Srikakulam
-
శ్రీకాకుళం పర్యటనకు వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన పాలకొండ వైఎస్సార్సీపీ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు.పాలవలస కన్నుమూతఇటీవల, వైఎస్సార్సీపీ సీనియర్ నేత,రాజ్యసభ మాజీ సభ్యుడు పాలవలస రాజశేఖరం (81)అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. రాజశేఖరం మృతి విషయాన్ని ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే జగన్...రాజశేఖరం కుమారుడు పాలవలస విక్రాంత్ను, కుమార్తె రెడ్డి శాంతిని ఫోన్లో పరామర్శించారు. రాజశేఖరం మృతికి సంతాపం తెలిపారు. గురువారం నేరుగా రాజశేఖరం ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
బొడ్డపాడులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
పలాస: పలాస మండలం బొడ్డపాడులో మార్చి 1న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో విజేతలకు షీల్డుతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. ప్రథమ బహుమతి రూ.40 వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాలుగో బహుమతి రూ. 10వేలు ఇస్తామన్నారు. క్రీడాకారులు త మ జట్టుతో మార్చి 1న హాజరు కావాలని, క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.300లు చెల్లించి తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు. మిగతా వివరాల కోసం 8309642480 సెల్ నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. ఉప్పు పరిశ్రమపై దౌర్జన్యం సంతబొమ్మాళి: నౌపడ ఉప్పు పరిశ్రమపై మూలపేట పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై నౌపడ సాల్ట్ రన్ 1956 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎన్ఎస్ కంపెనీ) యాజమాన్యం, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, నష్ట పరిహారం చెల్లించకుండా వారి ఆధీనంలో ఉన్న ఉప్పు మడులపై పోర్టు యాజమాన్యం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎస్ఎస్ కంపెనీ మేనేజర్ దివాకర్ షాతో పాటు ఉప్పు కార్మికులు, సిబ్బంది మంగళవారం అడ్డుకున్నా రు. జరిగిన నష్టాన్ని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అయినా పోర్టు సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగించారు. దీంతో ఏమీ చేయలేక ఎన్ఎస్కంపెనీ సిబ్బంది, ఉప్పు కార్మికులు వెనుదిరిగారు. అ నంతరం రోడ్డు నిర్మాణానికి తమ ఉప్పు భూ ములు ఎంత వరకు తీసుకుంటున్నారో పోర్టు యాజమాన్యం వెల్లడించలేదని పేర్కొన్నారు. పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు వేయడం వల్ల ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్
● దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులే శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత్రునివలస పరిధిలోని టిడ్కో కాలనీ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సీక్రెట్గా గంజాయి సేవిస్తుండగా రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ చదువుతున్న వారే కావడం గమనార్హం. అయితే ఇందులో విశాఖపట్నంకు చెందిన వారు ఇద్దరు కాగా, శ్రీకాకుళానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరంతా శ్రీకా కుళంలోని ఓ కాలేజీలో చదువుతున్నట్లు తెలు స్తోంది. పట్టుబడిన వారి వద్ద నుంచి అరకిలోకు పైగానే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై టౌన్ సీఐ పైడపునాయుడును వివరణ కోరగా ఆరుగురు గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లు చెప్పారు. ఎంత మోతాదుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించగా కేవలం 50–60 గ్రాము లు మాత్రమే వారివద్ద ఉందన్నారు. వీరిపై కేసు నమోదు చేయ లేదని, ప్రస్తుతం విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ ఉద్యోగాలంటూ మోసం సంతబొమ్మాళి: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కోటి రూపాయలకు టోపీ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నర్సాపురం పంచాయతీ బడే నర్సాపురం గ్రామానికి చెందిన మోడీ భాస్కర్రెడ్డి కోటబొమ్మాళిలో శ్రీమారుతి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఇటలీలో ఉద్యోగాలంటూ ఇన్ స్టిట్యూట్లో పలువురు యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి వద్ద నుంచి సుమా రు కోటి రూపాయలు వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. గడువు దాటినా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు మంగళవారం కోటబొ మ్మాళి ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వారికి సమాధానం చెబుతూ బడే నర్సాపురంలో ఉన్న ఇంటికి వెళ్లడంతో అక్కడకు వెళ్లిన బాధితులు భాస్కర్రెడ్డితో వాగ్వా దానికి దిగారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళన చేపట్టారు. మీరు ఇచ్చిన డబ్బులను ఏజెంట్కు ఇచ్చి తాను మోసపోయానని భాస్కర్రెడ్డి సమాధానం ఇచ్చారు. శాంతించని యువకులు నిలదీయడంతో.. వారి నుంచి తప్పించుకొని బైక్పైన కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అక్కడ కూడా బాధిత యువకులు ఆందోళన చేపట్టారు. శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 3.33 లక్షలు జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3,33,634 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపారు. 84 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మెగా డీఎస్సీ హామీ ఏమైంది..? శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అని చెప్పి నేటికీ భర్తీ చేయకపోవడం దారుణమని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ఎన్.ఆర్ దాసరి క్రాంతి భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్ లేక లక్ష లాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఽఖర్చుచేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణా ల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న పె ద్దలు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్. రామోజీ, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంత సిక్కోలుపై గంజాయి పంజా విసురుతోంది. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా చేసి నేరప్రవృత్తిని పెంచుతోంది. జిల్లాలో గంజాయి దొరకని పట్టణమంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి టౌన్కు సినిమా థియేటర్, బస్టాండ్, ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నంత సాధారణంగా... గంజాయ
● జిల్ల్లాలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు ● మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత ● కట్టడి లేదని అసహనం వ్యక్తం చేస్తున్న ప్రజా ప్రతినిధులు ఆమదాలవలసలో.. ●● బీఆర్నగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇటీవల కొంతమంది గంజాయి సేవిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ● ఒడిశా నుంచి రైళ్లలో బ్యాగుల్లో పట్టుకుని వచ్చి ఎదురుగా ఉండే ఒకట్రెండు లాడ్జీల్లో మకాం వేసి క్రయ విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇచ్ఛాపురం టౌన్ పరిధిలో.. ● రైల్వేస్టేషన్ శివార్లు, ఎల్మ్యాక్స్ సమీప పొదలు, బెల్లుపడ కాలనీ శివారు, పురుషోత్తపురం శివార్లు గంజాయి విక్రయాలకు అడ్డాలుగా ఉన్నాయి. ● ఈ ప్రాంతాల్లో ఇటీవల ఎనిమిది మందిని పట్టుకున్నారు. ● కంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో పొట్లాల్లో క్రయ విక్రయాలిప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. పలాస–కాశీబుగ్గ కేంద్రంగా.. ● నగర శివార్లలోని హుద్హుద్ ఇళ్లు, కోసంగిపురం జగనన్న కాలనీ, సూదికొండ, నెమలికొండ, రైల్వేస్టేషన్ అంబుసోలి, బెండితోట రిజర్వ్ ఫారెస్టు, రైల్వే గ్రౌండ్లో గంజాయి సేవిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ● రైల్వేస్టేషన్ సమీప ఆలయాలు, పలాస అన్నపూర్ణ సమీప పరిసరాల వద్ద సాధువులు అమ్ముతుంటారు. నరసన్నపేటలో.. ● ఆర్టీసీ కాంప్లెక్స్లో సులభ్కాంప్లెక్సు అడ్డాగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం. ● జమ్ము జంక్షన్ సమీప పరిసరాల్లోను, బజారులో రాజేశ్వరి టాకీస్ దగ్గర పల్లిపేట జంక్షన్ వెంకటేశ్వర థియేటర్ రాజుల చెరువు గట్టు మీద కాలనీలో, కొన్ని స్లమ్ ఏరియా ఉన్న కాలనీల్లో ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. టెక్కలిలో.. ● జాతీయ రహదారి ఆనుకొని నిర్మానుష్య ప్రాంతాలు, తోటలు, ప్రైవేటు లేఅవుట్లు, వెంచర్లు, వంశధార కాలువ ఏరియా మత్తుపదార్థాల సేవనానికి కేరాఫ్లుగా నిలుస్తున్నాయి. ● టెక్కలిలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులను కలిపే రైలు మార్గం ఉండటం, గుణుపూర్ నుంచే గంజాయి వస్తుందని స్థానికంగా చర్చజరుగుతోంది.అదేమీ శివారు ప్రాంతం కాదు.. నిర్మానుష్య ప్రాంతం అంతకంటే కాదు. దాదాపు నగరం నడిబొడ్డున.. అది కూడా పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోని పొట్టి శ్రీరాములు మార్కెట్లో ఇద్దరు యువకులు గంజాయి తీసుకుంటూ దొరికిపోయారు. అది కూడా వీరు సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే కంట పడ్డారు. మార్కెట్ను సందర్శించేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ వస్తే ఈ బాగోతం బయటపడింది. జిల్లా కేంద్రంలో గంజాయి ఎంత విచ్చలవిడిగా దొరుకుతుందో ఎమ్మెల్యే సాక్షిగా ఘటన రుజువు చేసింది.జిల్లా కేంద్రంలో.. నగరంలోని ఉమెన్స్ కళాశాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. డచ్బంగ్లా వెనుక ఖాళీ స్థలం కూడా వీరి అడ్డానే. అఫీషియల్కాలనీ ఫైర్ ఆఫీస్, ఆర్అండ్బీ సమీప సబ్పోస్టాఫీస్లలో రాత్రి వేళ చూస్తే భయం పుట్టక మానదు. మత్తులో నేరాలు – ఘోరాలు జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన హత్య ఘటనలో నిందితుడిని ఇంటరాగేట్ చేసేందుకు పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది. గంజాయి మత్తు దిగాక గానీ అతడు విచారణకు సహకరించలేదు. గత ఏడాది అక్టోబర్లో శ్రీకాకుళంలోనే ఓ యు వకుడిపై మరొకరు బ్లేడుతో గొంతు కోసేశాడు. ఒడిశాకు చెందిన ఓ యువకుడు పచ్చని కాపురంలో ప్రేమ పేరుతో చిచ్చుపెట్టాడు. మత్తులో ఏకంగా హత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో ఓ యువకుడు సొంత మేనమామ తమకు రావాల్సిన వాటాకు అడ్డుగా నిలుస్తున్నాడన్న కోపంతో స్నేహితుని సాయంతో మత్తులోనే కర్కశంగా చంపేశాడు. -
నువ్వలరేవులో విషాదం
కంచిలి/వజ్రపుకొత్తూరు రూరల్: కంచిలి జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బెహరా ధర్మారావు(31), బెహరా సన్నా అలియాస్ షణ్ముఖరావు(38) మృతిచెందడంతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్ను తాము ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ధర్మారావు స్వగ్రామంలో టైలరింగ్ చేస్తుండేవాడు. అతని సహాయకుడిగా సన్నా పనిచేస్తుండేవాడు. వీరిద్దరూ రెడీమేడ్ దుస్తుల్ని కుట్టి బరంపురంలోని హోల్సేల్ వ్యాపారులకు ఆర్డర్పై అందిస్తుడేవారు. ఈ క్రమంలోనే బరంపురం వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లబోదిబోమంటున్నకుటుంబాలు.. ధర్మారావుకు భార్య పూజ, కుమారుడు మున్నా, కుమార్తె వర్షిణి ఉన్నారు. సన్నాకు భార్య శృతి, మూడేళ్ల కుమారుడు రోషన్ ఉన్నారు. వీరంతా విషాదంలో మునిగిపోయారు. మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలకు సోంపేట సామాజిక ఆసుపత్రిలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఇద్దరు యువకుల మృతితో నువ్వలరేవులో విషాదఛాయలు అలముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు మంగళవారం గ్రామానికి చేరడంతో అశృనయానాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీలు, మత్య్సకార సొసైటీ సభ్యులు, గ్రామపెద్దలు మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అశ్రునయనాల మధ్య రోడ్డు ప్రమాద మృతుల అంత్యక్రియలు బాధిత కుటుంబాలకు పలువురి పరామర్శ -
విశిష్ట గుర్తింపు సంఖ్య తప్పనిసరి
ఆమదాలవలస: సొంత భూమి గల ప్రతి రైతు ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. జొన్నవలస రైతుసేవా కేంద్రంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. అనంతరం మునగవలసలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ఆధారిత పథకాలైన పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంటల బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు తదితర పథకాలను నేరుగా పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, భూమి రికార్డుల వివరాలతో రైతు సేవా కేంద్రంలో సమర్పించాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు, వ్యవసాయ సహయకులు, రైతులు పాల్గొన్నారు. -
సీఐడీ ఉచ్చు!
ఎస్బీఐ మెడకు● సీఐడీ చేతికెళ్లిన నరసన్నపేట ఎస్బీఐ బ్రాంచి వ్యక్తిగత రుణాల అవినీతి బాగోతం ● అంతర్గతంగా తేల్చలేక సీఐడీకి అప్పగిస్తూ ఫైలు పెట్టిన బ్యాంకు ఉన్నతాధికారులు ● పరిశీలన దశలో ఉండటంతో నంబర్ ఖరారు చేయని సీఐడీ ● గార బ్రాంచి బంగారం మిస్సింగ్ కేసు తీర్పు కోసం ఎదురు చూపులు ● ఏం గుర్తించారో వెల్లడించని పరిస్థితి సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు చెందిన రెండు బ్రాంచిల్లో చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారం మొత్తం ఆ బ్యాంకుకే మచ్చ తెచ్చిపెట్టింది. వీటిలో ఒకటి ఇప్పటికే కోర్టు పరిధిలో ఉండగా, మరొకటి సీఐడీ చేతికి వెళ్లింది. నరసన్నపేట బ్రాంచ్లో ఖాతాదారులకు తెలియకుండా ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల మీదుగా రుణాలు డ్రా చేసిన నిర్వాకాన్ని సీఐడీకి అప్పగించాలని బ్యాంకు ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోగా, గార ఎస్బీఐలో తాకట్టు బంగారం మాయం కేసుకు సంబంధించి కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నరసన్నపేట బ్రాంచ్కు సంబంధించి ఇప్పటివరకు సీఐడీ నంబర్ ఇవ్వలేదు. పలు డాక్యుమెంట్లతో కూడిన వివరాలను అడిగినట్టు తెలిసింది. అన్నీ పరిశీలించాకే కేసు నంబర్ ఇచ్చే అవకాశం ఉంది. జాతీయ బ్యాంకుల్లో కోటి రూపాయలకు లోపు అక్రమాలు జరిగితే స్టేట్ పోలీసు డిపార్ట్మెంట్కు, రూ.మూడు కోట్ల లోపైతే సీఐడీకి, రూ.3 కోట్లు దాటితే సీబీఐకి కేసు అప్పగించాల్సి ఉంటోంది. నరసన్నపేట ఎస్బీఐ బ్రాంచిలో రూ.కోటికి పైగా అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా బ్యాంకు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. కచ్చితమైన లెక్క లేకపోయినా రూ.3కోట్ల లోపే అక్రమాలు జరిగినట్టు తేలడంతో కేసును సీఐడీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. నరసన్నపేటలో ఏం జరిగిందంటే... నరసన్నపేట బ్రాంచిలో ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలపై వ్యక్తిగత రుణాలను బ్యాంకు అధికారులే వాడేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే బ్యాంకు ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టగా జరిగిన అక్రమాలను గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో రీజనల్ స్థాయి అధికారితో పాటు పలువురు బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్టు సమాచారం. తొలుత విషయం బయటకు పొక్కడంతో నాడు పనిచేసిన బ్యాంకు మేనేజర్ శ్రీకర్ మెడకు చుట్టుకుంది. రీజనల్ స్థాయి అధికారి ఒత్తిడితో సుమారు రూ.65లక్షలు బ్యాంకుకు తిరిగి జమ చేసినట్టు తెలిసింది. ఈ సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లినట్టు సమాచారం. అక్రమాలు జరిగాయని శాఖా పరంగా గుర్తించడంతో నాడు రీజనల్ మేనేజర్గా పనిచేసిన రమణమూర్తిరాజును యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేశారు. ఆ తర్వాత అప్పట్లో మేనేజర్గా పనిచేసిన శ్రీకర్పై సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికీ శాఖా పరంగా విచారణ కొలిక్కి రాకపోవడంతో పాటు రూ.కోటికి పైగా అక్రమాలు జరగడంతో సీఐడీకి కేసు అప్పగించాలని ఎస్బీఐ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. కోర్టులో గార బ్రాంచ్ వ్యవహారం గార ఎస్బీఐలో ఖాతాదారులు పెట్టిన బంగారాన్ని భద్రంగా ఉంచాల్సిందిపోయి వాటిని తీసుకెళ్లి కొందరు ఉద్యోగులు ఓ ప్రైవేటు సంస్థలో కుదవ పెట్టి కోట్ల రూపాయలు తీసుకుని సొంతానికి వాడుకున్నారు. దాదాపు 86 సంచుల్లోని రూ.4.7 కోట్ల విలువైన 7.146 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు ఈ రకంగా పక్కదారి పట్టాయి. కేసుకు సంబంధించి కోర్టులో చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. మిస్సయిన ఖాతాదారుల బంగారమంతా రికవరీ కావడంతో వ్యవహారం కొలిక్కి వచ్చేసిందని, కోర్టు తీర్పు ఇవ్వగానే ఎవరి బంగారం వారికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. అయితే దీంట్లో కీలక వ్యక్తులు తప్పించుకున్నారని, ముఖ్యంగా రీజనల్ మేనేజర్ రమణమూర్తిరాజు పాత్ర చూపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. గత రిమాండ్ రిపోర్టు కూడా సక్రమంగా లేదని తర్వాత వచ్చిన పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ మేరకు విచారణ కూడా చేశారు. కానీ ఏం గుర్తించారో వెల్లడి కాలేదు. ఆర్ఎం రాజు పాత్రపై నేటికీ రాని స్పష్టత.. ● గార ఎస్బీఐ కేసులో ఏ–1 ముద్దాయిగా పేర్కొన్న స్వప్నప్రియ 2023 అక్టోబరు నెలకు సంబంధించి బంగారు సంచులను మాయం చేసినట్లు ఉండే సీసీ ఫుటేజీని ఆర్ఎం రాజు పోలీసులకు ఇచ్చారు. కానీ అంతకుముందు నెలే (సెప్టెంబరు) బ్రాంచిలో సెంట్రల్ ఆడిట్ జరిగింది. అందులో ఎలాంటి తేడా లేదని క్లియర్గా ఉన్నట్లు చూపించారు. వాస్తవానికి పోలీసుల విచారణలో 14 నెలలుగా స్వప్నప్రియ ద్వారా ఈ తతంగం జరిగినట్లు చెప్పారు. అలాంటప్పుడు సెప్టెంబరులో జరిగిన సెంట్రల్ ఆడిట్లో ఈ అవకతవకలు బయటపడలేదా అన్నది అనుమానం. ● మొత్తం బ్యాగులన్నీ మార్చింది స్వప్నప్రియే అన్నట్లు చూపించారు. క్యాషియర్ పాత్ర లేకుండా సాధ్యమా.. ఉదంతం జరిగే సమయంలో క్యాషియర్ సురేష్ను ఆర్ఎం రాజు మూడు చోట్ల పోస్టుల్లో ఉంచారు. అంతే కాకుండా క్యాషియర్ సురేష్పై స్వప్నప్రియకు సంబంధించిన వారే దాడి చేశారంటూ అంతకుముందే గార పీఎస్లో కేసు నమోదు చేయడం.. అది ఫేక్ అని తేలడం జరిగాయి. దీనివెనకున్నది ఎవరో తేలలేదు. ● పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఓ నిందితుడు(లోహితాక్షి కన్సల్టెన్సీ తిరుమలరావు) రూ.1.70 కోట్ల వరకు నరసన్నపేట కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి కుటుంబ ఖాతాలకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీని వెనక ఆర్ఎం పాత్ర ఉందనే అనుమానం ఉంది. దీనిపై కూడా స్పష్టత లేదు. ● కేసు విచారణ జరుగుతుండగా గార బ్రాంచిలో పనిచేస్తున్న సిబ్బందిని అంతా ఒకేసారి ఆర్ఎం బదిలీ చేశారు. అది రూల్స్కు విరుద్ధం. కేసు పెట్టాల్సింది స్థానికంగా ఉన్న బ్రాంచి మేనేజరే తప్ప ఆర్ఎంకు సంబంధం లేదు. కానీ ఆయనే డైరెక్ట్గా కేసు పెట్టారు. దీని వెనక కుట్ర ఉందనే వాదనలు ఉన్నాయి. ● స్వప్నప్రియ బతికి ఉన్నప్పుడు అసలేం జరగలేదని చెప్పిన ఆర్ఎం ఆమె చనిపోయాక ఏ1గా ఫిర్యాదులో పెట్టడం వెనక కారణమేంటో ఇప్పటికీ సమాధాననం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. -
బొడ్డపాడులో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు
పలాస: పలాస మండలం బొడ్డపాడులో మార్చి 1న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు బొడ్డపాడు యువజన సంఘం అధ్యక్షుడు తామాడ క్రాంతి ఓ ప్రకటనలో తెలిపారు. బొడ్డపాడు యువజన సంఘం 71వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీల్లో విజేతలకు షీల్డుతో పాటు నగదు బహుమతులను అందజేస్తామని తెలిపారు. ప్రథమ బహుమతి రూ.40 వేలు, ద్వితీయ బహుమతి రూ.30వేలు, తృతీయ బహుమతి రూ.20వేలు, నాలుగో బహుమతి రూ. 10వేలు ఇస్తామన్నారు. క్రీడాకారులు త మ జట్టుతో మార్చి 1న హాజరు కావాలని, క్రీడాకారులకు భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎంట్రీ ఫీజు రూ.300లు చెల్లించి తమ పేర్లును నమోదు చేసుకోవాలని కోరారు. మిగతా వివరాల కోసం 8309642480 సెల్ నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు. ఉప్పు పరిశ్రమపై దౌర్జన్యం సంతబొమ్మాళి: నౌపడ ఉప్పు పరిశ్రమపై మూలపేట పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై నౌపడ సాల్ట్ రన్ 1956 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ (ఎన్ఎస్ కంపెనీ) యాజమాన్యం, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, నష్ట పరిహారం చెల్లించకుండా వారి ఆధీనంలో ఉన్న ఉప్పు మడులపై పోర్టు యాజమాన్యం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను ఎస్ఎస్ కంపెనీ మేనేజర్ దివాకర్ షాతో పాటు ఉప్పు కార్మికులు, సిబ్బంది మంగళవారం అడ్డుకున్నా రు. జరిగిన నష్టాన్ని ఎవరు ఇస్తారని ప్రశ్నించారు. అయినా పోర్టు సిబ్బంది అవేమీ పట్టించుకోకుండా రోడ్డు నిర్మాణ పనులను కొనసాగించారు. దీంతో ఏమీ చేయలేక ఎన్ఎస్కంపెనీ సిబ్బంది, ఉప్పు కార్మికులు వెనుదిరిగారు. అ నంతరం రోడ్డు నిర్మాణానికి తమ ఉప్పు భూ ములు ఎంత వరకు తీసుకుంటున్నారో పోర్టు యాజమాన్యం వెల్లడించలేదని పేర్కొన్నారు. పోర్టు యాజమాన్యం దౌర్జన్యంగా రోడ్డు వేయడం వల్ల ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
మూలకు చేరిన నిఘా నేత్రం!
● శ్రీకూర్మం క్షేత్రంలో పనిచేయని సీసీ కెమెరాలు ● పట్టించుకోని పాలకులు గార : విష్ణువు అవతారాల్లో రెండో అవతారం, ప్రపంచంలో ఇంకెక్కడా నిర్మించకూడదని పురాణాలు పేర్కొన్న ప్రముఖ క్షేత్రం శ్రీకూర్మం. ఇంతటి మహిమాన్వితమైన ఆలయం వద్ద నిఘా మసకబారుతోంది. గతంలో మూలవిరాట్ స్కాన్, తిరునామం పగలగొట్టడం వంటి ఘటనలు నేపథ్యంలో 2012లో హిందుత్వ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పలువురు అధికారులు మారినప్పుడు సీసీ కెమెరా వ్యవస్థను పటిష్టం చేశారు. తర్వాత నిర్వహణ కొరవడంతో సీసీ కెమెరా వ్యవస్థ పనిచేయడం లేదు. ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో సీసీ ఫుటేజీని పరిశీలించే మానిటర్ వ్యవస్థ పాడైపోయింది. గర్భగుడి లోపలికి, ఆలయానికి వచ్చే భక్తుల రాకపోకలు గమనించేందుకు సీసీలు ఏర్పాటు చేసినప్పటికీ మానిటర్ కొద్దిరోజుల కిందట కాలిపోయింది. ఇప్పటీకీ మరమ్మతులు చేయలేదు. వీటన్నింటినీ పర్యవేక్షించాల్సిన ఈవోకు రావివలస, పలాస గ్రూపు ఆఫ్ టెంపుల్స్తో పాటు శ్రీకూర్మనాథాలయం బాధ్యతల ఉన్నాయి. ఇక్కడ ఈవోతో మొదలుకొని అందరూ ఇన్చార్జిలే. రాత్రిపూట పవళింపు సేవ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఎవరూ ఉండకూడదన్న నిబంధన ఉన్నా అమలు కావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు దృష్టిసారించాలని గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథరావు వద్ద ప్రస్తావించగా సీసీ టీవీ మానిటర్ కాలిపోవడం వాస్తవమేనని, ఉన్నతాధికారులకు తెలియజేశామని చెప్పారు. తన మొబైల్లో లింక్ ద్వారా సీసీ ఫుటేజ్ చూస్తున్నానని తెలిపారు. -
ఉద్దానంలో ఎలుగు సంచారం
వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలో గల వజ్రపుకొత్తూరు, చినకొత్తూరు, కిడిసింగి పరిసర జీడి తోటల్లో గత రెండు రోజులుగా ఎలుగు సంచరిస్తూ రైతుల కంట పడటంతో వారు భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉద్దాన ప్రజల జీవనాధారమైన జీడి పంట పూత దశలో ఉండటంతో రైతులు తోట పనుల్లో బిజీ బిజీగా తోటల్లోనే గడుపుతున్నారు. తోటకు కంచెలు ఏర్పాటు చేయడం, పురుగు మందులు వేయడం, తదితర పనులు చేసేందుకు తోటకు వెళ్తున్నారు. ఈ సమయంలో ఎలుగు దాడి చేస్తుందన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. ఎలుగుబంటిని తప్పించబోయి వ్యక్తి మృతి కాశీబుగ్గ: మందస మండలం ముకుందపురం గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. మందసకు చెందిన జయరాం తన భార్యతో కలిసి స్కూటీపై వస్తుండగా ఒక్కసారిగా ఎదురుగా ఎలుగుబంటి రావడంతో అదుపుతప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జయరాం అక్కడికక్కడే మృతిచెందగా.. భార్యకు తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాన్ని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగ భద్రత కల్పించండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అధికారంలోకి వస్తే లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు గొప్పలు ఊదరగొట్టారని, కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నారని, తమ ఉద్యోగ భద్రత కల్పించాలని పశుసంచార వాహన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థక శాఖ కార్యాలయం వద్ద తొలగించిన పశుసంచార వాహన ఉద్యోగులు మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంచార పశు ఆరోగ్య సేవల వాహనాలు జిల్లాలో 18 ఉన్నాయని వాటిని ఆదివారం నుంచి నిలిపివేసి వాహనాలను పశు సంవర్ధకశాఖ సహాయ సంచాలకుడికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయని తెలిపారు. అదే విధంగా తమకు టెర్మినేషన్ ఆర్డర్స్ కూడా జారీ అయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసేస్తే ఎలా బతకాలని ప్రశ్నించారు. వాహనాలు నిలిపివేయడం అనివార్యమైతే తమను పశుసంవర్ధక శాఖలో కొనసాగించాలని కోరారు. -
పోలీసుల అదుపులో గంజాయి బ్యాచ్
● దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ విద్యార్థులే శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని పాత్రునివలస పరిధిలోని టిడ్కో కాలనీ పరిసర ప్రాంతంలో మంగళవారం సాయంత్రం శ్రీకాకుళం నగరానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సీక్రెట్గా గంజాయి సేవిస్తుండగా రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. దొరికిన వారంతా ఎంబీఏ, ఎంటెక్ చదువుతున్న వారే కావడం గమనార్హం. అయితే ఇందులో విశాఖపట్నంకు చెందిన వారు ఇద్దరు కాగా, శ్రీకాకుళానికి చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరంతా శ్రీకా కుళంలోని ఓ కాలేజీలో చదువుతున్నట్లు తెలు స్తోంది. పట్టుబడిన వారి వద్ద నుంచి అరకిలోకు పైగానే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇదే విషయంపై టౌన్ సీఐ పైడపునాయుడును వివరణ కోరగా ఆరుగురు గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లు చెప్పారు. ఎంత మోతాదుల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నారని ప్రశ్నించగా కేవలం 50–60 గ్రాము లు మాత్రమే వారివద్ద ఉందన్నారు. వీరిపై కేసు నమోదు చేయ లేదని, ప్రస్తుతం విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు. విదేశీ ఉద్యోగాలంటూ మోసం సంతబొమ్మాళి: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో కోటి రూపాయలకు టోపీ వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. నర్సాపురం పంచాయతీ బడే నర్సాపురం గ్రామానికి చెందిన మోడీ భాస్కర్రెడ్డి కోటబొమ్మాళిలో శ్రీమారుతి వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నారు. ఇటలీలో ఉద్యోగాలంటూ ఇన్ స్టిట్యూట్లో పలువురు యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించి వారి వద్ద నుంచి సుమా రు కోటి రూపాయలు వరకు వసూలు చేశారని బాధితులు తెలిపారు. గడువు దాటినా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించిన యువకులు మంగళవారం కోటబొ మ్మాళి ఇన్స్టిట్యూట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వారికి సమాధానం చెబుతూ బడే నర్సాపురంలో ఉన్న ఇంటికి వెళ్లడంతో అక్కడకు వెళ్లిన బాధితులు భాస్కర్రెడ్డితో వాగ్వా దానికి దిగారు. తమ వద్ద తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలని పట్టుబట్టి ఆందోళన చేపట్టారు. మీరు ఇచ్చిన డబ్బులను ఏజెంట్కు ఇచ్చి తాను మోసపోయానని భాస్కర్రెడ్డి సమాధానం ఇచ్చారు. శాంతించని యువకులు నిలదీయడంతో.. వారి నుంచి తప్పించుకొని బైక్పైన కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్కు వచ్చారు. అక్కడ కూడా బాధిత యువకులు ఆందోళన చేపట్టారు. శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ. 3.33 లక్షలు జలుమూరు: శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.3,33,634 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపారు. 84 రోజులకు గాను ఈ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. మెగా డీఎస్సీ హామీ ఏమైంది..? శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం అని చెప్పి నేటికీ భర్తీ చేయకపోవడం దారుణమని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ప్రశ్నించారు. శ్రీకాకుళం నగరంలో ఎన్.ఆర్ దాసరి క్రాంతి భవన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నోటిఫికేషన్ లేక లక్ష లాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఽఖర్చుచేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వ మద్యం దుకాణా ల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న పె ద్దలు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు ఎస్. రామోజీ, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. -
వుషు పోటీలకు వర్సిటీ క్రీడాకారులు
ఎచ్చెర్ల క్యాంపస్: పంజాబ్లోని ఛండీఘడ్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 22 నుంచి 27 వరకు అఖిల భారత మహిళలు, పురుషుల వుషు పోటీలు జరగనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం తరఫున ఆర్.పావని (ప్రతిభా డిగ్రీ కళాశాల), ఎం.శిరీష (విద్యాధరి డిగ్రీ కళాశాల) ప్రాతినిధ్యం వహించనున్నారు. కోచ్గా కె.మురళీ వ్యవహరిస్తున్నారు. క్రీడాకారులను వీసీ కె.ఆర్.రజిని, అధికారులు మంగళవారం అభినందించారు. ఇన్ఫోసిస్ స్కాలర్షిప్కు విద్యార్థి ఎంపిక టెక్కలి: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అందజేసే స్కాలర్షిప్కు టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మొదటి ఏడాది సీఎస్ఈ విద్యార్థిని ఎ.హేమలత ఎంపికై నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్టెమ్ స్టార్స్ స్కాలర్షిప్కు ఎంపికై న విద్యార్థినికి ఏడాదికి లక్ష రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు రూ. 4 లక్షలు ఉపకార వేతనం కింద అందజేస్తారని వివరించారు. పదో తరగతి, ఇంటర్లో సాధించిన మార్కులతో పాటు ఆర్థిక స్థోమత, ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్కు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, సీఎస్ఈ హెచ్ఓడీ వై.రమేష్, అసిస్టెంట్ హెచ్ఓడీ టి.చలపతిరావు, శాక్ ఇన్చార్జి జె.సురేష్కుమార్ అభినందించారు. ట్రాక్టర్ను ఢీకొట్టిన మినీ వ్యాన్ టెక్కలి : కోటబొమ్మాళి మండలం బొడ్డపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన వండాన శ్రీను టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు తన ట్రాక్టర్తో వస్తుండగా, బరంపురం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న ఓ మినీ వ్యాన్ బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ తొట్టె బోల్తా పడింది. వ్యాన్ ముందు భాగం పూర్తిగా నుజ్జయ్యింది. వ్యాన్ డ్రైవర్ బాదల్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స పొందుతూ యువకుడు మృతి ఆమదాలవలస: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్కుమార్(33) ఆమదాలవలస పట్టణానికి చెందిన చిట్టీ వ్యాపారి వేధింపులు తాళలేక ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. రాగోలు జెమ్స్లో చికిత్స పొందుతున్న సురేష్కుమార్ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంభ సభ్యులు తెలిపారు. కుమారుడి మరణంతో తండ్రి పొన్నాడ దమరకేశ్వరరావు, తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమదాలవలస ఎస్ఐ బాలరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రూప్–2 పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 23న జరగనున్న గ్రూప్–2 మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆర్డీవో కె.సాయి ప్రత్యూష తన కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కేంద్రాల వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయం వంటివి సక్రమంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. 144 సెక్షన్ అమలు చేయాలని సూచించారు. సమావేశంలో ఆర్టీసీ, పోలీస్, వైద్య ఆరోగ్యశాఖ సహా, పలు ప్రభుత్వ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
క్రీడల్
కళాశాలల్లో క్రీడలకు దూరం.. నేను ఆలిండియా యూనివర్సిటీ హ్యాండ్బాల్లో గోల్డ్ మెడల్ విన్నర్ని. గేమ్స్లో ఆసక్తితో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగంలో చేశాను. స్కూల్స్ వరకే పీడీ, పీఈటీలు ఉన్నారు. కాలేజీలకు పూర్తిగా పీడీలు లేరు. గత ప్రభుత్వం హయాంలో నాకు పదోన్నతి లభించింది. హెచ్ఎంగా చేరాల్సి వచ్చింది. క్రీడ లకు దూరమైపోయాను. అదే జేఎల్స్గా పదోన్నతులు కల్పించి పీడీలుగా నియమిస్తే జూనియర్ కాలేజీలు సైతం క్రీడలతో కళకళలాడుతుండేవి. –ఎమ్మెస్ చంద్రశేఖర్, హెచ్ఎం, జెడ్పీ హైస్కూల్ పాతటెక్కలి, వజ్రపుకొత్తూరు మండలం శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యార్థుల్లో సృజనాత్మకత, నైపుణ్యాలను గుర్తించి, వారిని తీర్చిదిద్దేందుకు శిక్షకులు కావాలి. అందుకు ప్రభుత్వ స్కూళ్లలో పాఠశాల స్థాయిలో పీడీ/పీఈటీలు ఉన్నారు. పాఠశాల స్థాయి తర్వాత జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లే వారిని ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సి ఉంటుంది. కానీ జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 38 ఉంటే.. పనిచేస్తున్న పీడీలు సున్నా. క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిద్దిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ ఆ దిశగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు, శిక్షకులను నియమించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఫలితంగా విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి ఉన్నా శిక్షకులు లేక నిరాశకు లోనవుతున్నారు.కొంతమంది పిల్లలు వివిధ వేదికల్లా రాణిస్తున్నా.. వారి వ్యక్తిగత ప్రతిభతోనే గుర్తింపు పొందుతున్నారు. నాలుగు గదులకే పరిమితమవుతూ.. జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యలో 10వ తరగతి వరకు పీఈటీలు, పీడీలు విద్యార్థులకు క్రీడల పట్ల మంచి శిక్షణ ఇస్తున్నారు. వారిని ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. అయితే వారి కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది. అందుకు ప్రధాన కారణం ఇంటర్మీడియట్లో చేరేసరికి విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చే వారు లేకపోవడం. సర్కారీ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు క్రీడలు, వ్యాయామాలకు దూరమైపోతూ నిరంతనం తరగతుల గదులకే పరిమితం అవుతున్నారు. దీంతో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నారు. ఇంకొంతమంది డ్రగ్స్, గంజాయి, చెడు వ్యసనాల బారిన పడుతున్నారు. అదే కాలేజీల్లో పీడీలుంటే వ్యాయామం, క్రీడలు, ఆటపాటలపట్ల ఆకర్షితులను చేస్తే మానసిక ఉల్లాసం, ఆనందం కలిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉండొచ్చని మానసిక వైద్యనిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన పదోన్నతల ప్రక్రియ.. పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలు, 30 మండలాలున్నాయి. ఈ మండలాల పరిధిలో ఇంటర్మీడియెట్ విద్యను అందిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 38 ఉన్నాయి. వీటిల్లో ఫిజికల్ డైరెక్టర్లు ఒక్కరూ లేరు. పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, ఎంపీఈడీ కోర్సు పూర్తి చేస్తే పీడీలుగా ఉద్యోగోన్నతులు పొందేవారు. జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపాలిటీ ఉన్నత పాఠశాలల్లో పనిచేసే పీఈటీలు ఉద్యోగోన్నతులపై జూనియర్ కళాశాలలకు వెళ్లేవారు. దీనిపై కోర్టులో కేసు జరుగుతున్నందున ఉద్యోగ పదోన్నతులు రెండు దశాబ్దాలుగా ఆగిపోయాయి. పీఈటీలంతా పాఠశాలల్లోనే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో పీడీలను పాఠశాలల్లో హెచ్ఎంలగా పదోన్నతులు కల్పించి నాటి సీఎం జగన్మోహన్రెడ్డి వారి పేరిట ఆపద్బాంధవుడిగా నిలిచారు. కానీ న్యాయస్థానాల్లో కేసులు కారణంగా జూనియర్ కాలేజీలకు పీడీలగా మాత్రం ఉద్యోగోన్నతలు పొందలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఉద్యోగోన్నతుల ద్వారా ఉన్నత పాఠశాలల్లో పీడీలను జేఎల్స్ పీఈగా పదోన్నతులు కల్పించాలని పీడీ, పీఈటీల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న పీడీలుఇంటర్ సెకెండియర్ విద్యార్ధులు3863837883 ఉద్యోగోన్నతులు కల్పించాలి.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫిజికల్ డైరెక్టర్ నియామకాలను ఉద్యోగోన్నతుల ప్రక్రియ ద్వారా చేపట్టాలి. జూనియర్ కళాశాలల్లో పీడీలు లేకపోవడం వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. క్రీడలకు దూరమైపోతున్నారు. జూనియర్ కాలేజీల్లో పీడీల నియామకాలు జరిగితే పేద విద్యార్థులకు మేలు జరుగుతుంది. – మొజ్జాడ వెంకటరమణ, పీడీ–పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు జూనియర్ కాలేజీల్లో కనుమరుగవుతున్న ఫిజికల్ డైరెక్టర్లు మొత్తం 38 చోట్ల ఒక్కరూ లేని వైనం నష్టపోతున్న విద్యార్థులు పట్టించుకోని ప్రభుత్వం 0 -
బైక్ను ఢీకొన్న గుర్తు తెలియని జంతువు
● తీవ్ర గాయాలపాలై వ్యక్తి మృతి సోంపేట: మండలంలోని సుంకిడి పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నర్సింగ్ మహంతి (45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింగ్ మహంతి కుమారుడు జగదీష్ ఐటీఐ చదువుతున్నాడు. జగదీష్ కొర్లాం వద్దకు బస్సులో రాగా.. కుమారుడిని తీసుకురావడానికి నర్సింగ్ సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. బుసాబద్ర పంచాయతీ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని జంతువు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో నర్సింగ్ కిందపడి గాయపడ్డాడు. 108 సిబ్బంది వచ్చేసరికే మృతిచెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబునాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బుడితి సచివాలయంలో ఒకే ఒక్కడు సారవకోట: మండలంలోని బుడితి సచివాలయానికి ఎంపీడీఓ మోహన్ కుమార్ మంగళవారం ఉదయం 10.10 గంటలకు తనిఖీ చేయడానికి వచ్చారు. ఆ సమయానికి వీఆర్ఓ తప్ప ఎవరూ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 10 నిమిషాల వ్యవధిలో పంచాయతీ కార్యదర్శి హాజరు కాగా ఇతర సిబ్బంది ఏ ఒక్కరూ రాలేదు. ఒక్క బుడితిలోనే కాకుండా అన్ని సచివాలయాలలో ఇదే తంతు నడుస్తుందని పలువురు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ విధానంపై సెక్టార్, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓల మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో మంగళవారం పాల్గొని మాట్లాడారు. జిల్లాలో 31 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర చాలా కీలకమని తెలిపారు. ఈనెల 27న జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి
నరసన్నపేట: ప్రజలకు ఆధార్ కార్డు లాగానే రైతులకు గుర్తింపు నంబర్లు తీసుకోవాలని జిల్లా వ్యవసా య శాఖ అధికారి త్రినాథస్వామి అన్నారు. మండలం కోమర్తి సచివాలయంలో రైతులకు విశిష్ట సంఖ్య రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందనే దానిపై ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులకు యూనిక్ ఐడీ చాలా ముఖ్యమని అన్నారు. ప్రభు త్వం నుంచి ఏ పథకం రైతులు పొందాలన్నా ఈ సంఖ్య ఉండాలని, రైతులు గమనించి సంబంధిత వీఏఏ వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. అలాగే ఈ నెల 28 కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని వీఏఏలకు ఆదేశించారు. కోమర్తి సచివాలయంలో రిజిస్ట్రేషన్ ఎలా ఉందని వీఏఏ కల్యాణిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకూ 190 మంది రైతుల పేర్లు రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. మిగిలిన రైతులు కూడా 28 కల్లా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. అలాగే రబీ పంటల నమోదు ప్రక్రియ పై ఆరా తీశారు. జిల్లా వ్యవసాయాధికారి వెంట నరసన్నపేట ఏడీ రవీంద్రభారతి, మండల వ్యవసాయాధికారిణి కె. సునీత తదితరులు ఉన్నారు. -
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పూర్తిస్థాయిలో కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన రావు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక రైతు సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంశధార కాలువల ఆధునికీకరణకు రూ.1500 కోట్లు కేటాయించాలన్నారు. ఆఫ్షోర్ ప్రాజెక్టు ప్రారంభించి 17 ఏళ్లయినా నేటికీ 40 శాతం పనులు కూడా జరగలేదని తెలిపారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు పరిహారం అందించి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు. పైడిగాం ప్రాజెక్టుకు గతంలో అంచనా వేసిన రూ.17 కోట్లు మంజూరు చేయాలని, ఈ ప్రాజెక్టు ఆధునీకరించడం ద్వారా మరో 7వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. మందస మండలంలోని కళింగదళ్, డబార్సింగ్, దామోదర్ సాగరం ప్రాజెక్టులను ఆధునికీకరించాలని కోరారు. చీపి గడ్డ ద్వారా వృధాగా పోతున్న నీటిని గోపాలసాగరానికి మళ్లించాలని కోరారు. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న నారాయణపురం, తోటపల్లి, మడ్డువలస సాగునీటి ప్రాజెక్టులు పూర్తికి అవసరమైన మొత్తం నిధులను ఈ బడ్జెట్లో కేటాయించాలని కోరారు. -
వాసుదేవుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కాశీబుగ్గ: మందసలోని వాసుదేవుని బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దాసాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశా రు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సంతోష్ పండా, వివేక్ సాతుర్వేది, అనిల్ పండా తదితరులు పాల్గొన్నారు. పరిశ్రమల్లో భద్రతపై దిశానిర్దేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలును కఠినంగా పరిశీలిస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. పారిశ్రామిక యూనిట్లలో రసాయన ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఆయన స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సంక్షోభ నిర్వహణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. అమోనియా, క్లోరిన్, ఎల్పీజీ, బ్యుటేన్ వంటి మండే స్వభా వం ఉన్న వాయువులను పెద్ద పరిమాణంలో వినియోగించే పరిశ్రమల్లో కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు ఉండాలన్నారు. తరచూ మాక్ డ్రిల్ నిర్వహించాలని, విష వాయువులు వెలువడే పరిశ్రమల్లో ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలపై తనిఖీలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే పూర్తి చేసిన తనిఖీల నివేదిక ఆధారంగా అన్ని పరిశ్రమలు మార్గదర్శకాలు పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. పింఛన్ సొమ్ముతో విలేజ్ సర్వేయర్ పరారీ జి.సిగడాం: మండలంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న చదువుల భాను ప్రతాప్ రూ.49వేల పింఛన్ సొమ్ముతో పరారైనట్లు ఆ సచివాలయ సి బ్బంది సోమవారం తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావులకు ఫిర్యాదు చేశారు. గ్రామ సచివాలయంలో 2024 జూన్ నుంచి పింఛన్ల పంపిణీ బాధ్యతలను ప్రతాప్కు అప్పగించారు. ఈ నెలకు సంబంధించి 1లక్ష 66వేల రూపాయల గాను 1లక్ష 17 వేలు రూపాయలను పంపిణీ చేశాడు. మిగతా సొమ్ము రూ.49వేలు లబ్ధిదారులకు ఇవ్వకుండా పరారయ్యాడని సచివాలయ సిబ్బంది ఫిర్యా దులో పేర్కొన్నారు. సంబంధిత పింఛన్ లబ్ధిదారులకు ఇబ్బంది రాకుండా సచివాలయ సిబ్బంది తమ సొంత నిధులు రూ. 33వేలు వెచ్చించి ఇచ్చారు. మరో రూ.16వేలు మృతి చెందిన లబ్ధిదారుల పింఛన్లని, వీటిని ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉందన్నారు. శివరాత్రి ఉత్సవాలకు పక్కాగా బందోబస్తు జలుమూరు: శ్రీముఖలింగంలో శివరాత్రికి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం శ్రీముఖలింగం శివరాత్రి ఉత్సవాలపై అర్చకులు, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో మాట్లాడారు. దక్షిణ ద్వారం గుండా వీఐపీల దర్శనాలను రద్దు చేయాలన్నారు. సామాన్యులు సులభంగా స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోప్ పార్టీలు అదనంగా ఏర్పాటు చేయాలని టెక్కలి డీఎస్పీ డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తికి ఆదేశించారు. చక్రతీర్థ స్నానాలకు అదనపు బందోబస్తు ఉండాలని, రోడ్డు, నది మార్గాలు శుభ్రం చేయాలని సూచించారు. గత ఏడాది జరిగిన పొరపాట్లు పునరావృతం కాకూడదన్నారు. దీనికి ముందు స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు సీఐలు ఇమ్మాన్యుయేల్ రాజు, జె.శ్రీనివాస్, సత్యనారాయణ, ఎస్ఐలు అశోక్బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
గ్రూప్–2 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–2 మెయిన్ పరీక్షలు ఈ నెల 23న జరగనున్నాయని, వాటిని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించా రు. పరీక్షల నిర్వహణపై కోఆర్డినేటింగ్ అధికారు లు, లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవె న్యూ అధికారి వెంకటేశ్వర రావుతో కలిసి సెంటర్ల వారీగా ఏర్పాట్లపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడు తూ, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని రకాలుగా సన్నద్ధం కావాలని ఆదేశించారు. 23వ తేదీ ఉదయం 10 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. దీని కోసం శ్రీకాకుళం, ఎచ్చెర్లలో మొత్తం 15 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, 5535 మంది సభ్యులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకొనే విధంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. -
మంత్రి అండతో మైనింగ్ దోపిడీ
టెక్కలి: జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అండతో కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీలు, ధాన్యం కొనుగోలులో అక్రమాలకు పాల్పడుతున్నారని, రాజస్థాన్కు చెందిన కొంత మంది బ్రోకర్లతో క్వారీలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి కమీషన్ల దుకాణాలు తెరిచారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ దుయ్యబట్టారు. సోమవారం టెక్కలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కూటమి పా లనలో గ్రామస్థాయి నుంచి కక్ష సాధింపు చర్యల కు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఎన్నికల మును పు ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలపై కనీసం దృష్టి సారించడం లేదన్నారు. ఇటీవల చంద్రబాబు ప్రకటించిన పాలనాపరమైన ర్యాంకింగ్లో జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడుకు 17వ ర్యాంకు వచ్చిందని, అయితే కక్ష సాధింపుల్లో మా త్రం మొదటి ర్యాంకులో ఉన్నారని తిలక్ ఎద్దేవా చేశారు. జిల్లాలో వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. కేంద్రమంత్రిగా రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రిగా అచ్చెన్నాయుడు రైతులను పట్టించుకోకుండా ఏం వెలగబెడుతున్నారని నిలదీశారు. గతంలో అనేక కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన బోయిన రమేష్కు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగించి ధాన్యం కొనుగోలులో మంత్రి సోదరుడు హరిప్రసాద్ నేతృత్వంలో కోట్లాది రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని తిలక్ దుయ్యబట్టారు. వైఎస్ జగన్ హయాంలో పోర్టు పనులు మొదలయ్యాయని, దానికి అనుసంధానంగా రోడ్లకు ప్రతిపాదిస్తే.. ఆ రోడ్లు తామే ఇచ్చామంటూ బాబాయ్, అబ్బాయ్లు గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, దళితులపై కూటమి నాయకులు దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోకుండా తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. దీనిపై తిరుగుబాటు తప్పదన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీసులు, విజిలెన్స్ ఎస్పీ కూటమిగా చేరి కింజరాపు కుటుంబం చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి, పార్టీ నియోజకవర్గ స్థాయి వివిధ అనుబంధ విభాగాల నాయకులు ఎస్.సత్యం, జీ.వి.రెడ్డి మాష్టారు, ఎస్.హేమసుందర్రాజు, ఆర్.మల్లయ్య, బి.మోహన్రెడ్డి, కె.సంజీవ్, డి.రామకృష్ణారెడ్డి, పోలాకి మోహన్, పి.వెంకట్రావు, దివాకర్, ఎన్.భీమారావు, కె.జీవన్, కె.రామరాజు, బి.వెంకటరమణ, పి.మోహన్, పి.బాలకృష్ణ, మదీన్, హెచ్.గోవిందరావు, పి.కరుణాకర్, ఎ.మల్లేష్, హెచ్.లక్ష్మణ్, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ -
శ్రీముఖలింగంలో పట్టాభిషేకం
జలుమూరు: దక్షిణ కాశిగా పేరొందిన శ్రీముఖలింగంలో సోమవారం కళింగరాజు అనంత వర్మ చోడ గంగదేవుడి 947వ పట్టాభిషేకం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, వారాహి అమ్మవారికి కుంకమ పూజలు నిర్వహించారు. నాటి రాజు పాలన, సైనిక శక్తి, ఆలయాల అభివృద్ధి, శ్రీముఖలింగం రాజధానిగా చేసుకొని ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో నిర్మించిన ఆలయాలు, శాసనాలను ఒడిశా ప్రాజెక్టు అధికారి విష్ణు మోహన్ వివరించారు. నాటి కట్టడాలు విశిష్టతను కటక్ చాపర్ కో కన్వీనర్ దీపక్కుమార్ నాయక్ తెలియజేశారు. గంగదేవుడి చిత్రపటాలతో ప్రదక్షిణలు చేసి ఆలయ కార్యాలయంలో భద్రపరిచారు. కళింగ రాజ్యంతోపాటు జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన శ్రీకూర్మం, అరసవల్లి, శ్రీముఖలింగం ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన దానాలు, తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాలను పీఏఎస్ కార్యదర్శి, కో కన్వినర్ మురళీధర్, తరుణ్ సింగ్లు వివరించారు. భావితరాలకు ఆనాటి రాజుల చరిత్ర తెలియజేసేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
టోకరా
విదేశీ ఉద్యోగాల పేరిటవిదేశీ ఉద్యోగాల పేరిట మోసపోయిన నిరుద్యోగులు అప్పు చేసి డబ్బులు చెల్లించాను మాది టెక్కలి మండలం గోకర్లపల్లి. ఇటలీలో మంచి ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగుతుందని స్నేహితుల ద్వారా తెలుసుకొని రెండో బ్యాచ్గా ఇచ్ఛాపురం సూర్యా లాడ్జిలో మొదటి విడతగా రూ.30వేలు చెల్లించాను. తర్వాత హైదరాబాద్లో రూ.1.28లక్షలు ఇచ్చాను. ఇటలీలో మంచి ఉద్యోగం అని చెప్పడంతో మా పేరెంట్స్ అప్పు చేసి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అంతా బోగస్ అంటున్నారు. – పడాల గణేష్, టెక్కలి మండలం స్థానికుల పరిచయంతో బలయ్యా.. ఇచ్ఛాపురం మండలం ధర్మపురం గ్రామం మాది. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఏజెంట్ ధర్మరాజు మా పక్క ఒడిశాకు చెందిన వ్యక్తి కావడంతో పాటు మా ప్రాంతంలో ఏజెంట్కు బంధువులు ఉండటంతో వారి ద్వారా నమ్మి ఇచ్ఛాపురం లాడ్జీలో రూ.50వేలు చెల్లించాను. ఇటలీలో వైన్ ప్యాకింగ్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఇచ్ఛాపురం గవర్నమెంట్ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ల్యాబ్లో మాకు మెడికల్ టెస్ట్లు జరిగాయి. ఈ రోజు ఉదయం ‘అంతా బోగస్...మోసపోయాం’ అంటూ మెసేజ్ పెట్టడంతో మాకుతెలిసింది. మాకు న్యాయం జరగాలి. – సాహుకారి భానుప్రకాష్, ధర్మపురం, ఇచ్ఛాపురం మండలం ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం కేంద్రంగా జరిగిన ఘరానా మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట సుమారు 350 మందికి టోకరా వేసి సుమారు ఆరున్నర కోట్ల రూపాయలతో ఓ ప్రబుద్ధుడు పరారయ్యాడు. ఇచ్ఛాపురానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడిశా చీకటి బ్లాక్ పార్వతీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల ధర్మరాజు పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తున్నాడు. ఏజెంట్గా అవతారం ఎత్తి స్థానిక యువకులతో ఉన్న బంధుత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇటలీలో మంచి ఉద్యోగాలు ఉన్నాయని స్థానికులైన కాయి దిలీప్(తేలుకుంచి), శ్రీను(బెజ్జిపద్ర)లతో ఉన్న బంధుత్వంతో ప్రచారం చేసుకున్నాడు. ఫ్రూట్స్ కటింగ్, ప్యాకింగ్, వైన్, బీర్లు కంపెనీలో ప్యాకింగ్ వంటి ఆకర్షణీయమైన ఉద్యోగాలు, కష్టం లేని పని, రూ.లక్షల్లో జీతం అంటూ నమ్మబలకడంతో జిల్లా నుంచి సుమారు 350 మంది వరకు ఈయన వలలో పడ్డారు. ఇచ్ఛాపురం కేంద్రంగా ఓ లాడ్జిని తీసుకొని తొలి విడతలో గత ఏడాది జూలై 26న 75 మందిని ఇంటర్వ్యూ చేసి వారి దగ్గర రూ.ఇరవై వేలు అడ్వాన్స్, తర్వాత రూ.1.35 లక్ష లు చొప్పున వసూలు చేశాడు. అలాగే నెల తిరక్క ముందు హైదరాబాద్లో ఇంటర్వ్యూ పేరిట 175 మంది వద్ద రూ.1.35 లక్షలు చొప్పున, ఈ ఏడాది జనవరిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీమారుతీ ఇన్స్టిట్యూట్లో 120 మందికి ఇంటర్వ్యూ నిర్వహించి వారి వద్ద నుంచి రూ.50వేలు చొప్పున వసూలుతో పాస్ఫొటోలు తీసుకున్నాడు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఇటలీ వెళ్లేందుకు సిద్ధం కావాలని నమ్మబలికాడు. ఇచ్ఛాపురం పట్టణలోని ఓ మెడికల్ ల్యాబ్లో 350 మంది యువకులకు మెడికల్ టెస్ట్లు నిర్వహించి యువకులను మరింత నమ్మించాడు. ఈ మెడికల్ టెస్ట్లో ఒక్కోక్కరి వద్ద రూ.2,500 నుంచి రూ.3,200 వరకు వసూలు చేసినట్లు యువకులు విలేకరులకు తెలిపారు. అంతా బోగస్సే.. ఇటలీ వెళ్లేందుకు మొదటి విడతలో 30 మంది ఢిల్లీ వచ్చి పాస్పోర్టు చెకింగ్, స్లాట్ బుకింగ్ చేసుకోవాలని కోరడంతో జిల్లా నుంచి శుక్రవారం ఢిల్లీ వెళ్లిన యువకులకు ఆదివారం రాత్రి పిడుగులాంటి వార్త చెవిన పడింది. ఇక్కడ ఇలాంటిది ఏమీ లేదని, అంతా బోగస్ అని తెలియడంతో లబోదిబోమన్నారు. ఇటలీ వెళ్లేందుకు డబ్బులు చెల్లించిన నిరుద్యోగుల గ్రూపులో సోమవారం ఉదయం ఏజెంట్ ధర్మరాజు వాయిస్ మెసేజ్ పెడుతూ ‘సారీ గయ్స్... మనమంతా మోసపోయాం. మీతో పాటు నేనూ కూ డా మోసపోయాను’ అంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేయ డంతో అందుబాటులో ఉన్న యువకులంతా సోమ వారం ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న సీఐ ఎం.చిన్నంనాయుడును కలసి తమ గోడును వెళ్లబుచ్చుకున్నారు. తామంతా మోసపోయామని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. పట్టణం పోలీస్ స్టేషన్లో బాధిత యువకులు ఫిర్యాదు చేసినట్లు బాధిత యువకులు తెలిపారు. జిల్లాలో 350 మంది బాధితులు ఇచ్ఛాపురం కేంద్రంగా మోసం -
అన్నింటా ఆయనే..
టెక్కలి జాతీయ రహదారిపై అధిక బరువుతో ఉన్న గ్రానైట్ బ్లాకులతో ప్రమాదకరంగా వెళుతున్న లారీ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో ఎవరి గ్రానైట్ క్వారీ నడవాలి..? ఎవరిది ఆపేయాలి..? ఏ క్రషర్ ఉంచాలి.. ఎవరిది ఉంచకూడదు.. ఇలా మైనింగ్కు సంబంధించి ప్రతీదీ కీలక నేత సోదరుడే డిసైడ్ చేస్తున్నారు. మైనింగ్ అనే కాదు.. ఇసుక, మద్యం, ధాన్యం కొనుగోలు.. అన్నింటా ఆయనదే రాజ్యం. మైనింగ్ ఆధిపత్యం వల్ల ఆయన అనుయాయులంతా లాభ పడుతుండగా.. మిగతా వ్యాపారులు మాత్రం క్వారీలు, క్రషర్లు మూసుకుని నష్టపోతున్నారు. గ్రానైట్ రాళ్లను రవాణా చేసే వాహనాల విషయంలోనూ వివక్ష చూపిస్తున్నారు. తమకు కావాల్సిన డబుల్ హౌసింగ్ లారీలకు మాత్రమే రాళ్ల రవాణా అప్పగించాలని, కాదన్న వారిని దూరం పెట్టాలని హకుం జారీ చేశారు. ఫలానా నంబర్లు గల ట్రైలర్లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, మిగతా వాటిని ఎక్కడికక్కడ ఆపేయండని అధికార వర్గాలకు సూచన ప్రాయ ఆదేశాలిచ్చారు. ఈ వాహనాల్లో పరిమితికి మించి లోడింగ్ చేసుకుంటున్నా.. ఆయనను అడిగే నాథుడు లేకపోయాడు. అంతా ఆయన కనుసన్నల్లోనే.. జిల్లాలో విస్తారంగా ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి గ్రానైట్ బ్లాకులను ప్రతి రోజూ 50 నుంచి 100 వరకు ట్రైలర్లు జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పాటు విశాఖపట్నం పోర్టుకు రవాణా చేస్తుంటాయి. విశాఖకు వెళ్లేవన్నీ పెద్ద బ్లాకులే. ఇంకా పెద్దవాటిని ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ముఖ్యంగా మనకు జిల్లాకు సంబంధించి గ్రానైట్ను మలేషియా, సింగపూర్, జపాన్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇతర రాష్ట్రాలకు వస్తే బెంగళూరుకు ఎక్కువగా తరలిస్తారు. మధ్యస్తంగా ఉన్న బ్లాకులను జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న పాలిషింగ్ యూనిట్లకు తరలిస్తుంటారు. ముఖ్యంగా నిమ్మాడ, పెదబమ్మిడి, వాండ్రాడ సమీపంలో 90 గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లకు అత్యధికంగా గ్రానైట్ క్వారీల నుంచి రవాణా చేస్తుంటారు. అలాగే, మెళియాపుట్టి మండలం వెంకటాపురం ఏరియాలోని పాలిషింగ్ యూనిట్లకు పంపిస్తుంటారు. ఈ గ్రానైట్ బ్లాకుల రవాణా అంతా కీలక నేత సోదరుడు చెప్పిన ట్రైలర్లతోనే చేయాలి. మిగతా వాటికి అప్పగిస్తే ఆ క్వారీ టార్గెట్ అయిపోయినట్టే. అందుకనే ఎందుకొచ్చిన గొడవ అని ఆ తమ్ముడు చెప్పిన ట్రైలర్లకే క్వారీ యజమానులు అప్పగిస్తున్నారు. జిల్లాలో 90కి పైగా ట్రైలర్లు ఉన్నాయి. వీటిలో 30 ట్రైలర్లు మాత్రమే తమకు కావాల్సినవని చెప్పి, వాటికి మాత్రమే రవాణా అప్పగించాలని హకుం జారీ చేశారు. దీంతో మిగతా 60కి పైగా ఉన్న ట్రైలర్ల యజమానులకు రవాణా పని దొరక్క నష్టపోతున్నారు. చర్యలు తీసుకోరే.. దీనికి తోడు పరిమితికి మించి ఏకంగా 100 టన్నుల సామర్థ్యంతో బ్లాకులను తరలిస్తున్నా అధికారులు కిమ్మనడం లేదు. ‘సోదరుడు’ చెప్పిన నంబర్లు గల లారీలు కావడంతో వాటిని ఆపే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇలా పరిమితికి మించి, సామర్థ్యాన్ని దాటి రవాణా చేసిన ట్రైలర్ ఒకటి ఇటీవల విశాఖ జిల్లా ఎండాడ దిశా మహిళా పోలీసు స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో భారీ బండ రాళ్లు(బ్లాకులు) జాతీయ రహదారికి అడ్డంగా పడిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పీఎంపాలెం పోలీసులు క్రేన్ల సహాయంతో వాటిని తొలగించడంతో అక్కడ ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ ఘటనలో కొందరికి గాయాలు కూడా అయ్యాయి. ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, మెళియాపుట్టి పరిసర ప్రాంతాల నుంచి రోజు వందల సంఖ్యలో గ్రానైట్ బ్లాకుల రవాణా అడ్డగోలుగా జరుగుతుందని, పరిమితికి మించి లోడింగ్ చేసి రవాణా చేస్తున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఇటీవల కొందరు జిల్లా ఉన్నతాధికారికి, రవాణ శాఖ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ స్పందన లేదన్న వాదనలు ఉన్నాయి. కీలక నేత సోదరుడి కనుసన్నల్లో అక్రమాలు మైనింగ్, ఇసుక, మద్యం, ధాన్యం కొనుగోళ్లు.. అన్ని రంగాల్లో ఆయనే ఆధిపత్యం గ్రానైట్ బ్లాకుల రవాణాలోనూ అక్రమాలే సామర్థ్యానికి మించి లోడింగ్ చేసి రవాణా ఇటీవల విశాఖ జిల్లా ఎండాడలో ప్రమాదానికి గురైన ఓ వాహనం భారీ గ్రానైట్ బ్లాకులతో రవాణా అవుతున్న ట్రైలర్ను చూడండి. 22 టైర్ల గల ఈ వాహనంపై రాష్ట్ర పరిధిలో 57 మెట్రిక్ టన్నుల బ్లాకులను మాత్రమే రవాణా చేయాలి. రాష్ట్రం దాటితే 55టన్నుల సామర్థ్యం గల బ్లాకులనే రవాణా చేయాలి. కానీ, ఇప్పుడీ ట్రైలర్లపై రాష్ట్రంలోనే కాదు.. జిల్లాలోనే 100 టన్నులకు పైగా బరువుల గల బ్లాకులను ఎక్కించి రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటిని ఏ ఒక్క అధికారి అడ్డుకోవడం లేదు. జిల్లాకు చెందిన కీలక నేత సోదరుడు అంతా తానై వ్యవహరిస్తున్నారు. మద్యం, ధాన్యం, ఇసుక, మైనింగ్.. ఇలా అన్నింటిలోనూ వేలు పెడుతున్నారు. అతగాడి జోక్యం ఉంటే చాలు ఆ అక్రమాల జోలికి అధికారులు వెళ్లడం లేదు. ‘ఆయనున్నాడు మనకెందుకులే.. మనకు ఎంతో కొంత వస్తుంది దాంతో సరిపెట్టుకుందాం’ అన్న ధోరణి కనబరుస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఇసుక దందా చేస్తున్నారు. ఈ విషయంలో కీలక నేత సోదరుడితో పాటు ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం నేతలకు భాగస్వామ్యం ఉంది. కానీ, సంబంధిత వర్గాలు మొత్తం కీలక నేత సోదరుడు చెప్పినట్టుగానే చేస్తున్నాయి. ఇక జిల్లాలోని మూడింతల మద్యం షాపులు కీలక నేత సోదరుడి కనుసన్నల్లోనే ఉన్నాయి. చాలా వరకు షాపులు ఆయన అనుయాయులు, కుటుంబీకులకే దక్కాయి. జిల్లాలో అక్రమాలకు దోహదపడ్డ మరో ప్రధాన అంశం ధాన్యం కొనుగోళ్లు. జిల్లాలో ధాన్యం కొనుగోలు లక్ష్యాలు, మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు, గోడౌన్లలో కస్లమ్ మిల్లింగ్ రైస్ స్టాక్ చేసేందుకు మిల్లర్ల దగ్గరి నుంచి ముడుపులు, సీఎంఆర్ కింద ఇవ్వాల్సిన బియ్యం బదులు పీడీఎస్ బియ్యం ఇచ్చే విషయంలో.. ఇలా ప్రతి దాంట్లోనూ ఆయన నిర్ణయాలే అమలవుతున్నాయి. మిల్లర్లు ఆవేదనతో ఉన్నా అధికారానికి భయపడి కక్కలేక, మింగలేక కుమిలిపోతున్నారు. -
విశాఖ ఉక్కుపై బిల్లు పాస్ చేయించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమన్న నిర్ణయం మంచిదే అయినప్పటికీ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి నిర్ణయం తీసుకోవాలని సమాజ వికాస సేవా సంఘం సభ్యులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖలో భూకుంభ కోణాలు, స్టీల్ప్లాంట్కు నాణ్యతలేని బొగ్గును సరఫరా చేసే అదానీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పర్యావరణాన్ని నాశనం చేసే థర్మల్ ప్లాంట్ల ఏర్పాటు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్, కార్యదర్శి బొడ్డేపల్లి సత్యనారాయణ, కె.గోపాల్, ఎస్.ధనుంజయ, ఎ.సత్యన్నారాయణ పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో సమస్యలపై ఆరా
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఆర్.సన్యాసినాయుడు సోమవారం జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్ను సందర్శించారు. పారిశుద్ధ్యం, పరిశుభ్రత, మౌలిక వసతులు, ఆహార సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థులకు చక్కటి భోజనం, వసతులు కల్పించాలని ఆదేశించారు. కాశీబుగ్గలో ఉద్రిక్తత కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడు రోడ్లు కూడలి వద్ద ఫుట్పాత్పై ఉన్న పూజా సామగ్రి షాపు తొలగింపు సోమవారం ఉద్రిక్తతకు దారితీసింది. మున్సిపల్ కమిషనర్ నడిపేన రామారావు ఆధ్వర్యంలో జేసీబీతో షాపును తొలగిస్తుండగా దుకాణదారుడి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల రంగ ప్రవేశం చేసి దుకాణదారులను అదుపుచేశారు. ఈ క్రమంలో షాపు యజమాని కఠారి శ్యామ్ ఒంటిపై నూనె పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే పోలీసులు అడ్డుకుని శ్యామ్ను అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులను కూడా పోలీసు స్టేషన్కు తరలించారు. ఖాళీ కోళ్ల ఫారం దగ్ధం రణస్థలం: మండలంలోని పాతర్లపల్లి వెంకటేశ్వర కాలనీలో ఎల్.శ్రీరాములుకు చెందిన ఖాళీ కోళ్ల ఫారం సోమవారం దగ్ధమైంది. మధ్యాహ్నం విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. రణస్థలం అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.1.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రణస్థలం అగ్నిమాపకాధికారి పైల అశోక్ తెలిపారు. జర్నలిస్టులపై దాడులు అమానుషం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల ప్రజాశక్తి విలేకరిపై తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద సోమవారం మానవహారం చేశారు. జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలని నినదించారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు భవిరి కృష్ణమూర్తి, సీపీఐఎంఎల్ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వపు గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పట్టపగలు చోరీచేసింది పక్కింటోడే..
శ్రీకాకుళం క్రైమ్: గత నెల 22న గార మండలం శాలిహుండంలోని ఓ పండ్లవ్యాపారి ఇంట్లో పట్టపగలు జరిగిన చోరీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. బాధితుడి ఇంటి పక్కన నివాసముంటున్న ఆటోడ్రైవరే ఈ చోరీకి పాల్పడినట్లు నిర్ధారించి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. నాలుగో ప్రయత్నంలో.. శాలిహుండం గ్రామానికి చెందిన ఉర్జాన ఆదినారాయణ, రమణమ్మలు సింగుపురం కూడలి వద్ద పండ్ల వ్యాపారం చేస్తుంటారు. ఉదయం వెళ్తే రాత్రి వరకు తిరిగిరారు. జనవరి 22న ఎప్పట్లాగే ఉదయం ఏడు గంటలకు వ్యాపారానికని వెళ్లిన దంపతులు రాత్రి ఎనిమిదిన్నరకు వచ్చేసరికి వెనుక తలుపులు తీసివున్నాయి. వాస్తవానికి దంపతులే తలుపులు వేయడం మరిచారు. రమణమ్మ తాను వేసుకున్న బంగారు గాజులు, గొలుసు బీరువాలో పెట్టడానికి తాళాలు వెతకగా కనిపించకపోవడంతో షరాబుని పిలిపించి తెరిపించింది. బీరువాలో తన ఇద్దరు కుమార్తెలకు చెందిన ఆరు తులాల గొలుసు, నాలుగు తులాల హారం, రెండున్నర తులాల నక్లెస్, రెండు తులాల వొంటిపేట గొలుసు కనిపించకపోవడంతో నిర్ఘాంతపోయింది. వెంటనే గార స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సీఐ పైడపునాయుడు, ఎస్ఐ జనార్దన దర్యాప్తు చేపట్టారు. స్థానికుల పనేనని గుర్తించి ఓ వ్యక్తి కదలికలపై నిఘా పెట్టారు. అప్పుల బెడద ఎక్కువై.. రమణమ్మ పక్కింట్లో నివాసముంటున్న జోగి రాజు ఆటో డ్రైవర్గా పనిచేస్తూ భార్యాబిడ్డలను పోషిస్తున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో దొంగతనం చేయాలని నిశ్చయించుకున్నాడు. ఉదయం వెళ్లి రాత్రి వరకు తిరిగి రాని రమణమ్మ ఇల్లే దొంగతనానికి సరైనదని భావించి రెండు, మూడుసార్లు ప్రయత్నించాడు. నాలుగోసారి గత నెల 22న చోరీ చేశాడు. చోరీ సొత్తును రాజు తన ఇంటి మేడపైన హోమ్ థియేటర్ స్పీకర్ బాక్సుల్లో దాచాడు. అప్పుల వారి తాకిడి ఎక్కువైపోవడంతో ఈ నెల 16న మధ్యాహ్నం 3 గంటలకు ఆరు తులాల ఆభరణాలు తనఖా పెట్టేందుకు బయల్దేరాడు. అప్పటికే రాజుపై నిఘా పెట్టిన పోలీసులు అతన్ని ఇంటివద్దే అదుపులోకి తీసుకుని విచారించగా మొత్తం విషయాన్ని బయటపెట్టాడు. ప్రతిభకు ప్రశంసలు.. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ సీహెచ్ పైడపునాయుడు, ఎస్ఐ జనార్దన, వన్టౌన్ ఎస్ఐ హరికృష్ణ, ఏఎస్ఐ శ్రీనివాసరావు, పీసీలు సూరిబాబు, జగదీష్, రమణమూర్తి, బాలకృష్ణలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ చెప్పారు. నిందితుని వద్ద మొత్తం సొత్తును రికవరీ చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. వీడిన శాలిహుండం చోరీ కేసు మిస్టరీ పండ్లవ్యాపారి ఇంట్లో 17 తులాలకు పైగా ఆభరణాలు మాయం చేసిన ఆటోడ్రైవర్ అరెస్టు -
అంగన్వాడీలను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి హెచ్చరించారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్డులో ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన అంగన్వాడీలు సుదీర్ఘ పోరాటం చేశారని, ఆ సమయంలో కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, వారి ప్రభుత్వం ఏర్పడినా నేటికీ అమలు చేయకపోవడం అన్యాయమని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నా 2019 నుంచి జీతాలు పెరగలేదన్నారు. దీనికితోడు యాప్లు, నూతన విధానాలతో పని భారాలు పెంచుతున్నారని వాపోయారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీ సమస్యలపై చర్చించాలని, హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.సూరయ్య, పట్టణ కన్వీనర్ ఆర్. ప్రకాష్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు కె.జ్యోతి, జి.రాజేశ్వరి, కె.సంధ్యారాణి, అంజలీభాయ్, కృష్ణభారతి, లక్ష్మి, లక్ష్మినారాయణ, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తీవ్రతరం చేస్తాం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఆధ్వర్యంలో ధర్నా -
వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్యాయత్నం
ఆమదాలవలస రూరల్: మండలంలోని శ్రీహరిపురం గ్రామానికి చెందిన పొన్నాడ సురేష్కుమార్ అనే యువకుడు సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంభ సభ్యులు చెబుతున్నారు. చిట్టీ డబ్బులు పూర్తిగా చెల్లించినప్పటికీ చిట్టీ వ్యాపారి వేధింపులకు పాల్పడటంతో తట్టుకోలేక సోమ వారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు, ఈ మేరకు ఆమదాలవలస పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ ఎస్.బాలరాజు వద్ద బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడని కుటుంబ సభ్యులు తెలిపారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనతో విద్యార్థుల బతుకులు అంధకారంలోకి వెళ్లిపోతున్నాయని వైఎస్సార్ సీపీ కళింగ కార్పొరేషన్ మాజీ చైర్మన్, రాష్ట్ర కళింగ సామాజికవర్గ అధ్యక్షుడు దుంపల రామారావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, విద్యాదీవెన, వసతి దీవెన సొమ్ము విడుదల చేసి విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ కంటే అధికంగా ఇస్తానని చెప్పి అధికారం చేపట్టాక విద్యార్థులతో ఆడుకోవడం సీఎం చంద్రబాబుకు తగదన్నారు. నిరుద్యోగ భృతి జాడే లేదని, సంపద సృష్టించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన అబద్దాల బాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం యువత వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో సచివాలయాల్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించి యువతను ఆదుకున్నట్లు గుర్తు చేశారు. -
పకడ్బందీగా పబ్లిక్ పరీక్షలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున ఎటువంటి మాస్ కాపీయింగ్, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలను సిద్ధం చేసి పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు. రెవిన్యూ డివిజనల్ అధికారులు వారి స్థాయిలో సమావేశం నిర్వహించాలని సూచించారు. ● సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డు పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయని కలెక్టర్ తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. జిల్లాలో 28,984 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. 149 కేంద్రాలకు 149 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, ఏడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ● ఏపీ సార్వత్రిక విద్యా సంస్థ నిర్వహించే ఓపెన్ స్కూల్ పదోతరగతి పరీక్షలు కూడా ఎస్ఎస్సీ పరీక్షల సమయంలోనే జరగనున్నాయని కలెక్టర్ చెప్పారు. 807 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, జిల్లాలో 8 కేంద్రాలకు ఎనిమిది మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ● ఓపెన్ ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయని కలెక్టర్ తెలిపారు. 1553 మంది హాజరు కానున్నారని చెప్పారు. 8 కేంద్రాలకు 8 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ● జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మాట్లాడుతూ పరీక్షలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిప్రత్యూష, ఏసీఈ లియాఖత్ అలీఖాన్, జిల్లా ఒకేషనల్ అధికారి తవిటినాయుడు, జిల్లా వైద్యారోగ్య అధికారి బాల మురళీకృష్ణ, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్కుమార్, జిల్లా ఉద్యాన అధికారి వరప్రసాద్, యూత్ కో–ఆర్డినేటర్ ఉజ్వల్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పదో తరగతి పరీక్షలకు 28,984 మంది విద్యార్థులు ఓపెన్ టెన్త్ పరీక్షలకు 807 మంది విద్యార్థులు ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 1553 మంది విద్యార్థులు అధికారుల సమీక్షలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
అయోడిన్ లోపంపై అవగాహన
అరసవల్లి: అయోడిన్ లోపంతో శరీరంలో వచ్చే మార్పులు, అనారోగ్య పరిస్థితులపై ఆశావర్కర్లు అవగాహన కలిగి ఉండాలని ఐ.జి.డి. జిల్లా కో–ఆర్డినేటర్ కె.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ఆశా వర్కర్లకు శిక్షణ నిర్వహించారు. ఇన్స్టిస్ట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ (ఢిల్లీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అయోడిన్ లోపంతో వచ్చే సమస్యలపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో 40 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రాంను ఐటీసీ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ట్రైనర్ డాక్టర్ ఎం.చైతన్య మాట్లాడుతూ అయోడిన్ లోపంతో థైరాయిడ్, క్రిటినిజం, ఎదుగుదల లేకపోవడం, రక్తహీనత, బలహీనం తదితర లోపాలు తలెత్తుతాయన్నారు. అయోడిన్తో కూడిన ఉప్పును మాత్రమే వినియోగించాలని, ఆకుకూరలు, గుడ్లు, పాలు, బీన్స్, క్యార ట్, బెల్లం, పండ్లను తగు మోతాదులో తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో బాలమురళీకృష్ణ, జిల్లా ఐజీడీ కో–ఆర్డినేటర్ అశోక్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ మహాలక్ష్మీనగర్లో ఉపాధ్యాయురాలి ఇంట్లో దొంగలు పడ్డారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జామి వెంకటేశ్వరి రణస్థలం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఆమె ఈ నెల 15న పర్లాకిమిడి వెళ్లారు. తిరిగి సోమవారం రాత్రి 7.45 గంటలకు ఇంటికి రాగానే తలుపులు పగులకొట్టి, తాళాలు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా తెరిచి ఉండటంతో వెంటనే జె.ఆర్.పురం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ ఎం.అవతారం ఇన్చార్జి ఎస్సై జి.లక్ష్మణరావులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం ఎస్సై భరత్ ఆధ్వర్యంలో సిబ్బంది రామారావు, శ్రీనివాసరావు, కిరణ్కుమార్ వివరాలు సేకరించారు. తులం బంగారం, 300 గ్రాముల వెండి పోయినట్లు ఉందని, ఇంకా పూర్తిగా చూడాల్సి ఉందని బాధితులు చెప్పారు. ఇంటి పరిసరాలు తుప్పలతో నిండి ఉండటం, చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగతనం సులువుగా జరిగిందని భావిస్తున్నారు. జె.ఆర్.పురం పంచాయతీ మహాలక్ష్మీనగర్లో ఘటన రంగంలోకి దిగిన పోలీసులు -
జె.ఆర్.పురం పోలీస్స్టేషన్ను అర్ధరాత్రి తనిఖీ చేసిన ఎస్పీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్, పైడిభీమవరంలోని జిల్లా ఇసుక చెక్పోస్టును ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆదివారం అర్ధరాత్రి తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో ఓ హోంగార్డు, కానిస్టేబుల్ నిద్రపోయి ఉండగా.. అందులో కానిస్టేబుల్ మద్యం సేవించినట్లు గుర్తించారు. బ్రీత్ ఎనలైజర్ మిషన్ పెట్టగా 86 పాయింట్లు రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇన్చార్జి ఎస్సై జి.లక్ష్మణరావు వద్ద ప్రస్తావించగా.. కానిస్టేబుల్పై విచారణ జరుగుతోందని, పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు. కాగా, సోమవారం ఎస్పీ కార్యాలయ టెక్నికల్ సిబ్బంది స్టేషన్కు చేరుకుని సీసీ ఫుటేజీలు పరిశీలించారు. అక్రమ ఇసుక తరలింపులో లంచావతారం ఎత్తిన ఓ అధికారిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్న సమయంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్ను అర్ధరాత్రి తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. -
‘ఆదిత్యుడిని తలచుకున్నాకే పాట’
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని నిత్యం తలచుకున్నాకే తన గీతాలాపన ప్రారంభమవుతుందని సినీ గాయని సునీత అన్నారు. ఆదివారం ప్రత్యేకంగా ఆమె సూర్యనారాయణ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. స్వామి ప్రసాదించిన ఆరోగ్యంతోనే గత రెండు దశాబ్దాలుగా సినీ రంగంలో పాటలు పాడుతున్నానన్నారు. తన కెరీర్లో 9 నంది అవార్డులతో పాటు రెండు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడంతో పాటు అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్లో గుర్తింపు రావడం నిజంగా తన అదృష్టమన్నారు. అంతకుముందు సూర్యనమస్కారాల పూజల ను తిలకించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో వేదాశీర్వచనాన్ని అందజేసి ఆలయ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వై.భద్రాజీ తదితరులు పాల్గొన్నారు. ‘థర్మల్ ప్లాంట్తో అభివృద్ధి బూటకమే’ సరుబుజ్జిలి: థర్మల్ ప్లాంట్ నిర్మించడం వల్ల అభివృద్ధి జరుగుతుందని చెప్పడం అంతా బూటకమని తెలుగు రాష్ట్రాల మానవ హక్కు ల వేదిక కన్వీనర్ వీఎస్ కృష్ణ తెలిపారు. ఆదివారం థర్మల్ ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాలైన వెన్నెలవలస, మసాన్పుట్టి, బొడ్లపాడు, తిమడాం, జంగాలపాడు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గిరిజనులతో సమావేశం నిర్వహించారు. పచ్చని పంటపొలాల్లో థర్మల్ ప్లాంట్ నిర్మాణ ఆలోచనలు తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. థర్మల్ ప్లాంట్ నిర్మా ణం వల్ల వందలాది ఎకరాల పంట భూములతోపాటు, మానవాళి మనుగడే ప్రఽశ్నార్థకంగా మారుతుందని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలు 2050 నాటికి థర్మల్ ప్లాంట్లు మూసివేయడానికి నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో కొత్తగా ఈ ప్రాంతంలో ప్లాంట్ ఏర్పాటు చే స్తామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాబోయే ప్రమాదాన్ని ముందు గానే అరికట్టి, భావితరాల భవిష్యత్ను కాపా డుకోవాలంటే పవర్ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదన విరమించేవరకు కలసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో మానవహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథం, ప్రసూనకర్త అనురాధ, జిల్లా కార్యదర్శి సురేష్, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు చౌదరి లక్ష్మణరావు, ఆదివాసీ సంక్షేమపరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, న్యూ డెమొక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు వంకల మాధవరావు, థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు సురేష్దొర, కార్యదర్శి అత్తులూరి రవికాంత్, కోశాధికారి సింహాచలం పాల్గొన్నారు. అంధకారంలో మార్చురీ టెక్కలి: టెక్కలి జిల్లా ఆస్పత్రికి చెందిన మా ర్చురీ విభాగం సుమారు నెల రోజులుగా అంధకారంలో ఉంది. పాత ఆస్పత్రికి ఆనుకుని ఉన్న మార్చురీ విభాగానికి చెందిన విద్యుత్ సరఫరా వైర్లను నెల రోజుల కిందట దుండగులు చోరీ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ విభాగానికి విద్యుత్ సరఫరా లేకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. ఇక్కడ రెండు ఫ్రీజర్లు ఉన్నప్పటికీ ఒక్కటి మాత్రమే పనిచేస్తోంది. అయితే దానికి సైతం విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో చీకటి పడిన తర్వాత తీసుకువచ్చిన మృతదేహాలను భద్రపరచడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల కాలంలో తీసుకువచ్చిన మృతదేహాలతో పాటు కుటుంబ సభ్యులు రేయింబవళ్లు చీకట్లోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. అధికారులు స్పందించి మార్చురీ విభాగానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
మహారాణిపేట: ఈ నెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిరప్రసాద్ సారథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్ ఏర్పాట్లు చేస్తున్నారు. పది మంది అభ్యర్థు లు తుది ఎన్నికల బరిలో నిలిచారు. అభ్యర్థుల పేరుతో తెలుగులో బ్యాలెట్ పత్రం రూపొందించి, ప్రింటింగ్ కోసం కర్నూలు ప్రభుత్వ ముద్రణాలయానికి పంపారు. అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం అభ్యర్థులు నామినేషన్లో పేర్కొన్న మేరకు తొ లి అక్షరం ఆధారంగా తెలుగు అక్షర క్రమంలో బ్యాలెట్ పత్రం నమూనాను తయారు చేశారు. తుది జాబితా మేరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మొ త్తం 22,493 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి అదనంగా మరో పది శాతం కలిపి సుమారు 25 వేల బ్యాలెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. ఇవి ఈ నెల 18, 19 తేదీల్లో విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల తేదీకి రెండు రోజులు ముందు వాటిని బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు. 18 నుంచి తొలి విడత శిక్షణ ఎన్నికల నిర్వహణ కోసం ఈ నెల 18 నుంచి సిబ్బందికి, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. రెండో విడత శిక్షణ 24న ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 123 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరపనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారి(పీఓ)తోపాటు ముగ్గురు సిబ్బంది అవసరం. మొత్తం 492 మంది సిబ్బందితోపాటు అదనంగా మరో పది శాతం మందిని ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేస్తున్నారు. ● 27న జరిగే ఎన్నికలకు సిబ్బంది నియామకం ● 18న తొలి విడత శిక్షణ తరగతులు ● 25 వేల బ్యాలెట్ పత్రాల తయారీ -
ఇంటర్ పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేయాలి
శ్రీకాకుళం: మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు పూర్తిస్థాయి లో ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు గొండు సీతారాం అన్నారు. ఆదివారం జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులతో ఆర్ట్స్ కళాశాలలోని ప్రాంగణంలో గల ఆర్ఐఓ కార్యాలయంలో జిల్లా పర్యవేక్షణ అధికారి, పరీక్ష కమిటీ సభ్యులు, ప్రిన్సిపాళ్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో ఆయన సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉండాలన్నారు. జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి పి.దుర్గారావు మాట్లాడుతూ మొదటి, రెండో సంవత్సర విద్యార్థులకు 75 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి ఏడాది 20,389 మంది, రెండో ఏడాదికి 19,967 మంది పరీక్ష రాస్తారని తెలిపారు. పర్యవేక్షణకు 1600 మంది ఇన్విజిలేటర్లు, 1480 సీసీ కెమెరాలు అమర్చుతున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరీక్షా కమిటీ సభ్యులు భీమేశ్వరరావు, నారాయణరావు, సింహాచలం, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగ చిన్నారిపై కుక్కల దాడి
పొందూరు : పొందూరు పరిధిలోని అలబోయినపేట మంగళకాలనీ సమీపంలో కుక్కలు మూకుమ్మడిగా చేసిన దాడి చేయడంతో ఎనిమిదేళ్ల దివ్యాంగ చిన్నారి సెనగల శ్యామల తీవ్రంగా గాయపడింది. మూగ, చెవిటి సమస్యతో బాధపడుతున్న శ్యామల స్నేహితులతో కలిసి సమీపంలో పెళ్లి విందుకు వెళ్లి వస్తుండగా కుక్కలు దాడి చేశాయి. నాలుగు కుక్కలు వెనుక నుంచి ఒక్కసారిగా అరుస్తూ దూసుకొచ్చాయి. కుక్కల అరుపులకు పిల్లలంతా భయపడి పారిపోగా శ్యామలకు వినిపించకపోవడంతో అక్కడే ఉండిపోయింది. స్నేహితులు ఎందుకు పరుగుపెడుతున్నారో తెలుసుకునేలోగానే నాలుగు కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కాళ్లు, చేతులు, పొట్టభాగంలో గాయాలయ్యాయి. ఇంతలో అటుగా వస్తున్న గ్రామస్తులు కుక్కలు తరిమి చిన్నారిని కాపాడారు. చిన్నారిని పొందూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ఆదాయానికి మద్యమే మార్గమంటూ..
● గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్న టీడీపీ నాయకుడు ● కపాసుకుద్ది కేంద్రంగా బెల్టులకు మద్యం సరఫరా ● మత్స్యకార గ్రామాలకు అధికంగా మద్యం పంపిణీఇచ్ఛాపురం రూరల్: కొత్త మద్యం పాలసీతో తెలుగు తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. గ్రామాలకు అక్రమంగా మ ద్యం తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నారు. కవిటి మండలం మత్స్యకార గ్రా మానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు ఇలా మద్యం సరఫరా చేసిన వైనం వెలుగు చూడడంతో అతను ప్రస్తుతం పరారైపోయాడు. ఈ నాయకుడు ప్రస్తుతం మత్స్యకార సొసైటీ అధ్యక్షుడిగా, రేషన్ షాపు డీలర్ ప్రతినిధిగా పరపతి సంపాదించాడు. తన వ్యాపారానికి కవిటి మండలం కపాసుకుద్ది కేంద్రంగా చేసుకుని ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి కపాసుకుద్ది, కర్రివారిపాలెం, ఇద్దివానిపాలెం, బెజ్జిపుట్టుగ, బొరివంక, కుసుంపురం, బల్లిపుట్టుగ వరకు బెల్టు షాపులను ఎంచుకొని ఇచ్ఛా పురం మండలం కొఠారీ వైన్ షాపుల వద్ద నుంచి రాత్రి సమయాల్లో సరుకును తీసుకొని పై గ్రామాలకు డోర్ డెలివరీ చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. బుధవారం ఇచ్ఛాపురం రూరల్ పోలీసులకు సుమారు రెండు లక్షల రూపాయల మద్యం దొరకడంతో.. సరుకును తీసుకువెళ్తున్న వ్యాను డ్రైవర్ ఈ ‘బాబు’ బండారాన్ని బయటపెట్టేశాడు. దీంతో రూరల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ నేత పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికో రేటు.. గ్రామాల్లో బెల్టు షాపును నిర్వహించేందుకు గ్రామానికో రేటును ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మత్స్యకార గ్రామాల్లో రెండేసి బెల్టు షాపులు చొప్పున ఏర్పాటు చేసి ఒక్కో బెల్టు షాపు నుంచి గ్రామానికి రూ.30వేల నుంచి రూ.50 వేల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నా రు. స్థానిక పోలీస్ స్టేషన్కు ఒక రేటు, ఎకై ్సజ్ శాఖ స్టేషన్కు ఒక రేటును నెలవారీ మామూళ్లుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం పాన్ షాపులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లే అడ్డా.. గత ప్రభుత్వంలో ఎక్కడా బెల్టు షాపుల ఊసే లే దు. ఒకవేళ అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులు, సెబ్ అధికారులు దాడు లు చేసి నిర్వాహకులపై కేసులు నమోదు చేసేవా రు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోని పాన్షాపులు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను ఏకంగా మినీబార్లుగా మార్చేశారు. ఇక్కడ బెల్టు షాపులు నిర్వహిస్తూ రోజంతా మందుబాబులకు సరుకు అందిస్తున్నారు. బెల్టు షాపు నిర్వాహకులు క్వార్టర్ బాటిల్కు రూ.50 అదనంగా తీసుకుంటున్నారు. ఈ బెల్టుషాపులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. పాన్ షాపుల వద్ద బహిరంగంగా మద్యం తాగుతున్న మందుబాబులుఅక్రమ విక్రయాలపై చర్యలు తీసుకుంటాం అక్రమంగా బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేపడితే చర్యలు తీసుకుంటాం. సిబ్బందితో ముమ్మరంగా దాడులు చేయించి ఇప్పటికే అరెస్టులు, కేసులు నమోదు చేయడం జరిగింది. గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించడం నేరం. వైన్ షాపులు బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. – పి.దుర్గాప్రసాద్, సీఐ, ఎకై ్సజ్ శాఖ, ఇచ్ఛాపురం -
నరసన్నపేటలో గంజాయి కలకలం
నరసన్నపేట : నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో గంజాయి వినియోగం ఒక్కసారి బట్టబయలైంది. ఒకేసారి 9 మంది అరెస్టు కావడంతో కలకలం రేగింది. స్థానికంగా గంజాయి అమ్మకాలు, వినియోగం జరుగుతుందని గమనించిన పోలీసులు దీనిపై నిఘా వేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్తో పాటు పలు ప్రాంతాల్లో గంజాయి అక్రమంగా చేతులు మారుతున్నట్లు అనుమానంతో ఇటీవల సోదాలు చేశారు. అప్పట్లో ఏమీ లభించలేదు. శనివారం స్థానిక వెంకటేశ్వరాలయం ఎదురుగా రాజులు చెరువు గట్టుపై ఉన్న వీధిలో పసుపుల రమణ ఇంటి వద్ద కొందరు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.66 వేల విలువైన 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో కొందరు గంజాయిని వినియోగిస్తున్నారు. వీరిని విచారించగా మిగిలిన వారూ పట్టుబడ్డారు. ఈ మేరకు కేసు నమోదు చేసి 9 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ జె.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. స్థానిక ట్యాంకు బండ్ వీధికి చెందిన కోట ప్రతీప్, శ్రీరాంనగర్కు చెందిన లిమ్మా రాహుల్, పెద్దపేటకు చెందిన అరసవల్లి వరప్రసాద్, జగన్నాథపురానికి చెందిన దనిమిశెట్టి అజయ్, హనుమాన్నగర్కు చెందిన గొడ్డు రాఘవేంద్ర, బొంతల వీధికి చెందిన పొన్నాడ అజయ్, మేదర వీధికి చెందిన బెహరా హరి, శ్రీకాకుళం సానా వీధికి చెందిన తట్టా హేమంత్, పోలాకి గొల్లలవలసకు చెందిన దంత పునీత్లను అరెస్టు చేసినట్లు సీఐ వివరించారు. వీరి వద్ద రెండు ద్విచక్ర వాహనాలు, 9 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ● 22 కేజీలు స్వాధీనం.. 9 మంది అరెస్టు -
నేటి నుంచి వాసుదేవుని బ్రహ్మోత్సవాలు
కాశీబుగ్గ: మందస పట్టణంలో కొలువైన వాసుదేవు ని 16వ బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రా రంభం కానున్నాయి. ఈ నెల 23 వరకు ఉత్సవాలు జరుగుతాయి. 14వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో రాజుల కాలం నుంచి ఏటా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 1744 సంవత్సరంలో నరసాపురానికి చెందిన తెలికిచెర్ల కందాడ రామాను జాచార్యస్వామి ఇక్కడ సంస్థానాచార్యులుగా ఉండేవారు. ఆయన వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ రా మనుజ పెద్ద జీయర్ స్వామి, గోపాలాచార్య స్వా మి శిష్యులుగా ఉండేవారు. అప్పట్లో ఇక్కడ ఉన్న వేద పాఠశాలలో పండితులు విధ్యనభ్యసించేవారు. 1950 వరకు ఆలయంలో క్రతువులు జరిగేవి. రాజు ల పాలన అనంతరం కొన్ని దశాబ్దాల పాటు ఆల యం మూతపడి శిథిలావస్థకు చేరుకుంది. చిన్నజీయరుస్వామి వాసుదేవ ఆలయ చారిత్రక ప్రాముఖ్యతను గుర్తించి తన గురువు స్మారకార్థం జీర్ణోద్ధరణ చేసేందుకు సంకల్పించి 2001 నుంచి పున:నిర్మాణ పనులను చేపట్టారు. 2009లో ఆలయాన్ని పునఃప్రతిష్టించారు. ఆలయంలో రాజుల పాలన కా లంలో ఉన్న విగ్రహాన్నే పునఃప్రతిష్టించారు. ఆలయంలో ఉన్న వాసుదేవ పెరుమాళ్ విగ్రహ నిజరూ పం తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరస్వామి విగ్రహం మాదిరిగానే ఉంటుంది. బ్రహ్మోత్సవ కార్యక్రమ వివరాలు ఈ నెల 17వ తేదీ సోమవారం ఆంజనేయస్వామి అభిషేకం. 18న శ్రీవాసుదేవ పెరుమాళ్ అభిషేకం, శ్రీవిశ్వక్సేన ఆరాధన, అంకురారోపణం. 19న గరుడపూజ, ధ్వజారోహణం, హనుమద్వాహనం, శేషవాహన సేవ. 20న కల్పవృక్ష వాహనము, ఎదుర్కోలు ఉత్సవం. 21న శ్రీ వాసుదేవ్ పెరుమాళు కల్యాణ మహోత్సవం, గరుడవాహన సేవ. 22న పొన్నచెట్టు వాహనము, తెప్పోత్సవం, అశ్వవాహనము 23న రథోత్సవ, చక్రస్నానం, ద్వాదశరాధన, శ్రీపుష్పయాగం. -
రూల్స్కు తిలోదకాలుబీసీ సంక్షేమ శాఖలో నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు. ముడుపుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. –8లో
తనిఖీలతో ఆగిన లారీలు● జిల్లాలోని ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉన్నతాధికారులు సీరియస్ ● అక్రమ రవాణాను క్యాష్ చేసుకున్న అధికారిపైనే ప్రధానంగా ఫోకస్ ● సంబంధం ఉన్న శాఖలకు చెందిన కొందరికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం ● అధికారికి లారీకి రూ. 2వేలు చొప్పున ముడుతున్నట్టు భోగట్టా సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా నుంచి అక్రమ ఇసుకను దగ్గరుండి సరిహద్దులు దాటిస్తున్న ‘లంచావతారం’పై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. సెలవు రోజైనా ఆదివా రం కూడా ఇదే విషయమై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఈ అధికారి ఒక్కో లారీకి రూ.రెండేసి వేల చొప్పున వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ర్యాంపులో ఇసుక ఎత్తినందుకు రూ.వెయ్యి, అక్రమ రవాణా చేసినందుకు రూ.వెయ్యి వసూలు చేసి లబ్ధిపొందుతున్నట్టు సమాచారం. జరుగుతున్న భాగోతంపై ‘సాక్షి’లో కథనం వచ్చాక విస్తృతంగా చర్చకు దారి తీసింది. అధికారిక ర్యాంపులు ఏడే.. జిల్లాలో అధికారికంగా 11 ఇసుక ర్యాంపులు నడిచేవి. ఇందులో రీచ్లతో పాటు డీ సిల్టేషన్ ర్యాంపులున్నాయి. వీటిలో గార, ముద్దాడపేట, కాఖండ్యాం, బట్టేరు రీచ్లకిచ్చిన ఏడాది గడువు ముగిసింది. దీంతో అధికారికంగా నడుస్తున్నవి ఏడు రీచ్లే. కానీ, గడువు తీరిన రీచ్లతో పాటు అనధికారికంగా వంశధార, నాగావళి నదీ తీరం పొడవునా ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసు క ర్యాంపులు నడుస్తున్నాయి. మంచినీటి ఇన్ఫిల్టరేషన్ బావులు, సంపులు, వంతెనలు ఉన్న చోట కూడా ఇసుక తవ్వేసి తరలించేస్తున్నారు. ఆమదాలవలస నియోజకవర్గంలో దూసి, ఇసుకలపేట, దిబ్బలపేట, తొగరాం, కొత్తవలస, నిమ్మతొర్లాడ, పాతూరు, నారాయణపురం, అక్కివరం, బెలమం, లొద్దలపేట, కొరపాం, తోటాడ, సింగూరు, చెవ్వాకులపేట, సవలాపురం, శ్రీకాకుళం నియోజకవర్గంలోని బైరి, కరజాడ, బూరవల్లి, కళ్లేపల్లి, కిల్లిపాలెం, పొన్నాం, బట్టేరు, నైరా, గార, నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం, పర్లాం, రామకృష్ణాపురం, శ్రీముఖలింగం, దొంపాక, లుకలాం, బుచ్చిపేట, ఉర్లాం, చేనులవలస, గోపాలపెంట, పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు, హిరమండలం మండలాల్లోని పలు గ్రామాల నదీ తీరంలో అక్రమంగా ఇసుక ర్యాంపులు నడిచాయి. దీంతో పాటు గడువు ముగిసిన గార, బట్టేరు, కాఖండ్యాం, ముద్దాడపేట రీచ్ల్లో కూడా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇటీవల కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు వెళ్లి తనిఖీలు చేయడంతో వాటిలో కాస్త తవ్వకాలు ఆగాయి. రాత్రి పూట మాత్రం యథాతథంగా సాగిపోతున్నాయి. అనధికార ర్యాంపుల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర కన్న 10టైర్ల లారీకి రూ. 12వేలు, 12టైర్ల లారీకి రూ. 14వేలు, 14టైర్ల లారీకి రూ. 16వేలు, 16టైర్ల లారీకి రూ. 18వేలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదే విషయమై కలెక్టర్ గ్రీవె న్స్కు గతంలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఇలా మొత్తం తిలాపాపం.. తలా పిడికెడు అన్నట్టుగా అ క్రమ తవ్వకాలు, తరలింపులో నాయకులతో పాటు పలువురు భాగస్వామ్యం కావడంతో అక్రమ సొ మ్ముకు కక్కుర్తిపడే అధికారులకు పంట పండింది. క్యాష్ చేసుకున్న ఆ అధికారి అక్రమ రవాణా అరికట్టేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి రణస్థలం మండలం పైడి భీమవరం సరిహద్దులో చెక్పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యే క దళాలకు చెందిన సిబ్బందిని తనిఖీల కోసం నియమించారు. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగలేదు. ముఖ్యంగా రాత్రిపూట ఎక్కువగా అక్రమ రవాణా సాగుతోంది. ఇక ఉదయం నకిలీ బిల్లుల సాయంతో వందలాది లారీలు జిల్లా దాటేస్తున్నాయి. ఇదే అవకాశంగా తీసుకుని లంచావతారం ఎత్తిన ఓ అధికారి క్యాష్ చేసుకుంటున్నారు. అక్రమార్కులతో అధికారికి లింకులు విశాఖకు చెందిన లారీ యజమానులతో పాటు అనధికార ర్యాంపులు నిర్వహిస్తున్న నిర్వాహకులతో డీల్ కుదుర్చుకుని పథకం ప్రకారం జిల్లా నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇచ్ఛాపురానికి చెందిన ఓ లారీ య జమాని విశాఖలో ఉంటూ ఆయనకు బాగా సహకరిస్తున్నారు. ఆ యజమానికి సొంతంగా 13లారీలు ఉండటం, ఆ వ్యక్తికి లంచావతారమెత్తిన అధికారికి సన్నిహిత సంబంధాలుండటంతో ఈ యజమాని మరికొంతమంది లారీ యజమానులతో ఒప్పందం కుదిర్చి జిల్లా నుంచి ఇసుకను తరలించేస్తున్నారు. ఇసుక కొరత ఉన్న మొదట్లో లారీకి రూ. 3వేల నుంచి రూ. 5వేల వరకు ముడుపులు తీసుకోగా, ప్రస్తుతం లారీకి రూ. 2వేలు చొప్పున తీసుకుంటున్నట్టుగా సమాచారం. ఇందులో సగం అక్రమ ర్యాంపుల నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రికార్డెడ్గా రోజుకి 150నుంచి 180వరకు లారీలు తరలివెళ్తున్నట్టు తెలిసింది. అనధికారికంగా ఎన్ని లారీలు వెళ్తున్నాయో యజమానులకే తెలియాలి. ఇలా, రికార్డయిన అయిన లారీలను జా యింట్ కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేసేసరికి 28 లారీల్లో 12లారీలు నకిలీ బిల్లులతో తరలిస్తున్నట్టుగా గుట్టు రట్టు అయింది. సరిహద్దు చెక్పోస్టుల్లో తనిఖీ చేస్తున్న విషయం తెలుసుకుని దానికి ముందు కొంత దూరంలో 50వరకు లారీలు చాలా సేపు నిలిచిపోయాయి. ఆ తర్వాత రణస్థలం, సతివాడ, రామతీర్థం మీదుగా మళ్లించేశారు. ప్రస్తుతం కూడా ఈ రూట్లోనే అక్రమ రవాణా సాగుతోంది. జయహో.. రాజమ్మ తల్లి వత్సవలస రాజమ్మ తల్లి రెండో వారం యాత్ర ఘనంగా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఉన్నతాధికారి ఆరా జిల్లాలో జరుగుతున్న అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, నకిలీ బిల్లులపై జిల్లా ఉన్నతాధికారి సీరియస్గా దృష్టిసారించారు. ముఖ్యంగా సరిహద్దులో లంచావతారం ఎత్తిన అధికారి కోసం ప్రత్యేకంగా ఆరా తీసినట్టు తెలిసింది. ఎవరా అధికారి అని నిఘా వర్గాల ద్వారానే వివిధ మార్గాల్లో తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇసుక వ్యవహారంలో సంబంధం ఉన్న శాఖలకు చెందిన కొందరికి నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. -
ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలు
నరసన్నపేట: జాతీయ రహదారిపై దేవాది సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆటో బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. అతివేగంతో వస్తున్న ఆటో పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి అదుపుతప్పడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి క్షతగాత్రులను బయటకు తీశారు. ఆర్.ఈశ్వరమ్మ, కొండాలమ్మ, పైడమ్మలకు బలమైన గాయాలు కాగా, మిగిలిన ముగ్గురూ స్పల్ప గాయాలతో బయటపడ్డారు. ఎచ్చెర్ల మండలం సనపలవానిపేటకు చెందిన వీరంతా ఆటోలో నిమ్మాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఎన్హెచ్ అంబులెన్స్లో శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఎన్హెచ్ పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో స్పందించి తగిన సహాయం అందించారు. మంత్రిని కలిసిన వెటర్నరీ సిబ్బంది కాశీబుగ్గ: తమను ఉద్యోగాల్లో కొనసాగించాలని కోరుతూ వెటర్నరీ(1962) వాహనం సిబ్బంది ఆదివారం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడిని కలిశారు. అకస్మాత్తుగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడం భావ్యం కాదన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెటర్నరీ వాహనాల నిర్వహణ అవకతవకలు ఉన్నట్లు గుర్తించామని, 104లా చిన్న వాహనం పెట్టేందుకు ఆలోచిస్తున్నామని, జీవీకే సంస్థకు రూ. 150 కోట్ల బకాయి ఉందని తెలియజేశారు. ఈ సమస్యలన్నీ తేలాక మళ్లీ పిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా, ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగులను తొలగించడం అన్యాయమని, ఉద్యోగుల కోసం నిరహార దీక్షలు చేస్తామని సీఐటీయూ అధ్యక్షుడు సురేష్ బాబు తెలిపారు. -
ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: బంధువుల వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మృతి చెందారు. అరకబద్ర గ్రామానికి చెందిన రంగాల కృష్ణారెడ్డి(63) ఆదివారం ధర్మపురం బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఇంటికి తన ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, ధర్మపురం–ఈదుపురం రోడ్డులో వెళ్తున్న ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టింది. పంట పొలాల్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈయనకు భార్య సీతమ్మ, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి అంకిత భావంతో పనిచేసిన కృష్ణారెడ్డి మృతి పట్ల జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంపత్ని చిట్టిబాబు, నాయకులు సంతాపం తెలియజేశారు. -
ఆదిత్యుని సన్నిధిలో మాఘమాస సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో మాఘమాస సందడి నెలకొంది. మాఘ మాసం రెండో ఆదివారం సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఇతర జిల్లాల నుంచి సైతం భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రపుష్కరిణి వద్ద పిడకల పొయ్యిలపై క్షీరాన్నాన్ని వండి ఆదిత్యునికి నివేదించారు. తలనీలాల మొక్కులు తీర్చుకుని ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయంలో స్వామివారి మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి వేకువజామున 6 గంటల నుంచే ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో సర్వదర్శనాలకు సిద్ధం చేశారు. భక్తులకు ఎండ వేడి నుంచి రక్షణగా ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో దర్శన మార్గాల్లో టెంట్లు వేయించారు.మంచినీటిని సరఫరా చేయించారు. మరుగుదొడ్లు విషయంలో మాత్రం భక్తులు అవస్థలు పడ్డారు. పలువురు అధికారులు ఆదిత్యున్ని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి రావడంతో వివిధ దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.8.15 లక్షలు, విరాళాలు, ప్రత్యేక పూజలు టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,08,740, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 2.25 లక్షల వరకు ఆదాయం లభించినట్లు ఈవో ప్రకటించారు. -
● కుటుంబానికి తప్పిన పెను ప్రమాదం
కారులో మంటలు టెక్కలి: మండలంలోని నరసింగపల్లి సమీపంలో ఆదివారం ఓ కారు నుంచి హఠాత్తుగా మంటలు రావడంతో యజమాని గమనించి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. టెక్కలి మండలం సీతాపురం గ్రామానికి చెందిన బెండి ఉదయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కారులో పర్లాఖిమిడి వైపు వెళ్తుండగా, నరసింగపల్లి సమీపంలో రోడ్డుపై వేసిన మినుము మొక్కలు ఇంజిన్లోకి వెళ్లి రాపిడికి మంటలు వ్యాపించాయి. ముందుగా పొగలు రావడంతో గమనించిన ఉదయ్ ఒక్కసారిగా అప్రమత్తమై కారును నిలిపివేసి హుటాహుటినా కుటుంబ సభ్యులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం గ్రామస్తుల సాయంతో మంటలపై నీరు చల్లడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారు ఇంజిన్, అడుగు భాగం దెబ్బతింది. -
తిలోదకాలు
సర్వీస్ రూల్స్కు.. ● బీసీ సంక్షేమశాఖ రూటే సెప‘రేటు’ ● నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. ఆపై పదోన్నతులు ● ముడుపులు చెల్లిస్తే అక్రమాలన్నీ సక్రమాలే శ్రీకాకుళం పాతబస్టాండ్: బీసీ సంక్షేమ శాఖలో సర్వీస్ రూల్స్కు తిలోదకాలిస్తున్నారు. ఉన్నతాధికారుల పేరు చెప్పి కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఇక్కడ పదోన్నతుల వ్యవహారం సాగుతోంది. అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్)గా విధుల్లోకి చేరిన వారు, కుక్గా చేరిన వారు ఒక్క సారిగా మూడు కేడర్లు దాటి వసతి గృహ సంక్షేమాధికారిగా పదోన్నతులు పొందుతున్నారు. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు.. ఆ సర్టిఫికెట్ నకిలీదా వాస్తవమైనదా అన్నది పరిశీలించకుండానే పదోన్నతులు కట్టబెట్టేస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి ఉన్నతాధికారులకు డబ్బులు చెల్లించి ఉద్యోగాల్లో కొనసాగుతున్నవారు, అడ్డగోలుగా పదోన్నతులు పొందిన కొందరు ఉద్యోగులు విధులకు డుమ్మాకొట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ●2006లో జీఓ 36 ప్రకారం 10 శాతం ప్రమోషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారిచేసింది. అప్పటికి అర్హత ఉన్నవారి ప్రకారం 8 మందికి పదోన్నతులు కల్పించాల్సింది. అయితే ఈ జీవోని తుంగలోకి తొక్కి అధికారులే సొంత జీవోను తయారు చేసుకొని కాసులకు కక్కుర్తి పడి ఏకంగా 25 మంది కింది స్థాయి ఉద్యోగులకు వార్డెన్లుగా (హెచ్డబ్ల్యూఓ) పదోన్నతులు కల్పించారు. ఈ ఖాళీలు ఎక్కడి నుంచి వచ్చాయో..ఏ జీవో ప్రకారం పదోన్నతుల కల్పించారో వారికే ఎరుక. ఇటువంటి పదోన్నతుల పర్యవసానంగానే గతంతో ఇక్కడ జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన అధికారికి ఇప్పటికీ పెన్షన్ రాలేదు. అంతేకాకుండా ఆ కేసులు కూడా తేలలేదని కార్యాలయ సిబ్బందే చెబుతున్నారు. ఆ తర్వాత డీబీసీడబ్ల్యూఓగా వచ్చి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిణి కి కూడా కేసుల బెడద తప్పలేదు. ● జీవో ప్రకారం పదోన్నతి పొందిన వారు మూడేళ్లలోపే బీఈడీ పూర్తి చేయాలి. అలా పూర్తి చేయకపోతే తిరిగి సబార్డినేట్ పోస్టుకి వెళ్లాలి. ఇక్కడ మాత్రం పదోన్నతి పొందడమే తప్ప ఆ తర్వాత పట్టించుకునే వారే కరువయ్యారు. ఒక వేళ ఎవరైనా డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చినా అవి నిజమైనవా నకిలీవా అన్న దర్యాప్తు కూడా చేపట్టడం లేదు. ● ఏ ఉద్యోగికై నా పదోన్నతి పొందాక రెండేళ్లలోపు డిపార్ట్మెంట్ టెస్టులు రాయాలి. అంటే ఎస్ఓ–1 ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే పాత కేడర్కే రివర్ట్ చేయాల్సి ఉంది. ఆ నిబందన కూడా ఈ శాఖలో ఇప్పటి వరకు అమలు కావడం లేదు. ఇటువంటి వాటిని ఆ ఉద్యోగులకు బూచిగా చూపించి కొందరు జిల్లా స్థాయి అధికారులు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ సంక్షేమశాఖలో డబ్బులిస్తే చాలు ఉన్నతాధికారులను, ఆపై ఉన్నతాధికారులను తప్పుతోవ పట్టించడంలో కొందరు ఘనాపాటిలు ఈ శాఖలో తిష్ఠ వేశారు. ● బీసీ సంక్షేమశాఖలో ముఖ్యంగా జోన్–1లో రూల్ 16 హెచ్ నడుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో 2008లో సీనియారిటీ లిస్ట్ ఇచ్చారని, మరలా ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమని వార్డెన్లు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు రూల్ 16హెచ్ పక్కను పెట్టి సీనియారిటీ పేరిట కొత్తగా అవినీతి పదోన్నతులు పేరిట ఫైల్ను తయారుచేసి మరోసారి కలెక్టర్, ఇతర అధికారులను తప్పుతోవ పెట్టించే ప్రయత్నం ఈ శాఖలో మొదలైందని ఆ శాఖ ఉద్యోగులు చెబుతున్నారు. తప్పుడు పదోన్నతులు ఇవ్వడం ఈ శాఖకు అలవాటుగా మారిందని ఆ ఆద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● సెటిల్డ్ సీనియారిటీ మార్చే అధికారం ఎవరికీ లేదు. 2008లో ఇచ్చిన సెటిల్డ్ సీనియార్టిని ఒక వేళ మార్పు చేయాలంటే మూడేళ్లలోపే మార్చే అధికారం ఉంటుంది. అప్పుడు చేయకుండా ఇప్పుడు మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ● లావేరులో పనిచేసిన ఓ అటెండర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో వార్డెన్గా పదోన్నతి పొందినట్లు ఆ శాఖ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఆయనతో పాటు పదోన్నతి పొందిన ఇద్దరు ఉద్యోగ విరమణ పొందినా క్రమశిక్షణ చర్యలు క్రింద పెన్షన్ నిలుపుదల చేశారు. దీనిని బట్టి కొంతమందికే క్రమశిక్షణా చర్యలు, మరికొంతమందికి మినహాయింపులు ఉంటాయనేది అర్ధం చేసుకోవచ్చు. ● ప్రధానంగా జిల్లా అధికారికి, కార్యాలయ సిబ్బందికి, అస్మదీయులకు అనుకూలంగా ఫైల్ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే నష్టపోయినవారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే సమస్యలు, వివాదాలతో కూనరిల్లుతున్న ఈ సంక్షేమ శాఖ మరింత ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ శాఖ జిల్లా కార్యాలయంలో అధిక శాతం మంది కారుణ్య నియామకం పొందినవారే. వారికి సర్వీస్ రూల్స్పై అవగాహన లేకపోవడం, అధిక వేతనంపై ఆశతో తప్పులమీద తప్పులు చేస్తున్నారని ఆ శాఖలో కొంతమంది ఉద్యోగులు బాహాటంగానే చెబుతున్నారు. -
ఉత్తరాంధ్ర మాజీ సైనికుల ఆత్మీయ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని పెద్దరెల్లివీధిలో జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వన్ స్టేట్ వన్ అసోసియేషన్ రాష్ట్ర అడహాక్ కమిటీ కన్వీనర్ కె.గోవిందరావు, రాష్ట్ర స్థాయి క్రియాశీలక నాయకులు, బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు, రాజమండ్రికి చెందిన సీనియర్ మాజీ సైనికులు, న్యాయవాది డాక్టర్ సూరెడ్డి శివకుమార్ హాజరయ్యారు. మాజీ సైనికుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నామని, సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల మాజీ సైనికుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
ఇచ్ఛాపురం రూరల్: మద్యానికి బానిసైన వ్యక్తి గెడ్డలో పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్ఛాపురం మండలంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మపురం గ్రామానికి చెందిన పైల నూకయ్య(58) మద్యానికి బానిసయ్యాడు. శారీరక సమస్యలతో బాధపడుతూ రెండు రోజుల క్రితం గ్రామానికి కొంత దూరంలో ఉన్న దండుగెడ్డలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం శవమై తేలడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. నూకయ్యకు భార్య, ఇద్దరు కూమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యారంగ సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని ఏఐఎఫ్ఈఏ చీఫ్ ప్యాట్రన్ కె.సుబ్బారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతిభవన్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్(1938) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం అద్యయన తరగతులు నిర్వహించారు. ఏపీటీఎఫ్ కార్యకర్తలకు ఉపాధ్యాయ ఉద్యమం, సమకాలీన అంశాలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, నూతన విద్యా విధానం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ఉద్యమ తొలి గురువు మార్పు బాలకృష్ణమ్మ చిత్రపటానికి నివాళ్లర్పించారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు చింతాడ దిలీప్కుమార్, జిల్లా అధ్యక్షుడు బి.రవి, జిల్లా గౌరవ అధ్యక్షులు టెంక చలపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మద్యం బాటిళ్లు పట్టివేత గార: ఉత్తరాంధ్రలో పేరున్న వత్సవలస రాజులమ్మ తల్లి యాత్రలో అనధికార మద్యం వ్యాపారం జోరందుకుంది. శని, ఆదివారాల్లో జరిగిన ఈ యాత్రకు అధిక సంఖ్యలో జనం తరలిరావడంతో అనధికార మద్యం వ్యాపారం జరగ్గా ఎకై ్సజ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఓ వ్యక్తి వద్ద నుంచి 10 బాటిళ్లు, మరొక వ్యక్తి నుంచి 15 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడుల్లో ఎకై ్సజ్ ఎస్ఐలు ఆర్.మహేష్బాబు, బి.రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఓల్డేజ్ హోమ్లో గుర్తు తెలియని బాలిక బూర్జ: మండలంలోని పాలవలసలో సహాయమాత ఓల్డేజ్ హోమ్లో గుర్తు తెలియని బాలిక ఉందని, ఈమె వివరాలను గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేయాలని నిర్వాహకులు ఆదివారం బూర్జ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నరసన్నపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ అమ్మాయి గాయపడటంతో స్థానికులు కొందరు శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారని, కాళ్లు విరగడంతో కొన్ని రోజులు అక్కడే ఉంచి చికిత్స అందించారని, ఆమె ఎవరో చెప్పలేని స్థితిలో ఉందని, కనీసం పేరు కూడా చెప్పడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. రిమ్స్ సిబ్బంది 2023 డిసెంబరు 31న ఓల్డేజి హోమ్లో చేర్పించారని, ఇంతవరకు బాలిక కోసం కుటుంబ సభ్యులు రాలేదని, వారి వివరాలు కనుక్కోవాలని కోరారు. రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి కాశీబుగ్గ: తిరుపతి–పూరీ రైలులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస రైల్వే ఎస్ఐ ఎస్కే షరీఫ్ తెలిపారు. విశాఖపట్నం వద్ద రైలు ఎక్కిన 40 ఏళ్ల తప్పతాగి ఉన్నాడని, పలాస రైల్వే స్టేషన్ వచ్చేసరికి మృతి చెందినట్లు తోటి ప్రయాణికులు ఫిర్యాదు చేయడంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మృతుడి వివరాలు లభించలేదని, పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డీఎస్సీ–2003 టీచర్లకు పాతపెన్షన్ అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డీఎస్సీ–2003 ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఫోరం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. డీఎస్సీ వెలువడిన 2003 సమయంలో సీఎంగా చంద్రబాబునాయుడే ఉన్నారని.. ఆరోజు నియామకాల జాప్యానికి నాటి ప్రభుత్వాలే కారణమని చెప్పారు. ప్రభుత్వ జాప్యానికి ఉపాధ్యాయులను బలిపశువులను చేయడం తగదని.. పాతపెన్షన్ను అమలు చేయకుటే ఉద్యమబాట పడతామని ఫోరం ప్రతినిధులు స్పష్టంచేశారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న కళింగభవన్లో డీఎస్సీ 2003 ఉత్తరాంద్ర ఫోరం ఆధ్వర్యంలో మెమో 57 ఉద్యోగ ఉపాధ్యాయ సాధన సమితి సమావేశం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కన్వీనర్ మోపిదేవి శివశంకర్ మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ 2003 నవంబర్ 13న విడుదలైనప్పటికీ నియామకాలు 2005 నవంబర్లో చేపట్టి.. రెండేళ్లపాటు ప్రభుత్వం జాప్యం చేసిందని, తమను బలవంతంగా సీపీఎస్ విధానంలోకి నెట్టడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియమితులైన 7361 మంది ఉపాధ్యాయులకు, హోంశాఖ కు చెందిన 1800 మంది కానిస్టేబుళ్లకు, గ్రూప్–2, గ్రూప్–1, హెల్త్ విభాగానికి చెందిన 1800 మందికి మొత్తం 11,000 మంది ఉపాధ్యాయ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్తింపచేసి పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఇది ఆర్థిక భారమైన డిమాండ్ కాదని.. న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని దానికి అవసరమైన అన్ని రకాల సహకారం ఏపీ ఎన్న్జీవో సంఘం తరఫున అందిస్తామన్నారు. ఏపీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు దుప్పల శివరాంప్రసాద్ మాట్లాడుతూ మెమో 57 ప్రకారం 15 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేశాయన్నారు. ఇక్కడ అమలు చేసి 16వ రాష్ట్రంగా నిలవాలని కోరారు. ఫోరం జిల్లా కన్వీనర్ పి.శ్రీహరి మాట్లాడుతూ సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ అమలు చేసిన తొలి రాష్ట్రంగా మన రాష్ట్రం నిలవాలన్నారు. సమావేశంలో సుబ్బారెడ్డి, విజయనగరం కన్వీనర్ రవి, విశాఖ కన్వీనర్ షేక్ మహ్మద్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు గాదె శ్రీనివాసులునాయుడు, కోరేడ్ల విజయ్గౌరి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘సంచార పశు ఆరోగ్య సేవలు ఆపేయండి’
కాశీబుగ్గ: పశువులకు అత్యవసర వైద్య సేవలు అందించాలని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార పశు ఆరోగ్యసేవలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి చూస్తోంది. ఉన్న ఫలంగా సంచార పశు ఆరోగ్య సేవలను ఆపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 19 మే 2022లో ప్రారంభించిన ఫేజ్–1లో 175 వాహనాలు తిరిగి ఆయా ఏడీ కార్యాలయంలో అప్పగించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఆయా వెహికల్స్లో పనిచేస్తున్న పైలెట్, పారావిట్, డాక్టర్, పైలెట్ రిలీవర్లు విధులకు హాజరు కాకూడదని వాట్సాప్లో సూచించారు. జిల్లాలో ఫేజ్–1లో 09 వాహనాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
దేవుడా.. ప్రమాదం తప్పింది
● చెరువులో పడిపోయిన స్కూల్ బస్సు ● స్థానికుల స్పందనతో నిలబడిన విద్యార్థుల ప్రాణాలు ● ఐదుగురు విద్యార్థులకు గాయాలు కాశీబుగ్గ: మందస మండలం ఉమాగిరి వద్ద స్కూల్ బస్సు శనివారం చెరువులో పడిపోయింది. బస్సులో ముప్పై మంది ఉండగా.. ఐదుగురు గాయపడ్డారు. మిగతా వారు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మందస మండల కేంద్రంలోని వివేకానంద ప్రైవేటు పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు.. 30 మంది విద్యార్థులతో శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మందస నుంచి భైరిసారంగిపురం, బెల్లుపటియా, పెడంగో, బుడార్సింగి గ్రా మాలకు బయల్దేరింది. ఉమాగిరి వద్ద చెరువు పక్కన కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతు న్న ప్రదేశంలో.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను తప్పించబోయి బస్సు చెరువులో పల్టీ కొట్టింది. దీంతో పిల్లలంతా ఒక్కసారిగా హాహాకారాలు పెట్టారు. అక్కడున్న స్థానికులు వెనువెంటనే స్పందించి పిల్లలను, బస్సు సిబ్బందిని బయటకు తీశారు. చెరువులో నీరు తక్కువగా ఉండ డంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయినప్పటికీ బుడార్సింగి, పెడంగో గ్రామాలకు చెందిన ఐదు మంది విద్యార్థులు ఎన్.ధీరజ్, ఎన్.లోకేష్, పవి త్ర పట్నాయక్, హర్షిత, మహేష్ గౌడ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఉమాగిరి వాసి శిష్టు బాబ్జితో పాటు స్థానికులు రక్షించారు. 108 సాయంతో గాయపడిన వారిని మందస మండలం హరిపురం ప్రభుత్వ సామా జిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు డాక్టర్ ఐశ్వర్య, రాజ్యలక్ష్మిలు వైద్యసేవలు అందించారు. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి రైతు దుర్మరణం
పొందూరు/ఆమదాలవలస రూరల్: : ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన ఘటన ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పొందూరు మండలం తాడివలసకు చెందిన తమ్మినేని భాస్కరరావు(51) తనకు ఉన్న ఎకరా పొలంతో పాటు సుమారు ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. కొద్ది నెలల క్రితం ట్రాక్టర్ను కొనుగోలు చేసి దుక్కులు దున్నడం, పొలం పనులు చేయడం వంటి పనులు చేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 5 గంటలకు వ్యవసాయ పనుల కోసం సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న ఆమదాలవలస మండలం బెలమాం గ్రామంలోని పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్పై వెళ్లాడు. పొలం లోతట్టులో ఉండటంతో ట్రాక్టర్ బోల్తా పడి భాస్కరరావు కిందనే చిక్కుకుపోయాడు. స్థానికులు గుర్తించి బయటకు తీసేసరికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న భార్య రమణమ్మ అక్కడికక్కడే కుప్పకూలింది. ఆమదాలవలస ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
శ్రీకాకుళం
లక్కీచాన్స్సిక్కోలు బౌలర్కు లక్కీ చాన్స్ వచ్చింది. మెక్గ్రాత్ క్రికెట్ అకాడమీ నుంచి పిలుపు వచ్చింది. –8లోఆదివారం శ్రీ 16 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025పైడిబీమవరం చెక్పోస్టు వద్ద నిలిపిన లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం తనిఖీ చేయగా నకిలీ బిల్లులతో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా నిర్ధారణ జరిగిన వాహనాలివి. 28 లారీలను తనిఖీ చేస్తే వాటిలో 12 లారీలు నకిలీ బిల్లులతో రవాణా చేసున్నట్టుగా తేలింది. బట్టేరు, బైరి, కాఖండ్యాం, గార ఇసుక రీచ్ల నుంచి ఇసుకతో అక్రమంగా వస్తున్నట్టుగా గుర్తించారు. విచారణ 24కు వాయిదా ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో తొలగించిన 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు లేబర్ కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జనవరి 2న ఫిర్యా దు చేయగా, పలు వాయిదాలు పడ్డాయి. శ్రీకాకుళం డే అండ్ నైట్ కూడలిలోని లేబర్ కమిషన్ కార్యాలయంలో శనివారం విచారణ నిర్వహించాల్సి ఉండగా, ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. విచారణ రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సర్వీస్ ఏజెన్సీ, వర్సిటీ అధికారులు హాజరు కావాలని సూచించారు. వేకువజామున ఎస్పీ ఆకస్మిక తనిఖీలు నరసన్నపేట: రాత్రి సమయాల్లో పోలీసులు పెట్రోలింగ్ సమర్థంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. అలాగే జాతీయ రహదారిపై పెట్రోలింగ్ వాహన సిబ్బంది కూ డా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. శనివారం వేకువజామున ఆయన నరసన్నపేట పోలీసు స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. అప్ప టికి స్టేషన్లో ఉన్న సిబ్బందిని నైట్ డ్యూటీలు, నైట్ పెట్రోలింగ్పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సత్యవరం కూడలి వద్ద జాతీయ రహ దారి పెట్రోలింగ్ పోలీసు వాహన సిబ్బందితో మాట్లాడి సూచనలు చేశారు. దొంగతనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పెట్రోలింగ్ మరింత సమర్థంగా నిర్వహించాలన్నారు. రాజమ్మ తల్లి జాతర రెండోవారం ప్రారంభం గార: మండలంలోని చినవత్సవలస రాజమ్మ తల్లి రెండో వారం జాతర శనివారం ఉదయం నుంచే ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి రాత్రికి విడిది చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ 130 మంది పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేశారు. వత్సవలస గ్రామాన్ని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద సాయంత్రం పరిశీలించి బందోబస్తు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈవ్టీజింగ్, పిక్కాట, పేకాటలు జరిగితే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లా నుంచి నకిలీ బిల్లులతో ఇసుకను ఇష్టాను సారం తరలిస్తున్నారు. జేసీ ఆకస్మిక తనిఖీలతో ఈ విషయం బట్టబయలైంది. ఇన్నాళ్లూ లోప భూయిష్టమైన తనిఖీల కారణంగానే నకిలీల గుట్టు రట్టు కాలేదు. వాస్తవానికి జిల్లాలో నకిలీ బిల్లులతో ఇసు క రవాణా జరుగుతుందనేది బహిరంగ రహస్యం. పత్రికల్లోనూ అనేక మార్లు కథనాలు వచ్చాయి. ఇందులో ఓ అధికారి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ఉన్న ఫలంగా రూ.లక్షలు గడించారన్న ఆ రోపణలు సైతం ఉన్నాయి. విశాఖలోని బిల్డర్లు, లారీల యజమానులతో కుమ్మకై ్క, జిల్లాలో ఉన్న పలు ఇసుక ర్యాంపులతో ఒప్పందాలు కుదుర్చు కుని పథకం ప్రకారం నకిలీ బిల్లులతో ఇసుక రవా ణా చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. బిల్లులు లేకుండా కూడా సరిహద్దు దాటిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విశాఖ సంబంధాలతో... ఈ అధికారికి విశాఖలో ఉన్న బిల్డర్లు, లారీ యజమానులతో సత్సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో జిల్లాలోని ఇసుక ర్యాంపుల నిర్వాహకుల తో కూడా లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా రు. ముందుగానే ముడుపుల వ్యవహారం కుదుర్చు కుని పథకం ప్రకారం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేసినప్పుడు వ్యూహాత్మకంగా ర్యాంపుల్లో ఓ ప్రత్యేక పరికరంతో తయారు చేసిన బిల్లులు చూపించి దాటించేస్తున్నారు. జిల్లాలోని ఇసుక ర్యాంపుల వద్ద ఏ రోజుకారోజు ఏయే లారీ నంబర్లతో అధికారికంగా ఇసుక తరలివెళ్తుందో తెలిపే డేటాతో కూడి న లాగిన్ చెక్ పోస్టు సిబ్బంది వద్ద ఉండటం లేదు. దీంతో నకిలీ బిల్లులు గుర్తించలేకపోతున్నారు. ఎక్కడికక్కడ అనధికారిక ర్యాంపులు జిల్లాలో అధికారిక ర్యాంపులతో పాటు టీడీపీ నేత ల ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపులు నడుస్తున్నాయి. ఆమదాలవలస, పాతపట్నం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అన ధికార ర్యాంపులు కొనసాగుతున్నాయి. పత్రికల్లో కథనాలు వస్తే ఒకటి రెండు రోజులు హడావుడి చేసి, ఆ తర్వాత చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కొందరు నేతలు కోట్లాది రూపాయలు గడించారు. ఇప్పటికే జిల్లాలో రూ. 500కోట్ల విలువైన ఇసుక అక్రమంగా తరలిపోయిందన్న వాదనలు ఉన్నా యి. పగటి పూట కంటే రాత్రిపూటే ఎక్కువగా ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5గంటల వరకు ఇసుక లారీల జాతరే జరుగుతోంది. దీన్నివల్ల పల్లెల్లో రోడ్లు శిథిలమవ్వడమే కాకుండా లారీ ల రాకపోకలతో ఎప్పుడే ప్రమాదం చోటు చేసుకుంటుందోనన్న భయం కూడా గ్రామాల్లో ఉంది. క్యాష్ చేసుకుంటున్న అధికారి అనధికార ర్యాంపుల్లో జరుగుతున్న ఇసుక రవా ణాను ఓ అధికారి క్యాష్ చేసుకుంటున్నాడు. అటు విశాఖ బిల్డర్లు, లారీ యజమానులతోనూ, ఇటు ర్యాంపుల నిర్వాహకులను డీల్ కుదుర్చుకుని పక్కా వ్యూహం ప్రకారం జిల్లా నుంచి ఇసుక దాటించేస్తున్నారు. చెక్ పోస్టు వద్ద ఉన్న కదలికలు ఆ అధికారికి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఆ సమయంలో చాకచక్యంగా తన అధికారాన్ని ఉపయోగించుకుని జిల్లా నుంచి ఇసుకను సేఫ్గా దాటించేస్తున్నారు. తనిఖీలు జరిగినప్పుడు అధికారులపై నాయకుల పేర్లు చెప్పి ఒత్తిడి తీసుకువచ్చి లారీలు విడిపించుకుంటున్నారు. జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలతో ఎప్పటి నుంచో సాగుతున్న అక్రమ రవాణా గుట్టు రట్టు అయింది. నకిలీ బిల్లుల బాగోతం బయటపడింది. అయితే బిల్లుల వెనుక ఎవరు ఉన్నారో తేల్చాల్సి ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యోగ బాధితుల సమావేశం నేడు ఆమదాలవలస: ఉత్తరాంధ్ర ఉద్యోగ బాధితుల సమావేశం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో.. 2003 డీఎస్సీ ఫోరం ఆధ్వర్యంలో ఆది వారం శ్రీకాకుళం పట్టణంలోని కళింగ భవన్లో నిర్వహించనున్నట్లు ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ కొత్తకోట శ్రీహరి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 1, 2004 వ సంవత్సరానికి ముందు వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన అప్పటి ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల ఉద్యోగ నియామకాలను ఆలస్యం చేశాయని తెలిపారు. అలాగే పాత పింఛన్ అమలు చేయాలని కోరారు. సమావేశానికి పెద్ద సంఖ్యలో మూడు జిల్లాల బాధిత ఉద్యోగులు తప్పని సరిగా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అక్రమంగా పీడీఎస్ బియ్యం తరలింపు సంతబొమ్మాళి: కోటబొమ్మాళికి చెందిన ఒక వ్యాపారి తన వ్యాన్లో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మర్రిపాడు వద్ద కొంత మంది యువకులు శనివారం రాత్రి అడ్డుకున్నారు. వ్యాన్లో సుమారు 40 బస్తాల బియ్యం ఉన్నాయి. ఈ విషయాన్ని ఆర్ఐ ప్రసన్న, మర్రిపాడు వీఆర్ఓ ఉమాపతికి ఫోన్లో సమాచారం ఇచ్చినా ఘటనా స్థలానికి రాలేదు. సుమారు గంటన్నరకు పైగా పీడీఎస్ బియ్యం ఉన్న వ్యాన్ను అడ్డుకున్నా రెవెన్యూ అధికారులు రాకపోవడంపై స్థానికులు అసహ నం వ్యక్తం చేశారు. న్యూస్రీల్ ఇసుక అక్రమ రవాణాకు సూత్రధారిగా ఓ అధికారి విశాఖలో ఉన్న బిల్డర్లు, లారీ యజమానులతో ఒప్పందం జిల్లా నుంచి ఇసుక అక్రమ తరలింపునకు సహకారం భారీగా అందుతున్న ముడుపులు జేసీ తనిఖీలతో నకిలీ బిల్లుల గుట్టురట్టు పైడిభీమవరం చెక్ పోస్టు వద్ద ఇసుక లారీలు ఆపుతున్నారని తెలుసుకుని యూబీ పరిశ్రమ ఎదుట, నెలివాడ, వరిసాం, పైడి భీమవరం ఫ్లై ఓవర్కు ముందు నిలిపివేసిన లారీలివి. దాదాపు 50 ఇసుక లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పక్కాగా బిల్లులు ఉంటే ఆపేవారు కాదు. -
అతిథిదేవోభవ అంటూ..
కవిటి: అతిథి దేవోభవ అన్న ఆర్యోక్తిని కవిటి మండలం ఆర్.భైరిపురం వాసులు చేసి చూపించారు. ఇటలీలోని రోమ్ నగరానికి చెందిన ఎమ్మా ఎన్గ్రేసియా అనే యువతి ఇండియాలో కోల్కతా నుంచి కేరళ వరకు సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. శనివారం బరంపురం నుంచి బయలుదేరి 65 కిలోమీటర్లు ప్రయాణించి రాత్రయ్యే సరికి కవిటి మండలం ఆర్.భైరిపురం చేరుకున్నారు. ఇక్కడ బొర్ర పృథ్వీ అనే యువకుడు ట్రా వెలింగ్ కౌచ్ యాప్ ద్వారా ఆమెకు ఆతిథ్యం ఇచ్చాడు. దీంతో ఆమె అచ్చ తెలుగు ఆడపడుచులా మారి వారితో కలిసిపోయారు. తాను ఇప్పటివరకు 951 కిలోమీట ర్లు యాత్ర చేశానని, ఇంకా 1800 కిలోమీట ర్లు ప్రయాణించాల్సి ఉందని తెలిపారు. ఇక్కడ జరిగిన ఓ పెళ్లికి కూడా హాజరై సందడి చేశారు. ఇక్కడి ప్రజల ఆత్మీ యత, ఆదరణ తనను మంత్రముగ్ధురాల్ని చేసిందని అన్నారు. -
మూడు రకాల చెత్తలు వేరు చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ప్రజలు మూడు రకా ల చెత్తలను వేరు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం కింద కలెక్టర్ బంగ్లాలో శనివారం ఆయన తడి, పొడి, హానికరమైన చెత్తల ను వేరు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలో వేశారు. అక్కడి సిబ్బందికి తడి, పొడి, హానికరమై న చెత్తలపై అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తలను వేరు చేస్తేనే ప్రాసెసింగ్ చేయవచ్చన్నారు. తడి చెత్త నుంచి ఎరువులు తయారు చేయడం, కంపోస్టు, వర్మీ కంపోస్టు తయారు చేయడం, పొడి చెత్త రీ సైక్లింగ్కు పంపిస్తామని చెప్పారు. హానికరమైన చెత్త అంటే డైపర్స్, శానిటరీ న్యాప్కిన్స్, మెడిసిన్స్, గాజు, తదితరమైనవి హానికరమైనవని తెలిపారు. వీటిని రెడ్ కలర్ డబ్బాలో వేయాలన్నారు. -
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ బస్సులు డ్రైవింగ్ చేసిన సమయంలో విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ.విజయకుమార్ అధ్యక్షతన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ నిజాయితీ, అంకితభావం, క్రమశిక్షణతో డ్రైవింగ్ చేయాలన్నారు. ప్రాంతీయ రవాణా అధికారి రాజు మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్ల సేవలను కొనియాడారు. ప్రజా రవాణా అధికారి ఏ.విజయకుమార్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. అనంతరం శ్రీకాకుళం 1, 2 డిపోలు, టెక్కలి, పలాస డిపోలలో సుదీర్ఘకాలం ప్రమాద రహిత రికార్డు కలిగిన డ్రైవర్లు బి.వి.ఆర్.మూర్తి, వై.జి.రావు, కె.రమణలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1–2 డిపో మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ, టెక్కలి డీఎం శ్రీనివాసరావు, పలాస డిపో మేనేజర్ సన్యాసిరావు, సూపర్వైజర్లు, అసోసియేషన్ నాయకులు, భద్రతా దళం – నిఘా విభాగం సిబ్బంది పాల్గొన్నారు. చిన్నారులతో స్నేహపూర్వకంగా మెలగాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారులతో స్నేహపూర్వకంగా మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు అన్నారు. బాలల రక్షణ, సంక్షేమం, జువైనల్ జస్టిస్ బోర్డు పనితీరు, పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై శనివారం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జేజేబీ పనితీరు, ప్రీ లోక్ అదాలత్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం 12 కేసులు రాజీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు మంచు జనార్దనరావు, ఎన్ని సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. సీబీఎస్ఈ పరీక్షలు ప్రారంభం శ్రీకాకుళం రూరల్: కేంద్రీయ విద్యాలయంలో సీబీఎస్ఈ సిలబస్కు సంబంధించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ సోయాబ్ అలామ్ తెలిపారు. పాఠశాలకు చెందిన 119 మంది విద్యార్థులతో పాటు గాయాత్రీ స్కూల్కు చెందిన మరో 87 మంది ఇదే కేంద్రంలో పరీక్షలు రాస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణలో అన్ని వసతుల మధ్య ప్రశాంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి మొదటి వారంలో బాలవాటిక నోటిఫికేషన్ ఉంటుందన్నారు. రెండో తరగతి నుంచి 9వ తరగతి వరకూ వ్యాకెన్సీ పొజిషన్ కూడా త్వరలో విడుదలవుతుందని చెప్పారు. రక్షిత మంచినీటి పథకంలో క్లోరినేషన్ టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధి సమీపంలోని ఎర్రన్నాయుడు రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడి శుక్రవారం ఓ వ్యక్తి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ నీటినే వీధి కుళాయిల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం శ్యాంపిల్ టెస్ట్ నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల పర్యవేక్షణలో సమ్మర్ ట్యాంక్లో క్లోరినేషన్ చేపట్టారు. పరిసరాల్లో జంగిల్ క్లియరన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామీణ నీటి పరఫరా విభాగం డీఈ రామకృష్ణ, ఏఈ మోహన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ముగిసిన రహదారి భద్రతా మాసోత్సవాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగింపు కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రహదారి భద్రతపై పలువురు నిపుణులు, అధికారులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో 889 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, వాటిలో 285 మంది మరణించగా, 1043 మంది గాయపడ్డారని అధికారులు వివరించారు. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ విజయసారథి, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, ఆర్అండ్బీ ఎస్ఈ జాన్ సుధాకర్, డీఎంహెచ్ఓ టీవీ బాలమురళీకష్ణ, జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్రావు, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు పి.వి.గంగాధర్, ఆర్.అనిల్, మున్సిపల్ ఇంజినీర్ దక్షిణామూర్తి, నెహ్రూ యువ కేంద్రం కో–ఆర్డినేటర్ ఉజ్వల్, రవాణా శాఖ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలు వీరే : క్విజ్: కె.లోహిత(కేజీబీవీ, గార), ఎస్.రేఖ(కేజీబీవీ, గార), బి.రాజానందిని (శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, శ్రీకాకుళం), జి.హితేష్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, శ్రీకాకుళం). వ్యాసరచన: టి.హారిక (బీఎస్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి), ఎ.సూర్య (బీఎస్సీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి), పి.రేణుశ్రీ (డిగ్రీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట), కె.రాము (డిగ్రీ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట), జె. ఝాన్సీరాణి (సెయింట్ క్లారెట్ ఇ.ఎం. పాఠశాల, నరసన్నపేట), జె.హోయ్ (9వ తరగతి) – సెయింట్ క్లారెట్ ఇ.ఎం. పాఠశాల, నరసన్నపేట), యు.మానస (సెయింట్ క్లారెట్), డి.సింధూర (సెయింట్ క్లారెట్), కె.హారిక (బీఎస్సీ, గాయత్రీ కళాశాల, మునసబ్పేట), ఎం.జోష్నవి (గాయత్రీ కళాశాల), డి.మేనక (గాయత్రీ కళాశాల), టి.తైవేన్ (ఆదిత్య డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం), హాసిని (డిగ్రీ)(ఆదిత్య డిగ్రీ కళాశాల, శ్రీకాకుళం) -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి
నందిగాం: మండలంలోని కొత్తగ్రహారం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. పలాస మండలం రేగులపాడుకు చెందిన దాసరి భీమయ్య(65) నందిగాం మండలం భోరుభద్రలోని బంధువుల ఇంట్లో జరగనున్న గావు సంబరం కోసం కాలినడకన బయలుదేరాడు. కొత్తగ్రహారం వద్దకు వచ్చేసరికి టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన భీమయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. భీమయ్యకు భార్య తులసమ్మ, వివాహమైన ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తులసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి బైక్పై వెళుతున్న ఉపాధ్యాయుడు సింగూరు శ్రీనివాసరావు శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దోమాం పంచాయతీ బమ్మిడివానిపేటకు చెందిన ఈ ఉపాధ్యాయుడు కేశవరావుపేట పంచాయతీ కింతలిమిల్లు సమీపంలోని సర్వీస్ రోడ్డులో వెళ్తుండగా వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. బస్సు బ్రేక్ వేయటంతో ఉపాధ్యాయుడు రోడ్డుపై పడిపోయారు. హెల్మెట్ ధరించడంతో ప్రాణాపాయం తప్పింది. కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
పరిసరాల శుభ్రత సామాజిక బాధ్యత
టెక్కలి: పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి సామాజిక బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పంచాయతీ పరిశుభ్రతపై శనివారం టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తితో కలిసి టెక్కలిలో పర్యటించారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. నిర్వహణ తీరు సరిగ్గా లేకపోవడంతో ఈఓ జగన్నాథంపై అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సమీప ఇళ్ల వద్దకు వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి సమస్యలు తెలుసుకున్నారు. పట్టుమహదేవి కోనేరును పరిశీలించి పార్కుగా చేసే క్రమంలో పూర్తి స్థాయి నివేదికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం టెక్కలి పంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పంచాయతీను సుందరంగా తీర్చిదిద్దేందుకు పారిశుద్ద్య కార్మికులు పూర్తి స్థాయిలో సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీపీఓ భారతి సౌజన్య, వంశధార డీఈఈ శేఖర్బాబు, డ్వామా ఏపీడీ శైల జ, జిల్లా వనరుల కేంద్రం కోఆర్డినేటర్ నిశ్చల, ఎంపీడీఓ సీహెచ్.లక్ష్మీబాయి, డీఎల్పీఓ గోపి బాల, ఏపీఎం బి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి రవాణా గుట్టురట్టు
కాశీబుగ్గ: ఒడిశా నుంచి ముంబైకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన నలుగురు ఒడిశా వాసులను కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. శనివారం కాశీబుగ్గ పట్టణ పోలీసు స్టేషన్లో డీఎస్పీ వెంకట అప్పారావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. గంజాం జిల్లా బురైపహాడా గ్రామానికి చెందిన బిక్రమ్ మండల్, సునంద సవరలు 8 కేజీల గంజాయిని ముంబై తరలించేందుకు పలాస రైల్వేస్టేషన్కు రాగా పోలీసులు పట్టుకున్నారు. అదే విధంగా, ఒడిశా రాష్ట్రం గండాహాతి వాటర్ ఫాల్స్ సమీపంలో గంజాయిని పండించి అందులో మూడు కేజీల అమ్మేందుకు పలాస రైల్వేస్టేషన్కు వచ్చిన గంగవైన ఉదయకుమార్, గౌరవ్ పొరివా పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని కలిసేందుకు వచ్చిన మరో ఇద్దరు పరారయ్యారు. రెండు కేసుల్లో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. ఆరు కేజీల గంజాయితో.. ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి ముంబైకు గంజాయి అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా అంతర్భఅదవచుడంగపూర్ గ్రామానికి చెందిన మిలన్ పరిచ్ఛా అనే యువకుడు అదే రాష్ట్రానికి చెందిన చంద్రు అనే వ్యక్తి వద్ద 6.220 కేజీల గంజాయిని కొనుగోలు చేశాడు. బరంపురంలో బస్సు ఎక్కి ఇచ్ఛాపురం చేరుకున్నాడు. అనంతరం బెంగళూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గంజాయితోపాటు సెల్ఫోన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు. ముంబైలో గంజాయి వ్యాపారి ప్రేమానంద్మల్లిక్కు అందజేసేందుకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సమావేశంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని కుశాలపురం సమీపంలో బైపాస్ కూడలి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సవర నవీన్ (21) అనే యువకుడు మృతి చెందాడు. బంధువుల అమ్మాయితో కలిసి బైక్పై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తుండగా వేకువజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బైకు అదుపు తప్పిందా.. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా అనే విషయం తెలియడం లేదు. అంబులెన్స్ వచ్చేలోగానే నవీన్ మృతి చెందగా.. యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. మృతదేహాన్ని రిమ్స్కు తరలించిన పోలీసులు.. గాయపడిన యువతిని శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవీన్ స్వగ్రామం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం కుడ్డపల్లి. తండ్రి అనప పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తూ గత ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యంతో మృతి చెందారు. సరిగ్గా ఏడాదికే కుమారుడు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
గ్రంథాలయాలతోనే సమాజ చైతన్యం
శ్రీకాకుళం కల్చరల్: సమాజ చైతన్యానికి గ్రంథాలయాలుతో అవసరమని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. శ్రీకాకుళం ఎన్జీవో హోమ్లో శనివారం గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలతోనే మేథావి వర్గం తయారవుతుందన్నారు. గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం రాష్ట్ర కన్వీనర్ వల్లూరి శివప్రసాద్ మాట్లాడుతూ గ్రంథాలయాల సెస్ బకాయిలు రూ.710 కోట్లు ఉన్నట్లు వివరించారు. రచయిత అట్టాడ అప్పలనాయడు మాట్లాడుతూ ఒకప్పుడు పంచాయతీల స్థాయిలో గ్రంథాలయాలు ఉండేవని, ఇప్పుడవి కనుమరుగైపోయాయని చెప్పారు. అరసం రాష్ట్ర కార్యదర్శి శరత్ చంద్ర జ్యోతి మాట్లాడుతూ కొత్త తరాల జ్ఞాన వికాసానికి గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం తోడ్పాటునందిస్తుందన్నారు. సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమానికి తమవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. అరసం రాష్ట్ర అధ్యక్షవర్గ సభ్యులు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత జామి భీమశంకర్, జీన్ గ్రంథాలయ వ్యవస్థాపకులు పత్తి సుమతి, బూర్జ మండల ఉపాధ్యక్షులు బుడుమూడు సూర్యారావు, సీపీఐ పట్టణ కార్యదర్శి టి.తిరుపతిరావు, విశ్రాంత ఇంజినీర్ బి.ఎ. మోహనరావు, ఇస్కాఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.వి.మల్లేశ్వరరావు, జి.వి.నాగభూషణరావు, పాలకొండ డివిజన్ గ్రంథాలయ ఉద్యమ నాయకులు సుబ్బా నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
అసలు కథ చెప్పని ‘తండేల్’
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పద్నాలుగు నెలలు పాకిస్తాన్ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారులను విడుదల చేయించింది ఎవరు? వారిని వాఘా సరిహద్దుల నుంచి ఇంటి వరకు తీసుకొచ్చింది ఎవరు? వారి కష్టాలకు చలించిపోయి ఇచ్చిన మాట ప్రకారం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసిందెవ్వరు? ఇంకెవరూ వలస పోకుండా, ఎవరికీ అలాంటి దుస్థితి రాకుండా శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలో పోర్టు, హార్బర్, జెట్టీల నిర్మాణం మొదలుపెట్టింది ఎవరు? వలస బతుకులకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రయత్నించిందెవరు?... మత్స్యకారుల వలస జీవితం ఇతివృత్తంగా తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా ఈ ప్రశ్నలన్నింటినీ మరోసారి తెర ముందు ఉంచింది. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయి. బాధితులు మాత్రం మీడియా ముందుకు వచ్చి గుండె తెరిచి వాస్తవాలు వివరించారు. తమను విడిపించి తీసుకువచ్చింది, రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి అని విస్పష్టంగా చెప్పారు. తరాల తరబడి శ్రీకాకుళం జిల్లాను పాలిస్తున్న రాజకీయ కుటుంబాలు కలలో కూడా ఊహించని విధంగా జిల్లాలో పోర్టు పనులు ప్రారంభించడం, ఫిషింగ్ హార్బర్, జెట్టీ పనులు ప్రారంభించడం వైఎస్ జగన్ (YS Jagan) చలవేనని సోషల్ మీడియా మోతమోగిపోయేలా చెబుతున్నారు. ఇదీ జరిగింది.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డి.మత్స్యలేశంకు చెందిన 10 మంది, బడివానిపేటకు చెందిన ముగ్గురు, ముద్దాడకు చెందిన ఒకరు, విజయనగరం జిల్లా తిప్పలవలసకు చెందిన ఆరుగురు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు ఇలా మొత్తం 22 మంది మత్స్యకారులు చేపల వేట కోసం 2018 జూలైలో గుజరాత్ రాష్ట్రం వీరావల్కు వెళ్లారు. వీరంతా ఒక బృందంగా ఏర్పడి నాలుగు పడవల్లో అరేబియా సముద్రంలోకి వెళ్లారు. పడవలు సముద్రంలో తీవ్ర ఆటుపోట్లకు గురవడంతో పొరపాటుగా పాకిస్తాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారు. 2018 నవంబర్ 28న అక్కడి కోస్టు గార్డు అధికారులకు దొరికిపోయారు. పాకిస్తాన్ అధికారులు వారందరినీ కరాచీ సబ్ జైలులో పెట్టారు. అక్కడ సరైన తిండి, దుస్తులు లేక అక్కడ వారు పడ్డ అవస్థలు వర్ణనాతీతం. జైలు అధికారులు ఉదయం ఒక్క రొట్టె ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి రెండేసి రొట్టెలు ఇచ్చేవారు. వాటితోనే సరిపెట్టుకోమని చెప్పేవారు. రొట్టెలు వద్దంటే అన్నం ఇచ్చేవారు. ఆదివారం మాత్రం కొంచెం మాంసాహారం పెట్టేవారు. ఈద్ అనే స్వచ్ఛంద సంస్థ దుస్తులతో పాటు రూ.5 వేల నగదు ఇచ్చింది. అక్కడ కూలి పనులు చేస్తే కొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బుతో జైల్లోనే విక్రయించే కిరాణా సరుకులు కొనుక్కొని వంట చేసుకునేవారు. అదీ అరకొర భోజనమే. ఇలా కష్టాలు అనుభవిస్తూ క్షణమొక యుగంలా గడిపారు. మరోపక్క వేటకు వెళ్లిన వీరి ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. చివరకు వారితో పాటు వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడి ద్వారా వారంతా పాకిస్తాన్ అదుపులో ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ మత్స్యకారుల కుటుంబాలు తమ వాళ్ల కోసం గ్రామ సర్పంచ్ నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరినీ ఆశ్రయించాయి. ఎవరూ పరిష్కారం చూపలేదు. పాకిస్తాన్లో మత్స్యకారులు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారని తెలిసి వారి కుటుంబీకులు తల్లడిల్లిపోయేవారు. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ హామీ ఆ సమయంలో నిండు గర్భిణిగా ఉన్న రామారావు అలియాస్ రాజు సతీమణి నూకమ్మ, బందీగా ఉన్న మరో మత్స్యకారుడు ఎర్రయ్య సతీమణి శిరీష మిగిలిన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన న్యాయవాది గురుమూర్తి సాయంతో జిల్లా యంత్రాంగానికి, నాయకులకు, ప్రభుత్వానికి విన్నపాలు అందజేశారు. అయినా ఫలితం లేదు. అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారు. 2018 డిసెంబర్ 2న రాజాం నియోజకవర్గం లచ్చయ్యపేట గ్రామం వద్దకు వచ్చిన వైఎస్ జగన్ను బాధిత మత్స్యకార కుటుంబాలు కలిశాయి. పాకిస్తాన్ జైల్లో బందీలుగా ఉన్న తమ వాళ్లను విడిపించాలని కోరాయి. అప్పటి రాష్ట్ర మంత్రి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే కళా వెంకటరావును కలిసినా పట్టించుకోలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. తమ ఎంపీలను పంపిస్తానని, మత్స్యకార కుటుంబ సభ్యులు విదేశాంగ శాఖ మంత్రిని కలిసేలా చేస్తానని చెప్పారు. అధికారంలోకి వస్తే వెంటనే విడిపిస్తానని భరోసా ఇచ్చారు. జగన్ పునర్జన్మనిచ్చారు తండేల్ సినిమా హీరో పాత్రకు మూలమైన రామారావు సోదరి ముగతమ్మ. ఈమె భర్త అప్పారావు, కొడుకులు కళ్యాణ్, కిషోర్ కూడా అప్పట్లో పాక్ జైల్లో బందీ అయ్యారు. ‘తండేల్’ సినిమాలో జగన్ ప్రస్తావన లేకపోవడాన్ని చూసి ముగతమ్మ తట్టుకోలేకపోయారు. సినిమా చూసి వచ్చిన వెంటనే హాల్ బయట తన మనసులో మాటను మీడియా ముందు స్పష్టంగా చెప్పారు. తమ వారిని విడిపించి తీసుకువస్తానని చేతిలో చేయి వేసి జగన్ చెప్పారని, చెప్పినట్టుగానే తీసుకుని వచ్చారని తెలిపారు. అంతేకాకుండా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారని గుర్తు చేశారు. జగనన్నతో పాటు అప్పటి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, గ్రామ సర్పంచ్, సర్పంచ్ కుమార్తె, న్యాయవాది గురుమూర్తి కృషి కూడా ఉందని తెలిపారు. సినిమాలో అవేవీ లేకపోయినా బయట చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, అందుకే అన్ని విషయాలు వివరంగా చెబుతున్నానని అన్నారు.వైఎస్ జగన్ ప్రభుత్వం చొరవతో విడుదల పాదయాత్రలో ఉన్నప్పటికీ, వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్య పరిష్కారానికి కృషి చేశారు. దీంతో 2019 ఫిబ్రవరిలో మత్స్యకారుల నుంచి కుటుంబ సభ్యులకు ఉత్తరాలు రావడం మొదలైంది. ఇది కుటుంబ సభ్యులకు కొంత ఉపశమనం కలిగించినా, తిరిగి ఇంటికి వస్తారో, లేదో అన్న భయం వెంటాడుతూనే ఉండేది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల విడుదలకు కేంద్రంపై ఒత్తిడి మరింతగా పెంచారు.ఆ తర్వాత కేంద్రం 370వ అధికరణం ఎత్తివేయడం, 35 (ఎ)తొలగింపు వంటి పరిణామాలతో వీరి విడుదలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా వైఎస్ జగన్ పట్టువిడవకుండా ఎంపీల ద్వారా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరిపారు. దీంతో మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించింది. 2020 జనవరి 6న మత్స్యకారులను విడుదల చేసింది. ఆరోజు సాయంత్రం 7 గంటల సమయంలో వాఘాలోని భారత్–పాక్ సరిహద్దు వద్ద 20 మంది మత్స్యకారులను అప్పగించింది. వారికి అప్పటి వైఎస్సార్సీపీ (YSRCP) మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. మిగతా ఇద్దరు డాక్యుమెంట్లు, ఇతర సాంకేతిక కారణాల వల్ల తర్వాత విడుదలయ్యారు. విడుదలైన వారందరినీ వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు ఢిల్లీ తీసుకొచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి తెచ్చారు. వారంతా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. జగన్ వారందరికీ స్వీట్లు తినిపించి, ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇకపై మత్స్యకారులు ఇలా వలసలు వెళ్లే అవసరం లేకుండా రాష్ట్రంలోనే పోర్టు, జెట్టీ, ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.చెప్పినట్టుగానే హామీలు అమలు 194 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో మౌలిక సదుపాయాలు లేక మత్స్యకారులు వలసపోయేవారు. దీన్ని నివారించేందుకు జిల్లాలోని మూలపేటలోనే ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రూ.2,949.70 కోట్లతో సీ పోర్టు తొలి దశ, బుడగట్లపాలెంలో రూ.366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, మంచినీళ్లపేటలో జెట్టీ పనులకూ శ్రీకారం చుట్టారు. అధికారంలో ఉండగానే చాలా వరకు పనులు పూర్తి చేశారు. చదవండి: బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!వేట నిషేధ కాలంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పేరిట 17,136 మందికి రూ.10 వేలు చొప్పున సాయం అందజేశారు. మత్స్యకారుల సంక్షేమం క్షేత్రస్థాయిలో అందుతుందో తెలుసుకునేందుకు 66 మంది సాగర మిత్ర ఉద్యోగులను నియమించారు. గ్రామ సచివాలయాల్లో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఫిష్ ఆంధ్రా షాపులను ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ. 3 కోట్లు ఖర్చు పెట్టి గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి 3,064 మంది మత్స్యకారులను 46 బస్సుల ద్వారా తీసుకు వచ్చారు. ఇదంతా కళ్లెదుటే జరిగింది. అయినా ఇందులో ప్రధాన ఘట్టాలను సినిమాలో చూపించలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గంజాయి స్మగ్లర్లు అరెస్టుఇచ్ఛాపురం, కంచిలిలో గంజాయి స్మగ్లర్లు దొరికారు. వారి వద్ద నుంచి 18 కిలోల గంజాయి లభ్యమైంది. –8లో
మా ప్రాణాలు నిలబెట్టండి నాకు కిడ్నీ వ్యాధి సోకి సుమారు పదేళ్లు దాటింది. వారానికి మూడుసార్లు పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో డయాలసిస్ చేయించుకుంటున్నాను. కిడ్నీ వ్యాధి రాకుండా కారణాలు ఏమిటో ఇప్పటిౖకైనా తెలుసుకుని ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పాలని కోరుతున్నాము. మా లాంటి వ్యాధి గ్రస్తులకు మందులు, సౌకర్యాలు పెంచి మా ప్రాణాలను కాపాడాలను వేడుకుంటున్నాము. – పైల మాధవరావు, కిడ్నీ వ్యాధి గ్రస్తుడు, పలాస డయాలసిస్ యూనిట్ -
ఇసుక దోపిడీపై కన్నెర్ర
రణస్థలం: రణస్థలం మండలంలోని పైడిభీమవరం ఇసుక తనిఖీ కేంద్రం వద్ద 28 ఇసుక లారీలను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తనిఖీ చేయగా అందులో 12 నకిలీ బిల్లులతో రవాణా అవుతున్నట్లు తేలింది. దీంతో వెంటనే ఆయా లారీలను సీజ్ చేయాలని జేసీ ఆదేశించా రు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు ని త్యం వందలాది లారీల్లో ఇసుక రవాణా జరుగుతుంది. ఈ లారీలకు సక్రమమైన బిల్లులు లేవ ని తరచూ కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్తున్నాయి. దీంతో కలెక్టర్ ఆదేశాలతో జేసీ శుక్రవారం తెల్ల వారుజాము నుంచి తనిఖీలు మొదలుపెట్టారు. ఇసుక లారీలకు బిల్లులు ఉన్నా లేకున్నా తక్షణమే పైడిభీమవరం జిల్లా ఇసుక చెక్పోస్టు వద్ద నిలిపివేయాలని రెవెన్యూ, పోలీసులకు అదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో 28 ఇసుక లా రీలను మండల స్థాయి అధికారులు పైడిభీమ వరం చెక్పోస్టులో నిలుపుదల చేసి బిల్లులు తనిఖీలు చేశారు. బట్టేరు, బైరి, కాఖండ్యాం, గార, ఇసుక రీచ్ల నుంచి ఈ వాహనాలు వస్తున్నట్లు గుర్తించారు. చాలా బిల్లులు స్కాన్ కాకపోవడంతో డ్రైవర్లను ఆరా తీశారు. అనంతరం నకిలీ బిల్లులు గల 12 లారీలు సీజ్ చేసి మైన్స్ అండ్ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. ఈ తనిఖీలు జరుగుతున్నాయని తెలిసి రణస్థలం మండలంలోని యూబీ పరిశ్రమ ఎదుట, నెలివాడ, వరిసాం, పైడిభీమవరం గ్రామానికి ముందు పదుల సంఖ్యలో సుమారు 50కి పైగా ఇసుక లారీలు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఈ తనిఖీల్లో మండల తహసీల్దార్ ఎన్. ప్రసాద్, ఎస్ఐ ఎస్.చిరంజీవి, విజిలెన్స్ సిబ్బంది ఉన్నారు. 28 లారీల్లో 12 లారీలు నకిలీ బిల్లులేనని క్షేత్రస్థాయిలో గుర్తింపు 12 ఇసుక లారీలు సీజ్ -
ఒక్క రోజే 300 ట్రాక్టర్లతో..
పోలాకి: మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కోడూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 15–4 లో 48 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మండల పరిషత్ ఆధీనంలోని జీడిమామిడి తోటలో విలువైన మట్టి తరలింపు సర్వత్రా చర్చనీయాంశమైంది. శుక్రవారం ఒక్కరోజే 300 వందల ట్రాక్టర్లు వరకు మట్టిని ఎత్తేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ స్థలం అందులోనూ మండల పరిషత్ ఆధీన స్థలంలోనే జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కోడూరు పరిసర ప్రాంతాల్లో లభించే ఎర్రమట్టికి ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. సముద్ర తీర ప్రాంతానికి దగ్గరలో ఉన్న సారవంతమైన ఇసుకతో కూడిన మట్టి కావటంతో ఇప్పుడు దీనిపై అందరి కన్ను పడింది. రియల్ ఎస్టేట్ ముసుగులో అక్రమంగా లేఅవుట్లు వేసి ఈ మట్టితో పంట పొలాలను చదును చేస్తుండటంతో మరింత డిమాండ్ పెరిగింది. ఈ ఎర్రమట్టిలో ఎలాంటి మొక్క వేసినా ఆరోగ్యవంతంగా పెరుగుతుందని అంటారు. ఇలాంటి మట్టిని నేరుగా జేసీబీలు పెట్టి అక్రమంగా తరలించుకుపోతూ లక్షలరూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. -
ఉపాధి ఉద్యోగులపై వేధింపులు సరికాదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం సిబ్బంది ఉన్నతాధికారి తీ రుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యవహార శైలి, సమయ పాలన లేకపోవడంతో ఉద్యో గులం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఉపాధి పథకంలోని వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు శుక్రవారం జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సుధాకర రావు, అలాగే జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుని కలిసి వినతి పత్రం అందజేశారు. అంతకుముందు ఉద్యోగులు డచ్ భవనం వద్ద సమావేశం నిర్వహించి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బందిని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులందరినీ దోషులుగాను, దొంగలుగా భావించి మాట్లాడడం సరికాదన్నారు. కార్యాలయంలో రాత్రి సమయాల్లో పనులు పురమాయించడం, రాత్రి వేళల్లో వీడియో కాన్ఫరెన్స్లు, టెలీ కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ వ్యక్తి గత జీవితాలకు భంగం కలిగిస్తున్నారని వాపోయా రు. రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో వేతనాలు క ల్పించి జిల్లాకు 400 కోట్ల రూపాయలు మెటీరియ ల్ కాంపోనెంట్ నిధులను సమకూర్చిన ఘనత ఈ జిల్లా ఉపాధి హామీ పథకం సిబ్బందికి దక్కుతుందని అన్నారు. కానీ నిత్యం అవమానాలతో కించపరిచే విధంగా మాట్లాడడం, సంక్రాంతి పర్వదినాల్లో కూడా సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. సామాజిక తనిఖీ ఆడిట్లో జరిమానా లు, రికవరీలు విపరీత స్థాయిలో ఉంటున్నాయని వీటిని కుదించాలని వివక్ష చూపించడం సరికాదని వారు పేర్కొన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధి కారి వెంకటేశ్వరరావుకు కూడా వినతిపత్రాన్ని ఉపాధి హామీ ఉద్యోగులు కలెక్టరేట్లో అందజేశారు. కార్యక్రమంలో ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ నాయకులు వైవీ రమణ, అమ్మి నాయుడు, జయరాం, తవిటి నాయుడు, తెంబూరు రవి, అరుణ్ కుమార్, ప్రేమ లత, ప్రమీల, రత్నాకర్, ధర్మారావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
అరుదైన చెట్టుపిల్లి గుర్తింపు
సారవకోట: మండలంలోని వడ్డినవలస సమీప పొలాల్లో అరుదైన చెట్టు పిల్లిని గ్రామస్తులు శుక్రవారం గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ ఎస్ఎఫ్ఓ లక్ష్మిపురం ఈశ్వరరావు, బీట్ అధికారి శివ ప్రసాద్ గ్రామానికి చేరుకుని చెట్టుపిల్లిని సారవకోట సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్టులో వదిలారు. అరుదైన అటవీ జంతువులు గ్రామాల్లోకి వస్తే వెంటనే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఉద్యోగాల పేరిట మోసం టెక్కలి రూరల్: తమ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ సంతబొమ్మాళికి చెందిన పందిరి అప్పన్న, సన్యాసమ్మ దంపతులు శుక్రవారం టెక్కలి గొల్లవీధిలో ధర్నా చేపట్టారు. ఇద్దరు దివ్యాంగు పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి టెక్కలి గొల్లవీధికి చెందిన ఓ మహిళ రూ.18లక్షల 60 వేలు తీసుకుందన్నారు. నేటికీ తిరిగివ్వలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. డబ్బులు తిరిగివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటు సన్యాసమ్మ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. పోలీసులు చొరవతో గొడవ సద్దుమణిగింది. ఇదే విషయమై టెక్కలి సీఐ విజయ్కుమార్ వద్ద ప్రస్తావించగా.. కేసు కోర్టులో ఉందని తెలిపారు. ఉత్సాహంగా హ్యాండ్బాల్ జట్టు ఎంపికలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్స్ బాలురు హ్యాండ్బాల్ జట్టు ఎంపికలు శుక్రవారం ఉత్సాహభరితంగా సాగాయి. రాష్ట్రపోటీలకు ఎంపికయ్యేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని పాత్రునివలస క్రీడామైదానం వేదికగా జరిగిన ఈ ఎంపికలకు సీనియర్స్ మహిళలకు అరకొరగా హాజరుకావడంతో.. కేవలం జూనియర్స్ బాలురుకు మాత్రం ఎంపికలు నిర్వహించారు. మొత్తం 45 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులతో కూడిన తుది జాబితాను త్వరలో వెల్లడిస్తామని శ్రీకాకుళం జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి ఎమ్మెస్ చంద్రశేఖర్ తెలిపారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను ఈ నెల 21 నుంచి 23 వరకు కర్నూలు జిల్లా జిల్లా డీఎస్ఏ క్రీడామైదానం వేదికగా జరగనున్న 10వ ఏపీ రాష్ట్రస్థాయి(అంతర్జిల్లాల) హ్యాండ్బాల్ చాంపియన్షిప్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు రవిశేఖర్, డి.ఈశ్వరరావు, ఆర్.సతీష్రాయుడు, ఎల్.డిల్లేశ్వరరావు, డీఎస్ఏ కోచ్ ఎల్.అనీల్, లక్ష్మణరావు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మార్చి 24,25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె శ్రీకాకుళం అర్బన్: న్యాయమైన డిమాండ్ల సాధన కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దాదాపు పది లక్షల ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు, అధికారులు మార్చి 24, 25 తేదీల్లో సమ్మెకు చేపట్టనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ శ్రీకాకుళం కన్వీనర్ కేసీహెచ్ వెంకటరమణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళం స్టేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచి వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకులను పరిరక్షించాలని, సిబ్బందిని సకాలంలో నియమించాలని కోరారు. పని ఒత్తిడి పెరగడం, డిజిటలైజేషన్ అందుబాటులో ఉన్నందున వారానికి ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు తెరవాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల స్థానంలో శాశ్వత నియామకాలు చేపట్టాలన్నారు. 12వ వేతన సవరణలో భాగంగా మిగిలి ఉన్న డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ కృష్ణ కిషోర్, మండ శ్రీనివాసరావు, కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి స్మగ్లర్లు అరెస్టు
ఇచ్ఛాపురం : ఒడిశా నుంచి కర్ణాటకకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకట అప్పారావు తెలిపారు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిక్కమంగుళూరు జిల్లా రాఘవేంద్రనగర్ గ్రామానికి చెందిన ముజామిల్.. ఉప్పలి హిరేకోలలే రోడ్డుకు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్లు కలిసి బెంగళూరులోని ఇందిరానగర్లో నివాసముంటున్నారు. గంజాయికి బానిసయ్యారు. డబ్బు సంపాదనకు గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ క్రమంలో బెంగళూరులో గంజాయి అక్రమ వ్యాపారం చేస్తున్న విజయ్కుమార్కు గంజాయి ఇచ్చేందుకు ఒడిశా వెళ్లారు. ఖందమాల్ జిల్లా ఫుల్బాని ప్రాంతానికి చెందిన భరత్ డింఘాల్ వద్ద 18.310 కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. బరంపురం నుంచి బస్సులో బయలుదేరి ఇచ్ఛాపురం బస్టాండ్కి శుక్రవారం చేరుకున్నారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు వెళ్తుండగా స్టేషన్ సమీపంలో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి గంజాయి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. గంజాయి అక్రమ రవాణా జరగకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్న ఇచ్ఛాపురం సర్కిల్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ మహేశ్వర్రెడ్డి అభినందించినట్లు డీఎస్పీ వెల్లడించారు. సమావేశంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు,. 2 కిలోల గంజాయి స్వాధీనం కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్ సిబ్బంది క్వార్టర్స్ సమీపంలో 2.080 కిలోల గంజాయితో ముగ్గురిని కంచిలి పోలీసులు శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం సుర్లా జంక్షన్లో గంజాయి కొనుగోలు చేసి చైన్నెకు రైలులో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వీరు పట్టుబడ్డారు. ఈ మేరకు కాశీబుగ డీఎస్పీ వి.వెంకట అప్పారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. తమిళనాడుకు చెందిన అజిత్ లారీ క్లీనర్గా పని చేస్తూ కోల్కతాకు లోడ్తో వచ్చినప్పుడు ఒడిషా రాష్ట్రం సుర్లా జంక్షన్ వద్ద టిఫిన్ షాప్ వద్ద ఆపేవాడు. ఈ క్రమంలో బలియాగూడకు చెందిన బొద్ది సోమేశ్తో పరిచయం ఏర్పడింది. అక్కడ అతను చాలా మంది డ్రైవర్లు, క్లీనర్లకు గంజాయి అమ్మేవాడు. అజిత్కు గంజాయి తాగే అలవాటు ఉండటంతో సోమేష్ వద్ద గంజాయి కొనుక్కొని తాగేవాడు. ఈ క్రమంలో రెండు, మూడుసార్లు కొనుక్కొని చైన్నెకి తీసుకెళ్లేవాడు. అక్కడ చిన్నచిన్న పొట్లాలుగా చేసి అమ్మేవాడు. లాభాలు రావడంతో తన స్నేహితుడు కమలుద్దీన్ కూడా గంజాయి వ్యాపారం చేయాలని ఆశతో అజిత్ను అడగ్గా ఇద్దరూ ఈ నెల 11న చైన్నె నుంచి బయలుదేరి 13వ తేదీ వేకువజామున సుర్లా జంక్షన్కు చేరుకున్నారు. అక్కడ సోమేశ్ను కలిసి కేజీ రూ.10వేలు చొప్పున రెండు కేజీల గంజాయి కావాలని కోరారు. అందుకు సోమేష్ ఒప్పుకుని 14వ తేదీ సాయంత్రం సోంపేట రైల్వేస్టేషన్ వద్దకు వస్తే అక్కడ 2 కేజీల గంజాయి అందిస్తానని చెప్పాడు. దీంతో అజిత్, కమలుద్దీన్లు 13వ తేదీ రాత్రి ఇచ్ఛాపురం రైల్వేస్షేషన్ వద్ద బసచేసి 14వ తేదీ సాయంత్రం అప్పగిస్తుండగా కంచిలి పోలీసులకు దొరికిపోయారు. కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు, సిబ్బంది దాడి జరిపి నిందితులు సుర్లా జంక్షన్కు చెందిన బి.సోమేష్, చైన్నెకు చెందిన అజిత్, కమలుద్దీన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, 2.080 కిలోల గంజాయి, నల్లటి బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోంపేట సీఐ బి.మంగరాజు, కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు పాల్గొన్నారు. గంజాయి ముఠాను పట్టుకోవడంలో కృషిచేసిన ఎస్ఐ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. గంజాయి పట్టివేత టెక్కలి రూరల్: టెక్కలి సమీప తోటల్లో శుక్రవారం గంజాయి తాగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించి కొందరిని అదుపులో తీసుకున్నట్లు సమచారం. కొంత గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. 18 కేజీల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం ఒడిశా నుంచి బెంగళూరుకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు -
రేషన్ బియ్యం పంపిణీలో కోత
ఎల్.ఎన్.పేట: మండలంలోని సిద్ధాంతం గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో అధికారులు కోత విధించారు. రేషన్ సరుకుల నిల్వల్లో తేడాలు ఉన్నందున వీటిని సరిచేసేందుకు లబ్ధిదారులకు ఇచ్చే బియ్యంలో కోత విధించడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. సిద్ధాంతం రేషన్ డిపో డీలరు కొన్ని నెలల క్రితం పోస్టుకు రాజీనామా చేశారు. అప్పటికే కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన బియ్యంలో సుమారు 16 క్వింటాళ్ల బియ్యం తేడాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రేషన్ బియ్యం పంపిణీ చేపట్టారు. 16 క్వింటాళ్ల బియ్యం తేడాలను సరిచేసేందుకు కార్డుదారులకు ఇచ్చే బియ్యంలో అనధికారికంగా కోత విధించారు. అంత్యోదయ కార్డు లబ్ధిదారులకు 35 కిలోలకు 25 కిలోల బియ్యం ఇచ్చారు. 20 కిలోల కార్డుదారులకు 15 కిలోలు, అదే విధంగా 15 కిలోల కార్డుదారులకు 13 కిలోలు చొప్పున బియ్యాన్ని పంపిణీ చేశారు. పూర్తి బియ్యం ఇచ్చినట్లు బయోమెట్రిక్ తీసుకున్నారు. ఈ విషయమై టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి వద్ద ప్రస్తావించగా సమగ్ర విచారణ చేయిస్తానని తెలిపారు. కాగా, విషయం బయటకు పొక్కడంతో కార్డుదారులకు తక్కువగా ఇచ్చిన బియ్యాన్ని ఎల్.ఎన్.పేట సీఎస్డీటీ సాయంత్రం పంపిణీ చేశారు. అసంతృప్తి వ్యక్తం చేసిన లబ్ధిదారులు సాయంత్రానికి పూర్తిస్థాయిలో సరఫరా -
ఆదివాసీలపై దాడులు అమానుషం
పలాస: ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న సైనిక బలగాల దాడులను తక్షణమే నిలుపుదల చేయాలని సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీపార్టీతో పాటు వివిధ ప్రజాసంఘాల నాయ కులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కాశీబుగ్గ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టుల పేరుతో అడవుల్లో ఉన్న మూలవాసులను తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలను దేశ ప్రజలంతా ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు వి.మాధవరావు, సి.పి.ఐ జిల్లా కార్యదర్శి చాపర వేణు, సి.పి.ఐ.ఎం. నాయకులు కోనారి మోహనరావు, లిబరేషన్ నాయకుడు తామాడ సన్యాసిరావు, పత్తిరి దానేసు, జోగి కోదండరావు, సాలిన వీరాస్వామి, మద్దిల ధర్మారావు, కొర్రాయి నీలకంఠం, పోతనపల్లి కుసుమ, బదకల ఈశ్వరమ్మ, బర్ల జానకమ్మ, గొరకల బాలకృష్ణ, పోతనపల్లి అరుణ, కోనేరు రమేస్, సార జగన్, మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు. -
సేకరించిన శాంపిల్స్ ఇవే
● సేకరించిన శాంపిల్స్, మిషనరీలు ● అంతుచిక్కని కిడ్నీ వ్యాధి మూలాలు ● శాంపిల్స్ సేకరించినా పరిశోధన ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యం ● అటు ప్రభుత్వ ధనం వృధా.. ఇటు వ్యాధి గ్రస్తులకు క్షోభ ● కిడ్నీ వ్యాధులపై విధి విధానాలు లేని కూటమి ప్రభుత్వం కాశీబుగ్గ: పచ్చటి ఉద్దానాన్ని ఎప్పటి నుంచో వేధిస్తున్న కిడ్నీ సమస్య మూలాలు తెలుసుకోవడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఇక్కడ కిడ్నీ చావులు అతి సాధారణమైపోయిన దయనీయ స్థితి నెలకొంది. రెండు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న కిడ్నీవ్యాధిని ప్రభుత్వాలు నియంత్రించలేక పోతున్నాయి. పోతు న్న ప్రాణాలను డయాలసిస్తో కొద్ది రోజులు ఆపగలుగుతున్నారు తప్పితే మనుషులను మాత్రం కాపాడలేకపోతున్నారు. అలాంటి ఉద్దాన ప్రాంతంలో గత పదేళ్లుగా పలు సంస్థలు, బృందాలు పరిశోధనలు జరుపుతున్నాయి తప్పితే కారణం తెలపలేకపోతున్నాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అమెరికా నుంచి శాస్త్రవేత్తలను తీసుకువచ్చి శాంపిల్స్ సేకరించామని చెప్పింది. కానీ ఇన్ని రోజులైనా వాటి ఫలితాలేమిటో ఎవరూ చెప్పలేకపోయారు. ఎప్పటికప్పుడు పరిశోధనలు.. ఉద్దానంలో చాలా ఏళ్లుగా చాలా బృందాలు పరిశోధనలు జరుపుతున్నాయి. కానీ ఇతిమిద్దంగా ఇదీ కారణం అంటూ ఏమీ చెప్పలేకపోయాయి. 2019 వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.85 కోట్లతో కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. వ్యాధి పరిశోధనలకు రంగం సిద్ధం చేసింది. డయాలసిస్ యూనిట్లు పెంచడం, రూ.పదివేల పింఛన్లు కూ డా అందజేసింది. 2024లో వచ్చిన కూటమి ప్రభు త్వం కిడ్నీ వ్యాధి గ్రస్తుల ప్రాంతాల్లో జార్జ్ యూనివర్సిటీ వారితో వివిధ రకాల శాంపిల్స్ సేకరించినప్పటికీ ఇంతవరకు ఫలితాలు వెల్లడించలేదు. ఇదే చాలా మందిని కలవరపెడుతోంది. పలాసలోని కిడ్నీ ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు పొందుతున్న రోగులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాలలో ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో సుమారు 807 గ్రామాలలో కిడ్నీ వ్యాధి గ్రస్తులు 20 వేల మంది ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ప్రాథమిక కేంద్రాలు, 6 సామాజిక ఆస్పత్రులు ఉన్నాయి. ఉద్దాన ప్రాంతంలో ప్రజలు తాగుతున్న నీటి శాంపిల్స్, వాడుకలకు వాడుతున్న నీరు, పంట పొలాలకు ఉపయోగిస్తున్న నీటి శాంపిల్స్ సేకరించారు. రక్తంలో ఉన్నటువంటి సీరం, ఆర్ఎన్ఎ, డిఎన్ఎ, ప్లాస్మా వంటివి వ్యాధి గ్రస్తుల నుంచి సేకరిస్తున్నారు. వ్యాధి గ్రస్తుల నుంచి సేకరించిన యూరిన్ను పరీక్షలకు పంపించారు. ఇటీవల కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వ్యాధి గ్రస్తుల జుట్టు, మట్టి శాంపిల్స్ అమెరికాకు పంపించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఫలితాలు రాకపోవడం అందరూ విస్తుపోతున్నారు. పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో నాల్గో అంతస్తు మొత్తం పరిశోధనలకు కేటాయించాం. అక్కడ జార్జ్ యూనివర్సిటీ వారు పరిశోధనలు జరుపుతున్నారు. ఇటీవల జుత్తు, మట్టి శాంపిల్స్ రసాయ శాస్త్రానికి చెందిన శాస్త్రవేత్తలు ఉద్దానంలో పర్యటించి వాటిని అమె రికా తీసుకుని వెళ్లారు. వారి నుంచి ఇంకా సమాచారం రావాల్సి ఉంది. మేము ఉన్నత అధికారులను కలిసి వారిని సంప్రదించి వారి నుంచి కిడ్నీవ్యాధికి గల కారణాలు తెలిస్తే ప్రభుత్వం దృష్టిలో పెట్టి వెల్లడిస్తాం. అంతవరకు ఏమీ చెప్పలేం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, కిడ్నీ పరిశోధన కేంద్రం -
చారిత్రక ఉత్సవానికి సన్నద్ధం
జలుమూరు: చారిత్రక ఉత్సవానికి శ్రీముఖలింగం ముస్తాబవుతోంది. నాటి కళింగ సామ్రాట్ అనంత వర్మచోడ గంగదేవుని పట్టాభిషేక ఉత్సవం జరిగి 946 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో 947వ పట్టాభిషేక మహోత్సవాన్ని ఈ నెల 17న నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గురువారం ఉదయం ఒడిశా రాష్ట్రం పర్లాఖిముండి గజపతి రాజభవనం వద్ద నిర్వాహకులు ఉత్సవాల పోస్టర్ విడుదల చేశారు. కళింగ రాజధానిగా వెలుగొందిన శ్రీముఖలింగం(కళింగ నగరం) తూ ర్పు గంగ వంశపరిపాలనలో గొప్ప ఘనత సాధించింది. ఈ వంశకాలంలో కళింగ సామ్రాజ్యం ఉత్తరంలో గంగానది నుంచి దక్షిణంలో గోదావరి వర కూ విస్తరించింది. సైనిక, సాంస్కృతిక, శిల్పకళా వైభవంలో కళింగ సామ్రాజ్యం ఓ వెలుగు వెలిగింది. పూరి మొదలు శ్రీకూర్మం వరకు.. పూరి జగన్నాథ ఆలయానికి చోడగంగదేవుని పాలనలో పునాది పడింది. అయితే నిర్మాణం పూర్తికాలేదు. తర్వాత వచ్చిన రాజులు దీనిని పూర్తి చేశారు. శ్రీముఖలింగం దేవాలయం మొదటి కామర్నవ దేవుడు నిర్మించగా అనంత వర్మ వజ్రహస్తకుడు దేవుడు(చోడగంగదేవుని తాత) పూర్తి చేశాడు. చోడ గంగదేవుడు ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశాడు. శ్రీముఖలింగం కళింగ సంస్కృతికి ముఖ్య కేంద్రం. ఇక్కడ శాసనాలు ఆయన పాలన విధానాన్ని వివరింగా చెబుతాయి. హరిహరుల భక్తుడు.. జగన్నాథుడి భక్తుడిగా ప్రసిద్ధి చెందిన చోడ గంగదేవుడు శైవభక్తుడు కూడా. మధుకేశ్వర దేవాలయానికి పెద్ద మొత్తంలో దానాలు ఇచ్చినట్లు శాసనా లలో పొందుపరిచి ఉంది. ఇతను ముందు శైవుడు.. తర్వాత వైష్ణువుడయ్యాడని కొంతమంది చరిత్రకారులు అంటారు. నిజానికి ఇతను రెండింటికీ ప్రాధాన్యమిచ్చారు. శ్రీకూర్మం(కూర్మనాథస్వామి) ఆలయంతో పాటు ఒడిశాలో అనేక శైవ, వైష్ణ ఆలయాలకు పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. 70 ఏళ్లకు పైగా కళింగ రాజ్యాన్ని పరిపాలించిన ఈయన భారతదేశంలో గొప్ప రాజులలో ఒకరిగా నిలిచిపోయారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అనంత వర్మ చోడ గంగదేవుడు పట్టాభిషేకం 946 ఏళ్ల తర్వాత మరోసారి శ్రీముఖలింగంలో నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సమర్థవంతమైన పాలన.. అనంత వర్మ చోడ గంగదేవుడు కళింగ రాజ్యాన్ని ఎక్కువ కాలం అంటే సుమారు 70 ఏళ్లకు పైబడి సమర్థంగా పాలించారు. కళింగ రాజ్యంతో పాటు మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో సింహాచలం, శ్రీకూర్మ దేవస్థానం, అరసవల్లి, శ్రీముఖలింగం, ఒడిశాలో కూడా ఎన్నో దేవాలయాలను అభివృద్ధి చేశారు. శ్రీముఖలింగం రాజధానిగా పరిపాలన చేస్తూ కటక్ను కూడా రాజధానిగా మార్చి మంచి పాలన అందించారు. – కొల్లూరి సూర్యనారాయణ, ఆర్కియాలజీ విశ్రాంత ప్రొఫెసర్, ఆంధ్ర యూనివర్సిటీ నేటి తరాలకు తెలియాలి.. శ్రీముఖలింగం అత్యంత చారిత్రాక, ఆధ్యాత్మిక ప్రదేశం. వేల సంవత్సరాల నాటి పూర్వవైభవం మళ్లీ తెస్తున్నందుకు సంతోషం. దీర్ఘకాలం పాలన చేసిన అనంత వర్మ చోడ గంగ దేవుడు చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పురాతన, మరెన్నో విశేషాలు శ్రీముఖలింగంలో ఉన్నాయి. నాటి కళింగ రాజ్యం రాజధానిగా చేసుకొని పాలన చేసిన రాజు వైభవం పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియనుంది. – డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు, పలాస 17న శ్రీముఖలింగంలో అనంత వర్మ చోడ గంగదేవుడి పట్టాభిషేకం సన్నాహాలు చేస్తున్న నిర్వాహకులు ఇదీ ఘన చరిత్ర అనంత వర్మ చోడ గంగదేవుడు గంగ వంశాధిపతి. శ్రీముఖలింగం దేవాలయం నిర్మాణానికి బలమైన ఆధారాన్ని అందించిన రాజు. ఇతను తండ్రి దేవేంద్రవర్మ రాజరాజా, తల్లి రాజరాజాదేవి. ఈమె చోళ రాజ కుమార్తె. గంగ, చోళ వంశాల కలయికలో జన్మించిన చోడగంగదేవుడు చాలా శక్తివంతమైన పరిపాలకుడు. ఇతను తన సామ్రాజ్యాన్ని ఒడిశా,(ఆదికాలంలో కళింగ), ఆంధ్రప్రదేశ్తోపాటు మరికొన్ని ప్రాతాలను తన నియంత్రణలోకి తెచ్చాడు. బలమైన సైనికుడుగా తన రాజ్యాన్ని స్థిరంగా ఉంచాడు. అంతే కాకుండా యుద్ధవీరుడిగానూ పేరుగాంచాడు. పాలన ప్రారంభంలో కొన్ని కష్టాలు కూడా ఎదురయ్యాయి. చోళ రాజు కులోత్తుంగతో పలు యుద్ధాలు చేశాడు. తిరిగి రాజ్యాన్ని బలపరుచుకొని ఉత్కళ దేశాన్ని సైతం తన గుప్పెట్లో ఉంచుకున్నాడు. -
లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి అరెస్టు
సారవకోట: మండలంలోని కోదడ్డపనస గ్రామంలో ఈ నెల 10న పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన పిర్ల రామారావు అలియాస్ ముకుందరావును శుక్రవారం డీపీటీసీ డీఎస్పీ ప్రసాదరావు అరెస్టు చేశారు. వడ్డినవలసలోని త్రినాథస్వామి దేవాలయం సమీపంలో రామారావును అదుపులోకి తీసుకుని విచారించి అరెస్టు చేసి పాతపట్నం కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ అనిల్కుమార్ తెలిపారు. కాగా, ముకుందరావు గతంలోనూ గ్రామంలో పలువురిని ఇలాగే వేధించగా దేహశుద్ధి కూడా జరిగినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపుపై విచారణ నేడు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలోని క్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన 34 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించగా, బాధితులు లేబర్ కోర్టులో జనవరి 2న ఫిర్యాదు చేశారు. దీనిపై పలు వాయిదాల అనంతరం శనివారం మరో సారి విచారణ జరగనుంది. బాధితులు నెలన్నరగా విధులు లేక ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లేబర్ కోర్టులోనైనా న్యాయం జరుగుతుందేమోనని వీరంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. -
టీనేజర్ల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: యుక్త వయస్సులో ఉన్న మహిళలపై వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టిని సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంతో ఐసీడీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. టీనేజ్ ప్రెగ్నెన్సీలపై కారణాలను విశ్లేషించి ప్రతి సీడీపీఓ ఒక కేస్ స్టడీతో తర్వాత నెల జరి గే సమీక్షా సమావేశానికి హాజరుకావాలని తెలిపారు. గ్రామ స్థాయిలో బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలని ఆదేశించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు ఆధార్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. క్షేత్రస్థాయిలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలు వివరాలను విశ్లేష ణ చేసి నివేదికలు సమర్పించాలని తెలిపారు. ఆదిత్యుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి సతీసమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సఃప్రదాయం ప్రకారం సూపరింటెండెంట్ కనకరాజు, అర్చకులు ఇప్పిలి క్షేమేంద్ర శర్మలు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ విశిష్టతను, ఇటీవల జరిగిన కుంభసంక్రమణ అభిషేక పూజల వివరాలను వివరించారు. మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ శ్రీకాకుళం పాతబస్టాండ్: మార్చి 8వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ చేసి, జిల్లాలో గల పెండింగ్ కేసులను తగ్గించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు భవనంలో శుక్రవారం పోలీస్ అధికారులు, బీమా కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కరరావు, మూ డో అదనపు జిల్లా జడ్జి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, నాల్గో అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎల్ ఫణి కుమార్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. కోడిగుడ్లు, మాంసంపై అపోహలు వద్దు పాతపట్నం: కోడిగుడ్లు, కోడిమాంసంపై అపోహలు వద్దని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు (జేడీ) డాక్టర్ కంచరాన రాజగోపాల్రావు అన్నారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నియంత్రణలో భాగంగా శుక్రవారం జేడీ పాతపట్నం, వసుంధర రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో విధులు నిర్వహిస్తున్న పోలీసులు, పశుసంవర్ధశాఖ సిబ్బందికి బర్డ్ ఫ్లూ నియంత్రణపై సూచనలు, సలహాలు తెలియజేశారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ రాష్ట్రంలో బర్డ్ఫ్లూ వైరస్ వ్యాధిని గోదావరి జిల్లాలోని కోళ్లలో నిర్ధారించడంతో ఇక్కడ కూడా తనిఖీ లు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో బర్డ్ఫ్లూ నమోదు కాలేదని, జిల్లాలోని కోళ్లలో అసాధారణ మరణాలు కూడా లేవని తెలిపా రు. ముందస్తు వ్యాధి నిరోధక చర్యలలో భా గంగా జిల్లాలోని కోళ్ల రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇతర జిల్లా లు, రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణాపై స్థానిక చెక్పోస్టు సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో జిల్లా అంతటా రాపిడ్ రెస్పాన్స్ బృందాలు ఏర్పాటు చేసి, ఎలాంటి సందర్భంలోనైనా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. -
తాగునీటి ట్యాంకులో వ్యక్తి మృతదేహం
టెక్కలి రూరల్: టెక్కలి ఆదిఆంధ్ర వీధి సమీపంలో ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచి నీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో వ్యక్తి మృతదేహం బయటపడటం శుక్రవారం కలకలం రేపింది. కె.కొత్తూరు సమీపంలో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల మెస్లో మేనేజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్న పాలకొల్లుకి చెందిన చందనాల స్వామి(42) ఈ 12న తన ఊరు వెళ్తానని చెప్పి ద్విచక్రవాహనంపై బయటకు వచ్చేశాడు. ఏం జరిగిందో గానీ శుక్రవారం సాయంత్రం ఆదిఆంధ్రవీధి సమీపంలోని రక్షిత మంచినీటి పథకం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో శవమై తేలడాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే ఉన్న ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. టెక్కలి పట్టణానికి సరఫరా అయ్యే తాగునీటిలో మృతదేహం ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
దామోదరం సంజీవయ్యకు నివాళులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శుక్రవారం సంజీవయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్తో కలిసి సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి శాంతిశ్రీ, ఎస్డీసీ పద్మావతి, అప్పారావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు విశ్వ మోహన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ, కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన లాంగ్డ్రైవ్ సరదా
ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై బైక్పై లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ గమ్యం చేరాలనుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ కుటుంబాన్ని విషాదం వెంటాడింది. బైక్ అదుపు తప్పడంతో మృత్యువు వెంటాడింది. భర్త ప్రాణాలు కోల్పోగా.. భార్య గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రానికి చెందిన అభిషేక్ బెహరా (40) బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. బాలాసూర్ కుర్దా నుంచి భార్య అన్నయ్పార్థన్తో కలిసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై బెంగళూరు పయనమయ్యాడు. హెల్మెట్తో పాటు టూర్ కిట్తో సకల జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం మొదలుపెట్టారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఎచ్చెర్ల మండలం ఫరీదుపేట పంచాయతీ నవభారత్ నగర్కాలనీ సమీపంలోకి వచ్చేసరికి బైక్ స్కిడ్ కావటంతో అభిషేక్ బెహరాకు తీవ్ర గాయాలు కాగా, భార్య అన్నయ్పార్థన్ స్వల్పంగా గాయపడింది. స్థానికులు అందించిన సమాచారంతో 108 సర్వీస్ అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం అభిషేక్ బెహరా మృతి చెందారు. అన్నయ్ పార్థన్కు ప్రాణాపాయం తప్పింది . మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై అదుపు తప్పిన బైక్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి.. భార్యకు గాయాలు -
థర్మల్ ప్లాంట్తో సహజ వనరులు నాశనం
సరుబుజ్జిలి: థర్మల్ విద్యుత్ కేంద్రం పేరుతో సహజ వనరులను నాశనం చేయవద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. శుక్రవారం గిరిజనులు, ఆదివాసీలతో కలిసి వెన్నెలవలసలోని థర్మల్ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఆదివాసీల మనోభావాలను గౌరవిస్తుందని, వారి హక్కులకోసం జరిగే పోరాటానికి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. థర్మల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే గిరిజన పాఠశాలలు, జవహర్ నవోదయ విద్యాలయం, పచ్చని పంట పొలాలు నాశనం కావడంతో పాటు గ్రామాలు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. అన్ని వర్గాలు థర్మల్ వ్యతిరేక పోరాట ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి కూటమి ప్రభుత్వ కుతంత్రాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల సమాఖ్య అధ్యక్షుడు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర న్యాయ సలహాదారు చౌదరి లక్ష్మణరావు, జెడ్పీటీసీ సభ్యుడు సురవరపు నాగేశ్వరరావు, థర్మల్ విద్యుత్ కేంద్రం ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, ఉద్యమ నేతలు బీన జ్ఞానేశ్వరి, ఢిల్లీశ్వరి, తామాడ అప్పలస్వామి, పొందర మురళి, వైఎస్సార్సీపీ నేతలు ఖండాపు గోవిందరావు, అత్తులూరి రవికాంత్, దుంపల శ్యామలరావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనుల ఉద్యమానికి మద్దతు ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ -
అక్రమాల జాతర
వంశధార నదిలో డీ–సిల్టేషన్ ర్యాంపులోకి వేసిన అక్రమంగా వేసిన రాచబాట గార: గార మండల కేంద్రంలోని డీ సిల్టేషన్ ర్యాంపులో ఇసుక అక్రమాల జాతర జరుగుతోంది. దీనికి అధికారులే ప్రత్యక్ష సాక్షులుగా నిలిచా రు. కళింగపట్నం– పాలకొండ రోడ్డుకు ఆనుకొని ఉన్న డీ–సిల్టేషన్ ర్యాంపులో ఇష్టానుసారం ఇసు క తరలింపు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుకపై అనేక జీఓలు విడుదలతో పాటు స్వయానా ముఖ్యమంత్రి సైతం ఇసుక వాహనాలు ఆపవద్దు అని బహిరంగంగా నే వ్యాఖ్యానించారు. అదే వరమై వాల్టా వంటి చట్టాలు సైతం మంటగలుపుతూ ఇక్కడ ఇసుకను తవ్వి తోడేస్తున్నారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయిప్రత్యూష రిజర్వ్డ్ పోలీసుల సాయంతో ర్యాంపును తనిఖీ చేశారు. స్వయానా మండల అధికారుల టీమ్తో పరిశీలించారు. వంశధార నదిలో ఉన్న రెండు హిటాచీలను సీజ్ చేయమని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. వాటి తాళాలను గార పోలీసులకు అప్పజెప్పారు. ఇది లా ఉండగా ఈ ర్యాంపు సమీపంలోనే రక్షిత మంచినీటి పథకంతో పాటు పదుల సంఖ్యలో వ్యవసాయ పంపుసెట్లు, నది గట్టు చెంతనే ఆర్ అండ్బీ రోడ్డు ఉన్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న జీఓ ప్రకారం గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ నుంచి ఒకరు, మైన్స్ శాఖ నుంచి ఒకరు ఉండి ఏరోజుకారోజు ఆన్లైన్లో వచ్చిన వాహనాలకు ఇసుకను ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇవేమీ అమలు కావడం లేదని గుర్తించారు. ఎవరూ వస్తున్నా ముందుగానే సంబంధిత శాఖలకు తెలియడంతో అంతా గప్చిప్గా జరిగిపోతోంది. సీజ్ చేసిన తర్వాత కూడా శుక్రవారం ఉదయం హిటాచీలు స్టాక్ చేసిన ఇసుక వద్దనే ఉన్నాయి. వీటి తాళాలు మాత్రం గార పోలీస్స్టేషన్లో ఉన్నా.. ఎప్పటి మాదిరిగా పలు ఖాళీ వాహనాలు మాత్రం ఇసుక కోసం ఎదురు చూస్తుండటం కొసమెరుపు.