Srikakulam
-
ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి
పాతపట్నం: పాతపట్నం శ్రీ నీలమణిదుర్గ అమ్మవారి 51వ వార్షిక మహోత్సవాల సందర్భంగా ఆలయం ముందు ఉన్న మామిడి తోటలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ అక్కందర సన్యాసిరావు తెలిపారు. శుక్రవారం కబడ్డీ మైదా నాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 25 సాయంత్రం నాలుగు గంటలకు క్రీడలు ప్రారంభం కానున్నాయని, కబడ్డీ పోటీల్లో పాల్గొనేవారు శనివారం మధ్యాహ్నం ఒంటి గంటలోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్బాబు ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని, ప్రతి రోజూ సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్లడ్ లైట్స్ వెలుతురులో జరుగుతాయని తెలిపారు. -
ఇదే ఆనందమంట..!
● మైదానాల బాట పడుతున్న విద్యార్థులు ● మరికొద్ది రోజుల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు మొదలు ● ఎండల్లో జాగ్రత్తలు తప్పనిసరని చెబుతున్న నిష్ణాతులు శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యా సంవత్సరం ముగిసింది. పరీక్షలు పూర్తయ్యాయి. విద్యార్థులంతా మైదానాల బాట పడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్ కూడా నడుస్తుండడంతో క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు కళింగపట్నం, సింగుపురం, ఇచ్ఛాపురం, సోంపేట, మకరాంపురం, పలాస, వజ్రపుకొ త్తూరు, నందిగాం, టెక్కలి, నరసన్నపేట ఆమదాలవలస, ఎచ్చెర్ల, రణస్థలం తదితర ప్రాంతాల్లోని క్రీడాకారులు, విద్యార్థులు, యువత, చిన్నారులు మైదానాల్లో సందడి చేస్తున్నారు. వివిధ క్రీడాంశాల్లో నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకునేందుకు రెడీ అయిపోతున్నారు. దీనికితోడు త్వరలో మొదలయ్యే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను కూడా వినియోగించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. మరికొంతమంది త్రివిధ దళాల్లో ఉద్యోగాలకు శారీరక దారుఢ్యాన్ని పెంచుకోవడంలో తలమునకలవుతున్నారు. టోర్నీలు, లీగ్ మ్యాచ్లతో హడావుడి.. వేసవి సెలవుల్లో భాగంగా యువత, విద్యార్థులు పలు క్రీడాంశాల్లో మండల, నియోజకవర్గ, జిల్లాస్థాయి, అంతర్రాష్ట్ర క్రీడా టోర్నీలు, లీగ్ మ్యాచ్లు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక వేస్తున్నారు. కొన్ని చోట్ల టోర్నమెంట్లను కూడా మొదలుపెట్టేశా రు. ముఖ్యంగా క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ క్రీడాంశాల్లో టోర్నీలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి తోపాటు ఫుట్బాల్, చెస్, క్యారమ్స్, కరాటే, తైక్వాండో, జూడో క్రీడాంశాల్లోను పోటీలకు కసరత్తులు చేసుకుంటున్నారు. స్పోర్ట్స్ షాపులు కళకళ.. సమ్మర్ క్రీడల నేపథ్యంలో జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న స్పోర్ట్స్ షాపులు క్రీడాకారులతో కళకళలాడుతున్నాయి. క్రీడా దుస్తుల విక్రయాలతోపాటు క్రికెట్ కిట్లు, వాలీబాల్, షటిల్ రాకెట్స్ మొదలుకుని క్రీడా సామాగ్రి విక్రయాలతో షాపుల్లో సందడి వాతావరణం నెలకొంది. వీటితోపాటు ఫిట్నెస్ మెరుగుకోసం వివిధ యాంత్రిక పరికరాలు, బండిల్స్ విక్రయాలు కూడా జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మండే ఎండల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవా ల్సిన అవసరం ఉంది. ప్రస్తుత ఉష్ణాగ్రతల నేపథ్యంలో ఉదయం గరిష్టంగా 10.30 వరకు, సాయంత్రం 3.30 గంటల తర్వాత మాత్రమే మైదానాల్లో ఆడుకోవడం ఉత్తమం. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు గ్లూకోజ్, నిమ్మరసం, ఆరెంజ్ వంటి ద్రా వణాలను అధిక మోతాదులో తీసుకోవాలి. కొ బ్బరిబొండాలు,మజ్జిగ తీసుకోవడం మంచిది. – డాక్టర్ బొడ్డేపల్లి సురేష్కుమార్, వైద్యులు, సన్రైజ్ హాస్పటల్ ఎండీ శ్రీకాకుళంక్రీడాదుస్తులు, క్రీడా సామ గ్రి కొనుగోలు చేసే సమయంలో కచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నకిలీ సామగ్రి కూడా వచ్చేస్తున్నాయి. ఒకటికి రెండుసార్లు చూసి కొనుక్కోవాలి. – మొజ్జాడ వెంకట రమణ, సీనియర్ పీడీ -
● పేరుకుపోతున్న ఉపాధి బకాయిలు ● జిల్లాలో రూ.52 కోట్లకుపైగా బకాయి ● పని చేసి వేతనం కోసం ఎదురు చూస్తున్న వైనం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధి వేతనదారుల వేదన ఎవరికీ పట్టడం లేదు. ఒళ్లు హూనమయ్యేలా పని చేసి వేతనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కొత్తగా ఉపాధి విధానంలో మార్పులు వచ్చిన తర్వాత వేతన దారులకు బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో కూలీ లు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పేరు మారినా.. తీరు మారునా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును ప్రస్తుత ప్రభు త్వం మార్చింది. ఈ స్థానంలో వీబీజీరామ్జీ అంటూ కొత్త పేరు తీసుకువచ్చింది. కూలీలకు పది దినాలు పెంచుతూ ఉత్తర్వులు చేసింది. అయితే ఈ కొత్త పథకంలో ఉపాధి కూలి దినాలు పెంచి నా ప్రయోజనం లేదు. కూలీ లకు వేతనాల చెల్లింపులో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం వాటా ను నిర్ణయించింది. దీంతో ఈ పనులు ఈ ఏడాది అన్ని చోట్లా చురుగ్గా సాగడం లేదు. చేసిన పనికి బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. జిల్లాలో 30 మండలాలు, వాటి పరిధిలో 879 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో ప్రతి వేతన దారులకు కుటుంబానికి 150 రోజులు పని కల్పించాలి. కానీ ఇప్పటివరకు పనులు అరకొరగానే జరుగుతున్నాయి. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడమే దీనికి కారణమని వేతనదారులు చెబుతున్నారు. తగ్గిన వేతన దారులు జిల్లాలో దాదాపు 5 లక్షల కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. వీటిలో సుమారు పనికి వెళ్లే వేతనదారులు సుమారుగా 6.5 లక్షలు ఉన్నారు. అయి తే వీరిలో ఏటా పనులకు వెళ్తున్న వారు 4.5 లక్షలు మాత్రమే. గతంలో గరిష్టంగా 3.5 లక్షలు మంది వేతనదారులు పనులకు వెళ్లారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వేతనాలు మంజూరు కాకపోవడం, పనులు కల్పించకపోవడం, వేతనం తక్కువగా రావడంతో వేతనదారుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు. మారని సాఫ్ట్వేర్ ఉపాధిలో కొత్త విధానం ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చింది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన వీబీ జీ రామ్ జీ చట్టం ప్రకారం తగిన విధంగా సాఫ్ట్వేర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో బిల్లుల విషయమై స్పష్టత లేదు. 2025 ఏప్రిల్ నుంచి బకాయిలు పెట్టారు. పాత, కొత్త బకాయిలు కలిపి రూ.52 కోట్లు కంటే ఎక్కువే ఉన్నాయి. వసతుల లేమి.. ఉపాధి పనులు నిర్వహించే చోట వసతులు ఉండేవి. ప్రదానంగా మెడికల్ కిట్లు, తాగునీరు, టెంట్, పనిముట్లు వంటివి సరఫరా చేసేవారు. రెండేళ్లుగా కొత్తగా ఇలాంటి పరికరాలు మంజూరు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఎవరి పనిముట్లు వారే తీసుకెళ్తున్నారు. కనీసం పని చేసే చోట టెంట్లు, టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవు. వేసవిలో గతంలో ఓఆర్ఎస్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అవి కూడా లేవు. ఒకప్పుడు వేసవి అలవెన్సులు ఇచ్చేవారు. ఆ సమయంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయంలో పనులు చేసేవారు. అప్పుడు వేసవి అలవెన్సులు ఇతర వేతనం కలిపి సుమారుగా రూ.350 వరకు రోజు వేతనం గిట్టుబాటు అయ్యేది. ప్రస్తుతం ఎంత వేతనం గిట్టుబాటు అవుతుందో తెలీదు. ప్రస్తుతం గరిష్ట వేతనం రోజుకి రూ. 307లు వరకు ఉంది. అయితే ఆ స్థాయిలో పనులు జరగకపోవడం, ఇతర అలవెన్స్లు లేకపోవడంతో కనీస వేతనం ఎంత వస్తుందో తెలీని పరిస్థితి ఉంది. వేతనదారులకు రెండు మూడు రోజుల్లో బకాయిలు విడుదల కానున్నాయి. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వేతనదారులు ఆందోళన చెందవద్దు. – లవరాజు, డ్వామా పీడీ -
‘నోటీసులు లేకుండా ఉద్యోగాల నిలుపుదల సరికాదు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ అటెండర్లు, గెస్ట్, పార్ట్టైమ్ టీచర్లను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుంచి నిలుపుదల చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకి వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల కాంట్రాక్ట్–ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డి.గణేష్ అన్నా రు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏటా అంకితభావంతో పనిచేస్తున్న గురుకుల ఉద్యోగులను అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడం కార్మిక చట్టాలకు వ్యతిరేకమని ఆయన తెలిపారు. ఈ అన్యాయ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి 40 రోజుల సెలవుదినాల్లో కూడా జీతాలు చెల్లిస్తారని గుర్తు చేశారు. పూర్తికాల అధ్యాపకు ల లేమితో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్య అందించాలంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవా లని ఆయన డిమాండ్ చేశారు. అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామిని ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ దండ శ్రీనివాస్ కుటుంబసమేతంగా శుక్రవా రం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదా యం ప్రకారం అధికార సిబ్బంది, అర్చకులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఆలయ విశిష్టతను ప్రధానార్చకు లు ఇప్పిలి శంకరశర్మ ఆయనకు వివరించి స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్ సాయి పాల్గొన్నారు. అరసవల్లి: పంచాయతీరాజ్ శాఖతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామ సర్పంచ్గానే తన రాజకీయ జీవి తం ప్రారంభం కావడం నిజంగా తన అదృష్టమన్నారు. జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రాముఖ్యతను వివరిస్తూ..73వ రాజ్యాంగ సవరణ విశేషాలను వివరించారు. అంతకుముందు జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా గాంధీజీ, బీఆర్ అంబేడ్కర్ల చిత్రపటాలకు ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే శంకర్ తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్టేజిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడా..? జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ ఏకంగా వేదికపైన కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత ఉండకూడదు. అయినప్పటికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు రమేష్ను ఏకంగా స్టేజిపై ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేల సరసన కూర్చోబెట్టడం చర్చకు దారితీసింది. సమావేశానికి హాజరైన అధికారులు దీనిపై తీవ్రంగా చర్చించుకున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో చూడలేదని వాపోతున్నారు. -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026వంశధార చెంత నీటి కోసం చింత హిరమండలం మేజర్ పంచాయతీలో గుక్కెడు నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. వంశధార నది చెంతనే ఉన్నా మేజర్ పంచాయతీ వాసులకు నీటి సమస్య కొనసాగుతూనే ఉంది. ఏటా వేసవి సమయంలో రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్ సమస్య తలెత్తడంతో అధికారులు చేతులెత్తేశారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మేజర్ పంచాయతీ ప్రజల అవసరాలకు ఇది ఏ మాత్రం చాలడం లేదు. – హిరమండలం -
పార్టీ ఐడీ కార్డు వెరిఫికేషన్ పూర్తి చేయాలి
నరసన్నపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల సభ్యుల డిజిటలైజేషన్ జిల్లాలో బాగా జరిగింది. అయితే డిజిటలైజేషన్ చేసిన పేర్లు, ఐడీ కార్డుల వెరిఫికేషన్ పూర్తయితేనే వారికి పార్టీ నుంచి గుర్తింపు కార్డులు వస్తాయని, ఈ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో సరాసరిన 23 శాతం మేరకే వెరిఫికేషన్ ఇప్పటి వర కూ అయ్యిందని, ఈ నెలాఖరుకల్లా నూరు శాతం పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. వెరిఫికేషన్ అయితేనే పార్టీ నుంచి గుర్తింపు కార్డు వస్తుందని తెలిపారు. ఈ గుర్తింపు కార్డు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలోనికి కూడా అనుమతి ఉంటుందని, పార్టీలో గుర్తింపు లభిస్తుందని తెలిపారు. దీని కోసం ప్రత్యేక యాప్ ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలకు పంపించామని, దీన్ని గ్రామా ల్లో ఉన్న ప్రధాన కార్యకర్తలకు ఇచ్చి దీని ద్వారా డిజిటలైజేషన్లో రిజిస్టర్ చేసిన పేర్లు ఐడీ కార్డులు అన్నింటినీ పరిశీలించాలన్నారు. శుక్రవారం నాటికి టెక్కలిలో 25 శాతం, శ్రీకాకుళంలో 30 శాతం, నరసన్నపేటలో 20 శాతం, ఆమదాలవలస నియోజ కవర్గంలో 18 శాతం, ఎచ్చెర్లలో 21 శాతం, ఇ చ్ఛాపురంలో 24 శాతం, పలాసలో 15 శాతం, పాతపట్నంలో 18 శాతం వెరిఫికేషన్ పూర్తయిందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని, ఈ మేరకు సమన్వయకర్తలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. అనంతరం నరసన్నపేట నియోజకవర్గంలో వెరిఫికేషన్ పై సమీక్ష చేశారు. నియోజకవర్గంలో 10907 వరకూ కార్యకర్తలను అనుబంధ సంఘాల్లో సభ్యు లుగా చేర్చగా శుక్రవారం సరికి 20 శాతం మంది ఐడీ కార్డుల వెరిఫికేషన్ పూర్తయిందని పేర్కొన్నారు. -
కార్మికుడి ప్రాణం తీసిన క్వారీ ప్రమాదం
మెళియాపుట్టి: గ్రానైట్ క్వారీలు ప్రమాదాలకు నిలయాలుగా మారా యి. ఎక్కడి నుంచో పొట్టకూటికి వచ్చిన వ్యక్తులు ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. మెళియాపుట్టి ఎస్ఐ మహమ్మద్ అమీర్ అలీ తెలిపిన వివరాల మేరకు.. శుక్ర వారం వేకువజామున సుమారు రెండు గంటల ప్రాంతంలో ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లోని (గంగరాజపురం దరి) రాజయోగ క్వారీలో పనిచేస్తున్న ధర్మారామ్ జాట్ (34) మృతి చెందాడు. రాయి కోస్తుండగా రోప్ వైర్ తెగిపోడంతో ఇనుప చువ్వ మెడకు లోతుగా గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం జరగడంతో వెంటనే టెక్కలి ఆస్పత్రికి తరలించారు. అక్కడకు తీసుకెళ్లే సరికే ఆయన మృతి చెందారు. ఈయనది రాజస్థాన్లోని నాగవూర్ జిల్లా, భిల్లూ గ్రామం. ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు, తమ్ముడు ఉన్నారు. విషయం తెలుసుకున్న తమ్ముడు బయల్దేరి మెళియాపుట్టి వస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. గ్రానైట్ క్వారీలో అర్ధరాత్రి వేళ పనులు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే క్వారీలో గతంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. -
భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు
వజ్రపుకొత్తూరు రూరల్: ఏళ్ల తరబడి ఉన్నటువంటి భూ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. మండలంలోని ఎయిర్పోర్టు నిర్వాసిత గ్రామాలైన అనకాపల్లి, ఒంకులూరు, మోట్టూరు గ్రామాల్లో శుక్రవారం రెవెన్యూ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి వారితో మాట్లాడారు. గతంలో గ్రామాల్లో చేసిన రీసర్వేలో తప్పులు ఉన్నాయని, ఈ విషయాన్ని అనేక సార్లు రెవెన్యూ అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే భూ సమస్యల పరిష్కారానికి ఇంటింటి సర్వే చేపట్టేందుకు ఇప్పటికే గ్రామాల్లో 10 మంది వీఆర్వోలను రైతులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే ఎయిర్పోర్టు నిర్మాణంపై రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో స్థానిక తహసీల్దార్ డీవీ సీతారామయ్య, పాతపట్నం తహసీల్దార్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏం జరిగింది..?
శ్రీకాకుళం క్రైమ్/టెక్కలి: జిల్లాలోని కోటబొమ్మాళి ప్రాంతంలో శుక్రవారం జరిగిన క్రికెట్ మ్యాచ్ అటు పోలీసులను, ఇటు తల్లిదండ్రులను ఉలికిపాటుకు గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం గాజులవీధికి చెందిన పందిరి అరుణ భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. వీరిలో చిన్నవాడైన రోహిత్ అమ్మమ్మగారి ఊరు పెద్దసాన ఇటీవల వెళ్లాడు. శుక్రవారం అదే గ్రామస్తులతో కలిసి కోటబొమ్మాళి ప్రాంతంలో అక్కడివారితో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక యువకుని తలకు బాల్ తగిలి గాయమైనట్లు కుమారుడు రోహిత్ ఫోన్ చేశాడని అరుణ చెప్పారు. అనంతరం దగ్గరలో ఆస్పత్రికి తీసుకెళ్లారని, పోలీసులు తమను తీసుకెళ్తునట్లు మధ్యాహ్నం 12:30కు రోహిత్ ఫోన్చేసి చెప్పాడు. అయితే ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదని పేర్కొంది. టూ టౌన్ పీఎస్ నుంచి ఫోన్ వస్తుందని కుమారుడు చెప్పడంతో అక్కడికి సైతం తాను వెళ్లానని పేర్కొంది. మళ్లీ సాయంత్రం తనతో పాటు అందరి ఫోన్లు పోలీసులు లాక్కున్నారని, వేరే వారి వద్ద ఫోన్ తీసుకున్న తన కుమారుడు మళ్లీ చేశాడని అరుణ చెప్పారు. విషయం ఇటు టెక్కలి, కోటబొమ్మాళి పోలీసులకే కాక శ్రీకాకుళం టూటౌన్ పోలీసులకు కూడా తెలియడం, అప్పటికే కొంతమంది సీఐడీ పేరిట పోలీసులకు ఫోన్లు చేసి ఆ పిల్లలు ఏమయ్యారని వాకబు చేయడం అంతా చర్చకు దారి తీసింది. చివరికి రాత్రి 9.35 గంటలకు కుమారుడు రోహిత్ ఫోన్ చేసి తనని పోలీసులు విడిచిపెట్టినట్లు, క్షేమంగా అమ్మమ్మగారింటికి వెళ్తున్నట్లు చెప్పాడని ఆమె తెలిపారు. కాగా రోహిత్ తనను, మిగతావారిని పోలీసులు ఎక్కడికి పట్టుకెళ్లారన్నది చెప్పకపోవడంతో మిస్టరీగానే మిగిలింది. -
27న జిల్లాకు ఉప రాష్ట్రపతి రాక
శ్రీకాకుళం పాత బస్టాండ్: భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ జిల్లాలో పర్యటించనున్నారని, దీనికి పటిష్టమైన ఏర్పాట్లు చేయా లని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారు లను ఆదేశించారు. జిల్లాలో భారత ఉప రాష్ట్రపతి ిసీపీ రాధాకృష్ణన్ ఈ నెల 27వ తేదీన పర్యటించనున్న సందర్భంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఉప రాష్ట్రపతి ప్రోటోకాల్ ఆఫీసర్ అనంతశర్మలతో కలసి జిల్లా అధికారులతో సమీక్షించారు. రెండు హెలీపాడ్లు సిద్ధం చేయాలని ఆర్ అండ్బీ ఎస్ఈని ఎస్పీ ఆదేశించారు. శ్రీకాకుళం నగ రం శానిటేషన్, బ్యూటిఫికేషన్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చూడాలన్నారు. విద్యుత్ అంతరా యం లేకుండా చూడాలన్నారు. గార వెళ్లే రహదారు లు అన్నీ శుభ్రంగా ఉండాలని జెడ్పీ సీఈఓ, డీపీఓలను ఆదేశించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలను విచారించిన పోలీసులు
జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రా మానికి చెందిన మచ్చ సతీష్, మచ్చ శ్రీనివాసరావులకు సంబంధించిన 30 బస్తాల ధాన్యం, మూగజీవులకు నిల్వ చేసిన వరి గడ్డి అగ్నికి ఆహుతయ్యాయి. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి వివాదం కారణంగా ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తమపై కక్షగట్టి నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇరువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని నానుబాల వీధిలో వేంచేసిన విజయదుర్గ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు ఆరవెల్లి సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో మూలవిరాట్కు అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం
జి.సిగడాం: కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ఉపాధ్యాయుల సమస్యలపై ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని ఏపీటీఏఫ్ (257) జిల్లా ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు, పూర్వ జిల్లా కార్యదర్శి దుంగ వీరయ్యలు తెలిపారు. మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి నాయకులు ఐఆర్, పీఆర్సీ కమిటీలు ఏర్పాటు చేస్తామని అనేక హమీలు ఇచ్చి, ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాదిలో అప్గ్రేడ్ చేసిన పాఠశాలలకు హెచ్ఎంలు, పీడీ పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పనిభారం పెట్టడంతోపాటు అనేక యాప్లతో నానా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు, యాప్ల పేరుతో విద్యార్థులకు విద్యను బోధించడానికి సమయం సరిపోవడం లేదన్నారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పాత పెన్షన్ విధానం అమలు అయ్యేవరకు పోరాడుతామన్నారు. ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత లేకపోతే వారి కుటుంబాలు వీధిన పడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అనంతరం విజయవాడలో నిర్వహించనున్న ధర్నాకు ఏపీటీఏఫ్ మండల శాఖ కిల్లారి వెంకటరమణ, యలకల ఆదినారాయణ, చిత్తిరి జగదేశ్వరరావు, పిట్టా అప్పారావు, కోనారి నారాయణప్పడు తదితరులు బయల్దేరి వెళ్లారు. -
శ్రీకాకుళం
శుక్రవారం శ్రీ 24 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026 ● సెలవులోచ్.. కలాలతో చేతి వేళ్లకు కుదిరిన స్నేహాలకు కొన్నాళ్లు విరామం. బ్యాగుల భారం నుంచి భుజాలకు కాసిన్ని రోజులు విశ్రాంతి. బ్లాక్ బోర్డులతో చాక్పీసులకు కొద్ది రోజుల ఎడబాటు. నిద్రావస్థలోకి పుస్తకాలు, నిశ్శబ్దావస్థలోకి స్కూలు ఆవరణలు, మౌనవ్రతంలోకి బడి గంటలు.. కలగలిపి బడులకు వేసవి సెలవులు. విద్యా సంవత్సరం ఆఖరి రోజు కావడంతో పిల్లలు గురువారం వెలుగుతున్న ముఖాలతో బడి నుంచి బయటకు వచ్చారు. హాస్టళ్ల పిల్లలు ఉత్సాహంగా ఇళ్లకు బయల్దేరారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
పొందూరు: కృష్ణాపురం గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. కేశవదాసుపురం గ్రామానికి చెందిన పల్ల రాజ్కుమార్, లావేరు మండలం బుడుమూరుకు చెందిన పి.దుర్గాప్రసాద్లు లైటింగ్ పనులు చేస్తుంటారు. గురువారం బైక్పై పొందూరు వస్తుండగా కృష్ణాపురం వద్ద ఆగి ఉన్న బస్సును తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టారు. ఈ ఘటనలో యువకులు రోడ్డుపై తుళ్లిపడి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు స్పందించి 108 అంబులెన్సులో రిమ్స్కు తరలించారు. -
స్వీయగణన చేసుకోండిలా..!
● ఆన్లైన్లో స్వయంగా వివరాల నమోదు ● ఈ నెల 30 వరకు అవకాశం ● మే 1 నుంచి సిబ్బందితో గణన ప్రక్రియ హిరమండలం: జనగణన ప్రక్రియలో భాగంగా స్వీయగణన ప్రారంభమైందని హిరమండలం, ఎల్ఎన్పేట ఎంపీడీఓలు ఆర్.కాళీప్రసాద్, శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిఒక్కరూ తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ నెల 30వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొబైల్లో ఇలా.. మనం ఇంట్లో కూర్చుని వివరాలను నమోదు చేసుకునేందుకు డిజిటల్ ప్రక్రియ ప్రాంభించారు. దీనిలో భా గంగా మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయి నుంచి ఉన్నతాధికారులు, కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారి వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ●ముందుగా ‘ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీఓవీ.ఐఎన్’ ఆన్లైన్ పోర్టల్లోకి వెళ్లాలి. రాష్ట్రం ఎంచుకున్నాక క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. ●ముందుగాఇంటి యజమాని పేరునమోదు చేయాలి. ●ఇంట్లో ఎన్ని మొబైల్ నెంబర్లు ఉంటే అన్నీ ఇవ్వకూడదు. ఒక కుటుంబానికి ఒక మొబైల్ నంబర్ మాత్రమే ఇచ్చి నమోదు చేయాల్సి ఉంటుంది. ●మనకు నచ్చిన భాషను ఎంచుకోవాలి ●మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ●జిల్లా, గ్రామం, పిన్కోడ్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. ఈ నమోదులో మన ఇల్లు లొకేషన్ వచ్చేలా రెడ్మార్కుతో గుర్తించాల్సి ఉంటుంది. ●ఇళ్ల జాబితా ప్రశ్నలన్నింటినీ పూర్తి చేశాక వివరాలు సరిచూసుకోవాలి. ●అన్నీ సరిగ్గానే ఉన్నట్లు భావిస్తే సబ్మిట్ చేయాలి. తర్వాత 11 అంకెలు కలిగిన ఎస్ఈ ఐడీ జనరేట్ అవుతుంది. ●గణాంక సిబ్బంది (ఎన్యూమరేటర్లు) మే 1 తర్వాత మన ఇంటికి వచ్చినప్పుడు ఎస్ఈ ఐడీ నంబర్ చూపించాల్సి ఉంటుంది. వారు మనకు వచ్చిన ఐడీ నమోదు చేసినప్పుడు మనం ఇచ్చిన డేటా మ్యాచ్ అయితే జనగణన పూర్తయినట్లే. -
‘భగీరథుని స్ఫూర్తితో జల సంరక్షణ’
శ్రీకాకుళం పాతబస్టాండ్: భగీరథ మహర్షి స్ఫూర్తితో జిల్లాలో జల సంరక్షణ చేద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మహర్షి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇన్చార్జి వినాయకం, బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు. భగీరథుని చిత్ర పటానికి పూలమాలలు వేస్తున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
నేడు టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్మేళా
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిప్లమో, డిగ్రీ, ఐటీఐలలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల కోసం జేకేసీ, సీఎంఎస్ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి నిర్వహిస్తున్న ఈ జాబ్మేళాలో యమ హా మ్యూజిక్, టాటా ఎలక్ట్రానిక్స్, అట్లాస్ గ్రూప్, అపోలో టైర్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో పాటు లీ ఫార్మా, జెన్ఫోల్డ్ సస్టెయిన్బుల్ టెక్నాలజీస్ భీమా ఫైన్ కెమికల్స్ తదితర కంపెనీలు హాజరవుతున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందమ్మ పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో నేరుగా హాజరు కావాలని కోరారు. 26న లా ఎంట్రన్స్ మోడల్ టెస్ట్ శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన లా ప్రవేశ పరీక్షకు సంబంధించిన మోడల్ పరీక్షను నిర్వహిస్తున్నట్టు బీసీ న్యాయవాదుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఆగూరు ఉమామహేశ్వరరావు తెలిపారు. బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ మోడ ల్ ఎంపీఆర్ లా కాలేజీలో జరగనుందని ఆయన తెలిపారు. ఈ మోడల్ పరీక్షకి ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు వారి పేర్లను రిజిస్ట్రేష న్ చేయించుకున్నారని, ఇంకా ఆసక్తి గల వారు వారి పేర్లను 9440193228, 9440436496 నంబర్లకు ఫోన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. పరీక్ష పూర్తిగా ఉచితమని తెలిపారు. ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు నగరంలోని ఎంపీఆర్ న్యాయ కళాశాలలో ఈ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. టీచర్కు సన్మానం మందస: కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్గా పని చేస్తున్న గంట గోపాలకృష్ణకు 4వ, 5వ తరగతుల పరిసరాల విజ్ఞానం పుస్తక రచనలో అవకాశం దక్కడం గొప్ప విషయమని స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూన వేణుగోపాలరావు అన్నారు. మంగళగిరిలోని విధ్యాభవన్లో రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ పుస్తక రచనలో భాగంగా ప్రస్తుతం ఆయన నాలుగు వర్క్ షాప్లలో పాల్గొని, కొత్తపల్లి పాఠశాల కీర్తి పతాకాన్ని రాష్ట్రస్ధాయిలో ఎగురవేయడంపై స్థానిక పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, కొత్తపల్లి గ్రామ పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. పుస్తక రచన కోసం ఈ జిల్లా నుంచి ఆయన మాత్రమే ఎంపిక కావడం విశేషం. గురువారం పాఠశాలకు చివరి రోజు కావడంతో ఆయనను సత్కరించారు. ప్రశాంతంగా ఏపీ ఈ సెట్ నరసన్నపేట: స్థానిక కోర్ టెక్నాలజీలో గురువారం ఏపీ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది. రెండు కేంద్రాల్లో 350 మందికి 8 మంది గైర్హాజరయ్యారు. పాలిటెక్నిక్లో డిప్లమా పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్లో నేరుగా ప్రవేశాలకు ఏపీ ఈసెట్ ను ప్రభుత్వం నిర్వహించింది. డిప్లమా విద్యార్థులతో కోర్ టెక్నాలజీ వద్ద సందడి నెలకొంది. ‘ఉత్తరాంధ్ర జానపద కళలను పరిరక్షించాలి’పలాస: ఉత్తరాంధ్ర జానపద కళలను పరిరక్షించాలని జానపద కళల పరిశోధకులు బద్రి కూర్మారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత రెండు రోజులుగా పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉత్తరాంధ్ర జానపద కళలు, సాహిత్యం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ప్రాచీన కళలు గా తప్పెటగుళ్లు కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పలువురు వక్తలు మాట్లాడారు. కార్యక్రమంలో రంగం ప్రజా సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు రంగం రాజేష్, సినీ నటుడు డాక్టర్ కుమార్ నాయక్, రంగం జిల్లా అధ్యక్షుడు కొర్రాయి శ్రీకాంత్, ఎల్వీ చలం, రంగం రాష్ట్ర సహాయక కార్యదర్శి హేమసోధన్ తో పాటు అనంత కరుణాకర్, గండ్రేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అంగన్వాడీలకు వేసవి సెలవులు ఇవ్వాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ), శ్రీకాకుళం అర్బన్: అంగన్వాడీలకు మే నెలంతా వేసవి సెలవులు అమలు చేయాలని, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం.గోవర్ధనరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కల్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నియోజకవర్గ కేంద్రాల్లో గురువారం ఏడురోడ్ల కూడలివద్ద నిరసన చేపట్టి మానవహారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనం రూ.26వేలు అమలు చేయాలన్నారు. ఐసీడీఎస్ ప్రా రంభించి 50 ఏళ్లు పూర్తయినా నేటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదని, కనీసవేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సౌకర్యం అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు విపరీతంగా పెరిగినా ఒక్క రూపాయి వేతనం కూడా పెంచలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2026–27కి ప్రవేశపెట్టిన బడ్జెట్ లోనూ అన్యాయం జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, మెనూచార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చెయ్యాలని డిమాండ్ చేశారు. -
బాహుదాపై వంతెన పనులు ప్రారంభించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇచ్ఛాపురంలోని బాహుదా నదిపై వంతెన పనులు త్వరితగతిన ప్రారంభించి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన కార్యా లయం వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు. పురాతన వంతెన కావడంతో గతంలో కుప్పకూలిందని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని, ఇంతలో ప్రభుత్వం మారిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడంతో ఇచ్ఛాపురం, పరిసర గ్రామాలు, ఒడిశా గ్రామా ల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నార ని చెప్పారు. ప్రధాన వంతెనగా గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. -
సంతబొమ్మాళి పంచాయతీకి ‘ఐఎస్ఓ’ సర్టిఫికెట్
సంతబొమ్మాళి: సంతబొమ్మాళి గ్రామ పంచాయతీ పరిపాలనలో కార్యాలయం పనితీరు, ప్రజలకు అందించే సేవలు, రికార్డులు, పారిశుద్ధ్యం, తాగు నీటి సరఫరా, వీధిలైట్ల నిర్వహణను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తున్నందున ఐఎస్ఓ –9001–2015 ధ్రువీకరణ పత్రాన్ని కేరళ పరిపాలన సంస్థ ప్రతినిధులు గురువారం అందజేశారు. జిల్లాలో అత్యుత్తమ గ్రీనరీ, ఆహ్లాదకర వాతావరణంలో ఉన్న గ్రామ పంచాయతీగా గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన స్థానిక పరిపాలన వ్యవహారాల సంస్థ డైరెక్టర్ వి.పి.సుకుమార్, రాష్ట్ర పంచాయతీరా జ్ కార్యాలయం అధికారి ఇమాముద్దిన్ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి డి.శ్రీనివాసరావు కు ఐఎస్వో–9001–2015 సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో డివిజనల్ డెవలప్మెంట్ అధికారి అలివేలు మంగమ్మ, ఎంపీడీవో జయంత్ప్రసాద్, తహసీల్దార్ బి.హేమసుందరరావు, మండల స్వర్ణ గ్రామ అధికారి సీహెచ్.లక్ష్మణరావు, పీఏసీఎస్ అధ్యక్షుడు కూచెట్టి కాంతారావు, మాజీ సర్పంచ్ కళింగపట్నం లక్ష్మి పాల్గొన్నారు. -
26న సంగీత విభావరి
శ్రీకాకుళం కల్చరల్: పర్లాకిమిడికి చెందిన చైతన్య మెలోడీస్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో ఈ నెల 26వ తేదీన 12 గంటల పాటు చైతన్య మెలోడీస్ సరిగమలు పేరిట సినీ సంగీత విభావరి నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సింహాద్రి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 45 మంది ఔత్సాహిక గాయనీ గాయకులు గీతాలు ఆలపిస్తార ని పేర్కొన్నారు. చైతన్య సంస్థ ఆధ్వర్యంలో ఒడిశా లో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఈ ఏడాది శ్రీకాకుళం పరిసర ప్రాంత గాయనీ గాయకులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళాకారులు, కళాభిమానులు పాల్గొనాలని కోరారు. టెక్కలి రూరల్ : టెక్కలి జిల్లా ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లే వారికి సాయం అందించే వారు కరువయ్యారు. ఏదైనా ప్రమాదం జరిగి నడవలేని స్థితిలో బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వస్తే స్ట్రెచ్చర్ తెచ్చుకోవడం దగ్గర నుంచి డాక్టర్ వద్దకు వెళ్లడం వరకు మనమే చేసుకోవాలి. సహాయకుల జాడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గురువా రం ఓ యువతి తన కుటుంబ సభ్యుడికి కాలు విరిగిపోతే వైద్యుల వద్దకు తానే స్ట్రెచ్చర్ తీసుకెళ్లడం ఆస్పత్రిలో కనిపించింది. షిరిడీసాయికి ప్రత్యేక పూజలు శ్రీకాకుళం కల్చరల్: బొందిలీపురంలోని దర్బార్ షిరిడీసాయి బాబా మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సంతోష్ బ్రహ్మ, సురేష్ బ్రహ్మ ఆధ్వర్యంలో స్వామివారికి మూడు హారతులు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. -
అలసిపోయారు..
● బారువ తీరం అభివృద్ధి కలేనా..? ● ఏడాది గడిచినా మాటలకే పరిమితమైన అభివృద్ధి ● పనులు ఎప్పుడని ప్రశ్నిస్తున్న స్థానికులు ● హామీలు విని వచ్చి పోయే నౌకలు, రంగూన్కు విరివిగా ప్రయాణాలు, పీచు వస్తువుల ఎగుమతులు, దండిగా వ్యాపారాలు.. స్వాతంత్య్రానికి పూర్వం బారువ తీర వైభవం ఇది. మరి ఇప్పుడో.. మునిగిపోయిన ఓడను చూపించి అభివృద్ధి చేస్తామనే హామీలు, బెంచీలు లేని తీరాన్ని చూపించి మినీ గోవా చేస్తామనే గొప్పలు, రెండు రోజులు పండగలు నిర్వహించి ఏళ్లకు ఏళ్లు మాట మర్చిపోయే వైనాలు. బారువ తీరం హామీలు వినీవినీ అలసిపోయింది. మాటలు తప్ప పనులు లేకపోవడంతో నానాటికీ తీసికట్టుగా మారుతోంది. సోంపేట: జిల్లాలో పొడవాటి తీర ప్రాంతం ఉండి, అభివృద్ధికి అన్ని విధాలా అర్హతలు ఉన్నా బారువ వెనుకబడిపోతోంది. పాలకులు కేవలం హామీలకు మాత్రమే పరిమితం అవుతుండడంతో తీరం అధ్వానంగా మారుతోంది. ఒకప్పుడు బారువ తీరం రాష్ట్రంలో పేరున్న పర్యాటక ప్రదేశం. స్వాతంత్య్రం రాక మునుపు బారువ ఓడ రేవుగా ప్రసిద్ధి చెందింది. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించడం, వస్తువులు రవాణా జరిగేవి. చిల్కా మునకతో.. సుమారు 107 ఏళ్ల కిందట 1917 లో బారువ తీరంలో చిల్కా ఓడ మునిగి పోయింది. ఒడిశా, ఆంధ్రా ప్రాంతాల నుంచి ప్రజలు ఉపాధి కోసం రంగూన్ వెళ్లేవారు. ఈ ప్రాంతంలో తయారయ్యే పీచు, పీచు వస్తువులు, రవాణా చేసేవారు. మద్రాసు నుంచి సుమారు 1700 మంది ప్రయాణికులు, వివిధ వస్తువులతో కూడిన చిల్కా ఓడ బారువ తీరానికి చేరుకుని ఇక్కడి నుంచి గోపాలపూర్ వెళ్లే క్రమంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 80 మంది వరకు మృతి చెందారని, మిగిలిన వారిని కాపాడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఓడ గుర్తుగా ఓ పొగ గొట్టం కనిపిస్తూ ఉంటుంది. అన్ని అవకాశాలు ఉన్నా.. బారువ తీరానికి సుమారు 200 మీటర్ల దూరంలో, సుమారు ఎనిమిది మీటర్ల లోతులో చిల్కా నౌక ఓడ శిథిలాలు ఉన్నాయి. స్కూబా డైవింగ్ శిక్షణతో పర్యాటకులను ఓడ వద్దకు తీసుకువెళ్లే అవకాశం ఉందని గతంలో ఫెస్టివల్కు వచ్చిన స్కూబా డైవర్లు తెలిపారు. ఇది మొదలైతే అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది. పర్యాటక శాఖ దీనిపై దృష్టి పెడితే బారువ తీరం అభివృద్ధి చెందుతుంది. బోటు షికారు.. మహేంద్ర తనయ నదీ సంగమం బారువ తీరంలోనే ఉంది. నదీ సంగమం కలిసే ప్రాంతం నుంచి టి.శాసనాం గ్రామం వరకు బోటుషికారు చేసే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. అలాగే పొడవాటి తీరంలో చిన్న పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు, చిన్న క్రీడా మైదానాలు, మౌలిక వసతులు కల్పిస్తే రిషికొండకు ధీటుగా బారువ తీరం ఉంటుందని స్థానికులు తెలియజేస్తున్నారు. బీచ్ ఫెస్టివల్ హంగామా తప్పితే ఇక్కడ వాస్తవంగా జరిగిన పనులేవీ లేవని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బారువ తీరంలో గత ఏడాది బీచ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఈ తీరాన్ని మినీ గోవాగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు హామీలు గుప్పించారు. ఆ మాటలు నీటి మూటలుగానే మిగిలాయని స్థానికులు చెబుతున్నారు. ఫెస్టివల్ సమయంలో పర్యాటకులు కూర్చోవడానికి ఏర్పాటు చేసిన గుడారాలు పూర్తిగా పాడైపోయాయి. తూతూమంత్రంగా వేసిన విద్యుద్దీపాలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. బీచ్ అభివృద్ధి చేయాలి బారువ బీచ్ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. రిసోర్స్ ఉన్నా పర్యాటకంగా అభివృద్ధి లేకపోవడంతో పర్యాటకుల సందడి తక్కువగా ఉంది. పొడవాటి తీరాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయి. – కర్రి సత్యం, బారువ హామీలకే పరిమితం ఫెస్టివల్ పేరిట హంగామా తప్ప అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇచ్చిన హామీ ప్రకారం బారువ తీరాన్ని అభివృద్ధి చేయడానికి పాలకులు ముందుకు రావాలి. – గురాల శ్రీను, వైస్ఎంపీపీ, బారువ -
సనాతన ధర్మ పరిరక్షకుడు విద్యారణ్యుడు
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని ఉపనిషన్మందిరంలో జరుగుతున్న వజ్రోత్సవాలలో భాగంగా గురు వారం విద్యారణ్య మహర్షుల జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యారణ్యులు రచించిన పంచదశీ గ్రంథంలోని ‘చిత్రదీప ప్రకరణ’ అనే అంశంపై తెన్నేటి విక్రమశర్మ ప్రసంగించారు. విద్యారణ్యులు తన రచనల ద్వారా ధర్మసంస్థాపన, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా సనాతన ధర్మ వ్యాప్తి చేశారని చెప్పారు. విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ఆనాడు మతమార్పిడులను అరికట్టేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావును సత్కరించారు. కార్యక్రమంలో సనపల నారాయణమూర్తి, కోమలరావు, శ్రీమన్నారాయణ, పట్నాయక్, విశ్వేశ్వరరావు, అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు. -
ఇంజినీర్లు కావలెను!
హిరమండలం: వ్యవసాయ అనుబంధ శాఖల్లో జలవనరుల శాఖ కీలకమైనది. సాగునీటి ప్రాజెక్టులు, కాలువ లు, చెరువులు, సాగునీటి వనరులకు సంబంధించి పనులతో పాటు మరమ్మతులను పర్యవేక్షించేది ఆ శాఖే. ఇటువంటి శాఖలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ప్రధానంగా వంశధార ప్రాజెక్టు పరిధిలో ఇంజినీర్ల కొరత అధికంగా ఉంది. దీంతో పనులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం, ఆపై వంశధార ప్రాజెక్టుతో పాటు ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో అవసరానికి సరిపడా ఉద్యోగులు లేక డిప్యుటేషన్లు నడుస్తున్నాయి. ఒక్కో అధికారి రెండు, మూడు బాధ్యతలను చూడాల్సి వస్తోంది. ఫలితంగా పర్యవేక్షణ లేక పనులపై ప్రభావం పడుతోంది. జిల్లాలో జలవనరుల శాఖలో కీలకమైన వంశధార ప్రాజెక్టు పరిధిలో సర్కిల్, హిరమండలం, ఆమదాలవలస–1, 2, నరసన్నపేట, టెక్కలి సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 71 మంది ఇంజినీర్లు ఉంటేనే పూర్తిస్థాయిలో సేవలందుతాయి. ప్రస్తుతం 43 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 28 పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. చివర కు వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఎస్ఈ పోస్టులో పూర్తిస్థాయి అధికారి నియామకం కావడం లేదు. చివరకు ఎస్ఈగా ఈఈనే అదనపు బాధ్యత లు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటీ ఎస్ఈ పోస్టు ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. ఆరుగురు ఈఈలు పని చేయాల్సిన చోట ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఆమదాలవలస 1వ డివిజనల్లో ముగ్గురు, ఇన్వెస్టిగేషన్ లో ఒకరు, హిరమండలం కన్స్ట్రక్షన్ డివిజన్లో 11, మైక్రో ఇరిగేషన్ డివిజన్కు సంబంధించి నరసన్నపేటలో 8, టెక్కలిలో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జలవనరుల శాఖ పర్యవేక్షణ జిల్లా స్థాయిలో ఎస్ఈ బాధ్యత వహిస్తారు. అటువంటి పోస్టులో ఈఈ అదనపు బాధ్యతలు తీసుకొని రెండేళ్లవుతోంది. మధ్యలో ఒక అధికారిని ప్రభుత్వం నియమించింది. సదరు అధికారి రాయలసీమ వైపు వెళ్లిపోయారు. ప్రస్తుతం వంశధార పరిధిలో ఇద్దరు ఈఈ లు, ఇన్వెస్టిగేషన్ విభాగంలో ఒక్క ఈఈ మాత్రమే ఉన్నారు. 13 ఏఈ పోస్టులను సైతం భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే భూగర్భ జలాల సంరక్షణకుగాను ప్రతి నియోజకవర్గంలో జలధార–జలహారతి కింద ప్రభుత్వం కోటి రూపాయలతో పనులు చేయిస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో గ్రోయిన్ల నిర్మాణం చేపడుతోంది. గొట్టా బ్యారేజీ దిగువ పొర్లు ప్రాంతంలో పనులు చేపడుతున్నారు. వీటన్నింటికీ పర్యవేక్షించి పనులు చేయించే ఇంజినీర్లు కావాలి. ఎంబుక్ వివరాలు, బిల్లుల నమోదుకు ప్రస్తుత సిబ్బందిపై భారం పడుతోంది. ఇప్పటికై నా జల వనరుల శాఖలో పూర్తిస్థాయిలో ఇంజినీర్లతో పాటు సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు. జిల్లాలో ఇంజినీర్ల కొరత వాస్తవమే. కానీ వంశధార ప్రాజెక్టు పరిధిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులు చేయిస్తున్నాం. సిబ్బంది కొర త అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సిబ్బంది తక్కువగా ఉన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. – జి.రామచంద్రరావు, ఇన్చార్జి ఎస్ఈ, వంశధార ప్రాజెక్టు -
ఎఫ్సీఎల్–2 టోర్నీ విజేత విశాఖపట్నం
శ్రీకాకుళం న్యూకాలనీ: యువ క్రికెటర్లు, పాఠశాల స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఫోకస్ క్రికెట్ లీగ్ సీజన్–2 పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ ఘనంగా ముగిసింది. జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఏ) పర్యవేక్షణలో రెండు నెలలపాటు 16 ఏళ్లలోపు క్రీడాకారులకు కళింగపట్నం క్రికెట్ మైదానంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ జిల్లా క్రికెట్ సంఘం చీఫ్ సెలెక్టర్ కొట్టిస కిరణ్ సారధ్యంలో జరిగింది. లీగ్ కమ్ నాకౌట్ విధానంలో జరిగిన ఈ టోర్నీలో 20 జట్లు ప్రాతినిధ్యం వహించాయి. గురువారం కళింగపట్నం వేదికగా జరిగిన ఫైనల్ పోరులో ఐసీసీ ఇచ్ఛాపురం, ఆర్డీసీఏ విశాఖపట్నం తలపడ్డాయి. మొదట బ్యాటింగ్కు దిగిన విశాఖపట్నం నిర్ణీత 20 ఓవర్లలో 197 పరుగులు చేయగా, తదుపరి బ్యాటింగ్ చేసిన ఇచ్ఛాపురం జట్టు 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఆర్డీసీఏ విశాఖపట్నం జట్టు ఎఫ్సీఎల్–2 టైటి ల్ దక్కించుకుంది. ముగింపు కార్యక్రమానికి జిల్లా క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్ ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు మరిన్ని టోర్నీలు నిర్వహిస్తామన్నారు. త్వరలో వేసవి క్రీడా శిక్షణా శిబిరాల నిర్వహనకు సంబంధించి వివరాలు వెల్లడిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి మదీనా శైలాని, కౌన్సిల్ మెంబర్ డాక్టర్ సువ్వారి రవికుమార్, సీనియర్ క్రికెటర్ జీపీ నాయుడు, చీఫ్ కోచ్ కె.సుదర్శన్, కోచ్లు ఎం.ఆనంద్, హారిక యాదవ్, రాజా, సీనియర్ క్రీడాకారు లు పాల్గొన్నారు. -
కిడ్నీ రోగులకు వరం పలాస కిడ్నీ ఆస్పత్రి
సోంపేట: పలాసలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన కిడ్నీ ఆస్పత్రి జిల్లాలోని కిడ్నీ రోగు లకు వరం వంటిదని ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ అన్నారు. పలాస కిడ్నీ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చేయించుకుని ఇంటికి చేరుకున్న సోంపేటకు చెంది న హేమశ్రీని గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది రూపాయలు ఖర్చయ్యే శస్త్రచికిత్సలను ఆసుపత్రిలో ఉచి తంగా నిర్వహించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు ఎంతో చేశారని, రూ.700 కోట్లు వెచ్చించి ఇంటింటికి తాగునీరు అందజేసేందుకు శ్రీకారం చుట్టారని, డయాలసిస్ రోగులకు రూ.పది వేల పింఛను అందజేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శిలగాన భాస్కరరా వు, ఎంపీటీసీ పొడుగు కామేష్, పార్టీ నాయకులు రేగు బాలయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
● ఆపత్కాలంలో ఆపన్న హస్తం
ఆ ఇంటిని పోషించిన వ్యక్తి చాన్నాళ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ఆ ఇల్లాలు ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేని మానసిక దుస్థితిలో ఉన్నారు. ముగ్గురు ఆడబిడ్డలు అమ్మానాన్నల దీనస్థితి చూసి కన్నీరు పెట్టడం తప్ప ఇంకేమీ చేయలేకపోతున్నారు. ఈ ఆపత్కాలంలో వారికి వైఎస్సార్ సీపీ నేతలు అండగా నిలిచారు. కవిటి మండలం ఆర్.తొత్తిడిపుట్టుగ గ్రామానికి చెందిన భరత్ ఇంటి పరిస్థితిని స్థానికులు పార్టీ మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆ కుటుంబం పరిస్థితి చూసి చలించిపోయిన ప్రకాష్ ప్రతి నెలా రూ.2000వేలు పెన్షన్ ఇస్తానని మాటిచ్చారు. అన్న మాట ప్రకారం తొలి నెల ఆ డబ్బుతో పాటు మరో రూ.5వేలు, రెండు నెలలకు సరిపడా రేషన్ సరుకులను ఆ కుటుంబానికి అందజేశారు. ఇది కేవలం సాయం కాదు.. ఆ కుటుంబానికి తోడుగా ఒకరు ఉన్నారనే భరోసాను అందజేసింది. – కవిటి -
కూర్మనాథుని కల్యాణానికి అంకురార్పణ
గార : శ్రీకూర్మంలో ఈ నెల 27న ఏకాదశి సందర్భంగా కూర్మనాథుని కల్యాణం జరగనున్న నేపథ్యంలో గురువారం అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం చక్రఆళ్వార్ స్వామి ని ప్రత్యేక ఆసనంపై వేంచింపజేసిన అర్చకులు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, పరిషత్ రక్షాబంధన్, పతాక ప్రతిష్ట నిర్వహించారు. సాయంత్రం గరుడ ధ్వజారోహణం, దేవతాహ్వానం జరిపారు.కార్యక్రమంలో ఆలయ ఈఓ టి.వాసుదేవరావు, ప్రధానార్చకులు సీహెచ్. సీతారామ నృసింహాచార్యులు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శివానీ ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం పీయూ సీ విద్యార్థుల పరీక్ష కేంద్రాన్ని ట్రిపుల్ ఐటీ రిజి స్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ గురువారం పరిశీలించారు. పరీక్షల నిర్వహణపై ఆరా తీశా రు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, సాగర్, సింహాచలం, యోగీశ్వ రీ తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల : పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ అత్యంత ముఖ్యమని, ప్రతి కేంద్రంలోనూ సౌకర్యాలను కల్పించి అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా అబ్జర్వ ర్ డాక్టర్ ఎం.ఎ.వి.రామకృష్ణ ఆదేశించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహణకు సంబంధించి గురువారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్ర తా ఏర్పాట్లు, ప్రశ్నపత్రాల రవాణా, కేంద్రాల పర్యవేక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. జిల్లా సమన్వయకర్త కె.నారాయణరావు మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి పాలిసెట్ను విజయవంతం చేయాలన్నారు. ఎచ్చెర్ల : ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లే వేతనదారులు పనివేళలు పాటించాలని డ్వామా పీడీ లవకుమార్ అన్నారు. ఎచ్చెర్ల మండలం ఎస్ఎంపురంలో జరుగుతున్న ఉపాధి పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత కొలతల ప్రకారం పనిచేస్తే కూలి గిట్టుబాటు అవుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీవో శోభాదేవి, సిబ్బంది పాల్గొన్నారు. -
● అమ్మో.. నిమ్మ
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరిందని, శుక్రవారం జిల్లాలోని 12 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం కొత్తూరు మండలంలో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైన ట్లు వెల్లడించారు. జిల్లాలోని 10 మండలాల్లో తీవ్ర వడగాలులు, 6 మండలాల్లో వడగాలులు వీచాయని పేర్కొన్నారు. ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, కొత్తూరు, లక్ష్మీనర్సు పేట, మందస, నందిగాం, పాతప ట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో శుక్రవారం తీవ్ర వడగాలులు వీస్తాయని, గంగువారి సిగడాం, మెళియాపుట్టి మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్లలోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేసవి సెలవుల దృష్ట్యా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ పాఠశాలలు ఎలాంటి తరగతులు గానీ, శిక్షణ తరగతులు గానీ నిర్వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలను కాలువలు, చెరువులు, నదుల వద్దకు పంపవద్దని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ వాడాలి. తగినంత నీరు, పానీయాలు తీసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడకుండా చూడాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. రహదారి భద్రతా నిబంధనలు పాటించాలి. సెలవుల్లో పిల్లలు నిర్మాణా త్మకమైన, విద్యా సంబంధిత కార్యకలాపాల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో నిమ్మకాయలు, టమాట ధరలు భారీగా పెరిగాయి. 45 రోజుల కిందట కిలో నిమ్మకాయల ధర హోల్సేల్లో రూ.25 నుంచి రూ.30 ఉండేది. రిటైల్లో రూ.40 నుంచి రూ.45 వరకు విక్రయించేవారు. ఇప్పుడిది హోల్సేల్లో రూ.140, రిటైల్లో రూ.150కు అమ్ముతున్నారు. వేసవిలో నిమ్మకాయల ధర పెరగడం పరిపాటే అయినా ఏప్రిల్లోనే ఇంత ధర ఎన్నడూ లేదు. పైగా పెద్ద సైజు నిమ్మకాలు రూ.180 వరకు వెళ్తున్నాయి. అలాగే టమాట ధర కూడా కిలో రూ.25 నుంచి రూ.30 కు చేరుకుంది. ధరలు ఇలా పెరుగుతున్నా అధికారులు వాటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. –శ్రీకాకుళం -
కారును ఢీకొట్టిన లారీ
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కరజా డ వద్ద జాతీయ రహదారిపై గురువారం శ్రీకాకుళం నుంచి ఒడిశా వెళ్తున్న లారీ అదే రూటు లో నరసన్నపేట వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యా యి. ఒక్కసారిగా కారు అమాంతంగా పక్కకు రావడంతో ఇదే మార్గంలో వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. అది నేరుగా వెళ్లి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. గాయపడిన వారిని శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరోగ్యశ్రీతో బాబుకు నో క్రెడిట్.. అందుకే కుట్రలు: సీదిరి
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు తెచ్చే అప్పులు.. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 450 రోజులైనా ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడంలేదని మండిపడ్డారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘ఆరోగ్యశ్రీ పథకం 2006-07లో ప్రారంభమైతే.. కూటమి ప్రభుత్వ కాలంలో రెండు సార్లు ఆగిపోయింది. ఇరవై ఏళ్లలో ఇలాంటి గొప్ప పథకం నిలిచిపోవడం దారుణం. ఆరోగ్యశ్రీ పేరు చెప్పితే చంద్రబాబు నాయుడుకు క్రెడిట్ రావటంలేదు. ఆరోగ్యశ్రీ పేరు చెప్తే రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ గుర్తుకు వస్తున్నారు. అందుకే ఈ పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఆరు నెలలు ఎదురు చూసినా బిల్లులు రాక మళ్లీ స్ట్రైక్ చేశారు. ఆసుపత్రుల నిరసనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతోంది. అప్పులకు సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ను, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలను షూరిటీగా పెడుతున్నారు. ఇంతకంటే అన్యాయం ఎక్కడైనా ఉందా? చంద్రబాబు. ప్రభుత్వం తీసుకున్న అప్పులను ప్రైవేట్ ఆసుపత్రులే చెల్లించాలనే షరతు పెట్టడం దారుణం. రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వం రూ.3.54 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వం నడపడం చేతకాక ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నారు. ఈ మాత్రం దానికి మంత్రులు ఎందుకు? సింగపూర్ పర్యటనలు ఎందుకు?. “సంపద సృష్టి” అంటే చంద్రబాబు భాషలో అప్పులు చేయడమేనని అర్ధం. సంపద సృష్టించలేక అప్పులతోనే పాలన సాగుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని పెట్టుబడిదారులకు లాభదాయక వనరుగా మార్చుతున్నారు. ఇంత దారుణమైన విధానం దేశంలో ఎక్కడా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అన్ని ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తే ఆరోగ్య శాఖ అవసరం ఏంటి?. ప్రతీ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు వైఎస్ జగన్ నిర్మిస్తే చంద్రబాబు వాటిని ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు. ప్రజలపై ఆరోగ్య బిల్లులు పెరుగుతున్నాయి. వాటిని తగ్గించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
కష్టమే మిగులు
కొబ్బరికి తెగులు.. ఏం చేయాలో తెలీడం లేదు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి, ఎంతో కష్టపడి పెంచుతున్న కొబ్బరి మొక్కలు పెరిగి కాయలు కాస్తున్న సమయంలో పురుగు పోటుకి గురవుతున్నాయి. కళ్ల ముందే చెట్లు కుళ్లిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాకు సలహాలు, సూచనలు చెప్పేవారు కరువయ్యారు. – బి.షణ్ముఖరావు, యువ రైతు, పెద్దబొడ్డపాడు, వజ్రపుకొత్తూరు మండలం అడవి పందులు ధ్వంసం చేస్తున్నాయి కొబ్బరి పంటకు ఒక వైపు తెగుళ్లు, పురుగులు సోకుతుండగా మరో వైపు అడవిపందులు సైతం కొబ్బరి చెట్లను ధ్వంసం చేస్తున్నాయి. కొబ్బరి మొక్కలు నాటి వాటికి రక్షణగా కంచె ఏర్పాటు చేసినప్పటికి ప్రయోజనం లేదు. ఎన్నో ఆశతో కొబ్బరి మొక్కలను నాటుతుంటే వీటి బెడదతో పంటలు నాశనం అవుతున్నాయి. – టి.కృష్ణారావు, రైతు, సీతాపురం, వజ్రపుకొత్తూరు మండలం. అవగాహనతోనే అధిక దిగుబడి ఉద్యాన పంటలపై రైతులకు ఆసక్తితో పాటు అవగాహన కూడా అవసరం. ఇప్పటికే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. పంటల్లో అధిక దిగుబడులు సాధించాలంటే యాజమాన్య పద్ధతులు పాటించాలి. కొబ్బరి రైతు, కూలీ ల ప్రయోజనం కోసం కీర సురక్ష పథకం ద్వారా కేవలం రూ.143ల ప్రీమియంతో రూ. 7లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. రైతు సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. – సీహెచ్ శంకర్ దాస్, డివిజన్ ఉద్యాన శాఖాధికారి, వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంత పెద్ద కొడుకుగా పేరు పొందిన కొబ్బరికి ఆపద వచ్చింది. కొబ్బరి పంటకు ఒక వైపు అడవి పందులు, మరో వైపు తెగుళ్లు సోకి ఉద్యాన రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేలాది రూపాయలు ఖర్చుపెట్టి కొబ్బరి మొక్కలను కొనుగోలు చేసి నాటితే మొక్కలు కాపు వచ్చి పంట చేతికి అందుతున్న తరుణంలో కొమ్మ పురు గు, ఎర్రముక్కు పురుగులు ఆశిస్తూ కొబ్బరి మొక్కలను తొలిచేస్తున్నాయి. దీంతో చెట్లు కుళ్లిపోతూ నేల కూలిపోతున్నాయి. అలాగే వజ్రపుకొత్తూరు మండలంలో గల సీతాపురం, పెద్దబొడ్డపాడు, బెండి, కొండవూరు తదితర గ్రామాల్లో అడవి పందులు స్వైర విహారం చేస్తూ కొబ్బరి కందను తినేందుకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కాగా జిల్లా వ్యాప్తంగా 41661.27 ఎకరాల్లో కొబ్బరి పంట సాగవుతోంది. ఉద్దానం ప్రాంతంలో ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 28,389 ఎకరాల్లో సాగవుతుంది. అలాగే రణస్థలం మండలంలో 8803.70 ఎకరాల్లో రైతులు సాగు చేస్తుండగా మిగిలిన పంట ఇతర మండలాల్లో సాగు అవుతుంది. ఇతర పంటలకు భిన్నంగా కొబ్బరి పంట ఏడాది పొడవునా రైతులకు ఆదాయం తెచ్చిపెడుతుంది. దీంతో రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతు ఆశలను ఎర్రముక్కు పురుగులు నమిలి పిప్పి చేస్తున్నాయి. దీంతో ఎదుగుతున్న కొబ్బరి మొక్కలు నాశనమైపోతున్నాయి. చెట్టును తొలుస్తున్న ఎర్రముక్కు పురుగు 5–10 ఏళ్ల వయస్సు కలిగిన కొబ్బరి మొక్కలను ఈ పురుగు ఆశిస్తుంది. ప్రధానంగా తోటలో మొవ్వుకుళ్లు లేదా పిడుగు పాటుతో చనిపోయిన చెట్లు గానీ మొవ్వులో కొమ్మకు పురుగు ఆశించిన చెట్లు తోటలో ఈ ఎర్రముక్కు పురుగులు ఆకర్షిస్తాయి. అలాగే తోటను ట్రాక్టర్ ద్వారా దున్నే సమయంలో గాని పనులు చేస్తున్న సమయంలో గానీ చెట్లు కాండంపై గాయాలు అయితే ఈ పురుగులు ఆశిస్తాయి. లక్షణాలు ● మధ్య వలయంలో ఆకులు పసుపు రంగులో మారుతాయి. లేదా ఎండిపోతాయి. ● కాండంపై రంధ్రాల ద్వారా చిక్కని ముదురు ఎరుపు రంగు జిగురు కారుతుంది. రంధ్రం నుంచి నమిలిన పిప్పి వెలుపలికి వస్తుంది. ● కమ్మ మొదలు వద్ద నిలువుగా చీలుతుంది. ● పీచుతో పురుగు కట్టిన ఉండలు లేక నమిలిన పిప్పి ఆకు వలయాలలో లేక చెట్టు మొదలు వద్ద కనిపిస్తాయి. ● పురుగు ఆశించిన చెట్టు కాండముపై చెవి ఆన్చితే లోపల లద్దె పురుగులు కాండంను తినే శబ్దం వినిపిస్తుంది. కొబ్బరి చెట్టుకి ఆశించిన ఎర్రముక్కు పురుగులు యాజమాన్య పద్ధతులు ఈ పురుగు ఆశించి చనిపోయిన చెట్టు మానులను వెంటనే తొలగించాలి. లేదా చీల్చి తగలబెట్టాలి. తోటలో కొమ్మ పురుగు ఆశించిన మొవ్వుల నుంచి పురుగును తొలిగించి 100 గ్రాముల వేపపిండి, 150 గ్రాముల ఇసుక కలిపి మిశ్రమాన్ని ఆ రంధ్రాల్లో పెట్టాలి. సకాలంలో ఈ పురుగును గమనించి 10 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాన్, 10 మిల్లీలీటర్ల నీటిలో కలిపి వేరు ద్వారా మందు ఎక్కించాలి. మందు వేసిన 45 రోజుల వరకు కొబ్బరి కాయలు వినియోగించరాదు. ఎర్రముక్కు పురుగు గుంపుగా ఆకర్షించు కృత్రిమ ఎరను బకెట్లో ఉంచి కొబ్బరి కాండానికి 1.50 మీటర్ల ఎత్తులో అమర్చిన,ఎర్రముక్కు తల్లి పురుగులు ఆకర్షితమై బకెట్ లోపల గల విష ఆహారంలో పడి చనిపోతాయి. సగం డొల్ల అయిన కాండంలోని చెత్త,కుళ్లు పదార్థాన్ని శుభ్రం చేసి సిమెంట్, రాళ్లు, ఇసుక మిశ్రమంతో పూతగా పూయాలి. జిల్లా వ్యాప్తంగా 41661.27 ఎకరాల్లో కొబ్బరి సాగు కొబ్బరి పంటను ఆశిస్తున్న తెగుళ్లు ఒకవైపు అడవి పందులు.. మరో వైపు తెగుళ్ల బెడద ఆందోళనలో రైతులు -
‘ప్రభుత్వ పాఠశాలలే మిన్న’
నరసన్నపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని స్థాయిల్లో రాణించాలన్నా, ఆత్మ స్థైర్యంగా ఉండాలన్నా ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్చించాలని ఆర్జేడీ విజయ భాస్కర్ అన్నారు. మండలం సత్యవరంలో బుధవారం ఆయన ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి వారికి ప్రభుత్వ పాఠశాలల పనితీరును వివరించి పాఠశాలల పటిష్టతకు సహకరించాలని కోరారు. అనంతరం స్కూల్ ఆవరణలో నరసన్నపేట మేజరు పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు. జీతం కోసం కాకుండా మానవతా దృక్పథంతో ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. మాజీ సైనికుల సంక్షేమానికి ‘వీర్ పరివార్’ భరోసా శ్రీకాకుళం పాతబస్టాండ్: మాజీ సైనికులు వారి కుటుంబాల సంక్షేమానికి, వారి న్యాయపరమై న సమస్యల పరిష్కారానికి ‘నల్సా వీర్ పరివా ర్ సహాయత యోజన–2025’ ఒక చక్కటి వేదిక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పేర్కొన్నారు. బుధ వారం స్థానిక పెద్దరెల్లి వీధిలో ఉన్న జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సైనిక సంక్షేమ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘లీగల్ సర్వీస్ క్లినిక్’ ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఉద్దానం పైపులైన్ల లీకేజీలు అరికట్టాలి
● జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సమస్యల ప్రస్తావన శ్రీకాకుళం: ఉద్దానం ప్రాంతంలో తాగునీటి పైపులైన్ల లీకేజీలు లేకుండా అరికట్టాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పిరియా విజయ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జెడ్పీ సీఈఓ వెంకటరామన్ లతో కలిసి బుధవారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. భూ గర్భ జలాల సమస్య లేకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీలో అందరికీ కార్డులు అందజేయాలని కలెక్టర్ సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల అధికారులు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కావాలని, ఈ విషయంపై ప్రిన్సిపాల్ సెక్రటరీకి తెలియజేయాలని శాసన సభ్యులు కూన రవి కుమార్, నిమ్మక జయకృష్ణ సూచించారు. సీతంపేట ఐటీడీఏ పీఓతో కలిసి సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. వంగర మండలంలో ఉన్న ఉపాధి హామీ సమస్యలను జెడ్పీటీసీ ఉత్తరావల్లి సురేష్ బెనర్జీ తెలియజేయగా విజయనగరం జిల్లా డ్వామా పీడీకి తెలియజేస్తానని జెడ్పీ సీఈఓ వెంకట్రామన్ తెలిపారు. హిరమండలం నుంచి తాగునీరు ఉద్దానంకు ఇస్తున్నారని, కానీ హిరమండలంలో తాగునీరు పూర్తిస్థాయిలో అందించడం లేదని జెడ్పీ చైర్ పర్సన్ తెలిపా రు. జెడ్పీటీసీ దువ్వాడ వాణి మాట్లాడుతూ టెక్కలిలో తాగునీటి పైపులకు ఉన్న లీకేజీలు అరికట్టాలని కోరగా లీకేజీలు లేకుండా చూస్తామని ఎస్ఈ చెప్పారు. సంతబొమ్మాళి మండలంలో తా గునీటి సమస్య గురించి జెడ్పీటీసీ చెప్పగా శాశ్వత పరిష్కారం కింద తాగునీరు ప్రాజెక్టు చేపడుతున్నట్లు ఎస్ఈ చెప్పారు. ట్యాంక్ల క్లోరినేషన్పై జెడ్పీ చైర్పర్సన్ అధికారులను నిలదీశారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ జేజేఎం ప నులు చేయని కాంట్రాక్టర్లను రద్దు చేయాలన్నారు. సాంఘిక సంక్షేమ వసతి భవనాల వద్ద పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని జెడ్పీటీసీ దువ్వాడ వాణి చెప్పగా, శ్లాబ్లపై రక్షణ గోడలు కొద్దిగా ఎత్తు పెంచాలని ఎమ్మెల్యే కూన రవి కుమార్ చెప్పారు. దువ్వాడ వాణి వేసిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు ఉంటే దానికి అనుగుణంగా పరిశ్రమలు రావాలని, అందుకు ప్రభుత్వ భూ ములైతే అది ప్రభుత్వం చూసుకుంటుందని, ప్రైవే టు ల్యాండ్ అయితే భూ సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లా సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు. పత్రికలో వచ్చిన కథనంపై తాను స్వయంగా వెళ్లి పరిశీలించానని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సీకేడీ మందులు గత 8 నెలలుగా సరఫరా చేయడం లేదని జెడ్పీ చైర్ పర్స న్ పిరియా విజయ తెలిపారు. సోంపేటలో డయా లసిస్ యూనిట్ మరమ్మతులకు గురైందని తక్షణమే మరమ్మతులు చేయాలని సోంపేట జెడ్పీటీసీ కోరారు. కవిటి, సోంపేట, పాతపట్నంలో లో వోల్టేజీ సమస్య ప్రస్తావనకు వచ్చింది.మాట్లాడుతున్న జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయమాట్లాడనివ్వకుండా.. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, జెడ్పీటీసీలను మాట్లాడనివ్వకుండా కూటమి ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలను ప్రస్తావిస్తున్నప్పుడు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ఎన్.ఈశ్వరరావు, గొండు శంకర్లు ఏ సమస్య ప్రస్తావించినా అడ్డు తగలడంతో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు -
రైతును విస్మరిస్తే పుట్టగతులు ఉండవు
● ప్రారంభానికి నోచుకోని విత్తన శుద్ధికేంద్రం ● కేంద్రాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ నాయకులు నందిగాం: జిల్లాలో రైతులకు మేలు చేసే విత్తన శుద్ధి, నిల్వ కేంద్రాన్ని ప్రారంభించకుండా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తాత్సారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ అన్నారు. బుధవారం మండలంలోని శివరాంపురం పంచాయతీ బడబంద గ్రామ పరిధిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిర్మించిన విత్తన శుద్ధి, నిల్వ కేంద్రాన్ని ఆయన పలువురు పార్టీ నాయకులు, రైతులతో కలిసి సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ హయాంలో జిల్లాలో విత్తన శుద్ధి కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో టెక్కలి డివిజన్ నందిగాం మండలం బడబందలో మరో విత్తన శుద్ధి, నిల్వ కేంద్రం ఐదు ఎకరాల్లో ఏర్పాటుకు రూ.10కోట్లు మంజూరు చేశారని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రూ.4.7 కోట్లతో భవనం నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశా రు. ప్రభుత్వ మారాక ఈ కేంద్రానికి పరికరాలు ఏర్పాటు చేయలేదని, వ్యవసాయ శాఖ మంత్రి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కేంద్రం ప్రారంభమైతే వైఎస్ జగన్కు పేరు వస్తుందనే అక్కసుతోనే అలా వదిలేశారని దుయ్యబట్టారు. 10వేల మెట్రిక్ టన్నుల విత్తనాల నిల్వ సామర్థ్యం, సుమా రు 5వేల హెక్టార్లకు విత్తనాలు సరఫరా చేసుకునే అవకాశం ఉన్నా ఈ కేంద్రాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ప్రాంత రైతులకు ఆఫ్ఫోర్ ప్రాజెక్టు మంజూరు చేస్తే, అది పూర్తి చేయడానికి రెండుసార్లు మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడు ఎందుకు పూనుకోవడం లేదన్నా రు. నందిగాం మండలంలో మీరు చేసిన అభివృద్ధి, జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధిపైన బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. విత్తన శుద్ధి కేంద్రాన్ని పరిశీలించడానికి వస్తుంటే పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, రైతుల బాగోగులు చూడకుండా సింగపూర్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. సందర్శనలో ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, యర్ర చక్రవర్తి, చిన్ని జోగారావు, పోలాకి మోహనరావు, తమిరె ఫాల్గుణరావు, జడ్యాడ జయరాం, కణితి నారాయణమూర్తి, అంబోడి విష్ణు, తమిరె రాజు, అన్నెపు రామారావు. ఎస్ హేమసుందరరాజు, నూక సత్యరాజు,ఎస్ వినోద్, శివారెడ్డి,భాను, సతీష్, కాళ్ల సంజీవరావు, కోత సతీష్, కిల్లి అజయ్,అక్కురాడ లోకనాధం, టెక్కలి విమల, కర్నిక జీవనరావు,తమిరె దేవేంద్ర, బొంగి హనుమంతురావు, దీర్ఘాశి కృష్ణారావు, పిన్నింటి జయరాం,నందదిగాం మహేష్,పినకాన తులసయ్య, కణితి కేశవరావు, ఉప్పాడ వెంకటరావు, అట్టాడ అప్పన్న, రేగల కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
వేస్ట్ ఆయిల్.. బెస్ట్ ఐడియా
కవిటి: ముత్యాలపేటకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి పాతిన ఉమాశంకర్ వినూత్నంగా ఆలోచించాడు. గ్యాస్ లేని వారంతా కట్టెల పొయ్యితో అవస్థలు పడుతుంటే.. ఆయన మాత్రం ప్రత్యామ్నాయ గ్యాస్ను తయారు చేయడంపై దృష్టి పెట్టాడు. ఆ దిశగా ప్రయత్నాలు చేసి విజయం సాధించాడు. బుక్ చేయడం, ఎదురు చూడడం వంటి అవస్థలతో పని లేకుండా తనే సొంతంగా గ్యాస్ తయారు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతతో కవిటిలో నిర్వహిస్తున్న రామేశ్వరం కేఫ్ కూడా మూతపడింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చిన చెఫ్లకు పోషణ భారంగా మారింది. దీంతో వారిని కొద్ది రోజులు సెలవుపై ఇంటికి వెళ్లి రావాలని పంపించి బాగా ఆలోచించాడు. ఆర్మీలో పనిచేసిన రోజుల్లో తన అనుభవంలో ఉన్న ఆలోచనను వెల్డింగ్ వర్క్ చేస్తున్న తన మిత్రుడు రాజేష్తో పంచుకున్నాడు. ఇద్దరూ తమ అభిప్రాయాల్ని చర్చించుకొని తమకున్న ప్రత్యామ్నాయ ఇంధనంతో గ్యాస్ స్టవ్ చేసే పనిని చేయగలిగే ఓ పొయ్యిని తయారు చేశారు. ● లారీలు, బస్సులు, ఆటోలు తదితర వాహనాలలో వాడేసి తొలగించిన వేస్ట్ ఆయిల్తో ఈ పొయ్యి పనిచేసేలా ఓ స్టవ్ డిజైన్ తయారు చేశారు. ● ఓ ఆయిల్టిన్ను ట్యాంకర్గా మార్చి స్టాండ్పై ఎత్తుగా అమర్చారు. ● అందులో 15 లీటర్ల వేస్ట్ ఇంజిన్ ఆయిల్ నింపారు. ● దాని నుంచి స్టవ్ బర్నర్ వద్దకు ఆయిల్ ప్రసరించి దాన్ని నిప్పుతో మండించే ఏర్పాటుచేశారు. ● ఆ స్టవ్ బర్నర్కు ఓ ఎయిర్ బ్లోయర్(ఎలక్ట్రిక్)సాయంతో నిరంతరం గాలిని అందించేలా ఏర్పాటు చేశారు. ● దీంతో బర్నర్ వద్ద గ్యాస్ స్టవ్ కంటే అత్యధికమైన మంట వెలువడుతోంది. ● ఈ 15 లీటర్ల వేస్ట్ ఆయిల్తో మూడు రోజుల పాటు రోజుకు రెండుసార్లు లెక్కన 60 కిలోల బిర్యానీ తయారు చేయగలుగుతున్నారు. ● ఇన్స్టంట్ చికెన్ ఐటెం తయారీకి గ్యాస్ స్టవ్ వాడి వంటకాలు చేస్తున్నారు. ● పెద్ద పరిమాణంలో తయారు చేసే వంటలకు వేస్ట్ ఆయిల్తో నడిచే స్టవ్ను వినియోగిస్తున్నారు. ● గతంలో మూడు రోజులకు ఓ గ్యాస్ సిలెండర్ వినియోగించే పరిస్థితి ఉండేది. దాని ధర రూ.2200. ● ఈ ప్రయోగం ద్వారా మూడురోజులకు అయ్యే వంటకోసం ఖర్చు రూ.400 మాత్రమే. ● బడ్జెట్ ఫ్రెండ్లీ వేస్ట్ ఆయిల్ స్టవ్తో ఉమాశంకర్ చేస్తున్న వ్యాపార ప్రయాణం పలువురికి మార్గదర్శకంగా మారింది. ● ఈ వేస్ట్ ఆయిల్ స్టవ్ను.. విశ్రాంత ఆర్మీ ఉద్యోగి పాతిన ఉమాశంకర్ దాన్ని ఎకనామికల్ ఫ్రెండ్లీగా కూడా మార్చుకున్నారు. ఎక్కడో.. ఎవరెవరి మధ్యనో యుద్ధం జరుగుతుంటే.. ఇక్కడ హొటళ్లు మూతపడుతున్నాయి. సిలిండర్లు లేక, ఉన్నవి రాక, వంటలు సాగక చాలా భోజన శాలలకు తాళాలు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన ఆ హొటల్ను తిరిగి తెరిచింది. వాహనాల వ్యర్థ ఆయిల్తో వంట చేయవచ్చనే వినూత్న యోచన వారి బతుకు బండిని మళ్లీ పట్టాలు ఎక్కించింది. విశ్రాంత సైనికుడి ఆలోచనకు ఇప్పుడు అంతా సలామ్ కొడుతున్నారు. వాహనాల నుంచి తీసిన ఇంజిన్ ఆయిల్ మంటతో వంటలు గ్యాస్కు ప్రత్యామ్నాయంగా వేస్ట్ ఆయిల్ వినియోగం గ్యాస్ లేక మూతపడిన హోటల్ను తిరిగి నడిపిస్తున్న వైనం విశ్రాంత సైనికుడి ఆలోచనకు సర్వత్రా ప్రశంసలు ఆర్మీలో పనిచేసేటప్పుడు చూశా.. నేను ఇండియన్ ఆర్మీలో సుదీర్ఘకాలం పనిచేశాను. ఇటీవలే ఉద్యోగ విరమణ పొందాను. ఉన్న ఊరిలో ఉండాలనే ఆలోచనతో మరో ఉద్యోగం కోసం ఆలోచించలేదు. రెడీమేడ్స్ వస్త్రవ్యాపారం, రామేశ్వరం కేఫ్ అనే హోటల్ను నడుపుతున్నాను. ఇటీవల వచ్చిన గ్యాస్ కొరత.. నా ఉద్యోగ సమయంలో చూ సిన ఈ వేస్ట్ ఆయిల్ గ్యాస్స్టవ్ వైపు ఆలోచన చేసేలా చేసింది. నా మిత్రుడు రాజేష్తో నా ఆలోచనను పంచుకున్నాను. ఇద్దరి ఆలోచనలు కలిశాయి. నా వ్యాపారానికి ఆటంకం తొలగించింది. – పాతిన ఉమాశంకర్, హోటల్ నిర్వాహకుడు, కవిటి -
‘తప్పెటగుళ్లు ప్రాచీన కళారూపం’
పలాస: ఉత్తరాంధ్ర జానపద కళల్లో తప్పెటగుళ్లు అత్యంత ప్రాచీన కళారూపమని రంగం ప్రజాసాంస్కృతిక వేదిక అధ్యక్షుడు రంగం రాజేష్ చెప్పారు. పలాసలో బుధవారం ప్రభు త్వ జూనియర్ కళాశాల ఆవరణలో తప్పెటగుళ్లు శిక్షణ తరగతులు ఘనంగా జరిగాయి. ఈ శిబిరాన్ని రంగం రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో సినీనటుడు డాక్టరు కుమార్నాయక్, రంగం జిల్లా అధ్యక్షుడు కొర్రాయి శ్రీకాంత్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. యాదవ కుల సంస్కృతి సంప్రదాయాల నుంచి పుట్టిన ఈ తప్పెటగుళ్లు కేవలం వినోదం మాత్రమే కాదని, ఇందులో దాగి ఉన్న లయ, దరువు, శారీరక విన్యాసాలు అద్భుతమని పేర్కొన్నారు. ఈ ప్రయత్నం వల్ల మరుగున పడిపోతున్న కళాకారులకు తగిన గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘కార్మికుల ప్రయోజనాల కోసమే చేనేత క్లస్టర్లు’పొందూరు: ఖాదీ, చేనేత రంగాల్లో వడుకు, నేత కార్మికుల ప్రయోజనాల కోసం క్లస్టర్ల ఏర్పాటు తప్పనిసరని ఎన్ఆర్ఎల్ఎం జాతీయ మిషన్ మేనేజర్(న్యూఢిల్లీ) జావర్ధాన్ అన్నా రు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఖాదీ, చేనేత కార్మికుల స్థితిగతులు, ప్రయోజనాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సెర్ప్ అధికారులతో కలిసి పొందూరులో పర్యటించారు. ఆంధ్రా ఫైన్ ఖాదీ కార్మిక సంఘం(ఏఎఫ్కేకే) మాస్టర్ వీవర్స్, ప్రైవేటు ఖాదీ సంస్థలను కలిశారు. పొందూరులో త్వరలో క్లస్టర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్లస్టర్ ఏర్పాటుపై ఏఎఫ్కెకె సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరప్రసాద్, దండా వెంకటరమణ, ప్రైవేటు ఖాదీ సంస్థ నిర్వాహకుడు బండారు జైప్రతాప్కుమార్, మాస్టర్ వీవర్లు, కార్మికుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సెర్ప్ లైవ్లీహుడ్ డైరెక్టర్ పద్మావతి, సెర్ప్ అడిషనల్ డైరెక్టర్ మహిత, ఎగ్జిక్యూటివ్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపిక
పలాస: పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ ఏడాది హెచ్ఈసీ గ్రూప్ విద్యార్థిని ఎస్.డేనియా ప్రీతి ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో టాపర్గా నిలిచి షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికై ంది. 1000 మార్కులకు 975 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించడంతో పురస్కారానికి అర్హత సాధించింది. ఈమె స్వగ్రామం నందిగాం మండలం విసంపల్లి. తండ్రి నాగేశ్వరరావు ఉపాధ్యాయుడు, తల్లి జయమ్మ గృహిణి. ఈ సందర్భంగా ప్రీతి మాట్లాడుతూ సివిల్స్ సాధించడమే తన లక్ష్యమన్నారు. పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. ఆయన బుధవారం సాయంత్రం జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని కలెక్టర్ తన కార్యాలయం నుంచి జూమ్ ద్వారా నిర్వహించారు. కాలుష్య నియంత్రణ మండలి, లీగల్ మెట్రాలజీ విభాగాల్లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఆమదాలవలస, నరసన్నపేట, టెక్కలి నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులకు ఏప్రిల్ నెలాఖరులోగా శంకుస్థాపనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. రెడ్డి వేదితకు పురస్కారం హిరమండలం: పరిపాలనతో పాటు ఉత్తమ ప్రజాసేవలు అందించినందుకుగాను సివిల్ సర్వీసెస్ అధికారి రెడ్డి వేదిత ఢిల్లీ ప్రభుత్వం నుంచి పురస్కారం అందుకున్నారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ముఖ్యమంత్రి జనసేవా సదన్లో జరిగిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ సర్దార్ తరంజిత్ సింగ్ సంధు, సీఎం రేఖాగుప్తా చేతులమీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. వేదిత తండ్రి దివంగత రెడ్డి నాగభూషణం కూడా సివిల్ సర్వీసెస్ అధికారిగా సేవలందించారు. తల్లి రెడ్డి శాంతి పాతపట్నం మాజీ ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జితో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వేదితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. -
పీజీ తెలుగు పాఠ్యాంశంలో ‘నీటిగింజల పంట’ కవిత
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లాకు చెందిన వర్ధమాన రచయిత, ఉపాధ్యాయుడు కంచరాన భజంగరావు రాసిన ‘నీటి గింజల పంట’ కవితకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కృష్ణా యూనివర్సిటీ(మచిలీపట్నం)లోని ఎంఏ తెలుగు మూడో సెమిస్టర్ సిలబస్లో దీన్ని పాఠ్యాంశంగా చేర్చారు. ఇటీవల జరిగిన ఆ వర్సిటీ తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్(బీఓఎస్)లో సంబంధిత నిపుణులు దీనికి ఆమోదముద్ర వేశారు. డాక్టర్ ఎన్వీ కృష్ణారావు(ఆచార్య నాగార్జున వర్శిటీ), డాక్టర్ సుంకర గోపాలయ్య (ఉన్నత విద్యామండలి సిలబస్ కమిటీ సభ్యులు), వర్సిటీ తెలుగుశాఖాధిపతి, ఇతర సభ్యులతో కూడిన బీఓఎస్ ఎంఎ (తెలుగు) పాఠ్యాంశాన్ని సమీక్షించి నూతనంగా చేర్పులు, మార్పులు చేశారు. అందులో నీటిగింజల పంట కవితను మూడో సెమిస్టర్లో పొందుపరిచారు. ఈ గుర్తింపుపై ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు స్పందిస్తూ కళింగాంధ్ర బతుకు చిత్రానికి పట్టం కట్టిన నీటిగింజల పంటకు వర్సిటీ స్థాయిలో సుమిచిత స్థానం లభించినట్టు అయ్యిందన్నారు. కంచరాన భుజంగరావుకు ఈ గుర్తింపు లభించడంపై సహచర ఉపాధ్యాయులు, సాహితీ మిత్రులు అభినందనలు తెలియజేశారు. -
యువతి ఆత్మహత్యాయత్నం
టెక్కలి రూరల్: సంతబొమ్మాళి మండలం నావాబుపేట గ్రామానికి చెందిన యువతి బుధవారం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఇంట్లో వచ్చిన చిన్నపాటి తగాదా కారణంగా మనస్తాపానికి గురై ఫ్యాన్కి ఉరివేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు కిందకు దించి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. నౌపడ పోలీసులు వివరాలు సేకరించారు. ముద్దాయిల ఆరోగ్యంపై దృష్టి గార: జైలులో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల ఆరోగ్య సంరక్షణలో నిర్లక్ష్యం వద్దని, వారికి నాణ్యమైన ఆహారం అందేలా చూడటం అధికారుల బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. బుధవారం అంపోలు జిల్లా జైలును తనిఖీ చేశారు. బ్యారక్లను సందర్శించి ముద్దాయిలతో మాట్లాడారు. కేసుల్లో ఉచిత న్యాయ సహాయం అందుతున్న తీరు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడి ఉన్న కుటుంబాలకు అండగా నిలిచే స్పృహ పథకం విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో జిల్లా జైలర్ దివాకర్నాయుడు, చీఫ్ ఎల్ఏడీసీ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత నరసన్నపేట: పోలాకి మండలం మబగాం గ్రామస్తుల చిరకాల కోరిక ఉమా మాధవస్వామి(వల్లభనారాయణ స్వామి) ఆలయ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం నిర్వహించిన పందిరిరాట కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. మే 6 నుంచి 9 వరకూ ప్రతిష్ట మహోత్సవాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ధర్మాన గజలక్ష్మి, పద్మప్రియ, రామ్మనోహర్నాయుడు, రామలింగన్నాయుడు దంపతులు పాల్గొన్నారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి గాయాలు బూర్జ: పాలకొండ–శ్రీకాకుళం ప్రధాన రహదారిలో లక్కుపురం కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్.ఎన్.పేట మండలం కొత్త బాలేరు గ్రామానికి చెందిన సవర లింగయ్య గాయపడ్డాడు. లింగయ్య తన స్వగ్రామం నుంచి పాలకొండ వెళుతుండగా శ్రీకాకుళం వైపు వెళుతున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తల, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ ఎస్.ఎన్.మూర్తి తెలిపారు. -
రైలు నుంచి జారిపడి మహిళకు గాయాలు
పాతపట్నం: పాతపట్నం రైల్వేస్టేషన్లో రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు నుంచి దిగుతూ జారిపడి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం రూర్కెలా నుంచి గుణుపూర్ వస్తున్న రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు పాతపట్నం రైల్వేస్టేషన్లో ఆగుతుండటంతో మెళియాపుట్టి మండలం సుందరాడ గ్రామానికి చెందిన సుమిత్ర పండి రైలు దిగుతుండగా కాలుజారి కింద పడింది. ఫ్లాట్పాం, రైలు మధ్య ఉండిపోవడంతో తలకు, ఎడమ చేయికు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. -
పుస్తక నేస్తం.. జీవన సర్వస్వం
నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం ● దారిచూపే దీపంగా పుస్తకాలు ● సాంకేతిక యుగంలోనూ వన్నెతగ్గని వైనం పఠనం తప్పనిసరి.. పుస్తకం చదవడం వ్యసనంలా మారింది. నా 88 ఏళ్లు వయస్సులో ఎన్నో పుస్తకాలు చదివాను. ఇంకా చదువుతునే ఉంటాను. దానివల్ల కూడా రచయితగా మారాను. – డాక్టర్ నిక్కు అప్పన్న, రిటైర్డ్ ప్రొఫెసర్, శ్రీకాకుళం ఇచ్ఛాపురం రూరల్/శ్రీకాకుళం కల్చరల్: పుస్తక పఠనం ఓ మంచి అనుభూతి.. ఓ మథనం.. ఓ చైతన్యం.. వెరసి అనుభవాల సారం. ప్రతి పుస్తకంలో ఓ జీవితం దాగుంటుంది. పుస్తకమా..పుస్తకమా.. నిన్ను చదవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే...‘తల దించుకుని నన్ను చదువు...జీవితంలో నిన్ను తలెత్తుకుని జీవించేలా తయారు చేస్తా’ అంటుందట పాఠకుడితో. విజేతల్ని మీ అభిరుచి ఏంటని ప్రశ్నిస్తే ఎక్కువ మంది ఠక్కున చేప్పే సమాధానం పుస్తక పఠనమనే.. జీవితంలో వెలుగులు నింపే గొప్ప అస్త్రం పుస్తకం. మారుతున్న కాలానికనుగుణంగా ప్రస్తుతం పిల్లల్లో పుస్తక పఠనం అలవాటు క్రమంగా తగ్గుతోంది. ఆన్లైన్ అభ్యసనంతో పట్టుమని పది నిమిషాలు కూడా విద్యార్థులు పుస్తకాలు చదవలేకపోతున్నారు. ఇంకొందరు మాత్రం పుస్తకాలపై ప్రేమ చూపుతునే ఉన్నారు. తాము కొనుగోలు చేసిన, సేకరించిన పుస్తకాలతో ఇంట్లోనే లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటున్నారు. రోజులో సగభాగం అందులోనే గడుపుతుంటారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. నేడు ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రత్యేక కథనం.. పుస్తకాలతో ప్రయోజనాలివే.. ● ఒంటరి తనం పారదోలి మంచి స్నేహితులుగా వ్యవహరిస్తాయి. ● ఏకాగ్రత పెరుగుతుంది. విషయాన్ని శ్రద్ధగా చదవడం అలవాటవుతుంది. ● పద సంపద వృద్ధి చెంది భాషపై పట్టు పెరుగుతుంది. ● భావ వ్యక్తీకరణకు దోహదం చేస్తుంది. ● ప్రాపంచక విషయాలు తెలుస్తాయి. లోకజ్ఞానం రెట్టింపవుతుంది. ● విజేతల ఆత్మకథలు చదివినప్పుడు స్ఫూర్తి, ప్రేరణ పొందవచ్చు. ● పరాజితుల అనుభవాలు సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. ప్రోత్సహించాలి.. కరోనా నుంచి చాలా మంది రచయితలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నారు. పుస్తకాన్ని కొని చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోవడం బాధాకరం. పిల్లల్లో పుస్తక పఠనాన్ని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సాహించాలి. – అట్టాడ అప్పలనాయుడు, రచయిత ఇంట్లోనే గ్రంథాలయం పుస్తకాలు చదడం చిన్నప్పటి నుండే అభిరుచిగా మారింది. ఎక్కడ కొత్త పుస్తకం కనబడినా వెంటనే కొనేయడం అలవాటైంది. మిత్రులు, సాహితీవేత్తలు కానుకగా ఇచ్చిన పుస్తకాలతో ఇంట్లోనే ఓ చిన్నపాటి గ్రంథాలయం ఏర్పాటైంది. – బెందాళం కృష్ణారావు, సాహితీవేత్త -
ఏడు తులాల బంగారం చోరీ
సారవకోట: బైదాలాపురంలో సోమవారం రాత్రి యాళ్ల రాము ఇంట్లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 7 తులాల బంగారం పట్టుకుపోయారని బాధితులు బుధవారం సారవకోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అడ్డపనస గ్రామానికి చెందిన పల్లి పావని కన్నవారి గ్రామమైన బైదాలాపురం సోమవారం వచ్చింది. రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తన పుస్తెలతాడును, ఇంట్లో చిన్న బాక్స్లో ఉన్న మరో పుస్తెలతాడును దొంగలు దోచుకుపోయారు. పోలీసులకు సమాచారమివ్వగా ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. బుధవారం రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయగా నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన కొత్త బ్యాచ్ను జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ బుధవారం ప్రారంభించారు. లైట్ వెహికల్ లైసెన్స్ ఒక సంవత్సరం అనుభవం కలిగి 21 ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు. 40 రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఫీజు ఇతర వివరాలకు 9390886033 నంబరును సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ ఏ.అమరసింహుడు, అకౌంట్స్ ఆఫీసర్ ఇ.జి.రాజు, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ పాల్గొన్నారు. -
విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్య
వజ్రపుకొత్తూరు: బెండిగేటు రైల్వే ట్రాక్ వద్ద మంగళవారం రాత్రి గూడ్స్ రైలు కిందపడి నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన విశ్రాంత సీఆర్పీఎఫ్ జవాను బగాతి హిమంత్రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ పోలీసుల కథనం మేరకు.. హిమంతరావు కొంతకాలంగా విశాఖపట్నంలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. మద్యానికి బానిసై అనారోగ్యం పాలైన ఆయన ఇటీవల జడ్యాడకు వచ్చాడు. హెపటైటిస్ వ్యాధితో మానసికంగా బాధపడేవాడని, అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు జీఆర్పీ పోలీసులకు తెలియజేశారు. జీఆర్పీ పోలీసులు బుధవారం శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రూడ్స్ రైలు లోకో పైలట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. -
బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి
సోంపేట: సోంపేట పట్టణంలోని పెద్దకోమటి వీధి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాసపురం గ్రామానికి చెందిన బడ్డి పున్నాలు (78) అనే వృద్ధురాలు మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పున్నాలు సోంపేట పట్టణంలో ఆకుకూరలు, పువ్వులు అమ్ముతుండేది. ఎప్పట్లాగే బుధవారం ఉదయం పెద్ద కోమటి వీధి వద్ద బారువ నుంచి కంచిలి వైపు వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఈమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు బైరాగి ఫిర్యాదు మేరకు సోంపేట ఎస్ఐ మోహిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పున్నాలు 78 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా ఉండేది. పూలు, ఆకుకూరలు విక్రయిస్తూ కుటుంబానికి చేదోడుగా నిలిచేది. ఈమె మృతితో సోంపేట, పలాసపురంలో విషాదచాయలు అలముకున్నాయి. -
చీపురు పంట దగ్ధం
● రూ.15 లక్షల ఆస్తినష్టం ● లబోదిబోమంటున్న గిరిజనులు హిరమండలం: కొండపోడులో భాగంగా చేపట్టిన చీపురు పంట అగ్నికి ఆహుతి కావడంతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయారు. హిరమండలం మండలంలోని గొడియాపాడు గిరిజన గ్రామంలో గిరిజనులు పెద్ద ఎత్తున చీపురు పంట సాగు చేస్తున్నారు. పంట చేతికందుతున్న సమయంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేసవి గాలులకు మంటలు పూర్తిగా వ్యాపించాయి. కళ్లెదుటే పంట కాలిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో గిరిజనులు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనలో సవర చిన్నికి చెందిన 2.7 ఎకరాలు, సవర గుడమకు చెందిన 3 ఎకరాలు, సవర చిన్నసొడంగకు చెందిన 3.4 ఎకరాలు, ఊయక సంధ్యకు చెందిన 2.4 ఎకరాలు, ఆరిక గౌరమ్మకు చెందిన 2 ఎకరాలు కాలిపోయాయి. సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అంచనా. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే
● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం రూరల్: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమని, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ప్రకారం కూడా వైఎస్సార్ సీపీకి 50 శాతం ఓట్లు వస్తాయని చెబుతున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. పెదపాడులోని ధర్మాన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్లు, వా ర్డు మెంబర్ల ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తన రాజకీయ జీవితం సర్పంచ్ నుంచే మొదలైందన్నా రు. పౌరులకు అన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతోనే సచివాలయ వ్యవస్థ పెడితే దాన్ని నిర్వీర్యం చే సేశారని మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేయడం టీడీపీకి మాత్రమే తెలుసని అన్నారు. తు ఫాన్లకు నేలపాలైన పంటను సర్కారు గాలికి వదిలేసిందన్నారు. కొందరు అధికారులు పచ్చ నేతలకు కొమ్ము కాస్తున్నారని, వారి చిట్టా తమ వద్ద ఉందని తెలిపారు. -
శ్రీకాకుళం
రోడ్డుపై రైతులు.. విదేశాల్లో అమాత్యులు బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026రోడ్డుపై మొక్కజొన్న 50 కిలోల గోమాంసం సీజ్ నరసన్నపేట: మేజర్ పంచాయతీ రాజీవ్ నగర్ కాలనీలోని ఒక ఇంటిలో అక్రమంగా విక్రయిస్తున్న 50 కిలోల గోమాంసంను మంగళవారం పోలీసులు సీజ్ చేశారు. విశ్వ హిందూపరిషత్ సభ్యులు సుమ బాల, పొట్నూరు రమేష్లు స్థానిక పోలీసులకు సమాచారం అందజేయడంతో నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ విక్రయ కేంద్రాన్ని పరిశీలించి 50 కిలోల గో మాంసంను సీజ్ చేసి అమ్మకందారుడైన మహమ్మద్ ఖాశీంపై కేసు నమోదు చేశారు. కనకమహాలక్ష్మికి బంగారు హారం బహూకరణ డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర కల్పవల్లి సిరులతల్లి కనకమహాలక్ష్మికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కంద శ్రీనివాసరావు బంగారు హారం బహూకరించారు. రూ.7,85,647 విలువ చేసే 61.49 గ్రాముల పొడులతో కూడిన బంగారు హారాన్ని ఆలయ అధికారులకు మంగళవారం అందజేశారు. వీరిచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, ప్రసాదం అందజేశారు. టీచర్ల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ రూపొందించాలని, నూతన పీఆర్సీ కమిటీ వేసి 30 శాతం ఇంటీరియర్ రిలీఫ్ మంజూరు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, మెమో 57 ప్రకారం 2005 డీఎస్సీ వారికి ఓపీఎస్ వర్తింపచేయాలని పీఆర్టీయూ నాయకు లు కోరారు. ఈ మేరకు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో మంగళవారం శాంతియుత ధర్నా నిర్వహించి, కలెక్టర్కు వినతిపత్రం అందించారు. విశ్రాంత ఉపాధ్యాయుల కు బకాయిలు చెల్లించాలని, 302 జీఓ పునరుద్ధరించి పదోన్నతు లు కల్పించాలని, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్–1 హెచ్ఎంలుగా మార్చాలని, ఉర్దూ, ఒరియా ఉపాధ్యాయుల కు పదోన్నతులు కల్పించి బడులను బలోపేతం చేయాలని కోరారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లాలో మొక్కజొన్న రైతులు రోడ్డున పడుతున్నారు. పంట కొనుగోలు చేయాలని గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాలన అంశాలు తెలుసుకోవడానికి సింగపూర్ వెళ్లారు. ఇక్కడ రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే.. అక్కడ అమాత్యులు శిక్షణ తీసుకుంటున్నారు. ఓ వైపు పంటలను కొనుగోలు చేయడానికి డబ్బుల్లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మంత్రులను సింగపూర్ పంపించింది. ఈ వైఖరి అన్నదాతల ఆగ్రహానికి కారణమవుతోంది. జిల్లాలో దయనీయ స్థితి.. ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించాక లాభాలు వస్తాయని రైతులు పంటలు వేసుకుంటా రు. వేసిన పంటకు సకాలంలో ఎరువులు అందించాలి. పంట పండాక కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేసి మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. పంట పండాక చేతులేత్తేసింది. కొనుగోలు చేయలేమంటూ దాట వేత ధోరణి ప్రదర్శిస్తోంది. వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత జిల్లాలో మొక్కజొన్న రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. విత్తు దగ్గరి నుంచి పంట పండే వరకు కష్టాలు పడ్డారు. పంట చేతికొచ్చాక ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. దగా పడ్డ రైతులు చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు దగా పడుతు న్నారు. ఖరీఫ్, రబీ సీజన్లో వేసిన పంటలన్నింటికీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విత్తనాల దగ్గరి నుంచి ఎరువుల వరకు, పంట పండించిన దగ్గరి నుంచి అమ్ముకునే వరకు కష్టాలు పడుతున్నారు. రాష్ట్రానికి వచ్చిన ఎరువులన్నీ పచ్చనేతల చేతుల్లోకి వెళ్లిపోవడంతో ఎరువులన్నీ బ్లాక్ మార్కెట్ అయిపోయా యి. రూ.280 ఎరువును రూ.600కు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి రైతుకు దాపురించింది. దాదాపు అన్ని పంటలకు, అన్ని సీజన్లకు ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. ఎరువుల దందాను ఆపే పరిస్థితి లేకుండా పోయింది. కంచే చేను మేసినట్టు పరిస్థితి తయారైంది. నానా బాధలు పడి పంటను పండిస్తే ఇప్పుడా పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. వ్యవసాయం దండ గ అని గతంలో చంద్రబాబు అన్న మాటలను ఇప్పుడు రుజువు చేసుకుంటున్నారని రైతులు అంటున్నారు. కొనుగోలు కేంద్రాల ఊసే లేదు బాధ్యత గల ప్రభుత్వమైతే రైతుకు చేతికొచ్చిన పంటను కొనుగోలు చేసేందుకు సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. రైతు నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలి. దారుణమేంటంటే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జోలికే పోలేదు. పంటను కొనుగోలు చేయడానికి డబ్బుల్లేవంటూ చేతులేత్తేస్తోంది. ఇంతకంటే అసమర్థ ప్రభుత్వం ఇంకొకటి లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాలో 87,821 ఎకరాల్లో మొక్క జొన్న సాగు జరిగింది. ఎకరాకు 30 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చింది. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం క్వింటా మొక్కజొన్నకు రూ. 2400 దక్కాలి. కానీ కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు చేసిన ప్రకటనలు.. మాటలకే పరిమతమయ్యాయి. రూ. 254కోట్లకు పైగా రైతుకు నష్టం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ఇదే ఆసరాగా తీసుకుని పచ్చ నాయకులు దళారుల అవతారమెత్తారు. రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. తక్కువ ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారు. క్వింటా మొక్కజొన్నను రూ.1400 నుంచి రూ. 1600కు కొనుగోలు చేస్తున్నారు. లెక్కన క్వింటాకు రూ. 800 నుంచి రూ. 1000వరకు రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రూ.29వేల మేర కోల్పోతున్నా రు. జిల్లా వ్యాప్తంగా చూస్తే రూ. 254కోట్లకు పైగా నష్టపోతున్నారు. జిల్లాకు చెందిన ఓ ఫౌల్ట్రీ యజమానిగా ఉన్న చౌదరి మొక్కజొన్న కొనుగోలు విషయంలో శాసిస్తున్నారు. తాను నిర్దేశించిన ధరకే దళారులు కొనుగోలు చేసేలా మాఫియా నడుపుతున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తే ఈ ధర కూడా దక్కదని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహం అష్టకష్టాలు పడి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అటు ఖరీఫ్లోనూ, ఇటు రబీలో నూ ధాన్యం, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఆరుబయట పండిన పంటను ఎండబెట్టుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కానీ ప్రభుత్వానికి పట్టడం లేదు. ముఖ్యమంత్రి దగ్గరి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకు చోద్యం చూస్తున్నారు.ప్రజా సంతృప్తిలో రాష్ట్ర సగటును దాటాలి: కలెక్టర్ తీవ్ర ఆందోళనలో మొక్కజొన్న రైతులు సింగపూర్లో పర్యటిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మద్దతు ధర దక్కక దిగాలు పడుతున్న అన్నదాతలు దళారులుగా అవతారమెత్తిన అధికార పార్టీ నాయకులు కొనుగోళ్లను శాసిస్తున్న ఓ ఫౌల్ట్రీ యజమాని చౌదరి జిల్లాలో రూ. 254కోట్లకు పైగా నష్టపోతున్న రైతులు నాడు నేడు ఎంత తేడా గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఎరువులు కూడా సకాలంలో రైతు ఇంటికే అందజేసింది. పండిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన మొక్కజొన్నను రవాణా చేసేందుకు నేరుగా రైతుల పొలాలకు లారీలు, కార్గో బస్సులు పంపించేది. అవి చాలకపోతే సీట్లు తీసి పల్లె వెలుగు బస్సులు ఉపయోగించేది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, దళారులకు తావివ్వకుండా నేరుగా రైతు పొలం వద్దకు వెళ్లి కొనుగోలు చేసేది. అంతటితో ఆగకుండా 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు వేసింది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాల్లేవు. మద్దతు ధరకు కొనుగోలు చేసే నాథుడు లేడు. రైతును నట్టేట ముంచేశారు. చేతిలో ఉన్న పంటను అమ్ముకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. -
పేరాడ తిలక్కు మరోసారి నోటీసులు
టెక్కలి: వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్కు టెక్కలి పోలీసులు మంగళవారం రాత్రి నోటీసులు అందజేశారు. ఈ మేరకు ఎస్ఐ కె.రాము నేరుగా వైఎస్సార్సీపీ కార్యాలయానికి వెళ్లి తిలక్కు నోటీసులు అందజేశారు. ఈ నెల 10వ తేదీన నమోదైన కేసుకు సంబంధించి స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే అంశంపై రెండుమార్లు తిలక్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. తిలక్ మాట్లాడుతూ అచ్చెన్నాయుడు చేస్తున్న అవినీతి అక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నందుకు, కక్షపూరితంగా అక్రమ కేసులు నమో దు చేస్తున్నారని తెలిపారు. అయినా వెనక్కి తగ్గేది లేదన్నారు. సోషల్ మీడియాల్లో యాక్టివ్గా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల పై కావాలనే కొంత మంది టీడీపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేసి అక్రమంగా విచారణ పేరుతో పోలీస్స్టేషన్కు పిలిపించుకుని వేధిస్తున్నారని తెలిపారు. -
ఊరి బడిని కాపాడుకున్నారు
కంచిలి: దాదాపుగా ఖాళీ అయిపోతున్న ఊరి బడిని పెద్దలంతా కలిసి కాపాడుకున్నారు. పోలేరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరంలో కేవలం పది మంది విద్యార్థులే చదువుతుండేవారు. వీరిలో ఐదో తరగతి చదువుతున్న ఏడుగురు పై తరగతికి ప్రమోట్ అవ్వడంతో ముగ్గురు విద్యార్థులే మిగలడంతో పాఠశాల మూసివేత దశకు వచ్చింది. ఈ విషయాన్ని హెచ్ఎం జనార్దనరావు, మిగిలిన సిబ్బంది గ్రహించారు. రెండు నెలలుగా ఎస్ఎంసీ సభ్యులు, గ్రామస్తులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి, పాఠశాల పరిస్థితిని వివరించారు. దీంతో గ్రామస్తులు ప్రత్యేకంగా సమావేశమై ప్రైవేటు బడులకు వెళ్తున్న పిల్లలను తిరిగి ఈ బడిలో చేర్పించాలని నిర్ణయించారు. గడిచిన రెండు రోజులుగా పాఠశాల ఉపాధ్యాయుడు జనార్ధనరావు, గ్రామస్తులు, యువత అధిక సంఖ్యలో ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొని, ఇంటింటికీ తిరిగి ప్రైవేటు పాఠశాలలకు చెందిన 45 మంది విద్యార్థులను ఇక్కడ చేర్పించడంతో విద్యార్థుల సంఖ్య 48కి చేరి మోడల్ ప్రైమరీ పాఠశాలగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇప్పుడు పాఠశాలకు నలుగురు ఉపాధ్యాయులు వచ్చే అవకాశం ఉందని మండల విద్యాశాఖాధికారి–1 ఎస్. శివరామ్ ప్రసాద్ అన్నారు. -
అక్రమ కేసులు ఎత్తివేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాక్షి సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిపై పెట్టిన అక్రమ కేసు రద్దు చేయాలని కోరుతూ జిల్లా జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో సాక్షి సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరిని పోలీసులు అరెస్టు చేసిన తీరు అత్యంత అప్రజాస్వామికంగా ఉందన్నారు. జర్నలిజం, సోషల్ మీడియా యాక్టివిస్టులపై జరుగుతున్న ఇటువంటి దాడులు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయని పేర్కొన్నారు. అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన కీలక మార్గదర్శకాలను అమలు చేయాలని కోరారు. అక్రమంగా బనాయించిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను కాపాడటంలో జిల్లా యంత్రాంగం చొరవ చూపాలని, పోలీసు వ్యవస్థ చట్టబద్ధంగా వ్యవహరించేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో మీడియా సమాఖ్య ప్రతినిధులు శాసపు జోగినాయుడు, బగాది అప్పలనాయుడు, తోట భీమారావు, బరాటం దుర్గాప్రసాద్, హరి తదితరులు పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ధర్నా
శ్రీకాకుళం అర్బన్: బకాయి పడ్డ డీఏను తక్షణమే చెల్లించాలని కోరుతూ దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళంలోని సంచార్ భవన్ వద్ద బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ జనవరి నుంచి 3 విడతల డీఏ అరియర్స్ను తక్షణమే చెల్లించాలన్నారు. దీనిపై కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా పక్కన పెట్టేయడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు పోలాకి వెంకటరావు, మాతల గోవర్ధన్రావు, ఎస్.అభిమన్యు, బీహెచ్.లక్ష్మి, సూర్యనారాయణ, హెచ్. లక్ష్మి, వై.లక్ష్మి, వి.శివనాయుడు, జి.మహేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏబీవీపీ ప్రతినిధుల ఆందోళన
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని 80 అడుగుల రోడ్డులో నారాయణ కళాశాలలో అకాడమీ ముద్రిత పుస్తకాలు అడ్డగోలకు తీసుకురావడమే కాకుండా అధిక ధరలకు విక్రయిన్నారన్న ఆరోపణలపై ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్కుమార్ నేతృత్వంలో విద్యార్థి సంఘ ప్రతినిధులు కళాశాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో తమను కళాశాల ప్రతినిధులు బయటకు నెట్టేశారంటూ ఏబీవీపీ ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం ఏబీవీపీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యాసంస్థ అక్రమాలు, దోపీడీలను ప్రశ్నిస్తునే ఉంటామన్నారు. జిల్లా ఆర్ఐఓ సురేష్కుమార్కు ఫిర్యాదు చేస్తున్నా స్పందించడంలేదని ఆరోపించారు. నారాయణ విద్యాసంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమపై కావాలనే విద్యార్థి సంఘ ప్రతినిధులు ఆరోపిస్తున్నారని, ఫర్నిచర్ ధ్వంశం చేశారని చెప్పారు. -
పశువులు పట్టివేత
రణస్థలం : లావేరు మండలం తాళ్లవలస జాతీయ రహదారిపై సోమవారం ఉదయం మూడు బొలెరో వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 14 పశువులను లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేకాట శిబిరంపై దాడి జి.సిగడాం: వెలగాడ గ్రామ పరిధిలోని అరటి తోటలో పేకాట ఆడుతున్న 11 మందిని జి.సిగడాం ఎస్సై వి.సందీప్కుమార్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.44,850 నగదు, ఫోన్ పే ద్వారా రూ.9వేలు, 9 సెల్ఫోన్లు, 5 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు పలాస : లక్ష్మీపురం సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాము, క్లీనర్ శివగణేష్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్సులో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 25న జాబ్ మేళా నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 25న ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.లత ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లమో చేసిన 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల నిరుద్యోగ యువత అర్హులని పేర్కొన్నారు. 25న ఉదయం 9.30 గంటలకు చేరుకోవాలని సూచించారు. 12 కంపెనీల నుంచి హెచ్ఆర్లు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైల్వేస్టేషన్లో సమస్యలు పరిష్కరించాలి కంచిలి: సోంపేట రైల్వేస్టేషన్లో సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ డాక్టర్ సీపాన గుణవతి కోరారు. సోమవారం స్థానిక రైల్వేస్టేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫుట్ఓవర్ బ్రిడ్జి, మరుగుదొడ్లు, వెయిటింగ్ హాల్, తాగునీరు తదితర సమస్యలపై దృష్టి సారించాలన్నారు. ప్రధాన రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అడ్వైజర్ ఎల్.గోవిందరాజులు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.జి.ప్రసాద్, పిట్ట పోలయ్య, కడియం ప్రసాద్, ధనుంజయ, ఈరోతు శ్రీనివాసరావు, బడే రాజేష్, డొంక సునీల్, పెట్టా రామకృష్ణ పాల్గొన్నారు. రెండు రోజుల్లో ఉపాధి బకాయిలు జమ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధి హామీ పథకం పెండింగ్ బకాయిలను రెండు రోజుల్లో వేతనదారుల ఖాతాల్లో జమ చేస్తామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.వి.లవరాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేతనదారులకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిందని, నిధులు కూడా విడుదలయ్యాయని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల కొన్ని రోజులుగా ఆగిన పేమెంట్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకే జమ చేస్తామని వివరించారు. ప్రతి ఒక్కరికీ పనికి తగిన వేతనం అందుతుందని పీడీ స్పష్టం చేశారు. పనులు పరిశీలన హిరమండలం: గొట్టాబ్యారేజీ వద్ద జరుగుతున్న గైడ్ బండ్ పనులను డీఈ బి.సరస్వతి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొట్టాబ్యారేజీ ఆధునీకరణ పనులు నిమిత్తం ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసిందన్నారు. పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీపడవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈలు పరిశుద్దబాబు, ఏఈ ఆనంద్ పాల్గొన్నారు. -
కార్మికులకు ఆసరాగా ‘ఈ–శ్రమ్’
టెక్కలి: వివిధ రంగాల్లో కార్మికులుగా పనిచేస్తున్న వారి కోసం అందజేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి సహాయ కార్మిక శాఖాధికారి ఎం.విజయకుమార్ కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవన నిర్మాణ రంగంతో పాటు ఇతర రంగాలు, ఉపాధి హామీ పథకం వేతనదారులు సైతం ఈ–శ్రమ్కార్డు ద్వారా సంక్షేమ పథకాలు అందుకోవచ్చని పేర్కొన్నారు. ఇవీ అర్హతలు... ● కార్మిక శాఖ అందజేస్తున్న సంక్షేమ పథకాలను అందుకోవడానికి కొన్ని రకాల అర్హతలు ప్రామాణికం చేశారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు కార్మికుడు, కార్మికురాలిగా పనిచేస్తున్నట్లు ధృవీకరణ ఉండాలి. ● వయసు 19 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆధార్, రేషన్కార్డు, కుటుంబ సభ్యుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి. ● ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వేతనదారులు సైతం నమోదు చేసుకోవచ్చు. ● కార్మిక శాఖా కార్యాలయంలో ఈ పత్రాలతో పాటు దరఖాస్తు, రూ.110 చలానా చెల్లించాలి. ఇది ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఇవీ ప్రయోజనాలు... కార్మికుల ఇంట్లో కుమార్తెలకు వివాహం సమయంలో (గరిష్టంగా ఇద్దరు కుమార్తెలు ) రూ.20 వేలు అందజేస్తారు. ప్రసూతి వైద్య సాయం ద్వారా మహిళా కార్మికురాలికి, కార్మికుడి భార్యకు, కుమార్తెలకు రూ.20 వేల సాయం అందజేస్తారు. సహజం మరణం పొందితే రూ.60 వేలు, నామినీ లేదా వారిపై ఆధారపడిన వారికి అందజేస్తారు. దహన సంస్కారాలకు రూ.20 వేలు చెల్లిస్తారు. -
టీడీపీ కార్యక్రమంలా అగ్నిమాపక వారోత్సవాల సభ!
టీడీపీ కార్యాలయంలో ఉపాధ్యాయ సంఘ సమావేశం శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవం సోమవారం నిర్వహించడం విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ అధికార పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించడం పట్ల పలువురు తప్పుపడుతున్నారు. కాగా, ఇదే సమావేశంలో సంఘ నాయకులు చేసిన తీర్మానాలు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని అద్దం పట్టేలా ఉండటంతో తెలుగుదేశం కార్యకర్తలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం కాగా ఆ రోజున పార్టీ కార్యాలయంలో ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తున్నట్లుగా తీర్మానాలు చేయడాన్ని తప్పుపట్టడం గమనార్హం. నరసన్నపేట: నియోజకవర్గ కేంద్రం నరసన్నపేటలో సోమవారం నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ముగింపు కార్యక్రమం విమర్శలకు తావిచ్చింది. పూర్తిగా అధికార కార్యక్రమం అయినా అగ్నిమాపక సిబ్బంది ఆ విషయం మరిచి టీడీపీ నాయకులకు పసుపు కండువాలు వేసి పార్టీ కార్యక్రమంలా నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. పార్టీ నాయకులను ఆహ్వానించడం అలా ఉంచితే పసుపు కండువాలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, నరసన్నపేట అగ్నిమాపక అధికారి వరహాలు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. -
ప్రణాళికలే విజయ సూత్రాలు
టెక్కలి: విద్యార్థులు ప్రణాళికంగా ఆలోచనలు చేస్తే తప్పనిసరిగా విజయాలు సాధిస్తారని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు వెల్లడించారు. కళాశాలలో సోమవారం 2026 ప్రతిభా పురస్కార వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రముఖ సంస్థలు నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో రూ.33 లక్షల అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీతో పాటు రూ.4 లక్షల కనిష్ట వేతన సరాసరి ప్యాకేజీతో 70 కంపెనీల్లో 800 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. వీరందరికీ అభినందన పత్రాలు అందజేసి సత్కరించారు. గేట్–2025 పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు క్యాప్జెమిని, కాగ్నిజెంట్, డెలాయిట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎల్–టీ మైండ్ట్రీ, విప్రో వంటి సంస్థలతో పాటు కోర్ రంగంలో ఎన్సీసీ, రామ్కో, తోషిబా, పెన్నార్ వంటి సంస్థల్లో ఉద్యోగాలు సాధించినట్లు వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ డీన్ ఎం.సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అప్రమత్తతే అసలైన భద్రత
● వేసవిలో అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ● అత్యవసర కాల్స్పై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి ● కొత్తగా సోంపేట, నరసన్నపేటలకు రెండు శకటాలు ● ‘సాక్షి’తో ముచ్చటించిన జిల్లా అగ్నిమాపక అధికారి జడ్డు మోహనరావు శ్రీకాకుళం క్రైమ్ : సూరీడు నిప్పులు కక్కుతున్నాడు. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతగా ఉండాలని, సిబ్బంది సైతం ఫైర్ ఎమెర్జన్సీ కాల్స్పై అలెర్ట్గా ఉండాలని జిల్లా అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ అధికారి జడ్డు మోహనరావు అన్నారు. జిల్లాలో అగ్నిమాపక శకటాలు, ఇతర అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. కొత్తగా రెండు శకటాలు.. ఇదివరకు శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, ఆమదాలవలస, కొత్తూరు, రణస్థలం ఫైర్స్టేషన్లకు శాశ్వత భవనాలు ఉన్నాయి. ప్రస్తుతం సోంపేట స్టేషన్ శాశ్వత భవనంలోకి మారడానికి సిద్ధంగా ఉంది. నరసన్నపేటకు సెమీ పెర్మినెంట్ భవనమే ఉంది. సోంపేట, నరసన్నపేటలకు వారం రోజుల కిందటే ఎలక్ట్రానిక్ బేస్ మీద నడిచే రెండు అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఇంజిన్లు వచ్చాయని మోహనరావు తెలిపారు. 10 ఫైర్ స్టేషన్లలో 45 మంది ఫైర్మ్యాన్లు, 23 మంది డ్రైవింగ్ ఆపరేటర్లు, 33 మంది లీడింగ్ ఫైర్మ్యాన్లు, ఎనిమిది మంది స్టేషన్ అధికారులున్నారు. అయితే ఇంకా 68 మంది వరకు సిబ్బంది అవసరం ఉంది. జాగ్రత్తలు పాటించాల్సిందే.. ● అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు 101కు గానీ, సంబంధిత స్టేషన్ ఫోన్ నంబర్కు గానీ, స్టేషన్ అధికారికి గానీ తక్షణం కాల్ చేయాలి. ● కాల్స్ వచ్చిన తక్షణమే ఇన్చార్జి ఫైర్ స్టేషన్ అధికారులు సిబ్బందిని అలర్ట్ చేయాలి. ● రోడ్డు మీదకు వచ్చేసరికి కచ్చితంగా కండిషన్లో ఉన్న వాహనాలు, పరికరాలే ఉండాలి. ఎప్పటికప్పుడు కండిషన్లో ఉన్నవీ లేనిదీ తనిఖీ చేసుకోవాలి. ● వేసవి ముగిసేంతవరకు అత్యవసర పరిస్థితుల్లో తప్ప అధికారులకు, సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయరు. ● ఎలాంటి ఫైర్కాల్ వచ్చినా సంబంధిత స్టేషన్ అధికారికి సమాచారం ఇవ్వాలి. నిర్లక్ష్యంతో అధికారి వినకపోయినా, సిబ్బంది చెప్పకపోయినా, ఘటనాస్థలికి వెళ్లకపోయినా ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాల్సిందే. ● తక్షణ చర్యల్లో భాగంగా పరికరాలతో కూడిన మిస్ట్ బుల్లెట్ అందుబాటులో ఉంచుకోవాలి. ● 101 ఎమర్జెన్సీ నంబర్, స్టేషన్ ఎస్టీడీ నంబర్తో పాటు ప్రజలు ఫోన్ చేస్తే వెంటనే స్పందించేలా స్టేషన్ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉన్నాం. వారోత్సవాల్లో భాగంగా ఇప్పటికే ప్రజలను అవగాహనపరుస్తున్నాం. గత రెండేళ్లలో దాదాపు రూ. 15 కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవిస్తే.. రూ. 42 కోట్లకు పైగా ఆస్తులను ప్రమాదాల్లో కాపాడగలిగాం. పబ్లిక్లో కూడా అవేర్నెస్ వచ్చింది. మా శకటాలు వెళ్లే లోపే వాళ్లూ రెస్పాన్స్ అవుతున్నారు. నిబంధనలు పాటించని, ఫైర్సేఫ్టీ ఎక్విప్మెంట్ లేని, అనుమతులు లేని మాల్స్, పరిశ్రమలేవైనా మా దృష్టిలోకొస్తే చర్యలు తప్పవు. – జడ్డు మోహనరావు, జిల్లా అగ్నిమాపక అధికారి, శ్రీకాకుళంమొబైల్ ఫోన్ నంబర్లు ఉన్న సిమ్లు యాక్టివేట్ చేసుకోవాలి. ● గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలు పరిధి ముఖ్య కూడళ్లలోను, హోటళ్లు, సచివాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, కమ్యూనిటీ హాళ్లు, దేవాలయాలు, హెల్త్ సెంటర్లు, ఎఫ్పీఎస్ డీలర్ షాపులు, రైతుబజారు, మార్కెట్లలో స్కూళ్లు, పోస్టు ఆఫీస్లు, బ్యాంకులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లులో సంబంధిత ఫైర్స్టేషన్ అధికారి మొబైల్ నెంబర్, స్టేషన్ నంబర్, ఎమెర్జెన్సీ కాల్ 101 నెంబర్లు కనిపించేలా ప్రదర్శించాలి. జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు : 12 2024–25 లో జిల్లావ్యాప్తంగా ఫైర్కాల్స్ : 628 ఆస్తినష్టం : రూ. 10,57,69,000 కాపాడిన ఆస్తి : రూ. 25,52,50,000 2025–26లో జిల్లావ్యాప్తంగా ఫైర్కాల్స్ : 516 ఆస్తినష్టం : రూ. 4,45,57,000 కాపాడిన ఆస్తి : రూ. 16,84,65,000 అత్యవసర నంబర్లు స్టేషన్ కాంటాక్ట్ మొబైల్ ఆఫీస్ నంబర్ శ్రీకాకుళం 9963726782 08942222099 ఇచ్ఛాపురం 8317587461 08947231101 సోంపేట 9963744295 08947234101 పలాస 9963730662 08945241101 టెక్కలి 9000505945 08945244277 కోటబొమ్మాళి 9963730845 08942238659 నరసన్నపేట 7680089447 08942276777 ఆమదాలవలస 9963730658 08942286401 కొత్తూరు 9000873349 08946258444 రణస్థలం 9963731326 08942293101 ఔట్పోస్ట్ ఫైర్ స్టేషన్ ఆఫీస్ నెంబర్ మందస 08947237101 పొందూరు 08941242101 ఫైర్ ఎమెర్జన్సీ కాల్ 101 -
పద్మ పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకులకు 2027 సంవత్సరపు ’పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వ్యాపార పారిశ్రామిక, ప్రజా వ్యవహారాలు విభాగాల్లో విశిష్టమైన గుర్తింపు పొందిన వారి ని పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డుల కోసం ప్రతిపాదించవచ్చని పేర్కొ న్నారు. ముఖ్యంగా గుర్తింపునకు నోచుకోని క్షేత్రస్థాయి వ్యక్తులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల నుంచి అర్హులను గుర్తించడమే ఈ ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. స్వీయ నామినేషన్లు ఆన్లైన్ ద్వారా http:awards.gov.in పోర్టల్లో సమర్పించవచ్చని, ఆన్లైన్ దరఖాస్తులకు జూలై 31, 2026 చివరి తేదీ అని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని అర్హులైన వ్యక్తుల వివరాలను నిర్ణీత నమూనాలో జూన్ 10వ తేదీలోగా కలెక్టర్ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. అర్హులైన వారు నామినేషన్ సమర్పించేటప్పుడు ఆ వ్యక్తి సాధించిన విజయాలను, చేసిన విశిష్ట సేవలను స్పష్టంగా వివరించేలా ఒక వివరణాత్మక పత్రాన్ని జత చేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం www. padmaawards.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు. మంత్ర పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు పాతపట్నం: పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారికి సహస్ర నామార్చనలు, నీరాజన మంత్ర పుష్పాలతో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. 51వ వార్షిక మహత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖడ్గ నామాల తో కుంకుమార్చనలు, మూల మంత్ర హోమా లు నిర్వహించామని ఈఓ వి.వాసుదేవరావు తెలిపారు. సోమవారం తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులకు అమ్మవారిని దర్శించుకుని, అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. ఆంధ్ర, ఒడిశా నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఖైదీల కుటుంబాలకు ‘స్పృహ’తో సామాజిక భరోసా శ్రీకాకుళం పాతబస్టాండ్: నేర బాధితులు, జైలులో ఉన్న వ్యక్తులపై ఆధారపడిన కుటుంబాలకు సామాజికంగా, ఆర్థికంగా అండగా నిలవడమే ‘నల్సా స్పృహ–2025’ పథకం ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పేర్కొన్నారు. సోమవారం స్థానిక న్యాయ సేవా సదన్లో ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ.. సమాజంలో అపవాదు ఎదుర్కొంటున్న ప్రభావిత వర్గాలకు ఈ పథకం ద్వారా బహు ముఖ మద్దతు లభిస్తుందని వివరించారు. ఖైదీల కుటుంబాల్లోని పిల్లల విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధి దెబ్బతినకుండా ప్యానల్ న్యాయవాదులు, వలంటీర్లు వారధిలా పనిచేయాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు త్వరలో నరసన్నపేటలో నిర్వహించనున్నట్లు నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యోగా పోటీలపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 10–55 ఏళ్ల వయసు వరకు 12 కేటగిరీల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. వివరాలకు 9676472733, 9492266889 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
మేమూ మార్కులు పెంచుకుంటాం
● సీనియర్ ఇంటర్ విద్యార్థులకూ ఇంప్రూవ్మెంట్కు చాన్స్ ● 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం విద్యార్థులకు గొప్ప అవకాశం.. ఇంటర్ ద్వితీయ సంవత్స రం విద్యార్థులకు సైతం ఇంప్రూవ్మెంట్కు అవకాశం క ల్పించడం గొప్ప అవకాశం. సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్బోర్డు తీసుకున్న గొప్ప నిర్ణయం. ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 27వ తేదీ వరకు అవకాశం ఉంది. విద్యార్థులు వారు చదువుకున్న కళాశాలల్లో ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి మొదలవుతాయి. – రేగ సురేష్కుమార్, ఇంటర్విద్య జిల్లా డీవీఈఓ/ఆర్ఐఓ శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త అందించింది. ఇంటర్ సెకెండియర్ విద్యార్థులకు సైతం మార్కులు పెంచుకునేందుకుగాను ‘ఇంప్రూవ్మెంట్’ కోసం పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తు ఇంటర్బోర్డు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2024లో ఈ విధానం అమల్లోకి రావాల్సి ఉండగా.. ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఎట్టకేలకు ఇంటర్ బోర్డు నిర్ణయం అమల్లోకి తీసుకొచ్చింది. సప్లిమెంటరీ పరీక్షలకు ఈ నెల 27వ తేదీలోగా ఫెయి లైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్బోర్డు జిల్లా అధికారులు సూచిస్తున్నారు. మే 21వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఫస్టియర్కు మాత్రమే.. ఇంటర్మీడియెట్ బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్కు అవకాశం ఉండేది. ఏటా మార్చి నెలలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన పేపర్ల(సబ్జెక్టులు)కు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకై పరీక్ష ఫీజులు చెల్లించి, పరీక్షలకు హాజరుకావడం జరుగుతుండేది. అయితే ఈ ఇంప్రూవ్మెంట్ విధానాన్ని ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది. మే నెల 21 నుంచి జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు వెలువరించింది. ఎక్కువ మార్కులకే ఫిక్స్ ఇంప్రూవ్మెంట్కు హాజరయ్యే విద్యార్థుల్లో ఎన్నో అనుమానాలు, మరెన్నో సందేహాలకు ఇంటర్బోర్డు చెక్ చెప్పింది. ఎక్కువ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టులో సాధించిన మార్కులు.. ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులు.. ఏవి ఎక్కువ మార్కులు అయితే వాటినే ఇంటర్బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. అయితే ఇది కేవలం ఫీజులు దండుకునేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులుజిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 164 జూనియర్ కాలేజీలు ఉండగా.. జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 39,838 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 17,385 మంది పరీక్ష రాయగా 12,684 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో కనీసం 3వేల మంది వరకు ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మెయిన్స్.. అదుర్స్
● జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సిక్కోలు జోరు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో పూర్తి హవా కనబర్చారు. ఆమదాలవలస సమీపంలోని పూజారిపేటకు చెందిన చింతాడ అజయ్కుమార్ 99.88 పర్సంటైల్ స్కోర్తో మెరిశాడు. తల్లిదండ్రులు వెంకటరమణ, అమ్మాజీ. జిల్లాకు చెందిన నరవ రోషన్ రామ్ 99.63 పర్సంటైల్తో రాణించాడు. తండ్రి మహేశ్వరరావు, తల్లి అరుణకుమారి. శ్రీకాకుళానికి చెందిన కంచరాపు రేవంత్కుమార్ 99.36 పర్సంటైల్తో ప్రతిభ కనబర్చాడు. తండ్రి కంచరాపు జోగరావు, తల్లి పూర్ణచంద్రావతి. అలాగే శ్రీకాకుళానికే చెందిన బాన్న రాజేష్ 99.03 పర్సంటైల్తో ప్రతిభ చూపించాడు. కంచిలి: కంచిలిలో నివసిస్తున్న గుడ్ల సాహితి 99.57 పర్సంటైల్ సాధించింది. ఈమెకు ఆల్ ఇండియా జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 610 ర్యాంకు వచ్చింది. ఈమె తండ్రి పైడి రాజు వ్యాపారం చేస్తుండగా, తల్లి శైలజ గృహిణి. ఇదే గ్రామానికి చెందిన బత్తుల వంశీకృష్ణ 99.715 పర్సంటైల్ సాధించాడు. ఇతను ఆల్ ఇండియాలో 4653వ ర్యాంకు సాధించాడు. ఇతని తండ్రి రమేష్, తల్లి గాయత్రిలు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. కంచిలిలో గల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలకు చెందిన విద్యార్థి కొత్తపల్లి ప్రశాంత్ 69.01 పర్సంటైల్ సాధించి, ఎస్సీ కేటగిరిలో ఆల్ ఇండియా 36663 ర్యాంకు సాధించాడు. -
నేడు తీవ్ర వడగాలులకు అవకాశం
రాష్ట్రంలో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళవారం రాష్ట్రంలో 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం 54 మండలాల్లో తీవ్ర వడగాలులు, 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాకు సంబంధించి రెండు రోజుల పాటు తీవ్ర ఉక్కపోత, వడగాలులు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ప్రధానంగా ఆమదాలవలస, బూర్జ, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీనర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలకు దీని ప్రభావం ఎక్కువ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. –శ్రీకాకుళం పాతబస్టాండ్ -
కమిటీలన్నీ వంద శాతం పూర్తి చేయండి
● ఓటర్ల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారించాలి ● వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలకు ముఖ్య నాయకుల సూచన శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీని పటిష్టం చేసుకునేందుకు సమష్టిగా కృషి చేద్దామని వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు, ముఖ్య నాయకులతో సోమవా రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియో జక వర్గాల్లో బూత్ కమిటీలు, గ్రామస్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ పూర్తిచేసేందుకు సమన్వయకర్తలు కృషి చేయాలన్నారు. బూత్ స్థాయి నుంచి గ్రామస్థాయిలో ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ ఒక్క ఓటును అధికార పార్టీ నాయకులు తొలగించకుండా కాపాడుకోవాల్సిన బాధ్య త మనపై ఉందన్నారు. అధికారాన్ని వినియోగించుకుని ఓట్లను తొలగించే కార్యక్రమం కూటమి నేతలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టాలని సూచించారు. పార్టీకి సంబంధించి ఎక్కడ ఏ సమస్య ఉ న్నా తమ దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తామన్నారు. వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా మనమంతా కలసి పనిచేయాలన్నారు. కూటమి నేతలు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా వైఎస్సార్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అమలుచేయకుండా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇసుక, మట్టి, నీరు అన్ని ప్రకృతి వనరులు దోచు కుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ పాతపట్నం నియోజకవర్గం పరిశీలకులు పాలవలస విక్రాంత్, పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదావలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, కోఆర్డినేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి హర్షవర్ధన్రెడ్డి, వైఎస్సార్సీపీ మహిళావిభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, నియోజకవర్గ పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, దుంపల లక్ష్మణరావు, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, చల్ల రవికుమార్, వెలమలకుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, గొండు రఘురాం, సనపల నారాయణరావు, గేదెల పురుషోత్తం పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
అడ్మిషన్ల కోసం కార్పొరేట్ల అడ్డదారులు
శ్రీకాకుళం: జిల్లాలోని కొన్ని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ల బాధ్యతను టీచర్లకు అప్పగిస్తున్నాయి. కొత్తగా అడ్మిషన్లు చేయిస్తేనే తదుపరి సంవత్సరం ఉద్యోగాల్లో ఉంటారని షరతులు విధిస్తున్నారు. ఈ సారి కొత్తగా విద్యార్థులను కూడా ప్రచారాలకు వాడుకుంటున్నారు. కొత్తగా పిల్లలను చేర్పిస్తే వీరికి ఫీజులో రాయితీలు ఇస్తామని చెబుతుండడంతో వారు వీధివీధీ తిరుగుతున్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా వేరొక పాఠశాలలో చదువుతున్నట్లు తెలిసిన ప్రతి ఇంటికి వెళ్లి ప్ర చారాలు చేస్తున్నారు. వేరొకరి ద్వారా పాఠశాలల్లో చేరాలనుకునే వారికి ఫీజును అధికంగా వసూలు చేస్తున్నట్లు భోగట్టా. ఆ మొత్తాన్ని తాయిలాలుగా పంచుతున్నట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపై దృష్టి సారించి ఇలాంటి వాటిని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి విషయాలు ఎవరైనా ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకువస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వారి గుర్తింపును కూడా రద్దు చేసే అవకాశాలు ఉంటాయి. కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో కూడా ఈ విషయమై తక్షణం మాట్లాడతాను. – రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి -
అదును చూసి.. చదును చేసి
ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడికుదుటి పాలెం గ్రామంలో ఎమ్మెల్యే ఈశ్వరరావుకు చెందిన ఎన్ఈఆర్ స్కూల్ వెనక వెంకటరాయణ చెరువుకు వెళ్లే గెడ్డను కప్పేసి చదును చేసిన దృశ్యమిది. ఆక్రమించిందెవరో? ఎక్కడి నుంచి కంకర, మట్టి, గ్రావెల్ తెచ్చి గెడ్డను కప్పేశారో పాలకులే చెప్పాలి. చదును చేసిన గెడ్డను వాహనాల పార్కింగ్ కోసం ఉపయోగిస్తుందెవరో వాళ్లే తెలియజేయాలి.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఎచ్చెర్ల నియోజకవర్గంలో అక్రమార్కులు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో చెప్పడానికి వెంకటరాయణ చెరువుకు వెళ్లే గెడ్డే నిలువెత్తు సాక్ష్యం. రణస్థలం మండలంలో జరుగుతున్న అక్రమాలకు ఇదొ క సాక్షిగా నిలిచింది. ఇంతగా బరితెగించెందెవరో, ఆక్రమణకు గురైన గెడ్డ పక్కనే ఉన్న స్కూల్ యజ మాని నడికుదుటి వారే నిగ్గు తేల్చాలి. భారీ ఎత్తున అక్కడికి మట్టి, కంకర, గ్రావెల్ తెచ్చిందెవరో రట్టు చేయాలి. లేదంటే గెడ్డ కనుమరుగైనట్టే. అడ్డు అదుపూ లేని అక్రమాలు.. రణస్థలం మండలంలో ప్రభుత్వ భూములు ఆక్ర మణకు గురవుతున్నాయి. ఖాళీగా కనిపిస్తే చాలు పాగా వేసేస్తున్నారు. చెరువులు, వాగులు, కొండలైతే చెప్పనక్కర్లేదు. దర్జాగా ఆక్రమించేసి సొమ్ము చేసుకుంటున్నారు. కొండలకు గుండు కొట్టేసి, కంకర, గ్రావెల్ను తమకు కావాల్సిన చోట వేసుకుని లోతట్టు ప్రాంతాలను చదును చేసుకుంటున్నారు. గతంలో ఇదే స్కూల్ ముందు లోతట్టు ప్రాంతాన్ని చదును చేసేందుకు సంచాం కొండ నుంచి గ్రావెల్, కంకరను టిప్పర్ల ద్వారా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గ్రామస్తులు నిలదీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్క సంచాం కొండే కాదు రణస్థలంలోని అనేక కొండలతో పాటు నియోజకవర్గంలోని కొండలు దాదాపు కరిగిపోతున్నాయి. కొండలను బోడి కొండలుగా చేసేస్తున్నారు. కాపాడాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. చెప్పాలంటే అక్రమార్కులకు తమవంతుగా మరింత సాయం చేస్తున్నారు. ఎంత ధైర్యం చెరువులు, వాగులు, ప్రభుత్వ భూముల ఆక్రమణ ల కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచి ది. నియోజకవర్గం వ్యాప్తంగా ఆక్రమణలు జరుగుతున్నాయి. రణస్థలం మండలం దాంట్లో ముందుంది. ఎన్నో ఆక్రమణలు ఉన్నాయి. దానికో ఉదాహరణ వెంకటరాయణ(దినం మద్యం చెరువు)కు వెళ్లే గెడ్డ ఆక్రమణ. ఎన్ఈఆర్ స్కూల్ వెనక 2 ఎకరాలకు పైగా ఉన్న గెడ్డను కప్పేసి, కొండలను తవ్వి తీసిన గ్రావెల్, కంకరతో పాటు చెరువులను తవ్వి తీసిన మట్టిని తీసుకొచ్చి చదును చేసేశారు. తమకు కావాల్సిన విధంగా గెడ్డను కప్పేసి, చిన్న కాలువ మాదిరి తయారు చేసి, ఏకంగా అలైన్మెంట్ మార్చేశారు. ఆక్రమణ దారుల దయాదాక్షిణ్యంపైన గెడ్డలో కాస్త ఉంచినట్టు కనబడుతోంది. ఇప్పుడది వాహనాల పార్కింగ్ ప్రదేశంగా మారిపోయింది. అక్రమార్కులెవరు? ఎన్ఈఆర్ స్కూల్ వెనక గెడ్డను కప్పేసిందెవరు? కప్పేసిన గెడ్డలో కొంత ఉంచి, కాలు వలా అలైన్మెంట్ మార్చేసిందెవరు? ఆ గెడ్డను ఆక్రమించి, కప్పేసేందుకు ఎక్కడి నుంచి గ్రావె ల్, కంకర, మట్టి తీసుకొచ్చిందెవరు? ఏ చెరు వును, ఏ కొండను తవ్వేశారు? ఇంత మొత్తంలో మట్టి, గ్రావెల్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఆద్యులు, బాధ్యులు ఎవరు? ప్రస్తుతం తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా నియోజకవర్గ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు స్కూల్ పక్కనే అంత ధైర్యం చేసిందెవరో నిగ్గు తేల్చాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికి ఎమ్మెల్యే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దొంగలెవరో రూఢీ చేయాలి. లేకపోతే, వెంకటరాయణ చెరువుకు వెళ్లే గెడ్డ భవిష్యత్లో పూర్తిగా కనుమరుగైపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రెండెకరాలకు పైగా గెడ్డ పోరంబోకు స్థలం అక్రమంగా చదును నడికుదుటిపాలెంలో ఆక్రమణ దందా గెడ్డ పోరంబోకులో కాస్త మినహాయించి కాలువగా అలైన్మెంట్ మార్పు కొండలు, చెరువులను తవ్వి తీసుకొచ్చిన కంకర, గ్రావెల్, మట్టితో గెడ్డను కప్పేసిన వైనం -
మింగేస్తున్న మా‘రీచులు’.. ఇసు‘కాసులు’!
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాంలో పొక్లెయినర్లు, జేసీబీలతో వంశధారను కుళ్లబొడిచి విశాఖపట్నం తదితర చోట్లకు టిప్పర్లలో అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ఎమ్మెల్యే కనుసన్నల్లో యథేచ్ఛగా దందా సాగుతోంది. అక్రమ రవాణాకు అడ్డు లేకుండా సరిహద్దు చెక్ పోస్టులను మూసేశారు. నకిలీ బిల్లుల తయారీకి ప్రత్యేక డివైజ్లు సృష్టించి ఖజానాకు గండికొడుతున్నారు.పచ్చ ముఠాల ఇసుక దోపిడీకి సజీవ సాక్ష్యమిది. విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం రేగిడి మండలం కందిశ – తునివాడ గ్రామాల మధ్య నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకుంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. నదిలో యంత్రాలతో విచ్చలవిడిగా తవ్వడంతో రేగిడి బట్టి ఓపెన్ చానల్కు నీరు అందక పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలు చేస్తున్న పొక్లెయినర్కు అడ్డంగా నిలబడి రైతులు నిరసన తెలిపారు. నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధి తీరుపై మండిపడ్డారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా పచ్చముఠాల కనుసన్నల్లో యథేచ్ఛగా ఇసుక దందా సాగుతోంది. గోదావరి, కృష్ణా, నాగావళి, వంశధార, పెన్నా లాంటి నదులతో పాటు చెరువులనూ చెరపడుతున్నారు. నదీమ తల్లికి గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు. డీసిల్టేషన్ ముసుగులో నదులను కబళించి అధికార పార్టీ నాయకులు జేబులు నింపుకొంటున్నారు. మంత్రులు, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, వారి బంధువులు, అనుచరుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది. దోచుకున్న సొమ్మును వాటాలేసుకుని పంచుకుంటున్నారు. అడ్డుపడితే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. భౌతిక దాడులకూ వెనుకాడకుండా బరితెగిస్తున్నారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ నియోజకవర్గంతోపాటు మరో మంత్రి సత్యకుమార్ గెలుపొందిన ధర్మవరంలోనూ ఇసుక దందా భారీగా జరుగుతోంది. గ్రామ స్థాయి నేత నుంచి ‘ముఖ్య’ నేత దాకా ఇందులో భాగస్వామ్యం కావడంతో అధికార యంత్రాంగం నిస్తేజంగా మారిపోయింది.డీసిల్టేషన్ ముసుగులో లూటీ..వరదలతో నదులలో ఏర్పడిన మేటలను డీసిల్టేషన్ ద్వారా మాన్యువల్గా మాత్రమే తొలగించాలి. ఇలా తొలగించిన ఇసుకను ఒకచోట డంప్ చేసి వినియోగదారుల అవసరాలకు విక్రయించాలి. స్టాక్ పాయింట్ నుంచే లారీలకు లోడింగ్ చేసి పంపించాలి. కానీ డీసిల్టేషన్ పేరుతో నదిలో జేసీబీల ద్వారా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. నదిలోనే లారీల్లో లోడింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతించిన ఇసుక ర్యాంపుల్లో మీటరు లోతులో మాత్రమే తవ్వకాలు చేపట్టాల్సి ఉండగా 5 నుంచి 20 మీటర్ల వరకు తవ్వకాలు చేస్తున్నారు. ఇసుక మేటలతో పాటు నదీ గర్భాన్ని తవ్వేసి, టన్నుల కొద్దీ నదిలోనే పోగేసి, అక్కడికే ఏకంగా లారీలను రప్పించి లోడింగ్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం డీసిల్టేషన్ పాయింట్లలో ఎంత పరిమాణంలో తవ్వారో లెక్కలు ఉండాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా అధికారుల పర్యవేక్షణ లేదు. టీడీపీ నాయకుల అజమాయిషీలో ఆ పాయింట్లన్నీ ఉండటంతో అటువైపు కన్నెత్తి చూడటం లేదు. వరద నీటితో నదులు ఉప్పొంగిన సమయంలోనూ అక్రమ తవ్వకాలు ఆగడం లేదు.ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్..నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడేస్తూ నదుల్లోకి నేరుగా రోడ్లు నిర్మించారు. నదీ గమనాన్ని మార్చేస్తూ నీటిని దారి మళ్లించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయేలా నదులను కబళిస్తున్నారు. దీంతో నదుల స్వరూపమే మారిపోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇసుక లోడ్ లారీల వల్ల రహదారులన్నీ శిధిలమైపోతున్నాయి. భారీ గుంతలతో రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఉత్తరాంధ్రలో బాబాయ్–అబ్బాయ్ అండతో..ఉత్తరాంధ్రలో బాబాయ్–అబ్బాయ్ అండతో ఇసుక అక్రమ దందా మూడు పొక్లెయిన్లు ఆరు టిప్పర్లు అన్నట్లుగా సాగుతోంది. శ్రీకాకుళం మండలం పొన్నాం, బట్టేరు, నైరా, భైరి, కరుజాడ, గారలో వంశధార నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. నాగావళిని కిల్లిపాలెంలో తోడేస్తున్నారు. ఆమదాలవలస, నరసన్నపేటలో అడ్డు అదుపు లేకుండా యంత్రాలతో ఇసుక దోపిడీ సాగుతోంది. పార్వతీపురం పరిధిలో సువర్ణముఖి నది నుంచి ఇసుకను లూటీ చేస్తున్నారు. సీతానగరం మండలం గెడ్డలుప్పి, సీతానగరం, చిన్న భోగిలి, లక్ష్మీపురం, బూర్జ, పెదంకలాం రేవుల నుంచి ఇసుక తరలింపు జోరుగా సాగుతోంది. పాలకొండ మండలం గోపాలపురం, చిన్నమంగళాపురం, అంపిలి ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్నారు. భామిని మండల పరిధిలో వంశధార తీరమంతా అక్రమ తవ్వకాలే. ఇక్కడ కూటమి నేతదే హవా.శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం చిత్రావతి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వి, టిప్పర్లతో తరలిస్తున్న దృశ్యం ‘గోదావరి’ గుండె చెరువు..గోదావరి జిల్లాల్లో పచ్చముఠాల మధ్య వాటాలు తేలకపోవడంతో చినబాబు డైరెక్షన్లో ఇసుక పంచాయతీలు జరుగుతున్నాయి. రావులపాలెం మండలం ఊబలంక, ఆలమూరు మండలం జొన్నాడ ర్యాంపుల్లో యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పి.గన్నవరం పరిధిలో ఉడిమూడిలంక, వైవీపాలెం, అయినవిల్లిలంక, ఆత్రేయపురంలోని బొబ్బర్లలంక, రాజోలు మండలం సోంపల్లి, ఐ.పోలవరం మండలం మురమల్ల, అల్లవరం మండలం బోడసకుర్రుల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలోని కుమారదేవం, తాళ్లపూడి, చిడిపి, రాజమండ్రి సిటీ కోటిలింగాల పేట ఇసుక రేవులు, సీతానగరం మండలంలో రెండు ఇసుక ర్యాంపుల్లో రాత్రిళ్లు గుట్టు చప్పుడు కాకుండా తవ్వేస్తున్నారు.డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ ర్యాంపులో ఇసుక అక్రమ తవ్వకాలు ‘కృష్ణా’లో కొల్లగొట్టేస్తున్నారు..ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పామర్రు నియోజకవర్గం లంకపల్లి, రొయ్యూరు, నార్త్ వల్లూరు అక్రమ ర్యాంపుల్లో ఇసుక దొంగలు దోచుకుంటున్నారు. రోజుకు 150 లారీల ఇసుక తరలిపోతోంది. అవనిగడ్డ నియోజకవర్గం పాపవినాశనంలో రోజుకు సుమారు 100 నుంచి 150 లారీలు ఇసుక తరలిస్తున్నారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం నుంచి రోజుకు 300 నుంచి 350 లారీల వరకు తరలిపోతున్నాయి. జగ్గయ్యపేట నియోజకవర్గం చిట్యాల, లింగాల, పోలంపల్లి, ముక్త్యాల, సుబ్బాయగూడెం, పెనుగంచిప్రోలు, నందిగామ నియోజకవర్గం కీసర, గండేపల్లి, మొగులూరు, వేములపల్లి, గడ దేవరపాడు, వెల్లంకి, కొండూరు, కొడవటికల్లు, పొక్కునూరు, కాసారాబాద, పల్లగిరి, కమ్మవారిపాలెంలో పెద్ద ఎత్తున యంత్రాల సాయంతో అక్రమ తవ్వకాలు, రవాణా జరుగుతోంది.కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని చోడవరంలో తవ్వకాలు జరిపి, టిప్పర్లలో రవాణా చేస్తున్న దృశ్యం గుంటూరులో పచ్చ గునపం..ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకుల కనుసన్నల్లో దోపిడీ సాగిపోతోంది. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి–గుండిమెడలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. పగలు మనుషులతో, రాత్రి యంత్రాలతో తవ్వేస్తున్నారు. అమరావతి మండలంలో ఎనిమిది రీచ్లు ఉండగా మల్లాది రీచ్లో మాత్రమే అధికారికంగా తవ్వకాలు చేపడుతున్నారు. అచ్చంపేట మండలం చింతపల్లి, బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం పందిళ్లపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వేస్తున్నారు.నెల్లూరు, ప్రకాశంలో ఇష్టారాజ్యం..శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెంలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో ప్రధానంగా పాలేరు పరీవాహక ప్రాంతంలో జరుగుమల్లి, కె.బిట్రగుంట, రావులకొల్లు, ఉప్పలదిన్నె పరిధిలో అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ఉదయం మనుషుల ద్వారా, రాత్రి పూట జేసీబీలతో తవ్వేస్తున్నారు. అద్దంకి నియోజకవర్గం రామాపురం పరిధిలో గుండ్లకమ్మ నదిలో తాగునీటి ఊట బావులకు సమీపంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ అధికారికంగా ఇసుక రీచ్ లేదు. దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలం పోలవరంలో అక్రమ రవాణా జరుగుతోంది. దర్శి టీడీపీ నేత లక్ష్మి పొలాలు కొనుగోలు చేసి అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలిస్తున్నారు. సీమలో యథేచ్ఛగా దోపిడీరాయలసీమలో అడిగే నాథుడే లేడన్న ధోరణిలో ఇసుకను దోచుకుంటున్నారు. కడప నగరానికి సమీపంలోని సిద్దవటం సమీపంలోని పెన్నా నది నుంచి ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. రాజంపేట పరిధిలోని బాలరాచపల్లి, మందరం ప్రాంతంలో చెయ్యేరు నుంచి యంత్రాలతో తోడుతూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పాపాఘ్ని నది, కొండాపురం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. చక్రాయపేట మండలంలో పాపాఘ్ని నది నుంచి పొక్లెయిన్లతో ఇసుకను తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నారు. లింగాల మండలం వేంపల్లెలో పాపాఘ్ని నుంచి ఇసుక తరలిపోతోంది. తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం చిత్రచేడు సమీపంలో పెన్నా నదిలో ఇసుకను భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు. పుట్టపర్తి చుట్టుపక్కల చిత్రావతిని తోడేస్తున్నారు. తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం, అడపారెడ్డిపల్లి, పెడిపల్లి, చిగురువాడ, కేసీపేట, వేదాంతపురం, తణపల్లి, తిరుచానూరు ప్రాంతాల్లో ఇసుక దందా జోరుగా సాగుతోంది. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు, ఎం.కొత్తపల్లి, మామండూరు, ఐతేపల్లి, నాగయ్యగారిపల్లి, రెడ్డివారిపల్లి, నరసింగాపురం, బుచ్చినాయుడుపల్లి, తొడంవాడ, శానంబట్ల ప్రాంతాల్లో భారీ యంత్రాలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం నాగులాపురం మండలం చిన్నాపట్టు, పిచ్చాటూరు మండలం అడవికొడియంబేడు వద్ద అరుణా నది వద్ద రెండు చోట్ల జేసీబీలతో ఇసుక లోడింగ్ జరుగుతోంది. ఈ రెండు గ్రామాల నుంచి పెద్దఎత్తున తమిళనాడుకు నిత్యం ఇసుకను తరలిస్తున్నారు. -
● అడుగంటిన ఆశ
ఉన్నదే ఒక్కగానొక్క బావి. ఆ ఊరిలో 300 మంది జనాభా ఉంటే అందరికీ ఆ బావి నీరే ఆధారం. ఇంత కీలకమైన బావి నీటిని ఓ నలుగురు వ్యక్తులు మోటార్లు పెట్టి తోడేస్తున్నారు. వేసవి కావడంతో ఊరుఊరంతా గగ్గోలుపెడుతోంది. సంతబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ పందిగుంట గ్రామం వ్యథ ఇది. బావిలో గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు మోటార్లు పెట్టి రోజూ నీళ్లను నేరుగా వాళ్ల ఇళ్లకు పైపుల ద్వారా తోడేస్తుండడంతో మిగిలిన వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ కార్యదర్శి కె.విద్య వద్ద ప్రస్తావించగా.. దీనిపై గ్రామస్తులు ఫిర్యాదు ఇచ్చారన్నారు. – సంతబొమ్మాళి -
ఆదా చేద్దాం..!
● వేసవిలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం ● స్వీయ నియంత్రణతోనే వృథాకు అడ్డుకట్ట అవగాహన అవసరం విద్యుత్ వినియోగంపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగిఉండాలి. అవసరం మేరకు మాత్రమే ఉపకరణాలు వాడాలి. స్వీయ నియంత్రణతో వృథా ఖర్చు తగ్గించవచ్చు. విద్యుత్ ఆదా చేసేందుకు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. – జి.ప్రసాద్, విద్యుత్ శాఖ డీఈఈ, పాతపట్నం ●హిరమండలం: వేసవి కావడంతో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఏ ఇంట చూసినా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగం పెరుగుతోంది. వీటితో పాటు వాషింగ్మిషన్, మిక్సీలు, కుక్కర్లు వంటి ఉపకరణాలు దినచర్యలో భాగమైపోయాయి. ఫలితంగా నెల తిరిగే సరికి విద్యుత్ బిల్లు మోత మోగుతోంది. దాన్ని చూసి బెదిరిపోయే కంటే ముందుగానే విద్యుత్ పొదుపు పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉపకరణాలు వాడకంలో ఆచుతూచి వ్యవహరిస్తే వృథా ఖర్చు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో సుమారు 6.71 లక్షల గృహ వినియోగవసరాల కోసం దాదాపు 80 శాతం విద్యుత్ వినియోగం జరుగుతోంది. రోజుకు సుమారు 60 లక్షల యూనిట్ల వినియోగం జరుగుతోంది. అందులో కేవలం లైట్ల కోసం 20 శాతం వాడుతున్నారు. ఈ విషయంలో కొంచెం పొదుపు పాటిస్తే వృథా ఖర్చు తగ్గుతుంది. సాధారణ బల్బులకు బదులుగా ఎల్ఈడీ రకం పెట్టుకుంటే బిల్లు తక్కువ వస్తుంది. పగటిపూట లైట్లు అవసరం లేకుండా కిటికీలకు లేత రంగుల కర్టెన్లు వేస్తే కాంతి లోపలికు వస్తుంది. పిల్లలకు నేర్పించాలి.. విద్యుత్ వినియోగం ఆదాపై తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కల్పించాలి. సెలవులు కావడంతో అవసరం మేరకు మాత్రమే ఉపకరణాల వాడాలి. బడిలో విరామ సమయాల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపివేయాలని చెప్పాలి. ఇంట్లో కంప్యూటర్లు, టీవీలు కొంత సమయమే చూడాలి. ఫోన్, కెమెరాలకు అవసరం మేరకే చార్జింగ్ చేసుకోవాలి. ఫ్రిజ్ డోర్ తరచూ తీయకూడదని వివరించాలి. ఇలా పాటిస్తే మేలు.. ● ఫ్రిజ్, గోడ మధ్య ఖాళీ ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కంప్రెసర్ ఎక్కువగా పనిచేసి విద్యుత్ వృథాకు ఆస్కారం కలుగుతుంది. ● కొందరు వాషింగ్ మిషన్లో సామర్థ్యానికి మించి దుస్తులు వేస్తారు. అలాచేస్తే యంత్రం పనిచేసే సమయం పెరిగి కరెంట్ వాడకం ఎక్కువ అవుతోంది. టీవీ, కంప్యూటర్లు వాడకపోతే స్విచ్ఛాప్ చేయాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు చార్జింగ్ పూర్తికాగానే ప్లగ్ల నుంచి తొలగించాలి. ● ఎక్కువ చల్లదనం కోసం చాలామంది 18 డిగ్రీల వద్ద ఏసీలు వినియోగిస్తుంటారు. అలాకాకుండా ఎప్పుడూ 24 డిగ్రీలలో ఉంచుకుంటే 20 శాతం విద్యుత్ ఆదా చేయగలం. గదిలో తలుపులు, కిటికీలు మూసివేశాకే ఏసీ ఆన్ చేయాలి. ● మైక్రో ఓవెన్ను మాటిమాటికీ తీయకూడదు. అలాచేస్తే ఉన్న ఉష్ణోగ్రత తగ్గి తిరిగి వేడెక్కేందుకు మరింత సమయం పడుతుంది. ● ఆటోమెటిక్ ఆన్,ఆఫ్ విదానంతో పాటు 5 నక్షత్రాల ప్రమాణాలున్న ఉపకరణాలు కొనుగోలు చేయడం ఉత్తమం. గృహ అవసరాలకు బిల్లు ఇలా.. యూనిట్లు చార్జీ(యూనిట్కు) 0 – 30 రూ.3.25 31–75 రూ.4.00 76–125 రూ.4.50 126–225 రూ.6.00 226–400 రూ.8.75 400 పైన రూ.9.75 -
తండ్రి కళ్లెదుటే కుమారుడు మృతి
రణస్థలం: రణస్థలం జాతీయ రహదారి మరో విషాదానికి సాక్షిగా నిలిచింది. కళ్ల ముందే కుమారుడు ప్రాణాలు వదిలేస్తే.. నిస్సహాయంగా ఏడుస్తున్న తండ్రి కన్నీటితో ఈ దారి తడిచింది. జేఆర్ పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం విశాఖలోని మల్కాపురం నుంచి పంది దీనబంధు, కుమారుడు ప్రేమ్కుమార్(15) ఆదివారం శ్రీకాకుళానికి బైక్పై వచ్చారు. ప్రేమ్కుమార్ శ్రీకాకుళంలోని డిఫెన్స్ ఎంట్రన్స్ పరీక్ష రాశాడు. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం వెళుతుండగా రణస్థలం టౌన్ వద్దకు రాగానే సాయంత్రం 4గంటల సమయంలో లారీని ఓవర్ టేక్ చేయబోయి వీరి స్కూటీ అదుపు తప్పింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న తండ్రి దీనబంధు రోడ్డు ఒకవైపు తుళ్లిపోగా వెనుక కూర్చుని ఉన్న కొడుకు మాత్రం లారీ టైర్ కిందకు వెళ్లిపోయాడు. సరిగ్గా తలభాగం చక్రాల కింద నలిగిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే ఇలా చనిపోవడంతో ఆ తండ్రి ఒక్కసారిగా నిశ్చేష్టుడైపోయాడు. జేఆర్ పురం పోలీసులు వచ్చి మృతుని వివరాలు సేకరించారు. దీనబంధు విశాఖపట్నంలోని మల్కాపురంలో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం జిల్లాలోని మెళియాపుట్టి మండలంలోని బురద రామచంద్రాపురం పంచాయతీలో గల శేఖరపురం గ్రామంలోని హరిజన వీధి. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకు చనిపోవడంతో గుండెలవిసేలా రోదించారు. ఈ ప్రమాదంపై జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద స్థలంలో రోదిస్తున్న తండ్రి దీనబంధు అదుపు తప్పిన స్కూటీ లారీ చక్రాల కింద పడి చనిపోయిన కుమారుడు -
● అ‘పూర్వ’ సమ్మేళనం..
ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1975–76 బ్యాచ్ పదో తరగతి విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాలులో 50 ఏళ్ల తర్వాత కలిసి ఆనాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన బులుసు పేరి శాస్త్రి మాస్టారును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జి.వి.నరసింహులు, ఎస్.చంద్రశేఖర్, జె.రామారావు, కుప్పిలి వెంకట రాజారావు, సరుబుజ్జిలి మాజీ ఎంపీపీ కిల్లి సత్యనారాయణ, అప్పలాచారి, కిల్లి రామ్మోహన్రావు, గవర్నమెంట్ హైస్కూల్ హెచ్ఎం కె.ఏ.రాములు, శివానందమూర్తి, బులుసు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. – ఆమదాలవలస -
మే 9,10లో కథా కార్యశాల
శ్రీకాకుళం కల్చరల్: Ð]lÆý‡®-Ð]l*¯]l Ķæ¬Ð]l MýS£é Æý‡^èlƇ$$-™èl-ÌS¯]l$ {´ù™èlÞ-íßæ…-^ól…-§ýl$MýS$ MýS£é-Æý‡-^èl-¯]lÌZ Ððl$ÌSMýS$-Ð]lË$, Ð]lçÜ$¢Ð]l# G…í³MýS, ÕÌSµ…, OÔðæÍ Ððl$Æý‡$-VýS$ç³-Æý‡-^èl-yýl…ÌZ ™èlÈ-¹§ýl$ C^óla…-§ýl$MýS$ Ðól$ ¯ðlÌS 9, 10 ™ól©ÌZÏ Æð‡…yýl$ ÆøkÌS´ër$ }M>-MýS$-âýæ…ÌZ M>Æý‡Å-Ô>ÌS °Æý‡Ó-íßæ-çÜ$¢-¯]l²r$Ï Ýëíßæ¡ {çÜÐ]l…† }M>-MýS$âýæ… hÌêÏ MýS±-Ó-¯]lÆŠ‡ MóS™èl-Ð]l-Æý‡ç³# }°ÐéçÜ$ ™ðlÍ-´ëÆý‡$. D M>Æý‡Å-Ô>-ÌSÌZ {ç³gêÔèæMìS¢ º$MŠS çßo‹Ü GyìlrÆŠ‡ G…Ò-G‹Ü ÔèæÆý‡Ã, MýS£é Æý‡^èlƇ$$-™èlË$ Asêtyýl Aç³µ-ÌS-¯éĶæ¬yýl$, VýS…sôæyýl VúÆý‡$¯é-Ķæ¬yýl$, Ð]l$ÍÏ-ç³#Æý‡… fVýS-©‹-Ù, §éçÜÇ Æ>Ð]l$-^èl…{§ýl Æ>Ð]l# ÇÝùÆý‡$Þ ç³Æý‡Þ-¯]l$ÏV> Ð]lÅÐ]l-çßæ-ÇÝë¢Æý‡$. 45 HâýæÏ ÌZç³# Ð]lĶæ$-çÜ$…yìl MýS£é Æý‡^èl¯]l ÌZ Cç³µ-sìæMóS {ç³ÐólÔèæ… E¯]l² Ķæ¬Ð]l¡ Ķæ¬Ð]l-MýS$Ë$ D M>Æý‡Å-Ô>-ÌSÌZ ™èlÈ-¹§ýl$ ´÷…§ýl-Ð]l^èl$a. ´ëÌŸY-¯]l§ýl-ÌS-_¯]l ÐéÆý‡$ HO§ðl¯é JMýS ÝëÐ]l*-hMýS A…Ôèæ…Oò³ A¿¶æ$Å-§ýlĶæ$-MýS-Æý‡OÐðl$¯]l ç³§ýl®†ÌZ 4 õ³i-ÌSMýS$ (100 OÌñæ¯]l$Ï)-Ñ$…^èl° MýS£ýl Æ>íÜ Ðól$ 3Ð]l™ól-©ÌZV> ÐésêÞ‹³ §éÓÆ> 9490098811 ¯]l…º-ÆŠ‡MýS$ Ìôæ§é MóS™èl-Ð]l-Æý‡ç³# }°-ÐéçÜ$, 8&42/1, †ÌSMŠS ¯]lVýSÆŠæ, CÍ-íÜ-ç³#Æý‡…, }M>MýS$-âýæ…, 532 001MýS$ ´ùçÜ$t §éÓÆ> M>± ç³…´ë-Í. M>Æý‡Å-Ô>ÌS Æð‡…yýl$ ÆøkË$ ¿Zf¯]l Ð]lç܆ çܧýl$´ëĶæ$… MýS Í-µ-Ýë¢Æý‡$. Çh-[-õÜt-çÙ¯ŒS Æý‡$çÜ$Ð]l¬ ₹200 ^ðlÍÏ…_ õ³Æý‡$Ï ¯]lÐðl*§ýl$ ^ólçÜ$-MøÐéÌS° MðS.}-°ÐéçÜ$ MøÆ>Æý‡$. బలపంపై సింహాచలేశుని రూపం నరసన్నపేట: స్థానిక సంతపేటకు చెందిన సూక్ష్మకళాకారుడు వీఎస్ఎన్ ఆచారి వరాహ నరసింహ స్వామి నిజరూప దర్శనాన్ని బలపంపై చెక్కి అబ్బుర పరిచారు. సింహాచలేశుని చందనోత్సవం సందర్భంగా నరసింహ స్వామి నిజరూపాన్ని చెక్కినట్లు వివరించారు. 6 మిల్లీమీటర్ల ఎత్తు మూడు మిల్లీ మీటర్ల వెడల్పు ఉన్న బలపంపై ఈ బొమ్మ చెక్కినట్లు వివరించారు. ‘నకిలీ గిరిజనులపై ఉద్యమించాలి’ పాతపట్నం: ఆదివాసీలంతా కలిసి నకిలీ గిరిజనులపై ఉద్యమించాలని ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు సవర రాంబాబు పిలుపునిచ్చారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఆదివాసీ భవనంలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్న ఆదివాసీల సంఘాల నాయకులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జే ఏసీ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రస్తుత రాజ కీయ నాయకులు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మిగతా కులాల గిరిజన జాబితాకి కృషి చేస్తున్నారని, నిజమైన ఆదివాసీ హక్కుల కోసం ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరమన్నారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి గురడి అప్పన్న మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న ఆదివాసీ సంఘాలన్నీ ఒక తాటిపైకి రావడం శుభపరిణామన్నారు. జిల్లాలో 35 ఏళ్ల నుంచి సుమారుగా రెండు వందల మందికిపైగా నకిలీ గిరిజన ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. సమావేశంలో సవర జగన్, జేఏసీ నాయకులు మల్లిపురం భాగ్యలక్ష్మి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి, టెక్కలి, నందిగాం, సారవకోట, హిరమండలం, కొ త్తూరు, మందస, సోంపేట, కంచిలి, పాతపట్నం, సరుబుజ్జిలి, బూర్జ, జలుమూరు మండలాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ‘ప్రతిభను ప్రోత్సహించేందుకే పరీక్షలు’ ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్లో ఒడియా మైనారిటీ విద్యార్థుల్లో దాగున్న ప్రతిభను ప్రోత్సహించడానికి మేధా సమ్మాన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఒడియా డీఐ దుర్గాప్రసాద్ చౌదరి అన్నారు. స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మున్సిపల్ ఒడియా ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం అపోటా ఆధ్వర్యంలో మేధా సమ్మా న్ జిల్లా స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలో గల ఒడియా ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మేధా సమ్మాన్ పోటీ పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో మీనకేతన్ బెహరా(బ్రాహ్మణ వీధి మున్సిపల్ ఒడియా ప్రాఽథమిక పాఠశాల), లవ్లీ బెహరా(ఎంపీయూపీఎస్, బొడ్డబడ), దేవ శ్రీ బెహరా(ఎంపీయూపీఎస్, మండపల్లి) నిలిచారు. -
ఎస్సీ కార్పొరేషన్ రుణాలపై వడ్డీ మాఫీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ద్వారా 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు రుణాలు పొందిన ఎస్సీ లబ్ధిదారులకు వడ్డీ మాఫీ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంఘం ఇన్చార్జి కార్యనిర్వాహక సంచాలకులు వినాయకం ఒక ప్రకటనలో తెలిపా రు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 సంవత్సరం వరకు ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేడీసీ కింద స్వయం ఉపాధి పథకాల లోన్లు పొందిన ఎస్సీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మాఫీ అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి 2018 –19 సంవత్సరం వరకు తీసుకున్న రుణాలపై ఈ నెల 30వ తేదీ లోగా అసలు మొత్తం చెల్లించిన లబ్ధిదారులకు వడ్డీ మొత్తం మాఫీ జరుగుతుందన్నారు. ఏప్రిల్ 30వ తేదీ తర్వాత వడ్డీ మాఫీ అవకాశం రద్దవుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత లబ్ధిదారులు అసలుతో పాటు వడ్డీని కూడా చెల్లించాలని వివరించారు. -
హామీల అమలులో కూటమి సర్కారు విఫలం
శ్రీకాకుళం : ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎస్టీయూ నాయకులు విమర్శించారు. ఎస్టీయూ జిల్లా శాఖ ప్రథమ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు పేడాడ ప్రభాకరరావు అధ్యక్షతన స్థానిక క్రాంతి భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఉద్యోగ వర్గం తీవ్ర అసంతృప్తికి లోనవుతోందన్నారు.నెలనెలా ఎన్టీఆర్ ఉద్యోగుల ఆరోగ్య పథకం పేరిట జీతాల నుంచి రూ.300 చొప్పున కట్ చేస్తూనే, హెల్త్ కార్డు ద్వారా సరైన వైద్య సేవలు అందని పరిస్థితి నెలకొనడం అన్యాయమన్నారు. రాష్ట్ర కార్యదర్శి పడాల తమ్మినాయుడు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. బదిలీలు పొందినా రిలీవ్ కాని ఉపాధ్యాయులను ఏప్రిల్ 23లోగా రిలీవ్ చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్పై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పరిష్కారం చూపాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాసరావు మాట్లాడుతూ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లకు వెంటనే గౌరవ వేతనం చెల్లించాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్థిక కార్యదర్శి కె.తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులు, విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ వైస్ చైర్మన్ ఎస్.వి.రమణమూర్తి హెచ్చరించారు. సమావేశంలో జిల్లా నాయకులు, ఉపాధ్యాయ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు అన్నారు. ఈ నెల 15న ఒంగోలులో నిర్వహించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 28వ రాష్ట్ర మహాసభల అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పలిశెట్టి తొలిసారి ఆదివారం శ్రీకాకుళంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఈయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై మాట్లాడారు. విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించకుండా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘సీ్త్ర– శక్తి’ పథకం కారణంగా సిబ్బందిపై పెరుగుతున్న పని భారం, బస్సుల కొరత, సిబ్బంది లోపం వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పథకం అమలులో భాగంగా సిబ్బందికి విధిస్తున్న పనిష్మెంట్లను అడ్డుకునేందుకు యూనియన్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఆయా అంశాలపై ఈ నెలాఖరులో 28వ రాష్ట్ర మహాసభలో స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఈయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతాడ వెంకటరావు, విజయనగరం జోన్ జోనల్ కార్యదర్శి బాసూరి కృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు కె.దశరథుడు, శ్రీకాకుళం 1–2 డిపో నాయకులు కె.బాబూరావు, జి.త్రినాథ్, ఎస్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
అరసవల్లిలో ‘వైశాఖ’ సందడి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వైశాఖమాసం తొలి ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, సంప్రదాయక నివేదనలతో అరసవల్లి ఆలయంలో సందడి వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి రక్షణ చర్యలు చేపట్టడంతో భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకున్నారు. ఇంద్రపుష్కరిణి అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భక్తుల సంప్రదాయక పూజలకు ఆటంకం కలిగింది. ఘాట్ మెట్ల వద్దే మహిళలు పెసల మొలకలు, కొబ్బరి, బెల్లం, చలివిడి, మామిడి పళ్లు తదితర ప్రసాదాలను స్వామికి ప్రసాదాలుగా నివేదించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు.పుష్కరిణిలో నీరు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లతో అంతరాలయ దర్శనాన్ని కలిపించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించేలా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ చర్యలు చేపట్టారు. కేశఖండన శాలలో భక్తుల నుంచి అదనపు వసూళ్లు చేపడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈవో తనిఖీలు చేపట్టి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ కొరత నేపథ్యంలో అన్నప్రసాదం విషయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. భక్తులకు ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ఉచితంగా మజ్జిగ పంపిణి చేసేలా చలివేంద్రాన్ని ఈఓ ప్రారంభించారు. కార్యక్రమంలో మాన్సాస్ సూపరింటెండెంట్ నిద్దాన నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తరుగులో తగ్గేదేలే..!
● 50 కిలోల బస్తాలో రెండు నుంచి ఐదు కిలోల తగ్గుదల ● ప్రతి నెలా ఇదే తంతు ● ఫిర్యాదులు చేస్తున్న డీలర్లు ● పట్టించుకోని అధికారులు హిరమండలం : జిల్లాలో రేషన్ డిపోలకు అందజేసే బియ్యం బస్తాల్లో తరుగు కనిపిస్తోంది. పౌరసరఫరాల శాఖ గోదాంల నుంచి డీలర్ల వద్దకు వచ్చేసరికి 50 కిలోల బియ్యం బస్తా వద్ద 2 నుంచి 5 కిలోల వరకు తరుగు వస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో 5 కిలోలు దాటుతోందని డీలర్లు లబోదిబోమంటున్నారు. ప్రతి నెలా ఏదో ఒక మండలంలో ఈ సమస్యపై డీలర్లు అధికారులకు వినతిపత్రాలు అందిస్తూనే ఉన్నారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అసలు పౌరసరఫరాల శాఖ గోదాముల వద్దకు వచ్చేసరికి ఈ వ్యత్యాసం ఉంటుందా? లేకుంటే వచ్చాక పక్కదారి పట్టిస్తున్నారా? అనే విషయంపై స్పష్టత రావడం లేదు. కానీ జిల్లా వ్యాప్తంగా ఈ బియ్యం గోల్మాల్ జరిగినట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. గోనె సంచి బరువుకు.. సాధారణంగా గోనె సంచి బరువు 580 గ్రాములు ఉంటుంది. అదనంగా అర కిలో బియ్యం బస్తాల్లో అందించాలి. కానీ 2 నుంచి 5 కిలోలు తగ్గించి ఇస్తున్నారు. లెవీలో మరపెట్టిన బియ్యం ఇండెంట్ ప్రకారం పౌరసరఫరాల శాఖ గోదాముకు చేర్చుతారు. అక్కడి నుంచి డీలర్లు బియ్యం విడిపించి తీసుకెళుతుంటారు. కానీ ప్రతినెలా ఈ తరుగు సమస్య వెంటాడుతునే ఉంటోంది. 50 కిలోల బస్తాలో గన్నీ సంచి బరువు 580 గ్రాములు పోను 49.420 కిలోల బియ్యం ఉండాలి. కానీ అలా ఉండటం లేదు. చాలావరకూ డిపోలకు 47 కిలోల బరువు ఉన్న బియ్యం వస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం కార్డుదారులపై పడుతోంది. ఇలా తరుగు వస్తుండడంతో అదే బియ్యాన్ని 50 కిలోల పేరుతో డీలర్లు కార్డుదారులకు సర్దుబాటు చేస్తున్నారు. అంతిమంగా ఇది కార్డుదారులకు నష్టం చేకూరుస్తోంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 1603 రేషన్ డిపోల పరిధిలో 6,60,884 రేషన్కార్డులు ఉన్నాయి. ఇందులో కుటుంబసభ్యులు 19,51,094 మంది ఉన్నారు. ప్రతి నెలా 9,599.306 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుంటుంది. దాదాపు ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎల్ఎస్ పాయింట్ ఉంది. అక్కడ పౌరసరఫరాల శాఖ గోదాముల నుంచి బియ్యం సరఫరా అవుతుంటుంది. అక్కడ డిప్యూటీ తహశీల్దారు స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది. కానీ ఈ తరుగు బియ్యానికి మాత్రం చెక్ పడటం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో రేషన్ బియ్యం సరఫరా పారదర్శకంగా జరిగేది. ఇంటింటికీ రేషన్ సక్రమంగా అందించేవారు. అది కూడా కార్డుదారుల ఎదుట తూకం వేసి ఇచ్చేవారు. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పటికై నా రేషన్ బియ్యంలో తరుగు లేకుండా చూడాలని రేషన్ డీలర్లతో పాటు సామాన్య ప్రజలు కోరుతున్నారు. రేషన్ బియ్యం విషయంలో రాజీ లేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తే చర్యలు తప్పవు. ఎక్కడైనా బియ్యంలో తరుగు వస్తే వెంటనే కార్యాలయానికి ఫిర్యాదు చేయాలి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాం. – కె.బాలకృష్ణ, తహశీల్దారు, హిరమండలం -
నేడు మెగా జాబ్మేళా
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సముదాయంలో సోమవారం మెగా జాబ్మేళా నిర్వహించనున్నారు. శివానీ విద్యా సంస్థలతో పాటు ఉన్నతి ఫౌండేషన్ సంయుక్తంగా ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం ప్రతినిధులు తెలిపారు. ఫాక్స్కాన్, అపోలో, టాటా ఎలక్ట్రానిక్స్, అరబిందో, కేఎల్ గ్రూప్ తదితర కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, బీఏ, బీకాం, బీఎస్సీ, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కళాశాల ప్రాంగణానికి చేరుకోవాలన్నారు. జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడిగా బీవీవీఎన్ రాజు (డిప్యూటీ తహసీల్దారు) ఎన్నికయ్యారు. జిల్లా రెవెన్యూ సర్వీసు సంఘం ఎన్నికలు (2026 – 2029) ఆదివారం ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా రాజు, సెక్రటరీగా డి.సోనికిరణ్, సహాధ్యక్షుడిగా ఎస్.గణపతిరావు, ఉపాధ్యక్షులుగా బి.సత్యం, బి.గోపాల్, కె.అరుణకుమార్, డి.పద్మావతి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి.కె.శ్రీనివాసరావు, స్పోర్టు అండ్ కల్చరల్ ప్రతినిధిగా ఐ.లింగరాజు, జాయింట్ సెక్రటరీలుగా ఎం.గౌరీశంకర్ కుమార్, బి.సంతోష్కుమార్, కె.రాధిక, ఎస్.ప్రకాశరావు, ట్రెజరర్గా మురళీధర్ నాయక్, కార్యవర్గ సభ్యులుగా కె.శరత్బాబు, సీహెచ్ దామోదరరావు ఎన్నికయ్యారు. వీరిని రెవెన్యూ ఉద్యోగులు అభినందించారు. సమర్థవంతమైన నాయకత్వం అలవర్చుకోవాలి ● రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు శ్రీకాకుళం పాతబస్టాండ్ : రెవెన్యూ సర్వీసుల సంఘంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందని, మంచి నాయకత్వంతోనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నగరంలోని రెవెన్యూ వసతి గృహంలో జిల్లా రెవెన్యూ సర్వీసుల అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలకు హాజరయ్యారు. పూర్వ అధ్యక్షుడు, ఇటీవల డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన కంచరాన శ్రీరాములును అసోసియేషన్ తరఫున ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు పప్పల వేణుగోపాల్, కళ్యాణ చక్రవర్తి, కార్యదర్శి వీవీఎన్ రాజు, తహశీల్దార్ గణపతిరావు, మహిళా సభ్యురాలు ప్రవల్లిక ప్రియా, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు, మురళీధరనాయక్ పాల్గొన్నారు. -
భవిష్యత్ హోమియో వైద్యానిదే
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆరోగ్య పరిరక్షణలో హోమియో వైద్యం కీలకభూమిక పోషించనుందని ఐఐహెచ్పీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఎస్ఎస్ శివమూర్తి అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్పీ) ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ సహకారంతో శ్రీకాకుళం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో సైంటిఫిక్ సెమినార్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోమియోపతి వైద్యానికి దేశంతోపాటు విశ్వవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందన్నారు. ఐఐహెచ్పీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ నరేంద్రనాథ్, పూర్వపు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కేఆర్కెపీ మూర్తి, జాతీయ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వీకే పంకజాక్షన్, డాక్టర్ పంచిరెడ్డి అనిల్కుమార్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీబీకె సతీష్, మహరాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ సైన్సెస్ ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీఎస్ శ్రీధర్ తదితరులు మాట్లాడుతూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్స పూర్తిచేయడంలో హోమియోపతి తిరుగులేని రారాజుగా విరాజిల్లుతోందన్నారు. అనంతరం పూణేకు చెందిన డాక్టర్ మనీషా సోలాంకి, హైదరాబాద్కు చెందిన డాక్టర్ బి.జ్ఞానానంద, విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సజిత్ తెలగంశెట్టి, అమలాపురానికి చెందిన డాక్టర్ వీఎస్ దయానిధి వివిధ అంశాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణ కార్యదర్శి డాక్టర్ కె.వివేకనంద, కన్వీనర్లు డాక్టర్ సువ్వారి రవికుమార్, డాక్టర్ ఎన్.దాసు, ఎ.వి.షణ్ముఖరాజు, డాక్టర్ రమణ, డాక్టర్లు, హోమియో వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ.. కబ్జా.. నిర్లక్ష్యం
●కబ్జాకు గురైన రిజర్వ్ సైట్●తహసీల్దార్ సంతకం ఫోర్జరీ●నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్●పట్టించుకోని యంత్రాంగం శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రం సమీపంలో భూ ఆక్రమణల వ్యవహారాలు పెచ్చుమీరుతున్నాయి. మొన్నటికి మొన్న రాగోలులో 96 సెంట్లు కబ్జా చేసేందుకు విఫలయత్నం చేశారు. తాజాగా విలీన పంచాయతీ పరిధిలోని ఎస్బీఐ స్టాఫ్ కాలనీకి చెందిన 11 సెంట్లు రిజర్వ్ స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి కబ్జా చేయడానికి పూనుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం పరిధిలోని చాపురం పంచాయతీలో ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన ఎస్బీ ఐ స్టాఫ్ కాలనీలో గల 11 సెంట్లు విలువైన రిజర్వ్ స్థలాన్ని ఓ వ్యక్తి చేజిక్కించుకునేందుకు తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేశాడు. 1989–90లో ఎస్బీఐ స్టాఫ్ కాలనీకి చెందిన 68 మంది ఉద్యోగులు కలిసి చెరో ఐదున్నర సెంట్లు చొప్పున రెండెకరాలు విస్తీర్ణంలో సర్వే నంబర్ 254/1లో (పాతది 330/1) కొనుగోలు చేశారు. పంచాయతీ నిబంధనల ప్రకారం ఇందులో 11 సెంట్లు రిజర్వ్ స్థలంగా విడిచిపెట్టారు. ఒక్కొక్కరూ ఇల్లు కట్టుకునేందుకు గాను ఒక వాచ్మెన్ను అప్పట్లో నియమించుకున్నా రు. ఉదయం పూట ఆ వాచ్మెన్ వాటరింగ్ చేయడం, రాత్రయితే నిర్మాణపు ఇంటికి కాపాలా ఉండే లా కాలనీవాసులు నియమించుకున్నారు. కాలక్రమేణా వాచ్మెన్ వేర్వేరు చోట్ల కాపలా కాయాల్సి రావడంతో స్టాఫ్ కాలనీకు చెందిన వారంతా రిజర్వ్ స్థలంలో ఓ పాకను ఏర్పాటు చేసి అతడిని అక్కడే ఉండమని చెప్పారు. ఆ వ్యక్తి పదేళ్లకుపైగా అదే పాకలో ఉన్నారు. కొంతకాలం తర్వాత పాక వెనుక నుంచి రెండుసెంట్లు స్థల విస్తీర్ణంలో దర్జాగా ఓ మేడ నిర్మించేశాడు. అక్కడితో ఆగకుండా ఏకంగా తను కాపాలా ఉన్న 11 సెంట్లు రిజర్వ్ స్థలానికి నకి లీ డాక్యుమెంట్ సృష్టించి కబ్జాకు పూనుకున్నాడు. కొద్ది రోజుల కిందట ఎస్బీఐ స్టాఫ్ కాలనీలో దొంగతనాలు జరగడంతో పోలీసులు ఎస్బీఐ కాలనీ వాళ్లతో ఓ సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరా ల కోసం ఓ గది ఏర్పాటు చేయాలన్నారు. కాలనీ వాసులంతా నిర్ణయించుకొని రిజర్వ్ సైట్లో ఏర్పా టు చేసుకోవాలని స్థలాన్ని చూపించారు. అయితే అక్కడకు వెళ్లే సరికి వాచ్మెన్గా ఉన్న వ్యక్తి ఈ స్థలం తనదేనంటూ నకిలీ డాక్యుమెంట్లు చూపించగా వారంతా కంగుతిన్నారు. ఈ వ్యక్తి తహసీల్దార్ సంతకాలతో ముందుగా ఓ పొజిషన్ సర్టిఫికెట్ సృష్టించాడు. అక్కడితో ఆగకుండా నివాసం ఉన్న రిజర్వ్ స్థలాన్ని సైతం సెటిల్మెంట్ డీడీ కింద ఒకరి నుంచి ఒకరికి దఖలు పడినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 2025 జూలైలో ఆమదావలస రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేయించేశాడు. ఈ విషయం దావానలంలా వ్యాపించడంతో కాలనీ వాసులంతా కలిసి తహసీల్దార్ గణపతిరావుకు పొజిషన్ సర్టిఫికెట్ చూపించారు. దీంతో ఆయన ఫోర్జరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. అనంతరం శ్రీకాకుళం పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మా కాలనీవాసులంతా కలిసి మల్లేష్ను వాచ్మెన్గా పెట్టుకున్నాం. ఆయనే నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి 11సెంట్లు స్థలాన్ని కబ్జా చేస్తాడని ఊహించలేదు. – జగదీష్, ఎస్బీఐ కాలనీ అధ్యక్షుడు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. జరిగిన విషయంపై మేమంతా కలిసి జిల్లా రిజిస్టర్ కార్యాలయానికి, ఆమదా లవలస రిజిస్టర్ ఆఫీస్కు, కలెక్టర్ గ్రీవెన్స్కు, ఎస్పీ కార్యాలయానికి, ఆర్డీవో కార్యాలయానికి ఫిర్యాదు చేశాం. – ఎంఆర్ హుస్సేన్, స్టాఫ్ కాలనీ సెక్రటరీ -
రెండేళ్లలోనే కూటమి గ్రాఫ్ పడిపోయింది: ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఏపీలో అరాచక పాలన నడుస్తోందని.. ప్రతిపక్షం లేకుండా చేయాలని అనుకుంటున్నారు.. ఇది సరైన పద్దతి కాదంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని.. ప్రధాన ప్రతిపక్షాన్ని అల్లరి పాలు చేసే కుట్రలు చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘రెడ్బుక్లో ఉన్నవారిని వేధిస్తూ ఇదే మా పాలన తీరు అని చెబుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను తీవ్రవాదులను వేటాడినట్టు వేటాడుతున్నారు. రెండేళ్లలోనే కూటమి గ్రాఫ్ పడిపోయింది’’ అని ధర్మాన పేర్కొన్నారు. -
ఆన్లైన్లో పాలిసెట్ హాల్ టికెట్లు
ఎచ్చెర్ల: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఈ నెల 25వ తేదీన నిర్వహిస్తున్న ఏపీ పాలిసెట్–2026కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల హాల్టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని పాలిటెక్నిక్ ప్రవేశాల జిల్లా సహాయ కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.నారాయణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర యాప్) 95523 0009 లోనూ, http:polycetap.ap.gov.in వెబ్సైట్లోనూ హాల్టికెట్లు పొందవచ్చునని చెప్పా రు. హాల్టికెట్లు పొందని, డౌన్లోడ్లో ఇబ్బందులు ఉన్నవారు ఈ నెల 20వ తేదీ నుంచి సమీపంలో ఉన్న సహాయ కేంద్రాన్ని సంప్రదించాలన్నారు. టెక్కలి రూరల్: స్థానిక కోదండరామ వీధిలో శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ నిర్వహించా రు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు ఆధ్వర్యంలో టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ తన సిబ్బంది తో కలసి ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కోదండరామ వీధిలో సుమారు 60 ఇళ్లు సోదా చేసారు. అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు. అలానే వీధిలోని సుమారు 90 వాహనాల రికార్డులను పరిశీలించి సరైన పత్రాలు లేని 12 ద్విచక్రవాహనాలతో పాటు ఆటోను గుర్తించి వాటిని స్టేషన్కు తరలించారు. మాదక ద్రావ్యలు వాడటం వల్ల వచ్చే అనర్థాలను వివరించారు. ఇచ్చాపురం: మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కలెక్టర్ గ్రీవెన్స్కి 53 వినతులు వచ్చాయి. ఈ గ్రీవెన్స్ ముఖ్యంగా మున్సిపాలిటీలో కొటేరు బంద–కోదండరామచెరువు మధ్య 212/2 సర్వేనంబర్లో 34.30 ఎకరాలుండగా ప్రస్తుతం సుమారుగా 10.52 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని ఈ ఆక్ర మణలను తొలగించాలని, మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూ పాలని, బాహుదానది పై కొత్తవంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, బెల్లుపడ వరదగట్టు నిర్మాణం చేపట్టాలని, నియోజకవర్గ ప్రజ ల ఆరోగ్యం దృష్ట్యా 100 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని, కవిటిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణం చేపట్టాలని, మినీ స్టేడియం నిర్మించాలని వినతి పత్రాలు అందజేశారు. ప్రభుత్వ బడుల్లోనే పిల్లల్ని చేర్పించండి కంచిలి: బడి ఈడు పిల్లల్ని అన్ని సౌకర్యాలు, చక్కని విద్యాబోధన చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. మండలంలోని మఠం సరియాపల్లి గ్రామ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు శనివారం నిర్వహించిన బడి పిలుస్తోంది ర్యాలీలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. హిరమండలం: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గంగరాపు సింహాచలం విమర్శించారు. ఎల్ఎన్పేట మండలం మోదుగువలస ఆర్అండ్ఆర్ కాలనీలో వేతనదారులతో శనివారం ఆయన మాట్లాడారు. వేతనదారులకు ఫేస్ రికగ్నేషన్ యాప్, రెండు పూటలా పని రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 20న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పేదల కోసం రూపొదించిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్ర భాగస్వామ్యాన్ని తగ్గించడం దారుణమన్నారు. -
‘బడి పిలుస్తోంది’లో ప్రజలను భాగస్వామ్యం చేయండి
నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా బడి పిలుస్తోంది కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములుగా చేయా లని డీఈఓ ఎ.రవిబాబు, ఏపీసీ వేణుగోపాలరావు అన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా శనివారం మండలం సత్యవరం జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలకు డీఈఓ, ఏపీసీలు వచ్చారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యా యులతో పాటు పాల్గొన్నారు. కొన్ని ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 23వ తేదీ వరకూ రోజూ అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలు జరగాలని సూచించారు. పెద్దఎత్తున విద్యార్థులను చేర్చుకోవాలని అన్నారు. -
చిట్టీల పేరిట టీడీపీ నేత టోకరా
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గుజరాతీపేట సమీప ఫాజుల్బేగ్ పేటలో నివసిస్తున్న టీడీపీ డివిజన్ ఇన్చార్జి సురకాశీ వెంకటరావు చిట్టీలు, వడ్డీ డబ్బుల పేరిట రూ. కోట్లలో మోసగించారని బాధి తులు శనివారం ఆందోళన నిర్వహించారు. సుమా రు 30 మంది బాధితులు ఫాజుల్బేగ్పేట దేవాంగు ల వీధి మర్రిచెట్టు వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. వెంకటరావు కాంట్రాక్టు పనులు చేసుకుంటూ తమ వద్ద చిట్టీల పాట పేరుతో డబ్బులు తీసుకుని ఆరునెలలుగా పరారైపోయాడరని, ఎక్కడ ఉన్నాడో తెలీదని బాధితులు వాపోయారు. బాధితుల్లో మాదిరెడ్డి కృష్ణకు మారి, జనా దివ్య, పొట్నూరు కల్పన, మావూరు రోజా, కిరిగి సంతోష్కుమార్, దారపు శ్రీనివాస్, తోటాడ ఈశ్వరమ్మ, గొంటిముక్కల శివప్రసాద్, మరికొందరున్నారు. రెండో పట్టణ పోలీసులను సంప్రదించగా బాధితులు తమను ఇంకా సంప్రదించలేదని, కేసు నమోదు చేయలేదన్నారు. -
వాడీవేడిగా నేర సమీక్ష సమావేశం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నెలవారీ నేర సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ఉదయం 11 గంటలకు మొదలైన సమీక్ష రాత్రి 8 గంటల వరకు సాగడం విశేషం. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ముఖ్యంగా పెండింగ్ కేసుల దర్యాప్తులో అలసత్వం, గంజాయి అక్రమ రవాణా, అంతర్రాష్ట్ర ముఠాల చొరబాటు, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి అధికారులకు కాస్త గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం. ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి చొరబాటుదారు లు మాల్తో అక్రమంగా ప్రవేశించి ఇక్కడి యువతకు విక్రయించడాన్ని అరికట్టలేకపోవడం, ఇటీవలి పాతపట్నం గంజాయి అంశంపై అక్కడి సిబ్బంది సమాచార గోప్యత పాటించకపోవడంపై ఎస్పీ గట్టిగానే మాట్లాడారు. ముఖ్యంగా గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను ట్రేస్ చేసి కోర్టులో హాజరుపర్చాలన్నారు. సోంపేట ఎస్హెచ్ ఓ పరిధిలో అధికంగా పెండింగ్ కేసులు ఉండటంపై మాట్లాడారు. డైనమిక్ బీట్ సిస్టమ్ అమలు.. జిల్లాలోకి గత కొంతకాలంగా అంతర్రాష్ట్ర ముఠాలు చొరబడి భారీ చోరీలు చేసే అంశంపై రాత్రి వేళ డైనమిక్ బీట్ సిస్టమ్ను సమర్థంగా అమలుచేయాలని, బీట్లను పునర్ వ్యవస్థీకరించి అవసరమైన ప్రాంతాల్లో బీట్ సంఖ్యను పెంచాలని ఎస్పీ మాట్లాడారు. నేరాలు జరిగే ప్రాంతాల్లో బీట్ సిబ్బంది నిరంతర గస్తీ నిర్వహించాలన్నారు. సాంకేతికతతో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మిస్సింగ్ కేసులను వేగవంతంగా ఛేదించాలని, సీసీటీవీ, డేటా ఎనాలసిస్ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించాలని, వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను డిస్పోజ్ చేయాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎక్కువగా కట్టి రోడ్డు ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, భవానీ, స్పెషల్బ్రాంచి, సీసీఎస్, టాస్క్ఫోర్స్, లా అండ్ ఆర్డర్ సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు. -
కాలేయమే కీలకం!
అరసవల్లి: మానవ ఆరోగ్యంలో కాలేయం (లివర్) పాత్ర అత్యంత కీలకం. మనం బాగుండాలంటే లివర్ బాగుండాలని ప్రముఖ గాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీహర్ష పల్లె సూచించారు. సమతుల్య ఆహారం తీసుకోవడం, తగిన వ్యాయామం, మద్యానికి దూరంగా ఉండటంపై పలు సూచనలను చేశారు. ఆదివారం ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపించే కారకాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సాలిడ్ హేబి ట్స్– స్ట్రాంగ్ లివర్’ అనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ లివర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇదే విధానాన్ని ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని వివరించారు. ధూమపానం, మద్యపానం వద్దు.. కాలేయాన్ని ప్రభావితం చేసేలా ఫ్యాటీ లివర్, హెపటైటిస్ ఎ, బి,సి,ఇ, సిర్రోసిస్ తదితర వ్యా ధులుంటాయి. అధికంగా మద్యాన్ని సేవించిన, సిగరెట్లు తాగిన వారి లివర్ తక్కువ కాలంలోనే పాడయ్యే అవకాశముంది. కొందరు ఎలాంటి అలవాట్లు లేకపోయినప్పటికీ తగిన వ్యాయామం చేయకపోవడంతో పాటు జన్యుపరమైన కారణాలతో అధిక కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్యలతో తీవ్ర అవస్థలు పడుతుంటారు. అలసట ఎక్కువగా ఉండడం, పచ్చకామెర్లు, వాంతులు, పొట్టనొప్పి, ఆకలి లేకపోవడం తదితర లక్షణాలుంటే హెపటైటిస్–బి లక్షణాలుగా గుర్తించవచ్చు. సిర్రోసిస్ (లివర్ గట్టిపడి స్కార్ టిష్యూ ఏర్పడటం) వారిలో లివర్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. ఫ్యాటీ లివర్ ఉంటే పకోడిలు, బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, కూల్ డ్రింకులు, స్వీట్లు, కేక్లు, చిప్స్, మైదా, ఆల్కహాల్ తదితర వస్తువులు సేవించకూడదు. లివర్ను కాపాడుకునేందుకు కొబ్బరినీరు, తాజా పండ్లు, పైబర్ (పీచు) పదార్థాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాల్సిందే.. పెరుగుతున్న కేసులు.. జిల్లాలో ఇటీవల కాలంలో లివర్ డామేజ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. 2010 నుంచి జిల్లాలో కేసుల సంఖ్య నెలకు సగటున 10 వరకు కేసులు నమోదవుతున్నాయి. క్రమేణా 2014 నుంచి మద్యం అధికంగా అమ్ముడుకావడంతో పాటు కల్తీమద్యం కూడా అందుబాటులోకి వచ్చేయడంతో మందుబాబుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. జిల్లాలో మద్యం ఏరులా పారుతున్న క్రమంలో లివర్ కేసులు కూడా అంతే స్థాయిలో కనిపిస్తున్నాయి. కాలేయ సమస్యలతో ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు చేసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్యలున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటికే 55 శాతం మందికి ఫ్యాటీ లివర్ కేసులున్నట్లుగా అంచనా. డయాబెటిక్ కేసులు పెరగడం కూడా ఇందుకు మరో కారణంగా చెబుతుంటారు. ప్రస్తుతం పది కేసుల్లో ఇద్దరికి లివర్ క్యాన్సర్ సోకుతున్నట్లుగా అంచనా. కాలేయం(లివర్)పై జాగ్రత్తలు అవసరం అధిక మద్యం సేవించడంతో తీవ్ర ప్రభావం ఫ్యాటీ లివర్తో పెను ముప్పు నేడు ప్రపంచ కాలేయ దినోత్సవం -
అమ్మవారి పండగల్లో వసతులు కల్పించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి మే 24 వరకు అమ్మవారి పండుగలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించాలని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెంటాడ వెంకట పద్మావతి కోరారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హనుమంతు కూర్మారావుకు శనివారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరసవిల్లి, మండల వీధి, మహలక్ష్మినగర్ కాలనీ, చిన్న మండల వీధి, కుమ్మరి వీధి, రుప్ప వీధి, దుడ్డి వీధి, గురిటిపోలమ్మ అమ్మవారి ప్రాంగణం, స్టేట్ బ్యాంకు కాలనీ, గైనేటి వీధి, పెద్ద బరాటం వీధి ప్రాంతంలో జరగనున్న అమ్మవారి పండుగల సందర్భంగా మౌలిక వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని కోరారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం ఓ గంట అదనంగా తాగునీరు విడుదల, రోజువారీగా చెత్త తొలగింపు, డ్రైనేజీ పనులు, డయేరియ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల దమ్మలవీధి, బలగ ప్రాంతాల్లో నమోదైన అతిసార వ్యాధి పునరావృతం కాకుండా చూడాలన్నారు. శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంచాలని, ఆహారం కల్తీకాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. అరసవిల్లి నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు డివైడర్స్ తాత్కాలికంగా తొలగిస్తే ప్రజల రాకపోకలు సాఫీగా జరిగే అవకాశం ఉందన్నారు. కమిషనర్ని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి, అలపాన త్రినాథ్ రెడ్డి, బీసీ విభాగం నాయకులు రౌతు సూర్యనారాయణ, జయరాం, శోభన్, గుడికోటి బాల, నగరపు బాబూరావు, రుప్ప లక్ష్మణ, తిరగడి లక్ష్మణ, రషీద్, శ్రీను, జామి ప్రమోద్, ఖలీల్ భాష, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మలా మోసి.. నాన్నలా కాచి
తమ్ముడు నడవ లేడు. రోజూ వచ్చే నాన్న ఇంకా రాలేదు. మధ్యాహ్నం ఎండ మండిపోతోంది. తనకేమో కాళ్లకు చెప్పులు కూడా లేవు. బరువు లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేవాడే. కానీ తమ్ముడిని భుజాన మోశాడు. చిన్నతనంలో పెద్దరికం చూపించాడు. ఈ చిత్రంలో భుజాన ఉన్న అబ్బాయి పేరు కింతలి రూపే. ఊరు అలుదు. మజిల్ డిజార్డర్ వల్ల బడికి నడిచి వెళ్లే పరిస్థితి లేదు. రోజూ తండ్రి వెంకటరమణ బైక్పై బడికి తీసుకెళ్లి తీసుకువస్తుంటారు. శుక్రవారం ఆయన బడికి రావడం ఆలస్యమైంది. ఒంటి పూట కావడంతో మధ్యాహ్నం ఎండ చుర్రుమంటోంది. తండ్రి రాక ఆలస్యం అవుతుండడంతో రూపేష్ అన్న గోవర్ధన్ ఇలా తమ్ముడిని భుజాన మోసుకుంటూ బడికి సమీపంలోని ఓ ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. కాళ్లకు చెప్పులు లేకపోయినా.. ఎండ ధాటికి పాదా లు కాలిపోతున్నా నవ్వుకుంటూ తమ్ముడిని తీసుకెళ్లాడు. అమ్మలా మోసి.. నాన్నలా కాపు కాచి అన్న అనిపించుకున్నాడు. తండ్రి వచ్చాక ముగ్గురూ బండిపై ఇంటికెళ్లారు. తమ్ముడిని గోవర్ధన్ ప్రేమగా మోసుకెళ్తున్న దృశ్యం ముచ్చట గొలిపింది. – సారవకోట, శ్రీకాకుళం జిల్లా -
నేతతో జట్టు.. ఉద్యోగం ఫట్
అత్యుత్సాహానికి ఫలితం కంపెనీలో తనకు తిరుగులేదన్న ధోరణితో ఉద్యోగి ఉండేవాడు. నియోజకవర్గ నేత తన వాడని అహంకారం చూపించేవాడు. ఇటీవల యూబీ బీర్ల కంపెనీలో జరిగిన ఆడిట్లో ఇతగాడి ప్రమేయం ఉన్న పలు అవకతవకలు బయటపడ్డాయి. నేత ఉన్నాడు కదా.. తనకేమీ కాదని అనుకున్నాడు. కానీ ఉన్నత స్థాయి అధికారులు మాత్రం క్షమించలేదు. నేరుగా కంపెనీకి వచ్చి ఆ ఉద్యోగిని గేటు వద్దకు పిలిపించి కంపెనీకి సంబంధించి ఆయన దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి బయటికి పంపించేశారు. నేత ఏదో కాపాడుతారనుకుంటే బూమరాంగ్ అయిందని, ఇతగాడిపై వేటుతో మిగతా తొత్తులు కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొందని కంపెనీలోనే కాదు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అతడు ఓ ఉద్యోగి. జీతం తీసుకుంటున్న సంస్థ కోసం పని చేయడం అతడి విధి. వేతనం ఇస్తున్న యాజమాన్యానికి విధేయుడిగా ఉండడం అతడి కర్తవ్యం. కానీ అతడు ఓ నాయకుడి ప్రాపకాన్ని సంపాదించి అత్యుత్సాహం ప్రదర్శించాడు. జీతం ఇస్తున్న కంపెనీని ఆ నాయకుడికి దాసోహం చేయడానికి అన్ని విధాలుగా సహకరించాడు. అక్రమాలు బట్ట బయలు కావడంతో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఆఖరుకు ఆ నాయకుడు కూడా కాపాడలేకపోయాడు. ఎచ్చెర్ల నియోజకవర్గ కీలక నేతకు, యూబీ బీర్ల కంపెనీ అధికారులకు మొదట్లో పడేది కాదు. చాలా వ్యవహారాలు పోలీస్స్టేషన్ వరకు వెళ్లాయి. అయితే మధ్యలో ఏం జరిగిందో గానీ యూబీ బీర్ల కంపెనీ అధికారులు ఆ నేత దారికొచ్చారు. ఆ నేత చెప్పినట్టే ఆడుతున్నారు. ఉద్యోగుల్లో ఎవరిని ఉంచాలో.. ఎవరిని తీసేయాలో నిర్ణయించే స్థాయికి సదరు నేత వెళ్లిపోయాడు. దీంతో ఒకరిద్దరు ఉద్యోగులు అత్యుత్సాహం చూపించడం మొదలు పెట్టారు. కంపెనీలో చేయాల్సిన కార్యకలాపాలను కీలక నేత ఇంటి వద్దనే ఉండి చేస్తూ ఉండేవాడు. పలు లావాదేవీల్లో రూ. కోట్లలో లబ్ధి చేకూర్చారు. కానీ ఒక రోజు ఆ ఉద్యోగి బాగోతం బయటపడింది. ఆడిట్లో అవకతవకలు వెలుగు చూశాయి. ఇంకేముంది ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే ఆయన్ని ఏకంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కాపాడతారనుకున్న కీలక నేత ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడిది ఎచ్చెర్ల నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. యూబీ బీర్ల కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఎచ్చెర్ల నియోజకవర్గ నేతకు దాసోహమైపోయాడు. కంపెనీలో ఉండి పనిచేయాల్సిన ఆ ఉద్యోగి ఆ నేత ఇంటి వద్ద ఉండి లబ్ధి చేకూర్చాడు. ఏ రకంగా వెళ్తే భారీగా డబ్బులు దోచుకునే అవకాశం ఉందో సలహా ఇచ్చి, దగ్గర ఉండి కాగల కార్యాన్ని పూర్తి చేసేవాడు. యూబీ బీర్ల కంపెనీ నుంచి బీర్ల రవాణా కోసం ట్రాన్స్పోర్ట్ టెండర్ల నుంచి ఉద్యోగాల కల్పన వరకు చేతివాటం ప్రదర్శించాడు. సాధారణంగా ఇతర ప్రాంతాలకు బీర్ల రవాణాకు ట్రాన్స్పోర్ట్ లారీలకు టెండర్లు పిలిచి, రవాణా బాధ్యత అప్పగిస్తారు. ఈ క్రమంలో ఏ రూట్కు ఎంత అనేది నిర్ణయించుకుని, ఆశావహులు టెండర్లు వేస్తారు. కానీ, ఇక్కడ ఇతర పోటీదారుల రాకుండా ముందుగానే వారిని బెదిరించడం, ఎన్ని చేసినా కొందరికి దక్కే కాంట్రాక్ట్ను బెదిరించి లాక్కోవడం వంటి ఘటనలు కీలక నేత ప్రమేయంతో జరిగాయి. తనను కాదని ఎవరైనా లారీలు తిప్పడానికి ప్రయత్నిస్తే కదలనివ్వకుండా అడ్డుకోవడం, రోజుల తరబడి అక్కడే ఉండిపోయేలా అడ్డంకులు సృష్టించడం వంటివి జరిగాయి. ఈ బాధ భరించలేక పోటీలో టెండర్లు దక్కించుకున్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు కూడా కీలక నేతకు తలొగ్గారు. ఇలా అంతా తానై బీర్ల కంపెనీలో ఆ నేత చక్రం తిప్పుతున్నాడు. ఇక, ఆయనకు ఎదురు లేదని ఒక ఉద్యోగి అత్యుత్సా హం ప్రదర్శించాడు. నేత చెప్పిందల్లా చేయడమే కాకుండా అడ్డగోలుగా ఎలా సంపాదించాలో సల హా ఇచ్చి ఆ పని చేయించేవాడు. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ధరలు పెంచి పెట్టడం, లోకల్ మెయింటెనెన్స్ వర్క్ల పేరుతో అవకతవకలకు పాల్పడటం, ఉద్యోగాల కల్పన పేరుతో చేతివాటం ప్రదర్శించడం వంటివి చేసేవాడు. యూబీ బీర్ల కంపెనీలో జరిగిన ఘటనపై ఎచ్చెర్ల నియోజకవర్గంలో చర్చ నియోజకవర్గ నేతకు జీహుజూర్ అంటూ పనిచేసిన ఉద్యోగి అక్రమాలు వెలుగు చూడడంతో ఉద్యోగం నుంచి తొలగింపు కాపాడలేకపోయిన నాయకుడు -
వేడుకలకు వేళాయె..!
పాతపట్నం: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి యాత్రా మహోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 19 నుంచి 27 వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి 51వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్ అక్కందర సన్యాసిరావు, ఈఓ టి.వాసుదేవరావులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలు ఇలా.. ● ఈ నెల 19న వర్ధినీ కలశస్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అఖండ దీపస్థాపనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 20న కుంకుమార్చన, రద్ర హోమాలు, మహారాజ భోగాలు, 21న అష్టోత్తర శతనామార్చనలు, మూలమంత్ర, మంటపస్త దేవతా హోమాలు, 22న లలితా త్రిశతి నామార్చనలు, శ్రీ సూక్త, దుర్గా సూక్త హోమాలు, 23న లక్ష్మీనారాయణ హోమాలు, 24న రుద్ర హోమాలు, 25న వర్థనీ కలశోద్వాసనాలు, అపబంబృంద స్నానం, 26న త్రిశత నామకుంకుమార్చనలు, వర్ధని పూజలు, 27న బలిహరణ, మహా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. ● 20న సాయంత్రం 6 గంటల నుంచి బొమ్మిక గ్రామస్తుల భజన, 21న సాయంత్రం 5.30 గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు, 22న రాత్రి 8 గంటలకు నరసన్నపేట చంద్రమౌళి బుర్రకథ, 23న సాయంత్రం 6 గంటలకు హిమగిరి మాస్టారు ఆధ్వర్యంలో భరతనాట్యం, కూచిపూడి నత్యప్రదర్శన, 25, 26, 27వ తేదీల్లో ప్రతీ రోజు సాయంత్రం 4 గంటలకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, 27న సంగిడీ, ఉలవ బస్తా పోటీలు జరుగుతాయి. అమ్మవారి మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్య లు తీసుకుంటు న్నాం. ఆలయానికి రెండు రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం. – అక్కందర సన్యాసిరావు, చైర్మన్, నీలమణిదుర్గ ఆలయం, పాతపట్నం 19 నుంచి పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి యాత్రా మహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు -
శ్రీకాకుళం
భూ రికార్డుల్లో తప్పిదాలు సహించబోము: కలెక్టర్ శనివారం శ్రీ 18 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026హిరమండలం: భూ రికార్డుల నమోదులో ఒక్క తప్పు జరిగినా సహించేది లేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. ఎల్ఎన్పేట మండలంలోని సిద్ధాంతంలో గురువారం ఆపరేష న్ వెరిఫికేషన్ చేపట్టారు. గ్రామంలో 405 ఖాతాలకు సంబంధించి స్థితిగతులను పరిశీలించా రు. గతంలో ఇదే గ్రామంలో 359 ఖాతాలకు సంబంధించి తప్పులు దొర్లాయి. దీంతో సరిచేసే పనిలో పడ్డారు. చనిపోయిన వారి పేరిట రికార్డు లు, మిగతా ఖాతాల్లో చిన్నచిన్న లోపాలను గుర్తించిన కలెక్టర్ వీఆర్వోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సరిచేయాలని ఆదేశించారు. సిద్ధాంతం గ్రామంలో సరుబుజ్జిలి మండలం పర్వతాలపేట కు చెందిన అరసవల్లి సోమేశ్వరరావుకు భూమి ఉంది. దీంతో గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని పర్వతాలపేట వెళ్లారు. అక్కడ రైతుతో మాట్లాడారు. రికార్డులు సరిగ్గా ఉన్నాయో లేదో ఆరా తీశారు. -
మెళియాపుట్టిలో వినతుల స్వీకరణ
మెళియాపుట్టి: మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జీపీఆర్ఎస్ గ్రీవెన్స్ ద్వారా శుక్రవారం సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యాప్తంగా 164 మంది వారి సమస్యలను అర్జీల రూ పంలో అందించినట్లు ఆయన పేర్కొన్నారు. రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనపై వినతులు అందించినట్లు తెలిపారు. మండలకేంద్రంలో నూతన అంగన్వాడీ కేంద్రం నిర్మించాలని కోరారు. పీఓ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు. అనంతరం నందవ కొత్తూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పరిశీలించారు. పెద్దమడి గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ, ఇతర సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి వైద్యులు సమయ పాలన పాటించాలని అంటూనే మందుల నిల్వలు ఇతరాలు పరిశీలించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆ దేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ గ్రీవెన్స్లో 9 దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన అర్జీల్లో వికలాంగ పింఛన్లు మంజూరు కోరు తూ 2 దరఖాస్తులు, బ్యాటరీ వెహికల్స్ మంజూరు చేయాలని కోరుతూ 2 దరఖాస్తులు, ఉపాధి కల్పించాలని కోరుతూ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు 2 దరఖాస్తులు, సదరం సర్టిఫికెట్లో పుట్టిన తేదీని మార్చాలని కోరుతూ 1 దరఖాస్తు, చేపల వ్యాపారం చేసుకోవడానికి దివ్యాంగులకు ఉపయోగపడే వెహికల్ మంజూరు చేయాలని కోరుతూ 1 దర ఖాస్తు, మానసిక వికలాంగుని వైద్యం, మందులు ఇప్పించాలని కోరుతూ 1 దరఖాస్తు వచ్చాయి. కొత్తదిబ్బల పాలెం గ్రామానికి చెందిన వికలాంగురాలు చేసుకొన్న దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని డీఆర్డీఏ పథక సంచాలకులు కిరణ్ కుమార్ను ఆదేశించారు. అలాగే మానసిక వికలాంగునికి వైద్యంతో పాటు ఉచిత మందులు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ‘భూములు ఇచ్చేదే లేదు’ వజ్రపుకొత్తూరు రూరల్: తాతల కాలం నుంచి ఉద్యాన పంటలను నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్న తాము అవసరమైతే ప్రాణాలను ఇస్తాం.. కానీ ఎట్టి పరిస్థితిలో భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమంటూ రైతులు తేల్చిచెప్పారు. మండలంలో గల మోట్టూరు గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి స్థానిక తహసీల్దార్ డి.సీతారామయ్య ఆధ్వర్యంలో భూ సేకరణ కోసం గ్రా మస్తులతో ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధికారులు రైతుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టు విషయంలో నాయకులకే ఒక స్పష్టత లేదని, ఒక రోజు కార్గో ఎయిర్ పోర్టు అంటున్నారు, మరో రోజు డొమెస్టిక్ ఎయిర్ పోర్టు అంటున్నారని విమర్శించారు. పాలకులకే స్పష్టత లేనప్పుడు పరిహారంపై ఎన్నో సందేహాలు ఉన్నాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తయ్యే సమయానికి యువతకు ఉద్యోగ అర్హత వయస్సు దాటితే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్దానంలో ఉన్న లక్షలాది చెట్లను ధ్వంసం చేస్తే పర్యావరణానికి ముప్పు కలగదా అని ప్రశ్నించారు. జీడికి మద్దతు ధర ఇవ్వని వారు భూములు అడగడం విడ్డూరమన్నారు. సమావేశంలో పా తపట్నం, ఆమదాలవలస తహసీల్దార్లు ప్రసాదరావు, రాంబాబు, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతి, ఎస్ఐ బబి నీహర్, వీఆర్ఓలు ప్రసాద్, షణ్ముఖ, యర్రయ్య, తిరుపతి, శ్రావణ్ తదితరులు ఉన్నారు. -
‘జలం–జీవం’కు సిద్ధం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లావ్యాప్తంగా శనివారం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల ‘జలం–జీవం’ అనే నినాదంతో నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వేసవి దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. అలాగే చెరువులు, కుంటలు వంటి జల వనరుల వద్ద పేరుకుపోయిన చెత్తను తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, కాలువల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశా రు. మురుగునీటి నిర్వహణలో భాగంగా ఇంటింటికీ ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించాలని, శుద్ధి చేసిన నీటిని మొక్కలకు పోసేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
● సరికొత్త కోకో గింజల యూనిట్
కోకో గింజలను ఆరబెట్టడానికి సోలార్ క్రాప్ డ్రైయర్ ఆధునిక, లాభదాయకమైన సాంకేతికత అని రణస్థలం ఉద్యానవన అధికారి ఏ.అమరేశ్వరి తెలిపారు. రణస్థలం మండలం నారువ గ్రామంలో జిల్లాలోనే మొదటిసారిగా నిర్మించిన సోలార్ క్రాప్ డ్రైయర్ యూనిట్ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సూర్యరశ్మిని ఉపయోగించి గింజల్లోని తేమను 5–7 శాతానికి తగ్గిస్తుందని, తద్వారా నాణ్యమైన చాక్లెట్ తయారికీ అవకాశం కలుగుతుందన్నారు. ధూళి నుంచి రక్షణతో పాటు వర్షాకాలంలో కోకో ఆరబెట్టుకోవచ్చునని వివరించారు.యూనిట్ ఖరీదు రూ.3,50 లక్షలు కాగా ప్రభుత్వ రాయితీ రూ.1.40 లక్షలు ఇస్తుందని తెలిపారు. – రణస్థలం -
ఫెయిలయ్యావా..?
మనసును గాయపర్చవద్దు.. పిల్లల్లో సున్నితమైన మనస్తత్వం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏది తప్పు, ఏది కరెక్ట్ అని అంచనా వేసుకోలేరు. ముఖ్యంగా పరీక్షల్లో ఫెయిల్ అయిన వెంటనే తల్లిదండ్రులు కోపగించుకుంటారనే భయంతో అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. అలాంటి ప్రమాదాలకు గురి కాకుండా తల్లిదండ్రులే వారికి మనోధైర్యం కల్పించాలి. చిన్న తనం నుంచి ఓటమిని ఎలా ఎదుర్కొనాలి అనే విషయాన్ని వారిలో పదే పదే గుర్తు చేయాలి. దీని వల్ల భవిష్యత్లో ఎలాంటి ఓటమినైనా ఎదుర్కొనే శక్తి పిల్లల్లో వికసిస్తుంది. – నిర్మల్ అలెగ్జాండర్, మానసిక వైద్య నిపుణుడు, జిల్లా ఆస్పత్రి, టెక్కలి. టెక్కలి: ఫెయిలయ్యావా..? అయితే ఏం. తలుపు తట్టిన ఓటమి నీకు పాఠం నేర్పిస్తుంది. నేర్చుకుంటే అదే విజయాలకు దారి చూపుతుంది. పురాణాల నుంచి ఇప్పటివరకు చరి త్ర మార్చే విజయాలు సాధించిన వారంతా ఎప్పు డో ఒకప్పుడు ఫెయిలైన వారే. తన ప్రయత్నం వృథా అయిందని థామస్ ఆల్వా ఎడిసిన్ ఆత్మహత్య చేసుకుని ఉంటే మనకు బల్బు వాడే భాగ్యం ఉండేది కాదు. ఫెయిల్ అయిన ప్రతిసారీ ఆయన కొత్త విషయాలు నేర్చుకున్నారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎంట్రన్స్లో ఓటమి చెందిన అబ్దుల్ కలాం ప్రపంచం మెచ్చిన గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. సాఫ్ట్వేర్ దిగ్గజం బిల్గేట్స్ ఎన్నో ఓటములు చవి చూసిన తర్వాత చివరగా మైక్రోసాఫ్ట్ను రూపొందించారు. ఏమో ఇప్పుడు ఇంటర్ ఫెయిలైన విద్యార్థి రేపు పట్టుదలతో చదివి సివిల్స్ సాధించవచ్చేమో. ఎవరికి తెలుసు. తక్కువ మార్కులు తెచ్చుకున్న వారే తన కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారేమో.. చెప్పలేం కదా. కాలం ఇచ్చే బహుమతి అందుకోవాలంటే.. ఇలాంటి పరీక్షలకు తట్టుకుని నిలబడాలని పెద్దలు చెబుతుంటారు. అఘాయిత్యం వద్దు.. ప్రస్తుతం వివిధ రకాల పరీక్షల ఫలితాల నేపథ్యంలో పరీక్షల్లో తప్పామని, తల్లిదండ్రులు కోపగించుకుంటారనే భయంతో ఎంతో మంది విద్యార్థులు నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించేస్తున్నారు. ర్యాంకులే జీవితాలను శాసిస్తాయనే భ్రమలో బతికేస్తున్నారు. ఎంతో మంది చదువు లేకపోయినా గొప్ప గొప్ప విజయాలు సాధించిన వారు ఉన్నారు. పరీక్షల్లో తప్పితే పిల్లల పై ఎలాంటి కోప, తాపాలు లేకుండా వారిలో మనోధైర్యం కల్పించాల్సింది తల్లిదండ్రులేనని నిపుణులు సూచిస్తున్నారు. జీవితంలో ఎలా గెలవాలి అనే దానిపై వారికి ధైర్యం కల్పించాలని హితవు పలుకుతున్నారు. మనసు బాగోలేదా.. పరీక్షల్లో తప్పి మనసు బాగోలేకపోతే.. బాధ చెప్పుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆత్మహత్యలకు ప్రేరేపించే వేళ కొన్ని రకాల మానసిక సిబ్బందితో నేరుగా ఫోన్లో సమస్యలను చెప్పుకోవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం టెలీమానస్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెంట్స్ అండ్ నెట్ వర్కింగ్ అక్రాస్ స్టేట్ పేరుతో 14416, 18008914416 ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచారు. ఆయా నంబర్లకు ఫోన్ చేసి ఆత్మహత్యకు ప్రేరేపించే సమస్యలను విన్నవిస్తే, వారు ఆ ప్రమాదం నుంచి ఎలా బయట పడాలి అనే దానిని వివరిస్తారు. ఈ విషయంలో వివరాలు గోప్యంగా ఉంచుతారు. చరిత్ర మెచ్చిన విజయాలు సాధించిన వారంతా ఓటమి చవి చూసిన వారే పరీక్షల్లో ఓటమితో దిగులు అనవసరం మళ్లీ గెలుపుపై దృష్టి పెట్టడమే విజేతల లక్షణం మనసు బాగోకపోతే మార్గాలున్నాయ్ ర్యాంకులే కాదు.. జీవితం ముఖ్యం పరీక్షల్లో ర్యాంకులే కాదు.. విజయం సాధించడానికి జీవితం ముఖ్యం. ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఎన్నో రకాల ఒడిదొడుకులను ఎదుర్కొని ప్రపంచ మేధావులుగా ఎదుగుతున్నారు. పిల్లలను అతి గారాబం చేసే చర్యల వల్ల కొన్ని సందర్భాల్లో ఓటమిని తట్టుకోలేరు. విజయానికి ఓటమి, గెలుపు రెండూ అవసరమని వారిలో ధైర్యం కల్పించాలి. – వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, టెక్కలి -
మత్స్యకారులను ఆదుకున్నది వైఎస్ జగనే
పొలాలు తీసుకుంటే ఉద్యమిస్తాం ● ఓటుబ్యాంకుగా వాడుకున్నది చంద్రబాబే ● పోర్టుల ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలి ● మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో మత్స్యకారులను ఓటుబ్యాంకుగా వాడుకుని వదిలేయడం తప్ప ఒక్క పోర్టు నిర్మాణానికై నా శ్రీకారం చుట్టారా అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్య కారులు, తీర ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే... నారా లోకేష్ ఇంకా పాత పద్ధతిలో అక్క, చెల్లి, చిన్నాన్న, గొడ్డలి అంటూ ఎద్దేవా చేయడం దారుణమన్నారు. ఆయన శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టాక మంగిడిపూడి బీచ్లో బీచ్ ఫెస్టివల్ చేసుకోవటం తప్ప ఇంకేమైనా చేశారా అని ప్రశ్నించారు. జీఓ నంబర్ 217ను ఆనం రామనారాయణరెడ్డి లాంటి పెత్తందారుల నుంచి రిజర్వాయర్లను కాపాడి మత్స్యకా రులకు మేలు చేయడానికి తెచ్చారన్నారు. మంత్రి నారా లోకేష్కి కొల్లు రవీంద్ర బినామీ అని రాష్ట్రంలో అందరూ అంటున్నారని తెలిపారు. జువ్వలదిన్నెలో కనీసం తట్టెడు మట్టిగాని ఒక్క ఇటుకై నా వెయ్యకుండా టీడీపీ నాయకులు అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు. వైఎస్ జగన్ అక్కడ పనులన్నీ పూర్తి చేశాకే టీడీపీ వచ్చిందన్నారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటుకు అప్పగించడం దారుణమన్నారు. జువ్వలదిన్నె హార్బర్ 800 మీటర్ల బెర్త్లో 11250 బోట్లు పార్కింగ్కి సరిపోద్దని, బోట్లు పెరిగితే అది సరిపోదన్నారు. అందులో 25ఎకరాల భూమిని 40 శాతం బెర్త్ని సాగర్ డిఫెన్స్ వాళ్లకు కేటాయించారని, మిగతాది మత్స్యకారులకు వాడుకోండని అంటున్నారని, నిజంగా అది రక్షణ శాఖదైతే మత్స్యకారులకు అందులోకి అనుమతించరు కదా అని ప్రశ్నించారు. కావాలంటే వారికి మరోచోట ఇచ్చుకోవచ్చని వివరించారు. నారా లోకేష్కు చేతనైతే హార్బర్ పూర్తి చేసి మేం పూర్తి చేస్తున్నామని చెప్పుకోండి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తామంటే మత్స్యకారుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లు మాయం అయిపోతే పోలీసులు చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. భావనపాడులో పోర్టు నిర్మిస్తామని టీడీపీ నేతలు ఏళ్ల తరబడి తాత్సారం చేసి కాలం గడిపేశారే తప్ప ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోయారని, చేయాలన్న సంకల్పం ఉంటే సాధ్యపడుతుందని అది వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసి చూపించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం ఇవ్వటానికి వేల కోట్లు ఖర్చుచేయాలని, అందులో కోట్లాది రూపాయిలు కమీషన్లు కొట్టేయవచ్చన్న అచ్చెన్న, రామ్మోహన్నాయుడుల ఆలోచనలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెక్ పెట్టిందన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే దానికి అనుబంధంగా పరిశ్రమల స్థాపనకు అందుబాటులో 10వేలు ఎకరాలు సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయని, వాటిని చక్కగా వాడుకోవచ్చని అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఒక్క లేఖ రాస్తే పదివేల ఎకరాల భూమి పైసా ఖర్చులేకుండా పరిశ్రమలకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా ఆలోచన చేసి పోర్టుకి అనుసంధానంగా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలన్నారు. పచ్చగా పంటలు పండుతున్న భూములు తీసుకుని స్థానికులకు ఇబ్బంది పెట్టి జనాగ్రహానికి గురికావద్దని అన్నారు. -
అమరావతి పేరిట భారీ భూదోపిడీ
● వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమదాలవలస: అమరావతిని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి గుదిబండగా మారి ప్రజలకు శాపంగా మారే ప్రమాదం ఉందని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్లాంటి నగరం నిర్మిస్తామంటూ ప్రజల భావోద్వేగాలను ఆసరాగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన అనుచరులు భారీ స్థాయిలో అవినీతి, భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలో ప్రధాన నగరాలు అభివృద్ధి చెందడానికి శతాబ్దాల సమయం పట్టిందని, ఒక నగరం రూపుదిద్దుకోవడానికి 400 నుంచి 500 ఏళ్లు పడుతుందని గుర్తుచేశారు. గుజరాత్లోని గాంధీనగర్, ఛత్తీస్గఢ్లోని రాయపూర్ వంటి కొత్త రాజధానుల్లో జనాభా తక్కువగా ఉండటానికి ఉపాధి అవకాశాల కొరతే కారణమని పేర్కొన్నారు. మయన్మార్లో నిర్మించిన నగరం ప్రజలు లేక ‘ఘోస్ట్ సిటీ’గా మారిందని ఉదహరించారు. శివరామకృష్ణ కమిటీ అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని పేర్కొందని గుర్తు చేశారు. రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోందని, కొద్దిమంది చేతుల్లోనే భూములు కేంద్రీకృతమవుతున్నాయన్నారు. అమరావతి నిర్మాణాలకు ఆ ప్రాంత రైతులకు కేవలం 30 శాతం భూమి ఇచ్చి మిగతా భూమిని కార్పొరేట్లకు అప్పగిస్తున్నారని విమర్శించారు. ఆరోగ్యశ్రీ బకాయిలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి కీలక చెల్లింపులు నిలిచిపోయిన పరిస్థితుల్లో రూ.లక్షల కోట్లు అమరావతిపై ఖర్చు చేయడం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన వికేంద్రీకరణ విధానాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మావిగన్ ఆలోచన చాలా బాగుందని మేధావులు సైతం చెబుతున్నారన్నారు. -
● పదవి లేకున్నా పెత్తనమే!
కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్న వ్యక్తి ఏ అధికారో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. సర్పంచ్ల పదవీ కాలం పూర్తయిన తర్వాత టీడీపీ నాయకులే అధికారుల కుర్చీలో ఆశీనులై పెత్తనం చెలాయిస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రామసభ నిర్వహిస్తున్నట్లు దండోరా వేశారు. మరో అరగంటలో గ్రామ సభ మొదలవుతుందన్న సమయంలో కాబోయే సర్పంచ్గా ప్రచారం చేసుకుంటున్న స్థానిక టీడీపీ నాయకుడు నేరుగా అధికారుల కుర్చీలో కూర్చొని అధికార దర్పం చెలాయించాడు. ఈ దృశ్యాన్ని చూసిన పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది చేసేదేం లేక అక్కడి నుంచి వేరే గదిలోకి వెళ్లిపోయారు. – ఇచ్ఛాపురం రూరల్ -
ఆరుగురేనంట..!
● అరసవల్లి రథసప్తమి వీవీఐపీ పాసుల కేసులో ఆరుగురే నిందితులని తేల్చేసిన పోలీసులు ● నిందితులకు 41–ఏ నోటీసులు ● తప్పించుకున్న రాజకీయ నేతల అనుచరులు, ఇన్ఫ్లూయెన్సర్లు శ్రీకాకుళం క్రైమ్: అరసవల్లి వీవీఐపీ పాసుల నకిలీ వ్యవహారాన్ని పోలీసులు ఓ ‘కొలిక్కి’ తెచ్చారు. దాదాపు 3 నెలలు.. 3 దర్యాప్తు విభాగాలు, 100 మంది వద్ద స్టేట్మెంట్ల రికార్డు, 50 మందికి పైగా విచారణ, 13 మంది అనుమానితులు.. 9 మందిపై ఓ అంచనా వేసి చివరకు ఆరుగురే నిందితులని తేల్చేశారు. ఈ ఏడాది జనవరి 26న జిల్లాకేంద్రంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణుని సన్నిధిలో జరిగిన రథసప్తమి వేడుకలకు సంబంధించి నకిలీ వీవీఐపీ పాసులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆరుగురే నిందితులని పోలీసులు తేల్చేశారు. వీరిలో నగరానికి చెందిన మణికంఠ జిరాక్స్ అండ్ ప్రింటర్స్ ప్రతినిధులు ఇప్పిలి మణికంఠ, ఇప్పిలి కొండలరావు, ఇప్పిలి సంతోష్లే కాక నిజం శ్రీను, నిజం రాజులు ఉన్నారని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రోగ్రాంకు సంబంధించి నకిలీ వీవీఐపీ పాసులకు సంబంధించి అరుణోదయ ప్రింటర్స్ ప్రతినిధి హరిప్రసాద్ ఉన్నట్లు శ్రీకాకుళం రూరల్ సీఐ కె.పైడపునాయుడు వెల్లడించారు. సరైన ఆధారాలు దొరక్కపోవడంతో మిగతా వారి ప్రమేయం లేన ట్లు ప్రస్తుతానికి నిర్ధారించామని, నిందితులను విచారించి 41–ఏ నోటీసులిచ్చి పంపించేసినట్లు ఆయన చెప్పారు. అయితే తెరవెనుక సూత్రధారులను వదిలేశారన్న విమర్శలు నగరంలో గుప్పుమంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నిందితులను విచారించి.. శుక్రవారం ఉదయమే నిందితులను పోలీసులు స్టేషన్కు తీసుకొచ్చారు. దాదాపు 2 గంటల పాటు విచారించారు. అయితే దర్శనానికి సంబంధించి వీవీఐపీ నకిలీ పాసులు మణికంఠ జిరాక్స్ నుంచి ముద్రితమయ్యాయని, శ్రీను, రాజులు వారి నుంచి తీసుకున్నారని, తమన్షో ప్రోగ్రాంకు సంబంధించి నకిలీ పాసులు అరుణోదయ ప్రింటర్స్లో పనిచేస్తు న్న హరిప్రసాద్ ముద్రించారని సీఐ వెల్లడించారు. అనంతరం పలు సెక్షన్ల కింద ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 41–ఏ నోటీసులిచ్చి పంపించేశామని సీఐ వెల్లడించారు. ప్రాధాన్యత లేనిదిగా.. ఒకనొక దశలో పాలకవర్గానికి, పోలీసులకు అగ్గిరాజేసేటంత స్థితికి తీసుకెళ్లిన ఈ కేసులో చివరికి భక్తుల తరఫున నిలబడిన పోలీసులు రాజకీయ నాయకులకు తలొగ్గి ప్రతిష్టాత్మక కేసును కాస్తా ప్రాధాన్యత లేని కేసుగా పరిగణించే స్థితికి వచ్చారు. సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు 13 మంది అనుమానితులను, దాదాపు 10 వేల నుంచి 20 వేల వరకు నకిలీ పాసులు గుర్తించారు. వారిలో ప్రధానంగా సోషల్ మీడి యా ఇన్ఫ్లూయెన్సర్లు, కొంతమంది పత్రి కావిలేకర్లు, రాజకీయ నేతల అనుచరులు, కుటుంబీకు లు, రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లోని వారిని సైతం విచారణ పేరుతో పలు మార్లు స్టేషన్కు పిలిపించారు. కానీ ఏ మాయ జరిగిందో గానీ కేసును ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు మళ్లించడం, తర్వాత దర్యాప్తు మొదలుపెట్టడం.. చకచకా జరిగిపోయాయి. దాదాపు 3 నెలల త ర్వాత ఈ ప్రతిష్టాత్మక కేసును కాస్తా ప్రాధాన్యత లేని కేసుగా మార్చి ఎస్ఐ హరికృష్ణతో ఎఫ్ఐ ఆర్ నమోదు చేయించి మమ అనిపించేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కేసులో భక్తులు ఓడి నేతలు గెలిచారా.. భక్తుల తరపున నిలబడి పోలీసులు చతికిలపడ్డారా అన్నది ఆ ప్రత్యక్ష భగవానుడికే ఎరుక. -
అప్పులు తీర్చలేక తప్పుడు మార్గం
● బంగారం చోరీల కేసుల్లో ముద్దాయి అరెస్టు ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ లక్ష్మణరావు టెక్కలి రూరల్ : చెల్లి పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చలేకపోవడం, సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాలోచన రావడంతో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. శుక్రవారం టెక్కలి జగతిమెట్ట ఫ్లై ఓవర్ వద్ద ఓ వ్యక్తి బైక్పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు గుర్తించి ఆపారు. బండి రికార్డులు లేకపోవడంతో వ్యక్తిని అదుపులో తీసుకుని విచారించగా పలు చోరీ కేసులో ముద్దాయిగా ఉన్న మందస మండలం భిన్నళ మదనాపురం గ్రామానికి చెందిన కొమ్మాన ఢిల్లీరావు(దిలీప్కుమార్)గా గుర్తించారు. ఇతనిపై మూడు కేసులు ఉన్నాయని వెల్లడించారు. ఈ నెల 6న టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న రమణి జ్యూయలరీ షాపులోకి ఢిల్లీరావు ప్రవేశించి యజమాని కళ్లుగప్పి బంగారు గొలుసు, రెండు ఉంగరాలు చోరీ చేసి పరారయ్యాడు. 2025 మేలో కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో జ్యూయలరీ షాపులోకి మాస్క్ ధరించి వెళ్లి రెండు బంగారు గొలుసులు, ఉంగరం, జత చెవి బుట్టలతో పరారయ్యడు. ఈ ఏడాది మార్చిలో కాశీబుగ్గ ఓ టిఫిన్ షాపు ముందు పార్కింగ్ చేసి ఉన్న స్కూటీని మారుతాళంతో తెరిచి పరారయ్యాడు. ఈ మూడు కేసులకు సంబంధించి 45 గ్రాముల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, మొబైల్ ఫోన్ స్వాదీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు చెప్పారు. ఢిల్లీరావు విశాఖపట్నంలోని ఓ హోటల్లో పనిచేసేవాడని, చెల్లి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో టెక్కలి సీఐ విజయ్కుమార్, ఎస్ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు. -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో శుక్రవారం రైతు సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్నకు క్వింటాకు రూ.1700 ఉంటే రూ.1500కే కొనుగోలు చేయడం అన్యాయమన్నారు. దీనివల్ల ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేలు నుంచి రూ.30 వేలు వరకు నష్టపోతున్నారని చెప్పారు. వేరుశనగ, శనగలు, కందులు, అపరాలు ఉద్యాన పంటలకు మద్దతు ధరలు లేక రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఎరువులు కొరతను ఆసరాగా చేసుకొని వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లాలో ప్రధానమైన జీడిపంట సైతం మార్కెట్ లేదన్నారు. మామిడి, అపరాలు పంటలకు ఇన్సూరెన్సు క్లెయిమ్స్ చెల్లించడం లేదన్నారు. మద్దతు ధరల కోసం కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న మండల కార్యాలయాల వద్ద ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చంద్రరావు, పోలాకి ప్రసాద్, కె.మోహనరావు, వెలమల రమణ, కరగాన కొండయ్య, కె.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
సారా తయారీ కేంద్రాలపై దాడులు
కంచిలి: కంచిలి, సోంపేట మండలాలను ఆనుకొని ఉన్న ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో రెండు రాష్ట్రాల ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సిబ్బంది సంయుక్తంగా నాటుసారా తయారీ కేంద్రాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. బెల్లం ఊట, నాటుసారా ధ్వంసం చేశారు. డిప్యుటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు కుమార్, మురళీధర్, సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి.రమణ, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ సీఐ మధుకుమార్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. గొంగాపూర్ రామచంద్రాపూర్ గ్రామ సరిహద్దులలో సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి సుమారు 5వేల లీటర్లు బెల్లం ఊట, 200 లీటర్లు సారా ధ్వంసం చేశారు. ఈ దాడులలో సోంపేట, పలాస, ఇచ్ఛాపురం, కోటబొమ్మాళి టాస్క్ఫోర్స్ , ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, ఒడిశా పోలీసులు పాల్గొన్నారు. -
జనగణనపై అవగాహన అవసరం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జనగణనపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్, జిల్లా ముఖ్య జనగణన అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులు, ఉద్యోగులతో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల కుటుంబాలన్నీ మొబైల్ యాప్ ద్వారా స్వీయగణన నమోదు చేసుకోవాలని, ఇతరులకూ అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతిఒక్కరూ వెబ్సైట్ https://se.census.gov.in లోకి వెళ్లి జనగణన నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 4291 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించగా హౌస్ లిస్టింగ్ బ్లాక్ల సృష్టి ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. జిల్లాలో 3813 ఎన్యూమరేటర్లు, 624 సూపర్ వైజర్లను నియమించామని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. రేపు రాష్ట్రస్థాయి హోమియో సెమినార్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని హోటల్ బ్లూఎర్త్లో ఈ నెల 19న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియోపతిక్ ఫిజీషియన్స్ (ఐఐహెచ్పీ) ఏపీ స్టేట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ముఖ్య ప్రతినిధులు డాక్టర్ ఎ.వివేకానంద, డాక్టర్ అనిల్కుమార్, డాక్టర్ ఎ.వి.షణ్ముఖరాజు, కన్వీనర్లు డాక్టర్ ఎస్.రవి కుమార్, డాక్టర్ ఎన్.దాసు శుక్రవారం తెలిపా రు. ఉదయం 8 గంటల నుంచి జరగనున్న ఈ సెమినార్కు దేశంలోని నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన సీనియర్ హోమియోపతిక్ వైద్యులు హాజరై వైద్యవిధానంలో నూతన మార్పులు, సరికొత్త చికిత్సా విధానాలపై ప్రసంగించనున్నారని చెప్పారు. ఐఐహెచ్పీ జాతీయ, రాష్ట్రశాఖల ముఖ్య ప్రతినిధులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి జిల్లాలోని హోమియో డాక్టర్లు, వైద్యవృత్తిని ఎంచుకున్నవారు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల నిరసన శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మున్సిపల్ కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు మార్చి జీతాలు ఇప్పటికీ జమ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కళ్యాణి అప్పలరాజు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు అన్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. అనంతరం కమిషనర్ హనుమంతు కూర్మారావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 16, 17, 18న రాజమహేంద్రవరం జరిగిన రాష్ట్ర మహాసభల్లో పలు తీర్మానాలు చేశామన్నారు. పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కార్మికులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, హైకోర్టు తీర్పు మేరకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, బకాయి వేతనాలు విడుదల చేయాలని కోరారు. కార్మికులకు పని పరికరాలు అందించి పనిభారం తగ్గించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.వేణుగోపాల్, మున్సిపల్ నాయకులు ఎన్.పార్థసారథి, జె.గురుమూర్తి, ఆర్.గణేష్, అర్జి పెద్దమణి, దశుమంతుల రమణ, సీతమ్మ, సూర్యకళ, కె.తిరుమలరావు,రామచంద్ర, గౌతం రాజు పాల్గొన్నారు. వీరికి వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కె.సంతోష్ మద్దతు తెలిపారు. ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: సింగుపురం గ్రామానికి చెందిన బెవరా చిట్టిబాబు(34) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సింగుపురం బీసీ హాస్టల్లో అటెండర్గా పనిచేస్తున్న చిట్టిబాబు ఇటీవలే గ్రామంలో ఇల్లు నిర్మించాడు. అప్పులు ఎక్కువ కావడంతో తీవ్ర మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉరివేసుకున్నారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. భార్య గాయత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గ్యాస్ ఏజెన్సీ తీరుపై నిరసన
కవిటి: స్థానిక చింతామణి భారత్ గ్యాస్ గ్రామీణ వితరక్ కేంద్రం వద్దకు సిలిండర్ బుక్ చేసుకోవడానికి వెళ్లిన మహిళలు, వృద్ధులకు గ్యాస్ కంపెనీ యాజమాన్య ప్రతినిధులు, సిబ్బంది పరుషపదజాలంతో అవహేళన చేయడం పట్ల శుక్రవారం గొండ్యాలపుట్టుగ గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వినియోగదారుల సమస్యలు పట్టించుకోకుండా బయట గంటకుపైగా నిరీక్షింపజేసి యాజమాన్య సిబ్బంది ఫోన్లో మాట్లాడుకోవడం పట్ల అసంతృప్తికి గురయ్యారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అందజేస్తామని, లేకుంటే ఇవ్వబోమని తెగేసి చెప్పారని, ఈ విషయంలో దిక్కున్నచోట చెప్పుకోవాలని అగౌరవంగా మాట్లాడారని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఆర్ఎస్డీటీ పి.నిరంజన్కు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీలో జరుగుతున్న అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. కాగా, ఇదే అంశంపై తమపైన దాడి చేశారని, సమగ్రవిచారణ జరిపి న్యాయం చేయాలని గ్యాస్ ఏజెన్సీ యాజమాన్య ప్రతినిధులు కవిటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
జలం.. పాతాళం!
●నరసన్నపేట మండలంలో ఈ ఏడాది ఫిబ్రవరి లో 5.79 మీటర్లపైన ఉన్న భూగర్భ జలాలు మా ర్చి నెలాఖరుకు 7.26 మీటర్లకు పడిపోయాయి. ●జలుమూరు మండలంలో ఫిబ్రవరిలో 1.83 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు మార్చి నెలాఖరుకు 3.40 మీటర్లకు పడిపోయాయి. ●రణస్థలం మండలంలో ఫిబ్రవరిలో 9.58 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు మార్చి నెలాఖరుకు 11.10 మీటర్లకు పడిపోయాయి. ●సారవకోట మండలంలో ఫిబ్రవరిలో 6.11 మీటర్ల పైన ఉన్న భూగర్భ జలాలు మార్చి నెలాఖరుకు 7.74 మీటర్లకు పడిపోయాయి. గత ఏడాది మార్చిలో జిల్లాలో సగటున 7.59 మీటర్లు లోతులో భూగర్భ జలాలు ఉండగా, ఈ ఏడాది మార్చిలో 7.77 లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. అంటే 0.18 మీటర్ల లోతులో జలాలు ఉన్నాయి. గతేడాది జిల్లాలో నామమాత్రపు వర్షాభావ పరిస్థితులు వల్ల భూగర్భ జలాలు కొంతమేర తగ్గాయని అధికారులు చెబుతున్నారు. ఇచ్ఛాపురం రూరల్ : జిల్లాలో భూగర్భ జలాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. వేసవి ఎండలు మండుతుండటంతో పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారవు తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సగటు భూగర్భ జలమట్టం 7.10 మీటర్లు పైన ఉండగా.. మార్చిలో భూగర్భ జలాలు 7.77 మీటర్ల లోతుకు పడిపోయా యి. అంటే 0.67 మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గాయి. ప్రస్తుతం జిల్లాలో నరసన్నపేట,జలుమూ రు, సారవకోట,రణస్థలం మండలాల్లో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వచ్చే రెండు నెలల్లో జిల్లా అంతటా భూగర్భ జలాలు మరింత లోతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. గతేడాది మార్చి నెలాఖరుతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలాఖరు కు భూగర్భ జలాలు గణనీయంగా తగ్గాయి. పొంచి ఉన్న ప్రమాదం.. జిల్లా వ్యాప్తంగా చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరి కంటే మార్చి నెలలో భూగర్భ జాలల తగ్గుదల స్వల్పంగా నే కనిపిస్తున్నప్పటికీ పలు మండలాల్లో జలాలు భారీగా పడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండ నుంది. జిల్లాలో 30 మండలాల్లో ఫిబ్రవరితో పోల్చి తే మార్చిలో దాదాపు అంతటా భూగర్భ జలాలు పడిపోయాయి. ఫిబ్రవరిలో సగటు భూగర్భ జల మట్టం 7.10 మీటర్లు ఉండగా, మార్చి నెలాఖరుకు సగటు భూగర్భ జల మట్టం 7.77 మీటర్లకు పడిపోయింది. మొత్తం 0.67 మీటర్లకు పడిపోయాయి. హిరమండలం, గార, కంచిలి, ఎచ్చెర్ల, పాతపట్నం, సోంపేట, టెక్కలి మండలాల్లో భూగర్భ జలాల తగ్గుదల కనిపిస్తోంది. ఆమదాలవలస, కవిటి, కోటబొమ్మాళి, మందస, శ్రీకాకుళం మండలాలు స్థిర పరిస్థితిలో ఉన్నప్పటికీ తగ్గుదల ట్రెండ్ కొనసాగితే ప్రమాదం తప్పదని జిల్లా భూగర్భ జల అధికారులు హెచ్చరిస్తున్నారు. గతేడాదితో పోల్చితే.. గార, కంచిలి, కోటబొమ్మాళి, మందస, నందిగాం, పలాస, సంతబొమ్మాళి, పోలాకి, పొందూరు, సారవకోట, సోంపేట, టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో గత ఏడాదితో పోల్చితే నీటి మట్టం కొంత మేర పెరిగిందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో నీటి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రస్తు తం జిల్లాలో జల ధార, జల హారతి ప్రొగాం చేపడుతున్నాం. ఇందులో భాగంగా జలసంరక్షణ పనులు నిర్వహిస్తున్నాం. జిల్లా ప్రజలు రీచార్జ్ పద్ధతులను అవలంబించి నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇళ్ల సముదాయాల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల వద్ద చెక్డ్యామ్లు, పాంపాడ్లు నిర్మించుకోవాలి. ఏప్రిల్, మే నెలల్లో సహజంగానే వేసవి తీవ్రత కారణంగా భూగర్భ జలాలు పడిపోతాయి. – ఎన్.వి.కె.దుర్గాప్రసాద్, జిల్లా భూగర్భజల శాఖాధికారి -
25 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు
పాతపట్నం: పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి దేవస్థానం 51వ వార్షిక నవరాత్రి యాత్రా మహోత్సవాలు సంద ర్భంగా ఈ నెల 25 నుంచి 27 వరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్, రాష్ట్ర వ్యాయామ సంఘం అధ్యక్షులు అక్కందర సన్యాసిరావు, ఎన్ని శేఖర్బాబు తెలిపారు. గురువారం ఆల య ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుగులో పోటీలు నిర్వహిస్తామని, ఆసక్తి గల జట్లు 9393946424 నంబరుకు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శనరావు, ఆలయ కమిటీ సభ్యులు, పీడీలు, పీఈటీ పాల్గొన్నారు. -
భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు
మెళియాపుట్టి : భరణికోట గ్రామానికి చెందిన సవర జగ్గారావుకు జిల్లా అదనపు న్యాయ స్థానం జీవిత ఖైదు విధించిందని ఎస్పీ మహేశ్వరరెడ్డి గురువారం వెల్లడించారు. భార్య పద్మ (33)పై అనుమానంతో జగ్గారావు 2021 అక్టోబర్ 16న గొడవకు దిగాడు. తనతో పాటు తెచ్చుకున్న నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో పద్మ అక్కడికక్కడే మృతిచెందింది. కుమారుడు జగదీశ్ విషయాన్ని మావయ్య సవర నరసింహులుకి చెప్పడంతో ఆయన మెళియాపుట్టి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో జగ్గారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో జగ్గారావుకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. స్వీయ గణనకు శ్రీకారం శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తన కార్యాలయంలో గురువారం స్వీయ గణనను విజయవంతంగా నిర్వహించి జిల్లాలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వీయ గణన కాలపరిమితి ఏప్రిల్ 30 వరకు ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎవరి వివరాలు వారే వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర జనగణన సంచాలకులు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియను ఆయన ప్రారంభించారు. అధికారిక లింక్ http://se.census. gov.in/ ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. -
శ్రీకాకుళం
ఎండల్లో చల్లటి నేస్తంశుక్రవారం శ్రీ 17 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ఎండలు ఠారెత్తుతున్నాయి. అడుగు బయట పెడితే చాలు ఒంటిలోని నీరంతా చెమటలా బయటకు పోతోంది. ఎండల వేడిని తగ్గించేందుకు తాటి ముంజెలు వచ్చేశాయి. పోషకాల గనిగా పేరొందిన ఈ ముంజెలు ఇప్పుడు విరివిగా లభ్యమవుతున్నాయి. తాటిముంజల్లో శరీరానికి చలువ చేసే గుణాలు ఉండటంతో కొనేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం డజన్ రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. వ్యాపారులకూ లాభసాటిగా ఉండడంతో దాదాపు ప్రతి జంక్షన్లోనూ తాటి ముంజెలు కనిపిస్తున్నాయి. పోషకాలు మెండు.. తాటి ముంజెలు శరీరంలో నీటిశాతాన్ని పెంచుతాయి. ఎండ వేడిమికి గురికాకుండా కాపాడతాయి. వీటిలో విటమిన్ ఏ, బి, సీలతో పాటు శరీరానికి కావాల్సిన జింక్, పొటాషియం, పాస్పరస్, ఐరన్ ఉంటాయి. ట్యూమర్లు, క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. పొటాషియం అధికంగా ఉండటంతో రక్తపోటు తగ్గించి శరీరంలో మలినాలను బయటకి పంపుతుంది. కడుపు ఉబ్బరం, వికారం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. –హిరమండలం -
రేపు జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ: నిరుద్యోగ యువతీయువకుల కోసం శనివారం జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రలోని బలగ హాస్పటల్ జంక్షన్లో ఉన్న డీఎల్టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి జాబ్మేళా జరుగుతుందన్నారు. ఈ జాబ్మేళాను మిడ్ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్, ఐ స్మార్ట్ సొల్యూషన్స్ సంస్థ, అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థల్లో వివిధ పోస్టుల భర్తీ కోసం చేపడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. ● మిడ్ ల్యాండ్ మైక్రో ఫిన్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్ /ఐ.టి.ఐ /డిప్లమో వి ద్యార్హత కలిగి ఉన్న, 18–29 మధ్య వయస్సు గల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులు, ఎంపికై న వారు శ్రీకాకుళం, పలాస, పాతపట్నం, సాలూరు, ఇచ్చాపురం, పాలకొండ, కోటబొమ్మాళి, విజయ నగరంలలో పని చేయాల్సి ఉంటుంది. 150 ఫీల్డ్ ఆఫీసర్, సెంటర్ ఆఫీసర్ ఖాళీలు ఉన్నాయి. జీతం నెలకు రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుంది. ఇతర అలవెన్సులు లభిస్తాయి. ● ఐ స్మార్ట్ సొల్యూషన్స్ సంస్థలో ఉద్యోగాల కోసం ఇంటర్ ఆపైన విద్యార్హత కలిగి, 20–35 మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువత అర్హులు. 75 టెలిసేల్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో పనిచేయాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.8వేల నుంచి రూ.12వేల వరకు ఉంటుంది. ● అన్నపూర్ణ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలో ఇంటర్ ఆపైన విద్యార్హత కలిగి ఉన్న, 20–30 మధ్య వయస్సు గల యువతీ యువకులకు 120 ఖాళీల కు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం, పలా స, సోంపేట, పార్వతీపురం, రాజాం, విజయనగరంలలో పనిచేయాల్సి ఉంటుంది. జీతం రూ.16 వేల నుంచి రూ.35వేల వరకు ఉంటుంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్సీఎస్.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్ లో అభ్యర్థులు వివరాలు నమోదు చేసుకోవాలి. -
గంజాయి ముఠా కిరాతకం
● పాతపట్నం నియోజకవర్గంలో ఘటన ● గంజాయి బ్యాచ్ ఆగడాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిన సామాన్య వ్యక్తి ● ఆ వ్యక్తిపై దాడికి తెగబడిన గంజాయి బ్యాచ్ ● చెట్టుకు కట్టి విచక్షణరహితంగా దాడి ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాగోతం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గంజాయి ప్రభావం రోజు రోజుకూ హద్దులు దాటి పోతోంది. కొంత మంది ముఠాలుగా తయారై ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే స్థాయికి అక్రమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా పోలీసులకు సమాచారం ఇస్తే వారిపై కాపు కాసి మరీ దాడులు చేస్తున్నారు. ఇలాంటి సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా జిల్లాకు ఒడిశా దగ్గరగా ఉండడం.. మారు మూల ఒడిశా ప్రాంతంతో జిల్లాకు అనేక అక్రమ మార్గాలు ఉండడంతో ఈ గంజాయి అక్రమ రవాణాకు అన్ని రకాలుగా మార్గం అనుకూలంగా మారుతోంది. అయితే ఎప్పటికప్పుడు గంజాయి రవాణా పోలీసులకు చిక్కుతున్నప్పటికీ, అవి ఇతర ప్రాంతాలకు చెందిన వారు మాత్రమే పట్టుబడుతున్నారు తప్పా, జిల్లాకు చెందిన గంజాయి బ్యాచ్ మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. ఇంటిదొంగలెవరు..! జిల్లా పోలీస్ అధికారి ప్రత్యేక నిఘా వేస్తున్నప్పటికీ ఆయా శాఖలో మాత్రం కొంత మంది గంజాయి బ్యాచ్కు సహకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. గత కొన్ని నెలల క్రితం పాతపట్నం నియోజకవర్గంలో బహిరంగంగా జరిగిన సంఘటనను కొంత మంది ప్రమేయంతో దాచాలని చూసినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశా ప్రాంతం బినలా పరిసర ప్రాంతాల నుంచి కొసమాల మీదుగా కొంత మంది గంజాయి బ్యాచ్ అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని కొసమాల గ్రామానికి చెందిన హైదరాబాద్లో వలస కార్మికుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులకు ఇచ్చిన సమాచారం గంజాయి ముఠాకు చేరింది. అంతే సమాచారం ఇచ్చిన వ్యక్తి పాతపట్నంలో బస్సు దిగే సమయంలో కాపు కాసి దాడి చేశారు. అక్కడితో విడిచిపెట్టకుండా మోటారు సైకిల్పై బలవంతంగా తీసుకువెళ్లి కొసమాల గ్రామంలో చెట్టుకు కట్టి మరీ విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. గ్రామానికి రానివ్వకుండా హుకుం జారీ చేశారు. ఈ సంఘటన తెలిసిన పోలీసులు మాత్రం ఎందుకో సైలెంట్ పాత్ర వహించడంతో బాధితుడు చికిత్స పొందుతూ ప్రాణ భయంతో హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఒడిశాకు ఆనుకుని ఉన్న పాతపట్నం నియోజకవర్గంలో గంజాయి రవాణా, ఆయా ముఠాల ప్రాబల్యం ఉన్నప్పటికీ స్థానికంగా ప్రజా ప్రతినిధుల అండ కావచ్చు, కట్టడి చేయాల్సిన అధికారుల రక్షణ కావచ్చు.. మొత్తంగా ఒక ఆరుగురు ముఠా చెప్పిందే వేదంగా ఈ అక్రమ వ్యవహారం సాగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విశాఖ పట్టణంలో ఒక ప్రాంతం, హైదరాబాద్లో బాలానగర్ ప్రాంతాలకు గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్లో ఓ హాస్టల్లో పాతపట్నం నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి గంజాయి సరఫరా చేస్తూ అక్కడ యువతను బలి చేస్తున్నారని తెలుస్తోంది. నేర సమాచారం ఇచ్చేవారు వివరాలను గోప్యంగా ఉంచాలని చట్టాలు ఘోషిస్తున్నాయి. కానీ కొందరు ఇంటి దొంగలు తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే రీతిలో ఆ సమాచారాన్ని నేర ముఠాలకు లీక్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. సమాచారం ఇచ్చిన పాపానికి అమాయకులు నేరగాళ్ల చేతిలో చిక్కి చితికిపోతున్నారు. జిల్లా శివారు గ్రామం కోసమాలకు చెందిన ఓ వ్యక్తి గంజాయి బ్యాచ్ చేతిలో ఇదే తరహాలో చావుదెబ్బలు తిన్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సజ్జలను సత్కరించిన జిల్లా బీసీ నాయకులు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ బీసీ విభాగం నాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ పీఏసీ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్యాదవ్తో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్, కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, వెలమకుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు ఆరంగి మురళి, పొందర కుల రాష్ట్ర అధ్యక్షుడు రాజాపు అప్పన్నలు తదితరులు సత్కరించి జ్ఞాపిక అందజేశారు. -
నాలుగు గంటల పాటు తిలక్ విచారణ
టెక్కలి: వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ను గురువారం టెక్కలి పోలీసులు నాలుగు గంటల సేపు విచారించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణంపై మంత్రి కె.అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఇటీవల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీనిపై టెక్కలి పోలీసులు తిలక్కు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై ఈ నెల 13న టెక్కలి పోలీస్ స్టేషన్కు తిలక్ హాజరయ్యారు. మళ్లీ రెండో దఫాగా గురువారం సాయంత్రం 4 గంటల తర్వాత విచారణకు హాజరయ్యారు. రాత్రి 8 గంటల వరకు విచారణ కొనసాగించారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు ఎస్.సత్యం, టి.కిరణ్, చిన్ని జోగారా వు, కె.జీవన్ ఉన్నారు. ఇదిలా ఉండగా తిలక్ స్టేషన్కు హాజరవుతున్న నేపథ్యంలో పట్టణంలో పలు జంక్షన్ల వద్ద పోలీసులు పహరా కాశారు. -
డీఈఈ సెట్–2026కు దరఖాస్తులకు గడువు పొడిగింపు
గార: జిల్లాలోని ప్రభుత్వ విద్యా శిక్షణ సంస్థ వమరవల్లిలో రెండేళ్ల ప్రాథమిక విద్యలో డిప్లమో కోర్సు ప్రవేశం కోసం దరఖాస్తులకు గడువు పొడిగించారని డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు ప్రిన్సిపాల్ ఎ.గౌరీశంకర్ 9492848205, జీవీ రమణ 9491843995 లకు సంప్రదించాలన్నారు. రిమ్స్ ఎక్స్రే విభాగంలో షార్ట్ సర్క్యూట్ శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో గురువారం ఉదయం ఐదు గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగిన మంటలు చెలరేగాయి. ప్రమాదంలో ఓ టేబుల్, కంప్యూటర్ మానిటర్ కాలిపోయాయి. ఆ సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రమా దం తప్పింది. పొగలు రావడంతో అక్కడ ఉన్న సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చా రు. విషయం తెలుసుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిని, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ సీపీ శ్రీదేవి గదిని పరిశీలించారు. నేడు అర్జీల స్వీకరణ మెళియాపుట్టి: మండలకేంద్రంలో శుక్రవారం గ్రీవెన్స్ ద్వారా సమస్యల స్వీకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీతంపేట ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవార్ ఒక ప్రకటన ద్వారా గురువారం తెలిపారు. కార్యక్రమంలో నేరుగా ఆయనే సమస్యలపై దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం ఖూనీ హిరమండలం: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యు రాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్టును ఆమె తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా పూడి శ్రీహరిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ కక్షల కోసం పోలీసు వ్యవస్థను పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. శ్రీకాకుళం రూరల్: శ్రీకాకుళం ఆర్టీవో అధికారి పి.వి.గంగాధర్కు రోడ్సేఫ్టీ అవేర్నెస్తో పాటు పబ్లిక్ అవుట్రీచ్లో మంచి ప్రతిభ కనపర్చినందు కు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ఇటీవల బెంగళూరులోని ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ వెహికల్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కర్ణాటక రవాణా శాఖమంత్రి రామలింగారెడ్డి ఈ అవార్డును ప్రదానం చేశారు. కార్మికుల సంక్షేమానికి దరఖాస్తుల ఆహ్వానం వజ్రపుకొత్తూరు రూరల్: భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్మిక శాఖాధికారి పి.విజయ్కుమార్ తెలిపారు. మార్చి 1 నుంచి నాలుగు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సంక్షేమ నిధి ద్వారా కార్మిక శాఖలో సభ్యత్వం పొందిన అర్హులైన ప్రతి కార్మికుల కుటుంబానికి వివాహ కానుకగా రూ. 20 వే లు, ప్రసూతి సాయం రూ.20 వేలు, సహజ మరణానికి రూ. 60 వేలు కాగా అంత్యక్రియలకు తక్షణ సాయంగా రూ.20 వేలు అందించనున్నట్లు తెలిపారు. వివరాలకు కాశీబుగ్గలో ఉ న్న కార్మిక శాఖను లేదా 94925 55040 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని సూచించారు. -
భూ సమస్యల పరిష్కారమే ధ్యేయం
జలుమూరు: భూముల రీ సర్వే అనంతరం ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను అధిగమించి రైతులకు తప్పులు లేని పట్టాదారు పాస్పుస్తకాలు అందజేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. గురువారం అక్కురాడలో రీ సర్వేపై అధికారులు, రైతులతో మాట్లాడారు. అక్కురాడ పరిధిలోని 924 ఖాతాల్లో ఇప్పటి వరకూ 45 ఖాతా లను మాత్రమే సరిచేయడం జరిగిందన్నారు. మిగిలిన ఖాతాల్లో తప్పులు సరిదిద్దడంపై జాప్యంపై అధికారులతో మాట్లాడారు. సర్వే లోపాలను సవరించేందుకు మండల,సచివాలయ అధికారు లు సమన్వయంతో సనిచేయాలని సూచించారు. ప్రధానంగా అక్షర దోషం లేని పాస్ పుస్తకాలు రైతులకు అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీని కోసం ప్రతి ఖాతాను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. -
18న ఉపాధ్యాయ సమస్యలపై ధర్నా
శ్రీకాకుళం: రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్య ల పరిష్కారం కోరుతూ ఈ నెల 18న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావాలి శ్రీనివాస్, పప్పల తిరుమలరావు తెలిపారు. గురు వారం వారు విలేకరులతో మాట్లాడుతూ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన న్యాయపరమైన సమస్య ల సాధనకు ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పా రు. 12వ పీఆర్సీ 2023 జూలై 1 నుంచి అమ లు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని, 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. -
పోలీస్స్టేషన్ పరిశీలన
జి.సిగడాం: స్థానిక పోలీస్స్టేషన్ను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. దీనిలో భాగంగా సిబ్బంది పనితీరు, స్టేషన్ నిర్వహణపై ఆరా తీశారు. గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పోలీసులు పక్కాగా గస్తీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో తగాదాలు సృష్టించేవారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. ఆయనతో పాటు శ్రీకాకుళం డీఎస్సీ వివేకానంద, జేఆర్పురం సీఐ అవతారం, ఎస్ఐ సందీప్కుమార్లు ఉన్నారు. వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు హిరమండలం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలానికి చెందిన మీసాల రజిని, ష్ట్ర రైతు విభాగం జాయింట్ సెక్రటరీగా సొర్లంగి గ్రామానికి చెందిన వంగపల్లి లక్ష్మినారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. మీసాల రజిని లక్ష్మినారాయణ -
ఏడాదంతా... ఏ చింత లేకుండా..!
● ఏజెన్సీ చింతపండుకు వినియోగదారుల క్యూ ● ఏడాదంతా నిల్వ ఉండేలా ఏర్పాట్లు ఒకేసారి కొనుగోలు చేస్తాం ప్రతిఏటా సీజన్ ఏజెన్సీకి వచ్చి మాకు, మా బంధువులకు సరిపడిన చింతపండును ఒకేసారి కొనుగోలు చేస్తాం. చింతపండుకు పిక్కతీసి, బాగా శుభ్రపరిచిన అనంతరం హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో ఉన్న మా బంధువులకు పంపిస్తుంటాము. – జి.శారద, కొత్తూరు కష్టమే మిగులుతోంది ఏడాది మొత్తం చింతపంటను నమ్ముకొని ఉంటాము. ప్రమాదకరమైన చెట్లు ఎక్కి చింతబొట్లను చెట్టు నుంచి తీయడం జరుగుతుంది. తీసిన బొట్టలు నుంచి చింత పండును వేరు చేయడానికి రోజులు తరబడి కష్టపడతాము. కానీ తగిన ధరలు లభించడం లేదు. – సవర సుంకయ్య, కొత్తూరుకొత్తూరు: ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో చారు లేకుండా భోజనం ఉండదు. నిత్యం వంటింట్లో ఏదో రకంగా చింతపండు వినియోగం ఉంటుంది. అలాగే పచ్చళ్ల తయారీకి సైతం అత్యంత కీలకంగా చింతపండును పేర్కొంటున్నారు. అలాంటి నాణ్యమైన చింతపండుకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు, సీతంపేట, భామిని మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు ప్రసిద్ధిగాంచాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో మైదాన ప్రాంతం వ్యాపారులతో పాటు కొనుగోలుదారులు సంతల్లో గిరిజనులు విక్రయించే చింతపండు కోసం క్యూ కడుతుంటారు. అధిక మొత్తంలో కొనుగోలు చేసి ఏడాదంతా వినియోగించడం, అమ్మకాలు సాగిస్తుండడం పరిపాటిగా మారింది. ఏజెన్సీ చింతపండుకు గిరాకీ జిల్లాలో ఏజెన్సీ చింతపండుకు అత్యంత గిరాకీ ఉంది. ఇక్కడి గిరిజనులు ఆటవీ ప్రాంతాల నుంచి పెద్ద పెద్ద చింత చెట్లు వద్ద చింతపండును సేకరిస్తారు. దీని రుచి వేరుగా ఉంటుంది. ఇక్కడ లభ్యమయ్యే చింతపండుతో తయారు చేసిన పచ్చళ్లు. చారు, పులుసు తదితర వంటకాలు మంచి రుచిని కలిగి ఉంటాయి. అందుకే ఒకేసారి అధిక మొత్తంలో కొనుగోలు చేసి వివిధ రకాల పద్ధతుల్లో నిల్వ ఉంచుకొని ఏడాదంతా వినియోగించడంతో పాటు.. పట్టణాల్లో ఉండే బంధువులు, స్నేహితులకు పంపిస్తామని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇకపోతే పంట దిగబడిని బట్టి ధర ఆధారపడుతుంది. ఈ ఏడాది పంట తక్కువ ఉండడంతో పాటు ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు సంతలకు ఎక్కువ మంది రావడంతో కిలో రూ.75 లు నుంచి రూ.80లు ధర ఉంది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. నిల్వచేసే విధానం సాధారణంగా ఏజెన్సీలోని సంతల్లో గిరిజనుల వద్ద వినియోగదారులు కొనుగోలు చేస్తారు. చింతపండుకు ఉన్న పెంకులు, ఇతరాలను వేరుచేసి శుభ్రపరుస్తారు. పల్లె ప్రాంతాల ప్రజలు కేజీ నుంచి రెండున్నర కేజీల పరిమాణంలో ఉప్పు వేసి గోళాకారంగా ఉండలను చేసి ఎండబడతారు. ఎండిన తర్వాత ఉండలను మట్టి, ప్లాస్టిక్ బకెట్లలో ఏడాదంతా ఉంచుకొని వినియోగిస్తారు. పట్టణ ప్రజలైతే పై ప్రక్రియ మాదిరిగానే చేసి ప్రత్యేక కవర్లలో, ఫ్రిడ్జ్లలో పెట్టి ఏడాదంతా నిల్వ ఉంచి వినియోగిస్తారు – నష్టపోతున్నాం ప్రస్తుతం చింతపండు నిల్వ చేసేందుకు శీతల కేంద్రాలు లేకపోవడంతో దళారీలు అడిగిన ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నాము. అధికారులు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తే మాకు మేలు జరుగుతుంది. – నిమ్మక అప్పన్న, గొట్టిపల్లి, కొత్తూరు -
ఆదిత్య విద్యార్థుల ప్రతిభ
టెక్కలి: ఇటీవల సత్యసాయి జిల్లాలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్నోవేషన్, డిజైన్, ఎంటర్ప్రెన్యూర్షిప్ బూట్ క్యాంప్లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో బుధవారం వారిని అభినందించారు. ఏఐసీటీఈ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 250 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. వారిలో ఆదిత్య విద్యార్థులు మైరెన్ ఎక్స్, కాష్యుహబ్, ఎఫీసోల్వో తదితర ఇన్నోవేషన్ ప్రాజెక్టులతో పాల్గొన్నట్లు వెల్లడించారు. కాష్యు హబ్కు జ్యూరీ ప్యానెల్ ఉత్తమ జట్టు అవార్డు, ప్రశంసా పత్రాలు అందజేసినట్లు తెలిపారు. అలాగే ఎఫీసోల్వోకు ప్రశంసపత్రాలు అందజేశారన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ఐతమ్ రైజ్ సీఈవో మనోజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
తూతూమంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదిక
కవిటి: మండలంలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించి నిర్వహించిన 18వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక తూతూమంత్రంగా జరిగింది. 2024 ఏప్రిల్ నుంచి 2025 మార్చి వరకు జరిగిన పనులకు సంబంధించి ఉపాధి హామీ సామాజిక తనిఖీ ప్రజావేదిక సభ బుధవారం కవిటిలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.లవరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. వాస్తవానికి సామాజిక తనిఖీ ఆడిట్ బృందం ఫిబ్రవరి 11 నుంచి మార్చి 31 వరకు గ్రామస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ గ్రామస్థాయి సభలకు సంబంధించి మీడియా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడంలో తనిఖీ బృందం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. వేజ్ కాంపోనెంట్ రూ.10.56 కోట్లకు పైగా నిధులు, పీఆర్ విభాగంలో రూ.4.10 కోట్లు, సోషల్ ఫారెస్ట్రీలో రూ.97,713లు, కాంపౌండ్స్ రూ.1.14 లక్షలకు సంబంధించిన పనులపై ఈ తనిఖీ నిర్వహించారు. సమీక్ష ప్రారంభం అయిన గంటలోనే 5 పంచాయతీలకు సంబంధించిన సానుకూల, ప్రతికూల అంశాలకు సంబంధించిన చర్చ సోషల్ ఆడిట్ సిబ్బంది పూర్తి చేసేశారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.15 కోట్ల నిధులు వినియోగానికి సంబంధించి కేవలం రూ.20,500లు దుర్వినియోగం అయినట్లు అధికారులు తేల్చారు. ఈ నిధులు బెజ్జిపుట్టుగలో రూ.6,000లు, సహలాలపుట్టుగలో రూ.7,500లు, బల్లిపుట్టుగలో రూ.4,500లు, వరకలో రూ.2,500లుగా నిర్దారించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ టి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, హెచ్ఆర్ మేనేజర్ శ్రావణ్, ఎంపీడీవో ఎల్.త్రినాథ, ఏపీవో టి.మోహనరావు, ఈసీ నీలాంబర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. -
చిరుతిండి.. ప్రమాదమండి..!
● జంక్ ఫుడ్తో చిన్నారులకు అనారోగ్యాలు ● ప్యాకింగ్ పదార్థాలతో అపాయం ● సంప్రదాయ సమతుల్య ఆహారంతో మేలు అవగాహన కల్పిస్తున్నాం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంక్ ఫుడ్ మాన్పించే విధంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆకర్షణీయమైన ప్యాకింగ్లో ఉండే ఆహార పదార్థాల వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సంప్రదాయ ఆహార పదార్థాలు తయారు చేసి పిల్లలకు అందివ్వాలి. దీనివలన వారిలో శారీరక, మానసిక ఎదుగుదల ఉంటుంది. – విద్యా శతపతి, సీడీపీవో, టెక్కలి జంక్ఫుడ్తో అనారోగ్య సమస్యలు జంక్ ఫుడ్ వలన చిన్నారుల్లో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం, గుండె, పొట్ట సమస్యలతో పాటు మెదడు ఎదుగుదల లేకుండా చేస్తాయి. జంక్ఫుడ్ ఆకర్షణకు గురి కాకుండా చూసుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. – బీఆర్కే మహారాజ్, చిన్న పిల్లల వైద్య నిపుణుడు, టెక్కలి జిల్లా ఆస్పత్రి ఎదుగుదలకు హానికరం చిన్నారుల ఎదుగుదలపై ఈ జంక్ ఫుడ్స్ తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా ఎక్కువ క్యాలరీలు, చక్కెర, ఉప్పు ప్రభావంతో వారిలో రోగ నిరోధక శక్తి నశించి అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వీటిలో ఎటువంటి ప్రోటీన్లు, విటమిన్లు ఉండవు. దీనివల్ల పెరుగుదల, రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. బర్గర్లు, పిజ్జా, చిప్స్, సోడాల్లో పోషకాలు తక్కువ, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి. దీంతో శరీరం పోషక లోపంతో ఎదుగుతుంది. అధిక బరువు, గుండె, లివర్ సమస్యలకు దారి తీస్తాయి. ఎక్కువ చక్కెర, ఫ్యాట్స్ వలన స్థూలకాయం, మధుమేహపు ప్రమాదం, ఫాటీ లివర్ మొదలైన సమస్యలు చిన్న వయసులోనే వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఏకాగ్రత తగ్గి, చిరాకు, అలసట, నిద్రలేమి సమస్యలు వస్తాయి. తల్లిదండ్రుల్లో మార్పు రావాలి చిన్నారులకు జంక్ ఫుడ్ను మాన్పించే విషయంలో తల్లిదండ్రుల నుంచి మార్పు రావాలి. ఇంట్లో తల్లిదండ్రుల ఆహార అలవాట్లుకు అనుగుణంగా పిల్లల ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే విషయంలో ఆకర్షణీయంగా ఇంట్లోనే పదార్థాలను తయారు చేసి వారికి అందివ్వాలి. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఆహారాన్ని తయారు చేయడంలో పిల్లలు భాగస్వామ్యం ఉండే విధంగా చూడాలి. దీనివలన వారు తయారు చేసిన ఆహారాన్ని ఎలాగైనా తినాలి అనే మార్పు వస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినే విషయంలో వారిని ప్రోత్సహించే విధంగా చిన్నపాటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దీనివలన ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్ ఆహారం అనారోగ్యం అనే విషయంపై చిన్నారులకు అవగాహన కల్పించాలి. సంప్రదాయ ఆహారంతో మేలు చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు కొన్ని రకాల సాంప్రదాయ ఆహారాలను అలవాటు చేయాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఇంట్లో వండిన సమతుల్య ఆహారం అనగా పప్పు, కూరలతో చేసిన ఆహారం, పాలు, గుడ్లు, చికెన్, చేపలు వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారం వారి పెరుగుదలకు ఎంతో మంచిది. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, అరటి, పచ్చి కూరలు, క్యారట్, బీట్రూట్తో చేసిన ఆహార పదార్థాలతో విటమిన్లు, ఖనిజ లవణాలు లభిస్తాయి. -
మొక్కా.. ఏదీ నీ లెక్కా..?
ఇచ్ఛాపురం రూరల్: ఉపాధి హామీ పథకంలో భాగంగా గతంలో వేతనదారులకు ఇచ్చిన మొక్కలు ఇప్పుడు సామాజిక తనిఖీ బృందానికి దొరకడం లేదు. మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా.. లెక్కకు మాత్రం అక్కడ ఒక్క మొక్క కూడా సామాజిక తనిఖీ బృందాలకు చిక్కకపోవడం విశేషం. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 1,252 పనులకు గత నెల రోజులుగా సామాజిక బృందం సభ్యులు గ్రామాల్లో ఆడిట్ నిర్వహించారు. వేతనాల రూపంలో రూ.10.75 కోట్లు, మెటీరియల్ రూపంలో రూ.5.14 కోట్లకు సామాజిక తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రజావేదికలో మండలంలోని ఏ గ్రామంలో కూడా మొక్కలు లేకపోవడంతో పీడీ లవరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మొక్కలు నాటాలని ఆదేశించారు. బాలకృష్ణాపురంలో రూ.1.05 లక్షల ఖర్చుతో నీటి కుంట తవ్వారు. అయితే జేసీబీతో కప్పివేసినట్లు సామాజిక బృందం గుర్తించింది. అదే గ్రామంలో రూ.5.38 లక్షలతో నక్కల బంధ చెరువు పూడిక తీత పనులు చేపట్టారు. అయితే ఆ చెరువు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించి చెరువు గట్టును పూర్తిగా తొలగించి, గ్రావెల్ రోడ్డు వేసి స్థలాలుగా మార్చుకున్నట్లు సామాజిక తనిఖీలో బృందం గుర్తించింది. దీనిపై ఏపీడీ ఎంకై ్వరీ వేస్తున్నట్లు పీడీ లవరాజు ఆదేశించారు. వివిధ కారణాలతో ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.4,500ల జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, పీఏసీఎస్ చైర్మన్ పెదిన బాబ్జీ, డ్వామా పీడీ బి.లవరాజు, ఏపీడీ పి.రాధ, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ అధికారి శ్రవణ్కుమార్, ఎంపీడీవో ఎ.ప్రభాకరరావు, ఎస్ఆర్పీ సిర్ల మాధవరావు, ఏపీవో పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో నిర్వహిస్తున్న వసతి గృహంలో చేరేందుకు చలన సంబంధ, బధిర విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థినులను ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ ఏడీ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో 50 మంది విభిన్న ప్రతిభావంతులైన బాలికలు చేరేందుకు అవకాశం ఉందన్నారు. 1వ తరగతి నుంచి పోస్టు గ్రాడ్యూయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచిత భోజనం, వసతితో పాటు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, సంవత్సరానికి నాలుగు జతలు యూనిఫామ్స్, కాస్మోటిక్ చార్జీలకు గానూ ప్రతినెల రూ.250లు అందజేయనున్నట్లు వెల్లడించారు. అలాగే పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న, ఉపాధి శిక్షణ పొందుతున్న విభిన్న ప్రతిభావంతులైన బాలికలకు సైతం శిక్షణ కాలములో వసతి గృహంలో వసతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. వసతి గృహంలో చేరే విద్యార్థినుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలని, వికలాంగత్వం 40 శాతం కానీ అంతకంటే ఎక్కువ గానీ ఉండాలన్నారు. కుల ధ్రువీకరణ పత్రం(ఓసీలకు అవసరం లేదు) ఉండాలని స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 08942–240519, 99519 71764, 80747 77210 నంబర్లను సంప్రందించాలని సూచించారు. అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం టెక్కలి: అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక పట్టుమహదేవి కోనేరు గట్టుపై ఆలయం అభివృద్ధి పనులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం అన్న క్యాంటిన్ను ప్రారంభించారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అంతకుముందు కోటబొమ్మాళిలో పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఆయనతో పాటు ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, నాయకులు కె.హరివరప్రసాద్, వి.విజయలక్ష్మి, ఎం.సుందరమ్మ, ఎం.దమయంతి తదితరులు ఉన్నారు. గాయత్రీలో మెరిట్ స్కాలర్ షిప్ టెస్ట్ శ్రీకాకుళం రూరల్: గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్సు అండ్ మేనేజ్మెంట్ కళాశాలలో డిగ్రీ ప్రవేశం పొందాలనుకునే విద్యార్థుల కోసం 2026–27 విద్యా సంవత్సరం నుంచి మెరిట్స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు గురజాడ విద్యాసంస్థల అధినేత జీవీ స్వామినాయుడు బుధవారం తెలిపారు. మే 1వ తేదీ నుంచి 31 వరకు ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతీ 100 మందిలో ఉత్తమ మార్కులు సాధించిన 5 మందికి రూ.25 వేల ప్రతిభా పురస్కారం అందజేస్తామన్నారు. ఈ పరీక్ష అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ స్టడీస్ వంటి అంశాలపై ఉంటుందన్నారు. పరీక్ష కోసం ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మరిన్ని వివరాలకు 94403 95109 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఆయనతో పాటు కరస్పాండెంట్ రంగారావు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
భూసమస్యలు పరిష్కరించని రీ సర్వే మాకొద్దు
● సత్యవరంలో గ్రామసభను బహిష్కరించిన రైతులు నరసన్నపేట: ‘ఎన్నో ఏళ్ల తర్వాత భూములు రీ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు కూడా రికార్డులు పూర్తి స్థాయిలో సరిదిద్దరా.. భూ సమస్యలు ఎక్కడికక్కడ ఉంచేసి తూతూమంత్రంగా రీ సర్వే చేసి వెళ్లిపోతామంటే మేం సహకరించం. ఇటువంటి రీ సర్వే మాకు వద్దు. ఉన్న భూములు అన్నింటినీ రీ సర్వే చేసి సమస్యలు పరిష్కరించండి. అన్ని విధాలా సహకరిస్తాం. ప్రధానంగా సత్యవరం రెవెన్యూ గ్రామ పరిధిలోని హెల్డోవర్ భూములను రీ సర్వే చేయాలి. లేకుంటే రీ సర్వే వద్దు’ అంటూ నరసన్నపేట మండలం సత్యవరం, దూకులపాడు, తండ్యాలవానిపేట రైతులు రీ సర్వే గ్రామసభను బహిష్కరించారు. మూడో విడతలో సత్యవరం రెవెన్యూ పరిధిలో భూముల రీ సర్వేకు అనుమతి రావడంతో బుధవారం అవగాహన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూముల సమస్యలు పరిష్కరించకపోతే రీ సర్వే ఎందుకంటూ రైతులు రెవెన్యూ అధికారులను నిలదీశారు. వివాదాస్పద భూములంటూ కొన్నింటిని హెల్డోవర్ పేరిట ఏళ్ల తరబడి పక్కన పెట్టేశారు. వీటికి పాస్ పుస్తకాలు కావాలని అడుగుతున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీ ఆరంగి మురళి మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి అని గతంలో కేంద్రం తీసుకువచ్చిన చట్టం ప్రకారం 600 ఎకరాలు మాకు దకలు పడ్డాయని, ఇప్పటికీ సాగు చేస్తున్నామని, ఆ తర్వాత భూములను హెల్డోవర్లో పెట్టారని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హెల్డోవర్ క్లియరెన్స్ చేసి 600 ఎకరాల్లో రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ పక్కన పెట్టారని తెలిపారు. ఈ భూముల్లో పట్టా పుస్తకాలు పొందిన వారు కొందరు మరణించారని, వారి పిల్లలకు పాస్ పుస్తకాలు ఇప్పించాలని విన్నవించారు. అనంతరం తహసీల్దార్ టి.సత్యనారాయణ మాట్లాడుతూ రీ సర్వేకు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. -
● కేజీబీవీలో 87.82 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటాయి. 25 కేజీబీవీల నుంచి 772 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 678 మంది ఉత్తీర్ణత సాధించారు. 87.82 శాతం ఉత్తీర్ణత నమోదైంది.పొందూరులో 97.30, గారలో 97.22, సారవకోటలో 96.7, పోలాకిలో 96.55, కొత్తూరులో 96.4 3, ఆమదాలవలసలో 95.45, కవిటిలో 95 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మందసలో 54.84, ఎల్లంపేటలో 42.86, ఇచ్ఛాపురంలో 73.53, పాతపట్నంలో 71.43 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పలు కేజీబీవీల్లో 970 మార్కులకు పైగా సాధించి ప్రతిభ చాటుకున్నారు. విద్యార్థినులతో పాటు ప్రిన్సిపాళ్లను, పీజీటీలను ఏపీసీ వేణుగోపాలరావు అభినందించారు. ఆమదాలవలస కేజీబీవీ విద్యార్థిని జె.వనజాక్షి ఎంపీసీలో 983 మార్కులు సాధించి కేజీబీవీల్లో టాపర్గా నిలిచింది. -
అదరగొట్టారు..
● ఇచ్ఛాపురం రూరల్: మండపల్లి గ్రామానికి చెందిన తిప్పన రాజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు 990 సాధించిటాపర్గా నిలిచాడు. ఎం.తోటూరు ఆదిత్యా విద్యా సంస్థల్లో చదువుతున్న రాజు కంప్యూటర్ ఇంజనీర్ కావడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. ● శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్ సెకెండియర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో శ్రీకాకుళం శ్రీచైతన్య విద్యార్థులు కంచరాపు రేవంత్కుమార్, మూల సాత్విక, వడ్డి మురళీకృష్ణ 989 మార్కులతో సత్తాచాటారు. నారాయణ కాలేజ్కు చెందిన కొత్తకోట ఉజ్వల 988 మార్కులతో మెరిసింది. సీనియర్ బైపీసీ గ్రూపులో శ్రీకాకుళం శ్రీచైతన్య కాలేజ్కు చెందిన పెడగోపు బిందుమాధవి 990 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచింది. ఫస్టియర్ ఎంపీసీలో శ్రీకాకుళానికి చెందిన ఎం.సౌందర్యలహరి 470 మార్కులకుగాను 467 మార్కులు సాధించింది. పొడుగు ప్రణీల, వంక జనీష, ఎస్.లక్ష్మిచేతన్, చిట్టి షణ్ముకసాయి, బైరి హస్మిత, పొలుమూరు శ్యామ్కృష్ణ, గుడ్ల హిమజ, గున్ను నేహ, లిస మహంతి 466 మార్కులు, దుంగ లిఖిత, అల్లాడ ఉర్షిత 465 మార్కులు సాధించి సత్తాచాటారు. బైపీసీలో 455 మార్కులకుగాను శ్రీకాకుళం నగరానికి చెందిన లిమ్మక లక్ష్మిత, పప్పల హర్షిత 451 మార్కులతో జిల్లా టాపర్లగా నిలిచారు. పైడిపెద్ది గిరి మేఘన 449, డి.భార్గవి 445 మార్కులు సాధించారు. వీరంతా స్థానిక శ్రీచైతన్య, నారాయణ కాలేజ్ విద్యార్థులే. ● జలుమూరు: ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థిని పాగోటి మౌనిక ద్వితీయ సంవత్సరం బైపీసీలో 990 మార్కులు సాధించింది. తల్లిదండ్రు లు రమణమ్మ, అశోక్ కుమార్ ఇద్దరూ వ్యవసాయ కూలీలే. ● బూర్జ: ఓప్పివాడ ఏపీ మోడల్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకెండియర్ చదువుతున్న చింతాడ అనన్యశ్రీ 990 మార్కులతో సత్తాచాటింది. -
స్వీయగణన ప్రక్రియ విజయవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జనగణన–2027లో భాగంగా తొలిసారిగా ప్రవేశపెట్టిన ‘స్వీయ గణన’ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈమేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించే జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలు htt ps://se.census.gov.in పోర్టల్ ద్వారా తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రక్రియను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, ప్రభుత్వ సిబ్బంది భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతిరోజూ కనీసం 10 నుంచి 20 మంది వ్యక్తులు స్వీయ గణన చేసుకునేలా సిబ్బంది చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 26న జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలలో ‘సెన్స స్ 5కేరన్’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రి య పూర్తిగా స్వచ్ఛందమైనదని స్పష్టం చేశారు. ఆదిత్యుని సన్నిధిలో మహాలింగార్చన అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలోని అనివెట్టి మండపంలో మాస శివరాత్రి సందర్భంగా బుధవారం శివ పంచాయతన సహిత మహాలింగార్చన ఘనంగా నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ అర్చనాభిషేకాలను శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు, ఆలయ అధికార సిబ్బంది పాల్గొన్నారు. ఖైదీలకు న్యాయ సహాయం శ్రీకాకుళం పాతబస్టాండ్ : జైళ్లలో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిల హక్కులను కాపాడటంతో పాటు వారికి సత్వర న్యాయం అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో పోలీసు, ఎకై ్సజ్ అధికారులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ ద్వారా బెయిల్ లభించినా బయటకు రాలేకపోతున్న వారు, మహిళలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ముద్దాయిల కేసులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలని సూచించారు. రాబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేస్తూ.. గతంలో మాదిరిగానే ఈసారి కూడా రికార్డు స్థాయిలో కేసులను రాజీ మార్గంలో పరిష్కరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి హరిబాబు, అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్, ఎస్.డి.పి.ఓ వి.వెంకటప్పరావు, అదనపు ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.నాగభూషణ రావు, జైలు అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్ వర్సిటీలో ఎంఓయూ ఎచ్చెర్ల: స్థానిక డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ, హైదరాబాద్కు చెందిన టార్చ్ ఫిన్టెక్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ మధ్య బుధవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు, స్వయం సాధన కోర్సులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అందిస్తారు. భారత ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ విభాగం ద్వారా నిధులు సమకూరుతాయని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, టార్చ్ ఫిన్టెక్ డైరెక్టర్ వైభవ్ సీపాన, అధ్యాపకులు పాల్గొన్నారు. -
శ్రీహరి అరెస్టు అప్రజాస్వామికం
నరసన్నపేట: జర్నలిస్టుగా సామాజిక అంశాలపై అవగాహన ఉన్న వైఎస్సార్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి ప్రజల ఇబ్బందులను సోషల్మీడియా ద్వారా బయటపెడుతుంటే, దానిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ బుధవారం తీవ్రంగా ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా మారు వేషాల్లో వచ్చి పోలీసులు ఎత్తుకుపోవడం దారుణమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. సుప్రీం కోర్టు నిబందనల మేరకు ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చి విచారణ జరపాలని, పోలీసులు ఆ నిబంధనను తుంగలోకి తొక్కి అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శ్రీహరిని వెంటనే విడిచిపెట్టాలన్నారు. అక్రమ అరెస్టు అన్యాయం... టెక్కలి: వైఎస్సార్సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమ అరెస్టు చేయడం అన్యాయమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ బుధవారం మండిపడ్డారు. చంద్రబాబు ప్రభు త్వం చేస్తున్న అక్రమాలను మీడియా ద్వారా బహిర్గతం చేస్తున్న ప్రతినిధులపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
మొక్కజొన్న రైతుల గోడు పట్టదా?
● వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలి ● మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ గార/శ్రీకాకుళం రూరల్ : మొక్కజొన్న కొనుగోలు లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికై నా నిర్లక్ష్యం వీడి వెంటనే మొక్కజొన్న కేంద్రాలను తెరిచి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బుధవారం గార మండలం కొత్తూరు, అచ్చెన్నపాలెం, శ్రీకాకుళం రూరల్ మండలం బలివాడ గ్రామాల్లో మొక్కజొన్న రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెట్టిన మద్దతు ధరకు కొనకపోతే కలిగిన నష్టాన్ని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. పరిశ్రమ, ప్రైవేటు వర్తకులు మాట తప్పవచ్చు కానీ ప్రభుత్వమే మాట తప్పితే ఎలా అని నిలదీశారు. ఏసీ గదుల్లో ఉండటం కాదని, పొలాల్లోకి వచ్చి రైతుల కన్నీరును చూడాలన్నారు. రైతుల ఘోష మీ చెవికి వినిపించడం లేదా? అని ప్రశ్నించారు. యూరియాను టీడీపీ కార్యకర్తలు బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు అమ్ముకున్నారని, జగన్ ప్రభుత్వం మాదిరిగా రైతు భరోసా కేంద్రాల వద్ద యూరియా అమ్మకాలు జరగాలని, విత్తనాలు అన్ని అందుబాటులో ఉంచాలన్నారు. రూ.280లకే దొరకాల్సిన యూరియాను రూ.700కు పక్క గ్రామాల్లో కొనుగోలు చేసుకున్నామని రైతులే చెబుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ధ్వజమెత్తారు. జిల్లాలో 80 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోందని, ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కాగా, రూ.1700కే కొనుగోలు చేస్తున్నారని, ఎకరాకు సరాసరి 40 క్వింటాళ్లు దిగుబడి రాగా రూ.28 వేలు నష్టపోతున్నారని చెప్పారు. జిల్లాలో రూ.240 కోట్ల మేర రైతులకు నష్టం వాటిల్లుతోందన్నారు. రెండేళ్ల కిందట అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మద్దతు ధరకే కొనుగోలు జరిగిందని రైతులే చెబుతున్నారని, కరోనా వంటి పరిస్థితుల్లో కళ్లాల వద్దకే వచ్చి తీసుకెళ్లారని గుర్తు చేశారు. జిల్లాలో ఓ వర్తకుడు క్వింటా రూ.1800 కంటే ఎక్కువ కొనవద్దని చెబుతున్నాడని తెలుస్తోందన్నారు. డ్యాష్బోర్డుపై చూడటం కాదని, పొలాల్లోకి వచ్చి రైతుల కన్నీరు చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీ యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీపీ గొండు రఘురామ్, నియోజకవర్గాల పరిశీలకులు చల్లా రవికుమార్, ఎన్ని ధనుంజయరావు, పార్టీ ఎస్ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పీస గోపి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మార్పు పృథ్వీరాజ్, నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు పీస శ్రీహరిరావు, మండల వ్యవసాయ విభాగం అధ్యక్షుడు శిమ్మ ధర్మరాజు, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్దన, బరా టం నాగేశ్వరరావు, సుంకాన సురేష్, గురువు అప్పలనాయుడు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కాశీబుగ్గ డీఎస్పీగా భవాని బాధ్యతల స్వీకరణ
పలాస/శ్రీకాకుళం క్రైమ్: కాశీబుగ్గ డీఎస్పీగా టి.భవాని బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఈమె గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేశారు. తర్వాత పోటీపరీక్షలు రాసి కడప జిల్లాలో డిప్యూటీ తహశీల్దారుగా కొలువు సాధించారు. తాజాగా గ్రూప్–1 ఫలితాల్లో డీఎస్పీగా ఎంపికై కాశీబుగ్గలో నియమితులయ్యారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిని బుధవారం డీఎస్పీ భవాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ ఆమెకు సూచించారు. -
శ్రీకాకుళం
చిట్టచివరన సిక్కోలు ● ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అట్టడుగు స్థానాల్లో నిలిచిన శ్రీకాకుళం ● జిల్లా సగటుతో పోలిస్తే వెనుకబడిన ప్రభుత్వ యాజమాన్య కళాశాలలు ● ప్రభుత్వ హడావుడి నిర్ణయాలు, ఏకపక్ష వైఖరే కారణమంటున్న విశ్లేషకులు చిన్నారుల ఆరోగ్యాన్ని జంక్ఫుడ్ దెబ్బతీస్తోంది. ప్యాకింగ్ పదార్థాలు తీవ్ర అనారోగ్యాన్ని కలగజేస్తున్నాయి. –8లోగురువారం శ్రీ 16 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026మే 21 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు.. ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ప్రధాన పరీక్షలు జూన్ 2తో ముగుస్తాయి. ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు, మార్కులు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు పరీక్షలకు సమాయత్తం కావాలి. ఏప్రిల్ 20 నుంచి 27 వరకు పరీక్ష ఫీజులను కాలేజీల్లోనే చెల్లించాలి. రీ–కౌంటింగ్, రీ–వెరిఫికేషన్కు నిర్దేశిత ఫీజులు చెల్లించి, కాలేజీల్లో దరఖాస్తులు చేసుకోవాలి. – రేగ సురేష్కుమార్, జిల్లా ఆర్ఐఓ/డీవీఈఓ (ప్రస్తుత ఫలితాలు) శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తీవ్రంగా నిరాశపరిచారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉత్తీర్ణత శాతంతోపాటు రాష్ట్రస్థాయిలోనూ వెనుకబడ్డారు. గత ఏడాది 74 శాతం సాధించగా.. ఈ ఏడాది ఒకశాతం దిగజారి 73కి చేరింది. ఇక ఎప్పటిలాగే ఈ సారి కూడా బాలురు కంటే బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో 71 కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వ తేదీ వరకు 23రోజులపాటు పరీక్షలు జరగగా.. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఫస్టియర్లో 70 శాతం.. ప్రథమ సంవత్సరం విద్యార్థులు గత ఏడాదితో కాస్త పోలిస్తే మెరుగనిపించారు. గత ఏడాది జనరల్ కోర్సులలో 63 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 70 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 21వ స్థానంలో నిలిచారు. 17,432 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాగా.. 12,163 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకెండియర్లో 73 శాతం.. సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్ధులు గత ఏడాది కంటే ఒక శాతం దిగజారి 74 శాతం నుంచి 73 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్లో మాత్రం ముందు వరుసలో నిలిచారు. జనరల్ కోర్సుల పరీక్షలకు 17,355 మంది హాజరుకాగా, 12,684 మంది పాసయ్యారు. సర్కారు వెనుకంజ.. గత ఏడాది వరకు మెరుగైన ఉత్తీర్ణత సాధిస్తూ వచ్చిన ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలు తాజా ఫలితాల్లో వెనుకబడ్డాయి. జిల్లా సగటు ఉత్తీర్ణతతో పోలిస్తే సర్కారీ కళాశాలల ఫలితాలు తగ్గుముఖం పట్టాయి. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హడావుడి నిర్ణయాలు, కనీస అభిప్రాయ సేకరణ, దిగువ స్థాయిలో అధికారులతో సమీక్షలు, సమావేశాలు లేకుండా తీసుకొచ్చిన ఏకపక్ష విధానాలే కారణామనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా క్లాసులు నిర్వహించకుండా వారోత్సవాలు, పేరెంట్స్ మీటింగ్స్ పేరిట 15 రోజులు, జీఎస్టీ వారోత్సవాలు, వినియోగదారుల వారోత్సవాలు, రాజ్యాంగ ఆమోదం, జాతీయ సేవా పథకం దినోత్సవం, ర్యాలీలు, ప్రతినెల స్వర్ణాంధ్ర–స్వచ్ఛంధ్రా పేరిట పరిసరాల పరిశుభ్రత, ఒకటేంటి.. ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో విద్యార్థులకు క్లాసులు లేకుండా చేయడంతో తమకు పాఠాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఆదేశాలతో కార్యక్రమాలను జరపాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. పాఠశాలల్లో జరిగే కార్యక్రమాలన్నీ కాలేజీల్లో అమలుచేస్తూ అధ్యాపకులు పాఠాలకు నోచుకోలేదని.. ఈ విషయంలో తాము కూడా ఏమీ చేయలేకపోయామని ప్రిన్సిపాళ్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వెరసి ప్రభుత్వ యాజమాన్య కాలేజీల్లో పూర్తిస్థాయిలో క్లాసులు జరగలేదనే సర్వత్రా అంగీకరిస్తున్నారు. సత్తాచాటిన గురుకులాలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఫస్టియర్లో 566 మంది విద్యార్థులకు గాను 496 మంది ఉత్తీర్ణులయ్యారు. 88 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎల్.గోవింద్ (బైపీసీ) 440, లింగాల రేష్మ, పొట్నూరు చరణ్కుమార్ (ఎంపీసీ) 462, టి. దీపిక (సీఈసీ) 456, మార్కులతో ప్రతిభ చాటారు. సెకెండియర్లో 591 మందికి గాను 517 మంది పాసై 87 శాతం ఉత్తీర్ణత సాధించారు. అల్లాడ సోనియా (బైపీసీ) 977, కొప్పిలి జగదీష్ (ఎంపీసీ) 973, కోనారి గీతాలక్ష్మి (సీఈసీ)850 మార్కులతో సత్తాచాటారు. వీరితో పాటు అధ్యాపక బృందాన్ని జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోదలక్ష్మి అభినందించారు. సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో ఫస్టియర్లో 67 శాతం, సెకెండియర్లో 70 శాతం ఉత్తీర్ణత సాధించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 18 వసతి గృహాల నుంచి ఫస్టియర్లో 571 మంది హాజరుకాగా 381 మంది ఉత్తీర్ణులయ్యారు. 66.73 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకెండియర్లో 468 మంది హాజరు కాగా, 326 మంది పాసయ్యారు. 69.66 శాతం పలితాలు సాధించారు. -
చిరుద్యోగి అరెస్ట్ అన్యాయం
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న చిరుద్యోగిని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అరెస్ట్ చేయించి శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించడం అన్యాయమని ఏపీఎస్ ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న క్రమంలో స్వీపింగ్ సూపర్వైజర్గా పనిచేస్తున్న రెల్లి కులస్తుడైన ఆకుల శీనును పనితీరు బాగోలేదనే కారణంతో ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా నేరుగా స్టేషన్లో పెట్టండని కలెక్టర్ ఆదేశించడం దారుణమన్నారు. అంబేద్కర్ జయంతి రోజునే ఎస్సీ వర్గానికి చెందిన ఉద్యోగిని అరెస్ట్ చేయడం రాజ్యాంగ హక్కుని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. దీనిని ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సంఘంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు టి.తిరుపతిరావు, ముత్యాలరావు, కిరణ్, నవీన్, అనిల్, ఈశ్వరమ్మ, జయంతి, పూర్ణ, సత్యవతి, పార్వతమ్మ, కార్మికులు పాల్గొన్నారు. సిబ్బంది పనితీరుపై కలెక్టర్ ఆగ్రహం.. శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దూరప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీ అధికారులపై ఉందన్నారు. కాంప్లెక్స్ ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి చెత్త, చెదారం లేకుండా చూడాలన్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సిబ్బంది పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్.అప్పలనారాయణ, ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు ఎఎన్ఎస్ శ్రీనివాస్, రాజు, ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
కష్టాల మోత!
● గర్భిణులను డోలీతో మోసుకొస్తున్న గిరిజనులు ● చిన్నారులకు తప్పని నాలుగు కిలోమీటర్ల కాలినడక ● రోడ్డు లేక మామిడిజోల గ్రామస్తుల అవస్థలు 4సారవకోట : ఎన్ని మారుతున్నా తమ డోలీ మోతల కష్టాలు మాత్రం మారడం లేదని సారవకోట మండలం బద్రి పంచాయతీ మామిడిజోల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు లేక నిత్యం అవస్థలు పడుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కొన్నేళ్ల కిందట సీతంపేట, సరుబుజ్జిలి, కొత్తూరు, హిరమండలం మండలాలలోని పలు ప్రాంతాల నుంచి పలు కుటుంబాల గిరిజనులు బద్రి గ్రామానికి సుమారు 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మామిడిజోల గ్రామానికి వలస వచ్చారు. చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలను చదును చేసి చీపురు, పసుపు, వేరుపనస తదితర పంటలను సాగు చేస్తూ జీవనం సాగు చేస్తున్నారు. మొదటి నుంచీ ఈ గ్రామానికి రోడ్డు సమస్య వెంటాడుతోంది. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో ఏ కష్టమొచ్చినా కాలినడకనే సమీప గ్రామాలకు వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించారని, కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం రోడ్డు మార్గమైనా కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు. డోలీలే గతి.. గ్రామంలో గర్భిణులకు ఆరోగ్య పరీక్షలకు సంబంధించి అవస్థలు తప్పడం లేదు. ప్రతి నెలా బుడితి సీహెచ్సీకి వైద్య పరీక్షల నిమిత్తం డోలీ కట్టుకుని మోసుకొచ్చి తిరిగి తీసుకెళ్తున్నారు. ప్రసవ సమయంలో ఆస్పత్రికి తీసుకురావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏమాత్రం పొరపాటు జరిగినా తల్లీ, బిడ్డలకు ప్రాణాపాయం తప్పదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 -
యంత్రం.. పనిచేసే మంత్రం
● అగ్నిమాపక శాఖ వద్ద అధునాతన పరికరాలు ● జిల్లాలో అగ్ని మాపక వారోత్సవాలుమన జిల్లాలో లేనివి మల్టీ పర్పస్ వాటర్ ట్రెండింగ్ (విశాఖ) పదివేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ బౌజర్స్, ఎనిమిది వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ లారీలు, బహుళ అంతస్థుల్లో ప్రమాదాలు సంభవించినప్పుడు అవసరమైన హైడ్రాలిక్ ప్లాట్ఫామ్ స్నారికల్ లేడర్స్ (విశాఖపట్నం, విజయవాడల్లో) ఉన్నాయి. వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఇరుక్కున్నా, నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీయాలన్నా దీన్ని ఉపయోగిస్తారు. దీన్ని ఎలక్ట్రిక్ రిమోట్ సాయంతో ఆపరేటర్ చేస్తారు. ఆయిల్ ప్రమాదాలకు ఫోమ్ మేకింగ్ బ్రాంచిని ఉపయోగించి ఫోమ్ను స్ప్రే చేస్తారు. 360 డిగ్రీల కోణంలో వాటర్ స్ప్రే చేయొచ్చు. 40.6 అడుగుల పొడవున్న అల్యూమినియం ఎక్సటెన్షన్ ల్యాడర్(నిచ్చెన) ఉంటుంది, సింగిల్ యూనిట్ అయితే 16, డబుల్ యూనిట్ అయితే 32 మంది ఉంటారు. అడ్వాన్స్ (మల్టీపర్పస్) వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సాధారణంగా వాటర్ ట్రెండింగ్ ఇంజిన్లో కిందనుంచి వాటర్ ప్రెజర్ కొడతారు. దీనికై తే పైన హ్యాండిల్ పట్టుకుని వాటర్ కొట్టవచ్చు. ఫోమ్, కార్బన్డైయాకై ్సడ్ ఉంటుంది. దీని ద్వారా ఫైర్ను కట్ చేయొచ్చు. మిస్ట్ జీప్ ఇది కాన్వాయ్లో ఉపయోగపడుతుంది. మినీ ఫైర్ ఇంజిన్ అని కూడా అంటారు. 200 లీటర్ల నీటి సామర్థ్యం ఉంటుంది. మిస్ట్ గన్తో ఫైర్ను కట్ చేస్తారు. ఈ గన్ నుంచి వెలువడే ఒక నీటి బిందువు అనేక మిల్లీ మైక్రాన్ అణువులుగా ఏర్పడి మంటలను ఆర్పుతుంది. చిన్న చిన్న సందుల్లోంచి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. ట్రూప్ క్యారియర్ ప్రమాదం సంభవించే ప్రాంతానికి అప్పటికప్పుడు సిబ్బంది వెళ్లేందుకు ప్రయాణంలో ఉపయోగపడేదే ట్రూప్ క్యారియర్. 30 మంది సిబ్బంది ఇందులో వెళ్లవచ్చు. ఫైర్ బుల్లెట్ బైక్ ఇదికూడా ఇరుకై న సందుల్లోంచి వెళ్లడానికి వీలుగా ఉంటుంది. 10 లీటర్ల ఫోమ్తో కూడిన నీళ్లుంటాయి. రెండు సిలిండర్లు ఉంటాయి. గ్యాస్ లీకై నప్పుడు త్వరగా ఫైర్ కటింగ్ అవుతుంది. ఆయిల్ ఫైర్ అయినప్పుడు ఫోమ్ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రానిక్ బేస్ అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఇంజిన్ జిల్లాలోని సోంపేట, నరసన్నపేటలకు అధునాతన ఎలక్ట్రానిక్ బేస్ అడ్వాన్స్డ్ వాటర్ టెండర్ ఇంజిన్లు కొత్తగా రెండు వచ్చాయి. వీటి నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సుదూర బహుళ ప్రయోజన నాజి ల్తో కూడిన కొత్త అధునాతన వాటర్ టెండర్ ఇంజిన్ ఇది. బోట్లు, ఇతర పరికరాలు ఉన్నాయి. వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శకటాలు, అధునాతన పరికరాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వేర్వేరు ప్రమాదాలు జరిగినప్పుడు వేర్వేరు పరికరాలను ఉపయోగిస్తారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా వీటిపై అవగాహన తప్పనిసరి. – శ్రీకాకుళం క్రైమ్ -
వసతి గృహానికి సామగ్రి వితరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్ : నగరంలోని ఎస్సీ హాస్టల్ –2 (భీమ్ భవన్ హాస్టల్)కు యూనియన్ బ్యాంక్ యాజమాన్యం మంగళవారం రూ.30 వేలు విలువైన 15 ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను అందజేశారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు మెరుగైన వసతులు సమకూర్చేందుకు గాను బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కోలక కృష్ణమోహన్ విజ్ఞప్తి మేరకు, హాస్టల్ విద్యార్థులకు వేసవి ఎండల తీవ్రత దష్ట్యా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు యూనియన్ బ్యాంక్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్యాంక్ శ్రీకాకుళం రీజినల్ హెడ్ పైడి రాజా, లీడ్ బ్యాంక్ మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, ఆర్ఎస్ఈటీఐ మేనేజర్ రాంజీ, ఏఐబీఓసి రీజనల్ సెక్రటరీ తేజేశ్వరరావు, బ్యాంకర్స్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ మజ్జి రాజశేఖర్, అసోసియేషన్ లీడర్ ధనరాజు, అసోసియేషన్ జోనల్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్, బ్యాంకు ఉద్యోగులు అనిల్ సూర్య కిరణ్, బహుజన టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సీర రమేష్బాబు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమిలో టీడీపీ నాయకుల ఇళ్ల నిర్మాణం
గార: విలువైన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా టీడీపీ వర్గీయులు ఆక్రమించుకుంటున్నారు. మండలంలోని శ్రీకూర్మం గ్రామంలోని బస్టాండ్ సమీపంలో సర్వే నంబర్ 600 లో 0.12 సెంట్లు ప్రభుత్వం స్థలం ఉంది. ఈ స్థలాన్ని గత ప్రభుత్వంలో శ్రీకూర్మనాథుని దర్శనం కోసం వచ్చే దూర ప్రాంత భక్తుల కోసం ఉచిత గదులతో పాటు కల్యాణ మంటపం నిర్మించాలన్న ఆలోచనతో ఢిల్లీకి చెందిన ఆదిలీలా ఫౌండేషన్కు అప్పగించింది. దీనికోసం అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. తర్వాత ఎన్నికలు రావడంతో పనులు ప్రారంభం కాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ స్థలంపై స్థానిక టీడీపీ నాయకుల కన్ను పడింది. నియోజకవర్గ ఎమ్మెల్యే సహకారంతో స్థానికులైన ముగ్గురు పేరున పట్టాలు ఇచ్చారని ప్రచారం జరిగింది. దీంతో గ్రామంలోని మంగళవారం అన్ని పార్టీలకు చెందిన పలువురు వెళ్లి నిర్మాణం జరుగుతున్న పనులును నిలిపేశారు. ప్రభుత్వం ఆదిలీలా ఫౌండేషన్కు ఇచ్చిన స్థలంలో ఎలా ఇళ్లు నిర్మిస్తారని నిలదీశారు. గత ఏడాది ఈ స్థలంలో నిర్మాణాలు ప్రారంభించేందుకు ప్రయత్నించగా పత్రికల్లో వార్తలు రావడతో అధికారులు నోటీసులు ఇచ్చి పనులను నిలిపేశారు. ప్రస్తుతం అధికార బలంతో పట్టాలు తెచ్చామని పనులు చేయడంపై స్థానికులు పీజీఆర్ఎస్కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. -
బాబోయ్ కింగ్ కోబ్రా
ఇచ్ఛాపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చీకటిలో సుమారు పది అడుగుల కింగ్ కోబ్రాను మంగళవారం రాత్రి స్థానికులు గుర్తించారు. ఆందోళనకు గురైన ప్రజలు స్నేక్ హెల్ప్లైన్కు సమాచారం అందివ్వడంతో స్నేక్ క్యాచర్ రామచంద్ర జగన్నాథ్ సాహు సంఘటనా స్థలానికి చేరుకొని కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకొని దగ్గర్లో ఉన్న అడవుల్లో విడిచిపెట్టారు. గత వారం రోజుల నుంచి ఒడిశా జయంతిపురం, పాత్రపురం గ్రామాల్లో భారీ కింగ్ కోబ్రాలు సంచరిస్తుండటంతో బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. అంబులెన్స్లు ఇలా.. సేవలు ఎలా..? పాతపట్నం: అత్యవసర సమయాల్లో రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించే అంబులెన్స్ 108 వాహనంతో పాటు కోవిడ్ సమయంలో సీహెచ్సీకి అదనంగా ఇచ్చిన అంబులెన్స్ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. పాతపట్నం సీహెచ్సీ ఆస్పత్రిలో ఈ వాహనాలు తుప్పు పట్టి, మూలన పడి ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన అంబులెన్స్కు రంగులు వేసి ఉపయోగిస్తున్నారు. 108కు ఫోన్ చేస్తే అత్యవసర సేవలు అలస్యం అవుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు. నేటి నుంచి ఈయూ రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం అర్బన్: ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో బుధవారం జరగనున్నాయి. ఈ మహాసభలకు హాజరయ్యేందుకు శ్రీకాకుళం ఒకటో డిపో నుంచి ఈయూ నాయకులు మంగళవారం బస్సులో బయలుదేరి వెళ్లారు. యూనియన్ ముఖ్య అంశాలు, ఉద్యోగుల సమస్యలు, భవిష్యత్ ప్రణాళిక నిర్ణయించనున్నట్లు యూనియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఈయూ నాయకులు ఎస్.వి.రమణ, జి.వి.రమణమ్మ, సనపల శ్రీనివాసరావు, డి.సుజాత, ఎం.వనజాక్షి, డి.బి.మూర్తి, కె.వై.బాబు, ఆర్ఎస్రావు, వై.కె.కుమార్, రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిఽధిలో సెంట్రల్ జాయింట్ సెక్రటరీ
అరసవల్లి : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని కేంద్ర ప్రభుత్వ స్టాటిస్టిక్స్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్కుమార్ గుప్తా కుటుంబసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ బృందం స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అఖండ భారత్ లక్ష్యంగా పాదయాత్ర రణస్థలం: భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని, హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, దేశ సమైక్యతను బలపరిచి అఖండ భారత్ సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలకులు మాతా సుమనపురి పాదయాత్ర చేపట్టారు. ద్వాదశ జ్యోతిర్లింగాల పాదయాత్రలో భాగంగా రణస్థలం మండలం పతివాడపాలెం విచ్చేసిన ఆమెకు విశ్వహిందూ పరిషత్ సభ్యులు స్వాగతం పలికారు. ఈమె గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రోజుకు సుమారు 20 కిలోమీటర్లు నడుస్తూ ఇప్పటి వరకు రెండేళ్లు యాత్ర పూర్తి చేశారు. నాలుగు సంవత్సరాల పాటు కొనసాగే ఈ యాత్ర రామేశ్వరం వద్ద ముగియనుందని సభ్యులు తెలిపారు. భార్యాభర్తలకు రిమాండ్ పాతపట్నం: చిన్నలోగిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి సోయి ఈ నెల 11న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దలోగిడి గ్రామానికి చెందిన ఆశ వర్కర్ జైనవలస చిలకమ్మ, ఆమె భర్త జైనవలస ముఖలింగం వేధింపుల వల్లే చనిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టాడు. ఈ నేపథ్యంలో మంగళవారం దంపతులను నరసన్నపేట కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. వీరిని అంపోలు జిల్లా జైలుకు తరలించామని ఏఎస్ఐ కె.శ్రీరామ్మూర్తి తెలిపారు. ఫలసాయం హక్కులకు రీటెండర్ ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ క్యాంపస్లో మామిడి, జీడి వృక్షాల పంట ఫలసాయం హక్కుల కోసం రీ టెండర్ దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ శ్రీకాకుళం పేరిట రూ.10 వేల డిపాజిట్ డీడీని జతపరచి టెండర్ కొటేషన్ను సీల్డ్ కవర్లో వర్శిటీలోని ప్రధాన పరిపాలనా భవనం వద్ద ఏర్పాటుచేసిన బాక్స్లో ఈ నెల 16వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు వేయాలని సూచించారు. మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటలకు కవర్లు బహిర్గతం చేసి ఎక్కువ మొత్తం చెల్లించే వారికి ఫలసాయం అందిస్తామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు సరికాదు నరసన్నపేట: కూటమిలో లేని రాష్ట్రాలపై ఎస్ఐఆర్(సర్) పేరుతో కేంద్ర ప్రభుత్వం దాడులు నిర్వహించడం తగదని ీసీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. మంగళవారం నరసన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యుద్ధ ప్రభావం ప్రజలపై పడుతోందని, ఆ భారాన్ని నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇదే సమయంలో సర్ పేరుతో కూటమిలో లేని రాష్ట్రాలపై దాడులకు దిగుతోందని విమర్శించారు. ఓటమి భయంతో అర్హులైన ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు. కేరళ వంటి రాష్ట్రంలో ఇదేలా వ్యవహరించిందన్నారు. గ్యాస్ కష్టాలు రెట్టింపు అయ్యాయని, విమాన చార్జీలు తగిడి మోపెడయ్యాయని, గ్యాస్ సరఫరాలో కేంద్రం చేతులెత్తేసిందని అన్నారు. ఓవైపు అంబేడ్కర్ జయంతి వేడుకలు నిర్వహిస్తూనే.. మరోవైపు ఆయన ఆశయాలకు తిలోదకాలు ఇస్తూ తూట్లు పొడుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్నా వారి రుణాలను మాఫీ చేయని మోదీ సర్కారు.. కార్పొరేట్లకు రుణ మాఫీ చేయడం దారుణమన్నారు. నరసన్నపేటలో అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయని, అధికార పార్టీ నాయకుల అండతోనే అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్కు నివాళి అర్పించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీపై తప్పుడు ప్రచారం తగదు
ఇచ్ఛాపురం: బాపు బొమ్మ స్పీక్స్ అనే ట్విట్టర్(ఎక్స్) ఖాతా ద్వారా ఫేక్ స్క్రీన్షాట్ సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, నాయకులు పట్టణ పోలీసుస్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రజల్లో అపోహలు కలిగించడానికి, రాజకీయ దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటువంటి దుష్ప్రచారాలతో ప్రజాస్వామ్యం దెబ్బతినడమే కాక శాంతిభద్రతలకు ముప్పు కలిగే అవకాశముందన్నారు. ఇటువంటి ఫేక్ ఖాతాను సృష్టించిన వ్యక్తిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, ఎంపీపీ బోర పుష్ప, మునిపల్ మాజీ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, సల్లా దేవరాజు, పిలక సంతు, కారింగి మోహన్రావు, చిరంజీవి, సోషల్మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఉనికి కోసమే ‘కూన దిగజారుడు వ్యాఖ్యలు
● వైఎస్సార్ సీపీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమదాలవలస: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ మతిభ్రమించిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరని వైఎస్సార్ సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై చేసిన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోరన్నారు. కూన రవికుమార్ తెలుగుదేశం పార్టీలో ఉనికి కోసమే ఇలా చేస్తున్నారని, వైఎస్సార్ సీపీ నాయకులతో తిట్టించుకుంటే మంత్రి పదవి వస్తుందనే ఆశతో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దివంగత ఎన్టీఆర్ మరణం వెనుక కారణం ఎవరో ఈ దేశం మొత్తం చెప్పగలదనే విషయం గుర్తుంచుకోవాన్నారు. కూన రవికుమార్కు చేతనైతే టీడీపీలో ఈనాటికీ అనుమానాలు ఉన్న వంగవీటి రంగా, కింజరాపు ఎర్రన్నాయుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, ఇంద్రారెడ్డి, జీఎంసీ బాలయోగిల మరణాలపై చంద్రబాబు వద్దకు వెళ్లి అడిగి తెలుసుకోవాలని హితవుపలికారు. తమ నేతలు జగన్మోహన్ రెడ్డి, దివంగత రాజశేఖరరెడ్డిలు ప్రజల హృదయాలు గెలుచుకొని నాయకులు అయ్యారని, మీ నాయకుడు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడని, ఇది ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మీ యువ నాయకుడు లోకేష్ త్వరలోనే నాన్నకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నాడని విమర్శించారు. కూన రవికుమార్ చేసే చీకటి వ్యాపారాలు నియోజకవర్గ ప్రజలకు తెలుసునని పేర్కొన్నారు. కూన కేకలకు బెదిరే వారు లేరని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ ముఖ్య నాయకులు సురవరపు నాగేశ్వరరావు, బోర చిన్నంనాయుడు, పొడుగు శ్రీనివాసరావు, బెవర మల్లేశ్వరరావు, దుంపల శ్యామలరావు, పొన్నాడ చిన్నారావు, మొండేటి కూర్మారావు, సంపతిరావు రామారావు, పున్నపురెడ్డి తవిటినాయుడు, బొడ్డేపల్లి మన్మధరావు, బొడ్డేపల్లి వెంకటరమణ, పొదిలాపు తిరుపతిరావు, సత్యనారాయణ, మెట్ట వసంతరావు, అన్నపు కృష్ణ, ప్రసాద్, అన్నపు సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వంట గ్యాస్కీ తిప్పలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇప్పటివరకు కమర్షియల్ గ్యాస్కే ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పు డు ఇంటిలో వంట గ్యాస్కు కూడా తిప్పలు తప్పడం లేదు. ఇదే అదనుగా కొన్ని గ్యాస్ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో చాలా దుకాణాలు, హొటళ్లు, ప్రైవేటు వసతి గృహాలు, ఇలా పలు వ్యాపార కేంద్రాలు మూతపడ్డాయి. అయితే ప్రభుత్వం, గ్యాస్ కంపెనీల అధికారులు గృహావసర వంటగ్యాస్ కొరత లేదని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు వంట గా్య్స్కు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిలిండర్లు ప్రైవే టు మార్కెట్కు వెళ్లిపోతుండడం, అధిక ధరలకు అడ్డగోలుగా విక్రయిస్తుండడం కనిపిస్తోంది. జిల్లా కేంద్రంలో బ్లాక్ మార్కెట్లో విరివిగా వంట గ్యాస్ సరఫరా అవుతోంది. ముఖ్యంగా నగరంలో కొత్తగా ఏర్పడిన రెండు ఏజెన్సీల్లో ఈ అక్రమాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గృహ అవసరాలకు సిలిండర్ ఆన్లైన్లో బుక్ చేసి మూడు వారాలు గడిచినా చాలా మందికి బండ అందలేదు. గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే కొరత ఉంది. బ్లాక్ మార్కెట్ చీకటి వ్యాపారం కూడా పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ స్థాయిలో జరుగుతోంది. ఇటీవల గ్యాస్ ఇవ్వడం లేదని ఇచ్ఛాపురానికి చెందిన వ్యాపారులు నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. శ్రీకాకుళం నగరంలో రెండు మూడు ఏజెన్సీల్లో అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆ రెండు రాజకీయ నాయకులకు చెందినవి కావడంతో వాటి జోలికి అధికారులు వెళ్లడం లేదు. ఇందులో ఒక ఏజెన్సీ యజమాని స్థానికంగా ఉండరు. కేవలం సిబ్బందిపై ఆధారపడి ఈ ఏజెన్సీని నడపడంతో సిబ్బంది అడ్డగోలు ఆదాయానికి ఆశపడి అఽధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఫిర్యాదు చేసినా.. జిల్లా కేంద్రంలోని రెండు ఏజెన్సీలపై వందలాది ఫిర్యాదులు ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు ఇష్టారాజ్యంగా కమర్షియల్ సిలిండర్, డొమెస్టిక్ సిలిండర్ అనే తేడా లేకుండా ఒక్కో బండపై రూ.1500 నుంచి రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తూ అమ్మకాలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమావేశమైనా ఉందా..? గ్యాస్ కొరతతో జనం అల్లాడుతున్నా ఉన్నతాధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు కనీసం సమావేశాలైనా నిర్వహించలేదు. సమస్యను పరిష్కరించే మార్గం వెతకడం లేదు. జిల్లాలో 39 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నా యి. ప్రధానంగా బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసిఎల్ వంటి సంస్థలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 6,92,825 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సగటున ప్రతి వారంలో 13 వేలు వరకు బండలు అవసరం ఉంది. అయితే సిలిండర్ల కొతర చూపడంలో వినియోగదారులు అధికంగా బక్ చేయడంతో సమస్యలు వస్తున్నాయి. గడువును నిర్ణయించడంతో కూడా వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. బుక్ చేసిన మూడు వారాలైనా అందని గ్యాస్ బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు వంట గ్యాస్ స్పందించని అధికారులు -
ఫేక్ ప్రచారంపై వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదు
నరసన్నపేట: బాపు బొమ్మ స్పీక్ అనే ట్విట్టర్(ఎక్స్) ఖాతా ఉంచి ఫేక్ స్క్రీన్ షాట్ సృష్టించి.. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిందని కొందరు ఫేక్ ప్రచారం చేస్తున్నారని, పార్టీ అభివృద్ధిని ఓర్వలేకే కొందరు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం వద్ద ఎంపీపీ ఆరంగి మురళి, నాయకులు కరిమి రాజేశ్వరరావు, ముద్దాడ బైరాగినాయుడు, రాజాపు అప్పన్న, చింతు రాఘవరావు, సురంగి నర్శింగరావు, బొబ్బాది ఈశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ఫేక్ స్క్రీన్ ప్రచారాన్ని తప్పుపట్టారు. దీనికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈమేరకు నరసన్నపేట ఎస్సై బి.గణేష్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట సోషల్ మీడియా ప్రతినిధులు పి.రమణ, రామకుమార్, అరవిందు పాల్గొన్నారు. -
జనగణనకు శ్రీకారం
● తొలిసారిగా స్వీయ నమోదుకు అవకాశం ● స్వగ్రామాల్లో లేనివారికి ఉపయోగకరం ● గత గణనలో జిల్లా జనాభా సంఖ్య 28 లక్షలు స్వీయ నమోదు ఇలా.... స్వీయగణన కోసం ‘ఎస్ఈ.సీఈఎన్ఎస్యూఎస్.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి లింక్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ లోనికి వెళ్లి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకొని అందులో ఉన్న క్యాప్చాను నమోదు చేయాలి. అటు తరువాత కుటుంబ యజమాని పేరు, మొబైల్ నెంబర్ నమోదు చేస్తే ఫార్మేట్ తెరుచుకుంటుంది. ఇందులో భాషను ఎంపిక చేసుకుని, ఓటీపీ నమోదు చేసి, లొకేషన్ వివరాలను నమోదు చేయాలి. అటు తర్వాత కుటుంబానికి సంబంధించిన 33 ప్రశ్నలకు సమాధానాలను నింపాలి. అన్నీ మరోసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 11 అంకెల సెల్ఫ్ యాన్యుమరేషన్ ఐడీ నెంబర్ జనరేట్ అవుతుంది. దీనిని ఓ చోట రాసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి. జనగణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఆ ఐడీ నంబర్ను చెబితే వారు మరోసారి చూసుకొని సబ్మిట్ చేస్తారు. ఏవైనా తప్పులు దొర్లినా, మార్పులు చేసుకోవాలన్నా సిబ్బంది సమక్షంలో సరిచేసుకునే అవకాశం కూడా ఉంటుంది. శ్రీకాకుళం : రాష్ట్రంలో 2011 తర్వాత చేపడుతున్న జనగణనలో తొలిసారిగా స్వీయ నమోదు ప్రవేశపెట్టారు. ప్రజలే తమ వివరాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా నమోదు చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా చేపడుతున్న జనగణన కోసం భారీ కసరత్తు జరుగుతుంది. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను సేకరించేందుకు ఏర్పాటు చేశారు. మే ఒకటి నుంచి 31 వరకు మొదటి విడత లెక్కింపు చేపడతారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి 15 రోజులు ముందుగా అంటే మే 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయ జనగణనకు అవకాశం కల్పించారు. దేశ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కీలకంగానున్న జనగణనలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలను చేస్తున్నారు. జిల్లాలో 2011 ప్రకారం 28 లక్షల జనాభా ఉన్నారు. 15 ఏళ్ల తర్వాత జనగణన.. జిల్లాలో 2011లో చివరిసారిగా జనగణన జరిగింది. 2021లో కరోనా కారణంగా లాక్డౌన్ పరిస్థితుల్లో జనగణనను చేపట్టలేకపోయారు. ప్రస్తుతం 2026–27 జనగణన కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే తెలియజేసింది. డేటా గోప్యతకు ప్రాధాన్యత.. ప్రజల వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేందుకు గాను స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం డిజిటల్ విధానంలో ఉంటుంది. స్థానికంగా అందుబాటులో లేని వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. జనగణనను రెండు దశల్లో చేపట్టనున్నారు. తొలిదశ మే ఒకటి నుంచి 31వ తేదీ వరకు జరగనుండగా ఇందులో ఇళ్ల వివరాలు, సదుపాయాలను తెలుసుకుంటారు. రెండో దశలో జనాభా లెక్కింపు సామాజిక, ఆర్థిక, సాంస్కతిక స్థితిగతులు ఆధారంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి సిబ్బందికి శిక్షణ ప్రక్రియ జరుగుతుంది. -
●దారిలో గోడ కట్టేశారు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లా కేంద్రంలోని కంపోస్టు కాలనీలో దాదాపుగా నివసించేదంతా నిరుపేదలే. హుద్హుద్ సమయంలో అక్కడ పేదలకు నివాస గృహాలు అందించారు. అయితే ఇక్కడ నడిరోడ్డుపై టీడీపీకి చెందిన ఇన్చార్జి తనయుడు అడ్డంగా గోడ నిర్మించేశారని స్థానికులు కొంతమంది కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావుకి వినతి పత్రాన్ని సోమవారం ఆయన చాంబర్లో అందించారు. ఫిర్యాదు చేసేందుకు అధిక సంఖ్యలో బయలుదేరడంతో వెళ్లే వారికి పింఛన్, రేషన్ కట్ చేస్తామని బెదిరించారు కూడా. అయినా కొందరు వెళ్లి ఫిర్యాదు చేశారు. కంపోస్టు కాలనీ ఎన్టీఆర్నగర్ కాలనీ బ్లాక్ –11, 12 వెనుక భాగాన నడక దారిని మూసేశారు. తన బంధువులకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేశారని స్థానికులు తెలిపారు. కమిషనర్ తాను స్వయంగా వచ్చి చూస్తానని చెప్పడంతో మహిళంతా ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి సోమవారం వినతుల స్వీకరిస్తానని తెలిపారు. -
400 నాటుసారా ప్యాకెట్లు స్వాధీనం
కంచిలి: సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ ఆధ్వర్యంలో నాటుసారా రవాణా, అమ్మకాలపై వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం తనిఖీలు చేపట్టారు. పాత నేరస్తులపై నిఘా ఉంచి, గత నేర చరిత్ర కలిగిన పులకపుట్టుగ గ్రామానికి చెందిన పులక లక్ష్మణరావు అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తున్న సమాచారంతో నిఘా పెట్టారు. దీంతో ఆయన ఒడిశా తుటుపురం నుంచి 300 నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపైన రవాణా చేస్తుండగా.. ఆదివారం సంత దగ్గర కాపుకాసి పట్టుకున్నారు. ఇతని నుంచి నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. అదేవిధంగా మఠం సరియాపల్లి గ్రామంలో నాటుసారా అమ్ముతున్న రత్నాల హేమలత, బొండాడ మోహనరావుల నుంచి 100 నాటుసారా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. బొండాడ మోహనరావు, పులక లక్ష్మణరావులు గతంలో పలు కేసుల్లో ముద్దాయిలు. వీరి ముగ్గురినీ సోంపేట కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ జీవీ రమణ తెలిపారు. ఒడిశా నుంచి నాటుసారా రవాణా అరికట్టడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. నాటుసారాపై ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14405 లేదా 94409 02358 నంబర్కు తెలియజేయాలని కోరారు. దాడుల్లో ఎస్ఐ జగన్నాథ్, సిబ్బంది భాను ప్రసాద్, ఉమాపతి, మార్కారావు తదితరులు పాల్గొన్నారు. -
సిబ్బందికి ఇబ్బంది
శ్రీకాకుళం: ప్రజా ప్రతినిధుల ప్రచార ఆర్భాటాలు సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి జిల్లా కేంద్రంలో పలు పనులను ప్రారంభించి బైక్ నడిపారు. ఆయన బైక్పై కలెక్టర్ కూడా ఉన్నారు. ఆపక్కనే ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా బండి తీశారు. దీంతో వీరికి భద్రత కల్పించాల్సిన వారు ద్విచక్ర వాహనాల వెనుక కిలో మీటర్ మేర పరుగులు పెట్టారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఇటీవల ప్రయాణికులు ఉన్న ఓ బస్సును నడిపారు. టెక్కలిలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు కూడా బైక్ నడుపుతుంటారు. వీరి ప్రచార ఆర్భాటం భద్రత సిబ్బందికి సవాల్ విసురు తోంది. దీన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా ప్రజాప్రతినిధులకు ఈ విషయాన్ని చెప్పలేకపోతున్నారు. ఇటీవల సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు పెరగడంతో వారితో పాటు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. -
కుక్కలు.. భౌబోయ్..!
● జిల్లాలో కుక్కల స్వైర విహారం ● విచ్చలవిడిగా దాడులు చేస్తున్న వైనం ● బెంబేలెత్తిపోతున్న ప్రజలు హిరమండలం: జిల్లాలో కుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రతిచోట స్వైర విహారం చేస్తున్నా యి. పట్టణాల్లోని ప్రధాన రహదారులు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో సైతం గుంపులుగా సంచరిస్తూ అటువైపుగా వచ్చేవారిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. అధికారులు శస్త్ర చికిత్సల పేరుతో లక్షలా ది రూపాయలు ఖర్చు చేసినట్టు గణాంకాలు చూపిస్తున్నారే తప్ప, వీటిని కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదు. గతేడాది 43,294 మంది కుక్కకాటు బాధితులుగా జిల్లాలో నమోదయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఎక్కువగా.. జిల్లాలో గతేడాది జనవరి, ఫిబ్రవరి, నవంబర్లో ఎక్కువగా కుక్కకాట్ల కేసులు నమోదయ్యాయి. వేసవిలో కొంత తగ్గాయి. పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లో వీటి బెడద ఎక్కువగా ఉంది. ఆయా చోట్ల వీటి నియంత్రణకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల శ్రీకాకుళంలోని సర్వజన ఆస్పత్రిని ప్రపంచ బ్యాంకు సర్వే బృందం సందర్శించింది. ఆ సమయంలో కుక్కకాటు బాధితుల ఓపీ చూసి ఆశ్చర్యపడింది. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస–కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మేజర్ పంచాయతీలు కొనసాగుతున్నాయి. 777 పంచాయతీలుగా ఉన్నాయి. అయితే మున్సిపాలిటీల్లో అస్సలు కుక్కల నియంత్రణ చర్యలు కానరావడం లేదు. కుక్కల నియంత్రణకుగాను వాటి సంరక్షణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు, వాటికి ఆహారం వంటివి సమకూర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒక్క శ్రీకాకుళం నగరంలో 2021 నుంచి 2025 వరకు రూ.73.8 లక్షలు ఖర్చుచేసి 5,203 శస్త్రచకిత్సలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ మిగతాచోట్ల మాత్రం అటువంటివేమీ కనిపించడం లేదు. ఇప్పటికై నా యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కకాటు చాలా ప్రమాదక రం. కరిచిన వెంటనే యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్లు వేసుకోవాలి. హిరమండలంలో ఇటీవల 10 మంది కుక్కకాటుకు గురయ్యారు. వారికి తక్షణ వైద్య సాయం అందించాం. నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందికర మే. అందుకే కరిచిన వెంటనే ఆస్పత్రికి రావాలి. – పి.సాయికుమార్, వైద్యాధికారి, హిరమండలం పీహెచ్సీ -
●అగంతకుల ఆచూకీ కోసం..
శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా వెంకటేశ్వర జ్యూయలరీ షాపులో దోపిడీ కేసుకు సంబంధించి అగంతకుల ఆచూకీ కోసం పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు బృందాలు గాలింపు చేస్తుండగా ఇప్పటికే నలుగురు నిందితులు ఒడిశాలో పట్టుబడినట్లు విశ్వసనీయ సమాచారం. వీరి నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేలా విచారణాధికారులు కృషి చేస్తున్నారు. దుండగులు ఉపయోగించిన కారును సైతం ట్రేసవుట్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ దోపిడీలో స్థానికుల హస్తం సైతం ఉందన్న కోణంలో కొందరిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. కాశీబుగ్గ వ్యాపార వర్గాల్లో ఈ దోపిడీ కాస్తా కలకలం రేపిందనే చెప్పాలి. పన్నుల అధికారులు సైతం నిఘా పేరిట కన్నేయడంతో జీఎస్టీలు ఎగ్గొట్టి వ్యాపారాలు చేస్తున్న వారు కలవరపడుతున్నారు. -
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణం సోమవారం ఉదయం ఘనంగా జరిగింది. చైత్ర బహుళ ఏకాదశి పర్వదినం సంద ర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి ఆగమశా స్త్రం ప్రకారం కల్యాణ సేవను అర్చకులు పూర్తి చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ ఈ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా వేదమంత్రో చ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నిర్వహించారు. శ్రీకాకుళం : జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న జనగణన– 27లో డిజిటల్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ వివరాలను శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్, జనగణన నగర ఇన్చార్జి కూర్మారావు ‘సాక్షి’కి తెలిపారు. ప్రజలు తమ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి వారు సూచించిన మేరకు ఓ లింకును డౌన్లోడ్ చేసుకుని కుటుంబ యజమాని ఆధార్ కార్డ్ నంబర్, సెల్ నంబర్తో నమోదు కావచ్చని తెలిపారు. అందులో పొందుపరిచిన 31 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను నమోదు చేసి వాటిని మరోసారి చూసుకొని సబ్మిట్ చేయాలని సూచించారు. సబ్మిట్ చేసిన తర్వాత ఓ నంబర్ వస్తుందని, దాన్ని జాగ్రత్తగా ఉంచాలని చెప్పారు. జనగణన ఎన్యుమరేటర్ ఇళ్లకు వచ్చినప్పుడు ఆ నంబర్ను చెబితే వారు ఆ సమాచారాన్ని సరిచూసుకొని సబ్మిట్ చేస్తారని అక్కడితో జనగణన నమోదు పూర్తయినట్లేనని పేర్కొన్నారు. ఏప్రి ల్ 16 నుంచి డిజిటల్ జనగణన విధానం అమల్లోకి వస్తుందని 30వ తేదీలోగా పూర్తి చేయా లని చెప్పారు. ఎన్యుమరేటర్ వచ్చే సమయాని కి తాము ఊరిలో లేమని, ప్రయాణాలు వా యిదా వేసుకోవాల్సి వస్తుందన్న చింత ప్రజల కు లేకుండా ఉండేందుకే ఈ డిజిటల్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎచ్చెర్ల: మండలంలో కుశాలపురం గ్రామానికి సమీపంలోని ఫ్లై ఓవర్పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం రూరల్ మండలంలోని భైరి గ్రామానికి చెందిన కొంగరాపు రంగయ్య మృతి చెందగా, బూరె లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం రూరల్ మండలం భైరి గ్రామానికి చెంది న బూరె లక్ష్మణరావు, కొంగరాపు రంగయ్యలు మేకను అమ్మేందుకు లావేరు మండలంలోని బుడుమూరు సంతకు మోపెడ్పై వెళ్లారు. మేకను సంతలో అమ్మి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వాహ నం నడుపుతున్న లక్ష్మణరావు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక కూర్చున్న రంగయ్య రోడ్డుపై పడ్డారు. దీంతో రంగయ్య (50) తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణరావుకు గాయాలయ్యాయి. 108 సాయంతో వీరిని రిమ్స్కు తరలించారు. రంగయ్య కుమారుడు లక్ష్మీనారాయ ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగయ్యకు భార్యతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. హైదరాబాద్లో సోంపేట యువకుడు మృతి సోంపేట: పట్టణానికి చెందిన యువకుడు వికాష్కుమార్ నెపాక్ హైదరాబాద్లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సోంపేటలోని నేతాజీ నగర్లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు లింగరాజ్ నెపాక్ కుమారుడు వికాష్కుమార్ నెపాక్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే సోమవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. వికాష్ మృతితో నేతాజీ నగర్లో విషాదచాయలు అలముకున్నాయి. -
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 99 వినతులు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్లో భాగంగా బాధితుల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించరాదని, ప్రతీ అర్జీదారుడికి సంత ప్తికరమైన సమాధానం అందాలని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 99 ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 22 అర్జీలు రాగా, పంచా యతీ రాజ్ శాఖకు 20, సెర్ప్ విభాగంలో 15, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో 9 వినతులు అందాయి. పోలీసు శాఖకు 4, సర్వే సెటిల్మెంట్స్ మరియు విద్యుత్ శాఖలకు సంబంధించి చెరో 3 చొప్పున ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ క్లినిక్ పర్యవేక్షణ పీజీఆర్ఎస్ అనంతరం కలెక్టర్ అక్కడ ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ను స్వయంగా పర్యవేక్షించారు. మండలాల వారీగా ఏర్పా టు చేసిన డెస్క్ల వద్దకు వెళ్లి, దరఖాస్తుదారులతో నేరుగా మాట్లాడి వారి భూసంబంధిత సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల అర్జీలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే రెవెన్యూ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా అందించాలని, ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కొన్ని వినతులు పరిశీలిస్తే... ●వారసత్వంగా వచ్చిన తన జిరాయతీ భూమి 20 సెంట్లలో వజ్రపుకొత్తూరు మండల అధికారులు నలుగురికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని, వారికి వేరేచోట ఇళ్ల పట్టాలి ఇప్పించి తన స్థలం తనకు ఇవ్వాలని వజ్రపుకొత్తూరు మండలం కంబాల రా యుడుపేట గ్రామానికి చెందిన బైపల్లి పార్వతి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. దీనిపై ఇదివరకే ఫిర్యాదు చేశానని, తనకు అనుకూలంగా న్యాయస్థానం కూడా తీర్పునిచ్చినప్పటికీ రెవె న్యూ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ●అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలని, ఖాతాదారులకు న్యా యం చేయాలని కోరుతూ పాతపట్నం అగ్రిగోల్డ్ బ్రాంచ్ పరిధి లో ఉన్న ఏజెంట్లు, ఇతర సిబ్బంది పీజీఆర్ఎస్లో కోరారు. ఈ సమస్యపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. ●గార మండలం అంపోలు గ్రామానికి చెందిన కురమాన మల్లేశ్వరరావుకు ప్రభుత్వం గతంలో డీ –పట్టా ఇచ్చిందని, అయితే రీ–సర్వేలో 1బీ అడంగల్ లేకుండా చేశారని, తిరిగి తనకు అడంగల్ పాస్బుక్ మంజూరు చేయాలని ఆయన కోరారు. ●సంకిలి షుగర్ ఫ్యాక్టరీలో 1996 నుంచి పనిచేస్తున్న 16 మంది ఉద్యోగులను ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా మేనేజ్మెంట్ ఉద్యోగాల నుంచి తొలగించిందని, తమను వెంటనే తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని వారు కోరారు. -
అక్కసుతోనే..
హామీలు అమలు చేయకుండా విపక్షంపై కక్ష సాధిస్తున్నారు. వైఎస్ జగన్పై విమర్శలు చేయ డమే అధికార పార్టీ నాయకులు పనిగా పెట్టుకున్నారు. కింజరాపు బుజ్జి, ఎర్రన్నాయుడు మరణం వెనుక ఎవరి పాత్ర ఉందో అందరికీ తెలుసు. అబద్ధాలతో చంద్రబాబు మెప్పు కోసం పాకులాడుకోవడం మానుకోవాలి. వైఎస్ జగన్పై విమర్శలు చేసే స్థాయి అచ్చెన్నాయుడుకు లేదు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు టెక్కలిలో అరాచక పాలన సాగుతోంది. తిలక్ ను విచారణ కోసం పోలీస్స్టేషన్కు పిలుపించు కుని గంటల తరబడి నిర్భందించడం అన్యాయం. మరణించిన వారిపై లేని పోని విమర్శ లు చేసిన అచ్చెన్నాయుడుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై వేధింపులు, అక్రమ కేసులు బనాయించడమే తప్ప ప్రజల కోసం ఆలోచన చేయడం లేదు. మూలపేట పోర్టు సభ పెద్ద ఎత్తున విజయవంతం కావడంతో అది తట్టుకోలేక ఇలా అక్రమంగా విచారణలు, కేసులతో పోలీసులు వేధిస్తున్నారు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్సార్ మరణంపై అచ్చెన్నాయుడు ఉన్మాది లా మాట్లాడారు. అచ్చెన్నాయుడుకు దమ్ముంటే దివంగత నేత ఎర్రన్నాయుడు మరణంపై సీబీఐ, సీఐడీ దర్యాప్తులు చేయాలి. ఆనాడు ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారులో ఒక్క ఎర్రన్నాయుడు తప్ప మిగిలిన వారంతా ఎలా బతికి బయట పడ్డారు. కేవలం అచ్చెన్నాయు డు ప్లాన్ ప్రకారమే జరిగింది. కారులో ఎర్రన్నాయుడుతో ప్రయాణించిన వారిలో చౌదరి బాబ్జికు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి, అప్పలనాయుడుకు ఎంపీ పదవులు కట్టబెట్టడంలో ఆంతర్యమేమిటి. అక్రమ విచారణలు, కేసులకు భయపడేది లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త


