breaking news
Srikakulam
-
ఓటర్లను కాపాడుకుందాం
● పాతపట్నం బీఎల్ఏల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలుకొత్తూరు: అర్హత గల ఓటర్లను కాపాడుకోవాలని, ‘సర్’ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు అన్నారు. మండలంలోని గూనభద్ర ఆర్ఆర్ కాలనీ, కొత్తూరులో శుక్రవారం నిర్వహించిన సర్ కార్యక్రమాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి ఎ.హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, పార్టీ జిల్లా టా స్క్ఫోర్స్ సభ్యుడు సందీప్ రెడ్డి పరిశీలించారు. అనంతరం రెడ్డి శాంతి అధ్యక్షతన బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ పార్టీ మద్దతుదారుల ఓట్లను కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన ప్రభుత్వం ఓట్లను తొలగించే కుట్ర పన్నుతుందని అడ్డుకోవాలని సూచించా రు. రాష్ట్రంలో ఉన్న 4.16 కోట్ల ఓటర్లలో సుమారు 70 లక్షల ఓట్లు మ్యాపింగ్ కానందున ఈ ఓట్లును సర్ నెపంతో కూటమి ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. అందులో భాగంగా పాతపట్నం నియోజవర్గంలో సుమారు 53 వేల ఓట్లు తొలగిస్తున్నారని చెప్పారు. ప్రతి ఓటు కీలకమని కృష్ణదాస్ అన్నారు. ఎలాంటి సందేహం ఉన్నా వార్ రూమ్కు తెలపాలని హర్షవర్ధన్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో పార్టీ టాస్క్ఫోర్స్ సభ్యుడు సందీప్ రెడ్డి, ఎంపీపీలు సవర సావిత్రి, రెడ్డి జ్యోతి, జెడ్పీటీసీ సభ్యులు కామక భాగ్యవతి, బీసీ సెల్ రాష్ట్ర సంయక్త కార్యదర్శి చింతాడ సూర్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గండివలస ఆనందరావు, విష్ణు, రామకృష్ణ, నియోజకవర్గం బూత్ కమిటీ ఇన్చార్జి సూర్యం, మండల ఇన్చార్జి పోలయ్య, పార్టీ జిల్లా నాయకులు ఏవీ సురేష్ , వైస్ఎంపీపీ ప్రదీప్ ఉదయ్ మాజీ సర్పంచ్ సాదుబాబు, బొమ్మాలి నగేష్లతో పాటు పలువురు పార్టీ నేతలు, బీఏల్ఏలు పాల్గొన్నారు. -
పనస పండు.. పోషకాలు మెండు
● పనస పండ్ల అమ్మకాల జోరు ● మార్కెట్లో పెరిగిన గిరాకీ వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంత రైతుల ప్రధాన జీవనాధారమైన పంటల్లో ఒకటైన పనస పంటకు మార్కెట్లో భలే గిరాకీ ఉంది. పనస కాయ, పండ్లలో విలువైన పోషకాలు మెండుగా ఉండడంతో పాటు రుచి కూడా బాగుంటుంది. దీంతో భోజనప్రియులు వీటిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. పనస కాయలను విందు భోజనాల్లో అధికంగా వినియోగిస్తారు. దీంతో ఈ పంట ప్రారంభంలోనే కాయలను జోరుగా అమ్మకాలు చేస్తూ.. కలకత్తా, బెంగుళూరు, ఒడిశా, భువనేశ్వర్, హైదరాబాద్ ఇతర సుదూర ప్రాంతాలకు తరలించి రైతులు ఆదాయాన్ని పొందారు. ప్రస్తుతం పనస పండ్లు అమ్మకాలు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. వేసవి కాలం ముగింపు దశలో పసన పండ్లుకు మార్కెట్లో మంచి డిమాండ్ పెరిగింది. ఏడాదిలో ఒకేసారి లభించే ఈ పనస పండ్లు తియ్యటి రుచితో పాటు పోషక విలువలు అధికంగా ఉండడంతో ప్రజలు పనస పండ్లును తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఉద్దాన ప్రాంతంలో పండిన ఈ పండ్లను జాతీయ రహదారుల వెంట విపరీతంగా అమ్మకాలు చేస్తున్నారు. పరిమాణం ఆధారంగా ధరలు ఒక్కొక్క పండును వాటి పరిమాణంతో పాటు ఖజ్జా, బురద రకాల బట్టి రూ.100ల నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. పండ్లతో పాటు పసన తొనలను కూడా ప్రత్యేకంగా అమ్మకాలు చేస్తూ జీవనోపాఽధిని పొందుతున్నారు. కాగా సీజన్లో ప్రత్యేకంగా దొరికే ఈ పనస పండ్లును తినేందుకు ప్రజలు మక్కువ చూపడంతో మార్కెట్లో డిమాండ్ పెరిగింది. దీంతో పండ్లు అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రైతులతో పాటు వ్యాపారులకు కూడా ఆదాయం కలిసి వస్తోందని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఉన్న వాతావరణంలో పనస పండ్లు బాగా మగ్గి తొనలు రుచిగా ఉంటాయని, వర్షాలు కురిస్తే మాత్రం ఈ పండ్లు రుచిని కోల్పోవడంతో పాటు పండ్లు లోపల ఉన్న పిక్కలు మొలకలు వచ్చే పరిస్థితి ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతం పనస పండ్లు తినేందుకు ప్రజలు మార్కెట్ల వైపు ఎగబడుతూ ఈ సీజనల్ ఫ్రూట్ రుచిని అస్వాదిస్తున్నారు. నోరూరిస్తున్న పనస తొనలు -
‘పోలీసు సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం’
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు సిబ్బంది ఉద్యోగ రీత్యా లేదా కుటుంబ, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. శుక్రవారం డయల్ యువర్ ఎస్పీ (పోలీసు గ్రీవెన్సు) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యాలయంలో జిల్లాలో పలువురు పోలీసులు సెలవులు, సర్వీస్ అంశాలు, విధి నిర్వహణలో వచ్చే ఇబ్బందులను ఎస్పీకి తెలియజేశారు. పోలీసు సిబ్బంది శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల్లోగా 6309990800 నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయవచ్చని ఎస్పీ తెలియజేశారు. ‘విచారణ ముగిసే వరకు ఎలాంటి ప్రచారాలు వద్దు’ రణస్థలం: తనపై పలు పత్రికల్లో వస్తున్న వార్తల్లో వాస్తవాలు లేవని పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి పి.అజయ్బాబు తెలిపారు. పైడిభీమవరం పంచాయతీకి చెందిన సాధా రణ నిధుల దుర్వినియోగం జరిగిందని, సంబంధించిన రికార్డులను తారుమారు చేసినట్లు శుక్రవారం పలు పత్రికల్లో కథనాలు ప్రచురి తం కావడంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పంచాయతీకి చెందిన నిధులపై విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని కోరారు. తన అనుమతి లేకుండా తన ఇంటిలో ఫొటో లు తీయడం సబబు కాదన్నారు. నిధుల దు ర్వినియోగంపై విచారణ పూర్తయ్యేంత వరకు ఎలాంటి కథనాలు ప్రచారం చేయవద్దని ఆ ప్రకటనలో కోరారు. జిల్లా రిజిస్ట్రార్ ఆకస్మిక తనిఖీ ఆమదాలవలస రూరల్: జిల్లా రిజిస్ట్రార్ బి.సంజీవయ్య శుక్రవారం ఆమదాలవలస సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమదాలవలస విచ్చేసిన ఆయన కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. కార్యాలయ పరిధిలో రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే విషయం స్థానిక సబ్ రిజిస్ట్రార్ను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా రిజిస్ట్రేషన్ల వల్ల ఇక్కడ నుంచి ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందని విషయం కూడా పరిశీ లించారు. క్రయ, విక్రయదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సబ్ రిజిస్టర్ రాఘుపాత్రుని జగదీశ్వరరావు, కూన శివరామక్రిష్ణ, స్థానిక సిబ్బంది సంతోష్ కుమార్ పాల్గొన్నారు. మావిగన్తోనే రాష్ట్రాభివృద్ధి ● అమరావతి కేవలం అవినీతి కూపం ● కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: మావిగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని, దేశంలోనే మావిగన్ అ త్యుత్తమ రాజధాని అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూ టీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట పార్టీ కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ (మచిలీపట్నం,విజయవాడ,గుంటూరు) కారిడార్ ఒక్కటే సరైన ప్రత్యామ్నాయమని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న అమరావతి టీడీపీ స్వప్రయోజనాలకు మాత్రమే ఉపకరిస్తుందని, దీని పేరుతో భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, అప్పులు చేస్తున్నారని మండి పడ్డారు. స్వల్ప పెట్టుబడితో అప్పులు లేకుండా మావిగన్ను రాష్ట్ర రాజధానిగా తీర్చి దిద్దవచ్చని అన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తన ఆలోచన విరమించుకోవాలని సూచించారు. అమరావ తి ప్రాజెక్టు ప్రజల సొమ్మును దోచుకోవడానికి, కాంట్రాక్టర్లుకు దోచి పెట్టడానికే తప్ప సామాన్యుడికి ఉపయోగపడేది కాదన్నారు. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మచిలీపట్నం పోర్టు ఉందని, గన్నవరం విమానాశ్రమం, జాతీయ రహదారులు, కృష్ణానది జలాలు వంటి సహజ వనరులు సిద్ధంగా ఉన్నాయన్నారు. -
దుబాయ్లో అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ లభ్యం
సంతబొమ్మాళి: మరువాడ పంచాయతీ ఆర్.మరువాడ గ్రామానికి చెందిన పాల ఈశ్వరరావు దుబాయ్లో అదృశ్యమై కొన్ని రోజుల తర్వాత ఆచూకీ లభించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈశ్వరరావు మే 15న హైదరాబాద్ నుంచి దుబాయ్కు జీవనోపాధి కోసం స్థానిక ఏజెంట్ ద్వారా వెళ్లారు. 16న మెడికల్ నిమిత్తం వెళ్లిన సమయంలో అక్కడ తప్పిపోయారు. భాష రాకపోవడంతో దుబాయ్ పోలీసులు అనుమానించి జైలులో పెట్టారు. అప్పటి నుంచి ఫోన్ చేయకపోవడంతో ఈ విషయం తెలియక ఈశ్వరరావు భార్య భారతి, కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. కొన్ని రోజుల తర్వాత స్నేహితులు గంట గోవిందరావు, పైల కేశవరావుకు ఫోన్ ద్వారా విషయం చెప్పడంతో దుబాయ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ నెల 2న విడిపించారు. శతాధిక వృద్ధురాలు మృతి వజ్రపుకొత్తూరు రూరల్: చినవంక గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు సాన అప్పలమ్మ(102) శుక్రవారం మృతి చెందారు. ఈమె మంకినమ్మ దాసురాలుగా ఉద్దాన ప్రాంత భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించారు. అప్పలమ్మ భర్త, కుమార్తె కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. దీంతో మనవడు ధనరాజ్ అంత్యక్రియలు చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రణస్థలం: పైడిభీమవరం జాతీయ రహదారిపై శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఊక లారీ ముందు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ప్రమాదంలో ఊకలో ఉన్న కార్మికుడు వీరబాబుకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలానికి చెందినవాడిగా గుర్తించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్లాస్టిక్తో పర్యావరణానికి పెనుముప్పు
ఎచ్చెర్ల : పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించే ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలని, విద్యార్థి దశ నుంచే దీనిపై అవగాహన కలిగి ఉండాలని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ గిరిధర్ మద్రాస్ అన్నారు. శుక్రవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ వంటి క్యాంపస్లలో ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించారని, ఇక్కడ కూడా ప్లాస్టిక్ సంచులు, బాటిళ్ల వాడకాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఏవో శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ ప్రకాశరాజు, పెద్దింటి ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. -
ఖరీఫ్కు గడ్డుకాలం!
● మే, జూన్ నెలల్లో సహకరించని వరుణుడు ● జూలైపైనే అన్నదాతల ఆశలు శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మే, జూన్ నెలల్లో వరుణుడు ముఖం చాటేయడంతో జూలై నెలపైనే ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువులు సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాగైతే కష్టమే.. మే, జూన్ నెల వర్షాలను ఒకసారి పరిశీలిస్తే తీవ్ర వర్షాభావ పరిస్థితులే కనిపిస్తున్నాయి. మే నెలలో 100.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 67.8 మి.మీ.లకే పరిమితమైంది. 21 మండలాల్లో సగటు కంటే చాలా తక్కువ వర్షం కురిసింది. మరో మూడు మండలాల్లో చిరుజల్లులతోనే సరిపెట్టింది. సోంపేటలో మాత్రమే సగటు వర్షం కురిసింది. ఈ నెలలో జిల్లా వ్యాప్తంగా సగటుకంటే 32.5 శాతం వర్షాలు తక్కువగా పడ్డాయి. జూన్ నెలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో 30 మండలాల్లో జూన్లో 134.9 మి.మీ.ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 84.4 మి.మీ.ల వర్షం పడింది. ఈ నెలలో కూడా 37.4 శాతం వర్షపాతం తక్కువ నమోదయ్యింది. 8 మండలాల్లో సగటు కంటే తక్కువ వర్షం పడింది. అంటే ఈ నెలలో పూర్తిగా (డెఫిసిటీ) తక్కువ వర్షం పడినట్టు లెక్క. 7 మండలాల్లో చిరు జల్లులతోనే సరిపెట్టింది. సగటు వర్షపాతం కేలం 4 మండలాల్లోనే పడింది. ఇదీ పరిస్థితి.. ఏటా ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతులు 30 మండలాల్లో సుమారు 1,53,060 హెక్టార్లలో వరి పంట వేస్తున్నారు. ఒకప్పుడు 2.25 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వరి సాగయ్యేది. జిల్లా విభజన తర్వాత వరి పంట విస్టీర్ణం తగ్గింది. ఈ ఏడాది జిల్లాలో 1,53,060 హెక్టార్లలో వరి పంట వేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. జూలైలో ఎక్కువగా వెదలు జల్లుతారు. మరికొంత విస్తీర్ణంలో వరి నాటుకునేందుకు నారు మడులు సిద్ధం చేస్తుంటారు. సకాలంలో వర్షాలు లేక చాలాచోట దుక్కిలు సరిగా జరగలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది మే నెలలో వర్షాలు విపరీతంగా కురిశాయి. జూన్లో పంటలు వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ ఏడాది వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మేఘాలు కమ్ముకుంటున్నా వర్షాలు కురవడం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ ఆశాజనకంగా లేదు. – కూన రామారావు, రైతు -
పైసలుంటేనే పని!
శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటు పెడుతున్నారు. పైకమిస్తేనే పనిచేస్తున్నారు. లేదంటే ఫైల్ రిజెక్టే. ఆర్టీఓ ఉన్నతాధికారులు సైతం ఈ వ్యవహారంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. దీని వల్ల కొద్ది రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల బదిలీపై వచ్చి ఓ మహిళా అధికారి వచ్చిన ఫైల్స్ను సైతం ఎలాంటి లోపాలు లేకపోయినా రిజెక్ట్ చేస్తుండడంతో వాహనదారులంతా ఆందోళన చెందుతున్నారు. కారణాలు ఏంటని ప్రశ్నిస్తే మాత్రం ఆమెను నేరుగా కలిస్తేనే సదరు ఫైల్ ఓకే అవుతోంది. మరికొన్ని జటిలమైన పనులకు సైతం ఆమెకు అత్యంత సన్నిహితం గల ఇద్దరు ఏజెంట్లను కలవాల్సిందే. అక్కడ వారు అడిగిన పైకాన్ని అందిస్తే చాలు సా యంత్రానికి కల్లా ఫైల్ చేతిలో ఉంటుంది. ఇటీవల శ్రీకాకుళానికి చెందిన ఓ వ్యక్తి వైట్బోర్డుకు సంబంధించిన నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలను అప్రూవుల్ చేయడానికి వెళ్లగా ఆయన వద్ద నుంచి రూ.600 అదనంగా వసూలు చేసినట్లు తెలిసింది. నరసన్నపేటకు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్కు వెళ్లినా రూ.500 ఏజెంట్ చేతిలో పెట్టాల్సి వచ్చింది. ఎల్ఎల్ఆర్ అప్రూ వుల్ చేయడానికి ఆన్లైన్లో పెట్టుకుంటే నేరుగా అప్రూవుల్ చేయాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసినపుడు ఆర్టీఓను సంప్రదించాల్సిన అవసరం లేదని స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆ మహిళా అధికారి మాత్రం కావాలనే కొర్రీలు వేస్తూ ఫైల్ను రిజెక్ట్ చేస్తోంది. ఏజెంట్లన కలిసి డబ్బులిస్తేనే పని జరుగుతోంది. వాహనానికి సంబంధించిన ఆధార్ సీడింగ్ చాలా అవసరం. ఈకేవైసీ అప్రూవుల్ కుడా ఉచితంగా చేయాలి. కానీ వాటికి కూడా అదనంగా మరో రూ.300 చెల్ల్లించుకుంటే ఓకే అవుతోంది. ఇన్ని డబ్బులు కట్టినా చివరికి ఆమెకు సంబంధించిన ఏజెంట్లకు కుడా అదనంగా మరికొంత పైకం ఇచ్చుకోవాల్సిందేనని లోకల్ టాక్. విచారణ చేయిస్తా ఆర్టీఓ కార్యాలయంలో నాన్ట్రాన్స్పోర్టు వాహనాలకు సంబంధించి జరుగుతున్న అక్రమ వసూళ్లపై విచారణ చేయిస్తాం. ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై చర్యలు తీసుకుంటాం. – విజయసారథి, జిల్లా ఉపరవాణా శాఖాధికారి ఆర్టీఓ కార్యాలయంలో వసూళ్ల దందా ప్రతి పనికీ ఓ రేటు చూసీచూడనట్టు వదిలేస్తున్న ఉన్నతాధికారులు -
సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితా విడుదల
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను జిల్లా లో పక్కాగా పూర్తి చేసి సెప్టెంబరు 22న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు 86.79 శాతం మ్యాపింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం ఈ శని, ఆదివారాల్లో బీఎల్ఓలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటారని అన్నారు. అలాగే ప్రజలు ఓటర్స్.ఈసిఐ.గోవ్.ఇన్ వెబ్సైట్ ద్వారా ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ లేదా ఈసేవ ద్వారా ‘బుక్ ఏ కాల్’ సౌక ర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఎరువుల కొరత లేకుండా ముందస్తుగా 50 శాతం నిల్వలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాకు మొత్తం 37,707 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 17,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామని, 3,524 మెట్రిక్ టన్నుల డీఏపీతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఈసారి నల్లబజారును, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ’ఈ– పంట’ డేటాబేస్ ఆధారంగా, ’ఏపీ ఏమ్స్’, ’ఐఎఫ్ఎంఎస్’ యాప్ల ద్వారా పక్కాగా ఆధార్ అథెంటికేషన్, వేలిముద్రలు లేదా ఓటీపీ ఆధారంగానే ఎరువుల పంపిణీ జరుగుతుందని స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో పోలింగ్ కేంద్రాల్లోనే బీఎల్ఓలు జిల్లాలో ఎరువుల కొరత లేదు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు
జి.సిగడాం : ఖరీఫ్ సీజన్లో ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని కృషి విజ్ఞాశ్రీన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.అనూషా, రణస్థలం ఏడీఏ వడ్డాది శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జి.సిగడాం రైతుసేవా కేంద్రం వద్ద మొక్కజొన్న, వరిసాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ మొక్కజొన్న, వరి పంటలే కాకుండా వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తే మంచి రాబడులు వస్తాయన్నారు. వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకుంటే పంటలపై మరింత అవగాహన కలుగుతుందన్నారు. విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. అనంతరం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన ఆదర్శ రైతులు డోల చిన్నంనాయుడు, బాతువ గ్రామానికి చెందిన కలిశెట్టి ఆదినారాయణలను అభినందించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బెండి బాబ్జీ, ఏఈఓలు మరడ వెంకటేష్, కొమ్ము అప్పారావు, కంబాల జగదేశ్వరరావు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు తిర్లంగి మాధవి, తలచింతల కుసుమ, మొయ్యిల సంతోష్, పట్నాన నర్సింగరావు, సనపల శివ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ బదిలీ
శ్రీకాకుళం/శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగరపాలక సంస్థ కమిషనర్ హనుమంతు కూర్మారావును బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఆయన్ను మాతృసంస్థకు రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కావలి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న శ్రావణ్కుమార్ను శ్రీకాకుళం కమిషనర్గా నియమించింది. కాగా, కూర్మారావు బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల్లోనే శ్రీకాకుళం నగరంలో ప్రబలిన డయేరియాకు బాధ్యుడిని చేస్తూ జిల్లా అధికారులు సస్పెండ్ చేశారు. ఓ నెల రోజుల తర్వాత దానిని రీవోక్ చేస్తూ తిరిగి శ్రీకాకుళం కమిషనర్గా నియమించారు. కూర్మారావు సస్పెండ్ అయిన సమయంలో నగరవాసులతో పాటు కార్యాలయ సిబ్బంది సైతం చాలా బాధపడ్డారు. అదే కార్యాలయ సిబ్బంది తాజాగా కూర్మారావుని మాతృశాఖకు బదిలీచేసినట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయగానే బాణసంచా కాల్చడం చర్చనీయాంశమైంది. కూర్మారావు శ్రావణ్కుమార్ -
ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జూలై 4, 5 తేదీలలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని నమోదు పత్రాలు సమర్పించాలని శ్రీకాకుళం నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని 279 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి ఓటర్ల నుంచి నమోదు పత్రాలు స్వీకరించడం, వాటి ధ్రువీకరణ, డిజిటలీకరణ ప్రక్రియకు సంబంధించిన సేవలు అందిస్తారని చెప్పారు. ప్రతి ఓటరూ నమోదు పత్రాన్ని పూర్తిగా నింపి అవసరమైన ధ్రువీకరణ పత్రాల ప్రతులను బూత్ స్థాయి అధికారికి సమర్పించాలని సూచించారు. ఇంకా నమోదు పత్రం సమర్పించని వారు ప్రత్యేక శిబిరాలను వినియోగించుకోవాలని కోరారు. -
ఉప్పు తిప్పలు
ఏళ్లుగా సాగుకు నోచుకొని ఉప్పు గల్లీలు ఉప్ప తయారీలో దేశంలోనే ఐదో స్థానం. ఉమ్మడి రాష్ట్రంలో రెండో స్థానం. మూడు వేల ఎకరాలకుపైగా ఉప్పు సాగు. నిత్యం వచ్చి పోయే వ్యాపారులు.. నిండుగా కొనుగోళ్లు.. ఒకప్పుడు నౌపడ వైభవమిది. కానీ ఇప్పుడు అక్కడ రైతులు వర్తకం చేయడానికి ‘ఉప్పు’తిప్పలు పడుతున్నారు. సాగు విస్తీర్ణం పడిపోవడం, సిండికేట్వ్యాపారం, ధర లేకపోవడంతో నౌపడ ఉప్పు పరిశ్రమ తన వైభవాన్ని కోల్పోయింది. సంతబొమ్మాళి: నవ రుచులకు తల్లి.. నౌపడ ఉప్పుగల్లీ.. ఒకప్పుడు సిక్కోలు ముక్తకంఠంతో పలికిన మాట ఇది. ఒకప్పుడు ఉప్పు సాగులో దేశంలో ఐదో స్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న నౌపడ ఉప్పు పరిశ్రమ నేడు దయనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలం నౌపడతో పాటు భావనపాడు, మర్రిపాడు, యామలపేట, మూలపేట, కె.లింగూడు పంచాయతీల్లో సుమారు 1000 కుటుంబాలు ఉప్పు పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా 3,200 ఎకరాల్లో ఉప్పు సాగు చేపట్టేవారు. ప్రతి సీజన్లో 5 లక్షల నుంచి ఏడు లక్షల వరకు ( 50కేజీలు) బస్తాలను పండించేవారు. ఇదంత గతం. ఇప్పుడు ఉప్పు సాగు ప్రతి సీజన్ (డిసెంబర్ నుంచి మే నెల వరకు)లో తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం సుమారు 400 ఎకరాల్లో మాత్రమే ఉప్పు సాగు జరుగుతోంది. సుమారు లక్ష బస్తాలు మాత్రమే పండించగలుగుతున్నారు. కారణాలు అనేకం ప్రతి సీజన్లో ఉప్పు సాగు విస్తీర్ణం తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. పండించిన ఉప్పు పంటకు ధర లేకపోవడం ప్రధాన కారణం. కూలి రేట్లు, డీజల్ రేట్లు పెరిగినా ఉప్పు బస్తా ధర మాత్రం పెరగలేదు. 50 కిలోల ఉప్పు బస్తా ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలుకుతోంది. దీనికి తోడు ఉప్పు పండించే సీజన్లో అకాల వర్షాలు పడటం వల్ల రైతులకు అదనపు పెట్టుబడి భారమవుతోంది. మరో వైపు వ్యాపారులు సిండికేట్ కావడంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది. మార్కెట్లో ఉన్న ధరతో సంబంధం లేకుండా సిండికేట్ వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు పండించిన ఉప్పును అమ్ముకోవాల్సిన పరిస్థితి. 2018 సంవత్సరం నుంచి లైసెన్స్లు కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడం, మూలపేట పోర్టుకు కొంత భూమి ఇవ్వడం వంటి కారణాలతో సాగు తగ్గింది. భవిష్యత్లో ఉప్పుసాగు ప్రశ్నార్థకంగా మారుతోందని పలువురు అంటున్నారు. రోజురోజుకూ తగ్గుతున్న నౌపడ ఉప్పు పరిశ్రమ విస్తీర్ణం గతంలో మూడువేల ఎకరాల్లో సాగు ప్రస్తుతం 400 ఎకరాలకు పడిపోయిన వైనం -
రైతులకు న్యాయం చేయాలి
కవిటి: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేసిన విత్తనాలు నారుమడి స్థాయిలోనే మొలకశాతం తగ్గి నష్టపోవడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ నర్తు రామారావు శుక్రవారం పేర్కొన్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ ఆర్జీఎల్ వరి విత్తనాలను కవిటి, కంచిలి, సోంపేట మండలాల్లో రైతులకు అందించిందని, నేటికి 15 రోజులైనా మొలకలు రాలేదన్నారు. బొరివంక, డీజీ పుట్టుగ, కపాసుకుద్ధి, పుటియాదల, డొంకూరు, ఈదుపురం, ధర్మపురం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వెంటనే వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రైతుల తరఫున ఉద్యమం తప్పదన్నారు. జిల్లా మోడరన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ ఎంపికలు రేపు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా మోడరన్ పెంటాథ్లెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మోడరన్ పెంటాథ్లెన్ లేజర్ రన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రధాన కార్యదర్శి పీవీజే కృష్ణంరాజు ఒక ప్రకటనలో తెలిపారు. రాజాంలోని జీసీఎస్ఆర్ డిగ్రీ కళాశాల వేదికగా ఉదయం 9 గంటల నుంచి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాస్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్–15, 17, 19, యూత్, మెన్ అండ్ ఉమెన్ విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలను ఈనెల 11, 12 తేదీల్లో ఏలూరు వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డులను విధిగా తీసుకురావాలని, వివరాలకు 91772 27837 నంబర్ను సంప్రదించాలని కోరారు. వేధింపులపై ఫిర్యాదు శ్రీకాకుళం క్రైమ్: తన ఇద్దరు కుమార్తెలను వేధిస్తున్న వ్యక్తి నుంచి రక్షణ కల్పించాలని శ్రీకాకుళం రూరల్ మండలం రాయిపాడుకు చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీకి శుక్రవారం వినతి పత్రం అందించారు. యాళ్ల చంద్రశేఖర్ అలియాస్ యాళ్ల శ్రీను అనే వ్యక్తి గతంలో కూడా వేధించడంతో శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని, కొన్ని కారణాల వల్ల విత్డ్రా చేసుకున్నామని చెప్పారు. వేధింపులు భరించలేక పిల్లలను విశాఖ హాస్టల్లో చదిస్తున్నామని, సెలవులకు వచ్చినప్పు డు మరలా వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘టెక్కలి సీఐ వేధిస్తున్నారు’ సాక్షి, టాస్క్ఫోర్స్: టెక్కలి సీఐ విజయ్కుమార్ తనను వేధిస్తున్నారని, అక్రమంగా కేసుల్లో ఇరికిస్తున్నారని, స్టేషన్కు వస్తున్న కేసుల్లో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ కొమ్ము తరుణ్ అనే టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో పోస్టు చేశాడు. ఇప్పుడీ వీడియో హాట్ టాపిక్గా మారింది. కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు పేరు చెప్పి ఓ మహిళ వద్ద రూ.40 లక్షలు తీసుకున్నానని తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ కేసులో అసలు ఫిర్యాదు లేకుండా తనను అరెస్టు చేశారని పేర్కొన్నాడు. తాను టీడీపీ కార్యకర్తగా ఉన్నప్పటికీ అన్యాయంగా చిత్రహింసలకు గురి చేస్తూ నరకం చూపించారని, మంత్రి అచ్చెన్నాయుడుకు బంధువునని చెప్పుకుంటూ సీఐ విజయ్కుమార్ అక్రమాలు చేస్తున్నారని ఆరోపణలు చేశాడు. ఈ వీడియో అటు పోలీసు వర్గాల్లో మరో వైపు జిల్లా వ్యాప్తంగా విభిన్న వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదే వీడియో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇదే సీఐ వ్యవహార శైలిపై గతంలో జిల్లా ఉన్నతాధికారులు పలు సమీక్షల్లో హెచ్చరించినట్లు సమాచారం. అరుణోదయ నాగన్న మృతికి సంతాపం పలాస: అరుణోదయం నాగన్నగా గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన పరకాల నాగన్న శుక్రవారం తన నివాసంలో అనారోగ్యంతో మృతి చెందడంతో ఉద్దానం ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో ఒకరై, చివరి వరకు ఆ సంఘాన్ని నడిపించి తన ఆట పాటలతో ప్రజలను ఉర్రూతలూగించిన నాగన్నకు ఉద్దానం ప్రాంతంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం సద్దుమణిగిన తర్వాత పునర్నిర్మాణం జరుగుతున్న సమయంలో 1978 నుంచి ఉద్దానం ప్రాంతంలో ఆయన పర్యటించారు. వజ్రపుకొత్తూరు మండలం మర్రిపాడు వద్ద నిర్మించిన జిల్లా అమరవీరుల స్మారక స్థూపం వద్ద బుర్రకథ దళం బృందంకళాకారులు అరుణోదయ రామారావు, కానూరి వెంకటేశ్వరరావులతో కలసి కళా ప్రదర్శనలు ఇచ్చారు. చివరిగా 2023లో పలాస సూదికొండ కాలనీలో విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి వర్ధంతి సభకు హాజరై నివాళ్లు అర్పించా రు. నాగన్న మృతిపట్ల అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రామారావు, సోమేశ్వరరావు, ఉద్దానం రచయతల సంఘం అధ్యక్షుడు కుత్తుం వినోద్, నిశితాసి, పోతనపల్లి కుసుమ, కొర్రాయి నీలకంఠం తదితరులు సంతాపం తెలియజేశారు. పలాస సూదికొండ కాలనీలో సుబ్బారావు పాణిగ్రాహి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న నాగన్న(ఫైల్) -
ప్రైవేటు భూమికి బదులు ఆలయ భూములు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయానికి చెందిన భూములను ఇచ్చేసి.. ఆలయ పరిసరాల్లోని జిరాయితీ భూములను శాశ్వతంగా వినియోగించుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాథరావు అన్నారు. శుక్రవారం విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్ సుజాత, స్థానిక ఆర్డీవో సాయి ప్రత్యూషలతో కలిసి ఆలయ పరిసరాల్లో ఓ పురాతన భవనాన్ని పరిశీలించారు. ఈ భవనానికి బదులుగా ఆలయానికి చెందిన ఓ విలువైన భూమిని ఇచ్చేయడమో లేదంటే...అందుకు సమాన పరిహార మొత్తాన్ని ఇచ్చేసేలా నిర్ణయాలను తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధికి కావాల్సిన భూముల వివరాలను, ప్రత్యామ్నయంగా చేపడుతున్న చర్యలను ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ నివేదించారు. వీరి వెంట ఏఈవో అప్పలనాయుడు, డీసీ కార్యాలయ సూపరింటెండెంట్ మంగిపూడి ప్రసాద్ తదితరులున్నారు. -
కాకి లెక్కలేనా సర్
ఎకనాలెడ్జ్మెంట్ ఫారం ఉంచడం లేదు గార మండలం చల్లపేట గ్రామంలో ఓటర్లకు ఎకనాలెడ్జ్మెంట్ ఫారం ఇవ్వడం లేదు. రెండు ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్ఓనే తీసుకుంటున్నారు. అడుగుతుంటే తర్వాత ఇస్తామని చెబుతున్నారని ఓటర్లు చెబుతున్నారు. – సావాడ ధర్మారావు, చల్లపేట, గార మండలం మా ఇంటికి ఎవరూ రాలేదు గతంలో సింగుపురం గ్రామంలోనే ఉండేవాళ్లం. ఇప్పుడు ప్రశాంత్ నగర్ కాలనీకి మారిపోయాం. మా ఇంటికి బీఎల్ఓలు రాలేదు. ఏడు ఓట్లు మా ఇంటిలో ఉండగా ఒక్కరికీ ఫారాలు పంపిణీ చేయలేదు. – వారణాశి శమంతకమణిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్).. అంకెలు అంతుచిక్కడం లేదు. ఫారాలు పంపిణీ ముమ్మరంగా జరుగుతోందని సిబ్బంది చెబుతున్నారు. అసలు తమకు ఫారాలే ఇవ్వలేదని చాలా మంది గ్రామస్తులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ జరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫారాల పంపిణీ, స్వీకరణకు మరో 10 రోజుల వ్యవధి ఉంది. జిల్లాలో ఇప్పటికే 98.24 శాతం మేర ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ పూర్తయినట్టు చూపిస్తున్నారు. మొత్తం ఓటర్లు 18,97,405 మంది ఉండగా, 18,64,016 మందికి పంపిణీ చేసినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు ఇవి కాకి లెక్కలని తేటతెల్లం చేస్తున్నాయి. అర్బన్లో ఇలా.. ● జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో కార్యక్రమం దారుణంగా జరుగుతోంది. ● చాలా ఏరియాల్లో బీఎల్ఓలు అడుగే పెట్టలేదు. కానీ, ఆ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో పంపిణీ చేసినట్టు చూపిస్తున్నారు. ● శ్రీకాకుళం నగరంలోని పీఎన్కాలనీ, గైనేటివీధి, ఆదిత్యానగర్ కాలనీ తదితర ప్రధాన ప్రాంతాల్లో కనీసం ఇళ్లను సందర్శించలేదు. వీరి పరిస్థితి ఏమిటో..? ● శ్రీకాకుళం నగరంలోని గైనేటి వీధిలో నివాసముంటున్న కె.సంతోషి 2024ఎన్నికల్లో ఓటు వేశారు. కానీ, తాజాగా చేపడుతున్న సర్ కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు. ● శ్రీకాకుళం నగరంలోని గైనేటి వీధిలో నివాసముంటున్న గొర్లె జనార్ధరావు ఫ్యామిలీకి కూడా ఫారాలు ఇవ్వలేదు. వారికే కాదు ఆ కాంపౌండ్లో మిగతా వారికి ఫారాలు పంపిణీ చేయలేదు. ● శ్రీకాకుళం నగరంలోని పీఎన్కాలనీలోని రెండో వీధిలో ఉంటున్న కె.నాగమణి.. కుటుంబంలోని మిగతా ఓటర్లకు కూడా ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు. ● సారవకోట మండలం కూర్మనాథపురం గ్రామంలో 528ఓట్లకు గాను 200మందికి పైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయలేదు. ● శ్రీకాకుళం రూరల్లోని సింగపురం పరిధిలోని 150 ఇళ్లు ఉన్న దుబలరాయి కాలనీలో ఇంతవరకు బీఎల్ఓలు సందర్శించిన దాఖలాల్లేవు. ఫారాల పంపిణీలో వివక్ష ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ, స్వీకరణ విషయంలో కూడా పలుచోట్ల వివక్ష చూపిస్తున్నారు. ఇంట్లో ఐదుగురు ఉంటే నలుగురికి ఇవ్వడం, మిగతా వారికి ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తూ దాట వేస్తున్నారు. స్వీకరణ విషయంలో మతలబు జరుగుతోంది. ఓటర్ వద్ద ఎకనాలెడ్జ్మెంట్గా ఒకఫారం ఉంచాల్సింది పోయి.. ఆ ఫారం కూడా తీసుకుని తమ చేతుల్లో కొందరు బీఎల్ఓలు పెట్టుకుంటున్నారు. రెండు ఫారాలు బీఎల్ఓలే తీసుకుంటే భవిష్యత్లో ఓటు గల్లంతై ఏమీ అడగలేని పరిస్థితిలో ఓటర్లు ఉంటారు. ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ శాతం నియోజకవర్గాల వారీగా శ్రీకాకుళం 97.63 ఇచ్ఛాపురం 97.65 ఎచ్చెర్ల 98.34 పలాస 96.25 టెక్కలి 97.31 ఆమదాలవలస 99.89 పాతపట్నం 99.06 నరసన్నపేట 99.88 మ్యాపింగ్ కాని ఓట్లు 2,50,627 పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలు 18,64,016 పంపిణీ శాతం 98.24 శాతం డిజిటలైజ్డ్ ఎన్యూమరేషన్ ఫారాలు 9,85,170 జిల్లాలో మొత్తం ఓట్లు 18,97,405 మ్యాపింగ్ అయిన ఓట్లు 16,46,778 ఈ లెక్కల్లో వాస్తవమెంత? అంతుచిక్కని ‘సర్’ అంకెలు అధికారుల నివేదికలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు కుదరని పొంతన 98.24 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్టు నివేదికలు చాలాచోట్ల ఇంకా జరగని పంపిణీ మరో పది రోజులే వ్యవధి ఓటర్ దగ్గర ఎకనాలెడ్జ్మెంట్ ఫారం లేకుండా చేస్తున్నారని ఆరోపణలు -
విశాఖ స్టీల్ప్లాంట్ బాధితులకు న్యాయం చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఐ.ఎఫ్.టి.యు.జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కృష్ణవేణి, ఐ.యన్.టి.యు.సి. నాయుకులు సనపల అన్నాజీరావు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో అంబేడ్కర్ జంక్షన్ వద్ద కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి రూ.50 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. న్యాయ విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, మణికొండ ఆదినారాయణమూర్తి, ఎన్.వి.రమణ, ఎం.గోవర్దనరావు, మెడికల్ రిప్రజెంటివ్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వాసుదేవరావు, వివిధ సంఘాలు నాయకులు కొత్తకోట అప్పారావు, ఎల్.రామప్పడు, మన్యం రమణ, పి.జగ్గారావు, పి.జనార్ధనరావు, కె.వి.ఎల్.ఎస్. ఈశ్వరి, టి.ముత్యాలరావు, డి.కిరణ్, నవిర రామకృష్ణ, శివ, రామ్మోహన్, ఎస్. మల్లేశ్వరరావు, ఎస్.లక్ష్మి, పుణ్యవతి, ఎస్.అప్పలరాజు పాల్గొన్నారు. -
నేతా.. ఇదేం రోత..?
శ్రీకాకుళం: ఆయన ఓ ఎమ్మెల్యే. ఎక్కడైనా తప్పు జరిగితే సరిదిద్దాల్సిన వ్యక్తి. ఎవరికైనా ఇబ్బంది కలిగితే పరిష్కరించాల్సిన నాయకుడు. అలాంటిది సాక్షాత్తు ఎమ్మెల్యేనే చిన్న పిల్లల ఆస్పత్రి పక్కన రాత్రిపూట బర్త్ డే పార్టీ అంటూ నానా హంగామా చేశారు. ఆస్పత్రిలో ఉన్న వారు కంగారు పడిపోయేంత శబ్దాలు చేస్తూ దగ్గరుండి నృత్యాలు నిర్వహించారు. పాతపట్నంలో జరిగిన ఈ సంఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. పాతపట్నంలో బుధవారం రాత్రి స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పుట్టిన రోజు వేడుకలు పట్టణం మధ్యలో ఉన్న ఎరుకోల కాంప్లెక్స్లో జరిగాయి. చిన్నపిల్లల ఆస్పత్రి, పాఠశాలలు వంటివి ఉన్న ప్రదేశంలో రాత్రి సమయం అని కూడా చూడకుండా పెద్ద సౌండ్ సిస్టంతో బర్త్డే పార్టీ చేయడంతో రోగులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈవెంట్ పేరుతో సున్నితమైన ప్రాంతాల్లో డాన్స్లు పెట్టడం సబబు కాదన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు. ఇబ్బంది పెట్టడం దారుణం ప్రశాంత వాతవరణంలో ఉండే పాతపట్నంలో ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకల్లో ఈవెంట్ల పేరుతో నృత్యాలు చేయడం దారుణం. ఈవెంట్ పక్కనే చిన్నపిల్లల ఆస్పత్రి ఉన్నప్పటికి ఈవెంట్లకు పోలీసులు, అధికారులు వత్తాసు పలకడం విడ్డురుంగా ఉంది. ఎమ్మెల్యే దగ్గర ఉండి నృత్యాలు చేయించడం దారుణం. ఆయన ఎమ్మెల్యేగా అనర్హుడు. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే పాతపట్నం -
‘భూగర్భ విద్యుత్’ పనులకు మోక్షం
ఆర్డీఎస్ఎస్ పనులు జిల్లాలో శరవేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ కేబుల్ పనులు నగరంలో వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతానికి 33 కేవీ యూజీ కేబుల్ పనులు జరుగుతుండగా.. 11 కేవీ యూజీ కేబుల్ పనుల కోసం నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఆమోదం కోసం ఫైల్ పంపించాం. జనాలకు ఇబ్బందులు లేకుండా రాత్రి వేళల్లో పనులు పూర్తి చేసేలా కన్స్ట్రక్షన్స్ విభాగ అధికారులకు సూచించాం. విపత్తుల నుంచి జిల్లాలో తీర ప్రాంతాల్లో విద్యుత్ శాఖకు నష్టం వాటిల్లకుండా కవర్డ్ కండక్టర్ల కేబుల్స్ పనులు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. – జీఎన్ ప్రసాద్, ఎస్ఈ, విద్యుత్ శాఖ అరసవల్లి: జిల్లా కేంద్రంలో భూగర్భ విద్యుత్ కేబు ల్ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రీవాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద రూ.459.18 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదించి, ఆయా పనులకు పరిపాలనా అనుమతులతో టెండర్లు ఖరారైపోయాయి. ఈ ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సిన పనులకై 2021లోనే అప్పటి ఎస్ఈ మహేంద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సర్వే చేపట్టారు. నాటి ఈ ప్రతిపాదిత పనులకు ఇప్పటికి గ్రహణం వీడి పునఃప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో భూగర్భ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు ప్రాజెక్టును ఎస్ఈ జీఎన్ ప్రసాద్, కన్స్ట్రక్షన్స్ ఈఈ ఆనంద్ పర్యవేక్షణలో శరవేగంగా జరుగుతుండగా, మరోవైపు తీర ప్రాంత సబ్స్టేషన్ల వద్ద కవర్డ్ కండక్టర్ల ఏర్పాటు పనులకు కూడా మార్గం సుగమమైంది. అమలు ఇలా.. ఆర్డీఎస్ఎస్ పథకంలో భాగంగానే 2022లోనే తొలిసారిగా అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయం ముందు భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు పూర్తి చేసిన విద్యుత్ శాఖాధికారులు.. తాజాగా నగరంలోని మిగిలిన కీలక ప్రాంతాల్లో ఈ భూగర్భ వ్యవస్థ అమలుకు చర్యలు చేపడుతున్నారు. ఈమేరకు ఆదిత్య (అరసవల్లి) 11 కేవీ ఫీడర్, పీఎన్ కాలనీ, శాంతినగర్ కాలనీ, విశాఖ–ఎ కాలనీ, బలగ, సరస్వతి మహాల్, ఆదివారం పేట 11 కేవీ ఫీడర్లకు మొత్తం 23.5 కిలోమీటర్లు మేర అండర్గ్రౌండ్ (యుజి) కేబుల్స్ను రూ.7.65 కోట్లతో వేయనున్నారు. అలాగే అంపోలు నుంచి సర్కిల్ ఆఫీస్ వరకు, చిలకపాలెం నుంచి గుజరాతీపేట వరకు, అలాగే గుజరాతీపేట నుంచి శ్రీకాకుళం ఆవుట్డోర్ సబ్స్టేషన్ వరకు, అలాగే అరసవల్లి సబ్స్టేషన్ నుంచి ఇండోర్ సబ్స్టేషన్ వరకు, శ్రీకాకుళం అవుట్ డోర్ సబ్స్టేషన్ నుంచి ఎఎస్ఎన్ కాలనీ సబ్స్టేషన్ వరకు మొత్తం 25 కిలోమీటర్ల 33 కేవీ ఫీడర్లకు యూజీ కేబుల్స్ను రూ.15.23 కోట్లతో వేయనున్నారు. అలాగే అరసవల్లి సబ్స్టేషన్ నుంచి కొత్త కలెక్టరేట్ వరకు, 33 కేవీ బొరివంక సబ్స్టేషన్ నుంచి మాణిక్యపురం వరకు, అలాగే బొరివంక నుంచి దూగానపుట్టుగ వరకు, అలాగే 33 కెవి రాజపురం సబ్స్టేషన్ నుంచి కవిటి వ్యవసాయ ప్రాంతాల వరకు మొత్తం 254 కిలోమీటర్లు మేర 789 స్పన్ పోల్స్ మీదుగా కవర్డ్ కండక్టర్ కేబుల్స్ వేసేందుకు రూ.26.42 కోట్లు వెచ్చించనున్నారు. శ్రీకాకుళం నగరంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు జరుగుతున్న దృశ్యం రూ.45.46 కోట్ల అండర్ గ్రౌండ్ కేబుళ్లు, కవర్డ్ కండక్టర్ పనులు 2021లో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ప్రతిపాదనలు, సర్వే పూర్తి ఎట్టకేలకు ఆ పనుల కొనసాగింపునకు మోక్షం -
కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వివిధ షెడ్యూల్ పరిశ్రమల కార్మికులు, అంగన్వాడీ, ఆశా, వి.ఓ.ఎ, మధ్యాహ్న భోజనం పథకం తదితర స్కీం వర్కర్లు, కాంట్రాక్టు – అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరు తూ జూలై 30, 31 తేదీలలో కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టనున్న ధర్నాలు విజయవంతం చేయాల ని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని యూటీఎఫ్ జిల్లా భవన్లో సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం గురువా రం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక, ఉద్యోగులు అతి తక్కువ వేతనాల తో తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్నారని చెప్పారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వేతన సవరణ తప్పక జరగాలన్నారు. పరిశ్రమల్లో బలవంతంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనా రాయణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.గణపతి, ఎన్.వి.రమణ, హెచ్.ఈశ్వరరావు, డి.సుధ, డి.ధన లక్ష్మి, బి.ఉత్తర, కె.కేశవరావు, కె.సుశీల, ఎన్.మోహనరావు, ఆర్.చంద్రమౌళి, అంబటి సత్యనారాయ ణ, హేమలత, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. -
అయ్యగారి అక్రమాల రింగ్
కార్యదర్శి కవరింగ్ ఈ ఫొటో చూడండి. జేఆర్పురంలోని గ్రామ కార్యదర్శి తన ఇంటిలో పైడి భీమవరం పంచాయతీ రికార్డులను దగ్గర పెట్టుకుని చూస్తున్నారు. ఈయనేదో పంచాయతీ అభివృద్ధి కోసమో.. నిధులు వినియోగంపై సక్రమ రికార్డుల నిర్వహణ కోసమో నిమగ్నమయ్యారనుకుంటే పొరపాటే. పంచాయతీ నిధులు దుర్వినియోగం అభియోగాలతో సీజ్ చేసిన రికార్డులను పరిశీలిస్తున్న వైనమిది. అధికారుల దగ్గర ఉండాల్సిన రికార్డులు సంబంఽధిత గ్రామ కార్యదర్శి ఇంటిలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఎవరికి వెళ్లకూడదో, వారికే సీజ్ చేసిన రికార్డులు వెళ్లాయి. ఇక, వాటిలో ఏం జరుగుతాయో అందరికీ తెలిసిందే. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మేజర్ పంచాయతీ పైడి భీమవరంలో జరిగిన అక్రమాలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. విచారణ పక్కదారి పట్టించేందుకు వ్యూహరచన చేశారు. దానిలో భాగంగా ఇద్దరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. నిధులు దుర్వినియోగం కథ కంచికి చేర్చేందుకు పక్కా ప్లాన్ చేశారు. విచారణ జరపాల్సిన డీఎల్పీఓను తప్పించి ఎంపీడీఓకు బాధ్యతలు అప్పగించారని కూడా తెలిసింది. సీజ్ చేసిన పంచాయతీ రికార్డులు అధికారులు దగ్గర ఉండాల్సిందిపోయి పంచాయతీ కార్యదర్శి ఇంటికి పంపించారు. ఇప్పుడా రికార్డులు సరిదిద్దే పనిలో పంచాయతీ కార్యదర్శి నిమగ్నమయ్యారు. దానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్ష మయ్యాయి. ఇదేమి నిర్వాకమంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని మేజర్ పంచాయతీ పైడి భీమవరంలో టీడీపీ నేత భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ఎస్సీ మహిళ సర్పంచ్గా కొనసాగిన పంచాయతీలో రూ. కోట్లలో నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతికి సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా టీడీపీకి చెందిన రౌతు శ్రీనివాసరావు వైపు వేళ్లన్నీ చూపిస్తున్నాయి. సర్పంచ్ ప్రతినిధి హోదాలో నిధులు మింగేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫిర్యాదులు సైతం వెళ్లాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే నిధులు గోల్మాల్ జరిగాయి. దీనిపై జూన్ 21వ తేదీన జరిపిన విచారణలో అక్రమాలు బయటపడ్డాయి. ఒక్క ఏడాదిలో రూ.9.43కోట్ల నిధులను వివిధ పనులు, అడ్వాన్సుల రూపేణా ఊదేశారు. సుమారు రూ.3కోట్లు పైచిలుకు నిధులు ఎలాంటి పత్రం లేకుండా అడ్వాన్స్ రూపంలో ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధి, టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు మింగేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు సైతం ఉన్నాయి. పంచాయతీ ఆధికారుల అండతో పంచాయతీ తీర్మానం లేకపోయినా 2025లో ఒకే ఏడాది రూ.9.43 కోట్లు పైచిలుకు నిధులు అడ్డగోలు లెక్కలు చూపించి విత్డ్రా చేశారు. ప్రధానంగా సీసీ రోడ్లు, కాలువలు, కుళాయిలు, విద్యుత్ సామాన్లు, డ్రైనైజీ పెపులు రూపంలో అధిక ఖర్చులు చూపించి వాడుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీరాజ్ చట్ట ప్రకారం రూ. 5లక్షలు దాటి నిధులు డ్రా చేయాలంటే మండల ఉన్నతాధికారులు సంతకాలు కావాలి. ప్రధాన కాంట్రాక్టర్కై నా నిధులు ఒకేసారి వేయడానికి లేదు. అలాంటిది ఎలాంటి అర్హత లేని ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధి పేరుతో టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు అకౌంట్లో నేరుగా రెండు నెలల వ్యవధిలో అడ్వాన్స్ రూపంలో రూ.2.52 కోట్లు నిధులు జమ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. డీఎల్పీఓను మార్చి.. ఎంపీడీఓను పెట్టారా? పంచాయతీ నిధులు అవకతవకలు, అక్రమాలపై ప్రధానంగా విచారణ చేయాల్సింది డీఎల్పీఓనే. పంచాయతీ నిధులు వినియోగంపై వారికే పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీఎల్పీఓను విచారణ అధికారిగా తొలుత నియమించారు. కానీ టీడీపీ నేత బాగోతం ఎక్కడ బయటపడుతుందోననే కుట్రలకు తెర లేపారు. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కోట్లు వ్యవహారం బయటపడితే పరువు పోవడమే కాకుండా పార్టీపై మచ్చ పడుతుందని అక్రమార్కులు సదరు ఎమ్మెల్యేలను ఆశ్రయించారు. వీరిలో ఒకరికి ముడుపులు అందించారని ఆరోపణలు ఉండగా, మరొకరికి భూలావాదేవీలకు సహకరిస్తామని భరోసా ఇచ్చారు. మొత్తానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమదైన శైలిలో ఉన్నతాధికారులపై ఒత్తిడికి తీసుకొచ్చారు. ఏకంగా విచారణ అధికారినే తొలగించి, వారి స్థానంలో స్థానికంగా ఉన్న ఎంపీడీఓను నియమించినట్టు సమాచారం. దీనిపై పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి. నిధులు అవతకవకలను గుర్తించాక పంచాయతీ రికార్డులను అధికారులు సీజ్ చేశారు. ఇదే విషయాన్ని డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ ధ్రువీకరిస్తూ ప్రకటన కూడా చేశారు. పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయి. అవన్నీ అధికారుల వద్ద భద్రంగా ఉండాలి. కానీ, అందుకు భిన్నంగా సీజ్ చేసిన రికార్డులు ఆ గ్రామ కార్యదర్శి చేతికి అందాయి. జీఆర్పురంలోని ఆయన ఇంటికొచ్చాయి. తన ఇంట్లో సదరు రికార్డులను కార్యదర్శి సరిదిద్దే పనిలో పడ్డారు. దానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చేశాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. రికార్డుల మార్ఫింగ్ జరుగుతుందన్న వాదనలకు ఆ ఫొటోలు బలం చేకూర్చాయి. దీని వెనుక ఉన్నదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పైడి భీమవరంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆ వ్యవహారాన్ని కప్పి పుచ్చే ప్రయత్నం ఓ ఇద్దరు ఎమ్మెల్యేల లాబీయింగ్ విచారణాధికారుల దగ్గర ఉండాల్సిన రికార్డులు పంచాయతీ కార్యదర్శి ఇంటికి ఆ రికార్డులను మార్చే పనిలో పంచాయతీ కార్యదర్శి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు -
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ‘మావిగన్’ మూలం
● మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వజ్రపుకొత్తూరు రూరల్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి మూలమని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. వజ్రపుకొత్తూరులో గల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం పార్టీ ముఖ్య నాయకులు, బీఎల్ఏలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సర్ పై బీఎల్ఏలకు దిశానిర్దేశంచేశారు.ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే రాష్ట్ర ప్రయోజనం కోసం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కోసం మాట్లాడారు. దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీని నేడు ఎన్సీఆర్(నేషనల్ క్యాపిటల్ రిజియన్)గా పిలుస్తున్నారని, ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న నోయిడా, గజియాబాద్, గుర్గామ్, ఫరీదాబాద్లకు అనుసంధానంగా సుమారు వెయ్యి కిలోమీటర్ల అవుటర్ రింగు రోడ్డు వేసి ఈ అనుసంధానంగా ఉన్న ఢిల్లీతో పాటు ఈ నాలుగు ప్రాంతాలను కలిపి ఎన్సీఆర్గా పిలుస్తున్నారని గుర్తు చేశారు. దేశ అభివృద్ధికి ఈ ఎన్సీఆర్ మూల స్తంభంగా ఉందని, అదే మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి మావిగన్ పేరుతో కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. అమరావతి, మావిగన్ల మధ్య వ్యత్యాసాన్ని జనాలకు వివరించాలని సూచించారు. వేలాది కోట్లు రాజధాని నిర్మాణం పేరిట వృధా చేస్తున్నారని, మావిగన్కు అంత పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. మావిగన్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పార్టీ శ్రేణులతో కలిసి తీర్మానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ఉప్పరపల్లి ఉదయ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షులు తిర్రి రాజారావు, మాజీ అధ్యక్షుడు పుక్కళ్ల గురయ్యనాయుడు, నియోజకవర్గ గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడు ఇరోతు హేమంత్, జిల్లా అధికార ప్రతినిధి బమ్మిడి దుర్యోధన, కర్ని శ్రీను, మండల బూత్ కన్వీనర్ కరుణాకర్ ఉన్నారు. 107 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2358 పోలింగ్ కేంద్రాలకు అదనంగా కొత్తగా మరో 107 కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలను సిద్ధం చేశామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పో లింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణపై మాట్లాడా రు. ఇచ్ఛాపురంలో 20, పలాసలో 18, టెక్కలిలో 4, శ్రీకాకుళంలో 45, ఆమదాలవలసలో 11, ఎచ్చెర్లలో 9 చొప్పున కొత్త కేంద్రాలను ప్రతిపాదించగా, నరసన్నపేట, పాతపట్నం నియోజకవర్గాల్లో ఎలాంటి మార్పులు లేవన్నా రు. పలాస నియోజకవర్గంలో 7 పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పులతో పాటు ఇచ్ఛాపురంలో ఒకటి, పలాసలో ఒకటి, టెక్కలిలో రెండు, ఆమదాలవలసలో రెండు చొప్పున మొత్తం 6 చోట్ల మార్పులు ప్రతిపాదించామన్నారు. -
పరిమితికి మించి తవ్వవద్దు
నదిలో ఇసుకను పరిమితికి మించి తవ్వుతున్నారు. దీంతో సమీప పంట పొలాల్లో నీరు ఇంకిపోతున్నాయి. నదిలో 15 అడుగుల లోతులో పెద్ద గోతులు పెట్టి ఇసుకను తవ్వుతున్నారు. అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలపై పరిమితులు పెట్టాలి. – జాయి వెంకటరమణ, బుచ్చిపేట రోడ్లన్నీ పోయాయి ఇసుక లారీల వల్ల మా రోడ్లన్నీ పాడైపోయాయి. నడవలేక పోతున్నాం. నదికి వెళ్లే ఒకే ఒక మార్గా న్ని ధ్వంసం చేశారు. రోడ్డును బాగు చేయాలి. – కొన్న సూరన్నాయుడు, బుచ్చిపేట మృతదేహం తీసుకెళ్లాలన్నా ఇబ్బందే శ్మశాన స్థలం ఆక్రమించి పోగులు వేశారు. అంత్యక్రియలు చేసేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. స్కూల్ పిల్లలు ఇసుక లారీలతో అనేక అవస్థలు పడుతున్నారు. ఏ క్షణానికి ఏ ప్రమాదం జరుగుతుందో అనే భయం కలుగుతుంది. గతంలో హాయిగా ఉండే వాళ్లం. – మార్పు సురేష్, బుచ్చిపేట -
నిరంకుశత్వంపై.. నిరసన జ్వాల
● ఇసుక అక్రమ రవాణాపై బుచ్చిపేట గ్రామస్తుల ఆగ్రహం ● శ్మశానం కూడా మిగలకుండా తవ్వేస్తున్నారని మండిపాటు నరసన్నపేట వంశధార నదిలో బుచ్చిపేట నుంచి చేనువలస వరకూ ఇసుకాసురులు విధ్వంసం సృష్టిస్తున్నారు. మొత్తం నది స్వరూపమే మారిపోయేలా ఇష్టానుసారం ఇసుక దోచుకుంటున్నారు. ప్రస్తు తం నదిలో పొడి ఇసుక అన్నదే లేదు. అంతా తడి ఇసుకే అందిన మేరకు లోతుకు వెళ్లి తవ్వేస్తున్నా రు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో గ్రామస్తులంతా గురువారం ఇసుక ర్యాంపు నిర్వాహకుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. నదిలో నుంచి వస్తున్న టిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో గురువారం మధ్యాహ్నం వరకూ బుచ్చిపేట ఇసుక ర్యాంపు మార్గంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు ఇసుక లారీల సిబ్బంది వాదనకు దిగారు. ఇసుక ర్యాంపు నిర్వాహకులు వచ్చే వరకూ.. సమస్యలు పరిష్కరించే వరకూ లారీలను విడిచి పెట్టబోమని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక లారీల సిబ్బంది ఇసుక ర్యాంపు నిర్వహకులకు సమాచారం ఇచ్చారు. రోడ్డు ఛిద్రం చేస్తున్నారు.. ఈ సందర్భంగా గ్రామస్తులు జాయి శ్రీను, కొన్న శ్రీనివాసరావు తదితరులు మాట్లాడుతూ ఇసుక ర్యాంపు నిర్వహకుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘లారీల రాకపోకలతో రోడ్లు ఛిద్రమవుతున్నాయి. ఏటికి వెళ్లే రోడ్లు మరింత దారుణంగా మారుతున్నాయి. ఇదే మార్గంలో శ్మశానం ఉంది. శవాన్ని తీసుకువెళ్లేదుకు కూడా అవస్థలు పడుతున్నాం. అలాగే నదిలో ఇష్టానుసారంగా గోతులు పెట్టి అందిన మేరకు ఇసుక తవ్వేస్తున్నారు. దీంతో గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడుతోంది. సమీప పొలాలు, జీడి తోటలు నీరు లేక ఎండిపోతున్నాయి. ఉదయం పూట స్కూల్ బస్సు లు వచ్చే సమయంలో లారీలతో ఇబ్బంది అవుతోంది. స్కూ ల్ పిల్లల సైకిళ్లు బురదలో కూరుకుపోతున్నాయి’ అంటూ తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఏకరువు పెట్టారు. అనంతరం ఇసుక ర్యాంపు నిర్వహకులు వచ్చి గ్రామస్తులతో సంప్రదింపులు చేసి రోడ్డును అభివృద్ధి చేస్తామని, ఇసుక లారీలతో పిల్లలకు, గ్రామస్తులకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
ఆమదాలవలస: పట్టణంలోని పలు ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (రూరల్) బి.రజిని గురువారం తనిఖీ చేశారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఎరువుల నిల్వలు, విక్రయ రికార్డులు, ధరల పట్టికలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, పంపిణీ విధానాన్ని పరిశీలించి డీలర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ) కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయించరాదని స్పష్టం చేశారు. రైతులకు విక్రయించే ప్రతి ఎరువుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలని, నిబంధనలను ఉల్లంఘించిన డీలర్లపై ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏపీఏఐఎంఎస్ యాప్ ద్వారా మాత్రమే ఎరువులు విక్రయించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి వ్యవసాయ అధికారి నవీన్, వ్యవసాయ సహాయకులు పాల్గొన్నారు. -
జెడ్పీలో కారుణ్య నియామకాలు
అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్యంలో పనిచేస్తూ..వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాల్లో అర్హులకు గురువారం కారుణ్య నియా మాకాల్లో భాగంగా ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగ నియామకపత్రాలను జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజ య అందజేశారు. జెడ్పీ సీఈఓ ఆర్.వెంకట్రామన్ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు దేవాది లక్ష్మణరావుకు జలుమూరు ఎంపీపీ కార్యాలయంలో, పట్ట రామినాయుడుకు సారవకోట ఎంపీపీ కార్యాలయంలో, వంగర లోకేష్కు జి.సిగడాం ఎంపీపీ కార్యాలయంలో, గొర్లె నిరోషకు బూర్జ ఎంపీపీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్లుగా నియమించారు. జిల్లా పరిష త్ యాజమాన్యంలో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తు న్న ఎస్.ప్రణీత్కుమార్కు సింగుపురం జెడ్పీ హైస్కూల్లో, జి.శ్రీనివాసరావుకు బొద్దాం జెడ్పీ హైస్కూల్లో, ఇ.రాజశేఖర్కు ఆదపాక జెడ్పీ హైస్కూల్లో రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. కార్యక్రమంలో సి–సెక్షన్ ఏఓ ఉరిటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణంతో సర్వస్వం కోల్పోయినా ఇంత వరకు తమ కుమార్తెలిద్దరికి పీడీఎఫ్ పరిహారం చెల్లించలేదని తండ్రి గిన్ని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక విలేకర్లతో ఆయన మాట్లాడుతూ అర్హుల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ తన కుమార్తెలు గిన్ని నోమేశ్వరి, గిన్న జ్యోతిలకు పరిహారం చెల్లించలేదన్నారు. ఈ విషయాన్ని మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లినా న్యాయం జరగలేదన్నారు. టీడీపీ కార్యకర్త అయిన తాను గత ప్రభుత్వం హయాంలో పోర్టు భూములు ఇవ్వడానికి అప్పట్లో అంగీకరించలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక భూములు ఇచ్చేందుకు సిద్ధపడి సంతకం చేశానన్నారు. అయినా పరిహారం ఇవ్వకుండా జాప్యం చేయడం తగదన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన వంటివి వెంటనే చేపట్టాలని ఎన్జీవో సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశా రు. గురువారం కలెక్టరేట్ వీసీ హాలులో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యలపై ప్రస్తావించారు. కార్యక్రమంలో ఎపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, కోశా ధికారి బడగల పూర్ణచంద్రరావు,పూజారిజానకిరాం, డి.శ్రీరామ్, బొచ్చ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 11న జాతీయ లోక్ అదాలత్ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాజీకి అనువైన కేసులను పరిష్కరించుకుని దీర్ఘకాలిక న్యాయపోరాటాలకు ముగింపు పలకాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు విజ్ఞప్తి చేశారు. కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రజా ప్రయోజన సేవలకు సంబంధించిన వివాదాలను పరస్పర రాజీ మార్గంలో, తక్కువ సమయంలో పరిష్కరించుకునేందుకు శాశ్వత లోక్ అదాలత్ సేవలను ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని శాశ్వత లోక్ అదాలత్ చైర్మ న్ జి.రజిని పిలుపునిచ్చారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని సంస్థ ప్రాంగణంలో వివి ధ శాఖల అధికారులతో వారు అవగాహన కార్య క్రమం నిర్వహించారు. రవాణా, పోస్టల్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆస్పత్రి, బీమా, బ్యాంకింగ్, గ్యాస్ సరఫరా వంటి ప్రజా ప్రయోజన సేవల వివాదాలను ఈ అదాలత్ ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
వీబీజీ రామ్జీ పథకం ప్రారంభం
శ్రీకాకుళం రూరల్ : వికసిత్ భారత్ జీ రామ్జీ పథ కం ద్వారా 125 రోజుల పనిదినాలను కల్పిస్తున్న ట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని గూడేం గ్రామంలో వీబీ జీ రామ్జీ పథకాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా ఇప్పటివరకూ వంద రోజులు పని కల్పించారని, తాజాగా వీబీ జీ రామ్జీ ద్వారా అదనంగా మరో 25 రోజులు పని కల్పిస్తున్నట్లు తెలిపారు. జలధార జలహారతి కింద 90 రోజుల పాటు ఫీడర్ ఛానెల్లో పనులు, చెరువుల పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. ఇకపై గ్రా మాల్లో రోడ్లు, కాలువలు, మరుగుదొడ్లు, అంగన్వా డీ, స్కూల్ పనులు చేసుకునేందుకు వెసులుబాటు ఉందన్నారు.కార్యక్రమంలో డ్వామా పీడీ లవరాజు, ఎంపీడీవోలు, ఏపీడీ, గ్రామస్తులు పాల్గొన్నారు. -
విద్యా కానుకలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు
పాతపట్నం: విద్యా సంవత్సరం ప్రారంభమై రోజు లు గడుస్తున్నా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంత వరకు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు అందించకపోవడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని, కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ను గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. గురువారం పాతపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, మండ ల కన్వీనర్లు, బీఎల్ఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా జరుగుతున్న ఓటర్ల సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమావే శంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ జాయింట్ సెక్రటరీ చింతాడ సూర్యనారాయణ, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు రెడ్డి రామారావు, రాష్ట్ర వైఎస్సార్ టీయూసీ విభాగం జాయింట్ సెక్రటరీ ఇప్పిలి నారాయణరావు, నియోజకవర్గ బూత్ అధ్యక్షుడు ఏనుగుతల సూర్యం, బైపోతు ఉదయ్కుమార్, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ సెక్రటరీ సవర రమేష్, మండల పార్టీ అధ్యక్షులు గండివలస ఆనందరావు, మీసాల వెంక ట రామకృష్ణ, పెనుమజ్జి విష్ణుమూర్తి, బూత్ కమిటీ అధ్యక్షులు గోకవలస రాము, రవి, సాధుబాబు, ప్రసాదరావు, చిన్నారావులు, మామిడి గంగధర్, రాజు తదితరులు పాల్గొన్నారు. -
తగ్గిన కోతుల బెడద
మెళియాపుట్టి: పరశురాంపురం పంచాయతీ పరిధి లోని తూముకొండ రామచంద్రాపురం (టీకేఆర్ పురం), రంగడిఘాటి, పరశురాంపురం తదితర గ్రామాల్లో కొద్దిరోజుల క్రితం వందల సంఖ్యలో కోతులు, వానరాల పిల్లలు సంచరిస్తుండేవి. ఎక్కడ చూసినా ఇవే కనిసిస్తుండటంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఈ విషయమై సాక్షిలో పలుమార్లు ‘వామ్మో వానరాలు’ పేరిట కథనాలు ప్రచురితం కావడంతో అటవీశాఖ అధికారులు స్పందించారు. గ్రామంలోని కోతుల ను కొంచెంకొంచెంగా పట్టుకుని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లడంతో ప్రస్తుతం వాటి బెడద తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. గతంలో చుట్టుపక్కల ఉన్న పోడు వ్యవసాయ పంటలు, కూరగాయల పంటలను కోతలు నాశనం చేసేవని, చిన్నపిల్లలను వెంబడిస్తూ ఇబ్బందిపెట్టేవని, ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ఆనందంగా ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అకస్మాత్తుగా వందల సంఖ్య లో కోతులు మా గ్రామ పంచాయతీలో కనిపించాయి. ఎలా వచ్చాయో.. ఎవరు తెచ్చి విడిచిపెట్టారో తెలీదు. అప్పటి నుంచి ఫారెస్ట్ అధికారులు, తహసిల్దార్ దృష్టిలోకి తీసుకెళ్లాం. ఈ విషయమై ‘సాక్షి’లో కథనాలు ప్రచురితం కాగానే అధికారు లు స్పందించి కొద్దిరోజుల క్రితమే కోతులను తరలించారు. అరకొరగా మిగిలి ఉన్న వాటిని కూడా తరలించాలి. –తెంబూరు ప్రసాదరావు, తాజా మాజీ సర్పంచ్, పరశురాంపురం -
సిస్కో పోలీస్ స్టేషన్ పునఃప్రారంభం
రణస్థలం: పారిశ్రామిక అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, అందుకు శాంతిభద్రతల ప్రాధాన్యత అవసరమని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జెట్టి తెలిపారు. పైడిభీమవరం పారిశ్రామికవాడలో ఏర్పాటు చేసిన సిస్కో (శ్రీకాకుళం ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్) పోలీస్ స్టేషన్ను ఆయన గురువారం పునఃప్రారంబించారు. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ నిధులు రూ. 20లక్షలు వెచ్చించి మళ్లీ తయారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతంలో నియంత్రణ, అత్యవసర సంఘటనలపై తక్షణ స్పందన ఉంటుందని చెప్పారు. అనంతరం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ఏడాదిగా డాక్టర్ రెడ్డీస్ పరిశ్రమ సౌజన్యంతో సిస్కో పైడిబీమవరం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. గతంలో మాదిరిగా ప్రారంభించి వదిలేయకుండా ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఉండాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వి.నారయణరెడ్డి, అదనపు ఎస్పీలు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐ ఎం. అవతారం, ఎస్సై చిరంజీవి, సిస్కొ పరిధిలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు ఉన్నారు. -
జాతీయ ఆర్చరీ పోటీల్లో సిక్కోలు హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా ఆర్చరీ పోటీల్లో జిల్లాకు చెందిన ఆర్చరీ క్రీడాకారులు సత్తాచాటారు. గోవా వేదికగా జూన్ 26 నుంచి 29 వరకు ఆలిండి యా యూత్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఓపెన్ నేషనల్ ఆర్చరీ పోటీల్లో శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్కాలనీలో ఉన్న ఫ్యూచర్ ఆర్చరీ అకాడమీ విద్యార్థులు అద్భుత ప్రతిభతో ఆకట్టుకున్నారు. అకాడమీ కోచ్ డొంక సంతోష్ సారథ్యంలో జి. జోష్య తులశ్రీ బంగారు పతకం, జె.రిషాన్ రజతం, కె.పూర్ణానంద బృందం రజతం, ఎ.దుష్యంత్ రజతం, కె.జక్షిత్ రామ్ కాంస్యం, బి.సమీర రాణి రజతం, ఎం.చరణ్ తేజ కాంస్యం, వి.ఎస్.భరత్ రజ తం, ఆర్.యశ్వంత్, పి.ఈక్షిత్ రామసాయి, వి.ఎస్.భరత్ టీమ్ బంగారు పతకాలు, బి. నిత్య బంగారం, జి.దేవరాజ్ రజత పతకాలు సాధించారు. వీరందరినీ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం అభినందించారు. -
ఆర్ఓబీల ఏర్పాటుకు స్థల సేకరణ
పలాస: నీలావతి, సున్నాదేవి రైల్వే ఎల్.సి.గేట్లు వద్ద ఆర్ఓబీల కోసం స్థల సేకరణ జరుగుతోందని, ఆ ప్రాంతాల్లో ఉన్న రైతులు సహ కరించాలని పలాస ఆర్డీవో ఆర్.అప్పలరాజు కోరారు. ఈ మేరకు బుధవారం రెవెన్యూ అధికారులు, రైల్వే సిబ్బందితో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి అభిప్రాయాలను సేకరించా రు. కార్యక్రమంలో తహశీల్దారు బి.శ్రీదేవి, రైల్వే లైజనింగ్ ఆఫీసర్ డేవిడ్ రాజు,రైల్వే సెక్షన్ ఇంజినీరింగ్ సిబ్బంది, ఆర్ఐలు పాల్గొన్నారు. హిరమండలం: భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు. ఎల్ఎన్పేట మండలం గోలుకుప్ప గిరిజన గ్రామంలో రైతులు రీ సర్వే ను అడ్డుకోవడంతో గురువారం ఆర్డీవో కృష్ణమూర్తితో కలిసి పర్యటించారు. భూముల రీ సర్వే వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. అయినప్పటికీ రైతు లు సంతృప్తి చెందకపోవడంతో రీ సర్వే జరిగే లా రైతులతో మాట్లాడాలని తహసీల్దార్ ఈశ్వ రమ్మను ఆదేశించారు. అనంతరం అగ్రహారంలో సర్ ప్రక్రి యను పరిశీలించారు. తురకపేట సెంటర్లోని ఎరువుల దుకాణం తనిఖీ చేశారు. కార్యక్రమంలో డీటీ నీలిమ, సిబ్బంది పాల్గొన్నారు. అరసవల్లి: జిల్లా పరిషత్ యాజమాన్య పరిధి లో సీనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఇద్దరికి ఏఓలుగా పదోన్నతులు కల్పిస్తూ జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, జెడ్పీ సీఈవో ఆర్.వెంకట్రామన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశా రు. నీలాద్రిరావుకు జి.సిగడాం మండల పరిష త్ కార్యాలయ ఏఓగా, వి.దేవిప్రసాద్కు మెళి యాపుట్టి మండల పరిషత్ కార్యాలయ ఏఓగా నియమించారు. కార్యక్రమంలో సి–సెక్షన్ ఏఓ రమేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి రూరల్: బొప్పాయిపురంసమీపంలో జాతీయ రహదారిపై గురువారం ఓ కారు అతివేగంగా వచ్చి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. విశాఖపట్నం నుంచి పలా స వైపు వస్తుండగా ఇరుకు వంతెన వద్ద కారు ను అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారు లో ఉన్న జి.కమల, కె.విజయ, జి.అనూషలకు స్వల్పగాయాలు కాగా డైవర్కు ఎటువంటి గాయాలు కాలేదు. క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. టీడీపీకి ఇన్చార్జి కావాలా..? వద్దా..? రణస్థలం: టీడీపీ ఎచ్చెర్ల నియోజకవర్గానికి ఇన్చార్జి కావాలా.. వద్దా అంటూ జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, తణుకు ఎమ్మెల్యే, జోనల్ కో ఆర్డినేటర్ ఎ.రాధాకృష్ణ, పార్లమెంటరీ ఇన్చార్జి కిమిడి నాగార్జున అభిప్రాయ సేకరణ చేసినట్లు టీడీపీ శ్రేణుల భోగట్టా. రణస్థలం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో టీడీపీ ఎచ్చెర్ల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సమక్షంలో నిర్వహించారు. సమావేశం అనంతరం ఒక గదిలో నియోజకవర్గ అభివృద్ధి, ఇక్కడ టీడీపీ ఇన్చార్జి అవసరమా లేదా అని అభిప్రాయాలు తెలుసుకున్నారని సమాచారం. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని సంధ్య గజపతి, డీజీఎం ఆనందరావు, ముప్పిడి సురేష్, చౌదరి బాజ్జిలతో పాటు పలువురి పేర్లు ప్రధానంగా ఉన్నట్లు వినికిడి. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుకే ఇన్చార్జి ఇస్తారనే గుసగుసలూ వినిపించాయి. -
ప్రభుత్వ స్థలం ఆక్రమణకు యత్నం
హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండంలో ఆక్రమణలకు, అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారు. చివరకు బస్ సెల్టర్ నిర్మాణం కోసం కూటాయించిన స్థలా న్ని సైతం విడిచిపెట్టడం లేదు. అలికాం–బత్తిలి ప్రధాన రహదారి చెంతనే న్యూగొట్టా బ్యారేజీ సెంటర్లో బస్టాండ్ లేకపోవడంతో షెల్టర్ నిర్మాణానికి స్థలం కేలాయించారు. 2022లో ప్రస్తుత కేంద్ర మంత్రి, నాటి ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు శంకుస్థాపన చేశారు. కానీ ఎందుకో బస్టాండ్ నిర్మా ణం జరగలేదు. ఈ క్రమంలో ఓ వ్యక్తి సదరు స్థలంలో నిర్మాణం మొదలుపెట్టాడు. ఇప్పటికి పునాదుల స్థాయిలో నిర్మాణాలు పూర్తయినా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదు లు చేయడంతో తహశీల్దారు బాలకృష్ణ స్పందించా రు. ఆర్ఐ ,వీఆర్వోలను పంపించి పనులను నిలిపివేశారు. అక్కడ వీలైనంత త్వరగా బస్టాండ్ నిర్మా ణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. -
బొబ్బిలి సబ్ జైలుకు జర్నలిస్ట్ కేవీఆర్
సాక్షి, విజయనగరం: కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఏపీలో సాగుతున్న అరాచకాలపై గళమెత్తిన జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతోంది. మంత్రి లోకేష్ ‘రెడ్ బుక్’ పేరుతో ఏపీలో సాగిస్తున్న రాజకీయ విధ్వంసాన్ని ప్రశ్నించినందుకు.. తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కేవీఆర్ (KVR)ను ఏపీ పోలీసులు అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేశారు.తన యూట్యూబ్ ఛానల్లో ఏపీలోని పరిస్థితులను ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అని వ్యంగ్యంగా ప్రస్తావిస్తూ కేవీఆర్ చేసిన వ్యాఖ్యలను.. కావాలనే భారత రాజ్యాంగానికి ఆపాదిస్తూ కూటమి కార్యకర్తలు ఏపీలో పలు చోట్ల ఫిర్యాదులు చేశారు. విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలోని పోలీస్ బృందం తీవ్ర ఒత్తిడిల నడుమ హైదరాబాద్లోని సరూర్ నగర్లో ఉన్న కేవీఆర్ నివాసంలో ఆయన్ను అరెస్ట్ చేసింది. కనీసం 41-ఏ నోటీసు కూడా ఇవ్వకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఈ అరెస్ట్ సాగింది.మరోవైపు పోలీసుల నోటీసులకు స్పందించలేదన్న కారణాన్ని చూపిస్తూ.. బొబ్బిలి న్యాయస్థానం కేవీఆర్కు 14 రోజుల రిమాండ్ విధించడంతో ఆయన్ను బొబ్బిలి సబ్ జైలుకు తరలించారు. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాలను కాలరాస్తూ.. మఫ్టీలో వచ్చి జర్నలిస్ట్ కేవీఆర్ను అరెస్ట్ చేసే క్రమంలో ఆయన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించి, పిల్లలను భయభ్రాంతులకు గురిచేసిన బొబ్బిలి రూరల్ సీఐ కె. శ్రీనివాస్పై తెలంగాణలోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ను కేవీఆర్ భార్య విజయలక్ష్మి పోలీసులకు సాక్ష్యాలుగా అందజేశారు. గత రెండు నెలలుగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ కేసులో ఏపీ పాలకులు మరికొన్ని అరెస్టులకు కూడా వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. -
పారదర్శకంగా ప్రభుత్వ సేవలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు లబ్ధిదారులకు పారదర్శకంగా అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి బుధవారం వివిధ శాఖల ప్రగతిపై మండల స్థాయి అధికారులతో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక సరఫరా, విద్యుత్ సేవలు వంటి అంశాల్లో ప్రజా సంతృప్తి శాతం ఆశించిన స్థాయిలో లేదని, క్షేత్రస్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వీటిని తక్షణమే మెరుగుపరచాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందే అర్జీలను గడువులోగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
● ఎరువుల కోసం పడిగాపులు
రైతులకు ఎరువుల కష్టాలు మొదలయ్యాయి. ఆమదాలవలస పట్టణంలో ఎరువుల దుకా ణాల నుంచి ప్రభుత్వం అందించే యాప్ ద్వారా రైతు లకు ఎకరాకు ఒక బస్తా చొప్పున యూరియా అందిస్తున్నారు. పట్టణంలోని 4 దుకాణాలకు వ్యవసాయశాఖ అధికారులు అనుమతులు ఇచ్చారు. అధిక ధరలకు అమ్మకూడదని, పురుగు మందులు కూడా కొనాలని ఒత్తిడి చేయకూడదని ఆదేశించారు. అయితే ఈ నిబంధనలు అమలు కావడం లేదని రైతులు చెబుతున్నారు. యూరియా బస్తాలు కూడా సకాలంలో అందడం లేదని, మూడు రోజులుగా దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని వాపోతున్నారు. గతంలో రైతుభరోసా కేంద్రాల వద్ద సలువుగా ఎరువులు అందేవని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
11, 12 తేదీల్లో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఈ నెల 11, 12 తేదీల్లో జరగనున్న జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను విజయవంతం చేయాలని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యనిర్వాహక కార్యదర్శి, మీట్ స్పాన్సర్ నారాయణశెట్టి వెంకట కిరణ్కుమార్ పిలుపునిచ్చారు. పోటీలు జరగనున్న శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా బుధవారం టోర్నమెంట్ బ్రోచర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్కుమార్, సీఈఓ సంపతిరావు సూరిబాబు మాట్లాడుతూ అండర్–11, 13, 15, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు పోటీలు నిర్వహిస్తామన్నారు. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, ఈ నెల 9లోగా 9440255255, 8328514385 నంబర్లకు ఫోన్చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ సంఘ జిల్లా కోశాధికారి, పీపీ గోర అనిల్కుమార్, గురుగుబెల్లి ప్రసాద్, మదీనా శైలానీ, మెండ శాంతికుమార్, కంచరాన వైకుంఠరావు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. మావిగన్కే ప్రజల మద్దతు మందస: మావిగన్తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. మందస మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బీఎల్ఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మావిగన్కు పలాస నియోజకవర్గం నుంచి ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కూటమి పాలనలో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. అమరావతి పేరుతో రైతులను మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా బగాది శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమాఖ్య చైర్మన్, సీనియర్ న్యాయవాది బగాది రామమోహనరావును రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని నమోదిత వినియోగదారుల స్వచ్ఛంద సంస్థల విభాగం ప్రతినిధిగా ప్రభుత్వం నామినేట్ చేసింది. ఈ కమిటీకి పౌర సరఫరాల శాఖ మంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈయన మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. క్రమశిక్షణతో చదవండి ఎచ్చెర్ల : క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, నైపుణ్య ఆధారిత విద్యపై దృష్టి సారించాలని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ గిరిధర్ మద్రాస్ అన్నారు. బుధవారం వర్సిటీలో విద్యార్థులకు బ్రాంచిల వారీగా ప్రవేశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారేనని, పట్టుదలతో చదివి మంచి ఇంజినీర్లు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి శివరామకృష్ణ, డీన్ శాస్త్రి, ఫైనాన్స్ అధికారి వాసు, సాగర్, ప్రకాశరావు, యోగీశ్వరరావు, ముని రామకృష్ణ, మోహనకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ ఈఏపీసెట్లోసిక్కోలు జోష్
● పొందూరు విద్యార్థికి రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు ● ఇంజినీరింగ్లో 4722 మంది, అగ్రికల్చర్, ఫార్మసీలో 2198 మంది అర్హత శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యార్థులు ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగాల్లో మెరుగైన ర్యాంకులు సాధించారు. పొందూరుకు చెందిన కోరుకొండ శ్రావ్య ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకుతో మెరిసింది. మెళియాపుట్టి మండలం మాకన్నపళ్లికి చెందిన తండ్యాల మురళి 71వ ర్యాంకు సాధించాడు. ఇంజినీరింగ్ విభాగంలో 6557 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 4722 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 2446 మంది పరీక్ష రాయగా 2198 మంది అర్హత సాధించారు. అదరగొట్టారు.. నరసన్నపేటకు చెందిన తండ్యాల పవన్సాయి 106వ ర్యాంకు, సంతబొమ్మాళి మండలం కళింగ వీధికి చెందిన అల్లు రోహిత్ 110, శ్రీకాకుళం నగరానికి చెందిన నక్క పవన్ 161, రాజాంలోని కస్పా వీధికి చెందిన వడ్డాది చరణ్ 180వ ర్యాంకు సాధించారు. జిల్లాకు చెందిన పెద్దింటి మాధవ్ 246వ ర్యాంకు, ఎండ నవదీప్ 251, పైడి దినేష్ 323, వరుణీష్ మహాపాత్ర జామి 347, బొడ్డేపల్లి మనోజ్ 363, శ్రీకర్ కణితి 372, గురువు హైందవి 374, కొండల కనిష్క 417, సకలాబత్తుల యశ్వంత్ 465, బి.కౌషిత 521, ఎస్.కళ్యాణ్క్రాంతి 596, ఎన్.అరుణ్రాజ్ 597, నరవ రోషన్రామ్ 602, ఎం.జ్యోతీష్కుమార్ 630, పి.సాయిగౌతమ్ 648, నల్ల చరణ్ 677, పి.లక్ష్మీప్రణీత 699, జి.రుషిత 723, ఎం.హరినాక్ష్ 735, కంచరాపు రేవంత్కుమార్ 766, పి.లహరి 785, కె.లక్ష్మికౌషిక్ 786, వడ్డి మురళికృష్ణ 871, అన్నెపు నితిన్ 936, ఎన్.లావణ్య 952, జరుగుళ్ల లక్ష్మిసంజయ్ 985వ ర్యాంకులు సాధించారు. వీరంతా నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్ధులు కావడం విశేషం. -
నిరంతరం లీకులే..
ఆమదాలవలస: తాగునీటి పైపులైన్లకు మరమ్మతుల పేరిట లక్షల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం దక్కడం లేదని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిట్టమ్మ క్వార్టర్స్, గేటు ప్రాంతం, మేదర వీధి, పాత ఆమదాలవలసకు వెళ్లే పైపులైను లీకేజీ కారణంగా నీరు కలుషితమవుతోంది. మెట్టక్కివలస నుంచి పాత ఆమదాలవలసకు వచ్చే పైపులైను రైల్వే ట్రాక్ కల్వర్టు కింద పూర్తిగా పాడై మురుగునీటిలో కూరుకుపోయింది. బీఆర్ నగర్ రోడ్డు వద్ద నిరంతర లీకులతో దాదాపు పైపులు పూర్తిగా పాడైపోయాయి. దీంతో నీరు కలుషితమై ఆయా ప్రాంతాల్లో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. సంపులు, ట్యాంకర్లలో ఎప్పటికప్పుడు మట్టిని తొలగించకపోవడం వల్ల తరచూ సమస్యలు ఏర్పడుతున్నాయి. -
కాలువల్లో కలుషితమై..
పలాస: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చాలావార్డుల్లో సురక్షిత తాగునీరు అందడం లేదు. 31 వార్డులకు గాను 24 వేల వీధి కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. హడ్కోకాలనీ, రాజమ్మకాలనీ, సూదికొండకాలనీ తదితర ప్రాంతాల్లో తాగునీటికి నేటికి ట్యాంకర్లే ఆధారం. కొన్ని వార్డులకు ఉద్దానం రక్షిత మంచినీటి పథకం పైపుల ద్వారా, పైలెట్ స్కీమ్ల ద్వారా మంచినీరు సరఫరా అవుతున్నప్పటికీ ఆ పైపులైన్లు మురుగు కాలువలను ఆనుకుని ఉన్నాయి. కొన్నిసార్లు లీకేజీ కారణంగా మంచినీరు, మురుగునీరు కలిసిపోయి నీరు కలుషితమవుతోంది. సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
ప్రాణాలు పోతున్నా..
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నగరంలో 50 డివిజన్లలో మంచినీటి కుళాయి పైపులైన్లు వేసి దశాబ్దాలు గడుస్తోంది. దాదాపుగా పైపులైన్లన్నీ కాలువల్లోనే దర్శనమిస్తున్నాయి. పలుచోట్ల పైపులు తుప్పుపట్టి ముక్కలయ్యే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు డేఅండ్నైట్ జంక్షన్ నుంచి కొత్త రోడ్డు వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో ఇరువైపులా ఉన్న కాలనీల్లో పైపులైన్లు దెబ్బతిన్నాయి. బలగ, దమ్మలవీధి, కాకివీధి, కంపోస్టు కాలనీ, హయాతినగర్, భైరివానిపేట, యాతపేట, గుజరాతిపేట, రెల్లవీధి, వైష్ణపువీధి, కృష్ణాపార్కు, గుడివీధి, జెండాలవారివీధి, మంగువారితోట, గూణపాలెం, ఏఎస్ఎన్కాలనీ, అరసవల్లిలో కాలువల్లో పైపు లైన్లు పూర్తిగా మునిగిపోయి వాటి మీదుగా కాలువనీరు ప్రవహిస్తోంది. గతేడాది డిసెంబర్లో బలగ ప్రాంతంలో డయేరియా ప్రబలి ఇద్దరు, ఈ ఏడాది ఫిబ్రవరిలో దమ్మలవీధి ప్రాంతంలో డయేరియా ప్రబలి సుమారు 10 మంది మృత్యువాత పడ్డారు. ఆ సమయంలో కొన్ని పైపులైన్లు మార్చేసి తర్వాత పట్టించుకోవడం మానేశారు. -
● విదేశాల్లో ఉద్యోగాల పేరిట టోకరా
విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామంటూ హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి సారవకోట, టెక్కలి మండలాలకు చెందిన ఆరుగురు బాధితుల నుంచి లక్షలు రూపాయలు దండుకుని మోసం చేశాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం వడ్డినవలస గ్రామానికి చెందిన పాలిన చిన్నారావుకు రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు చెందిన మహమ్మద్ మొయిన్ నమ్మబలికాడు. చిన్నారావు తనకు తెలిసిన టెక్కలి మండలం కొండ భీంపురం గ్రామానికి చెందిన మరో నలుగురు, గొదలాంకు చెందిన మరో యువకుడితో కలిసి గత ఏడాది సెప్టెంబర్లో సికింద్రాబాద్లోని ఒక లాడ్జిలో మొయిన్ను కలిశారు. వీరందరికి రష్యాలో ఉద్యోగాలున్నాయని నమ్మబలికాడు. అందుకు పాలిన చిన్నారావు రూ.లక్ష, బుడ్డ కోటేశ్వరరావు, ఇప్పిలి లక్ష్మినారాయణ, ఇప్పిలి గోవిందరావు, కోరాడ వెంకటేష్, కొర్రాయి ప్రసాదరావులు రూ.1.72 లక్షలు చొప్పున మొయిన్కు విడతల వారీగా 7816036131 నంబర్కు ఫోన్ పే చేశారు. డబ్బులు చేతికొచ్చిన తర్వాత మొయిన్ ఈ ఏడాది జనవరి 23 నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. ఈ విషయమై ఈ ఏడాది మార్చి 24న సారవకోట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి దర్యాప్తు చేయకపోవడంతో బాధితులు మరోసారి బుధవారం పోలీసుస్టేషన్కు వచ్చి ఆరా తీశారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ విదేశాలలో ఉద్యోగం వస్తుందని అప్పు చేసి డబ్బులు ముట్టజెప్పామని, తీరా తమను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. -
● పొందూరు రైల్వేస్టేషన్లో హై టెన్షన్
● తెగిపడిన రైల్వే లైన్ హైటెన్షన్ వైర్ ● జిల్లాలో పలు స్టేషనల్లో రైళ్ల నిలిపివేత పొందూరు రైల్వేస్టేషన్లో బుధవారం పెను ప్రమాదం తప్పింది. రెండో నంబర్ ప్లాట్ఫారం వద్ద రైళ్ల రాకపోకలకు సంబంధించిన ప్రధాన ఓవర్ హెడ్ హై టెన్షన్ విద్యుత్ వైర్లు ఒక్కసారిగా తెగిపడి భువనేశ్వర్–విశాఖపట్నం మార్గంలోని రైల్వే ట్రాక్పై పడిపోయాయి. ఈ సమయంలో ప్లాట్ఫారంపై ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. స్థానిక రైల్వే అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. యుద్ధ ప్రాతిపదికన వైర్లకు మరమ్మతులు చేసి లైన్ క్లియర్ చేశారు. ఈ క్రమంలో భువనేశ్వర్–విశాఖపట్నం మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలాస ఈఎంయూతో పాటు పలు రైళ్లను ఆమదాలవలస రైల్వేస్టేషన్లోనే నిలిపివేశారు. జి.సిగడాం, చీపురుపల్లి రైల్వే స్టేషన్ల వద్ద కూడా పలు రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. –పొందూరు -
డీలర్ల గగ్గోలు
తరుగుతో బస్తాలు.. ● జె.ఆర్.పురం 66వ డిపోకు వచ్చిన బస్తాల్లో భారీగా తరుగు ● 50 బస్తాల్లో 9 బస్తాల్లో తక్కువగా బియ్యం ● డీఏం అదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన రణస్థలం: ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత లోపించింది. తరుగుతో ఉన్న బియ్యం బస్తాలను అంటగడుతున్నారంటూ డీలర్లు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా లావేరులో కొన్ని నెలలుగా పౌరసరఫరాల గోదాం నుంచి తరుగుతో కూడిన బియ్యం బస్తాలు వస్తున్నాయంటూ డీలర్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవమని బుధవారం నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళ్తే.. రణస్థలం మండలం జె.ఆర్.పురం పంచాయతీలో 66వ రేషన్ డిపోను చిన్ని పావని పేరుతో చిన్ని రవి అనే దివ్యాంగుడు నిర్వహిస్తున్నారు. జూలై నెల రేషన్ ఇచ్చేందుకు 296 రేషన్ కార్డుదారులకు గాను 50 కేజీల బరువుతో ఉన్న 88 బస్తాలు విడిపించారు. ఆ బస్తాల్లోని సుమారు 9 బస్తాల్లో తరుగు భారీగా ఉండటం గుర్తించారు. ఒక బస్తాలో 41.620 కేజీలు, మరొక బస్తాలో 41.890 కేజీలు, 43.460 కేజీలు, 45.420 కేజీలు చొప్పున వ్యత్యాసం ఉండటాన్ని హమాలీల సమక్షంలోనే డీలర్ గుర్తించారు. ఈ విషయమై లావేరు గోదాం డీటీ నానిబాబుకు ఫిర్యాదు చేయగా ఆయన పట్టించుకోలేదు. తిరిగి ఒక బస్తా మాత్రమే ఇస్తానని, తీసుకుంటే తీసుకో లేదంటే పో అంటూ సమాధానమిచ్చారని డీలర్ రవి వాపోయారు. తరుగు ఎక్కువగా ఉండటంపై డీటీ వద్ద వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోనికి రాలేదు. దీంతో సివిల్ డిప్యూటీ తహసీల్దార్ అరుణకుమారి, సివిల్ సప్లయ్ డీఏం టి.వేణుగోపాలరావుకు విషయం తెలియజేయగా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉన్నతాధికారులు ఆదేశాలతో.. ఉన్నతాధికారుల ఆదేశాలతో డీటీ నానిబాబు వెంటనే 66వ రేషన్ డిపో వద్దకు వెళ్లి పరిశీలించారు. తరుగుతో సుమారు 9 బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. 41 కేజీల నుంచి 48 కేజీలతో బస్తాలు ఉన్నట్లు నిర్ధారించారు. అన్ని బస్తాల్లోని తరుగు లెక్కకట్టగా సుమారు నాలుగు బస్తాలు రేషన్ డీలర్కు ఇవ్వాల్సి ఉందని గుర్తించి, రేపటి కల్లా అందజేస్తామని చెప్పారు. -
అయ్యో... ఎంత కష్టమొచ్చిందో!
ఆమదాలవలస రూరల్: తాను లేకపోతే తన బిడ్డలు ఈ లోకంలో ఎలా బతుకుతారని కలత చెందిందో ఏమో ఆ మాతృహృదయం కర్కశంగా మారిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన బిడ్డల గొంతు కోసం హతమార్చింది. ఆపై తానూ గొంతు కోసుకుంది. ఈ హృదయ విదారక ఘటన శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం వెదుళ్లవలసలో మంగళవారం సంచలనం రేకెత్తించింది. ఆమదాలవలస రూరల్ మండలం వెదుళ్లవలసకు చెందిన తల్లి కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన కుమార్తెలు భవానీ (3), చాందిని (4నెలలు)లను గొంతుకోసి హతమార్చింది. ఆమె కూడా గొంతు కోసుకుంది. ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త రమణ వరంగల్లో కూలి పనులు చేస్తున్నారు. అత్త వేధింపులను తట్టుకోలేక పిల్లలను హతమార్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటల వరకు అత్తాకోడళ్లు ఘర్షణ పడ్డారని, దీంతో అత్త వేధింపులు భరించలేక పిల్లలను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. వేకువజామున ఈ ఘటన జరిగి ఉండవచ్చని, పొద్దున్నే అత్త తలుపులు తట్టగా స్పందన లేకపోవటంతో చుట్టు పక్కల ఉన్నవారిని పిలిచి చూడగా రక్తపు మడుగులో తల్లీపిల్లలు కనిపించారని తెలిపారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద్, ఆమదాలవలస సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ ఎస్.బాలరాజు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. -
దిష్టిబొమ్మల్లా కుళాయిలు
జి.సిగడాం: ఆనందపురం.. పేరులో ఉన్న ఆనందం బతుకులో లేకపోయింది. 700 కుటుంబాలు నివసిస్తున్న గ్రామానికి కుళాయిలు ఉన్నాయి గానీ చుక్క నీరు రావడం లేదు. గత ప్రభుత్వం హయాంలో కుళాయిలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ప్రస్తుతం శిథిలం కావడంతో కుళాయిల ద్వారా నీరు రావడం లేదు. అధికారులు, నాయ కులు సమీక్షలు నిర్వహిస్తున్నామని చెబుతున్నా అవేవీ సఫలం కావడం లేదు. గత ఏడాది మార్చిలో ప్రజలందరికీ స్వచ్ఛమైన నీరందిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ మాట నెరవేరలేదు. నీటి కోసం ఆరాటం నేలబావి నుంచి నీరు తెచ్చుకోవాలంటే నరకం కనిపిస్తోంది. తాగునీటికి నానా ఇబ్బందులు పడుతున్నాం. ఎన్ని సార్లు వినతులు ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – గొర్లె లక్ష్మి, ఆనందపురం, జి.సిగడాం ఇబ్బంది పడుతున్నాం చాలా దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. వాటర్ ట్యాంకు నిర్మించి నీరందించాలి. – చిత్తిరి అప్పమ్మ, ఆనందపురం, జి.సిగడాం -
బతుకును పెంచుకో
● ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ● ఆత్యహత్య దేనికీ పరిష్కారం కాదంటున్న సామాజిక వేత్తలు ● ఒక్క క్షణం ఆలోచించండి అంటున్న మానసిక నిపుణులు.. ధైర్యం చెప్పాలి.. బతకడానికి బలమైన కారణం లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కష్టం వచ్చినప్పుడు ధైర్యం చెప్పే వారు ఉండాలి. ఎవరికి వారే కుమిలిపోవడం, ఒంటరి తనం ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు. – డాక్టర్ రోష్ మల్లిఖార్జున్, మానసిక వైద్యనిపుణులు కౌన్సెలింగ్ తప్పనిసరి జిల్లాలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. పిల్లలు సమాజంలో బతకడం కష్టమనే భావంతో ఇలా చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ తప్పనిసరి. సమస్య ఉంటే కౌన్సెలర్లను సంప్రదించాలి. టెలి మానస్ నంబర్ 144106కు ఫోన్ చేసినా కావాల్సిన సలహాలు ఇస్తారు. – డాక్టర్ బెండి సాయిరామ్, మానసిక వైద్యులు ముందుగానే గుర్తించాలి పిల్లలు జీవించే హక్కును ఎవరి హరించినా నేరమే. వీటిని అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మానసిక, ఆర్థిక సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇస్తే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి. – కొమ్ము రమణమూర్తి, అడ్వకేట్, సోషల్ వర్కర్ శ్రీకాకుళం కల్చరల్ : కుంగుబాటు, మానసిక క్షోభ, ఒంటరితనం, క్షణికావేశం.. కలగలిపి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. మనసులో ఉన్న ఆందోళనను ఎవరూ గుర్తించకపోవడం, బాధను ఎవరితోనూ పంచుకోకపోవడం, సరైన సమయానికి మాట్లాడే వారు లేకపోవడంతో జిల్లాలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అయితే దీని నివారణకు మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కౌన్సెలింగ్ అనేది ప్రాణాలను నిలబెడుతుందని అంటున్నారు. క్షణికావేశాల్లో బతుకులను బలి చేసుకుంటున్న వారికి ఇదే మార్గమని సూచిస్తున్నారు. ఇటీవల ఘటనలు.. ● మే 14న ఆమదాలవలస మండలం గాజులకొల్లివలసలో తల్లితో గొడవపడి రాజేష్, గార మండలం గిడిపేటలో భార్య మద్యం తా గొద్దన్నందుకు కర్రి త్రినాధరావు చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించారు. ● సారవకోట మండలం కురిడిలో భాస్కరరావు గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ● జూన్ 19న పలాస రైల్వేస్టేషన్ సమీపంలోని తాళభద్ర వద్ద తల్లి ఇద్దరు పిల్లలను రైలు కింద తోసి తనూ ఆత్మహత్య చేసుకుంది. ● మే 4న జి.సిగడాంలో తన భర్త హోంగార్డు శ్యామలరావు మద్యానికి, బెట్టింగ్లకు బానిసై బంగారాన్ని అమ్మేయడంతో భార్య ఉరి వేసుకుంది. ● అప్పు ఇస్తే తిరిగి అవతలివారే కేసు పెట్టడంతో మనస్తాపానికి గురై ఏప్రిల్ 11న పాతపట్నం చిన లోగిడికి చెందిన ఆటో డ్రైవర్ దయానిధి ఆత్మహత్య చేసుకున్నాడు. కుంగుబాటే కారణం.. కుంగుబాటు, మానసిక క్షోభ ఎంతో మందిని చంపేస్తున్నా యి. వీటి నివారణకు కౌన్సె లింగ్ సెంటర్ల ఏర్పాటు అత్యవసరం. ఒంటరితనం, నిరాశ, లేదా క్షోభ వంటి సంకేతాలను గమనిస్తే వారితో మాట్లాడాలి. యోగా, శ్వాస ద్వారా స్థైర్యాన్ని పెంచుకోవడం కుంగుబాటును, ఆందోళనను తగ్గిస్తుంది. – యార్లగడ్డ గీత, ఏపీలోని ’ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’, అపెక్స్ మెంబెర్ -
మేతగాళ్ల జేబులోకి.. వేటగాళ్ల సొమ్ములు..!
పోలాకి: రాకాసి అలలను దాటుకుంటూ నడిసముద్రంలో వేట సాగించి తమ జీవననావను ముందుకు సాగిస్తున్న మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో వారి కుటుంబ పోషణకు ప్రభుత్వం అందించే మత్స్యకార భరోసా సొమ్ములు కొంతమంది నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయని అర్హులైన లబ్ధిదారులు చెబుతున్నారు. పోలాకి మండలం అంపలాం పంచాయతీ రాజారాంపురంలో కొన్ని లక్షల రూపాయల వేటగాళ్ల సొమ్ములు మేతగాళ్లు నొక్కేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నిలదీశారనే నెపంతో గ్రామానికి చెందిన 24 మంది అర్హులైన మత్స్యకారులకు పథకం వర్తింపజేయకుండా కొర్రీలు పెడుతున్నారు. దీనిపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. ఫిర్యాదు వెనక్కుతీసుకోవాలని బాధితులు ఒత్తిడి చేశారని, సదరు నేతల నుంచి తమకు హాని జరిగే అవకాశం ఉందని బాధితులు తాజాగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఇదీ పరిస్థితి.. మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాలో డమ్మీలే ఎక్కువగా ఉన్నారని, కొంతమంది అర్హుల పేర్లు జాబితాలో రాకపోవటంతో మొత్తం గుట్టు బయటపడిందని స్థానికులు చెబుతున్నారు. రాజారాంపురం తీరం నుంచి రిజిస్టర్ కాబడిన బోట్లపై సముద్రంలోకి వేటకు వెళ్లినట్లు వచ్చిన లబ్ధిదారుల జాబితాలో తీరప్రాంతానికి సంబంధం లేని గ్రామాల వ్యక్తుల పేర్లు సైతం ఉన్నాయని ఆధారాలతో సహా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. రాజారాంపురం తీరంలో 84 బోట్లు, 75 తెప్పలు రిజిస్టర్ కాబడి ఉంటే అందులో ఎన్నిబోట్లు, ఎన్ని తెప్పలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఈ పథకం ఏమేరకు పక్కదారి పట్టిందో అర్ధం చేసుకోవచ్చు. వాస్తవానికి ఒక బోటుకు ఆరుగురు, తెప్పకు ముగ్గురు చొప్పున 728 మంది క్రూమెంబర్లు(కలాసీలు)గా అంపలాం గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 687 మందిని అర్హులుగా గుర్తించారు. రాజారాంపురం తీరం నుంచి వేటసాగితే అంతే స్థాయిలో ప్రొడక్టివిటీ కూడా ఉండాల్సి ఉంది. ఆ విషయానికి వస్తే జిల్లాలో ప్రతిచోటా దాదాపు ఇలాంటి వ్యవహారమే ఉందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. మత్స్యకార భరోసా అందించే వేటగాళ్ల జాబితాకు, మన మత్స్యకారులు నిజంగా కష్టపడి వేటసాగించి తీసుకువచ్చే ప్రొడక్టివిటీ లెక్కలకు ఎక్కడా సరిపోలటం లేదు. రాజారాంపురం విషయానికి వస్తే బాధితులుగా చెప్పబడుతున్న 24 మందిలో కొంతమంది మత్స్యకారేతర కుటుంబాల వ్యక్తులు ఉన్నారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్న మాట. ఇక్కడ ఇప్పటికే సొమ్ములు అందుకున్న 704 మందిలో అందరూ మత్స్యకారులేనా అంటే అక్కడా సమాధానం కుదరటంలేదు. సరికదా.. సదరు జాబితాలో నాన్ లోకల్ వ్యక్తులే ఎక్కువగా ఉన్నారు. మత్స్యకార భరోసా కోసం సముద్రంలో వేటసాగించే తీరప్రాంత వ్యక్తులు అందరూ అర్హులే తప్ప ఎక్కడా మత్స్యకారులు మాత్రమే ఉండాలని లేదని అర్హులైన బాధితులు చెబుతున్నారు. మత్స్యకార భరోసాలో డమ్మీ లబ్ధిదారులు లక్షల రూపాయలు నొక్కేశారని అర్హుల ఆవేదన ఇదే విషయమై నిలదీశారని రాజారాంపురంలో 24 మంది పై కక్షసాధింపు న్యాయం చేయాలని కలెక్టర్ను ఆశ్రయించిన బాధితులు తుప్పల్లో తెప్పలు..జాబితాలో పేర్లు.. రాజారాంపురం తీరంలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏళ్ల తరబడి ముళ్లపొదలు, తుమ్మతుప్పల్లో చెదలు పట్టిపోయిన బోట్లకు కూడా రంగులేసి రిజిస్టర్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.1.37 కోట్లు మత్స్యకార భరోసా సొమ్ము అంపలాం సచివాలయం పరిధిలో అందితే అందులో సగానికిపైగా డమ్మీజాబితా ఖాతాల్లోకే చేరాయని తెలుస్తోంది. ఈ పథకమే కాకుండా ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే డీజిల్ బిల్లు సైతం ఇలాంటి వేటకెళ్లని బోట్లు పేరుతో రాయితీ దండుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అర్హులు కోరుతున్నారు. -
దళిత ఓటర్ల పేర్లు తొలగించొద్దు
శ్రీకాకుళం/శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితాల సవరణ ప్రక్రియలో జిల్లాలోని అర్హులైన దళిత ఓటర్ల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగిపోకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ దళిత సంఘాల జేఏసీ నాయకులు మంగళవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలెక్టరేట్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కంఠ వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి తైక్వాండో శ్రీను మాట్లాడుతూ జిల్లాలోని అనేక గ్రామాల్లో నిరక్షరాస్యులు, వృద్ధులు, సామాజికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున సర్ ప్రక్రియలో అవసరమైన పత్రాలు సమర్పించడం, దరఖాస్తులు నింపడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేవలం సాంకేతిక కారణాలు, పత్రాల లోపాల పేరుతో అర్హులైన దళిత ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామాలు, దళితవాడల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు బూత్ లెవల్ అధికారులు సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, నిరక్షరాస్యులకు ఇంటి వద్దే సేవలు అందించి వారి దరఖాస్తులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. -
ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమాలకు మద్దతు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీజేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12 నుంచి జరగనున్న తొలి విడత ఉద్యమాలకు ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సహకార శాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు పి.జానకిరామ్ తదితరులు ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ బి.వి.వి.ఎన్.రాజును కలిశారు. కార్యక్రమంలో జేఏసీ అసోసియేట్ చైర్మన్ దామోదర్, మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అరుణకుమారి, ఏపీ సహకార శాఖ సేవా సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టుబడిన దారిదోపిడీ దొంగలు
శ్రీకాకుళం రూరల్ : శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన దారిదోపిడీ కేసులో నిందితులను రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసు వివరాలను మంగళవారం టౌన్ సీఐ పైడపునాయుడు, రూరల్ ఎస్ఐ సురేష్ విలేకరులకు వెల్లడించారు. మద్యానికి బానిసైన శ్రీకాకుళం నగరానికి చెందిన కొంకాన వెంకటనారాయణ, పడిపాటి నితిన్రెడ్డి, కొల్లు విజయ్కుమార్లు సులువుగా డబ్బులు సంపదించాలని దారిదోపిడీల మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఖాజీపేటకు చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు శ్రీకాకుళం పట్టణం నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఉదయం 4 గంటల సమయంలో అదే మార్గంలో ద్విచక్ర వాహనం వస్తున్న ఈ ముగ్గురూ కలిసి దాడిచేశారు. అతని జేబులో రూ.20వేల నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. వీరిలో ఇద్దరు పట్టుబడగా, విజయ్కుమార్ పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుల వద్ద నుంచి రూ.7500 నగదు, సెల్ఫోన్, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శతాధిక వృద్ధురాలి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు తామాడ పాపుడమ్మ (105) మంగళవారం మృతి చెందారు. ఈమె 1973లో సర్పంచ్గా పనిచేశారు. ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. భర్త పోలినాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయన కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. సరస్వతమ్మ వైఎస్సార్ సీపీ మండల మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలు అందించారు. ఈమె మృతి పట్ల తాజా మాజీ సర్పంచ్ బత్తిని సృజన లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు సంతాపం తెలియజేశారు. -
వ్యాన్ ఢీకొని ముగ్గురికి గాయాలు
● వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తే కారణం శ్రీకాకుళం క్రైమ్ : మద్యం మత్తులో ఉన్న లగేజీ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపి ముగ్గురి గాయాలకు కారణమయ్యాడు. ట్రాఫిక్ సీఐ వి.రామారావు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాకుళం మండలం రాయిపాడుకు చెందిన వృద్ధుడు యట్రాజుల తవుడు ఏఎస్ఎన్కాలనీలో నిర్మిస్తున్న ఓ ఇంటికి తాపీ పనికి మంగళవారం ఉదయం వెళ్లాడు.. మధ్యాహ్నం బలగ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో తమ గ్రామానికి చెందిన ఫంక్షన్ జరుగుతుండటంతో భోజనానికని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొత్తరోడ్డు నుంచి ఆర్టీసీ కాంప్లెక్సు వైపు వస్తున్న లగేజీ వ్యాను డ్రైవర్ నారు మురళి (ఆమదాలవలస మండలం దూసి) మద్యం మత్తులో వృద్ధుడిని ఢీకొట్టాడు. అంతేకాక కాంప్లెక్సు వైపు స్కూటీపై వెళ్తున్న దంపతులు సాధు గణేష్, మాధవిలను ఢీకొట్టాడు. అందరూ గాయపడటంతో డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు. పీఎన్ కాలనీలో.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీలో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఓ మహిళ గాయపడింది. ట్రాఫిక్ ఏఎస్ఐ మెట్ట సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. పీఎన్కాలనీలో కర్రి స్వాతి తన భర్త సంతోష్కుమార్తో కలిసి నివాసముంటోంది. ఈ క్రమంలో తన బంధువైన ఉదయ్కుమార్తో నవభారత్ జంక్షన్కు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లావేరుకు చెందిన ప్రగఢ గోపి తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. మహిళకు గాయాలవ్వడంతో కేసు నమోదు చేశామని చెప్పారు. దంపతులకు గాయాలు రణస్థలం: లావేరు మండలం బొంతుపేట జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్న దంపతులు నడుపూరి సురేష్, రాజకుమారిలకు బొలెరో వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలు కావడంతో 108 అంబులెన్సులో శ్రీకాకుళం తరలించారు. లావేరుకు చెందిన సురేష్ బైక్పై శ్రీకాకుళం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించిందని 108 సిబ్బంది ఈశ్వరరావు, చిన్నా తెలిపారు. లావేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో బంగారు పతకం
ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సి.ఎస్.ఈ.విద్యార్థి ఎండ శివచరణ్ జూన్ 27, 28వ తేదీల్లో చిత్తూరులో జరిగిన రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో అండర్–23 విభాగంలో 72 కేజీల గ్రీకోరోమన్ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్య సభ్యులు వి.ఎం.ఎం.సాయినాథ్రెడ్డి, కె.దుర్గా శ్రీనివాసరావు, పి.దుర్గాప్రసాద్రాజు, డి.వెంకటరావు, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, జె.హరీష్లు శివచరణ్ను అభినందించారు. జూలై 10, 11వ తేదీలలో హర్యానాలో జరగబోయే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లోనూ పతకం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వై.శ్రీనివాసరావు, జి.టి చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ కె.రాజ్కిరణ్, ఎస్వీఎస్ సునీల్కుమార్, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. -
ఆశలపై నీళ్లు
నరసన్నపేట: ‘అధికారులకు మొర పెట్టుకున్నాం.. ఎమ్మెల్యేను కలిశాం. ఎవరూ స్పందించలేదు. మా సమస్యలు పరిష్కరించని వారికి మేమెందుకు ఓటెయ్యాలి. మేము అసలు ఓటు వేయం. సర్ కార్యక్రమాన్ని కూడా బహిష్కరిస్తాం..’ నరసన్నపేట మండలంలోని వజ్రంపేట వాసుల ఆక్రందన ఇది. తాగునీటి సమస్య పరిష్కరించాలని సోమవారం ఉదయం పంచాయతీ కార్యాలయాన్ని మహిళలు చుట్టుముట్టారు కూడా. చాలాకాలంగా సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మంగళవారానికి నీరు వస్తుందని ఆశించినా చుక్క నీరు కూడా రాలేదు. దీంతో ప్రభుత్వం, అధికారులపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఓటరు నమోదులో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి, అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నగరపాలక సంస్థ పరిధిలోని బీఎల్ఓలు, సూపర్వైజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో వెనుకబడిన బీఎల్ఓలు పనితీరును మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలు మాత్రమే స్వయంగా పంపిణీ చేసి తిరిగి వారే సేకరించాలని స్పష్టం చేశారు. ప్రక్రియను సులభతరం చేసేందుకు వీలుగా ఫారాల డిజిటలైజేషన్కు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఒక సహాయకుడిని, ఓటర్లను గుర్తించడంలో తోడ్పాటునందించేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగవావాడీ సిబ్బందిని ప్రతి బీఎల్ఓకు సహాయకులుగా కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కూర్మారావు, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, ఏసీపీ జానకి తదితరులు పాల్గొన్నారు. -
మహిళా శిశు సంక్షేమ శాఖ సంఘం కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో జరిగింది. జిల్లా అధ్యక్షురాలిగా శోభారాణి (సీడీపీఓ గార), ప్రధాన కార్యదర్శిగా ఉమాజానకి (సీడీపీఓ కొత్తూరు), కోశాధికారిగా ఎం.రాజేశ్వరి, (సీడీపీఓ ఇచ్చాపురం), వైస్ ప్రెసిడెంట్లుగా శోభారాణి, పాపునాయుడు, జాయింట్ సెక్రటరీగా మణెమ్మ, అనురాధ, కార్యవర్గ సభ్యులుగా గీత, బీవీ లక్ష్మి, రూపలత, వంశీ ప్రియా తదితరులు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎన్జీజీవో సంఘ పట్టణ అధ్యక్షుడు బొచ్చ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ జేఏసీ జాయింట్ సెక్రెటరీ విద్య తదితరులు పాల్గొన్నారు. -
2 న సామూహిక ఉపనయనాలు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 2న జ్యేష్ట బహుళ విదియ గురువారం ఉదయం 7.09 గంటలకు బ్రాహ్మణ బాలురుకి సామూహిక ఉపనయనాలు జరిపిస్తున్నట్లుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఆరామ ద్రావిడ సంఘం జిల్లా కార్యదర్శి దార్లపూడి రవి తదితరులు ప్రకటించారు. ఈ మేరకు మొత్తం 22 మంది బాలురుకు ఉపనయనాలు పూర్తిగా ఉచితంగా చేపడుతున్నామని, ఆది త్యుని సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాన్ని జరిపించుకోవడం ఒక అదృష్టమని వివరించారు. ఇంటింటి సర్వేపై దిశానిర్దేశం శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రత్యేక సంక్షిప్త సవరణ ఓటర్ల జాబితా నవీకరణలో భాగంగా చేపట్టిన ఇంటింటా సర్వే ప్రక్రియను అత్యంత సమర్థంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం అధికారి పవన్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియా ఈ సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో ప్రస్తుతం సాగుతున్న ఇంటింటా సర్వే పురోగతిని, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికి వివరించారు. ఈ పనులను గడువులోగా, ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను నివేదించారు. మూన్నాళ్ల ముచ్చటేనా..? మందస: మందస మండలం మకరజోల పంచాయతీ అల్లిమెరక గ్రామానికి హరిపురం నుంచి వేసిన రోడ్డు అప్పుడే విరిగిపోయింది. కొద్ది నెలల కిందటే ఈ రోడ్డు వేయగా.. ఇది మూన్నాళ్ల ముచ్చటగా మారిందని స్థానికులు అంటున్నారు. రోడ్డును ఇలాగే వదిలేస్తే ప్రమాదాలు జరుగుతాయని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు. మొగిలిపాడులో కంకర అక్రమ నిల్వలు పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని 2వ వార్డు మొగిలిపాడులో రియల్ ఎస్టేట్ వ్యా పారులు కంకర అక్రమ నిల్వలు భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్లు వేయడం, దాన్ని చదును చేయడానికి అక్రమంగా కొండలను కరిగించి కంకర తీసుకొచ్చి ఈ విధంగా డంప్ చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇటీవల మొగిలిపాడు గ్రామం జాతీయ రహదారి పక్కన, ప్రస్తుతం కంకర నిల్వ ఉన్న అతి సమీపంలోనే వెంచర్లు వేశారు. దానికి సమీపంలోనే చెరువు, వరద కాలువ కూడా ఉంది. వాటిని కప్పేసి అందులో కలు పుకోవడానికి ఈ విధంగా అక్రమంగా కంకర అర్ధరాత్రి పూట కంకర తీసుకొచ్చి నిల్వ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ రియల్ ఎస్టేటు ప్లాట్లుపై రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. దీనికి ఎలాంటి అనుమతులు లేవని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు చెబుతున్నా, అక్కడ పనులు మాత్రం రాత్రిపగలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పైగా విద్యుత్ స్తంభాలు కూడా వేశారు. -
● పొందూరు చేనేత చీరలకు భాగ్యం
ఒన్ డిస్ట్రిక్ట్, ఒన్ ప్రొడక్ట్ పథకంలో భాగంగా ఎంపికైన పొందూరు చేనేత చీరలకు మహర్దశ కలిగిదని కేంద్ర మూల్యాంకన అధికారులు హర్ప్రీత్ సింగ్, శిష్టి తెలిపారు. మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మూల్యాంకన బృందం అధికారులు పొందూరు ఖాదీ చేనేత కాటన్ చీరల ఉత్పత్తిని పరిశీలించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ట్రేడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓడీఓపీకి పొందూరు కాటన్ చీరల భౌతిక పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మూల్యాంకన బృందం పర్యటించింది. తండ్యా మెట్టలో చేనేత, కాటన్చీరలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా చేనేతజౌళిశాఖ అధికారి టి జనార్ధనరావు, చేనేత సొసైటీ మేనేజర్ ఒ.శ్రీనివాసరావు, ఏఎఫ్కేకే సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కామేశ్వరప్రసాద్, డి.వెంకటరమణ పాల్గొన్నారు. –పొందూరు -
డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలింగ్ స్టేషన్ల డిజిటలైజేషన్ సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) – 2026 కార్యక్రమంలో భాగంగా మంగళవారం అరసవల్లి మిల్లు జంక్షన్ వద్ద 131 పోలింగ్ స్టేషన్కు సంబంధించి అపార్ట్మెంట్లో ఉన్న ప్లాట్ యజమానులతో మాట్లాడారు. ఎన్యూమరేషన్ ఫారాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 30 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు నగర సహాయ టౌన్ ప్లానర్ జానకి తెలిపారు. కార్యక్రమంలో ఎన్నికల డీటీ శ్రీనివాసరావు, బీఎల్ఓలు పాల్గొన్నారు. జె.భైరిపురంలో చైన్స్నాచింగ్ కంచిలి : జె.భైరిపురంలో సోమవారం రాత్రి చైన్స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన 62 ఏళ్ల వృద్ధురాలు బల్ల సావిత్రి రాత్రి ఏడున్నర గంటల సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి గ్రామంలో మెయిన్రోడ్డు పక్కన ఉన్న చెరువుకు వెళ్లింది. అదే సమయంలో ముగ్గురు దుండగులు మోటార్ సైకిల్పై వచ్చి వృద్ధురాలి మెడలో ధరించిన ఒకటిన్నర తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. దుండగుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరంతా బైక్పై ఒడిశా వైపు పారిపోయారు. ఈ మేరకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ పి. పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సేవలకు సత్కారం మెళియాపుట్టి: విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తింపునిస్తాయని ఎంపీడీఓ ఎన్.పి.పండా అన్నారు. మెళియాపుట్టి మండల పరిషత్ ఏవోగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన రాజేశ్వరమ్మను మంగళవారం ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు ఎస్.మోహనరావు, బైపోతు ఉదయ్కుమార్, ఎన్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వార్షిక కార్యాచరణ ప్రణాళికపై శిక్షణ ఎచ్చెర్ల : సెర్ప్ ఆదేశాల మేరకు జిల్లాలోని 19 మండలాల వార్షిక కార్యాచరణ ప్రణాళికపై లావేరు మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎచ్చెర్ల టీటీడీసీ కార్యాలయంలో రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలను బడికి పంపించడం, మహిళల అక్షరాస్యత, పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, భూసార పరీక్షలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సంస్థాగత నిర్మాణ డీపీఎం మోహనరావు, ఏపీఎం భాగ్యలత, ఎల్సీ బసవరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ కార్యాలయంలో బండికి చార్జింగ్
ఇచ్ఛాపురం రూరల్: ప్రభుత్వ కార్యాలయాలను ప్రజల సేవల కోసం వినియోగించాల్సి ఉండ గా, కొందరు అధికార పార్టీ నాయకులు వాటిని వ్యక్తిగత అవసరాలకు ఉపయోగిస్తున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు మంగళవారం తన వ్యక్తిగత ఎలక్ట్రిక్ బైక్కు చార్జింగ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ విద్యుత్ను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని సొంత ఆస్తిలా ఉపయోగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● టీడీపీ నాయకుడి దుశ్చర్య -
గిరిజన నాయకులపై ఎమ్మెల్యే ఆగ్రహం
ఆమదాలవలస రూరల్: పిల్లలను చంపేంత కష్టం ఏం వచ్చిందో..? గొంతుపై కత్తి పెట్టేంత కర్కశం ఎందుకు వచ్చిందో..? ప్రాణం తీసుకోవాలనేంత ఆలోచన ఆ మనసులో ఎలా చేరిందో గానీ.. ఆ కన్నతల్లి పేగు తెంచుకుని పుట్టిన బిడ్డల మరణ శాసనం రాసింది. ఆమదాలవలస మండలం వెదుళ్లవలస గ్రామంలో మంగళవారం కూర్మాపు వరలక్ష్మి అనే మహిళ తన బిడ్డలైన కూర్మాపు భవాని(3), కూర్మాపు చాందిని (4నెలలు)ని కత్తితో గొంతుకోసి దారుణంగా హతమార్చింది. ఆమె కూడా కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం కొన ఊపిరితో ఆస్పత్రిలో ఉంది. ఆమె భర్త కూర్మా పు రమణ వరంగల్లో కూలి పనులు చేస్తూ ఉంటారు. ఈ సంఘటనతో వెదుళ్లవలస శోకసంద్రమైంది. ఊరు ఊరంతా కంట తడి పెట్టింది. కలహాలే కారణమా..? వరలక్ష్మికి అత్త కూర్మాపు లక్ష్మితో కలహాలు ఉన్నా యి. కుటుంబంలో వరలక్ష్మి వద్దనే అత్త కూర్మాపు లక్ష్మి ఉంటున్నారు. కొంత కాలం నుంచి అత్త వేధింపులకు పాల్పడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. సోమవారం అర్ధరాత్రి రెండుగంటల వరకు అత్త, కోడలు ఘర్షణ పడ్డారని, దీంతో అత్త వేధింపులు భరించలేక పిల్లలను హతమార్చినట్లు స్థానికులు చెబుతున్నారు. అత్తాకోడళ్లు రాత్రి ఘర్షణ పడ్డాక అత్త ఇంటి బయట నిద్రపోయింది. తల్లీపిల్లలు తలుపులు వేసుకుని లోపల నిద్రపోయారు. ఉదయం 5 గంటల సమయానికి అత్త తలుపులు తట్టగా ఎవరూ తీయలేదు. దీంతో చుట్టుపక్కల వారికి సమా చారం ఇవ్వగా వారు వచ్చి చూశారు. తలుపులు తీయగా రక్తపు మడుగులో తల్లీపిల్లలు కనిపించడంతో నిశ్చేష్టులైపోయారు. వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అప్పటికే పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. తల్లి మాత్రం కొన ఊపిరితో ఉంది. వెంటనే ఆమెను శ్రీకాకుళం రిమ్స్కు తరలించా రు. పసి పిల్లలు అలా పడుకున్నట్టే ప్రాణాలు విడిచేసిన దృశ్యాలు చూసి స్థానికులు కంట తడి పెట్టారు. రాత్రి మూడింటి తర్వాతే ఘటన జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అత్త వేధింపులతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఈ ఘటనకు కారణమై ఉండవచ్చనే వాదన వినిపిస్తోంది. ఘటనా స్థలానికి పోలీసులు ఈ విషయం తెలిసిన వెంటనే వెదుళ్లవలసకు పోలీసులు చేరుకున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద, ఆమదాలవలస సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ ఎస్.బాలరాజు సంఘటన జరిగిన విషయం గ్రామస్తులను అడిగి తెలుసున్నారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాపు చేస్తామని డీఎస్పీ చెప్పారు. తల్లి కోలుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలరాజు తెలిపారు. సారవకోట: మండలంలోని పలువురు గిరిజన నాయకులపై నరసన్నపేట ఎంఎల్ఏ బగ్గు రమణమూర్తి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని గిరిజన మత్స్యకారులకు ద్విచక్ర వాహనం, ఐస్ బాక్స్లు మంజూరయ్యాయి. బుడితి సొసైటీ సభ్యులు ఆరుగురికి ఈ యూనిట్లు మంజూరు కాగా బొమ్మికపేట, సింగంవలస గ్రామాల కు చెందిన ఇద్దరు గిరిజనులకు సైతం రెండు యూ నిట్లు మంజూరయ్యాయి. బొమ్మికపేట, సింగంవలస గ్రామాలకు చెందిన ఇద్దరికి తన నోటీసులో లేకుండా ఏ విధంగా యూనిట్లు మంజూరు చేశా రని సంబంధిత శాఖ సిబ్బంది పై తొలుత ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేయగా.. ఐటీడీఏ నుంచి వచ్చిన యూనిట్లను మీరు ఎలా మంజూరు చేయించుకుంటారని గిరిజన నాయకులైన జన్ని రామారావు, బి.తులసీరావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఐటీడీఏ సీతంపేటలో దరఖాస్తు చేసుకున్నామని, మంజూరయ్యాయని ఇద్దరూ సమాధానమిచ్చారు. అమ్మ తప్ప వారికేదీ తెలీదు.. ఆకలేస్తే అమ్మ.. నిద్ర వస్తే అమ్మ.. నిద్రలో ఉలికిపడినా అమ్మ.. నొప్పి పుట్టినా అమ్మే కావాలి. ఆ రాత్రి కూడా గొంతు వద్ద ఏదో కోసుకుంటుంటే అమ్మా.. అనే అరిచి ఉంటారు. రక్తం ధార కట్టి ఊపిరి పోతూ ఉంటే అమ్మనే తలచుకుని ఉంటారు. ప్రాణం గాల్లో కలిసిపోతూ ఉన్న సమయాన అమ్మా.. అమ్మా అంటూ ఏడ్చి ఉంటారు. ఆ పసివాళ్లకేం తెలుసు.. ఆ గొంతు కోసింది అమ్మేనని. ఆ చిన్నారులకేం తెలుసు తమ ప్రాణాలు తీసింది కన్నతల్లేనని. వెదుళ్లవలసలో కన్నతల్లి ఇద్దరు బిడ్డల గొంతుకోసి చంపేసింది. తాను కూడా గొంతు కోసుకుని చనిపోవడానికి ప్రయత్నించింది. పసికందుల గొంతు కోసి చంపిన కన్నతల్లి అనంతరం పీక కోసుకుని ఆత్మహత్యాయత్నం వెదుళ్లవలసలో ఘటన కొన ఊపిరితో చికిత్స పొందుతున్న తల్లి -
●కొబ్బరి రైతుల భూములు కాపాడాలి
కవిటి మండలం శిలగాం సమీపంలోని అల్లేరు భూములను కొబ్బరి రైతుల ప్రయోజనాలకే వినియోగించాలని, కొబ్బరి ఆధారిత పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. శిలగాం గ్రామ పరిధిలోని సర్వే నంబర్–110లో ఉన్న 21.76 ఎకరాల అల్లేరు భూములను 1990లో కొబ్బరి, జీడి, మామిడి రైతుల అభివృద్ధి కోసం ఉద్యానవన శాఖకు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రస్తుతం ఆ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్కు పేరుతో ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు రావడం వల్ల కొబ్బరి రైతుల్లో ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ఈ భూముల్లో కొబ్బరి అనుబంధ పరిశ్రమలకు మాత్రమే అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ఈ భూమిలో శిలగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించిన ఐదు ఎకరాల ఆట స్థలాన్ని యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా ఇటీవల పెద్ద కర్రివానిపాలెం మత్స్యకార గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని, పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ ప్రమాదంలో ఎనిమిది కుటుంబాలు తీవ్రంగా నష్టపోగా, వాటిపై ఆధారపడిన మరో 50 కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నదని వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. సుమారు రూ.88 లక్షల నష్టం జరిగినట్లు అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కడియాల ప్రకాష్ పాల్గొన్నారు. -
ప్రతీ అర్జీని ఆడిట్ చేయాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 165 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ప్రతీ అర్జీని జిల్లా అధికారులు స్వయంగా పరిశీలించడంతో పాటు ఖచ్చితంగా గ్రీవెన్స్ ఆడిట్ నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యల తీవ్రతను బట్టి అధికారులు స్పందించాలని, జాప్యానికి తావులేకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 165 ఫిర్యాదులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కాగా జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ పీఏ ఆ శాఖ పరమైన సమస్యపై స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆమెకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో టెన్త్, ఇంటర్మీడియట్ అడ్మిషన్స్ ప్రారంభం గోడ పత్రికను ఆవిష్కరించారు. కొన్ని వినతులు పరిశీలిస్తే.. ●జిల్లాలో రైతులకు ఎరువులు, పురుగు మందుల కొరత లేకుండా చూడాలని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. ●శ్రీముఖలింగం క్షేత్రంలో 30 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని శ్రీముఖలింగేశ్వర దేవస్థానం అర్చక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు నాయుడుగారి రాజశేఖర్ కోరారు. దిక్కున్న చోట చెప్పుకోమంటున్నారు.. ●జిల్లాలోని భైరవానిపేట గ్రామానికి చెందిన 14 దళిత కుటుంబాలకు 2013లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ పచ్చ తోరణం కింద ఒక్కొక్కరికి 100 మొక్కల్ని ఇవ్వడం జరిగింది. అయితే దళితులకు ఇచ్చిన మొక్కలపై కూటమి నాయకులు పెత్తనం చేస్తున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి పీజీఆర్ఎస్లో కోరారు. రాత్రి సమయంలో కొబ్బరి చెట్ల ఫలసాయాన్ని దొంగతనంగా కోస్తున్నారని, అడిగితే దిక్కున్నచోట చెప్పుకోండని దళితులను భయపెడుతున్నారన్నారు. ఆమదాలవలస మండలంలోని కొత్తరోడ్డు జంక్షన్లో బావాజీ మఠం భూముల్లో అక్రమ లే అవుట్కు ఎంపీ ల్యాడ్ నిధులు మంజూరు సరికాదని, అక్కడ జరుగుతున్న అక్రమాలు పరిశీలించాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందజేశారు. అలాగే బుర్జ మండలంలోని అన్నంపేట గ్రామం భూ వివాదం అంశంపై నిజమైన హక్కుదారునకు న్యాయం చేయాలని విన్నవించారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి పంచాయతీలో అక్రమంగా తొలగించిన వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లను వెంటనే పునరుద్దించాలన్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పైడి పోలయ్య తదితరులు ఉన్నారు. మత్య్సకార భరోసా పథకం లబ్ధిదారుల పేర్లలో అవకతవకలు ఉన్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని పోలాకి మండలం అంపలాం గ్రామ మత్స్యకారుడు మైలపల్లి సూరిబాబు కోరారు. వాస్తవంగా గ్రామంలో 100 కుటుంబాలు కంటే తక్కువ మంది వేటకు వెళ్లిన మత్య్సకారులు ఉండగా, 640 మందికి మంజూరైనట్లు జాబితాలు వచ్చాయన్నారు. దీనిపై నిలదీసినందుకు 24 మంది అర్హులైన మత్స్యకారుల పేర్లను లబ్ధిదారులు జాబితా నుంచి తొలగించారని తెలిపారు. ఇది చాలా అన్యాయమని అడిగితే దాడులు చేసేందుకు సిద్ధపడుతున్నారని, అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
టెక్కలి ఆర్డీఓ తీరు సరిగ్గాలేదు ‘సర్’
టెక్కలి : టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి తీరు సక్రమంగా లేదని, కేవలం మంత్రి అచ్చెన్నాయుడుకు మాత్రమే తాబేదారుగా పనిచేస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు పనిచేయడం లేదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో లోపాలున్నాయని, నిమ్మాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలింగ్ బూత్ల్లో కొన్నేళ్లుగా మరణించిన వారి ఓట్లు తొలగించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో.. సోమవారం తిలక్ నియోజకవర్గ నాయకులతో కలిసి ఆర్డీఓను కలిశారు. కానీ, సమస్య స్వీకరించే విషయంలో ఆర్డీఓ తీరు నచ్చకపోవడంతో అసహనంతో ఆయన బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాల్సిన ఆర్డీఓ పూర్తిగా మంత్రి అచ్చెన్నాయుడు మెప్పు కోసం ఒక ఏజెంట్గా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సర్ ప్రక్రియలో లోపాలున్నాయని చెబితే మాపై తిరుగుబాటు చేసేలా వ్యవహరించడం అత్యంత హేయనీయమన్నా రు. మరోవైపు.. టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయ కులతో నిర్వహిస్తున్న సమావేశాన్ని ఆర్డీఓ తీరు నచ్చక బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ టెక్కలి మండలం అధ్యక్షుడు హనుమంతు వెంకటేశ్వరరావు చెప్పారు. పలాస: మండలంలోని కోసంగిపురం వద్దనున్న జగనన్న కాలనీలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుకుంది. కాలనీకి చెందిన నెయ్యిల ఉమామహేశ్వరరావు (56) అనారోగ్యంతో మృతి చెందాడు. పిల్లలు చిన్నవారు కావడంతో ఉమామహేశ్వరరావు భార్య సరస్వతి ఆయనకు తలకొరివి పెట్టింది. దీంతో కాలనీలో విషాదచాయలు అలముకున్నాయి. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీ సు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు బాధితుల నుంచి 61 ఫిర్యాదులు అందా యి. ఎస్పీ కె.వి.మహేశ్వరరె డ్డి బాధితుల నుంచి ఫిర్యా దులు స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలుతెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. -
సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్ హమాలీ ల సమస్యలు పరిష్కరించాలని సివిల్ సప్లయ్ హమాలీ వర్క ర్స్ యూనియన్ శ్రీకాకుళం శాఖ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం జీజీఆర్ఎస్ వద్ద జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సివిల్ సప్లయ్ కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం అదే పనిగా హమీలీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. నెలాఖరు వరకు కూలీలు జమ అవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం పీజీఆర్ఎస్లో యూనియన్ నాయకులు కెస్ నారాయణ, చిక్కాల గోవిందరావు తదితరులు వినతిపత్రంను అందజేశారు. -
● ఐదు బైకులు, మోటారు పంపు స్వాధీనం ● ముగ్గురు మైనర్లు, ఇద్దరు వ్యక్తులు అరెస్టు
రణస్థలం: మండలంలోని జేఆర్పురం పోలీస్ సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో జరిగిన వరుస బైక్ చోరీల దొంగలను జేఆర్పురం సర్కిల్ పరిధి పోలీసులు పట్టుకున్నారని జేఆర్పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రణస్థలం పరిధిలో 6 ద్విచక్ర వాహనాలు, లావేరులో 1, జి.సిగడాంలో 1 మొత్తం 8 ద్విచక్ర వాహనాలు, లావేరులో ఒక వ్యవసాయ మోటారు ఇటీవల కాలంలో దొంగిలించారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామన్నారు. జే.ఆర్.పురం, సీతంవలస పరిధిలో నలుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అయితే వారిలో ముగ్గురు మైనర్లు కాగా.. ఒక వ్యక్తి లావేరు మండలంలోని బుడతవలస గ్రామానికి చెందిన కుప్పిలి హరిగా పేర్కొన్నారు. మైనర్లులంతా లావేరు మండలంలోని ఒక గ్రామానికి చెందినవారే. అలాగే ఈ బైకులు కొనుగోలు చేసిన ఇనుప తుక్కు దుకాణం నిర్వాహకుడు అదపాక గ్రామానికి చెందిన బెజ్జిపురపు వెంకట నాయుడును ఆరెస్టు చేశామని తెలిపారు. వీరి నుంచి ఐదు బైకులు, ఒక వ్యవసాయ మోటారు రికవరీ చేశారు. మిగతా మూడు బైకులు తుక్కుకు అమ్మేశారు. సమావేశంలో జేఆర్పురం, లావేరు, జి.సిగడాం ఎస్లు ఎస్.చిరంజీవి, కె.అప్పలసూరి, సందీప్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కె.కిరణ్ కుమార్, ఎం.జోగారావు, లావేరు కానిస్టేబుల్ లక్ష్మణరావు, హేమంత్, ఎచ్చెర్ల కానిస్టేబుల్ రవి కుమార్ తదితరులు ఉన్నారు. -
బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం: శ్రీకాకుళం ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ ఈఈగా మాడెం శ్రీనివాసరావు సోమవారం బాధ్యతలు స్వీకరించా రు. ఇదే సంస్థలో క్వాలిటీ కంట్రోల్ ఈఈగా పనిచేసిన శ్రీనివాసరావును కొద్ది నెలల క్రితం శ్రీకాకుళంలో పూర్తి అదనపు బాధ్యతలతో నియమించిన విషయం తెలిసింది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెండు నెలల వరకు విధుల్లో చేరని శ్రీనివాసరావు సోమవారం విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన వారం రోజులు పాటు సెలవులో వెళ్లిపోయారు. శ్రీనివాసరావు సోదరుడు రెండు రోజుల క్రితం మృతి చెందడంతో ఆయన సెలవు పెట్టినట్లు తెలిసింది. -
సోమవారం సంత..
మందస: సోమవారం సంత.. వందలాది వ్యాపారులు, వేలాది మంది గిరిజనులకు ఆధారం. మందస చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు ప్రజలు ప్రతి వారం ఇక్కడకు వచ్చి సరుకులు కొనుగోలు చేసుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన సంతలో మలమూత్ర విసర్జనకు ఆరుబయటకే వెళ్లాల్సిన దీనస్థితి ఉంది. ఇదివరకు ఈ గ్రామానికి కనీసం బస్టాండ్ సదుపాయం కూడా లేదు. ఎన్నో దశాబ్దాల నిరీక్షణ తర్వాత వైఎస్సార్సీపీ హయాంలో రోడ్లు విస్తరించి బస్టాండ్ సదుపాయం కల్పించడంతో బస్సు కోసం దుకాణాల ముందు దీనంగా నిలబడే దుస్థితి తప్పింది. అప్పుడే స్థానికులు మందస అభివృద్ధి కమిటీ పేరిట ముందుకు వచ్చి మరుగుదొడ్లు ఏర్పాటు చేయగా దానికి రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించారు. మందసకు వచ్చే వారికి ఇవి ఉపయోగకరంగా ఉండేవి. కానీ కాలక్రమేణా అవి పాడైపోవడంతో సమస్య మొదటికి వచ్చింది. సంతకు వేలాదిగా గిరిజన ఆడపడుచులు వస్తారు. వీరి అవసరాలకు ఆరుబయటకు వెళ్లాల్సి రావడం అత్యంత బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. మందసలో సమస్యల గురించి ఎన్నోసార్లు చెప్పినా ఎవ రూ పట్టించుకోవడం లేదు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. – కంచి బెహరా, ఎంపీటీసీ సభ్యుడు, మందస -
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
గార: మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది శ్రీకూర్మం పంచాయతీ వెలమవీధికి చెందిన సాధు లక్ష్మణరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మణరావు (46) గత కొన్నేళ్లు గా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం సాయంత్రం చెరువులో పడి చనిపోతానని చెప్పి బయటకు వెళ్లడంతో గ్రామస్తులు వెతికి ఇంటికి తీసుకువచ్చారు. సోమవారం ఉదయం భోజనం చేసిన తర్వాత బయటకు వెళ్లిపోయాడు. సమీపంలోని సత్రం వద్ద భద్రం పంతులు మేడ మీద మునగ చెట్టుకు తన తువ్వాలుతో ఉరివేసుకున్నాడు. పనిమనిషి మేడమీదకు వెళ్లే సమయంలో చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. భార్య సుమంగళి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్. గంగరా జు తెలిపారు. -
నిఘా నిద్రపోతోందా..!
●ప్రతి నెలా క్రైమ్ మీటింగ్లో ఎస్పీ.. నిఘా పెంచండి.. రాత్రి గస్తీ పటిష్టంగా అమలు చేయండి అని ఇస్తున్న ఆదేశాలు బేఖాతరవుతున్నాయా..! ●శ్రీకాకుళం నగరంలో ఆదివారం పోలీసుల పెట్రోలింగ్ ఉందా..! ఉంటే ఒక్క చోట కాకపోయినా మరొక్క చోటైనా పోలీసుల నిఘాకు నిందితులు చిక్కేవారు. ●నిఘా నీడలో నగరం అంటూ ఊదరగొడుతున్న పోలీసులు సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో.. లేదో పరిశీలించాల్సిన అవసరం లేదా..! ●వజ్రపుకొత్తూరు మండలంలో రెండు రోజుల క్రితం రెండు చైన్ స్నాచింగ్లు నమోదయ్యాయి. అంతర్రాష్ట్ర గ్యాంగులకు ఇది పరిపాటిగా మారింది. ఆ నేపథ్యంలోనైనా పోలీస్ వర్గాలు అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి ఉండేదా..! ●అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ కాంప్లెక్స్లో సీసీ కెమెరాల మోనిటరింగ్పై ఎప్పుడైనా దృష్టి సారించారా..! -
మేం ఓటర్లం కాదా.. పన్నులు కట్టడం లేదా?
● పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించిన వజ్రంపేట మహిళలు ● ఏడాదిగా నీరు రావడం లేదని ఆవేదన మాకు ఒక పూట నీరు వస్తుంది. అది కూడా పైపు ను గట్టిగా పీల్చితే నాలుగైదు లీటర్లు నీరు వస్తుంది. పీల్చకపోతే అదీ రాదు. దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నాం. అధికారులు చర్యలు తీసుకోవాలి. – రావాడ పార్వతి, వజ్రంపేట నరసన్నపేట: ‘అయ్యా.. పంచాయతీ వారూ.. మేము వజ్రంపేటలో ఉంటున్నాం. తాగడానికి బిందెడు నీరు ఇప్పించండి.. మీ పేరు చెప్పుకుంటాం. చాలాసార్లు మీ కార్యాలయం చుట్టూ తిరిగాం. అదిగో ఇదిగో అన్నారు. ఆరు నెలలు గడిచాయి. అసలు మీ ఉద్దేశం ఏమిటి. మా వీధికి నీరు ఎందుకు రావడం లేదు. ఎంతో ప్రయత్నిస్తే ముంతడు నీరు వస్తుంది. దీంతో రోజంతా ఎలా గడిపేది. మేము పంచాయతీలో ఓటర్లం కాదా. మేము ఇంటి పన్నులు కట్టడం లేదా.. కుళాయి పన్ను కట్టడం లేదా.. మరెందుకు మాకు నీరు ఇవ్వరు..’ మండలంలోని వజ్రంపేటకు చెందిన మహిళలు పంచాయతీ సిబ్బందిని సోమవారం నిలదీసిన తీరు ఇది. ప్రతి నిత్యం నీటికి ఇబ్బంది పడుతుండడంతో అక్కడి మహిళలు సోమవారం పంచాయతీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. ఆ సమయానికి ఇన్చార్జి ఈఓ లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్ మురళికి తమ సమస్యను వివరించారు. పశువుల ఆస్పత్రి వద్ద కొత్తగా వాటర్ ట్యాంకు కడుతున్నారు. అది పూర్తయితే తప్ప మీకు నీరు ఇవ్వలేమని మురళి చెప్పడంతో మహిళలు మరింతగా ఆవేదన చెందారు. ఆ ట్యాంకు ఎప్పటికి పూర్తమవుతుంది.. అప్పటివరకు తామేం చేయాలి.. ఊరొదిలి వెళ్లిపోవాలా అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి అధి కారి స్పందిస్తూ తానేమీ చేయలేనని ఎంపీడీఓను కలవాలని చెప్పడంతో వారంతా వెనుదిరిగారు. వజ్రంపేట జంక్షన్ వద్ద గతంలో మూడు లక్షలు ఖర్చు చేసి ప్రధాన పైపు లైన్కు ఒక వాల్ పెట్టారు. కొన్నాళ్లు నీరు కొంత మేరకు వచ్చేది. ఆరునెలల కిందట వజ్రంపేట పక్క వీధుల వాళ్లు తమకు నీరు రావడం లేదని ఆ వాల్ రూట్ మార్చారు. అప్పటి నుంచి తమకు నీరు రావడం లేదని మహిళలు తెలిపారు. ఇళ్లకు కుళాయిలు ఉన్నా దిష్టిబొమ్మలా మారిపోయాయని తెలిపారు. ఇంటి పన్నులు కడుతున్నాం. నీటి పన్ను కడుతు న్నాం. మాకు ఎందుకు తాగడానికి నీరు ఇవ్వరు. గతంలో ఒకసారి పంచాయ తీ కార్యాలయానికి వచ్చాం. వారం రోజులు కొంత నీరు వచ్చింది. ఇప్పుడు మళ్లీ మొదటికి వచ్చింది. – షేక్ ఫాతిమా -
టెక్కలి ఆర్డీఓ తీరుపై మండిపాటు
టెక్కలి: టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి తీరుపై కొంత మంది ఫిర్యాదుదారులు మండిపడ్డారు. సంతబొమ్మాళి మండలం మూలపేట పోర్టుకు సంబంధించి పీడీఎఫ్లు అందలేదంటూ జీరు జయలక్ష్మి, జీరు రమేష్, జీరు హైమావతి, జీరు అశోక్, జీరు నారాయణరావు, నాగేశ్వర్రావు, తిరుపతిరావు తదితరులు సోమవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో విన్నవించేందుకు వచ్చారు. అయితే తమ విన్నపాన్ని స్వీకరించే విషయంలో ఆర్డీఓ తీరుపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. తమ బాధలను చెప్పుకోవడానికి వస్తే ఆర్డీఓ చాలా హీ నంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కార్యకర్తలుగా ఉన్నప్పటికీ తమ పై వ్యవహరించిన తీరు ఎంతో ఇబ్బంది కలిగిందంటూ వాపోయారు. జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలిసిన మధుకేశ్వరుని చక్రతీర్థ స్నానాలు పుణ్య వంశధార నదిలో ఘనంగా జ్యేష్టమాసం సోమవారం జరిగాయి. పార్వతీ పరమేశ్వరులను చక్కగా అలంకరించి పల్లకిలో ఆశీనులుగా చేశారు. అనంతరం వంశధార నదిలో స్వామివారి సహిత వారాహి అమ్మవారికి పుణ్య చక్రతీర్థ సాన్నాలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో యథాస్థానంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో స్వామివారి పాంచరాత్రి కల్యాణ ఉత్సవాలు ముగిశాయి. జి.సిగడాం: కప్ప..కప్ప నీలాలు, కండవ నిండా వర్షాలు, కురవాలి వానదేవుడా, వానమ్మ వానమ్మా ఒక్క సారి వచ్చిపోవమ్మా.. రైతుల కష్టాలు తీర్చేవా రావమ్మా.. అంటూ మండల పరిధిలోని వెలగాడ, గొలుసుపూడిపేట గ్రా మాల్లో రైతులు, యువకులు, విద్యావంతులు కప్పయాత్ర చేశారు. కప్పను కావిడిలో ఊరేగిస్తూ ఇంటింటికి తీసుకువెళ్లి పసుపు, కుంకుమ, బిందెలతో నీరు తెచ్చి పూజలు చేశారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో సమగ్ర ఆర్థికాభివద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, ఉపా ధి కల్పన, స్వయం ఉపాధి రంగాలకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన జిల్లా రుణ ప్రణాళిక మొత్తం పరిమాణం రూ.19,735.42 కోట్లు, గత ఆర్థిక సంవత్సరంలోని రూ.15,576.44 కోట్లతో పోలిస్తే రూ.4,158.98 కోట్ల (26.70 శాతం) పెరుగుదల నమోదైందని తెలిపారు. -
● బైక్పై రయ్మంటూ వెళ్లిపోయిన చైన్ స్నాచర్లు ● పోలీసులకు సమాచారం తెలిసేలోగానే పారిపోయిన వైనం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో ఆదివారం వేకువజామున అలజడి సృష్టించిన చైన్ స్నాచ ర్లు పోలీసులు మేలుకునేలోపే ఉడాయించారు. ఆదివారం రాత్రి 11 గంటలకు రెండో పట్టణ ఎస్ఐ హేమంత్కళ్యాణ్ ఐతమ్ కాలేజీ వైపు ఉన్న సర్వీసు రోడ్డు తుప్పల్లో దొంగిలించిన బైక్ను పట్టుకోగలిగారు. ●ఈ దుండగులు ఆ దివారం వేకువజామున 3:22 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి బయటకు వచ్చారు. ●3.42కు నీలమ్మగుడి సమీపంలో నివాసముంటున్న వ్యాపారి మరుపల్లి సీతారాం ఇంటి ముందున్న పల్సర్ 250 మో డల్ బైక్ చోరీ చేశారు. ●ఈ బైక్తో 5.03కు కార్గిల్ పార్క్ నుంచి 5.30 గంటలకు పెదపాడు వరకు వరుసపెట్టి దొంగతనాలకు పాల్పడ్డారు. ●ఈ విషయాలు పోలీసులకు తెలిసే లోపే జంప్ అయ్యారు. ●5:40 గంటలకు మడపాం టోల్ప్లాజా దాటి న దుండగులు 5.53కే 34 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్కలి ఐతమ్ కాలేజీ వద్ద తేలారు. సీసీ కెమెరాలు ఫెయిల్ : ఐతమ్ కాలేజీ వైపున్న రోడ్డులోకి చేరి తుప్పల్లో బైక్ను పడేశారు. సమీపంలో సీసీ కెమెరా ఉన్నా పనిచేయకపోవడంతో వారు బస్సు లో వెళ్లారా.. మరే ఇతర వాహనంలో వెళ్లారా.. అన్నది తెలియరాలేదు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కూడా కెమెరాలు పనిచేయకపోవడంతో ఎటు నుంచి వచ్చారన్నది తెలియలేదు. ఆ గ్యాంగుల పనేనా..? ఆదివారం నాడే విశాఖ, అనకాపల్లిలో వరుస చైన్స్నాచ్లు జరగడంతో ఆ గ్యాంగు లోని సభ్యులే జిల్లాలో ఎంటరై ఉంటారని అనుమానిస్తున్నారు. వీరు యూపీ, వెస్ట్బెంగాల్, రాజస్థాన్, బీహార్కు చెందినవారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి..? ఇంకా ఎంత శోకం అనుభవించాలి..? డ్రైవర్ల మద్యం మత్తు ప్రాణాలను బలి తీసుకుంటోంది. అయినా మేలుకోవడం లేదు. రథ సారధుల నిద్ర మత్తు మాటిమాటికీ ప్రమాదాలకు కారణమవుతోంది. అయినా చర్యలు తీసుకోవడం లేదు. రోడ్డు పక్క నిలుపుతున్న వాహనాలు ప్రమాద
పెద్దపాడు ఫ్లైఓవర్పై మలుపులో రాత్రి సమయాన లారీ పార్కింగ్ మా కుటుంబానికి పెద్ద దిక్కు మా అమ్మ మురపాల పార్వతి. ఎన్నో ఏళ్లుగా ఆటోలో ప్రయాణం చేసినా ఎప్పుడూ ఏమీ కాలేదు. లారీ డ్రైవర్ మద్యంతాగి బండి నడిపి మా అమ్మను పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతోంది. అదే ఈ ప్రమాదానికి కారణమైంది. రోడ్డుపై తనిఖీలు జరుగుతున్నాయా లేదా అన్న అనుమా నం కలుగుతోంది. వ్యవస్థలో లోపాలే దీనికి కారణం. – మురపాల సంగీత, మృతురాలు మురపాల పార్వతి కుమార్తె శ్రీకాకుళం క్రైమ్ : ●కవిటి మండలంలో వ్యాపారం చేసుకుందామని ఇంటి నుంచి బయల్దేరిన ముగ్గురు మహిళలను ఓ డ్రైవర్ మద్యం మత్తు బలి తీసుకుంది. ●కొర్లాం ప్రాంతంలో ఓ లారీ డ్రైవర్ మత్తులో రాంగ్రూట్లోకి వచ్చేయడంతో మూడు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ●నందిగాం ఫ్లై ఓవర్లో బ్రేక్డౌన్ అయిన ఐరన్ వ్యాన్ను ఒడిశా నుంచి వస్తున్న స్కార్పియో ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయారు. ఇవే కాదు ఇలాంటి ఘటనలు ఇంకెన్నో జరిగాయి. వీటిలో మెజారిటీ సంఘటనల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. నిద్ర మత్తు, మద్యం మత్తు, మితిమీరిన వేగం వంటి కారణాల వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన ప్రమాదాల్లో 46 మందికి మరణాలు సంభవిస్తే.. గడిచిన 2 నెల ల్లో 33 మంది మృత్యువాత పడటం గమనార్హం. వీరిలో ఎక్కువ మంది రహదారి నిబంధనలు పాటించకపోవడం, మద్యం మత్తు, నిద్రమత్తు, మితిమీరిన వేగం, అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, అదుపు తప్పి ఆగి ఉన్న వాహనాలను, కల్వర్టులను, స్తంభాలను ఢీకొట్టడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి స్వయం తప్పిదాలున్న వారే కాక ఎదుటివారి ర్యాష్ డ్రైవ్, రహదారుల్లో భద్రతా లోపాలు వంటివీ కారణంగా కనిపిస్తుండటం గమనార్హం. ఎస్పీ మాట వింటున్నారా..? రోడ్డు ప్రమాదాలపై ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అను నిత్యం సమీక్షలు నిర్వహిస్తున్నారు. అనేక సూచనలు చేస్తున్నారు. కానీ అవి క్షేత్రస్థాయిలో అమలులోకి రావడం లేదనే మాట వినిపిస్తోంది. హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్షణమే స్పందించి క్షణాల్లో ఘటనాస్థలికి చేరాలని, స్పీడ్ ర్యాష్, డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్, మైనర్ రైడింగ్ చేస్తున్నవారి వాహనాలు ఆపాలని, అర్ధరాత్రి, వేకువజామున లారీ, కార్లు, ఇతర వాహనాల డ్రైవర్లను ఆపి ఫేష్వాష్ చేయించాలని, హైవేలపైన, కింద సర్వీసు రోడ్డులపైన, ఫ్లై ఓవర్ల కింద భారీ వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలని ఎంత చెబుతున్నా ఎవరూ వినడం లేదు. దానికి నిదర్శనమే ఈ ప్రమాదాలు. ●సర్వీసు రోడ్డు నుంచి హైవేకి వెళ్లేటప్పుడు అధిక వేగంతో వాహనాలు వెళ్లడం, ఒకే మార్గంలో ఎదురెదురుగా వాహనాలు రావడం. ●వాహనదారుల మద్యం మత్తు, నిద్ర మత్తు, రహదారి నిబంధనలు ఉల్లంఘించడం. ●హైవే వెంబడి రాత్రి పూట లైట్లు వెలగకపోవడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, హెచ్చరిక బోర్డులు అనుకున్న స్థాయిలో లేకపోవడం. ●ఎన్హెచ్–16 నుంచి సర్వీసు రోడ్డులోకి ఎంటరయ్యేటప్పుడు జిల్లాలో చాలా చోట్ల కాంక్రీట్ దిమ్మలు అడ్డంగా ఉండటం, ఇసుక లారీలు రవాణాతో దారి పొడవునా ఇసుక పేరుకుపోయి వాహనాలు స్కిడ్ అవ్వడం. ●ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు లారీలు సర్వీసు రోడ్లలోనే కాక ఫ్లై ఓవర్లు, హైవేలపై రోజుల గంటల తరబడి పార్కింగ్ చేయడం, ఫ్లై ఓవర్ల కింద రోజుల తరబడి ఉంచేయడం. ●హైవేల వెంబడి ముఖ్య కూడళ్లలో దాబాలు, హోటళ్లు, టోల్ప్లాజాల వద్ద పోలీసుల తనిఖీలు శూన్యం. అక్కడే మద్యం పూటుగా సేవించి భారీ వాహనాలు నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ●హైవేకు లింక్గా ఉన్న గ్రామీణ రహదారుల్లో భారీగా గోతులుండటం, ఇరువైపులా పొదలు అల్లుకుపోయి మలుపుల్లో వచ్చే వాహనాలు, కల్వర్టులు కనపడకపోవడం, సైడ్ ఎడ్జ్ల్లో గ్రావెల్ నింపకపోవడం. ●కొత్త బ్లాక్స్పాట్లు గుర్తించకపోవడం, పాత బ్లాక్స్పాటుల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోకపోవడం, సూచిక బోర్డులు లేకపోవడం కారణాలు.నరసన్నపేట జమ్ము కూడలి సమీప సర్వీసు రోడ్డులో లారీలు పార్కింగ్ రహదారి ప్రమాదాలపై జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు. వాహనదారులు రహదారి నిబంధనలు పాటించాలి. హైవేల్లో నెలకొన్న సమస్యలపై ఇతర విభాగాల అధికారులతోను సమన్వయం చేసుకుంటూ ఉన్నతాధికారికి నివేదించి చర్యలు తీసుకుంటాం. – పి.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ, శ్రీకాకుళం మద్యం మత్తులోనే ఘోరంచాలా ఏళ్లుగా మా అమ్మ ఉద్దానంలో కొబ్బరి కా యలు, పనసపండ్లు తదితర వస్తువులు ఇక్కడ కొని బరంపురంలో విక్రయిస్తోంది. ఎప్పుడూ చిన్న సమస్య కూడా రాలేదు. కేవలం డ్రైవర్ మ ద్యం మత్తే ఈ ప్రమాదానికి కారణం. మాలాంటి దుస్థితి ఎవరికీ రాలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ తని ఖీలు చేసి ఉంటే మా అమ్మ బతికి ఉండేదేమో. – నర్తు నారాయణరావు, రాపాకపుట్టుగ, కవిటి మండలం -
ఒంటరితనం భరించలేక టీచర్..!
శ్రీకాకుళం: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జె.రోహిణి (39) అనారోగ్య కారణాల వల్ల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన రోహిణి కాశీబుగ్గలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నారు. భర్త జీవనరావు విజయనగరంలోని జీఎస్టీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. భర్త వారానికి ఒక రోజు వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి వచ్చేసరికి తలుపు మూసి ఉంది. పక్కింటి వారి సహకారంతో తలుపులు పగలు గొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి రోహిణి ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీఐ రామకృష్ణ వచ్చి పరిశీలించారు. ఆదివారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణికి కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు. -
వేసెయ్ పాగా!
శ్రీకాకుళం రూరల్: కోర్టులో కేసు నడుస్తున్నా.. ప్రభుత్వ అధికారులు హెచ్చరిక బోర్డులు పెట్టినా.. స్థలాల ఆక్రమణ విషయంలో మాత్రం కూటమి నాయకులు వెనక్కి తగ్గడం లేదు. మమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తామన్న రీతిలో కబ్జాలకు తెగబడుతున్నారు. అధికారం చేతిలో ఉందనే అండతో చెలరేగిపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సింగుపురంలో ప్రధాన రహదారిని ఆనుకొని కోట్ల రూపాయల విలువ చేసే ముసలగుండం చెరువుపై కబ్జాదారుల కన్ను మరోసారి పడింది. గ్రామ సచివాలయం ఎదురుగానే ఈ చెరువు స్థలం ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. రెవెన్యూ, పంచాయతీ అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ పరిస్థితి.. సింగుపురం గ్రామ ప్రారంభంలోనే సుమారు 200 ఏళ్ల కిందటి ముసలగుండం చెరువు ఉంది. దీని విస్తీర్ణం రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 270/4లో సుమారు నాలుగు ఎకరాలు. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం ఎకరా కోటి రూపాయలపైనే ధర పలుకుతోంది. అప్పట్లో గ్రామస్తులు ఓవైపు తాగునీటి అవసరాలకు, మరోవైపు స్నానాలకు వాడుకునేవారు. ఏటా నిర్వహించే కొండమ్మతల్లి జాతర ఉత్సవాల్లో సైతం ఊరేగించిన ఉత్సవ విగ్రహాలకు ఇందులో పవిత్ర స్నానాలు చేయించేవారు. కాలక్రమేణ చెరువు వినియోగం తగ్గిపోయింది. గ్రామాల్లో తాగునీటి కుళాయిలు రావడం, బోర్లు, ఇతరత్రా వసతులు స్థానిక ప్రజలకు అందుబాటులో రాకపోవడంతో గ్రామస్తులు చెరువుపై ఆధారపడటం మానేశారు. కూటమి నేతల కన్ను.. 2024 జనవరిలో చెరువు అంతటినీ డంపింగ్ యార్డులోని మట్టిని తీసుకొచ్చి రాత్రికిరాత్రే కప్పేందుకు ఓ కూటమి నాయకుడు కుట్రపన్నాడు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలియడంతో అప్పటి తహశీల్దార్ వెంకట్రావు చెరువు చుట్టువైపులా ప్రభుత్వ చెరువు అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. అప్పట్లో ఆక్రమణ నిలిచిపోయింది. తాజాగా సదరు కూటమి నాయకుడు కన్ను మరోసారి అదే చెరువుపై పడింది. అప్పట్లో ఈ చెరువు వివాదాస్పదం కావడం, గ్రామస్తులు కోర్టులో సైతం కేసులు వేయడంతో జిల్లా యంత్రాంగం సైతం ఇది చెరువేనంటూ నిర్ధారించారు. రెండోసారి కబ్జాకు యత్నం.. ఇదే చెరువు స్థలంలో రెండు రోజుల క్రితం సాగునీటి కాలువల్లోని మట్టిని తీసుకొచ్చి చెరువులోని మిగిలిన నీటిని కప్పిస్తూ కూటమి నేత పనులు చేయిస్తున్నాడు. ఇంత వ్యవహారం జరుగుతున్నా పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారు. చెరువు పరిరక్షణపై 2024 ఫిబ్రవరిలో గ్రామస్తులంతా కలిసి కోర్టులో కేసులు వేశాం. అయినప్పటికీ సింగుపురం టీడీపీ మాజీ సర్పంచ్ గుండ ఆదిత్యనాయుడు నాలుగు ఎకరాల చెరువు కబ్జాకు పాల్పడుతున్నారు. ఇదివరకూ ప్రభుత్వ చెరువు అంటూ ఏర్పాటు చేసిన బోర్డులు సైతం పీకిపారేశారు. రెండు రోజులుగా కాలువల్లో మట్టిని తీసుకొచ్చి చెరువులో నీటితో మిగిలిన భాగాన్ని కప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. – బగ్గు అప్పారావు, ఎంపీటీసీ, సింగుపురం సింగుపురం మేజర్ పంచాయతీ పరిధిలో ఖాళీ స్థలం కనిపిస్తే కూటమి నేతలు పాగా వేసేందుకు సిద్ధపడుతున్నారు. వీరి ఆగడాలకు అడ్డు లేకుండాపోతోంది. రెవెన్యూ అధికారులు స్పందించి ఆక్రమణలు అరికట్టాలి. – బాణ నర్సింగరావు, సింగుపురం సింగుపురంలో చెరువు కబ్జా జరుగుతుందన్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తాం. ప్రభుత్వ చెరువులు, డీ పట్టా భూములు, కాలువలు ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎస్.గణపతి, శ్రీకాకుళం మండల తహశీల్దార్ సింగుపురంలో కోట్లు విలువైన చెరువు కబ్జాకు కూటమి నేత ఎత్తుగడ కోర్టులో కేసు ఉండగానే మరోసారి ఆక్రమణకు యత్నం పట్టించుకోని అధికారులు -
ఆదిత్యుని సన్నిధిలో భక్తుల సందడి
అరసవల్లి: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఏఈఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో భక్తులకు దర్శనాలు సజావుగా జరిగేలా ఏర్పాటు చర్యలు చేపట్టారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో రూ.300 దర్శన టికెట్ల భక్తులకు అంతరాలయ దర్శనం చేయించారు. ప్రసాదాల కౌంటర్ల వద్ద ఫ్యాన్లు పని చేయకపోవడంతో ఉక్కపోతకు గురయ్యారు. మరోవైపు, క్యూలైన్లలో సెల్ఫోన్లు చెకింగ్ పాయింట్ల వద్ద గంటల తరబడి వేచివుండడంతో దర్శనాలు ఆలస్యం కావడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేశఖండన శాల, మరుగుదొడ్లు, కొబ్బరి కాయలు కొట్టిన చోట అదనపు వసూళ్లు జరిగాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒకే పాయింట్ వద్ద చెప్పుల కలెక్షన్ ఉండటంతో భక్తులకు పాట్లు తప్పలేదు. ఆదిత్యుని సన్నిధిలో అసోం చీఫ్ సెక్రటరీ.. అరసవల్లి సూర్యనారాయణ స్వామిని జిల్లాకు చెందిన అసోం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోత రవి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. -
ఆ రెండు చుక్కలే శ్రీరామరక్ష
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అరసవల్లి: పోలియో నిర్మూలన లక్ష్యంగా వరుస గా మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో మారుమూల ప్రాంతంలో చిన్నారికి కూడా పోలియో డ్రాప్స్ ఇచ్చేలా యంత్రాంగం చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. ఆదివారం స్థానిక నగరంలో హౌసింగ్ బోర్డు కాలనీలో అంబేడ్కర్ భవన్ వద్ద పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని డీఎంహెచ్ఓ కె.అనితతో కలి సి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 0–5 వయస్సు గల చిన్నారులు 1,80,879 మందికి తప్పనిసరిగా ఈ పోలియో చుక్కలు వేయించాలని, ఈ మేరకు కొండ ప్రాంతాలతో పాటు వలసదారుల పిల్లలకు కూడా ఈ డ్రాప్స్ వేయించాలన్నారు. ఈ రెండు చుక్కలే భవిష్యత్కు శ్రీరామరక్ష అని అన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ జి ల్లాలో మొత్తం 30 మండలాల్లో అన్ని మారు మూల ప్రాంతాలను కూడా కవర్ చేస్తూ పోలియో డ్రాప్స్ వేయించేలా మొబైల్ బృందాలను నియ మించామన్నారు. మొత్తం 1096 పోలియో బూత్లలో మొత్తం 7430 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారన్నారు. అనివార్య కారణాలతో పోలియో డ్రాప్స్ వేయించుకోలేని వారి కోసం 29, 30 తేదీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. -
ఓటు పాట్లు..!
● కోడళ్లకు చుక్కలు చూపిస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ ● పుట్టింటి ఐడీ ఆధారాలు సమర్పించేందుకు ఇబ్బందులు ● గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా చిక్కులు హిరమండలం: జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సర్వే ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఓటర్లకు చుక్కలు చూ పిస్తున్నాయి. ముఖ్యంగా 2002 తర్వాత వివాహం జరిగిన మహిళలకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫామ్స్ను తీసుకునేందుకు బీఎల్ఓలు ముందుకు రావడం లేదు. అలాంటి వారి ఓటు మ్యాపింగ్కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు రాలేదని చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా కోడళ్ల ఓట్లపై కుటుంబా ల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా నిరక్షరాస్యులకు ఈ విషయంలో ఏం జరుగుతుందో వారికి తెలియడం లేదు. జిల్లాలో మొత్తం 8 నియోజకవర్గాల్లో 18,97,116 ఓటర్లు ఉన్నారు. ఇందులో 12,92,904 మ్యాపింగ్ జరిగాయి. జిల్లాలో 2,358 బూత్లు ఉన్నాయి. వీటిలో ప్రతి బూత్కు ఒక్కో బూత్లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)ను నియమంచారు. వీరి దగ్గరే ఆయా బూత్లకు సంబంధించి 2002, 2025 ఓటరు జాబితాలు ఉంటాయని ఎన్నికల కమిషన్ (ఈసీ)చెబుతోంది. అయితే బీఎల్ఓలు మాత్రం తమ దగ్గర ఆయా ఓటరు జాబితాలు లేవని, ఉన్నా ఎంతమందికి ఇస్తామని ప్రశ్నిస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫాం తోపాటు 2002, 2025 ఓటరు జాబితా వివరాలు బీఎల్ఓలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో.. జిల్లాలో పాతపట్నం, పలాస నియోజకవర్గంలో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉంటారు. 80 వేల మంది వరకూ గిరిజన మహిళా ఓటర్లు ఉంటారు. గిరిజనులు ఒకేచోట ఉండే పరిస్థితి ఉండదు. కొండ శిఖర గ్రామాలతో పాటు గూడల్లో ఎక్కువగా నివసిస్తుంటారు. ఆ పై నిరక్షరాస్యులే అధికం. ఈ రెండు కారణాలతో వీరి ఓట్ల మ్యాపింగ్ చాలా కష్ట మని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు 2002 తర్వాత పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన వారికి చిక్కుముడులు ఎదురవుతున్నాయి. పుట్టింటి నుంచి ఓటరు ఐడీ, ఇతర ఆధారాలు తెస్తేనే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తామని బీఎల్ఓ లు తేల్చిచెబుతున్నారు. మరి కొంతమంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చి వెళ్లిపోతున్నారు. ఆ ఫామ్ ఎలా నింపాలి, ఏయే వివరాలు ఉండాలో తెలియపరచడం లేదని ఆరోపిస్తున్నారు. ఎప్పుడో వివాహాలు జరిగి మెట్టినింటికి వచ్చిన వారికి ఎలాంటి ఆధారాలు లభించడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వారిలో ఎక్కువగా గిరిజన మహిళలే అధికంగా ఉంటున్నారని సర్వే అధికారులు చెబుతున్నారు. ఆ నిబంధనతో.. వివాహం తర్వాత మెట్టినింటికి వచ్చిన మహిళలు తప్పకుండా తమ పుట్టినింటి ఐడీ వివరాలు అందించాల్సిందేనని చెబుతుండడంతో వారు బిక్కమొఖం వేస్తున్నారు. సాధారణంగా ఏళ్ల కిందట వివాహాలు జరిగి మెట్టినింటికి వచ్చేవారికి ఎలాంటి ఆధారాలు ఉండవు. గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యులే అధికం. దీంతో ఇక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే జిల్లాలో పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతవుతాయన్న ఆందోళన రాజకీయ పార్టీల్లో ఉంది. మరోవైపు వివరాలు లేవని చెప్పి చాలామంది ఓట్లు గల్లంతు చేసే అవకాశం ఉంటుందని అధికార పార్టీపై విపక్షాలకు అనుమానాలు ఉన్నాయి. -
పైడిగాం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలి
సోంపేట: నియోజకవర్గంలో ఏకై క మైనర్ నీటిపారుదల ప్రాజెక్టు పైడిగాం ప్రాజెక్టు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని వైఎస్సార్ సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘పైడిగాంకు పోదాం’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. బేసిరామచంద్రాపురం నుంచి స్థానిక రైతులు, పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా పైడిగాం ప్రాజెక్టు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సుమారు 63 ఏళ్ల క్రితం నిర్మించిన ప్రాజెక్టు శిథిలావస్థకు చేరుకునే దశకు వచ్చిందన్నారు. తిత్లీ వంటి తుఫాన్లు సంభవిస్తే స్థానిక రైతులకు ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వం , ప్రజా ప్రతినిధులు స్పందించి పైడిగాం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పునఃనిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఒడిశా రాష్ట్రంతో నీటి సరఫరాకు ఎటువంటి ఒప్పందాలు లేకపోవడంతో అక్కడి ప్రభుత్వం మహేంద్ర తనయ నదిపై అవసరాలకు మించి ఆనకట్టలు నిర్మించి దిగువ ప్రాంతానికి నీరు రాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ విషయమై జిల్లాకు చెందిన కేంద్రమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, స్థానిక విప్ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పైడిగాం ప్రాజెక్టు సుమారు 17 కిలోమీటర్ల ప్రధాన కాలువలో 10 కిలోమీటర్లు మాత్రమే సిమెంట్ గోడ నిర్మాణం జరిగిందని, మిగతా కాలువకు గోడ నిర్మించడానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గన్ని పద్మనాభం సమితి అధ్యక్షుడిగా ఒక్కసారే పనిచేసి తన కృషితో మూడు మండలాల రైతులకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. 15 ఏళ్లపాటు స్థానిక ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న అశోక్ నియోజకవర్గానికి ఏం చేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పైడిగాం ప్రాజెక్టుకు గన్ని పద్మనాభం ప్రాజెక్టుగా పేరు మార్చడంతో పాటు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నర్తు నరేంద్రయాదవ్ మట్లాడుతూ రాష్ట్రంలోసాగు నీటి ప్రాజెక్టుల కోసం సాగు చేసే ఖర్చులో ఒక్క శాతం కూడా నియోజకవర్గానికి విడుదల చేయకపోవడం దురదృష్టకరమన్నారు. దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే వహించాలన్నారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మాట్లాడుతూ అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కృషితో సుమారు రూ.14 కోట్ల నిధులతో 10 కిలోమీటర్ల మేర కాలువకు సిమెంట్ గోడ నిర్మించారని, తిత్లీ తుఫాన్ సమయంలో అప్పటి నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో మరమ్మతులు జరిగాయని గుర్తు చేశారు. కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, కంచిలి మాజీ ఏఎంసీ చైర్మెన్ బతకల మోహనరావు మాట్లాడుతూ నిధులు మంజూరుపై రెండేళ్లుగా ప్రకటనలు ఇవ్వడం తప్ప ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తడక యశోద, పార్టీ నాయకులు తడక జోగారావు, ఇప్పిలి కృష్ణారావు, శిలగాన భాస్కరరావు, వజ్జ మృత్యుంజయం, రౌతు విశ్వనాథం, బుద్దాన శ్రీకృష్ణ, మడ్డు వెంకటరావు, సల్ల దేవరాజు, నర్తు భాను, గురాల శ్రీను, తామాడ బుజ్జి, రాజేష్ ఖన్నా, టి.ధర్మారావు, దున్న మాధవరావు, సకలాబత్తుల హరీష్, పిన్నింటి ఈశ్వరరావు, తామాడ పద్మావతి, పోకల హేమరాజు, బతకల సతీష్, కె.శ్రీనివాసరావు, ఎం.సిసింద్రీ తదితరులు పాల్గొన్నారు. -
మద్యానికి మరొకటి..
వేసెయ్ పాగా..ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. సింగుపురంలో కోట్లు విలువ చేసే భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. –8లోఒంటి మీద వస్త్రం నిలవనంత మత్తు.. ఎదురుగా వాహనం కనిపించనంత నిషా.. ఎంత ఘోరం జరిగిందో గుర్తు పట్టలేనంత మైకం.. ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలికొంది. డ్రైవర్ నెత్తికెక్కిన మత్తు, అతివేగానికి ఫలితంగా మూడు కుటుంబాల్లో దీపాలు ఆరిపోయాయి. పొద్దున్నే సామాన్లు కొని సాయంత్రానికి అమ్మేసి ఇంటికి వెళ్లిపోదామనుకున్న ఆడ పడుచుల ప్రయాణం నడిరోడ్డుపైనే ఆగిపోయింది. కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో లగేజీ ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశారు. చిత్రంలో కనిపిస్తున్న లారీ డ్రైవర్ తీరు చూశారా.. ఒంటి మీద టవల్ కూడా నిలవనంతగా మద్యం తాగి ఉన్నాడు. అదే మత్తులో లారీ డ్రైవింగ్ చేస్తూ ఘోర ప్రమాదానికి కారణమయ్యాడు. ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతుండడం వీరికి వరం కాగా.. సామాన్యులకు శాపమైంది.నుజ్జునుజ్జు అయిన ఆటో కవిటి, ఇచ్ఛాపురం : ఉద్దానం ప్రాంతంలో పండే కొబ్బరి కాయ లు, పనస పండ్లు, అరటికాయలు, మునగ వంటి ఉత్పత్తుల్ని ఇక్కడ కొనుగోలు చేసి వాటిని బరంపురం మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముకోవడం వారికి జీవనోపాధి. అలా వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తుంటారు. ఎప్పటిలాగానే ఈ ఆదివారం కూడా సరుకులు కొనడానికి ఇంటి నుంచి బయల్దేరారు. సాయంత్రానికి అన్నీ అమ్మేసి ఇంటికి వచ్చేద్దామని అనుకున్నారు. కానీ ఆ ముగ్గురు మహిళలకు ఇదే చివరి రోజైంది. మద్యం మత్తులో లారీని నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపిన ఓ డ్రైవర్ నిర్లక్ష్యం వారి జీవితాల్ని గాలిలో కలిపేసింది. కంచిలి మండలం ఆదివారం సంత నుంచి లగేజీ ఆటోలో వెళుతున్న ముగ్గురు మహిళలు కవిటి మండలం జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో 16 వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కవిటి మండలం గుజ్జుపుట్టుగకు చెందిన మురపాల పార్వతి(50), రాపాకపుట్టుగ కు చెందిన నర్తు పద్మమ్మ (60), ఇచ్ఛాపురం పట్టణం అమీన్సాహేబ్పేటకు చెందిన మద్దిలి తరిణమ్మ (52)తో పాటు మరికొందరు మఖరాంపురం జంక్షన్ వద్ద సంతకు వెళ్లేందుకు ఆదివారం లగేజీ ఆటోపై బయల్దేరారు. మఖరాంపురం జంక్షన్లో సరుకు కొనుగోలు చేసి తిరుగు ప్రయాణమయ్యా రు. సరిగ్గా జమేదారుపుట్టుగ జంక్షన్కు వచ్చేసరికి ఆటోను రోడ్డు పక్కగా నిలిపారు. అయితే అదే సమయానికి వెనుక నుంచి అతివేగంతో వస్తున్న లారీ ఈ ఆటో ను అమాంతం ఢీకొట్టి 50 మీటర్ల దూరం ఈడ్చుకుపో యి విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. వారిలో రాపాకపుట్టుగకు చెందిన నర్తు ఎర్రయ్య, బరంపురానికి చెందిన బొడ్డు కేశవులు, రాపాకపుట్టుగకు చెందిన మామిడి మోహినమ్మ, కామాక్షి ఉన్నారు. వీరిలో మోహినమ్మ, కామాక్షి పరిస్థితి విషమంగా ఉండడంతో బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల వారంతా అక్కడకు చేరుకున్నారు. లారీ డ్రైవర్ పరిస్థితి చూసి అందరూ విస్మయం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఉన్న ఆ డ్రైవర్ పరిస్థితి దారుణంగా ఉంది. కనీసం ఒంటిపై తువ్వాలు నిలవడం లేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఆయా కుటుంబాల వారికి విషయం తెలియడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. తమకు అన్నం పెట్టే చేతులు ఇక లేవని కన్నీరుమున్నీరయ్యారు. మృతుల్లో నర్తు పద్మమ్మకు భర్త బాబయ్య ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మురపాల పార్వతికి భర్త ఢిల్లీరావు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. మద్దిలి తరిణమ్మకు భర్త దాలయ్య, కొడుకు, కూతురు ఉన్నా రు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఇచ్ఛాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇచ్ఛాపురం రూరల్ ఎస్ఐ జనార్ధనరావు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. లారీని స్వాధీనం చేసుకుని, డ్రైవర్ భంజారౌత్ను అదుపులోకి తీసుకున్నారు. బాధితులను ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కడియాల ప్రకాష్ వెళ్లి పరామర్శించారు.తరిణమ్మ మృతదేహం మురపాల పార్వతి మృతదేహం వద్ద రోదిస్తున్న భర్త నర్తు పద్మమ్మ మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారులు జమేదారుపుట్టుగ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మహిళల దుర్మరణం నలుగురికి గాయాలు మద్యం మత్తులో లారీ నడిపిన డ్రైవర్ -
ఎప్పుడెప్పుడు..?
● ఆదివారం ఉదయం సరిగ్గా 5.03 గంటలు. జిల్లాకేంద్రంలోని ఒకటో పట్టణ పీఎస్ పరిధి కార్గిల్ పార్క్ ప్రాంతం. ఏపీహెచ్బీ కాలనీకి చెందిన చిల్లా రేణుకాదేవి మార్నింగ్వాక్ చేస్తుండగా ఆమెకు ఎదురుగా గుర్తు తెలియని ఇద్దరు అగంతకులు ద్విచక్రవాహనంపై వచ్చి చైన్ తెంపబోయారు. ఆమె ప్రతిఘటించడంతో పారిపోయారు. ● 5.16కు రెండో పట్టణ పరిధి బలిజేపల్లివారివీధిలో బోయిన సూర్యకుమారి, 5.28 గంటలకు ప్రకా ష్నగర్ మహలక్ష్మి నిలయం మలుపులో రేగి లక్ష్మి మెడల్లోంచి మొత్తంగా 4 తులాల పుస్తెల తాడులు తెంపుకుపోయారు. ● కేవలం అరగంట వ్యవధిలో మూడు దొంగతనాలు జరిగాయి. -
సాంఘికశాస్త్రం.. మోయలేని భారం!
ఇటీవల సిలబస్ మార్పుల నేపథ్యంలో గణితం, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల్లో పాఠాలను గణనీయంగా తగ్గించిన విద్యాశాఖ.. సాంఘికశాస్త్రానికి వచ్చేసరికి గుట్టలు, గుట్టలుగా చాప్టర్లు పెంచిందన్న విమర్శలు వస్తున్నాయి. ఉదాహరణకు పదో తరగతి సైన్స్లో భౌతికశాస్త్రంలో 4, రసాయన శాస్త్రంలో 4, జీవశాస్త్రంలో 5 మొత్తం కలిపి 13 పాఠాలు ఉండగా వీటిని వేర్వేలు ఉపాధ్యాయులు బోధించే అవకాశం ఉంది. గణితం 15 అధ్యాయాలు కాగా భాషా సబ్జెక్టులు 10 నుంచి 14 యూనిట్లకు పరిమితం చేశారు. సాంఘికశాస్త్రంలో మాత్రం 22 పాఠాలు ఉండగా వీటిని ఒక్క ఉపాధ్యాయుడే బోధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సిలబస్ను కుదించాలని ఏపీఎస్ఎస్టీఎఫ్ ఫోరం ప్రభుత్వానికి ఇటీవల విజ్ఞప్తి చేసింది. నందిగాం: రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఇటీవల రూపకల్పన చేసిన సిలబస్లోని అసమానతలు విద్యార్థులు, ఉపాధ్యాయులపై తీవ్ర మానసిక ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ మార్చారు. 9,10 తరగతులకు గతేడాది సిలబస్నే నిర్దేశించినా, సాంఘిక శాస్త్రం సిలబస్ను హేతుబద్ధీకరించి భారాన్ని తగ్గిస్తామని గతంలో విద్యాశాఖాధికారులు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఆరు నుంచి పది తరగతుల వరకు అమలు చేస్తున్న సాంఘికశాస్త్రం సిలబస్ మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే అధికంగా ఉంది. దీంతో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు, నేర్చుకునే విద్యార్థి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 6 నుంచి 8వ తరగతి వరకు యథాతథంగా సీబీఎస్సీ సిలబస్ను పోలి ఉంటూ వాటికి అదనంగా ప్రాంతీయ అంశాలు ఒక చాప్టర్, ఏఐ ఒక చాప్టర్ జత చేసి రెండు సెమిస్టర్లుగా మార్చారు. 9, 10 తరగతుల పాఠ్యాంశాలు పూర్తిగా సీబీఎస్సీ సిలబస్నే రాష్ట్ర సిలబస్గా పొందుపర్చారు. వీటిలో 6 నుంచి 9 వతరగతి వరకు సెమిస్టర్–1, సెమిస్టర్–2గా విభజించి వాటిలోనే భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్ధశాస్త్రం వంటి విభిన్న అంశాలు పొందుపర్చగా, పదో తరతిలో సెమిస్టర్ విధానం లేకుండా పాత పద్ధతిలోనే ఈ నాలుగు విభాగాలు పొందిపరిచారు. సవాల్గా మారిన భోదన.. నేటి విద్యావిధానంలో విద్యార్థుల నిరంతర సమగ్ర మూల్యాంకనం, ప్రాజెక్టుల తయారీ, ఇతర అకడమిక్ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఉపాధ్యాయులకు 22 పాఠాల విస్తృత సిలబస్ను అధికారులు చెప్పినట్లు డిసెంబర్ నాటికి పూర్తి చేయడం సవాల్గా మారింది. నిర్ణీత సమయంలో బోధించడం, రివిజన్ చేయించడం కష్టంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర సబ్జెక్టులతో పోల్చితే సిలబస్ ఎంతో అధికం ఉపాధ్యాయులు, విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి సిలబస్ తగ్గించాలని ఏపీఎస్ఎస్టీఎఫ్ ఫోరం వినతి -
న్యాయవాదులకు క్షమాపణ చెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాదులను అసభ్య పదజాలంతో, న్యాయవాద వృత్తిని కించపరిచేలా మాట్లాడం సరికాదని వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అధికార పార్టీ దురహంకారానికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో మేధావి వర్గానికి చెందిన న్యాయవాదులనే ఇంత దారుణమైన పదజాలంతో, బహిరంగంగా కించపరిచి మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చన్నారు. న్యాయవాదులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రైతుల కోరిక మేరకు బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా వారి బాధలు తెలుసుకోవడానికి వెళ్లిన వారిపై ప్రత్యక్ష దాడులు చెయ్యించడం చూస్తూ ఉంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. -
సీసీ కెమెరాలో ఏముంది..?
● పోలీసులు నగరంలోని అన్ని సీసీ ఫుటేజీలు పరిశీలించగా ఆర్టీసీ కాంప్లెక్సు బయట వేకువజాము 3.20 గంటలకు అగంతకులు కదలికల దృశ్యాలు కనిపించాయి. తర్వాత ఒకటో పట్టణ పరిధి కార్గిల్ పార్క్ సమీప నీలమ్మగుడి వద్ద ఓ బైక్ను దొంగిలించినట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అదే బైక్పై సమీపంలోనే మార్నింగ్ వాక్ చేస్తున్న చిల్లా రేణుకాదేవి మెడలోంచి చైన్ తెంపేసి చేతులతో అగంతకుడు పట్టుకెళ్తున్నట్లు సీసీ ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఆమె ఫిర్యాదు సైతం ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ● కార్గిల్ పార్క్ నుంచి ప్రకాష్బాబు ఓల్డ్బుక్షాపు మీదుగా శివజ్యోతి మెస్ పక్కనే ఉన్న బలిజేపల్లివారి వీధి ఎంటరై విజయ్ రెసిడెన్సీ ఎదురుగా వున్న సందు చివరకి వెళ్లారు. బోయిన గోవిందరావు భార్య సూర్యకుమారి ఇంటి ముందు వాకిలి ఊడ్చుతుండగా అగంతకులిద్దరూ బండిపై వచ్చి చూసి వెళ్లిపోయి మళ్లీ వచ్చి ఆమె తో మాట కలిపినట్టు నటించాడు. అంతలోనే మరో వ్యక్తి వచ్చి 3 తులాల పుస్తెల తాడు తెంపేశాడు. 2 పుస్తెలు, సతుమానం భాగం ఆమె చేతిలోనే ఉండిపోగా మిగతా రెండుతులాల తాడు పట్టుకుపోయారు. అక్కడి నుంచి నేరుగా ప్రకాష్నగర్ చేరి మహలక్ష్మినిలయం మలుపులో మార్నింగ్ వాక్ చేస్తున్న రేగి లక్ష్మి మెడలో పుస్తె తెంపేశారు. ● ఘటనాస్థలికి రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్ఐ హేమంత్కళ్యాణ్, ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణలు వెళ్లి బాధితుల నుంచి వివరాలు సేకరించి నగరంలో సీసీ పుటేజీలు పరిశీలించారు. ● ఇందులో ఉదయం 5.16 గంటల నుంచి 5.22 గంటల వరకు సీసీ పుటేజీ కనిపించకపోవడం గమనార్హం. అగంతకులు మడపాం టోల్ ప్లాజా దాటినట్లు కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దారి కాచి దోపిడీశ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని ఖాజీపేట పంచాయతీ పరిధిలో ఆదివారం వేకువజామున దారి దోపిడీ జరిగింది. అదే గ్రామానికి చెందిన పంచిరెడ్డి అప్పలనాయుడు శ్రీకాకుళం నుంచి తన ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు వ్యక్తులు వచ్చి అప్పలనాయుడుపై దాడి చేసి అతడి జేబులో నుంచి రూ.20వేలు నగదు పట్టుకొని పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైస్కూల్ టీచర్ ఆత్మహత్య
పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు జె.రోహిణి (39) అనారోగ్య కారణాల వల్ల తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మెళియాపుట్టి మండలం తూముకొండ గ్రామానికి చెందిన రోహిణి కాశీబుగ్గలోని మారుతీనగర్లో ఒంటరిగా ఉంటున్నారు. భర్త జీవనరావు విజయనగరంలోని జీఎస్టీ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. ఇద్దరు కుమార్తెలు విశాఖపట్నం, ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. భర్త వారానికి ఒక రోజు వస్తుంటారు. ఎప్పటిలాగే శనివారం రాత్రి వచ్చేసరికి తలుపు మూసి ఉంది. పక్కింటి వారి సహకారంతో తలుపులు పగలు గొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి రోహిణి ఉరికి వేలాడుతూ కనిపించారు. వెంటనే కాశీబుగ్గ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో సీఐ రామకృష్ణ వచ్చి పరిశీలించారు. ఆదివారం ఉదయం పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోహిణికి కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని సీఐ చెప్పారు. -
నాలుగో తరగతి ఉద్యోగుల కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఎన్జీవో కార్యాలయం వద్ద క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ సంఘ భవనంలో ఆదివారం శ్రీకాకుళం జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఎలక్షన్ అధికారిగా బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఎలక్షన్ అధికారిగా బి.నవీన్కుమార్ వ్యవహరించారు. అధ్యక్షుడిగా ఎస్.శంకరరావు (సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్), సెక్రటరీగా ఎ.తారకేశ్వరరావు (అగ్రికల్చర్), కోశాధికారిగా టి.సీతారాం (కమర్షియల్ టాక్స్), అసోసియేట్ ప్రెసిడెంట్గా కె.చంద్రమౌళి (రెవెన్యూ), ఉపాధ్యక్షులుగా జి.నాగమణి (డీఎంహెచ్వో ఆఫీస్), పి.సుబ్రహ్మణ్యం (ట్రెజరీ), బి.లక్ష్మి(డీఎంహెచ్వో ఆఫీస్), సంయుక్త కార్యదర్శులుగా జై.రవికుమార్ (కమర్షియల్ టాక్స్), ఎ.పద్మావతి (అగ్రికల్చర్), ఆర్గనైజింగ్ సెక్రటరీగా పి.శ్రీనివాసరావు (రెవెన్యూ), లీగల్ అడ్వైజర్గా సీహెచ్ ఉమాశంకర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదో తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బల్లాడ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీవో హోమ్లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం ద్వారా ఒక్కో విద్యార్థికి రూ.3వేలు, మెమెంటో, సర్టిఫికెట్, ఎస్ఆర్ షాపింగ్ మాల్ అధినేత గోపీనాథ్ రెడ్డి తరఫున రూ.2వేలు, గిఫ్ట్ ఓచర్, సర్టిఫికెట్ అందించారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ నాయకులు దుక్క రాజశేఖరరెడ్డి, బాకీ వేణుగోపాల్రెడ్డి, గౌరవ సలహాదారులు బుచ్చ రామకృష్ణారెడ్డి, దూడ విష్ణుమూర్తిరెడ్డి, పాల వసంత రెడ్డి, బళ్లాడ హేమమాలిని రెడ్డి, పడపాన సుగుణారెడ్డి, మునకాల కిరణ్ కుమార్రెడ్డి, అలపాన త్రినాధ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాత పెన్షన్ మంజూరుకు కృతజ్ఞతలు శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 అనుసరించి పాత పెన్షన్ మంజూరు చేయడానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించినందున కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ ఎన్జీవో సంఘ పూర్వపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తమనాయుడు అన్నారు. ఆదివారరం శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయంలో డీఎస్సీ–2003 ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ ఒకటి ముందు నియామక ప్రక్రియలు పూర్తిచేసుకుని కొన్ని కారణాల వల్ల సీపీఎస్ విధానంలోకి నెట్టవేయబడిన డీఎస్సీ 2003 ఉపాధ్యాయులు, కొంతమంది పోలీస్ కానిస్టేబుళ్లు, గ్రూప్–2 అధికారులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11,715 మందికి ఉపశమనం లభించిందన్నారు. సమావేశంలో ఎన్జీవో సంఘ జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయి వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి చల్లా శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పూజారి జానికిరాం, బడగల పూర్ణచంద్రరావు, రాష్ట్ర కన్వీనర్ బలగ శ్రీనివాసరావు, జిల్లా కో–కన్వీనర్లు గురుబెల్లి భాస్కరరావు, దుప్పల శివరాం ప్రసాద్, కొత్తపల్లి ప్రకాష్, శ్రీకర్, అట్టాడ తిరుమలేశ్వరరావు, గురుగుబెల్లి చిన్ని కృష్ణంనాయుడు, చదువుల టార్జాన్, దుంపల అనిల్, కె.రామకృష్ణ, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమ సభకు సహకరించండి శ్రీకాకుళం అర్బన్: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా జూలై 12న శ్రీకాకుళంలో జరగనున్న మొదటి ఉద్యమ సన్నద్ధత సభ విజయవంతం చేసేందుకు సహకరించాలని జిల్లా చైర్మన్ బీవీవీఎన్ రాజు నేతృత్వంలోని బృందం ఆదివారం ఎన్జీజీవో అధ్యక్షుడు హనుమంతు సాయిరాం, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.వేణులను కోరారు. సభకు తప్పకుండా హాజరు కావాలని విన్నవించారు. దీనిపై సాయిరాం స్పందిస్తూ తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ప్రకటించారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అర్జీదారులు మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకో వచ్చని తెలిపారు. జిల్లా పరిషత్ పాత సమా వేశ మందిరంలో రెవెన్యూ క్లినిక్ ఉంటుందని, ప్రజలు గమనించి రెవెన్యూ క్లినిక్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. శ్రీముఖలింగంలో ఘనంగా మైనాకోత్సవం జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జ్యేష్టమాసం ఐదో ఆదివారం స్వామికి మైనాకోత్సవం ఘనంగా జరిగింది. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి ముందుగా హోమం బలిహరణ అనంతరం పార్వతి పరమేశ్వరులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు వివాహ మహోత్సవం నచ్చని మైనాకుడు స్వామివారి గృహాన్ని దహనం చేస్తాడు. కార్యక్రమాన్ని మైనాకోత్సవంగా నిర్వహించడం సంప్రదాయంగా పరగణిస్తారు. పాలిసెట్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రారంభం ఎచ్చెర్ల: ఏపీ పాలిసెట్–2026 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు నేటి నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసినప్పుడు సూచనలు తప్పనిసరిగా పాటించాలి. వెబ్ ఆప్షన్లు నమోదు సమయంలో ఉపయోగించే మొబైల్ నంబర్ తప్పనిసరిగా అభ్యర్థి లేదా వారి తల్లిదండ్రు లది ఉండాలి. ఓటీపీలను ఇతరులతో పంచుకోకూడదు. ఒకసారి వెబ్ ఆప్షన్లను ఫ్రీజ్ చేసిన తర్వాత వాటిని తిరిగి మార్చడం, తెరవడం సాధ్యం కాదు. హెల్ప్లైన్ సెంటర్లో కూడా ఓపెన్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి అన్ని ఆప్షన్లను పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్ర మే ఫ్రీజ్ చేయాలి. వెబ్ ఆప్షన్లు నమోదు చేయ డానికి ముందు కళాశాలలు, కోర్సులను తమ ప్రాధాన్యత క్రమంలో ఒక కాగితంపై ముందుగా రాసుకుని అనంతరం అదే క్రమంలో వెబ్సైట్లో నమోదు చేయాలి. రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లో మార్పు అవసరమైతే అభ్యర్థి సంబంధిత హెల్ప్లైన్ సెంటర్ను సంప్రదించి, అవసరమైన అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి సెట్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలి. పునరావాస కాలనీలో పనులు సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామమైన విష్ణుచక్రం పునరావాస కాలనీలో పంచాయతీ అధికారులు పనులు చేపట్టారు. ‘ఎవరికి చెప్పినా ఏం లాభం’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. సెలవు రోజు అయినా పనులను చేపట్టారు. విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేసి గ్రామానికి వెలుతురు తెచ్చారు. నిల్వ ఉన్న మురికినీటిని మళ్లించారు. గ్రామాల్లో ఉన్న ఆలయాలకు పునరావాస కాలనీలో 13 సెంట్లు కేటాయించామని తహసీల్దార్ హేమసుందర్రావు తెలిపారు. -
ఎవరికి చెప్పినా.. ఏం లాభం?
● తీవ్ర ఆవేదనలో విష్ణుచక్రం గ్రామస్తులు ● పోర్టు పునరావాస గ్రామంలో కనీస వసతులు కరువు ● అధికారులకు ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం సంతబొమ్మాళి : పుట్టిన ఊరిని, నివాసమున్న ఇళ్లను వదిలి సర్వం త్యాగం చేసి పునరావాస కాలనీలో తలదాచుకుంటున్న విష్ణుచక్రం గ్రామస్తులు కనీస సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూలపేట పోర్టు పునరావాస ప్రాంతమైన విష్ణుచక్రం గ్రామస్తులను 15 నెలల క్రితం నౌపడ పునరావాస కాలనీకి తీసుకొచ్చారు. ఒక్కో కుటుంబానికి ఐదు సెంట్లు చొప్పున 70 కుటుంబాలకు స్థలాలు కేటాయించారు. అయితే వసతులు కల్పించడం మాత్రం మర్చిపోయారు. వీధి దీపాలు రెండు నెలలుగా వెలగడం లేదు. దీంతో రాత్రి వేళల్లో విషసర్పాలతో భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. బాగా దిగువకు సీసీ రోడ్డు నిర్మాణం చేపడట్టడంతో మట్టి పేరుకుపోయింది. డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో దుర్గంధం వెదజల్లి దోమలు, ఈగలకు నిలయంగా మారింది. కుళాయిల ద్వారా ఎప్పుడు నీరు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో మంచినీటి క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. గుడి, బడి లేక.. పునరావాస కాలనీకి వచ్చి 15 నెలలు కావస్తున్నా విద్యార్థుల కోసం పాఠశాల ఏర్పాటు చేయలేదు. పాఠశాల లేక చిన్నారులను దూరప్రాంతాలకు పంపుతున్నారు. కమ్యూనిటీ హాల్ కూడా లేదు. విష్ణుచక్రం గ్రామంలోని గుడులన్నీ పునరావాస కాలనీలో పునర్నిర్మిస్తామని చెప్పిన అధికారులు తర్వాత పట్టించుకోవడం లేదని పలువురు మండిపడుతున్నారు. దీంతో చెరువు ఒడ్డున కర్రకు దేవుడి జెండా ఏర్పాటు చేసి ప్రతి రోజు పూజలు చేస్తుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల జూలైలో మరిడమ్మ తల్లి సంబరాలు ఉన్నాయని, ఇక్కడ గుడి నిర్మాణం చేయకపోవడంతో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామం విష్ణుచక్రంలో ఉన్న మరిడమ్మ తల్లి దేవాలయానికి వెళ్లి సంబరాలు జరుపుకోవాల్సి వస్తోందంటున్నారు. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.త్యాగాలు మర్చిపోయారు.. పోర్టు కోసం మేము చేసిన త్యాగాలను ప్రజాప్రతినిధులు, అధికారులు మరిచిపోయారు. నిర్వాసిత కాలనీలో కనీస వసతులు లేవు. వీధి దీపాలు నెలల తరబడి వెలగడం లేదు. ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. – గిన్ని దాలప్ప, నిర్వాసితుడు, విష్ణుచక్రం సంబరాలు ఎలా.. ? వచ్చే నెలలో మరిడమ్మ తల్లి సబంరాలు జరుగుతాయి. కాలనీలో గుడి నిర్మాణానికి స్థలం కూడా కేటాయించలేదు. సంబరాలు ఎలా జరుపుకోవాలి. గుడి, బడికి సంబంధించి నెలలు గడిచిన డబ్బులు జమ చేయలేదు. – గిన్ని బైరాగి, నిర్వాసితుడు, విష్ణుచక్రం -
హంతకుడిని కఠినంగా శిక్షించాలి
సోంపేట: మండలంలోని గొల్లఊరు గ్రామానికి చెందిన పిన్నింటి ఊర్వశిని హత్య చేసిన హంతకుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల ప్రతినిధులు శనివారం మృతురాలు ఊర్వశి కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఊర్వశిని హత్య చేసిన శివకుమార్కు కఠిన శిక్ష విధించాలన్నారు. అనాథలుగా మిగిలిన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. మాజీ సర్పంచ్ పిన్నింటి ఈశ్వరరావు, ప్రగతి శీల మహిళా సంఘ ప్రతినిధులు బదకల ఈశ్వరమ్మ, మద్దెల ధర్మారావు, జోగు కోందరాం తదితరులు పాల్గొన్నారు. అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాసరి సోమశేఖర్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థుల దగ్గర అడ్మిషన్ ఫీజు పేరుతో రూ.3 వేలు వసూలు చేయడం సరికాదని దుయ్యబట్టారు. అడ్మిషన్ ఫీజులు కట్టలేక అనేక మంది పేద విద్యార్థులు డ్రాపౌట్స్ అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఫీజు రద్దుచేసి, ఇప్పటికే వసూలు చేసిన అడ్మిషన్ ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి తక్షణమే తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాజు, సాయి, మోహన్, పవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీముఖలింగంలో పండిత సదస్యం
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో పాంచరాత్రి కల్యాణ ఉత్సవాల్లో భాగంగా జేష్టమాసం నాలుగో రోజు శనివారం అంకుర్పారణ, హోమం, పండిత సదస్యం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, ఏకవార అభిషేకాలు చేపట్టారు. దీనికి ముందు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. కూర్మనాథుని సన్నిధిలో సివిల్ జడ్జి గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని బొబ్బిలి సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణమూర్తి కుటుంబ సభ్యులతో శనివారం దర్శించుకున్నారు. ముందుగా గర్భాలయంలో మూలవిరాట్ను దర్శించుకొని, అనంతరం లక్ష్మీ సన్నిధి, దుర్గాదేవి, రెండు ధ్వజస్తంభాలు, తాబేళ్ల పార్కును సందర్శించారు. ఆలయ ఈవో టి.వాసుదేవరావు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆర్చకులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. కోటబొమ్మాళిలో దొంగతనాలు టెక్కలి రూరల్: కోటబొమ్మాళిలో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనాలు జరిగినట్లు స్థానికులు శనివారం గుర్తించారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న పలు దుకాణాల్లో శుక్రవారం అర్ధరాత్రి చోరి జరిగినట్లు సమీప షాపు యజమానులు గుర్తించారు. వారి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక వ్యక్తి ఇనుప రాడ్డుతో ముఖానికి మాస్క్ పెట్టుకుని చోరీలకి పాల్పడ్డాడు. సమీపంలో ఉన్న మీసేవా కేంద్రంలో చోరీకి పాల్పడి రూ.20 వేల నగదు దొంగలించినట్లు యజమాని ప్రసాదరావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే అక్కడే ఉన్న చికెన్ సెంటర్లో రూ.70 వేలు చోరీకి గురైనట్లు షాపు యజమాని గుర్తించారు. అదేవిధంగా సమీప జిరాక్స్ షాపులో సైతం చోరీ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి టెక్కలి రూరల్: మండలంలోని వీరరామకృష్ణాపురం వద్దనున్న మద్యం గోడౌన్ వద్ద లారీ డ్రైవర్ చదలవాడ లక్ష్మీ నారాయణ రెడ్డి (63) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రకాశం జిల్లా నికరంపల్లి గ్రామానికి చెందిన ఈయన మద్యం బాటిళ్ల లోడును లారీలో ఎక్కించుకుని టెక్కలి మండలం వీఆర్కే పురం వద్దనున్న మద్యం గోడౌన్కి వచ్చారు. అనంతరం అక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెపోటు రావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిక్షించి మృతి చెందినట్లు తెలిపారు. -
అనాథ శవానికి అంత్యక్రియలు
నందిగాం: మండల పరిధిలోని పాత్రునివలసలో ఉన్న పాత షిర్డీ సాయిబాబా మందిరంలో మృతి చెందిన అనాథ శవానికి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత్రునివలస జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పాత షిర్డీ సాయిబాబా మందిరం నుంచి శుక్రవారం సాయంత్రం దుర్వాసన వస్తుండటంతో, ఉపాధి హామీ పనులు చేసి వస్తున్న వేతనదారులు గమనించి లోపలకి వెళ్లి చూశారు. అక్కడ ఒక వ్యక్తి మృతి చెంది ఉండడంతో నందిగాం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిశీలించి.. గత కొన్ని రోజులుగా ఆయా గ్రామాల్లో మృతుడు బిచ్చగాడిగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెవెన్యూ సిబ్బందికి సమాచారం అందించి గ్రామస్తుల సహకారంతో మందిరం ఆవరణలోనే ఖననం చేశారు. మానవత్వం చాటుకున్న ఏఎస్ఐ ఇచ్ఛాపురం: కంచిలి పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న టి.రామారావు అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ధనరాజుల తులసమ్మ ఆలయం వద్ద భిక్షాటన చేస్తున్న సుమారు 50 ఏళ్ల యాచకుడు ఈనెల 22వ తేదీన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. మృతుడి బంధువులు వస్తారని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలో భద్రపరిచారు. అయితే 5 రోజులైనా ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న కంచిలి ఏఎస్ఐ రామారావు యాచకునికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు రావడంతో రూరల్ పోలీస్లు శవ పంచనామ, పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని అప్పగించారు. దీంతో తన సొంత ఖర్చులతో శనివారం సాయంత్రం బాహుదా నది శ్మశానవాటికలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో యాచకుని మృతదేహానికి అంత్యక్రియలను స్థానికుల సహకారంతో పూర్తి చేశారు. ఈవిధంగా గడచిన 20 ఏళ్లలో 70 అనాథ శవాలకు అంత్యక్రియలు ఏఎస్ఐ రామారావు అంత్యక్రియలు నర్విహించారు. కార్యక్రమంలో రూరల్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రాంబాబు, హనుమ తదితరులు పాల్గొన్నారు. -
జనాగ్రహం
●నౌపడ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి నిరసన సంతబొమ్మాళి: అసలే ఎండలు మండిపోతున్న వేళ.. ఇష్టానుసారం విద్యుత్ కోతలు విధించడంతో నౌపడ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కరెంట్ లేకపోవడంతో ప్రజలు మండిపడుతూ సబ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఫోన్ చేసినా లైన్మెన్ స్పందించడం లేదని, అసలు విద్యుత్ సరఫరా ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నిస్తూ నౌపడ విద్యుత్ సబ్స్టేషన్ కు చేరుకొని సిబ్బందిని ప్రశ్నించారు. ఈఎల్ఆర్ అంటూ టెక్కలిలో కరెంట్ తీశారని సిబ్బంది సమాధానమిచ్చారు. రొయ్యల చెరువులకు విద్యుత్ సరఫరా ఎలా ఉంది. మాకెందుకు కట్ చేశారని జనాలు ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా సబ్ స్టేషన్ లోపలికి వెళ్లిపోయారు. అక్కడ నుంచి విద్యు త్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. కరెంటు కోసం గొడవ చేస్తారా.. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కరెంట్ సమస్య ఉంటే పగలు చెప్పుకోవాలని రాత్రిపూట ఏమిటని తిరిగి జనాలపై మండిపడ్డారు. ప్రతి రోజు రాత్రి పూట కరెంటును తీసివేస్తున్నారని జనాలు చెప్పగా.. అలాగైతే సోలార్, ఇన్వెర్టర్ ఏర్పాటు చేసుకోవాలని, కరెంటు కోసం గొడవ చేస్తారా అంటూ పోలీసులు ఆగ్రహించారు. గంటకు పైగా ఇరువురి మధ్య వాగ్వాదం జరగడం ఆ తర్వాత కరెంటు రావడంతో అందరూ వెనుదిరిగారు. -
‘టీడీపీ దోపిడీ తెలిసిపోతుందనే దాడి’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అమరావతిలో జరుగుతున్న అవినీతి, అప్పులు, భూములు ఇవ్వని రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వేధిస్తోందో వైఎస్సార్సీపీ ప్రపంచానికి చెబుతోందనే అక్కసుతోనే పార్టీ నేతలపై దాడి చేశారని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మండిపడ్డారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేసి వాహనాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని ధ్వజమెత్తారు. ఈ దాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్కు సైతం గాయాలయ్యాయని తెలిపారు. శ్రీకాకుళంలోని టౌన్హాల్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకటి రెండు చోట్ల పోలీసులే ఈ దాడిని కో ఆర్డినేట్ చేయడం, అధికార పార్టీ అరాచకాలకు కవచంలా నిలవడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని ఆగ్ర హం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన దోపిడీ బయటకు రాకుండా ఉండేందుకే రాజకీయ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిర్మించే భవనాలకు చదరపు అడుగుకు సుమారు రూ. 5,587 ఖర్చవుతుంటే, చంద్రబాబు మాత్రం చదరపు అడుగుకు రూ. 20,439 ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారన్నారు. ఇప్పటికే అమరావతి పేరుతో రూ. 47,385 కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను గాలికొదిలేశారని విమర్శించారు. పెనుమాక తదితర గ్రామాల్లో భూ ములివ్వని రైతుల పొలాలను ముంచేస్తూ, సాగు చేసుకోనివ్వకుండా మట్టి దందాలు, ఇసుక దోపిడీలకు తెగబడటం సరికాదన్నారు. రైతు భూమి మీద కన్నేసి, రైతు గొంతు కోసేయడం చంద్రబాబు దుర్మార్గ పాలనకు ప్రతీక అని అన్నారు. టీడీపీకి అమరావతి అంటే ప్రజల రాజధాని కాదు, కాంట్రాక్టర్ల దోపిడీ రాజధాని అని మండిపడ్డారు. రైతులను మోసం చేసి, భయపెట్టిన వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ బాధితులైన అమరావతి రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, రాష్ట్ర పొందర కూరాకుల బీసీ విభాగం అధ్యక్షులు రాజాపు అప్పన్న, ఎస్ఈసీ మెంబర్ చల్ల శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, కిల్లి అజయ్, కనపల అరవింద్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి మండలం రాధావల్లభపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీ వర్గీయుల దాడిలో గాయపడి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని కృష్ణదాస్, తిలక్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
సూక్ష్మకళ.. అబ్బురపరిచేలా!
● గాజు సీసాల్లో చెక్కతో కళాకృతులు ● టెక్కలి కార్పెంటర్ సోమేశ్వరరావు నైపుణ్యంటెక్కలి : ఒకప్పుడు అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసేవారని గొప్పగా చెప్పుకునే వారు. ఆధునికీకరణ, సరైన ప్రోత్సాహం లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ఎంతోమంది అద్భుత కళాకారులు కనుమరుగైపోయారు. ఇలాంటి పరిస్థితిలో టెక్కలి మెట్టవీధికి చెందిన కార్పెంటర్ సింహాద్రి సోమేశ్వరరావు తన సూక్ష్మ కళా నైపుణ్యంతో వివిధ రకాల ఆకృతులను తయారు చేసి అబ్బురపరుస్తున్నారు. చిన్నతనం నుంచి సూక్ష్మ కళపై ఉన్న ఆసక్తిని అభిరుచిగా మార్చుకున్నారు. కార్పెంటర్ పని ముగిశాక తీరిక వేళల్లో సూక్ష్మ కళాకృతులను తయారుచేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. సీసాలో మంచం నుంచి స్టాండ్ వరకు... సోమేశ్వరరావు తన సూక్ష్మ కళావిద్యతో గాజు సీసాలో మంచం, గాజుల స్టాండ్, నెయిల్ పాలిష్ సీసాలో స్వస్తిక్ ముద్ర, టూత్ పిక్తో గొలుసు తదితర వస్తువులను తయారు చేశారు. ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందజేస్తే మరిన్ని అద్భుతమైన కళా కృతులు తయారు చేయడమే కాకుండా మరికొందరికి శిక్షణ అందజేస్తానని సోమేశ్వరరావు చెబుతున్నారు. టూత్ పిక్తో రూపొందించిన గొలుసు గాజు సీసాలో గాజుల స్టాండ్ గాజు సీసాలో మంచం కళాకృతి -
చుక్కల పండగ
● నేటి నుంచి పల్స్ పోలియో ● జిల్లాలో 1096 బూత్ల్లో 84 మొబైల్ బృందాల నియామకాలు అరసవల్లి: జిల్లాలో ఆదివారం నుంచి పల్స్ పోలి యో కార్యక్రమం మొదలు కానుంది. 28, 29,30 తేదీల్లో పల్స్పోలియో చుక్కలు వేయనున్నారు. ఇందుకోసం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పక్కా ఏర్పాట్లు చేశారు. ఐసీడీఎస్, విద్యాశాఖ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ, యూత్, మహిళా సంఘాల కోఆర్డినేటర్లు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో మొత్తం 30 మండలాల్లో ఐదేళ్ల లోపు వయసు గల చిన్నా రులు సుమారుగా 1,80,879 మందిని గుర్తించి, అందరికీ ఈ మూడు రోజుల్లో టీకా చుక్కలు వేయించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం చర్యలకు దిగింది. ఇంటింటికీ లక్ష్యంగా.. జిల్లాలో పోలియో నియంత్రణకు గాను మొత్తం 71 పీహెచ్సీలు, 13 యూపీహెచ్సీల పరిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు పోలియో చుక్కలను వేయించేందుకు వైద్య శాఖ అన్ని ఏర్పా ట్లు చేసింది. మొదటి రోజు ఆదివారం నాడు ప్రాథమిక పాఠశాలలు తెరుచుకునేలా ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో మొత్తం 1096 పోలియో బూత్లను సిద్ధం చేయగా.. తొలిరోజు ఈ బూత్ల వద్ద పోలి యో చుక్కలను వేయనున్నారు. అలాగే తర్వాత 29, 30 తేదీల్లో బూత్ల్లో టీకాలు వేయించుకోని వారిని గుర్తించేందుకు సుమారు 6,11,630 ఇళ్లను సందర్శించి ఇంటింటికీ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలనే లక్ష్యంతో వైద్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఆశవర్కర్లు, అంగన్వాడీలు, వైద్యశాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, హెల్త్అసిస్టెంట్లు ఇలా అన్ని స్థాయిలో సిబ్బంది ఈ వ్యాక్సినేషన్కు సిద్ధం చేస్తున్నారు. అలాగే వీధులు, పొలాలు, ఆట స్థలాల్లో పిల్లల కోసం 84 మొబైల్ బృందాలను, ప్రయాణికులకు వీలుగా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, సంతలు, దేవాలయాల వద్ద కూడా 40 ట్రాన్సిట్ బూత్లను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం కార్యక్రమం కోసం 7,430 మంది సిబ్బంది, పర్యేవేక్షణకు 122 మందిని నియమించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల చిన్నారులకు పోలియో టీకాలను వేయించేలా అన్ని చర్యలు చేపట్టాం. మొత్తం 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయించేందుకు గాను మొత్తం 2.90 లక్షల డోసులను డీప్ ఫ్రీజర్లులో ఉంచుతూ పంపిణీ చేశాం. 28న దాదాపుగా ఈ పోలియో చుక్కలను అందరికీ వేయించాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టాం. తర్వాతి రెండు రోజులు ఇంటింటికీ తిరిగి మిగిలిన వారికి టీకాలు వేయించాలని ఆదేశించాం. – డాక్టర్ కె.అనిత, డీఎంహెచ్ఓ -
రేటు..
శ్రీకాకుళంఆదివారం శ్రీ 28 శ్రీ జూన్ శ్రీ 2026ఒక్క ఏడాది వ్యవధి.. సగటు సిక్కోలు జీవి సంపాదనలో ఎలాంటి మార్పు లేదు. కానీ నూనె ప్యాకెట్ ధర దాదాపు రెండింతలైంది. కిలో కొనాల్సిన చోట అరకిలో కందిపప్పుతో సర్దుకుపోవాల్సి వస్తోంది. శనగల నుంచి పోపుల వరకు, సబ్బుల నుంచి ఇంటి సామాన్ల వరకు దాదాపు అన్నింటి ధరలు కనీసం యాభై శాతం పెరిగాయి. కూరగాయల ధరలూ వీటికి జత కలిశాయి. ఫలితంగా పేదవాడి బడ్జెట్ తల్లకిందులైంది. కాసిన్ని రాళ్లు వెనకేసుకునే భాగ్యం లేకుండా పోయింది. సేవింగ్స్కు దూరంగా.. అప్పులకు దగ్గరగా బతుకు బండి సాగుతోంది. 7 -
9 కేసుల్లో రూ.1.50 లక్షల జరిమానా
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆహార భద్రతా ప్రమాణాల అమలులో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండబోదని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన హోటళ్లు, స్వీట్ షాపులు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లపై నమోదైన కేసులను శనివా రం జాయింట్ కలెక్టర్ కోర్టులో విచారించి మొత్తం 9 పెండింగ్ కేసులను పరిష్కరించారు. ఈ కేసుల్లో ఆహార భద్రతా నిబంధనలను పాటించని ఆహార వ్యాపార నిర్వాహకులకు మొత్తం రూ.1,50,000లు జరిమానా విధించా రు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ఆహార వ్యాపార సంస్థలు తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రతి చిన్న, పెద్ద ఆహార వ్యాపార సంస్థ చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండాల ని, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించ డం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే సంబంధిత లైసెన్సులను కూడా రద్దు చేస్తామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మినారాయణ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కె.లక్ష్మి, జి.శ్రీరాములు ఉన్నారు. రణస్థలం: చెరువులకు అనుసంధానంగా ఉన్న కాలువలను బాగు చేయించాలని రాష్ట్ర భూగ ర్భ జల డైరెక్టర్ కేఎస్ శాస్త్రి అన్నారు. మండలంలోని కొండములగాం పెద్ద చెరువు పనుల ను, కొండ కిందకు వచ్చే కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులు, బావుల్లో ప్రసుత్త నీటిమట్టం ఏ స్థాయిలో ఉంది. వర్షాలు పడిన తర్వాత ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టమైన నివేదిక తయా రు చేసి పంపించాలని ఉపాధి హామీ సిబ్బంది ని ఆదేశించారు. కాలువలు బాగు చేయడం వల్ల రైతులు పంట పొలాలకు నేరుగా మళ్లించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో డీడీ ఎన్వీకే దుర్గాప్రసాద్, ఎంపీడీఓ ఎం.ఈశ్వరరావు, ఏపీఓ ఎం.శ్రీనివాసనాయుడు ఉన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరాటాలు తప్పనిసరిగా మారాయని ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు బీవీఏ రాజు తెలిపారు. జూలై 12వ తేదీన జరిగే మొదటి ఉద్యమ సన్నద్ధం సభ విజయవంతం చేయడానికి అన్ని శాఖల ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అన్ని శాఖల ఉద్యోగుల మద్దతు కూడగట్టుకోవడంలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, డిసేబుల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ డీఆర్డీఏ, డ్వామా ఎంపవర్మెంట్, ఏపీఈడబ్ల్యూడీసీ శాఖల ఉద్యో గులను కలిసి మద్దతు కోరారు. వారంతా మద్ద తు ఇస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి శ్రీకాకుళం జిల్లా మహి ళా విభాగం చైర్ పర్సన్ కె.ప్రవల్లిక ప్రియ, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి డి.సోనికిరణ్, జాయింట్ సెక్రటరీలు కె.రాధిక, ఎం.గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్ను సద్వినియోగం చేసుకోవాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం రూరల్: ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ జాబితా(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. మండల పరిధిలోని సింగుపురం గ్రామంలో శనివారం ఆయన పర్యటించి బీఎల్వోల పనితీరుపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 8 శాసనసభ నియోజకవర్గాల్లోని 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏ)లు కుడా బీఎల్వోలతో కలిసి సమన్వయంగా కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతీ ఓటరు వివరాలను, కుటుంబ వివరాలతో అనుసంధానం (మ్యాపింగ్) చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 88 శాతం మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. నిరక్షరాస్యులు, వృద్ధులు, సమయం లేని ఓటర్లకు సాయంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఇతర శాఖల సిబ్బంది సహకారంతో ఫారాలు పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి స్వరూపారాణి, ఎంపీడీవో ప్రకాశ్రావు, ఈవోపీఆర్డీ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ ఆదిత్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గోవాలో మత్య్సకారుడు మృతి
సంతబొమ్మాళి: మండలంలోని కె.లింగూడు పంచాయతీ ఎం.సున్నాపల్లి గ్రామానికి చెందిన మోసా గురుమూర్తి (48) అనే మత్య్సకారుడు గోవాలో సముద్రపు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో వారం రోజులు క్రితం తోటి మత్య్సకారులతో కలిసి గోవా వెళ్లాడు. శుక్రవారం సాయంత్రం సముద్రంలో చేపల వేట చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురై మృతి చెందాడని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందింది. మృతుడికి భార్య గిరమ్మ, కుమారులు రామకృష్ణ, వివేక్లు ఉన్నారు. మరణవార్త విని గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని మత్య్సకారులు కోరుతున్నారు. ఇరువర్గాలపై కేసులు నమోదు కొత్తూరు: మండలంలోని మహాసింగి గ్రామ సమీపంలో పంట భూమి విషయమై కర్లెమ్మ పంచాయతీ పరిధి అఫీషియల్ కాలనీకి చెందిన పొందూరు తేజేశ్వరరావు కుటుంబ సభ్యులు, మహాసింగి గ్రామానికి చెందిన కొవ్వాడ గోపాలు కుటుంబ సభ్యులకు మధ్య శుక్రవారం కొట్లాట జరిగింది. అనంతరం ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.వెంకటేష్ శనివారం తెలిపారు. -
పైడిగాంపై పోరుబాట..!
● ప్రాజెక్టు ఆధునీకరణకు వైఎస్సార్సీపీ డిమాండ్ ● నేడు ‘పైడిగాం పోదాం పదండి’ కార్యక్రమం ● విజయవంతం చేయాలని పిలుపు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన చంద్రబాబు హయాంలో గానీ.. మూడుసార్లు స్థానిక ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన బెందాళం అశోక్ హయాంలో గానీ పైడిగాం ప్రాజెక్టు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ ప్రాంత రైతులపై కూటమి పాలకులకు ఎటువంటి ప్రేమ ఉందో దీని ప్రకారం తెలుసుకోవచ్చు. ఇప్పటికై నా పైడిగాం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టి ఈ ప్రాంత రైతులకు న్యాయం చేయాలి. – సాడి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త, ఇచ్ఛాపురం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న పైడిగాం పోదాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రాజెక్టు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగింది. టీడీపీ హయాంలో రైతులకు న్యాయం జరగలేదు. ఒక్క రూపాయి నిధులు కూడా విడుదల కాలేదు. ప్రభుత్వం స్పందించి ఆధునీకరణ పనులు చేపట్టి రైతులకు న్యాయం చేయాలి. – డాక్టర్ నిమ్మన దాస్, ఎంపీపీ, సోంపేట సోంపేట: మండలంలోని చిన్ననీటి ప్రాజెక్టు అయిన పైడిగాం ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి, పంటలకు సకాలంలో సాగునీరు అందజేసేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘పైడిగాం పోదాం పదండి’ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టనున్నారు. రైతులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతో పోరు చేపడుతున్నట్లు ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వస్తే పైడిగాం ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపడతామని ఎన్నికల సమయంలో కూటమి నాయకులు హామీలు గుప్పించారు. అయితే అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు కనీసం ఒక్క పైసా నిధులు కూడా మంజూరు చేయకపోవడం దారుణమని స్థానిక రైతులు, వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ప్రాజెక్టు ఆధునీకరణకు నోచుకోకపోవడంతో పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని మూడు మండలాల రైతులకు సకాలంలో సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారింది. కంచిలి, సోంపేట, మందస మండలాల పరిధిలోని 67 చెరువులకు సాగునీరు సకాలంలో అందడం లేదు. అదే కాలువలకు పూర్తి రాతి కట్టడం నిర్మిస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అందువలన ప్రభుత్వం స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఇదీ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1958–63 సంవత్సరాల మధ్య నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా.. అప్పటి సమితి అధ్యక్షుడు గన్ని పద్మనాభం కృషితో పైడిగాం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. సోంపేట, కంచిలి, మందస మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు సాగునీరు అందజేయాలనే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ప్రత్యక్షంగా 5 వేల ఎకరాలకు అయినా.. పరోక్షంగా మరో 10 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా జరుగుతుంది. అనంతరం 2014 – 19లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కాలువలకు రాతి కట్టడం నిర్మాణం కోసం రూ.14 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో 16.4 కిలోమీటర్ల కాలువలో 6.2 కిలోమీటర్ల కాలువకు రాతికట్టడం పూర్తి చేశారు. అయితే మిగతా కాలువకు రాతికట్డడం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాగా 2018లో తిత్లీ తుఫాన్ ప్రభావంతో పైడిగాం ప్రాజెక్టు ఆనకట్ట ఆనవాలు లేకుండా పోయింది. దీంతో 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ ఆధ్వర్యంలో రూ.20 లక్షల నిధులు మంజూరు చేసి ఆనకట్ట మరమ్మతులు చేపట్టారు. దీంతో రైతులకు కొంత ఉపశమనం కలిగింది. -
ఒక్కసారికి వదిలేయండి సర్..!
జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ ప్రాంతం.. సమయం శుక్రవారం ఉదయం 10.22 గంటలు.. ఒకే ద్విచక్రవాహనంపై ముగ్గురు మైనరు బాలురు..అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుళ్లు రౌతు ఈశ్వరరావు, ఎస్.శ్రీహరిలు బండిని ఆపారు. కానిస్టేబుళ్లు పక్కకు తీసుకెళ్లగానే బాలురు నోటి వెంబడి వచ్చిన ఒకే మాట చివరి వరకూ కొనసాగింది.. ‘‘మాకేం తెలియదు..ఈ ఒక్కసారికి వదిలేయండి..!’’ కానిస్టేబుల్: ఏం చదువుతున్నారు.. ? బండి నడిపిన బాలుడు : సర్.. నేను ఐటీఐ చదువుతున్నాను.. మిగతా బాలురు : నేను, వీడు ఇంటర్ చదువుతున్నాం.. కానిస్టేబుల్ : ఏ ఊరు..? ఇటేం వచ్చారు..? బాలురు : ఖాజీపేట అండి. సెలవు కదా అని దుస్తులు కొనేందుకు వచ్చేశాం. బండి ఎవరిది : మా నాన్నది అండి.. గొర్రెలు మేపేందుకు వెళ్లిపోయాడు. తెలియకుండా తెచ్చేశా.. కానిస్టేబుల్ : మరి మీరు చిన్నోళ్లు కదా.. ఎవరైనా మీ బండిని ఢీకొట్టినా.. మీరు ఢీకొట్టినా చాలా ప్రమాదం కదా.. ఈ విషయం మీకు తెలియదా..! బాలురు : మాకేం తెలియదండి.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. ప్లీజ్.. తక్షణమే కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనాన్ని ట్రాఫిక్ స్టేషన్కు తరలించేసి బాలురును ఇంటికి పంపించి తల్లిదండ్రులను తీసుకురమ్మన్నారు. ఈ విషయమై ట్రాఫిక్ సీఐ రామారావు మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరమని, ఇచ్చే వాహన యజమానికి రూ. 5 వేలు జరిమానా విధిస్తామని చెప్పారు.-శ్రీకాకుళం -
ఐఆర్ ప్రకటనలో జాప్యం తగదు
శ్రీకాకుళం: పీఆర్సీ కాల పరిమితి ముగిసి మూడేళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం కరువు భత్యం ప్రకటించకుండా తాత్సారం చేయడం తగదని, ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని ఎస్టీయూ సంఘం రాష్ట్ర కార్యదర్శి పడాల అమ్మినాయుడు అన్నారు. ఎస్టీయూ జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం శుక్రవారం శ్రీకాకుళంలోని క్రాంతిభవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జేఏసీ వైస్ చైర్మన్ ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి టెట్ అవసరమా ? అని ప్రశ్నించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ వర్క్ అడ్జెస్ట్మెంట్ పేరుతో ప్రభుత్వం ఉపాధ్యాయులలో గందరగోళ పరిస్థితి సృష్టిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు కంచరాన తేజేశ్వరరావు, మానెం సన్యాసిరావు, పేడాడ రామకృష్ణ, మురళీకృష్ణ, కృష్ణ, కూన కృష్ణారా వు, బొడ్డేపల్లి రమేష్, రామచంద్ర, మొయ్యి తేజేశ్వరరావు, పేడాడ అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణ వైభోగమే..!
శ్రీకాకుళం కల్చరల్ : హిందూ సంప్రదాయంలో ఏ పని తలపెట్టిన శుభ ముహూర్తాలు చూసుకోవడం ఆనవాయితీ. కొత్త వస్తువులు, వాహనాలు కొనాలన్నా మంచి రోజులు ఉండాల్సిందే. అలాంటిది జీవితంలో అత్యంత ప్రధానమైన వివాహాలు, గృహప్రవేశాల విషయంలో నక్షత్ర, రాశి బలాలకు సరిపడా ముహుర్తాలపై ప్రజలకు అచంచల విశ్వాసం ఉంటుంది. అయితే గత మే 14న అధిక జ్యేష్టమాసం ప్రారంభం కావడంతో నెల రోజులుగా శుభకార్యాలకు బ్రేక్ పడింది. తాళికట్టు శుభవేళ.. ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది. 16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. జూన్ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు ఉన్నాయని అంటున్నారు. వ్యాపారాలు కళకళ.. నెలరోజులుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, పురోహితులు, బంగారం షాపులు, వస్త్రవ్యాపారులు, ఫొటోగ్రాఫర్ల వ్యాపారాలు మందగించాయి. చాలా మంది కార్మికులకు ఉపాధి కరువైంది. జూన్ 19 నుంచి మళ్లీ సీజన్ ప్రారంభం కానుండటంతో ఈ అనుబంధ వ్యాపారాలన్నీ ఊపందుకుంటాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల వరకు వివాహాలు నెల రోజుల తర్వాత ముహూర్తాలు మొదలవడంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల వరకు పెళ్లిళ్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో వధూవరులకు కావలసిన వస్త్రాలు, పట్టుచీరలు కొనేందుకు తల్లిదండ్రులు, బంధువులు షాపులకు క్యూ కడుతున్నారు. కిరాణా దుకాణాలలో కూడా వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ‘బంగారం’ లాంటి చాన్స్ పెళ్లికి ముఖ్యమైనది బంగారం. దాని ఖరీదు పెరుగుతున్నా తప్పని సరిగా బంగారం పెట్టాల్సిందే. స్వర్ణాభరణాల ధరలు పెరుతున్నా పెళ్లికి అతిముఖ్యంగా కావలసిన తాళిబొట్టు, మట్టెలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో కొందరు బంగారం షాపుల వద్ద చేరి వీటిని ముందుగా ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటున్నారు. మరికొందరు బంగారం ముక్క కొనుగోలు చేసి తమకు తెలిసిన తయారీదారుని వద్ద వెళ్లి ఆర్డర్ ఇస్తున్నారు. జ్యేష్టమాసం విశేషమైంది జ్యేష్టమాసం అన్ని మాసాలలోకి విశేషమైంది. బ్రహ్మదేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. నిజ జ్యేష్ట మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు యధావిధిగా నిర్వహిస్తారు. చాలా మంది వివాహాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. – తెన్నేటి విక్రమశర్మ, ప్రకాశరాయ జ్యోతిషాలయం ముహూర్తాల కోసం వస్తున్నారు.. నెలరోజులుగా ముహూర్తాలు లేక చేతిలో పనులు లేవు. ఎట్టకేలకు శుభ ముహూర్తాలు మొదలు కావడంతో వివాహాది శుభకార్యాలు చేయించుకునేందుకు మావద్దకు వస్తున్నారు. తేదీలు ముందుగా బుక్ చేసుకుంటున్నారు. – పి.నర్సింహమూర్తి, పురోహితులు, శ్రీకాకుళం -
క్రికెటర్లు క్లీన్బౌల్డ్
● జిల్లా అండర్–19 బాలికల ఎంపికల్లో బండారం బట్టబయలు ● క్రికెట్ సంఘం గేట్కు తాళాలు ● అవస్థలు పడిన క్రీడాకారులు, తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి శ్రీకాకుళం న్యూకాలనీ: క్రీడాకారులకు బాసటగా నిలవాల్సిన క్రీడా సంఘాలు వారితో ఆటాడుకుంటున్నాయి.క్రికెట్ క్రీడాకారుల భవిషత్ను ప్రశ్నార్థకం చేస్తూ వ్యవహరిస్తున్నాయి. జిల్లా క్రికెట్ సంఘంలో రోజురోజుకూ గొడవలు ముదురుతున్నాయి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ జిల్లా క్రికెట్ సంఘం అన్నంట్టుగా అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సెలక్షన్స్ కోసం వస్తే.. తాళాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం అండర్–19 మహిళల సెలక్షన్స్, పురుషుల మల్టీడేస్ జట్ల సర్టిఫికెట్ పరిశీలన నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లా క్రికెట్ సంఘం భవనం గేటుకు అదనంగా తాళాలు వేయడంతో క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు కంగు తిన్నారు. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు ఉదయం 7.30 గంటలకే శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలోని జిల్లా క్రికెట్ సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీఏ నియమించిన సెలెక్టర్లు, తాత్కాలిక సమన్వయ కమిటీ సభ్యులు కూడా వచ్చారు. అయితే, కార్యాలయ గేటుకు ముందే తాళాలు ఉండగా, వాటికి అదనంగా డబుల్ లాక్ వేయడంతో సెలక్షన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. సుమారు రెండున్నర గంటల పాటు సెలెక్టర్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు గేట్ బయటే వేచి చూసినా తాళాలు తీయకపోవడంతో తల్లిదండ్రులు, క్రీడాకారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడ జరుగుతున్న తతంగాన్ని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ దృష్టికి కొంతమంది తల్లిదండ్రులు తీసుకెళ్లగా, ఆయన వెంటనే గేట్లు తెరవాలని ఆదేశించారు. దీంతో ఎట్టకేలకు ఉదయం 10 గంటల తర్వాత గేట్లు తెరుచుకోవడంతో సర్టిఫికెట్ పరిశీలన, నెట్ ప్రాక్టీస్ ద్వారా అండర్–19 బాలికల జట్టు ఎంపికలు పూర్తి చేసి మమ అనిపించారు. క్రీడాకారులకు నష్టం తప్పదా..? ఘటనపై ఏసీఏ తాత్కాలిక సమన్వయ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సెలక్షన్ ప్రక్రియను జిల్లా క్రికెట్ సంఘంలో చక్రం తిప్పుతున్న కొంతమంది ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మరోపక్క జిల్లా క్రికెట్ సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అటు ఏసీఏతోపాటు ఇటు క్రీడాకారుల తల్లిదండ్రులు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుశ్చర్యలు, సంఘటనల వల్ల ఏసీఏ సెలెక్షన్లలో, అంతర్జిల్లాల క్రికెట్ టోర్నీల్లో జిల్లా ప్రాతినిధ్యమే కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కూన’ ఎన్నిక అనంతరం రోజుకో రచ్చ.. జిల్లా క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా ఎమ్మెల్యే కూన రవికుమార్ ఎన్నికై నప్పటి నుంచి జిల్లా క్రికెట్ సంఘంలో రోజుకో యవ్వారం, పూటకో సంఘటన అన్నట్టుగా అగ్గి రాజుకుంటోంది. కూనపై అక్కసుతో జిల్లాలో కింజరాపు వర్గం ఏసీఏలో కీలక వ్యక్తులతో చేతులు కలిపి తెరవెనక తతంగాలు నడిపిస్తున్నారనే విషయం సైతం చక్కర్లు కొడుతోంది. ఏసీఏ పెద్దలు కేసినేని చిన్ని, సానా సతీష్లతో కింజరాపు బాబాయ్, అబ్బాయ్ టచ్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. జిల్లా క్రికెట్ సంఘంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఒకరిద్దరు వల్లే జిల్లా క్రికెట్ సంఘం మొత్తం బజారున పడుతోందని క్రీడాకారుల తల్లిదండ్రులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 28వ తేదీన జరగాల్సిన జిల్లా అండర్–19 మల్టీటేస్ క్రికెట్ జట్టు ఎంపికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందోనన్న మీమాంస సర్వత్రా నెలకొంది. -
మాదకద్రవ్యాల రహిత జిల్లాయే లక్ష్యం
శ్రీకాకుళం క్రైమ్ : మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యమని శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా డీఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం నుంచి డే అండ్నైట్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ రామచంద్రకుమార్, సీఐలు పి.ఈశ్వరరావు, వి.రామారావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొమ్మిది కిలోల గంజాయి స్వాధీనం
మందస: స్థానిక కొర్రాయిగేటు జంక్షన్ వద్ద శుక్రవారం 9 కిలోల గంజాయిని తరలిస్తుండగా సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్ఐ కె.కృష్ణ ప్రసాద్ పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు.. పూణెకు చెందిన శ్రీరామ్ జిలేబి షాప్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్నాడు. ఒడిశాకు చెందిన రంజాన్ అనే వ్యక్తి తో అతనికి పరిచయమైంది. ఆర్థిక స్థితి బాగోకపోవడంతో రంజాన్ గంజాయి వ్యాపారం గురించి శ్రీరామ్కు చెప్పాడు. కానీ శ్రీరామ్ ఆసక్తి చూపించలేదు. వైజాగ్లో జిలేబీ వ్యాపారం చేద్దామని వెళ్లి.. అక్కడ అనువుగా లేక విజయనగరం వచ్చాడు. అక్కడ స్కూటీ దొంగతనం చేసి.. అదే స్కూటీతో బరంపురం వచ్చి అక్కడి నుంచి రైలులో పూణె వెళ్లిపోయాడు. అక్కడ వేరే స్నేహితుడితో గంజాయి అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. పూణేలోనే ఓ మైనర్ను తోడుగా తీసుకువచ్చి 8 ప్యాకెట్ల గంజాయిని గురువారం ఉదయం బరంపురంలో తీసుకున్నాడు. పూణె వెళ్లడం కోసం పలాస రైల్వే స్టేషన్కు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. -
‘ఉద్యమాలకు ఉద్యోగులు సన్నద్ధం’
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో జూలై 12 వ తేదీన జిల్లాలో జరగను న్న మొదటి ఉద్యమ సన్నద్ధం సభకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంపూర్ణ మద్దతును ఇ చ్చారు. ఈ మేరకు శుక్రవారం ఏపీజేఏసీ జిల్లా అధ్యక్షులు బీవీఎన్ రాజును రెవెన్యూ వసతి గృహంలో కలిసి ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పెండింగ్ డీఏలను ప్రకటించటం, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ను ప్రకటించడం, సరెండర్ లీవుల మంజూరు, నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వడం, కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం రద్దు చేయడం తదితర సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నట్లు సచివాలయ ఉ ద్యోగులు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జీకే శ్రీనివాసరావు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల ఐటీఈపీ కోర్సు.. దరఖాస్తుల ఆహ్వానం
ఎచ్చెర్ల: నాలుగేళ్ల బీఈడీ కోర్సులకు సంబంధించి సమీకృత ఉపాధ్యాయ విద్యా కార్య క్రమం (ఐటీఈపీ)లో ప్రవేశానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఈ విద్యా సంవ్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోందని రిజిస్ట్రార్ ఆచార్య బి.అడ్డయ్య తెలిపారు. ఎన్టీఏ జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత చెందిన వారు దరఖాస్తులు చేయడానికి అర్హులని తెలియజేశారు. చెరో 50 సీట్లతో బీఎస్సీ, బీఈడీ, బీఏబీఈడీ కోర్సులను డాక్టర్ బీఆర్ఏయూ ఆఫర్ చేస్తుందని తెలిపారు. దరఖాస్తులు వచ్చే నెల 4 వ తేదీవరకూ యూనివర్సిటీకి అందజేయవచ్చని తెలి పారు. ఈ వివరాల కోసం యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్యూ.బీఆర్ఏయూ.ఈడియూ.ఇన్ను సందర్శించి తెలుసుకోవచ్చని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య సూచించారు. జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు జీవన్ కుమార్ జలుమూరు: జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు పాగోడు ప్రాథమిక పాఠశాల విద్యార్థి కె.జీవన్కుమార్ అర్హత సాధించాడు. గుంటూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి ఏపీ నుంచి ఒకే ఒక్క విద్యార్థి ఎంపికయ్యాడు. దీనిపై పాగోడుతోపాటు స్వగ్రామం బోరవాని పేట గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన పోటీల్లో జిల్లా నుంచి జీవన్ కుమార్ ప్రథమ స్థానంలో నిలిచాడు. జీవన్ కుమార్ తల్లి రోహిణిది వ్యవసాయ కూలి కుటుంబం. డిసెంబర్ నెలలో మధ్య ప్రదేశ్ జబల్పూర్లో జరగనున్న ఈ సైక్లింగ్ పోటీల్లో జీవన్ కుమార్ పాల్గొననున్నాడు. ఈ విద్యార్థి ఇటీవలే 1200 సీడ్బాల్స్ తయారు చేసి సోషల్ మీడియాతోపాటు పలు ప్రచార మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. ‘ప్రతి వాహనం తనిఖీ చేయాలి’ ఇచ్ఛాపురం: అంతర్రాష్ట్ర చెక్ పోస్టుకు ఒడిశా నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని విశాఖపట్నం రేంజ్ పోలీస్ ఐజీ గోపీనాథ్ జెట్టీ సూచించారు. ఆయన శుక్ర వారం సరిహద్దులోని పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్పోస్టుని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి రవాణాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఐ మీసాల చిన్నంనాయుడు, ఎస్ఐ ఎం.ముకుందరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ‘ఆశ్రమ పాఠశాలలు మూసివేస్తే ఉద్యమమే’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రేషనలైజేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠశాలలను కుదించే కుట్రకు కూటమి ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించక తప్పదని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ యోగి హెచ్చరించా రు. శ్రీకాకుళం నగరంలో ఇలిసిపురంలోని అంబేడ్కర్ విజ్ఞాన భవన్లో శుక్రవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాబ యోగి మాట్లాడుతూ గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గత ఏడాది మే 15న జారీ చేసిన మెమోను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. రేషనలైజేషన్ చేస్తే చాలా ఆశ్రమ పాఠశాలలు మూతపడతాయని, కొండ కోనల్లో సమాజానికి దూరంగా ఉన్న ఆదివాసీలను విద్యకు దూరం చేయాలన్న చంద్రబాబు కుట్రను తిప్పికొడతామన్నారు. గిరిజనులపై కూటమి ప్రభుత్వానికి చిన్నచూపు తగదన్నా రు. ఆదివాసీలకు ఇచ్చిన సీఆర్టీ ఉద్యోగాలు పోతాయని, ఏజెన్సీలో ప్రత్యేక డీఎస్సీ నిర్వహించే పరిస్థితి ఉండదని, ఆదివాసీ నిరుద్యోగ యువత ఉపాధికి దూరమైపోతారన్నారు. సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కోశాధికారి యడ్ల సూరినారాయణ, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్, ఏపీటీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గేదెల శేషగిరి, సన్నశెట్టి రాజేశేఖర్ తదితరులు మాట్లాడారు. -
పూండిలో చైన్స్నాచర్ల హల్చల్
● ఓ వృద్ధురాలు, మరో మహిళ నుంచి బంగారు ఆభరణాల చోరీ వజ్రపుకొత్తూరు: పూండిలో చైన్స్నాచర్లు హల్చల్ సృష్టిస్తున్నారు. వ్యాపార కేంద్రం కావడంతో ఒంటరిగా ఉన్న ఇల్లే లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహిస్తున్నారు. ఎవరూ లేని సమయంలో మహిళలు, వృద్ధుల మెడలోని ఆభరణాలు దోచేస్తున్నారు. దోపిడీకి గురైన వారు అరగంట తర్వాత స్పృహలోకి వస్తున్నారు. పూండిలో గురువారం సాయంత్రం, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సంఘటనలే ఇందుకు నిదర్శనం. పూండి – పీఎంపురం రహదారిలో నివాసముంటున్న వృద్ధురాలు కోట లక్ష్మీ గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి ముందున్న పూలు ఏరుతున్న సమయంలో చైన్స్నాచర్లు వచ్చి మెడలోని ఐదు తులాల బంగారం గొలుసు ఎత్తుకుపోయారు. దీంతో ఆమె కుమారుడు కోట తవిటినాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం దున్న జగదీశ్వరి అనే మహిళ బార్రూం నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె మెడలో సుమారు 4.50 తులాల బంగారం పుస్తెల తాడు తెంచుకుపోయారు. ఈ సమయంలో జగదీశ్వరి కుమార్తె ఫోన్ చేసినా ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి తండ్రి రవికుమార్కు ఫోన్ చేసింది. ఆయన ఇంటికి వచ్చి చూసే సరికి బాత్రూం వద్ద ఆమె స్పృహ కోల్పోయి ఉండటాన్ని గమనించారు. కొంత సేపటి తర్వాత తేరుకుని భర్తకు విషయం చెప్పింది. వెనుక నుంచి ఎవరో తలపై కొట్టడంతో కింద పడిపోయానని, ఆ తర్వాత తనకు ఏం జరిగిందో తెలియదని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఆందోళనకు గురయ్యారు. వీరి కుటుంబానికి పూండి బస్టాండ్ రోడ్డులో బంగారం షాపు, ఫ్రూట్, పాన్ షాపు ఉన్నాయి. గత ఏడాది జనవరి 23న రవికుమార్కు చెందిన బంగారం షాపులోనే సుమారు రూ.70 లక్షలు విలువైన వెండి బంగారం నగలు చోరికీ గురయ్యాయి. ఇంకా ఆ చోరీ కేసు తేలనే లేదు. ఆ సొత్తు రికవరీ కాకపోగా మళ్లీ సంఘటన జరగడంతో వారు బోరున విలపిస్తున్నారు. సీసీ ఫుటేజీల పరిశీలన.. వజ్రపుకొత్తూరు ఎస్ఐ బి.నిహార్ బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఇంకా ఫిర్యాదు అందలేదని, ప్రాథమిక సమాచారం మేరకు సీసీ టీవీల ఫుటేజీ, ఘటనా ప్రాంతాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
స్వాతంత్య్ర స్ఫూర్తిజ్వాల ‘వందేమాతరం’
శ్రీకాకుళం అర్బన్ : వందేమాతర గేయం స్వాతంత్రోద్యమంలో భారతీయులకు స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని గాంధీ మందిర కమిటీ వక్తలు పేర్కొన్నారు. బ్రిటీష్ పాలకుల దురాగతాలను ఎదిరించేందుకు వందేమాతరం నినాదం అందరినీ ఏకం చేసిందన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధుల స్మృతివనంలో వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర ఛటోపాధ్యాయ 188వ జయంతి శుక్రవారం నిర్వహించారు. విగ్రహదాత డాక్టర్ నిక్కు అప్నన్నతో పాటు గాంధీ మందిర ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో సురంగి మోహన్రావు, ఎం.ప్రసాదరావు, జామి భీమశంకర్, పైడి హరనాధరావు, చౌదరి రాధాకృష్ణ, కొంక్యాన మురళీధర్, కొంక్యాన వేణుగోపాల్, పొన్నాడ రవికుమార్, మహిబుల్లాఖాన్, పందిరి అప్పారావు, గుత్తు చిన్నారావు, జి.నాగేశ్వరరావు, పెంకి చైతన్యకుమార్, బుడుమశీరు సూర్యారావు, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఇచ్ఛాపురం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం సమీపంలో సుర్లా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన నిరంజన్ మహరణ(48) మృతిచెందాడు. ఒడి శా నుంచి ఇచ్ఛాపురం వస్తుండగా గుర్తు తెలి యని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన నిరంజన్ను స్థానికులు చికిత్స నిమిత్తం బరంపురం తరలించినా ఫలితం లేకపోయింది. ఒడిశా పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. నిరంజన్ పట్టణంలోని దానంపేటలో ఈ–సేవా కేంద్రం, ఫ్లెక్సీ యూనిట్ నిర్వహిస్తున్నాడు. భార్య సుజ్ఞాని, కుమారుడు శుభమ్ ఉన్నారు. నిరంజన్ మృతితో పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కుజ్జిపేట గ్రామ సమీపంలోని తాలిచెరువు గట్టుపై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గురువారం ఉదయం గ్రామస్తులు ఉపాధి హామీ పనుల కోసం చెరువు గట్టుపై వెళ్తుడగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఫీల్డ్ అసిస్టెంట్ గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి మెడ చుట్టూ టవల్ చుట్టి ఉండటం, చెవులు, ముక్కు నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు గుర్తించారు. ఎవరైనా చంపి పడేశారా, ఇంకేదైనా కా రణముందా అనేది తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. కోటబొమ్మాళి ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అభివృద్ధిపై మాట్లాడే అర్హత అచ్చెన్నకు లేదు టెక్కలి: టెక్కలి నియోజకవర్గంలో అభివృద్ధిపై మాట్లాడే కనీస అర్హత మంత్రి అచ్చెన్నాయుడు కు లేదని వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఇటీవల సంతబొమ్మాళి మండలం బోరుభద్రలో మంత్రి చేసిన వ్యాఖ్యలపై తిలక్ శుక్రవారం ఘాటుగా స్పందించారు. వారసత్వ రాజకీయాలతో ఎదిగి వేలాది కోట్ల రూపాయలు అవినీతి సంపాదన చేసిన అచ్చెన్నాయుడు ఈ రోజు అభివృద్ధి చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే కుటుంబం రాజకీయ పబ్బం గడుపుతూ నియోజకవర్గంలో ఏ ఒక్క శాశ్వతమైన పథకం తీసుకువచ్చారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపడుతున్న రోడ్లు, జలజీవన్ మిషన్ పథకాలకు సొంత పేర్లు పెట్టుకుంటున్నారు తప్పా శాశ్వత కార్యక్రమాలు చేయడం లేదని దుయ్యబట్టారు. ప్రస్తుతం చేస్తున్న జలజీవన్ మిషన్ పథకం గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రతిపాదనలు చేసినవేనని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లలో పెద్ద ఎత్తున కమీషన్లు దండుకుంటున్నారని, దీనిపై దర్యాప్తు చేయిస్తామని తిలక్ పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలో టెక్కలి నియోజకవర్గంలో మూలపేట పోర్టు నియోజకవర్గ చరిత్రలో తలమానికంగా నిలిచిందన్నారు. నిమ్మాడ గ్రామంలో పీహెచ్సీకి రూపకల్పన చేసిన సంగతిని మంత్రి మరిచారని ఎద్దేవా చేశారు. నిమ్మాడ నుంచి చిట్టెయ్యవలస వరకు వైఎస్సార్సీపీ హయాంలోనే రోడ్లు వేశారని గుర్తు చేశారు. టీడీపీలో నియంతగా మరొకరికి రాజకీయంగా అవకాశం ఇవ్వకుండా అవినీతి సంపాదన చేస్తున్న అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని తిలక్ హెచ్చరించారు. పేరాడ తిలక్ -
మాజీ సైనికుల ఔదార్యం
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా పరిషత్ సమీపంలోని కంపోస్టు కాలనీలో అనాథ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించేందుకు డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో రూ.21,000ను చెక్ రూపంలో అందజేశామని సంఘ అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చేతుల మీదుగా వృద్ధురాలికి ఈ సాయం అందించామని చెప్పారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ పైడి మురళీధరరావు, కోశాధికారి ముదిల సింహాచలం, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ సనపల రామకృష్ణ, హానరరీ ప్రెసిడెంట్ సవర లక్ష్మణరావు, అడ్వైజర్ పైడి రామారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు బోర రాంబాబు, బట్న కామేశ్వరరావు, సిక్కోలు సైనికుడు నర్సింగ్ పాల్గొన్నారు. -
ఆనందం..‘ఆహ్లాద్’కరం
టెక్కలి : టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన ఆహ్లాద్–2కే26 కార్యక్రమాలను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, కార్యక్రమాల కో ఆర్డినేటర్ డి.యుగంధర్ నేతృత్వంలో జ్యోతి ప్రజ్వళనతో కార్యక్రమాలు ప్రారంభించారు. వివిధ కళాశాలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ కళా నైపుణ్యాలను ప్రదర్శించేందుకు రెండు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శనివారం ముగింపు సందర్భంగా భారత మాజీ క్రికెటర్ ఎం.ఎస్.కె.ప్రసాద్, వర్ధమాన సినీ నటి రాశీసింగ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నాయకత్వ లక్షణాలు, కళాత్మక అభిరుచులు, వివిధ క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకు తమ కళాశాలలో కొత్తగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించినట్లు డైరెక్టర్ వెల్లడించారు. కళాశాలలో నిర్వహించిన ఆహ్లాద్ కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణంలో సందడి వాతావరణం చోటుచేసుకుంది. -
‘ఆదిత్య’లో ఆహ్లాద్–2026
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 26, 27 తేదీలలో ఆహ్లాద్–2026 పేరిట సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు ఏపీ, తెలంగాణా, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత, కళా ప్రతిభను వెలికితీసేందుకు నృత్యం, సంగీతం, ఫ్యాషన్షో, సాహిత్యం, సాంస్కృతిక పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం జరిగే ముగింపు కార్యక్రమాలకు సినీ నటి రాశీసింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. -
‘ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కీలకం’
నరసన్నపేట: జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) జరుగుతోందని, దీనిపై వైఎస్సార్సీపీకి చెందిన బీఎల్ఏలు శ్రద్ధగా దృష్టి పెట్టాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సూచించారు. ప్రధానంగా ఎన్యూమరేషన్ ఫారంల డిజిటలైజేషన్పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. పోలాకి మండలం మబగాంలో గురువారం బీఎల్ఓ కృష్ణదాస్కు ఎన్యూమరేషన్ ఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సర్’ కార్యక్రమంపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఇప్పటికీ పూర్తి కాలేదని, తొందరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు కోరారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి కాకపోతే వాటిని నింపి ఓటరు తిరిగి మళ్లీ ఎప్పుడు బీఎల్ఓలకు ఇస్తారు, వాటిని డిజిటలైజేషన్ ఎప్పుడు చేస్తారు అని ఆందోళన వ్యక్తం చేశా రు. బీఎల్ఓలకు పలుచోట్ల ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారని, ఇలాగైతే సర్పై ఎలా దృష్టి పెట్టగలరని ప్రశ్నించారు. ఈ 15 రోజులైనా బీఎల్ఓలను ఇతర బాధ్యతల నుంచి తప్పించాలని సూచించారు. నరసన్నపేట నియోజకవర్గంలో మరింత పగడ్బందీగా సర్ కార్యక్రమం నిర్వహించాలని, దీనిపై బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దోమ మన్మధరావు, నియోజకవర్గ బూత్ కమిటీ అద్యక్షులు సురంగి నర్శింరావులకు సూచించారు. తరచుగా గ్రామాల్లో పర్యటించి సర్ కార్యక్రమం సకాలంలో పూర్తి చేసి అర్హత కలిగిన ఓటర్లు అందరికీ ఓటు హక్కు ఉండే విధంగా చూడాలని కోరారు. -
గ్రామసభ బహిష్కరణ
సరుబుజ్జిలి: ఇనాం భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగిస్తామని మాయ మాటలు చెప్పి, భూములను సంబంధం లేని వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను సహించబోమని రొట్టవలస గ్రామానికి చెందిన రైతులు అధికారులను నిలదీశారు. ఈ మేరకు గ్రామంలో గురువారం ఏర్పాటు చేసిన గ్రామసభను రైతులు బహిష్కరించారు. రొట్టవలస గ్రామ పరిధిలో ఇనాం పేరుతో ఉన్న భూములను సుమారు 300 మంది చిన్న,సన్నకార రైతులు 200 ఏళ్లగా సాగు చేస్తున్నారు. వీరికి అడంగల్ను అధికారులు ఇవ్వగా రుణాలు, పంట నష్టపరిహారం, భూములు క్రమవిక్రయా లు జరుపుకునే వారమని రైతులు తెలిపారు. అయితే తమ గ్రామంలో సాగుహక్కులో ఉన్న భూములపై తమకు సర్వహక్కులు ఉన్నప్పటికీ తమకు పట్టాలు ఇవ్వకుండా భూములకు సంబంధం లేని మగటపల్లి సాంబమూర్తికి రీసర్వే పే రుతో అధికారులు ధారాదత్తం చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని స్పష్టం చేశారు. దీంతో అధికారులు చేసేది లేక గ్రామసభ నిర్వహించకుండా వెనుదిరిగారు. సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తానని తహసీల్దార్ నళినాక్షి తెలిపారు. -
అరసవల్లి గోశాలలో రెండు ఆవులు మృతి
డయారియాతోనే మృతి ఆలయానికి చెందిన రెండు ఆవులకు డయారియా సోకింది. గురువారం ఉదయం 8 గంటలకు ఆలయం నుంచి ఫోన్ సమాచారం రాగానే వెళ్లి చూశాం. శరీర ఉష్ణోగ్రత 101.45 ఫారన్హీట్ ఉండాలి. కానీ ఒక ఆవుకు 97.5 ఫారన్హీట్, రెండో ఆవుకు 98.2 ఫారన్హీట్ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో పాటు డయారియా తీవ్రంగా ఉండడంతో మృతిచెందాయి. ఫుడ్ పాయిజన్కు కారణాలు లేకపోలేదు. – డాక్టర్ జి. దిలీప్, పశువైద్యుడు, అరసవల్లి అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి గోశాలలో ఉన్న రెండు ఆవులు గురువారం మృతి చెందాయి. ఇందులో ఒకటి సాయంత్రమే మృతి చెందగా.. రెండోది రాత్రి వేళలో కన్ను మూసింది. ఇది స్థానికంగా చర్చనీయాంశమైంది. గురువారం ఉదయానికి గోశాలలో ఉండే రెండు ఆవుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో స్థానిక పశువైద్యుడు దిలీప్కు సమాచారం ఇచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆవుల మృతి విషయం బయటకు పొక్కకుండా ఆలయ అధికారులు గోప్యత పాటించినప్పటికీ.. గురువారం సాయంత్రం ఓ ఆవు కళేబరాన్ని ఖననం చేయడంతో ఒక్కసారిగా సమాచారం దావానంలా వ్యాపించింది. దీంతో హుటాహుటిన ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ ఆలయానికి చేరుకుని సంబంధిత విభాగ బా ధ్యులతో చర్చించి తదుపరి చర్యలపై చర్చించినట్లుగా తెలిసింది. అయితే ఒకేసారి రెండు ఆవుల మృతి వెనుక నిర్వహణ లోపమే ప్రధానమని స్పష్టమవుతోంది. గతంలోనూ ఇక్కడ ఓ ఆవు, దూడ మృతి చెందాయి. ఒకేసారి రెండు ఆవులకు డయారియా ఆదిత్యాలయం గోశాలలో మొత్తం 13 ఆవులుండగా,ఇందులో గురువారం రెండు ఆవులు మృతిచెందడం సంచలనంగా మారింది. వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం వీటికి డయా రియా సోకిందని, అలాగే శరీర ఉష్ణోగ్రతలు పూర్తిగాతగ్గిపోవడంతో తట్టుకోలేకపోయాయ ని నిర్ధారణకు వచ్చారు. గురువారం ఉదయం రెండు ఆవుల పరిస్థితులను చూసి ఏఈఓ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది కూలర్లు పెట్టి మరీ గోశాలలో ఆవులకు సపర్యలు చేయించారు. పశువైద్యుడు దిలీప్ ఆధ్వర్యంలో ఆవులకు సైలెన్లు ఎక్కించి మందులు పెట్టారు. అయి నా లాభం లేకపోయింది. నిర్వహణ లోపమే శాపమా గోశాల నిర్వహణలో లోపాలున్నాయని, గడ్డి, తవుడు ఆహారం అందిస్తున్న నిర్వహణదారుల నిర్లక్ష్యమే ఆవుల పాలిట శాపాలుగా మారిపోయాయనే విమర్శలు వినిపిస్తున్నా యి. బడ్జెట్లో రూ.లక్షలాది రూపాయలు గోశాలకు ఖర్చులు చూపిస్తూ టెండర్లు ఖరారు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారనే చర్చ స్థానికంగా గుప్పుమంటోంది. ఇదిలావుంటే డయారియా అని వైద్యులు నిర్ధారణకు రావడంతో అసలు డయేరియా కు ఫుడ్ పాయిజన్ కారణమంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుళ్లిన పదార్థాలను ఆహారంగా పెట్టడం, అధికంగా అరటి పళ్లు భుజించడంతో గత ఏడాది ఆవు మృతిచెందిన సంగతి విదితమే. మిగిలిన గోవుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఫుడ్ పాయిజన్ కారణమంటూ చర్చ గతంలోనూ ఒక ఆవు, దూడ మృతి డయారియాతో మరణాలు నిర్ధారించిన పశు వైద్యులు -
శ్రీకాకుళం
పేటలో దాసుకోలేనన్ని గొడవలు హాట్ టాపిక్శుక్రవారం శ్రీ 26 శ్రీ జూన్ శ్రీ 2026సాక్షి ప్రతినిఽధి, శ్రీకాకుళం: నరసన్నపేట టీడీపీలో గొడవలు ఎప్పటికప్పుడు బయటపడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎలాగైనా బరిలోకి దిగాలని కేంద్ర రాష్ట్రమంత్రులకు మేనల్లుడు, బావ మరిది వరసైన మెండ దాసునాయుడు ఉవ్విళ్లూరుతున్నారు. తానే ఓ పవర్ సెంటర్లా మారాలని తాపత్రయపడుతున్నారు. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి మరో ఛాన్స్ రాదనే సంకేతాలతో తెగ హడావుడి చేస్తున్నారు. కానీ బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన ముందు దాసునాయుడు పప్పులుడకడం లేదు. ఆయన వేసే ప్రతి ఎత్తుగడను తిప్పికొడుతున్నారు. దాసుకు అంత సీన్ లేదని తీసి పారేస్తున్నారు. ఆయన చేసే యాక్షన్కు చెక్ పెట్టి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల ముందే పరువు తీసేస్తున్నారు. వీరి వ్యవహారం నరసన్నపేట టీడీపీలో రచ్చరచ్చగా మారింది. నాయుడి షో.. తెలుగు యువత అధ్యక్షుడిగా దాసనాయుడు చేసే షో అంతా ఇంతా కాదు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు జిల్లాకు వస్తే అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తారని పార్టీ వర్గాలే అంటుంటాయి. అవతల వ్యక్తుల నుంచి స్పందన లేకపోయినా వారంతా విష్ చేసినట్టు తనకే తాను బిల్డప్ ఇస్తూ హల్చల్ చేస్తుంటారు. నలుగురైదుగురిని వెంటేసుకుని, బలమైన నాయకుడిగా, కేంద్రరాష్ట్ర మంత్రుల సొంతమనిషిగా శ్రీకాకుళం, నరసన్నపేట నియోజకవర్గంలో అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ మధ్య ‘సాక్షి’ కార్యాలయం ఎదుట కూడా ఇలాగే అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ కేడర్, తోటి నాయకుల దగ్గర తన మేకపోతు గాంభీర్యం చూపిస్తుంటారని అంటుంటారు. ఎత్తుకు పై ఎత్తులు ఈ క్రమంలో తనకో నియోజకవర్గం కావాలని నరసన్నపేటను ఎంచుకున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలం పెంచుకుని, అక్కడ పోటీ చేయాలని పావులు కదుపుతున్నారు. చిన్నా చితక నాయకులు, కార్యకర్తలను వెంట బెట్టుకుని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. రెండో పవర్ సెంటర్గా అక్కడ షో చేస్తున్నారు. దాసునాయుడు చేస్తున్న యాక్షన్ చూసి ప్రస్తుత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు ఆయన కుమార్తె ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. వేసే ప్రతి అడుగును ముఖ్యంగా అర్చన తిప్పికొడుతున్నారు. నువ్వు ఎక్కడేదో చేసుకో.. ఇక్కడ పప్పులుడకవని చేతల ద్వారా చూపిస్తున్నారు. పలుసార్లు అవమానపరిచారు కూడా. ఒక కార్యక్రమంలోనైతే కేంద్ర, రాష్ట్ర మంత్రుల ముందే మెండ దాసునాయుడును ‘యూజ్ లెస్ ఫెలో’ అని అర్చన బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే రకంగా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్లెక్సీలతో డామినేట్ చేద్దామని చూస్తే పీకి పారేశారు. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు నరసన్నపేటలోనే రాజకీయంగా ఎదగాలని తన నియోజకవర్గంలో ఒక ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ పెట్టుబడి ఎక్కడిది అన్నది పక్కన పెడితే అక్కడే ఉండి భవిష్యత్ రాజకీయాలు నెరపాలని ప్లాన్ చేస్తున్నారు. బగ్గు రమణమూర్తిపైన, వారి కుమార్తె పేరున పలువురి వ్యక్తులతో సోషల్ మీడియా వేదికగా దుయ్య బట్టడం, పలు ఆరోపణలు గుప్పించడం వంటివి వ్యూహత్మకంగా జరుగుతున్నాయి. ఇవన్నీ బగ్గు వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయి. అదే దిశగా దాసునాయుడ్ని లక్ష్యంగా చేసుకుని అటు వైపు నుంచి కౌంటర్లు పడుతున్నాయి. మనోడి సంగతి స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చేద్దామనే ధోరణిలో ప్రత్యర్థి శిబిరం కూడా వ్యూహాత్మకంగా వెళ్తోంది. ఆయనకంత సీన్ లేదని, సొంత మండలమైన పోలాకిలోనే నమ్మరని, ఆయన సోదరుడిపై వచ్చిన వసూళ్ల ఆరోపణలు ప్రతి ఒక్కరికీ తెలుసని, అలాంటి వ్యక్తిని నరసన్నపేట ప్రజలు నమ్మరని బగ్గు వర్గం గట్టిగా నమ్ముతోంది. మొత్తానికి బగ్గు వర్సెస్ మెండ రాజకీయ యుద్ధం నరసన్నపేటలో హాట్ టాపిక్గా మారింది. నరసన్నపేట టీడీపీలో అంతర్గత పోరు పవర్సెంటర్గా ఎదగాలని మెండ దాసునాయుడు తాపత్రయం కింజరాపు బంధుత్వాన్ని వాడుకుంటున్న వైనం దాసు ఎత్తుగడలు తిప్పికొడుతున్న బగ్గు ఫ్యామిలీ -
మార్కెట్ కమిటీ.. పరిస్థితి ఏమిటి..?
పారదర్శకత కోసమే.. మార్కెట్ కమిటీల్లో పారదర్శకమైన పాలన అందించేందుకే ఈ పర్మిట్ విధానం అమలు చేయనున్నాం. ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్ సులభతరం కానుంది. వాణిజ్య లావాదేవీలు పెరుగుతాయి. వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – బి.రవికిరణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ, శ్రీకాకుళం హిరమండలం: జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకప్పుడు స్థానిక సంస్థల అభివృద్ధి, మౌలిక వసతులకు నిధులు అందేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏఎంసీల ద్వారా ఏటా పశువైద్య శిబిరాలు జరిగేవి. పాడి రైతులకు ఉచితంగా మందులు కూడా అందించేవారు. ఇప్పుడు అవి కూడా నిలిచిపో యాయి. దీనికి తోడు తనిఖీ కేంద్రాలతో పాటు గోదాముల నిర్వహణలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 12 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఇచ్ఛాపురం, కంచిలి, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పొందూరు, హిరమండలం, పాతపట్నం, ఆమదాలవలస, జలుమూరులో ఏఎంసీలు ఉన్నాయి. ఈ ఏడాది ఆదాయ లక్ష్యం రూ.22.96 కోట్లు కాగా.. ఏప్రిల్, మే నెలలో రూ.2.18 కోట్లు సమకూరింది. జిల్లా వ్యాప్తంగా మార్కెట్ కమిటీలకు సంబంధించి 11 తనిఖీ కేంద్రాలు ఉన్నాయి. ప్రధానంగా వ్య వసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు, సెస్ వసూ లు, చెక్పోస్టుల వద్ద వసూళ్ల ద్వారా ఏఎంసీలకు ఆదాయం సమకూరుతుంది. ఆదాయం వరకూ బాగానే ఉంది. కానీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటు వ్యవసాయ అనుబంధరంగాల వారికి అంతంతమాత్రంగానే ప్రోత్సాహం అన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటివరకూ మాన్యువల్.. మార్కెట్ కమిటీల్లో సిబ్బంది చేతివాటం నియంత్రించేందుకు జూలై నుంచి ఈ–పర్మిట్ విధానాన్ని అమలుచేస్తున్నారు. ఇప్పటివరకూ మాన్యువల్ విధానం అమల్లో ఉంది. అక్కడే ఎక్కువగా అవి నీతి జరుగుతోందని గుర్తించారు. అందుకే ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ ఈ–పర్మిట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్లైన్లో డబ్బులు చెల్లించాక ప్రత్యేక క్యూఆర్ కోడ్తో కూడి న ఈ–పర్మిట్ వస్తుంది. తనిఖీ కేంద్రాల వద్ద దా న్ని స్కాన్ చేయగానే సమగ్ర వివరాలు వస్తాయి. జిల్లాలో ఇప్పటికే వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 670 మందికిపైగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. లైసెన్స్ తప్పనిసరి ప్రతి వ్యాపారి ఈ–ట్రాన్స్పోర్టు పర్మిట్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. వారికి వ్యక్తిగత లాగిన్, పాస్వర్డులు కేటాయిస్తారు. వాటి ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఆన్లైన్లో పర్మిట్ జారీచేస్తారు. బ్యాంకుల ద్వారా సెస్ చెల్లింపులకు 15 రోజుల గడువు ఉంటుంది. ఈలోపు డబ్బులు చెల్లించకపోతే మాత్రం ప్రక్రియ నిలిచిపోతుంది. తనిఖీ కేంద్రాల వద్ద ట్రేడ్ లైసెన్స్ లేకుండా పంట దిగుబడులు తరలించే వ్యాపారుల నుంచి నాన్ ట్రేడర్స్ లైసెన్స్ కింద సెస్ వసూలు చేస్తారు. అయితే అలా మూడుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈలోగా సదరు వ్యాపారితో లైసెన్స్ కోసం దరఖాస్తు చేయిస్తారు. మూడుసార్లు దాటితే మాత్రం సరుకు విలువ బట్టి జరిమానా కూడా వసూలు చేస్తారు. జూలై నుంచి ఈ–పర్మిట్ విధానం చెల్లింపులన్నీ ఆన్లైన్లోనే పారదర్శకత కోసమే అంటున్న అధికారులు వ్యాపారులు వినియోగించుకోవాలని విన్నపం -
నిర్మాణంలో ఉన్న ఇల్లు కూల్చివేత
నిర్మాణంలో ఉన్న ఇల్లువీరభద్రాపురంలో ఉద్రిక్త పరిస్థితిపలాస: పలాస మండలం వీరభద్రాపురం గ్రామంలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో బమ్మిడి విమలకుమారి అనే ఒక మహిళ ఇల్లు నిర్మించుకుంటున్నారు. శ్లాబ్ వరకు వచ్చింది. ఏమైందో ఏమో గానీ గురువారం రాత్రి పలాస తహసీల్దార్ బి.శ్రీదేవితో పాటు రెవెన్యూ యంత్రాంగం అక్కడకు వెళ్లి పొక్లెయినర్తో ఇంటిని కూల్చివేశారు. స్థానికులంతా మూకుమ్మడిగా వెళ్లి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ, పోలీసు సిబ్బంది అక్కడకు వెళ్లి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. పసుపు కుంకుమ కింద బమ్మిడి కృష్ణారావు తన చెల్లెలు విమలకుమారికి ఈ స్థలం ఇచ్చారు. ఆ స్థలంలో ఆమె ఇల్లు కట్టుకుంటుండగా కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు అది ప్రభుత్వం భూమి అని, అందులో ఇల్లు క ట్టుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో ఎ లాంటి నోటీసు లేకుండా అధికారులు ఆగమేఘాల మీద అక్కడకు వెళ్లి ఇంటిని కూల్చేశారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వా మి వారి కల్యాణ సేవ గురువారం ఉదయం ఘనంగా జరిగింది. నిజ జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఉత్సవమూర్తులను కల్యాణ మూర్తులుగా అలంకరించి అనివెట్టి మండపంలో ఆగమశాస్త్రం ప్రకారం కల్యాణాన్ని జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో క్రతువు జరిగింది. ‘పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిద్దాం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: పారదర్శకంగా, అత్యంత కచ్చితత్వంతో ఓటర్ల జాబితా అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)–2026 ప్రక్రి యపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి గురువారం ఆయన ఈఆర్వోలతో సమావేశం నిర్వహించారు. జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ అనంతరం జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్లు, అబ్జెక్షన్ల స్వీకరణ ఆ తర్వాత వీటిని ప రిష్కరించి ఈ ఏడాది సెప్టెంబర్ 22న తుది జాబితాను ప్రచురించడం వరకు ప్రతి కార్యక్ర మం సకాలంలో పూర్తి చేసేందుకు సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) తప్పనిసరిగా ప్రతి ఇంటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని సూచించారు. 28న పల్స్ పోలియో శ్రీకాకుళం పాతబస్టాండ్: పోలియో రహిత సమాజ నిర్మాణం మనందరి బాధ్యతని, జూన్ 28న జిల్లాలో నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో టీకా కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు లయన్ పొన్నాడ రవికుమార్, లయన్ నటుకుల మోహన్ నేతృత్వంలో రూపొందించిన పోలియో అవగాహన వాల్పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఐదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులందరూ తప్పనిసరిగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. బాలుడిపై కుక్కల దాడి పలాస: కాశీబుగ్గ శ్రీనివాసనగర్కు చెందిన పదేళ్ల బాలుడు మడ్డు రోహిన్పై కుక్కలు దాడి చేయడంతో గా యాలపాలయ్యాడు. వీధిలో ఆడుకుంటుండగా ఒక్క సారి కొన్ని కుక్కలు అతనిపై దాడి చేశాయి. ఆ సమయంలో స్థానికులు వెంటనే చూసి కుక్కలను త రిమేయడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. మున్సిపాలిటీలో విచ్చలవిడిగా కుక్కలు తి రుగుతున్నాయని, మున్సిపల్ అధికారులు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మాదకద్రవ్యాలతో జీవితం నాశనం శ్రీకాకుళం పాతబస్టాండ్: డ్రగ్స్, మద్యం, ధూమపానం వంటి వ్యసనాల బారిన పడి జీవితం నాశనం చేసుకోవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు యు వతకు సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం బలగలోని రిమ్స్ వైద్య కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ‘మాదక ద్రవ్యాలు వద్దు – జీవితం ముద్దు’ అనే నినాదంతో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల న్యాయ విజ్ఞానం కోసం లీగల్ లిటరసీ క్లబ్ ఏర్పాటు చేసి, న్యాయవాదిని, పారా లీగల్ వలంటీర్ను ని యమించారు. -
పొలంలోనే ప్రాణం వదిలి..
● విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి మెళియాపుట్టి: దుర్భలాపురం గ్రామానికి చెందిన రైతు పెద్దింటి మోహన్ (55) విద్యుత్ షాక్కు మృత్యువాతపడ్డాడు. పోలీసులు తెలిపి న వివరాల ప్రకారం.. మోహన్ బుధవారం సాయంత్రం గ్రామ పరిధిలోని పొలంలో సారికంద పంటకు నీరు కట్టడానికి వెళ్లాడు. విద్యుత్ శాఖ సిబ్బంది ఇటీవల కురిసిన వర్షాలకు తెగిన కరెంట్ వైర్లను చుట్టి పొలంలో వేశారు. వాటికి అదే పొలంలోని పంపుషెడ్ విద్యుత్ తీగ అంటుకుని ఉంది. ఆ విషయం గమనించని మోహన్ కరెంట్ వైర్లను పక్కకు వేయాలని ప్రయత్నించగా షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మోహన్కు భార్య తవిటమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కార్గో ఎయిర్పోర్టు పేరుతో విధ్వంసం
పలాస : ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో విధ్వంసం సృష్టించడం తగదని, నిర్మాణ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ జూలై 15న పలాస ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాసలో బుధవారం వివిధ ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీర ప్రాంతాన్ని రక్షించి పర్యావరణాన్ని కాపాడాల్సిన ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు కార్పొరేటు కంపెనీలకు పచ్చని ఉద్దానాన్ని అప్పగించాలని చూడటం ఇక్కడి ప్రజలను మోసగించడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. నిజంగా కార్గో ఎయిర్పోర్టు కట్టాలనే చిత్త శుద్ధి ఉంటే మూలపేట వద్ద ప్రభుత్వం సేకరించిన భూమి చాలా ఉందని, అక్కడ నిర్మించుకోవాలని కోరారు. సమావేశంలో సి.పి.ఎం.జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు వంకల మాధవరావు, లిబరేషన్ నాయకులు మద్దిల రామారావు, తామాడ సన్యాసిరావు, కోనారి మోహనరావు, సీ.హెచ్ రవికుమార్(సి.పి.ఐ), కొమర వాసు, జోగి అప్పారావు, పౌరహక్కుల సంఘం నాయకుడు పత్తిరి దానేసు, ఎన్.గణపతి, పి.కుసుమ, జుత్తు వీరాస్వామి, జి.బాలకృష్ణ, పి.నాగేశ్వరరావు, కోనేరు రమేస్, ఎం.వినోద్కుమార్, ఎస్.వీరాస్వామి, సోమనాధం పాల్గొన్నారు. -
28న పల్స్ పోలియో
శ్రీకాకుళం పాతబస్టాండ్: పల్స్ పోలియో ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పల్స్ పోలియో నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం సెలవు దినమైనప్పటికీ పోలియో చుక్కలు వేసేందుకు పాఠశాలలు తెరిచి ఉంచాలన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ తదితర చోట్ల ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత మాట్లాడుతూ 1,80,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.అనిత, అదనపు డీఎంహెచ్ఓ శ్రీకాంత్, డీఐఓ రామదాసు, విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ అటవీ శాఖ అధికారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీముఖలింగంలో కల్యాణోత్సవాలు ప్రారంభం జలుమూరు: అధిక జేష్ఠ మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో బుధవారం ముఖలింగేశ్వర సహిత వారాహి అమ్మవారి పాంచరాత్రి కల్యాణ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ధ్వజారోహణ నిర్వహించి పుణ్యాహవచనం, మంటపారాధన, బలిహారణ అనంతరం మంగళం పలికారు. కార్యక్రమంలో ఈఓ ఏడుకొండలు, పురోహితులు బంకుపల్లి ఫణేంద్రశర్మ, అర్చకులు శేషాద్రి వెంకటాచలం, నాయుడుగారి రాజశేఖర్, నారాయణమూర్తి, శివాజి, సింహాచలం, భక్తులు పాల్గొన్నారు. పొలంలో మోహన్ మృతదేహం -
ఆటోను ఢీకొన్న కారు
మందస: మండలంలోని మకరజోల సమీపంలో జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు మార్గమధ్యలో ఆటోను ఢీకొంది. ఆటోలో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో డ్రవర్కు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఉత్తరాంధ్రకే ప్రఖ్యాతిగాంచిన శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఇక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, అధ్యాపకులంతా సమష్టిగా కృషి చేయాలని కాలిజియేట్ ఎడ్యుకేషన్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ పీవీ కృష్ణాజీ పేర్కొన్నారు. బుధవారం కళాశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం అధ్యాపకులతో కలిసి సమావేశం నిర్వహించారు. వివిధ విభాగాల పనితీరు, ఫలితాలు, అడ్మిషన్ల తీరు గురించి ప్రిన్సిపాల్ డాక్టర్ యాళ్ల పోలినాయుడును అడిగి తెలుసుకున్నారు. కళాశాలకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. కళాశాలలో అడ్మిషన్లు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రోణంకి హరిత, ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్ జి.రాజశేఖర్, అకడమిక్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, డాక్టర్ రామకృష్ణ, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించండి శ్రీకాకుళం పాతబస్టాండ్: అపరిష్కృతంగా ఉన్న మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు బుధవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కల్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జూలై 7న చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. గ్రానైట్ క్వారీలో ప్రమాదం ● యువకుడు మృతి సారవకోట: మండలంలోని గోవర్ధనపురం రెవెన్యూ పరిధి అనవీర్ గ్రానైట్ క్వారీలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన యువకుడు జె.శ్రీకాంత్ రెడ్డి (23) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రానైట్ క్వారీలో ఎప్పటిలాగే బుధవారం విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ రెడ్డి ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సమీపంలో ఉన్న రాయి నీడలో సేద తీరేందుకు కూర్చున్నాడు. అయితే అదే రాయి ప్రమాదవశాత్తు ఆయనపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది ఒడిశాలోని గంజాం జిల్లా నరసింగపూర్గా గుర్తించారు. నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్ఐ అనిల్ కుమార్, క్లూస్ టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారావు రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
జూలై 11, 12 తేదీల్లో సాహితీ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: జూలై 11, 12 తేదీల్లో విజయవాడలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో సాహితీ స్రవంతి, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా రాష్ట్రస్థాయి సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు ఎంబీ విజ్ఞాన కేంద్రం బాధ్యులు గుండు నారాయణరావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, సీనియర్ జర్నలిస్ట్ నల్లి ధర్మారావులతో కలిసి విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని జిల్లాల నుంచి ప్రసిద్ధ కవులు, రచయితలతో పాటు యువకులు, వర్దమాన రచయితలు సుమారు 300 మందికి పైగా ఈ సమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రచయితలు, కవులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో సాహితీ స్రవంతి జిల్లా కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్, నెట్టిమి రమణారావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం బాధ్యులు పి.సుధాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్త కోతలే..!
ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న పంపు హౌస్ 2 కూటమి ప్రభుత్వ వైఫల్యం ఈ రెండేళ్లలో ఎత్తిపోతల పథకం పూర్తిచేయలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉండడం దారుణం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో సగానికి పైగా పనులు కూడా పూర్తయ్యాయి. వాటిని సైతం పూర్తిచేయలేకపోయింది ఈ ప్రభుత్వం. ఇంతకంటే వైఫల్యం ఉంటుందా..? – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం హిరమండలం: ఆర్భాటం ఎక్కువ.. పని తక్కువ అన్నట్టు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు నిర్మాణం కూడా పూర్తిచేయలేకపోయింది. బీఆర్ఆర్ వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, ఎత్తిపోతల పథకం, ఉద్దానం సమగ్ర మంచినీటి పథకం.. ఇలా ఏ పథకాన్ని కూడా రెండేళ్లలో పూర్తిచేసి ప్రజలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయింది. ప్రధానంగా వంశధార ప్రాజెక్టు పరిధిలోని హిరమండలం ఎత్తిపోతల పథకం ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. దీంతో జిల్లాకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యం దెబ్బతినేలా ఉంది. ఇదీ జరిగింది... వంశధార ఫేజ్–2 రిజర్వాయర్కు నేరడి బ్యారేజీ నిర్మాణం కీలకం. దీనికోసం ఒడిశాతో జల వివాదం నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో వ్యవహరించారు. ఈ మేరకు అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ చర్చలు జరిపారు. వంశధార నదిలో హిరమండలం వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించడానికి నిర్ణయించారు. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి 12 టీఎంసీల నీటిని వంశధార జలాశయంలోకి చేర్చడమే లక్ష్యంగా పనులు ప్రారంభించారు. ఇందుకుగాను రూ.176.35 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. రూ.140.17 కోట్లకు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ వైఎస్సార్సీపీ హయాంలో శరవేగంగా పనులు ప్రారంభించారు. రెండేళ్లలో సగానికిపైగా పనులు పూర్తి చేశారు. కానీ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం మాటలతో కాలం గడిపిందే తప్ప.. పనులు మాత్రం సజావుగా ముందుకు తీసుకెళ్లలేకపోయింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిధుల విడుదలలో తాత్సారం కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతోంది. ఎత్తిపోతల పథకానికిగాను విద్యుత్ సబ్స్టేషన్ అవసరం. కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. గత నెలలో ఏపీ ట్రాన్స్కోకు సబ్స్టేషన్ నిర్మాణానికిగాను రూ.9.18 కోట్లు చెల్లించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ ఇంకా సబ్స్టేషన్ పనులు మొదలుకాలేదు. 132 కేవీ విద్యుత్ లైన్లు సారవకోట, పాతపట్నం, హిరమండలం నుంచి మొత్తం 75 టవర్లు ఏర్పాటు చేసి సబ్స్టేషన్కు అనుసంధానం చేయాలి. వీటి ఏర్పాటుకు సంబంధించి భూములను గుర్తించాలి. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. కానీ ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. సబ్స్టేషన్ నిర్మాణాన్ని సైతం ప్రారంభించలేదు. దీంతో ఎత్తిపోతల పథకం నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రకటనలకే పరిమితం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 2026 ఖరీఫ్నకు రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేశారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు గమినిస్తే వచ్చే ఏడాది ఖరీఫ్నకు కూడా ఇది సాధ్యమవుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి రిజర్వాయర్లో నీటిని స్థిరీకరిస్తే.. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందుతుంది. నారాయణపురం ఆనకట్ట కింద 18,527 ఎకరాలు, హెచ్ఎల్సీ కింద ఉన్న 5 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరుగుతుంది. ఆపై ఉద్దానం ప్రాజెక్టుకు 1.12 టీఎంసీల తాగునీరు అందించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ ఈ పనులు చేయలేం. కానీ ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎత్తిపోతల పథకంలో ఎడతెగని జాప్యం విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణంపై నిర్లక్ష్యం ప్రచార ఆర్భాటంతోనే గడిపేసిన కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్లో వంశధార నీరు లేనట్టే -
ఆదర్శనీయం
● తన ఇద్దరు పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించిన ఉపాధ్యాయుడు మందస: ప్రభుత్వ బడుల్లోని అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విధిగా తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు, కొత్తపల్లి ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు గవ్వ భీమారావు కోరారు. ఈ మేరకు మండలంలోని కొత్తపల్లి ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో తన చిన్న కుమారుడు గవ్వ తరుణ్ను 1వ తరగతిలో చేర్పించారు. పెద్ద కుమారుడు గవ్వ గిరీష్ కూడా అదే పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. దీంతో ఆయనను పలువురు అభినందించారు. -
తవ్వారు.. వదిలేశారు..!
కొత్తూరు: కూటమి ప్రభుత్వంలో హడావుడిగా నాయకులు రోడ్ల పనులను ప్రారంభించి.. సకాలంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని రాయల గ్రామం నుంచి ఎర్రటిగూడ వరకు రోడ్డు పనులు మంజూరు చేశారు. దీంట్లో భాగంగా పనులు ప్రారంభించారు. ఈ రోడ్డు ఊరు చెరువు గట్టుపై నుంచి వెళ్లాల్సి ఉండడంతో చెరువు గట్టుకు రక్షణ గోడ నిర్మాణం కోసం మూడు నెలల క్రితం గాడిని తవ్వారు. అయితే అనంతరం గోడ నిర్మాణం చేపట్టకుండా వదిలేయడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. నెలలు గడుస్తున్నా రక్షణ గోడ నిర్మాణ పనులు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాడిలో నీరు చేరుతోంది. ఫలితంగా చెరువు గట్టు బలహీనపడింది. ఈ చెరువు కొండల దిగువ భాగాన ఉన్నందున చిన్నపాటి వర్షాలకు చెరువులోకి నీరు చేరడం వలన గాడిలో నీరు ఎక్కువవుతోంది. దీంతో గట్టు పలుచోట్ల బలహీనపడడంతో కూలిపోయే అవకాశం ఉంది. ఒకవేళ గట్టు కూలిపోయినట్లయితే చెరువులో నీరు పొలాల్లోకి చేరుతుంది. ఫలితంగా మొలక దశలో ఉన్న వరినారు, వరి వెదలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు గాడి తవ్వడం వలన రోడ్డు మీద మట్టి నిండిపోవడంతో రోడ్డు మీద ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వర్షం కురిసే సమయంలో ఈ రోడ్డు నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ రక్షణ గోడ నిర్మాణం చేపట్టాలని ఇంజినీరింగ్ అధికారులకు రైతులు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని వాపోతున్నారు. రోడ్డు పనుల కోసం చెరువు గట్టు తవ్వేశారు. అయితే సకాలంలో పూర్తి చేయకపోవడంతో గట్టు పూర్తిగా బలహీనపడింది. పలుచోట్ల బీటలు వారింది. వర్షాలకు చెరువులో ఎక్కువ నీరు చేరినట్లయితే చెరువు గట్టు కొట్టుకుపోయి పంట పొలాల్లోకి నీరుచేరే ప్రమాదం ఉంది. తవ్విన గాడి పూడ్చకపోతే ఈ ఏడాది పంట చేతికొచ్చే అవకాశం లేదు. – రాగాల సులోచన, ఆయకట్టు రైతు, రాయల గ్రామం -
నిధుల కాజేతే లక్ష్యం..!
● పంచాయతీల నిధులపై కూటమి నేతల కన్ను ● సర్పంచ్లు లేకపోవడంతో అదునుగా భావిస్తున్న నాయకులు ● అధికారులపై రాజకీయ ఒత్తిడి తెస్తున్న వైనం హిరమండలం: పంచాయతీల్లోని నిధులపై కూటమి నేతలు కన్నేశారు. గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న నిధులను ఏదో రూపంలో బయటకు తీయాలని కొందరు వ్యూహాలు రచిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గ్రామాల అవసరాలకు వినియోగించాల్సిన నిధులను మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 912 పంచాయతీలున్నాయి. ఏప్రిల్తో గ్రామ సర్పంచుల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం నిర్ణయాధికారం ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వచ్చింది. దీంతో గ్రామాల్లో రాజకీయ నాయకుల జోక్యం తగ్గుతుందని భావించినప్పటికీ.. పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. నేరుగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోయినా, అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి తమకు అనుకూలంగా పనులు మంజూరు చేయించుకోవాలనే ప్రయత్నాలు కూటమి నేతలు చేస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పంచాయతీలు, ప్రత్యేక అధికారుల మ్యాపింగ్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. దీంతో కొత్త పనులకు అనుమతులు, బిల్లుల చెల్లింపులు, నిధుల బదిలీల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి కొందరు కూటమి నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని వినియోగించే అవకాశం లేకపోవడంతో, వాటిపై సరికొత్త వ్యూహ రచన చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఒత్తిళ్లు..! కొన్ని మండలాల్లో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. గ్రామాల్లో చేయాల్సిన పనుల జాబితాలను నేతలే సిద్ధం చేసి అధికారులకు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం వ్యవహరించే అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ అనుచరులతో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అతిక్రమించి నిధులు ఖర్చు చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండడంతో పలువురు అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో పంచాయతీలో ఒక పనికి ఒకరిద్దరూ కాకుండా ఏకంగా కూటమిలోని నలుగురు, ఐదుగురు చొప్పున పోటీపడటంతో అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే నిధులను ఎలాగైనా స్వాహా చేయాలని చూస్తున్న నేతల ప్రయత్నాలు, ఒత్తిళ్లుకు అధికారులు తలొగ్గకుండా నిధులను పరిరక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పనుల పేరుతో నిధులు కాజేసే ప్లాన్ గ్రామాల్లో మురుగు నీటి కాలువలు, రోడ్ల మరమ్మతులు, విద్యుత్, పారిశుద్ధ్య పనులు ఇలాంటి చిన్నపాటి పనులు పేరుతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి అవసరం లేని పనులను కూడా అత్యవసరంగా చూపించి నిధులు ఖర్చుచేసే మార్గాలు వెదుకుతున్నారనే విమర్శలొస్తున్నాయి. కొన్నిచోట్ల పనులు చేయకనే బిల్లు గురించి చర్చలు మొదలయ్యాయని, మరికొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయని చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గ్రామ ప్రజల అవసరాలకంటే నేతలకు లబ్ధి కల్పించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. -
విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ వై.అప్పయ్య, కె.దశరథలు డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రైవేట్పరం చేయడాన్ని నిరసిస్తూ రెండో రోజైన బుధవారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సొంతంగా నిర్వహించాలని, విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశలవారీగా ప్రైవేటుపరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచన విరమించుకోవాలని కోరారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను విరమించుకోవాలని, జీవో నంబర్ 88ని రద్దు చేయాలన్నారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆర్టీసీలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా జీతాలు చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు జి.త్రినాథరావు కె.బాబురావు, జి.కామేశ్వరరావు, ఎస్వీ రమణ, ఎన్వీఆర్ మూర్తి, పీవీఆర్ఎల్ కామేశ్వరి, ఎం.వైకుంఠం, నవీన్, బీఆర్ కృష్ణ, ఎం.ఆర్.మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఆశ్రమ పాఠశాలలు కుదించే నిర్ణయాన్ని మార్చుకోవాలి
పలాస: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉన్నారనే నెపంతో వాటిని కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సూదికొండ కాలనీలోని పీడీఎస్యూ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో 8, 9, 10 తరగతులను కుదించి, వారిని సమీప పాఠశాలలకు పంపించాలనే ఆలోచన సరైనది కాదన్నారు. దీనివల్ల ఆర్థిక భారం వలన ఇతర పాఠశాలలకు విద్యార్థులు వెళ్లలేక మధ్యలో చదువుకు స్వస్తి పలికే అవకాశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆదివాసీ పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, వంటమనిషి, వాచ్మెన్ తదితర పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. ఆయనతో పాటు పీడీఎస్యూ స్థానిక నాయకులు విజయ్, రాజు, గణేష్ తదితరులు ఉన్నారు. -
శివకుమార్ను కఠినంగా శిక్షించాలి
పలాస: సోంపేట మండలం గొల్లూరు గ్రామానికి చెందిన శివకుమార్ను కఠినంగా శిక్షించాలని, అతని కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలకు తగిన న్యాయం చేయాలని పౌరహక్కుల సంఘం, ఇతర ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గొల్లూరులో జరిగిన దారుణ ఘటనపై అంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రజాసంఘాల నాయకుల నిజ నిర్ధారణ కమిటీ మంగళవారం ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శివకుమార్ ఇంట్లో ఉన్న ఊర్వశిని ఆస్తి తగాదాల నేపథ్యంలో కక్ష పెంచుకొని అతి దారుణంగా హత్య చేసి పారిపోయాడన్నారు. అందువలన నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. అలాగే అనాథలైన చిన్నారులకు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పత్తిరి దానేసు, జిల్లా కమిటీ నాయకులు సోమనాథం, వైకుంఠరావు, జోగారావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల ధర్మారావు, పుచ్చ దుర్యోధనరావు, సాలిన వీరాస్వామి, బొడ్డు నాగమణి, సరస్వతి, దాసరి శ్రీరాములు, వాసుదేవరావు, బొడ్డు జగన్ తదితరులు పాల్గొన్నారు. -
వేదన మిగిలింది
కల కరిగింది● రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం ● కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించిన తండ్రి కుమారుడి మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి అప్పారావు టెక్కలి రూరల్: చేతికి అందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. కలలన్నీ చెదిరిపోవడంతో గుండెలవిసేలా రోదించాడు. తనలా కూలి పని చేయకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఇంజినీరింగ్ చదివిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ విషాద ఘటన విక్రంపురం జంక్షన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంతబొమ్మాళి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జగదీష్(19) కె.కొత్తూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ప్రతి రోజు ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్లేవాడు. ఎప్పట్లాగే మంగళవారం కూడా ద్విచక్ర వాహనంపై బయలుదేరి టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తుండగా విక్రాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడమో లేక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందో అనే విషయమై స్పష్టత రావడం లేదు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జగదీష్ని హైవే అంబులెన్స్లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న తండ్రి అప్పారావు ఆస్పత్రికి చేరుకుని కుమారుడిపై పడి బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. జగదీష్కు తల్లి కన్నమ్మ, అన్నయ్య ఉన్నారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ని లోపాలు ఏంటి సర్?
కవిటి: కవిటి బెహరావీఽధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ లోపభూయిష్టంగా జరుగుతోందని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం పార్టీ రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, సల్ల దేవరాజ్తో కలిసి కవిటి బెహరావీధిలోని పలు పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఓటర్ల ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా బీఎల్వోలు విధులు నిర్వహించడం తగదన్నారు. 89వ పోలింగ్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉండగా వారిలో కేవలం ముగ్గురికే ఎస్ఐఆర్ ఫారాలు అందించి మిగిలిన వారికి ఇవ్వలేదన్నారు. బీఎల్ఏగా ఉన్న బెందాళం రమణమూర్తికి కూడా ఒక్క ఫారం మాత్రమే అందజేశారని చెప్పారు. బీఎల్ఏకే ఇలా జరిగితే నిరక్ష్యరాస్యులైన ఓటర్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇంటింటికి వెళ్లకుండా అందరినీ ఒకేచోటికి రప్పించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. 92వ పోలింగ్ కేంద్రం బీఎల్ఓ జానకిరావు.. నాగుల గిరిదాస్ అనే వ్యక్తి ఇంట్లో ఐదుగురు ఓటర్లకు గాను ఇద్దరికే ఫారాలు ఒక్కొక్కటి ఇచ్చారని, దీనిపై ప్రశ్నించగా రెండు ఇస్తే పోగొట్టుకుంటారని తన వద్ద ఉంచేశానని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిటి మండల కేంద్రంలోనే ఈ తరహా పనితీరు కనిపిస్తుంటే ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కలెక్టర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సైతం తహసీల్దార్ టి.కల్యాణచక్రవర్తి మాట్లాడుతూ బీఎల్ఓలను నియంత్రించలేకపోతున్నానని చెప్పడం గమనార్హం. 23 ఓట్ల తొలగింపునకు కుట్ర! సారవకోట: చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతుగూడలో 23 మంది గిరిజనుల ఓట్లు తొలగించేందుకు స్థానిక టీడీపీ నాయకులు ప్రయత్నాలు చేశారు. మంగళవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ మండల కమిటీ ఉపాధ్యక్షుడు బొంగు కొండయ్య, డీఎల్డీఏ చైర్మన్ నక్క తులసీదాస్లు గ్రామానికి చేరుకుని బీఎల్ఏలతో మాట్లాడారు. దీంతో గిరిజనులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. 23 మంది ఓటర్ల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని, తుది జాబితాలో వారి పేర్లు లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పోలాకి జెడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని నాయకులు స్పష్టం చేశారు. -
నేడు జాబ్మేళా
శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్) కళాశాలలో ‘ఉన్నతి’ ఫౌండేషన్ సహకారంతో బుధవారం మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, ఉన్నతి ఫౌండేషన్ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కోఆర్డినేటర్ బి.రంజిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నస్ ఇన్స్ట్రూమెంట్స్, వోల్టాస్, అపోలో ఫార్మసీ, దూత్ ట్రాన్స్మిషన్స్, టీవీఎస్, డాటా క్రాప్, విస్ట్రాన్ వంటి 15 కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. సుమారు 600 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఎంఎల్టీ, ఫార్మసీ తదితర అర్హతలు కలిగిన యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు బయోడేటా, ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, రెండు పాస్ఫొటోలతో ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణం వద్దకు చేరుకోవాలని సూచించారు. ఉత్తీర్ణత శాతం పెరగాలి నరసన్నపేట: రెసిడెన్షియల్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత శాతం పెరగాలని ఏపీఎస్డబ్ల్యూ ఆర్ఐఈఎస్ జాయింట్ సెక్రటరీ కె.రాజ్యలక్ష్మి అన్నారు. తామరాపల్లిలోని మహిళా రెసిడెన్సియల్ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. భోజన వసతి, తరగతుల నిర్వహణ తదితర అంశాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కళాశాల సిబ్బందికి, వంట ఏజెన్సీ ప్రతినిధులకు తగు సూచనలు చేశారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రత్యేక కార్యాచరణ అవసరమన్నారు. ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు తీర్చిదిద్దాలన్నారు. ఈమె వెంట డీసీఓ వై.యశోదలక్ష్మి ఉన్నారు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఖైదీలకు, వన్యప్రాణుల దాడి బాధితులకు చట్టప్రకారం సకాలంలో న్యాయ సహాయం అందించడంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నూతనంగా ప్రవేశపెట్టిన పలు పథకాలపై వలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. జైళ్లలో ఉన్న ముద్దాయిలు, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ ల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘స్పృహ’ పథ కం గురించి వివరిస్తూ.. ఖైదీలపై ఆధారపడిన వారి కుటుంబ సభ్యులకు, ఖైదీలకు నడుమ వలంటీర్లు సమన్వయకర్తలుగా వ్యవహరించాలన్నారు. ఉచిత న్యాయవాదిని నియమించడంలో సహాయం చేయాలని సూచించారు. అడవుల సరిహద్దు ప్రాంతాల్లో జరిగే మానవ – వన్యప్రాణి సంఘర్షణల వల్ల నష్టపోయే బాధితులకు ఈ నూతన పథకం ద్వారా న్యాయం పొందేలా తగిన అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. -
ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ ప్రారంభం
ఎచ్చెర్ల : ఎస్ఎంపురంలోని శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రవేశాలకు మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు, తల్లిందండ్రులు హాజరయ్యారు. మొదటి అడ్మిషన్ పొందిన పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం కాశీపట్నం గ్రామానికి చెందిన వి.ప్రీతి, అనకాపల్లి జిల్లాకు చెందిన సీహెచ్ దీక్షిత్ ధర్మతేజలకు డైరెక్టర్ గిరిధర్ మద్రాసు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కౌన్సెలింగ్ కన్వీనర్ అమరేంద్రకుమార్ మాట్లాడుతూ ఈ నెల 24 వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. తొలి రోజు 500 మందికి గాను 319 మంది అమ్మాయిలు, 104 మంది అబ్బాయిలు మొత్తం 423 మంది అడ్మిషన్లు పొందారని వివరించారు. 24వ తేదీన 500 మందికి కౌన్సెలింగ్ జరుగుతుందని వివరించారు. కార్య క్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
● రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి..
పలాస: పలాస మున్సిపాలిటీకి చెందిన కుమ్మరి రామారావు(60) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు, బంధువులు ఇచ్చిన వివరాలు ప్రకారం.. ఆయన పలాస–కాశీబుగ్గ పట్టణంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నా రు. ఉదయం పూట కూలీలను తీసుకొని వెళ్లి పనికి అప్పగించి ఇంటికి ప్రతి రోజు వస్తుంటారు. సాయంత్రం వేళల్లో మళ్లీ వారు పనిచేసే చోటకు వెళ్లి పరిశీలించి తిరిగి ఇంటికి వస్తుంటారు. రోజూ మాదిరిగానే సోమవారం కూడా కాశీబుగ్గ నుంచి తిరిగి బైకుపై వస్తుండగా పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద మున్సిపాలిటీకి చెందిన చెత్తను సేకరించే ట్రాక్టరు ఆగి ఉంది. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మద్యం సేవించి ఆ పక్కనే ఉన్న పండ్ల దుకాణం వద్ద నిలబడి ఉన్నాడు. రామారావు ఆ ట్రాక్టర్ను బలంగా ఢీకొన్నారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను అంబులెన్స్లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తు ప్రాణాలు తీసినట్లు చెబుతున్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పచ్చమూకల దాష్టీకం
టెక్కలి: రాధావల్లభపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు యర్ర శ్యామలరావు, తమ్మినేని రమణమూర్తి తదితరులపై గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వారి ని కుటుంబ సభ్యులు 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. రాత్రి సమయంలో గ్రామానికి వెళ్తుండగా గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు బొడ్డేపల్లి వెంకటేష్, సనపల కృష్ణమూర్తి ఇరువురూ దారి కాచి దాడి చేశారు. ఈ దాడిలో శ్యామలరావు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా.. రమణమూర్తి చేయి విరిగిపోయింది. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, రాధావల్లభపురానికి చెందిన నాయకులు అజయ్కుమార్, సనపల కృష్ణారావు తదితరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగిందనే సమాచారం తెలుసుకున్న నాయకులు కర్ణిక జీవన్, బడ్డ రాజేష్, ఆట్ల రాహుల్, బర్ల కార్తీక్, చింతాడ జీవన్, కవిటి చిన్న, బగాది జయరాం, మెండ భాస్కర్ తదితరులు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. గతంలో గ్రామంలోని ఓ కేసు విషయమై సాక్షులుగా ఉన్న తమను బెదిరించడమే కాకుండా దాడికి పాల్పడ్డారని బాధితులు తెలియజేశారు. మరో 8 మందికి కొడతామని బెదిరించారని, కిల్లి అజయ్ను చంపేస్తామని అన్నారని తెలిపారు. దాడి ఘటనపై తిలక్ మాట్లాడుతూ గ్రామాల్లో రెచ్చిపోతున్న టీడీపీ కార్యకర్తలను వదిలిపెట్టేది లేదని, టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు అండతో దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
ఈ ‘ఆదాయ’ పైత్యాన్ని ఏమందురు..?
● గుడులు, బడుల వద్ద మద్యం విక్రయాలు ● బరి తెగిస్తున్న వ్యాపారులు ● కొత్తూరు జంక్షన్లో గిరిజన బాలికల వసతి గృహం పక్కనే రెండు వైన్షాపులు ● శ్రీకాకుళం, కాశీబుగ్గలో గుడులకు ఎదురుగా వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన బస్ షెల్టర్ సమీపంలో శ్రీరామమందిరం గుడికి ఎదురుగా 100 మీటర్ల లోపు ఉన్న మధు బార్ అండ్ రెస్టారెంట్ దృశ్యమిది. టీడీపీ నాయకుడు ఇప్పిలి మధుకు చెందిన బార్ అండ్ రెస్టారెంట్ ఇది. దీని పై ఫిర్యాదులు వెళ్లినా పట్టించుకోవడం లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ప్రభుత్వం ఆదాయమే పరమావధిగా పెట్టుకుంది. దీనికి మద్యాన్నే మార్గంగా ఎంచుకుంది. ఇంకేముంది గుడి, బడి అని చూడటం లేదు. ఎక్కడ కావాలంటే అక్కడ మందు షాపులు పెట్టుకోవడానికి అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో శాంతిభద్రతల సమస్య పెచ్చుమీరుతోంది. నిత్యం రాకపోకలు సాగించే ప్రాంతంలో వైన్షాపులుంటే అక్కడున్న బాలికల రక్షణ దేవుడికెరుక. అలాంటిది మందుబాబులు సంచరించే ఏరియాలో బాలికల వసతి గృహాలు ఉంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అనుమతి ఎలా ఇచ్చారో..! ● కొత్తూరు జంక్షన్లో ఉన్న గిరిజన బాలికల వసతి గృహాన్నే తీసుకోండి.. ఒక వైన్షాపు పక్కనున్న కాంప్లెక్స్లో గిరిజన బాలికల వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏర్పాటు చేసిన కొన్ని నెలలకు మరో వైన్షాపు అక్కడ పెట్టారు. ● వైన్షాపు పక్కన గిరిజన బాలికల వసతి గృహం ఏర్పాటుకు సంబంధిత అధికారులు అనుమతి ఇవ్వడం ఆశ్చర్యంగా ఉంది. ● బాలికల వసతి గృహం ఉన్న దగ్గరలో కొత్తగా మరో వైన్షాపు ఏర్పాటు చేసేందుకు ఎకై ్సజ్ అధికారులు అనుమతి ఇవ్వడం మరింత విచిత్రం. ● ఇక్కడ ఇరు శాఖల అధికారుల తప్పులూ ఉన్నాయి. ● టీడీపీకి చెందిన వ్యక్తి వైన్షాపు కావడంతోనే అనుమతులు వచ్చేశాయని అంటున్నారు. మొత్తానికి పైఅంతస్తులోని వసతి గృహంలో ఉంటున్న బాలికలు కిందకి దిగి ప్రతి రోజూ ఆ వైన్షాపుల ముందు నుంచే వెళ్లాల్సి వస్తోంది. గుడి.. బడి.. ఏదైతే మాకేంటి..! గుడుల వద్ద వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు కొదవ లేదు. దేవదాయ శాఖ పరిధిలోకి రాలేదని చెప్పి జిల్లాలో పలు దేవాలయాల పక్కన, ఎదురుగా వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఎకై ్సజ్ అధికారులు అనుమతులిచ్చేశారు. అవన్నీ టీడీపీ నేతలకు చెందినవి కావడంతో స్థానికులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. పవిత్రమైన దేవాలయాల వద్దకు వెళ్లే భక్తులకు వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు దర్శనం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఎక్కడా స్థలం లేనట్టు దేవాలయాల దగ్గర వైన్షాపులు పెట్టడానికి వ్యాపారులకై నా మనసు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు. డబ్బు కోసం దేవాలయాలు, విద్యాలయాలు కూడా వదలరా అన్న చర్చ జరుగుతోంది. కాశీబుగ్గ పాత జాతీయ రహదారిపై రైల్వే స్టేషన్కు ఎదురుగా రామాలయం, షిర్డీ సాయి ఆలయాలు ఉన్నాయి. వాటి ఎదురుగా ఒక వైన్షాపు, ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది. ఇందులో ఒకటి నగర టీడీపీ నాయకుడిది. -
● అర్ధరాత్రి మృత్యుకేళి
వజ్రపుకొత్తూరు: ఎప్పుడో తోడును కోల్పోయిన ఆ తల్లికి కొడుకు మాత్రమే ఆధారం.. కొడు కు సంపాదనే బతుకు బండిని నడిపిస్తోంది. ఒకే ఒక్క ప్రమాదం ఆ అమ్మను అనాథను చేసింది. ఒక రోజు కిందటే ఇంటికి వచ్చిన మరో యువకుడి భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేసి ఆ కుటుంబానికి శోకం మిగిల్చింది. ఉత్సవాలు చూద్దామని ఉత్సాహంగా వెళ్లిన ఆ ఇద్దరు యువకులు శవాలై ఇంటికి చేరారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వజ్రపుకొత్తూరు మండలం ఉద్దానం గోపీ నాథపురానికి చెందిన కర్ని తులసీరావు (కోదండరావు) (27), కొండవూరు పంచాయతీ గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ(24) ఆదివారం రాత్రి మండలంలోని సైనూరులో జరుగుతున్న చింతలపోలమ్మ తల్లి ఉత్సవాలు చూద్దామని వెళ్లారు. రాత్రి అక్కడ వినోద కార్యక్రమం జరగడంతో అది తిలకించి తిరిగి వస్తుండగా.. ఉద్దానం రామకృష్ణాపురం రహదారిలో పాతటెక్కలి వద్ద స్కూటీతో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 12 నుంచి 2.30 గంటల సమ యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముళ్లపొదల్లో పడి ఉన్న యువకుల మృతదేహాలను సో మవారం తెల్లవారు జామున గుర్తించిన స్థానికులు వజ్రపుకొత్తూరు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబాల్లో కన్నీరు.. కోదండరావు తండ్రి మోహనరావు చాలా ఏళ్ల కిందట మృతి చెందగా తల్లి రాజేశ్వరి ఉన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లే కోదండరావు మృతితో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. మణికంఠ ఒక రోజు కిందటే నెల్లూరు నుంచి వచ్చాడు. అతడికి తల్లిదండ్రులు గంగాధర్, నీలవేణిలతో పాటు ఓ తమ్ముడు ఉన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన బైక్ ఇద్దరు యువకుల దుర్మరణం చింతలపోలమ్మ ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘటన -
పైడి భీమవరం.. సొమ్ములకు క్షవరం
పైడిభీమవరం గ్రామ సచివాలయంరణస్థలం: జిల్లాలో అధిక రాబడి సాధించే పైడి భీమవరం పంచాయతీకి అవినీతి మరకలు అంటుకున్నాయి. పంచాయతీలో 2025–26లో ఉన్న సాధారణ నిధులు రూ.9,43,08,960 ఏడాది లోపే వివిధ పనులు, అడ్వాన్స్ రూపంలో ఖర్చు చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో దాదాపు రూ.3 కోట్లు ఎలాంటి పత్రాలు లేకుండా అడ్వాన్స్ రూపంలో ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధి, టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు మింగేయడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధికి కూడా ముడుపులు అందినట్లు ప్రచారం జరుగుతోంది. కంపెనీల డబ్బే.. జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం పంచాయతీలో గల పారిశ్రామికవాడలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 28 వరకు ఉన్నాయి. అందులో 12 కంపెనీల నుంచి నేరుగా పన్నుల రూపంలో పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. మిగతా కంపెనీలు ఏపీఐఐసీకి పన్నులు చెల్లించినా మళ్లీ ఏపీఐఐసీ నుంచి 30శాతం పంచాయతీకే వస్తుంది. ఏడాదికి సుమారు రూ 2.5కోట్ల వరకు పైడిభీమవరం పంచాయతీకి నిధులు వస్తాయి. వైఎస్సార్ సీపీ హయాంలో పకడ్బందీగా.. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి సర్పంచ్ పదవి రాగా, 14 వార్డు మెంబర్ల స్థానాల్లో వైఎస్సార్సీపీ 10, టీడీపీ 4 వార్డు మెంబర్లు గెల్చుకున్నారు. దీంతో పంచాయతీ డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే వీల్లేకుండా పోయింది. ప్రతి పనీ పద్ధతిగా జరిగింది. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు ఒక్కొక్కటిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మింగేశారిలా.. 2025లో పంచాయతీ తీర్మానం లేకపోయినా ఒకే ఏడాది రూ. 9.43 కోట్లు పైచిలుకు నిధులు అడ్డగోలు లెక్కలు చూపించి విత్డ్రా చేశారు. అందులో ప్రధానంగా సీసీ రోడ్డులు, కాలువలు, కుళాయిలు, విద్యుత్ సామాన్లు, డ్రైనేజ్ పైపులు రూపంలో ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కానీ అవసరం లేని చోట ప్రైవేటు లే–అవుట్లకు ప్రభుత్వ సొమ్ముతో సీసీ రోడ్లు వేశారు. ఎక్కడా బ్లీచింగ్ పౌడర్ కనిపించకపోయినా, ట్రాక్టర్ మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయల పేరుతో భారీగా నిధులు స్వాహా చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆ టీడీపీ నాయకుడి అకౌంట్లో.. పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం రూ. 5లక్షలు దాటి నిధులు డ్రా చేయాలంటే మండల ఉన్నతాధికారుల సంతకాలు కావాలి. అలాంటిది ఎలాంటి అర్హత లేని ఆ గ్రామ సర్పంచ్ ప్రతినిధినని చెప్పుకునే టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు అకౌంట్లో నేరుగా రెండు నెలల వ్యవధిలో అడ్వాన్స్ రూపంలో రూ. 2.52 కోట్లు నిధులు జమ చేయడం హాట్ టాపిక్గా మారింది. ఆ డబ్బులతోనే ఇటీవల పెట్రోల్ బంకు నిర్మించాడనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాగే తాగునీటి పైపులు, కుళాయి ట్యాపులు, ప్లంబింగ్ పనులు రూపంలో సుమారు రూ.2కోట్లు నిధులు బొక్కేశారు. బాసిన లక్ష్మణరావు అనే ప్లంబర్పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రౌతు శ్రీనుకే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడాదిలో సుమారు రూ. 5కోట్లు ముట్టినట్లు సచివాలయ ఉద్యోగుల టాక్. ఇక సీఎం పర్యటనల పేరుతోనూ బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై సీఎంఓకు ఫిర్యాదు వెళ్లింది. కూటమి, నాయకులతోపాటు అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిగ్గు తేల్చాలి.. కూటమి పాలన కాలంలో పైడి భీమవరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలి. మా పంచాయతీలో అక్కడక్కడా మొక్కుబడిగా రోడ్లు వేశారు తప్ప రూ.9 కోట్ల నిధులు ఖర్చు చేసేంత పనులు జరగలేదు. గోల్మాల్ జరిగింది. వీటిపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలి. – పైడిభీమవరం గ్రామ పెద్దలు పైడిభీమవరం పంచాయతీలో సాధారణ నిధులు గోల్మాల్ ఏడాదిలో రూ.9.43 కోట్ల నిధులు మాయం అడ్వాన్స్ రూపంలో నిధులు స్వాహా చేసిన టీడీపీ నేత సీఎంఓకు ఫిర్యాదుతో విషయం బహిర్గతం మేం సంతకాలు చేయలేదు గత ఐదేళ్ల పంచాయతీ పాలనలో వైఎస్సార్సీపీ తరఫున 10మంది వార్డు మెంబర్లు ఉన్నాం. అందులో నేనే ప్రతి సమావేశానికి హాజరయ్యాను. వాళ్లు నిధులు అడ్డగోలుగా ఖర్చు చేస్తామంటే ఎప్పుడూ మా 10మంది ఒప్పుకోలేదు. మరి ఇంత భారీగా ఎలా నిధులు ఎలా స్వాహా చేశారో అర్థం కావటం లేదు. – చింతపల్లి చిన్నా, మాజీ 2వ వార్డ్ మెంబర్, పైడిభీమవరం పంచాయతీ విచారణ జరపాలి పైడిబీమవరం పంచాయతీలో గత ఏప్రిల్ నాటికి రూ.9కోట్లకు పైగా నిధులు ఉండేవి. అందులో చివరి రెండు మీటింగ్లకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు చూస్తే నిధులన్నీ ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మేము ఎక్కడా సంతకాలు చేయలేదు. పంచాయతీలో ఎక్కడా పనులు జరగలేదు. – ఎం.శ్రీను, మాజీ వార్డు మెంబర్, పైడిభీమవరం విచారణ చేస్తాం పైడిభీమవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చాయి. పూర్తి స్థాయిలో ఎంకై ్వరీ చేసి వివరాలు వెల్లడిస్తాం. – ఆర్.స్వరూపరాణి, జిల్లా పంచాయతీ అధికారి -
2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్
● 1998 డీఎస్సీ ఉపాధ్యాయుల ఆందోళన ● మొత్తం ఖాళీలు చూపించడం లేదని ఆవేదన శ్రీకాకుళం: జిల్లాలో 2008 డీఎస్సీ ఉపాధ్యాయులు 108 మందికి జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయించారు. ప్రతిఏటా వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి పాఠశాలలను కేటాయిస్తూ ఉంటారు. దీనిలో భాగంగా సోమవారం వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరితోపాటు 1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులకు కూడా కౌన్సెలింగ్ కోసం పిలిచారు. వీరంతా కలిసి 321 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే 1998 డీఎస్సీకి చెందిన ఉపాధ్యాయులకు రాష్ట్ర అధికారులు ఇచ్చిన హామీ మేరకు కౌన్సెలింగ్ జరగలేదంటూ వారు ఆందోళన చేపట్టారు. కౌన్సెలింగ్ హాల్ ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేసి జిల్లా విద్యాశాఖ అధికారిని నిలదీశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను చూపించాలని డిమాండ్ చేశారు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు రాష్ట్ర అధికారుల ఆదేశాల మేరకు 321 ఖాళీలను మాత్రమే చూపించారు. దీనికి 1998 ఉపాధ్యాయులు అంగీకరించకుండా అన్ని ఖాళీలు చూపించాల్సిందేనని పట్టుబట్టి కౌన్సెలింగ్ బహిష్కరించారు. అధికారుల చర్యలు సరికాదు ఈ సందర్భంగా 1998 డీఎస్సీ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ఇప్పటికే ప్రతి ఉపాధ్యాయుడు 50 నుంచి 150 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారని, ఎటువంటి అలవెన్సులు లేకుండా అతి తక్కువ జీతానికి పనిచేస్తున్న తమకు మరింత దూరం వెళ్లేలా జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని వాపోయారు. 321 స్థానాలు మాత్రమే ఖాళీగా చూపిస్తే.. తమకంటే ముందు నియమించబడిన 2008 ఉపాధ్యాయులు 108 మంది ఉన్నారని, వారంతా దగ్గరలోని ఖాళీలను కోరుకుంటే తాము సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యులు రాష్ట్ర అధికారులతో మాట్లాడినప్పుడు అన్ని ఖాళీలను చూపిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. రాత్రి 8 గంటల వరకు ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. ఇదిలా ఉండగా వీరి డిమాండ్కు తలొగ్గి అన్ని ఖాళీలను చూపిస్తే 2008 ఉపాధ్యాయులకు రీ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
సంబరాలు చాలు.. ఉద్యోగాలు ఇవ్వండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారని, ఈ రెండేళ్లలో ఏం సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్, కొన్న శ్రీనివాస్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో సూర్య మహల్ జంక్షన్ వద్ద సో మవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండేళ్లలో నాలు గు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు ఎన్ని ఉద్యోగాలు ప్రకటించారో చెప్పాలన్నారు. నిరుద్యోగ యువత రోడ్లపై తిరుగుతుంటే.. సంబరాలు చేసుకోవడం సరికాదన్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ చేపట్టాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీచ్ షాక్స్ పేరుతో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30 వేల పైచిలుకు ఉద్యోగాలతో సమగ్ర మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 19,000 పోస్టులను భర్తీ చేసి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని 35 ఏళ్లకు పెంచాలని, ఇతర అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ టౌన్ కన్వీనర్ వేణు, నాయకులు వసంత్, హేమంత్, జగదీశ్, రామోజీ తదితరులు పాల్గొన్నారు. -
● వ్యక్తి అనుమానాస్పద మృతి
నందిగాం: మండలంలోని నౌగాం పంచాయతీ హుకుంపేటలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందారు. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు.. సోమవారం సాయంత్రం గ్రామంలోని ఉపాధి వేతనదారులు పనికి వెళ్లిపోయాక.. గ్రామానికి చెందిన దాసరి సింహాచలం(37) తన ఇంటికి రెండిళ్ల దూరంలో ఉన్న మరొకరి ఇంటిలో గొంతులో తీవ్ర రక్తస్రావమై పడి ఉన్నాడు. బంధువులు ఆయనను గమనించి 108లో టెక్కలి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందాడు. ఆయన మృతి చెందిన విధానంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం తన తల్లి సూరమ్మ, భార్య మణెమ్మతో కలిసి ఉంటున్నాడు. అయితే భార్యతో నిత్యం గొడవపడుతూ ఉండేవాడని సమాచారం. మృతికి గల కారణం పోలీసు దర్యాప్తు పూర్తయితేనే తెలుస్తుంది. -
● తాత మనవడి ఆఖరి ప్రయాణం
పూసపాటిరేగ / కంచిలి: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కంచిలి నుంచి విశాఖపట్నానికి సోమవారం ఉదయం కారులో బయలుదేరారు. తాత, అమ్మమ్మ, మనవలు, కుమార్తె కబుర్లలో మునిగిపోయారు. అల్లుడే డ్రైవింగ్ కావడంతో నిశ్చింతగా ప్రయాణిస్తున్నారు. భోగాపురం మండలం పోలిపల్లి ఫ్లైఓవర్పై కనురెప్పపాటులో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని ఆవలవైపు ఉన్న రోడ్డుపైకి చేరింది. అంతే... అదే సమయంలో శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ కారును బలంగా ఢీకొని 80 మీటర్ల మేర ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో తాతా మనవడు దుర్మరణం చెందగా, నలుగురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికు లు తెలిపిన వివరాల ప్రకారం... కంచిలిలో నివసిస్తున్న మన్యాల సూరిబాబు (60), లక్ష్మి.. ఇంటికి అల్లుడు రాపాక కిశోర్కుమార్, కుమార్తె ఉమామహేశ్వరి, మనవడు రాపాక సాత్విక్ రిహాన్సుహాసన్ (ఏడాదిన్నర), మరో మనవరాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు కొయ్య నేహశ్రీ ఇటీవల కారులో వచ్చారు. అక్కడ పనులు ముగించుకుని రాజమండ్రిలో శుభకార్యానికి హాజరయ్యేందుకు అందరూ బయల్దేరారు. తొలుత విశాఖపట్నం మధురవాడలో నివసిస్తున్న అల్లుడు కిశోర్కుమార్ ఇంటికి చేరుకోవాలనుకున్నారు. మరో అరగంట సమయంలో ఇంటికి చేరుకుంటారనగా.. పోలిపల్లి వద్ద జాతీయరహదారిపై ఉన్న ఫ్లై ఓవర్పై జరిగిన ప్రమాదంలో సూరిబాబు, మనవడు సాత్విక్రిహాన్సుహాసన్ దుర్మరణం చెందారు. మిగిలిన నలుగురు గాయపడ్డారు. -
ఊర్వశిది హత్యే
● ఆస్తి గొడవలతో హత్య చేసిన మరిది ● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులుసోంపేట: మండలంలోని గొల్లవూరు గ్రామంలో ఈనెల 18వ తేదీన పిన్నింటి ఊర్వశిని ఆస్తి గొడవల కారణంగా మరిదే హత్య చేసినట్లు కాశీబుగ్గ డీఎస్సీ టి.భవానీ వెల్లడించారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో స్థానిక సీఐ బి.మంగరాజుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.భవానీ మాట్లాడుతూ.. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన గోకర్ల లోకనాథం తన రెండో కుమార్తె పిన్నింటి ఊర్వశి మృతిపై అనుమానం ఉందని బారువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోకనాథం ఫిర్యాదు మేరకు బారువ ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. సోంపేట సీఐ బి.మంగరాజు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగిందన్నారు. మృతురాలి భర్త రాజారావుకు అన్న జయరాం, తమ్ముడు శివకుమార్ ఉన్నారు. రాజారావు కుటుంబానికి, మిగతా కుటుంబ సభ్యులకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో సమావేశాలు నిర్వహించినా మృతురాలి మరిది శివకుమార్ పెద్దల తీర్పునకు అంగీకరించలేదు. ఈ క్రమంలో మృతిరాలి భర్త మూడు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మృతురాలు ఊర్వశి భూ సమస్యల పరిష్కారం కోసం బావ జయరాం, మరిది శివకుమార్, తోటికోడలు పిన్నింటి యశోదకు లాయర్ నోటీసులు పంపించింది. అవి వారికి 17వ తేదీన అందాయి. – దాడిచేసి హత్య నోటీసులు రావడంతో మృతురాలి మరిది శివకుమార్ కక్ష పెంచుకుని 18వ తేదీ ఉదయం మృతురాలిని ఏమైనా చేస్తానని గ్రామ పెద్దల వద్ద బెదిరించాడు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలి ఇంటి నుంచి కంగారుగా వస్తూ పారిపోయినందున శివకుమార్ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. 22వ తేదీన మందస మండలంలోని జిల్లుండి వద్ద శివకుమార్ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో 18 తేదీన ఉదయం 9.10 గంటల నుంచి 9.30 గంటల ప్రాంతంలో మృతురాలిపై దాడిచేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో మంచంపై మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ముద్దాయి నుంచి నేరం చేసిన సమయంతో ధరించిన రక్తం మరకల దుస్తులు, ఉపయోగించిన స్కూటీ, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు సీఆర్పీఎఫ్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తుండడం విశేషం. సమావేశంలో బారువ ఎస్ఐ ఎస్.హరిబాబు నాయుడు ఉన్నారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్లో 155 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ అర్జీలపై అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. మొత్తం 155 ఆన్లైన్ అర్జీలు స్వీకరించగా.. వాటిలో రెవెన్యూ 52, పంచాయతీ రాజ్ 22, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ 14, వ్యవసాయ శాఖ 9, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 7, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ 6, హోం శాఖ 6, ఏపీఈపీడీసీఎల్ 6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 5, గ్రామీణ నీటి సరఫరా 5, వాటర్ రిసోర్సెస్ ఈఎన్సీ 4, మైన్స్ అండ్ జియాలజీ 3, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, బీసీ సంక్షేమం 2, పబ్లిక్ హెల్త్ 2, పౌర సరఫరాలు, మెడికల్ ఎడ్యుకేషన్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు నుంచి ఒక్కొక్కటి చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం రెడ్క్రాస్కు సంబంధించి కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరం చేయూత గోడ పత్రికను ఆవిష్కరించారు. పలు వినతులు పరిశీలిస్తే... ● విశ్రాంత ఉద్యోగుల పింఛన్ బకాయిలు, ఇతర బకాయిలు చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పీజీఆర్ఎస్ లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు శ్యామ్, జనరల్ సెక్రటరీ కేటీ నాయు డు, కోశాధికారి వాసుదేవరావు, కార్యదర్శి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాల్గొన్నారు. ● ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినతి అందజేశారు. అంతకుముందు వారు జెడ్పీ ముందు నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం కర్కశత్వంతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 43,300కు తగ్గిందన్నారు. ఒకప్పుడు అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే, ఇప్పుడు 10,700 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుమారు రూ.700 కోట్లు నిధులు వెచ్చించి 1,459 బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డొప్ప రాము తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఏఐవైఎఫ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. మందుగా వారు ఎన్జీవో హోం నుంచి ర్యాలీగా పీజీఆర్ఎస్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ రెండేళ్లలో కూటమి నాయకులు ఏమి సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్, కొన్న శ్రీనివాస్లు ప్రభుత్వానికి సూచించారు. ● విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
ఇళ్లు కేటాయించని డిపాజిట్లు వెనక్కి
శ్రీకాకుళం: టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టి, గృహాలు పొందలేకపోయిన లబ్ధిదారులకు వాటిని వెనక్కి ఇచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు దశాబ్ధ కాలం క్రితం నగరవాసులు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,820 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించారు. వీరి నుంచి కేటగిరీల వారీగా రూ.25,000, రూ.50,000, రూ.లక్ష డిపాజిట్లుగా తీసుకున్నారు. అయితే వీరిలో 1,904 మందికి మాత్రమే ఇళ్లను కేటాయించారు. అప్పటినుంచి మిగిలిన 1,916 మంది తమకు ఇళ్లను కేటాయించాలని, లేనిపక్షంలో డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేందుకు నిధులను కేటాయించింది. ఇదిలా ఉంటే తమకు ఎటువంటి వడ్డీ లేకుండా పన్నెండేళ్ల తర్వాత డిపాజిట్లను వెనక్కి ఇస్తున్నారని, అదే బ్యాంకులో వేస్తే ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుందని, ఈ లెక్కన తమ డిపాజిట్ డబ్బు రెండుసార్లు రెట్టింపు అయ్యేదని లబ్ధిదారులు అంటున్నారు. వడ్డీతో సహా చెల్లించాలని కోరుతున్నారు. కాగా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు డిపాజిట్ చెల్లించినప్పుడు కార్పొరేషన్ నుంచి ఇచ్చిన రశీదును కార్పొరేషన్ కార్యాలయంలో గానీ, సచివాలయాల్లో గానీ అందజేయాలని సూచిస్తున్నారు. అయితే సగం మంది లబ్ధిదారుల వద్ద అప్పట్లో ఇచ్చిన రశీదు లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రెవెన్యూ క్లినిక్లో 60 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. పీజీఆర్ఎస్లో భాగంగా సోమవారం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ను ఏర్పాటు చేశారు. కలెక్టర్తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య అక్కడ ఏర్పాటు చేసిన అన్ని కౌంటర్లను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్లో 60 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల సందర్శన శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ రాజ్యలక్ష్మి సోమవారం సందర్శించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. భోజన శాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. పాఠశాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవికి సూచించారు. ఆమెతో పాటు పాఠశాల సిబ్బంది ఉన్నారు. సోంపేట: మండలంలోని తోటవూరు గ్రామానికి చెందిన రిక్కభరత్(21) శనివారం రాత్రి హైదరాబాద్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు చందానగర్లోని వీఆర్ షటిల్ కోచింగ్ సెంటర్లో షటిల్ కోచ్గా విధులు నిర్వహిస్తున్నాడు. షేర్లింగపల్లిలోని ఒక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు ఆదివారం సమాచారం అందింది. మృతదేహం సోమవారం తోటూరు గ్రామానికి చేరింది. అయితే మృతుడి తండ్రి ఇదివరకే మరణించడంతో.. కొడుకు మృతదేహానికి తల్లి లీలావతి అంత్యక్రియలు నిర్వహించారు. భరత్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. -
అప్రమత్తతే కీలకం..!
విద్యుత్ ప్రమాదం.. సమాచారం ఇవ్వాలి వర్షాకాలంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశాలున్నాయి. వీధిలో గాలి, వర్షాలకు తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. మరమ్మతులు చేయిస్తాం. విద్యుత్ సమస్యలపై వెంటనే సమచారం ఇవ్వాలి. – జి.ప్రసాదరావు, విద్యుత్ శాఖ ఏడీ, పాతపట్నం పాతపట్నం: ప్రస్తుతం ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇటువంటి సమయాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏమ్రాతం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు. ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. వర్షంలో వైర్లు తెగిపడినట్లు గుర్తిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● తడి చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్లు తాకవద్దు. ● విద్యుత్ సంబంధిత మరమ్మతులు సొంతంగా చేయకూడదు. ● సిబ్బంది సెల్ఫోన్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. ● వీధుల్లో, పొలాల్లో తడిచిన విద్యుత్ స్తంభాలను తాకకూడదు. ● తోటలు, పొలాలు వంటి ప్రదేశాల్లో విద్యుత్ తీగలు పడితే 1912కు కాల్ చేయాలి. ● విద్యుత్ తీగలపై బట్టలు ఆరవేయకూడదు. ● విద్యుదాఘాతం సంభవిస్తే వెంటనే సరఫరా నిలిపివేయాలి. బాధిత వ్యక్తిని ప్లాస్టిక్ లేదా ఎండిన కర్రతో వేరుచేయాలి. వానాకాలంలో జాగ్రత్తలు అవసరం లేకుంటే ప్రాణాలకే ప్రమాదం జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన


