Srikakulam
-
1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం: జిల్లాలోని 1,112 గృహాలకు రూ.13.22 కోట్లు మంజూరైనట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. నగరంలోని 44వ వార్డులో ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0 కింద మంజూరైన గృహన్ని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏవై గ్రామీణ్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏప్రిల్ నెలలో నిధులు వస్తాయని, లబ్ధిదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులకు పెండింగ్లో ఉన్న బిల్లులు సత్వరమే విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి కుటుంబానికి ఒక గొప్ప ఆనందకరమైన క్షణమన్నారు. పట్టణ హౌసింగ్ స్కీం కింద ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 లక్షలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఈడబ్ల్యూడీసీ డైరెక్టర్ పీఎంజే బాబు, గృహ నిర్మాణ శాఖ పీడీ రమాకాంత్, గృహ నిర్మాణ శాఖ పీడీ డి.రమాకాంత్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు పైడిశెట్టి జయంతి, డీఈ సత్యాజీ, ఏఈ మణికంఠ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్పీ గ్రీవెన్సుకు 44 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదిక (గ్రీవెన్సు) కార్యక్రమంలో ప్రజల నుంచి 44 వినతులు అందాయి. అదనపు ఎస్పీ (క్రైమ్) పి.శ్రీనివాసరావు వినతులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఇసుక లారీని ఢీకొన్న ట్యాంకర్ రణస్థలం: లావేరు మండలంలో బొంతుపేట గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ముందు వెళ్తున్న ఇసుక టిప్పర్ లారీని వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ ఢీకొంది. దీంతో ట్యాంకర్లో ఉన్న డ్రైవర్ అబ్దుల్లా షేద్కు తీవ్రగాయాలయ్యాయి. హైవే పోలీసులు, లావేరు పోలీసుల సాయంతో క్రేన్ సాయంతో క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీశారు. కాగా ఇసుక టిప్పర్ లారీ ఆగకుండా వెళ్లిపోయింది. క్యాబిన్లో ఇరుకుపోయిన డ్రైవర్ అబ్ధుల్లా షేద్ను 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందించారు. ఇతను ఉత్తరప్రదేశ్ చెందినవాడు. దీనిపై ఇంకా లావేరు పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. -
పోరాడుతూనే ఉంటాం
జనం తరిమికొడతారనే భయం టీడీపీలో కలగాలి. అప్పుడే పను లు చేస్తారు. అభివృద్ధి అంటే.. కిడ్నీ ఆస్పత్రి, సుజలధార, మూలపేట పోర్టు వంటి ప్రాజె క్టులు. బీచ్ ఒడ్డున 150 లైట్లు వేసి రీల్స్ చేయడం అభివృద్ధి కాదు. పోర్టు పూర్తయ్యే వరకు మేం పోరాడుతూనే ఉంటాం. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సిగ్గు చేటు వైఎస్ జగన్ కల, ఎన్నో కుటుంబాల త్యాగాల ఫలితమే మూలపేట పోర్టు. డబ్బులు వచ్చే అమరావతి తప్ప చంద్రబాబు అండ్ కోకు ఏమీ అక్కర్లేదు. వైఎస్ జగన్ చేసిన పనుల వద్ద ఫొటోలు దిగితే క్రెడిట్ వచ్చేయదు. – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి కమీషన్ల కోసమే.. టెక్కలి నియోజకవర్గంలో మైనింగ్ నుంచి లిక్కర్ అక్రమ వ్యాపారాల వరకు కింజరాపు కుటుంబం పెద్ద ఎత్తున దోపిడీ చేస్తోంది. కేంద్ర మంత్రికి దమ్ముంటే బహిరంగ సభ పెట్టి మూలపేట పోర్టు చంద్రబాబు కట్టారని చెప్పగలరా.? కమీషన్ల కోసమే పనులు ఆపేశారు. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త -
పీ–4తో పేదరికం నిర్మూలన సాధ్యం
● ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన పీ–4 కార్యక్రమంతో పేదరికం నిర్మూలన సాధ్యమని జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పీ–4 కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన మార్గదర్శుల సత్కార కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని సంపన్న పౌరులు మార్గదర్శులుగా అత్యంత పేదరికంలో ఉన్న 20 శాతం బంగారు కుటుంబాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం ఒక గొప్ప సామాజిక బాధ్యత అని కొనియాడారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 8,760 మంది మార్గదర్శులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, డీఆర్వో విశ్వేశ్వరరావు, ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీప్రసన్న, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీధర్, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. జెడ్పీ సీఈవోగా వెంకట్రామన్ శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పరిషత్ సీఈవోగా వెంకట్రామన్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు డిప్యూటీ సీఈవోగా శ్రీకాకుళంలో పనిచేస్తూ ఇన్చార్జి సీఈవోగా వ్యవహరించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరం కొద్దిరోజుల క్రితం బదిలీ అవ్వగా, తాజాగా ఆయనకు సీఈవోగా పదోన్నతి కల్పిస్తూ శ్రీకాకుళంలో నియమించారు. గతంలో ఈయన శ్రీకాకుళం ఎంపీడీవోగా కూడా పనిచేశారు. మంగళవారం ఈయన బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. -
త్వరితగతిన అర్జీల పరిష్కారం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 113 అర్జీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లు 113 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 58 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 24, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 5, పేదరిక నిర్మూలన సంస్థ 16, మున్సిపల్ కార్పొరేషన్ 11, సర్వే అండ్ లాండ్ రికార్డులు 8, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 7 తదితర శాఖలకు సంబంధించి 113 అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించినవారిలో అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పలు వినతులు పరిశీలిస్తే.. పొందూరు మండలంలోని లోలుగు రెవెన్యూ పరిధిలో ఉన్న డీజీఆర్ జ్యూట్మిల్ ప్రైవేట్ లిమిటెడ్ మిషనరీ అక్రమ అమ్మకాలపై అధికారులు కోరిన సమాచారం ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీవీ రమణ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకొని తనకు వివరాలు అందజేయాలని కోరారు. ● శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో ప్రశాంతి వృద్ధాశ్రమం వెనుక కలెక్టర్ ఆఫీసు రోడ్డులో డీటీసీపీ అప్రూవల్ పొందిన లేఅవుట్ శ్రీసాయి శ్రీనివాసనగర్ నివాసాల మీదుగా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు సిద్ధం చేశారని, ఆ ప్లాన్ రద్దు చేయాలని శ్రీసాయినగర్ వాసులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. దీనివలన సుమారు 200 కుటుంబాలకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
క్రెడిట్ చోరులపై
30 శాతం పనులు చేయలేరా..? పోర్టు పరిశీలిస్తే సర్కారు బండారం బయటపడుతుంది. అందుకే అడ్డుకున్నారు. 70 శాతం పనులు వైఎస్సార్ సీపీ పూర్తి చేస్తే.. 30 శాతం పనులు రెండేళ్లయినా చేయలేకపోయారు. పైగా అంతా తామే చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమం దిగ్విజయం ప్రసంగాలతో అధికార పక్షంపై నిప్పులు చెరిగిన వైఎస్సార్ సీపీ నేతలు పోర్టుకు వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు అడుగడుగునా అడ్డుగోడలే అన్నింటినీ దాటుకుని సభను విజయవంతం చేసిన నేతలు -
రణన్నినాదం
సిగ్గు లేదా.. మూలపేట పోర్టు కట్టామని చెప్పుకోవడానికి టీడీపీకి సిగ్గు లేదా. జిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు నిలదీయాలి.. జిల్లాకు ఎందుకు ప్రాజెక్టులు తీసుకురావడం లేదని కేంద్ర, రాష్ట్ర మంత్రులను నిలదీయాలి. అసలు 40 ఏళ్ల టీడీపీ పాలనలో జిల్లాకు చేసిందేమిటి..? వైఎస్ఆర్.. ఆ తర్వాత వైఎస్ జగన్మాత్రమే జిల్లాకు ప్రాజెక్టులు తీసుకువచ్చారు. – చింతాడ రవికుమార్, నియోజకవర్గ ఇన్చార్జి, ఆమదాలవలసఅదే టీడీపీ భయం మూలపేట కీలకం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఏమీ లాభం లేదు. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ పునాది రాయి కాదు మైలు రాయి.. మూలపేటకు వైఎస్ జగన్ వేసింది సాధారణ పునాది రాయి కాదు. జిల్లా చరిత్రలో ఓ మైలురాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరాన్ని వాడుకోవాలన్న ఆలోచన చేసిన ఏకై క నేత వైఎస్ జగన్. – పిరియా విజయ, జెడ్పీ చైర్ పర్సన్ సీఎం అంటే వైఎస్ జగన్ సీఎం అంటే వైఎస్ జగనే. మాటిస్తే నిలబెట్టుకుంటారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం రైతాంగానికి ఒక్క యూరియా బస్తా ఇవ్వలేదు. మంత్రి రామ్మోహన్నాయుడు విమానాల్లో తిరుగుతూ ఉంటే ప్రజల సమస్యలు అర్థం కావు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే కూటమికి చెంపదెబ్బ మూలపేట పోర్టు కార్యక్రమం కూటమి ప్రభుత్వానికి చెంపదెబ్బ. చంద్రబాబు అమరావతి తప్ప రాష్ట్రంలో ఇంకేమీ పట్టవు. కూటమి అరాచకాలను కార్యకర్తలు ప్రశ్నించాలి. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీఇచ్ఛాపురంసమన్వయకర్తక్రెడిట్ చోరులపైసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/టెక్కలి/ శ్రీకాకుళం పీఎన్కాలనీ : చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిప్పులు చెరిగింది. పోర్టుకు సపోర్టు ఇవ్వలేని అసమర్థ వైఖరిని జన సభ సాక్షిగా ఎండగట్టింది. మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ పేరిట పోరాటానికి పిలుపునిచ్చింది. దీనికి భయపడిన ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. నేతలు పోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంది. దీంతో వైఎస్సార్ సీపీ నేతలు నౌపడ మూడు రోడ్ల జంక్షన్లో సభ నిర్వహించి అధికార పక్షంపై మాటల తూటాలు పేల్చారు. వైఎస్ జగన్ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి కాగా.. టీడీపీ రెండేళ్లలో ఆ 30 శాతం పనులు చేయలేకపోయింది. పైగా మొత్తం ఘనత తమదే అన్నట్లు డబ్బాలు కొడుతోంది. ఈ పోర్టును పూర్తి చేస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డికి క్రెడిట్ వస్తుందని ఉద్దేశపూర్వకంగా పనులు జాప్యం చేస్తూ వస్తోంది. దీనిపైనే వైఎస్సార్ సీపీ ఉద్యమానికి సిద్ధమైంది. అర్ధంతరంగా ఆగిపోయిన మూలపేట పోర్టు పనుల పరిశీలనకు నడుం బిగించింది. దీనికోసం పోలీసులను అనుమతి కోరితే సభ ఏర్పాటుకు తప్ప పోర్టు సందర్శనకు అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న ఉద్దేశంతో మూలపేట పోర్టుకు సమీపంలో నౌపడ జంక్షన్ వద్ద సభ నిర్వహించారు. సభకు తరలివచ్చిన వేలాది మందితో నౌపడ జంక్షన్ జనసంద్రమైంది. టెక్కలి, కోటబొమ్మాళి నుంచి నౌపడ జంక్షన్ వైపు వెళ్లే రహదారులన్నీ కిటకిటలాడాయి. వేలాది కార్లతో ర్యాలీగా వైఎస్సార్సీపీ శ్రేణులు వచ్చాయి. దీంతో దారులన్నీ వాహ నాల జాతరను తలపించాయి. విపరీతమైన రద్దీ ఏర్పడింది. వాహనాలన్నీ మూలపేట పోర్టు వైపు వస్తుండటంతో పోలీసులు ఆంక్షలు పెంచారు. అయినప్పటికీ ఆంక్షలను చేధించుకుని నౌపడ జంక్షన్ వద్ద జరిగిన సభ కు రకరకాల మార్గాల ద్వారా వేలాదిగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు ప్రసంగాలతో అదరగొట్టారు. పోర్టు లెక్కలన్నీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. టీడీపీ అలసత్వాన్ని వివరిస్తూ మాటల తూటాలు పేల్చారు. క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, చంద్రబాబు అండ్కోపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మన మూలపేట పోర్టుకు పోదాం పదండి...మన పోర్టు మన కృషి అంటూ పిలుపుతో నిర్వహించిన నిరసన సభ విజయవంతమైంది. ప్రజల నుంచి అశేష స్పందన రావడంతో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తలేరాజేష్, శ్రీకాకుళం జిల్లాలోని వివిధ నియోజకవర్గ పరిశీలకులు దుంపల లక్ష్మణరావు, అంధవరపు సూరిబాబు, ఎన్ని ధనుంజయ్, చల్లా రవికుమార్, పిన్నింటి సాయి, కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంబటి శ్రీనివాస్, ఆరంగి మురళీధర్, రాజాపు అప్పన్న, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్, విజయనగరం పార్లమెంట్ పరిశీలకులు కేవీజీ సత్యనారాయణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల దివ్యభారతి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, పార్టీ యువజన నాయకులు ధర్మాన కృష్ణచైతన్య, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవి నాగ్, ఇంటలెక్చువల్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు పిల్లల రామకృష్ణ, పార్టీ నాయకులు దువ్వాడ వాణి, వైవీ శ్రీధర్, పొన్నాడ రుషి, చిట్టి జనార్ధనరావు, మండవల్లి రవి, శ్రీరామ్మూర్తి, బుక్కూరు ఉమామహేశ్వరరావు, పాలవసంత రెడ్డి, మార్పు అశోక్కుమార్, గద్దిబోయిన కృష్ణయాదవ్, చింతాడ వరుణ్, ఆట్ల సుజనమ్మ, కోణార్క్ శ్రీను, ఇప్పిలి కృష్ణారావు, కడియాల శ్రీహరి, ఎంఏ భేగ్, డాక్టర్ దాస్, పిలక రాజ్యలక్ష్మిలతో పాటు జిల్లాలో అన్ని నియోజకవర్గాల వైఎస్సార్సీపీ శ్రేణులు వేలాదిగా హాజరయ్యారు. -
● పొదల్లో పసికూన
పాతపట్నం: ఆకలి తీర్చడానికి చనుబాలు లేవు.. ఏడుపు ఆపడానికి తల్లి పొత్తిళ్లు లేవు.. ఒంటి నిండా చీమల కాట్లు.. కంటి నిండా కన్నీటి బొట్లు. వారం వయసున్న పిల్లాడు పొదల మధ్య పడిన అవస్థ ఇది. పాతపట్నం మండలంలోని బూరగాం గ్రామంలోని సత్యనారాయణ ఆలయం పక్కన ఘంసీ పుల్లాయ్ ఇంటి పెరటిలో సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎవరో పసి కందును పడేసి వెళ్లిపోయారు. ఆ పసికందు గుక్కపట్టి ఏడవడంతో భూదేవి అనే మహిళ బాబును రక్షించి, గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తుల సమక్షంలో బాబుకు సపర్యలు చేసి, శరీరాన్ని శుభ్రం చేశారు. బాబుకు వైద్య సేవల కోసం మంగళవారం ఉదయం తీసుకువెళతామన్నారు. ప్రస్తుతం బాబు ను భూదేవి అనే మహిళ వద్ద గ్రామస్తులు ఉంచారు. -
తీరంలో రణన్నినాదం 'పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం'
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/టెక్కలి/ సంతబొమ్మాళి/నందిగాం/ టెక్కలిరూరల్: ఉత్తరాంధ్ర తీరంలో అభివృద్ధికి అత్యంత కీలకమైన మూలపేట పోర్టుపై చంద్రబాబు ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. రెండేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేని ప్రభుత్వ అసమర్థతను తూర్పారపట్టింది. చేసిందేమీ లేకపోయినా పోర్టు ఘనత తమదే అంటూ క్రెడిట్ చోరీకి యత్నిస్తున్న చంద్రబాబు కుయుక్తులను కడిగిపారేసింది. శ్రీకాకుళం జిల్లా నౌపడలో జరిగిన కార్యక్రమంలో ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి స్థానిక ప్రజలే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ప్రభుత్వం ఎన్ని అవరోధాలు సృష్టించినా జనం రాకను ఆపలేకపోయారు. పోర్టు పరిశీలనకు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. నౌపడ జంక్షన్ వద్ద ముళ్లకంచెలతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వద్ద ఎక్కడిక్కడ టిప్పర్లను అడ్డం పెట్టారు. గ్రామాల శివార్లలో బారికేడ్లు పెట్టారు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామాల్లోకి రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. వాటిన్నింటినీ ఛేదించుకుని సభకు అశేషంగా హాజరయ్యారు. మూలపేట పోర్టు విషయంలో అధికార పార్టీ చేస్తున్న అబద్ధాల ప్రచారాన్ని నేతలు తిప్పి కొట్టారు. ఈ పోర్టు పూర్తయ్యేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.జగన్ హయాంలోనే 70 శాతం పూర్తి మూలపేట పోర్టు పనులలో మెజారిటీ భాగం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.4,362 కోట్ల నిధులను సమకూర్చారు. ఫైనాన్షియల్ క్లోజర్ జరిగింది. రుణాలకు బ్యాంకులతో టైఅప్ పూర్తి చేశారు. భూసేకరణ పూర్తిచేశారు. మూలపేట, విష్ణు చక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ. 149 కోట్లుఖర్చు చేశారు. వీటితోపాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీతో పాటు ప్రాజెక్టుకు కావలసిన అన్ని అనుమతులనూ తెచ్చారు. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగించడంతో పాటు ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ పూర్తిచేశారు కాబట్టి ప్రాజెక్టు 70శాతానికి పైగా పూర్తి అయినట్లే. జగన్ హయాంలో పనులన్నీ వేగంగా జరగడాన్ని గుర్తు చేసుకుంటూ.. మళ్లీ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదని స్థానికులు పేర్కొంటున్నారు. ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ బహిరంగ సభకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఆంక్షలువైఎస్సార్సీపీ చేపట్టిన ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించింది. మూలపేట పోర్టుకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు అష్ట దిగ్బంధనం చేశారు. కనీసం గ్రామస్తులు రావడానికి వీల్లేని విధంగా ఆంక్షలు పెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులెవరూ పోర్టు వైపు వెళ్లకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. నౌపడ జంక్షన్ నుంచి పాలనాయుడుపేట జంక్షన్ వద్ద, యామల పేటకు వెళ్లే రహదారి వద్ద, రాజపురం జంక్షన్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి బయట వ్యక్తులెవరూ పోర్టు ప్రదేశానికి వెళ్లకుండా బారికేడ్లు, ముళ్ల కంచెలతో మోహరించారు. నౌపడ మూడు రోడ్లు జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లే రహదారిలో టిప్పర్లను అడ్డంగా పెట్టి దాని ముందు బారికేడ్లు పెట్టి ముళ్లకంచెను ఏర్పాటు చేశారు. మూలపేట గ్రామస్తులు కూడా తమ గ్రామానికి వెళ్లాలంటే ఆధార్ కార్డు చూపించాల్సిన దుస్థితి చోటు చేసుకుంది. కొందరికి జీడి తోటలకు పరిహారం, పీడీఎఫ్ పరిహారం ఇవ్వలేదని, ఇంటి స్థలాలు కూడా కేటాయించలేదని, నిర్వాసిత కాలనీలో మౌలిక వసతులు కల్పించకుండానే తరలిస్తున్నారని మూలపేట గ్రామస్తులు వైఎస్సార్సీపీ నేతలకు వినతిపత్రాన్ని అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు పీడిక రాజన్నదొర, పుష్పశ్రీవాణి, బూడి ముత్యాల నాయుడు, కురసాల కన్నబాబు, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, పసుపులేటి బాలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా పరిషత్ చైర్మన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాసరావు, జల్లిపల్లి సుభద్ర, ఎంపీ గుమ్మ తనూజారాణి, మాజీ ఎంపీ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవి బాబు, నర్తురామారావు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు ఎం. విశ్వేశరరాజు, రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, శంబంగి వెంకట చినప్పలనాయుడు, వాసుపల్లి గణేశ్, అదీప్రాజ్, గొర్లె కిరణ్కుమార్, పెట్ల ఉమాశంకర్ గణేశ్, మళ్ల విజయప్రసాద్, శోభా హైమావతి, భాగ్యలక్ష్మి, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్, శత్రుచర్ల పరీక్షిత్ రాజు, కేకే రాజు, జెడ్పీ మాజీ చైర్మన్, జీసీసీ మాజీ చైర్మన్ గులిపల్లి శోభాస్వాతీరాణి తదితరులు హాజరయ్యారు.బహిరంగ సభలో ప్రసంగిస్తున్న శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వేదికపై వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు జగన్కు పేరొస్తుందన్న కక్షతోనే..ఒక ప్రభుత్వం కొనసాగిస్తున్న పనిని తర్వాత ప్రభుత్వం పూర్తి చేయాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కక్షతో మూలపేట పనులు ఆపేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురం పోర్టులో రీల్స్ చేసుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ భూ సేకరణ, అనుమతులన్నీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే చేసింది. రామ్మోహన్ నాయుడికి సమర్థత ఉంటే, తన శాఖ పరిధిలోని విశాఖ ఎయిర్ పోర్టు పనులను రెండేళ్లుగా ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు..? మీ మామూళ్ల కోసం ఇక్కడి పనులు సాగనివ్వరా..? అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉన్నా మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించలేదు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టు పూర్తయి ఉండేది. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారే అధికార పక్షం వారు ఇవాళ ప్రజాసంక్షేమం అంటూ మాట్లాడడం సిగ్గుచేటు. పోర్టు పనులను మేం పరిశీలిస్తామంటే ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతోంది? భయంతో ఎంతోకాలం మీరు పరిపాలన చేయలేరు. త్వరితగతిన పోర్టు పూర్తి చేయాలి. – బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత టీడీపీ నేతలను తరిమికొట్టాలి..ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ సిక్కోలు వెనుకబాటును రూపుమాపే ప్రాజెక్టులు తీసుకువచ్చారు. టీడీపీ పాతికేళ్ల పాలనలో ఒక్క శాశ్వత ప్రాజెక్టు అయినా తీసుకురాలేదు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లాకు ఏం చేశారో చూపగలరా..? మూలపేట పోర్టుకు అవసరమైన ఆర్థిక వనరులు, అనుమతులన్నీ వైఎస్ జగన్ ప్రభుత్వమే తీసుకువచ్చింది. టీడీపీ రెండేళ్లలో నయాపైసా ఇవ్వలేదు. ఏ రోజైతే జిల్లాలో టీడీపీని ప్రజలు తరిమి కొడతారో, ఆ రోజే వీరు భయపడి పనిచేస్తారు. ప్రైవేటు వ్యక్తులు కడుతున్న భోగాపురం ప్రాజెక్టుకు రామ్మోహన్ నాయుడు టూరిస్టులా వెళ్లి తామే కడుతున్నామని అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబు రూ.3.50 లక్షల కోట్లు అప్పు తెచ్చి, అందులో రూ.1000 కోట్లైనా ఈ పేద జిల్లాకు పెట్టారా? వైఎస్ జగన్ పోర్టులు, హార్బర్లతో అభివృద్ధి వికేంద్రీకరణకు రూపకల్పన చేశారు. కానీ టీడీపీ నేతలు జిల్లాలో ఇసుక, మట్టి, రాయి దోచుకుంటున్నారు. ఉద్దానం ప్రాంతానికి ఊపిరి పోసే విధంగా కిడ్నీ ఆస్పత్రి, హిరమండలం నుంచి సుజలధార ప్రాజెక్టుల ఘనత వైఎస్ జగన్కే దక్కింది. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి రెండేళ్లలో ఒక్కశాతం పని చేయలేదుకూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా మూలపేట పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వైఎస్ జగన్ హయాంలో పునరావాసం, భూసేకరణ, అనుమతులన్నీ పూర్తి చేసి కీలకమైన పనులు చేస్తే, వీరు అడ్డగోలుగా తామే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు. వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇవ్వడానికి చూశారు. బుడగట్ల పాలెం జట్టీ, భోగాపురం అన్నీ జగన్ చలవే. అబద్ధాలు చెప్పడం, ప్రజలను మోసగించడమే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు తెలిసిన పని. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ఒక్క ప్రాజెక్టయినా తెచ్చారా.. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంటూ జిల్లాకు ఏమీ చేయకుండా చంద్రబాబు భజన చేయడం సిగ్గుచేటు. వలస వెళ్లి ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాల్లో చనిపోతున్న జిల్లా వాసుల కష్టాలను చూసి, పాదయాత్రలో జగన్ తయారుచేసిన బ్లూ ప్రింట్ ఫలితమే మూలపేట పోర్టు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులకు ఛాలెంజ్ చేస్తున్నాను.. జిల్లాకు మీరు తెచ్చిన ఒక్క ప్రాజెక్టు అయినా చూపగలరా?. వైఎస్సార్, జగన్ హయాంలోనే జిల్లాకు వంశధార, రిమ్స్, పోర్టు, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీలు వచ్చాయి. అచ్చెన్నాయుడు గారూ.. అసెంబ్లీలో జగన్ను కాల్చేయాలంటున్నారు.. ఎవరిని కాల్చాలి? సంపదనంతా అమరావతిలో కేంద్రీకరిస్తున్న వారినా? లేక అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసిన జగన్నా..? – సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారుమూలపేట పోర్టు పూర్తయితే టెక్కలి ప్రాంతం ముంబైలా అభివృద్ధి చెందుతుంది. గతంలో భారీ భూసేకరణ సాధ్యం కాదని వాయిదా వేసిన ప్రాజెక్టును వైఎస్ జగన్ ఆచరణాత్మక ఆలోచనతో కేవలం 1,800 ఎకరాలతో సాధ్యమని నిరూపించి పనులు ప్రారంభించారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లలో ఏ సీఎం చేయని పనిని వైఎస్ జగన్ చేసి చూపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. కనీసం పనుల పరిశీలనకు కూడా అనుమతి ఇవ్వడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం. మూలపేట పోర్టు, ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు, ఫిషింగ్ హార్బర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్తో వైఎస్ జగన్ జిల్లాపై ప్రేమను చాటుకున్నారు. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడురెండేళ్లవుతున్నా ఎక్కడి పనులక్కడే..దశాబ్దాలుగా టీడీపీ ఎన్నికల అజెండాగా మాత్రమే ఉన్న పోర్టును వైఎస్ జగన్ పట్టాలెక్కించి 70 శాతం పూర్తి చేశారు. కానీ కూటమి ప్రభుత్వం రెండేళ్లవుతున్నా మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేని అసమర్థతతో ఉంది. పోర్టు పూర్తయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందనే కుళ్లుతోనే పనులు ఆపేశారు. గతంలో టీడీపీ 5 వేల ఎకరాలు దోచుకోవాలని చూస్తే, జగన్ మాత్రం తక్కువ భూమితో, అత్యధిక పరిహారం ఇచ్చి ప్రాజెక్టు సాకారం చేశారు. – పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎంవాస్తవ రూపంలోకి తెచ్చింది జగనేచాలామంది నేతల్లా శంకుస్థాపన రాయి వేసి వదిలేయకుండా, రూ.4,362 కోట్ల నిధులతో, నిర్వాసితులకు న్యాయం చేస్తూ పోర్టు పనులను వాస్తవ రూపంలోకి తెచ్చిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్. సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వాడుకుని 11 పోర్టులు నిర్మిస్తే ఏపీ అభివృద్ధి చెందుతుందనే ముందుచూపు జగన్ది. – పిరియా విజయ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీకాకుళంమాట మీద నిలబడని బాబు‘చెప్పాడంటే చేస్తాడు’ అనే క్రెడిట్ జగన్కే దక్కుతుంది. మాట తప్పడం చంద్రబాబు నైజం. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చి, ఏమీ చేయకుండా కూర్చున్న కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. – మత్స్యలింగం, అరకు ఎమ్మెల్యేబాబాయి, అబ్బాయ్లదే పాపంవలసల జిల్లా శ్రీకాకుళంలో రూ.4,362 కోట్లతో పోర్టు తెచ్చి, 25 వేల మందికి ఉపాధి, అందులో స్ధానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా జగన్ జీఓ తెచ్చారు. కానీ కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న బాబాయి, అబ్బాయిలు క్రెడిట్ జగన్కు వెళ్తుందనే కుట్రతో నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త జగన్ గెలిస్తేనే జిల్లా అభివృద్ధికిడ్నీ ఆస్పత్రి, మంచినీరు, పోర్టు వంటి ప్రాజెక్టులతో జగన్ జిల్లాకు దిక్సూచిలా నిలిచారు. కూటమి పాలనలో ఒక్క మంచి పనీ జరగలేదు. మళ్లీ జగన్ను గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యం. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యేఅన్నీ అబద్ధాలే..కూటమి పాలనలో అభివృద్ధి శూన్యం. వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధించడం, క్రెడిట్ చోరీ మాత్రమే జరుగుతోంది. 71 శాతం పనులు పూర్తయ్యాయని నిర్మాణ సంస్థే చెబుతుంటే, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. 40 ఏళ్లుగా మీ కుటుంబం జిల్లాకు చేసిందేమీ లేదు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్తబాబు చేసింది శూన్యంశ్రీకాకుళం అభివృద్ధికి కీలకమైన వంశధార, కిడ్నీ సెంటర్, మెడికల్ కాలేజీ, పోర్టు అన్నీ వైఎస్ జగన్ తెచ్చినవే. 17 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు జిల్లాకు ఇచ్చింది శూన్యం.– చింతాడ రవికుమార్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ ఈ పోర్టుజిల్లా ప్రజల చిరకాల వాంఛ మూలపేట పోర్టు. ఈ కలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్దే. తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నాన్ని వైఎస్ జగన్ మొదలుపెట్టారు. ప్రధానంగా 4 పోర్టుల నిర్మాణం, 8 ఫిషింగ్ హార్బర్స్ని ఈ తీర ప్రాంతంలో ఏర్పాటు చేయాలనే ఆలోచన వైఎస్సార్సీపీది. కూటమి నేతలు మూలపేట పోర్టును తామే నిర్మించామని ప్రగల్బాలు పలకడానికి సిగ్గులేదా..? – కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులుమూలపేట కీలకంమూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టాల్సిన అవసరం ప్రతిపక్షాలపై ఉంది. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న శ్రీకాకుళం జిల్లా నుంచి దీనికి నాంది పలకడం చాలా సంతోషం. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్నా ఏ ఒక్క అభివృద్ధి పనికీ శ్రీకారం చుట్టకపోగా గత ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ముందుకు కూడా రాకపోవడం దారుణం. – బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్ -
కోడిపుంజు గుడ్డు పెట్టింది.. గ్రామం మొత్తం షాక్!
శ్రీకాకుళం జిల్లా: ఎక్కడైనా కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. అది సృష్టి ధర్మం కూడా. కానీ ఎల్ఎన్పేట మండలం బొర్రంపేటలో మాత్రం కోడిపుంజు గుడ్డు పెట్టడం విశేషం. సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్తో పాటు కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే జన్యుపరమైన లోపాలతో ఇటువంటివి జరుగుతుంటాయని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. -
ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..
‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ అప్డేట్స్.. వైఎస్సార్సీపీ భారీ బహిరంగ సభశ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని గల మూలపేట పోర్ట్ పనులు త్వరితగతన జరగాలని ఉత్తరాంధ్ర వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో నౌపాడలో జరిగిన భారీ బహిరంగ సభ. ఈ సభకు భారీగా తరలివచ్చిన ఉత్తరాంధ్ర వాసులు. ధర్మాన ప్రసాదరావు కామెంట్స్..చిత్తశుద్ధి లేని ప్రభుత్వం నోరులని ప్రాంతాలకు అన్యాయం చేస్తోంది.అన్ని ప్రాంతాలకు సంపద సమానంగా పంపిణీ చేయాలి.టీడీపీ ప్రభుత్వం ఏనాడైనా శ్రీకాకుళం జిల్లాకు శాశ్వతమైన పనిచేసిందా?.ఎల్లో పత్రికలు పెట్టిన హెడ్డింగ్స్ చూసి ప్రజలు మోసపోతున్నారు.తరిమికొట్టే రోజు వచ్చినప్పుడే భయపడి అభివృద్ధి చేస్తారు.దిగజారి మూలపేట పోర్టు మేమే తెచ్చామని కేంద్రమంత్రి చెప్తున్నారు.మనం మౌనంగా ఉంటే మన జిల్లా అభివృద్ధిని పట్టించుకోరు.టీడీపీ ఎమ్మెల్యేలే రాక్షసుల్లా దాడులు చేస్తున్నారు.కూటమి ఎమ్మెల్యే దుర్మార్గాలు చూస్తే సిగ్గేస్తోంది.వైఎస్సార్సీపీ హయాంలో 30 లక్షల ఇళ్లు కట్టించాం.వైఎస్ జగన్ గొప్ప నాయకుడు, విశాలమైన భావాలున్న నాయకుడు. బొత్స సత్యనారాయణ కామెంట్స్..మూలపేట ఈ ప్రాంత అభివృద్ధి కాదు రాష్ట్ర మొత్తం అభివృద్ధి.దూరదృష్టితో పోర్టును వైఎస్ జగన్ నిర్మించారు..కూటమి ప్రభుత్వం పోర్టును పట్టించుకోలేదు.ప్రజల కష్టాలను పట్టించుకోలేదు..కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి సభ పెట్టడానికి వచ్చామురామ్మోహన్ నాయుడు భోగాపురం ఎయిర్ పోర్టుకు వెళ్లి రీల్స్ తీసుకునేవారు.భోగాపురం ఎయిర్ పోర్టు వైఎస్ జగన్ కృషి కాదా?.కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ జగన్ చేసిన మంచిని అచ్చెన్నాయుడు మర్చిపోయావా?.వైఎస్ జగన్ పనులను వారి మెప్పు కోసం ప్రచారం చేసుకుంటున్నారు..30 శాతం పనులను ఎందుకు పూర్తి చేయలేదు..కాంట్రాక్టర్కు మీకు సెట్టింగ్ కుదరలేదా?పోర్టును చూస్తే మీకు కలిగే ఇబ్బంది ఏమిటి?.వేరే వారికి పుట్టిన పిల్లలకు మీరు పెట్టవద్దు.రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.అమరావతి కోసం ఎంత ఖర్చు చేశారు.రాష్ట్ర విభజనకు మేము వ్యతిరేకం కాదని ఎర్రం నాయుడు చెప్పారు.మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కామెంట్స్..చంద్రబాబు వలనే పోర్ట్ పనులు జరుగుతున్నాయనడం టీడీపీ నేతల సిగ్గుచేటు.ఇలా మాట్లాడం అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు దివాలకోరు రాజకీయానికి నిదర్శనం.పాదయాత్ర సందర్భంగా జగన్ పోర్ట్ నిర్మాణం గురించి హామీ ఇచ్చారు..అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు..నేను పుట్టక ముందు నుంచి పోర్ట్ అంటూ చెపుతున్నారు..ఏ నాయకుడు నిర్మించ లేకపోయారు.వైఎస్ జగన్ వలన పోర్ట్ నిర్మాణం పూర్తి అయింది.శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చిన ఒక ప్రాజెక్ట్ గురించి బాబాయి అబ్బాయి చెప్పాలి..చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. శ్రీకాకుళానికి ఏం చేశారో చెప్పాలి?. శ్రీకాకుళం..ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్..భావనపాడు పోర్టును నిర్మిస్తామని టీడీపీ నేతలు మోసం చేశారు..ఉత్తరాంధ్ర ప్రజలను ఓటు బ్యాంకుగా చంద్రబాబు చూశారు..దశాబ్దాల కలను వైఎస్ జగన్ నిజం చేశారుమూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైఎస్ జగన్ నిర్మించారుచదువుకున్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.. పాముల పుష్పశ్రీవాణి కామెంట్స్.. మూలపేట పోర్టు దశాబ్దల కల.ప్రజల కలను వైఎస్ జగన్ నిజం చేశారు..మూలపేట పోర్టు పనులను 70 శాతం పూర్తి చేశారు..30% పనులు పూర్తి చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది.వైఎస్ జగన్ కు మంచి పేరు వస్తుందని చెప్పి పోర్ట్ నిర్మాణం పూర్తి చేయలేదు..ఉత్తరాంధ్ర అభివృద్ధిలో పెద్దన్న పాత్ర వైఎస్ జగన్ పోషించారు.. పోలీసుల ఆంక్షలు..మూలపేట పోర్టును పరిశీలించవద్దంటూ పోలీసుల ఆంక్షలు.నౌపాడ జంక్షన్ వద్ద సభకు మాత్రమే అనుమతి.వైఎస్సార్సీపీ నేతల పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు.నౌపాడ జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారికేడ్లు ఏర్పాట్లు. మూలపేట పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకం: ధర్మాన కృష్ణదాస్ఏడాది కాలంలోనే 70 శాతం పనులు పూర్తి చేశాం.కూటమి వచ్చిన తర్వాత 30 శాతం పనులను కూడా చేయలేకపోయింది.వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర. విశాఖ:కురసాల కన్నబాబు కామెంట్స్...క్రెడిట్ చోరీలో చంద్రబాబు స్థాయి పెరిగింది..ఇప్పుడు క్రెడిట్ దోపిడీ చేస్తున్నారు..బాబు ఏనాడైనా ఒక్క పోర్టు నిర్మాణం చేశాడా?చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసింది ఏమీ లేదు..వైఎస్ జగన్కు పేరు రాకూడదని కుట్ర చేస్తున్నారు..ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే మూలపేటకు వెళ్తున్నాం.రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ కామెంట్స్..ఉత్తరాంధ్రలో వలసలు అరికట్టాలని జగన్ సంకల్పించారు..వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకు ఊపిరి పోశారు..ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాల గడ్డ..మూలపేట పోర్టు కోసం పోరాటం చేస్తాం..అమరావతిపై పెట్టిన శ్రద్ద.. ఉత్తరాంధ్రపై ఎందుకు లేదు.. విశాఖ..ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్..మూలపేట పోర్టు వైఎస్ జగన్ సంకల్పం..70 శాతం పనులు మా హయాంలో చేసాం..30 శాతం పనులు కూడా చేయకుండా క్రెడిట్ చోరీ చేస్తున్నారు..వెనకబడిన శ్రీకాకుళం అభివృద్ధి చెందడం చంద్రబాబుకి ఇష్టం లేదు..ఎన్ని కుట్రలు చేసినా.. మూలపేట పోర్టు ఘనత జగన్నదే.. మూలపేట పోర్టుకు ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు..జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు.. ఆంక్షలు వలయంలో మూలపేట పోర్టు..నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు..విశాఖ నుంచి మూలపేటకు బయలుదేరిన వైఎస్సార్సీపీ నేతలు. మన మూలపేటకు పోదాం అనే కార్యక్రమాన్ని విచ్చిన్నం చేసే కుట్రలో ప్రభుత్వంవైఎస్సార్సీపీ నేతలు మూలపేట పోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు సిద్ధమైన పోలీసులు.పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధమవుతున్న పోలీసులు..నౌపాడ జంక్షన్ వద్ద జంక్షన్ వద్ద ముల్లకంచెలతో బారీకేడ్లు ఏర్పాటు..మూలపేటకు వచ్చే అన్ని రోడ్లను బ్లాక్ చేస్తున్న పోలీసులు..రోడ్డును టిప్పర్లతో బ్లాక్ చేసిన పోలీసులు.మన మూలపేట పోర్టుకు పోదాం నేపథ్యంలో వందల సంఖ్యలో పోలీసుల మోహరింపు..ఎన్ని ఆంక్షలు పెట్టినా కార్యక్రమం విజయవంతం చేస్తానంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులు..నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 👉రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటి నుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు.👉మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు.👉అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. -
సపోర్టు ఇచ్చిందే వైఎస్సార్సీపీ
పోర్టు నిర్మాణంలో వాస్తవాలను వివరిస్తాం ● మూలపేట పోర్టు క్రెడిట్ కొట్టేయడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు ● పోర్టు పనుల ఘనత వైఎస్ జగన్దే ● నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ నిర్వహిస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు ● జనాలకు వాస్తవాలు చెప్పడానికి సిద్ధమవుతున్న నాయకులు – సాక్షి ప్రతినిధి శ్రీకాకుళంమూలపేట పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికి మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కమిషన్ల లావాదేవీల కోసం కాలయాపన చేశారు. ఇప్పుడు క్రెడిట్ చోరీ చేస్తున్నారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధితో పాటు జిల్లాను ప్రపంచ పటంలో గుర్తించే విధంగా పోర్టుకు శ్రీకారం చుట్టిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే ఈ ఘనత అని నిరూపిస్తాం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి ● వైఎస్సార్సీపీ ఉన్నప్పుడు రూ.4361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం కోసం 2023 ఏప్రిల్ 19వ తేదీన శంకుస్థాపన చేశారు. ● మూలపేట, విష్ణుచక్రం గ్రామాల ప్రజలకు పునరావాస కాలనీ, మౌలిక సదు పాయాల కోసం నౌపడ సమీపంలో రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రోడ్డు కోసం రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. ● రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను రైతుల అంగీకారంతో సేకరించారు. ● ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ తో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. ● కేవలం ఏడాది కాలంలోనే అనగా ఎన్నికల సమయానికే సౌత్ బ్రేక్ వాటర్, నార్త్ బ్రేక్ వాటర్ పనులతో పాటు కార్గో బెర్తుల నిర్మాణం, క్యాటింగ్ యార్డు నిర్మాణం, బ్లాచింగ్ చిప్స్ ప్లాంట్ నిర్మాణంతో పాటు డ్రెడ్జింగ్ పనులతో సహా 70 శాతం పనులు పూర్తి చేశారు. మరో వైపు రోడ్డు పనులు ప్రాథమిక స్థాయిలో పూర్తి చేశారు. పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్) -
అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): పేద విద్యార్థులను కించపరిచేవిధంగా మాట్లాడిన గరికపాటి నరసింహారావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని, రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ సెంటర్ల ఏర్పాటును విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మిలు డిమాండ్ చేశారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సీఐటీయూ, భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో గరికపాటి వ్యాఖ్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల వల్ల వంట కార్మికులు ఉపాధి కోల్పోతారని, మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాలలపై అసభ్యంగా మాట్లాడిన గరికపాటిపై ప్రభుత్వం, బాలల హక్కుల కమిషన్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.సుశీల, బి.ఉత్తర, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డి.చందు, ఖగేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ, ఐద్వా నాయకురాలు టి.ప్రవీణ, యూనియన్ నాయకులు ఎ.రాధ, వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా చెస్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: నగరంలో కొత్తరోడ్లోని కాశ్యప్ నర్సింగ్ కళాశాల వేదికగా ఆదివారం జరిగిన జల్లాస్థాయి అండర్–9 చెస్ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి బాలబాలికలు హాజరై ప్రతిభ కనబర్చారు. ఈ ఎంపిక పోటీల్లో బాలురు విభాగంలో అన్నెపు శశాంక్, శనుగును శివ, సనపల రిత్విక్సాయి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో లిపిక కారుణ్య, కొల్ల భవిష్య, రేష్మిక మొదటి మూడు స్థానాల్లో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికై న వీరంతా ఏప్రిల్ 18, 19 తేదీల్లో అన్నవరం వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి అండర్–9 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరుపున ప్రాతినిధ్యం వహిస్తారని ఆలిండియా చెస్ ఆన్ స్కూల్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు తెలిపారు. అంతకుముందు ఈ ఎంపిక పోటీలను తంగుడు సుధీర్ మొదటి ఎత్తువేసి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్, కార్యదర్శి జామి రమేష్, సంఘ ప్రతినిధులు, కోచ్లు పాల్గొన్నారు. జిల్లాకు ఇన్చార్జి మంత్రి కొండపల్లి రాక నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం జిల్లాకు రానున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటకు విజయనగరం నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి మధ్యాహ్నం 2.00 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. జీరో పావర్టీ పీ–4 (పేదరిక నిర్మూలన) ఏర్పాటు చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో విజయనగరం చేరుకుంటారని వివరించారు. -
రెండేళ్ల పాలనలో ఏం చేశారు..?
టెక్కలి, సంతబొమ్మాళి: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు ప్రపంచ పటంలో ప్రత్యేక గుర్తింపునిచ్చే విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జిల్లా పరిశీలకుడు ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నారు. సోమవారం సంతబొమ్మాళి మండలం నౌపడ సమీపంలో నిర్వహించనున్న ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ స్థలాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ.. గతంలో ఎంతో మంది నాయకులు ఈ ప్రాంతంలో పోర్టు కడతామని హామీలిచ్చి మరచిపోయారని గుర్తు చేశారు. ఈ జిల్లాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సుమారు రూ.4362 కోట్లతో అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించారని, ఎన్నికల సమయానికి 70 శాతం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో మాయ మాటలతో కూటమి ప్రభుత్వం అధికారం దక్కించుకుని మిగిలిన 30 శాతం పనులు పూర్తి చేయలేదని ముత్యాలనాయుడు ఆరోపించారు. పోర్టు నిర్మాణంలో వాస్తవ పరిస్థితులను తెలియజేయడానికే ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ.. టెక్కలి నియోజకవర్గం ప్రాంతంలో పోర్టు నిర్మాణం 70 ఏళ్లుగా కలగా మిగిలిపోయిందన్నారు. అలాంటి కలను సాకారం చేసే విధంగా గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మూలపేట పోర్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న కూటమి నాయకులు రెండేళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. 30 శాతం పనులు పూర్తి చేయలేకపోవడమే కాకుండా పోర్టు క్రెడిట్ను దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మూలపేట పోర్టు మంజూరు కోసం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాసు ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయం చేయాలని కోరారు. అనంతరం వైఎస్సార్సీపీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో ఏడాది కాలంలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్కలి నియోజకవర్గం టీడీపీ ముఖ్య నాయకులతో పాటు నారా లోకేష్ వరకు కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతో పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. జిల్లాలో వలసల నివారణ, యువతకు ఉపాధి, జిల్లా అభివృద్ధి కోసం నిర్మాణం తలపెట్టిన పోర్టు పనులు పూర్తి చేసేందుకు నిర్వహిస్తున్న పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. వీరితో పాటు జెడ్పీటీసీ పాల వసంత్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బి.మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, నాయకులు పి.రవికుమార్రెడ్డి, ఎన్.భీమారావు, ఎస్.సత్యం, కె.సతీష్, జి.గురునాధ్యాదవ్, కె.అజయ్, ఎ.మురళి, కె.జీవన్, బి.రాజేష్, వి.శ్రీధర్రెడ్డి, బి.కార్తీక్, ఆర్.మురళీరెడ్డి తదితరులు ఉన్నారు. ఏడాదిలో 70 శాతం పోర్టు పనులు పూర్తి చేసిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదే పోర్టు నిర్మాణంలో వాస్తవాలను ప్రజలకు వివరించడానికే కార్యక్రమం నౌపడ సమీపంలో సభా స్థలం పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు నేడే ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ భారీ బహిరంగ సభ -
‘పోర్టు పేరుతో టీడీపీ నాయకులు పబ్బం గడుపుకున్నారు’
టెక్కలి: జిల్లాలో పోర్టు నిర్మాణం పేరుతో ప్రజల్ని ఊరిస్తూ టీడీపీ నాయకులు దశాబ్దాల కాలంగా పబ్బం గడుపుకుని అధికారం వెలగబెట్టుకున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమంపై ఆయన మాట్లాడారు. దివంగత ఎర్రంన్నాయుడు నుంచి ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా ఉన్న రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు సైతం భావనపాడులో పోర్టు కడతామంటూ ఏళ్ల తరబడి ఓటు రాజకీయాలు చేశారని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం.. వైఎస్సార్సీపీ హయాంలో గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా సంకల్పించి మూలపేటలో పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అప్పలరాజు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూలపేట పోర్టు క్రెడిట్ను దోచుకునే విధంగా టీడీపీ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, వీటిని తిప్పికొట్టడానికి మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ (భూ సమస్యలపై) సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు నేరుగా లేదా ఆన్లైన్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు. భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేయడమైనదని, ఈ అవకాశాన్ని అర్జీదారులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని డీసీసీబీ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భాగంగా తాపీపని చేస్తున్న బార రామారావు (45) విద్యుత్ ఘాతానికి గురై ఆదివారం మృతి చెందాడు. పని చేస్తున్న సమయంలో పైన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య బార్ అప్పన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి గార: మండలంలోని వత్సవలస రాజమ్మ తల్లి జాతరకు వెళ్తూ ఆర్టీసీ బస్సు చక్రాలు కిందపడి మహిళ మృతి చెందింది. జి.సిగ డాం మండలం ఎస్పీ రామచంద్రాపురాని (అగ్రహారం)కి చెందిన ముగుడ కనక (50) కుమారుడు కవిలేశు స్కూటీపై ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో శ్రీకూ ర్మం మీదుగా వత్సవలస వెళ్తున్నారు. తండ్యాలపేట గ్రామ సమీపంలోకి వచ్చేసరికి ఎదురు గా వస్తున్న ఆర్టీసీ బస్సు స్కూటీకి తగిలింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న కవిలేశు పక్కకు పడిపోగా, తల్లి కనక రోడ్డుపై పడిపోవడంతో తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెనుక చక్రం వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కనక భర్త గుజరాత్ రాష్ట్రంలోని ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్నాడు. కవిలేశు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ తెలుగు చంద్రమోహన్ తెలిపారు. స్కూటీ అదుపుతప్పి మహిళ మృతి పోలాకి: మండలంలోని సుసరాం ర్యాంపుల వద్ద స్కూటీ అదుపుతప్పి జరిగిన ప్రమాదంలో ఉర్జాం గ్రామానికి చెందిన సంపతిరావు తేజ అనే మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు. మరో మహిళతో కలిసి ఒక ఫంక్షన్లో మెహందీ పెట్టేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలం వద్ద నుంచి పోలీసుల సహకారంతో నరసన్నపేట ఆస్పత్రికి తరలించగా, అప్పటికే తేజ మృతి చెందింది. మృతురాలి భర్త ప్రకాశ్ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అతనికి ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో మెహందీ పెట్టేందుకు తేజ వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
దాచేస్తే దాగని నిజం.. మూలపేట పోర్టు ఘనత వైఎస్ జగన్దే
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రంలో వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ముఖ్యమంత్రిగా తన పాలన ప్రారంభమైన నాటినుంచే శ్రీకారం చుట్టారు. సంతబొమ్మాళి మండలం మూలపేట సముద్రతీర ప్రాంతంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణం తలపెట్టారు. అంతకుముందు ప్రతి ఎన్నికలోనూ పోర్టు అంశాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో సుమారు రూ.4,361.91 కోట్లతో మూలపేట తీరంలో గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేశారు. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు వ్యయం చేశారు. వీటితో పాటు టెక్కలి జాతీయ రహదారి నుంచి మూలపేట వరకు రైతుల అంగీకారంతో 327.75 ఎకరాలను సేకరించి రోడ్డు పనులు ప్రారంభించారు. రైల్వే మార్గానికి అవసరమైన 100.71 ఎకరాలను కూడా సేకరించారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీతో పాటు అన్ని రకాల అనుమతులతో పోర్టు నిర్మాణం ప్రారంభించారు. రెండుదశల్లో నిర్మించాలని తలపెట్టిన ఈ పోర్టు పనుల్లో ఏడాదిలోనే.. ఎన్నికల సమయానికే 70 శాతం పనులు పూర్తిచేశారు. అనంతరంవచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా మిగిలిన 30 శాతం పోర్టు పనులను కూడా పూర్తిచేయలేకపోయింది. పనులు నిలిపేయడం కమీషన్ల కోసమేనన్న ఆరోపణలున్నాయి. అయినా పోర్టు క్రెడిట్ చోరీ చేసేందుకు టీడీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోర్టుకు అవసరమైన భూములను వైఎస్సార్సీపీ హయాంలోనే సేకరించినా మళ్లీ భూములు కావాలంటూ కూటమి నేతల డైరెక్షన్లో అధికారులు చెబుతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నేడు ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ మూలపేట పోర్టు ఘనతను చోరీచేయడానికి టీడీపీ నేతలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించడానికి వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సోమవారం ‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడురోడ్ల జంక్షన్ వద్ద భారీ బహిరంగసభ నిర్వహించేందుకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సీనియర్ నాయకులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
వైఎస్సార్సీపీ మూలపేట పోర్టు పర్యటనకు పోలీసుల అడ్డంకులు
సాక్షి, శ్రీకాకుళం: ‘‘మన మూలపేట పోర్టుకు పోదాం పదండి’’ కార్యక్రమంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారు. రేపు(మార్చి 30 సోమవారం) చలో మూలపేట పోర్టు కార్యక్రమానికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. కార్యక్రమానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.మూలపేట పోర్టుకు వైఎస్సార్సీపీ నేతలు వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. నౌపాడ జంక్షన్ వద్ద సభ జరుపుకునేందుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. షరతులు లేకుండా అనుమతులు ఇవ్వాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. న్యాయబద్ధమైన కార్యక్రమాన్ని కూటమి సర్కార్ అడ్డుకుంటోంది. అనుమతులు లేవంటూ వైఎస్సార్సీపీ నేతలకు ఫోన్ల ద్వారా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చెత్త శుభ్రం చేసిన కలెక్టర్
ఆమదాలవలస: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనదే అని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని అక్కులపేట, దూసి, తొగరాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. పీహెచ్సీలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బయోమెడికల్కు సంబంధించిన వ్యర్థాలను వేరు చేసి డస్ట్బిన్లో వేయాలని సూచించారు. తొగరాం స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో కలిసి పరిసర ప్రాంతంలో పిచ్చి మొక్కలు, చెత్త తొలగించారు. -
భారీగా గంజాయి స్వాధీనం
నరసన్నపేట: ఒడిశా నుంచి తమిళనాడులోని తిరువూర్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్న అజిత్కుమార్, గోకుల్ శక్తివేల్లను నరసన్నపేట పోలీసు లు శనివారం అరెస్టు చేశారు. మడపాం టోల్గేట్ వ ద్ద నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఒక వాహనంలో వెళ్తున్న అజిత్కుమార్ పట్టుబడినట్లు సీఐ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈయన వద్ద 12.550 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా సత్యమంగళంకు చెందిన అజిత్కుమార్ ఒక ప్రైవేటు కంపెనీ లో పనిచేస్తుండగా అదే కంపెనీలో పనిచేసే పద్మచరణ్ దిగల్ బత్తుతో పరిచయం ఏర్పడింది. ఈయన సహకారంతో అజిత్కుమార్ భువనేశ్వర్లో తక్కువ ధరకు గంజాయి కొని తమిళనాడులోని తిరువూర్ ప్రాంతంలో అధిక ధరలకు విక్రయాలు చేయడం ప్రారంభించాడు. మంచి ఆదాయం వస్తుండటంతో ఈ నెల 21న తిరువూర్ నుంచి బయల్దేరి పద్మచరణ్ సూచించిన వ్యక్తి వద్దకు వెళ్లి తన స్నేహితుడు గోకుల్ శక్తివేల్తో కలసి గంజాయి కొనుగోలు చేసి తిరిగి తిరువూర్ వెళ్తుండగా మడపాం వద్ద శనివా రం పట్టుపడినట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 కిలోల గంజాయితో ఇద్దరు అరెస్ట్ ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి తమిళనాడుకు 3.060 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నం నాయుడు తెలిపారు. పోలీస్ సర్కిల్ కార్యాలయంలో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడులోని కాంచీపురం జిల్లా వలజబాద్కి చెందిన నాగరాజుమురుగన్, రాజీలు గంజాయితో పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి గంజాయి, ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు.వీరిని విచారించగా ఒడిశా సమంతపూర్ చంచలకులో గ్రామానికి చెంది న బరుజోదోళాయి వద్ద నుంచి గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడుకి తీసుకెళ్తుండగా పోలీసుల కు పట్టుబడినట్లు సీఐ వెల్లడించారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైమ్ సిబ్బంది ఉన్నారు. రెండు కిలోల గంజాయితో ఇద్దరు అరెస్టు ఆమదాలవలస: బీఆర్ నగర్ సమీపంలో రెండు కేజీల గంజాయితో పట్టుబడిన ఆమదాలవలస పట్టణానికి చెందిన సయ్యద్ తాహిర్, మన్యాల నరేష్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సనపల బాలరాజు తెలిపారు. గంజాయి సేవిస్తున్న అందిన పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. వీరి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనపరుచుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. -
12వ పీఆర్సీ అమలు చేయాలని వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో 12వ పీఆర్సీని అమలు చేయడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే మూడేళ్లు కావస్తున్నా కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడం వల్ల పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రూ.30 వేల కోట్ల పైబడి బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులలో ఉందని చెబుతున్న కూటమి ప్రభుత్వ పెద్దలు, సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమాంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.వైకుంఠరావు, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కార్యదర్శి బి.రవికుమార్, జి.సురేష్, జిల్లా నాయకులు బి.శ్యాం, వైకుంఠరావు, ఎల్.అర్జున్ తదితరులు పాల్గొన్నారు. మందస : కార్గో ఎయిర్పోర్టు వల్ల విలువైన భూములను కోల్పోయి రోడ్డున పడతామని మందస మండలం రాంపురం పంచాయతీ రాంపురం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రామ సచివాలయం, తహశీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్పోర్టు వల్ల గ్రామంలో 115 మంది రైతులకు చెందిన దాదాపు 200 ఎకరాల భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని, ఉపాధి కోల్పోయి కోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. భూ సేకరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించి న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తమ సేవలందించిన మార్గదర్శకులకు ఈనెల 30న సత్కరించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం వెల్లడించారు. జీరో పోవర్టీ పి–4 కార్యక్రమం ద్వారా మార్గదర్శులు బంగారు కుటుంబాలకు మద్దతు ఇవ్వడం లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం మార్చి 30 నాటికి సంవత్సరం పూర్తిచేసుకుంటోందన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన, అసెంబ్లీ నియోజక వర్గ స్థాయిలో శాసన సభ్యుల అధ్యక్షతన సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
నిజాలు చెప్పేందుకే పోర్టుకు పోదాం
● జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు ● 30న పోర్టుకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ టెక్కలి, సంతబొమ్మాళి: దశాబ్దాల పాలనలో టీడీపీ జిల్లాకు చేయలేని పనులు వైఎస్ జగన్ ఐదేళ్లలో చేసి చూపించారని, జిల్లా అభివృద్ధికి వైఎస్ జగన్ ఇచ్చిన గొప్ప కానుక మూలపేట పోర్టు అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షు డు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన శనివారం నౌపడ మూడు రోడ్లు జంక్షన్లో గల బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.4361కోట్లతో మూలపేట పోర్టు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని, కూటమి అధికారంలోకి వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. పనులు చేయకపోగా.. పోర్టు చంద్రబాబు కృషి ఫలితంగా వచ్చిందంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోర్టు నిర్మాణంపై నిజానిజాలు ప్రజలకు చెప్పేందుకు ఈ నెల 30న పోర్టుకు పోదాం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ... దశాబ్దాలుగా జిల్లాను పాలించిన టీడీపీ ఈ జిల్లా ప్రజలకు ఏం చేశారో ప్రశ్నించాలన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారని, వారు జిల్లాకు ఎన్ని ప్రాజెక్టులు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇతర జిల్లాల తో అభివృద్ధిలో పోటీ పడాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్ మూలపేట పోర్టుకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. దీనిపై టీడీపీ క్రెడిట్ చోరీ చేయడం సిగ్గు చేటన్నారు. పోర్టుకు పోదాం బలప్రదర్శన కాదని, వాస్తవ పరి స్థితులు ప్రజలకు వివరించడానికి అని తెలిపారు. వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరా తిలక్ మాట్లాడుతూ... గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అన్ని రకాల అనుమతులతో పోర్టు పనులు ప్రారంభించి, ఏడాది కాలంలో 70 శాతం పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్ల పాటు కాలయాపన చేశారని దుయ్యబట్టారు. శాంతియుతంగా పరిశీలన కార్యక్రమం చేపడుతున్నామని, అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోర్టు పేరుతో సుమారు 36 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 30న జరగనున్న కార్యక్రమానికి పోలీసులు సహకరించాలని, దీన్ని ఉద్యమంగా మార్చొద్దని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్, వైఎస్సార్ సీపీ ఇచ్ఛాపురం, ఆమదాలవలన నియోజకవర్గ ఇన్చార్జిలు సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, చింతాడ రవికుమార్, టెక్కలి, ఇచ్ఛాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గ పరిశీలకులు చల్లా రవికుమార్, దుంపల లక్ష్మణరావు, ఎన్ని ధనుంజయ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయిసురేష్కుమార్, సీనియర్ నాయకులు అంబటి శ్రీను, సనపల నారాయణరావు, పిన్నింటి సాయికుమార్, మామిడి శ్రీకాంత్, మెంటాడ స్వరూప్, పాలిన శ్రీనివాస్, ఆరంగి మురళి, నర్తు నరేంద్ర, టెక్కలి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు దువ్వాడ వాణి, దుబ్బ వెంకట్రావు, పార్టీ నాలుగు మండలాల అధ్యక్షులు బి.మోహన్రెడ్డి, హెచ్.వెంకటేశ్వర్రావు, ఎస్.హేమసుందర్రాజు, టి.ఫల్గుణరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, కంచిలి ఎంపీపీ పి.దేవదాస్రెడ్డి, ఎస్.సత్యం, జి. గురునాద్ యాదవ్, పి.రాజా, పి.రవికుమార్రెడ్డి, కె.సతీష్, కె.అజయ్, ఉంగ సాయి, శిష్టు గోపి, టి.కిరణ్, ఎన్.భీమారావు తదితరులు పాల్గొన్నారు. -
డీబీసీ టు ఏబీసీ
● కర్నూలులో జరిగిన అక్రమాలపై చర్యలు ● జిల్లాలో అక్రమాలపై ఉన్నతాధికారుల విచారణ ●జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అనురాధకు డిమోషన్శ్రీకాకుళం పాతబస్టాండ్: లంచాలు తీసుకోవడం, కిందిస్థాయి సిబ్బందిని ఇంటి పనికి పెట్టుకోవడం, ప్రతి పనికీ డబ్బు లు అడగడం, అక్రమాలపై రాజకీయ అండతో కప్పిపుచ్చుకోవడం.. ఏళ్లకు ఏళ్ల పాటు సాగిన ఈ తంతుకు ఎట్టకేలకు తెరపడింది. జిల్లా బీసీ సంక్షేమాధికారి అనురాధ అక్రమాలపై ఎట్టకేలకు ఉన్నతాధికారుల విచారణ పూర్తయ్యింది. ఆమె హోదా తగ్గించడమే కాకుండా పీలేరుకు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి(డీసీబీ) అనురాధపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనురాధపై ఇదివరకే లెక్క లేనన్ని ఆరోపణలు ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగులను అవమానపరిచినట్లు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. తనపై వచ్చిన అభియోగాలపై విచారణ జరగకుండా జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఒత్తిడి తెచ్చుకొని తప్పించుకున్న ఆమె.. ఈ సారి మాత్రం తప్పించుకోలేకపోయారు. తాజాగా విజయవాడ బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జునరావు ఈమెకు డిమోషన్ ఇచ్చారు. అంతేకాకుండా బదిలీ చేస్తూ ఈ నెల 25న ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం డీబీసీడబ్ల్యూఓగా ఉన్న ఈమెను ఏబీసీడబ్ల్యూఓ(సహాయ బీసీ సంక్షేమాధికారి)గా హోదాను తగ్గించారు. నాలుగేళ్ల పాటు డీబీసీడబ్ల్యూఓగా పనిచేసిన ఈమెను తిరిగి ఏబీసీడబ్ల్యూఓగా నియమించడం పరాభవంగానే చెప్పాలి. ఆమెను ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పీలేరు ఏబీసీడబ్ల్యూఓగా బదిలీ చేశారు. అనురాధ కర్నూలు జిల్లాలో ఏబీసీగా పనిచేసిన కాలంలో అవినీతి, అక్రమాలు, పర్యవేక్షణ లోపం, లంచాలు ఇతర అంశాలపై ఫిర్యాదులు ఉన్నాయి. వాటిని విచారించాక డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ విచారణ చేసి ఆమెను డీబీసీడబ్ల్యూఓ నుంచి ఏబీసీడబ్ల్యూఓగా వెనక్కి పంపించాలని నిర్ణయించారు. కర్నూలు నుంచి ఆమె తాత్కాలిక పదోన్నతి పద్ధతిలో నాలుగేళ్ల కిందట శ్రీకాకుళం డీబీసీడబ్ల్యూఓగా బదిలీపై వచ్చారు. ఇచ్ఛాపురానికి చెందిన శాసన సభ్యుడి అండదండలు అందడంతో ఈమె అక్రమాలు పెచ్చుమీరాయి. విజయవాడలో జిల్లాకు చెందిన మంత్రి పీఏతో ఆర్థిక లావాదేవీలు జరిపేవారన్న అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే తనపై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ తొక్కి పెట్టి ఉంచడంతో ఇంతవరకు ఆమె ఆటలు సాగాయి. ఎట్టకేలకు కర్నూలు అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో చర్యలకు ఉపక్రమించారు. ఆమె జిల్లాకు డీబీసీడబ్ల్యూఓగా వచ్చి నాలుగేళ్లు అవుతోంది. జిల్లాలోనూ ఆమైపె అనేక ఆరోపణ లు ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది సైతం ఆమైపె పలు రకాల ఫిర్యాదులు చేశారు. రాజకీ య నాయకుల అండతో వాటిని తొక్కిపెట్టి నెట్టుకొచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లోనూ, కింది స్థాయి సిబ్బంది పదోన్నతులలోనూ రూ.లక్షల్లో చేతులు మారాయన్న అభియోగాలు ఉన్నాయి. అలాగే ప్రతి వసతి గృహం నుంచి ప్రతి నెల పిల్లల సంఖ్యను బట్టి నెల వారీ వసూలు చేస్తున్నట్టు, ఇటీవల జరిగి ఏసీబీ దాడుల్లో బయట పడింది. దీనిపై ఇంచా విచారణ సాగుతోంది. ఈ విచారణ పూర్తయితే మరోసారి ఈమైపె శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాకు వచ్చిన తర్వాత బొడ్డేపల్లి రాజగోపాలరావు శత జయంతి ఉత్సవాలకు ప్రభుత్వం ఇచ్చి న నిధులు రూ.లక్షల్లో కాజేశారని అప్పట్లో బీసీ సంఘాల వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. నాలుగేళ్లలో శాఖ ఉద్యోగులు, సిబ్బందికి ఇచ్చిన ప్రమోషన్లు, బదిలీలు, డిప్యూటేషన్ల పేరుతో అవినీతి, అక్రమంగా శాంతి నగర్లో రూ. కోటి విలువైన ఆస్తులు సంపాదించినట్టు ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే బీసీ సంక్షేమ శాఖ కింది స్థాయి సిబ్బందిని తన ఇంటి వద్ద పనులకు వినియోగించుకుంటారనే అపవాదు కూడా ఉంది. జిల్లాలో జరిగిని అవినీతిపై విచారణ పూర్తయితే ఈమైపె మరిన్ని చర్యలు ఉంటాయని తెలుస్తోంది. -
శ్రీకాకుళం బాలిక కేసులో ట్విస్టులు.. నిందితుడి కూతురే డాక్టర్..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య కేసు సంచలన మలుపులు తీసుకుంటోంది. ఈ కేసులో ఒక్కొక్కటిగా వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడి అరెస్ట్పై పోలీసులు ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలిని బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అయితే, నిందితుడు సివిల్ ఇంజినీర్ వెంకటరమణకు భారీగా డబ్బు, రాజకీయ పలుకుబడి ఉందని బాధితులు చెబుతున్నారు. దీని ప్రభావంతో కేసు మలుపు తిరుగుతుందేమోనని భయం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలి విషయంలో కూడా జీజీహెచ్లో నిందితుడి కూతురు వైద్యురాలి ఉండటంతో పోస్టుమార్టం రిపోర్ట్ మార్పిడి ప్రయత్నాలపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్బంగా బాధితురాలి పేరెంట్స్ మాట్లాడుతూ..‘నా కూతురికి న్యాయం చేయాలి. న్యాయం జరగకపోతే భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. నిందితుడికి ఉరి శిక్ష లేదా ఎన్కౌంటర్ చేయాలి’ అని డిమాండ్ చేశారు.జరిగింది ఇది.. శ్రీకాకుళం జిల్లాలో హిరమండలంలో ఓ గ్రామానికి చెందిన దంపతుల ఏకైక కుమార్తె(17) విజయనగరం జిల్లా శృంగవరపుకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చింది. స్థానికంగా సివిల్ ఇంజినీరుగా పని చేస్తున్న వెంకటరమణ.. ‘అమ్మాయికి పాఠాలు చెబుతాను.. నా వద్దకు పంపండి’ అని తల్లిదండ్రులను ఒప్పించాడు. కుమార్తె భవిష్యత్తు బాగుండాలని ఆశించిన వారు నమ్మకంతో అందుకు అంగీకరించారు. ఈ నెల 22న బాలికను శ్రీకాకుళం తీసుకురావాలని వెంకటరమణ సూచించడంతో తండ్రి స్వయంగా తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక తాను శ్రీకూర్మంలో ఉన్నానని.. ఇక్కడికి రావాలని వెంకటరమణ ఫోన్లో చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శ్రీకూర్మం వెళ్లారు. బాలికను అక్కడే ఉంచిన వెంకటరమణ.. తండ్రిని వెనక్కి పంపేశాడు.అనంతరం, ఈ నెల 23న బాలికను విశాఖలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి పైశాచికంగా దాడి చేశాడు. ‘మీ కుమార్తె అనారోగ్యానికి గురైంది’ అంటూ 24న తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. వారికి బాలికను అప్పగించడంతో స్వస్థలానికి తీసుకెళ్లారు. అప్పటికీ ఆమె కొనఊపిరితో ఉన్నప్పటికీ... ‘మీ కుమార్తె చనిపోయింది. అందుకు నేనే కారణం. ఈ విషయం బయటకు చెప్పకుండా దహన సంస్కారాలు నిర్వహించండి. మీకు డబ్బు ఇస్తాను’ అని తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. కొనఊపిరితో ఉన్న కుమార్తెను వారు శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలు వద్ద ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాలిక మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజనాసుపత్రికి బుధవారం తీసుకొచ్చారు. ‘చదువు చెబుతానంటే నమ్మి పంపించాం. మా బిడ్డను చంపేశాడు. నిందితుడిని కఠినంగా శిక్షించండి. న్యాయం చేయండి’ అని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. -
శ్రీకాకుళం
● సీతారామం శనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026శ్రీకాకుళం నగరంలోని కోదండరామాలయంలో కల్యాణశోభవరుడు.. రఘుకుల తిలకుడు.. వధువు.. భూమాత కూతురు. వేద మంత్రాల మధ్య వేదికలు అయోధ్యలా మారాయి. పెళ్లి సందడితో ఆలయాలు వివాహ మండపాలుగా కనిపించాయి. జానకి రాముల పరిణయ ఘట్టాన్ని తిలకించే భాగ్యం పొందిన భక్తులు తన్మయత్వంలో మునిగారు. శ్రీరామనవమి సందర్భంగా ఊరూరా రామాలయాల్లో సీతారాముల పెళ్లి జరుపుకున్నారు. వడపప్పు, పానకం పంచి పెట్టి సంబరం చేశారు. -
భూవివాదంలో నలుగురికి గాయాలు
రణస్థలం : లావేరు మండలం కొత్తకోట పంచాయతీ బట్టుపాలెం గ్రామంలో శుక్రవారం మధ్యాహం భూమి విషయమై రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ శివంగం నాగరాజు, అతని కుమారుడు చైతన్య, తల్లి బుల్లెమ్మ, సోదరుడు కుమారుడు సాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ కుటుంబాన్ని అంతమొందించడానికే కొందరు నెల్లిమర్ల నుంచి వచ్చారని నాగరాజు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. రిమ్స్ నుంచి వచ్చిన వాంగ్మూలం ప్రకారం ఇరువర్గీయులపై కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్సై కె.అప్పలసూరి తెలిపారు. -
కార్పొరేట్ స్థాయి వైద్యమే లక్ష్యం
కొత్తూరు: కార్పోరేట్ ఆస్పత్రులు అందిస్తున్న సేవలు కంటే దీటుగా.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందివ్వాలన్నదే రెడ్డీస్ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సత్తి అన్నారు. మండలంలోని మూరుమూలలో ఉన్న కురిగాం పీహెచ్సీని రెడ్డీస్ ఫౌండేషన్ నిధులతో ఆధునీకరించారు. పీహెచ్సీని డైరెక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. పీహెచ్సీ వైద్యాధికారి పెద్దిన ప్రసన్న కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడారు. అధునాతన యంత్రాలను సమకూర్చామన్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆస్పత్రిలో ల్యాబ్, ఫార్మసీ, పలు వార్డులు, ల్యాబరేటరీని ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇంతవరకు 24 పీహెచ్సీలను ఆధునీకరించామన్నారు. ఈఓ బుజ్జిబాబు, ఫౌండేషన్ సిబ్బంది సురేష్, నవీన్, పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు. -
సిరి కల్యాణపు బొట్టును పెట్టి..!
కల్యాణం వీక్షిస్తున్న భక్తులు శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారాముల పరిణయ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి ఈ మహోన్నత ఘట్టాన్ని వీక్షించి పులకించిపోయారు. అంతకుముందు రామాలయాలు, రామమందిరాల వద్ద వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధనలు, కోలాట భజనలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో జరిగిన కల్యాణోత్సవాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. – శ్రీకాకుళం కల్చరల్/వజ్రపుకొత్తూరు రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
రెవెన్యూ క్రీడా పోటీలు ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026ను శుక్రవారం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్లతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. కోడి రామమూర్తి స్టేడియంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ క్రీడల కలెక్టరేట్ యూనిట్, శ్రీకాకుళం డివిజన్ యూనిట్, టెక్కలి డివిజన్ యూనిట్, పలాస డివిజన్ యూనిట్ సభ్యులు పాల్గొంటున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ డి.పృథ్వీరాజ్కుమార్, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఆర్డీఓలు కె.సాయి ప్రత్యూష, ఎం.కష్ణమూర్తి, ఆర్.అప్పలరాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యనారాయణ, సివిల్ సప్లయ్ డీఎం టి.వేణుగోపాల్, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఎం.లావణ్య, ఏపీఆర్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ పి.శ్రీనివాసరావు, జిల్లా సెక్రటరీ వి.వి.ఎన్.రాజు, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీరాములు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ ఐ.లింగ రాజు, ట్రెజరర్ మురళీధర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారుల సమస్యలపై సైకిల్యాత్ర
మందస : మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి నివేదించేందుకు ఇచ్ఛాపురం మండలం డొంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు 700 కిలోమీటర్లు మేర సైకిల్యాత్ర చేపడుతున్నట్లు కవిటి మండలం కపాసుకుద్ధి గ్రామానికి చెందిన గుడార ప్రసాద్ తెలిపారు. డొంకూరులో ఈ నెల 13న ప్రారంభమైన యాత్ర శుక్రవారం గెడ్డవూరు గ్రామ తీరానికి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 55 కిలోమీటర్ల యాత్ర పూర్తి చేశానని, తీరప్రాంత గ్రామాల్లో మత్స్యకారుల సమస్యలను తెలుసుకుంటున్నానని చెప్పారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు ప్రసాద్ను అభినందించారు. -
మాజీ స్పీకర్ తమ్మినేనికి పరామర్శ
ఆమదాలవలస: మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం చేతికి ఇటీవల శస్త్ర చికిత్స జరిగింది. ఆమదాలవలసలోని తమ్మినేని స్వగృహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శుక్రవారం వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. పార్టీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. పరామర్శించిన వారిలో పార్టీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, పార్టీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ ఆరంగి మురళి, పార్టీ నాయకుడు పొందర అప్పన్న, తదితరులు ఉన్నారు. -
వణికించిన వడగళ్లు
● రబీ వరి పంటపై తీవ్ర ప్రభావం ● పలుచోట్ల నేలవాలిన పైరు ● రాలిన మామిడిపిందెలు సారవకోట/మెళియాపుట్టి: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రబీ వరి పంటతో పాటు మామిడి, మిరప సాగులపై అకాల వాన తీవ్ర ప్రభావం చూపుతోంది. సారవకోట మండలంలోని పొప్పంగి సమీపంలో రంగసాగరం ఆయకట్టును నమ్ముకుని ఈ ఏడాది రబీలో స్థానిక రైతులు వరి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పంట దిగుబడి బాగా తగ్గింది. గత ఏడాది కరాకు సుమారు 35 నుంచి 40 బస్తాలు రాగా, ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా కనిపిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరా వరి పంటకు సుమారు 8 నుంచి 10 బస్తాల వరకు పొల్లు గింజలు వచ్చాయని సారవకోట, గొర్రిబంద గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగసాగరం ఆయకట్టు ప్రాంతంలోని జగన్నాథపురం, జగ్గయ్యపేట, బురుజువాడ, రైవాడ, కొత్తూరు, అగదల, సవరపేట, సారవకోట, గోపాలపురం, వండానవలస తదితర గ్రామాలలో ఈ ఏడాది సుమారు 2000 ఎకరాలలో వరి సాగు చేశారు. ఈ తరుణంలో గురువారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానతో కోత దశకు వచ్చిన పంట చాలా వరకు నేల రాలిపోయిందని రైతులు వాపోతున్నారు. ఎన్నడూ లేని విధంగా వడగళ్లు పడటంతో పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. ఇప్పటికే పొల్లు గింజల వల్ల దిగుబడి తగ్గిపోగా తాజాగా వడగళ్ల వానతో పంట నేల రాలి పోయిందని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు 82 కేజీల ధాన్యాన్ని రూ.1200కే దళారులు కొనుగోలు చేసి ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. మెళియాపుట్టి మండలం జోడూరు గ్రామానికి చెందిన కమిరి సోమేశ్వరరావు, బి.ధర్మారావులకు చెందిన మిరప, నువ్వు, మామిడి పంట అంతా రాలిపోయింది. అధికారులు పరిశీలించి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేలవాలింది.. గురువారం కురిసిన వడగళ్ల వానతో వరి పంట చాలా వరకు నేలవాలింది. ఇంత వరకు ఎన్నడూ చూడని విధంగా వడగళ్లు పడ్డాయి. ఈ ఏడాది పొల్లు గింజలు అధికంగా రావడంతో దిగుబడి బాగా తగ్గింది. – చెంచల చంద్రరావు, రైతు, గొర్రిబంద, సారవకోట మండలం -
రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు రేపు
టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రగ్బీ జిల్లా జట్లు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు డొంకాన రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజర్ బి.నారాయణరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మెన్ అండ్ ఉమెన్ కేటగిరిలో నిర్వహిస్తున్న ఎంపికల్లో భాగంగా ఉదయం 9 గంటల నుంచి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు 8500007272, 7842423423 నంబర్లకు సంప్రందించాలని కోరారు. 108లో గిరిజన గర్భిణి ప్రసవం కొత్తూరు: చిన్నరాజపురం గ్రామానికి చెందిన 26 ఏళ్ల గిరిజన మహిళ సవర జ్యోతి నిండు గర్భిణి. శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కొత్తూరు 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. వెంటనే సిబ్బంది చేరుకొని గర్భిణిని హిరమండలం పీహెచ్సీకి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో హిరమండలం పీహెచ్సీలో చేర్చించినట్లు ఈఎంటీ ఎం.కృష్ణ, పైలట్ గోవిందరావు తెలిపారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని గొంటివీధి సమీపంలో ఓ ప్లై వుడ్ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో శుక్రవారం వేకువఝామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రూ.6 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దపాడురోడ్డులోని కిల్లిపాలెం యూనియన్ బ్యాంకు సమీపంలో అద్దె ఇంట్లో 62ఏళ్ల వృద్ధుడు దుర్గ విజయ్కుమార్ తన భార్య, ఇద్దరు కుమార్తెలతో నివాసముంటున్నాడు. గొంటివీధిలో అద్దెషాపులో ప్లై వుడ్, ఫర్నిచర్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం వేకువజామున 2.05 గంటలకు షాపులో అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం అందడంతో సిబ్బందిని పంపించి మంటలను అదుపు చేశామని ఏడీఎఫ్వో శ్రీనుబాబు తెలిపారు. ఇన్వాల్వ్డ్ మెటీరియల్, డ్రెస్సింగ్ టేబుల్ మెటీరియల్, గ్లాస్, కంప్యూటర్, ప్రింటర్, రివాల్వింగ్ కుర్చీలు, ఫర్నిచర్ మెటీరియల్ కాలి బూడిదయ్యాయని చెప్పారు. బ్యాంకు రుణాలతో గొంటివీధి, న్యూకాలనీలో అద్దె షాపులు నడుపుతున్నానని, ఎటువంటి ఆస్తిపాస్తులు లేవని, కుమార్తెలకు వివాహం చేయాల్సిన సమయంలో ఈ కష్టమొచ్చిందని బాధితుడు వాపోయాడు. హోటళ్లలో విజిలెన్స్ దాడులు పొందూరు: మండలంలోని పలు హోటళ్లలో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులుగా ఏడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. పలువురిపై 6ఏ కేసులను నమోదు చేసినట్లు విజిలెన్స్ ఎస్ఐ రామారావు తెలిపారు. తనిఖీల్లో ఇన్చార్జి ఆర్ఐ జగదీష్, వీఆర్వో రేవతిరావు, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి నరసన్నపేట: మండల పరిధిలోని కామేశ్వరిపేట, దాసరివానిపేట వద్ద రైల్వేలైన్పై శుక్రవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఆమదాలవలస రైల్వే హెచ్సీ మధుసూదనరావు తెలిపిన వివరాలు మేరకు.. కామేశ్వరిపేట వద్ద వంశధార వంతెనపై ట్రాక్ వద్ద వెల్డింగ్ పనులు చేస్తున్న తిలారుకు చెందిన కోట అప్పారావు(29) ప్రమాదవశాత్తూ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. అలాగే దాసరివానిపేట వద్ద జరిగిన మరో ప్రమాదంలో గుర్తు తెలియని రైలు ఢీకొని గంజాం జిల్లా కాలీకట్ ప్రాంతానికి చెందిన ఎస్.బి.పాణిగ్రహి(35) మృతి చెందాడు. ఈ రెండు ప్రమాదాలపై కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాకుళం రిమ్స్కు తరలించామని హెచ్సీ తెలిపారు. -
ప్రభుత్వ విప్ అశోక్ బహిరంగ క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ఆదివాసీల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదివాసీ జేఏసీ ముఖ్య సలహాదారుడు వాబ యోగి, జేఏసీ జిల్లా అధ్యక్షుడు సవర రాంబాబు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని క్రాంతి భవనంలో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఆదివాసీలు ఎవరనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలన్నారు. జిల్లాలో బెంతు ఒరియా తెగ లేదని అనేక కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు తెలియజేశాయని గుర్తు చేశారు. గతంలో నకిలీ బెంతు ఒరియా ఎస్టీ సర్టిఫికెట్లను కలెక్టర్ రద్దు చేశారని చెప్పారు. ఎమ్మెల్యే అశోక్ ఇవేవీ తెలుసుకోకుండా ఆదివాసీ నాయకులను పరుషపదాలతో దూషించడం సరికాదన్నారు. ఆదివాసి సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న నకిలీ బెంతు ఒరియాలు 27 వేలమంది గురించి పదేళ్లుగా ఫైల్ పట్టుకుని తిరుగుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, మీ నియోజకవర్గంలో మా ఆదివాసీ ప్రజలు కూడా ఉన్నారని గుర్తు చేశారు. వారి సమస్యలపై స్పందించరెందుకని ప్రశ్నించారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే అశోక్ వైఖరి సరికాదన్నారు. జిల్లాలో రెండు లక్షల ఆదివాసి జనాభా మనోభావాలు దెబ్బతీసిన మీకు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సమావేశంలో సవర జగన్నాయకులు, ఆలిండియా ఫెడరేషన్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సవర భాస్కరావు, సవర కుమార్, జిల్లా అధ్యక్షుడు సవర చుక్కారావు, గిరిజన చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు సవర సోమేశ్రావు, జన్ని కాంతారావు, బండపల్లి రాకేష్, సవర రామారావు, జన్ని వాసు చంద్రశేఖర్, అప్పన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే అశోక్ గిరిజనులకు క్షమాపణ చెప్పాలి కొత్తూరు : ఆదివాసీ గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ క్షమాపణ చెప్పాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నిమ్మక అప్పన్న డిమాండ్ చేశారు. కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామంలో ఆదివాసీ గిరిజనులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అశోక్ క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు సమస్యలు వివరించేందుకు వెళ్లిన ఆదివాసీలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. బెంతు ఒరియాలను గిరిజన జాబితాల్లో చేర్పించాలని గిరిజన నేతలకు చెప్పడం భావ్యం కాదన్నారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు ఆరిక శివ, నిమ్మక గణపతి, నిమ్మ రత్నాలు పాల్గొన్నారు. క్షమాపణలు చెప్పకపోతే ఉద్యమమే మందస : ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్యమం తప్పదని గిరిజన ఐక్య వేదిక మందస మండల అధ్యక్షుడు ఎస్.బిట్టుబాబు(నీలకంఠం) స్పష్టం చేశారు. శుక్రవారం పద్మపురం గ్రామంలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులను అవమానించేలా ఎమ్మెల్యే అశోక్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ గిరిజనుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే గిరిజన సమాజం ఐక్యంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు ఎం.చూడామణి, ఎం.దాడు, ఎస్.డొంబురు, ఎస్.మోహనరావు, పి.నీలకంఠం పాల్గొన్నారు. -
దారిపై రక్తపు చారలు
ఎచ్చెర్ల: జాతీయ రహదారి మళ్లీ రక్తం పూసుకుంది. వరుస పెట్టి జరుగుతున్న ఘటనలతో రోడ్డు మళ్లీ మరణ సంకేతాలను పంపించింది. గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకులు కన్నుమూశారు. దైవ దర్శనం కోసం వచ్చి తిరిగి వెళ్తుండగా ఇలా మృత్యు కౌగిలిలో చిక్కుకున్నారు. అరిణాం అక్కివలస గ్రామం సమీపంలో బైక్ లారీని ఢీకొన్న ఘటనలో విశాఖపట్నం సెంగలరావుపేటకు చెంది న తల్లీ కొడుకులు నాగమణి(55), సీహెచ్ నరేంద్రకుమార్(32) మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సెంగలరావుపేటకు చెందిన తల్లీకొడుకులు అరసవల్లి సూర్యనారాయణ మూర్తి దర్శనం కోసం బైక్పై వచ్చారు. స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా అరిణాం అక్కివలస వద్ద ఆగి ఉన్న లారీని వీరి బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నరేంద్రతో పాటు వెనుక కూర్చున్ని తల్లి కిందకు పడిపోగా.. ఇద్దరూ ఘటనా స్థలంలోనూ ప్రాణాలు వదిలేశా రు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నరేంద్రకుమార్కు వివాహమై ఓ పాప ఉంది. -
వడగళ్లు.. రైతుకు కడగండ్లు
సారవకోట: మండలంలో గురువారం కురిసిన వడగళ్ల వానతో రైతులు తీవ్ర అవస్థలు పడ్డారు. గత మూడు రోజుల నుంచి రబీలో వరి కోతలు చేపట్టి ధాన్యం జాతీయ రహదారి 326ఎపై ధాన్యం ఆరబెడుతున్నారు. అయితే వర్షం కురవడంతో రైతులు వాటిని చక్కబెట్టుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే రైస్ మిల్లుల ఆవరణలో ఉన్న ధాన్యం బస్తాల పై టార్పాలిన్లు కప్పి ధాన్యం బస్తాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. సుమారు అరగంటకు పైగా వడగళ్లతో కూడిన వర్షం కురవడంతో కొన్ని దగ్గర ధాన్యం తడిసి పోయాయి. హిరమండలం: హిరమండలం, ఎల్ఎన్పేట మండలాల్లో గురువారం వడగళ్ల వాన ముంచెత్తింది. మధ్యాహ్నం వరకూ ఎండ ఉండగా ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఈదురు గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డుపై వడగళ్లు పడడంతో అందరూ ఆశ్చర్యపడ్డారు. జీడి మామిడి పూత దశలో నష్టం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. దీంతో ప్రయాణికులు, ప్రజలు కాసేపు బెంబేలెత్తిపోయారు. రైతులకు తీవ్ర నష్టం బూర్జ: మండలంలో గురువారం సాయంత్రం పడిన వడగళ్ల వర్షంతో పండ్ల తోటలకు తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. ఇటీవల తేనె మంచు ప్రభావంతో జీడిమామిడితోట లు పూర్తిగా పువ్వు, పింజ దశల్లో మాడిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పడిన ఆకాల వర్షంతో మామిడి, జీడి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. -
శ్రీముఖలింగేశ్వరుని హుండీ ఆదాయం రూ.1.91 లక్షలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగేశ్వ రుని హుండీ ఆదాయం రూ. 1,91,175గా వచ్చినట్లు ఆలయ ఈఓ కె.ఏడుకొండలు గురువారం తెలిపారు. ఆలయ అధికారులు, సత్యసాయి సేవాసమితి సభ్యులు, అర్చకుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగిందన్నారు. కార్య క్రమంలో రావివలస ఎండల మల్లికార్జునస్వా మి, దేవాలయ ఆలయ ఈఓ జి.గురునాథరా వు, పాలక మండలి చైర్మన్ శివప్రసాద్ పాడి భక్తులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మూలపేట పోర్టుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయని, ఇప్పుడు కొత్తగా ఒక్క సెంటు భూమిని కూడా అదనంగా సేకరించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశా రు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారిశ్రామికీకరణ కోసం పారిశ్రామిక వేత్తలు స్వయంగా భూములు కొనాలని, రైతులే వారి భూములను వారికి నచ్చిన ధర చెప్పి విక్రయించుకోవాలని ఆయన పేర్కొన్నారు. పోర్టు కోసం భూములు ఇచ్చిన మూలపేట, విష్ణుచక్రం గ్రామాల నిర్వాసితులకు వైఎస్ జగన్ ప్రభుత్వం అప్ప ట్లో మంజూరు చేసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికీకరణ కోసం అనవసర భూ సేకరణ చేసి, పారిశ్రామిక వేత్తలతో లాలూచీ పడి రైతులకు అన్యాయం చేయాలని చూస్తే ఉద్యమం చేయకతప్పదని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు అన్ అయిడెడ్ ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు. వీరికి లాటరీ ద్వారా సీట్లు కేటాయించనున్నట్లు ఎస్ఎస్ఏ ఏపీసీ పి.వేణుగోపాలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చని, ఇతర విషయాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారి సంప్రదించవచ్చునన్నారు. సంబంధిత పాఠశాలలు వెబ్సైట్లో చూడవచ్చునని, ఎంపికై న విద్యార్థులు ఏప్రిల్ 7వ తేదీలోగా ఎంపికై న పాఠశాలల్లో జాయిన్ అవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 1800425 8599 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
నేటి నుంచి రెవెన్యూ ఉద్యోగుల క్రీడా పోటీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఏపీఆర్ఎస్ఏ అధ్యక్షుడు కె.శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు.ఈ నెల 27, 28, 29 తేదీల్లో ‘శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కతిక కార్యక్రమాలు’ పేరిట జరిగే పోటీల్లో ఆఫీస్ సబోర్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ సహాయ సహకారాలతో కార్యకర్మం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించేందుకు, ఉద్యోగుల్లో ఐక్యత పెంపొందించేందుకు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరారు. నరసన్నపేట : మడపాం పంచాయతీ కొత్తపేటకు చెందిన పిన్నింటి రమణ (50) పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికి త్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. వారం క్రితం పొలానికి వెళ్లిన ప్పుడు పాము కరవగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పొందూరు : కనిమెట్ట ఎస్సీ కాలనీకి చెందిన కె.శ్రావణ్కుమార్(32) గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణ్కుమార్ భార్య కొంతకాలం క్రితం రైలు ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. దీనికి తోడు తండ్రి పక్షవాతానికి గురికావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వీటిని తట్టుకోలేని శ్రావణ్కుమార్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజారావు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. గురువా రం బార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అత్యధికంగా 127 ఓట్ల ఆధిక్యంతో విజయ సాధించారు. ఈయన గతంలో మూడుసార్లు అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఎట్టకేలకు విజయం వరించింది. జిల్లా బార్ అసోసియేషన్లో 773 ఓట్లు ఉండగా 649 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన కూన రాజారావుకు 387 ఓట్లు, మామిడి క్రాంతికి 260 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా డి.సరళకుమారి 15 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. మిగిలిన పదవులు ఏకగ్రీవమయ్యాయి. జనరల్ సెక్రటరీగా చిట్టి సూర్యనారాయణ, జాయింట్ సెక్రటరీగా డొంకాన ఈశ్వరరావు, కోశాధికారిగా సిరిపురపు సుజా త, మహిళా ప్రతినిధిగా గురువుబెల్లి సత్యభామ, లై బ్రరీ సెక్రటరీగా కె.శంకరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చ రల్ సెక్రటరీగా జి.ఇందిరా ప్రసాద్ ఎంపికయ్యా రు. ఎన్నికల ప్రధాన అధికారిగా కంచరాన నాగభూషణరావు, ఎన్నికల సహాయకులుగా నౌపడ విజయ్కుమార్, ఎన్.వి.కె.సుబ్రహ్మణ్యం, పి.జయరావు, జె.శ్రీనివాసరావు, ఎం.వి.శ్రీనివాసరావు, ఎ.అప్పలరాజు వ్యవహరించారు. -
శ్రీకాకుళం
శుక్రవారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2026పోర్టుకు సిద్ధం1సంతబొమ్మాళి: నౌపడలో సభా స్థలాన్ని పరిశీలిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పేరాడ తిలక్ తదితరులు ‘మూలపేట పోర్టుకు పోదాం పదండి’ పేరిట పోరాటానికి వైఎస్సార్సీపీ సన్నద్ధమవుతోంది. సమర సన్నద్ధత కార్యక్రమాలు గురువారం జిల్లా వ్యాప్తంగా జరిగాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్తో కలిసి నౌపడలో సభా స్థలాన్ని పరిశీలించారు. కంచిలి మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, పరిశీలకుడు దుంపల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’
కంచిలి/కవిటి: గిరిజనులపై శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంతొరియా కులానికి ఎస్టీ సర్టిఫికెట్ అంశంపై ఎమ్మెల్యే అశోక్ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించడం, అందుకు సంబంధించి తీసుకుంటున్న చొరవపై నిజమైన ఎస్టీ కులాలకు నష్టం జరుగుతోందని ఇటీవల గిరిజన సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. స్పందించకపోతే ఎమ్మెల్యే అశోక్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అశోక్తో గిరిజన సంఘ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ వర్గం(గిరిజనులు) 5గురు, బెంతొరియా కులం నుంచి 5గురితో కలిసి కలెక్టర్ ఆధ్వర్యంలో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఈ సమయంలో కంచిలి మండలానికి చెందిన భగవాన్ దొళాయి అనే గిరిజన యువకుడు ఎమ్మెల్యే అశోక్ను ఉద్దేశించి.. ‘‘మీరు అసెంబ్లీలో మాట్లాడక ముందు ఇలా రెండు వర్గాలను కూర్చొబెట్టి చర్చించాలని తెలియదా..! అని అభ్యంతరం వ్యక్తం చేశాడు. వెంటనే ఎమ్మెల్యే అశోక్ ఆ యువకుడి మీద అమాంతం విరుచుకుపడ్డారు. ‘నువ్వెవరు నాకు చెప్పడానికి.. బాస్టర్డ్’ అంటూ ఆవేశంతో విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. గిరిజన నేతలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పినప్పటికీ ఆయన శాంతించ లేదు. అనంతరం వారు ఎమ్మెల్యేకి, స్థానిక తహసీల్దార్ కృష్ణమూర్తికి వినతిపత్రాలు అందించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే తీరుపై గిరిజన సంఘాల అసహనం ఎమ్మెల్యే అశోక్ దగ్గరకు మాట్లాడేందుకు వెళ్లిన గిరిజన సంఘాల నేతలు అడిగిన ప్రశ్నకు తీవ్ర పదజాలంతో స్పందించడంపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన యువకుడు అని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోవడం ఏంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం తగదని గిరిజన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఏపీ రాష్ట్ర ఏఐఏఈఎఫ్ ఉపాధ్యక్షుడు సవర జగన్నాయకులు, పలాస మండలానికి చెందిన ఆదివాసీ సంఘాల జేఏసీ సభ్యులు ఉన్నారు. -
“ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’
శ్రీకాకుళం: గిరిజనులపై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ దూషణలకు దిగారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ను కలిశారు గిరిజన సంఘం నేతలు. అసెంబ్లీలో ఆదివాసీల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యేను కోరారు గిరిజనులు. అయితే వారిపై ఎమ్మెల్యే అశోక్ దూషణలకు దిగారు. “బ్లడీ బాస్టర్డ్… మీరు నన్ను ప్రశ్నించడం ఏంటి?”, బుర్ర ఉండి మాట్లాడుతున్నారా? లేక బుర్ర లేకుండా మాట్లాడుతున్నారా?, “ఆఫ్ నాలెడ్జ్ పీపుల్ నా దగ్గరకు ఎందుకు వచ్చారు?’, నేను ఏం చేయాలో కూడా మీరు చెప్పాలా?, వాడెవడు నాకు చెప్పడానికి?, ఏం చేయాలో నేను చేస్తా’ అంటూ అవమానకర రీతిలో మాట్లాడారు.టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ గిరిజనులపై బూతు పురాణం మాట్లాడిన ఘటనపై స్థానికంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో ఇచ్చాపురం నియోజకవర్గంలో ఆయనపై మరింత అసంతృప్తి పెరిగింది. -
పెళ్లిలో ఎలాంటి మార్పు లేదు.. భోజనాల్లేవంతే!
పార్వతీపురం మన్యం జిల్లా: అమెరికా–ఇరాన్ మధ్య కొద్ది రోజులు గా జరుగుతున్న యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత వల్ల చాలా ప్రాంతాల్లో హోటళ్లు మూతబడుతున్నాయి. హాస్టళ్లలో భోజనానికి ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యులను గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో వివాహం జరిగితే ఇలా ఉంటుందోనని తెలియజేస్తూ ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రిక వెరైటీ ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రస్తుతం జరుగుతన్న యుద్ధం వల్ల వివాహ కార్యక్రమాల్లో ఎటువంటి మార్పు లేదని, కావున బంధు, మిత్రులు అందరూ వివాహ కార్యక్రమానికి సకాలంలో హాజరు కావాలని కోరుతున్నాం. గ్యాస్ సిలిండర్లు కొరత వల్ల కేవలం భోజనం ఏర్పాట్లు మాత్రమే రద్దు చేయబడ్డాయి. మిగిలిన కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. కానుకలు ఇచ్చేవారు నిరభ్యంతరంగా ఇవ్వొచ్చు.. వాటిపై ఎటువంటి ఆంక్షలు లేవు.. మీరంతా కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను దీవించవలసినదిగా కోరుతున్నాము. మీ కోసం మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశాం.. గమనించగలరు ధన్యవాదాలు అంటూ.. ఆహ్వానించగా దానికి బదులుగా బందువులు ఈ విధంగా బదులిచ్చారు.. ఆహ్వానించినందుకు ధన్యవాదాలు... మా కారు గ్యాస్తో నడుస్తుంది.. ప్రస్తుతం గ్యాస్ కొరత వల్ల కారు కదిలేలా లేదు. కాబట్టి మేము పెళ్లికి రాలేకపోతున్నాం.. మీ కార్యక్రమాన్ని యథా విధిగా కానివ్వండి.. వధూవరులకు మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి.. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఆహ్వాన పత్రిక చూసిన వారంతా ట్రెండ్కు తగ్గుట్టుందని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. -
●మూలపేట పోర్టుకు తరలిరండి
పలాసలో మాట్లాడుతున్న డాక్టర్ సీదిరి అప్పలరాజు రణస్థలం: లావేరు మండలం కలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి అఖిల (21) అనే వివాహిత గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. లావేరు పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అఖిలకు భర్త సురేష్కు మధ్య ఇటీవల మనస్ఫర్థలు తలెత్తాయి. భర్త సరిగా మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన అఖిల ఈ నెల 23న రాత్రి 11 గంటల సమయంలో క్షణికావేశంలో గడ్డి మందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. వీరికి 2022లో వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమె స్వగ్రామం రణస్థలం మండలం పాతర్లపల్లి పంచాయతీ సూరంపేట. మృతురాలి తండ్రి యందవ అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 31న ఉదయం 9 గంటల నుంచి జాబ్మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం తెలిపారు. టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, స్కిల్ దునియా, ప్రెస్మీన్ హెచ్ఆర్ సొల్యూషన్స్, నాగార్జున అగ్రికెమ్, కాన్సెంట్రిక్స్ ఫార్మా, పీఎంజే జ్యూయలరీ, జాయ్ అలుక్కాస్, డెక్కన్ కెమికల్, ఐ స్మార్ట్ సొల్యూషన్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని 500పైగా ఉద్యోగాలు కల్పిస్తాయని వివరించారు. టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, బీటెక్, ఎంబీఏ, డిగ్రీ, ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివిన 18 నుంచి 30 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసిటీ నెల్లూరు, హైదరాబాద్లలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు naipunyam.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికా రి ఉరిటి సాయికుమార్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ రిఫరెన్స్ నంబర్, బయోడేటా, ఆధార్, విద్యార్హతల ఒరిజినల్, జెరాక్స్ కాపీలు, పాస్పోర్ట్ సైజు ఫొ టోతో కలిసి ఉదయం 9 గంటలకు జాబ్మేళా ప్రాంగణానికి హాజరుకావాలని, వివరాలకు 95509 67353 నంబర్ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
రోడ్డున పడిన టమాటా
● పెరిగిన దిగుబడి.. తగ్గిన అమ్మకాలు ● చెల్లని టమాటాను సాయంత్రం పూట పారబోస్తున్న వ్యాపారులు శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో పలుచోట్ల టమాటాలను వ్యాపారులు రోడ్డుపైనే పారబోశారు. కొన్ని రోజులుగా టమాటా ధర భారీగా పతనమైంది. హోల్సేల్లో 25 కిలోల ట్రే రూ.80 నుంచి రూ. 100కు విక్రయిస్తున్నారు. రిటైల్ మూడు కేజీలు రూ.20 చొప్పున అమ్ముతున్నారు. రోజురోజుకు దిగుబడి పెరుగుతుండగా, అమ్మకాలు తగ్గుతుండడంతో వ్యాపారులు చెల్లని టమాటాలను సాయంత్రంపూట రోడ్లపై పడేసి వెళుతుండగా వాటిని పశువులు తింటున్నాయి. ఐదు నెలల క్రితం 25 కేజీల టమాటా ట్రే రూ.1600 వరకు ధర పలికింది. ఆ సీజన్లో జిల్లాలో పంట ఉండ దు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా ఇతర ప్రాంతా ల నుంచి దిగుమతి అవుతున్నప్పటికీ జిల్లాలోనే పంట ఉండడంతో ఇవన్నీ అమ్మకాలు కాక రోడ్లపై పడేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
రైలు కిందపడి యువకుడు దుర్మరణం
ఆమదాలవలస: శ్రీకాకు ళం రోడ్ (ఆమదాలవల స) రైల్వేస్టేషన్లో బుధవా రం ఉదయం ఫలక్నుమా రైలు కింద పడి యువకుడు మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. మృతుడి వయసు సుమారు 35 ఏళ్లు ఉంటుందని, మిగ తా ఎటువంటి ఆధారాలు లభించలేదని చెప్పా రు. ఆచూకీ తెలిసిన వారు 9493474582 నంబర్కు సమాచారం అందించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకు ళం రిమ్స్కి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. వజ్రపుకొత్తూరు రూరల్: ప్రపంచ రంగస్థల దినోత్సవం, శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా పల్లిసారధి గ్రామంలో ఈ నెల 26 నుండి 28వ తేదీ వరకు ఉత్తరాంధ్ర ఆహ్వానిత నాటక కళాపరిషత్ పోటీలు నిర్వహించనున్న ట్లు వైఎస్సార్సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్కుమార్, జన జాగృతి అధ్యక్షుడు కుమార్ నాయక్ తెలిపారు. పల్లిసారధిలో బుధవారం వారు మాట్లాడుతూ .. శ్రీరామాలయ కమిటీ, నాటక పరిషత్ కమిటీల ఆధ్వర్యంలో ‘కళ కళ కోసం కాదు–కళ ప్రజా చైతన్య కోసం’ అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. -
గిరిజన బాలిక అనుమానాస్పద మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన 17 ఏళ్ల గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఊరూరా వెళ్లి సర్కస్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట విజయనగరం జిల్లా ఎస్.కోటకు వెళ్లగా అక్కడ వెంకట్రావు అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వెంకట్రావు తరచూ బాలిక ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులను ఒప్పించి బాలికను విజయనగరం జిల్లా ఎస్.కోట ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్లో చేర్పించాడు. ఇటీవల పరీక్షలు పూర్తి కావడంతో బాలిక తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మరుసటి రోజునే వెంకట్రావు ఫోన్ చేసి బాలికను పంపించాలని కోరగా.. అప్పటికే నీరసంగా ఉండడంతో కొద్ది రోజుల తర్వాత పంపిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. వెంకట్రావు ససేమిరా అంటూ ఇంగ్లిష్ నేర్పించేందుకు ప్రైవేట్ పెట్టిస్తానని, ఆదివారం వస్తున్నానని బాలికను అప్పగించాలని చెప్పాడు. ఆ ప్రకారమే వెంకట్రావుకు బాలికను అప్పగించారు. మరుసటి రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇంటి పై నుంచి మీ పాప పడిపోయి మృతి చెందిందని చెప్పాడు. మీరు ఎస్.కోట రావా ల్సిన అవసరం లేదని వంగరాడమెట్ట సమీపంలోకి వస్తే అక్కడే ఖననం చేసేద్దామని చెప్పాడు. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఎస్.కోట బయలుదేరగా మధ్యలోనే వారిని ఆపి అంత్యక్రియలు జరిపించేందుకు ఒప్పించాడు. ఇంతలో బాలికలో కదలికలు కనిపించడంతో తల్లిదండ్రులు హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా రాగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తుండగా బాలిక మృతి చెందింది.బాలిక శరీరంపై పలుచోట్ల గాయాలు ఉన్నాయని, అత్యాచారం తర్వాత హత్య చేసి ఉండవచ్చని అక్కడివారు తల్లిదండ్రులకు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. వెంకట్రావు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ వివేకానంద నేతృత్వంలో విచారణ ప్రారంభించారు. -
23 తులాల బంగారం చోరీ
● రూ.లక్షన్నర నగదు మాయం ● అవలింగి గ్రామంలో ఘటన సారవకోట: అవలింగి గ్రామంలో ముద్దాడ గౌరినాయుడు ఇంట్లో భారీ చోరీ జరిగింది. కప్ బోర్డులో దాచిన 23 తులాల బంగారం, లక్షన్నర నగదు మాయమైంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకా రం.. గౌరినాయుడు తన తల్లి హేమలత, భార్య పావని, ఆరు నెలల పాపతో కలిసి అవలింగిలో సొంతింట్లో నివాసం ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ వారానికి ఒకటి రెండు రోజులు స్వగ్రామానికి వచ్చి పొలం పనులు చూసుకుని వెళ్తుంటాడు. శనివారం సాయంత్రం తల్లి హేమలత ఆమె బంధువుల ఇంటికి వెళ్లగా, గౌరినాయుడు భార్య పావని చంటి బిడ్డతో ఇంట్లోనే ఉంది. ఆదివారం పావని తన బిడ్డను చూస్తుండమని పక్కింట్లో ఉండే ఓ బాలుడికి చెప్పి దుస్తులు ఉతికేందుకు సమీపంలోని కాలువ వద్దకు వెళ్లి వచ్చేసింది. సోమ వారం అత్తయ్య హేమలత క్యాంపు నుంచి తిరిగి వచ్చి అదే రోజు సాయంత్రం బ్యాంకు ఖాతాలో జమైన రూ.4వేలు విత్డ్రా చేసి కప్బోర్డులో పెట్టేందుకు చూడగా, ఆ కప్బోర్డులో ఉండాల్సిన 23 తులాల బంగారు నగలు, ఇంటి పనుల కోసం తెచ్చిన రూ.లక్షన్నర నగదు కనిపించలేదు. దీంతో కుమారుడు గౌరినాయుడుకు సమాచారమివ్వగా ఆయన వచ్చి మంగళవారం సారవకోట పోలీసుల కు సమాచారం అందించారు. క్లూస్టీం ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. -
తొట్టెల్లో నీరుంటే ఒట్టు!
● మూగజీవాలకు దప్పిక తిప్పలు ● అడుగంటుతున్న చెరువులు, వాగులు ● నిరుపయోగంగా నీటి తొట్టెలు ● పట్టించుకోని అధికారులు ఇచ్ఛాపురం రూరల్ : వేసవి కాలం వచ్చిందంటే చాలు పాడి రైతుల్లో ఆందోళన మొదలవుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు చెరువులు, వాగులు, కుంటలు ఎండిపోవడంతో మూగజీవాలకు నీటిని అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పాడి రైతులు, కాపరిలు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 16,80,000కు పైగా పశువులు ఉన్నాయి. గొర్రెలు, మేకలు మేపుకుంటూ 70 వేలకు పైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నెల రోజుల వరకు వరకు బాహుదా, మహేంద్రతనయా నదులతో పాటు చెరువులు, బావుల్లో నీరు ఉండటంతో మూగజీవాల దాహార్తి తీర్చుకునేవి. వేసవికా లం ప్రారంభం కావడంతో భూగర్భ జలాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో తాగేందుకు నీరులేక పశువు లుఅల్లాడిపోతున్నాయి. సంతల్లో విక్రయం.. జిల్లాలో ఒకప్పుడు చాలా ఇళ్ల వద్ద పశువుల శాల, తోటల్లో మేకలు, గొర్రెల మందల శాలలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పశువులకు మేతతో పాటు అవి తాగేందుకు నీరు లేకపోవడంతో పాడి రైతులు వ్యాపారులకు సంతల్లో పశువులను విక్రయిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నిర్మించిన తొట్టెల్లో పశువులు తాగేందుకు అవసరమైన నీటిని నింపేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం–పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో ‘పల్లె పండగ 2025–26 పశువుల నీటి తొట్టె’ పేరిట గత ఏడాది ప్రతీ గ్రామంలో తొట్టెలు నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పనులు చేసేందుకు స్థానిక టీడీపీ కార్యకర్తల్ని పురమాయించి ఒక్కో తొట్టె నిర్మాణానికి రూ.34వేలు చొప్పున అందజేసింది. దీంతో ఒక్కో మండలానికి లక్షల రూపాయలు కేటాయించారు. చాలా ప్రాంతాల్లో పశువులు సంచరించని కొబ్బరి తోటలు, గోర్జిలు, ఆలయాలు వద్ద తొట్టెలు నిర్మించి చేతులు దులుపుకున్నారు. వాటి నిర్వహణను ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారాయి. జిల్లాలో బాహుదానది, మహేంద్ర తనయ, వంశధార, నాగావళి, చంపావతి, సువర్ణముఖి, వేగావతి వంటి తదితర నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వకాలు చేస్తుండటంతో పాటు ఎండల తీవ్రత అధికం కావడంతో నదుల్లో నీరు ఇంకిపోతోంది. చెరువులు, కుంటలు, బోరు బావుల్లో నీరు పాతాళానికి చేరుకుంటోంది. దీంతో పశువుల కాపరులు, రైతులు కొన్నిచోట్ల వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన జింకలు, ఎలుగుబంట్లు సైతం నీటి కోసం గ్రామాల్లోకి వచ్చి వేటగాళ్ల ఉచ్చుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. మూగజీవాలకు వేసవిలో తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రతి మండలంలో పశువులు సంచరించే ప్రదేశాల్లో నీటి తొట్టెల నిర్మాణం జరిగింది. తొట్టెల్లో నీరు లేదంటూ చాలా మంది నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలదే. మరో మారు పంచాయతీలకు ఆదేశాలు జారీ చేసి తొట్టెల్లో నీరు నింపేందుకు చర్యలు తీసుకుంటాం – చల్లా శ్రీనివాసరెడ్డి, ఉపాధి ఏపీడీ మూగజీవుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో చెత్తా చెదారంతో నిండిపోయాయి. అధికారులు పర్యవేక్షించడం మానేశారు. వేలాది రూపాయలతో నిర్మాణం చేసిన తొట్టెలు కేవలం కూటమి నాయకులకు కాసుల పథకంగా మిగిలిపోకముందే తొట్టెల్లో నీటిని నింపి మూగ జీవాల దాహర్తిని తీర్చాలి. – కారంగి మోహనరావు, మాజీ ఎంపీపీ, ఇచ్ఛాపురం -
జాబ్మేళాకు స్పందన
సోంపేట: నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి బి.చంద్రమౌళి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోంపేట పట్టణంలోని కె.ఆర్.కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. 13 ప్రెవేటు కంపెనీల ప్రతినిధులు హాజరై 256 మంది నిరుద్యోగ యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన 105 మందిని వివిద కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్కు బాటలు వేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్లేస్మెంట్ అధికారి ఎం.వంశీకృష్ణ, కళాశాల కరస్పాండెంట్ కొంచాడ శేషాద్రి, ప్రిన్సిపాల్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజనులకు అండగా నిలుద్దాం
● ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి శ్రీకాకుళం పాతబస్టాండ్: గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, వారికి రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీలపై జరిగే దాడుల విషయంలో పోలీస్ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డిని ఆదేశించారు. గిరిజన ఉద్యోగులపై పని ప్రదేశాల్లో వేధింపులు జరిగితే సహించేది లేదన్నారు. ఐటీడీఏ పరిధిలోని పనులన్నింటిలోనూ గిరిజనులకే తొలి ప్రాధాన్యమివ్వాలన్నారు. ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. గిరిజనుల ముసుగులో తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందిన వారిపై, అక్రమంగా సంఘాలు నడుపుతున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కలర్ గ్రానైట్ పర్మిషన్ల అంశంపై చర్చిస్తూ గిరిజనులకు ఇబ్బంది కలిగించే వారి లీజులపై పునః సమీక్షించాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో ఎస్టీలపై దాడులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, గతేడాది 5 కేసులు నమోదయ్యాయని వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల కోసం అమలు చేస్తున్న పథకాలపై ఐటీడీఏ పీవో స్వప్నల్ పవార్తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో ఎస్టీ కమిషన్ సభ్యులు మల్లేశ్వరరావు, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఎం.అన్నాదొర, గిరిజన సంఘాల నేతలు చౌదరి లక్ష్మీనారాయణ, గేదెల రమణమూర్తి, బిడ్డిక తేజేశ్వరరావు, సవర కుమారి, సవర తులసి, ధరణి బైరిసింగి, బి.పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
అదరగొట్టిన సిక్కోలు క్రికెట్ జట్టు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. కెప్టెన్, స్టార్ ఆటగాడు ఎస్డీఎన్వీ ప్రసాద్ తుఫాన్ ఇన్నింగ్స్తో 388 పరుగుల లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. విజయనగరం జిల్లాలోని ఏసీఏ క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఏసీఏ అంతర్జిల్లాల సీనియర్స్ పురుషుల వన్డే క్రికెట్ టోర్నీలో మంగళవారం తూర్పుగోదావరి జిల్లాతో శ్రీకాకుళం తలపడింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తూ.గో. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. జిల్లా జట్టులో సాయియశ్వంత్, ఎన్.హిమకర్ తలా రెండు వికెట్లు, నంబళ్ల సుశాంత్ ఒక వికెట్ పడగొట్టాడు. భారీ లక్ష్యసాధనతో బరిలోకి దిగిన శ్రీకాకుళం జిల్లా 48.4 ఓవర్ల 391 పరుగులు సాధించి ఔరా అనిపించింది. ప్రసాద్ 59 బంతుల్లోనే 146 పరుగులతో నాటౌట్గా నిలిచి సిక్కోలును విజయపథంలో నిలిపాడు. బెందాళం సాత్విక్ 70 బంతుల్లో 84 పరుగులు, కె.సాయిసాత్విక్ 71 బంతుల్లో 78 పరుగులతో రాణించారు. జట్టు రికార్డు లక్ష్యసాధన పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, ప్రధాన కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదినా శైలానీ, కౌన్సెలర్ డాక్టర్ ఎస్.రవికుమార్, సంఘ ప్రతినిధులు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తంచేశారు. ఎస్డీఎన్వీ ప్రసాద్ బి.సాత్విక్ సాయిసాత్విక్ -
ఆటోను ఢీకొట్టిన స్కూల్ బస్సు
● ముగ్గురు డిగ్రీ విద్యార్థులకు గాయాలు నరసన్నపేట : తామరాపల్లి సమీపంలో జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు డిగ్రీ విద్యార్థులు గాయపడ్డారు. కోటబొమ్మాళి వైపు నుంచి విద్యార్థులతో నరసన్నపేట వస్తున్న ఆటోను మార్కెట్ కమిటీ వద్ద ఉన్న ఓ ప్రైవేటు స్కూల్ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న డిగ్రీ విద్యార్థులు కోటబొమ్మాళి మండలం సింహాద్రిపురానికి చెందిన రాజాపు సంతోష్, హర్ష, నిమ్మాడకు చెందిన శిమ్మ మాధురిలకు గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డీజల్ కోసం బస్సు రాంగ్రూట్లో వెళ్తూ ఎదురుగా వస్తున్న ఆటోను అదుపు తప్పి ఢీకొట్టిందని ఆటో డ్రైవర్ వీరాస్వామి తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంటనే నరసన్నపేట ఎస్సై బి.గణేష్ ఘటనా స్థలానికి వెళ్లి సమీక్షించారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును పక్కకు తరలించి గాయపడ్డ విద్యార్థులకు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పోర్టు బహిరంగ సభ విజయవంతం చేయండి
సంతబొమ్మాళి: నౌపడ మూడు రోడ్లు జంక్షన్ వద్ద ఈ నెల 30న జరిగే మూలపేట పోర్టు భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ కోరారు. మంగళవారం నౌపడ మూడురోడ్లు జంక్షన్ వద్ద స్థలం లెవలింగ్ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మూలపేట పోర్టు పనులు 75 శాతం పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి మిగిలిన వారిని విస్మరించడం ఎంతవరకు సమంజమని ప్రశ్నించారు. పార్టీ తరఫున ఉత్తరాంధ్ర నాయకులు మూలపేట పోర్టు, పరిసర ప్రాంతాలను సందర్శిస్తారని తెలిపారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు పిలక రవికుమార్రెడ్డి, చిన్ని జోగారావు యాదవ్, బడ్డ రాజేష్ తదితరులు ఉన్నారు. -
విద్యార్థులతో వడ్డింపు
కొత్తూరు: గొట్టిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులే తోటి విద్యార్థులకు వడ్డించారు. విద్యార్థులతో ఎటువంటి పనులు చేయించ కూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇలా చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై పాఠశాల వార్డెన్ అప్పన్నమ్మ వద్ద ప్రస్తావించగా కమాటి అనారోగ్యం వల్లత హాజరు కాలేదని, కుక్ ఒక్కరే ఉన్నందున విద్యార్థులు వడ్డించినుట్ల చెప్పారు. యురేకా సైన్స్ ఎక్స్పో ఫలితాలు విడుదల శ్రీకాకుళం: యురేకా సైన్స్ ఎక్స్పో–2026 రాష్ట్ర, జిల్లా స్థాయి ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.ఎస్.లక్ష్మణరావు, తవ్వా సురేష్, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విభాగంలో పర్యావరణం సుస్థిర అభివృద్ధికి సంబంధించి పైడి భీమవరం, ఇప్పిలి హైస్కూళ్లు ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో పైడి భీమవరం, కొల్లిపాడు హైస్కూల్ తొలి రెండు స్థానాలు సాధించాయి. మూఢ నమ్మకాలు–శాసీ్త్రయ దృక్పథం అంశంలో జర్జంగి విద్యార్థులు ప్రథమ స్థానాన్ని పొందారు. ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి అన్ని విభాగాల్లోనూ ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు విజేతలుగా నిలిచారు. ఈ నెల 29న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవన్లో జరిగే కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందిస్తామని గిరిధర్ తెలిపారు. సమగ్ర చైతన్యయాత్ర ప్రారంభం ఇచ్ఛాపురం: రాష్ట్రంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ కార్మికుల సంక్షేమ సాధనకు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర చైతన్య, రాష్ట్ర సర్వే యాత్రను చేపట్టినట్లు రాష్ట్ర ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.వి.సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఇచ్ఛాపురం గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సమగ్ర చైతన్య రాష్ట్ర సర్వే యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ 175 నియోజకవర్గాల్లో పర్యటించి ఎలక్ట్రికల్ కార్మికులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై.శంకర్రావు, ఉపాధ్యక్షుడు కె.పాల్రాజు, కార్యదర్శి బి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి కె.శ్రీహరి, కోశాధికారి ఎం.శ్రీధర్, స్వేచ్ఛావతి ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు రంగాల శ్రీనివాసరావు, కార్యదర్శి చిలకలపూడి కృష్ణారావు, ధర్మసాహు, దానేష్రెడ్డి, కాయశ్రీను, దుదిష్టి, కె.మణి పాల్గొన్నారు. ఆదిత్యలో సావి–3 సినిమా పోస్టర్ ఆవిష్కరణ టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం సావి–3 సినిమా పోస్టర్ను డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. శ్రీలక్ష్మి కృష్ణ ఫిల్మ్ సిటీ యూనిట్ ఆధ్వర్యంలో డైరెక్టర్ కృష్ణమాయ, నిర్మాత విజయ్ తదితరులు తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కళాశాలలో నాలుగు రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో నటులు సామ్రాట్రెడ్డి, లిఖిత, డిమాన్ పవన్, టెంపర్ వంశీ, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అలుమ్ని ఇన్చార్జి డి.యుగంధర్, శాక్ ఇన్చార్జి సురేష్, ఎస్టేట్ మేనేజర్ పిరియా రమేష్, డీన్ డి.విష్ణుమూర్తి పాల్గొన్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు ఇచ్ఛాపురం రూరల్: ఇచ్ఛాపురం మండలంలోని ఓ గ్రామంలో తోటలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు మద్యం మత్తులో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయమై గ్రామపెద్దల వద్ద పంచాయితీ జరిగినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యాత్రలో పాల్గొన్న ఎలక్ట్రికల్ యూనియన్ ప్రతినిధులు -
దళితుల హక్కుల పరిరక్షణే ధ్యేయం
● రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం ●జెడ్పీలో వినతుల స్వీకరణ శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అన్నారు. దళితులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన దళితుల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ, ఐఐఐటీ, మున్సిపల్ కార్పొరేషన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ, ఏపీఈపీడీసీఎల్, తదితర శాఖల అధికారులతో ఎస్సీ రోస్టర్ పాయింట్ అమలుపై సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు. ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ దళితులపై దాడులు జరిగిన వెంటనే పోలీసుల స్పందించి ఆలస్యం చేయకుండా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకువచ్చేందుకు 9701305417 వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ, న్యాయం అందించడంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. ఎస్సీ కమిషన్ 59 ఉప కులాలకు రక్షణ కవచం వంటిదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ రోస్టర్ పాయింట్ తప్పనిసరిగా అమలు జరగాలని రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రావాడ సీతారాం అధికారులను కోరారు. అంతకుముందు సీతారాంకి జిల్లాలోని దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో దళిత నాయకులు బోకర నారాయణరావు, కల్లేపల్లి రామ్గోపాలరావు,, డి.గణేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.వినాయకం, భూ గర్భ గణులు శాఖ ఉప సంచాలకులు మోహనరావు, డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల విద్యాలయాల జిల్లా కో–ఆర్డినేటర్ వై.యశోధ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డాక్టర్ కంఠ వేణు, ఏపీఈఈడబ్ల్యూఐడీసీ డైరెక్టర్ పి.ఎం.జె.బాబు తదితరులు పాల్గొన్నారు. -
నీరున్నా.. కన్నీరేనా..?
● వంశధార కాలువలకు నీరు నిలిపివేత ● బ్యారేజీ పనుల పేరుతో వృథాగా కిందకు.. ● పోలీస్ పహారాతో నీటిని దిగువకు విడుదల ● అన్నదాతలకు అపార నష్టం తీరని అన్యాయం.. రైతులకు వంశధార అధికారులు తీరని అన్యాయం చేశారు. కనీసం బ్యారేజీ పనులు అని ముందుగా చెప్పి ఉంటే పంటల సాగును స్వచ్ఛందంగా నిలిపివేసేవాళ్లం. కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రైతులు నష్టాల్లో కూరుకుపోయేలా చేశారు. – మీసాల బాస్కరరావు, రైతు, భగీరథిపురం చాలా ఘోరం ఇంతకంటే ఘోరం ఉంటుందా? రైతుల విషయంలో మరీ ఇంత నిర్లక్ష్యం తగునా? ముందుగా చెప్పి ఉంటే పంటల సాగు చేయకుండా ఉండేవాళ్లం కదా. రైతులకు కన్నీళ్లు మిగిల్చారు. – కరణం శివరాం, రైతు, పిండ్రువాడ హిరమండలం: ‘వంశధార ప్రాజెక్టు నిర్మాణ పనులు 2026 ఫిబ్రవరికి పూర్తిచేస్తాం. రబీలో రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరు శనగ, ఇతర పంటలను వేసుకోవాలి. వరికి నీరు ఇచ్చే ఆస్కారమే లేదు. మాట వినకుండా వరి వేసి సాగునీరు అందించలేద ని చెప్పి మమ్మల్ని నిందించకండి. వరి తప్ప ఇతర పంటలు వేసుకోండి’.. గత ఏడాది డిసెంబరు 6న శ్రీకాకుళం జెడ్పీ మందిరంలో జిల్లా నీటిపారుదల సలహా మండలిలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన ప్రకటన ఇది.. వంశధార పరిధిలో రైతులు రబీకి వేరు శనగ, నువ్వు, మొక్కజొన్న, ఇతర కూరగాయలను సాగుచేశారు. కర్బూజా వంటి పంటలను కూడా వేసుకున్నారు. పెట్టుబడులు పెట్టాక, దిగుబడులు వస్తాయ న్న సమయంలో గొట్టా బ్యారేజీ మరమ్మతుల పేరిట నీటిని కిందకు వదిలేస్తున్నారు. కనీసం రైతుకు ఒక మాటైనా చెప్పకుండా నీటిని వదిలేయడంతో రబీ పంటలు వేసుకున్న వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎడమ, కుడి కాలువ పరిధిలో నీటి సరఫరాను నిలిపివేశారు. బ్యారేజీలో స్థిరీకరించిన నీటిని కిందకు వృధాగా విడిచిపెట్టేశారు. దీంతో కాలువల పరిధిలో రబీ పంటలు వేసుకున్న రైతులు రెండు సార్లు ఆందోళనకు దిగారు. మంగళవారం మరోసారి ఆందోళనకు దిగే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. మూడు నెలల కిందట జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ఓ సలహా ఇచ్చి ఉన్నా పంటలు వేసుకునే వాళ్లం కాదని, ఇప్పుడు డబ్బు, కష్టం రెండూ వృథా అయ్యాయని వాపోతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో రబీ సాగు లక్ష్యం 70,319 హెక్టార్లు. అయితే ఇందులో సింహభాగం వంశధార కాలువల పరిధిలో పాతపట్నం, నరసన్నపేట, ఆమదాలవలస నియోజకవర్గాల్లోనే ఎక్కువగా పండిస్తారు. అధికారుల సూచనలతోనే ఈ ఏడాది వరి వేయలేదు. ఇప్పుడు వేసిన పంటలకు కూడా నీరివ్వకుండా వేధిస్తున్నారు. ముందుగా చెప్పకుండా ఉన్నట్టుండి నీరు ఆపేయడంతో పెట్టుబడులను రైతులు నష్టపోతున్నారు. -
సంబరాల వేళ..
జలుమూరు: అందవరంలో గ్రామ దేవత పండగలో భాగంగా మంగళవారం సిరిమాను ఉత్సవం అంబరాన్ని తాకింది. సిరిమానును ప్రత్యేకంగా పూలు, పసుపు కుంకుమ, నూతన వస్త్రాలతో అలంకరించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి అమ్మవారికి, సిరిమానుకి ప్రత్యేక పూజలు చేశారు. సంప్రదాయం ప్రకారం రాజుబాబు ఇంటి నుంచి సిరిమానును ప్రారంభించారు. ఆచారం ప్రకారం అందవరపు కుటుంబీకులైన అందవరపు రాము సిరిమాను అధిరోహించారు. మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు డీసీసీబి మాజీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ వాన గోపి, మాజీ ఎంపీపీ బగ్గు రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కనుసు సీతారాం, పైడి విఠలరావు, రేగాన శ్యామ్, బగ్గు గౌతమ్పిట్ట ప్రసాద్, పొన్నాడ విజయ్, ఎస్.ఆదిబాబు, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక పరిష్కారం ఉండాలి : ఎస్పీ
శ్రీకాకుళం క్రైమ్ : పబ్లిక్ గ్రీవెన్స్లో స్వీకరించిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి పారదర్శకంగా పరిష్కారం చూపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరిపాలన, పోలీసు సిబ్బందికి సంబంధించి అన్ని అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు ఈ–ఆఫీస్ విధానం ద్వారా జరగాలని, ఎస్ఐల పనితీరును డీఎస్పీ, సీఐలు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విజుబుల్ పోలీసింగ్లో భాగంగా గ్రామాల్లో నిత్యం సందర్శించి ప్రజలతో మమేకమవ్వాలని, నారీశక్తి–సంకల్పం పేరిట మహిళలు, బాలికల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. బాణసంచా తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి నియమ నిబంధనలు, అనుమతులు, లైసెన్సులను పరిశీలించాలన్నారు. సకాలంలో కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాన్బెయిల్బుల్ వారెంట్లను తక్షణమే అమలు చేయాలన్నారు. హెల్మెట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై కేసులు నమోదు చేయాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రమణ, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, గోవిందరావు, సీఐలు పాల్గొన్నారు. -
రబీ పంట సిద్ధం
సారవకోట: మండలంలో రబీలో సాగు చేసిన వరి పంట చేతికి రావడంతో రైతులు వరి కోతలు చేపడుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా రబీ సీజన్లో 3 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంతో ప్రస్తుతం అంగూరు, అడ్డపనస, సారవకోట గ్రామాలలో వరి కోతలు చేపట్టి ధాన్యంను రోడ్లపై ఆరబెడుతున్నారు. ‘గ్రామ పెద్దలు చట్టాలను గౌరవించాలి’ రణస్థలం: ప్రజలు, ప్రజా ప్రతినిధులు చట్ట పరిధిలో సమస్యలను కోర్టు, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులు చేయడం ద్వారా పరిష్కరించుకోవాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపారు. మండలంలోని కొండములగాం గ్రామంలో ఇటీవల కొన్ని కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేసి దండోరా వేయడం అనే వివాదంపై ఆ గ్రామంలో అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కు టుంబాలు, వ్యక్తుల గౌరవాలకు భంగం కలిగే లా చర్యలు చేపట్టరాదని, అలా చేసిన వారి పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలందరూ చట్టాలను గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం గ్రామంలో పోలీస్, రెవెన్యూ సిబ్బందితో నిఘా ఏర్పాటు చేస్తున్నామని, శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
‘నీరు వృథాగా వదిలేస్తున్నారు’
శ్రీకాకుళం పాతబస్టాండ్ : గొట్టా బ్యారేజీలోని నీటిని వృథాగా విడిచిపెట్టేస్తున్నారని, దీని వల్ల రబీ పంట చివరి దశలో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో భగీరథపురం, నీలదేవిపురం, గొడియపాడు, మహాలక్ష్మిపురం, పిండ్రువాడ, అంబావల్లి, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు తదితర గ్రామాల వారు మంగళవారం ఉన్నతాధికారులకు విన్నవించారు. కలెక్టర్ లేకపోవడంతో అందుబాటులో ఉన్న డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తికి వినతిపత్రం అందించారు. పై గ్రామాల్లో ఈ రబీసీజన్లో సుమారు 2 వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, వరి కోత దశకు వచ్చాయని, మరో 15 రోజుల్లో పంట చేతికి అందుతుందని, ఇలాంటి సమయంలో బ్యారేజీ గేట్లు పైకెత్తి నీటిని వదిలేయడం రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని రెడ్డి శాంతి పేర్కొన్నారు. రైతులు ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావులను కలిసి పలుమార్లు విన్నవించుకున్నా స్పందించడం లేదన్నారు. అన్నదాత సుఖీభవ డబ్బులు అందరికీ పడడం లేదని, సాగునీటి విషయంలోనైనా న్యాయం చేయాలని రెడ్డి శాంతి వినతిపత్రంలో కోరారు. -
సిక్కోలు.. కొత్త లెక్కలు
1.60లక్షల జనాభా ప్రాతిపదికనైతే.. రాజకీయానికి కొత్త రెక్కలు హస్తిన నుంచి చల్లని కబురు వచ్చింది. జిల్లా రాజకీయం ఉప్పొంగింది. ఇన్నాళ్లూ గుండెల్లో పెట్టుకున్నా ఆశలు రెక్కలు తొడుక్కొని వ్యూహాలోకాల్లో విహరిస్తున్నాయి. పునర్విభన జరిగితే నియోజకవర్గాలు పెరిగి కొత్తకొత్త పదవులు పుట్టుకొచ్చి రాజకీయ నిరుద్యోగం తీరుతుందని ఆశ. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నియోజకవర్గాల పునర్విభజన ప్రకటన జిల్లాలో రాజకీయ వేడి రగిలించింది. ఈ ప్రకటన రాజకీయ ఆశావహులకు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. పునర్విభజన జరిగితే జిల్లా ముఖ చిత్రంతో పాటు రాజకీయ స్వరూపం మారుతుంది. ప్రస్తుతం ఉన్న 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా మరో ఆరు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకో లోక్సభ నియోజకవర్గం కూడా ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పడతాయి? వాటిలోకి ఏ మండలాలు వస్తాయి? అన్నదానిపై చర్చలు ప్రారంభమయ్యాయి. సర్వత్రా ఇదే చర్చ.. 2004లో 12 అసెంబ్లీ స్థానాలు ఉండేవి. కానీ 2009 పునర్విభజన అయ్యాక 10 అసెంబ్లీ స్థానాలకు పడిపోయాయి. ఉణుకూరు, హరిశ్చంద్రపురం నియోజకవర్గాలు రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాలో కూడా 10 అసెంబ్లీ స్థానాలుండేవి. జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు, ఒక లోక్సభకు పరిమితమైంది. త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనతో జిల్లాలో గణనీయంగా అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. దీంతో జిల్లా చరిత్రలో అత్యధిక నియోజకవర్గాలుగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న నియోజకవర్గాలు మారుతాయా? ఉన్న మండలాలు పోతాయా? కొత్త మండలాలు వస్తాయా? ఇలా రకరకాల ఊహాగానాలకు తెరలేచింది. ఆశల పల్లకిలో ఆశావహులు.. జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ నాయకులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొత్తగా మరికొంత మంది పోటీ చేసే అవకాశం రానుండడంతో గంపెడాశలు పెట్టుకున్నారు. చాలా మంది నాయకులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. ఇంతవరకు పరిమిత స్థానాలు కావడం, నేతల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు వచ్చేసరికి కొందరినే సీట్లు వరిస్తున్న పరిస్థితి నెలకొంది. మిగతా వారికి నిరాశే ఎదురవుతూ వస్తోంది. ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీల్లో ఈ పోటీ ఎక్కువగా ఉంది. సీట్ల కోసం పోటీ పడటమే కాదు ఎంతైనా ఖర్చు పెట్టాలన్న ఉత్సుకతతో సీటు ఇస్తే మా తడాఖా చూపిస్తాం, అవసరమైతే ఎంతవరకై నా ఖర్చు పెడతామనే నాయకులు ఉన్నారు. అలాంటి వారందరికీ నియోజకవర్గాల పునర్విభజన మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ● ప్రస్తుతం ఉన్న లోక్సభతో పాటు మరో లోక్సభ స్థానం ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.● ఈ లెక్కన మన జిల్లాలో కొత్తగా ఆరు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియ జరిగితే మారనున్న జిల్లా ముఖచిత్రం రాజకీయ లెక్కలూ మారే అవకాశం ఔత్సాహిక ఆశావహుల్లో ఆనందం జనాభా లెక్కల ప్రకారం కొత్తగా ఆరు అసెంబ్లీలు ఏర్పాటయ్యే అవకాశం మరో లోక్సభ వచ్చే ఛాన్స్! జరిగితే ఇలా..! తాజాగా చేపడతామంటున్న పునర్విభజన ప్రక్రియతో కొత్తగా సుమారు ఆరు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 14కి, రెండు లోక్సభ స్థానాలకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముందు ఇలా.. జిల్లాల పునర్విభజనకు ముందు ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్సభ స్థానాలు ఉండేవి. జిల్లాలో ప్రస్తుతం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక లోక్సభ ఉంది. -
‘క్షయ వ్యాధిని నివారిద్దాం’
శ్రీకాకుళం : ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్యాధికారి కార్యాలయం నుంచి స్థానిక ఏడు రోడ్ల కూడలి వరకు మంగళవారం ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తు న్నామని తెలిపారు. జిల్లాలో 2.0 మిషన్లు, టీబీ నాట్ మిషన్లు ఉన్నాయని ఈ వందరోజుల కార్యక్రమంలో భాగంగా 77 పంచాయతీలను 1000 మంది పాపులేషన్ లెక్కన తీసుకొని ఒకటి కంటే తక్కువ ఉన్న పంచాయతీలను టీబీ ముక్త పంచాయతీలుగా ఒకటి లేక ఎక్కువ కేసులు ఉన్న పంచాయతీని సిల్వర్ పంచాయతీగా ఒకటి లేక సున్నా ఉన్న పంచాయతీలను గోల్డ్ పంచాయతీలుగా నిర్ణయించామన్నారు. టీబీ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. -
నల్ల రిబ్బన్లతో నిరసన
మందస: బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు ఈ నెల 23 నుంచి 31వ తేదీ వరకు నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. బిడిమి గ్రామంలో ప్రజలు, రైతులు నల్ల రిబ్బన్లతో సమావేశంలో పాల్గొని నిరసన తెలిపారు. గత 18 నెలలుగా కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నామన్నారు. సర్పంచ్ ధర్మారావు మాట్లాడుతు కొంతమంది వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్ వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్దంగా ఉన్నారని ప్రచారాన్ని చేస్తున్నారని,కానీ అది పూర్తిగా అసత్యమని అన్నారు. కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్లతో నిరసన చేస్తున్న రైతులు -
అర్జీల పరిష్కారానికి చర్యలు
● ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ ● పీజీఆర్ఎస్లో 149 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో 149 అర్జీలు స్వీకరించారు. ప్రధానంగా రెవెన్యూ శాఖ 30, పంచాయతీ రాజ్ 17, వ్యవసాయ శాఖ 16, పేదరిక నిర్మూలన సంస్థ 13, మున్సిపల్ కార్పొరేషన్ 11, ఏపీఈపీడీసీఎల్ 11, సర్వే 9, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 5, రూరల్ డవలప్మెంట్ 5, అటవీ శాఖ 2, ఆర్డబ్ల్యూఎస్ 5 తదితర శాఖల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ● ఏనేటి కోండ్స్ కులాన్ని ఎస్టీ కులంలో చేర్చారని.. అందువలన తమకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంను రెవెన్యూ అధికారులు అందజేయాలని కోరుతూ విద్యార్థులు, యువత పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. 20 ఏళ్లుగా ఈ కులానికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయుడం లేదని తెలిపారు. దీనివలన యువత ఉద్యోగ, ఉపాధికి దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఫిర్యాదు చేయడానికి వచ్చినవారిలో ఒక విద్యార్థిని మూర్చపోయింది. ● తనకు కళాకారుల పింఛన్ పునరుద్ధరించాలని సరుబుజ్జిలి మండలంలోని పెద్ద సవలాపురం గ్రామ పంచాయతీకి చెందిన కోరాడ అప్పారావు కోరారు. ● శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ రిజర్వు ప్రాంతాలు, లే అవుట్ రిజర్వు ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని పూజారి నాగేశ్వరరావు కోరారు. ● బీసీ, ఎస్టీ, ఎస్టీ హక్కుల చట్టాలను ప్రభుత్వ అధికారులు కఠినంగా అమలు చేయాలని, అందరికీ సామాజిక న్యాయం దక్కాలని భారత్ చైతన్య యువజన పార్టీ ప్రతినిధులు పీజీఆర్ఎస్లో వినతి పత్రంను అందజేశారు. -
బంగారం దొంగతనం చేసిన వ్యక్తి అరెస్టు
మందస: మండలంలోని హరిపురం గ్రామ పెద్దవీధికి చెందిన పొట్టి శాంతి ఇంట్లో ఇటీవల 20 గ్రాముల బంగారం దొంగతనం జరిగింది. ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కేసుని విచారణ చేసిన పోలీసులు నిందుతుడిని సోమవారం పట్టుకున్నారు. నిందితుడు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన వ్యక్తిగా నిర్ధారించారు. నిందితుడు ఉమాకాంత్ బిస్వల్(శంకర్) హరిపురంలోని శ్రీలక్ష్మీ స్వీట్ షాప్లో కూలీపని చేసుకుంటున్నాడు. అదే షాపులో పొట్టి శాంతి కూడా పని చేస్తుండగా, ప్రతిరోజు మాదిరిగానే ఇంటికి తాళం వేసి తన హ్యాండ్ బ్యాగులో వేసుకొని షాపునకు వచ్చింది. నిందితుడు శంకర్ ఆమె బ్యాగ్లో ఉన్న తాళం చెవిని తీసి శాంతి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను పట్టపగలే దొంగలించాడు. దీనిపై ఆమె ఈనెల 15వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందుతుడిని పట్టుకున్నారు. సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి సోంపేట కోర్టుకు తరలించారు. -
ఖచ్చితమైన గణాంకాలే దేశ ప్రగతికి పునాది
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల శాసీ్త్రయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జన గణాంకాలే ప్రాతిపదిక అని కలెక్టర్, ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత జన గణన–2027కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పదేళ్లకొకసారి నిర్వహించే ఈ మహత్తర ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 1, 2027ను సూచిక తేదీగా తీసుకుని నిర్వహించే ఈ గణనలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సమర్దవంతమైన డేటా సేకరణ ద్వారానే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పథకాలు రూపొందించడం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ బి.వి.ఎల్.సాయి శేఖర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అధికారి శివ కుమార్, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఓటర్ల జాబితాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైఎస్సార్సీపీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కమిటీ విభాగం విస్త్రృత స్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తేనే విజయం మన సొంతమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పరిశీలకుడు కుంబా రవిబాబు మాట్లాడుతూ బూత్ లెవెల్ కమిటీలు చాలా జాగ్రత్తగా పనిచేయాలని, లేకుంటే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించడం అధికార పార్టీ నాయకులకు చాలా సులువని, అధికారులంతా వారికే సహకరిస్తారు కాబట్టి తొలగింపు పెద్ద పని కాదన్నారు. కాబట్టి వైఎస్సార్సీపీ బూత్ కమిటీలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడు దోమ మన్మథరావు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, నియోజకవర్గ సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, కళింగ వైశ్యకుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాస్రావు, కరిమి రాజేశ్వరరావు, చల్ల శ్రీను, నర్తు నరేంద్రయాదవ్, చల్ల శ్రీను, మూకళ్ల తాతబాబు, బొడ్డేపల్లి రమేష్, పూర్ణసాగర్, రవిచంద్ర, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉలిక్కిపడ్డ నరసన్నపేట
● పట్టపగలే చైన్ స్నాచింగ్ నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో పట్టపగలు జనసంచారం అధికంగా ఉన్నచోట ఒక మహిళ మెడలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు చైన్ స్నాచింగ్కు పాల్పడ్డారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా పట్టణంలోని ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న జగన్నాథపురానికి చెందిన కాల్ల పద్మ విధులు ముగించుకొని తోటి టీచర్స్తో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బండి వీధి వద్ద ఒక షాపింగ్ మాల్ వద్దకు వచ్చేసరికి శిథిల ప్రభుత్వ షాపుల వైపు నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు మెడలో ఉన్న చైన్ను లాక్కొని వెళ్లిపోయారు. దీంతో పద్మ రోడ్డుపై పడిపోగా చుట్టుపక్కల వాళ్లు తేరుకొని, ద్విచక్ర వాహనాన్ని వెంబడించే ప్రయత్నం చేయగా సత్యవరం జంక్షన్ వైపు అత్యంత వేగంగా పరారయ్యారు. కాగా పద్మను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ తన మెడలో రెండు పావు తులాల పుస్తెలతో పాటు బంగారు గొలుసు ఉందని తెలిపారు. కాగా ఈ సంఘటనపై వెంటనే స్పందించిన నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ దర్యాప్తు ప్రారంభించారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాధితురాలు పద్మ నుంచి వివరాలు సేకరిస్తున్న ఎస్ఐ గణేష్ -
ఎస్పీ గ్రీవెన్సుకు 55 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)నకు బాధితుల నుంచి 55 ఫిర్యాదులందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఫిర్యాదులు స్వీకరించి బాధితులకు సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కోత కోసేశారు తమ వరిపంట పొలాన్ని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు కోత కోసేశారని, ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని సంతబొమ్మాళి మండలం కొల్లిపాడుకు చెందిన జి.ద్రౌపది తరపున ఆమె కుమారుడు, వికలాంగుడైన మురళి ఎస్పీ గ్రీవెన్సులో సోమవారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
సనాతన ధర్మ ప్రచారం కోసం..
కంచిలి: భారత దేశ వ్యాప్తంగా సనాతన ధర్మం ప్రచారం చేసేందుకు ఇద్దరు యువకులు ఉపక్రమించారు. ఒకరు సైకిల్తోను, మరొకరు స్కేటింగ్ చేస్తూ తిరుగుతున్నారు. సైక్లింగ్ చేసే అశుతోష్ పాండే ఈ ఏడాది జనవరి 20వ తేదీన బీహార్ రాష్ట్ర పరిధి శివాం జిల్లా నుంచి బయల్దేరి నేపాల్ బోర్డర్ వరకు వెళ్లి, మళ్లీ దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. సైకిల్ వినియోగిస్తే డబ్బులు ఆదా కావడంతోపాటు వాహనాల ద్వారా వచ్చే పొల్యూషన్ తగ్గుతుందని, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు. స్కేటర్ రాజా ఛార్దమ్ యాత్ర చేస్తూ 12 శక్తిపీఠాలను దర్శనం చేస్తూ ఆల్ ఇండియా టూర్ చేస్తున్నట్లు తెలిపారు. వీరు ఇప్పటి వరకు 2500 కిలోమీటర్లు ప్రయాణించారు. మొత్తం 15వేల కిలోమీటర్లు ప్రయాణిస్తామని తెలిపారు. వీరిద్దరూ వేర్వేరుగా వీళ్ల ఆల్ ఇండియా యాత్రలు చేపడుతూ, కంచిలి వచ్చేటప్పుడు ఒక్కచోట కలిశారు. వీరికి కంచిలికి చెందిన వ్యాపారి సంజయ్ కుమార్ శర్మ ఆదివారం రాత్రి ఆతిథ్యం కల్పించి సత్కరించారు. -
మా కన్నీరు చూడండి
హిరమండలం: వంశధార అధికారుల అనాలోచిత నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయి. ప్రస్తుతం బ్యారేజీలో నీటిని స్థిరీకరించకుండా దిగువకు విడిచిపెడుతున్నారు. దీంతో ఎడమ ప్రధాన కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టాలని సోమవారం రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గొట్టా బ్యారేజీపై రైతులు బైఠాయించడంతో అటు పాతపట్నం, ఇటు శ్రీముఖలింగం, మరోవైపు హిరమండలం నుంచి వచ్చే వాహనాలు నిలిచిపోయాయి. రైతులు మాట్లాడుతూ ఇటీవల బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడిచిపెడితే ఆందోళన చేశామని, నెలాఖరు వరకు నీటిని ఎడమ ప్రధాన కాలువ ద్వారా అందించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించామన్నారు. అయినా మళ్లీ నీటిని కిందకు విడిచి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ గా పెట్టుబడి పెట్టి, ఆరుగాలం శ్రమించి సాగు చేశామని, తీరా పంట చేతికి అందివస్తున్న వేళ నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. ఈ విషయంలో కలెక్టర్, మంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఇదేం పనితీరు..?
సోంపేట: కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కొర్లాం గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొర్లాం గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు ఆదివారం రాత్రి పొలానికి వెళ్లగా విష కీటకం కరిచినట్లు గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే మందులు ఉచితంగా ఇస్తారని సూచించారు. వెంటనే బాధితుడు కొర్లాం ప్రాథమిక ఆరో గ్య కేంద్రానికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో తలుపులు వేసి ఉండడం గమనార్హం. చాలాసేపు కేకలు వేసినా, డోర్ కొట్టినా సిబ్బంది తలుపు తీయలేదని బాధితుడు ఆరోపించారు. నొప్పి తీవ్రంగా ఉండడంతో హరిపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఏడాదిగా పూర్తిస్థాయి వైద్యుడు లేక ఆస్పత్రిలో సేవలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి వైద్యుడు భాస్కరరావు స్పందిస్తూ.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. ● ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రిలో అందని సేవలు ● ఇబ్బంది పడ్డ బాధితుడు -
అస్త్రంగా మూలపేట
శ్రీకాకుళం30న చలో మూలపేట విజయవంతం చేయండి మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026దాడిచేద్దాం ముప్పేటశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దశాబ్దాలుగా సిక్కోలు కల గంటున్న మూలపేట పోర్టును సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని, పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి రూ.3400కోట్లు నిధులు మంజూరు చేసి సుమారు 74 శాతం పనులు పూర్తిచేశారని వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. మిగిలిన పనులు పూర్తి చేస్తే ఆ క్రెడిట్ ఎక్కడ జగన్మోహన్రెడ్డి ఖాతాలో పడిపోతుందనే అక్కసుతో టీడీపీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు పనులు చేపట్టకుండా తాత్సారం చేస్తున్నార ని వారు మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సోమవారం జిల్లా కేంద్రంలో ‘మన మూలపేటకు పోదాం పదండి’ పేరిట సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 30న చలో మూలపేటను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అదీప్రాజు, తూర్పుకాపు, కళింగవైశ్య, వెలమ కుల రాష్ట్ర బీసీ విభాగం నాయకులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్రకార్యదర్శి కేవీజీ సత్యనారాయణ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవీ స్వరూప్, రాష్ట్రకార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్, పార్టీ మహిళావిభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, ఎస్ఈసీ మెంబర్లు చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయి, ఉలాల భారతిదివ్య, చల్ల రవికుమార్, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, మార్పు పృధ్వి, ముత్తా విజయ్కుమార్, ప్రత్తి అన్వేష్, గంట్యాడ రమేష్, బొడ్డేపల్లి రమేష్, బూడి అనురాధ, గేదెల పురుషోత్తం, మండవల్లి రవి, కోణార్క్ శ్రీను, సనపల నారాయణరావు, బుక్కూరు ఉమామహేశ్వరరావు, రౌతు శంకరరావు, తంగుడు నాగేశ్వరరావు, అంధవరపు రమేష్, డాక్టర్ నిమ్మన దాస్, చిట్టి జనార్ధనరావు, మూకళ్ల తాతబాబు, పీస శ్రీహరి, బీసీ విభాగం జిల్లా అధ్యక్షులు అశోక్చక్రవర్తి, గద్దిబోయిన కృష్ణయాదవ్, టి.కామేశ్వరిలతో పాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధిక సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసమర్థ ప్రభుత్వమిది శ్రీకాకుళం ఉద్యమాల పురిటి గడ్డ. మూలపేట పోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ శ్రీకారం చుడితే మిగిలిన పనులు పూర్తిచేయడం కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం టీడీపీది. అప్పట్లో ఉద్దానం మంచినీటి ప్రాజెక్టు శంకుస్థాపనకు హెలికాప్టర్లో నేను వచ్చి తిరిగి వెళ్తుండగా వైఎస్ జగన్ ఒక్కసారి హెలికాప్టర్ వెనక్కి తిప్పి మూలపేట పోర్టు పనులు చూసి వెళ్దామన్నారు. ఈ జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ఉన్నా ఒక్క అభివృద్ధి పని చేయలేదు. – బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి రామన్న అచ్చెన్నలకు అడిగే దమ్ము లేదు పోర్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు తెచ్చి పనులన్నీ దాదాపు పూర్తి చేస్తే ఆ మిగిలిన పని పూర్తి చేయడం టీడీపీ నేతలకు చేత కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు జిల్లా అభివృద్ధికి నిధులు అడిగే దమ్ము లేదు. అరసవల్లి ఇంద్రపుష్కరిణి పనులకు మేం శంకుస్థాపన చేస్తే..శిలాఫలకాలపై పేర్లు మార్చి మళ్లీ అవే పనులకు కొబ్బరికాయలు కొట్టారు. ఒడిశా, ఆంధ్రాలో కూటమి పార్టీలే ఉన్నా నేరడిపై చర్చే జరగడం లేదు. బస్టాప్లు, సోలార్ లైట్లపై పేర్లు రాసుకుంటే అభివృద్ధి కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే ప్రాజెక్టులు కట్టాలి. ఈ ఏడాది బడ్జెట్లో వంశధార, నేరడిలకు పైసా వెచ్చించలేదు. మూలపేట పోర్టు నిర్మాణంలో నాటి మంత్రి సీదిరి కీలక పాత్ర పోషించారు. రానున్న రోజుల్లో వంశధార ప్రాజెక్టు, బుడగట్లపాలెం, కలెక్టరేట్లను సందర్శించి పనులు చేయాలని ప్రశ్నిద్దాం. ఏం చేయకపోయినా జనం ఓట్లు వేస్తున్నారనేదే టీడీపీ నేతల ధీమా. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి సన్నాహక సమావేశంలో పార్టీనేతల పిలుపు ఉద్యమాల పురిటి గడ్డ శ్రీకాకుళం: బూడి ముత్యాలనాయుడు ఏం చేయకపోయినా ఓట్లు వేస్తున్నారనే టీడీపీ ధీమా: ధర్మాన ప్రసాదరావు రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడాలి: ధర్మాన కృష్ణదాస్ పోర్టుతో ప్రపంచంతో కనెక్టివిటీ: కుంభా రవిబాబు అపర భగీరథుడు జగన్మోహన్రెడ్డి: సీదిరి అప్పలరాజు ఇదే మన అస్త్రం వలసల నివారణకు, ఉద్యో గ, ఉపాధి అవకాశాలకు మూలపేట పోర్టు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వైఎస్ జగన్ ఈ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుడితే.. కూటమి పాలకులు దాన్ని పూర్తిచేయకపోవడం అన్యాయం. రాబోయే ఎన్నికల్లో మూలపేట పోర్టుని అస్త్రంగా వాడుకుని వైఎస్సార్సీపీ విజయానికి బాటలు వేద్దాం. పది వేల మందితో పోర్టును సందర్శిద్దాం. – ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
కుటుంబం సామాజిక బహిష్కరణ
రణస్థలం: రణస్థలం మండలంలోని కొండములగాం గ్రామంలో బైరెడ్డి తవుడు కుటుంబ సభ్యులను సామాజిక బహిష్కరణ చేస్తున్నట్లు ఆదివారం ఉదయం గ్రామ పెద్దలు తీర్మానం చేయడం, ఆ కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదని రాత్రి సమయంలో దండోరా వేయడం మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఘటనను ఖండిస్తూ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రెసిడెంట్ కె.గౌరినాయుడు, బైరెడ్డి కుటుంబ సభ్యులు జేఆర్ పోలీసులకు, డిప్యూటీ ఎంపీడీఓలకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వారు తెలిపిన వివరాల మేరకు.. కొండములగాం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 57/15లో 10 సెంట్లు భూమి ఉంది. ఆ భూ మిపై అన్ని పత్రాలు ఉన్నాయి. కోర్టు తమకు అనుకూలంగా స్టే ఇచ్చిందని, అయినా దీనిపై తమ కుటుంబానికి ముడిపెట్టి తమను సామాజిక బహిష్కరణ చేయడం ఎంత వరకు న్యాయ మని బాధితులు ప్రశ్నించారు. దీనిపై దండోరా వేయించడం బాధ కలుగుతోందన్నారు. బంధు వుల వద్ద తలెత్తుకోలేకపోతున్నామని తెలిపారు. గ్రామ పెద్దలపై తగు చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్కు వినతుల వెల్లువ
మెళియాపుట్టి: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి సోమవారం మండలంలో పర్యటించారు. మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో ఆయన సభ నిర్వహించారు. మందస, మెళియాపుట్టి, పాతపట్నం, మందస, నందిగాం, టెక్కలి, కొత్తూరు, హిరమండలం తదితర మండలాల్లోని గ్రా మాలకు చెందిన గిరిజనులు వారి సమస్యలపై వినతులు అందించారు. వినతిపత్రాలపై ఆయన స్పందిస్తూ.. పరిష్కారం చేస్తామన్నారు. బొజ్జి రెడ్డి వస్తుండగా దీనబంధుపురం కూడలి వద్ద పలువురు గిరిజనులు గ్రానైట్ ఫ్యాక్టరీల వల్ల ఇబ్బంది పడుతున్నామని ఆయనకు తెలిపారు. అయితే కారు దిగకుండా దూరంగా చూసి వెనుదిరుగుతున్న సమయంలో గ్రానైట్ వ్యర్థాల వల్ల కిడ్నీ వ్యాధులు వస్తున్నాయని చూడాలని వారు కోరారు. దానికి ఆయన బదులిస్తూ వినతి పత్రాల రూపంలో రాసివ్వాలని, సమయం లేదని చెప్పి వెనుదిరిగారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
● అతడి భార్యకు, పాపకు తీవ్రగాయాలు రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు జాతీ య రహదారిపై ఆదివారం బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. లావేరు పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. స్కూటీపై కె.రమే ష్(32) తన భార్య సుజాత, రెండేళ్ల కుమార్తె ధాతిశ్రీతో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వస్తున్నారు. ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో బుడుమూరు దగ్గరకు వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో గాయపడిన రమేష్ను స్థానికులు హుటాహుటిన 108 వాహనంపై శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే చనిపోయారు. భార్య సుజాత, పాప ధాతిశ్రీకి బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేష్ స్వగ్రామం విజయనగరం జిల్లాలోని దాకమర్రి. గార మండలం నిజామాబాద్లో ఉన్న అత్తవారింటికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
‘బలవంతపు భూసేకరణ వద్దు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, జీడి బోర్డు ఏర్పాటు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, విలువైన బీచ్ శాండ్ను కార్పొరేట్కు అప్పగించే ప్రయత్నం మానుకోవాలని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. భావనపాడు ఫిషింగ్ హార్బర్, బుడగట్లపాలెంలో జెట్టీ నేటికీ పూర్తికాలేదని గుర్తు చేశారు. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో ఐటీ డీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, గిరిజన భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. -
నిధుల వినియోగంలో పారదర్శకత ఉండాలి
● జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ శ్రీకాకుళం: జిల్లా అభివృద్ధి పథకాల అమలులో వేగం పెంచాలని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ అధికారులను ఆదేశించారు. ఆదివా రం జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సంఘాల సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు సూచించిన పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి, నివేదికలను సిద్ధం చేయాలన్నారు. ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో జరిగిన పనులపై విచారణ జరపాలన్నారు. అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులను సహించేది లేదు. సమావేశాల్లో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, వివిధ మండలాల జెడ్పీటీసీ సభ్యులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాజకీయం సుడాల్సిందే..!
● నిధులు సుడావి.. ప్రారంభోత్సవాలు టీడీపీ నేతలవి ● జిల్లా కేంద్రంలో కార్గిల్ పార్క్, రామలక్ష్మణ నుంచి పెద్దపాడు రోడ్డు పనులు ప్రారంభం ● కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రారంభించిన వైనం ● సుడా చైర్మన్ లేని సమయంలో ప్రారంభంపై మండిపడుతున్న జనసేన శ్రేణులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జనసేనను తెలుగు తమ్ముళ్లు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. అధికారిక కార్యక్రమాల్లో వారికంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పొత్తు ధర్మం అన్నది పాటించడమే లేదు. ఎన్నికల వరకే వారి అవసరం, ఆ తర్వాత అనవసరం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పనులు చేయడం, కమీషన్లు కొట్టేయడం, పూర్తయిన పనులు ప్రారంభించడం అంతా తెలుగుదేశం పార్టీ నేతలే చేస్తున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో గత కొన్ని నెలలు గా కార్గిల్ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ఈ పార్క్ నిర్మాణానికి సుడా నిధులు రూ.2కోట్లు వరకు వెచ్చించారు. కానీ పనులు పూర్తి కాకుండానే హడావుడిగా ప్రారంభించేశారు. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని జనసైనికులు మండిపడుతున్నారు. అంతేకాకుండా రామలక్ష్మణ కూడలి నుంచి పెద్దపాడు వరకు రోడ్డు నిర్మాణం, డివైడర్ పనులు, సెంట్రల్ లైటింగ్ తదితర పనులను మొత్తం రూ.3.68కోట్లతో చేశారు. ఇందులో ఏ పనులూ పూర్తికాకుండానే ప్రారంభించేశారు. సుడా చైర్మన్ కొరికాన రవికుమార్, సుడా వైస్ చైర్మన్ లేని సమయంలో ప్రారంభించడం ఏంటని జనసేన నాయకులు మండిపడుతున్నారు. వీరిద్దరికి ఎలాంటి సమాచారం లేకుండా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్లు 21వ తేదీ రంజాన్ నాడు రాత్రికి రాత్రి పనులు ప్రారంభించేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ పనులు పూర్తయ్యి అంతా సిద్ధంగా ఉన్నాక ప్రారంభించారా అంటే అదీ లేదు. తెలుగుదేశం పార్టీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు తప్ప కూటమిలో జనసేన నాయకులకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సుడా సొమ్ముతో పనులు చేసినప్పుడు కనీసం ఆ శాఖ చైర్మన్కి ప్రాధాన్యత ఇవ్వాలి, కనీసం వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. ఆయన కూడా లేని సమయంలో ప్రారంభించేశారు. -
ఇంటర్ ‘స్పాట్’ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ స్పాట్ వాల్యుయేషన్ మొదలైంది. శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా ఆదివారం మొదటి విడత సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ మొదలైంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్ పేపర్ల వాల్యుయేషన్ ప్రక్రియ మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు. ఆయా సబ్జెక్టుల బోర్డుల ఏర్పాటు అనంతరం దిద్దుబాటును ఆరంభించారు. ఈ సబ్జెక్టులకు నియామకమైన స్క్రూటినైజర్లు సోమవారం రిపోర్ట్ చేయనున్నారు. సీఈలు, ఏఈలకు ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జవాబుపత్రాల దిద్దుబాటులో అప్రమత్తంగా వ్యవహరించాలని, దిద్దుబాటును, మార్కుల పోస్టింగులు, మిగిలి న ఖాళీ పేపర్ల పరిశీలన, బబ్లింగ్, వంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియెట్ బోర్డు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చిన ప్రతిఒక్కరూ స్పాట్ కేంద్రం వద్ద విధిగా రిపోర్ట్ చేయాలని ఆర్ఐఓ సురేష్కుమార్ స్పష్టంచేశారు. బీఐఈఏపీ కాలేజ్ లాగిన్లోని అపాయింట్మెంట్ ఆర్డర్ను కళాశాల యాజమాన్యాలు/ప్రిన్సిపాళ్ల నుంచి తీసుకోవాలన్నారు. గైర్హాజరైనవారిపై బోర్డు ఆదేశాల మేరకు తగు చర్యలు ఉంటాయని ఆర్ఐఓ వెల్లడించారు. -
ఫోజులు కొత్తవి
పనులు పాతవి.. ఈ ఫొటో చూడండి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కలిపి మరోసారి శంకుస్థాపన చేసిన దృఽశ్యమిది. నాడు మంజూరైన నిధులనే వినియోగిస్తూ దానికి ప్రసాద్ స్కీమ్ రూ. 58కోట్లతో అభివృద్ధి పనులని కలరింగ్ ఇచ్చారు. ఈ ఫొటో చూడండి. 2023 డిసెంబర్ 20వ తేదీన రూ.4కోట్లతో అరసవల్లి ఇంద్ర పుష్కరిణి పునః నిర్మాణ పనులకు నాటి రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన దృశ్యమిది. నిధులు కూడా మంజూరయ్యాయి. పుష్కరిణిలో ఉన్న నీరు అంతా తీసేసి క్లీన్ చేశారు. అప్పటికి కాంట్రాక్టర్ ఖరారు కాలేదు. పనులు చేసే లోపు ఎన్నికల కోడ్ వచ్చేసింది. పనులు ముందుకు సాగలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అభివృద్ధి అనే పదానికి చంద్రబాబు ప్రభుత్వం వింత అర్థం చెబుతోంది. గత ప్రభుత్వంలో శంకుస్థాపన జరిగిన పనులకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రసాద్ స్కీమ్ కింద అరసవల్లి అభివృద్ధి చేస్తామని అనేక శాశ్వత కట్టడాలను కూల్చేశారు. ఆ పనులకు ఇప్పటివరకు అతీగతి లేదు. ఇప్పటికే రెండు రథసప్తమి వేడుకలు అయిపోయాయి. కూల్చేసిన కట్టడా లు ఎక్కడికక్కడే ఉన్నాయి. ప్రసాద్ స్కీమ్ మంజూరుకు నోచుకోలేదు. ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసా ద్ స్కీమ్ ద్వారా అరసవల్లి క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పి.. వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేసిన ఇంద్ర పుష్కరిణి పనులకే మళ్లీ కింజరాపు బాబాయ్, అబ్బాయ్లు శంకుస్థాపన చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రథ సప్తమి వేడుకలు రాష్ట్ర పండగగా గుర్తించి, ప్రజల సొమ్ముతో సంబరాలు చేసి, వివిధ కార్యక్రమాలతో సోకులు చేశారే తప్ప ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు. అట్టహాసం పేరుతో విపరీతమైన పబ్లిసిటీ చేసి ఈ సారి రథసప్తమి దర్శనాల సమయంలో భక్తులను తీవ్ర ఇబ్బందులకు గు రి చేశారు. ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. ఒక్క పైసా విడుదల చేయలేదు. కార్పొరేషన్లో అప్పటికే ఉన్న నిధులను, సుడా నిధులను వాడేసి అభివృద్ధి పనుల ముసుగులో కావాల్సిన కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చారు. ఆ పనులు ఎంత నాసిరకంగా ఉన్నాయో వాటిని ప్రస్తుతం చూస్తే ఎవరికై నా అర్థమవుతుంది. కార్పొరేషన్ సొమ్మును దుబారా చేయడం తప్ప పనులకు సార్థకత ఉండటం లేదు. వీరు చేసిన పనికి కార్పొరేషన్ ఆర్థిక ఊబిలో కూరుకుపోయిందని, నిధులు ఖాళీ అయిపోయాయని, కొత్త పనులు చేపట్టడానికి ఏమీ లేదని ఓ అధికారి ఉన్నతాధికారులకు ఏకంగా నివేదిక ఇచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడేమో రూ. 58కోట్లతో ప్రసాద్ స్కీమ్ కింద అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశామని కొత్త పబ్లిసిటీకి తెరలేపారు. డైవర్షన్ పాలిటిక్స్ మాదిరి ప్రజల్ని మభ్య పెట్టేడమే లక్ష్యంగా అడుగులు వేస్తు న్న పరిస్థితులు ఉన్నాయి. నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా చేసిన చంద్రబాబు ఈ జిల్లాకు చేసిన మేలంటూ ఏమీ లేదు. వైఎస్సార్ చేపట్టిన వంశధార ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేపట్టిన మూలపేట పోర్టు, బుడగట్లపాలెం పిషింగ్ హార్బర్, వంశధార ఎత్తిపోతల పథకం, కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి, ఉద్దానం మంచినీటి పథకం, గత ప్రభుత్వంలో మంజూరైన విద్యా సంస్థలకు పూర్తి సౌకర్యాలు, వసతులు, పనుల పూర్తిపై ఇప్పటివరకు దృష్టి పెట్టలేదు. ఇప్పటికే అధికారం వచ్చి రెండేళ్లు కావస్తోంది. మిగతా మూడేళ్లలో ఏం చేస్తారో క్లారిటీ లేదు. దానికి అరసవల్లి ఆలయం అభివృద్ధి పనుల పేరుతో కూల్చేసిన కట్టడాల చిత్రాలే నిలువెత్తు సాక్ష్యం. వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన శంకుస్థాపనలకు మళ్లీ శంకుస్థాపనలు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నదిదే కొత్తగా మంజూరు కాని నిధులు పాత వాటితో సోకులు అరసవల్లి ఆలయ అభివృద్ధి పేరుతో కొత్తగా హడావుడి -
‘నంది విగ్రహం ధ్వంసం దారుణం’
సోంపేట: బారువ కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయంలోని నంది విగ్రహాన్ని దొంగిలించి ధ్వంసం చేయ డం దారుణమని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం సమన్వయకర్త సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి కోటిలింగేశ్వర స్వామి దేవాలయాన్ని, ఉమామహేశ్వర స్వా మి దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం దేవాలయంలో నంది విగ్రహం దొంగిలించిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలన్నారు. బారువ మేజర్ పంచాయతీ పరిధిలోని బారువ పేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన వారిని ఆదుకోవాలని, జగనన్న కాలనీని అభివృద్ధి చేయాలని కోరా రు. డిగ్రీ కళాశాల సమీపంలో శిథిలావస్థలో ఉన్న మంచినీటి ట్యాంకును కూల్చాలని అధికారులను కోరారు. ఆయనతో పాటు పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, వైస్ ఎంపీపీ గురాల శ్రీను, బారువ, పలాసపురం సర్పంచ్లు యర్ర రజని, తడక జోగారావు, ఎంపీటీసీ తామాడ పద్మ, దేవాలయ అర్చకులు భువనేశ్వర్ పాణిగ్రాహి, పార్టీ నాయకులు నర్తు బాను, తామాడ బుజ్జి, దున్న మాదవరావు, కర్రి సత్యం, తెప్పల ధర్మారావు, తిరుపతిరెడ్డి, అమర లోకనాథం, శంకర్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. -
‘ఇచ్ఛాపురం ఎమ్మెల్యే ప్రకటన సరికాదు’
పలాస: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఇటీవల బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలపాల నే ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వీల్లేదని గిరిజన సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పలాసలో ఆదివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా జేఏ సీ అధ్యక్షుడు సవర రాంబాబు, ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న, గిరిజన సంఘం నాయకుడు సవర జగన్నాయకులు, జేఏసీ చీఫ్ అడ్వైజర్ వాబ యోగి మాట్లాడుతూ బెందాళం అశోక్ స్పీకరు రఘురామకృష్ణంరాజును కలిసి బెంతు ఒరియాలను ఎస్టీల్లో చేర్చాలని కోరడం సరికాదన్నారు. గతంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికలను చూసి ఎమ్మెల్యేలు ముందుకు వెళ్లాలని కోరారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక, భూసమస్యలకు సంబంధించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను సోమవారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీల నమోదు, స్థితిగతులకు సంబంధించి 1100 నంబర్కు కాల్ చేసి తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం భక్తుల వసతి గృహం అందుబాటులోకి వచ్చింది. సుదూర ప్రాంతాల భక్తులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ ఈఓ కె.ఏడుకొండలు ఆదివారం తెలిపారు. -
హుండీలో నగదు చోరీ
సోంపేట: బారువ గ్రామంలోని బస్టాండ్ వద్ద గల ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివా రం రాత్రి హుండీని గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి నగదు దొంగిలించారు. కమిటీ సభ్యులు ఆదివారం ఉదయం వెళ్లే సరికి హుండీ ధ్వంసమై ఉండడాన్ని గమనించారు. కమిటీ సభ్యుడు ఎస్.ఆదినారాయణ బారువ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదినారాయణ ఫిర్యా దు మేరకు ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా నిరసన మందస: బిడిమి గ్రామంలో జుత్తు జగన్నాయకులు స్మారక చిహ్నం వద్ద ఆదివారం కార్గో ఎయిర్ పోర్టుకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు మాట్లాడుతూ కొందరు వ్యక్తులు శ్రీకాకుళం కలెక్టరేట్కు వెళ్లి భూములు ఇవ్వడానికి ఈ ప్రాంతం ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రచారం చేస్తున్నారని, అది పూర్తిగా అసత్యమని తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి కూడా ఇవ్వబోమని తేల్చి చె ప్పారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషకు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పామన్నారు. కేంద్ర మంత్రికి ఉద్దానం సమస్యలపై పట్టింపు లేదన్నారు. కార్యక్రమంలో తెప్పల అప్పారావు, కృష్ణమూర్తి, గంటు రామస్వామి, దున్న రామారా వు, తామాడ లక్ష్మీ నారాయణ, దున్న సురేష్, మర్ల సంతోష్, లబ్బ సురేష్ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గ్రీవెన్స్ సెల్ నిర్వహించనున్నారని రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ సీమ రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారు సమస్యలపై వినతులు అందజేయవచ్చన్నారు. సాయంత్రం మూడు గంటలకు జిల్లా అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. -
23న జిల్లా బూత్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం
నరసన్నపేట : వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీల విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 23న నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళంలోని జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ హాలులో సాయంత్రం 3 గంటలకు జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు దోమ మన్మధరావు అధ్యక్షతన సమావేశం ఉంటుందన్నారు. అదే రోజు ఉదయం 10 గంటలకు మూలపేట పోర్టు సందర్శన సన్నాహక సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ముత్యాలనాయుడు, పార్లమెంట్ పరిశీలకుడు కుంబా రవిబాబు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారని తెలిపారు. నియోజకవర్గ, మండల బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు హాజరుకావాలని కోరారు. -
ఇంటర్ స్పాట్కు సర్వం సిద్ధం
● నేటి నుంచి మొదలుకానున్న ఇంటర్మీడియెట్ మూల్యాంకనం ● శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వేదికగా వాల్యుయేషన్ ● ఏర్పాట్లు పూర్తిచేసిన జిల్లా అధికారులు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్)కు సర్వం సిద్ధమైంది. శ్రీకాకుళం ప్రభుత్వ (బాలుర) జూనియర్ కళాశాల కేంద్రంగా ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఈ మూల్యాంకనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పలు విడతల్లో జరిగే స్పాట్లో మొదటి విడతగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ పేపర్ల దిద్దుబాటు చేపట్టనున్నారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ వాల్యుయేషన్ మొదలైన విషయం తెలిసిందే. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమం పేరిట శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించిన సంగతి తెలిసిందే. స్పాట్కు హాజరయ్యేవారు సమయపాలన పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని, దిద్దుబాటులో జరిగే తప్పులు, దోషాలకు తగు మూల్యం చెల్లించుకోకతప్పదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సీసీ కెమెరాలను అమర్చి, ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారు. జిల్లాకు చేరిన 2.35 లక్షల పత్రాలు.. శ్రీకాకుళం జిల్లాకు 2.35 లక్షల జవాబుపత్రాలు చేరుకోనున్నాయి. ఇప్పటి వరకు 2 లక్షల జవాబుపత్రాలు చేరాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13 ప్రధాన సబ్జెక్టుల జవాబుపత్రాలు చేరుకుంటున్నాయి.మూల్యాంకనం మొత్తం వివిధ స్పెల్స్లలో జరగనుంది. ఒక ఎగ్జామినర్ పూటకు 15 చొప్పున రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. పర్(స్క్రిప్ట్)కు రూ.23.66 పైసలు చెల్లిస్తారు. ఈ లెక్కన రోజుకు రూ.709.66 చెల్లించనున్నారు. వీటితోపాటు టీఏ, డీఏ, లోకల్ కన్వీయిన్స్/అవుట్స్టేషన్ అలవెన్స్ ఇలా చెల్లించే మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. అధికారులు, ఎగ్జామినర్ల నియామకం పూర్తి.. స్పాట్ వాల్యుయేషన్లో అన్ని సబ్జెక్టులకు కలిపి మూల్యాంకనంలో మొత్తం వెయ్యి మంది వరకు యంత్రాంగం/సిబ్బందిని నియమించారు. స్పాట్ క్యాంప్ ఆఫీసర్గా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ వ్యవహరిస్తున్నారు. ఏసీవో జనరల్–1గా గణపతి వెంకటేశ్వరరావు (ఇన్చార్జ్ ప్రిన్సిపాల్– జీజేసీ శ్రీకాకుళం బాలురు), జనరల్–2గా ఎస్.సత్యనారాయణ, సీసీవోలు, కోడింగ్ ఆఫీసర్లు, ఏసీవోలు, చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లు నియామక ప్రక్రియ పూర్తయ్యింది. జిల్లాలో ఆదివారం నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. అధికారులు, సిబ్బంది నియామకం పూర్తయింది. నియామక ఉత్తర్వులను కళాశాలల లాగిన్లో సిద్ధంగా ఉన్నాయి. విధిగా సమయపాలన పాటించాలి. సీసీ కెమెరాలను అమర్చి, స్ట్రీమింగ్ చేయించాం. బోర్డు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తారు. – రేగ సురేష్కుమార్, డీవీఈఓ/ఆర్ఐఓ/ఇంటర్ స్పాట్ క్యాంప్ ఆఫీసర్, శ్రీకాకుళం -
లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ దుయ్యబట్టారు. జిల్లా కేంద్రంలోని క్రాంతి భవన్లో శనివారం ఆయన విలేకరులతోమాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఏటా నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేనిపక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. అన్ని శాఖల్లోనూ వేలాది సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ పదివేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఈ జాబ్ క్యాలెండర్ను రద్దుచేసి లక్ష ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు జరిగిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్, ఎన్నికల సభల్లో చంద్రబాబునాయుడు, వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ యువతకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోక పోవడం సిగ్గు చేటన్నారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి, మత్తు పదార్థాలు, డ్రగ్స్ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతోందన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు ఆర్.అరవింద్, వసంతరావు, సంతోష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సాహిత్యంతో పోరుబాట
శ్రీకాకుళం కల్చరల్ : సాహిత్యంతోనే పోరుబాట సాగించాలని అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం శ్రీకాకుళంలోని రెడ్క్రాస్ సమావేశ మందిరంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరసం 90 ఏళ్ల ప్రస్తానమని, అటువంటి సంస్థకు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఎంతో మంది అభ్యుదయ కవుల స్ఫూర్తితో సంస్థ సేవలు విస్తృతంగా ఉన్నాయని, ఈ నెల 23, 24 తేదీలలో మహాసభలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ అభ్యుదయ వాద సంఘాలన్నీ ఏకతాటిపైకి నిలిచి దేశంలో జరుగుతున్న అరాచకాలపై గళం, కలం ఝుళిపించాలని పిలుపునిచ్చారు. అరసం జిల్లా అధ్యక్షుడు నల్లి ధర్మారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా వాసుదేవాచారి గజల్ గీతాలు ఆలపించారు. నూతన కమిటీ ఎన్నిక.. అరసం కమిటీ నూతన జిల్లా గౌరవాధ్యక్షుడిగా చింతాడ కృష్ణారావు, అధ్యక్షుడిగా నల్లి ధర్మారావు, ఉపాధ్యక్షులుగా బెందాళం వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా టి.తిరుపతిరావు, కార్యదర్శులుగా నరేష్కుమార్, బీవీఎస్ రాజులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, గేదెల ఇందిరాప్రసాద్, వి.జగన్నాథంనాయుడు, కె.శరత్చంద్ర, టి.తిరుపతిరావు, సీహెచ్ కృష్ణారావు, నరేష్, కంచరాన భుజంగరావు, తదితరులు పాల్గొన్నారు. పేద విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలోని బొల్లినేని మెడిస్కిల్స్లో 2025లో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత సాధించిన పేద విద్యార్థులకు బీఎస్సీ పారామెడికల్ కోర్సుల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కోర్సును పూర్తి చేసుకొని ఉద్యోగం పొందాక ఫీజు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బీఎస్సీలో న్యూరో ఫిజియాలజీ, డయాలసిస్, పెరిఫ్యూజన్ రెస్పరేటరీ మెడికల్ రికార్డ్స్, బ్లడ్ హెమటాలజీ టెక్నాలజీ, ఎంఎల్టీ కోర్సులకు సంబంధించి అడ్మిషన్లు జరుగుతున్నట్లు వివరించారు. 2026లో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నామని, వివరాలకు 7995013422 నంబర్ను సంప్రదించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రంలో మంటలు పలాస: బ్రాహ్మణతర్లా అంగన్వాడీ కేంద్రంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. సుమారు రూ.20వేలు విలువైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం.. బ్రాహ్మణతర్లా చాకలి వీధిలోని అంగన్వాడీ కేంద్రం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చెత్తా చెదారంపై సిగరెట్ పీక వేయడంతో మంటలు చెలరేగాయి. దీంతో రేకుల షెడ్లో ఉన్న సామగ్రి కాలిపోయింది. విషయం తెలుసుకున్న అంగన్వాడీ కార్యకర్త అగ్నిమాపక, కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఎ.ఎస్.ఐ సోమేశ్వరరావు, కాశీబుగ్గ హెచ్సీ జగన్మోహన్రావు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇంద్ర పుష్కరిణి పనులు ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం ప్రాంగణంలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఇంద్ర పుష్కరిణి పనులకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రం తరహాలో ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని వారు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్, ఈఓ ప్రసాద్, అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. గెడ్డలో మృతదేహం కలకలం మందస: డిమిరియా గ్రామ సమీపంలోని గెడ్డలో శనివారం మృతదేహం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న మందస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీయగా మృతుడు అంబుగాం గ్రామానికి చెందిన గుడియా జగన్నాథరావు(47)గా గుర్తించారు. ఈయన తోపుడు బండిపై తిను బండారాలు అమ్ముకునేవాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసమానతలు ఉన్నంత కాలం ఉద్యమాలు ఆగవు
● సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ● కోమర్తిలో అప్పలసూరి 29వ వర్ధంతి సభ నరసన్నపేట: భారత విప్లవోద్యమంపైన ఆరు దశాబ్దాలుగా పాలకులు అనేక నిర్బంధాలను ప్రయోగిస్తున్నారని, అరెస్టులు అక్రమ నిర్బంధాలతో విప్లవోద్యమాన్ని ఆపలేరని, అసమానతలు ఉన్న చోట ఉద్యమాలు సహజమని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. నరసన్నపేట మండలం కోమర్తి అమరవీరుల స్థూపం వద్ద మామిడి అప్పలసూరి 29వ వర్థంతితో పాటు కోమర్తి అమరులకు నివాళి అర్పించే కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిజం అంతమైందని పాలకులు చెప్పుకుంటున్నా.. సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం విప్లవోద్యమాన్ని అనచటం ఎవరి తరమూ కాదన్నారు. ఒక్కో సందర్భంలో పోరాటం సాయుధ రూపం సైతం తీసుకుంటుందని, నిత్య జీవన సంఘర్షణ నుంచి ప్రతిఘటనా పోరాటాలు సాగుతాయని చెప్పారు. అఖిత భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు మాట్లాడుతూ సామ్రాజ్యవాద యుద్ధోన్మాదం పెచ్చుమీరుతోందని, ఎందరో అమాయకులు వారి పంతాలకు ప్రాణాలు కోల్పోతున్నారని, మరెందరో అభాగ్యులుగా మిగిలి పోతున్నారని, వీటికి కారకులైన వారిని ప్రధాని మోదీ వెంటేసుకు రావడం సరికాదన్నారు. సీనియర్ నాయకులు అప్పయ్య, ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు కృష్ణవేణి మాట్లాడుతూ అమరుల త్యాగాలు వృథాగా పోనీయకూడదని, వారి ఆశయాల సాధనకు నేటి తరం ప్రజలను ఏకం చేయాల్సి అవసరం ఉందన్నారు. అప్పలసూరి లాంటి నాయకులు చూపిన పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమన్నారు. కార్యక్రమంలో న్యూ డెమొక్రసీ జిల్లా కమిటీ సభ్యులు నేతింటి నీలం రాజు, జిల్లా నాయకులు బగ్గు భాస్కరరావు, గ్రామ కమిటీ ప్రతినిధులు కొల్లి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. -
భవనం పైనుంచి జారిపడి కార్మికుడి మృతి
పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఉదయపురం రామలక్ష్మణ కాలనీకి చెందిన భవన నిర్మాణం కార్మికుడు సత్యం కృష్ణారావు(41) శనివారం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలిపాడు వద్ద శ్రీగౌరీ ఇంజినీరింగ్ వర్క్స్ యజమాని చౌదరి ఉపేంద్ర వద్ద వెల్డింగ్ పనులను కృష్ణారావు చేస్తుంటాడు. ఎప్పటి లాగే ఇంటి వద్ద నుంచి శనివారం ఉదయం బయలుదేరి వెళ్లాడు. మొగిలిపాడు దత్తాశ్రయం దారిలో తర్లాన సంజీవరావు బిల్డింగ్ పైఅంతస్తులో రేకులు బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారిపడి గాయాలపాలయ్యాడు. తీవ్ర గాయాల పాలవడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయాన్ని చౌదరి ఉపేంద్ర ఫోన్ ద్వారా కృష్ణారావు భార్య సత్యం గీతకు తెలియజేశారు. ఆమె వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా భర్త విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించింది. కృష్ణారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ బంగారం ముఠా గుట్టురట్టు
రణస్థలం : జె.ఆర్.పురం పంచాయతీలోని స్టార్ గోల్డ్ (వన్ గ్రామ్ గోల్డ్) షాపులో నకిలీ బంగారం అమ్మేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టు రట్టయ్యింది. పోలీసులు, షాపు యజమాని రమణ తెలిపిన వివరాల ప్రకారం.. వన్ గ్రామ్ గోల్డ్ షాపునకు ఐదు రోజుల క్రితం ఓ మహిళ, ఇద్దరు పురుషులు వచ్చి నల్లపూసలు దండ కొనుగోలు చేసుకుని వెళ్లిపోయారు. మరుసటి రోజు వచ్చి తమ వద్ద 300 ఏళ్ల క్రితం కాయిన్స్, బంగారం ఉందని, కొనుగోలు చేయాలని కోరారు. అయితే తన వద్ద డబ్బులు లేవని, మరుసటి రోజు రమ్మని చెప్పి పంపించేశారు. ఇంతలో వారు తెచ్చిన బంగారం తాలుకా ఫొటోలను స్నేహితుడికి పంపించి ఆరా తీయగా.. కొంత ఒరిజినల్ చూపి మిగతా అంతా నకిలీ బంగారం అంటగడతారని, కొనవద్దని చెప్పారు. మూడు రోజులుగా వారిపై నిఘా వేసి క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో వారు కేజీ నకిలీ గొలుసులతో రాగా చాకచక్యంగా వారిని పట్టుకుని జె.ఆర్.పురం పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేస్తామని ఎస్సై ఎస్.చిరంజీవి చెప్పారు. -
నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం
హిరమండలం: కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిందని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ ఉద్యోగ నియామకాలు అంటూ ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో పరిస్థితి బాగాలేదన్నారు. ఉగాది నాడు మంత్రి లోకేష్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్లో తేదీలు తప్ప.. ఉద్యోగాల సంఖ్య వేయకపోవడం హాస్యాస్పదమని చెప్పారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటనలతో ఊదరగొట్టిన విషయాన్ని గుర్తుచేశారు. నిరుద్యోగ భృతిని అటకెక్కించారని.. ఉద్యోగాల నోటిఫికేషన్ల ఊసే లేకుండా పోయిందని విమర్శించారు. ప్రైవేటు కంపెనీల ఉద్యోగాలను కూడా తమ ఖాతాల్లో వేసుకున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆరు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని చెప్పారు. 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగ యువతను దగా చేశారని.. వచ్చే ఎన్నికల్లో యువత బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
తెరుచుకున్న తలుపులు
ఇచ్ఛాపురం రూరల్: తన కింద పనిచేసే వ్యక్తిపై యజమాని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఇంటికి తాళాలు వేసి పిల్లల్ని అర్థనగ్నంగా బయటకు గెంటేశారంటూ శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘మంటగలిసిన మానవతత్వం’ కథనానికి అధికారులు స్పందించారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ జనార్దనరావు ఆధ్వర్యంలో బాధితుడు కోళ్ల మన్మధరావుకు శనివారం ఇంటి తాళాలు అప్పగించారు. 15 రోజుల్లో ఇల్లు తమ సొంతమని నిరూపించుకోవాలని, లేనిపక్షంలో ఇంటిపై హక్కులు కోల్పోతారని ఎస్ఐ ఇంటి తాళాలు ఇప్పించారని మన్మధరావు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, పెద్దలకు బాధితుడు కృతజ్ఞతలు చెప్పారు. -
● భక్తిశ్రద్ధలతో రంజాన్
ప్రసంగిస్తున్న ముఫ్తీ జియావుర్ రహమాన్ రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల ఉపవాస దీక్షలను విరమించారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు చెప్పుకుని పేదలకు దానధర్మాలు చేశారు. జిల్లా కేంద్రంలోని చారిత్రక జామియా మసీదు వద్ద రంజాన్ సందర్భంగా సందడి వాతావరణం కనిపించింది. –శ్రీకాకుళం కల్చరల్ / సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
రూ.26.96 కోట్లతో మడ్డువలస ఫేజ్–2 పనులు
జి.సిగడాం : మడ్డువలస ప్రాజెక్ట్ కాలువ పనుల కోసం ఫేజ్–2 కింద రూ.26 కోట్ల 90 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రాజెక్ట్ ఎస్ఈ పొన్నాడ సుధాకరరావు తెలిపారు. శుక్రవారం దేవరవలస వద్ద చేపడుతున్న కాలువ పనులను ఎస్ఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్కు రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పనులు జరుగుతున్న సమయంలో ప్రజలు, రైతులు సహకరించాలన్నారు. ఇప్పటికే అవసరమైన రైతులకు కాలువ ద్వారా సాగునీరు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఫేజ్–2 పనులు పూర్తయితే ప్రతిసెంటు భూమికీ సాగునీరు అందుతుందన్నారు. ఈయనతోపాటు ఈఈ బోర గోవిందరావు, డీఈఈలు పి.రవికుమార్, ఎ.రమేష్, జేఈఈలు బి.కోటేశ్వరరావు, రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు. దేవరవలస వద్ద పనులను పరిశీలిస్తున్న ఎస్ఈ సుధాకరరావు, ఈఈ గోవిందరావు -
ఎంత చెబితే అంతే..!
రణస్థలం: కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను అన్నీ కష్టాలే వెంటాడుతున్నాయి. గత ఏడాది అకాల వర్షాలు, తుఫాన్లు వల్ల నష్టపోయిన పంటలకు ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడంతో రైతులు కుదేలైపోయారు. రబీలో పంటలు సాగు చేద్దామంటే తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా సాగునీరు వచ్చే పరిస్థితి కానరావడం లేదు. తాజాగా చేతికి అందుతున్న మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించక, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో వరి, అపరాలు తర్వాత మెట్ట ప్రాంతాల్లో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట చేతికొచ్చేసినా మార్కెట్లో మద్దతు ధర లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవల వరకు రూ.2300 వరకు పలికిన క్వింటా ధర ప్రస్తుతం రూ.1600కు పరిమితమైంది. మరోవైపు కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల ఎంత చెబితే అంతకే అమ్మకాలు జరపాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతులు చాలాచోట్ల మొక్కజొన్న కోతలు మొదలయ్యాయి. మద్దతు ధర పెరిగితే కోతలు మొదలుపెడతామని మరికొందరు రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వమే మేలు.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏటా ఫిబ్రవరిలోనే మార్కెటింగ్ శాఖ అధికారుల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. మద్దతు ధర ప్రకటించి రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పొలం వద్దకే బస్సులు పంపించి మరీ మొక్కజొన్న కొనుగోలు చేసేవారు. అప్పట్లో రూ.2400 వరకు మద్దతు ధర ప్రకటించారని, రవాణా ఖర్చులు లేకుండా అంతా జగన్ ప్రభుత్వమే చూసుకుండేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. మద్దతులేక రైతుల గగ్గోలు.. ఎకరా విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుకు సుమారు రూ.30వేల నుంచి రూ.35వేల వరకు పెట్టుబడి అవుతుంది. బాగా పండితే ఎకరాకు 35 క్వింటాళ్ల నుంచి 43 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అమ్మే సమయానికి క్వింటాల్ మద్దతు ధర రూ.2400 వరకు ఉంటే సుమారు లక్ష వరకు రాబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్ ధర రూ.1600 ప్రకారం చూసుకుంటే రూ.70వేలు లోపే వస్తుంది. అంటే ఎకరాకు రూ.30 వేలు చొప్పున, క్వింటాకు రూ.700 వరకు రైతులు నష్టపోతున్నారు. తెరుచుకోని కేంద్రాలు.. కూటమి ప్రభుత్వ పాలనలో ఆ పార్టీల నాయకులు చెబుతున్న మాటలకు బయట కనిపిస్తున్న చేష్టలకు పొంతన లేకుండాపోతోంది. ఇటీవల కూటమి నాయకులు ఎక్కడికక్కడ ఉపన్యాసాల్లో మొక్కజొన్న రైతును ఆదుకుంటామని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో చూపించడం లేదు. మొక్కజొన్న మద్ధతు ధర ప్రకటించాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు నిలదీస్తున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీల నాయకులపైనా, రైతులపైనా అక్కసు చూపడం సరికాదని, వెంటనే మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మొక్కజొన్న కొనుగోలులో దళారులదే రాజ్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కూటమి ప్రభుత్వం మద్దతు ధర రూ.1600కు పడిపోవడంతో రైతులు కుదేలు మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు.. మొక్కజొన్న పంట వేసిన రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని స్థితిలో వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఉన్నారు. జిల్లాలో 58 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. మొక్కజొన్న పంటకు వెంటనే మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. – గొర్లె కిరణ్కుమార్, మాజీ ఎమ్మెల్యే, ఎచ్చెర్ల ఆదేశాలు రాలేదు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, మద్దతు ధర ప్రకటనపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. రైతులకు క్షేత్రస్థాయిలో అదే చెబుతున్నాం. – వి.శ్రీనివాసరావు, ఏడీఏ -
గేట్లో ఉత్తమ ర్యాంకులు
శ్రీనివాస్ కల్యాణ్ (488వ ర్యాంకు) జి.సాయిగణేష్ (31వ ర్యాంకు) ఇంటూరు ఉమేష్చంద్ర (77వ ర్యాంకు) పూడి అభిషేక్ (246వ ర్యాంకు) ఎచ్చెర్ల : గేట్–2026 ఫలితాల్లో ర్యాంకులు కై వసం చేసుకున్న విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకోవాలని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. జి.సాయిగణేష్ (ఈసీఈ) 31వ ర్యాంకు, ఇంటూరి ఉమేష్చంద్ర (సీఎస్ఈ) 77వ ర్యాంకు, మరో 20 మంది విద్యార్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని చెప్పారు.కార్యక్రమంలో డీన్ శివరామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. – సంతబొమ్మాళి: కోటపాడు పంచాయతీ కాశీపురం గ్రామానికి చెందిన పూడి అభిషేక్కు గేట్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ఆలిండియా స్థాయిలో 246వ ర్యాంకు సాధించాడు. అభిషేక్ తండ్రి రాంబాబు రైతు కాగా, తల్లి సునీత గృహిణి. తాడేపల్లిగూడెంలో ఇంజినీరింగ్ చదివి గేట్లో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జి.సిగడాం: మండల కేంద్రం జి.సిగడాంకు చెందిన పుప్పాల శ్రీనివాస్ కల్యాణ్ గేట్లో ఆలిండియా స్థాయిలో 488వ ర్యాంకు సాధించాడు. తండ్రి గౌరీ ప్రసాద్ ఆటో డ్రైవర్, తల్లి దివ్యకుమారి గృహిణి. శ్రీనివాస్ కల్యాణ్ బీటెక్ పూర్తి చేసుకుని ఇంటి వద్దనే చదువుకుంటూ గేట్లో మంచి ర్యాంకు సాధించడం పట్ల కుటుంబసభ్యులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
ముగ్గురికి రిమాండ్
హిరమండలం : పోలీసులపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడిచేసిన ముగ్గురికి కోర్టు రిమాండ్ విధించింది. హిరమండలం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనా వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18న రాత్రి 112 అత్యవసర విభాగానికి వచ్చిన ఫిర్యాదును విచారించేందుకు కానిస్టేబుళ్లు ఇద్దరు హిరమండలం ప్రధాన రహదారికి వెళ్లారు. అయితే దంత తేజేశ్వరరావు, అల్లాడ మధుబాబు, నీలంశెట్టి మిన్నారావు అసభ్యకరంగా ప్రవర్తించారు. దాడిచేసే ప్రయత్నం చేశా రు. దీనిపై కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ముగ్గుర్ని అరెస్టు చేసి కొత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్కు ఆదేశించడంతో జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ హేమంత్ కళ్యాణ్ తెలిపారు. నేడు అరసం జిల్లా మహాసభ శ్రీకాకుళం కల్చరల్ : అభ్యుదయ రచయితల సంఘం (అరసం) జిల్లా మహాసభ శనివారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీకాకుళం రెడ్క్రాస్ భవనంలో నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నల్లి ధర్మారావు, చింతాడ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. 70 ఏళ్ల చరిత్ర గల ఈ సంస్థకు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరవుతారని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రంథాలయ పునర్నిర్మాణ ఉద్యమ సంస్థ, రాష్ట్ర కన్వీనర్ వల్లూరు శివప్రసాద్, ప్రముఖ రచయిత అట్టాడ అప్పలనాయుడు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. అభ్యుదయ వాదులంతా ఆహ్వానితులేనని తెలిపారు. జీడి తోటలో మంటలు టెక్కలి రూరల్ : తొలుసూరుపల్లి గ్రామ సమీపంలోని జీడి తోటలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గూన వేణుగోపాలరావుకు చెందిన నాలుగు ఎకరాల జీడితోటలో గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. స్థానిక యువకులు గమనించి మంటలను అదుపు చేశారు. -
రైలు హాల్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
టెక్కలి/పాతపట్నం/మందస: కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రాపురం రైల్వే హాల్ట్ వద్ద విశాఖ–గుణుపూర్ ప్యాసింజర్ రైలు హాల్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు కోరారు. శుక్రవారం ప్యాసింజర్ రైలు హాల్టింగ్ను ప్రారంభించారు. పాతపట్నం రైల్వే స్టేషన్లో రూర్కెలా–గుణుపూర్ రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు హాల్టును, మందస రైల్వే స్టేషన్లో బ్రహ్మపురం–విశాఖ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ను కేంద్రమంత్రి, పాతపట్నం, పర్లాకిమిడి ఎమ్మెల్యేలు మామిడి గోవిందరావు, రూపెష్ పాణిగ్రహీ, రైల్వే అధికారులు ప్రారంభించారు. కార్యక్రమంలో వాల్తేరు, ఖుర్ధా రైల్వే డివిజన్ డీఆర్ఎంలు లలిత్, సునీల్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
కార్గోఎయిర్ పోర్టు ప్రభావిత గ్రామాల్లో నిరసనలు
పలాస : కార్గో ఎయిర్ పోర్టు ప్రభావిత గ్రామాల్లో ఈ నెల 23 నుంచి 31 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ నాయకుడు ఎం.రామారావు, కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు చెప్పారు. కాశీబుగ్గ సి.ఐ.టి.యు.కార్యాలయంలో శుక్రవారం కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాటానికి సంఘీభావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రభావిత ప్రాంతాల్లో సభలు సమావేశాలు పెట్టనీయకుండా ఎందుకు పోలీసు ఆంక్షలు పెడుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడిని ప్రశ్నించారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జీడి మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కె.మోహనరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సి.ఐ.టి.యు. జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్కుమార్, పోరాట కమిటీ మీడియా కన్వీనర్ బత్తిన లక్ష్మణ్, పి.కుసుమ, కె.గురయ్య, పొట్టి ధర్మారావు, గుంటి లోకనాథం, గుంటు రామస్వామి, లండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ను సస్పెండ్ చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డ్రగ్స్ కేసులో పట్టుబడిన తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్కుమార్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ప్రతినిధులు డిమాండ్ చేశారు.ఈ విషయమై శ్రీకాకుళం సూర్యమహల్ జంక్షన్ వద్ద శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీపై టీడీపీ నాయకత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పట్టుబడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండాలని తరచూ ఉపన్యాసాలు చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఇప్పుడు తమ పార్టీ ప్రజాప్రతినిధులే డ్రగ్స్ కేసుల్లో చిక్కుకోవడంతో ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పూర్తి నైతిక బాధ్యత వారే వహించాలన్నారు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన ప్రజాప్రతినిధులకు ఎలాంటి రాజకీయ పరిరక్షణ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని, యువతను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు ప్రజల్లో చైతన్యం పెంచే కార్యక్రమాలను మరింత విస్త్రృతంగా చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్, నాయకులు అరవింద్, రామోజీ, వసంతరావు, శ్రీనిధి, అన్నాజీ, హేమంత్, కృష్ణ, వికాస్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు -
కార్గిల్ పార్కు పనుల పరిశీలన
శ్రీకాకుళం : జిల్లా పరిషత్ రోడ్డులోని సుడా కార్గిల్ పార్కులో జరుగుతున్న పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫొటో సెషన్, స్పీచ్ పాయింట్ల వద్ద ప్రాక్టికల్ డెమో విధానంలో ఫొటోలు తీయించి పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు సైతం పరిశీలించారు. పెండింగ్ పనులను టీములు వారీగా ఏర్పాటు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్కు ప్రారంభోత్సవం నాడు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సుడా ఎస్ఈ సుగుణాకర్, మున్సిపల్ కార్పొరేషన్ ఎం.ఈ. శర్మ, ఎంహెచ్ఓ సుధీర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎ.శైలజ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, డీఎస్డీఓ మహేష్, సుడా ఏఈలు పాల్గొన్నారు. 24న జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) ఆదేశాల మేరకు ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ (వెటరన్స్) క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను మాస్టర్ వెటరన్ అథ్లెట్స్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు కోరారు. 35 ఏళ్లుపైబడి, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వేర్వేరుగా వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు చెప్పారు. 100, 400, 800, 1500 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, డిస్కస్త్రో, జావెలన్త్రో, రిలే పరుగు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వెటరన్ క్రీడాకారులను ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి శాప్లీగ్ మాస్టర్స్ (వెటరన్) పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల వెటరన్ అథ్లెట్స్ స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఎస్డీఓ సూచించారు. వివరాలకు 9390352942 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఒకేసారి మూడు కొలువులు హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. అటువంటిది ఒకేసారి మూడు బ్యాంకు కొలువులను సాధించాడు హిరమండలం మండలంలోని పిండ్రువాడ గ్రామానికి చెందిన కురమాన జగదీష్. ఇటీవల విడుదలైన స్టేట్బ్యాంక్ క్లర్క్, యూనియన్ బ్యాంకు క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ పోస్టులకు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సత్యవతి సాధారణ వ్యవసాయ కూలీలు. జగదీష్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ను గ్రామస్తులు అభినందించారు. -
దొంగతనాలే వృత్తిగా..
● ఒకరు 22, మరొకరు 7 కేసుల్లో ముద్దాయిలు ● ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు రణస్థలం: దొంగతనాలు చేయడంలో ఆరితేరిన ఓ ముద్దాయికి మరొక ముద్దాయి జైల్లో పరిచమయ్యాడు. ఇరువురు కలిసి దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్నారు. ఒకే నెలలో 10 దొంగతనాలు చేసి ఆపై వచ్చిన సొమ్ముతో జల్సాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నారు. జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్లో సీఐ ఎం.అవతారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 23న లావేరు మండలం ఆర్.ఆర్.వైన్ షాపులో చోరీ జరిగింది. షట్టర్ పగలగొట్టి లోపల క్యాష్ కౌంటర్లో ఉన్న రూ.15 వేలు నగదు, డీవీఆర్ బాక్స్, జీవో రూటర్ బ్యాక్స్ను పట్టుకుపోయారు. షాప్ సేల్స్మెన్ బవిరి రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్పీ కె.మహేశ్వరరెడ్డి ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. నాయని ప్రభుకుమార్ (లవ్లీకుమార్), బైరెడ్డి మోహన్కుమార్ (పండు) ఈ చోరీ చేసినట్లు గుర్తించి శుక్రవారం లావేరు మండలం సుభద్రపురం జంక్షన్ వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. జైల్లో పరిచయం.. విజయవాడకు చెందిన లవ్లీ కుమార్పై గతంలో 22 చోరీ కేసులు ఉన్నాయి. మూడో తరగతి వరకు చదువుకుని 13 ఏళ్లత వయస్సులోనే చిన్న, చిన్న షాపులు, సైకిల్లు, బైకులు, రాగి బిందెలు వంటి దొంగతనం చేస్తుండేవాడు. ఇలా 22 కేసుల్లో ముద్దాయిగా జైలుకు వెళ్లాడు. రాజమండ్రికి చెందిన బైరెడ్డి మోహన్కుమార్ తొమ్మిదో తరగతి వరకు చదివి రైల్వే ఫ్లాట్ ఫాంపై సమోసాలు అమ్ముకుంటూ సెల్ ఫోన్లు దొంగిలిస్తూ నేరాలు చేసేవాడు. ఇద్దరూ రాజమండ్రి సెంట్రల్ జైలులో పరిచయమయ్యారు. జైలు నుంచి జనవరి 31న విడుదలైన తరువాత ఇద్దరూ కలిసి దొంగతనాలు చేయడం మొదలెట్టారు. నెల రోజుల వ్యవధిలోనే విజయవాడ, పెందుర్తి, శ్రీకాకుళం, లావేరు, సబ్బవరం, ఎస్.కోట, బొండపల్లి, రామభద్రపురం వంటి చోట్ల జరిగిన చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. దొంగతనంగా సంపాదించిన సొమ్ముతో విలాసవంతమైన హోటళ్లలో మద్యం సేవించడం, కోల్కత్తా వంటి ప్రాంతాలకు వెళ్లి అసాంఘిక పనులు చేసేవారు. వీరి వద్ద నుంచి రూ.68,800 నగదు, కెమెరా, డీవీఆర్ బాక్స్లు రికవరీ చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ అవతారం తెలిపారు. ముద్దాయిలను పట్టుకున్న లావేరు ఎస్సై కె.అప్పలసూరి, సిబ్బందికి అభినందనలు తెలిపారు. సమావేశంలో లావేరు, రణస్థలం ఎస్సైలు కె.అప్పలసూరి, ఎస్.చిరంజీవి, సిబ్బంది ఉన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం
మందస/వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం గ్రామానికి చెందిన లావేటి మనోజ్(20) గురువారం రాత్రి హరిపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా కొర్రాయి గేటు సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మనోజ్ కార్పెంటర్గా పని చేసేవాడు. తండ్రి సూర్యనారాయణ, తల్లి గౌరి, సోదరుడు వినయ్ ఉన్నారు. మనోజ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మందస ఎస్ఐ కె.కృష్ణప్రసాద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతూ.. రణస్థలం : వరిశాం సమీపంలో ఈ నెల 16న ఓ ప్రైవేటు పాఠశాల బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో లంక మోహన్ అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కారి సీతయ్య గాయపడి శ్రీకాకుళంలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో సీతయ్య(27) శుక్రవారం ఉదయం మరణించినట్లు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
ప్రత్యేక కార్యక్రమాలివే..
● గ్రామంలో 12 రోజుల పాటు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తారు. ● ఈ నెల 22న సాయంత్రం దాసుడు ఇంటి నుంచి దేవరతో బయలుదేరుతారు. టక్కురాణి అమ్మవారికి పూజలు చేసి జెండా ఆవిష్కరణతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు వచ్చే నెల 02న జరిగే రావణ సంహారంతో ముగియనున్నాయి. దాదాపుగా 12 రోజుల పాటు సందడిగా జరిగే ఈ ఉత్సవాలు మొదటి రోజున అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తారు. మరసటి రోజు చిన్న పండగ నిర్వహించి పగటి వేషాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతారు. 2న పెద్ద పండగ నిర్వహించి అమ్మవార్లకు చల్లదనం, మొక్కులు తీర్చుకుంటారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం శ్రీరామనవమి (ఈ నెల 27)న నాడు ముందుగా గ్రామ దేవత బృందావతి అమ్మవారి ఆలయం వద్ద జెండాను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేస్తారు. రామాలయం వద్ద మరో జెండాను ఆవిష్కరించి వేదమంత్రోచ్ఛారణల మధ్య సీతారాములు కల్యాణం నిర్వహిస్తారు. తర్వాత రోజు నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువకులు డ్యాన్స్లు, పగటి వేషాలతో అలరిస్తారు. కర్రసాము, గారడీ, పాండురంగ, రామ నాటకం, రామయ్య పట్టాభిషేకం, కోయి డాన్స్, రావణ దాహనం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ముగిస్తారు. -
ప్రాణం తీసిన వివాదం
● రాత్రివేళ ఎందుకు తిరుగుతున్నావంటూ బంధువును ప్రశ్నించిన టీడీపీ కార్యాలయ మేనేజర్ ● వాగ్వాదానికి దిగిన మరో యువకుడు ● తోపులాటలో గాయపడి మేనేజర్ మృతి ● నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని మండలవీధిలో గురువారం రాత్రి ఇరు వర్గాల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఓ యువకుడి మరణానికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలవీధిలో నివాసముంటున్న గొర్లె మోహన్కృష్ణ (32) గురువారం రాత్రి అదే వీధిలో ఆరుబయట కూర్చున్నాడు. ఈ సమయంలో తన బంధువు కొందరు యువకులతో తిరుగుతూ కనిపించాడు. ఈ రాత్రి వేళ వీరితో ఎందుకు తిరుగుతున్నావని మోహన్కృష్ణ ప్రశ్నించాడు. ఇదే సమయంలో అటుగా వస్తున్న మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన గడ్డి మనోహర్ అనే యువకుడు మోహన్కృష్ణతో వాగ్వాదానికి దిగాడు. తమ వీధి వారితో తిరిగితే తప్పేంటని ప్రశ్నించగా ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. మనోహర్ నెట్టేయడంతో మోహన్కృష్ణ తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడిని ఒకటో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంధువులు ఏం చెబుతున్నారంటే.. మోహన్కృష్ణపై నలుగురు దాడి చేశారని బంధువులు చెబుతున్నారు. దాడి జరిగిన సందర్భంలో మోహన్కృష్ణ బంధువు కూడా అక్కడే ఉన్నా అతను నోరు మెదపకపోవడానికి కారణాలను కూడా కొందరు అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలో తరచూ గంజాయి బ్యాచ్ తిరుగుతుంటారని, ఇది కూడా వారి పనేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషాదంలో కుటుంబ సభ్యులు.. మోహన్కృష్ణ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ మేనేజర్గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతని తండ్రి వెంకటరమణ పార్టీ కార్యాలయ పనులన్నీ చూసేవారు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందడంతో మోహనకృష్ణకు బాధ్యతలు అప్పగించారు. మోహనకృష్ణ సోదరికి వివాహం కాగా, తల్లి లక్ష్మితో కలిసి మండల వీధిలో నివాసం ఉంటున్నాడు. రక్షణ ఏదీ? ఇటీవల కాలంలో శ్రీకాకుళం నగరంలో హత్యలు పెరిగిపోతున్నాయి. కొద్దిరోజుల క్రితమే 80 అడుగుల రోడ్డులో మోహన్ అనే యువకుడ్ని హత్య చేయగా, ఇప్పుడు మోహనకృష్ణ మృత్యువాత పడటం గమనార్హం. -
శ్రీకాకుళం
–8లోనువ్వలరేవులో రామయ్య వైభోగం ● సాగర తీరంలో సీతారాముల పరిణయానికి సర్వం సిద్ధం ● నువ్వలరేవులో రేపటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం ● తరతరాలుగా ప్రత్యేకతను చాటుకుంటున్న మత్స్యకారులు ● ఏప్రిల్ 2 వరకు వేడుకల నిర్వహణ నేటి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా శ్రీకాకుళం: రంజాన్ సందర్భంగా ప్రభుత్వం శనివారం సెలవు ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి, ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డీఈఓ పి.రవిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి, ఓపెన్ స్కూల్ గణితం, భారతీయ సంస్కృతి పరీక్షలను మార్చి 30వ తేదీకి వాయిదా వేసినట్లు చెప్పారు. గతంలో కేటాయించిన ఇన్విజిలేటర్లు, సిబ్బంది అందరూ మారిన తేదీల్లో యధావిధిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. మొక్కజొన్న కొనుగోలులో దళారులదే రాజ్యంగా మారింది. మద్దతు ధర రూ.1600కు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026ఎన్నో సరదాలు గుండెలతో పలకరింపులు ‘ఫజర్’ నమాజు నుంచి ఆక్రీ జుమ్మా దాకా నెలవంక పొడుపు నుంచి రంజాన్ ‘ఈద్’ దాకా.. రంజాన్ మాసం వన్నెల రంగుల దీపం మనిషి మనిషిని కలిస్తే ఆయుష్షు పెరిగే సంతోషం 22 నుంచి ఇంటర్మీడియెట్ స్పాట్ శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ మూల్యాంకనం (స్పాట్ వాల్యుయేషన్) ఈ నెల 22 నుంచి మొదలుకానుందని జిల్లా ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ తెలిపారు. వాస్తవానికి ఈ నెల 21 నుంచి స్పాట్ మొదలుకానుండగా రంజాన్ సెలవును రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20కి బదులుగా 21వ తేదీకి మార్పు చేసిందని గుర్తుచేశారు. ఇప్పటికే సంస్కృతం పేపర్ల వాల్యుయేషన్ జరుగుతోందన్నారు. మిగిలిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. 29న బాలుర క్రికెట్ జట్టు ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా అండర్–19 బాలుర క్రికెట్ జట్టు ఎంపికలను ఈ నెల 29న జరగనున్నాయని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ శుక్రవారం తెలిపారు. చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ క్రీడామైదానం వేదికగా ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు మొదలవుతాయని పేర్కొన్నారు. 2007 సెప్టెంబర్ ఒకటి తర్వాత జన్మించిన వారు అర్హులని స్పష్టంచేశారు. ఆసక్తి, అర్హత కలిగిన క్రీడాకారులు జనన ధృవీకరణ పత్రం, ఆధార్కార్డు, తెలుపు యూనిఫాం, స్పోర్ట్స్ కిట్తో హాజరుకావాలని కోరారు. దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్కు 7 అర్జీలు శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా సత్వర చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. కలెక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ బి.శైలజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏడు దరఖాస్తులు స్వీకరించారు. అందులో దివ్యాంగ పింఛన్ల మంజూరు కోరుతూ 1, బ్యాటరీ వాహనం కోరుతూ 1, సదరం సర్టిఫికెట్ కోరుతూ 1, ఆర్టీసీ బస్ రిజర్వేషన్ సమస్యపై 1, ఉద్యోగ ఉపాధి కల్పించమని కోరుతూ 3 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జనారణ్యంలో జింక మృతి పలాస : అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వచ్చిన జింక రోడ్డు ప్రమాదంలో శుక్రవారం మృతి చెందింది. పలాస మండలం శాసనాం జాతీయ రహదారిలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ వన్యప్రాణి మృత్యువాత పడింది. సమాచారం అందుకున్న వైల్డ్ లైఫ్కు చెందిన ఓంకార్ త్యాడి జింక మృతదేహాన్ని పలాస ప్రభుత్వ పశువుల ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు. అనంతరం పూడ్చిపెట్టారు. కాగా, గ్రావెల్ మాఫియా కంకర కోసం అటవీ ప్రాంతాల సమీపంలోని కొండలను తొలిచేస్తున్నారు. అక్కడ రణగొణ ధ్వనుల వల్ల అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనారణ్యంలోకి వచ్చి ఈ విధంగా మృత్యువాత పడుతున్నాయి. అటవీశాఖ అధికారులు స్పందించి వన్యప్రాణుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని పర్యావరణ, జంతు ప్రేమికులు కోరుతున్నారు. వర్షంతో ఉపశమనం శ్రీకాకుళం/కొత్తూరు : జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతకు గురైన ప్రజానీకానికి వర్షం కొంత ఉపశమనమిచ్చింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రెండు రోజులుగా వాతావరణ శాఖ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు జిల్లావ్యాప్తంగా వర్షం పడింది. కొత్తూరు, కర్లెమ్మ, పారాపురం, మహసింగి తదితర గ్రామాల్లో వర్షం కురవడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. ఐకమత్యంతో ఉత్సవాలు.. తరతరాలుగా వస్తున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఐకమత్యంతో జరుపుకుంటున్నాం. మాఇంటి ఇలవేల్పుగా బృందావతి అమ్మవారిని కొలుసుకుంటూ మాకు ఆదర్శ దైవంగా నిలిచిన శ్రీరాముడు, సీతమ్మలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఏటా వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. – మువ్వల పూర్ణచంద్రరావు, సర్పంచ్ నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు మండలం ఆచారాలకు పెద్దపీట.. తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. వలస కూలీలు ఎక్కడ ఉన్న స్వగ్రామానికి చేరుకుని ఉత్సవాలలో భాగస్వామ్యం అవుతారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామ పెద్దలు, పూజారులు, యువకులు సహకారంతో ఉత్సవాలు జరుపుకుంటాం. – బి.వెంకటేష్, మాజీ ఎంపీటీసీ, నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు మండలం వజ్రపుకొత్తూరు రూరల్: కోదండరాముడి కల్యాణోత్సవానికి జిల్లాలోనే అతిపెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవు(లక్ష్మిదేవిపేట) ముస్తాబవుతోంది. తరతరాలుగా వస్తున్న కుల కట్టుబాట్లు, సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తూ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్తులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఏప్రిల్ 2 వరకు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. అంతటా ప్రత్యేకమే.. స్వగ్రామానికి వలస జీవులు.. తాము ఎక్కడ ఉన్నా గ్రామ దేవత బృందావతి అమ్మవారి చల్లన దీవెనలు, సీతారాముల కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని గ్రామస్తుల విశ్వాసం. అందుకే భారీ వ్యయంతో పెద్ద పండగగా కల్యాణోత్సవం జరుపుకుంటారు. ఈ వేడుకను తిలకించేందుకు వలస జీవులంతా స్వగ్రామానికి చేరుకుంటారు. ఊరంతా వెలుగు.. శ్రీరామ నవమి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో ఊరంతా విద్యుత్ వెలుగులతో విరజిమ్ముతుంది. ఉత్సవాలు తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది జనం తరలివస్తుంటారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల చొరవతో గ్రామస్తులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. స్పీకర్ శుభాకాంక్షలు రంజాన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ముస్లింలందరికీ శుభాకాంక్షలు. రంజాన్ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్ 30న మూలపేట పోర్టు సందర్శన పోలాకి: జిల్లా ప్రజల చిరకాల స్వప్నం మూలపేట పోర్టును ఈ నెల 30న వైఎస్సార్సీపీ ఉన్నత స్థాయి అధికార బృందం సందర్శించనున్న నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ క్షేత్రస్థాయిలో సన్నాహక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మబగాంలో పాతపట్నం నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నేతృత్వంలో ముఖ్యనాయకులతో కృష్ణదాస్ సమావేశమాయ్యరు. కార్యక్రమానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ప్రారంభించి దాదాపు 85 శాతం పనులు పూర్తిచేసిన తరువాత కూడా మిగిలిన పనులు పూర్తిచేయకుండా కూటమి ప్రభుత్వం పోర్టు పట్ల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ముఖచిత్రం మార్చేయాలనే ధ్యేయంతో, వలసల నివారణ కోసం తీసుకున్న ఈ నిర్ణయం క్రెడిట్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందుతుందనే దురుద్దేశంతోనే పోర్టుపై కూటమి నాయకులు కినుక వహిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలతో కలసి పోర్టును సందర్శించి ప్రభుత్వ తీరును ప్రజలముందు ఉంచాలని చెప్పారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ పోర్టులో కనీసం ట్రయల్ రన్ వేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రాంతీయయాత్ర ద్వారా జగన్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పనుల జాప్యాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. హిరమండలం: జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో త్వరలో ప్రత్యేకాధికారుల పాలన అమలుకానుంది. ప్రస్తుతం సర్పంచ్ల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, నిబంధనల ప్రకారం ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక వంటి సాంకేతిక, న్యాయ పరమైన అంశాల కారణంగా పంచాయతీ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల జరిగే వరకు గ్రామ పంచాయతీల పరిపాలనను ప్రత్యేకాధికారులకు అప్పగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీంతో ఆశావహులు మూగబోతున్నారు. జిల్లాలో 912 గ్రామ పంచాయితీలు ఉన్నాయి. ఆయా పంచాయతీల్లో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించే అవకాశం ఉంది. అధికారుల కొరత ఉన్న ప్రాంతాల్లో ఒక అధికారికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. ఆలస్యానికి ప్రధాన కారణాలు... పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి రావాల్సి ఉంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం (ట్రిపుల్ టెస్ట్) రిజర్వేషన్ల అమలుకు ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ను నియమించింది. ఈ కమిషన్ 45 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంది. అనంతరం రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ప్రారంభించడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశముంది. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మారనున్నారు. ఈ ప్రక్రియల్నీ పూర్తయ్యే సరికి పంచాయతీ ఎన్నికలు జూన్ తర్వాతే జరిగే అవకాశం ఉందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక కూటమిలోని నాయకులు, కార్యకర్తలను సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికలు జరిగి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పగ్గాలు చేపడితే నాయకులు, కార్యకర్తలను వందశాతం సంతృప్తి పరచలేమని, ఏడాది పాటు ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరో వైపు ప్రజల్లో అసంతృప్తిని సైతం అంచనా వేసి, ఎన్నికల ను దూరం చేస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక అధికారుల జాబితాపై కసరత్తు గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించేందుకు జిల్లా అధికారులు ఇప్పటికే జాబితా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. తహసీల్దార్లు, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ రాజ్ సహా య ఇంజినీర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, పశు వైద్యాధికారులు,ఆరోగ్యశాఖ సూపర్వైజర్లు, ఉద్యా న శాఖ అధికారులు, ఉప తహసీల్దార్లు తదితర శా ఖ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రత్యేకా ధికారులుగా గెజిటెడ్ అధికారులనే నియమించాల ని ప్రభుత్వం స్పష్టం చేయడంతో టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్ల పేర్లను జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. అయితే అధికారుల కొరత ఏర్పడితే చిన్న పంచాయతీల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, హెడ్మాస్టర్లను కూడా ప్రత్యేక అధికారులుగా నియమించే అవకాశం ఉంది. మండల కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రధాన గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లను పెద్ద జనాభాగల పంచాయతీలకు ఎంపీడీఓలను ప్రత్యేకాధికారులుగా నియమించే ప్రతిపాదనలు ఉన్నాయి. అవసరమైతే ఒక అధి కారికి రెండు లేదా మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించే అవకాశముందని తెలుస్తోంది. ఏప్రిల్ 2తో సర్పంచ్ల పదవీ కాలం ముగింపు జూన్ తర్వాతే పంచాయతీ ఎన్నికలకు అవకాశాలు అప్పటివరకు ప్రత్యేక అధికారుల చేతిలో గ్రామ పాలన ఇది నిజమేనా..? పంచాయతీ ఎన్నికల నిర్వహణ క్రమంపై కూటమి పార్టీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. సాధారణంగా పార్టీ గుర్తులు లేకుండా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో వర్గపోరుకు దారి తీసే అవకా శం ఉందని నాయకులు భావిస్తున్నారు. ఈ ప్రభా వం తర్వాత జరిగే మండల పరిషత్, జిల్లా పరిషత్ (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని జిల్లా నాయకులు అంటున్నారు. అందుకే ముందుగా పార్టీ గుర్తులతో జరిగే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తే కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. -
రిటైర్డ్ డీఎంహెచ్ఓకు రూ.56 లక్షలకు టోకరా
● పుడమి తల్లి పూజలో... శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలోని ఓ రిటైర్డ్ డీఎంహెచ్ఓ సైబర్ మోసానికి గురయ్యారు. కేటుగాళ్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని శనివారం రూ.56.25 లక్షలకు టోకరా వేశారు. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల మేరకు.. పీఎన్ కాలనీలో నివాసం ఉంటున్న రిటైర్డ్ డీఎంహెచ్ఓకు గత ఏడాది డిసెంబర్ 17న ఓ వీడియో కాల్ వచ్చింది. అందులో పోలీస్ గెటప్లో ఉన్న ఓ వ్యక్తి ‘ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులం’ అని చెబుతూ మీరు డీఎంహెచ్ఓగా ఉండేటప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్కు పాల్పడ్డారని, అనేకమంది మహిళలకు సంబంధించి అశ్లీల వీడియోలు, ఇతర ఆధారాలు తమ వద్ద ఉన్నాయని బెదిరిస్తూ.. మిమ్మల్ని అరెస్టు చేయడం తప్పదని, లేదంటే సెక్యూరిటీ డిపాజిట్ కింద కొంత మొత్తం చెల్లించాలని చెప్పారు. దీంతో బాధితుడు డిసెంబర్ 19న రూ.15.75 లక్షలు, 29న రూ. 21.74 లక్షలు, ఈ ఏడాది జనవరి 5న రూ. 18.75 లక్షలు వారు చెప్పిన ఖాతాల్లోకి ఆన్లైన్ లావాదేవీల ద్వారా పంపించాడు. అప్పటికీ వాళ్లు మరో రూ. 18 లక్షలు అడగడంతో తాను సైబర్ మోసానికి గురయ్యానని గ్రహించాడు. ఆన్లైన్ పోర్టల్ లో సైబర్ క్రైమ్ వెబ్సైట్కు ఫిర్యాదు చేశాడు. గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఈశ్వరరావు వెల్లడించారు. -
సమష్టి కృషితో జిల్లా అభివృద్ధి
శ్రీకాకుళం కల్చరల్: నూతన సంవత్సరంలో జిల్లా సమగ్ర అభ్యున్నతికి సమష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో గురువా రం ఘనంగా జరిగాయి. కలెక్టర్, శాసన సభ్యు లు పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి చెందే విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పంచాంగం శ్రవణం శ్రీపరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ పండితులు ధర్మపురి గౌరీశంకరశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు బాగుంటాయని తెలిపారు. ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలు జిల్లాలో ముగ్గురు అర్చకులకు ఉగాది పుర స్కారాలను అందించారు. నగరంలోని కోదండరామాలయం ప్రధాన అర్చకులు బంకుపల్లి శేషాచార్యులకు, గుజరాతీపేట జగన్నాథ స్వా మి దేవాలయం అర్చకులు పెంట సత్యన్నారాయణ శర్మకు, ఎల్ఎన్పేట జగన్నాథ స్వామి దేవాలయం అర్చకులు వినోద్ కుమార్ స్వామి కి ఉగాది పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. శివ శ్రీ నృత్య కళానికేతన్ గురువు శ్రీకాంత్ రఘుపాత్రుని కళా బృందం ప్రదర్శించిన కూచిపూడి, కోలాటం నృత్యాలు ఆహూతులను అలరించాయి. కవులు ఆలపించిన కవితలు అందరినీ ఆకట్టుకున్నాయి. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి ఇచ్ఛాపురం: పట్టణ పరిధిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లుపడ, చిన్నకొండవీధికి చెందిన యువకుడు ఉప్పాడ కుమార్ (23) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు యువకుడు ద్విచక్రవాహనంపై బెల్లుపడ నుంచి పట్టణం వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ గుడి సమీపంలో బెల్లుపడ వైపు వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వస్తున్న యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకొని వివరాలు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి త్రినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ ముకుందరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం కల్చరల్: గార మండలం శ్రీ కూ ర్మంకి చెందిన అంధవరపు బాలకృష్ణ మూర్తి (88) కన్ను మూయగా ఆయన నేత్రాలను దా నం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు, కొడుకు అంధవరపు బాలకృష్ణమూర్తి, అంధవరపు శ్రీనివాస నెహ్రూలు రెడ్క్రాస్కు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, పి.చిన్నికృష్ణల ద్వా రా కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 7842699321 కు సంప్రదించాలన్నారు. -
కళహండి కట్టప్ప
● ప్రదర్శనల్లో అలరిస్తున్న సునీల్ మహానంద ● నటుడిగా, ఫోక్ డ్యాన్సర్గా, గాయకునిగా రాణింపు ● కేరమ్స్లో నేషనల్ ప్లేయర్గా గుర్తింపు కలహండి కట్టప్ప వేషధారణలో సునీల్ మహానంద కంచిలి: ఉత్తరాంధ్రలో ఎక్కడ జాతర జరిగినా విచిత్ర వేషధారణతో ఓ వ్యక్తి కనిపిస్తాడు. ఆడు తూ, ఆట పట్టిస్తూ హుషారుగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటాడు. భారీ కాయంతో జాతర కు సెంటర్ఆఫ్ అట్రాక్షన్గా మారుతాడు. జనం అతడిని ‘కలహండి కట్టప్ప’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ వేషధారణ హాస్యానికే అయినా.. అతడు జానపద గీతాలను అద్భుతంగా పాడగలడు. అంతకుమించి ఆటను రక్తి కట్టించగలడు. జాతీయ స్థాయి కేరమ్స్ పోటీల్లోనూ రాణించాడు. పుట్టుక ఒడిశాలోని కలహండే అయినా మన తెలుగు వారికి అందులోనూ సిక్కోలు వారికి చిర పరిచితుడు. ఈ కట్టప్ప అసలు పేరు సునీల్ మహానంద. స్వస్థలం ఒడిశా రాష్ట్రం. ఇటీవల రథసప్తమి వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అలాగే కంచిలిలో జరిగిన జాతరలో ఈ కలహండి కట్టప్ప తళుక్కున మెరిశాడు. ఓ 20 మందిని వెంటబెట్టుకుని 350 కిలోమీటర్లు ప్రయాణించి కంచిలిలో ప్రదర్శన ఇచ్చాడు. తెలుగు ప్రాంతాల్లో ఎక్కడ జాతర జరిగినా అతడు బండి కట్టి రావాల్సిందే. సునీల్ మహానంద తన గురువు ప్రమోద్కుమార్ నాయక్ వద్ద నాటక రంగంలో శిక్షణ పొందారు. 15 ఏళ్లుగా ఈ వృత్తినే ఎంచుకొని ప్రయా ణం కొనసాగిస్తున్నారు. ఇతడు నటనతోపాటు నేషనల్ ఫోక్ డ్యాన్సర్గాను, గాయకునిగా కూడా రాణిస్తున్నారు. ఇతని స్వగ్రామం కలహండి జిల్లా భవానీపట్నం. కలహండి కట్టప్ప ప్రదర్శనను సంబర మహోత్సవాల్లో స్ట్రీట్ షోలతోపాటు, స్టేజి ప్రదర్శనలు కూడా ఇస్తారు. 20 మంది బృంద సభ్యులతో ఈ ప్రదర్శనలిస్తున్నారు. ఇప్పటి వరకు ఒడిశా రాష్ట్రంలో వివిధ జిల్లాల్లోను, పక్క రాష్ట్రాల్లో ప్రదర్శనలిచ్చారు. సినిమాల్లోనూ రాణింపు సునీల్ మహానంద వీధి ప్రదర్శనలతోపాటు స్టేజి షోలను చేస్తున్నారు. ప్రస్తుతం వీటితోపాటు ఒడి యా సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేశారు. అలాగే షార్ట్స్ ఫిల్మ్లను కూడా చేస్తున్నారు. సమాజానికి అవసరమైన మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్లను కూడా తీస్తుంటారు. వీటితోపాటు ‘నృత్యగాన సాంస్కృతిక అనుస్టాన్’ పేరుతో భవానీపట్నంలో ఫోక్ డ్యాన్స్ అకాడమీని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ‘కలహండి కట్టప్ప’ అనే పేరుతో యూట్యూబ్ చానెల్ను కూడా నిర్వహిస్తున్నారు. -
మాటలన్నీ గ్యాసేనా..?
ప్రతి రోజూ కమర్షియల్ సిలిండర్స్ డిమాండ్ 1000 అక్రమంగా స్టాక్ చేసిన ఏజెన్సీల పై చర్యలు కూడా తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. వచ్చిన వాటిలో కొన్ని ఏజెన్సీలు అక్రమంగా స్టాక్ చేసి, పంపిణీ చేయకుండా నిల్వ చేసి, బ్లాక్లో విక్రయిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరఫరా 100 మాత్రమే. ప్రభుత్వ హాస్టళ్లలో గ్యాస్ కష్టాలు మామూలుగా లేవు. కట్టెల పొయ్యే గతి వినియోగదారులకు గ్యాస్ అందకపోవడంతో కట్టెల పొయ్యి గతిగా మారింది. ప్రధానంగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు వినియోగదారులకు తీవ్రంగా వేధించడంతో చిరుదుకాణదారులు, హోటళ్ల నిర్వాహకులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. దుకాణాలు మూత వేయలేక, అలా అని నడపలేక ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో గ్యాస్ ఏజెన్సీలు: 38 డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు6,12,000 సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: గ్యాస్.. సామాన్య వినియోగదారుడు నుంచి హోటల్ యజమానుల వరకు అందరి నోటా ఇదే మాట. గతంలో గ్యాస్ బుక్ చేసుకుంటే ఒకటి రెండు రోజుల్లో వచ్చేసేది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకొని వారాలు గడుస్తున్నా అందని పరిస్థితి జిల్లాలో నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 38 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా వీటిలో హోటళ్లు, రెస్టారెంట్, చిరు వ్యాపారులు వినియోగించే కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 4,320 ఉన్నాయి. అలాగే గృహ వినియోగదారులు వినియోగించేందుకు డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు 6,12,000 ఉన్నాయి. అయితే ప్రధానంగా కమర్షియల్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకుంటే జిల్లా వ్యాప్తంగా రోజుకి 1,000 గ్యాస్ సిలిండర్లు అందాల్సి ఉండగా నేడు కేవలం 100 సిలిండర్లు మాత్రమే అందటంతో వారు నానా ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలను తెరవలేని దయనీయ దుస్థితిని ఎదుర్కొంటున్నారు. దీంతో భోజన ప్రియులు సైతం ఇబ్బంది పడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్, చిరు దుకాణాల్లో రుచికరమైన భోజనాలు ఆరగించే భోజన ప్రియులు మూత బడిన దుకాణాలు చూసి విస్తుపోతున్నారు. వీటిలో పనిచేస్తున్న వారికి ఉపాధి కరువైంది. కొంత మంది చిరు దుకాణ నిర్వాహకులు దిక్కుతోచని పరిస్థితిలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. కొరత లేదంటూనే... వంటలు చేసేందుకు గృహిణులు సైతం అనేక తంటాలు పడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. ఇంటిలో గ్యాస్ లేక, గ్యాస్ బుక్ చేస్తే ఏజెన్సీలు పెట్టిన కొర్రీలు వంట చేసే మహిళలకు శాపంగా మారాయి. గ్యాస్ లేక కట్టెల పొయ్యిపై వంటలు చేస్తూ పొగతో నానా తిప్పలు పడుతున్నారు. జిల్లాలో గ్యాస్ కొరత ఇంతలా వేధిస్తుంటే అధికారులు మాత్రం కొరత లేదు అంటూ ప్రకటనలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అధికారులు చెప్పినట్లు గ్యాస్ కొరత లేకపోతే తాము గ్యాస్ బుక్ చేసుకుప్పటికీ ఎందుకు సకాలంలో రావడం లేదని లబ్ధిదారులు ఘాటు విమర్శలు చేస్తున్నారు. జిల్లా అధికారులు వారి మెప్పు కోసం ఉత్త గ్యాస్ ప్రకటనలే చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే ప్రజలు పడుతున్న గ్యాస్ కష్టాలు వారి కళ్లకు కనిపిస్తాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాయింట్ కలెక్టర్పై నెపం.. జిల్లా అధికారులు చేసిన ప్రకటనలు నిజమైతే లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండాలి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి ఎక్కడా లేదు. దీనికి కారణం గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ను కృతిమ కొరత సృష్టిస్తున్నాయా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ● కొన్ని ప్రాంతాల్లో ఒక్కో గ్యాస్ సిలిండర్ వినియోగదారుడి అవసరాన్ని బట్టి అదనంగా రూ.300 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. ● డొమెస్టిక్ సిలిండర్లు పంపిణీ చేస్తున్నామని చెబుతున్నా వినియోగదారులకు మాత్రం సకాలంలో అందడం లేదు. ప్రశ్నిస్తుంటే మా చేతిలో ఏమి లేదని, అంతా జేసీ చేతిలో ఉందని చెప్తూ చేతులు దులుపుకుంటున్నారు. ● దీంతో గ్యాస్ కోసం ఏం చేయాలో తెలియక బహిరంగ మార్కెట్లో అధిక డబ్బులు ఇచ్చి మరీ గ్యాస్ను కొనుకుంటున్నామని కొందరు వాపోతున్నారు. జిల్లాలో గ్యాస్ కొరత లేదని జేసీ ప్రకటన గ్యాస్ దొరక్క అల్లాడిపోతున్న లబ్ధిదారులు మూతపడుతున్న చిరు దుకాణాలు -
మంటగలిసిన మానవత్వం
● చిన్నారులను బయటకు తోసేసిన యజమాని ● ఇంటికి తాళాలు వేసిన వైనం ● అర్ధనగ్నంగా ఆరుబయట చిన్నారులు ఇచ్ఛాపురం రూరల్: యజమాని, కింద పనిచేసేవా రి మధ్య జరిగిన గొడవ ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామంలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామానికి చెందిన రైతు లోపింటి వెంకటరమణ వద్ద కోళ్ల మన్మధరావు గత ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్నారు. వీరు దగ్గరి బంధువులు కూడా. దీనికి కృతజ్ఞతగా యజమాని వెంకటరమణ మన్మధరావుకు వివాహం కూడా జరిపించారు. పదేళ్ల కిందట తన ఇంటి పక్కనే ఇల్లు కట్టుకునేందుకు కూడా సమ్మతించారు. అయితే బుధవారం మన్మధరావు, వెంకటరమణ కుటుంబాలకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం కొట్లాటకు దారి తీసింది. దీంతో ఇరువురు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కొట్లాటలో గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తన కింద పనిచేసిన వ్యక్తి తిరుగుబాటు చేయడం సహించలేని రైతు వెంకటరమణ అదే రోజు సాయంత్రం ఇంటికి తాళం వేసేశాడని స్థానికులు చెబుతున్నారు. మన్మధరావు కుమారులు నరేష్, శ్రీనులు బడి విడిచిపెట్టిన తర్వాత బుధవా రం మధ్యాహ్నం తమ ఇంటికి చేరుకున్నాక ఇంటికి తాళం వేసి ఉండడం చూసి హతాశులయ్యారు. తగాదాల్లో మీ తల్లిదండ్రులు ఇచ్ఛాపురం ఆస్పత్రిలో ఉన్నారని, మీ ఇంటికి వెంకటరమణ తాళాలు వేసేశాడంటూ చెప్పడంతో చిన్నారులు తమ యజమానిని తాళాలు తీయాలంటూ వేడుకున్నారు. అయినప్పటికీ కనికరించని యజమాని ఇంటి దగ్గర నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్రహించడంతో చిన్నారులు ఆరుబయటే ఉండటం చూసిన స్థానిక సర్పంచ్ వలపల రంజిత చిన్నారులను చేరదీసి రాత్రి తన ఇంట్లో భోజనం పెట్టి నిద్రపుచ్చారు. గురువారం ఉగాది కావడంతో చిన్నారులు తమ ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లడంతో ఆగ్రహించిన యజమాని నిర్దాక్షిణ్యంగా చిన్నారులను అర్ధనగ్నంగా బయటకు గెంటేసి తలుపులకు తాళాలు వేసేశాడు. స్థానికులు రూరల్ ఎస్ఐకు సమాచారం అందివ్వగా ఎస్ఐ జనార్ధనరావు ఇంటి తలుపులు తీయించి ఫొటోలు తీసి, ఆరుబయట ఉన్న పిల్లలు పరిస్థితిని చూసీ చూడనట్లు వ్యవహరించి మళ్లీ తాళాలు వేయించేశారని స్థానికులు చెబుతున్నారు. -
వంటలు భేష్
● బయో గ్యాస్.. ● గ్యాస్ కష్టాలను అధిగమిస్తున్న హరేకృష్ణ అక్షయపాత్ర ● రోజుకు 30వేలకు పైగా భోజనాల పంపిణీ ● కేవలం బాయిలర్లతోనే భోజనాల తయారీ బయో గ్యాస్ ద్వారానే వంట.. అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటకాలకు గాను రోజుకు పది సిలిండర్లు అవసం కాగా కేవలం ఐదు సిలెండర్లను వాడుతూ మిగిలినది పునరుత్పాదక ఇంధనాల ద్వారానే వంట చేస్తోంది. ప్రధానంగా మిగిలిపోయిన కూరగాయలు, మిగిలిన భోజనాలు ఈ బయోగ్యాస్ ప్లాంట్లో ఉపయోగించి రోజుకు 15 నుంచి 20 కిలోల గ్యాస్ను ఉత్పత్తి చేస్తోంది. పెద్ద పెద్ద యంత్రాలను ఉపయోగించి కేవలం నీటి ఆవిరి ద్వారానే పప్పు, అన్నం, కూరగాయల కు సంబంధించి వంటను తయారు చేస్తోంది. వీటన్నింటికీ బ్రికెట్స్ బాయిలర్ ద్వారా గ్యాస్ ఉత్పత్తి చేస్తూ వంట చేస్తోంది. వీటితో పాటు అదనంగా చెక్కపొడి, కొబ్బరిపీసు, వేరుశనగ పొట్టుతో కలిసి పునరుత్పాదక శక్తి వనరుల ద్వారానే అక్షయపాత్రలోని వంటకాలు నిర్విరామంగా తయారు చేస్తున్నారు. ఈ దిమ్మలను బాయిలర్లో వేడి చేయడం ద్వారా వచ్చే వేడితో వంట చేస్తున్నారు. అలాగే సోలార్ ద్వారా రోజుకు 450 యూనిట్ల కరెంటు ఉత్ప త్తి చేస్తూ వంటశాలకు నిర్వహిస్తున్నారు. పాఠశాలలకు భోజనాలు సరఫరా చేసే వాహనాలను సైతం ఎలక్ట్రికల్ వెహికిల్స్నే వాడుతున్నారు.శ్రీకాకుళం రూరల్: ప్రపంచమంతా సిలిండర్ భారాన్ని మోస్తుంటే హరేకృష్ణ సంస్థకు చెందిన అక్షయ పాత్ర మాత్రం గ్యాస్ కష్టాలు దరి చేరకుండా వండి వారుస్తోంది. కేవలం బాయిలర్లతోనే భోజనాలు తయారు చేస్తోంది. శ్రీకాకుళం మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 312 మంది విద్యార్థుల కోసం అప్పట్లో అక్షయ పాత్ర మొదలుపెట్టారు. నేడు శ్రీకాకుళంతో పాటు, గార, ఆమదావలస పాఠశాలకు సైతం 18వేల మంది విద్యార్థులకు నిత్యం భోజనాలు అందిస్తోంది. వీటితో పాటు హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో 9 అన్న క్యాంటీన్లకు గాను పదివేలు భోజనాలు సైతం ఈ సంస్థే సరఫరా చేస్తోందని సంస్థ పర్యవేక్షకులు తిలారి శ్రీనివాస్ తెలిపారు. -
‘తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత’
శ్రీకాకుళం కల్చరల్: తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వీసీ డాక్టర్ కేఆర్ రజిని అన్నారు. తెలుగు రచయితల వేదిక (తెరవే) ఆధ్వర్యంలో శుక్రవారం ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన ఉగాది సంబరాలు, పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజిని ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తెలుగు కవులు, జర్నలిస్టులు, రచయితలు తెలుగు భాషా సాహిత్య సంస్థల ద్వారా తెలుగు భాషను పరిరక్షిస్తున్నారని పేర్కొన్నారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ, తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతుల ప్రచారానికి తెరవే చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెరవే సభ్యుడు తోట గోపాలరావు రచించిన తోట వారి కథలు, స్పందన కవితా సంపుటి పుస్తకాలను వైస్ చాన్స్లర్ కేఆర్ రజిని ఆవిష్కరించి పంపిణీ చేశా రు. స్పందన కవితా సంపుటిని డాక్టర్ ముట్నూరు ఉపేంద్ర శర్మ సమీక్షించగా, తోట వారి కథలు పుస్తకాన్ని పీఎస్ నాగరాజు సమీక్షించారు. కవి సమ్మేళనలో కిల్లాన శ్రీనివాస్, భోగిల ఉమామహేశ్వరరావు, ఇద్ది పాపయ్యల నిర్వహణలో 50 మంది కవులు పాల్గొని స్వీయ కవితలను వినిపించారు. భోగిల ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఐఎన్డీ ప్రసాద్, ఇద్ది పాపయ్యలు తొలుత ప్రతిస్పందన అనే నాటికను ప్రదర్శించారు. -
21న అప్పలసూరి వర్ధంతి
నరసన్నపేట: శ్రీకాకుళం నక్సల్బరీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అమరవీరుడు మామిడి అప్పలసూరి అని సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ అన్నారు. కోమర్తిలో అమరవీరుల స్థూపం వద్ద 21న కోమర్తిలో 29 వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోమర్తిలో గురువారం ఉదయం ఈ మేరకు కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ గ్రామంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పలసూరి చూపించిన పోరాట మార్గాన్ని అనుసరించి నూతన ప్రజాస్వామిక విప్లవ సాధన కోసం ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపు నిచ్చారు. సమస్యల పరి ష్కారానికి పోరాటమే సరైన మార్గమని అన్నారు. 21న ఉదయం 10 గంటల నుంచి కోమర్తిలో వర్ధంతి సభ నిర్వహిస్తామని పార్టీ కార్యకర్తలు, అప్పలసూరి అభిమానులు, కోమర్తి ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనసెట్టి రాజశేఖర్, ఐఎఫ్టీయూ జిల్లా నాయకురాలు సవలాపురం కృష్ణవేణి, న్యూ డెమొక్రసీ జిల్లా నాయకులు నేతింటి నీలం రాజు, ఏఐకెఎంఎస్ జిల్లా నాయకులు బగ్గు భాస్కరరావు, కోమర్తి కాలనీ వాసులు కొల్లి చిన్నబాబు, పెదలాపు దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఏడాది నీటి కష్టాలు తప్పవా..?
● ఏడాదిగా మరమ్మతులకు నోచుకోని ఆర్వో ప్లాంట్ ● టెక్కలి ఆస్పత్రిలో రోగులకు తప్పని తాగునీటి కష్టాలు టెక్కలి రూరల్: ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలోని ఉన్న ఆర్వో ప్లాంట్ గత ఏడాదిగా పని చేయడం లేదు. ఆస్పత్రికి వస్తున్న రోగులు తాగునీటికి తంటాలు పడు తున్నారు. ఎప్పటికప్పుడు దీనిపై ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ దాన్ని బాగు చేయకపోవడంతో ఈ ఏడాది సైతం నీటి కష్టాలు తప్పేలా లేవని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వేసవిలో ఆర్వో ప్లాంట్ మరమ్మతులకు గురైంది. ఆ ఏడాది ఆస్పత్రికి వచ్చే రోగులు తాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డారు. నీటి బాటి ల్స్ కోనుగోలు చేసుకుని తాగేవారు. కొంత మంది తమ ఇళ్ల నుంచి నీరు తెచ్చుకునే వారు. అప్పట్లో ‘సాక్షి’లో వచ్చిన వార్తలకు స్పందించి రోగులకు క్యాన్లతో నీటిని ఏర్పాటు చేశారు. అయినప్పటికి పూర్తిస్థాయిలో రోగులకు తాగునీరు అందివ్వలేకపోయారు. ఈ ఏడాది అయినా ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించి రోగులకు తాగునీరు అందిస్తారనే ఆశ ఉన్నప్పటికీ.. ఇంత వరకు ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. వేసవిలో సైతం తాగునీటికి తంటాలు తప్పేలా లేవని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఆర్వో ప్లాంట్ మరమ్మతులు చేయించాలని పలువురు కోరుతున్నారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ నుంచి ఉర్లాం రైల్వే స్టేషన్ వెళ్లే మార్గ మధ్యంలో గురువారం రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందారని శ్రీకాకుళం రోడ్డు జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదన రావు తెలిపారు. రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసి శ్రీకాకు ళం సర్వజన ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించామని తెలిపారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని, సమాచారం తెలిసిన వారు జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు. బంగారం కొనుగోలులో గందరగోళం కొత్తూరు: ఉగాది నాడు కొత్తూరులో బంగారం కొనుగోలుదారులు గందరగోళానికి గురయ్యారు. ఉగాది నాడు బంగారం కొనుగోలు చేయడం చాలా మందికి సంప్రదాయం. ఉగా ది రోజు ఉదయం ఒక గ్రాము బంగారం ధర రూ.15,800 చూపించింది. సాయంత్రానికి రూ.14,900కు తగ్గింది. అయితే కొత్తూరులోని పలు షాపుల్లో తగ్గిన ధర కాకుండా ఉదయం ధరకే బంగారం విక్రయించారు. కొనుగోలుదారులు తర్వాత విషయం తెలుసుకుని నష్టపోయామని లబోదిబోమన్నారు. ఒకే ఊరిలో ఒక్కో షాపులో వేరు వేరు ధరలతో బంగారం విక్రయాలు జరగడంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్లో ఆల్ ఇండియా 248వ ర్యాంక్ పొందూరు: మండలంలోని ధర్మపురం గ్రామానికి చెందిన మొదలవలస రాజ్కుమార్ గేట్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచాడు. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గేట్ ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంక్ 248 పొందాడు. ప్రస్తుతం రాజ్కుమార్ ఐఐటీ ధన్బాద్లో కృత్రిమ మేథస్సు, డేటా సైన్స్ విభాగంలో పరిశోధనలు చేస్తున్నారు. రాజ్కుమార్ తండ్రి మొదలవలస గోవిందరావు మెడికల్ బిజినెస్ చేస్తుంటారు. తల్లి మొదలవలస జయసుధ గృహిణి. గేట్లో 544వ ర్యాంకు సంతబొమ్మాళి: బోరుభద్ర పంచాయతీ గొదలాం గ్రామానికి చెందిన పిలక పవన్కుమార్ గేట్ ఎంట్రన్స్టెస్ట్లో ఆల్ ఇండియాలో 544వ ర్యాంకు సాధించారు. ప్రాథమిక విద్య బోరుభద్రలోని ప్రైవేటు పాఠశాలల్లో, వెన్నెలవలస నవోదయలో ఇంటర్మీడియెట్ వరకు చదివాడు. ఫిబ్రవరి 8న జరిగిన గేట్ ఎంట్రన్స్ లో ఆల్ ఇండియా ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు రమేష్బాబు, కళావతమ్మ గ్రామస్తులు అభినందించారు. టెక్కలి: కోటబొమ్మాళి మండలం కురుడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లఖినేని కిరణ్కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశు వైద్యాధికారిగా ఎంపికై గురువారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా అవార్డును అందుకున్నారు. పశువుల పునరుత్పత్తి విభాగంలో 2012 – 2026 వరకు కృత్రిమ గర్భధారణ లక్ష్యాలను పూర్తి చేయడంలో కిరణ్కుమార్ చేసిన సేవలకు ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాతో పాటు టెక్కలి డివిజన్ పరిధిలో గల పశు సంవర్ధక శాఖ సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు. -
రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్య
● కత్తిపోట్లకు 19 ఏళ్ల యువకుడు బలి ● మరొకరి పరిస్థితి విషమం ● ఇసుకతోటలో దారుణం ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాల యం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనీల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సిలింగ్లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి.. రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనీల్పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. గతంలో ఇతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్, ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనీల్కు, వెంకటేష్కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం రాత్రి అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనీల్ తర ఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనీల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్లపై దాడి చేశాడు. బలమైన కత్తిపో ట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్ను వెంటనే కేజీహెచ్కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు. రౌడీషీటర్ అనీల్ వెంకటేష్(ఫైల్) -
82 సెలవులు
232 పనిదినాలు.. శ్రీకాకుళం న్యూకాలనీ: నూతన విద్యా సంవత్సరానికిగాను జూనియర్ కళాశాలల్లో ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో సెకెండియర్ విద్యార్థులకు ఆ రోజు నుంచే తరగతులు మొదలు కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్మీడియెట్ బోర్డు డైరెక్టర్/సెక్రటరీ పి.రంజిత్భాషా అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఇంట ర్మీడియెట్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలల్లో ఇటీవలి ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సెకెండియర్ తరగతులను ఏప్రిల్ ఒకటి నుంచి మొదలుపెడతా రు. వాస్తవానికి గత ఏడాదికి ముందు వరకు ఏటా జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతుండేవి. గత విద్యా సంవత్సరం నుంచి ఏప్రిల్ ఒకటి నుంచే తరగతుల ను నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. అలాగే ప్రైవేటు కాలేజీలకు పోటీగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ ప్రవేశాలకు అ డ్మిషన్లు మొదలుపెట్టాల ని ఆదేశాలు జారీ చేశారు. నాడు–నేడుతో ప్రభుత్వ కాలేజీలకు కొత్తశోభ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం అడ్మిషన్ డ్రైవ్స్ (క్యాంపెయినింగ్లు) నిర్వహించారు. ిఫిబ్రవరి, మార్చి నెలల్లో కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న సర్కారీ పాఠశాలల్లో, గ్రామా ల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా వసతులు, సౌకర్యాలు, ల్యాబ్లు, డిజిటల్ వి ద్య, ఐఎఫ్పీ ప్యానెల్స్ పెరిగాయి. డొక్కా సీతమ్మ పేరిట మధ్యాహ్న భోజనం అమలుచేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేందుకు ఇంటర్ విద్య డైరెక్టర్ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 164 కాలేజీలు ఫంక్షనింగ్.. జిల్లాలో అన్ని యాజమాన్య జూనియర్ కళాశాలలు 164 ఫంక్షనింగ్లో ఉన్నాయి. వీటిల్లో 38 ప్రభుత్వ, 13 మోడల్, 25 కేజీబీవీలు, 9 సోషల్వెల్ఫేర్, ఒక ట్రైబల్, 6 హైస్కూల్ ప్లస్, రెండు కో ఆపరేటివ్, 70 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఫస్టియర్ పరీక్షలు రాసిన 19850 మంది విద్యార్థులు సెకెండియర్ తరగతుల్లో కూర్చోనున్నారు. 82 సెలవులు.. 2026–27 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలలు 232 రోజులు పనిచేయనున్నాయి. 2026 ఏప్రిల్ 1న కాలేజీలు మొదలుకానుండగా, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీగా ప్రకటించారు. మళ్లీ జూన్ 1వ తేదీన పూర్తిస్థాయిలో కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఆఖరి పనిదినంగా 2027 మార్చి 18గా నిర్ణయించారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 18 వరకు మొత్తం 314 రోజులు ఉండగా ఇందులో ఇందులో 232 రోజులు కళాశాలలు పని చేయనున్నాయి. 2026–27 అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఇంటర్ బోర్డు ఏప్రిల్ 1 నుంచి సర్కారు జూనియర్ కళాశాలల్లో తరగతులు ప్రారంభం ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు జూన్ ఒకటి నుంచి కళాశాలలు పునఃప్రారంభం అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం ప్రభుత్వ కళాశాలల్లో అన్ని వసతులు, సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, బ్యాగులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అమలవుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ఇంటర్ విద్య ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. అన్ని కాలేజీలు అకడమిక్ క్యాలెండర్ను విధిగా పాటించి, అమలుచేయాల్సి ఉంటుంది. – రేగ సురేష్కుమార్, ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ/ఆర్ఐఓ శ్రీకాకుళం -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
కంచిలి: మండలంలోని గోకర్ణపురం కాలనీకి చెందిన బల్ల వైకుంఠరావు(40) అనే వ్యక్తి రెండు కిడ్నీలు పాడై బుధవారం మృతి చెందారు. మృతుడు చైన్నెలో ఉపాధి పొందుతుండేవాడు. సుమారు మూడు నెలల క్రితం వ్యాధిని గుర్తించాడు. అనారోగ్యం ఏర్పడడంతో విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స పొందుతుండేవాడు. అయితే ఆయన మృతి చెందడంతో చితికి భార్య గౌరి తలకొరివి పెట్టింది. వారి పెద్ద కుమారుడు చరణ్ విజయనగరంలోని బాలాజీ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా మొదటి సంవత్సరం చేస్తున్నాడు. పరీక్షలు రాస్తుండడంతో రావడం కుదరకపోవడం, ఆరో తరగతి చదువుతున్న కుమార్తె హారిక ఇంటి వద్దే ఉన్నప్పటికీ.. తనకు కూడా గుండెలో రంధ్రం ఏర్పడడంతో అనారోగ్యంతో ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితిల్లో మృతుని భార్యే చితికి నిప్పు పెట్టింది. పేద కుటుంబానికి చెందిన యజమాని మృతి చెందడం, మరోవైపు మృతిని కుమార్తె కూడా గుండె జబ్బుతో బాధపడుతుండడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
హమ్మయ్యా..!
● ముగిసిన ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ● ఇళ్లబాట పట్టిన విద్యార్థులు ● ఈనెల 21 నుంచి వాల్యూయేషన్ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ముగిశాయి. ఇక మూల్యాంకనమే మిగిలి ఉంది. ఈనెల 17వ తేదీతో ఇంటర్ ప్రథమ సంవత్సరం రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగియగా.. బుధవారంతో ద్వితీయ సంవత్సరం (సీనియర్ ఇంటర్) రెగ్యులర్ కోర్సుల పరీక్షలు ముగిశాయి. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి జిల్లాలో 71 పరీక్ష కేంద్రాల్లో ఫిబ్రవరి 23వ తేదీన మొదలైన ఈ పరీక్షలు ప్రభుత్వ సెలవులు మినహా.. మిగిలిన అన్ని రోజుల్లో 20 రోజులపాటు పరీక్షలు నిర్విరామంగా జరిగాయి. అయితే జిల్లాలో అతి తక్కువ కేంద్రాల్లో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే విద్యార్ధులు రాసే పలు బ్రిడ్జ్ కోర్సుల పేపర్లకు మార్చి 24వ వరకు పరీక్షలు జరగనున్నాయి. 259 మంది గైర్హాజరు ఇదిలా ఉండగా పరీక్షల్లో భాగంగా బుధవారం సెట్–2 ప్రశ్నాపత్రంతో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కెమిస్ట్రీ పరీక్ష రాశారు. జిల్లావ్యాప్తంగా 71 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 15,624 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 15,365 మంది పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు హాస్టల్స్, వసతి కేంద్రాల్లో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రయాణికులతో కిటకిటలాడింది. మాల్ ప్రాక్టీసు కేసులు నిల్ ఈ ఏడాది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీసులు నమోదుల(డీబార్లు) కాకపోవడం విశేషం. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక్క మాల్ ప్రాక్టీసు కేసు కూడా నమోదు కాకపోడం ఇదే తొలిసారి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 2023లో సీసీ కెమెరాలతో ఆన్లైన్ స్ట్రీమింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఈ విధానంతో పరీక్ష కేంద్రాలపై అధికారులు పక్కా నిఘా ఉంచారు. నిరంతరం పర్యవేక్షించారు. ఆర్ఐఓ రేగ సురేష్కుమార్ నేతృత్వంలో డీఈసీ కమిటీ సభ్యులు బి.శ్యామ్సుందర్, ఎస్.భీమేశ్వరరావు, ఎస్.అన్నపూర్ణారావుతోపాటు సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు జరిపినప్పటికీ ఎలాంటి మాల్ ప్రాక్టీసులు నమోదు కాలేదు. మూల్యాంకనకు ఏర్పాట్లు కాగా ఈనెల 21వ తేదీ నుంచి శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల కేంద్రంగా ఇంటర్మీడియట్ జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ మొదలుకానుంది. వివిధ విడతలుగా జరగనున్న ఈ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకుగాను అధికారులు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేస్తున్నారు. ప్రధాన ద్వారంతోపాటు దిద్దుబాటు జరిగే అన్ని గదుల్లోనూ సీసీ కెమెరాలను అమర్చడంతోపాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. వాల్యూయేషన్లో పాల్గొనే అధికారులు, ఎగ్జామినర్లు, సిబ్బంది నియామకం ఉత్తర్వులను ఆయా కాలేజీల లాగిన్లలో ఇంటర్మీడియట్ బోర్డు పొందుపర్చింది. -
దివ్యాంగులకు అండగా ఉంటాం
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం సందర్భంగా కలెక్టరేట్లో దివ్యాంగ ఉద్యోగులు, ఇతర దివ్యాంగులకు బుధవారం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో మాట్లాడి అర్హతలు తెలుసుకున్నారు. వారి అర్హతకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి అధికారిని పిలిచి వారు చేయగలిగే ఉద్యోగం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కు వెళ్లి అందరూ పరిశీలన చేసి, ఏం అవసరమో తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, కలెక్టరేట్ పరిపాలనాధికారి జీఏ సూర్యనారాయణ, తహసీల్దార్ గణపతిరావు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు, ఆర్ఐ లింగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 12.70 లక్షల మందికి లబ్ధి
● మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం రూరల్: రాష్ట్రంలో 12.70 లక్షల మంది దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పథకం (ఉచిత బస్సు ప్రయాణం) కింద లబ్ధి చేకూరనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలియజేశారు. బుధవారం ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి శ్రీకాకుళంలోని రాగోలు వద్ద దివ్యాంగ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రాగోలు నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఉచిత బస్సు సర్వీసును ప్రారంభించినట్లు చెప్పారు. దివ్యాంగులకు ఉన్న శాతాన్ని బట్టి పెన్షన్ను అర్హులందరికీ అందిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. జిల్లాలో 32 వేల మందికి దివ్యాంగుల పెన్షన్ను అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాశాఖాధికారి సీహెచ్ అప్పలనారాయణ, రాష్ట్ర ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ డైరక్టర్ పీఎంజేబాబు పాల్గొన్నారు. -
18వ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భూమి కోసం, ఉపాధి హామీ కోసం, సామాజిక న్యాయం కోసం పోరాడే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 18వ మహాసభలు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలో సుందరయ్య భవన్లో గోపి అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగరాపు సింహాచలం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 1934లో నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య నిర్మించారని, ఆయన స్ఫూర్తితో జిల్లాలో చౌదరి తేజేశ్వరరావు లాంటి నాయకుల నాయకత్వంలో వెనుక బడిన మన జిల్లా అభివృద్ధికి పేదలకు భూ పంపిణీ చేయాలని ఉద్యమాలు, పోరాటాలు చేసిన చరిత్ర ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. ప్రభుత్వం సేకరిస్తున్న భూములు ఎక్కువ భాగం దళితులు, ఇతర పేదల ఆక్రమణలో ఉన్న భూములేనని, గ్రామీణ పేదలకు పని హక్కుగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వంశధార నిర్వాసితుల హక్కుల కోసం నిర్బంధాలను ఎదురించి సమరశీల పోరాటాలు చేసి నిర్వాసితుల పక్షాన పోరాడిన సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె.నవీన్, కె.చింటు, వినాయక్, పి సురేష్, శంకర్, రాకేష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
● ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇచ్ఛాపురం రూరల్: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఎమ్మెల్సీ నర్తు రామారావు మండిపడ్డారు. స్థానిక విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేసిన వికృత చేష్టలు ప్రజలను కలచివేశాయని, ఇలాంటి ఘటనలు ప్రభుత్వ పరువు తీసేలా ఉన్నాయని అన్నారు. ఇదే సమయంలో డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ వంటి వ్యక్తులు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండటం కూటమి ప్రభుత్వం నైతిక విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతోందని దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, కూటమి ఎమ్మెల్యేలు అఘాయిత్యాలకు పాల్పడినా వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజలకు మంచి పాలన అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు వివాదాలు, అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని, ఎంపీ పుట్టా మహేష్కుమార్ యాదవ్ను వెంటనే పదవుల నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
అంగన్వాడీ కార్యకర్తపై దాడి
ఇచ్ఛాపురం రూరల్: వ్యక్తిగత కక్షలు పెంచుకున్న బంధువులు విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తపై కర్రతో దాడి చేసిన ఘటన మండలంలో కలకలం సృష్టించింది. స్థానిక రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాయితారి అంగన్వాడీ కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న లోపింటి లక్ష్మీభాయికి, సమీప బంధువులు కోళ్ల మన్మథరావు, తేజేశ్వరి దంపతులకు కాలువ విషయమై వ్యక్తిగత సమస్యతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కార్యకర్త లక్ష్మీభాయి వద్దకు వెళ్లిన మన్మథరావు దంపతులు వాగ్వాదానికి దిగారు. వీరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో సహనం కోల్పోయిన దంపతులు.. కర్రతో లక్ష్మీభాయి తలపై దాడి చేయడం తీవ్ర రక్తస్రావమైంది. దీంతో స్పందించిన స్థానికులు హుటాహుటిన ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రిలో చేర్పించారు. రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ జనార్థనరావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
సమగ్ర శిక్ష గత ఏపీసీ శశిభూషణ్ సస్పెన్షన్
శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న సంపత్ రావు శశిభూషణ్ గతంలో సమగ్ర శిక్ష అభియాన్లో ఏపీసీగా పనిచేసినప్పుడు కోర్టు ఉత్తర్వులను అమలు చేయని కారణంగా ఆయన్ని సస్పెండ్ చేయాలని ఆదేశించడంతో దాన్ని అమలు చేస్తూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. శశి భూషణ్ రావు కంటే ముందు ఏపీసీగా పనిచేసిన జయ ప్రకాష్ జిల్లాలో కేజీబీవీలో సీఆర్పీలుగా పనిచేస్తున్న కొందరిని తొలగించారు. దీనిపై ఆయా సీఆర్టీలు హైకోర్టును ఆశ్రయించారు. ఇది జరిగిన సందర్భంలో జయప్రకాష్కు బదిలీ అవ్వగా శశిభూషన్ ఏపీసీగా బాధ్యతలు స్వీకరించారు. తొలగించిన సీఆర్టీలను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దీన్ని శశిభూషణ్ రావు అమలు చేయకుండా ఉండిపోయారు. దీంతో బాధిత సీఆర్పీలు కోర్టు తీర్పును అమలు చేయలేదని మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగ్రహం చెందిన హైకోర్టు న్యాయమూర్తి సమగ్ర శిక్ష రాష్ట్ర అధికారిని వివరణ కోరారు. దీనిపై ఎస్పీడీగా తాను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని ఉత్తర్వులు జారీ చేశానని, జిల్లా స్థాయిలో దాన్ని అమలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఈ కారణంగా అప్పటి ఏపీసీ శశిభూషణ్ రావును సస్పెండ్ చేయాలని కోర్టు ఆదేశించడంతో సమగ్ర శిక్ష అధికారులు ప్రస్తుతం శశిభూషణ్ పనిచేస్తున్న ఉన్నత విద్యాశాఖ అధికారులకు విషయాన్ని పొందుపరిచారు. వీటిని పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేస్తూ రెండు రోజుల కిందట ఉత్తర్వులు వెలువరించారు. అయితే దీన్ని కళాశాల ప్రిన్సిపాల్ పోలి నాయుడు అమలు చేయకుండా తాత్సారం చేశారు. దీనిపై ఎవరు అడిగినా ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయని, ఈ కారణంగానే అమలు చేయలేదని చెబుతూ, సస్పెన్షన్ ఉత్తర్వులను వాట్సాప్లో పంపించడం వల్ల, దాన్ని డిలీట్ చేసేశానని చెబుతూ వచ్చారు. అయితే బుధవారం సాయంత్రం సరికి సస్పెన్షన్ ఉత్తర్వులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. దీనిని అమలు చేయకపోవడంపై దళిత సంఘాలు మండిపడుతూ గురువారం ఆందోళన చేపట్టాలని నిశ్చయించాయి. హైకోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్ , కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
అసభ్యంగా ప్రవర్తిస్తే గట్టిగా ఎదిరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అమ్మాయిలపై బంధువులు, స్నేహితులు లేదా ప్రయాణాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, శరీర భాగాలపై అనుచితంగా చేతులు వేసినా భయపడకుండా వెంటనే ఎదురించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. నగరంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని ఆర్సీఎం సెయింట్ జాన్స్ స్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల భద్రత కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నాల్సా) రూపొందించిన స్నేహ పూర్వక న్యాయ సేవలు వారి రక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆపదలో ఉన్నప్పుడు లేదా వేధింపులకు గురైనప్పుడు విద్యార్థులు వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098, పోలీసు 100 లేదా ఉచిత న్యాయ సేవల నంబర్ 15100కు సమాచారం అందించాలని సూచించారు. పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, సిస్టర్ జ్యోత్స్న, టి.సుమంజలి పాల్గొన్నారు. -
మానసిక దివ్యాంగురాలిపై అత్యాచారం
కవిటి: మండలంలోని ఒక పంచాయతీలో మానసిక దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని కవిటి పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేశారు. ఈ కేసును ఇచ్ఛాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నంనాయుడు విచారణ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి స్వాధీనం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరిగ్రామం, కరజాడ పరిసర ప్రాంతం మడపాం వంతెన ఇసుక ర్యాంప్ వద్ద బుధవారం రెండు కేజీల గంజాయితో బగ్గు నవీన్, అమర్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సివిల్స్ విజేత రాముకు ఎస్పీ ప్రశంసలు శ్రీకాకుళం క్రైమ్: సివిల్స్లో 463వ ర్యాంకు సాధించిన జి.సిగడాం మండలం నడిమివలసకు చెందిన సౌరోతు రామును ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రశంసించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు సివిల్ సర్వీసెస్లో ఉన్నత ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాము సాధించిన ర్యాంకు ఆధారంగా ఐపీఎస్, ఐఏఎస్ సేవల్లో ఎంపికయ్యే అవకాశాలున్నాయన్నారు. భర్తను కోల్పోయినా కృంగిపోకుండా రాము తల్లి కూలి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తూ కొడుకును ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమని కొనియాడారు. జిల్లా యువత రామును ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
పంచాంగ శ్రవణం
పోలాకి: మండలంలోని మబగాంలో పరాభవ నామ సంవత్సరం పురస్కరించుకొని బుధవారం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రాబోయే మార్పు లు, వాతావరణం, రాజకీయ, సామాజిక అంశాలపై శృంగవరపు లక్ష్మీధనుంజయశర్మ పంచాగ పఠనంలో స్పష్టంగా తెలియజేశారని కృష్ణదాస్ అన్నారు. స్వగ్రామంలో తోటి రైతులు, గ్రామస్తులతో కలిసి పంచాంగ శ్రవణంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అభిమానులు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. -
ఐఐటీ మద్రాస్తో ఆదర్శ పాఠశాల ఒప్పందం
రణస్థలం: మండలంలోని కొండములగాం ఆదర్శ పాఠశాల విద్యా ప్రమాణాల ఉన్నతీకరణలో భాగంగా ప్రతిష్టాత్మక ఐఐటీ మద్రాస్తో స్కూల్ కనెక్ట్ అనే ప్రొగ్రాం ద్వారా ఆన్లైన్ కోర్సులను అందించేందుకు ఒప్పందం జరిగిందని ప్రిన్సిపాల్ పొట్నూర్ శ్రీధర్ తెలిపారు. మండలంలోని విద్యార్థులు ఇంటర్లో అడ్మిషన్ తీసుకోవడం ద్వారా ఈ గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పదో తరగతి పరీక్షకు 87 మంది గైర్హాజరు శ్రీకాకుళం: జిల్లాలో బుధవారం జరిగిన పదో తరగతి హిందీ పరీక్షకు 87 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 28,539 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 28,452 మంది పరీక్ష రాశారు. 145 కేంద్రాల్లో పరీక్ష జరగగా, డీఈఓ ఏడు కేంద్రాలను, జిల్లా పరిశీలకులు ఆరు కేంద్రాలను పరిశీలించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 9 కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ 47 కేంద్రాల్లో తనిఖీలు జరిపాయి. ఇది ఎలా ఉంటే తొమ్మిది కేంద్రాల్లో జరిగిన ఓపెన్ స్కూల్ 10వ తరగతి పరీక్షలకు 82 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 591 మంది విద్యార్థులకు గాను 509 మంది పరీక్ష రాసినట్లు డీఈఓ రవిబాబు చెప్పారు. భూములు ఇచ్చేది లేదుటెక్కలి: పోర్టు ఆధారిత పరిశ్రమలకు తమ భూములు ఇచ్చేది లేదంటూ టెక్కలి మండలం పాతనౌపడ గ్రామంలో రైతులు, గ్రామస్తులు బుధవారం రాత్రి నిరసన తెలిపారు. ‘రైతుల భూము లు కార్పొరేట్లకు కట్టబెట్టవద్దు, పోర్టు ఆధారిత పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదు, ప్రాణాలైనా అర్పిస్తాం–భూములను కాపాడుకుంటాం’ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అప్పలరెడ్డి, సర్పంచ్ ప్రతినిధి డి.లోకేశ్వర్రెడ్డి, రామా రావు, యోగితో పాటు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
కృత్రిమ మేధ.. వికృత నీడ
మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది. టెక్కలి : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కఠిన శిక్షలు» ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. » ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడితే సెక్షన్ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. » ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. » మరొకరి సంతకాన్ని డిజిటల్ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. » వీటితో పాటు ఫేక్ న్యూస్ సృష్టించడం, వాయిస్లు సృష్టించడం, నకిలీ ఎల్రక్టానిక్ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్ఎస్ కింద కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మంచి పనులకు ఉపయోగించాలి కంప్యూటర్ రంగంలో విప్లవాత్మకంగా కొనసాగుతున్న కృత్రి మ మేధస్సు (ఏఐ) ను మంచి పనులకు ఉపయోగించడం వల్ల అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప తప్పుడు మార్గాలకు వెళితే కచ్చితంగా శిక్షలకు గురికాక తప్పదు. ఏఐ ఉపయోగం, దుర్వినియోగం పై అవగాహన పెంచుకోవాలి. – ప్రొఫెసర్ ఎం.వీ.బీ.చంద్రశేఖర్, హెచ్ఓడీ, సీఎస్ఈ, ఏఐఎంఎల్దుర్వినియోగం చేస్తే కఠినమైన శిక్షలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏఐ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఏఐను దుర్వినియోగం చేస్తే కఠినతరమైన శిక్షలు ఉన్నాయి. ఏఐను ఒక టూల్గా ఉపయోగించి ఎన్నో ఉపాధి అవకాశాలు సాధించవచ్చు. కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సుల్లో ఏఐతో కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరిస్తున్నాం. – ప్రొఫెసర్ వీవీ నాగేశ్వరరావు, డైరెక్టర్కచ్చితంగా దొరికిపోతారు అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి. – కె.నిహారిక, సీఎస్ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల , టెక్కలి డేటా షేర్ కాకుండా చూసుకోవాలి సోషల్ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహిళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి.– ఎస్.చిరంజీవి, సీఎస్ఈ, ఏఐఎంఎల్మార్ఫింగ్ జరిగితే ఆందోళన వద్దు ఏఐ ద్వారా డీప్ ఫేక్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి. – ప్రియాంకపాడి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ -
ఒకేసారి నాలుగు ఉద్యోగాలు సాధించిన గృహిణి
శ్రీకాకుళం: మండలంలోని పెంటూరుకు చెందిన పొందూరు కుమారి ఒకేసారి నాలుగు ఉద్యోగాలకు ఎంపికైంది. బడబంద గ్రామానికి చెందిన పొందూరు వైకుంఠరావు, భారతమ్మల చిన్న కుమార్తె అయిన కుమారిని పెంటూరు చెందిన నడుపూరు హరీష్ కు 2022లో ఇచ్చి వివాహం చేశారు. భర్త ఏఆర్ కానిస్టేబుల్గా విజయవాడలో పనిచేస్తుండడంతో అక్కడే కోచింగ్ తీసుకొని ఈ ఉద్యోగాలు సాధించినట్లు ఆమె తెలిపారు. రీజనల్ రూరల్ బ్యాంక్(ఆర్ఆర్బీ) పీవో, ఆర్ఆర్బీ క్లర్క్, ఎస్బీఐ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్(కెనరా బ్యాంకు)గా నాలుగు ఉద్యోగాలు పొందటమే, కాకుండా ఎల్ఐసీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మూడు విడత ఇంటర్వ్యూలు పూర్తి చేసుకొని చివరి విడత ఇంటర్వ్యూకు ఎదురు చూస్తోంది. అయితే వీటిలో రీజనల్ రూరల్ బ్యాంకు పీవోగా విధుల్లో చేరుతానని, తన భర్త హరీష ఇచ్చిన సహకారంతోనే ఈ ఉద్యోగాలు సాధించానని కుమారి తెలిపారు. -
పోర్టు సభ విజయవంతం చేయండి
● వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ సంతబొమ్మాళి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండే ళ్లు కావస్తున్నా మూలపేట పోర్టు నిర్మాణం మొద టి దశ కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహి స్తున్న తీరుకు నిరసనగా ఈ నెల 30న నౌపడలో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాల ని వైఎస్సార్ సీపీ టెక్కలి ఇన్చార్జి పేరాడ తిలక్ కోరారు. మండలంలోని నౌపడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఈ ప్రాంత చిరకాల స్వప్నమైన మూలపేట పోర్టును 75శాతం పూర్తి చేసినా, కూటమి ప్రభుత్వం మిగిలిన పనులు చే యకుండా కాలక్షేపం చేస్తుందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి విఽఘాతకులుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు మిగిలిపోయారని దుయ్యబట్టా రు. మూలపేట పోర్టుపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై ఉత్తరాంధ్ర సీనియర్ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు అన్ని విభాగాల నాయకులు ఈ నెల 30న మూలపేట పోర్టు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఈ పర్యటనలో వాస్తవ పరిస్థితి తెలుసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి, ప్రజల తరఫున పోరాటం చేసే బాధ్యతను తీసుకుంటామని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో మూలపేట పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి ల్యాండ్ ఎంక్విజేషన్ చేసి నిర్వాసితులకు అనువైన పునరావాస కాలనీకి భూములు కేటాయించారని, పోర్టు రోడ్ నిర్మాణం తదితర పనులు 75 శాతం పూర్తి చేశా రని వివరించారు. కూటమి ప్రభుత్వం కనీసం నిర్వాసిత కాలనీలో కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. టీడీపీ నాయకులకు ప్రత్యేక ప్యాకేజీ, యూత్ ప్యాకేజీ ఇచ్చి వైఎస్సార్సీపీ సానుభూతి పరులకు సామాన్య ప్రజలకు, రైతులకు, పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రోడ్డుకు ఇరువైపులా భూములు తీసుకుంటున్నారనే ప్రచారంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ మండల పార్టీ అఽధ్యక్షుడు బి.మోహనరెడ్డి, నాయకులు పి.రవికుమార్ రెడ్డి, నక్క భీమారావు, సత్తారు సత్యం, తదితరులు ఉన్నారు. -
ప్రమోషన్ ఫైల్పై విచారణకు కలెక్టర్ ఆదేశాలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని 154 హెల్త్ అసిస్టెంట్ల (ఏఎన్ఎంలు) ప్రమోషన్లకు సంబంధించి ఫైల్పై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇద్దరు అధికారులను విచారణకు ఆదేశించారు. ఏడాదిన్నర కాలంగా తమకు రావాల్సిన గ్రేడ్–2 ప్రమోషన్లు నిర్దాక్షిణ్యంగా ఆపేశారంటూ జిల్లాలో వివిధ పీహెచ్సీల్లో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో ఉన్న డీఎంహెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి విధితమే. రాత్రి కార్యాలయంలోనే నిద్రించి తిరిగి మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు తమ నిరసనను వీరు కొనసాగించారు. విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, పాలకొండ ఆర్డీవో స్వప్నిల్ పవార్ జగన్నాథం, జెడ్పీసీఈఓ సత్యనారాయణను తక్షణమే సంబంధిత కార్యాలయానికి వెళ్లి సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశాలిచ్చారు. దీంతో మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు డీఎంహెచ్ఓ చాంబర్లోకి వెళ్లి సంబంధిత ఫైల్ పూర్వాపరాలు పరిశీలించారు. ప్రమోషన్లు ఆగడానికి ఎస్టీ కమిషన్ విచారణే కారణమని డీఎంహెచ్ఓ అనిత సోమవారం చెప్పారు. 154 మంది ఉన్న ప్రమోషన్ లిస్టులో తమ ఎస్టీ రిజర్వేషన్ ప్రాతిపదికన 9 పోస్టులు రావాల్సి ఉండగా నాలుగే కేటాయించారని ఎస్టీ కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి వారికి గతంలోనే 412 శాంక్షన్ పోస్టుల్లో 24 కేటాయించాల్సి ఉన్నా 29 కేటాయించడంతోనే 5 పోస్టులు అదనంగా అప్పట్లోనే ఇచ్చేయడంతోనే ఇప్పుడు తగ్గించినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ ఎస్టీ కమిషన్ సైతం మీ జిల్లాలోనే ఈ అంశం తేల్చుకోవాలని చెప్పినట్లు సమాచారం. -
శ్రీకాకుళంలో ఇఫ్తార్ విందు నేడు
శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ పండుగను పురస్కరించుకుని బుధవారం నగరంలో జిల్లా స్థాయి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి షేక్ మహబూబ్ షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ రోడ్డులోని శశి కన్వెన్షన్ హాల్ (జూడియో బిల్డింగ్ 4వ అంతస్తు)లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ విందు కార్యక్రమానికి జిల్లాలోని ముస్లిం మత పెద్దలు, సోదరులందరూ విచ్చేయాలని ఆయన కోరారు. ఆర్హెచ్పురంలో అక్రమంగా గ్రావెల్ తరలింపు సంతబొమ్మాళి: మండలం ఆర్హెచ్పురం రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 191లో ఎలాంటి అనుమతులు లేకపోయినా అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ను తరలించుకుపోతున్నారు. ఈ తతంగమంతా కొన్ని నెలలుగా జరుగుతున్నా రెవె న్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. జేసీబీ సాయంతో కొండను తవ్వి ట్రాక్టర్ల సాయంతో తరలించుకుని వెళ్లిపోతున్నారు. రోజుకు సుమారు 100లోడులు వరకు తరలించి దూరాన్ని బట్టి రూ.700 నుంచి రూ.1500లు వరకు ట్రాక్టర్ గ్రావెల్ను అమ్ముకుంటున్నారు. ఈ గ్రావెల్ను లేఅవుట్లకు, రోడ్లకు వినియోగిస్తున్నారు. దీనిపై రెవె న్యూ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని స్థానిక సర్పంచ్ ఎన్ని మన్మధరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దీనిపై వీఆర్వో శంకర్ను అడుగగా గతంలో గ్రావెల్ ను తరలిస్తుంటే అడ్డుకున్నామని, ఇప్పుడు తరలిస్తున్నట్లు తెలియదని అన్నారు. పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు. కూర్మ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు హిరమండలం: వైదిక గ్రామం కూర్మలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. 26న యువకులకు ఆధ్యాత్మిక ప్రవచనం, 27న శ్రీరామనవమి వేడుకలు, 28,29 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తి వికాస స్వామి ముఖ్య అతిథిగా రానున్నా రని చెప్పారు. మూడు రోజుల పాటు ఆధ్యాత్మి క ప్రవచనం ఇస్తారని తెలిపారు. అన్నదానం కూడా ఉంటుందన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఇతర వివరాలకు 7732075607 నంబరును సంప్రదించాలని కోరారు. సివిల్స్ విజేతకు కలెక్టర్ సత్కారం శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ బడిలో చదివి, పేదరికాన్ని జయించి సివిల్స్లో 463వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సౌరోతు రాము ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో కలసి ఘనంగా సత్కరించారు. ఈ అపురూప ఘట్టానికి రాము తల్లి లక్ష్మి కూడా సాక్షిగా నిలిచారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది కలిసి రాముకు శాలుశా కప్పి, పుష్ప గుచ్ఛం, విలువైన పుస్తకాలను బహూకరించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తండ్రిని కోల్పోయినా కుంగిపోకుండా ఎన్ఐటీ వరంగల్లో చదివి, నేడు సివిల్స్లో ర్యాంకు సాధించడం సామాన్యమైన విషయం కాదని కొనియాడారు. రాము సాధించిన ర్యాంకుకు ఐపీఎస్ వస్తుందని భావిస్తున్నానని, ఐఏఎస్ కూడా వచ్చే అవకాశం ఉందని, ఏ విభాగంలో సేవలందించినా జిల్లాకు గర్వకారణమని ఆకాంక్షించారు. కలెక్టర్ పెద్దమనసు.. సత్కార కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. రాము తల్లిని గౌరవిస్తూ, ఆ తల్లీకొడుకులను స్వయంగా కలెక్టర్ కార్యాలయం కింద వరకు తోడ్కొని వెళ్లి, మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు. -
శ్రీకాకుళం
కల్తీ కాటేస్తుందికల్తీ సరుకులు పెరిగిపోతున్నాయి. నూనెలను సైతం వదలడం లేదు. –8లోదాడులు హేయం టీటీడీ ఛైర్మన్ను తొలగించండి ● వైఎస్సార్సీపీ మహిళా నేతలపై అనుచిత వ్యాఖ్యలు దారుణం ● టీడీపీ గూండాలు దాడి చేయడం హేయమైన చర్య ● నిరసన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026పాలన ఘోరంశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని చంద్రబాబుకి నిరంతరం భజన చేస్తూ, అబద్దాలనే నిత్యం ప్రచారం చేసే టీవీ చానెల్ యజమాని బీఆ ర్ నాయుడుకు అప్పగించడం దారుణమని వైఎస్సా ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బీఆర్ నాయుడు రాసలీలల వీడియోలు బయటపడిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం మానవహారం చేసి నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ నాయుడు వీడియోలు వైరల్ అయ్యాక వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతిలో శాంతియుతంగా చేపట్టిన ర్యాలీ ని పోలీసులు అడ్డుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం దారుణమని అన్నారు. శిల్పారామంలో బీఆర్ నాయుడు ఉన్న ఓ హోటల్ వద్ద నిరసన చేయడం తప్పా అని ప్రశ్నించారు. నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసం టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలుచేయడం దారుణమన్నారు. ఇదేనా సూపర్ సిక్స్ బీఆర్ నాయుడు అనైతికంగా ప్రవర్తించి దాడులు చేయించడం, అక్రమ అరెస్టులు చేయడం హేయ మైన చర్యగా భావిస్తున్నామని వైఎస్సార్సీపీ డాక్ట ర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. అబద్దాలు చెప్పడం, సమర్థించడం చంద్రబాబునాయుడుకి, బీఆర్నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ అంటే ఖాదర్భాషా, ఆదిమూలం, నజీర్, కిరణ్రాయల్, అరవల, బీఆర్నాయుడుల వీడియోలేనా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి అనైతిక చర్యలు చేస్తున్నా వారికి వెనకేసుకుని రావడమే కూటమి నాయకుల లక్ష్యమన్నారు. ప్రజలు కూటమికి అధికారం ఇచ్చింది కక్షలు సాధించుకోడానికి కాదని హితవు పలికారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, వైఎస్సార్ సీపీ టెక్కలి, ఆమదాలవలస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు పేరాడ తిలక్, చింతాడ రవికుమార్, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఎంవీ పద్మావతి, తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, వెలమ కుల రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు, నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, కరిమి రాజేశ్వరరావు, పిన్నింటి సాయి, కేవీజీ సత్యనారాయణ, పిల్లల రామకృష్ణ, చల్ల శ్రీనివాసరావు, గొండు కృష్ణమూర్తి, ధర్మాన రామ్మనోహర్నాయుడు, తమ్మినేని చిరంజీవినాగ్ (నాని), పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, చింతాడ వరుణ్, గేదెల పురుషోత్తం, మార్పు పృథ్వీ, ఎంఏ రఫీ, ముత్తా విజయ్కుమార్, రౌతు శంకరరావు, మండవిల్లి రవి, ఎం.ఏ రఫీ, ఖండాపు గోవిందరావు, గుమ్మడి రాంబాబు, సనపల నారాయణరావు, యజ్జల గురుమూర్తి, గంట్యాడ రమేష్, రాజాపు అప్పన్న, తంగుడు నాగేశ్వరరావు, సీపాన మహేంద్ర, పి.సుగుణారెడ్డి, టి.కామేశ్వరి, అంధవరపు సురేష్లతో పాటు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు భారీగా పాల్గొన్నారు. -
కృత్రిమ మేధ.. వికృత నీడ
● మన గడపలోకే.. మార్ఫింగ్.. ఎక్కడో ఎవరివో ఫొటోలు మార్ఫింగ్ చేశారంటే నోరెళ్లబెట్టి చూసేవాళ్లం. ఇప్పుడు ఆ వికృత క్రీడ మన గడప వరకు పాకింది. మన బడులు, కాలేజీలకూ ఈ జాడ్యం వచ్చేసింది. అందివచ్చిన సాంకేతికతను కొందరు ఇలా తప్పుడు పనులకు వినియోగించడంతో మన అమ్మాయిల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు, వాట్సాప్ స్టేటస్లు, సరదాగా తీసుకున్న ఫొటోలు సైతం ఇప్పుడు భయపెడుతున్నాయి. ఏఐ సహకారంతో జరుగుతున్న ఈ దురాగతానికి మన ఏమరపాటే అదనుగా మారుతోంది. టెక్కలి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పక్కదారి పడుతోంది. ఒక వ్యక్తి ఫొటో, వీడియోను ఉపయోగించి ఇష్టానుసారంగా దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఒకప్పుడు సెలబ్రిటీల ఫొటోలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసేవారు. ఇప్పుడు విద్యాలయాలకు ఆ వికృత సంస్కృతి పాకింది. వాట్సాప్, ఇన్స్ట్రాగామ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో జరిగిన కార్యక్రమాల్లో వీడియాలు, ఫొటోలను సేకరించి వాటితో వికృతమైన చేష్టలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో అవగాహన కలిగిన వ్యక్తులు ధైర్యంగా ఫిర్యాదు చేసి నిందితుల్ని సైబర్ పోలీసులకు పట్టిస్తున్నారు. మరి కొంత మంది వీటి బారిన పడినప్పటికీ బయటకు చెప్పుకోలేక తల్లడిల్లిపోతున్నారు. కఠిన శిక్షలు ● ఏఐతో కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వాటిలో మార్ఫింగ్, వాయిస్ క్లోనింగ్, రాజకీయ కుట్రలు తదితర చేష్టలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడడంతో పాటు ఇతర డిజిటల్ దుర్వినియోగానికి కఠినతరమైన శిక్షలను అమలు చేశారు. ● ఏఐ ద్వారా వ్యక్తిగతంగా ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్కు పాల్పడితే సెక్షన్ 67,67ఏ ప్రకారం 5 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ● ఏఐను వినియోగించి మరో వ్యక్తి మాదిరిగా ఫొటోలు, వీడియోలు సృష్టిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. ● మరొకరి సంతకాన్ని డిజిటల్ సంతకంగా మార్చి ఉపయోగిస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. ● వీటితో పాటు ఫేక్ న్యూస్ సృష్టించడం, వాయిస్లు సృష్టించడం, నకిలీ ఎలక్ట్రానిక్ రికార్డులు సృష్టించడం, మరొకరి గౌరవాన్ని భంగం కలిగించడం వంటి దుర్వినియోగానికి ఐటీ చట్టం 2000 ప్రకారం 66డి, 67 , బీఎన్ఎస్ కింద కఠినతరమైన శిక్షలు పడే అవకాశం ఉంది. అత్యవసర సమయాల్లో 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. మార్ఫింగ్ కీచకులతో తస్మాత్ జాగ్రత్త బహిరంగ ప్రదేశాల్లో తీసిన వీడియోలు, ఫొటోలతో మార్ఫింగ్ వీడియోలు ఆరిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) సహకారంతో దురాగతాలు విద్యాలయాలకు పాకిన వికృత చేష్టలు కచ్చితంగా దొరికిపోతారు అరకొర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న వారి వల్లనే ఏఐ దుర్వినియోగంగా మారుతోంది. వీడియోలు, ఫొటోలు మార్ఫింగ్కు పాల్పడితే కచ్చితంగా పట్టుబడతారు. ఏఐ టూల్స్ వినియోగంలో కొన్ని రకాల చెడు ప్రభావం లేకుండా మార్పులు చేయాలి. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే ధైర్యంగా ఫిర్యాదులు చేయాలి. – కె.నిహారిక, సీఎస్ఈ, (ఆర్టిఫిషియల్, మెషిన్ లెర్నింగ్) ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల , టెక్కలి డేటా షేర్ కాకుండా చూసుకోవాలి సోషల్ మీడియాల్లో వ్యక్తిగతమైన డేటా షేర్ కాకుండా చూ సుకోవాలి. ముఖ్యంగా మహి ళలు, విద్యార్థినులు జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లలో ఫొటోలు, వీడియోలు విషయంగా భద్రత పాటించాలి. – ఎస్.చిరంజీవి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన వద్దు ఏఐ ద్వారా డీప్ ఫేక్ మార్ఫింగ్ జరిగితే ఆందోళన చెందకూడదు. దీనికి సంబంధించి రక్షణ కోసం సైబర్ విభాగాలు ఉన్నాయి. వారికి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో ఆ వీడియోలు, ఫొటోలను తొలగిస్తారు. ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ధైర్యంగా ఉండాలి. – ప్రియాంకపాడి, సీఎస్ఈ, ఏఐఎంఎల్ -
గొట్టా బ్యారేజీ దిగ్బంధం
● అన్నదాతల మెరుపు ఆందోళన హిరమండలం: ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం రైతుల పాలిట శాపంగా మారింది. గొట్టా బ్యారేజీ వద్ద మంగళవారం రాత్రి రైతులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. గొట్టా బ్యారేజీలో రబీ పంటలకు నీరు స్థిరీకరణ లేకపోవడంతో పాటు ఉన్ననీటిని వృథాగా దిగువ సముద్రంలోకి విడిచిపెట్టడంతో నిరసనకు దిగారు. ఈ ఏడాది మోంథా తుఫానుతో వంశధారకు గట్లు, కరకట్టలు దెబ్బతిన్నాయి. వాటిని బలోపేతం చేసేందుకు గాను బ్యారేజీలో ఉన్న నీటి ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దిగువకు విడిచిపెట్టారు. ఈ విషయంపై ప్రత్యేక ప్రకటన చేయలేదు. ఇది తెలియని దిగువన ఉన్న రైతులు రబీలో భాగంగా వివిధ పంటలు వేసుకున్నారు. బ్యారేజీలో నీటి స్టోరేజీ తగ్గుముఖం పడుతోంది. దిగువకు నీటిని వృథాగా విడిచిపెట్టడంతో వంశధార నదీ తీర గ్రామాల రైతులంతా మంగళవారం రాత్రి ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ముందే ప్రకటించి ఉంటే తాము సాగుచేసేవారం కాదని, తీరా పెట్టుబడులు పెట్టాక సాగునీరు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వందలాది మంది రైతులు గొట్టా బ్యారేజీపై ఆందోళనకు దిగడంతో అటు పాతపట్నం, ఇటు శ్రీముఖలింగం, హిరమండలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి మాట్లాడగా.. వంశధార సిబ్బంది ఈ ఒక్క రోజుకు నీటిని దిగువకు వెళ్లకుండా నిలుపుదల చేస్తామని రైతులకు తెలిపారు. తర్వాతి రోజుకు మాత్రం కలెక్టర్, వంశధార ఎస్ఈ నుంచి ఆర్డర్ తె చ్చుకోవాలని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. -
వాటర్ ట్యాంకర్ ప్రారంభం
శ్రీకాకుళం: ఆమదాలవలస పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన వాటర్ ట్యాంకర్ను ఎమ్మెల్యే కూన రవికుమార్, వైద్యుడు దానేటి శ్రీధర్తో కలిసి ప్రారంభించారు. సామాజిక సేవలో భాగంగా డాక్టర్ దానేటి శ్రీధర్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకొచ్చి ట్యాంకర్ను అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ దానేటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సేవలు అందించడంలో తమ ట్రస్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. వేసవికాలంలో పట్టణ ప్రజలకు తాగునీటి సమస్యను కొంతవరకై నా తగ్గించేందుకు ఈ ట్యాంకర్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తమ్మినేని గీతాసాగర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ కూన వెంకట రాజ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి తదితరులు పాల్గొన్నారు. -
శానిటరీ ఇన్స్పెక్టర్ను విధుల్లోకి తీసుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు తొలగించిన శానిటరీ ఇన్స్పెక్టర్ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు, మేసీ్త్రలు మంగళవారం ఉదయం 5 గంటల నుంచి విధులు బహిష్కరించి శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ – ఎంప్లాయీస్ ఫెడరేషన్(సీఐటీయూ) శ్రీకాకుళం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న కార్మికులకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ఒక ప్రాంతంలో డయేరియా ప్రబలితే శానిటేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించిన ఎన్.శరత్ని బాధ్యులుగా చేస్తూ విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చిరుద్యోగులపై అక్రమ తొలగింపు సరికాదని, దీనిపై జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చొరవచేసుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లోకి తీసుకోకుంటే పోరాటాలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, అధ్యక్షుడు ఎ.గణేష్, డి.యుగంధర్, ఎం.రాఘవ, ఎ.శంకర్, ఎ.మోహన్, డి.చిట్టిబాబు, ఎ.జ్యోతిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే అశోక్ తీరుపై ఆగ్రహం
కంచిలి: ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తీరుపై ఆదివాసీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు పురేంద్ర సవర ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నువాగడ గ్రామంలో స్థానిక సర్పంచ్ సబితా గొమాంగో ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నకిలీ బెంతో ఒడియా వారికి ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్రం మొత్తం ఆదివాసీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆ ఉద్యమం తీవ్రంగా ఉంటుందని, దానికి బాధ్యులు ఎమ్మెల్యే అవుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఋషి సవర, డొంబురు, లక్ష్మణ, స్వప్న, కళావతి తదితరులు పాల్గొన్నారు. -
ఆశలు ఆవరి..!
దారుణం ● రబీ పంటకు సాగునీటి కష్టాలు ● నీరు నిలుపుదల చేసిన అధికారులు ● ఆందోళనలో అన్నదాత సారవకోట: పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు నిలుపుదల చేయడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బద్రి రెవెన్యూ పరిధిలో ఈ ఏడాది రబీలో వంశధార ఎడమ కాలువ కింద 600 ఎకరాల్లో 300 మంది రైతులు వరిపంట సాగు చేస్తున్నారు. అయితే మరో 20 రోజుల్లో పంట చేతికొచ్చే అవకాశం ఉన్న సమయంలో వంశధార అధికారులు నీరు నిలుపుదల చేశారని మంగళవారం రైతులు ఆరోపించారు. ఒక్కో ఎకరా సాగు చేసేందుకు ఇప్పటివరకు రూ.30 వేలు ఖర్చు పెట్టామని, కానీ వంశధార అధికారులు హిరమండలం గొట్టా బ్యారేజీ దగ్గర నుంచి సాగునీరు కాలువ ద్వారా రాకుండా నిలుపుదల చేయడంతో పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని ఆరోపిస్తున్నారు. అదే జరిగితే తాము ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తీవ్రంగా నష్టపోతాం నాకున్న 7 ఎకరాలు రబీలో వరిసాగు చేస్తున్నాను. ఏకరాకు రూ.30 వేలు చొప్పున ఇప్పటివరకు ఖర్చు చేశాం. పంట చేతికొచ్చే సమయంలో వంశధార అధికారులు ఇప్పుడు నీరు నిలుపుదల చేస్తే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతాం. – మెండ సూర్యనారాయణ, బద్రి, సారవకోట మండలం ఆర్థిక ఇబ్బందులు తప్పవు నాకున్న పొలంతో పాటు కౌలుకు తీసుకుని 12 ఎకరాలు రబీలో సాగు చేస్తున్నాను. పంట పొట్ట దశకు వచ్చింది. వచ్చే నెల మొదటి వారం నాటికి చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో వంశధార అధికారులు నీరు నిలుపుదల చేస్తే మా పంటలన్నీ ఎండిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. – యాళ్ల రమణయ్య, బద్రి, సారవకోట మండలం పనులు చేయించాలి ఆరుతడి పంటలు వేసుకోవాలని, రబీలో వరి వేయవద్దని గత డిసెంబర్లో ఆయకట్టు రైతులకు చెప్పడం జరిగింది. రూ.16 కోట్ల అభివృద్ధి పనులు మంజూరయ్యాయి. ఆ పనులు ఈ ఏడాది మేలోగా చేయించాలి. అందుకే కాలువ ద్వారా నీటిని మంగళవారం నుంచి నిలుపుదల చేశాం. – శిమ్మ శ్రీనివాసరావు, డీఈఈ, వంశధార -
మద్యం తాగి కుర్చీలు ధ్వంసం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆర్ష, సాహిత్య, ఆధ్యాత్మిక సేవా సంస్థ ఉపనిషన్మందిరం ఏర్పడి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 19వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు గుమ్మా నగేష్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం కరపత్రాలు ఆవిష్కరించారు. పరాభవ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది సందర్భంగా సాయంత్రం 6 గంటలకు కోదండ రామాలయంలో ప్రముఖ జ్యోతిష్య శాస్త్రవేత్త తెన్నేటి విక్రమ్ శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రముఖ పండితులు రామాయణంలోని వివిధ ఘట్టాలను వివరిస్తూ ప్రసంగించనున్నారని తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీన శ్రీరామ దర్బార్ నిర్వహిస్తున్నామని, కవి పండితులు ఆరోజు శ్రీరాముల వారిని కీర్తిస్తూ పద్య, గద్య భక్తి గీతాలు ఆలపించనున్నారని పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి శ్రీమద్రామాయణ ప్రసంగాలు నిర్వహిస్తున్నామని ఆధ్యాత్మిక ప్రియులు, సాహితీవేత్తలు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మందిరం ప్రతినిధులు పి.పతంజలి శాస్త్రి, నిష్టల నరసింహమూర్తి, కామేశ్వరరావు, డీజీ పట్నాయక్, తెన్నేటి విక్రమ్ శర్మ, జంధ్యాల శరత్ బాబు, బాపయ్య పంతులు, ఈశ్వర సుబ్రహ్మణ్య శర్మ, రంగుడు ప్రసాదరావు, గుహానంద్ పాల్గొన్నారు. -
కల్తీ కాటేస్తుంది..!
● జాగ్రత్త...● జిల్లాలో యథేచ్ఛగా వంటనూనెల కల్తీ ● నెయ్యిని సైతం వదలని వైనం ● చోద్యం చూస్తున్న యంత్రాంగం హిరమండలం: ఇప్పుడు ఏ నోట విన్నా కల్తీ అన్న మాట వినిపిస్తోంది. ముఖ్యంగా వంట నూనె, నెయ్యి కల్తీ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కాకినాడ సమీపంలో 870 కిలోల కల్తీ నెయ్యిని అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదంతా శ్రీకాకుళం జిల్లాలోని ఒక వ్యాపారికి తరలిస్తున్నట్లు పట్టుబడినవారు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అయితే జిల్లాలో వంట నూనె, నెయ్యిలో కల్తీ జరుగుతోందన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకినాడలో దీని మూలాలు తేలడంతో అనుమానాలకు బలం చేకూరింది. సరిహద్దు ప్రాంతాల్లో.. జిల్లాలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు అధికం. అటువంటి చోట రెండు రాష్ట్రాల బ్రాండ్లు పేరిట కల్తీని చలామణి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒడిశా వారికి ఏపీ ఉత్పత్తులుగా.. ఏపీలో ఒడిశా ఉత్పత్తులుగా చూపుతున్నారు. ధర తక్కువగా ఉండడంతో జనాలు నమ్ముతున్నారు. కల్తీ నూనెను కొనుగోలు చేసి చేజేతులా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాలో కొంతమంది వ్యాపారులు, దళారులు వంటనూనెను యథేచ్ఛగా కల్తీ చేస్తూ ప్రజారోగ్యంతో ఆటలాడుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా సన్ ఫ్లవర్, పామాయిల్, రైస్బ్రాన్, వేరుశనగ నూనెను ఎక్కువగా వినియోగిస్తుంటారు. అన్నిరకాలు కలిపి నెలకు దాదాపు 1,700 టన్నుల నూనె విక్రయిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతినెలా సుమారు రూ.15 కోట్ల నూనె వ్యాపారం జరుగుతుంటుంది. చిన్న, మధ్యతరహా హోటళ్లు, రెస్టారెంట్లలో ఎక్కువగా పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్నే వినియోగిస్తుంటారు. మిగిలిన వాటి కంటే తక్కువ ధరకు లభిస్తుండడంతో వీటివైపే మొగ్గుచూపిస్తుంటారు. అయితే వంటనూనెను సైతం కల్తీ చేస్తున్నారు. రకరకాల రసాయనాలు కలుపుతున్నారు. రంగు పోకుండా ఉండేందుకు మోతాదుకు మించి రసాయనాలు, నిషేధ పదార్థాలను వినియోగిస్తున్నారు. అటువంటి నూనె వాడడం వల్ల ప్రాణాంతాక వ్యాధులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిబ్బంది లేక ఇబ్బంది జిల్లాలో వేల టన్నుల వంటనూనె, వేల కిలోల నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయి. వందల కొద్దీ వ్యాపారులు ఉన్నారు. కానీ ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు మాత్రం ముగ్గురే ఉన్నారు. జిల్లా ఆహార భద్రతా అధికారి ఒకరు ఉండగా.. డివిజన్–1, డివిజన్–2 పరిధిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. డివిజన్–1 పరిధిలో శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట న్యాయస్థానాల పరిధిలో తనిఖీ చేయాలి. డివిజన్–2లో ఎచ్చెర్ల, పొందూరు, శ్రీకాకుళం, పలాస, సోంపేట కోర్టుల పరిధిలో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. ఒక్క శ్రీకాకుళం నగరంలో చిన్నపాటి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్టుఫుడ్ కేంద్రాలు 500 వరకూ ఉన్నాయి. 30 మండలాల్లో ఆ సంఖ్య 5 వేల వరకూ ఉండొచ్చని ఒక అంచనా. కానీ వీరందరి వద్ద కల్తీ జరగకుండా నియంత్రించే బాధ్యతలో ముగ్గురు అధికారులు ఉండడం ఆందోళన కలిగించే విషయం. ఫలితంగా ఎక్కడా సక్రమంగా తనిఖీలు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నెయ్యిలో ఇలా.. జిల్లాలో నెయ్యి సైతం కల్తీ జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. సాధారణంగా నెయ్యిని రెండు రకాలుగా ఉత్పత్తి చేస్తారు. ఇళ్లలో పెరుగు చిలికి వెన్నను తీస్తారు. దానిని మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. ఇది 10 నెలలు అయినా నిల్వ ఉంటుంది. అలాగే యంత్రంలో పాలుపోసి మరిగించడం ద్వారా వెన్నను తీయడం రెండో పద్ధతి. దీని నాణ్యత నెల రోజుల తర్వాత తగ్గిపోతుంది. జిల్లాలో రెండో రకం నెయ్యి ఉత్పత్తి, విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో వనస్పతి, పామాయిల్ కలిపేసి ఎక్కువ మంది కల్తీ చేస్తున్నారు. జిల్లాలో నెలకు 50 వేల లీటర్ల నెయ్యి విక్రయాలు జరుగుతాయని గణాంకాలు చెబుతున్నాయి. రకం, నాణ్యత బట్టి కిలో నెయ్యి రూ.350ల నుంచి రూ.1,000ల వరకూ విక్రయిస్తుంటారు. తీవ్ర అనారోగ్యం కల్తీ నూనె, నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలు తింటే అనారోగ్యానికి గురవుతారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయి. శ్వాసకోస సంబంధిత వ్యాధులు కూడా వస్తాయి. మలబద్ధకం, ఒళ్లునొప్పులు, గుండెపోటు, పక్షవాతం వంటి రుగ్మతలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ గాడి తప్పుతుంది. అందుకే ఆరోగ్యం పాడుచేసుకోవడం కంటే ముందే మేల్కోవడం ఉత్తమం. – పి.సాయికుమార్ వైద్యాధికారి, పీహెచ్సీ, హిరమండలం ఫిర్యాదు చేయాలి ఆహార పదార్థాల కల్తీ జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి. జిల్లాలో ఇద్దరు ఇన్స్పెక్టర్ల పరిధిలో తనిఖీలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. లేకుంటే 93984 67652 నంబర్ను సంప్రదించవచ్చు. తనిఖీలో కల్తీ అని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తాం. – సీహెచ్ లక్ష్మీనారాయణ, ఆహార భద్రతా అధికారి, శ్రీకాకుళం -
కమీషన్ల కక్కుర్తి.. నిలిచిన గిరిజన ప్రగతి..!
● పాతపట్నంలో ముందుకు సాగని అభివృద్ధి పనులు ● కీలక నేతకు ముందుగానే కమీషన్లు చెల్లింపు ● బిల్లుల జాప్యంతో నిలిచిపోయిన పనులు ● అవస్థలు పడుతున్న గిరిజనులు హిరమండలం: పాతపట్నం నియోజకవర్గంలో గిరిజన గ్రామాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెళియాపుట్టి, కొత్తూరు మండలాల్లో అత్యధికంగా గిరిజనులు నివసిస్తున్నారు. హిరమండలం, ఎల్ఎన్పేట, పాతపట్నం మండలాల్లో సైతం గిరిజన గ్రామాలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో రహదారులతో పాటు మౌలిక వసతులకు సంబంధించి పనులు ముందుకు సాగడం లేదు. రోడ్లను చదును చేసి.. మట్టి, గ్రావెల్ వేసి వదిలేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడం, ముందుగానే కీలక ప్రజాప్రతినిధికి 7 శాతం కమీషన్లు ముట్టజెప్పాల్సి రావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి గిరిజనులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముందుగానే కమీషన్లు.. 2024 సంవత్సరంలో పాతపట్నం నియోజకవర్గానికి మంజూరైన పనులకు సంబంధించి కాంట్రాక్ట్లు కొందరి చేతుల్లో ఉన్నాయి. వీరంతా ముందుగానే ఒక కీలక నేతకు కమీషన్లు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. దీంతో వారికి పనులు ప్రారంభించేందుకు అనుమతులిచ్చారు. వారు కంకర, మట్టితో చదును చేసి కొంతవరకు పనులు పూర్తి చేశారు. అనంతరం బిల్లులు పెట్టుకున్నారు. అయితే బిల్లుల్లో జాప్యం జరగడంతో కాంట్రాక్టర్లు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో పలాస, ఇచ్ఛాపురం, టెక్కలి, ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాలకు 268 పనులు అప్పట్లో మంజూరయ్యాయి. వాటిలో 123 పనులు పాతపట్నం నియోజకవర్గానికే కేటాయించారు. మొత్తం రూ.109.7 కోట్లకుగాను.. రూ.57.49 కోట్లు పాతపట్నంకే కేటాయింపులు చేశారు. కానీ కమీషన్ల పర్వం, ఆపై బిల్లుల్లో జాప్యంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. పూర్తయినవి 14 పనులే... పల్లె పండుగ పనుల విషయంలో సైతం పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉంది. ఒక్క ఎల్ఎన్పేట మండలానికి మినహాయించి మిగతా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు మండలాలకు 2024–25 ఆర్థిక సంవత్సరంలో 91 పనులు మంజూరయ్యాయి. అయితే అందులో పూర్తయినవి 14 పనులు మాత్రమే. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పల్లె పండుగ 2.0 కింద పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పనుల మంజూరు కోసం పాతపట్నం నుంచి 1, హిరమండలం నుంచి 21, ఎల్ఎన్పేట నుంచి 10 ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 11 అసలు ప్రారంభించలేదు. 21 వివిధ దశల్లో ఉన్నాయి. అసలు కొత్తూరు, మెళియాపుట్టిల నుంచి ప్రతిపాదనలే రాలేదని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం పల్లెపండుగ–1లో పనులకే ఇంతవరకూ మోక్షం లేకపోవడమే. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఇంతవరకూ గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు వేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరోవైపు పల్లెపండుగ పనుల్లో కమీషన్ల పర్వంపై అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. దీనిపై అధిష్టానానికి కొందరు ఫిర్యాదు కూడా చేసినట్టు తెలుస్తోంది. -
● అమరజీవికి ఘన నివాళి
అమర జీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నరసన్నపేటలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు నిస్వార్థ దేశ భక్తుడని కొనియాడారు. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు చరిత్రను కొత్త తరానికి తెలియజేయాలన్నారు. – శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) -
శ్రీకాకుళం
ప్రాణం తీసిన అతివేగంఅతివేగం ప్రాణం తీసింది. వరిసాం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. –IIలో● సజావుగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు మంగళవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2026● తొలిరోజు ● పుట్టెడు దుఃఖంలో పరీక్షకు హాజరై.. మెళియాపుట్టి: తండ్రి తనని శాశ్వతంగా విడిచిపెట్టి రెండురోజులే అయింది. విషాదం నుంచి ఆ కుటుంబం కోలుకోలేదు. ఆ దుఖంలోనే విద్యార్థిని పదో తరగతి పరీక్షలకు హాజరైంది. మెళియాపుట్టి మండలం పెద్ద లక్ష్మీపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ చైన్నెలో వలస కూలీగా పనిచేస్తూ.. ఈ నెల 14న కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. ఈయన కుమార్తె భూమిక పదో తరగతి చదువుతోంది. తండ్రి పోయిన దుఖంలోనే పరీక్ష రాయడానికి సిద్ధమైంది. గ్రామస్తులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, భూమికకు ధైర్యం చెప్పారు. శోకాన్ని దిగమింగి మొదటి పరీక్షకు చాపర హైస్కూల్కు హాజరైంది. పరీక్షా కేంద్రాలు


