్హత లేని వ్యక్తిని వెంటనే ఆ పదవి నుంచి సాగనంపాలని కోరుతూ శనివారం జిల్లా వ్యాప్తంగా దేవాలయాల వద్ద పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను కాపాడాలని, బీఆర్ నాయుడుకు ఆ పదవిలో కొనసాగేందుకు అర్హత లేదని అన్నారు. దేవాలయం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఉన్న వారే అపవిత్రం చేస్తున్నారని, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. –సాక్షి నెట్వర్క్ -
విద్యార్థుల భద్రతలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్
పాతపట్నం: విద్యార్థుల భద్రత, వసతుల కల్పనలో ఏ మాత్రం అలసత్వం వహించినా సహించేది లేద ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను హెచ్చరించారు. శనివారం మండలంలోని ప్రహారాజపాలెంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల ను కలెక్టర్ ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. ఇటీవల 7వ తరగతి చదువుతున్న చింతల పూజిత మెట్లపై నుంచి జారిపడి మృతి చెందిన ఘటన తెలిసిందే. ప్రమాదంపై క్షుణ్ణంగా ప్రిన్సిపల్ పద్మావతి ని, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని, మెట్లను, మెడ మీద టెర్రస్ను, విద్యార్థిని డార్మిటరీని పరిశీలించారు. విద్యార్థులపై నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లకు తలుపులు, ప్రహరీ పనులకు నిధులు మంజూరు చేసినప్పటికి, పనుల్లో జాప్యంపై ప్రిన్సిపాల్తో పా టు ఈడబ్లూఐడీసీ జేఈ రామారావుపై అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువుతున్న తరగతి గదులకు వెళ్లి, విద్యార్థులతో నోట్స్ చదివించి, విద్యా బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. శుద్ధ జలం లేకపోవడంతో రిపేర్ చేయించాలని తహసీల్దార్ ప్రసాదరావును ఆదేశించారు. పాతపట్నం గ్రామ సచివాలయం–1ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
ఆ దంపతుల నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్: ‘నేత్రదానం’ వెలుగుల దానమ ని రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు శనివారం పేర్కొన్నారు. గార మండలం శ్రీకూర్మం గ్రామానికి చెందిన అంధవరపు బాలకృష్ణమూర్తి (88) గత నెలలో మరణించడంతో కుటుంబ సభ్యులు రెడ్క్రాస్ ద్వారా నేత్రదానం చేశారు. ఆయన భార్య అంధవరపు రూపవతి (82) తన భర్త నేత్రదానం నుంచి ప్రేరణ పొంది మరణానంతరం నేత్రదానం చేయాలని కుమారులకు తెలియజేసి శనివారం తనువుచాలించారు. దీంతో కుటుంబ సభ్యులు అంధవరపు రాఘవ్కుమార్, శ్రీనివాస నెహ్రూ, వి.సుజాతలు నేత్రదానానికి ముందుకొచ్చారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్ర దానం చేయాలనుకునే 78426 99321 నంబరుకు సంప్ర దించాలని జగన్మోహనరావు కోరారు. -
తాతంశెట్టి తాట ఎప్పుడు తీస్తారు?
‘‘మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఒకప్పుడు ఆవేశంతో ఊగిపోయారు. స్త్రీల ధన..మాన.. ప్రాణాల రక్షణకే అధిక ప్రాధాన్యమిస్తామని ఊదరగొట్టారు. అయితే ఆదర్శాలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమని నిరూపిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలపై అఘాయిత్యాలు పెరిగినప్పటికీ చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కూటమి నేతలు బరితెగించి మహిళలపై దాడులకు పాల్పడుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం రైల్వేకోడూరులో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి తాతంశెట్టి నాగేంద్ర జంకుగొంకు లేకుండా నడిరోడ్డుపైనే ఓ మహిళను విచక్షణారహితంగా కొట్టినా కనీస మాత్రం కూడా స్పందించకుండా కాలయాపన చేస్తున్నారు.తిరుపతి జిల్లా: మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కల్యాణ .. తమ జనసేన పార్టీ నాయకులే ఓ మహిళపై నడి రోడ్డుపై దాడిచేస్తే పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నస్తున్నారు. సినిమాలో చెప్పినట్టు సభల్లో డైలాగులు చెప్పడం తప్ప తన సొంత పార్టీకి చెందిన నేతలు ఏం చేసినా ఆయనకు పట్టదా అని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నియోజకవర్గ కేంద్రంలో పట్టపగలు నడిరోడ్డున జనసేన పార్టీ నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర దళిత మహిళపై పోలీసుల సమక్షంలో.. పోలీసు లాఠీతో దాడిచేశారు. దుర్భాషలాడి వీధి రౌడీలా ప్రవర్తించారు. ప్రగల్భాలు పలికిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తమ పార్టీ నాయకులే మహిళల పట్ల బరితెగించి ప్రవర్తిస్తుంటే నోరు మెదపడం లేదని స్థానిక మహిళలు ప్రశి్నస్తున్నారు. మొన్న రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సచివాలయ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడి మోసగించాడని జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తప్పు చేశాడని అన్ని ఆధారాలున్నా డిప్యూటీ సీఎం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తమ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర్వులు జారీ చేశారని.. అయితే పార్టీ అధికారిక కార్యక్రమాల్లో అతను పార్టీ కండువా వేసుకుని వేదికపై ఆశీనుడవుతున్నా పవన్ కల్యాణ్కు తెలియదా అని నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోయాయని, పోలీసులు కేవలం ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా.. పోలీసులు చూస్తూ ఏమీ చేయక సలాములు కొడుతున్నారని మండిపడుతున్నారు. రైల్వేకోడూరు నడి»ొడ్డున దళిత మహిళపై పోలీసుల సమక్షంలో తాతంశెట్టి నాగేంద్ర దాడిచేస్తే అతనిని అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దారుణమంటున్నారు. బాధితురాలు రోడ్డుపై నిరసనకు దిగితే స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సలహాలు ఇచ్చారని దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసులు రాజకీయ నాయకులకు రక్షకులుగా ఉన్నారు తప్ప ప్రజలకు రక్షకులు కాదా అని ప్రశ్నిస్తున్నారు.సీఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలి రైల్వేకోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారానికి పాల్పడడంతోపాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఒక ప్రభుత్వ ఉద్యోగిని జాతీయ మానవహక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారని.. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దళిత మహిళపై పోలీసుల లాఠీ తీసుకుని కొట్టడం అమానుషం. నిస్సహాయురాలిగా ఉన్న మహిళను కొట్టడం ఏమిటి? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్న సందేహం తలెత్తుతోంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్కు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం ఉన్నా దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి. – ఇసుకపాటి లక్ష్మీనారాయణమ్మ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, రైల్వే కోడూరు ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు రైల్వేకోడూరు పట్టణం నడి»ొడ్డున ఓ దళిత మహిళపై జనసేన పార్టీ నాయకులు కర్రలతో దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పించడంలో తీవ్రంగా విఫలం అయింది. ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు. ఈ విషయంపై సీపీఐ తరఫున పోరాటాలు చేస్తాం. కనీసం పోలీసులు కూడా పట్టించుకోకపోవడం దారుణం. – చింతలపూడి నాగమ్మ, సీపీఐ మండల కార్యదర్శి, ఓబులవారిపల్లె -
కొంప ముంచిన బాదం పాలు
శ్రీకాకుళం రూరల్: సింగుపురం పంచాయతీ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన వారు జాతరలో బాదం పాలు తాగి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. గురువారం హటకేశ్వరస్వామి, కొండమ్మ తల్లి యాత్ర ముగింపు జరిగింది. ఈ సందర్భంగా సింగుపురం సచివాలయం కేంద్రం వద్ద రాజస్థాన్కు చెందిన ఓ ట్రావెల్ బడ్డీ ద్వారా అమ్మిన బాదంపాలు, ఐస్క్రీమ్లను చాలా మంది ఆస్వాదించారు. రూ.40 విలువ గల బాదంపాలు సాయంత్రానికి రూ.10కే ఇవ్వడంతో మరింత మంది ఆ పాల కోసం క్యూ కట్టారు. శుక్రవారం ఉదయం నుంచి వీరిలో చాలా మందికి వాంతు లు, విరేచనాలు, జ్వరం రావడంతో వారంతా దగ్గరిలో గల ప్రైవేట్ క్లినిక్లకు పరుగులు పెట్టారు. బాదం పాలు తాగడం వల్లే వాంతులయ్యాయని వారంతా వైద్యుల వద్ద చెప్పడం గమనార్హం. సింగుపురం గ్రామంలోని పలు ప్రైవేటు క్లినిక్లలో సుమా రు 60 నుంచి 70 వరకూ మందులు తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని సింగుపురం ప్రాధమిక వైద్యాధికారి వద్ద వెంకట్ వద్ద ప్రస్తావించగా బాదంపాలు తాగడంతో సింగుపురం చుట్టుపక్కల గ్రామాల్లో పలువురు అస్వస్థతకు గురైనట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ప్రాథమిక వైద్య కేంద్రంలో అన్ని రకాల మందులు ఉన్నాయని ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. -
ఫ్రైడే
మనసు లేని ప్రభుత్వం జిల్లాలో ఎండ మండిపోతోంది. మధ్యాహ్నానికి సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో వాహన చోదకులు, బయట పనిమీద వెళ్లిన వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం సూరీడి ధాటికి జనం చెమట్లు కక్కారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం శ్రీకాకుళం పాత బస్టాండ్: ఫ్యూనరల్ చార్జెస్.. ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే వారికి ప్రభుత్వం న్యాయంగా అందజేయాల్సిన సాయం. చంద్రబాబు ప్రభుత్వం ఈ సాయం కూడా చేయలేకపోతోంది. దాదాపు ఏడాదిగా ఈ మట్టి ఖర్చులను ప్రభుత్వం ఇవ్వడం లేదు. దీంతో ఆయా బాధిత కుటుంబాలకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఏడాదిగా జిల్లాలో మరణించిన ఒక్క ఉద్యోగికి కూడా ఈ ఫ్యూనరల్ చార్జీలు అందజేయలేదు. వారు ట్రెజరీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవడమే మిగిలింది తప్ప నగదు మాత్రం వారి ఖాతాలకు జమ కాలేదు. ఒకప్పుడు ఉద్యోగి, ప్రభుత్వ పింఛన్దారుడు మరణిస్తే 24 గంటల్లో వారి కుటుంబానికి ఫ్యూనరల్ చార్జీలు రూ.25వేలు అందజేసేవారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. నెలలు, సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ మట్టి ఖర్చులు అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో సుమారుగా 615 మంది వరకు ఇలాంటి మట్టి ఖర్చులు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ నగదు విడుదల జరగలేదని ట్రెజరీ అధికారులు వెల్లడిస్తున్నారు. దాదాపు రూ.1.53 కోట్ల బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయి. ఆర్జిత సెలవుల డబ్బులకు అతీగతీ లేదు ఉద్యోగులకు గౌరవప్రదంగా అందజేయాల్సిన ఆర్జిత సెలవుల డబ్బులు(ఎర్న్డ్ లీవ్ అమౌంట్) చెల్లింపులు కూడా జరగడం లేదు. ఇలాంటి ఆర్జిత సెలవు నగదు కోసం దరఖాస్తు చేసుకున్నవారు జిల్లాలో 500 కు పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరు ఏడాదిగా ఆ మొత్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్జిత సెలవుల నగదు చేతికి అందితే పిల్లలకు ఉపాధి కార్యక్రమాలు, వివాహాలు ఇతర అవసరాలకు పనికి వస్తాయని ఉద్యోగులు ఆశ పడుతుంటారు. కానీ వారికి నిరాశే మిగిలింది. దాదాపు రూ.60 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. గ్రాడ్యు టీ నగదు కూడా చెల్లింపులు జరగడం లేదు. ఈ బకాయిలు కూడా రూ.కోట్లలో ఉన్నాయి. జిల్లాలో వందలాది కుటుంబాలు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. కొందరు న్యాయ స్థానాలను కూడా ఆశ్రయించారు. -
ఉద్యోగి.. ఉక్కిరి బిక్కిరి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఒత్తిడికి గురవుతున్నారు. ఖాళీ లేకుండా ఏదో ఒక బాధ్యత అప్పగించడం, దానికి డెడ్లైన్ పెట్టడం, జిల్లా అధికారులు సతాయింపునకు గురి చేయడంతో నలిగిపోతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతి సారి ఇదే జరుగుతుందన్న ఆలోచనలో పడ్డారు. కాన్ఫరెన్స్లు, సమీక్షలతోనే గడిచిపోతుందని, పనిచేయడానికి సమయం ఎక్కడ ఉంటుందని ఆవేదన చెందుతున్నా రు. ఓపిక నశించడంతో ఎదురు ప్రశ్నించక తప్పడం లేదు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఓ మహిళా ఉద్యోగి నేరుగా ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ప్రశ్నలకు స్పందించలేక మ్యూట్లో పెట్టేసి వీడియో కాన్ఫరెన్స్ కొనసాగించారు. ఒక మహిళా ఉద్యోగి నేరుగా కలెక్టర్తోనే తీవ్ర స్వరంతో మాట్లాడారంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే సచివాలయం ఉద్యోగులు రోడ్డెక్కారు. ముఖ్యంగా అగ్రికల్చర్ అసిస్టెంట్లు ధాన్యం సేకరణ సమయంలో కలెక్టరేట్ను ముట్టడించడమే కాకుండా ఏకంగా కలెక్టర్నే నిలబెట్టేశారు. సర్వే ఉద్యోగుల పరిస్థితి కూడా దాదా పు అంతే. మొన్నటి వరకు సచివాలయం ఉద్యోగులే ఇబ్బందులు పడుతున్నారనుకుంటే ఇప్పుడా జాబితాలోకి రెవెన్యూ ఉద్యోగులు కూడా చేరారు. ఈ రెండు శాఖల్లోనే కాదు దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వీడియో కాన్ఫరెన్స్లు, టెలీ కాన్ఫరెన్స్లతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆ మధ్య ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రభుత్వం పెట్టిన టార్గెట్లతో ఒత్తిడికి గురై గుండెపో టుతో చనిపోయారు. సచివాలయం ఉద్యో గుల పరిస్థితైతే చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు అనారోగ్యం బారిన పడుతున్నారు. చెప్పాలంటే ఏ ఒక్క ఉద్యోగినీ ప్రభుత్వం వదలడం లేదు. గత ప్రభుత్వం ప్రశాంత వాతావరణం మధ్య చేపట్టిన భూముల రీసర్వేను ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఇప్పుడదే రీసర్వేను అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రభుత్వం మొదలు పెట్టింది. తాము చేస్తే పని.. వేరే వాళ్లు చేస్తే నేరమని తన సహజ ధోరణి ప్రదర్శించింది. నాలుక మడత పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రీసర్వేను తాజాగా చేపడుతోంది. కాకపోతే, అందుకు అవసరమైన వనరులను సమకూర్చలేదు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బేస్ స్టేషన్స్ ద్వారా నిర్వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అవసరమైన రోవర్లు, కొలతలకు సంబంధించిన పరికరాలు, కంప్యూటర్లు ఇవ్వలేదు. వాటి సమస్య తీవ్రంగా ఉంది. సర్వే చేసేందుకు సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. దాన్ని అధిగమించకుండా సర్వే పేరు తో ఉన్న ఉద్యోగులను వేధింపులకు గురి చేసి, ఒత్తిడికి లోనయ్యేలా చేస్తోంది. 10 రోజుల కిందట గ్రామ సర్వేయర్లు సామూ హికంగా సర్వే నిలిపివేశారు. కలెక్టర్ను కలిసి తమ గోడు విన్నవించుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఇద్దరిని సస్పెండ్ చేశారు. కాకపోతే, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు, వ్యతిరేకత వస్తాయని గమనించి ప్రభుత్వం వెంటనే సస్పెన్షన్ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. హంగామా.. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదు. కేవలం హంగామా తప్ప ఏమీ జరగడం లేదు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారులకు ఫలి తం ఉండటం లేదు. ప్రధానంగా 22ఎ సమస్యలు, ఎల్పీఎం సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకు సంబంధించి మ్యుటేషనుల, కరెక్షన్స్, అడంగల్లో పేరు మార్పు లు వంటి సమస్యలు పేరుకుపోతున్నాయి. కోర్టు ఉన్న సమస్యలకు సరైన సమాధానాలు పంపకపోవడంంతో కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇవన్నీ రెవెన్యూ ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తున్నాయి. దీనితో పాటు అడ్డగోలు పనులు చేయాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా వారు చెప్పిన పనులే చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో కింది స్థాయి నుంచి తహసీల్దార్ల వరకు ఇబ్బందులు పడుతున్నారు. చెప్పింది చేయకపోతే నేతలు సతాయిస్తున్నారు. ఇటీవల గార తహసీల్దార్ అంతకుముందు పాతపట్నం తహసీల్దార్పై నేతలు చిందులు వేయడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు వారి విధుల నిర్వహణ కంటే ఎమ్మెల్యేలు, మంత్రుల వారి ప్రొటోకాల్ పనుల తో బిజీ కావల్సిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తహసీల్దార్లు, ఇతర అధికారులు హాజరు కాకపోతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. దీంతో తహసీల్దార్లు, ఇతర అధికారులు, సచివాలయం ఉద్యోగులు వారి చుట్టూ తిరగడంతోనే సమయమైపోతోంది. పరిస్థితులు ఇలా ఉన్నా ఉన్నతాధికారులు ఏమీ పట్టించుకోవడం లేదు. చెప్పింది ఎందుకు చేయలేదని నిరంతరం నిలదీస్తున్నారు. దీంతో ఉద్యోగులు తీవ్రంగా మనస్తాపం చెందుతున్నారు. ఊపిరి సలపనివ్వడం లేదని ఆవేదన వరుస బాధ్యతల అప్పగింతపై ఆందోళన నేతల ఒత్తిళ్లు, అనధికార హుకుం సకాలంలో పనులు పూర్తి చేయలేని పరిస్థితి జాప్యంపై ఉన్నతాధికారుల చీవాట్లు భరించలేక ఆవేదన ఒత్తిడి తట్టుకోలేక ఆకస్మిక మరణాలు -
అసలే గ్యాస్ కొరత.. ఆపై గొడవ
ఇచ్ఛాపురం: గ్యాస్ కొరతతో వినియోగదారులు సహనం కోల్పోతున్నారు. శుక్రవారం స్థానిక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం వద్దకు అమీన్సాహెబ్ పేటకు చెందిన వినియోగదారుడు ఎం.విఘ్నేష్ వచ్చి గ్యాస్ సిలిండర్ కావాలని అడిగాడు. గ్యాస్ బుకింగ్ జరిగితే గానీ గ్యాస్ ఇవ్వలేమని ఏజెన్సీ ప్రతినిధి చెప్పాడు. గ్యాస్ బుకింగ్ వినియోగదారుడు తీసుకొచ్చిన గ్యాస్ పుస్తకాన్ని కార్యాలయంలో పరిశీలించగా ఆ పుస్తకం అప్పటికే ల్యాప్స్ అయినట్లు ఏజెన్సీ ప్రతినిధి వినియోగదారునికి చెప్పాడు. దీంతో వినియోగదారుడు సహనం కోల్పోయి ఏజెన్సీ ప్రతినిధిపై దాడికి పాల్పడ్డాడు. దీంతో గ్యాస్ ఏజెన్సీని మూసివేయడంతో మిగతా వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ఇదే విషయమై స్థానిక పోలీసుల వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో 30 యాక్ట్ అమలు శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం సబ్డివిజన్ పరిధిలోని శాంతిభద్రతలు దృష్టిలో ఉంచుకుని పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమల్లోకి తెస్తున్నామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. శుక్రవారం డీఎస్పీ తన కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖ ముందస్తు లిఖిత పూర్వక అనుమతి లేకుండా ధర్నాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు, ప్రజా శాంతికి భంగం కలిగించేలా గుంపులుగా ఉండే కార్యక్రమాలు నిషేధించామని తెలిపారు. ఏ విధమైన సామాజిక, ధార్మిక, రాజకీయ లేదా ఇతర కార్యక్రమాలు నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి ఉండాలన్నారు. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతల దృష్ట్యా ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. నాటకాలు.. సామాజిక చైతన్య వీచికలు కవిటి: సమాజంలో వేళ్లూనుకున్న పెడ ధోరణులు, రుగ్మతల్ని కూకటి వేళ్లతో తొలగించే సామాజిక చైతన్య వీచికలు నాటకాలని వక్తలు అన్నారు. శుక్రవారం మండలంలోని బొరివంకలో కళింగసీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పరిషత్ ఆహ్వానిత పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు విశాఖపట్నం తెలుగు కళాసమితి వారి చిటికెనవేలు, పెందుర్తి నటరాజ డ్రమటిక్ అసోసియేషన్ వారి నీళ్లు నీళ్లు అనే రెండు నాటిక ప్రదర్శనలు జరిగాయి. వ్యవసాయ కుటుంబంలో తండ్రి అడుగుజాడల్లో నడిచిన ఓ కుటుంబ సంప్రదాయాన్ని తర్వాత తరానికి చెందిన యువకుడు విడిచిపెట్టి ఆధునికత ఉచ్చులో పడి ఉన్న భూమిని పోగొట్టుకున్న వైనమే ఇతివృత్తంగా సాగిన చిటికెన వేలు నాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. రెండో ప్రదర్శనగా వేసిన నీళ్లు నీళ్లు అనే నాటిక ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్న రైతులు వర్షాలు సకాలంలో కురవక సాగులో నష్టపోతున్న వైనం, ఈ నేపథ్యంలో ఉన్న భూమిని అమ్ముకొని బోరుబావి వేసి సాగుచేసి లక్షలు ఆర్జిస్తాననే ఓ రైతు ఆలోచన ఏ విధంగా తారుమారైందనే కథాంశం నేపథ్యంగా సాగింది. -
సచివాలయాల్లో..
గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల పరిస్థితైతే మరింత దారుణంగా ఉంది. ప్రతీ పని వారికే అప్పగిస్తున్నారు. సహాయకులగా ఎవరూ లేకపోవడంతో చివరికి సబార్డినేట్ ఉద్యోగాలు కూడా వారే చేయాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. అటెండర్లు గ్రామస్థాయిలో చేయాల్సిన పనులన్నీ సచివాలయం ఉద్యోగులకు అప్పగించడంతో మదనపడుతున్నారు. గ్రామ స్థాయిలో రకరకాల డేటా, ఇతర సమాచార సేకరణ గత ప్రభుత్వంలో వలంటీర్లు చేయగా, ఇప్పుడా పని అంతా సచివాలయం ఉద్యోగులపైనే పడింది. సర్వేలు, మ్యాపింగ్, తదితర విధులను సచివాలయం ఉద్యోగులే నేరుగా ఇంటింటా తిరిగి చేస్తున్నారు. ఇక, ప్రభుత్వ ఉపాధ్యాయుల పరిస్థితి కూడా దాదాపు అదే విధంగా ఉంది. రకరకాల బాధ్యతలు అప్పగించడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో, ఒత్తిడికి తట్టుకోలేక అనారోగ్యం పాలవడంతో, కొందరు గుండెపోటుతో మరణిస్తున్నారు. -
పనిచేయని కోచ్ పొజిషన్, డిస్ప్లే బోర్డులు
కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ పరిధిలో మూడు ప్లాట్ఫామ్స్ మీద ఇటీవల స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ అట్టహాసంగా ప్రారంభించిన డిజిటల్ కోచ్ పొజిషన్ డిస్ప్లే బోర్డులు పనిచేయడం లేదు. దీని వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బెంగళూ రు వెళ్లే ప్రశాంతి ఎక్స్ప్రెస్ వచ్చినప్పుడు డిస్ ప్లే బోర్డులు పనిచేయలేదు. బోర్డులు ఉంటే ప్రయాణికులు వారికి కేటాయించిన కోచ్లు ఎక్కేందుకు సౌలభ్యంగా ఉంటుంది. రైల్వే సాంకేతిక అధికారులు స్పందించి కోచ్ పొజిషన్ బోర్డులు బాగు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
13న రాష్ట్ర మహాసభలు
శ్రీకాకుళం అర్బన్: నూతన ప్రజాస్వామిక సాహితీ సాంస్కృతికోద్యమం లక్ష్యంగా గత ఐదు దశాబ్దాలుగా జన సాహితీ అలుపెరుగని కృషి చేస్తోందని జన సాహితీ రాష్ట్ర అధ్యక్షులు దివికుమార్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఎన్జీఓ కార్యాలయంలో జనసాహితీ ప్రజా సాహిత్య సాంస్కృతిక పోరా ట సమితి ఆహ్వాన సంఘ ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దివి కుమార్ మాట్లాడుతూ తొలి తెలుగు జాతి వైతాళికుడు ప్రసి ద్ధి పొందిన గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తిది మన ప్రాంతమేనన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ ఆనాడు వద్దు వద్దు అని చెప్పిన తెల్ల దొరతనం నేటి నల్ల దొరల సౌజన్యంతో పరోక్షంగా కొనసాగుతూనే ఉందని అన్నారు. మనం చమురు ఎవరి దగ్గర కొనుక్కోవాలో, కొనుక్కోకూడదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించడం ఏమిట ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి మాట్లాడుతూ సాహితీ సాంస్కృతిక ఉద్యమ రంగంలో రాష్ట్ర మహాసభలు జరుపుకునే సందర్భంలో మే 24, 25 తేదీల్లో శ్రీకాకుళం నగరంలో పెద్ద ఎత్తున 13వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపా రు. గోర్కీ రచించిన అమ్మ నవలలను నాటకంగా మే 24న అంబేడ్కర్ ఆడిటోరియంలో ప్రదర్శించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. -
‘దళిత విద్యార్థిని మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: పాతపట్నంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులంలో 7వ తరగతి విద్యార్థిని పూజ మృతి చెందిన ఘటనపై దళిత సంఘాల జేఏసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఈ ఘటనపై నిష్పక్షపాతంగా పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి కనీసం రూ.15 లక్షల పరిహారం ప్రకటించాలని కోరారు. స్కూల్ వెనుక భాగంలో ఉన్న ప్రహరీ చాలా రోజు ల కిందటే కూలిపోయినా పునర్నిర్మాణం జరగలేదని, ఆ ప్రాంతానికి సమీపంలో రైల్వే ట్రాక్ ఉండటం వల్ల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న గోడ నిర్మాణం కూడా నాణ్యత లేనిదిగా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కోఆర్డినేటర్గా ఉన్న అధికారి పై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. -
సనాతన ధర్మ పరిరక్షణకు పాదయాత్ర
కంచిలి: భారతదేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాదయాత్ర చేస్తున్నట్లు గుజరాత్కి చెందిన మాతా సుమణి తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం కంచిలి హైవే వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కంచిలి రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) వారు మాతాసుమణి పాదయాత్ర జట్టుకు ఆహ్వానం పలికారు. శుక్రవారం రాత్రి కంచిలి ఊన శ్రీకాంత్ ఇంటి వద్ద బస చేసి శనివారం ఉదయం 4 గంటల నుంచే పాదయాత్రను ప్రారంభించనున్నట్లు ఆర్ఎస్ఎస్ వారు తెలిపారు. దేశంలోని ప్రజలంతా ఐక్యంగా ఉంటూ హిందువులంతా ఒకే కుటుంబంలా సనాతన ధర్మం ఆచరించేలా మార్గదర్శం కల్పించేందుకు పాదయాత్రను చేపట్టినట్లు పేర్కొన్నారు. గుజరాత్ సోమనాథ్ ఆలయం వద్ద 2024 ఆగస్టు 23వ తేదీన ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు 11 రాష్ట్రాల గుండా కొనసాగించానని అనంతరం ఒడిశాలోని పవిత్ర క్షేత్రం పూరిని దర్శించుకొని పాదయాత్రను ముగించనున్నట్లు తెలిపారు. -
బాలిక హత్యపై విచారణ
హిరమండలం: పాతపట్నం నియోజకవర్గానికి చెందిన బాలిక హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఇంటర్లో చేర్పిస్తానంటూ చెప్పి లైంగిక దాడి చేసి చంపేసిన విషయం విధితమే. ఈ ఘటనపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పందించారు. తక్షణం ఈ ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. దీంతో సంబంధిత ప్రతినిధి బృందం డాక్టర్ నాగమానస, గంగు సూర్యనారాయణ, చల్లా మధుసూదనరావు బాధిత కు టుంబాన్ని పరామర్శించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారితో పాటు జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, ఐసీడీఎస్ పీఓ మల్లేశ్వరరావు, సీడీపీఓ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: భారత సాంస్కృతిక, సహకార, స్నేహ సంఘం (ఇస్కఫ్) రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఈనెల 4న శనివారం ఉదయం కొత్త రోడ్ జంక్షన్లో గల హనుమాన్ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని ఆహ్వాన సంఘం అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్, జిల్లా శాఖ గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామమూర్తి, అధ్యక్షులు బీవీఎస్ఎన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. యుద్ధాలు– మానవాళి–పర్యావరణం అనే అంశంపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులతో చర్చ జరుగుతుందని తెలిపారు. పాతపట్నం: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన పాతపట్నంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద శుక్రవారం ఎస్ఐ కె.మధుసూధనరావు ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సరిహద్దు ప్రాంతంలో ప్రయాణించే వాహన చోదకులు తప్పనిసరిగా వాహన పేపర్లు, లైసెన్స్ తప్పనిసరిగా ఉంచుకోవాలన్నారు. ఈ చలానా పెండింగ్లు ఉంటే వెంటనే కట్టాలన్నారు. ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. తనిఖీల్లో ఏఎస్ఐ కె.శ్రీరాములు, కానిస్టేబుల్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా మరో మెగా చెస్ టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. శ్రీకాకుళం జిల్లా చెస్ అసోసియేషన్, సీఎస్ఎన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్ జరగనుంది. అదే విధంగా ఆ టోర్నీ ముగిసిన తర్వాత జూలై 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మరో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ శ్రీకాకుళం గ్రాండ్ కన్వెన్షన్లో జరగనుంది. ఈ టోర్నమెంట్లో గెలుపొందిన క్రీడాకారులకు రూ.10 లక్షలు నగదు బహుమతితో పాటు ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ సర్టిఫికెట్లను సైతం అందజేయనున్నట్టు టోర్నమెంట్ డైరెక్టర్, రాష్ట్ర చెస్ ఇన్ స్కూల్స్ కన్వీనర్, సనపల భీమారావు తెలిపారు. ఈ టోర్నమెంట్లలో దేశంలో అనేక రా ష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో పాటు ఇతర దేశాల క్రీడాకారులు కూడా పాల్గొననున్నారని, ఈ టోర్నమెంట్ నిర్వహణ శ్రీకాకుళం జిల్లాకు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఈ మెగా చెస్ టోర్నీలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, పారిశ్రామికవేత్త లు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహకరించాలని చెస్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని ఆర్గనైజషన్ కమిటీ ప్రెసిడెంట్ తంగుడు సుధీర్ తెలిపారు. నందిగాం: పోలవరానికి చెందిన కె.లచ్చయ్యపై శుక్రవారం తేనెటీగల దాడి చేసి గా యపరిచాయి. వివరాలు పరిశీలిస్తే లచ్చయ్య (60) తనకు గల మేకలకు గ్రామానికి సమీపంలో ఉన్న మెట్ట దగ్గరకు మేపుటకు తీసుకువెళ్లాడు. అయితే అక్కడ ఒక్కసారిగా తేనె టీగలు దాడి చేయడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. భోజనం వేళయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. అపస్మారక స్థితిలో లచ్చయ్య కనిపించాడు. దీంతో 108 వాహనానికి సమాచారం అందించారు. అందులో ప్రథమ చికిత్స చేసి టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
భూ సారానికి ముప్పు!
● వరి కొయ్య దహనంతో తగ్గుతున్న భూసారం హిరమండలం: కొన్నేళ్ల కిందట వరి కోతల అనంతరం గడ్డిని కుప్పలుగా వేసి పశువుల మేతకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల కొరత ఏర్పడుతుండడంతో రైతులు కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలతో పాటు మిగిలిన గడ్డిని రైతులు పొలంలోనే నిప్పంటిస్తున్నారు. అవగాహన లోపంతో అన్నదాతలు ఇలా చేస్తే ఇలాంటి తప్పిదాలతో భూసారానికి ముప్పు పొంచి ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంతో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాదని చెబుతున్నారు. పంటలకు కీడు చేసే పురుగులను తినే వానపాములు, కీటకాలు నశించే ప్రమాదం ఉంది. అలాగే భూమికి సేంద్రియ పీచు పదార్థాలుగా ఉప యోగపడే అవశేషాలు ఖనిజ, లవణాలు నశిస్తా యి. అలాగే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. ఇలా చేస్తే మేలు.. పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. పంటకోత పూర్తయిన తర్వాత మిగిలిన పంటల అవశేషాలను భూమిలో మురగబెట్టి దుక్కిలో కలిపిదున్నాలి. ఇలా చేయడంతో వరి గడ్డి భూమిలో మురిగి సేంద్రీయ కర్బనం పెరుగుతుంది. ఇది తరువాత సాగుచేసే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, సూపర్ పాస్పేట్, పొటాష్లను కలిపి పంట సాగు చేసుకొనే ముందు చల్లితే పొలంలో మిగిలిన కొయ్యలు, వరి గడ్డి రెండు వారాల్లోనే మురుగుతాయి. పంట భూముల్లో గడ్డి, వరి కొయ్యలను దహనం చేస్తే భూ సారాన్ని కోల్పోతుంది. అవసరం లేని గడ్డిని భూమిలోనే కలిపి దున్నితే సేంద్రీయ ఎరువుగా మారి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. గడ్డి, కొయ్యల దహనంతో వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – బి.సంధ్య, మండల వ్యవసాయాధికారి, హిరమండలం -
● కారు ఢీకొని మృతి చెందిన ఆశ కార్యకర్త ● తొమ్మిది రోజుల్లో కుమారుని వివాహం
కంచిలి: పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంటిని విషాదం కమ్మేసింది. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన వరుడి తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయా రు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళ్లగా.. కంచిలి మండలం ఆర వ సరియాపల్లి గ్రామానికి చెందిన బుడ్డెపు కమలా కుమారి(50) ఆశ కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఆమె భర్త సాధారణ రైతు కూలి. వీరికి కుమారుడు దినేష్రెడ్డితో పాటు కుమార్తె ఉంది. కుమార్తెకు వివాహమై అత్తవారింట్లో ఉంటుంది. ఇటీవల కుమారునికి వివాహం నిశ్చయమైంది. 12వ తేదీన ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో జాడుపూడి గ్రామంలోని వారి బంధువులందరికీ శుభ లేఖలు ఇవ్వడానికి ఆమె వెళ్లారు. శుభలేఖలు పంచడం పూర్తిచేసుకొని సాయంత్రానికి ఇంటికి రావడానికి జాడుపూడి వద్ద బస్సు ఎక్కి అంపురం కూడలి వద్ద దిగా రు. తన స్వగ్రామం వెళ్లేందుకు జాతీయ రహదారిని దాటుతుండగా పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆశ కార్యకర్త ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున ట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ నంబళ్ల సుశాంత్ ఈ ఏడాది కూడా తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత ఏడాది సెంచరీల వర్షం కురిపించగా.. ఈ సీజన్లోనూ అదే జోరును కనబరుస్తున్నాడు. తాజాగా విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో జరుగుతున్న ఏసీఏ అంతర్జిల్లాల అండర్–23 పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో సిక్కోలు యువ ఓపెనర్ 125 బంతుల్లో 10 బౌండరీలు, 8 భారీ సిక్సర్లతో 126 పరుగులు సాధించి జిల్లా జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. సుశాంత్కు ఎం.రోహిత్కుమార్ 63 పరుగల అర్ధసెంచరీతో సహకరించడంతో శ్రీకాకుళం జిల్లా జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. జిల్లా ఆటగాళ్లు రాణింపుపై కోచ్లు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
‘గిరిజనులకు అన్యాయం చేయొద్దు’
మెళియాపుట్టి: ఆదివాసీలకు అన్యాయం చేయవద్దని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ఆల్ ఇండియా కన్వీనర్,అరకు మాజీ ఎంపీ మిడియం బాబూరావు అన్నారు. ఆయన గురువారం చాపరలో గిరిజనుల హక్కులు, వారి సమస్యలు, జీఓ నంబర్ 3 గురించి, మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలనే డిమాండ్పై జరుగుతున్న పోరాటాల గురించి నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు. గిరిజన పంటలకు మద్దతు ధర లేదు, గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు లేవు, బెంతొరియాలు గిరిజనులమని చెప్పుకుని ఆదివాసీలను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనుల సమస్యలు చెప్పుకోవాలంటే జిల్లాలో ఐటీడీఏ కూడా లేదని తెలిపారు. తక్షణమే మెళియాపుట్టిలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర రైతుసంఘం కార్యదర్శి మోహన రావు, జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న, జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
● తిరుమల పవిత్రత కాపాడాలి
● బీఆర్ నాయుడిని తొలగించాలి ● 4న జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: తిరుమల పవిత్రతను కాపాడే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయు డును వెంటనే పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. చైర్మన్గా బీఆర్ నాయు డు టీటీడీని అపవిత్రం చేస్తున్నారని మండి పడ్డారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 4న వైఎస్సార్ సీపీ శ్రేణులు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు చేయనున్నారని పేర్కొన్నారు. బీఆర్ నాయుడిని ప్రభుత్వం వెనకేసుకురావడాన్ని నిరసిస్తూ పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
‘వెలుగు వీఓఏలకు వేతనాలు పెంచాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: వెలుగు వీఓఏలకు వేతనాలు పెంచాలని, బకాయిలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, వీఓఏ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.ధనలక్ష్మి, జి.అసిరినాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు డి.జోగారావు కోరారు. వెలుగు వీఓఏలకు కనీస వేతనాలు ఇవ్వాలని, హెచ్ఎర్ పాలసీ అమలు చేయాలని, సీ్త్ర నిధి ఇన్సెటివ్ బకాయిలు చెల్లించాలని, నాణ్యమైన 5జి మొబైల్ ఫోన్లు ఇవ్వా లని కోరారు. మహిళా మార్టుల్లో పెట్టిన పెట్టుబడులు పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలని కోరుతూ డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్కు వినతి పత్రం అందజేశారు. అంతకుముందు డచ్ భవనం వద్ద వీఓఏ ఉద్యోగుల జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడేళ్లుగా వేతనాలు పెంచలేదని, డీఏ అమలు చేయలేదన్నారు. ఆన్లైన్ సరుకులు పంపిస్తామని డబ్బులు కట్టించుకొని సరుకులు ఇవ్వలేదని, డబ్బులు తిరిగి చెల్లించలేదని అన్నారు. వీఓఏల సమస్యలపై ఏప్రిల్ 13 వ తేదీన మండల కేంద్రాల్లో ధర్నాలు, 27, 28 తేదీల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని యూనియన్ కమిటీ నిర్ణయించిందని తెలియజేసారు. -
‘భూ సేకరణ వద్దు’
మందస: మందస మండలం రాంపురం పంచాయతీ పరిధిలో గల తెలగ గంగువాడ గ్రా మానికి చెందిన భూ బాధిత రైతులు, గ్రామ ప్రజలు కార్గో ఎయిర్పోర్టుకు తమ వ్యతిరేకత తెలిపారు. మందస ఎమ్మార్వో కార్యాలయంలో, పలాస ఆర్డీఓ కార్యాలయంలో, సచివాలయాలకు వెళ్లి తమ అభ్యంతరాలు తెలియజేస్తూ మెమొరాండంలు సమర్పించారు. భూ సేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో చిత్త కూర్మారావు, చిత్త గున్నయ్య, యలమల కృష్ణారావు, చిత్త చంద్రశేఖర్, దాసరి మోహన్రావు, చిత్త సంతోష్, జోగి మోహన్రావు, ఆనంద్, హేమరాజు, నారాయణ, రాకెట్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. బిల్లు ఆమోదంపై హర్షం శ్రీకాకుళం పాతబస్టాండ్: అమరావతి చట్టబద్ధతపై పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కేక్ కటింగ్ నిర్వహించారు. కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులోని ఉభయ సభల్లో ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026’ ఏకగ్రీవంగా ఆమోదం పొందటంపై వారు హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలకు బడ్జెట్ కేటాయింపు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు రూ.2642 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. 2026–27 బడ్జెట్ ఔట్ రీచ్పై ఎమ్మెల్యేలు గౌతు శిరీష, గొండు శంకర్లతో కలెక్టరేట్ స మావేశ మందిరంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంక్షేమ పథకాలపై వివరిస్తూ జిల్లాకు రూ.2642 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు వివరించా రు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన బడ్జెట్ అన్ని వర్గాలకు చేరేలా ఉండాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఏడు పథకాలకు కేటాయింపులు చేశామన్నారు. జిల్లా అభివృద్ధి బడ్జెట్ను పలు శాఖలకు కేటాయించామన్నారు. ‘మహిళా టీచర్ల సమస్యలపై వినతి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: మహిళా టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం యూటీఎఫ్ ఆద్వర్యంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కి వినతి పత్రాలు అందజేశారు. యూటీఎఫ్ మహిళా విభాగం జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.తవిటమ్మ, జిల్లా కార్యదర్శులు జి.శారద, సూర స్వర్ణకుమారి, జిల్లా నాయకు లు సీహెచ్ సుబ్బలక్ష్మి, వెంకటేశ్వరి, జహీన రాణి తదితరులు వినతి అందజేసిన వారిలో ఉన్నారు. కనీస సదుపాయాలు కల్పించాలని, భద్రతా సమస్యలు పరిష్కరించాలని కోరారు. మహిళా టీచర్లకు ప్రత్యేక స్టాఫ్ రూమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పలు దుకాణాల్లో చోరీ యత్నం టెక్కలి రూరల్: టెక్కలిలో బుధవారం రాత్రి పలు దుకాణాల్లో చోరీ జరిగినట్లు షాపు యజమానులు గురువారం గుర్తించారు. ఆ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. తెంబూర్ రోడ్డులో గల ఓ మెడికల్ షాపులో చోరీ జరిగినట్లు షాపు యజమాని గుర్తించాడు. షాపు షట్టర్ తాళాలు బద్దలు గొట్టి షాపులోకి చొరబడి షాపులోని కొంత నగదుని దొంగిలించినట్లు పోలీసులకు తెలిపారు. అలానే ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ఒక ఒక చెప్పుల షాపు లో సైతం దొంగతనానికి ప్రయత్నించారని, అయితే ఆ షాపులో ఎలాంటి వస్తువులు గానీ డబ్బులు గానీ చోరీకి గురికాలేదని తెలిపారు. అయితే ఇదే విషయమై పోలీసులకు బాధితులు సమాచారం ఇచ్చారు. -
యమకంకరులు
పలాసలో వివిధ ప్రాంతాల్లో అర్ధరాత్రి అక్రమ కంకర తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కాశీబుగ్గ రైల్వే ఫ్లై ఓవరు పేరు చెప్పి కొంతమంది గ్రావెల్ మాఫియా సభ్యులు ఈ కంకరను తవ్వి రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి అక్కడి యథేచ్ఛగా అమ్మకాలు చేపడుతున్నారు. ఈ తవ్వకాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా అధికారుల చర్యలు మాత్రం తూతూమంత్రంగా ఉంటున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా తర్లాకోట, కొత్తూరు, కోసంగిపురం, రాజగోపాలపురం, కంబిరిగాం గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా ఈ తవ్వకాలు చేపడుతున్నారు. ఇక్కడి కంకరను కాశీబుగ్గలోని సెగిడి వీధిలో డంపు చేసి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు అమ్మకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీంతో కొండలు, చిన్న చిన్న మెట్టలు కనుమరుగవుతున్నాయి. పర్యావరణానికి పెనుముప్పుగా తయారవుతున్నాయి. కొండలను పిండి చేయడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఉన్న వన్యప్రాణులు సైతం జనారణ్యాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల ఓ జింక శాసనాం జాతీయ రహదారి వద్ద మృతి చెందిన విషయం తెలిసిందే. ఉద్దానం ప్రాంతంలో ఎలుగు బంట్లు సైతం గ్రామాల సమీపంలోకి వచ్చేస్తున్నాయి. వాటికి ఆవాసాలుగా ఉన్న బెండి, పెద్ద కొండ, రట్టికొండలు సైతం గ్రావెల్ తవ్వకాలతో బోసిపోతున్నాయి. ఇప్పటి వరకు పలాసలో గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని జిల్లా మైనింగ్ అధికారులు చెబుతున్నా ఈ తవ్వకాలు మాత్రం ఇష్టానుసారంగా జరుగుతున్నాయి. -
నో స్టాక్
పొందూరులో నో స్టాక్ బోర్డుఎన్నాళ్లో మాకీ కష్టాలు... గ్యాస్ బుక్ చేసి 20 రోజులు పైనే అయింది. ఇప్పటి వరకు రాలేదు. అందుకే వచ్చాను. ఏమిటో మాకీ కష్టాలు. ఇక్కడికి వస్తే సమాధానం చెప్పే వారే కరువయ్యారు. ఎన్నాళ్లో ఈ పరిస్థితి. ఆటోలు మీద ఖాళీ బండలు పట్టుకుని వస్తున్నాం. – మెట్ట శాంతమ్మ, నో స్టాక్ అంటున్నారు.. ఎప్పుడొచ్చినా కారణాలు చెబుతూనే ఉన్నారు. పనులు మానుకుని వస్తున్నాం. రోజంతా గ్యాస్ ఆఫీస్ వద్ద పడిగాపులు కాస్తున్నా ఫలితం ఉండడం లేదు. నో స్టాక్ బోర్డులు వెక్కిరిస్తున్నాయి. ఇంటిదగ్గర నుంచి గ్యాస్ బండ పట్టుకుని ఆటోలో 120 రూపాయలు ఖర్చు పెట్టి వస్తున్నాం. వస్తున్న గ్యాస్ ఎటో వెళుతుందో తెలియడం లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకుని మా గ్యాస్ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన ఓ వినియోగదారుడి ఆవేదన ఇది. పల్లెల్లో గ్యాస్ కష్టాల తీవ్రతకు నిదర్శనమీ చిత్రం. బుక్ చేసినా ఇవ్వడం లేదని పొందూరు ఇండేన్ గ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లు తెచ్చి వరుసగా పెట్టారు. ఓటీపీ వచ్చిన 15 రోజుల వరకు సిలిండర్ రాకపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల ఒత్తిడి, సిలిండర్ల సరఫరా లేకపోవడమో గానీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కూడా నోస్టాక్ బోర్డు పెట్టేశారు. దీంతో వినియోగదారులు వాదనకు దిగుతున్నారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో గ్యాస్ కొరత తీవ్రమవుతోంది. ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు గృహ వినియోగదారులకు కూడా గ్యాస్ దొరకడం లేదు. ఫోన్ ద్వారా బుక్ చేద్దామంటే కావడం లేదు. ఆన్లైన్లో ప్రయత్నించినా జరగడం లేదు. జరిగినా 15 నుంచి 20 రోజులైతే గానీ బండ ఇంటికి రావడం లేదు. గ్యాస్ ఏజెన్సీల నుంచి నో రెస్పాన్స్ వస్తోంది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం సిలిండర్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ కష్టాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వాణిజ్య సిలిండర్ల సరఫరాను ఆయా కంపెనీలు నిలిపివేయడంతో హోటల్స్ నిర్వాహకులు అష్టకష్టాలు పడుతున్నారు. గ్యాస్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొందరు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ నిర్వహణ సాగిస్తున్నారు. మరికొందరు పాత పద్ధతిలో ఊక పొయ్యిలను వినియోగిస్తున్నారు. కట్టెలు, ఊక సక్రమంగా దొరకని చోట ఏకంగా హోటల్స్ మూసేస్తున్నారు. పలుకుబడి ఉన్న హోటల్స్ యజమానులకు మాత్రం గుట్టుగా సిలిండర్లు వచ్చేస్తున్నాయి. అవి కమర్షియల్ సిలిండర్లా? డొమెస్టిక్ సిలిండర్లా? తెలీదు గానీ వారికి మాత్రం గ్యాస్ సమస్య అంతగా ఉండటం లేదు. తోపుడు బళ్లు, చిన్న హోటల్స్ మాత్రం మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 5వేలకు పైగా హోటళ్లు ఉన్నాయి. వీటిలో సింగిల్ డిజిట్లో తప్ప మిగతా హోటల్స్ అన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. జేసీ మీటింగ్కు డీలర్లు డుమ్మా.. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సంబంధించిన గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో జాయింట్ కలెక్టర్ సమావేశమయ్యారు. ఐదు ఏజెన్సీలకు గాను రెండు ఏజెన్సీలకు సంబంధించిన డీలర్లు మాత్రమే హాజరయ్యారు. మిగతా మూడు గ్యాస్ ఏజెన్సీల డీలర్లు రాకుండా వారికి సంబంధించిన సిబ్బందిని పంపించారు. చెప్పాలంటే జేసీ ఆదేశాలను లెక్క చేయనట్టు స్పష్టమైంది. జేసీ సమీక్ష చేసినప్పటికీ వారి దగ్గర సరైన సమాధానాలు రాలేదని తెలిసింది. ఒక భారత గ్యాస్ ఏజెన్సీ, మరో హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులపై జేసీ సీరియస్ అయినట్టు తెలిసింది. పంపిణీ సక్రమంగా చేయాలని? లేదంటే చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించినట్టు తెలిసింది. ఇకపై గ్యాస్ ఏజెన్సీలు విక్రయించే ప్రతి కమర్షియల్ సిలిండర్కు సంబంధించి రశీదు చూపించాలని, ఎవరికి విక్రయిస్తున్నారో పౌరసరఫరాల శాఖకు తెలియ జేయాలని, ఒక పర్యవేక్షక అధికారిని కూడా నియమిస్తున్నట్టు గురువారం జరిగిన సమీక్షలో స్పష్టం చేసినట్టు సమాచారం. మొత్తానికి అటు డొమెస్టిక్, ఇటు కమర్షియల్ సిలిండర్ల పంపిణీ ఒక మిస్టరీగా మారిపోయింది. కొరతను అవకాశంగా తీసుకుని కొన్ని ఏజెన్సీలు బ్లాక్లో సిలిండర్లను విక్రయిస్తున్నాయి. వాస్తవ ధరకు రెట్టింపు వేసి విక్రయిస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కమర్షియల్ సిలిండర్లు అయితే రూ. 3,500 వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. డొమెస్టిక్ సిలిండర్లను కూడా ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఎక్కడికక్కడ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. బుక్ చేసిన 15రోజుల వరకు గ్యాస్ రాకపోవడంతో.. రద్దీని ఆసరాగా తీసుకుని తమ వద్ద సిలిండర్లను ఎక్కువ ధరకు విక్రయించి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. తీవ్రమవుతున్న గ్యాస్ కొరత ఎక్కడికక్కడ నో స్టాక్ బోర్డులు గగ్గోలు పెడుతున్న వినియోగదారులు కమర్షియల్ గ్యాస్ కొరతతో మూతపడుతున్న హోటల్స్ బుక్ చేసి 15 రోజులు దాటినా రాని డొమెస్టిక్ గ్యాస్ -
ఎత్తిపోతల పనుల పరిశీలన
హిరమండలం: వంశధార కుడి కాలువపై జరుగుతున్న ఎత్తిపోతల పథకం పనులను ట్రైనింగ్ కలెక్టర్ పృథ్వీరాజ్, టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి గురువారం పరిశీలించారు. పనులు వేగవంతం కావాలని, సంబంధిత అధికారులకు సూచించారు. త్వరలో విద్యుత్ పనులు త్వరితగతిన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు. మెగా ఉద్దానం తాగునీటి పైపు వద్ద అడ్డంగా ఉన్న పనులు జాగ్రత్తగా ఇరు శాఖల అధికారుల సమన్వయంతో పూర్తి చేసుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ పనులు వంశధార కట్టడం విభాగం ఈఈ బి.రవీంద్ర బాబు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ ఆశలతకు పలు సూచనలు ఇచ్చారు. వంశధార రిజర్వాయర్ గట్టు పనులకు, మున్ముందు జరుగుతున్న అభివృద్ధి పనులకు అడ్డంకులపై ఆరా తీశారు. వేసవి దుక్కులే కీలకం ● సస్యరక్షణతోనే అధిక దిగుబడులు ● వ్యవసాయాధికారి సంధ్య హిరమండలం: వ్యవసాయంలో రైతులు సస్యరక్షణ చర్యలు పాటించినప్పుడే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు. విచక్షణారహితంగా పురుగుమందులు వాడితే ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. వేసవి దుక్కులతో రైతులకు అనేక ప్రయోజనాలు ఉంటాయని మండల వ్యవసాయాధికారి బి.సంధ్య చెబుతున్నారు. పంట అవశేషాలు తొలగింపు గత పంట తాలుకా అవశేషాలను పూర్తిగా తొలగిస్తే పురుగుల కొశస్థ దశలను నాశనం చేసిన తర్వాత సాగుచేసే పంటలకు పురుగులు ఆశించకుండా చేయవచ్చు. ముఖ్యంగా వరి పంటలో ప్రధానమైన కాండం తొలిచే పురుగు నియంత్రించవచ్చు. ముందే దున్నాలి వర్షాకాలం రాక ముందు భూమి మూడు దుక్కులు దున్నాలి. ఇలా చేస్తే తొలకరి వర్షాలకు నేల మెత్తబడి భూమిలోకి నీళ్లు ఇంకుతాయి. దుక్కులు లోతుగా అడ్డంగా, వాలుగా దున్నుకుంటే వర్షపు నీరు భూమిలోకి ఇంకి తేమను నిల్వ చేసే సామర్థ్యం పెరుగుతుంది. దుక్కి దున్ని భూమిని ఎండబెడితే కలుపు మొక్కలు నివారించవచ్చు. దుక్కులు దున్నే ముందు భూమిలో పశువుల పేడ, కంపోస్టు ఎరువులు చెరువు మట్టిని వేయాలి. వేసవిలో దుక్కి దున్నితే భూమి గుల్లగా మారుతుంది. దీంతో భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరగడమే కాకుండా తేమలో జీవించే సూక్ష్మజీవులు వానపాములు సంతతి వృద్ధి చెందుతుంది. -
పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్
పలాస: పలాస ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ‘ఎ’ గ్రేడ్ గుర్తింపు లభించింది. ఈ కళాశాలలో గురువారం అకడమిక్ ఆడిట్ నిర్వహించారు. అకడమిక్ అడ్వైజర్గా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ విభాగం లెక్చరర్ ఎం.శాంతి, రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇంగ్లిష్ లెక్చరర్ డాక్టరు బి.వేణుగోపాలరావులు సందర్శించి బోధన విధానాలు, విద్యా ప్రమాణాలు, అకడమిక్ పనితీరును నిశితంగా పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.వెంకటలక్ష్మి, ఐక్యూఏసీ కోఆర్డినేటరు పి.వెంకటరమణ వీరికి సహకరించారు. ఈ సందర్భంగా అకడమిక్ అడ్వైజర్ శాంతి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలు, నిర్వహణ విధానాలు ఉన్నతంగా ఉన్నాయని ప్రశంసించారు. అధ్యాపకులను, అధ్యాపకేతర సిబ్బందిని అభినందించారు. ప్రభుత్వ కళాశాలకు ‘ఎ’ గుర్తింపును ప్రధానం చేశారు. -
పోర్టు పరిశీలన అనుమతుల పత్రం బహిర్గతం చేయండి
● పోర్టు ఏజెన్సీ నిర్వాహకులతో అచ్చెన్న రూ.40 కోట్ల ఇంటిని కట్టించుకుంటున్నారు ● వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ టెక్కలి: మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతులు ఇచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారని, దమ్ముంటే అనుమతి పత్రాలను బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ సవాల్ చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై గురువారం టెక్కలిలో మీడియా సమావేశం నిర్వహించి మండిపడ్డారు. పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి సంబంధించి మార్చి 17న ఎస్పీకి దరఖాస్తు చేసుకోగా 29వ తేదీ సాయంత్రం ఆంక్షలతో సభకు మాత్రమే అనుమతులు ఇచ్చారని తిలక్ గుర్తు చేశారు. పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంలో భాగంగా అన్ని రకా ల మీడియాల ద్వారా వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రుల బండారం బయటపడిందన్నారు. పోర్టు పనుల విషయంలో 2024 ఎన్నికల నాటికి ఆయా ఏజెన్సీకి ఇచ్చిన బిల్లులను బహిర్గతం చేస్తే ఎంత మేరకు పనులు జరిగాయో పురోగతి అందరికీ తెలుస్తుందని తిలక్ అన్నారు. చంద్రబాబు హయాంలో భావనపాడు పోర్టు పనులు ప్రారంభించామని చెబుతున్నారని, అయితే దానికి సంబంధించిన అనుమతులు బహిర్గతం చేయాలని తిలక్ డిమాండ్ చేశారు. పోర్టు పనులు పూర్తి చేయకుండా ఆయా ఏజెన్సీని బెదిరించి విశాఖపట్టణంలో అచ్చెన్నాయుడు రూ.40 కోట్ల ఇల్లు కట్టించుకుంటున్నారని తిలక్ ఆరోపించారు. పోర్టు పూర్తి చేయడానికి గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల భూసేకరణలు, అనుమతులతో పనులు ప్రారంభించారని ఇప్పుడు అర్ధంతరంగా 36 వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏముందని తిలక్ ప్రశ్నించారు. కేవలం భూములను దోపిడీ చేయడానికే ల్యాండ్ పూలింగ్కు తెర తీస్తున్నారని స్పష్టం చేశారు. ఇకనైనా అచ్చెన్నాయుడు నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సత్తారు సత్యం, కె.జీవన్, ఎస్.వినోద్, బి.రాజేష్ తదితరులు ఉన్నారు. -
ఇసుకాసురులు..
● అక్రమ తవ్వకాలతో బరితెగింపు ● చోద్యం చూస్తున్న అధికారులు కొత్తూరు/పలాస: ఇసుకాసురులు బరి తెగించారు. ఉచిత ఇసుక విధానం పేరిట దోపిడీకి తెరతీశారు. టీడీపీ నేతల అండదండలతో అందినంత దోచుకుంటున్నారు. ఇసుక ర్యాంపును పర్యవేక్షించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటంతో వీరికి అడ్డూఅదుపూ లేకుండాపోతోంది. కొత్తూరు మండలంలోని బంకి (పొనుటూరు), వసప గ్రామాల వద్ద వంశధార నదిలో సిల్ట్ తొలగింపు కోసం ప్రభుత్వం గతంలో అనుమతులు ఇచ్చింది. నిబంధనల ప్రకారం మనుషులతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్లకు లోడ్ చేయాలి. అక్కడి నుంచి ర్యాంపు మీపంలో ఏర్పాటు చేసిన ఇసుక స్టాక్ పాయింట్లో అన్లోడ్ చేయాలి. అనంతరం గ్రామ సచివాలయం వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఇసుక విక్రయించాలి. తవ్వ కాలు సైతం మూడు అడుగుల లోతు దాట కూడదు. అయితే ఈ నిబంధనలేవీ ఇక్కడ అమలుకావడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కాకుండా అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. నదిలో ఇసుక తవ్వకాలు ఆరు అడుగుల కంటే ఎక్కవ తవ్వకాలు చేయడంతో ఎక్కడికక్కడ గోతులు ఏర్పడి చెరువులను తలపిస్తున్నాయి. ఏకంగా నదిలోనే రోడ్లు ఏర్పాటు చేసుకొని అక్రమంగా ఇసుక తరలించుకుపోతున్నారు. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పొనుటూరుకు ఆనుకొని ఉన్న ఒడిశా రాష్ట్రానికి యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. అస్తవ్యస్త తవ్వకాలతో భూగర్భజలాలు ఇంకిపోయే ప్రమాదం ఉందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తవ్వకాలు అరికట్టాలని కోరుతున్నారు. ఈ విషయమై తహశీల్దార్ వై.జోగారావు వద్ద ప్రస్తావించగా ఇసుక తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అయితే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసినట్లు ఫిర్యాదు వస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
మందస: ఆంధ్రా ఒడిశా సరిహద్దు సమీపంలోని కుల్లాడియా గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మందస మండలం చీపి గ్రామానికి చెందిన సవర ప్రదీప్ మృతి చెందారు. ఈ గ్రామానికి చెందిన సవర సూర్యనారాయణ, సవర ప్రదీప్లు ఒడిశాలోని జరడ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండంగా కుల్లాడియా గ్రామం వద్ద ఓ అడవి పంది హటాత్తుగా రావడంతో దాన్ని ఢీకొట్టారు. దీంతో బండిపై ఉన్న వీరిద్దరూ అదుపు తప్పి కింద పడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా ఆ వాహనంపై క్షతగాత్రులను హరిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం తీసుకెళ్లారు. గురువారం ఉదయం 9 గంటలకు సవర ప్రదీప్ మరణించారు. స్థానిక ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘వ్యక్తిగత దూషణలు సరికాదు’
ఆమదాలవలస: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తల పొగరుతో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, వాటిని తగ్గించుకుంటే మంచిదని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలో పార్టీ కార్యాలయంలో గురువా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కూన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అదే రోజు ఆమదాలవలసలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సర్పంచ్ల అభినందన సభకు హాజరైన జనాలను చూసి మతిభ్రమించి మాట్లాడారని అన్నారు. ప్రతి సమావేశంలోనూ చింతాడ రవికి ఉన్న స్థాయి ఏంటి అనే మాట్లాడుతున్నారని, కానీ ఎమ్మెల్యే తన స్థాయి మరిచి మాట్లాడడం సరికాదన్నారు. సొంత గ్రామం పొందూరు మండలం పెనుపర్తి గ్రామంలోనే కూన రవికుమార్ ఎంపీటీసీగా, సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయారని గుర్తు చేశారు. నీరు–చెట్టు పనుల డబ్బులు సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎన్నో భూ ఆక్రమణల ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలే తన బలమని స్పష్టం చేశారు. మేనమామ లేకుంటే ఆయన పరిస్థితి ఏమిటో కూన రవి ఆలోచించుకోవాలన్నారు. ఓటుకు రూ. 5000 ఇచ్చి ప్రజలను కొంటానని చెబుతున్న రవి అక్రమార్జన ఎంత ఉందో తెలుస్తోందన్నారు. వైఎస్ జగన్ ఐదేళ్లలో జిల్లాకు అనేక ప్రాజెక్టులు తీసుకువచ్చారని, టీడీపీ 17 ఏళ్లలో ఏం చేసిందో చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రవికుమార్, సరుబుజ్జలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షులు బెవర మల్లేశ్వరరావు, ఆమదాలవలస పట్టణ పార్టీ అధ్యక్షులు పొడుగు శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, పార్టీ ముఖ్య నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ ఇవ్వండి మహాప్రభో..
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్యాస్ కొరత సమయంలో హోటల్స్ను మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, తమకు కమర్షియల్ గ్యాస్ ఇవ్వాలని జిల్లా హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కమర్షియల్ సిలిండర్లు బ్లాక్లో ఒడిశా వెళ్లిపోతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కొందరు డీలర్లు అక్రమంగా కమర్షియల్ సిలిండర్లు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఇచ్ఛాపురంలో ఇండియన్ గ్యాస్ డీలర్లు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ నిర్వహణ భారంగా మారిందన్నారు. -
సిలింఢర్
శ్రీకాకుళం అమాతం పెరిగిన కమర్షియల్ గ్యాస్ బండ ధర ● అయినా బ్లాక్లోనే దందా.. ● గృహావసరాల గ్యాస్ కోసం జనం తిప్పలు ● బుక్ చేసినా 20 రోజుల పైమాటే.. ● గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న జనం లావేరు మండలం ఇజ్జాడపాలెం కిడ్నీ వ్యాధి మరణాలతో వణుకుతోంది. పదిమందికి పైగా మరణాలు సంభవించాయి. –8లోగురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026భానుడి భగభగలు ఓ వైపు.. ఆరుబయట కట్టెల పొయ్యి అగ్గిసెగలు మరోవైపు హోటల్ కార్మికులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా నగరంలో చాలా హోటళ్లు మూతపడిన సంగతి విదితమే. కొన్ని హోటళ్లు మాత్రమే కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తున్నాయి. వేసవి కావడం.. మధ్యాహ్నం వేళ వంటలు చేసే పరిస్థితి ఉండడంతో కార్మికులు మండుటెండలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరత కారణంగా తమ కష్టం పెరిగిందని.. దినసరి కూలీలో ఏమాత్రం మార్పు లేదని వాపోతున్నారు. ఇలా ఎక్కువ రోజులు అగ్గి వద్ద పని చేయలేమని చెబుతున్నారు. వారి కష్టాలకు నిదర్శనమైన ఈ చిత్రాలు శ్రీకాకుళం నగరంలోని ఓ మెస్ వద్ద కనిపించాయి. – శ్రీకాకుళం (పీఎన్కాలనీ) శ్రీకాకుళం: జిల్లాలో నానాటికీ గ్యాస్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. అధికారు లు ఇబ్బంది లేదని చెబుతున్నా వ్యాపారులు, గృహ వినియోగదారులు తీవ్రంగానే ఇక్కట్లకు గురవుతున్నారు. బుకింగ్ చేసిన 20రోజుల వరకు గ్యాస్ రాకపోవడంతో చేసే ది లేక ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలండర్ అమాంతంగా పెరిగినా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి నెలకొంది. గృహ, వాణిజ్య అవసరాలకు కట్టెల పొయ్యిలే ప్రత్యామ్నాయంగా మారాయి. జిల్లాలో కమర్షియల్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రూ.214లు పెంచారు. గతంలో 19 కేజీల సిలిండర్ ధర రూ.1,970లు ఉండగా.. ప్రస్తుతం రూ.2,184.50లకు చేరుకుంది. పెరిగిన ధరను చమురు సంస్థలు మంగళవారం రాత్రి ప్రకటించి, బుధవారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు. అయినప్పటికీ మార్కెట్లో రూ.3500 దాటి బ్లాక్లో విక్రయిస్తున్నారు. రాజాం, సంతకవిటి, టెక్కలి, శ్రీకాకుళంలో ఉన్న పలు ప్రైవేట్ కంపెనీల ఏజెన్సీలు పెద్ద ఎత్తున ఈ దందాకు పాల్పడతున్నాయి. గృహ వినియోగదారుల గ్యాస్ నిర్దేశిత వ్యవధిలో సరఫరా కావడం లేదు. బుక్ చేసిన తరువాత 15 నుంచి 20 రోజుల సమయం పడుతోంది. దీంతో పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు గ్యాస్ కోసం బారులు తీరుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. దీంతో గృహ వినియోగ దారులు ప్రత్యామ్నాయ పరిస్థితుల వైపు మొగ్గు చూపుతున్నారు. కట్టెలపొయ్యులు, బొగ్గుల పొయ్యలతో పాటు ఇండక్షన్ పొయ్యలను ఆశ్రయిస్తున్నారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ
కవిటి: మండలంలోని మాణిక్యపురం పీహెచ్సీలో ప్రభుత్వం అందించిన నిధుల వినియోగం తదితర అంశాలపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు మేరకు బుధవారం విచారణ చేపట్టారు. జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డా.ఆర్.రాందాస్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డా.కె.మేరీ క్యాథరిన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆర్.రాంబాబుల నేతృత్వంలో విచారణ జరిపారు. దీనిలో భాగంగా కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. నిధుల వినియోగానికి సంబంధించి బాధ్యులుగా ఉన్న సంబంధిత అధికారుల నుంచి వివరాలను రాబట్టి ఉన్నతాధికారులకు నివేదించనున్నామని తెలిపారు. విచారణలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కార్మికవర్గాన్ని యజమానులకు బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, లేకుంటే ఐక్య పోరాటాలు తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి క్రాంతి, ఎస్.కృష్ణవేణిలు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలుకు నిరసనగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని కోరుతూ ఆల్ ట్రేడ్ యూనియన్, ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కార్మిక వర్గం ప్రాణ త్యాగాలతో సాధించుకున్న కార్మిక చట్టాలను, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కడం దారుణమన్నారు. కార్మిక మంత్రిత్వశాఖ ఇక నుంచి యాజమాన్యాల మంత్రిత్వ శాఖగా మారబోతున్నదని, యాజమాన్యాల శ్రమ దోపిడీకి రహదారులను మోడీ ప్రభుత్వమే సిద్ధం చేస్తోందని విమర్శించారు. ఇటువంటి చర్యలు వీడకుంటే పోరాటాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిల పక్ష కార్మిక సంఘాల నాయకులు ఎన్వీ రమణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎం.గోవర్ధనరావు తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సైనికుల సంక్షేమమే ‘వీర్ పరివార్’ లక్ష్యం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మాజీ సైనికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ‘నల్సా వీర్ పరివార్ సహాయత యోజన–2025’ పథకం పనిచేస్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు తెలిపారు. బుధవారం ఆయన స్థానిక సైనిక్ బోర్డును సందర్శించి అక్కడి పరిస్థితులపై చర్చించారు. దేశ సేవలో తరించిన మాజీ సైనికులు తమ న్యాయపరమైన చిక్కులను వదిలించుకునేందుకు ఈ పథకం ఒక చక్కని వేదిక అని ఆయన పేర్కొన్నారు. సైనిక సంక్షేమ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లీగల్ సర్వీస్ క్లినిక్ ద్వారా ప్యానెల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని వివరించారు. మాజీ సైనికులు తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడానికి ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఎ.శైలజ, ప్యానెల్ అడ్వకేట్ వి.జ్యోతిర్మయి, ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు. -
హైమావతిపై విచారణకు కమిటీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలి ఏవో హైమావతిపై విచారణకు ముగ్గురు అధికారుల కమిటీని కలెక్టర్ నియమించారు. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె రెవెన్యూ ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, మానసిక అందోళనలను ఉన్నతాధికారులకు నివేదించడంపై ఈ కమిటీని నియమించారు. కమిటీలో ఎస్డీసీ పద్మావతి, శ్రీకాకుళం ఆర్డీవో సాయిప్రత్యూష, బీసీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మలు ఉన్నారు. కాగా విచారణ కమిటీ నియామకంపై రెవెన్యూ వర్గాల్లో చర్చ మొదలైయింది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాట్లాడడం తప్పుబట్టి విచారణ చేపట్టడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 10 నుంచి నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: ఈనెల 10వ తేదీ నుంచి బాపూజీ కళామందిర్లో శ్రీముత్యాలమ్మ కళానికేతన్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల 4వ ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనునట్లు ఆ సంస్థ అధ్యక్షురాలు కేతిరెడ్డి రాజేశ్వరి తెలిపారు. ఈ మేరకు బ్రోచర్ను బుధవారం విడుదల చేశారు. రోజుకు రెండు నాటికల ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. ఈ నెల 12న ముగింపు సభ, బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె.శ్యామ్ కుమార్, పొగిరి సత్యం, రమేష్, ప్రసాద్దు, కీర్తి, కుమారి, సంతోషి, స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోండి టెక్కలి: చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్ను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు సూచించారు. బుధవారం కోటబొమ్మాళిలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత విద్యుత్పై మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కె.హరివరప్రసాద్, నాయకులు బి.గోవిందరాజులు, బి.రమేష్, వి.విజయలక్ష్మి, ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కోరలు చాచిన కిడ్నీవ్యాధి..!
ఇజ్జాడపాలెంలో మరణ మృదంగం● ఇప్పటికే 10 మందికి పైగా మృతి ● అంతుపట్టని కారణాలు ● నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్న గ్రామస్తులు రణస్థలం: ఆహ్లాదకరమైన వాతావరణం.. చుట్టూ పచ్చని పైరు.. కొబ్బరి చెట్ల మధ్యలో అందమైన గ్రామం లావేరు మండలంలోని ఇజ్జాడపాలెం. అయితే అటువంటి గ్రామానికి పదేళ్లుగా కిడ్నీ మహమ్మారి పట్టిపీడిస్తోంది. సుమారు 1,200 మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో గత పదేళ్లలో 10 మందికి పైగా కిడ్నీ వ్యాధితో చనిపోవడంతో గ్రామస్తుల్లో భయందోళనలు నెలకొన్నాయి. ఈ మహమ్మారి ఇజ్జాడపాలెంతో పాటు చుట్టుపక్కల గోవిందపురం, లుకలాపుపేట తదితర గ్రామాలకు ఇప్పుడిప్పుడే వ్యాపించడంతో అక్కడ సైతం కేసులు బయటపడుతున్నాయి. ఇంత దారుణమైన పరిస్థితికి తాగునీరే కారణమా.. లేక మరే ఇతర అవశేషాలు ఉన్నాయో గ్రామస్తులకు అంతుబట్టడం లేదు. ఇటీవల గ్రామంలోని వాటర్ శాంపిల్స్ను వైద్యాధికారులు తీసుకొని వెళ్లారు. అయితే ఆ నమూనాలో ఎటువంటి ఫలితం కనిపించలేదు. అందువలన అధికారులు చొరవ తీసుకొని కారణాలను విశ్లేషించాలని స్థానికులు కోరుతున్నారు. మోగుతున్న ప్రమాద ఘంటికలు ఇజ్జాడపాలెం గ్రామంలో గత పదేళ్లలో పదిమంది కిడ్నీ మహమ్మారికి బలైపోయారు. వారిలో ఇజ్జాడ అప్పలనాయుడు (మాజీ సర్పంచ్), ఇజ్జాడ సూర్యనారాయణ, పిసిని అప్పలనాయుడు, పతివాడ రమణ, కందివలస అప్పారావు, కందివలస కాంతమ్మ, గొర్లె లక్ష్మి, గొర్లె త్రినాథ్, వండాన ఆదినారాయణ తదితరులు ఉన్నారు. కాగా మరో ఐదుగురు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. తాజాగా మంగళవారం గొర్లె త్రినాథ్ (48) మృతి చెందాడు. దీంతో ఈ గ్రామంలో నివాసం ఉండాలంటేనే ప్రజలు బయపడిపోతున్నారు. తీరని వెతలు ఇజ్జాడపాలెంలో కుటుంబాలన్నీ వ్యవసాయంపై అధారపడినవే. కిడ్నీవ్యాధి బారిన పడుతున్న ఆయా కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. కిడ్నీ వ్యాధి సోకినప్పటి నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వంటి ఆస్పత్రులకు తిరుగుతూ లక్షల్లో ఖర్చులు పెడుతున్నా ఫలితం కనిపించడం లేదు. డయాలసిస్ పేరుతో నిత్యం వేలల్లో ఖర్చులు పెడుతూ నెలల తరబడి ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుండడంతో కొందరు ఇంటి వద్దనే మంచం పట్టి కాలం వెళ్లదీస్తున్నారు. కాగా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కిడ్నీవ్యాధికి గురయ్యారు. ప్రస్తుతం కుటుంబంలో గొర్లె బంగరాప్పడు కిడ్నీవ్యాధితో బాధపడుతున్నాడు. కాగా తన కుమారుడు గొర్లె త్రినాథ్, భార్య లక్ష్మి ఇదే మహమ్మారికి బలైపోవడంతో కుటుంబం కకావికలం అయ్యింది. సమగ్ర పరిశీలన చేపట్టాలి మా గ్రామంలో గత పదేళ్లుగా కిడ్నీ వ్యాధితో పదిమందికి పైగా చనిపోయారు. ఇంకా మరో ఐదుగురు కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నారు. తాగునీటి వలనే కిడ్నీ వ్యాధి వస్తుందా.. లేక మరే ఇతర కారణం ఉందా అనే అంశంపై ఆధికారులు సమగ్ర పరిశీలన చేపట్టాలి. – ఇజ్జాడ అప్పలనాయుడు, గ్రామ నాయకుడు ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలి మా ఇజ్జాడపాలెం గ్రామంలో తాగునీటి సమస్య వల నే కిడ్నీ వ్యాధి వస్తోందని అనుకుంటున్నాం. ఇప్ప టికైనా అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలి. అలాగైనా కిడ్నీ వ్యాది వ్యాప్తి చెందకుండా ఆగే అవకాశం ఉంటుంది. – ఇజ్జాడ రాము, గోవిందపురం, ఎంపీటీసీ -
తిమడాంలో టీడీపీ నాయకుడి బరితెగింపు
జలుమూరు: మండలంలోని తిమడాం పంచాయతీలో ఒక టీడీపీ నాయకుడు ప్రభుత్వ చెరువు(దుబ్బోడో) సర్వే నంబర్ 85లో ఇంటి నిర్మాణంతోపాటు గట్టును మట్టితో కప్పి ఆక్రమణలకు పాల్పడుతున్నాడు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. కాగా ఈ చెరువు గట్టు మీద చాలా వరకూ ఆక్రమణలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఒక ఇంటి స్థలం సుమారు రూ.5 లక్షలు వరకూ పలకుతుండడంతో ఆక్రమణలుదారులు యథేచ్ఛగా గట్టును మట్టితో కప్పుతున్నారు. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు వద్ద ప్రస్తావించగా.. సిబ్బందిని పంపి ఆక్రమణలు తొలగించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆర్టీసీ కండక్టర్పై దాడి
టెక్కలి రూరల్: ఆర్టీసీ బస్సులో రద్దీ కారణంగా పాసింజర్లు ఎక్కువ మంది ఉండడంతో లోపలికి వెళ్లమన్నందుకు బస్సు కండక్టర్ నాసపు పాపారావుపై ఒక పాసింజర్ దాడి చేసిన ఘటన కోటబొమ్మాళి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. బస్సులోని ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు.. పలాస డిపోకు చెందిన విశాఖపట్నం వెళ్తున్న ఎక్స్ప్రెస్ బస్సులో కోటబొమ్మాళి జంక్షన్ వద్ద గంగు అర్జున్ తన కుమార్తెతో కలిసి ఎక్కాడు. అయితే జర్జంగి ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఎక్కుతున్న సమయంలో పాసింజర్లు ఎక్కువగా ఉండడంతో కండక్టర్ వారిని లోపలికి వెళ్లమని చెప్పాడు. అయితే ఆ సమయంలో తన కుమార్తైపె చేయి వేశాడని అర్జున్ కండక్టర్తో గొడవ పెట్టుకుని దాడి చేశాడు. తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అలాగే డ్రైవర్ అడగగా.. అతనిపై సైతం దురుసుగా మాట్లాడడంతో చివరకు బస్సును కోటబొమ్మాళి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లాడు. అనంతరం కోటబొమ్మాళి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఏడిపింఛన్
● రాజకీయ కక్షతో పింఛన్లు నిలిపివేత పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామంలో రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఏడుగురి పింఛన్లను అధికారులు నిలుపుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎన్ని రామారావు, సంపతిరావు వేదాంతినాయుడు, గురుగుబెల్లి బంతమ్మ, సీపాన సూర్యనారాయణ, యారబాటి దాలయ్య, సంపతిరావు నేపాలరాజు, పాతిన జగన్నాథంలు ఎన్టీఆర్ భరోసా పింఛన్ తీసుకునేందుకు అనర్హులని ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఎంపీడీవో వాసుదేవరావు నోటీసులు జారీ చేశారు. నోటీసు ప్రాప్తికి వారంతా జనవరి 9వ తేదీన ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఉంది. ఈ మేరకు వీరు గోకర్నపల్లి సచివాలయంలో విచారణకు హాజరైయ్యారు. పంచాయతీ కార్యదర్శి వీరి సంతకాలు తీసుకున్నారు. ఎంపీడీవో మాత్రం హాజరుకాలేదు. అయితే వీరు అక్రమంగా పింఛన్లు పొందుతున్నారని జనవరి నెలాఖరున ఎంపీడీవో విచారణ జరిపి, ఫిబ్రవరి నుంచి నిలుపుదల చేశారు. వారిలో గురుగుబెల్లి బంతమ్మకు రూ.75లు ఉన్నప్పటి నుంచి పింఛన్ వస్తుండడం గమనార్హం. మిగిలినవారంతా వృద్ధాప్య పింఛన్ రూ.1000లు ఉన్నప్పటి నుంచి పింఛన్ తీసుకుంటున్నారు. వీరంతా అర్హులైనప్పటికీ రాజకీయ కారణాలతో పింఛన్లు తొలగించారని వాపోతున్నారు. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ.. పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్ ఇచ్చిన నివేదిక మేరకు తాత్కాలికంగా పింఛన్లు నిలిపివేయడం జరిగిందన్నారు. -
తుపాకులతో మోహరించడం ఎందుకు..?
● మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలపై పేరాడ తిలక్ మండిపాటు టెక్కలి: మూలపేట పోర్టు పరిశీలనకు అనుమతులిచ్చామని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నారని.. అయితే అనుమతులు ఇచ్చినపుడు భారీగా పోలీసులు తుపాకులతో మోహరించాల్సిన అవసరం ఏముందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమం విజయవంతం కావడంతో, మంత్రి అచ్చెన్నాయుడు మతిభ్రమించి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోర్టు పరిశీలనకు సిద్ధమైన తరుణంలో లేనిపోని ఆంక్షలు విధించారని దుమ్మెత్తిపోశారు. కనీసం బహిరంగ సభకు సైతం చివరి నిమిషం వరకు అనుమతులు ఇవ్వకుండా తాత్సారం చేశారని గుర్తు చేశారు. మూలపేటకు వెళ్లే రహదారిలో ముళ్ల కంచెలు, తుపాకులతో భారీగా పోలీసులను ఎందుకు పెట్టారన్నారు. పోర్టు పరిశీలన చేపట్టినట్లయితే కూటమి నాయకుల నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతోనే పరిశీలనకు అడ్డుపడ్డారని ధ్వజమెత్తారు. దశాబ్ధాల కాలంగా కింజరాపు కుటుంబం ఈ జిల్లాకు ఏం మంచి చేసిందని ప్రశ్నించారు. ఇకనైనా అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
పోలీసుల అడ్డంకులు సరికాదు
గార: రెడ్బుక్ రాజ్యాంగంలో పౌరుల వ్యక్తిగత కార్యక్రమాలకు పోలీసులు అడ్డంకులు పెట్టడం సరికాదని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజే సుధాకరబాబు తల్లి రెండో వర్ధంతి తన ఇంటి వద్ద జరుపుకుంటుండగా.. అక్కడికి వెళ్లినవారిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీలను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి లోకేష్లు ఇలాంటి కార్యక్రమాలును ప్రోత్సహించడం తగదన్నారు. -
‘మన మూలపేట పోర్టుకు పోదాం.. విజయవంతం’
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం విజయవంతమైందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేడాడ తిలక్ అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. ఏ ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించామో అది నెరవేరిందని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా పోర్టు యాత్రను విజయవంతం చేసిన కార్యకర్తలు, నా యకులను అభినందించారు. అలాగే సభకు హాజరైన ఉత్తరాంధ్రకు చెందిన ప్రధాన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తల ఐక్యత చూసి కూటమి ప్రభుత్వం వణికిపోయిందని పేర్కొన్నారు. పేరాడ తిలక్ మాట్లాడుతూ స్థానిక ప్రజలు, యువత అండగా నిలిచారని తెలి పారు. సమావేశంలో పార్టీ నాయకులు ముద్దాడ బైరాగినాయుడు, రాజాపు అప్పన్న, సురంగి నర్శింగరావు చిన్ని జోగారావు, బొబ్బాది ఈశ్వరరావు, బుద్దల రాజశేఖర్ తదితరులు హాజరయ్యారు. -
నాటిక పోటీల బ్రోచర్ ఆవిష్కరణ
కవిటి: మండలంలోని బొరివంకలో కళింగ సీమ కళాపీఠం సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల ద్వితీయ ఆహ్వానిత నాటిక కళా పరిషత్ పోటీలు నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు బల్లెడ లక్ష్మణ మూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం నాటిక పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పేరొందిన నాటక సమాజాలకు చెందిన ప్రదర్శన బృందాలు ఈ పోటీల్లో పాల్గోనున్నాయి. మూడు రోజులు పాటు నిర్వహించనున్న పోటీల్లో ఏడు ప్రదర్శనలతో పాటు ఒక ప్రత్యేక నాటిక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలోని నాటక సమాజాలు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
దళం ఇక గతమే..!
పలాస: విప్లవాలు, ఉద్యమాలు, దళాలకు చిరపరిచితమైన శ్రీకాకుళంలో ఇక ఆ పదాలన్నీ గతం కానున్నాయి. ఉద్యమాల పురిటి గెడ్డ ఉద్దానం ప్రాంతానికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు అజ్ఞాత జీవితం వీడి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. ఆపరేషన్ కగార్ తర్వాత సాయుధ దళాలు, దండకారణ్య ఉద్యమానికి గుండెకాయ లాంటి నాయకులు ఒక్కొక్కరుగా లొంగిపోయారు. ఇప్పుడు వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు విజయవాడలో సోమవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిన తర్వాత ఉద్దానం ప్రాంతంలో ఎక్కడ చూసినా మావోయిస్టుల కోసం చర్చలు మొదలయ్యాయి. గత ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను, వారి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో శ్రీకాకుళం జిల్లా సాయుధ గిరిజన రైతాంగ పోరాటం 1969లో ప్రారంభమై 1970 కల్లా ఒక్క ఏడాదిలోనే చల్లారిపోయింది. ఆ నాటి పోరాటంలో పాల్గొన్న సాయుధ దళాల సభ్యులు, నాయకులు సుమారు 360 మంది పోలీసు కాల్పుల్లో మృతి చెందారు. ఆ తర్వాత సాయుధ పోరాటం తాత్కాలికంగా విరమిస్తూ అప్పటి మిగిలిన నాయకత్వం తిరిగి చట్టపరధి ఉద్యమాలకు పున రంకితమైంది. అప్పటికి మిగిలి ఉన్న పైలా వాసుదేవరావు, పోతనపల్లి అప్పలస్వామి, గొరకల రాంబాబు, పైలా చంద్రమ్మ, పోతనపల్లి జయమ్మ, పోతనపల్లి పారమ్మలు అజ్ఞాత జీవితం మాత్రం వీడలేదు. రహస్యంగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలను సాగించారు. 1977 తర్వాత తరిగి జిల్లాలో ప్రజాఉద్యమాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 1980 ప్రాంతం నుంచి 1990 వరకు పీపుల్స్వార్ ఉద్దానం కేంద్రంగా చేసుకొని సాయుధ దళాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసింది. జిల్లాలో అనేక సాయుధ చర్యల తర్వాత పోలీసు నిర్భందం పెరిగింది. అలా పోలీసు నిర్భందం నేపథ్యంలోనే బాతుపురం, పల్లిసారథి, బొడ్డపాడు, అక్కుపల్లి, ఒంకులూరు, బహాడపల్లి, నీలావతి, మాకన్నపల్లి, మామిడిపల్లి, మర్రిపాడు గడూరు తదితర గ్రామాల నుంచి రాడికల్ యువజన సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం తదితర ప్రజాసంఘాల నుంచి అత్యధిక సంఖ్యంలో ఉద్దానం ప్రాంతం గ్రామాల నుంచి యువకులు పీపుల్స్ వార్ సాయుధ దళాల బాట పట్టారు. అనంతరం జిల్లాలో పోలీసు నిర్భందం పెరగడం, ప్రజల నుంచి తగిన సహకారం లేకపోవడంతో ఒడిశా సరిహద్దు గ్రామాలకు దళాలు వెళ్లిపోయాయి. అనంతరం పీపుల్స్వార్ మావోయిస్టు పార్టీగా మారడం దండకారణ్య అటవీ ప్రాంతానికి ఈ జిల్లా ఉద్యమం విస్తరించింది. అక్కడ కూడా సాయుధ పోరాటం తీవ్రం కావడంతో ఈ జిల్లాకు చెందిన అనేక మంది పోలీసు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఒక్క కోపర్ డాంగ్ ఎన్కౌంటర్లోనే ఉద్దానం ప్రాంతానికి చెందిన 18 మంది మృతి చెందారు. ఆ విధంగా అక్కుపల్లి గ్రామంలో 7 మంది, అత్యధికంగా చనిపోగా బొడ్డపాడు, నీలావతి, బాహాడపల్లి, బాతుపురం, ఒంకులూరు, మెట్టూరు, మామిడిపల్లి తదితర గ్రామాల్లో జిల్లా మొత్తం మీద 60 మంది మావోయిస్టులు మృతి చెందారు. చివరికి బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు ఒక్కరే ఈ జిల్లా నుంచి మిగిలారు. ఇతను కూడా గత ఏడాది ఒడిశా సరిహద్దు గ్రామంలో పోలీసు కాల్పుల్లో మృతి చెందాడని, తప్పించుకున్నాడని వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే వారి ఇంటికి పోలీసులు కూడా వెళ్లి అతని కోసం వాకబు చేశారు. అయితే అనూహ్య రీతిలో సోమవారం విజయవాడలో పోలీసుల ఎదురుగా ప్రత్యక్షమవడంతో ఉద్దానంలో ఇక్కడ వారి ఉద్యమాలు, త్యాగాలు గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికి నాయకులంతా లొంగిపోవడంతో నాటి ఉద్యమానికి గుర్తుగా పల్లెల్లో స్థూపాలు మిగిలాయి. అజ్ఞాతం వీడిన ఏకై క మావోయిస్టు చెల్లూరు నారాయణ ఇక జనజీవన స్రవంతిలోనే మావోలు తొలి ఉద్యమంలో 360 మంది మృతి మలి ఉద్యమంలో 60 మంది మృతి శ్రీకాకుళం జిల్లాలో సాయుధ దళాలు లేనట్టే 30 ఏళ్ల అజ్ఞాత జీవితం వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన చెల్లూరు నారాయణరావు సుమారు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం గడిపాడు. పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన నారాయణరావు తల్లిదండ్రులు చనిపోగా ఇద్దరు అన్నదమ్ములు ఇప్పుడు ఉన్నారు. ఇతను ఇంటర్ వరకు చదువుకున్నాడు. చదువుకునే సమయంలోనే రాడికల్ విద్యార్థి సంఘానికి ఆకర్షితుడై అందులో చురుగ్గా పనిచేశాడు. దీంతో 1990లో అప్పటి పీపుల్స్ వార్ పార్టీ దళంలోకి వెళ్లాడు. అక్కడ నుంచి ఎప్పుడు కూడా ఇంటి ముఖం చూడలేదు. దళ సభ్యుడు నుంచి అంచెలంచెలుగా మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుని స్థాయికి ఎదిగాడు. ఎన్నో సాయుధ చర్యల్లో పాల్గొని తప్పించుకున్న ఆయన నేడు ఈ విధంగా పోలీసులకు లొంగిపోవడం విశేషం. -
ఇదో క్రెడిట్ చోరీ
గత ప్రభుత్వంలో ప్రియాగ్రహారం ఉన్నత పాఠశాలలో నాడు–నేడులో భాగంగా రూ.1.3కోట్ల నిధులతో పాఠశాల స్వరూపాన్నే మార్చేశాం. జూనియర్ కళాశాలను మరో రూ.80లక్షలతో అభివృద్ధి చేశాం. ఇప్పుడు కేవలం వాటికి ప్రహరీ నిర్మాణం చేపట్టి టీడీపీ నాయకుల పేర్లు పెట్టుకోవటం క్రెడిట్ చోరీ తప్ప మరేమీ కాదు. – సుంకరి ప్రసాదరావు, ఎంపీటీసీ సభ్యుడు, ప్రియాగ్రహారం. గరిమెళ్లను అవమానించడమే.. ప్రియాగ్రహారంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముఖద్వారంపై టీడీపీ నాయకుల పేర్లు పెట్టడం అంటే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల త్యాగాన్ని అవమానించడమే. ఇప్పటికే అక్కడ జూనియర్ కళాశాలకు గరిమెళ్ల పేరు వుంది. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉన్నత పాఠశాలకు సైతం అధికారికంగా గరిమెళ్ల పేరును పెట్టిస్తాం. – డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య, జెడ్పీటీసీ సభ్యుడు, పోలాకి -
గంజాయితో ముగ్గురు అరెస్టు
పలాస: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 7.610 కిలోల గంజాయిని, మూడు సెల్ఫోన్లు, రూ.800ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా చార్రాస్తాకు చెందిన గౌతం గోపాల్ ఠాకూర్, వీరేంద్రనగర్కు చెందిన రాజేష్ అశోక్ తోడిలు ఒడిశా వెళ్లి అక్కడ రాయగడ ప్రాంతంలోని బర్తింగ్డూడకు చెందిన జగన్ సాబర్ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. అతని సాయంతో పర్లాకమిడి నుంచి బస్సులో పలాస రైల్వేస్టేషన్కు మంగళవారం వస్తుండగా.. సాయిబాబా మందిరం వద్ద వారిని కాశీబుగ్గ ఎస్ఐ ఆర్.నర్సింహమూర్తి తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వారినుంచి గంజాయితో పాటు సెల్ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకొని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
భార్య మెడపై బ్లేడ్తో దాడి
రణస్థలం: లావేరు మండలంలోని కొత్తకుంకాం గ్రామానికి చెందిన కొవ్వూరు సంతోషినిపై ఆమె భర్త కొవ్వూరు రాము మద్యం మత్తులో బ్లేడ్తో మంగళవారం ఉదయం దాడి చేశాడు. ఆమె మెడపై గాయమవ్వడంతో 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. లావేరు పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య నందిగాం: మండలంలోని హరిదాసుపురంలో భర్తకు భార్య తలకొరివి పెట్టిన విషాదకర ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శిష్ణు తమ్మయ్య, కాంతమ్మకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉండేవారు. కుమార్తె చిన్నతనంలోనే మృతి చెందగా, వివాహం అయిన కుమారుడు తిరుపతిరావు ఐదేళ్ల క్రితం అనారోగ్య సమస్యతో మృతి చెందాడు. అయితే తమ్మయ్య(63) మంగళవారం వేకువజామున గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో, భార్య కాంతమ్మ తలకొరివి పెట్టింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కంచిలి: మండలంలోని పెద్ద శ్రీరాంపురం ఉన్నత పాఠశాల ఎదురుగా మెయిన్ రోడ్డుపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కవిటి మండలం తలగానపుట్టుగ గ్రామానికి చెందిన మదనాల పురుషోత్తం(29) అనే వ్యక్తి కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురం మెయిన్రోడ్డుపై బైక్పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న లగేజీ ఆటో ఢీకొట్టింది. దీంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఇతడికి సోంపేట ప్రభుత్వాస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి, మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతుడు పురుషోత్తం ఖతార్ దేశం నుంచి స్వగ్రామానికి ఇటీవల వచ్చి, సోంపేట మండలం జింకిభద్ర గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృతుడికి నెల రోజుల్లో పెళ్లి కావాల్సి ఉండడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తల్లి మదనాల దాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ కంఠం భూమి ఆక్రమణ రణస్థలం: లావేరు మండల కేంద్రంలోని సర్వే నంబర్ 242లో ఉన్న ప్రభుత్వ భూమి (గ్రామకంఠం)ని ఒక టీడీపీ నాయకుడు ఆక్రమించుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామ పెద్దలు ఎన్నిసార్లు వారించినా వినకుండా తనపని చేసుకుంటున్నాడు. సదరు టీడీపీ నాయకుడు గతంలో ఈ స్థలం ఆక్రమణకు విశ్వ ప్రయత్నాలు చేసినా గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. కాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆక్రమణ పర్వానికి తెరలేపాడు. తన ఇంటికి ఆనుకుని 40 అడుగుల పొడవునా, 4 అడుగుల వెడల్పున ఆక్రమించేలా పక్కాగా కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నాడు. దీనిపై కొంతమంది కలెక్టర్ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందినా మండల, గ్రామస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటికై నా అధికారులు చొరవ తీసుకొని ఆక్రమణలు అడ్డుకోవాలని కోరుతున్నారు. -
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
హిరమండలం: గిరిజన బాలిక జయంతి అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఇటీవల జయంతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. తెలిసిన వ్యక్తి కాలేజీలో చేర్పిస్తానని చెప్పి విగత జీవిగా ఇంటికి చేర్చాడు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు పోలీస్ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రెడ్డి శాంతి స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి మృతురాలి తల్లిదండ్రులు శ్రీను, రాధలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ తరుపున పోరాటం చేస్తామని చెప్పారు. ఆమెతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. -
‘సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే చెప్పండి’
శ్రీకాకుళం: జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ మున్సిపల్ యాజమాన్యాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను వెబ్సైట్లో పొందుపరిచామని, దీనిపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని జిల్లా విద్యా శా ఖ అధికారి ఎ.రవిబాబు కోరారు. మంగళవా రం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ త్వ రలో ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించనున్న దృష్ట్యా ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ సీనియార్టీ జాబితాలను వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. ఉపాధ్యాయులు దీన్ని పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ధ్రువీకరణ పత్రాలను జతచేసి ఈ నెల ఆరో తేదీలోగా డీఈఓ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఐసీడీఎస్కు పసికందు అప్పగింత పాతపట్నం: మండలంలోని బూరగాం గ్రామంలో ఈ నెల 30వ తేదీన ఇంటి పెరట పొదల్లో దొరికిన వారం రోజుల పసికందును జిల్లా ఐసీడీఎస్, చైల్డ్ హెల్ప్లైన్ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు. పొదల్లో పసికందు దొరికిన విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, పోలీసులు, చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు మంగళవారం బూరగాం గ్రామానికి చెరుకున్నారు. గ్రామానికి చెందిన దేవకి సోయి, సుబాచంద్ర సోయి దంపతుల వద్ద ఉన్న పిల్లాడిని ఎస్ఐ కె.మధుసూదనరావు, అంగన్వాడీ సూపర్ వైజర్ అమరావతి, ఐసీపీఎస్ జనార్ధనరావు, వైకుంఠరావు, సెక్రటరీ ఉదయ్శ్రీ, వీఆర్వో వెంకటరావు, సర్పంచ్ బిజిలి పుల్లాయ్, ప్రహ్లాద పుల్లాయ్, నర్సునాయుడు, గ్రామ పెద్దల సమక్షంలో జిల్లా ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. పసికందును సోమవారం రాత్రి విడిచి వెళ్లిన వారిపై మంగళవారం ఉదయం పోలీసులు గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్త పద్మావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నా మని ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. ఘనంగా ఆదిత్యుని రథోత్సవం శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్వామి ఉష పద్మిని ఛాయా సమేత రథోత్సవం జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ నిత్యౌపాసన, విశేషపూజ, మంగళహారతి ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. -
బగ్గువారి బాగోతాలు
● హస్తిన సాక్షిగాసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఏకంగా జాతీయ స్థాయికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. నియోజకవర్గంలో జరుగుతున్న, అవినీతి అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దర్జాగా దోపిడీ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒక ఫిర్యాదుపై విచారణ జరుగుతోంది. తాజాగా ఇసుక, మద్యం మాఫియాతో పాటు ఉపాధి హామీ పనుల్లో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు వెళ్లింది. ఎమ్మెల్యే వ్యవహారాలను ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్తలపై యాంత్రిక ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాది మొర పెట్టుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ తమకు సంబంధించి డైరీలో కూడా రిజిస్టర్ చేసింది. బరి తెగింపు.. అంతా ఇంతా కాదు.. నరసన్నపేట నియోజకవర్గంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గరి నుంచి పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. బహిరంగంగానే ఇసుక దోపిడీ జరుగుతోంది. రూ.వందల కోట్లను అక్రమార్కులు అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఎక్కడికక్కడ అక్రమ ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. పట్టపగలే వంశధార నదిని యంత్రాలతో తవ్వేసి, నచ్చిన ధరకు విక్రయించి విశాఖపట్నం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అడ్డొచ్చిన వాళ్లపై దాడులకు కూడా తెగబడుతున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు తమ్ముళ్లు బరితెగించి, దర్జాగా దోచుకుంటున్నారు. చెప్పాలంటే ఇసుక మాఫియా చెలరేగిపోతోంది. అధికారులు సైతం అక్రమ తవ్వకాలపై చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. దీని ఫలితంగా నదిలో మంచినీటి వనరులకు హాని కల్గిస్తున్నారు. లోతుగా తవ్వకాలు జరిపి నీటి లభ్యతకు దెబ్బకొడుతున్నారు. అందినంతా దోచుకో.. లిక్కర్ మాఫియా కూడా ఇక్కడ నడుస్తోంది. మద్యం దుకాణాలను ఒక వర్గం ఎక్కువగా దక్కించుకోవడమే కాకుండా మిగతా దుకాణాలను కూడా గుప్పెట్లో పెట్టుకుని సిండికేట్గా నడుపుతున్నారు. గుడి, బడి అని చూడకుండా దుకాణాలు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్పీకి మించి విక్రయాలు చేపట్టి అదనపు దోపిడీ చేస్తున్నారు. బెల్ట్షాపులకైతే లోటే లేదు. విచ్చల విడిగా ఏర్పాటు చేసి మందుబాబులను మద్యం మత్తులో ముంచేస్తున్నారు. అంతటితో ఆగలేదు. కల్తీ లిక్కర్ స్థావరాలు కూడా ఈ నియోజకవర్గంలోనే తొలుత బయటపడ్డాయి. కేసులు కూడా నమోదయ్యాయంటే ఎంత దారుణంగా కల్తీ బాగోతం నడిచిందో అర్థం చేసు కోవచ్చు. ఉపాధి హమీ పథకం పనుల్లో కూడా అవకతవకలు చోటు చేసుకున్నాయి. నాసిరకం పనులు చేసి బిల్లులు కొట్టేసారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నిస్తే కేసులే.. ఈ మొత్తం అక్రమాలకు సంబంధించి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిపై ఆరోపణలు ఉన్నాయి. ప్రశ్నించే వాళ్లపై తప్పుడు కేసులు పెడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. వీటిని లిఖిత పూర్వకంగా, ఆధారాల వీడియోలతో కలిపి సామాజిక కార్యకర్త, శ్రీముఖలింగం అనువంశిక అర్చకులు నాయుడు గారి రాజశేఖర్ ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇక్కడ జరుగుతున్నదంతా ఫిర్యాదులో ప్రస్తావించారు. సమగ్రంగా వివరించారు. సామాజిక కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్ స్వీకరించింది. తమ డైరీలో రిజిస్టర్ చేసి, నంబర్ కూడా ఇచ్చింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయి? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నది వేచి చూడాల్సి ఉంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి వెళ్లిన వ్యవహారాలు ఇసుక, మద్యం మాఫియాలపై ఫిర్యాదు ధన దాహానికి మంచినీటి పథకాలు నిర్వీర్యమవుతున్నాయంటూ ఫిర్యాదులో ప్రస్తావన నరసన్నపేట ఎమ్మెల్యేపై చేసిన ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల సంఘం -
కాపులు అణచివేతకు గురవుతున్నారు
● జనాభా ప్రాతిపదికన పదవులివ్వాలి ● తూర్పుకాపుల ఆత్మీయ సభలో వక్తలు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో అధిక సంఖ్యలో తూర్పు కాపులున్నా.. మిగిలిన కులాల వద్ద అణచివేతకు గురవుతున్నామని తూర్పుకాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం తూర్పుకాపుల ప్రాబల్యమున్న ప్రాంతాల్లో ఏ రాజకీయ పార్టీలైనా కాపులకే ప్రాధాన్యమివ్వాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు కాపుల ఐక్యతను చాటిచెబుతూ నగరంలో భారీ ప్రదర్శన చేపట్టారు. సప్తగిరి కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ కాంప్లెక్స్, డే అండ్ నైట్ కూడలి మీదుగా ఏడు రోడ్ల జంక్షన్ వరకు సాగింది. వైఎస్సార్ కూడలి వద్దకు చేరుకుని దివంగత గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజకీయ పార్టీల తీరుపై ఆగ్రహం ఈ సందర్భంగా జరిగిన సమ్మేళనంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, అన్ని రాజకీయ పార్టీలు ఈ సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నగరంలో జరిగిన కార్గిల్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను ఖండించారు. సుడా చైర్మన్, కాపు సామాజికవర్గ బలమైన నాయకుడు కొరికాన రవికుమార్ ప్రోటోకాల్ విషయంలో జరిగిన అన్యాయం, తూర్పు కాపు జాతికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. పాలకులు కుట్ర పూరితంగా రవికుమార్ని అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. సామాజిక వర్గ సమస్యలపై స్పందిస్తూ.. అందరికీ పెద్ద దిక్కుగా ఉంటున్న కొరికాన రవికుమార్ వంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి తూర్పు కాపు బిడ్డపై ఉందని పిలుపునిచ్చారు. ఆయన మార్గదర్శకత్వంలోనే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్లో జిల్లావ్యాప్తంగా ఈ ఐక్యతను మరింత బలోపేతం చేసి, సామాజికంగా, రాజకీయంగా తమ వాటాను దక్కించుకుంటామని తీర్మానించారు. సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురపు తేజేశ్వరరావు, లుకలాపు సంతోష్ చక్రవర్తి, వాడవలస సురేష్కుమార్, అన్నెపు రామకృష్ణ, డోల జగన్, శాసపు జోగినాయుడు, పతివాడ గిరీశ్వరరావు, మిర్తివాడ ప్రభాకర్, రాజు, గిరడ అప్పలస్వామి, తాట్రాజుల రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలో పలువురికి పదోన్నతులు
శ్రీకాకుళం: జిల్లా పరిషత్ పరిధిలోని ఉన్నత పాఠశాలలు, పంచాయతీ రాజ్ కార్యాలయాల్లో రికార్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పలువురికి జూనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పిస్తూ నియామక పత్రాలను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ మంగళవారం అందజేశారు. మురపాక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న రమాదేవిని శ్రీకూర్మం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పిల్లలవలస జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఎ.రాజేశ్వరిని రాజాం మండల పరిషత్లో, బాసురు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న సీహెచ్ తవిటినాయుడును రాజాం మండల పరిషత్ కార్యాలయంలో, దేవుదల జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న వీవీ రమణను లింగాలవలస జెడ్పీ హైస్కూల్లో జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతిపై నియమించారు. అలాగే కింతలి జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్న ఎస్.పార్వతిని శ్రీకాకుళంలోని జెడ్పీ హైస్కూల్లో నియమిస్తూ నియామకపత్రాలను పదోన్నతులు పొందినవారికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ పదోన్నతి పొందిన ఉద్యోగులు కష్టపడి పనిచేసి, జిల్లా పరిషత్ యాజమాన్యానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఈవో డి.సత్యనారాయణ, ఏవో రాజేశ్వరరావు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ బంద్
● ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పథకం నిలుపుదల ● బకాయిలు చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాల డిమాండ్ ● ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆరోగ్యశ్రీ చికిత్సలు నిలుపుదల శ్రీకాకుళం : జిల్లాలోని ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. గత కొంతకాలంగా తమ బకాయిలను చెల్లించాలని నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పదేపదే విన్నవిస్తున్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బుధవారం నుంచి ప్రత్యక్ష పోరాటానికి నిశ్చయించాయి. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నారు. జిల్లాలో 20 ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివే యాలని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయించింది. వైఎస్సార్ మానస పుత్రికగా పేరొందిన ఆరోగ్య శ్రీని ఎలాగైనా నిలిపివేయా లని చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటి నుంచో కుట్రలు పన్నుతోంది. ఆరోగ్యశ్రీ పేరును డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారు. ఏప్రిల్ నుంచి కొత్తగా యూనివర్సల్ హెల్త్ పాలసీని తీసుకురావాలని కూడా నిర్ణయించారు. కానీ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల వారు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతూ తొలిదశగా ఆరోగ్యశ్రీని నిలుపుదల చేయాలని నిర్ణయించారు. -
రాతలు.. చెరిపివేతలు
● బడి ముఖద్వారంపై ‘గరిమెళ్ల’కు బదులు టీడీపీ నేతల పేర్లు ● చెరిపివేసిన గుర్తు తెలియని వ్యక్తులు ● ప్రియాగ్రహారంలో రాజుకున్న రాజకీయం పోలాకి: ఆ బడి ముఖద్వారంపై ఇదివరకు స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ పేరు ఉండేది. ఈ మధ్య ఏం పనులు చేశారో గానీ అదే స్థానంలో స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర, రాష్ట్ర మంత్రుల పేర్లు ప్రత్యక్షమయ్యాయి. స్వాతంత్య్ర యోధుడి పేరు స్థానంలో వీరి పేర్లు పెట్టుకోవడంతో కొందరు వాటిని చెరిపేశారు. ఇప్పుడు ఈ వైనం మండలంలోని ప్రియాగ్రహారంలో నిప్పు రాజేసింది. పాఠశాల ముఖద్వారంపై రాసిన పేర్లు చెరిపేశారంటూ టీడీపీకి చెందిన నాయకులు సోమవారం సాయంత్రం పోలాకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామానికి చెందిన పలువురు యువకులను పోలీసులు మంగళవారం స్టేషన్కు పిలిపించారు. అందులో జనసేన, వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు టీడీపీ రెబల్గా మారిన దుబ్బ కోటేశ్వరరావు కూడా ఉన్నారు. పేర్లను ఎవరు చెరిపారో కనుక్కోకుండా తమను బెదిరించడం సరికాదని వారన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్చార్జి బలగ ప్రవీణ్తోపాటు వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు సుంకరి రాంబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తియ్యల రాము స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టకుండా కేవలం టీడీపీ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను స్టేషన్కు పిలిపించడంపై నిలదీశారు. అనంతరం అక్కడి నుంచి యువకులను వారి వెంట తీసుకెళ్లిపోయారు. టీడీపీ నాయకులు కూటమి ధర్మం పాటించడం లే దని, కనీసం అధికారంలో తాము భాగస్వాములం అనే విషయాన్ని పక్కన పెట్టారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల గేట్లపై రాజకీయ నాయకుల పేర్లు రాయటం తగదని అన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ సైతం తీవ్రంగానే స్పందించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ పేరుతో పాఠశాల ముఖద్వారం ఉండేదని, ఆ స్థానంలో అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం ఆక్షేపణీయమని జెడ్పీటీసీ సభ్యుడు ధర్మాన కృష్ణచైతన్య మండిపడ్డారు. -
‘బెందాళం ఆరోపణలు సరికాదు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): బెంతు ఒరియా సమస్యపై తప్పుడు సమాచారం ఇస్తున్న ఎమ్మెల్యే బెందాళం అశోక్ అసత్యాల ప్రెస్మీట్పై పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, గిరిజనులపై ఇలా లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని గిరిజన సంఘాల జేఏసీ ముఖ్య సలహదారుడు వాబ యోగి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హొటల్లో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీలను అనరాని మాటలు అనేసి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన చేశాక సుమారుగా 98 గంటల తర్వాత ప్రెస్ మీట్ ద్వారా క్షమాపణ అడగటం దారుణమన్నారు. బెంతు ఒరియాలు ఒడ్డి కులానికి చెందిన వారని టెక్కలి ఆర్డీఓ ప్రభుత్వానికి నివేదిక అందజేశారని గుర్తు చేశారు. ఎస్టీలుగా ఉద్యోగాలు పొందిన నలుగురు బెంతు ఒరియాల ఉద్యోగాలు రద్దు చేశారని తెలిపారు. జిల్లా జేఏసీ ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా కార్యదర్శి సింహాచలం మాట్లాడుతూ అశోక్ 15 ఏళ్లుగా పాలిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలకు రోడ్డు సదుపాయం కూడా లేదన్నారు. ఇళ్లు లేని ఆదివాసీలు ఉన్నారని, దానికి ఆయన బాధ్యులు కారా అని ప్రశ్నించారు. బెంతు ఒరియాలపై పూర్తిగా ఈ ప్రభుత్వ అధ్యయనం చేసి నకిలీ సర్టిఫికెట్ రద్దు చేయాలని కోరారు. ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా ఆదివాసుల గురించి తప్పుగా మాట్లాడితే ఇక క్షమించేది ఉండదని హెచ్చరించారు. -
సచివాలయాల తనిఖీల్లో అలసత్వం వద్దు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, క్షేత్రస్థాయి తనిఖీల్లో ఏమాత్రం అలసత్వం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావులతో కలిసి ఆయన వివిధ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీలకు సంబంధించి కలెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అధికారి తమకు కేటాయించిన సచివాలయాలను క్రమం తప్పకుండా సందర్శించి, సేవలందిస్తున్న తీరును పరిశీలించాలన్నారు. రిజిస్టర్ల నిర్వహణ, బయోమెట్రిక్ హాజరు, ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు. తనిఖీల నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. జన గణనపై దిశా నిర్దేశం రానున్న జన గణన ప్రక్రియపై కలెక్టర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గణన కోసం నియమించిన సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని, క్షేత్రస్థాయిలో ఎక్కడా తప్పులు దొర్లకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలని ఆదేశించారు. రీ–సర్వే పూర్తయిన గ్రామాల్లో మ్యుటేషన్లు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. నిషేధిత జాబితా (22ఏ)లో ఉన్న భూముల సవరణలు, వెబ్ల్యాండ్లో మార్పులపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు. అలాగే జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ఇంటి పన్ను వసూళ్లను శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నీటి తీరువా వసూళ్లలో పురోగతి సాధించాలని, రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని సకాలంలో జమ చేయాలని సూచించారు. ఇందులో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ఏం కష్టమొచ్చిందో..
● ఇద్దరు పిల్లలతో వివాహిత ఆత్మహత్యాయత్నం ● ఘటనా స్థలంలోనే వివాహిత మృతి ● తీవ్రంగా గాయపడిన పిల్లలు నరసన్నపేట: పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే తల్లడిల్లిపోయే తల్లి ఏకంగా ఆ పిల్లలను రైలు కింద తోసింది. తానూ చనిపోవాలని అనుకుంది. తల్లీపిల్లల ఆత్మహత్యాయత్నం ఘటన స్థానికులను కలిచివేసింది. ఘటనలో తల్లి చనిపోగా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కంబకాయ రైల్వే గేటు సమీపంలో మంగళవారం మధ్యాహ్నం శ్రీకాకుళం టౌన్కు చెందిన కొత్తపల్లి జ్యోతి(35) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన ఇద్దరు పిల్లలతో ఆమె విశాఖ ఎక్స్ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా జ్యోతి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇద్దరు పిల్ల లు హేమంత్, పునీత్లు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. ఈ సంఘటన చూపరుల హృదయాలను కలిచి వేసింది. అయితే లోకోపైలెట్ మానవతా దృక్పథంతో ట్రైన్ను ఆపి గాయపడిన ఇద్దరు పిల్లలను ఆమదాలవలస రైల్వే పోలీసులకు అప్పగించారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. జ్యోతిది కంబకాయ గ్రామం. పదేళ్ల కిందట వివాహమైంది. భర్తతో నిత్యం ఘర్షణలు పడుతూ మంగళవారం ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డారు కాగా పెద్దబ్బాయి హేమంత్కు కుడి కాలు విరిగిపోగా చిన్నబ్బాయి పునీత్ ఎడమ కాలికి గాయాలయ్యా యి. వీరిని శ్రీకాకుళం రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఒకరిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆమదాలవలస రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒత్తిడితో..
శ్రీకాకుళందళం ఇక గతమే..జిల్లాలో నక్సలిజం గతం కానుంది. స్థూపాలు మాత్రమే మిగిలాయి. –8లో ఏ పనీ చేయలేకపోతున్నాం ● జాబ్ చార్టును మర్చిపోతున్నాం ● వారమంతా సెలవు లేకుండా గడిచిపోతోంది ● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ముందు గగ్గోలు పెట్టిన రెవెన్యూ ఉద్యోగిని బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026‘వారంలో ఏడు రోజులూ సెలవులు లేకుండా గడిచిపోతున్నాయి.. వీసీలు, టీసీలు, రెవెన్యూ క్లినిక్లు అంటూ ఒత్తిడి తెస్తుంటే మా జాబ్చార్టు కూడా మర్చిపోతున్నాం..’ అంటూ ఓ రెవెన్యూ ఉద్యోగిని కలెక్టర్ ముందే వీడియో కాన్ఫరెన్స్లో గగ్గోలు పెట్టారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించడంతో.. టెక్కలికి చెందిన ఓ ఉద్యోగి ఆవేదన వెళ్లగక్కారు. జిల్లా ఉన్నతాధికారులు పని ఒత్తిడి చేస్తున్నారని, ఒక పని పూర్తికాకముందే మరో పని చెబుతున్నారని, సమయం ఇవ్వడం లేదని, రెవెన్యూకి సంబంధం లేని పనులు కూడా అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీసీలు టీసీలతో అసలు కార్యాలయంలో పనిచేసే అవకాశం లేకుండా చేస్తున్నారని అన్నారు. పని చెప్పడం తప్ప తమ సమస్యలు వినడం లేదన్నారు. దీంతో వీసీ మధ్యలో ఆమె మైక్ను మ్యూట్లో ఉంచి ఇతరులకు ఆమె మాటలు వినిపించకుండా చేశారు. కానీ దాదాపు రెవెన్యూ ఉద్యోగులందరిదీ అదే ఆవేదన అని సిబ్బంది తెలిపారు. – శ్రీకాకుళం పాతబస్టాండ్ -
ఐటీడీఏ ఏర్పాటుపై మంత్రి సమాధానం చెప్పాలి
కొత్తూరు: అధికారంలోకి వస్తే జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీపై మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్ చేశారు. మండలంలోని పలు గిరిజన గ్రామాల్లో గోవిందరావు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గొట్టిపల్లిలో గిరిజనులతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయడంతో పాటు.. గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నా సమస్యలు పరిష్కరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు, సంవత్సరాలు నుంచి సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. గిరిజన భూములు ఆక్రమణలకు గురవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. గిరిజనులు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సిర్ల ప్రసాద్, అప్పన్న, సుంకయ్య, గణపతి, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం: జిల్లాలోని 1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలోని 44వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏవై గ్రామీణ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ నెలలో నిధులు వస్తాయని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులు సత్వరమే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమన్నారు. పట్టణ హౌసింగ్ స్కీం కింద ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఈడబ్ల్యూడీసీ డైరెక్టర్ పీఎంజే బాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ రమాకాంత్, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.రమాకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పైడిశెట్టి జయంతి, డీఈ సత్యాజీ, ఏఈ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 44 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు) కార్యక్రమంలో ప్రజల నుంచి 44 వినతులు అందాయి. అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇసుక లారీని ఢీకొన్న ట్యాంకర్ రణస్థలం: లావేరు మండలంలో బొంతుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఇసుక టిప్పర్ లారీని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్లో ఉన్న డ్రైవర్ అబ్దుల్లా షేద్కు తీవ్రగాయాలయ్యాయి. హైవే పోలీసులు, లావేరు పోలీసుల సాయంతో క్రేన్ సాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. కాగా ఇసుక టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. క్యాబిన్లో ఇరుకుపోయిన డ్రైవర్ అబ్ధుల్లా షేద్ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినవాడు. దీనిపై ఇంకా లావేరు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. -
పోరాడుతూనే ఉంటాం
జనం తరిమికొడతారనే భయం టీడీపీలో కలగాలి. అప్పుడే పను లు చేస్తారు. అభివృద్ధి అంటే.. కిడ్నీ ఆస్పత్రి, సుజలధార, మూలపేట పోర్టు వంటి ప్రాజె క్టులు. బీచ్ ఒడ్డున 150 లైట్లు వేసి రీల్స్ చేయడం అభివృద్ధి కాదు. పోర్టు పూర్తయ్యే వరకు మేం పోరాడుతూనే ఉంటాం. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సిగ్గు చేటు వైఎస్ జగన్ కల, ఎన్నో కుటుంబాల త్యాగాల ఫలితమే మూలపేట పోర్టు. డబ్బులు వచ్చే అమరావతి తప్ప చంద్రబాబు అండ్ కోకు ఏమీ అక్కర్లేదు. వైఎస్ జగన్ చేసిన పనుల వద్ద ఫొటోలు దిగితే క్రెడిట్ వచ్చేయదు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి కమీషన్ల కోసమే.. టెక్కలి నియోజకవర్గంలో మైనింగ్ నుంచి లిక్కర్ అక్రమ వ్యాపారాల వరకు కింజరాపు కుటుంబం పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోంది. కేంద్ర మంత్రికి దమ్ముంటే బహిరంగ సభ పెట్టి మూలపేట పోర్టు చంద్రబాబు కట్టారని చెప్పగలరా.? కమీషన్ల కోసమే పనులు ఆపేశారు. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త -
పీ–4తో పేదరికం నిర్మూలన సాధ్యం
● ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ–4 కార్యక్రమంతో పేదరికం నిర్మూలన సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పీ–4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, డీఆర్వో విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీప్రసన్న, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈవోగా వెంకట్రామన్ శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవోగా వెంకట్రామన్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఈవోగా శ్రీకాకుళంలో పనిచేస్తూ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం కొద్దిరోజుల క్రితం బదిలీ అవ్వగా, తాజాగా ఆయనకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళంలో నియమించారు. గతంలో ఈయన శ్రీకాకుళం ఎంపీడీవోగా కూడా పనిచేశారు. మంగళవారం ఈయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. -
త్వరితగతిన అర్జీల పరిష్కారం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 113 అర్జీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు 113 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 58 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 24, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 5, పేదరిక నిర్మూలన సంస్థ 16, మున్సిపల్ కార్పొరేషన్ 11, సర్వే అండ్ లాండ్ రికార్డులు 8, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 7 తదితర శాఖలకు సంబంధించి 113 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించినవారిలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే.. పొందూరు మండలంలోని లోలుగు రెవెన్యూ పరిధిలో ఉన్న డీజీఆర్ జ్యూట్మిల్ ప్రైవేట్ లిమిటెడ్ మిషనరీ అక్రమ అమ్మకాలపై అధికారులు కోరిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీవీ రమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకొని తనకు వివరాలు అందజేయాలని కోరారు. ● శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రశాంతి వృద్ధాశ్రమం వెనుక కలెక్టర్ ఆఫీసు రోడ్డులో డీటీసీపీ అప్రూవల్ పొందిన లేఅవుట్ శ్రీసాయి శ్రీనివాసనగర్ నివాసాల మీదుగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఆ ప్లాన్ రద్దు చేయాలని శ్రీసాయినగర్ వాసులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనివలన సుమారు 200 కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
క్రెడిట్ చోరులపై
30 శాతం పనులు చేయలేరా..? పోర్టు పరిశీలిస్తే సర్కారు బండారం బయటపడుతుంది. అందుకే అడ్డుకున్నారు. 70 శాతం పనులు వైఎస్సార్ సీపీ పూర్తి చేస్తే.. 30 శాతం పనులు రెండేళ్లయినా చేయలేకపోయారు. పైగా అంతా తామే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం దిగ్విజయం ప్రసంగాలతో అధికార పక్షంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు పోర్టుకు వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు అడుగడుగునా అడ్డుగోడలే అన్నింటినీ దాటుకుని సభను విజయవంతం చేసిన నేతలు -
రణన్నినాదం
సిగ్గు లేదా.. మూలపేట పోర్టు కట్టామని చెప్పుకోవడానికి టీడీపీకి సిగ్గు లేదా. జిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు నిలదీయాలి.. జిల్లాకు ఎందుకు ప్రాజెక్టులు తీసుకురావడం లేదని కేంద్ర, రాష్ట్ర మంత్రులను నిలదీయాలి. అసలు 40 ఏళ్ల టీడీపీ పాలనలో జిల్లాకు చేసిందేమిటి..? వైఎస్ఆర్.. ఆ తర్వాత వైఎస్ జగన్మాత్రమే జిల్లాకు ప్రాజెక్టులు తీసుకువచ్చారు. – చింతాడ రవికుమార్, నియోజకవర్గ ఇన్చార్జి, ఆమదాలవలసఅదే టీడీపీ భయం మూలపేట కీలకం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఏమీ లాభం లేదు. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ పునాది రాయి కాదు మైలు రాయి.. మూలపేటకు వైఎస్ జగన్ వేసింది సాధారణ పునాది రాయి కాదు. జిల్లా చరిత్రలో ఓ మైలురాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాన్ని వాడుకోవాలన్న ఆలోచన చేసిన ఏకై క నేత వైఎస్ జగన్. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్ సీఎం అంటే వైఎస్ జగన్ సీఎం అంటే వైఎస్ జగనే. మాటిస్తే నిలబెట్టుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం రైతాంగానికి ఒక్క యూరియా బస్తా ఇవ్వలేదు. మంత్రి రామ్మోహన్నాయుడు విమానాల్లో తిరుగుతూ ఉంటే ప్రజల సమస్యలు అర్థం కావు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే కూటమికి చెంపదెబ్బ మూలపేట పోర్టు కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ. చంద్రబాబు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకేమీ పట్టవు. కూటమి అరాచకాలను కార్యకర్తలు ప్రశ్నించాలి. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీఇచ్ఛాపురంసమన్వయకర్తక్రెడిట్ చోరులపైసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/టెక్కలి/ శ్రీకాకుళం పీఎన్కాలనీ : చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది. పోర్టుకు సపోర్టు ఇవ్వలేని అసమర్థ వైఖరిని జన సభ సాక్షిగా ఎండగట్టింది. మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ పేరిట పోరాటానికి పిలుపునిచ్చింది. దీనికి భయపడిన ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. నేతలు పోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు నౌపడ మూడు రోడ్ల జంక్షన్లో సభ నిర్వహించి అధికార పక్షంపై మాటల తూటాలు పేల్చారు. వైఎస్ జగన్ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి కాగా.. టీడీపీ రెండేళ్లలో ఆ 30 శాతం పనులు చేయలేకపోయింది. పైగా మొత్తం ఘనత తమదే అన్నట్లు డబ్బాలు కొడుతోంది. ఈ పోర్టును పూర్తి చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్రెడిట్ వస్తుందని ఉద్దేశపూర్వకంగా పనులు జాప్యం చేస్తూ వస్తోంది. దీనిపైనే వైఎస్సార్ సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. అర్ధంతరంగా ఆగిపోయిన మూలపేట పోర్టు పనుల పరిశీలనకు నడుం బిగించింది. దీనికోసం పోలీసులను అనుమతి కోరితే సభ ఏర్పాటుకు తప్ప పోర్టు సందర్శనకు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో మూలపేట పోర్టుకు సమీపంలో నౌపడ జంక్షన్ వద్ద సభ నిర్వహించారు. సభకు తరలివచ్చిన వేలాది మందితో నౌపడ జంక్షన్ జనసంద్రమైంది. టెక్కలి, కోటబొమ్మాళి నుంచి నౌపడ జంక్షన్ వైపు వెళ్లే రహదారులన్నీ కిటకిటలాడాయి. వేలాది కార్లతో ర్యాలీగా వైఎస్సార్సీపీ శ్రేణులు వచ్చాయి. దీంతో దారులన్నీ వాహ నాల జాతరను తలపించాయి. విపరీతమైన రద్దీ ఏర్పడింది. వాహనాలన్నీ మూలపేట పోర్టు వైపు వస్తుండటంతో పోలీసులు ఆంక్షలు పెంచారు. అయినప్పటికీ ఆంక్షలను చేధించుకుని నౌపడ జంక్షన్ వద్ద జరిగిన సభ కు రకరకాల మార్గాల ద్వారా వేలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు ప్రసంగాలతో అదరగొట్టారు. పోర్టు లెక్కలన్నీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. టీడీపీ అలసత్వాన్ని వివరిస్తూ మాటల తూటాలు పేల్చారు. క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, చంద్రబాబు అండ్కోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి...మన పోర్టు మన కృషి అంటూ పిలుపుతో నిర్వహించిన నిరసన సభ విజయవంతమైంది. ప్రజల నుంచి అశేష స్పందన రావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తలేరాజేష్, శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, చల్లా రవికుమార్, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంబటి శ్రీనివాస్, ఆరంగి మురళీధర్, రాజాపు అప్పన్న, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, పార్టీ యువజన నాయకులు ధర్మాన కృష్ణచైతన్య, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఇంటలెక్చువల్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు పిల్లల రామకృష్ణ, పార్టీ నాయకులు దువ్వాడ వాణి, వైవీ శ్రీధర్, పొన్నాడ రుషి, చిట్టి జనార్ధనరావు, మండవల్లి రవి, శ్రీరామ్మూర్తి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పాలవసంత రెడ్డి, మార్పు అశోక్కుమార్, గద్దిబోయిన కృష్ణయాదవ్, చింతాడ వరుణ్, ఆట్ల సుజనమ్మ, కోణార్క్ శ్రీను, ఇప్పిలి కృష్ణారావు, కడియాల శ్రీహరి, ఎంఏ భేగ్, డాక్టర్ దాస్, పిలక రాజ్యలక్ష్మిలతో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల వైఎస్సార్సీపీ శ్రేణులు వేలాదిగా హాజరయ్యారు. -
● పొదల్లో పసికూన
పాతపట్నం: ఆకలి తీర్చడానికి చనుబాలు లేవు.. ఏడుపు ఆపడానికి తల్లి పొత్తిళ్లు లేవు.. ఒంటి నిండా చీమల కాట్లు.. కంటి నిండా కన్నీటి బొట్లు. వారం వయసున్న పిల్లాడు పొదల మధ్య పడిన అవస్థ ఇది. పాతపట్నం మండలంలోని బూరగాం గ్రామంలోని సత్యనారాయణ ఆలయం పక్కన ఘంసీ పుల్లాయ్ ఇంటి పెరటిలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరో పసి కందును పడేసి వెళ్లిపోయారు. ఆ పసికందు గుక్కపట్టి ఏడవడంతో భూదేవి అనే మహిళ బాబును రక్షించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో బాబుకు సపర్యలు చేసి, శరీరాన్ని శుభ్రం చేశారు. బాబుకు వైద్య సేవల కోసం మంగళవారం ఉదయం తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం బాబు ను భూదేవి అనే మహిళ వద్ద గ్రామస్తులు ఉంచారు. -
తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం'
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/టెక్కలి/ సంతబొమ్మాళి/నందిగాం/ టెక్కలిరూరల్: ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైన మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. రెండేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతను తూర్పారపట్టింది. చేసిందేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదే అంటూ క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న చంద్రబాబు కుయుక్తులను కడిగిపారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జనం రాకను ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వద్ద ఎక్కడిక్కడ టిప్పర్లను అడ్డం పెట్టారు. గ్రామాల శివార్లలో బారికేడ్లు పెట్టారు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వాటిన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని నేతలు తిప్పి కొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.జగన్ హయాంలోనే 70 శాతం పూర్తి మూలపేట పోర్టు పనులలో మెజారిటీ భాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4,362 కోట్ల నిధులను సమకూర్చారు. ఫైనాన్షియల్ క్లోజర్ జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్ పూర్తి చేశారు. భూసేకరణ పూర్తిచేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లుఖర్చు చేశారు. వీటితోపాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులనూ తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేశారు కాబట్టి ప్రాజెక్టు 70శాతానికి పైగా పూర్తి అయినట్లే. జగన్ హయాంలో పనులన్నీ వేగంగా జరగడాన్ని గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్సీపీ చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. మూలపేట పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. కనీసం గ్రామస్తులు రావడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులెవరూ పోర్టు వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నౌపడ జంక్షన్ నుంచి పాలనాయుడుపేట జంక్షన్ వద్ద, యామల పేటకు వెళ్లే రహదారి వద్ద, రాజపురం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులెవరూ పోర్టు ప్రదేశానికి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలతో మోహరించారు. నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిలో టిప్పర్లను అడ్డంగా పెట్టి దాని ముందు బారికేడ్లు పెట్టి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మూలపేట గ్రామస్తులు కూడా తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. కొందరికి జీడి తోటలకు పరిహారం, పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, ఇంటి స్థలాలు కూడా కేటాయించలేదని, నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండానే తరలిస్తున్నారని మూలపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ నేతలకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, బూడి ముత్యాల నాయుడు, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, జల్లిపల్లి సుభద్ర, ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవి బాబు, నర్తురామారావు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ఎం. విశ్వేశరరాజు, రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వాసుపల్లి గణేశ్, అదీప్రాజ్, గొర్లె కిరణ్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేశ్, మళ్ల విజయప్రసాద్, శోభా హైమావతి, భాగ్యలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, కేకే రాజు, జెడ్పీ మాజీ చైర్మన్, జీసీసీ మాజీ చైర్మన్ గులిపల్లి శోభాస్వాతీరాణి తదితరులు హాజరయ్యారు.బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వేదికపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు జగన్కు పేరొస్తుందన్న కక్షతోనే..ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణ, అనుమతులన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు..? మీ మామూళ్ల కోసం ఇక్కడి పనులు సాగనివ్వరా..? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నా మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఇవాళ ప్రజాసంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలి. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత టీడీపీ నేతలను తరిమికొట్టాలి..ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ సిక్కోలు వెనుకబాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకువచ్చారు. టీడీపీ పాతికేళ్ల పాలనలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా..? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. టీడీపీ రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? వైఎస్ జగన్ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకు రూపకల్పన చేశారు. కానీ టీడీపీ నేతలు జిల్లాలో ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి పోసే విధంగా కిడ్నీ ఆస్పత్రి, హిరమండలం నుంచి సుజలధార ప్రాజెక్టుల ఘనత వైఎస్ జగన్కే దక్కింది. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి రెండేళ్లలో ఒక్కశాతం పని చేయలేదుకూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి చూశారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలవే. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు తెలిసిన పని. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్ తయారుచేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా?. వైఎస్సార్, జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు వచ్చాయి. అచ్చెన్నాయుడు గారూ.. అసెంబ్లీలో జగన్ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్నా..? – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారుమూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి ప్రాంతం ముంబైలా అభివృద్ధి చెందుతుంది. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును వైఎస్ జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1,800 ఎకరాలతో సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని వైఎస్ జగన్ చేసి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్ హార్బర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో వైఎస్ జగన్ జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడురెండేళ్లవుతున్నా ఎక్కడి పనులక్కడే..దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును వైఎస్ జగన్ పట్టాలెక్కించి 70 శాతం పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉంది. పోర్టు పూర్తయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కుళ్లుతోనే పనులు ఆపేశారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సాకారం చేశారు. – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎంవాస్తవ రూపంలోకి తెచ్చింది జగనేచాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4,362 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవ రూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్ది. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీకాకుళంమాట మీద నిలబడని బాబు‘చెప్పాడంటే చేస్తాడు’ అనే క్రెడిట్ జగన్కే దక్కుతుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యేబాబాయి, అబ్బాయ్లదే పాపంవలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4,362 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్ జీఓ తెచ్చారు. కానీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయిలు క్రెడిట్ జగన్కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త జగన్ గెలిస్తేనే జిల్లా అభివృద్ధికిడ్నీ ఆస్పత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్ జిల్లాకు దిక్సూచిలా నిలిచారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ జరగలేదు. మళ్లీ జగన్ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేఅన్నీ అబద్ధాలే..కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించడం, క్రెడిట్ చోరీ మాత్రమే జరుగుతోంది. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్తబాబు చేసింది శూన్యంశ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీ, పోర్టు అన్నీ వైఎస్ జగన్ తెచ్చినవే. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఇచ్చింది శూన్యం.– చింతాడ రవికుమార్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ పోర్టుజిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ మొదలుపెట్టారు. ప్రధానంగా 4 పోర్టుల నిర్మాణం, 8 ఫిషింగ్ హార్బర్స్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్సార్సీపీది. కూటమి నేతలు మూలపేట పోర్టును తామే నిర్మించామని ప్రగల్బాలు పలకడానికి సిగ్గులేదా..? – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుమూలపేట కీలకంమూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి నాంది పలకడం చాలా సంతోషం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టకపోగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ముందుకు కూడా రాకపోవడం దారుణం. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ -
కోడిపుంజు గుడ్డు పెట్టింది.. గ్రామం మొత్తం షాక్!
శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైనా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. అది సృష్టి ధర్మం కూడా. కానీ ఎల్ఎన్పేట మండలం బొర్రంపేటలో మాత్రం కోడిపుంజు గుడ్డు పెట్టడం విశేషం. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్తో పాటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జన్యుపరమైన లోపాలతో ఇటువంటివి జరుగుతుంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్డేట్స్.. వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్ట్ పనులు త్వరితగతన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు. ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నోరులని ప్రాంతాలకు అన్యాయం చేస్తోంది.అన్ని ప్రాంతాలకు సంపద సమానంగా పంపిణీ చేయాలి.టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా శ్రీకాకుళం జిల్లాకు శాశ్వతమైన పనిచేసిందా?.ఎల్లో పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ చూసి ప్రజలు మోసపోతున్నారు.తరిమికొట్టే రోజు వచ్చినప్పుడే భయపడి అభివృద్ధి చేస్తారు.దిగజారి మూలపేట పోర్టు మేమే తెచ్చామని కేంద్రమంత్రి చెప్తున్నారు.మనం మౌనంగా ఉంటే మన జిల్లా అభివృద్ధిని పట్టించుకోరు.టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసుల్లా దాడులు చేస్తున్నారు.కూటమి ఎమ్మెల్యే దుర్మార్గాలు చూస్తే సిగ్గేస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఇళ్లు కట్టించాం.వైఎస్ జగన్ గొప్ప నాయకుడు, విశాలమైన భావాలున్న నాయకుడు. బొత్స సత్యనారాయణ కామెంట్స్..మూలపేట ఈ ప్రాంత అభివృద్ధి కాదు రాష్ట్ర మొత్తం అభివృద్ధి.దూరదృష్టితో పోర్టును వైఎస్ జగన్ నిర్మించారు..కూటమి ప్రభుత్వం పోర్టును పట్టించుకోలేదు.ప్రజల కష్టాలను పట్టించుకోలేదు..కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సభ పెట్టడానికి వచ్చామురామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు.భోగాపురం ఎయిర్ పోర్టు వైఎస్ జగన్ కృషి కాదా?.కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయావా?.వైఎస్ జగన్ పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు..30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు..కాంట్రాక్టర్కు మీకు సెట్టింగ్ కుదరలేదా?పోర్టును చూస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటి?.వేరే వారికి పుట్టిన పిల్లలకు మీరు పెట్టవద్దు.రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు.రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదని ఎర్రం నాయుడు చెప్పారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..చంద్రబాబు వలనే పోర్ట్ పనులు జరుగుతున్నాయనడం టీడీపీ నేతల సిగ్గుచేటు.ఇలా మాట్లాడం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దివాలకోరు రాజకీయానికి నిదర్శనం.పాదయాత్ర సందర్భంగా జగన్ పోర్ట్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..నేను పుట్టక ముందు నుంచి పోర్ట్ అంటూ చెపుతున్నారు..ఏ నాయకుడు నిర్మించ లేకపోయారు.వైఎస్ జగన్ వలన పోర్ట్ నిర్మాణం పూర్తి అయింది.శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి బాబాయి అబ్బాయి చెప్పాలి..చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలి?. శ్రీకాకుళం..ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..భావనపాడు పోర్టును నిర్మిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూశారు..దశాబ్దాల కలను వైఎస్ జగన్ నిజం చేశారుమూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ నిర్మించారుచదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్.. మూలపేట పోర్టు దశాబ్దల కల.ప్రజల కలను వైఎస్ జగన్ నిజం చేశారు..మూలపేట పోర్టు పనులను 70 శాతం పూర్తి చేశారు..30% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చెప్పి పోర్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు..ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్దన్న పాత్ర వైఎస్ జగన్ పోషించారు.. పోలీసుల ఆంక్షలు..మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ పోలీసుల ఆంక్షలు.నౌపాడ జంక్షన్ వద్ద సభకు మాత్రమే అనుమతి.వైఎస్సార్సీపీ నేతల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు.నౌపాడ జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారికేడ్లు ఏర్పాట్లు. మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం: ధర్మాన కృష్ణదాస్ఏడాది కాలంలోనే 70 శాతం పనులు పూర్తి చేశాం.కూటమి వచ్చిన తర్వాత 30 శాతం పనులను కూడా చేయలేకపోయింది.వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర. విశాఖ:కురసాల కన్నబాబు కామెంట్స్...క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..వైఎస్ జగన్కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్..ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు.. విశాఖ..ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..70 శాతం పనులు మా హయాంలో చేసాం..30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే.. మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు..జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు. మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు.👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. -
సపోర్టు ఇచ్చిందే వైఎస్సార్సీపీ
పోర్టు నిర్మాణంలో వాస్తవాలను వివరిస్తాం ● మూలపేట పోర్టు క్రెడిట్ కొట్టేయడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు ● పోర్టు పనుల ఘనత వైఎస్ జగన్దే ● నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు ● జనాలకు వాస్తవాలు చెప్పడానికి సిద్ధమవుతున్న నాయకులు – సాక్షి ప్రతినిధి శ్రీకాకుళంమూలపేట పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికి మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కమిషన్ల లావాదేవీల కోసం కాలయాపన చేశారు. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధితో పాటు జిల్లాను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా పోర్టుకు శ్రీకారం చుట్టిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే ఈ ఘనత అని నిరూపిస్తాం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి ● వైఎస్సార్సీపీ ఉన్నప్పుడు రూ.4361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం 2023 ఏప్రిల్ 19వ తేదీన శంకుస్థాపన చేశారు. ● మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీ, మౌలిక సదు పాయాల కోసం నౌపడ సమీపంలో రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రోడ్డు కోసం రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. ● రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను రైతుల అంగీకారంతో సేకరించారు. ● ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. ● కేవలం ఏడాది కాలంలోనే అనగా ఎన్నికల సమయానికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులతో పాటు కార్గో బెర్తుల నిర్మాణం, క్యాటింగ్ యార్డు నిర్మాణం, బ్లాచింగ్ చిప్స్ ప్లాంట్ నిర్మాణంతో పాటు డ్రెడ్జింగ్ పనులతో సహా 70 శాతం పనులు పూర్తి చేశారు. మరో వైపు రోడ్డు పనులు ప్రాథమిక స్థాయిలో పూర్తి చేశారు. పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్) -
అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పేద విద్యార్థులను కించపరిచేవిధంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గరికపాటి వ్యాఖ్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలలపై అసభ్యంగా మాట్లాడిన గరికపాటిపై ప్రభుత్వం, బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి.చందు, ఖగేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, ఐద్వా నాయకురాలు టి.ప్రవీణ, యూనియన్ నాయకులు ఎ.రాధ, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో కొత్తరోడ్లోని కాశ్యప్ నర్సింగ్ కళాశాల వేదికగా ఆదివారం జరిగిన జల్లాస్థాయి అండర్–9 చెస్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. ఈ ఎంపిక పోటీల్లో బాలురు విభాగంలో అన్నెపు శశాంక్, శనుగును శివ, సనపల రిత్విక్సాయి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో లిపిక కారుణ్య, కొల్ల భవిష్య, రేష్మిక మొదటి మూడు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వీరంతా ఏప్రిల్ 18, 19 తేదీల్లో అన్నవరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్–9 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆలిండియా చెస్ ఆన్ స్కూల్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు తెలిపారు. అంతకుముందు ఈ ఎంపిక పోటీలను తంగుడు సుధీర్ మొదటి ఎత్తువేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్, సంఘ ప్రతినిధులు, కోచ్లు పాల్గొన్నారు. జిల్లాకు ఇన్చార్జి మంత్రి కొండపల్లి రాక నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటకు విజయనగరం నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. జీరో పావర్టీ పీ–4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో విజయనగరం చేరుకుంటారని వివరించారు. -
రెండేళ్ల పాలనలో ఏం చేశారు..?
టెక్కలి, సంతబొమ్మాళి: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో నిర్వహించనున్న ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. గతంలో ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతంలో పోర్టు కడతామని హామీలిచ్చి మరచిపోయారని గుర్తు చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సుమారు రూ.4362 కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారని, ఎన్నికల సమయానికి 70 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేదని ముత్యాలనాయుడు ఆరోపించారు. పోర్టు నిర్మాణంలో వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికే ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గం ప్రాంతంలో పోర్టు నిర్మాణం 70 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. అలాంటి కలను సాకారం చేసే విధంగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కూటమి నాయకులు రెండేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. 30 శాతం పనులు పూర్తి చేయలేకపోవడమే కాకుండా పోర్టు క్రెడిట్ను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మూలపేట పోర్టు మంజూరు కోసం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఏడాది కాలంలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులతో పాటు నారా లోకేష్ వరకు కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధి, జిల్లా అభివృద్ధి కోసం నిర్మాణం తలపెట్టిన పోర్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వహిస్తున్న పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరితో పాటు జెడ్పీటీసీ పాల వసంత్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బి.మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, నాయకులు పి.రవికుమార్రెడ్డి, ఎన్.భీమారావు, ఎస్.సత్యం, కె.సతీష్, జి.గురునాధ్యాదవ్, కె.అజయ్, ఎ.మురళి, కె.జీవన్, బి.రాజేష్, వి.శ్రీధర్రెడ్డి, బి.కార్తీక్, ఆర్.మురళీరెడ్డి తదితరులు ఉన్నారు. ఏడాదిలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికే కార్యక్రమం నౌపడ సమీపంలో సభా స్థలం పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు నేడే ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ -
‘పోర్టు పేరుతో టీడీపీ నాయకులు పబ్బం గడుపుకున్నారు’
టెక్కలి: జిల్లాలో పోర్టు నిర్మాణం పేరుతో ప్రజల్ని ఊరిస్తూ టీడీపీ నాయకులు దశాబ్దాల కాలంగా పబ్బం గడుపుకుని అధికారం వెలగబెట్టుకున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. దివంగత ఎర్రంన్నాయుడు నుంచి ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు సైతం భావనపాడులో పోర్టు కడతామంటూ ఏళ్ల తరబడి ఓటు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సంకల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అప్పలరాజు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలపేట పోర్టు క్రెడిట్ను దోచుకునే విధంగా టీడీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టడానికి మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ (భూ సమస్యలపై) సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు నేరుగా లేదా ఆన్లైన్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడమైనదని, ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భాగంగా తాపీపని చేస్తున్న బార రామారావు (45) విద్యుత్ ఘాతానికి గురై ఆదివారం మృతి చెందాడు. పని చేస్తున్న సమయంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బార్ అప్పన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్సు చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగ డాం మండలం ఎస్పీ రామచంద్రాపురాని (అగ్రహారం)కి చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూ ర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురు గా వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు. స్కూటీ అదుపుతప్పి మహిళ మృతి పోలాకి: మండలంలోని సుసరాం ర్యాంపుల వద్ద స్కూటీ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఉర్జాం గ్రామానికి చెందిన సంపతిరావు తేజ అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. మరో మహిళతో కలిసి ఒక ఫంక్షన్లో మెహందీ పెట్టేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలం వద్ద నుంచి పోలీసుల సహకారంతో నరసన్నపేట ఆస్పత్రికి తరలించగా, అప్పటికే తేజ మృతి చెందింది. మృతురాలి భర్త ప్రకాశ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అతనికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో మెహందీ పెట్టేందుకు తేజ వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరంవచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
సాక్షి, శ్రీకాకుళం: ‘‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’’ కార్యక్రమంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రేపు(మార్చి 30 సోమవారం) చలో మూలపేట పోర్టు కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.మూలపేట పోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అడ్డుకుంటోంది. అనుమతులు లేవంటూ వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్ల ద్వారా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చెత్త శుభ్రం చేసిన కలెక్టర్
ఆమదాలవలస: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్కులపేట, దూసి, తొగరాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పీహెచ్సీలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెడికల్కు సంబంధించిన వ్యర్థాలను వేరు చేసి డస్ట్బిన్లో వేయాలని సూచించారు. తొగరాం స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతంలో పిచ్చి మొక్కలు, చెత్త తొలగించారు. -
భారీగా గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి తమిళనాడులోని తిరువూర్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అజిత్కుమార్, గోకుల్ శక్తివేల్లను నరసన్నపేట పోలీసు లు శనివారం అరెస్టు చేశారు. మడపాం టోల్గేట్ వ ద్ద నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనంలో వెళ్తున్న అజిత్కుమార్ పట్టుబడినట్లు సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈయన వద్ద 12.550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన అజిత్కుమార్ ఒక ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తుండగా అదే కంపెనీలో పనిచేసే పద్మచరణ్ దిగల్ బత్తుతో పరిచయం ఏర్పడింది. ఈయన సహకారంతో అజిత్కుమార్ భువనేశ్వర్లో తక్కువ ధరకు గంజాయి కొని తమిళనాడులోని తిరువూర్ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయాలు చేయడం ప్రారంభించాడు. మంచి ఆదాయం వస్తుండటంతో ఈ నెల 21న తిరువూర్ నుంచి బయల్దేరి పద్మచరణ్ సూచించిన వ్యక్తి వద్దకు వెళ్లి తన స్నేహితుడు గోకుల్ శక్తివేల్తో కలసి గంజాయి కొనుగోలు చేసి తిరిగి తిరువూర్ వెళ్తుండగా మడపాం వద్ద శనివా రం పట్టుపడినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్ ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి తమిళనాడుకు 3.060 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడులోని కాంచీపురం జిల్లా వలజబాద్కి చెందిన నాగరాజుమురుగన్, రాజీలు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు.వీరిని విచారించగా ఒడిశా సమంతపూర్ చంచలకులో గ్రామానికి చెంది న బరుజోదోళాయి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకి తీసుకెళ్తుండగా పోలీసుల కు పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైమ్ సిబ్బంది ఉన్నారు. రెండు కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు ఆమదాలవలస: బీఆర్ నగర్ సమీపంలో రెండు కేజీల గంజాయితో పట్టుబడిన ఆమదాలవలస పట్టణానికి చెందిన సయ్యద్ తాహిర్, మన్యాల నరేష్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సనపల బాలరాజు తెలిపారు. గంజాయి సేవిస్తున్న అందిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. వీరి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. -
12వ పీఆర్సీ అమలు చేయాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నా కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల పైబడి బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమాంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, జి.సురేష్, జిల్లా నాయకులు బి.శ్యాం, వైకుంఠరావు, ఎల్.అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మందస : కార్గో ఎయిర్పోర్టు వల్ల విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడతామని మందస మండలం రాంపురం పంచాయతీ రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం, తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్పోర్టు వల్ల గ్రామంలో 115 మంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, ఉపాధి కోల్పోయి కోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తమ సేవలందించిన మార్గదర్శకులకు ఈనెల 30న సత్కరించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం వెల్లడించారు. జీరో పోవర్టీ పి–4 కార్యక్రమం ద్వారా మార్గదర్శులు బంగారు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం మార్చి 30 నాటికి సంవత్సరం పూర్తిచేసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన, అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో శాసన సభ్యుల అధ్యక్షతన సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
నిజాలు చెప్పేందుకే పోర్టుకు పోదాం
● జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు ● 30న పోర్టుకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ టెక్కలి, సంతబొమ్మాళి: దశాబ్దాల పాలనలో టీడీపీ జిల్లాకు చేయలేని పనులు వైఎస్ జగన్ ఐదేళ్లలో చేసి చూపించారని, జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శనివారం నౌపడ మూడు రోడ్లు జంక్షన్లో గల బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.4361కోట్లతో మూలపేట పోర్టు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి అధికారంలోకి వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. పనులు చేయకపోగా.. పోర్టు చంద్రబాబు కృషి ఫలితంగా వచ్చిందంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోర్టు నిర్మాణంపై నిజానిజాలు ప్రజలకు చెప్పేందుకు ఈ నెల 30న పోర్టుకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... దశాబ్దాలుగా జిల్లాను పాలించిన టీడీపీ ఈ జిల్లా ప్రజలకు ఏం చేశారో ప్రశ్నించాలన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారు జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇతర జిల్లాల తో అభివృద్ధిలో పోటీ పడాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దీనిపై టీడీపీ క్రెడిట్ చోరీ చేయడం సిగ్గు చేటన్నారు. పోర్టుకు పోదాం బలప్రదర్శన కాదని, వాస్తవ పరి స్థితులు ప్రజలకు వివరించడానికి అని తెలిపారు. వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరా తిలక్ మాట్లాడుతూ... గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. శాంతియుతంగా పరిశీలన కార్యక్రమం చేపడుతున్నామని, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోర్టు పేరుతో సుమారు 36 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 30న జరగనున్న కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని, దీన్ని ఉద్యమంగా మార్చొద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, వైఎస్సార్ సీపీ ఇచ్ఛాపురం, ఆమదాలవలన నియోజకవర్గ ఇన్చార్జిలు సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, చింతాడ రవికుమార్, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు చల్లా రవికుమార్, దుంపల లక్ష్మణరావు, ఎన్ని ధనుంజయ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయిసురేష్కుమార్, సీనియర్ నాయకులు అంబటి శ్రీను, సనపల నారాయణరావు, పిన్నింటి సాయికుమార్, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, పాలిన శ్రీనివాస్, ఆరంగి మురళి, నర్తు నరేంద్ర, టెక్కలి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, దుబ్బ వెంకట్రావు, పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు బి.మోహన్రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్రావు, ఎస్.హేమసుందర్రాజు, టి.ఫల్గుణరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, కంచిలి ఎంపీపీ పి.దేవదాస్రెడ్డి, ఎస్.సత్యం, జి. గురునాద్ యాదవ్, పి.రాజా, పి.రవికుమార్రెడ్డి, కె.సతీష్, కె.అజయ్, ఉంగ సాయి, శిష్టు గోపి, టి.కిరణ్, ఎన్.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
డీబీసీ టు ఏబీసీ
● కర్నూలులో జరిగిన అక్రమాలపై చర్యలు ● జిల్లాలో అక్రమాలపై ఉన్నతాధికారుల విచారణ ●జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధకు డిమోషన్శ్రీకాకుళం పాతబస్టాండ్: లంచాలు తీసుకోవడం, కిందిస్థాయి సిబ్బందిని ఇంటి పనికి పెట్టుకోవడం, ప్రతి పనికీ డబ్బు లు అడగడం, అక్రమాలపై రాజకీయ అండతో కప్పిపుచ్చుకోవడం.. ఏళ్లకు ఏళ్ల పాటు సాగిన ఈ తంతుకు ఎట్టకేలకు తెరపడింది. జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధ అక్రమాలపై ఎట్టకేలకు ఉన్నతాధికారుల విచారణ పూర్తయ్యింది. ఆమె హోదా తగ్గించడమే కాకుండా పీలేరుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి(డీసీబీ) అనురాధపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనురాధపై ఇదివరకే లెక్క లేనన్ని ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగులను అవమానపరిచినట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. తనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరగకుండా జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఒత్తిడి తెచ్చుకొని తప్పించుకున్న ఆమె.. ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయారు. తాజాగా విజయవాడ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జునరావు ఈమెకు డిమోషన్ ఇచ్చారు. అంతేకాకుండా బదిలీ చేస్తూ ఈ నెల 25న ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం డీబీసీడబ్ల్యూఓగా ఉన్న ఈమెను ఏబీసీడబ్ల్యూఓ(సహాయ బీసీ సంక్షేమాధికారి)గా హోదాను తగ్గించారు. నాలుగేళ్ల పాటు డీబీసీడబ్ల్యూఓగా పనిచేసిన ఈమెను తిరిగి ఏబీసీడబ్ల్యూఓగా నియమించడం పరాభవంగానే చెప్పాలి. ఆమెను ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పీలేరు ఏబీసీడబ్ల్యూఓగా బదిలీ చేశారు. అనురాధ కర్నూలు జిల్లాలో ఏబీసీగా పనిచేసిన కాలంలో అవినీతి, అక్రమాలు, పర్యవేక్షణ లోపం, లంచాలు ఇతర అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని విచారించాక డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ విచారణ చేసి ఆమెను డీబీసీడబ్ల్యూఓ నుంచి ఏబీసీడబ్ల్యూఓగా వెనక్కి పంపించాలని నిర్ణయించారు. కర్నూలు నుంచి ఆమె తాత్కాలిక పదోన్నతి పద్ధతిలో నాలుగేళ్ల కిందట శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూఓగా బదిలీపై వచ్చారు. ఇచ్ఛాపురానికి చెందిన శాసన సభ్యుడి అండదండలు అందడంతో ఈమె అక్రమాలు పెచ్చుమీరాయి. విజయవాడలో జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఆర్థిక లావాదేవీలు జరిపేవారన్న అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే తనపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ తొక్కి పెట్టి ఉంచడంతో ఇంతవరకు ఆమె ఆటలు సాగాయి. ఎట్టకేలకు కర్నూలు అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో చర్యలకు ఉపక్రమించారు. ఆమె జిల్లాకు డీబీసీడబ్ల్యూఓగా వచ్చి నాలుగేళ్లు అవుతోంది. జిల్లాలోనూ ఆమైపె అనేక ఆరోపణ లు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది సైతం ఆమైపె పలు రకాల ఫిర్యాదులు చేశారు. రాజకీ య నాయకుల అండతో వాటిని తొక్కిపెట్టి నెట్టుకొచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లోనూ, కింది స్థాయి సిబ్బంది పదోన్నతులలోనూ రూ.లక్షల్లో చేతులు మారాయన్న అభియోగాలు ఉన్నాయి. అలాగే ప్రతి వసతి గృహం నుంచి ప్రతి నెల పిల్లల సంఖ్యను బట్టి నెల వారీ వసూలు చేస్తున్నట్టు, ఇటీవల జరిగి ఏసీబీ దాడుల్లో బయట పడింది. దీనిపై ఇంచా విచారణ సాగుతోంది. ఈ విచారణ పూర్తయితే మరోసారి ఈమైపె శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన తర్వాత బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చి న నిధులు రూ.లక్షల్లో కాజేశారని అప్పట్లో బీసీ సంఘాల వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లలో శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ఇచ్చిన ప్రమోషన్లు, బదిలీలు, డిప్యూటేషన్ల పేరుతో అవినీతి, అక్రమంగా శాంతి నగర్లో రూ. కోటి విలువైన ఆస్తులు సంపాదించినట్టు ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే బీసీ సంక్షేమ శాఖ కింది స్థాయి సిబ్బందిని తన ఇంటి వద్ద పనులకు వినియోగించుకుంటారనే అపవాదు కూడా ఉంది. జిల్లాలో జరిగిని అవినీతిపై విచారణ పూర్తయితే ఈమైపె మరిన్ని చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి అరెస్ట్పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, నిందితుడు సివిల్ ఇంజినీర్ వెంకటరమణకు భారీగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని బాధితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కేసు మలుపు తిరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి విషయంలో కూడా జీజీహెచ్లో నిందితుడి కూతురు వైద్యురాలి ఉండటంతో పోస్టుమార్టం రిపోర్ట్ మార్పిడి ప్రయత్నాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్బంగా బాధితురాలి పేరెంట్స్ మాట్లాడుతూ..‘నా కూతురికి న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.జరిగింది ఇది.. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతుల ఏకైక కుమార్తె(17) విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. స్థానికంగా సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్న వెంకటరమణ.. ‘అమ్మాయికి పాఠాలు చెబుతాను.. నా వద్దకు పంపండి’ అని తల్లిదండ్రులను ఒప్పించాడు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఆశించిన వారు నమ్మకంతో అందుకు అంగీకరించారు. ఈ నెల 22న బాలికను శ్రీకాకుళం తీసుకురావాలని వెంకటరమణ సూచించడంతో తండ్రి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తాను శ్రీకూర్మంలో ఉన్నానని.. ఇక్కడికి రావాలని వెంకటరమణ ఫోన్లో చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శ్రీకూర్మం వెళ్లారు. బాలికను అక్కడే ఉంచిన వెంకటరమణ.. తండ్రిని వెనక్కి పంపేశాడు.అనంతరం, ఈ నెల 23న బాలికను విశాఖలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి పైశాచికంగా దాడి చేశాడు. ‘మీ కుమార్తె అనారోగ్యానికి గురైంది’ అంటూ 24న తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారికి బాలికను అప్పగించడంతో స్వస్థలానికి తీసుకెళ్లారు. అప్పటికీ ఆమె కొనఊపిరితో ఉన్నప్పటికీ... ‘మీ కుమార్తె చనిపోయింది. అందుకు నేనే కారణం. ఈ విషయం బయటకు చెప్పకుండా దహన సంస్కారాలు నిర్వహించండి. మీకు డబ్బు ఇస్తాను’ అని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న కుమార్తెను వారు శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బుధవారం తీసుకొచ్చారు. ‘చదువు చెబుతానంటే నమ్మి పంపించాం. మా బిడ్డను చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించండి. న్యాయం చేయండి’ అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
శ్రీకాకుళం
● సీతారామం శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026శ్రీకాకుళం నగరంలోని కోదండరామాలయంలో కల్యాణశోభవరుడు.. రఘుకుల తిలకుడు.. వధువు.. భూమాత కూతురు. వేద మంత్రాల మధ్య వేదికలు అయోధ్యలా మారాయి. పెళ్లి సందడితో ఆలయాలు వివాహ మండపాలుగా కనిపించాయి. జానకి రాముల పరిణయ ఘట్టాన్ని తిలకించే భాగ్యం పొందిన భక్తులు తన్మయత్వంలో మునిగారు. శ్రీరామనవమి సందర్భంగా ఊరూరా రామాలయాల్లో సీతారాముల పెళ్లి జరుపుకున్నారు. వడపప్పు, పానకం పంచి పెట్టి సంబరం చేశారు. -
భూవివాదంలో నలుగురికి గాయాలు
రణస్థలం : లావేరు మండలం కొత్తకోట పంచాయతీ బట్టుపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహం భూమి విషయమై రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శివంగం నాగరాజు, అతని కుమారుడు చైతన్య, తల్లి బుల్లెమ్మ, సోదరుడు కుమారుడు సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ కుటుంబాన్ని అంతమొందించడానికే కొందరు నెల్లిమర్ల నుంచి వచ్చారని నాగరాజు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. రిమ్స్ నుంచి వచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇరువర్గీయులపై కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్సై కె.అప్పలసూరి తెలిపారు. -
కార్పొరేట్ స్థాయి వైద్యమే లక్ష్యం
కొత్తూరు: కార్పోరేట్ ఆస్పత్రులు అందిస్తున్న సేవలు కంటే దీటుగా.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందివ్వాలన్నదే రెడ్డీస్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సత్తి అన్నారు. మండలంలోని మూరుమూలలో ఉన్న కురిగాం పీహెచ్సీని రెడ్డీస్ ఫౌండేషన్ నిధులతో ఆధునీకరించారు. పీహెచ్సీని డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. పీహెచ్సీ వైద్యాధికారి పెద్దిన ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడారు. అధునాతన యంత్రాలను సమకూర్చామన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ల్యాబ్, ఫార్మసీ, పలు వార్డులు, ల్యాబరేటరీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇంతవరకు 24 పీహెచ్సీలను ఆధునీకరించామన్నారు. ఈఓ బుజ్జిబాబు, ఫౌండేషన్ సిబ్బంది సురేష్, నవీన్, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
సిరి కల్యాణపు బొట్టును పెట్టి..!
కల్యాణం వీక్షిస్తున్న భక్తులు శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల పరిణయ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి పులకించిపోయారు. అంతకుముందు రామాలయాలు, రామమందిరాల వద్ద వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధనలు, కోలాట భజనలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. – శ్రీకాకుళం కల్చరల్/వజ్రపుకొత్తూరు రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
రెవెన్యూ క్రీడా పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026ను శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కోడి రామమూర్తి స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ క్రీడల కలెక్టరేట్ యూనిట్, శ్రీకాకుళం డివిజన్ యూనిట్, టెక్కలి డివిజన్ యూనిట్, పలాస డివిజన్ యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్కుమార్, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్డీఓలు కె.సాయి ప్రత్యూష, ఎం.కష్ణమూర్తి, ఆర్.అప్పలరాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యనారాయణ, సివిల్ సప్లయ్ డీఎం టి.వేణుగోపాల్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎం.లావణ్య, ఏపీఆర్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ వి.వి.ఎన్.రాజు, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఐ.లింగ రాజు, ట్రెజరర్ మురళీధర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సమస్యలపై సైకిల్యాత్ర
మందస : మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు 700 కిలోమీటర్లు మేర సైకిల్యాత్ర చేపడుతున్నట్లు కవిటి మండలం కపాసుకుద్ధి గ్రామానికి చెందిన గుడార ప్రసాద్ తెలిపారు. డొంకూరులో ఈ నెల 13న ప్రారంభమైన యాత్ర శుక్రవారం గెడ్డవూరు గ్రామ తీరానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 55 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశానని, తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు ప్రసాద్ను అభినందించారు. -
మాజీ స్పీకర్ తమ్మినేనికి పరామర్శ
ఆమదాలవలస: మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఆమదాలవలసలోని తమ్మినేని స్వగృహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పార్టీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. పరామర్శించిన వారిలో పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఆరంగి మురళి, పార్టీ నాయకుడు పొందర అప్పన్న, తదితరులు ఉన్నారు. -
వణికించిన వడగళ్లు
● రబీ వరి పంటపై తీవ్ర ప్రభావం ● పలుచోట్ల నేలవాలిన పైరు ● రాలిన మామిడిపిందెలు సారవకోట/మెళియాపుట్టి: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రబీ వరి పంటతో పాటు మామిడి, మిరప సాగులపై అకాల వాన తీవ్ర ప్రభావం చూపుతోంది. సారవకోట మండలంలోని పొప్పంగి సమీపంలో రంగసాగరం ఆయకట్టును నమ్ముకుని ఈ ఏడాది రబీలో స్థానిక రైతులు వరి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంట దిగుబడి బాగా తగ్గింది. గత ఏడాది కరాకు సుమారు 35 నుంచి 40 బస్తాలు రాగా, ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి పంటకు సుమారు 8 నుంచి 10 బస్తాల వరకు పొల్లు గింజలు వచ్చాయని సారవకోట, గొర్రిబంద గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగసాగరం ఆయకట్టు ప్రాంతంలోని జగన్నాథపురం, జగ్గయ్యపేట, బురుజువాడ, రైవాడ, కొత్తూరు, అగదల, సవరపేట, సారవకోట, గోపాలపురం, వండానవలస తదితర గ్రామాలలో ఈ ఏడాది సుమారు 2000 ఎకరాలలో వరి సాగు చేశారు. ఈ తరుణంలో గురువారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో కోత దశకు వచ్చిన పంట చాలా వరకు నేల రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా వడగళ్లు పడటంతో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పొల్లు గింజల వల్ల దిగుబడి తగ్గిపోగా తాజాగా వడగళ్ల వానతో పంట నేల రాలి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు 82 కేజీల ధాన్యాన్ని రూ.1200కే దళారులు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. మెళియాపుట్టి మండలం జోడూరు గ్రామానికి చెందిన కమిరి సోమేశ్వరరావు, బి.ధర్మారావులకు చెందిన మిరప, నువ్వు, మామిడి పంట అంతా రాలిపోయింది. అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేలవాలింది.. గురువారం కురిసిన వడగళ్ల వానతో వరి పంట చాలా వరకు నేలవాలింది. ఇంత వరకు ఎన్నడూ చూడని విధంగా వడగళ్లు పడ్డాయి. ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా రావడంతో దిగుబడి బాగా తగ్గింది. – చెంచల చంద్రరావు, రైతు, గొర్రిబంద, సారవకోట మండలం -
రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు రేపు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రగ్బీ జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజర్ బి.నారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెన్ అండ్ ఉమెన్ కేటగిరిలో నిర్వహిస్తున్న ఎంపికల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8500007272, 7842423423 నంబర్లకు సంప్రందించాలని కోరారు. 108లో గిరిజన గర్భిణి ప్రసవం కొత్తూరు: చిన్నరాజపురం గ్రామానికి చెందిన 26 ఏళ్ల గిరిజన మహిళ సవర జ్యోతి నిండు గర్భిణి. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కొత్తూరు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చేరుకొని గర్భిణిని హిరమండలం పీహెచ్సీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో హిరమండలం పీహెచ్సీలో చేర్చించినట్లు ఈఎంటీ ఎం.కృష్ణ, పైలట్ గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గొంటివీధి సమీపంలో ఓ ప్లై వుడ్ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో శుక్రవారం వేకువఝామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపాడురోడ్డులోని కిల్లిపాలెం యూనియన్ బ్యాంకు సమీపంలో అద్దె ఇంట్లో 62ఏళ్ల వృద్ధుడు దుర్గ విజయ్కుమార్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు. గొంటివీధిలో అద్దెషాపులో ప్లై వుడ్, ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున 2.05 గంటలకు షాపులో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందడంతో సిబ్బందిని పంపించి మంటలను అదుపు చేశామని ఏడీఎఫ్వో శ్రీనుబాబు తెలిపారు. ఇన్వాల్వ్డ్ మెటీరియల్, డ్రెస్సింగ్ టేబుల్ మెటీరియల్, గ్లాస్, కంప్యూటర్, ప్రింటర్, రివాల్వింగ్ కుర్చీలు, ఫర్నిచర్ మెటీరియల్ కాలి బూడిదయ్యాయని చెప్పారు. బ్యాంకు రుణాలతో గొంటివీధి, న్యూకాలనీలో అద్దె షాపులు నడుపుతున్నానని, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, కుమార్తెలకు వివాహం చేయాల్సిన సమయంలో ఈ కష్టమొచ్చిందని బాధితుడు వాపోయాడు. హోటళ్లలో విజిలెన్స్ దాడులు పొందూరు: మండలంలోని పలు హోటళ్లలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఏడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై 6ఏ కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ రామారావు తెలిపారు. తనిఖీల్లో ఇన్చార్జి ఆర్ఐ జగదీష్, వీఆర్వో రేవతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి నరసన్నపేట: మండల పరిధిలోని కామేశ్వరిపేట, దాసరివానిపేట వద్ద రైల్వేలైన్పై శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్సీ మధుసూదనరావు తెలిపిన వివరాలు మేరకు.. కామేశ్వరిపేట వద్ద వంశధార వంతెనపై ట్రాక్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తున్న తిలారుకు చెందిన కోట అప్పారావు(29) ప్రమాదవశాత్తూ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. అలాగే దాసరివానిపేట వద్ద జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని రైలు ఢీకొని గంజాం జిల్లా కాలీకట్ ప్రాంతానికి చెందిన ఎస్.బి.పాణిగ్రహి(35) మృతి చెందాడు. ఈ రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్కు తరలించామని హెచ్సీ తెలిపారు. -
ప్రభుత్వ విప్ అశోక్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆదివాసీల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదివాసీ జేఏసీ ముఖ్య సలహాదారుడు వాబ యోగి, జేఏసీ జిల్లా అధ్యక్షుడు సవర రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని క్రాంతి భవనంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీలు ఎవరనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలన్నారు. జిల్లాలో బెంతు ఒరియా తెగ లేదని అనేక కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు తెలియజేశాయని గుర్తు చేశారు. గతంలో నకిలీ బెంతు ఒరియా ఎస్టీ సర్టిఫికెట్లను కలెక్టర్ రద్దు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే అశోక్ ఇవేవీ తెలుసుకోకుండా ఆదివాసీ నాయకులను పరుషపదాలతో దూషించడం సరికాదన్నారు. ఆదివాసి సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న నకిలీ బెంతు ఒరియాలు 27 వేలమంది గురించి పదేళ్లుగా ఫైల్ పట్టుకుని తిరుగుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, మీ నియోజకవర్గంలో మా ఆదివాసీ ప్రజలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. వారి సమస్యలపై స్పందించరెందుకని ప్రశ్నించారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే అశోక్ వైఖరి సరికాదన్నారు. జిల్లాలో రెండు లక్షల ఆదివాసి జనాభా మనోభావాలు దెబ్బతీసిన మీకు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సవర జగన్నాయకులు, ఆలిండియా ఫెడరేషన్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సవర భాస్కరావు, సవర కుమార్, జిల్లా అధ్యక్షుడు సవర చుక్కారావు, గిరిజన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు సవర సోమేశ్రావు, జన్ని కాంతారావు, బండపల్లి రాకేష్, సవర రామారావు, జన్ని వాసు చంద్రశేఖర్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అశోక్ గిరిజనులకు క్షమాపణ చెప్పాలి కొత్తూరు : ఆదివాసీ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ క్షమాపణ చెప్పాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న డిమాండ్ చేశారు. కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామంలో ఆదివాసీ గిరిజనులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అశోక్ క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు సమస్యలు వివరించేందుకు వెళ్లిన ఆదివాసీలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. బెంతు ఒరియాలను గిరిజన జాబితాల్లో చేర్పించాలని గిరిజన నేతలకు చెప్పడం భావ్యం కాదన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు ఆరిక శివ, నిమ్మక గణపతి, నిమ్మ రత్నాలు పాల్గొన్నారు. క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమమే మందస : ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం తప్పదని గిరిజన ఐక్య వేదిక మందస మండల అధ్యక్షుడు ఎస్.బిట్టుబాబు(నీలకంఠం) స్పష్టం చేశారు. శుక్రవారం పద్మపురం గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులను అవమానించేలా ఎమ్మెల్యే అశోక్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే గిరిజన సమాజం ఐక్యంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు ఎం.చూడామణి, ఎం.దాడు, ఎస్.డొంబురు, ఎస్.మోహనరావు, పి.నీలకంఠం పాల్గొన్నారు. -
దారిపై రక్తపు చారలు
ఎచ్చెర్ల: జాతీయ రహదారి మళ్లీ రక్తం పూసుకుంది. వరుస పెట్టి జరుగుతున్న ఘటనలతో రోడ్డు మళ్లీ మరణ సంకేతాలను పంపించింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు కన్నుమూశారు. దైవ దర్శనం కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఇలా మృత్యు కౌగిలిలో చిక్కుకున్నారు. అరిణాం అక్కివలస గ్రామం సమీపంలో బైక్ లారీని ఢీకొన్న ఘటనలో విశాఖపట్నం సెంగలరావుపేటకు చెంది న తల్లీ కొడుకులు నాగమణి(55), సీహెచ్ నరేంద్రకుమార్(32) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సెంగలరావుపేటకు చెందిన తల్లీకొడుకులు అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దర్శనం కోసం బైక్పై వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా అరిణాం అక్కివలస వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నరేంద్రతో పాటు వెనుక కూర్చున్ని తల్లి కిందకు పడిపోగా.. ఇద్దరూ ఘటనా స్థలంలోనూ ప్రాణాలు వదిలేశా రు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నరేంద్రకుమార్కు వివాహమై ఓ పాప ఉంది. -
వడగళ్లు.. రైతుకు కడగండ్లు
సారవకోట: మండలంలో గురువారం కురిసిన వడగళ్ల వానతో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత మూడు రోజుల నుంచి రబీలో వరి కోతలు చేపట్టి ధాన్యం జాతీయ రహదారి 326ఎపై ధాన్యం ఆరబెడుతున్నారు. అయితే వర్షం కురవడంతో రైతులు వాటిని చక్కబెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రైస్ మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం బస్తాల పై టార్పాలిన్లు కప్పి ధాన్యం బస్తాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. సుమారు అరగంటకు పైగా వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో కొన్ని దగ్గర ధాన్యం తడిసి పోయాయి. హిరమండలం: హిరమండలం, ఎల్ఎన్పేట మండలాల్లో గురువారం వడగళ్ల వాన ముంచెత్తింది. మధ్యాహ్నం వరకూ ఎండ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై వడగళ్లు పడడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. జీడి మామిడి పూత దశలో నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రయాణికులు, ప్రజలు కాసేపు బెంబేలెత్తిపోయారు. రైతులకు తీవ్ర నష్టం బూర్జ: మండలంలో గురువారం సాయంత్రం పడిన వడగళ్ల వర్షంతో పండ్ల తోటలకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇటీవల తేనె మంచు ప్రభావంతో జీడిమామిడితోట లు పూర్తిగా పువ్వు, పింజ దశల్లో మాడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పడిన ఆకాల వర్షంతో మామిడి, జీడి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. -
శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.91 లక్షలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వ రుని హుండీ ఆదాయం రూ. 1,91,175గా వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడుకొండలు గురువారం తెలిపారు. ఆలయ అధికారులు, సత్యసాయి సేవాసమితి సభ్యులు, అర్చకుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు. కార్య క్రమంలో రావివలస ఎండల మల్లికార్జునస్వా మి, దేవాలయ ఆలయ ఈఓ జి.గురునాథరా వు, పాలక మండలి చైర్మన్ శివప్రసాద్ పాడి భక్తులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మూలపేట పోర్టుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయని, ఇప్పుడు కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా అదనంగా సేకరించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశా రు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక వేత్తలు స్వయంగా భూములు కొనాలని, రైతులే వారి భూములను వారికి నచ్చిన ధర చెప్పి విక్రయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల నిర్వాసితులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అప్ప ట్లో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికీకరణ కోసం అనవసర భూ సేకరణ చేసి, పారిశ్రామిక వేత్తలతో లాలూచీ పడి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం చేయకతప్పదని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు అన్ అయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. వీరికి లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఎస్ఎస్ఏ ఏపీసీ పి.వేణుగోపాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చని, ఇతర విషయాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి సంప్రదించవచ్చునన్నారు. సంబంధిత పాఠశాలలు వెబ్సైట్లో చూడవచ్చునని, ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీలోగా ఎంపికై న పాఠశాలల్లో జాయిన్ అవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 1800425 8599 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షుడు కె.శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు.ఈ నెల 27, 28, 29 తేదీల్లో ‘శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు’ పేరిట జరిగే పోటీల్లో ఆఫీస్ సబోర్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ సహాయ సహకారాలతో కార్యకర్మం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు, ఉద్యోగుల్లో ఐక్యత పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరారు. నరసన్నపేట : మడపాం పంచాయతీ కొత్తపేటకు చెందిన పిన్నింటి రమణ (50) పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికి త్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. వారం క్రితం పొలానికి వెళ్లిన ప్పుడు పాము కరవగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొందూరు : కనిమెట్ట ఎస్సీ కాలనీకి చెందిన కె.శ్రావణ్కుమార్(32) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణ్కుమార్ భార్య కొంతకాలం క్రితం రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. దీనికి తోడు తండ్రి పక్షవాతానికి గురికావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వీటిని తట్టుకోలేని శ్రావణ్కుమార్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజారావు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. గురువా రం బార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అత్యధికంగా 127 ఓట్ల ఆధిక్యంతో విజయ సాధించారు. ఈయన గతంలో మూడుసార్లు అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఎట్టకేలకు విజయం వరించింది. జిల్లా బార్ అసోసియేషన్లో 773 ఓట్లు ఉండగా 649 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన కూన రాజారావుకు 387 ఓట్లు, మామిడి క్రాంతికి 260 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా డి.సరళకుమారి 15 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మిగిలిన పదవులు ఏకగ్రీవమయ్యాయి. జనరల్ సెక్రటరీగా చిట్టి సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరీగా డొంకాన ఈశ్వరరావు, కోశాధికారిగా సిరిపురపు సుజా త, మహిళా ప్రతినిధిగా గురువుబెల్లి సత్యభామ, లై బ్రరీ సెక్రటరీగా కె.శంకరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా జి.ఇందిరా ప్రసాద్ ఎంపికయ్యా రు. ఎన్నికల ప్రధాన అధికారిగా కంచరాన నాగభూషణరావు, ఎన్నికల సహాయకులుగా నౌపడ విజయ్కుమార్, ఎన్.వి.కె.సుబ్రహ్మణ్యం, పి.జయరావు, జె.శ్రీనివాసరావు, ఎం.వి.శ్రీనివాసరావు, ఎ.అప్పలరాజు వ్యవహరించారు. -
శ్రీకాకుళం
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026పోర్టుకు సిద్ధం1సంతబొమ్మాళి: నౌపడలో సభా స్థలాన్ని పరిశీలిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులు ‘మూలపేట పోర్టుకు పోదాం పదండి’ పేరిట పోరాటానికి వైఎస్సార్సీపీ సన్నద్ధమవుతోంది. సమర సన్నద్ధత కార్యక్రమాలు గురువారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్తో కలిసి నౌపడలో సభా స్థలాన్ని పరిశీలించారు. కంచిలి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పరిశీలకుడు దుంపల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’
కంచిలి/కవిటి: గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంతొరియా కులానికి ఎస్టీ సర్టిఫికెట్ అంశంపై ఎమ్మెల్యే అశోక్ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడం, అందుకు సంబంధించి తీసుకుంటున్న చొరవపై నిజమైన ఎస్టీ కులాలకు నష్టం జరుగుతోందని ఇటీవల గిరిజన సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. స్పందించకపోతే ఎమ్మెల్యే అశోక్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్తో గిరిజన సంఘ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ వర్గం(గిరిజనులు) 5గురు, బెంతొరియా కులం నుంచి 5గురితో కలిసి కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఈ సమయంలో కంచిలి మండలానికి చెందిన భగవాన్ దొళాయి అనే గిరిజన యువకుడు ఎమ్మెల్యే అశోక్ను ఉద్దేశించి.. ‘‘మీరు అసెంబ్లీలో మాట్లాడక ముందు ఇలా రెండు వర్గాలను కూర్చొబెట్టి చర్చించాలని తెలియదా..! అని అభ్యంతరం వ్యక్తం చేశాడు. వెంటనే ఎమ్మెల్యే అశోక్ ఆ యువకుడి మీద అమాంతం విరుచుకుపడ్డారు. ‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’ అంటూ ఆవేశంతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. గిరిజన నేతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పినప్పటికీ ఆయన శాంతించ లేదు. అనంతరం వారు ఎమ్మెల్యేకి, స్థానిక తహసీల్దార్ కృష్ణమూర్తికి వినతిపత్రాలు అందించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై గిరిజన సంఘాల అసహనం ఎమ్మెల్యే అశోక్ దగ్గరకు మాట్లాడేందుకు వెళ్లిన గిరిజన సంఘాల నేతలు అడిగిన ప్రశ్నకు తీవ్ర పదజాలంతో స్పందించడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన యువకుడు అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం తగదని గిరిజన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఏపీ రాష్ట్ర ఏఐఏఈఎఫ్ ఉపాధ్యక్షుడు సవర జగన్నాయకులు, పలాస మండలానికి చెందిన ఆదివాసీ సంఘాల జేఏసీ సభ్యులు ఉన్నారు. -
“ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’
శ్రీకాకుళం: గిరిజనులపై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ దూషణలకు దిగారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ను కలిశారు గిరిజన సంఘం నేతలు. అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు గిరిజనులు. అయితే వారిపై ఎమ్మెల్యే అశోక్ దూషణలకు దిగారు. “బ్లడీ బాస్టర్డ్… మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి?”, బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? లేక బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా?, “ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’, నేను ఏం చేయాలో కూడా మీరు చెప్పాలా?, వాడెవడు నాకు చెప్పడానికి?, ఏం చేయాలో నేను చేస్తా’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు.టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనులపై బూతు పురాణం మాట్లాడిన ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయనపై మరింత అసంతృప్తి పెరిగింది. -
పెళ్లిలో ఎలాంటి మార్పు లేదు.. భోజనాల్లేవంతే!
పార్వతీపురం మన్యం జిల్లా: అమెరికా–ఇరాన్ మధ్య కొద్ది రోజులు గా జరుగుతున్న యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత వల్ల చాలా ప్రాంతాల్లో హోటళ్లు మూతబడుతున్నాయి. హాస్టళ్లలో భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాహం జరిగితే ఇలా ఉంటుందోనని తెలియజేస్తూ ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక వెరైటీ ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం జరుగుతన్న యుద్ధం వల్ల వివాహ కార్యక్రమాల్లో ఎటువంటి మార్పు లేదని, కావున బంధు, మిత్రులు అందరూ వివాహ కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని కోరుతున్నాం. గ్యాస్ సిలిండర్లు కొరత వల్ల కేవలం భోజనం ఏర్పాట్లు మాత్రమే రద్దు చేయబడ్డాయి. మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. కానుకలు ఇచ్చేవారు నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.. వాటిపై ఎటువంటి ఆంక్షలు లేవు.. మీరంతా కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను దీవించవలసినదిగా కోరుతున్నాము. మీ కోసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం.. గమనించగలరు ధన్యవాదాలు అంటూ.. ఆహ్వానించగా దానికి బదులుగా బందువులు ఈ విధంగా బదులిచ్చారు.. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు... మా కారు గ్యాస్తో నడుస్తుంది.. ప్రస్తుతం గ్యాస్ కొరత వల్ల కారు కదిలేలా లేదు. కాబట్టి మేము పెళ్లికి రాలేకపోతున్నాం.. మీ కార్యక్రమాన్ని యథా విధిగా కానివ్వండి.. వధూవరులకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆహ్వాన పత్రిక చూసిన వారంతా ట్రెండ్కు తగ్గుట్టుందని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. -
●మూలపేట పోర్టుకు తరలిరండి
పలాసలో మాట్లాడుతున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు రణస్థలం: లావేరు మండలం కలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి అఖిల (21) అనే వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. లావేరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిలకు భర్త సురేష్కు మధ్య ఇటీవల మనస్ఫర్థలు తలెత్తాయి. భర్త సరిగా మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన అఖిల ఈ నెల 23న రాత్రి 11 గంటల సమయంలో క్షణికావేశంలో గడ్డి మందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరికి 2022లో వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె స్వగ్రామం రణస్థలం మండలం పాతర్లపల్లి పంచాయతీ సూరంపేట. మృతురాలి తండ్రి యందవ అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి జాబ్మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం తెలిపారు. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, స్కిల్ దునియా, ప్రెస్మీన్ హెచ్ఆర్ సొల్యూషన్స్, నాగార్జున అగ్రికెమ్, కాన్సెంట్రిక్స్ ఫార్మా, పీఎంజే జ్యూయలరీ, జాయ్ అలుక్కాస్, డెక్కన్ కెమికల్, ఐ స్మార్ట్ సొల్యూషన్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని 500పైగా ఉద్యోగాలు కల్పిస్తాయని వివరించారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసిటీ నెల్లూరు, హైదరాబాద్లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికా రి ఉరిటి సాయికుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ నంబర్, బయోడేటా, ఆధార్, విద్యార్హతల ఒరిజినల్, జెరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజు ఫొ టోతో కలిసి ఉదయం 9 గంటలకు జాబ్మేళా ప్రాంగణానికి హాజరుకావాలని, వివరాలకు 95509 67353 నంబర్ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
రోడ్డున పడిన టమాటా
● పెరిగిన దిగుబడి.. తగ్గిన అమ్మకాలు ● చెల్లని టమాటాను సాయంత్రం పూట పారబోస్తున్న వ్యాపారులు శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో పలుచోట్ల టమాటాలను వ్యాపారులు రోడ్డుపైనే పారబోశారు. కొన్ని రోజులుగా టమాటా ధర భారీగా పతనమైంది. హోల్సేల్లో 25 కిలోల ట్రే రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. రిటైల్ మూడు కేజీలు రూ.20 చొప్పున అమ్ముతున్నారు. రోజురోజుకు దిగుబడి పెరుగుతుండగా, అమ్మకాలు తగ్గుతుండడంతో వ్యాపారులు చెల్లని టమాటాలను సాయంత్రంపూట రోడ్లపై పడేసి వెళుతుండగా వాటిని పశువులు తింటున్నాయి. ఐదు నెలల క్రితం 25 కేజీల టమాటా ట్రే రూ.1600 వరకు ధర పలికింది. ఆ సీజన్లో జిల్లాలో పంట ఉండ దు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇతర ప్రాంతా ల నుంచి దిగుమతి అవుతున్నప్పటికీ జిల్లాలోనే పంట ఉండడంతో ఇవన్నీ అమ్మకాలు కాక రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
రైలు కిందపడి యువకుడు దుర్మరణం
ఆమదాలవలస: శ్రీకాకు ళం రోడ్ (ఆమదాలవల స) రైల్వేస్టేషన్లో బుధవా రం ఉదయం ఫలక్నుమా రైలు కింద పడి యువకుడు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, మిగ తా ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పా రు. ఆచూకీ తెలిసిన వారు 9493474582 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకు ళం రిమ్స్కి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వజ్రపుకొత్తూరు రూరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవం, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా పల్లిసారధి గ్రామంలో ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు ఉత్తరాంధ్ర ఆహ్వానిత నాటక కళాపరిషత్ పోటీలు నిర్వహించనున్న ట్లు వైఎస్సార్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్కుమార్, జన జాగృతి అధ్యక్షుడు కుమార్ నాయక్ తెలిపారు. పల్లిసారధిలో బుధవారం వారు మాట్లాడుతూ .. శ్రీరామాలయ కమిటీ, నాటక పరిషత్ కమిటీల ఆధ్వర్యంలో ‘కళ కళ కోసం కాదు–కళ ప్రజా చైతన్య కోసం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. -
గిరిజన బాలిక అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన 17 ఏళ్ల గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఊరూరా వెళ్లి సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్లగా అక్కడ వెంకట్రావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వెంకట్రావు తరచూ బాలిక ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఒప్పించి బాలికను విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్లో చేర్పించాడు. ఇటీవల పరీక్షలు పూర్తి కావడంతో బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మరుసటి రోజునే వెంకట్రావు ఫోన్ చేసి బాలికను పంపించాలని కోరగా.. అప్పటికే నీరసంగా ఉండడంతో కొద్ది రోజుల తర్వాత పంపిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. వెంకట్రావు ససేమిరా అంటూ ఇంగ్లిష్ నేర్పించేందుకు ప్రైవేట్ పెట్టిస్తానని, ఆదివారం వస్తున్నానని బాలికను అప్పగించాలని చెప్పాడు. ఆ ప్రకారమే వెంకట్రావుకు బాలికను అప్పగించారు. మరుసటి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటి పై నుంచి మీ పాప పడిపోయి మృతి చెందిందని చెప్పాడు. మీరు ఎస్.కోట రావా ల్సిన అవసరం లేదని వంగరాడమెట్ట సమీపంలోకి వస్తే అక్కడే ఖననం చేసేద్దామని చెప్పాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఎస్.కోట బయలుదేరగా మధ్యలోనే వారిని ఆపి అంత్యక్రియలు జరిపించేందుకు ఒప్పించాడు. ఇంతలో బాలికలో కదలికలు కనిపించడంతో తల్లిదండ్రులు హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా రాగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక మృతి చెందింది.బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని, అత్యాచారం తర్వాత హత్య చేసి ఉండవచ్చని అక్కడివారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. వెంకట్రావు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. -
23 తులాల బంగారం చోరీ
● రూ.లక్షన్నర నగదు మాయం ● అవలింగి గ్రామంలో ఘటన సారవకోట: అవలింగి గ్రామంలో ముద్దాడ గౌరినాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కప్ బోర్డులో దాచిన 23 తులాల బంగారం, లక్షన్నర నగదు మాయమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. గౌరినాయుడు తన తల్లి హేమలత, భార్య పావని, ఆరు నెలల పాపతో కలిసి అవలింగిలో సొంతింట్లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండు రోజులు స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకుని వెళ్తుంటాడు. శనివారం సాయంత్రం తల్లి హేమలత ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా, గౌరినాయుడు భార్య పావని చంటి బిడ్డతో ఇంట్లోనే ఉంది. ఆదివారం పావని తన బిడ్డను చూస్తుండమని పక్కింట్లో ఉండే ఓ బాలుడికి చెప్పి దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి వచ్చేసింది. సోమ వారం అత్తయ్య హేమలత క్యాంపు నుంచి తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం బ్యాంకు ఖాతాలో జమైన రూ.4వేలు విత్డ్రా చేసి కప్బోర్డులో పెట్టేందుకు చూడగా, ఆ కప్బోర్డులో ఉండాల్సిన 23 తులాల బంగారు నగలు, ఇంటి పనుల కోసం తెచ్చిన రూ.లక్షన్నర నగదు కనిపించలేదు. దీంతో కుమారుడు గౌరినాయుడుకు సమాచారమివ్వగా ఆయన వచ్చి మంగళవారం సారవకోట పోలీసుల కు సమాచారం అందించారు. క్లూస్టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. -
తొట్టెల్లో నీరుంటే ఒట్టు!
● మూగజీవాలకు దప్పిక తిప్పలు ● అడుగంటుతున్న చెరువులు, వాగులు ● నిరుపయోగంగా నీటి తొట్టెలు ● పట్టించుకోని అధికారులు ఇచ్ఛాపురం రూరల్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు పాడి రైతుల్లో ఆందోళన మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు చెరువులు, వాగులు, కుంటలు ఎండిపోవడంతో మూగజీవాలకు నీటిని అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాడి రైతులు, కాపరిలు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 16,80,000కు పైగా పశువులు ఉన్నాయి. గొర్రెలు, మేకలు మేపుకుంటూ 70 వేలకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నెల రోజుల వరకు వరకు బాహుదా, మహేంద్రతనయా నదులతో పాటు చెరువులు, బావుల్లో నీరు ఉండటంతో మూగజీవాల దాహార్తి తీర్చుకునేవి. వేసవికా లం ప్రారంభం కావడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో తాగేందుకు నీరులేక పశువు లుఅల్లాడిపోతున్నాయి. సంతల్లో విక్రయం.. జిల్లాలో ఒకప్పుడు చాలా ఇళ్ల వద్ద పశువుల శాల, తోటల్లో మేకలు, గొర్రెల మందల శాలలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పశువులకు మేతతో పాటు అవి తాగేందుకు నీరు లేకపోవడంతో పాడి రైతులు వ్యాపారులకు సంతల్లో పశువులను విక్రయిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిర్మించిన తొట్టెల్లో పశువులు తాగేందుకు అవసరమైన నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం–పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో ‘పల్లె పండగ 2025–26 పశువుల నీటి తొట్టె’ పేరిట గత ఏడాది ప్రతీ గ్రామంలో తొట్టెలు నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు చేసేందుకు స్థానిక టీడీపీ కార్యకర్తల్ని పురమాయించి ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.34వేలు చొప్పున అందజేసింది. దీంతో ఒక్కో మండలానికి లక్షల రూపాయలు కేటాయించారు. చాలా ప్రాంతాల్లో పశువులు సంచరించని కొబ్బరి తోటలు, గోర్జిలు, ఆలయాలు వద్ద తొట్టెలు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వాటి నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయి. జిల్లాలో బాహుదానది, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, చంపావతి, సువర్ణముఖి, వేగావతి వంటి తదితర నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేస్తుండటంతో పాటు ఎండల తీవ్రత అధికం కావడంతో నదుల్లో నీరు ఇంకిపోతోంది. చెరువులు, కుంటలు, బోరు బావుల్లో నీరు పాతాళానికి చేరుకుంటోంది. దీంతో పశువుల కాపరులు, రైతులు కొన్నిచోట్ల వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన జింకలు, ఎలుగుబంట్లు సైతం నీటి కోసం గ్రామాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. మూగజీవాలకు వేసవిలో తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతి మండలంలో పశువులు సంచరించే ప్రదేశాల్లో నీటి తొట్టెల నిర్మాణం జరిగింది. తొట్టెల్లో నీరు లేదంటూ చాలా మంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలదే. మరో మారు పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసి తొట్టెల్లో నీరు నింపేందుకు చర్యలు తీసుకుంటాం – చల్లా శ్రీనివాసరెడ్డి, ఉపాధి ఏపీడీ మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో చెత్తా చెదారంతో నిండిపోయాయి. అధికారులు పర్యవేక్షించడం మానేశారు. వేలాది రూపాయలతో నిర్మాణం చేసిన తొట్టెలు కేవలం కూటమి నాయకులకు కాసుల పథకంగా మిగిలిపోకముందే తొట్టెల్లో నీటిని నింపి మూగ జీవాల దాహర్తిని తీర్చాలి. – కారంగి మోహనరావు, మాజీ ఎంపీపీ, ఇచ్ఛాపురం -
జాబ్మేళాకు స్పందన
సోంపేట: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి.చంద్రమౌళి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోంపేట పట్టణంలోని కె.ఆర్.కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. 13 ప్రెవేటు కంపెనీల ప్రతినిధులు హాజరై 256 మంది నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 105 మందిని వివిద కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి ఎం.వంశీకృష్ణ, కళాశాల కరస్పాండెంట్ కొంచాడ శేషాద్రి, ప్రిన్సిపాల్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు అండగా నిలుద్దాం
● ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, వారికి రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. గిరిజన ఉద్యోగులపై పని ప్రదేశాల్లో వేధింపులు జరిగితే సహించేది లేదన్నారు. ఐటీడీఏ పరిధిలోని పనులన్నింటిలోనూ గిరిజనులకే తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. గిరిజనుల ముసుగులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, అక్రమంగా సంఘాలు నడుపుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కలర్ గ్రానైట్ పర్మిషన్ల అంశంపై చర్చిస్తూ గిరిజనులకు ఇబ్బంది కలిగించే వారి లీజులపై పునః సమీక్షించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో ఎస్టీలపై దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతేడాది 5 కేసులు నమోదయ్యాయని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలపై ఐటీడీఏ పీవో స్వప్నల్ పవార్తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.అన్నాదొర, గిరిజన సంఘాల నేతలు చౌదరి లక్ష్మీనారాయణ, గేదెల రమణమూర్తి, బిడ్డిక తేజేశ్వరరావు, సవర కుమారి, సవర తులసి, ధరణి బైరిసింగి, బి.పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
అదరగొట్టిన సిక్కోలు క్రికెట్ జట్టు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. కెప్టెన్, స్టార్ ఆటగాడు ఎస్డీఎన్వీ ప్రసాద్ తుఫాన్ ఇన్నింగ్స్తో 388 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. విజయనగరం జిల్లాలోని ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్జిల్లాల సీనియర్స్ పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో మంగళవారం తూర్పుగోదావరి జిల్లాతో శ్రీకాకుళం తలపడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తూ.గో. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. జిల్లా జట్టులో సాయియశ్వంత్, ఎన్.హిమకర్ తలా రెండు వికెట్లు, నంబళ్ల సుశాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. భారీ లక్ష్యసాధనతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జిల్లా 48.4 ఓవర్ల 391 పరుగులు సాధించి ఔరా అనిపించింది. ప్రసాద్ 59 బంతుల్లోనే 146 పరుగులతో నాటౌట్గా నిలిచి సిక్కోలును విజయపథంలో నిలిపాడు. బెందాళం సాత్విక్ 70 బంతుల్లో 84 పరుగులు, కె.సాయిసాత్విక్ 71 బంతుల్లో 78 పరుగులతో రాణించారు. జట్టు రికార్డు లక్ష్యసాధన పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, ప్రధాన కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంఘ ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. ఎస్డీఎన్వీ ప్రసాద్ బి.సాత్విక్ సాయిసాత్విక్ -
ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు
● ముగ్గురు డిగ్రీ విద్యార్థులకు గాయాలు నరసన్నపేట : తామరాపల్లి సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు గాయపడ్డారు. కోటబొమ్మాళి వైపు నుంచి విద్యార్థులతో నరసన్నపేట వస్తున్న ఆటోను మార్కెట్ కమిటీ వద్ద ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డిగ్రీ విద్యార్థులు కోటబొమ్మాళి మండలం సింహాద్రిపురానికి చెందిన రాజాపు సంతోష్, హర్ష, నిమ్మాడకు చెందిన శిమ్మ మాధురిలకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీజల్ కోసం బస్సు రాంగ్రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను అదుపు తప్పి ఢీకొట్టిందని ఆటో డ్రైవర్ వీరాస్వామి తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తరలించి గాయపడ్డ విద్యార్థులకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోర్టు బహిరంగ సభ విజయవంతం చేయండి
సంతబొమ్మాళి: నౌపడ మూడు రోడ్లు జంక్షన్ వద్ద ఈ నెల 30న జరిగే మూలపేట పోర్టు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ కోరారు. మంగళవారం నౌపడ మూడురోడ్లు జంక్షన్ వద్ద స్థలం లెవలింగ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మూలపేట పోర్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మిగిలిన వారిని విస్మరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. పార్టీ తరఫున ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టు, పరిసర ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు పిలక రవికుమార్రెడ్డి, చిన్ని జోగారావు యాదవ్, బడ్డ రాజేష్ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులతో వడ్డింపు
కొత్తూరు: గొట్టిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులే తోటి విద్యార్థులకు వడ్డించారు. విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించ కూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పాఠశాల వార్డెన్ అప్పన్నమ్మ వద్ద ప్రస్తావించగా కమాటి అనారోగ్యం వల్లత హాజరు కాలేదని, కుక్ ఒక్కరే ఉన్నందున విద్యార్థులు వడ్డించినుట్ల చెప్పారు. యురేకా సైన్స్ ఎక్స్పో ఫలితాలు విడుదల శ్రీకాకుళం: యురేకా సైన్స్ ఎక్స్పో–2026 రాష్ట్ర, జిల్లా స్థాయి ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.లక్ష్మణరావు, తవ్వా సురేష్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పర్యావరణం సుస్థిర అభివృద్ధికి సంబంధించి పైడి భీమవరం, ఇప్పిలి హైస్కూళ్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పైడి భీమవరం, కొల్లిపాడు హైస్కూల్ తొలి రెండు స్థానాలు సాధించాయి. మూఢ నమ్మకాలు–శాసీ్త్రయ దృక్పథం అంశంలో జర్జంగి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొందారు. ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్లో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తామని గిరిధర్ తెలిపారు. సమగ్ర చైతన్యయాత్ర ప్రారంభం ఇచ్ఛాపురం: రాష్ట్రంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమ సాధనకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర చైతన్య, రాష్ట్ర సర్వే యాత్రను చేపట్టినట్లు రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమగ్ర చైతన్య రాష్ట్ర సర్వే యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో పర్యటించి ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై.శంకర్రావు, ఉపాధ్యక్షుడు కె.పాల్రాజు, కార్యదర్శి బి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి, కోశాధికారి ఎం.శ్రీధర్, స్వేచ్ఛావతి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు రంగాల శ్రీనివాసరావు, కార్యదర్శి చిలకలపూడి కృష్ణారావు, ధర్మసాహు, దానేష్రెడ్డి, కాయశ్రీను, దుదిష్టి, కె.మణి పాల్గొన్నారు. ఆదిత్యలో సావి–3 సినిమా పోస్టర్ ఆవిష్కరణ టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సావి–3 సినిమా పోస్టర్ను డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీలక్ష్మి కృష్ణ ఫిల్మ్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ కృష్ణమాయ, నిర్మాత విజయ్ తదితరులు తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో నాలుగు రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నటులు సామ్రాట్రెడ్డి, లిఖిత, డిమాన్ పవన్, టెంపర్ వంశీ, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అలుమ్ని ఇన్చార్జి డి.యుగంధర్, శాక్ ఇన్చార్జి సురేష్, ఎస్టేట్ మేనేజర్ పిరియా రమేష్, డీన్ డి.విష్ణుమూర్తి పాల్గొన్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలోని ఓ గ్రామంలో తోటలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామపెద్దల వద్ద పంచాయితీ జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యాత్రలో పాల్గొన్న ఎలక్ట్రికల్ యూనియన్ ప్రతినిధులు -
దళితుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ●జెడ్పీలో వినతుల స్వీకరణ శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. దళితులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన దళితుల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, ఐఐఐటీ, మున్సిపల్ కార్పొరేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఏపీఈపీడీసీఎల్, తదితర శాఖల అధికారులతో ఎస్సీ రోస్టర్ పాయింట్ అమలుపై సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగిన వెంటనే పోలీసుల స్పందించి ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు 9701305417 వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ, న్యాయం అందించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఎస్సీ కమిషన్ 59 ఉప కులాలకు రక్షణ కవచం వంటిదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అధికారులను కోరారు. అంతకుముందు సీతారాంకి జిల్లాలోని దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దళిత నాయకులు బోకర నారాయణరావు, కల్లేపల్లి రామ్గోపాలరావు,, డి.గణేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.వినాయకం, భూ గర్భ గణులు శాఖ ఉప సంచాలకులు మోహనరావు, డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోధ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డాక్టర్ కంఠ వేణు, ఏపీఈఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ పి.ఎం.జె.బాబు తదితరులు పాల్గొన్నారు. -
నీరున్నా.. కన్నీరేనా..?
● వంశధార కాలువలకు నీరు నిలిపివేత ● బ్యారేజీ పనుల పేరుతో వృథాగా కిందకు.. ● పోలీస్ పహారాతో నీటిని దిగువకు విడుదల ● అన్నదాతలకు అపార నష్టం తీరని అన్యాయం.. రైతులకు వంశధార అధికారులు తీరని అన్యాయం చేశారు. కనీసం బ్యారేజీ పనులు అని ముందుగా చెప్పి ఉంటే పంటల సాగును స్వచ్ఛందంగా నిలిపివేసేవాళ్లం. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రైతులు నష్టాల్లో కూరుకుపోయేలా చేశారు. – మీసాల బాస్కరరావు, రైతు, భగీరథిపురం చాలా ఘోరం ఇంతకంటే ఘోరం ఉంటుందా? రైతుల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యం తగునా? ముందుగా చెప్పి ఉంటే పంటల సాగు చేయకుండా ఉండేవాళ్లం కదా. రైతులకు కన్నీళ్లు మిగిల్చారు. – కరణం శివరాం, రైతు, పిండ్రువాడ హిరమండలం: ‘వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనులు 2026 ఫిబ్రవరికి పూర్తిచేస్తాం. రబీలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరు శనగ, ఇతర పంటలను వేసుకోవాలి. వరికి నీరు ఇచ్చే ఆస్కారమే లేదు. మాట వినకుండా వరి వేసి సాగునీరు అందించలేద ని చెప్పి మమ్మల్ని నిందించకండి. వరి తప్ప ఇతర పంటలు వేసుకోండి’.. గత ఏడాది డిసెంబరు 6న శ్రీకాకుళం జెడ్పీ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా మండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన ఇది.. వంశధార పరిధిలో రైతులు రబీకి వేరు శనగ, నువ్వు, మొక్కజొన్న, ఇతర కూరగాయలను సాగుచేశారు. కర్బూజా వంటి పంటలను కూడా వేసుకున్నారు. పెట్టుబడులు పెట్టాక, దిగుబడులు వస్తాయ న్న సమయంలో గొట్టా బ్యారేజీ మరమ్మతుల పేరిట నీటిని కిందకు వదిలేస్తున్నారు. కనీసం రైతుకు ఒక మాటైనా చెప్పకుండా నీటిని వదిలేయడంతో రబీ పంటలు వేసుకున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎడమ, కుడి కాలువ పరిధిలో నీటి సరఫరాను నిలిపివేశారు. బ్యారేజీలో స్థిరీకరించిన నీటిని కిందకు వృధాగా విడిచిపెట్టేశారు. దీంతో కాలువల పరిధిలో రబీ పంటలు వేసుకున్న రైతులు రెండు సార్లు ఆందోళనకు దిగారు. మంగళవారం మరోసారి ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మూడు నెలల కిందట జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఓ సలహా ఇచ్చి ఉన్నా పంటలు వేసుకునే వాళ్లం కాదని, ఇప్పుడు డబ్బు, కష్టం రెండూ వృథా అయ్యాయని వాపోతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో రబీ సాగు లక్ష్యం 70,319 హెక్టార్లు. అయితే ఇందులో సింహభాగం వంశధార కాలువల పరిధిలో పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పండిస్తారు. అధికారుల సూచనలతోనే ఈ ఏడాది వరి వేయలేదు. ఇప్పుడు వేసిన పంటలకు కూడా నీరివ్వకుండా వేధిస్తున్నారు. ముందుగా చెప్పకుండా ఉన్నట్టుండి నీరు ఆపేయడంతో పెట్టుబడులను రైతులు నష్టపోతున్నారు. -
సంబరాల వేళ..
జలుమూరు: అందవరంలో గ్రామ దేవత పండగలో భాగంగా మంగళవారం సిరిమాను ఉత్సవం అంబరాన్ని తాకింది. సిరిమానును ప్రత్యేకంగా పూలు, పసుపు కుంకుమ, నూతన వస్త్రాలతో అలంకరించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి అమ్మవారికి, సిరిమానుకి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం రాజుబాబు ఇంటి నుంచి సిరిమానును ప్రారంభించారు. ఆచారం ప్రకారం అందవరపు కుటుంబీకులైన అందవరపు రాము సిరిమాను అధిరోహించారు. మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు డీసీసీబి మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, పైడి విఠలరావు, రేగాన శ్యామ్, బగ్గు గౌతమ్పిట్ట ప్రసాద్, పొన్నాడ విజయ్, ఎస్.ఆదిబాబు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక పరిష్కారం ఉండాలి : ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : పబ్లిక్ గ్రీవెన్స్లో స్వీకరించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా పరిష్కారం చూపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలన, పోలీసు సిబ్బందికి సంబంధించి అన్ని అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–ఆఫీస్ విధానం ద్వారా జరగాలని, ఎస్ఐల పనితీరును డీఎస్పీ, సీఐలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విజుబుల్ పోలీసింగ్లో భాగంగా గ్రామాల్లో నిత్యం సందర్శించి ప్రజలతో మమేకమవ్వాలని, నారీశక్తి–సంకల్పం పేరిట మహిళలు, బాలికల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. బాణసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి నియమ నిబంధనలు, అనుమతులు, లైసెన్సులను పరిశీలించాలన్నారు. సకాలంలో కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాన్బెయిల్బుల్ వారెంట్లను తక్షణమే అమలు చేయాలన్నారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమణ, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, గోవిందరావు, సీఐలు పాల్గొన్నారు. -
రబీ పంట సిద్ధం
సారవకోట: మండలంలో రబీలో సాగు చేసిన వరి పంట చేతికి రావడంతో రైతులు వరి కోతలు చేపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రబీ సీజన్లో 3 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో ప్రస్తుతం అంగూరు, అడ్డపనస, సారవకోట గ్రామాలలో వరి కోతలు చేపట్టి ధాన్యంను రోడ్లపై ఆరబెడుతున్నారు. ‘గ్రామ పెద్దలు చట్టాలను గౌరవించాలి’ రణస్థలం: ప్రజలు, ప్రజా ప్రతినిధులు చట్ట పరిధిలో సమస్యలను కోర్టు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేయడం ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. మండలంలోని కొండములగాం గ్రామంలో ఇటీవల కొన్ని కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేసి దండోరా వేయడం అనే వివాదంపై ఆ గ్రామంలో అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కు టుంబాలు, వ్యక్తుల గౌరవాలకు భంగం కలిగే లా చర్యలు చేపట్టరాదని, అలా చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘నీరు వృథాగా వదిలేస్తున్నారు’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గొట్టా బ్యారేజీలోని నీటిని వృథాగా విడిచిపెట్టేస్తున్నారని, దీని వల్ల రబీ పంట చివరి దశలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో భగీరథపురం, నీలదేవిపురం, గొడియపాడు, మహాలక్ష్మిపురం, పిండ్రువాడ, అంబావల్లి, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు తదితర గ్రామాల వారు మంగళవారం ఉన్నతాధికారులకు విన్నవించారు. కలెక్టర్ లేకపోవడంతో అందుబాటులో ఉన్న డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందించారు. పై గ్రామాల్లో ఈ రబీసీజన్లో సుమారు 2 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, వరి కోత దశకు వచ్చాయని, మరో 15 రోజుల్లో పంట చేతికి అందుతుందని, ఇలాంటి సమయంలో బ్యారేజీ గేట్లు పైకెత్తి నీటిని వదిలేయడం రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని రెడ్డి శాంతి పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావులను కలిసి పలుమార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు అందరికీ పడడం లేదని, సాగునీటి విషయంలోనైనా న్యాయం చేయాలని రెడ్డి శాంతి వినతిపత్రంలో కోరారు. -
సిక్కోలు.. కొత్త లెక్కలు
1.60లక్షల జనాభా ప్రాతిపదికనైతే.. రాజకీయానికి కొత్త రెక్కలు హస్తిన నుంచి చల్లని కబురు వచ్చింది. జిల్లా రాజకీయం ఉప్పొంగింది. ఇన్నాళ్లూ గుండెల్లో పెట్టుకున్నా ఆశలు రెక్కలు తొడుక్కొని వ్యూహాలోకాల్లో విహరిస్తున్నాయి. పునర్విభన జరిగితే నియోజకవర్గాలు పెరిగి కొత్తకొత్త పదవులు పుట్టుకొచ్చి రాజకీయ నిరుద్యోగం తీరుతుందని ఆశ. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నియోజకవర్గాల పునర్విభజన ప్రకటన జిల్లాలో రాజకీయ వేడి రగిలించింది. ఈ ప్రకటన రాజకీయ ఆశావహులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. పునర్విభజన జరిగితే జిల్లా ముఖ చిత్రంతో పాటు రాజకీయ స్వరూపం మారుతుంది. ప్రస్తుతం ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా మరో ఆరు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకో లోక్సభ నియోజకవర్గం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పడతాయి? వాటిలోకి ఏ మండలాలు వస్తాయి? అన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. సర్వత్రా ఇదే చర్చ.. 2004లో 12 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. కానీ 2009 పునర్విభజన అయ్యాక 10 అసెంబ్లీ స్థానాలకు పడిపోయాయి. ఉణుకూరు, హరిశ్చంద్రపురం నియోజకవర్గాలు రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కూడా 10 అసెంబ్లీ స్థానాలుండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్సభకు పరిమితమైంది. త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో గణనీయంగా అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. దీంతో జిల్లా చరిత్రలో అత్యధిక నియోజకవర్గాలుగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న నియోజకవర్గాలు మారుతాయా? ఉన్న మండలాలు పోతాయా? కొత్త మండలాలు వస్తాయా? ఇలా రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. ఆశల పల్లకిలో ఆశావహులు.. జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ నాయకులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా మరికొంత మంది పోటీ చేసే అవకాశం రానుండడంతో గంపెడాశలు పెట్టుకున్నారు. చాలా మంది నాయకులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ఇంతవరకు పరిమిత స్థానాలు కావడం, నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు వచ్చేసరికి కొందరినే సీట్లు వరిస్తున్న పరిస్థితి నెలకొంది. మిగతా వారికి నిరాశే ఎదురవుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పోటీ ఎక్కువగా ఉంది. సీట్ల కోసం పోటీ పడటమే కాదు ఎంతైనా ఖర్చు పెట్టాలన్న ఉత్సుకతతో సీటు ఇస్తే మా తడాఖా చూపిస్తాం, అవసరమైతే ఎంతవరకై నా ఖర్చు పెడతామనే నాయకులు ఉన్నారు. అలాంటి వారందరికీ నియోజకవర్గాల పునర్విభజన మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ● ప్రస్తుతం ఉన్న లోక్సభతో పాటు మరో లోక్సభ స్థానం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.● ఈ లెక్కన మన జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియ జరిగితే మారనున్న జిల్లా ముఖచిత్రం రాజకీయ లెక్కలూ మారే అవకాశం ఔత్సాహిక ఆశావహుల్లో ఆనందం జనాభా లెక్కల ప్రకారం కొత్తగా ఆరు అసెంబ్లీలు ఏర్పాటయ్యే అవకాశం మరో లోక్సభ వచ్చే ఛాన్స్! జరిగితే ఇలా..! తాజాగా చేపడతామంటున్న పునర్విభజన ప్రక్రియతో కొత్తగా సుమారు ఆరు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 14కి, రెండు లోక్సభ స్థానాలకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముందు ఇలా.. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్సభ స్థానాలు ఉండేవి. జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక లోక్సభ ఉంది. -
‘క్షయ వ్యాధిని నివారిద్దాం’
శ్రీకాకుళం : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు మంగళవారం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తు న్నామని తెలిపారు. జిల్లాలో 2.0 మిషన్లు, టీబీ నాట్ మిషన్లు ఉన్నాయని ఈ వందరోజుల కార్యక్రమంలో భాగంగా 77 పంచాయతీలను 1000 మంది పాపులేషన్ లెక్కన తీసుకొని ఒకటి కంటే తక్కువ ఉన్న పంచాయతీలను టీబీ ముక్త పంచాయతీలుగా ఒకటి లేక ఎక్కువ కేసులు ఉన్న పంచాయతీని సిల్వర్ పంచాయతీగా ఒకటి లేక సున్నా ఉన్న పంచాయతీలను గోల్డ్ పంచాయతీలుగా నిర్ణయించామన్నారు. టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. -
నల్ల రిబ్బన్లతో నిరసన
మందస: బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బిడిమి గ్రామంలో ప్రజలు, రైతులు నల్ల రిబ్బన్లతో సమావేశంలో పాల్గొని నిరసన తెలిపారు. గత 18 నెలలుగా కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నామన్నారు. సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతు కొంతమంది వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్ వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రచారాన్ని చేస్తున్నారని,కానీ అది పూర్తిగా అసత్యమని అన్నారు. కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తున్న రైతులు -
అర్జీల పరిష్కారానికి చర్యలు
● ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ● పీజీఆర్ఎస్లో 149 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో 149 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 30, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 16, పేదరిక నిర్మూలన సంస్థ 13, మున్సిపల్ కార్పొరేషన్ 11, ఏపీఈపీడీసీఎల్ 11, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 5, రూరల్ డవలప్మెంట్ 5, అటవీ శాఖ 2, ఆర్డబ్ల్యూఎస్ 5 తదితర శాఖల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ● ఏనేటి కోండ్స్ కులాన్ని ఎస్టీ కులంలో చేర్చారని.. అందువలన తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంను రెవెన్యూ అధికారులు అందజేయాలని కోరుతూ విద్యార్థులు, యువత పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా ఈ కులానికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయుడం లేదని తెలిపారు. దీనివలన యువత ఉద్యోగ, ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిలో ఒక విద్యార్థిని మూర్చపోయింది. ● తనకు కళాకారుల పింఛన్ పునరుద్ధరించాలని సరుబుజ్జిలి మండలంలోని పెద్ద సవలాపురం గ్రామ పంచాయతీకి చెందిన కోరాడ అప్పారావు కోరారు. ● శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ రిజర్వు ప్రాంతాలు, లే అవుట్ రిజర్వు ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పూజారి నాగేశ్వరరావు కోరారు. ● బీసీ, ఎస్టీ, ఎస్టీ హక్కుల చట్టాలను ప్రభుత్వ అధికారులు కఠినంగా అమలు చేయాలని, అందరికీ సామాజిక న్యాయం దక్కాలని భారత్ చైతన్య యువజన పార్టీ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో వినతి పత్రంను అందజేశారు. -
బంగారం దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు
మందస: మండలంలోని హరిపురం గ్రామ పెద్దవీధికి చెందిన పొట్టి శాంతి ఇంట్లో ఇటీవల 20 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేసుని విచారణ చేసిన పోలీసులు నిందుతుడిని సోమవారం పట్టుకున్నారు. నిందితుడు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. నిందితుడు ఉమాకాంత్ బిస్వల్(శంకర్) హరిపురంలోని శ్రీలక్ష్మీ స్వీట్ షాప్లో కూలీపని చేసుకుంటున్నాడు. అదే షాపులో పొట్టి శాంతి కూడా పని చేస్తుండగా, ప్రతిరోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి తన హ్యాండ్ బ్యాగులో వేసుకొని షాపునకు వచ్చింది. నిందితుడు శంకర్ ఆమె బ్యాగ్లో ఉన్న తాళం చెవిని తీసి శాంతి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పట్టపగలే దొంగలించాడు. దీనిపై ఆమె ఈనెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందుతుడిని పట్టుకున్నారు. సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి సోంపేట కోర్టుకు తరలించారు. -
ఖచ్చితమైన గణాంకాలే దేశ ప్రగతికి పునాది
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల శాసీ్త్రయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జన గణాంకాలే ప్రాతిపదిక అని కలెక్టర్, ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత జన గణన–2027కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పదేళ్లకొకసారి నిర్వహించే ఈ మహత్తర ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 1, 2027ను సూచిక తేదీగా తీసుకుని నిర్వహించే ఈ గణనలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సమర్దవంతమైన డేటా సేకరణ ద్వారానే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పథకాలు రూపొందించడం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ బి.వి.ఎల్.సాయి శేఖర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అధికారి శివ కుమార్, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఓటర్ల జాబితాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ విభాగం విస్త్రృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తేనే విజయం మన సొంతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కుంబా రవిబాబు మాట్లాడుతూ బూత్ లెవెల్ కమిటీలు చాలా జాగ్రత్తగా పనిచేయాలని, లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం అధికార పార్టీ నాయకులకు చాలా సులువని, అధికారులంతా వారికే సహకరిస్తారు కాబట్టి తొలగింపు పెద్ద పని కాదన్నారు. కాబట్టి వైఎస్సార్సీపీ బూత్ కమిటీలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడు దోమ మన్మథరావు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, కళింగ వైశ్యకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాస్రావు, కరిమి రాజేశ్వరరావు, చల్ల శ్రీను, నర్తు నరేంద్రయాదవ్, చల్ల శ్రీను, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమేష్, పూర్ణసాగర్, రవిచంద్ర, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉలిక్కిపడ్డ నరసన్నపేట
● పట్టపగలే చైన్ స్నాచింగ్ నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో పట్టపగలు జనసంచారం అధికంగా ఉన్నచోట ఒక మహిళ మెడలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా పట్టణంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న జగన్నాథపురానికి చెందిన కాల్ల పద్మ విధులు ముగించుకొని తోటి టీచర్స్తో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బండి వీధి వద్ద ఒక షాపింగ్ మాల్ వద్దకు వచ్చేసరికి శిథిల ప్రభుత్వ షాపుల వైపు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మెడలో ఉన్న చైన్ను లాక్కొని వెళ్లిపోయారు. దీంతో పద్మ రోడ్డుపై పడిపోగా చుట్టుపక్కల వాళ్లు తేరుకొని, ద్విచక్ర వాహనాన్ని వెంబడించే ప్రయత్నం చేయగా సత్యవరం జంక్షన్ వైపు అత్యంత వేగంగా పరారయ్యారు. కాగా పద్మను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ తన మెడలో రెండు పావు తులాల పుస్తెలతో పాటు బంగారు గొలుసు ఉందని తెలిపారు. కాగా ఈ సంఘటనపై వెంటనే స్పందించిన నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితురాలు పద్మ నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ గణేష్ -
ఎస్పీ గ్రీవెన్సుకు 55 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)నకు బాధితుల నుంచి 55 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కోత కోసేశారు తమ వరిపంట పొలాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కోత కోసేశారని, ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సంతబొమ్మాళి మండలం కొల్లిపాడుకు చెందిన జి.ద్రౌపది తరపున ఆమె కుమారుడు, వికలాంగుడైన మురళి ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
సనాతన ధర్మ ప్రచారం కోసం..
కంచిలి: భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్తోను, మరొకరు స్కేటింగ్ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్ చేసే అశుతోష్ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్ రాష్ట్ర పరిధి శివాం జిల్లా నుంచి బయల్దేరి నేపాల్ బోర్డర్ వరకు వెళ్లి, మళ్లీ దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. సైకిల్ వినియోగిస్తే డబ్బులు ఆదా కావడంతోపాటు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గుతుందని, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. స్కేటర్ రాజా ఛార్దమ్ యాత్ర చేస్తూ 12 శక్తిపీఠాలను దర్శనం చేస్తూ ఆల్ ఇండియా టూర్ చేస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటి వరకు 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. మొత్తం 15వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని తెలిపారు. వీరిద్దరూ వేర్వేరుగా వీళ్ల ఆల్ ఇండియా యాత్రలు చేపడుతూ, కంచిలి వచ్చేటప్పుడు ఒక్కచోట కలిశారు. వీరికి కంచిలికి చెందిన వ్యాపారి సంజయ్ కుమార్ శర్మ ఆదివారం రాత్రి ఆతిథ్యం కల్పించి సత్కరించారు. -
మా కన్నీరు చూడండి
హిరమండలం: వంశధార అధికారుల అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం బ్యారేజీలో నీటిని స్థిరీకరించకుండా దిగువకు విడిచిపెడుతున్నారు. దీంతో ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టాలని సోమవారం రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గొట్టా బ్యారేజీపై రైతులు బైఠాయించడంతో అటు పాతపట్నం, ఇటు శ్రీముఖలింగం, మరోవైపు హిరమండలం నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ ఇటీవల బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడిచిపెడితే ఆందోళన చేశామని, నెలాఖరు వరకు నీటిని ఎడమ ప్రధాన కాలువ ద్వారా అందించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించామన్నారు. అయినా మళ్లీ నీటిని కిందకు విడిచి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ గా పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి సాగు చేశామని, తీరా పంట చేతికి అందివస్తున్న వేళ నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్, మంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఇదేం పనితీరు..?
సోంపేట: కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కొర్లాం గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొర్లాం గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు ఆదివారం రాత్రి పొలానికి వెళ్లగా విష కీటకం కరిచినట్లు గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే మందులు ఉచితంగా ఇస్తారని సూచించారు. వెంటనే బాధితుడు కొర్లాం ప్రాథమిక ఆరో గ్య కేంద్రానికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో తలుపులు వేసి ఉండడం గమనార్హం. చాలాసేపు కేకలు వేసినా, డోర్ కొట్టినా సిబ్బంది తలుపు తీయలేదని బాధితుడు ఆరోపించారు. నొప్పి తీవ్రంగా ఉండడంతో హరిపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఏడాదిగా పూర్తిస్థాయి వైద్యుడు లేక ఆస్పత్రిలో సేవలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి వైద్యుడు భాస్కరరావు స్పందిస్తూ.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. ● ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రిలో అందని సేవలు ● ఇబ్బంది పడ్డ బాధితుడు -
అస్త్రంగా మూలపేట
శ్రీకాకుళం30న చలో మూలపేట విజయవంతం చేయండి మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026దాడిచేద్దాం ముప్పేటశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దశాబ్దాలుగా సిక్కోలు కల గంటున్న మూలపేట పోర్టును సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి రూ.3400కోట్లు నిధులు మంజూరు చేసి సుమారు 74 శాతం పనులు పూర్తిచేశారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ జగన్మోహన్రెడ్డి ఖాతాలో పడిపోతుందనే అక్కసుతో టీడీపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తున్నార ని వారు మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలో ‘మన మూలపేటకు పోదాం పదండి’ పేరిట సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 30న చలో మూలపేటను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అదీప్రాజు, తూర్పుకాపు, కళింగవైశ్య, వెలమ కుల రాష్ట్ర బీసీ విభాగం నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్రకార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, రాష్ట్రకార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, పార్టీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, ఎస్ఈసీ మెంబర్లు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయి, ఉలాల భారతిదివ్య, చల్ల రవికుమార్, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, మార్పు పృధ్వి, ముత్తా విజయ్కుమార్, ప్రత్తి అన్వేష్, గంట్యాడ రమేష్, బొడ్డేపల్లి రమేష్, బూడి అనురాధ, గేదెల పురుషోత్తం, మండవల్లి రవి, కోణార్క్ శ్రీను, సనపల నారాయణరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, రౌతు శంకరరావు, తంగుడు నాగేశ్వరరావు, అంధవరపు రమేష్, డాక్టర్ నిమ్మన దాస్, చిట్టి జనార్ధనరావు, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు అశోక్చక్రవర్తి, గద్దిబోయిన కృష్ణయాదవ్, టి.కామేశ్వరిలతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసమర్థ ప్రభుత్వమిది శ్రీకాకుళం ఉద్యమాల పురిటి గడ్డ. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. అప్పట్లో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు శంకుస్థాపనకు హెలికాప్టర్లో నేను వచ్చి తిరిగి వెళ్తుండగా వైఎస్ జగన్ ఒక్కసారి హెలికాప్టర్ వెనక్కి తిప్పి మూలపేట పోర్టు పనులు చూసి వెళ్దామన్నారు. ఈ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఒక్క అభివృద్ధి పని చేయలేదు. – బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి రామన్న అచ్చెన్నలకు అడిగే దమ్ము లేదు పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తెచ్చి పనులన్నీ దాదాపు పూర్తి చేస్తే ఆ మిగిలిన పని పూర్తి చేయడం టీడీపీ నేతలకు చేత కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు జిల్లా అభివృద్ధికి నిధులు అడిగే దమ్ము లేదు. అరసవల్లి ఇంద్రపుష్కరిణి పనులకు మేం శంకుస్థాపన చేస్తే..శిలాఫలకాలపై పేర్లు మార్చి మళ్లీ అవే పనులకు కొబ్బరికాయలు కొట్టారు. ఒడిశా, ఆంధ్రాలో కూటమి పార్టీలే ఉన్నా నేరడిపై చర్చే జరగడం లేదు. బస్టాప్లు, సోలార్ లైట్లపై పేర్లు రాసుకుంటే అభివృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే ప్రాజెక్టులు కట్టాలి. ఈ ఏడాది బడ్జెట్లో వంశధార, నేరడిలకు పైసా వెచ్చించలేదు. మూలపేట పోర్టు నిర్మాణంలో నాటి మంత్రి సీదిరి కీలక పాత్ర పోషించారు. రానున్న రోజుల్లో వంశధార ప్రాజెక్టు, బుడగట్లపాలెం, కలెక్టరేట్లను సందర్శించి పనులు చేయాలని ప్రశ్నిద్దాం. ఏం చేయకపోయినా జనం ఓట్లు వేస్తున్నారనేదే టీడీపీ నేతల ధీమా. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సన్నాహక సమావేశంలో పార్టీనేతల పిలుపు ఉద్యమాల పురిటి గడ్డ శ్రీకాకుళం: బూడి ముత్యాలనాయుడు ఏం చేయకపోయినా ఓట్లు వేస్తున్నారనే టీడీపీ ధీమా: ధర్మాన ప్రసాదరావు రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడాలి: ధర్మాన కృష్ణదాస్ పోర్టుతో ప్రపంచంతో కనెక్టివిటీ: కుంభా రవిబాబు అపర భగీరథుడు జగన్మోహన్రెడ్డి: సీదిరి అప్పలరాజు ఇదే మన అస్త్రం వలసల నివారణకు, ఉద్యో గ, ఉపాధి అవకాశాలకు మూలపేట పోర్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే.. కూటమి పాలకులు దాన్ని పూర్తిచేయకపోవడం అన్యాయం. రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడుకుని వైఎస్సార్సీపీ విజయానికి బాటలు వేద్దాం. పది వేల మందితో పోర్టును సందర్శిద్దాం. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
కుటుంబం సామాజిక బహిష్కరణ
రణస్థలం: రణస్థలం మండలంలోని కొండములగాం గ్రామంలో బైరెడ్డి తవుడు కుటుంబ సభ్యులను సామాజిక బహిష్కరణ చేస్తున్నట్లు ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు తీర్మానం చేయడం, ఆ కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని రాత్రి సమయంలో దండోరా వేయడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనను ఖండిస్తూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రెసిడెంట్ కె.గౌరినాయుడు, బైరెడ్డి కుటుంబ సభ్యులు జేఆర్ పోలీసులకు, డిప్యూటీ ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల మేరకు.. కొండములగాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 57/15లో 10 సెంట్లు భూమి ఉంది. ఆ భూ మిపై అన్ని పత్రాలు ఉన్నాయి. కోర్టు తమకు అనుకూలంగా స్టే ఇచ్చిందని, అయినా దీనిపై తమ కుటుంబానికి ముడిపెట్టి తమను సామాజిక బహిష్కరణ చేయడం ఎంత వరకు న్యాయ మని బాధితులు ప్రశ్నించారు. దీనిపై దండోరా వేయించడం బాధ కలుగుతోందన్నారు. బంధు వుల వద్ద తలెత్తుకోలేకపోతున్నామని తెలిపారు. గ్రామ పెద్దలపై తగు చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతుల వెల్లువ
మెళియాపుట్టి: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి సోమవారం మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో ఆయన సభ నిర్వహించారు. మందస, మెళియాపుట్టి, పాతపట్నం, మందస, నందిగాం, టెక్కలి, కొత్తూరు, హిరమండలం తదితర మండలాల్లోని గ్రా మాలకు చెందిన గిరిజనులు వారి సమస్యలపై వినతులు అందించారు. వినతిపత్రాలపై ఆయన స్పందిస్తూ.. పరిష్కారం చేస్తామన్నారు. బొజ్జి రెడ్డి వస్తుండగా దీనబంధుపురం కూడలి వద్ద పలువురు గిరిజనులు గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆయనకు తెలిపారు. అయితే కారు దిగకుండా దూరంగా చూసి వెనుదిరుగుతున్న సమయంలో గ్రానైట్ వ్యర్థాల వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చూడాలని వారు కోరారు. దానికి ఆయన బదులిస్తూ వినతి పత్రాల రూపంలో రాసివ్వాలని, సమయం లేదని చెప్పి వెనుదిరిగారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● అతడి భార్యకు, పాపకు తీవ్రగాయాలు రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు జాతీ య రహదారిపై ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్కూటీపై కె.రమే ష్(32) తన భార్య సుజాత, రెండేళ్ల కుమార్తె ధాతిశ్రీతో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బుడుమూరు దగ్గరకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన రమేష్ను స్థానికులు హుటాహుటిన 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. భార్య సుజాత, పాప ధాతిశ్రీకి బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేష్ స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దాకమర్రి. గార మండలం నిజామాబాద్లో ఉన్న అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
‘బలవంతపు భూసేకరణ వద్దు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, జీడి బోర్డు ఏర్పాటు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, విలువైన బీచ్ శాండ్ను కార్పొరేట్కు అప్పగించే ప్రయత్నం మానుకోవాలని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. భావనపాడు ఫిషింగ్ హార్బర్, బుడగట్లపాలెంలో జెట్టీ నేటికీ పూర్తికాలేదని గుర్తు చేశారు. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో ఐటీ డీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, గిరిజన భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. -
నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి
● జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అధికారులను ఆదేశించారు. ఆదివా రం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన పనులపై విచారణ జరపాలన్నారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదు. సమావేశాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, వివిధ మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాజకీయం సుడాల్సిందే..!
● నిధులు సుడావి.. ప్రారంభోత్సవాలు టీడీపీ నేతలవి ● జిల్లా కేంద్రంలో కార్గిల్ పార్క్, రామలక్ష్మణ నుంచి పెద్దపాడు రోడ్డు పనులు ప్రారంభం ● కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించిన వైనం ● సుడా చైర్మన్ లేని సమయంలో ప్రారంభంపై మండిపడుతున్న జనసేన శ్రేణులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జనసేనను తెలుగు తమ్ముళ్లు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో వారికంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పొత్తు ధర్మం అన్నది పాటించడమే లేదు. ఎన్నికల వరకే వారి అవసరం, ఆ తర్వాత అనవసరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పనులు చేయడం, కమీషన్లు కొట్టేయడం, పూర్తయిన పనులు ప్రారంభించడం అంతా తెలుగుదేశం పార్టీ నేతలే చేస్తున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో గత కొన్ని నెలలు గా కార్గిల్ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ఈ పార్క్ నిర్మాణానికి సుడా నిధులు రూ.2కోట్లు వరకు వెచ్చించారు. కానీ పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభించేశారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని జనసైనికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు వరకు రోడ్డు నిర్మాణం, డివైడర్ పనులు, సెంట్రల్ లైటింగ్ తదితర పనులను మొత్తం రూ.3.68కోట్లతో చేశారు. ఇందులో ఏ పనులూ పూర్తికాకుండానే ప్రారంభించేశారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, సుడా వైస్ చైర్మన్ లేని సమయంలో ప్రారంభించడం ఏంటని జనసేన నాయకులు మండిపడుతున్నారు. వీరిద్దరికి ఎలాంటి సమాచారం లేకుండా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లు 21వ తేదీ రంజాన్ నాడు రాత్రికి రాత్రి పనులు ప్రారంభించేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ పనులు పూర్తయ్యి అంతా సిద్ధంగా ఉన్నాక ప్రారంభించారా అంటే అదీ లేదు. తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు తప్ప కూటమిలో జనసేన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సుడా సొమ్ముతో పనులు చేసినప్పుడు కనీసం ఆ శాఖ చైర్మన్కి ప్రాధాన్యత ఇవ్వాలి, కనీసం వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఆయన కూడా లేని సమయంలో ప్రారంభించేశారు. -
ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం మొదటి విడత సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు. ఆయా సబ్జెక్టుల బోర్డుల ఏర్పాటు అనంతరం దిద్దుబాటును ఆరంభించారు. ఈ సబ్జెక్టులకు నియామకమైన స్క్రూటినైజర్లు సోమవారం రిపోర్ట్ చేయనున్నారు. సీఈలు, ఏఈలకు ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జవాబుపత్రాల దిద్దుబాటులో అప్రమత్తంగా వ్యవహరించాలని, దిద్దుబాటును, మార్కుల పోస్టింగులు, మిగిలి న ఖాళీ పేపర్ల పరిశీలన, బబ్లింగ్, వంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన ప్రతిఒక్కరూ స్పాట్ కేంద్రం వద్ద విధిగా రిపోర్ట్ చేయాలని ఆర్ఐఓ సురేష్కుమార్ స్పష్టంచేశారు. బీఐఈఏపీ కాలేజ్ లాగిన్లోని అపాయింట్మెంట్ ఆర్డర్ను కళాశాల యాజమాన్యాలు/ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకోవాలన్నారు. గైర్హాజరైనవారిపై బోర్డు ఆదేశాల మేరకు తగు చర్యలు ఉంటాయని ఆర్ఐఓ వెల్లడించారు. -
ఫోజులు కొత్తవి
పనులు పాతవి.. ఈ ఫొటో చూడండి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిపి మరోసారి శంకుస్థాపన చేసిన దృఽశ్యమిది. నాడు మంజూరైన నిధులనే వినియోగిస్తూ దానికి ప్రసాద్ స్కీమ్ రూ. 58కోట్లతో అభివృద్ధి పనులని కలరింగ్ ఇచ్చారు. ఈ ఫొటో చూడండి. 2023 డిసెంబర్ 20వ తేదీన రూ.4కోట్లతో అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు నాటి రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దృశ్యమిది. నిధులు కూడా మంజూరయ్యాయి. పుష్కరిణిలో ఉన్న నీరు అంతా తీసేసి క్లీన్ చేశారు. అప్పటికి కాంట్రాక్టర్ ఖరారు కాలేదు. పనులు చేసే లోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. పనులు ముందుకు సాగలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అభివృద్ధి అనే పదానికి చంద్రబాబు ప్రభుత్వం వింత అర్థం చెబుతోంది. గత ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి అభివృద్ధి చేస్తామని అనేక శాశ్వత కట్టడాలను కూల్చేశారు. ఆ పనులకు ఇప్పటివరకు అతీగతి లేదు. ఇప్పటికే రెండు రథసప్తమి వేడుకలు అయిపోయాయి. కూల్చేసిన కట్టడా లు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్ మంజూరుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసా ద్ స్కీమ్ ద్వారా అరసవల్లి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన ఇంద్ర పుష్కరిణి పనులకే మళ్లీ కింజరాపు బాబాయ్, అబ్బాయ్లు శంకుస్థాపన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రథ సప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా గుర్తించి, ప్రజల సొమ్ముతో సంబరాలు చేసి, వివిధ కార్యక్రమాలతో సోకులు చేశారే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. అట్టహాసం పేరుతో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈ సారి రథసప్తమి దర్శనాల సమయంలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గు రి చేశారు. ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఒక్క పైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్లో అప్పటికే ఉన్న నిధులను, సుడా నిధులను వాడేసి అభివృద్ధి పనుల ముసుగులో కావాల్సిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. ఆ పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాటిని ప్రస్తుతం చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది. కార్పొరేషన్ సొమ్మును దుబారా చేయడం తప్ప పనులకు సార్థకత ఉండటం లేదు. వీరు చేసిన పనికి కార్పొరేషన్ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, నిధులు ఖాళీ అయిపోయాయని, కొత్త పనులు చేపట్టడానికి ఏమీ లేదని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఏకంగా నివేదిక ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కొత్త పబ్లిసిటీకి తెరలేపారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి ప్రజల్ని మభ్య పెట్టేడమే లక్ష్యంగా అడుగులు వేస్తు న్న పరిస్థితులు ఉన్నాయి. నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా చేసిన చంద్రబాబు ఈ జిల్లాకు చేసిన మేలంటూ ఏమీ లేదు. వైఎస్సార్ చేపట్టిన వంశధార ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మూలపేట పోర్టు, బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, వంశధార ఎత్తిపోతల పథకం, కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, ఉద్దానం మంచినీటి పథకం, గత ప్రభుత్వంలో మంజూరైన విద్యా సంస్థలకు పూర్తి సౌకర్యాలు, వసతులు, పనుల పూర్తిపై ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఇప్పటికే అధికారం వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగతా మూడేళ్లలో ఏం చేస్తారో క్లారిటీ లేదు. దానికి అరసవల్లి ఆలయం అభివృద్ధి పనుల పేరుతో కూల్చేసిన కట్టడాల చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నదిదే కొత్తగా మంజూరు కాని నిధులు పాత వాటితో సోకులు అరసవల్లి ఆలయ అభివృద్ధి పేరుతో కొత్తగా హడావుడి -
‘నంది విగ్రహం ధ్వంసం దారుణం’
సోంపేట: బారువ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోని నంది విగ్రహాన్ని దొంగిలించి ధ్వంసం చేయ డం దారుణమని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని, ఉమామహేశ్వర స్వా మి దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలో నంది విగ్రహం దొంగిలించిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. బారువ మేజర్ పంచాయతీ పరిధిలోని బారువ పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని, జగనన్న కాలనీని అభివృద్ధి చేయాలని కోరా రు. డిగ్రీ కళాశాల సమీపంలో శిథిలావస్థలో ఉన్న మంచినీటి ట్యాంకును కూల్చాలని అధికారులను కోరారు. ఆయనతో పాటు పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, వైస్ ఎంపీపీ గురాల శ్రీను, బారువ, పలాసపురం సర్పంచ్లు యర్ర రజని, తడక జోగారావు, ఎంపీటీసీ తామాడ పద్మ, దేవాలయ అర్చకులు భువనేశ్వర్ పాణిగ్రాహి, పార్టీ నాయకులు నర్తు బాను, తామాడ బుజ్జి, దున్న మాదవరావు, కర్రి సత్యం, తెప్పల ధర్మారావు, తిరుపతిరెడ్డి, అమర లోకనాథం, శంకర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ప్రకటన సరికాదు’
పలాస: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఇటీవల బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలపాల నే ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీల్లేదని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పలాసలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా జేఏ సీ అధ్యక్షుడు సవర రాంబాబు, ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న, గిరిజన సంఘం నాయకుడు సవర జగన్నాయకులు, జేఏసీ చీఫ్ అడ్వైజర్ వాబ యోగి మాట్లాడుతూ బెందాళం అశోక్ స్పీకరు రఘురామకృష్ణంరాజును కలిసి బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలని కోరడం సరికాదన్నారు. గతంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికలను చూసి ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లాలని కోరారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక, భూసమస్యలకు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల నమోదు, స్థితిగతులకు సంబంధించి 1100 నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం భక్తుల వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈఓ కె.ఏడుకొండలు ఆదివారం తెలిపారు. -
హుండీలో నగదు చోరీ
సోంపేట: బారువ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివా రం రాత్రి హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు దొంగిలించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం వెళ్లే సరికి హుండీ ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. కమిటీ సభ్యుడు ఎస్.ఆదినారాయణ బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదినారాయణ ఫిర్యా దు మేరకు ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసన మందస: బిడిమి గ్రామంలో జుత్తు జగన్నాయకులు స్మారక చిహ్నం వద్ద ఆదివారం కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్కు వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చె ప్పారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పామన్నారు. కేంద్ర మంత్రికి ఉద్దానం సమస్యలపై పట్టింపు లేదన్నారు. కార్యక్రమంలో తెప్పల అప్పారావు, కృష్ణమూర్తి, గంటు రామస్వామి, దున్న రామారా వు, తామాడ లక్ష్మీ నారాయణ, దున్న సురేష్, మర్ల సంతోష్, లబ్బ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ సీమ రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. సాయంత్రం మూడు గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు.


