Srikakulam
-
ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. కొత్తగా బాబు మరో హామీ
నరసన్నపేట/పోలాకి/సారవకోట/టెక్కలి : రాష్ట్రంలో ఎన్నికలప్పుడు చంద్రబాబునాయుడు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో పాటు వైఎస్ జగన్ ప్రభుత్వంలో కొనసాగిన పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పి.. తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పిన తరుణంలో ఆయా పథకాల బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తల్లికి వందనం పథకాన్ని కొందరికే ఇవ్వడంతో పాఠశాలల్లో పిల్లల చేరికలు తక్కువైపోయాయి.విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బాట పట్టారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు ఇచ్చే కిట్లో నాణ్యత కొరవడింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలన్నింటినీ నీరుగార్చేసింది. ప్రజలకు ఏ పథకాలూ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న ఒకరిద్దరు పిల్లల పోషణకే అష్టకష్టాలు పడుతున్నారు. ఈ తరుణంలో ముగ్గురు, నలుగురిని కనాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునివ్వడం విస్తుగొలుపుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణకు కృషి చేశామని, ఇప్పుడు పరిస్థితులు మారినందున ఎక్కువ మంది పిల్లలను కనాలని.. పిల్లల బాగోగులు తాను చూస్తానని తాజాగా సెలవిచ్చారు.స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు వచ్చారు. నరసన్నపేటలోని పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదికలో మాట్లాడుతూ.. స్త్రీలు సృష్టికర్తలని, ఎంత మందికి వీలైతే అంతమందిని కనాలని అన్నారు. మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేలు ప్రభుత్వ పరంగా పురిటి మంచంçపైనే ఇస్తానని చెప్పారు. పనుల కోసం శ్రీకాకుళం వాసులు వలసలకు వెళ్లాల్సిన పని లేకుండా చేస్తానన్నారు. శ్రీకాకుళం జిల్లావాసులు లిటిగెంట్లని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.జిల్లా అభివృద్ధి కాకపోవడానికి మీరే కారణమంటూ ప్రజలపై నింద వేశారు. ప్రజలు సహకరిస్తే పలాసలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పారు. 23 నెలల్లో రూ. 24 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని, వీటి ద్వారా 24 లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని అన్నారు. నెల వారీ పింఛన్, ఇతర సంక్షేమ పథకాల కోసం పన్నులు పెంచాల్సి వస్తుందని చెప్పారు. అన్ని రంగాల్లో ప్రైవేటు పబ్లిక్ పీపుల్ పార్టనర్షిప్ (పీపీపీ) అమలు చేస్తామని, దీని ద్వారానే సంపద సృష్టిస్తామని చెప్పారు. మా భూమిని టీడీపీ ఎమ్మెల్యే వియ్యంకుడు ఆక్రమించారుసాక్షి, నెట్వర్క్: నరసన్నపేటలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వియ్యంకుడిపై నేరుగా సీఎంకు ఫిర్యాదు చేసేందుకు ఓ మహిళ సిద్ధమైంది. అయితే సీఎంను కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో ఆవేదనతో వెనుదిరిగారు. పోలాకి మండలం కుసుమపోలవలసకు చెందిన ఆర్మీ జవాను కొయ్యాన లక్ష్మణరావుకు చెందిన దాదాపు 60 సెంట్ల పొలం ఎమ్మెల్యే వియ్యంకుడు భైరి వెంకటరావు కబ్జా చేసి, ఇటీవల నిర్వహించిన రీసర్వేలో రికార్డులు మార్పించుకున్నారని జవాను భార్య భవానీ ఆరోపించారు.కలెక్టర్ను సంప్రదించినా ఫలితం లేదని, ఎమ్మెల్యే రమణమూర్తి దగ్గరకు వెళ్లి ఆయన వియ్యంకుడి తీరుపై ఫిర్యాదు చేస్తే, కోర్టుకు వెళ్లాలని ఉచిత సలహా ఇచ్చారని తెలిపారు. ఒక ఆర్మీ జవానుకు చెందిన భూమిని ఇలా లాక్కోవడంపై సీఎంకు ఫిర్యాదు చేద్దామని వస్తే దగ్గరకు వెళ్లనివ్వలేదని, న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
చంద్రబాబు చేసిన మేలేమిటి..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పలాస కిడ్నీ హాస్పటల్, రిమ్స్ మెడికల్ కాలేజ్, కలెక్టరేట్ నిర్మాణం, హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్, మూలపేట పోర్టు, వంశధార ఫేజ్–2, స్టేజ్–2, ఫిషింగ్ హార్బర్లు వంటి అనేక పనులు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వచ్చి హార్బర్ పనులు నిలిపివేశారని, నరసన్నపేటకు వచ్చి చెత్త నుంచి సంపద సృష్టించడం నేర్పిస్తామంటున్నారని చురకలు అంటించారు. ఈ మాత్రం దానికే జిల్లాకు రావాలా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వేదికపై హామీలు ఏం చేశారో చెప్పలేదని, అంతా వైఎస్సార్సీపీపై విమర్శలకే సరిపోయిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు చెబితే పేదోడి గుండె చప్పుడు, సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు వస్తాయని అన్నారు. ఫీజు రీ యింబర్స్మెంట్, రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు రుణమాఫీ, ఉచిత పంటల బీమా ఊసే లేకపోవడం అన్యాయమన్నారు. వైద్యం, విద్యను అందని ద్రాక్షగా మార్చేశారన్నారు. చంద్రబాబు, కూటమి అబద్ధాలను ప్రజలు గమనించాలని కోరారు. -
శ్రీకాకుళం
నిర్లక్ష్యం నీడలో.. జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వాహనాలు నిరుపయోగంగా ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు. –8లోబెట్టింగ్ జోరు..ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్లో జోరుగా సాగుతోంది. యువత నష్టపోతున్నారు. –8లోఅన్ని షాపులు మూసినా మందు షాపుల వద్ద తమ్ముళ్ల హడావుడి మామూలుగా లేదు. అందరూ వెళ్లినా కార్యకర్తలు మాత్రం లోపలకు వెళ్లలేకపోయారు. పోలీసులతోనూ వాగ్వాదం చేశారు. సీఎం ప్రసంగం కొనసాగుతుండగా బయటకు వెళ్లిపోతుంటే.. పోలీసులు తాళ్లు కట్టి మరీ ఆపారు. సీఎం పర్యటనలో చిత్రాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం -
జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణం టీడీపీ
● సీఎం పర్యటనపై వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ ఘాటు విమర్శలు నరసన్నపేట: జిల్లా వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం టీడీపీ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులు కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ సీపీని గొడ్డలి పార్టీ అని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఎన్సీఆర్బీ నివేదిక అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన 23 నెలల్లో ఒక్క కొత్త పరిశ్రమ జిల్లాకు తీసుకువచ్చారా.. అని సూటిగా ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులు నిలువునా మోసపోతుంటే వారి కోసం ఒక ప్రకటన చేయలేకపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పర్యటన అంతా ఆర్భాటమే తప్ప జిల్లాకు ఒరిగింది ఏమీ లేదన్నారు. ఉత్తరాంధ్ర వలసల నివారణ, జిల్లా ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ పాత ముచ్చట్లేనని కృష్ణదాస్ అన్నారు. వంశధార, మడ్డువలస, నేరడి బ్యారేజి, జంఝావతి గురించి మా ట్లాడిన చంద్రబాబు గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు, మూలపేట పోర్టు, బుడగట్ల పాలెం హార్బర్, ఉద్దానం కిడీ రీసెర్చ్ సెంటర్ వంటి చారిత్రాత్మక ప్రాజెక్టులు నిర్మిస్తే.. వాటికి రంగులేసుకుంటూ టీడీపీ తన ఖాతాలోకి వేసుకోవడం సిగ్గు చేటన్నారు. పలాసలో ఎయిర్పోర్టు నిర్మిస్తామనడం ప్రజలను మళ్లీ మోసం చేయడమేనన్నారు. -
●కనిపించని పొదుపు.. అంతా మదుపే
ప్రజలంతా పొదుపు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. అయితే పొదుపు కేవలం ప్రజలకు మాత్రమేనని తమకు కాదని సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన తేటతెల్లం చేసింది. స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి భారీ కాన్వాయ్ ఉపయోగించారు. జనాల తరలింపు కోసం విస్తృతంగా వాహనాలను వాడారు. పొదుపు పాటిస్తున్నామంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు రోడ్డుకు ఒక మార్గంలో కేవలం నాలుగు వాహనాల తో సీఎం చంద్రబాబు కాన్వాయ్ ప్రజావేదిక వరకు కొనసాగింది. మరో మార్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులతో భారీ కాన్వాయ్ సభా ప్రాంగ ణం వద్దకు చేరుకుంది. వీటితో పాటు తామరాపల్లి వద్ద నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి సైతం అధిక సంఖ్యలోవాహనాల తరలింపు కనిపించింది. -
‘అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు అన్నారు. సీఎం చంద్రబాబు జిల్లాకు వచ్చిన సందర్భంగా గోవిందరావు, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి. సింహాచలం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాద్లను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. సీఎం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా సమస్యలను తప్పుదోవ పట్టించడానికి అక్రమ అరెస్టులకు పూనుకుంటున్నారని విమర్శించారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని, కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని, సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పొద్దని, బలవంతపు భూసేకరణ ఆపాలని, సరుబుజ్జిలి థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. టెక్కలి: ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలనే ప్రధాన డిమాండ్తో శనివారం టెక్కలి ఆర్టీసీ డిపో ఎదుట ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేట్పరం చేయాలనే ఆలోచన మానుకోవాలని, స్తీశక్తి పథకం నిర్వహణకు అవసరమైన 3 వేల కొత్త బస్సులు వేయాలని, విద్యుత్ బస్సు ఆపరేటర్ల కోసం డిపోలను ఖాళీ చేయించే ఆలోచనలు మానుకోవాలని, ఎలక్ట్రికల్ బస్సులను సంస్థ సొంతంగా నిర్వహించాలని ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు జాయింట్ సెక్రటరీ ఎస్.రాజులు, డిపో ప్రెసిడెంట్ కే.బీ.రావ్, మురళి, డీఎల్ రా వ్తో పాటు మిగిలిన నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామంలో పాతపట్నం మాజీ ఎమ్మెల్యే (1972–78) చుక్క పగడాలమ్మ మరణంపై కాంగ్రెస్ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. పగడాలమ్మ చిత్ర పటానికి పూలమాలతో నివాళులు అర్పించి కాంగ్రెస్ పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పగడాలమ్మ నిరాడంబర జీవితం, నిస్వార్థ రాజకీయం ఇప్పటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయంగా ఉండాలన్నారు. ప్రజాసేవే పరమావధిగా భావించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని అందుపుచ్చుకొని అనంతరం సామాన్య జీవితాన్ని అనుభవించారని గుర్తుచేసుకున్నారు. -
డెంగీ నివారణకు అవగాహన ర్యాలీ
అరసవల్లి: జాతీయ డెంగీ నివారణా దినోత్స వం సందర్భంగా శనివారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం నుంచి అధికార సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయం నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు వెళ్లి డెంగీ నివారణ అవగాహనకు నినాదాలు చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో డాక్టర్ అనిత, జిల్లా మలేరియా అధికారి పి.వి.సత్యనారాయణ, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి ఎచ్చెర్ల : ట్రిపుల్ఐటీ కళాశాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆర్జీయూకేటీ వీసీ మద్దాలి లక్ష్మీనారాయణ సూచించారు. శనివారం శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలో పనిచేస్తున్న నాన్టీచింగ్ సిబ్బంది వీసీని మర్యాదపూర్వకరంగా కలిశారు. ఈ సందర్భంగా వీసీ పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు తదితరులు పాల్గొన్నారు. ‘ఆ భూమి వారసత్వ ఆస్తి’ కంచిలి: కేసరపడ కాలనీకి ఆనుకొని సర్వే నంబర్:468/2, 468/3 లలో ఉన్న 19 సెంట్ల స్థలం తన భర్త సల్ల షణ్ముఖరావుకు వారసత్వంగా వచ్చిన ఆస్తి అని భార్య సల్ల సావిత్రి తెలిపారు. ఈ భూవివాదాన్ని పరిష్కరించాలంటూ కొందరు కాలనీవాసులు పాత్రికేయ సమావేశంలో శుక్రవారం కోరిన మేరకు భర్త ఉపాధి కోసం బయట రాష్ట్రంలో ఉండటంతో ఆయన తరఫున వివరణ ఇచ్చారు. తన భర్తకు ఉమ్మడి కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి అని, తమ వద్ద ఉన్న పట్టాదారు పాస్ పుస్తకం తదితర ఆధారాల జెరాక్స్ కాపీలను విలేకర్లకు అందజేశారు. దీన్ని ప్రభుత్వ పోరంబోకు భూమిగా కొందరు స్థానికులు చిత్రీకరించడం సరికాదన్నారు. తమకు చెందిన స్థలంలో ఇప్పటికే ఓవర్హెడ్ ట్యాంకు, కాలనీ ఇళ్లు నిర్మించారని, ఇటీవల దౌర్జన్యంగా సిమెంటు రోడ్డు ప్రభుత్వ నిధులతో నిర్మించారని వాపోయారు. తమకు చెందిన జిరాయితీ భూమిలో ఎటువంటి పరిహారం ఇవ్వకుండా నిర్మాణాలు చేపట్టడం తగదన్నారు. ఈశాన్య ప్రాంత ప్రత్యేక సెల్ ఏర్పాటు శ్రీకాకుళం పాతబస్టాండ్: ఈశాన్య ప్రాంత ప్రజల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తి, చదువు నిమిత్తం ఈశాన్య ప్రాంతాల నుంచి శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చిన ప్రజల కోసం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందన్నారు. వీరికి ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లను నియమిస్తామన్నారు. కారు ఢీకొని వ్యక్తికి గాయాలు హిరమండలం: ఎల్ఎన్పేట మండల కేంద్రం సమీపంలో కోవిలాం కాలనీ వద్ద అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రావిచంద్రి గ్రామానికి చెందిన శ్రీనివాసరావు గాయపడ్డాడు. రావిచంద్రి నుంచి ఎల్ఎన్పేట మండలకేంద్రానికి బైక్పై వస్తుండగా హిరమండలం వైపు నుంచి ఆమదాలవలస వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ తిప్పలు హిరమండలం : ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల ఆగచాట్లు తప్పడం లేదు. అసలే మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే అడ్మిషన్ల టార్గెట్ వారిని మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు టార్గెట్ పెట్టి వీధుల్లో పరుగెత్తిస్తుంటే ..మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో టీచర్లను పల్లెలకు తీసుకువెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతో పాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిళ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యాసంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు రెన్యువల్ ఉండదని భయపెడుతున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో విహారయాత్రలకు కుటుంబసభ్యులతో వెళ్లాల్సిన సమయంలో పల్లెలు, పట్టణాల్లో తిరగాల్సి వస్తోందని ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు 600 మందికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులపై టార్గెట్ విధిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10 అడ్మిషన్లు చేయించాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి ఉపాధ్యాయులను అడ్మిషన్ల కోసం ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీతత్వం పెరగడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఎవరికి వారు తాపత్రయపడుతున్నారు. -
పోలీసుల పట్ల కనికరమేదీ ?
● ముఖ్యమంత్రి పర్యటనలో భారీ బందోబస్తు ● దాదాపు 10 గంటలు ఎండలో నిల్చునే విధులు శ్రీకాకుళం క్రైమ్ : నెలలో కనీసంగా 5 నుంచి 10 వరకు బందోబస్తు విధులు.. జిల్లాలోనే కాదు జిల్లాను దాటి కూడా వెళ్లాల్సిందే. అందులో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రతి చిన్న విషయానికీ భారీ సమావేశాలు, ముఖ్య నేతల పర్యటనలు, అధికారులతో రివ్యూలు, దేవాలయాల్లో ఉత్సవాలు, రాష్ట్ర పండగల పేరిట పోలీసుల బందోబస్తు.. ఏమాత్రం నిర్వహణలో తేడాలొచ్చినా, శాంతిభద్రతల్లో విఘాతమేర్పడినా అప్పటివరకు అంతా తామే అన్న రీతిలో వ్యవహరించే నేతలంతా తప్పుకొని పోలీసుల మీదే తప్పులను నెట్టేస్తారు. గత కొంతకాలంగా ఇదే తంతు జిల్లాలో నడుస్తోంది. శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలోని నరసన్నపేటలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర పేరుతో పర్యటనకొచ్చారు. దీనిలో భాగంగా హోంగార్డు నుంచి ఎస్పీ వరకు దాదాపు 1500 మందికి పైగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో రెండురోజులు ముందుగానే విధుల్లో అంతా చేరారు. శనివారం ఉదయం 7 నుంచి చంద్రబాబు తిరుగుపయనమైన సాయంత్రం 5 గంటల వరకు ఎండలో నిల్చునే విధుల్లో పాల్గొన్నారు. పొదుపు ఒట్టిమాటే..! ప్రధాని మోదీ పిలుపు మేరకు ఇంధనాన్ని పొదుపుగా వాడండి.. వాహనాలను కుదించుకోండి.. సమావేశాల్లో బందోబస్తు తగినంత మాత్రమే పెట్టుకోండన్న మాటలు చంద్రబాబు పర్యటనకు వర్తించవా అన్నది స్థానికులు చర్చించుకుంటున్నారు. కొందరు పోలీసులైతే ఇవేం బందోబస్తులండీ.. వెళ్తే అన్ని ఖర్చులూమావే.. ఇలాంటి వాటికి టీఏలు ఏమీ ఇవ్వరు.. గడిచిన మూడు బందోబస్తుల్లో ఇదే పరిస్థితి అని వాపోయారు. వాస్తవానికి పీసీ, హెచ్సీ, ఏఎస్ఐల వరకు నెలకు రూ.2,200లు టీఏ ఇవ్వాలి, ఎస్ఐ, సీఐలకు రూ. 3,500లు, డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 5 వేలు ఇవ్వాలి. గడిచిన 6 నెలలుగా ఇవి రావడం లేదని, నాయకుల సమావేశాలకు తాము పడుతున్న పాట్లు ఎవరూ పట్టించుకోవడంలేదంటూ పోలీసులు చర్చించుకోవడం గమనార్హం. ఇక పోలీసు వాహనాల్లో డీజిల్ ఖర్చు కూడా ఇలాంటి సమావేశాలకు, బందోబస్తులకు ఎంతవుతుందో ప్రభుత్వ పెద్దలే గ్రహించాలని వాపోతున్నారు. -
బొలెరో వ్యాన్ బోల్తా
ఎచ్చెర్ల: ఫరీదుపేట పంచాయతీ పరిధిలోని కోయిరాళ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం బొలెరో వ్యాన్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వాటర్ బాటిళ్లతో వస్తున్న వ్యాన్ కొయిరాళ్ల జంక్షన్ వద్దకు వచ్చేసరికి టైరు పేలి బోల్తాపడింది. ఆ సమయంలో అటుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెట్రోలింగ్ పోలీసులు, ఎన్హెచ్ఎఐ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై వాహనాలు మళ్లించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెట్టింగ్ జోరు!
● ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ రూ.లక్షల్లో అర్జన ● కోల్కతాలో విశాఖ బెట్టింగ్ ముఠా అరెస్టు ● జిల్లాలో ముఠా కదలికలపై ప్రత్యేక బృందాల నిఘా ఐపీఎల్ పోరు..శ్రీకాకుళం క్రైమ్ : ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ దేశవ్యాప్తంగా మంచి జోరు మీద సాగుతోంది.. ఇటీవలే విశాఖ పోలీసులు కోల్కతాలో అతిపెద్ద బెట్టింగ్ ముఠాలోని 8 మంది బుకీలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 234 బ్యాంకు అకౌంట్లు (మ్యూల్ఖాతాలు) గుర్తించి రూ.500 కోట్ల లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు. విస్తరించిన బెట్టింగ్ సామ్రాజ్యంలోని మరికొంతమంది రూ.1500 కోట్ల వరకు లావాదేవీలు జరిపివుంటారని అంచనా వేశారు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ ఈ బెట్టింగ్ జోరు మరింత ఊపందుకున్నట్లు సమాచారం. ‘జిల్లాలో ఎటువంటి బెట్టింగ్ ముఠాలు లేవు.. ఎటువంటి డెన్లు లేవు.. వారి ఆటలు ఇక్కడ సాగడం లేదు..’ అంటూ పోలీసులు బయటకు చెబుతున్నా చాపకింద నీరులా ఇక్కడో ‘డాన్ బుకీ’ తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తుండటంతో ఆధారాలతో సహా పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. నేతల అండదండలతో.. ఒకప్పుడు చిన్నా చితకా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ, కేసులను ఎదుర్కొంటూ పోలీసుల నుంచి తప్పించుకుని బెట్టింగ్నే ఇంటిపేరుగా మార్చుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు రూ.కోట్లకు పడగలెత్తి నాయకుల అండదండలతో బెట్టింగ్ మాఫియాలో ‘కీ’రన్నర్గా ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. మరో కీలక బుకీతో కలసి గోవా కేంద్రంగా మన జిల్లాలోని 10 మంది నిర్వాహకులతో కలసి బెట్టింగ్ నడుపుతున్నట్లు ప్రచారంలో ఉంది. కోల్కతా కేంద్రంగా మరో కీలక వ్యక్తి మరో 9 మందితో కలసి బెట్టింగ్ నడుపుతున్నట్లు సమాచారం. తానేం చేయడంలేదని పోలీసుల వద్ద నమ్మబలుకుతూనే కీప్యాడ్ మొబైళ్లను నిర్వాహకులకిచ్చి అంతా మేనేజ్ చేస్తున్నట్లు భోగట్టా. ప్రత్యేక యాప్ల ద్వారా.. విదేశాల్లో లభ్యమయ్యే ప్రత్యేక బెట్టింగ్ యాప్లలో ఓ యాప్ను కొనుగోలు చేసిన మన బుకీడాన్ కూడా విశాఖలో పట్టుబడిన గబ్బర్ మాదిరిగానే గోవా కేంద్రంగా చేసుకుని మరికొన్ని రాష్ట్రాల వ్యక్తులతో కలసి సిండికేట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బుకీడాన్ ఇచ్చిన కీప్యాడ్ మొబైల్ నుంచి వచ్చే రిసీవ్కాల్ ద్వారా నిర్వాహకులు ఇక్కడ బెట్టింగ్పై ఆసక్తి ఉండే యువకులను ముఖ్యంగా వ్యాపార వర్గాల వారిని ఎంచుకున్న ప్రదేశానికి పంపించడం.. లేదంటే ఆట కొనసాగేటప్పుడు వారికి లింక్పంపించి మొబైల్లో యాప్ను డౌన్లోడ్ చేసేలా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీనిలో ప్రధానంగా బోత్90 గేమ్ నడుస్తోంది. అంటే గేమింగ్లో బాల్ టు బాల్ (బాల్కు సిక్స్ వస్తుందని, వికెట్ వస్తుందని, బౌండరీ వస్తుందని ఇలా.. ), ఓవర్ టు ఓవర్ (ఓవర్లో ఎక్కువ రన్లు కొడతారని, ఎక్కువ వికెట్లు తీస్తారని), మ్యాచ్ టూ మ్యాచ్ (ఇండియా గెలుస్తుందని, లేదా వేరే దేశం గెలుస్తుందని) ఆటగాడు సెంచరీ కొడతాడని, కొట్టడని మొత్తంపైన ఎస్ ఆర్ నో ఉంటుంది. మనం బెట్టింగ్లో రూ. లక్ష పెడితే గెలిస్తే రూ. 90 వేలు అదనంగా వస్తుంది. ఓడితే రూ.లక్ష పోతుంది. అంటే నిర్వాహకులకు వెళ్లేది 10 శాతం కమీషన్.. ఆ వివరాలిస్తే అంతే.. విశాఖ మారికివలసకు చెందిన రవిశంకర్ తన ప్రమేయం లేకుండా డబ్బులొస్తాయనే ఆశతో బెట్టింగ్ మాఫియాకు చెందిన త్రినాథ్, జగదీష్లకు 60 మ్యూల్ఖాతాలు (తనకు తెలిసినవారి వద్ద అవసరం లేకపోయినా బ్యాంకు ఖాతాలు రూ.5 వేలకు ఆశపడి) తెరిపించి బుక్కయ్యాడు. అవే ఖాతాల్లో వారు రూ.లక్షల్లో బెట్టింగ్ లావాదేవీలు జరిపినట్లు తెలుసుకుని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అందుకే ప్రతీ ఖాతాదారుడు తన ప్రమేయం లేకుండా ఎవరికీ బ్యాంకు అకౌంట్లు, ఏటీఎం కార్డులు, పిన్నెంబర్లు, ఓటీపీ నెంబర్లు ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత కూడా ఎటువంటి బెట్టింగ్ యాప్ల జోలికి పోవొద్దని, అప్రమత్తంగా ఉండాలని హితవు పలుకుతున్నారు. -
సారాతో ఇద్దరి అరెస్టు
కంచిలి: గొల్లకంచిలి వద్ద 100 ప్యాకెట్ల సారాతో ఇద్దరు వ్యక్తులను సోంపేట ఎకై ్సజ్ సీఐ జి.వి. రమణ శనివారం అరెస్టు చేశారు. వీరి నుంచి సరకుతోపాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ముద్దాయిలుగా ఉన్న బురదపాడు గ్రామానికి చెందిన గేదెల మోహనరావు, గొల్లకంచిలికి చెందిన దుబ్బ ధర్మారావులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో వీరు నాటుసారా ప్యాకెట్లను ద్విచక్ర వాహనంపై తీసుకొస్తుండగా ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిపై గతంలో కూడా పలు కేసులు ఉండటంతో, సోంపేట కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ జగన్నాథ్, సిబ్బంది భానుప్రసాద్, ఉమాపతి, మార్కారావు పాల్గొన్నారు. -
ఐసెట్లో అదుర్స్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీ ఐసెట్–2026 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. శనివారం వెలువడిన ఫలితాల్లో పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు నిర్వహించిన ఐసెట్ ఫలితాల్లో రికార్డు స్థాయిలో 96 శాతం మంది ప్రవేశాలకు అర్హత సాధించారు. జిల్లాలో మే 2న ఐసెట్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. జిల్లా నుంచి 683 మంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగా పరీక్షకు 590 మంది హాజరయ్యారు. వీరిలో 566 మంది ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హత సాధించారు. మెరుగైన ర్యాంకులు.. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న మురపాక లిఖిత 133వ ర్యాంకు, జె.లోలాక్షి 199వ ర్యాంకు, పంచిరెడ్డి హారిక 243, కె.జయవర్ధన్ 259వ ర్యాంకు, ఎం.సోమినాయుడు 425వ ర్యాంకు, ఎ.కోమలి 543వ ర్యాంకు, ఏఎస్వీ నిహాల్వర్షిత్ 712వ ర్యాంకు, కుమారి యజ్ఞప్రియ 955వ ర్యాంకుతో రాణించారు. వీరంతా శ్రీకాకుళంలోని కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్ధులు కావడం విశేషం. సర్కారు వైఫల్యం.. ఉన్నత చదువులకు దూరం! కాగా, కూటమి ప్రభుత్వం వైఫల్యం కారణంగా ఉన్నత చదువులకు విద్యార్థులు దూరమైపోతున్నారు. చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను సకాలంలో చెల్లించకపోతుండటంతో భారీ మొత్తంలో ఫీజులు చెల్లించుకుని చదువుకొనే అవకాశం లేని విద్యార్థులు ఉన్నత చదువులకు స్వస్తి పలుకుతున్నారు. గతంలో వేల సంఖ్యలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం వందలకు పడిపోయిందంటే కూటమి ప్రభుత్వ పాలన.. విద్యకు వారు ఇస్తున్న ప్రాధాన్యం ఏంటో అర్ధమౌతోంది. మెరుగైన ర్యాంకులు సాధించిన జిల్లా విద్యార్థులు రికార్డు స్థాయిలో 96 శాతం మంది అర్హత -
‘ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే’
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని ప్రతీ ప్రాజెక్ట్ తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనతేనన్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు చేసింది శూన్యమని అప్పలరాజు విమర్శించారు. నాలుగుసార్లు సీఎంగా చేసిన చంద్రబాబు.. ఉత్తరాంధ్రాకు ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటనపై సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. చెత్త సంపద కేంద్రం ప్రారంభించటానికి ముఖ్యమంత్రి జిల్లాకి రావాలా? అని ప్రశ్నించారు. ‘ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు మూడోసారి జిల్లాకు వచ్చారు. ఒకసారి ఇచ్చాపురం వచ్చిన చంద్రబాబు టీ పెట్టటం నేర్పించారు. రెండోసారి బుడగట్ల పాలెం వచ్చినప్పుడు హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయాడు. మూడోసారి పర్యటనలోచెత్త సంపద కేంద్రం తీసుకువచ్చారు. చంద్రబాబుకు ఈ జిల్లాపై ఉన్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లం అయింది. ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం. మీకు శ్రీకాకుళం జిల్లా అంటే ఇంత చిన్న చూపా. పిల్లలు భారం కాదు....వాళ్లే మీ సంపద అంటున్నారు. పేదలకు ఎందుకు అలాంటి సలహాలు ఇస్తున్నారు. మీ అబ్బాయికి ఆ సలహా ఇవ్వండి. మీరెందుకు ఒక్కరితో ఆగిపోయారు. ఇద్దరిని, ముగ్గురిని ఎందుకు కనలేదు. నేటి చంద్రబాబు టీడీపీకి ఒకప్పటి టీడీపీకి చాలా తేడా ఉంది. వైఎస్సార్ ఆశయ సాధన కోసం, ప్రజలకు సేవ చేయాలనే ఆవిర్భవించిన దమ్మున్న పార్టీ వైఎస్సార్సీపీ. మా పార్టీతో మీ పార్టీకి పోలికా?’ అని మండిపడ్డారు. దేశంలో అత్యధికంగా పెట్రోల్ ధర గుంటూరులో ఉంది. ఇది మన ఏపీ ఘనత. ఆ రోజు పెట్రోల్ ధర ఎక్కువ ఉంటే జగన్ వైఫల్యం అట. ఈరోజు పెట్రోల్ ధర పెరిగితే చంద్రబాబుకు సంబంధం లేదట. పెట్రోల్ పై రాష్ట్రంలో అదనంగా రూ 4 వ్యాట్ వేసారు. దాన్ని తగ్గించండి. అమరావతి కోసం డీజిల్ తరలిస్తే ఎంతగా కొరత వచ్చిందో చూసాం...కేంద్ర అలా కుదరదని చివాట్లు పెడితే ప్రజలకు పెట్రోల్, డీజిల్ అందుబాటులోకి వచ్చింది. అమరావతిలో అంతులేని అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడరు. స్కూల్స్ కోసం దాతల నుండి విరాళాలు అడుగుతున్నారు. అతని కుమారుడే విద్యాశాఖ మంత్రి. తండ్రి కొడుకులు రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు. రీ సర్వే వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారు.. ఆ రోజు ఏం మాట్లాడారు. మీ భూములు లాక్కుంటారు, మేం వచ్చిన వెంటనే రీ సర్వే రద్దు చేస్తాం మిమ్మల్ని బెదిరించడానికే జగన్ రీ సర్వే చేస్తున్నారని చంద్రబాబు మాట్లాడటం వాస్తవం కాదా?రీ సర్వేలో అసలు మీ పాత్ర ఏంటి? ఒక్క ఎక్విప్ మెంట్ అయిన మీరు కొన్నారా?, రీ సర్వే ఘనతను వాళ్ళ ఖాతాలో చేర్చుకోవడానికి మాట్లాడుతున్నారు చంద్రబాబు. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడంలో ఎవరు ఎక్కువ రోల్ చేసారు చంద్రబాబు చెప్పాలి. మీరు మాట్లాడే ఉత్తరాంధ్రలోని ప్రతి ప్రాజెక్ట్ జగన్ ఘనతే.నేరేడు బ్యారేజ్ పై ట్రిబ్యునల్ తీర్పు 2021 లో జగన్ అధికారంలో ఉండగా వచ్చింది. నేరేడు బ్యారేజ్ పై ఒరిస్సా ముఖ్యమంత్రితో మాట్లాడిన ఘనత జగన్ది. అందులో మీ ఘనత ఏముంది. అందులో నీ ఘనత ఏంటి? రామ్మోహన్ నాయుడు పాత్ర ఏంటి. గెజిట్ నోటిఫికేషన్ మొన్న చేశారు. ఇది ఒక పొలిటికల్ స్టంట్. మీరు నాలుగుసార్లు సీఎంగా చేసిన సమయంలో ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా.. దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి టీడీపీ నాయకులు చెప్పoడి’ అని సవాల్ చేశారు. -
రెండో రోజూ..అదే జోరు
● ఉత్సాహంగా సాగుతున్న ఇంటర్నేషనల్ చెస్ పోరు ● ఆంధ్రప్రదేశ్ రేటింగ్ క్రీడాకారులు హవా శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. సీఎస్ఎన్ ట్రస్ట్, గీతా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రాండ్ కన్వెన్షన్లో జరుగుతున్న ఈ పోటీలు నువ్వా–నేనా అన్నట్టుగా ఉత్కంఠను తలపిస్తున్నాయి. ఐదురోజుల మెగా టోర్నీలో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడో రౌండ్ పోటీలను కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పోటీలను ప్రారంభించారు. బాలబాలికల ఎత్తుకు పై ఎత్తులను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంతటి భారీస్థాయిలో చెస్ టోర్నీని నిర్వహిస్తున్న కమిటీ ప్రతినిధులను అభినందించారు. దేశ నలుమూలల నుండి విచ్చేసిన క్రీడాకారులకు.. శ్రీకాకుళం విశిష్టతను, గొప్పతనాన్ని ప్రాచీన కట్టడాలను గురించి వివరించారు. కార్యక్రమంలో పోటీల ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సుధీర్, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాగాది కిషోర్, జయరాజ్, వసంతరావు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు రౌండ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు రేటింగ్ ప్లేయర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. వీరికి తమిళనాడు, ఒడిశా, అమెరికాకు చెందిన క్రీడాకారులు గట్టిపోటీనిస్తున్నారని డైరెక్టర్ సనపల భీమారావు తెలిపారు. -
పబ్లిసిటీ స్టంట్కే ముఖ్యమంత్రి పర్యటన
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే శనివారం నరసన్నపేటకు వస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జిల్లాలో మొక్కజొన్న రైతులకు కొనుగోలు కేంద్రాలు లేవని, గిట్టుబాటు ధర రాక సాగుదారులు అల్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ క్వింటాల్కు రైతులు రూ. 700 వరకూ నష్ట పోతున్నారని ఇవేవీ ముఖ్యమంత్రికి కనిపించకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన చేశారు. ఆరోగ్య శ్రీ బిల్లులు రాక ఆస్పత్రుల్లో రోగులను వెనక్కి పంపుతు న్నారని, కొత్త పింఛన్ల ఊసే లేదని ధ్వజమెత్తారు. వంశధార, టెక్కలి ఆఫ్ షోర్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ, మూలపేట పోర్టు ని ర్మాణాన్ని గాలికి వదిలేశారని మండి పడ్డారు. జిల్లాలో ఇన్ని ప్రదాన సమస్యలు పక్కన పెట్టి కేవలం స్వచ్ఛ ఆంధ్రా, స్వర్ణాంధ్ర అంటూ చెత్త పేరుతో ముఖ్యమంత్రి పర్యటిస్తుండటం ప్రజలను వంచించడమేనని కృష్ణదాస్ విమర్శించారు. -
పరిశ్రమ బస్సును ఢీకొట్టిన ఆటో
రణస్థలం: శ్రీకాకుళం వైపు నుంచి పైడిభీమవరం వైపు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ పరిశ్రమ బస్సును బుడుమూరు వద్ద వెనుకనే వస్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. స్థానికులు, లావేరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిశ్రమ చెందిన ఉద్యోగులను ఎక్కించుకునేందుకు బుడుమూరు వద్ద రెడ్డీస్కు చెందిన బస్సు శుక్రవారం ఉదయం 5.50గంటల సమయంలో ఆగింది. ఈ సమయంలో వెనుకనే వస్తున్న ఆటో బస్సును ఢీకొట్టింది. ఆటో డ్రైవర్కు బలమైన గాయాలు కావడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న టమోటాలు, కూరగాయలు చెల్లాచెదురుగా పడిపోయాయి. -
ఈ మాటలు గుర్తున్నాయా..?
అధికారంలోకి రాగానే పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు వాటికి అతీగతి లేదు. ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడ పేట వద్ద నాగావళి నదిపై వంతెనల నిర్మాణాలు పూర్తి చేస్తామని, నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదు. నియోజకవర్గానికి ఒక ఇంజినీరింగ్ కళా శాల తీసుకొస్తామని, వంశధార ప్రాజె క్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని, జీడి పిక్కల 80కిలోల బస్తా మద్దతు ధర రూ. 16వేలు చేస్తామని హా మీ ఇచ్చారు. జీడి పిక్కల ధర పెంచడం పక్కన పెడితే ఉన్న ధరను తగ్గించేశారు. ఆఫ్షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ పను లు చేస్తామని, పలాసలో రైతు బజారును ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, పలాసలో డిఫె న్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు. నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, వంశధార–బాహుదా నదుల అనుసంధానం చేస్తామని, కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతామని, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని, బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారు. -
నరసన్నపేటలో భూ ఆక్రమణలు అరికట్టాలి
నరసన్నపేట: జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గతంలో జిల్లాకు రెండు మార్లు వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. వారు శుక్రవారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. వంశధార, టెక్కలి ఆఫ్షోర్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం వరకూ నీరందిస్తామని అన్నారని నిలబెట్టుకోవాలని కోరారు. పైడిగాం ప్రాజెక్టు మరమ్మతు చేయాలని, జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, జీడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చే యాలన్నారు. నరసన్నపేటలో ఉన్న టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, చెరువులను చెరబడుతున్నారని విమర్శించారు. వంశధార నదిలో ఇసుకను కొల్లగొడుతున్నారని మట్టినీ వదలడం లేదని అన్నారు. నరసన్నపేటకు వస్తున్న చంద్రబాబు జిల్లా సమస్యలపై స్పందించాలని కోరారు. -
ఫైబర్ నెట్ సేవలకు అంతరాయం
● 72 గంటలుగా నిలిచిన సేవలు ● జిల్లా వ్యాప్తంగా 30 వేల మంది వినియోగదారులకు ప్రసారాలు బంద్ రణస్థలం: ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఏపీ ఫైబర్నెట్ (ఏపీఎస్ఎఫ్ఎల్) సేవలు నిలిచిపోయాయి. 72 గంటలుగా టీవీలు మూగబోయాయి. ఆరుమాసాలగా ప్రతిరోజు అక్కడక్కడా సమస్యలు ఉత్ఫన్నంగా కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలతో కలిసి ఇంట్లో ఆనందంగా గడుపుదామని వినియోగదారులు ఫైబర్ నెట్కు నెలవారీ ప్యాకేజీలు రూ.350, రూ.450, రూ.600 చొప్పున కట్టారు. ప్రస్తుతం నెట్ పని చేస్తున్నా టీవీ చానల్స్కు పూర్తి అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 30వేలకు మంది వినియోదారులు ఆందోళన చెందుతున్నారు. చేతులెత్తేసిన ఆపరేటర్లు వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆపరేటర్ల నుంచి సరైన సమాధానం లేకుండాపోయింది. ఒకటికి పది సార్లు ఫోన్లు చేసినా, ఆఫీస్కు వచ్చి నేరుగా ఫిర్యాదు చేసిన ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితిలో ఆపరేటర్లు ఉన్నారు. వెండర్ సమస్య.. క్షేత్రస్థాయిలో వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యను గుర్తిస్తున్నామని ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి కష్టమర్లకు సమాచారం వచ్చింది. ఈ సమస్య అంతా వెండర్ సృష్టిస్తున్న సాంకేతిక పరమైన సమస్యల వల్ల కలిగిందని వివరణ ఇచ్చారు. నిత్యావరసర సేవలను అత్యంత వేగంగా పునరుద్ధరించడానికి షోకాజ్ నోటీసులు, ఉన్నత స్థాయి చర్చలతో సహా అన్ని చట్టపరమైన, పరిపాలనాపరమైన చర్యలను చేపడుతున్నామని పేర్కొన్నారు. పట్టించుకోని ప్రభుత్వం.. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఏపీ ఫైబర్ నెట్ సేవలపై తరుచూ ఫిర్యాదులు అందుతున్నా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు
పలాస: పలాస మండలం సుమ్మాదేవి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం రైలు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. సుమారు 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గమనించి 108కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వారు హుటాహుటిని వచ్చి పలాస ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. జి.ఆర్.పి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి సాంకేతిక విద్య ఎచ్చెర్ల : గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రపంచస్థాయి నాణ్యమైన సాంకేతిక విద్యను, ఆధునిక పరిజ్ఞాణాన్ని అందించడమే లక్ష్యమని రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం నూతన ఉప కులపతి మద్దాలి లక్ష్మీనారాయణరావు స్పష్టం చేశారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి శుక్రవారం శ్రీకాకుళం జిల్లా క్యాంపస్ను సందర్శించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ గిరిధర్, నూజివీడు డైరెక్టర్ గోపాలరాజు, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం క్యాంపస్లోని వసతులు, విద్యా విధానాన్ని పరిశీలించిన వీసీ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆర్జీయూకేటీని దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.పరిశోధనలకు, విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ సండ్ర అమరేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్ల పాలనలో జిల్లాకు ఏమిచ్చారు?
● వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి హిరమండలం : గత రెండేళ్లలో సీఎం చంద్రబాబు జిల్లాకు ఏమిచ్చారో చెప్పాలని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం కేవలం రాజకీయ పర్యటనలకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. కూటమి పాలనలో ఏవర్గానికీ న్యాయం చేయడం లేదని ధ్వజమెత్తారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించడం లేదని, సాగునీరు ఇవ్వడంలో కూడా విఫలమవుతున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందించలేని స్థితిలో ఉండటం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. కూటమికి ప్రజాగుణపాఠం తప్పదని హెచ్చరించారు. -
ఇదేనా పొదుపు..?
● ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని పిలుపు ● సీఎం చంద్రబాబు పర్యటనకు ఇష్టానుసారం ప్రజాధనం ఖర్చు ● రోడ్డు కోసం చెరువును కప్పేసిన వైనం ● పారిశుద్ధ్యం కోసమే రూ.కోటికిపైగా ఖర్చు ● డంపింగ్ యార్డ్ ముస్తాబుకు అక్షరాలా రూ.అరకోటి పైనే చెరువునే కప్పేశారు భూగర్భ జలాలు పెంపొందించేందుకు చెరువుల పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఒక వైపు ప్రచారం చేస్తున్నారు. కానీ సీఎం వస్తున్నాని నరసన్నపేట పట్టణంలోని శర్మాల (పాలకర్ర) చెరువును సగానికి పైగా కప్పేశారు. ప్రజావేదిక సభా ప్రాంగణానికి వెళ్లేందుకు రోడ్డు మార్గం కోసం చెరువును కప్పడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేశారు. నరసన్నపేట: ఆర్భాటాలు వద్దని, ఖర్చులు తగ్గించుకోవాలని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చా రు. మన నాయకులు కూడా కాన్వాస్లు తగ్గించుకుని ఇదిగో మేమూ చేస్తున్నామంటూ బడాయిలకు పోయారు. తీరా చూస్తే.. నరసన్నపేటలో సీఎం పర్యటనకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు పెడుతూ దొరికిపోయారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ జిల్లా అధికారులకు, జిల్లాలో ఉన్న ఎంపీడీఓలకు తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించారు. వీరంతా పది రోజులు గా నరసన్నపేటలోనూ తిరుగుతూ వందలాది లీట ర్ల డీజిల్ను ఖర్చు చేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు 20 వార్డుల్లో రోజుకు ఒక్కో వార్డులో 10 మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులను, ఒక్కో వీధికి ఒక జేసీబీ, మరో ట్రాక్టర్ వినియోగించారు. దీని కోసం రూ. 20 లక్షలు వెచ్చించారని సమాచారం. ఇలా పదిరోజులు చేశారు. ఈ చర్యలకే కోటికి పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. పట్టణంలో అంతా ౖపైపె మెరుగులు చేశారు. ప్రస్తుతం మెయిన్ రోడ్డుపైనే అందరి దృష్టి పెట్టి పరిసర వీధుల్లో పట్టించుకోకపోవడంతో సమీప వీధుల్లో అప్పుడే చెత్త పెరుగుతోంది. డంపింగ్ యార్డు ముస్తాబుకే.. చెత్త నుంచి సంపద కేంద్రం నరసన్నపేటలో 2018 జూన్ 6న ప్రారంభించారు. అప్పట్లో దీని నిర్మాణానికి రోడ్లు, లోపల పరికరాలకు రూ. 50 లక్షల వరకూ వెచ్చించారు. ఈ ఎనిమిదేళ్లలో దీని నుంచి పైసా రాబడి రాలేదు. దీన్ని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వస్తుండటంతో అధికారులు మరో రూ. 60 లక్షలకు పైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. అంతా సినిమా సెట్టింగులు చేసినట్లు సమాచారం. సమావేశానికి.. తామరాపల్లి హెలీప్యాడ్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడే కార్యకర్తలతో ముఖాముఖి ఏర్పా టు చేశారు. 1100 మంది కార్యకర్తలు పట్టేలా భారీ సెట్టింగులు చేశారు. సెంట్రలైజ్డ్ ఏసీలు అమర్చారు. ఈ సమావేశానికీ సినిమా సెట్టింగులు చేస్తున్నారు. ఏసీ నిలిచేందుకు ఫ్లోర్ పై ప్రత్యేక కర్ర ప్లేట్లు వేస్తున్నారు. దారి పొడవునా సినిమా సెట్టింగులు వేస్తున్నారు. -
‘ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి’
కొత్తూరు: జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని నిర్వాసి తుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాజు సింహాచలం డిమాండ్ చేశారు. మండలంలోని మెట్టూరు బిట్–3 ఇరపాడు నిర్వాసితుల కాలనీలో నిర్వాసితులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ 2024 మార్చి నెలలో కొత్తూరులో వంశధార ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన సందర్భంగా కొత్తూరులో అప్పటి ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్యాకేజీపై హామీ ఇచ్చారని గుర్తు చేశారు. జిల్లా పర్యాటకు వస్తున్న చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు అధికారులకు ఆదేశించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కనీసం హమీ అమలును పట్టించుకోలేదన్నారు. హామీ ని అమలు చేయపోతే నిర్వాసితులతో మరో ఉద్యమం తప్పదన్నారు. సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి నరసన్నపేట: స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నరసన్నపేటకు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడులు తెలిపారు. శుక్రవారం వీరు స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో కలసి సీఎం రూట్ మ్యాప్ను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్షించారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు శ్రీకాకుళం క్రైమ్ : సీఎం చంద్రబాబు శనివారం నరసన్నపేట రానున్న సందర్భంగా భద్రతా పరంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ముగ్గురు అడిషనల్ ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 40 మంది సీఐలు, 90 మంది ఎ్స్ఐలు సహా హెచ్సీలు, పీసీలు, హోంగార్డులతో సహా దాదాపు 1550 మంది బందోబస్తు నిర్వహించనున్నట్లు తెలిపారు. వీరే కాక 2రోప్ పార్టీలు, 6 స్పెషల్ పార్టీలు విధుల్లో ఉంటారన్నారు. భద్రతా పరమైన చర్యల్లో భాగంగా ప్రైవేటు డ్రోన్ కెమెరాల వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. అరసవల్లి రథసప్తమి నుంచి ఇలాంటి ఆదేశాలు ఇస్తున్నా అమలు చేయడంలో విఫలమవుతున్నారు. తేనెటీగల దాడిలో ఉపాధి వేతనదారులకు గాయాలు పొందూరు: కొంచాడ పంచాయతీ పరిధిలోని యాగాటిపేట గ్రామం వద్ద శుక్రవారం తేనెటీగలు దాడి చేయడంతో ముగ్గురు ఉపాధి హామీ వేతనదారులతో పాటు పలువురు గ్రామస్తులు గాయపడ్డారు. ఓ చెట్టు కింద వంట చేస్తున్న సమయంలో పైకి పొగ వెళ్లడంతో తేనెటీగలు కదిలిపోయి సమీపంలో ఉన్న వారిపై దాడి చేశారు. అదే సమయంలో ఉపాధి పని కోసం దుబ్బులు చెరువుకు వెళ్తున్న ఉపాధి వేతన దారులు షేక్లాల్బీ, జి.జయమ్మ, వై.చిన్నమ్మడులతో పాటు గ్రామానికి చెందిని వై.శివకుమార్, వై.సూర్య, ఎస్.హరికృష్ణ, యు.మంగమ్మ, పి.గౌరమోమలకు గాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆటోల సహాయంతో పొందూరు సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ‘పెంచిన ధరలు తగ్గించాలి’ ఎచ్చెర్ల: పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు మండల కన్వీనర్ ఎస్.వి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో బీజేపీ కూటమి సర్కార్ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరు తూ సీపీఎం ఆధ్వర్యంలో వినూత్నంగా లారీకి తాడు కట్టి లాగి నిరసన తెలియజేశారు. కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల జీవ నం చిన్నాభిన్నమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
కూటమి నేతలు.. ఇవేం కోతలు!
అరసవల్లి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచం..తగ్గిస్తాం...అసలు విద్యుత్ కోతలుండవ్..అంటూ ప్రకటనలు గుప్పించిన నాయకుల మాటలకు నేటి వాస్తవ పరిస్థితికి ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. వేసవి కాలంలో గతంలో ఎన్నడూలేనంత విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. వేసవి ముందస్తు చర్యలపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం ఫలితంగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ఆర్) పేరిట విద్యుత్ కోతలు మొదలుపెట్టేశారు. దీంతో పరిశ్రమలతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. అవసరమైనంత విద్యుత్ వినియోగ సప్లయ్ తగ్గిపోయి..వినియోగం కూడా భారీగా పెరిగిపోవడంతో అవస్థలు తప్పడం లేదు. జిల్లాలో ఉన్న లక్షలాది మంది గ్రామీణ విద్యుత్ వినియోగదారులకు గత నెల నుంచి విద్యుత్ కోతల కష్టాలను కూటమి సర్కార్ రుచి చూపిస్తోంది. ఒకేరోజు 75 లక్షల యూనిట్లు వినియోగం..! జిల్లాలో శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ల పరిధిలో ఎల్టీ విద్యుత్ వినియోగదారులు (గృహాలు) 8,07,794, హెచ్టీ విద్యుత్ వినియోగదారులు 504 విద్యుత్ కనెక్షన్లున్నాయి. సప్లయ్కు మించి వినియోగం పెరగడంతో ఈఎల్ఆర్ కష్టాలు మొదలయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో గతంలో కంటే రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం మిలియన్ యూనిట్లు (ఎంయూ) పెరిగింది. ● మే 9న 71.65 లక్షల యూనిట్లు (7.16 మిలియన్ యూనిట్లు), 10వ తేదిన 7.16 ఎం.యు, 11వ తేదీన 7.31 మిలియన్ యూనిట్లు, 12న 7.41 ఎం.యు, 13న కాస్తా వాతావరణం చల్లబడటంతో 7.1 ఎం.యు, 14న ఏకంగా 75 లక్షల యూనిట్లు (7.51 ఎం.యు) విద్యుత్ వినియోగం నమోదయ్యింది. ఈ వేసవి సీజన్లో 14న అత్యధిక నమోదు జరిగినట్లుగా విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ఇదిలావుంటే ఈ ఏడాది ఏప్రిల్లో 16, 22, 23 తేదీల్లో ఈఎల్ఆర్ పేరిట విద్యుత్ కోతలు విధించిన విద్యుత్ శాఖ, తాజాగా ఈ నెల 11వ తేదిన కూడా సప్లయి కంటే విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో ఈఎల్ఆర్ కోతలు తప్పలేదు.. అత్యధికంగా ఏసీల వినియోగం..! విద్యుత్ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా వినియోగదారులకు అవగాహన కల్పించేలా విద్యుత్ శాఖ పలు కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వినియోగంలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ప్రస్తుత విద్యుత్ వినియోగం అత్యధిక స్థాయికి పెరిగిపోవడంలో ఏసీల వినియోగమే కీలకమని చెప్పవచ్చు. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో ప్రతి పదిళ్లకు ఒక్కో ఏసీ ఉందనే లెక్కలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కనీసంగా వీధికి 5 నుంచి 10 ఏసీలున్నాయి. వ్యాపార దుకాణ సముదాయాలు, మాల్స్లో కనీసం 10 నుంచి 50 ఏసీలు వరకు వినియోగంలో ఉన్నాయి. పీక్ అవర్స్లో విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో ఈఎల్ఆర్ పేరిట విద్యుత్ కోతలు విధిస్తున్నారు. వేసవిలో విద్యుత్ పొదుపు తప్పకుండా పాటించాలి. విద్యుత్ ఇంప్రూవ్మెంట్లో భాగంగా ముందస్తుగా జిల్లా సర్కిల్లో 266 ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. 368 కిలోమీటర్ల మేర కండక్టర్లు కొత్తగా మార్చాం. 8 మీటర్లు పొడవున 2526 విద్యుత్ స్తంభాలు, 9.1 మీటర్ల పోల్స్ 2618 వరకు మార్చాం. సప్లయి కంటే వినియోగం పెరిగినప్పుడు ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ క్రింద పారిశ్రామిక వినియోగంపై చర్యలు చేపడుతున్నాం. – నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఈ, విద్యుత్ సర్కిల్ తాము అధికారంలోకి వస్తే విద్యుత్ కోతలే ఉండవని నాడు ప్రగల్భాలు ఇప్పుడు ఈఎల్ఆర్ పేరిట ఇష్టారాజ్యంగా సరఫరా నిలిపివేత మండిపడుతున్న వినియోగదారులు 14న రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదు -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026ఎన్నికల్లో గెలిచే వరకు ఓ మాట.. గెలిచాక మరో మాట.. సీఎం చంద్రబాబు జిల్లాపై అవలంబిస్తున్న తీరు ఇది. ప్రస్తుతం జిల్లాలో రెడ్బుక్, మాఫియా రాజ్యంతో స్కామ్ల పాలన తప్ప ఇంకేమీ జరగడం లేదు. పాత పథకాలకు పాతరేశారు. కొత్త పథకాల ఊసే లేదు. అధికారంలోకి వచ్చాక జిల్లాకు వచ్చిన ప్రతి సారీ హామీలు ఇస్తున్నా.. వాటిని అమలు చేసిన దాఖలా ఒక్కటి కూడా లేదు. తాజాగా నరసన్నపేటకు స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కోసం సీఎం శనివారం వస్తున్నారు. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం -
కల్వర్టును ఢీకొన్న బైక్
నరసన్నపేట: గొట్టిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేట పట్టణం జగన్నాథపురానికి చెందిన అనుపోతుల శ్రీనివాసరావు(43) మృతి చెందాడు. గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై బసివలస వైపు నుంచి నరసన్నపేటకు వస్తున్న శ్రీనివాసరావు అదుపు తప్పి కల్వర్టు మదుముకు ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయాడు. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తీవ్ర గాయాలపాలై కల్వర్టులోనే మృతిచెందాడు. శ్రీనివాసరావు మడపాం టోల్గేట్ వద్ద టీస్టాల్ నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్య శ్రీదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరసన్నపేట ఎస్సై–2 శేఖరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● టీస్టాల్ నిర్వాహకుడు మృతి -
వివాదాస్పద స్థలంపై విచారణ చేపట్టాలి
కంచిలి: కేసరపడ కాలనీలో పూర్వం నుంచి ఉన్న ప్రభుత్వ పోరంబోకు స్థలం హఠాత్తుగా జిరాయితీ స్థలంగా మారడంపై గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లు క్రితం ఇక్కడ కాలనీ మంజూరు చేసిన తర్వాత అంతటా పక్కా ఇళ్లు నిర్మించుకొని కుటుంబాలతో జీవిస్తుండటం, అందులోనే రక్షిత మంచినీటి పథకం ఓవర్హెడ్ ట్యాంకు వినియోగంలో ఉండటం, తాజాగా ప్రభుత్వ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేపట్టడం వంటివి సాక్ష్యాలుగా ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కాలనీలో సర్వే నంబర్:468/2లో 16 సెంట్లు, 468/3లో 3 సెంట్లు మొత్తంగా 19 సెంట్లు స్థలం వివాదంగా మారింది. ఇందులో కాలనీ ఇళ్లు మంజూరవ్వడంతో మూడు ఇళ్లు కూడా నిర్మించుకొని దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. మిగతాది ఖాళీ స్థలంగా ఉంది. పూర్వం నుంచి ఇది ప్రభుత్వ పోరంబోకు భూమిగా గ్రామస్తులు వ్యవహరిస్తూ, అక్కడ కొంత భాగంలో గ్రామ అవసరాల కోసం సామాజిక మండపం నిర్మించతలపెట్టారు. దీనికోసం విరాళాలు కూడా పోగుచేసుకొని, లోతుగా ఉన్న ఈ స్థలంలో మట్టితో నింపారు. ఇంతలో ఇది జిరాయితీ స్థలం అని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేర్కొంటూ, అప్పగించాలంటూ రెవెన్యూ సిబ్బంది ద్వారా అక్కడ ఇళ్లు నిర్మించుకొన్న వారిని విచారణ చేపట్టడంతో గందరగోళం నెలకొంది. దీంతో అక్కడ కాలనీ ఇళ్లు నిర్మించుకొన్న మాలి మోహిని మహాపాత్రో, పిలక గంగమ్మ, సల్ల గంగమ్మలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల తరపున విచారణ చేపట్టి, ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని గ్రామానికి అప్పగించాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గ్రామంలో సమావేశమై విలేకరులకు తమ గోడును తెలియజేశారు. సమావేశంలో మల్లార్పు దుదిష్టి, కొరికాన కృష్ణమూర్తి, నెయ్యిల గంగాధర్, కొరికాన చంద్రముణి, మాలి అజిత్, రంగాల గోవింద్, పిలక కామరాజు, మల్లార్పు ప్రేమ్కుమార్, కడియం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అభూత కల్పనలు..
టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు జరిగిన మేలు ఒక్కటి కూడా లేదు. అంతకుముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నా జిల్లాపై వెనుకబాటు ముద్రను చెరపలేకపోయారు. జిల్లాలో ఆయన మార్క్ అంటూ ఏదీ లేదు. ఉన్న భవనాలు, ప్రాజెక్టులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగినవే. ● అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తామన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. ● ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలు ● ఒక్కటీ అమలు చేయని దుస్థితి ● అధికారంలోకి వచ్చాక ఎడాపెడా వాగ్దానాలు ● వాటికీ అతీగతి లేదు ● తాజాగా నరసన్నపేటలో స్వర్ణాంధ్ర ● స్వచ్ఛాంధ్ర పేరుతో సీఎం పర్యటన -
అంతర్జాతీయ స్విమ్మింగ్కు కుసుమూరు ఉపాధ్యాయుడు
● జూలైలో జిబ్రాల్టర్ జలసంధిలో ఈదడానికి సన్నాహాలు ● దివ్యాంగుడినైనా సప్తసముద్రాలు ఈదుతానంటున్న గణేష్ సీతంపేట: దివ్యాంగుడైనా ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ఈతలో మంచి పట్టు సాధించి సప్త సముద్రాలను ఈది తానేంటో నిరూపిస్తానని అంటున్నారు మండలంలోని కుసుమూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బలగ గణేష్. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని బూర్జ మండలం డొంకలపర్తి గ్రామం. జూలైనెల 20 నుంచి 29 మధ్య స్పెయిన్ నుంచి మొరాకా మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధిని ఈదనున్నట్లు తెలిపారు. 4 గంటల్లో 16 కిలోమీటర్ల దూరం ఆగకుండా ఈదనున్నట్లు చెప్పారు. ఈ సాహసోపేతమైన స్విమ్మింగ్కు అనుమతి కూడా లభించిందన్నారు. 2020 నుంచి స్విమ్మింగ్ పోటీల్లో తాను పాల్గొంటున్నానని 2020లో అవకాశాలు వచ్చినప్పటికీ కరోనా కారణంగా ఆగిపోయినట్లు తెలిపారు. 2025లో శ్రీలంక–ధనుష్కోట మధ్య ఉన్న సముద్రాన్ని 28 కిలోమీటర్లు 10 గంటల 40 నిమిషాల పాటు ఈదినట్లు చెప్పారు. అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పారా స్విమ్మర్గా రికార్డు సాధించానన్నారు. 2025 జూన్ 16న లండన్ నుంచి ఫ్రాన్స్ వరకు 34 కిలోమీటర్లు 13 గంటలపాటు ఇంగ్లీష్ చానల్ ఈదినట్లు తెలిపారు. ఏడు సమూద్రాలను ఈదడానికి నిర్ణయించానని ఇప్పటికి రెండు ఈదానని, మిగతా ఐదు సముద్రాల్లో కూడా స్విమ్మింగ్ చేసి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మరో విశేషమేమిటంటే తన కుమారుడు స్వామినాయుడు రాష్ట్రంలోనే అత్యంత వేగవంతమైన స్విమ్మర్గా ప్రశంస పొందాడన్నారు. తాను ఇచ్చిన కోచింగ్ తన కుమారుడికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ కార్యాలయంలో డిప్యూ టీ ఈఓ పి.నారాయుడు, ఎంఈవో సూర్య చంద్రరావు తదితరులు ఆయనను అబినందించారు. -
హత్యలు.. దాడులు.. ప్రమాదాలు
● జిల్లాలో కట్టుతప్పిన శాంతిభద్రతలు ● విపరీతంగా గంజాయి రవాణా శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. గన్ నెత్తిన పెట్టి, కత్తులు పీక మీద పెట్టి దోపిడీలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలు చొరబడుతున్నాయి. ఇది చాలదన్నట్టు కొంతమంది అధికార పార్టీ నేతలు తమ అనుచర గణంతో దాడులకు పాల్పడుతున్నారు. జిల్లాపై నెత్తుటి మరకలు పడుతున్నా పట్టించుకునే వారు లేకపోవడంతో శాంతిభద్రతలు అదుపు తప్పాయి. ఒక వ్యక్తి ఏకంగా జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు కూడా. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో జిల్లాచూసిన ప్రగతి ఇదే. పెట్రోల్, గ్యాస్ బండలు, నీటి కుండలు కష్టమనుకుంటున్న ఈ కాలంలో వీధివీధినా బెల్టుషాపులు దర్శనమిస్తున్నాయి. సిండికేట్ మా టున ప్రజాప్రతినిధులే అంతా తామై దోచుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. మద్యం మత్తులో దాడుల ఘ టనల కేసులైతే కొదవే లేదు. ఏకంగా పోలీసులమీదే తిరగబడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం నరసన్నపేటకు వస్తుండడంతో ఆయనైనా శాంతిభద్రతలపై ఆరా తీస్తారేమోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఆ గంజాయి అంతా ఎక్కడిది..? జిల్లాలో గంజాయి లేనే లేదని అధికారులు చెబుతున్నారు. కానీ నిత్యం ఏదో ఒక చోట రవాణా చేస్తూ.. కొందరు దొరుకుతున్నారు. స్థానిక యువతకు ఈ గంజాయి సరఫరా అవుతోందనే ఆరోపణ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ‘డయల్ యువర్ ఎస్పీ’ కాల్స్ సైతం గంజాయి మాటున దాడులను తేటతెల్లం చేస్తున్నాయి. ఘటనలు ఇవిగో.. ● నరసన్నపేట నియోజకవర్గం శ్రీముఖలింగంలో ఎమ్మెల్యే బగ్గు అనుచరులు ఓ అర్చకునిపై దాడికి యత్నించగా పోలీసులు న్యాయం చేయకపోవడంతో జాతీయ మానవహక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ● రాష్ట్ర మంత్రి అచ్చెన్న ఇలాకాలో తమ వర్గానికి ఎదురు తిరిగి సర్పంచిగా పోటీ చేశాడనే అక్కసుతో ఓ ఆడియోకాల్ అంశంలో కింజరాపు అప్పన్న అనే వ్యక్తిని పోలీసులు రహస్యంగా రెండు రోజులు తీసుకెళ్లారని ఏకంగా అతని భార్యే ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ● నౌపడలో సర్పంచ్ జీరు బాబూరావు సోదరుడు జీరు విశ్వనాధాన్ని ఓ కేసు విషయంలో స్టేషన్కు రాలేదన్న కోపంతో విశ్వనాథం పనిచేస్తున్న రొయ్యల చెరువు వద్దకు వెళ్లిన ఎస్ఐ దాడి చేశారు. ● జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక కేంద్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఈ ఏడాది జరిగిన రథసప్తమి వేడుకల్లో నకిలీ వీవీఐపీ పాసుల కుంభకోణం ఆలయ ప్రతిష్టను మసకబార్చింది. ● లావేరు మండలం మురపాకలో ఓ వృద్ధురాలిని ఈడ్చుకెళ్లి చెవి, ముక్కు కోసేసి బంగారం తెంపేసి ఆపై కాల్చి బావిలో పడేశారు. ఇప్పటికీ నిందితుల జాడ తెలియదు. ఇదే ఘటన మాదిరి నరసన్నపేటలోని ఓ వృద్ధురాలు హతమైంది. ● ఎచ్చెర్ల ఫరీద్పేటలో రెండు రాజకీయ హత్యలు జరగ్గా, నరసన్నపేట వనవిష్ణుపురంలో మరో హత్య జరిగింది. ● కాశీబుగ్గ వెంకటేశ్వర జ్యూయలర్స్ దోపిడీలో పాల్గొన్న ఒడిశా డెకాయిట్లను పోలీసులు పట్టుకున్నారు గానీ కీలక ఉత్తరప్రదేశ్ డెకాయిట్లను పట్టుకురాలేదన్న విమర్శలున్నాయి. ● జిల్లాలోని పైడి భీమవరం నుంచి టెక్కలి హైవే వెంబడి నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ● ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో డెన్లకు మన జిల్లాకు చెందిన వారు వెళ్లి ఇరుక్కుంటున్నారు. -
రిమ్స్ ఆస్పత్రికి ఫిజియోథెరపీ పరికరాలు
శ్రీకాకుళం: రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రికి శుక్రవారం కొత్త ఫిజియోథెరపీ పరికరాలు వచ్చాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పలనాయుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్, జాయింట్ డైరెక్టర్ రాజశేఖరరెడ్డి ఈ పరికరాలను ప్రారంభించి రిమ్స్ ఫిజియోథెరపీ విభాగం ఇన్చార్జికి అప్పగించారు. పరికరాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని గతంలో సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో రోగులకు మంచి సేవలు అందించాలని సూచించారు. ఇన్ పేషెంట్లు, అవుట్ పేషెంట్లకు అవసరమైన ఫిజియోథెరపీ పరికరాలు అందుబాటులోనికి వచ్చాయని, ఎలక్ట్రో థెరపీ, వ్యాయామ చికిత్స తదితర 16 రకాలు ఇందులో ఉన్నాయని వివరించారు. వెన్నెముక, మోకాళ్ల నొప్పులు, భుజాల నొప్పులు, పక్షవాతం, క్యాన్సర్, గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్న వారికి ఇవి అవసరమన్నారు. పుట్టుకతో నడవలేని పిల్లలకు కూడా ప్రస్తుతం అందుబాటులోనికి వచ్చిన పరికరాలు ఎంతో ఉపయోగకరమన్నారు. రోగులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ విభాగం ఇన్చార్జి హెచ్ఓడీ డాక్టర్ పార్థసారథి, డాక్టర్ సుభాషిని, ఫిజియోథెరపీ వైద్యులు రవి, బాబ్జీ, విష్ణుప్రియ, ప్రశాంతి, కోరాడ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఇలిసిపురం పాదాలమ్మతల్లి వీధిలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెండో పట్టణ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఆమదాలవలస మండలం బెలమాం గ్రామానికి చెందిన బెండి సరోజ్ (60) ఆర్మీలో పనిచేసి రిటైరయ్యారు. మద్యం వ్యసనంతో హింసించారనే కారణంతో పదేళ్ల క్రితమే భార్యా పిల్లలు వదిలి వెళ్లిపోయారు. నగరంలోనే వుంటున్న సరోజ్ శుక్రవారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి మద్యం సేవించేందుకు వెళ్లి తిరిగి సాయంత్రం వచ్చేశాడు. గది గడియపెట్టుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. పొగ బయటకు వ్యాపించడంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ ఎస్ఐ హేమంత్కళ్యాణ్ పేర్కొన్నారు. ఉపాధి వేతనదారుడికి తీవ్ర గాయాలు మెళియాపుట్టి: మండలంలోని కొత్తూరు పంచాయతీ పాత్రలోవ గ్రామానికి చెందిన సవర బాబూరావు ఉపాధి హామీ పథకం పనులు చేస్తూ పడిపోయి గాయాలపాలయ్యాడు. పాత్రలోవ గ్రామంలో కొండపై రాతికట్టల పని చేస్తూ కాలుజారి రాయిమీద నుంచి పడిపోవడంతో నుదుటి మీద తీవ్రగాయమై రక్తస్రావమైంది. క్షేత్ర సహాయకుడు బాలకృష్ణ 108కు ఫోన్చేసి తోటికూలీల సహాయంతో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
అరసవల్లిలో సహస్ర మహాలింగార్చన
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో క్షేత్రపాలకులైన భువనేశ్వరి రామలింగేశ్వర స్వామి వారికి సహస్ర మహాలింగార్చన కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. మాసశివరాత్రి సందర్భంగా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ అనివెట్టి మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు, మాససంక్రమణం సందర్భంగా గర్భాలయంలో సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం నిజరూపంతో పాటు ప్రత్యేక అలంకరణతో భక్తులకు సర్వదర్శనాలకు అనుమతించారు. జిల్లా కార్యవర్గం కరువు శ్రీకాకుళం : జిల్లా తెలుగుదేశం పార్టీకి కార్యవర్గం లేకుండా పోయింది. రాష్ట్ర నాయకత్వం జిల్లా కార్యవర్గాన్ని ఫిబ్రవరి నెలలో ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేదు. ప్రమాణ స్వీకారానికి అయ్యే ఖర్చును భరించేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేస్తున్నారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. కార్యాలయ మేనేజర్గా పని పనిచేసిన వ్యక్తి ఇటీవలే హత్యకు గురైన విషయం పాఠకులకు తెలిసిందే. ఇది జరిగి కూడా మూడు నెలలు అయినప్పటికీ నేటికీ ఆ పోస్టులో ఎవరినీ నియమించలేదు. పార్టీ పరిస్థితి, జిల్లా కార్యాలయ పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు గానీ, శాసనసభ్యులు గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమ్మర్ కోచింగ్ క్యాంపులు ప్రారంభం రేపు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్, శ్రీకాకుళం జిల్లా సెపక్తక్రా సంఘం చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి ఆదేశాల మేరకు ఆదివారం నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నెలరోజులపాటు జరగనున్నాయని కోచ్ జి.అర్జున్రావురెడ్డి శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో బాస్కెట్బాల్, సెపక్తక్ర క్రీడలకు సంబంధించి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 7 గంటలకు శిబిరాలు మొదలవుతాయని పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల ఒకటో తేదీ నుంచే శాప్ ఆదేశాల మేరకు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరాలు జరుగుతున్నప్పటికీ.. అసోసియేషన్ల తరఫున క్రీడాకారులకు అనేక సదుపాయాలను కల్పిస్తూ శిక్షణ నిర్వహించాలని ఎమ్మెస్సార్ తలచారని చెప్పారు. ఎనిమిదేళ్లు దాటిన బాలబాలికలు క్యాంపులో పాల్గొనవచ్చన్నారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు ఫ్లడ్లైట్ల వెలుతురులో శిక్షణ ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9949291288 నంబర్ను సంప్రదించాలన్నారు. విజ్ఞానశాస్త్రంలో కృత్యాధార బోధన శ్రీకాకుళం: విజ్ఞాన శాస్త్రంలో కృత్యాధార బోధన విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ఏ.రవిబాబు అన్నారు. శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు విద్యుదయస్కాంతత్వంపై వర్క్ షాపు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రయోగ సంబంధిత కిట్ను ఫిజిక్స్ ఫారమ్ను ఎస్.సాయి శ్రీనివాస్ రూపొందించడం అభినందనియమన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలన్నారు. పాఠశాలలో వినియోగించి రిన్ని కృత్యాలు విద్యార్థులు స్వయంగా చేసేలా ప్రోత్సహించాలన్నారు. అనంతరం రిసోర్స్ పర్సన్ బి.వెంకటరావును డీఈఓతో కలిసి ఉపాధ్యాయులు సన్మానించారు. ఫిజిక్స్ ఫారమ్ జిల్లా అధ్యక్షుడు జి.లక్ష్మణరావు, విశాఖ జిల్లా ఏపీసీ, ఐఏపీటీ రాష్ట్ర అధ్యక్షుడు జి.చంద్రశేఖర్, డీసీఈబీ సెక్రటరీ సంజీవరావు, ఇన్చార్జి హెచ్ఎం సీతన్నాయుడు, ప్రధాన కార్యదర్శి పి.రవికుమార్, కిరణ్, కామేశ్వరరావు, రామకృష్ణ, కృష్ణారావు, వేణుగోపాల్, రాజశేఖర్, శ్రీకాంత్, రమణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష సారవకోట: బుడితిలో 2024లో జరిగిన చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన వర్ల శివ అలియాస్ మున్నాకు 8 నెలల 10 రోజుల జైలు శిక్ష, రూ.100 జరిమానా విధిస్తూ పాతపట్నం జూనియర్ సివిల్ జడ్జి రోషిణి శుక్రవారం తీర్పునిచ్చారు. ఈ మేరకు ఎస్ఐ అనిల్కుమార్ విలేకరులకు తెలిపారు. -
● తిమడాంలో టీడీపీ నాయకుడి నిర్వాకం ● తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన ఎంపీటీసీ సభ్యుడు
జలుమూరు: తిమడాం పంచాయతీ కార్యాలయానికి ఆనుకు ని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెలమల చంద్రభూషణరావు ఆక్రమించారని ఎంపీటీసీ సభ్యుడు వెలమల అసిరినాయు డు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ జెన్ని రామారావుకు గురువారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సర్వే నంబర్ 85లో మూడో నంబర్ గ్రామ కంఠంగా ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ తనకు అనుకూలంగా రికార్డులు మార్చుకున్నాడని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు ఆక్రమిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం చుట్టూ ఆలయాలు ఉన్నాయని, మధ్యలో ఈ భూమి ఈ టీడీపీ నాయకునికి ఎలా సంక్రమించిందో అధికారులు నిగ్గు తేల్చాలన్నారు. ఇటీవల చెరువును కూడా మరో టీడీపీ నాయకుడు ఆక్రమించగా పోరాటం చేసి అడ్డుకున్నామని, అలాగే తాగునీటి టాంక్ నుంచి ప్రజలకు అందాల్సిన నీటిని కూడా తన పొలాలకు పైపులు ద్వారా మళ్లిస్తే వాటిని కూడా అడ్డుకున్నామని వివరించారు. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు వివరణ కోరగా ఇప్పటికే అధికారులను పంపించామని, ప్రభుత్వ భూమి అని తేలితే వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. -
లారీని ఢీకొన్న బొలెరో వ్యాన్
నందిగాం: కొండతెంబూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం వేకువజామున 3 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరాపుట్ జిల్లా సెమిలిగూడ పంచాయతీ గోపబంధునగర్కు చెందిన నిరంజన్ దొలయ్ (67) కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో కొరాపుట్ నుంచి బరంపురం పట్టణానికి కూరగాయలను గంజాం జిల్లా కరాచులీకు చెందిన ఆరతానాయక్ బొలెరా వ్యాన్లో తీసుకువెళ్తుండగా గురువారం వేకువజామున నందిగాం మండలం కొండతెంబూరు వద్దకు వచ్చే సరికి వ్యాన్ అదుపు తప్పింది. డివైడర్ను దాటి పలాస నుంచి టెక్కలి వైపు వస్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ నుజ్జయిపోవడంతో డ్రైవర్ ఆరతానాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కన ఉన్న నిరంజన్దొలయ్ తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న నందిగాం ఎస్సై షేక్ మహమ్మద్ ఆలీ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని నిరంజన్ దొలయ్ను టెక్కలి జిల్లా కేంద్ర ఆసుసత్రికి తరలించగా అక్కడ ఆయన మృతి చెందాడు. మృతుల వివరాలను బంధువులకు తెలియజేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడోరోజు 96 శాతం హాజరు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఏపీఈఏపీసెట్–2026 పరీక్షలు అధికారుల పర్యవేక్షణ నడు మ అత్యంత పకడ్బందీగా కొనసాగుతున్నాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల్లో భాగంగా మూడోరోజు గురువారం రెండు సెషన్లలో జరిగిన పరీక్షకు 96.12 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. నాలుగు కేంద్రాల్లో జరుగుతు న్న ఇంజినీరింగ్ స్ట్రీమ్కు రెండు సెషన్లకు కలిపి 1443 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 1387 మంది పరీక్షకు హాజర య్యారు. వివిధ కారణాలతో 56 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్కు 720 మందికి 694 మంది, మధ్యాహ్నం సెషన్కు 723 మందికిగాను 693 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యారు. నరసన్నపేట: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మూడో విడత ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) జూన్ నెల నుంచి ప్రారంభం కానున్న దృష్ట్యా పోలింగ్ కేంద్రాల వారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున బీఎల్ఏలను నియమించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దోమ మన్మధరావు ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎస్ఐఆర్ నోటిఫికేషన్ కాపీని గురువా రం మబగాంలో కృష్ణదాస్కు ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ పార్టీ తరఫు న జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రానికీ బీఎల్ఏలను నియమించాలని సూచించారని, ఈ విషయంలో నియోజకవర్గ సమన్వయకర్త లు మరింత బాధ్యతగా ఉండాలన్నారు. వీరందరికీ నియోజకవర్గాల వారీగా శిక్షణ నిస్తారని తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో మ నం అప్రమత్తంగా లేక పోతే మన ఓట్లు పోయే ప్రమాదం ఉంటుందన్నారు. ఒక్క ఓటు కూడా పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని, బాధ్యత కలిగిన అవగాహన ఉన్న కార్యకర్తలను బీఎల్ఏలుగా నియమించాలని కృష్ణదాస్ సూచించారు. ఈ నెల 20 కల్లా నియామకాలు పూర్తి చేయాలన్నారు. బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు దోమ మన్మధరావు మాట్లాడుతూ బీఎల్ ఏలకు శిక్షణ ఉంటుందన్నారు. నరసన్నపేట: క్రీడల అభివృద్ధికి శ్రీకాకుళం జిల్లా ఎంతో అనుకూలంగా ఉందని డీఎస్డీఓ మహేష్ అన్నారు. జిల్లాలో క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని, క్రీడల అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ఆయ న హామీ ఇచ్చారు. స్థానిక పీఎం శ్రీ స్కూల్లో వాలీబాల్, సాఫ్ట్బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ఏ సౌకర్యం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని కో రారు. స్థానిక వైద్యులు గొలివి మోహనరావు, లయన్స్ క్లబ్బు ప్రతినిధిలు ఊణ్ణ రంగనాథ్, సాహూ, పొట్నూరు రమేష్, మాజీ సర్పంచ్ గొద్దు చిట్టిబాబు మాట్లాడుతూ నరసన్నపేటలో క్రీడాకారులకు అండగా ఉంటామన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లపై ఆరా
నరసన్నపేట : నరసన్నపేటలో శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ షర్మాన్ అహ్మద్ ఖాన్లు సమీక్షించారు. గురువారం తామరాపల్లి వద్ద హెలీప్యాడ్ నుంచి ప్రజావేదిక, చెత్త నుంచి సంపద కేంద్రం వరకూ ట్రైల్ రన్ నిర్వహించారు. అనంతరం రూట్మ్యాప్పై సమీక్ష చేశారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఏఎస్పీ కృష్ణారావు, డీఎస్పీ రాజ్కుమార్ తదితరులు హాజరై భద్రతా చర్యలపై మరిన్ని సూచనలు చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ స్వప్నిల్ పవర్ జగన్నాథ్, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీఓలు కృష్ణమూర్తి, వేణుగోపాల్, డీఎంహెచ్ఓ అనిత, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ వీరన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
‘నీట్ రద్దు వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం’
వజ్రపుకొత్తూరు రూరల్: నీట్ రద్దు ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం అని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎల్.వెంకటాచలం అన్నారు. మండల కేంద్రమైన వజ్రపుకొత్తూరులో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. పేపర్ భద్రత వైఫల్యం, లీకేజీలు, పరీక్షల రద్దు వంటి కారణాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఏళ్ల తరబడి కష్టపడి చదివి పరీక్ష రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. పదే పదే జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఘటనలు రానున్న రోజుల్లో పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టాలు చేసి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
శ్రీకాకుళం
నాడు కళకళ.. నేడు వెలవెలమహిళా మార్టు వెలవెలబోతోంది. విక్రయాలు పడిపోయాయి. –8లోఅభివృద్ధికి నోచుకోని రాజుల చెరువు పట్టణం నడిబొడ్డున ఉన్న రాజుల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు రాజుల చెరువును అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు అధికారం చేపట్టి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్లీ నరసన్నపేటకు వస్తున్నారు. రాజుల చెరువు అభివృద్ధికి నిధులు కేటాయిస్తారని స్థానికులు ఎదురు చూస్తున్నారు. -
సాగునీటి కాలువ ఆక్రమణకు యత్నం
సారవకోట: మండల కేంద్రం సారవకోటలో జాతీ య రహదారి–326ఏకి ఆనుకుని ఉన్న సాగునీటి కాలువలో అక్రమ నిర్మాణం చేపట్టేందుకు స్థానిక టీడీపీ నాయకుడు ప్రయత్నిస్తున్నాడు. రంగసాగ రం నీరు ప్రవహించే కాలువను కప్పి దుకాణం ఏర్పాటు చేసేందుకు పునాదుల గోతులు తీశాడు. ఇందుకు రంగసాగరం నీటి సంఘం చైర్మన్ తీర్మా నం ఇవ్వడం గమనార్హం. ఈ నిర్మాణంపై రైతుల నుంచి ఫిర్యాదు వెళ్లడంతో చిన్న నీటి పారుదల శాఖ సిబ్బంది సంబంధిత స్థలాన్ని గురువారం పరిశీలించి పనులు నిలుపుదల చేయాలని ఆదేశించా రు. కాలువకు ఆనుకుని ఉన్న స్థలం తమదేనని ఆక్రమణదారుడు వాదించగా తగిన ఆధారాలు తీసుకు ని రావాలని సూచించారు. కాగా, మండలంలో టీడీపీలో రెండు వర్గాలుండగా ఓ వర్గానికి చెందిన వ్యక్తి ఈ ఆక్రమణకు పాల్పడగా మరో వర్గం వారు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పనులకు అనుమతి ఎలా ఇస్తారని తహశీల్దార్ విజయలక్ష్మిని మండల స్థాయి ప్రజాప్రతినిధి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, వీఆర్వో, సర్వేయర్ వెళ్లి పరిశీలించాలని సూచించానే తప్ప తాను ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని తహశీల్దార్ చెప్పినట్లు సమాచారం. -
సాగునీటి కాలువపై పక్కా భవనం
పలాస: పలాస మొగిలిపాడు జాతీయ రహదారి పక్కన సాగునీటి కాలువపై పలాసకు చెందిన ఓ వ్యాపారి పక్కా భవనం నిర్మించాడు. మొగిలిపాడు బ్రిడ్జి పక్కన సర్వీస్ రోడ్డు ఉంది. బ్రిడ్జి కారణంగా ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉంటుంది. దాని పక్కనే ఆ వ్యాపారి వ్యాపార అవసరాల కోసం గొడౌన్ నిర్మాణం చేపట్టాడు. గొడౌన్కు వెళ్లాలంటే సాగునీటి కాలువ దాటి వెళ్లాలి. దీంతో ఆ కాలువ అడ్డంగా ఉందని కాంక్రీట్ వేసి కప్పేశాడు. పనిలో పనిగా జాతీయ రహదారిని కూడా కొంత ఆక్రమించాడు. జాతీయ రహదారి అధికారులు ఎన్నిసార్లు నోటీసు లు ఇచ్చినా ఆ వ్యాపారి పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
సహకార సంఘ ఉద్యోగుల నిరసన
శ్రీకాకుళం అర్బన్: సహకార సంఘ ఉద్యోగులకు నష్టం చేసే జీఓ 322ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పేకల తేజేశ్వరరావు, పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాధ్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎర్నేని పాపినాయుడు, మెండ సత్యనారాయణ తదితరులు డిమాండ్ చేశారు. రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు గురువారం శ్రీకాకుళం డీసీసీబీ ప్రధాన కార్యాలయం వద్ద ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని 49 సంఘాలకు చెందిన ఉద్యోగులు జీఓ కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరికీ సమన్యాయం జరిగేలా జీవోను మార్పు చేసి, ‘కెపాసిటీ టు పే’ అనే నిబంధనను పూర్తిగా తొలగించాలని కోరారు. గతంలో ఉద్యోగులు చేసిన సమ్మె సందర్భంగా కమిషనర్, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఇవ్వాలని, గ్రాట్యుటీ పెంచాలని, 2019 తరువాత జాయినైన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 62 ఏళ్లకు పదవీ విరమణ వయస్సు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం డీసీసీబీ సీఈవోకు, జిల్లా సహకార అధికారికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో జిల్లా పీఏసీఎస్ ఉద్యోగులు యూనియన్ నాయకులు బల్లెడ రామారావు, సన్యాసిరావు, లక్ష్మీనారాయణ, దాసు, శ్రీనుబాబు, పడాల రఘు, సత్యనారాయణ జానకి తదితరులు పాల్గొన్నారు. -
కొత్తవి రావు..
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తుంటే.. ప్రభుత్వం పాత రేషన్ కార్డులు రద్దు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నెల 7, 8వ తేదీల్లో విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ిసీఎం చంద్రబాబు నాయుడు కార్డుల తొలగింపుపై దిశా నిర్దేశం చేశారు. ఉన్నకార్డులను తగ్గిస్తేనే సంక్షేమాలు అందించగలమని ఆయన స్పష్టం చేశా రు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతోంది. ఇప్పటివరకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పీజీఆర్ఎస్లోనూ, తహసీల్దారు కార్యాల యాల్లోనూ కొత్త కార్డుల కోసం దరఖాస్తులు వేల ల్లో వచ్చాయి. ఉన్న కార్డును విడగొట్టే వెసులుబాటు కూడా కల్పించలేదు. ఒక చోట నుంచి మరొక చోటుకి రేషన్ కార్డును మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. చాలా మంది ప్రజలు పిల్ల ల పేర్లను కార్డులో చేర్పించుకునేందుకు, కొత్తగా కార్డును తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,60,730 కార్డులు ఉన్నాయి. వీటిలో 19,39,082 యూనిట్లు ఉన్నాయి. వీటిలో బీపీఎల్, ఏఏవై, అంత్యోదయ వంటి కార్డులు కూ డా ఉన్నాయి. వీటిని తగ్గించేందుకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివాహం అయిన వారు, పిల్లలు పుట్టిన వారు, వా రికి ఉన్న కార్డులో కొత్తగా పేర్లు చేర్చుకునే అవకాశం లేదు. దీంతో వారు రేషన్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. పోర్టల్లోనూ ఈ ఆప్షన్లు పూర్తిగా తీసేశారు. కార్డుల ఏరివేత ప్రక్రియ వెనుక రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా.. వైఎస్సార్సీపీ హయాంలో కొత్త కార్డుకి దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారం తిరగకుండా కొత్త కార్డు మంజూరయ్యేది. మరుసటి నెల నుంచే బియ్యం వారికి చేరేది. ఈ కార్డు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులతో పాటు ఆరోగ్యశ్రీ పథకం ప్రయోజనం, పిల్లల చదువులు, రుణాలు, ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్మెంటు, ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఉపయోగపడేది.ఇప్పుడు ఆ భాగ్యం లేకుండా పోయింది. -
జిల్లాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?
● సీపీఎం నాయకుల సూటి ప్రశ్న శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాకు ఇదివరకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యు లు కోనారి మోహనరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీపీఎం కార్యాలయంలో గురువారం మీడి యా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల్లో వంశధార, ఆఫ్షోర్ రిజర్వాయర్తో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్ఛాపురం వరకు నీరందిస్తామని చెప్పిన హామీ నేటికీ నీటి మూటగా మిగిలిపోయిందన్నారు. నేరడి బ్యారేజ్కు ఎందుకు నిధు లు కేటాయించడం లేదని ప్రశ్నించారు. పైడిగాం ప్రాజెక్టు మరమ్మతులు చేస్తామని, కొండపేట లిఫ్ట్తో సహా అన్ని లిఫ్టులు మరమ్మతు చేస్తామన్న హామీ అమలు చేయలేదని విమర్శించారు. జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చేసిన వాగ్దానం నేటికీ అమలు చేయకపోవడంతో జీడి రైతులు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం నెరవేర్చ లేదన్నారు. వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామన్న హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బ ర్, శ్రీకాకుళం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రిమ్స్లో సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు అన్నీ హామీలు గానే ఉన్నాయన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం, వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలన్నారు. జిల్లాను విధ్వంసం చేసే కొవ్వాడ అను విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని, ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని, శ్రీకాకుళం జిల్లాను కార్పొరే ట్ కంపెనీలకు ఇస్తే శ్రీకాకుళానికి ప్రజలకు ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ లేకుండా పోతుందన్నారు. సరుబుజ్జిలి థర్మల్ పవర్ ప్లాంట్ రద్దు చేయాలని, భూసేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. -
చెస్తో మెదడుకు పదును
శ్రీకాకుళం న్యూకాలనీ : చెస్తో మెదడుకు పదును పెరుగుతుందని.. చదరంగం క్రీడాకారులు వారి జీవితాల్లో ఉన్నతంగా ఆలోచనలు చేయగలుగుతారని జీఎంఆర్ ఐటీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ జి.గిరీష్ పేర్కొన్నారు. శ్రీకాకుళం పెద్దపాడు రోడ్లో ఉన్న గ్రాండ్ కన్వెన్షన్ వేదికగా జరుగుతున్న ఐదు రోజుల ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు–2026 గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎస్ఎన్ ట్రస్ట్, గీతా చెస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీలను గ్రూప్–1 సెలెక్టడ్ డీఎస్పీ చౌదరి గౌరీతో కలిసి వీసీ గిరీష్ మొదటి ఎత్తువేసి టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. ఇటువంటి ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ పోటీలు శ్రీకాకుళంలో జరగడం అభినందనీయమని పేర్కొంటూ నిర్వాహకులను అభినందించారు. టోర్నీ నిర్వహణ ఏర్పాట్లు, చెస్ క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను టోర్నమెంట్ డైరెక్టర్ సనపల భీమారావు వివరించారు. రూ.5లక్షల నగదు బహుమతులు.. పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు రూ.5 లక్ష ల నగదు బహుమతులు అందజేయనున్నారు. ఈ టోర్నమెంట్లో 150 మంది ఇంటర్నేషనల్ రేటెడ్ ప్లేయర్లతో పాటు మొత్తం 335 మంది చెస్ క్రీడాకారులు దేశ నలుమూలల నుంచి హాజరయ్యారని టోర్నీ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ టి.సుధీర్ వెల్లడించారు. ఈ పోటీలకు పారిశ్రామికవేత్త సూర శ్రీనివాసరావు, ఊన్న నాగరాజు, సీఎస్ఎన్ ట్రస్ట్ ట్రస్టీ తాండ్ర సునీల్, ఎంజే సోలార్ జయరాజు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బగాది కిషోర్ హాజరై క్రీడాకారులను దీవించారు. ఇటువంటి ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్ మన జిల్లాలో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా, ఈ పోటీల్లో క్రీడాకారులు రెట్టించిన ఉత్సాహంతో పాల్గొంటున్నారు. -
మొక్కజొన్న పంట దగ్ధం
గార: కొర్ని గ్రామానికి చెందిన భీముని చిన్నబాబు కౌలుకి తీసుకొని సాగుచేస్తున్న మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. బుధవారం కొంత మొక్కజొన్న పంటను కోత కోసి పోగులు వేశారు. మిగిలిన పొలంలో చిన్న కుప్పలుగా వేసి ఉంచారు. గురువారం మంటలు వ్యాప్తి చెంది 70 సెంట్లలోని పంట అంతా కాలిపోయింది. కుప్పలుగా ఉన్న పొట్టలు సైతం కాలిపోవడంతో సుమారు రూ. 40 వేలు నష్టం వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పొలం మీదుగా వెళ్తున్న విద్యుత్ వైర్లు వల్ల గానీ, చుట్టుపక్కల ఎవరైనా కోతలు పూర్తయిన మొక్కలకు నిప్పు పెట్టడం వల్ల గానీ మంటలు వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. వీఆర్వో సన్యాసి పంటను పరిశీలించారు. -
18న అరసవల్లి ఆలయ హుండీ కానుకల లెక్కింపు
శ్రీకాకుళం : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18న హుండీ కానుకల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కిస్తామని తెలిపారు. రణస్థలం : లావేరు మండలం రావివలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం 5 గంటల సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 పశువులను లావేరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం, టెక్కలి, కోట బొమ్మాళి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో పట్టుబడిన 261 కిలోల గంజాయిని విశాఖ జిల్లా భీమునిపట్నం కాపులుప్పాడ గ్రామంలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ సమీపంలో ధ్వంసం చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు తెలిపారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డి.శ్రీకాంత్రెడ్డి సమక్షంలో ధ్వంసం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.రామచంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస : గాజులకొల్లివలస గ్రామానికి చెందిన వెలమరెడ్డి రాకేష్ (25) అనే యువకుడు బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. తండ్రి లేని రాకేష్ తన తల్లి మంగమ్మతో కలిసి గాజులకొల్లివలసలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి తల్లితో ఇంటి విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వెంటనే కిందకు దించి జొన్నవలస సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి మేనమామ కంచర్ల శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఆమదాలవలస: మండలంలోని తోటాడ గ్రామానికి చెందిన యువ పరిశోధకుడు తమ్మినేని సంతోష్ కుమార్ అరుదైన ఘనత సాధించి గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపీపీఎస్సీ) డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాలలో కామర్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సంతోష్ కుమార్ కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవలే ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ పరిశోధనను సమర్పించారు. అకడమిక్ రంగంలోను పోటీ పరీక్షల్లోనూ ఒకేసారి ప్రతిభ కనబరిచిన ఆయన విజయంపై గ్రామ ప్రజలు అధ్యాపకులు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన ఈ ఘనతతో తోటాడ గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. -
ఇంజినీరింగ్ విద్యార్థులకు క్యాంపస్ డ్రైవ్
ఎచ్చెర్ల : ప్రైవేటు విద్యుత్ రంగంలో కీలక భాగస్వామిగా ఉన్న సుజ్లాన్ పవర్ జెనరేటింగ్ కంపెనీ (అనంతపురం) గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వాక్–ఇన్డ్రైవ్కు మంచి స్పందన లభించింది. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ఈ డ్రైవ్లో ఆపరేషన్ ఇంజినీర్, సైట్ ఇంజనీర్, సైట్ క్వాలిటీ ఇన్చార్జ్, సైట్ స్టోర్ ఇన్చార్జ్ తదితర ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. బీఆర్ఏయూలోని ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు హాజరయ్యారు. వైస్ చా న్సలర్ కె.ఆర్.రజనీ డ్రైవ్ను ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. కాగా, 30 మందిని ఉద్యోగాల కోసం ఎంపిక చేయగా, మరో 40 మందిని ఆరు నెలల శిక్షణ కోసం ఎంపికచేశారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖరరావు, అధ్యాపకులు టి.భవానీ, బి.వ్యాసగీత, సీహెచ్ శ్రా వణి తదితరులు డ్రైవ్ను పర్యవేక్షించారు. కంపెనీ హెచ్ఆర్లు కె.నానాజీ, పి.వి.మోహన్, ప్రతినిధు లు పార్ధు, ఇందుకుమార్, శంకరరావు పాల్గొన్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
గార: రామచంద్రాపురం పంచాయతీ సెగిడిపేట గ్రామానికి చెందిన కర్రి త్రినాథరావు (45) గురువా రం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. త్రినాథరావు ఒప్పంగిలోని మిల్లులో కలాసీగా పనిచేస్తున్నాడు. మూడు రోజులుగా పనికి వెళ్లకుండా రోజూ మద్యం తాగుతున్నాడు. తాగవద్ద ని భార్య మందలించడంతో గురువారం సాయంత్రం మళ్లీ మద్యం తాగి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం శ్రీకాకు ళం రిమ్స్కు తరలించారు. భార్య రాంబాయి ఫిర్యా దు మేరకు హెచ్సీ రవిబాబు కేసు నమోదు చేశారు. త్రినాథరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పీఎం పాలెం (విశాఖ): భవన నిర్మాణ పనుల కోసం విశాఖ నగరానికి వచ్చిన ఓ తాపీ మేసీ్త్ర ప్రమాదవశాత్తు పై అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన విషాద ఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పీఎం పాలెం సీఐ జి.బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శ్రీకూర్మానికి చెందిన ఉంకుల రాము (47) క్రికెట్ స్టేడియం సమీపంలోని ఒక నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తున్నాడు. పగలు పని ముగించుకుని రాత్రి అదే భవనం నాలుగో అంతస్తులో తోటి కార్మికులతో కలిసి నిద్రించాడు. తెల్లవారుజామున రాము కనిపించకపోవడంతో తోటి వారు వెతకగా, భవనం ప్రహరీ అవతల శవమై కనిపించాడు. రాత్రి సమయంలో నిద్రమత్తులో భవనం అంచుకు వెళ్లినప్పుడు రక్షణ గోడ లేకపోవడంతో ప్రమాదవశాత్తు కింద పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాముకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు యుగంధర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. -
పేదలపై కక్ష కట్టారు
శ్రీకాకుళం: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి ధర్మా న ప్రసాదరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేటలో ఆరుగురు మత్స్యకారులపై ప్రభుత్వం కక్ష కట్టి వారి ఇళ్లను అప్పగించకపోగా.. గురువారం ఆయన గ్రామానికి వెళ్లి ఆరుగురు మత్స్యకారులతో దగ్గరుండి గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కొత్త సంక్షేమ పథకాలను ఇవ్వకపోగా గత ప్రభుత్వంలో ఇచ్చి న వాటిని కూడా వెనక్కి లాక్కుంటున్నారని, అలాంటి పరిస్థితే కుందువానిపేటలో నెలకొందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో కుందువానిపేట గ్రామంలో 147 ఇళ్లు నిర్మించి పేదలైన మత్స్యకారులకు ఇచ్చారని తెలిపారు. వీరిలో ఆరుగురు లబ్ధిదారులు అనివార్య కారణాల వల్ల ఇళ్లను అప్పట్లో స్వాధీనం చేసుకోలేకపోయారని, అయితే వారికి అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చామన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత స్థానికంగా ఉన్న కొందరు దళారులు ఈ ఆరుగురిని ఆ ఇళ్లలో గృహప్రవేశం చేయనీయకుండా చేశారని, అధికారులతో అల్లరి పెట్టించారని తెలిపారు. ఈ కారణంగానే తాము దగ్గర ఉండి పేదలకు ఇళ్లు అప్పగించినట్లు చెప్పారు. వైఎస్సార్ సీపీ హ యాంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, చంద్రబాబు రెండేళ్ల వ్యవధిలో ఒక్క ఎకరా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు గృహ ప్రవేశాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చెత్త నుంచి సంపద సృష్టిస్తానంటూ చంద్రబాబు జిల్లా వస్తున్నారని, ఆయన మరో మూడేళ్లు ఇలా నే ప్రజలను మభ్య పెడుతుంటారని చురకలు అంటించారు. వైఎస్సార్ సీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రులు ఎంత బలోపేతమయ్యాయో అందరికీ తెలుసని, ఇప్పుడు చంద్రబాబు వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నారని, టెక్కలి ఆస్పత్రే దానికి నిదర్శనమన్నారు. వైఎస్ జగన్ 17 వైద్య కాలేజీలు మంజూరు చేస్తే వాటినీ ప్రైవేటీకరించడానికి చూశారన్నారు. గడిచిన వారం రోజులుగా కలెక్టర్ నరసన్నపేట వెళ్లి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని, మరి జిల్లా పరిపాలన ఎవరు చూస్తారని సూటి గా ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఆనవాళ్లను చెరిపేయాలనే దురుద్దేశంతోనే సచివాలయాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు గత ప్రభుత్వ హయాంలో గుండె మీద చెయ్యి వేసుకుని ఉండేవారని, ఇప్పుడు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని తెలిపారు. ఎరువులు కూడా నల్ల బజారుకు తరలిపోతున్నాయని, రెట్టింపు ధరలు ఇచ్చి కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో రూ.1000 కోట్లయినా జిల్లాకు కేటాయించారా అని ప్రశ్నించారు. కుందువానిపేటలో ఇప్పటికీ 60 మందికి మత్స్యకార భరోసా మంజూరు కానట్లు తనకు దృష్టికి వచ్చిందన్నారు. బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్కు వైఎస్ జగన్ పునాది వేస్తే.. చంద్రబాబు ప్రభు త్వం దాన్ని నిలిపివేసిందన్నారు. పార్టీ యువ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో వచ్చిన సంక్షేమ పథకా లు ప్రస్తుతం రెండేళ్లుగా పడుతున్న కష్టాలు బేరీజు వేసుకొని భవిష్యత్లో ఎవరికి మద్దతు ఇవ్వాలో ప్రజలు నిర్ణయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రూరల్ మండలం ఎంపీపీ అంబటి నిర్మల, జెడ్పీటీసీ రుప్ప దివ్య, గార ఎంపీపీ గొండు రఘురాం, గేదెల పురుషోత్తం, చల్ల రవి, తాతబాబు, సూర్యం, పొన్నాడ రుషి, అంబటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల!
నరసన్నపేటలో మహిళా మార్టు ఈ దశకు రావడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఒక వైపు మహిళలను పారిశ్రామికులుగా తీర్చిదిద్దుతామని గొప్పలు చెప్పుకుంటూ మరో వైపు డీఆర్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న మహిళా మార్టులను ఇలా నిర్వీర్యం చేస్తున్నా రు. చెప్పేది ఒకటి చేసేది మరొకటి. దీనికి నరసన్నపేట మహిళా మార్టే నిదర్శనం. – జి.వి.రమణి, చల్లవానిపేట గతంలో మహిళా మార్ట్ బా గా నడిపాం. చాలెంజ్గా తీసుకొని నిర్వహించాం. ఎప్పుడూ కొనుగోలుదారులతో కళకళలాడేది. నెలకు కనీసం రూ.30 లక్షలు అమ్మకాలు చేసేవారం. మంచి లాభాలు కూడా వచ్చాయి. మమ్మల్ని సెర్ప్ అధికారులు మెచ్చుకున్నారు. రాష్ట్రంలో నరసన్నపేట మహిళా మార్టు మోడల్ గా నిలిచింది. – చింతు శ్రీదేవి, ఎంఎంఎస్ పూర్వపు అధ్యక్షురాలు నరసన్నపేట : మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఏర్పాటైన మహిళా మార్టులు తిరోగమన దిశలో పయనిస్తున్నాయి. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అలంకారప్రాయంగా మారాయి. నరసన్నపేటలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వెలుగు మహిళా మార్టు నిత్యం కొనుగోలుదారులతో కళకళలాడేది. వేలాది రూపాయల్లో వ్యాపారం జరిగేది. నేడు కనీస స్థాయిలో కూడా వ్యాపారం జరగడంలేదు. గతంలో పది మంది సిబ్బంది ఉండే వారు. నేడు ఒక్కరే ఉంటున్నారు. సరుకులు కూడా నిండుగా ఉండేవి. ఇప్పుడు సెల్ఫ్లు అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. దీనంతటికీ కారణం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2022 డిసెంబర్ 14న ప్రారంభం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్ 22న నరసన్నపేటలో మహిళా మార్టును అప్పటి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. డీఆర్డీఏ, సెర్ప్ అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి మార్ట్ను నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకు ఇక్కడ లభించేవి. రాష్టంలోనే నరసన్నపేట మహిళా మార్టు అమ్మకాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఎప్పుడూ ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే వరకూ రూ.3.94 కోట్లు మేర అమ్మకాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మహిళా మార్టు పూర్వ వైభవం తగ్గింది. రోజురోజుకూ అమ్మకాలు తగ్గుతూ వచ్చాయి. ఉన్న సరుకులు ఖాళీ చేశారు. కొన్నింటికి కాలపరిమితి అయిపోయిందని చెప్పి సిబ్బంది ఇళ్లకు తరలించేశారు. అనంతరం కొన్నాళ్లు మూతపడింది. స్థానికంగా వస్తున్న విమర్శలతో వెలుగు మహిళా మార్టుగా పేరు మార్చి ప్రస్తుత ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి జనవరిలో ఆర్భాటంగా ప్రారంభించారు. ఆ నెలంతా బాగానే నడిచింది. ఆ తర్వాత అమ్మకాలు రోజురోజుకీ తగ్గుతూ వచ్చాయి. గడిచిన 10 రోజులుగా ఒక్క రూపాయి కూడా అమ్మకాలు చేయడం లేదు. ఇలా మహిళా మార్టును అలంకారప్రాయంగా వదిలేయడానికి డీఆర్డీఏ అధికారుల్లో సరైన కార్యాచరణ లోపమేనని తెలుస్తోంది. స్థానిక అధికారులు సరైన దృష్టి పెట్టకపోవడం.. ఎంఎంఎస్ సభ్యులు పట్టించుకోకపోవడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. మహిళా మార్టులో అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎందుకు అమ్మకాలు పడిపోయాయో సమీక్ష చేస్తాను. మా వద్ద కొనుగోలుదారులు అధికంగా ఉన్నారు. స్వయం శక్తి సంఘాల సభ్యులు వచ్చి కొనుగోలు చేస్తే అమ్మకాలు వాటంతట అవే పెరుగుతాయి. అయితే మహిళలు ఇటు వైపు చూడటం లేదు. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి అమ్మకాలు పెరిగేలాచర్యలు తీసుకుంటాం. – పి.కిరణ్కుమార్, డీఆర్డీఏ పీడీ -
సిండికేట్ దందా
పనిలో పనిగా కల్తీ! గౌతు శిరీష ఇలాకాలో.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మహిళా ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్న పలాస నియోజకవర్గంలో మద్యం సిండికేట్ బరితెగించింది. ‘తమ్ముళ్లు’ సిండికేట్గా మారి మందుబాబులను నిలువునా దోచేస్తున్నారు. ఎంఆర్పీకి మించి విక్రయాలు చేసి జేబులు నింపుకుంటున్నారు. లైసెన్సు దుకాణాల్లో కౌంటర్లో క్వార్టర్పై రూ.10 నుంచి రూ.20 వరకు, బార్లో రూ.20 నుంచి రూ.50 వరకు, బెల్ట్షాపుల్లో క్వార్టర్పై ఏకంగా రూ.50 పెంచి విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల కల్తీ మద్యం విక్రయిస్తున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అభాగ్యులు, రోగులు, అనాథల పాలిట మానవతావాది, విశ్వమాత పేరుతో విద్యా సంస్థలను నడుపుతున్న ‘బాబే’ సిండికేట్ బాస్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అంతా బాబు కనుసన్నల్లో... పలాస నియోజకవర్గంలో తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని గ్రామాలు కనిపిస్తాయి గానీ మద్యం లేని గ్రామం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. పగలు రాత్రీ తేడా లేకుండా అన్ని వేళల్లోనూ మద్యం అందుబాటులో ఉంటుంది. లైసెన్సు దుకాణాలు, బార్లే కాదు బెల్ట్షాపులు కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. సిండికేట్ బాబు ఆధ్వర్యంలో ఇష్టారీతిన ధరలు పెంచేసి విక్రయిస్తున్నారు. ఎక్కడ ఎవరెంతకు అమ్మాల్లో అంతా ఆ బాబే నిర్ణయిస్తున్నారు. ఎవరికి ఇవ్వాల్సిన ముడుపులు వారికి అందుతుండటంతో రెచ్చిపోయి అమ్మకాలు సాగిస్తున్నారు. సమయం దాటినా లైసెన్సు దుకాణాల వెనక భాగంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారు. ఇక బెల్ట్షాపుల సంగతి సరేసరి. మహిళా ఎమ్మెల్యే ఇలాకాలో బరితెగింపు జిల్లాలో ఎంఆర్పీకి మించి విక్రయాలు ప్రారంభించిన మొదటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది పలాసే. దాని తర్వాతే మిగతా ప్రాంతాల్లో అధిక ధరలు మొదలయ్యాయి. మిగతా అన్ని చోట్ల ఒక ఎత్తు అయితే పలాస మరో ఎత్తు. ఎందుకంటే, ఇక్కడ టీడీపీకి చెందిన మహిళా ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉందని గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో మద్యం సిండికేట్ బరితెగించి విక్రయాలు చేపట్టడం చర్చనీయాంశమైంది. అయినా ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదు. అడపాదడపా నిలదీస్తే దౌర్జన్యం చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఏం చేసుకుంటే చేసుకో అనే ధోరణికి వెళ్లిపోయారు. ఇక్కడ సిండికేట్కు కొమ్ము కాస్తున్నది పెద్దలు కావడమే కారణం. బెల్ట్షాపులకై తే అడ్డూ అదుపు లేకుండాపోయింది. వీధికి నాలుగైదు ఉన్న ఈ షాపుల్లో క్వార్టర్పై రూ.50పెంచి అమ్ముతున్నారు. పలాసలో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు ‘బాబు’ నాయకత్వంలో బరి తెగింపు ఎమ్మార్పీకి మించి విక్రయాలతో రూ.కోట్లలో అక్రమార్జన క్వార్టర్ బాటిల్పై లైసెన్సు దుకాణాల్లో రూ.10 నుంచి రూ.20 పెంపు బార్లు, బెల్ట్షాపుల్లో రూ.50 వరకు వడ్డన అమ్మకాలు జోరుగా సాగుతుండటం, మందుబాబులను ప్రోత్సహించేలా ఎక్కడికక్కడ దుకాణాలు తెరవడంతో మద్యం ఏరులై పారుతోంది. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ వార్డుకు వెళ్లినా ముందుగా కన్పించేవి మద్యం షాపులు, బెల్ట్షాపులే. ఇదే అవకాశంగా తీసుకుని కొందరు కల్తీ మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రహస్య ప్రాంతాల్లో కల్తీ చేసి, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి మూతలు, సీసాలు తీసుకొచ్చి, గుట్టుగా విక్రయాలు కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా బెల్ట్షాపుల్లో కల్తీ మద్యాన్ని ఎక్కువగా అమ్ముతున్నారు. అక్కడైతే ఎవరూ పసిగట్టలేరని కల్తీ మద్యానికి గేట్లెత్తేశారు. రాజకీయ నాయకుల అండదండలతో రూ.కోట్లలో అక్రమంగా సిండికేట్ ఆర్జిస్తోంది. తలా ఇంత అని పంచుకుని, చూసీ చూడనట్టు వదిలేస్తున్న పెద్దలకు ముడుపులు ముట్ట జెప్పి తమ వ్యాపారానికి ఆటంకాలు లేకుండా చేసుకుంటున్నారు. -
చిరుద్యోగికి సమగ్ర శిక్ష
దారుణం.. ఇది చాలా దారుణం. ఎన్ని కల్లో కూటమి ప్రభుత్వం కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తోంది. దశాబ్దాలుగా పనిచేస్తూనే ఉన్నాం. మాతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నా రు. ఆందోళన కార్యక్రమాలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. – మెరక పోతయ్య, సమగ్ర శిక్ష మెసెంజర్స్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనీస వేతనం అమలు చేయాలి పెరిగిన నిత్యావసర ధరలకు సరిపడా వేతనాలు మాకు లేవు. ఉద్యోగ భద్రత లేదు. సమాన పనికి సమాన వేతనమైనా అమలుచేయాలి. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ సమాన పనికి సమాన వేతనం ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కనీస వేతనం అందించి ఆదుకోవాలి. – బోర గోవిందరావు, సీఆర్ఎంటీ, హిరమండలం హిరమండలం: సమగ్ర శిక్షలో చిరుద్యోగులు సమగ్రమైన శిక్ష అనుభవిస్తున్నారు. దశాబ్దాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి పనికి తగ్గ ప్రతిఫలం రావడం లేదు. కూటమి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా సమ్మె బాట పడుతున్నారు. ఈ నెల 15 నుంచి సమ్మెను ఉద్ధృతం చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే అన్ని మండలాల్లో ఆందోళనకు హాజరయ్యేందుకు వీలుగా విద్యాశాఖ అధికారులకు సామూహిక సెలవు నోటీసులు అందజేశారు. ఒకేసారి సమగ్ర శిక్ష సిబ్బంది రోడ్డెక్కితే విద్యాశాఖకు సంబంధించి కార్యకలాపాలు నిలిచిపోయే అవకాశం ఉంది. ఇదీ పరిస్థితి.. జిల్లాలో సమగ్ర శిక్ష కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 1,398 మంది పనిచేస్తున్నారు. కేజీబీవీ, డీపీఓ, ఏపీసీ, ఎంఈఓ, భవిత సెంటర్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఎక్కువ మంది పనిచేస్తున్నారు. సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్లు, ఐఈఆర్టీలు, టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్, ఆయాలు, ఫిజియోథెరపిస్టులు, మండల లెవల్ అకౌంటెంట్లు, ఇలా అందరూ సమ్మెబాట పడుతున్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు మించి విద్యాశాఖలో దశాబ్దాలుగా సేవలందిస్తుంటే పనికి తగ్గ వేతనం కూడా వీరికి అందడం లేదు. హామీలు బుట్టదాఖలు.. సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం అందిస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లవుతున్నా ఆ హామీకి అతీగతీ లేకుండా పోయింది. తీరా ఇప్పుడు సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాల పెంపు తమ పరిధిలో లేదని.. అది కేంద్ర పరిధిలోనిది అంటూ దాట వేస్తున్నారు. దేశంలోనే మన రాష్ట్రంలోనే మెరుగైన వేతనాలు అందిస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై సమగ్ర శిక్ష ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పొమ్మన లేకుండా పొగపెడుతున్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేసే అకౌంటెంట్లు మూడేసి చోట్ల పనిచేయాల్సి వస్తోంది. వీరికి ట్రావెలింగ్ అలవెన్స్లు ఇవ్వడం లేదు. ప్రతిరోజూ వీరు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. మరోవైపు పని సర్దుబాటు కింద సీఆర్టీలకు 100 కిలోమీటర్ల దూరంలోకి పంపిస్తున్నారు. వేతనాలు కూడా పెంచలేదు. పెరిగిన నిత్యావసరాలతో చాలీచాలని జీతాలతో ఎలా బతికేది అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాటవేత ధోరణి.. సమగ్ర శిక్ష అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడిచే ప్రాజెక్టు. ప్రధాన యజమాని రాష్ట్ర ప్రభుత్వమే. బడ్జెట్ను అవసరాల మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఉద్యోగుల వేతనాల పెంపు, సర్వీసు నిబంధనలు, క్రమబద్ధీకరణ, సంక్షేమ సౌకర్యాలు వంటివి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఈ విషయాన్ని కేంద్రమే పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఇదే పథకం కింద కేంద్ర వాటా 60 శాతం నిధులతో పంజాబ్, హరియాణా, హిమాచల్ప్రదేశ్, మణిపూర్, సిక్కిం, మధ్యప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలతో పాటు రాయితీలు ఇస్తున్నాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వంపై నెపం పెట్టి తప్పించునే ప్రయత్నం చేస్తోంది. సమగ్ర శిక్ష ఉద్యోగులపై కత్తికట్టిన కూటమి సర్కారు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై వివక్ష సమాన పనికి సమాన వేతనం లేని వైనం జీతాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దాటవేత పొమ్మనలేక పొగ పెడుతున్న వైనం -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎచ్చెర్ల: మండలంలో అల్లినగరం జంక్షన్ సమీపంలోని వేబ్రిడ్జి ఎదురుగా బుధవారం ఉదయం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలంలోని రొంపివలస గ్రామానికి చెందిన మహంతి తిరుపతిరావు (33) అనే వ్యక్తి మృతి చెందాడు. తిరుపతిరావు కుమార్తెకు బాగులేదని మంగళవారం రాత్రి శ్రీకాకుళం ఆస్పత్రికి వెళ్లి, బుధవారం ఉదయం తిరిగి ఇంటికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉదయం 8.30 గంటల సమయంలో అల్లినగరం వేబ్రిడ్జి ఎదురుగా రోడ్డు క్రాస్ చేస్తుండగా, విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో తిరుపతిరావుకు గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి 108 ద్వారా రిమ్స్కు చికిత్స నిమిత్తం తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తిరుపతిరావుకు భార్య సీతతో పాటు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా కారు నడపడంతో... వజ్రపుకొత్తూరు: మండలంలోని దేవునల్తాడలో బుధవారం వేకువజామున కారు ఢీకొన్న ప్రమాదంలో సారవకోట మండలం సవరబెజ్జి గ్రామానికి చెందిన చౌదరి సింహాచలం(21) అక్కడికక్కడే మృతి చెందాడు. రెళ్ల ఆనంద్ అనే వ్యక్తి కారును నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో నడపడంతో ప్రమాదం జరిగినట్లు వజ్రపుకొత్తూరు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. దేవునల్తాడ గ్రామంలో మంగళవారం పెద్దమ్మ తల్లి గ్రామ దేవత ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12వ తేదీ రాత్రి దేవుల్తాడ సముద్ర తీరం వద్ద స్టేజీ ప్రోగ్రాం జరిగింది. మృతుడు తన అత్త మణిరత్నం గ్రామమైన పూండి– గోవిందపురం పంచాయతీ మెట్టపేట(సీతంపేట) వెళ్లి అక్కడ నుంచి స్నేహితులు జి.తేజేశ్వరరావు, సవర గౌతమ్లతో కలిసి స్టేజీ ప్రోగాం చూసేందుకు దేవునల్తాడ వెళ్లారు. మృతుడు సింహాచలం స్టేజీ ప్రోగ్రాం చూస్తూ అక్కడే ఉన్న సీసీ రోడ్డు పక్కన నిద్రలోకి జారుకున్నాడు. ఇది గమనించకుండా నిందితుడు రెళ్ల ఆనంద్ సీసీ రోడ్డుపై నిద్రిస్తున్న చౌదరి సింహాచలం చాతిపై నుంచి మితిమీరిన వేగంతో కారును నిర్లక్ష్యంగా నడపడంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు సింహాచలం ఐటీఐ చదువుతున్నాడని తెలిపారు. దీంతో దేవునల్తాడ చేరుకున్న మృతుని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై రోదించారు. మృతుని తండ్రి చౌదరి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం కోసం పలాస ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ కె.వైకుంఠరావు తెలిపారు. -
మందకొడిగా..!
శ్రీకాకుళం: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య సమస్య క్యాన్సర్. క్యాన్సర్లో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ.. మహిళలను తీవ్రంగా వేధిస్తున్నది గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్. క్యాన్సర్ నివారణకు గతంలో ఎటువంటి వైద్యం గానీ, టీకాలు కానీ ఉండేవి కాదు. ఇటీవల కాలంలో ఆధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందుబాటులోకి రాగా, తాజాగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు హెచ్పీవీ పేరిట వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యాక్సిన్ను తీసుకోవడం వలన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించవచ్చు. 14 ఏళ్లు నిండిన బాలికలకు ఈ టీకాను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ టీకాను వైద్య ఆరోగ్య శాఖ ద్వారా యువతులకు అందుబాటులోనికి తీసుకొచ్చింది. ఈ టీకా వల్ల క్యాన్సర్ మాత్రమే కాకుండా లైంగికంగా సంక్రమించే తొమ్మిది రకాల వైరస్లను అరికట్టవచ్చు. అలాగే వైజెనల్ క్యాన్సర్, పల్వర్ క్యాన్సర్ను కూడా నివారించవచ్చు. ఈ టీకా ఖరీదు బయట మార్కెట్లో రూ.7,000ల నుంచి రూ.9,000ల వరకు ఉంది. రెండు డోసులు కలిగిన టీకా తొమ్మిది రకాల వైరస్లను, మూడు డోసులు కలిగిన టీకా ఏడు రకాల వైరస్ను అరికడుతుంది. అయితే బాలికలు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన లేకపోవడం, కొందరికి టీకా వలన ఏదో జరుగుతుందన్న అపోహ ఉండడం వల్ల జిల్లాలో స్పందన అంతంతమాత్రంగానే ఉంది. ఈ టీకా కొత్తగా తీసుకొచ్చింది కాదు. 2008 నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ.. ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల ధనిక వర్గాలు సైతం ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా వచ్చారు. అయితే ప్రస్తుతం క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదీ పరిస్థితి... శ్రీకాకుళం జిల్లాలో వైద్యారోగ్య శాఖ ద్వారా అన్ని పీహెచ్సీల్లో హెచ్పీవీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ మందకొడిగా వ్యాక్సినేషన్ జరుగుతోంది. జిల్లాలో 14,036 మంది బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, గడిచిన రెండు నెలల్లో 6,000 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. వైద్యారోగ్య శాఖ ప్రచారం కూడా అంతంత మాత్రమే ఉండడం, బాలికలు తల్లిదండ్రుల్లో అనేక అపోహలు ఉండడం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. వైద్యారోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, బాలికలు.. వారి తల్లిదండ్రుల్లో అపోహలు తొలగించేలా ప్రచారం చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది. హెచ్పీవీ వ్యాక్సిన్ బాలికలకు ఎంత అవసరమో.. 17 ఏళ్ల దాటిన యువకులకూ అంతే అవసరం. యువకులు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే వారు తొమ్మిది రకాల వైరస్ల నుంచి రక్షణ పొందడంతో పాటు, వారి జీవిత భాగస్వామికి క్యాన్సర్ వంటి మహమ్మారిని అంటించకుండా ఉండేందుకు దోహదపడుతుంది. దీనిపై అపోహల తొలగించేందుకు గానూ ఇప్పటివరకు డాక్టర్ దానేటి చారిటబుల్ ట్రస్టు ద్వారా 135 మందికి ఉచితంగా వ్యాక్సినేషన్ జరిపాను. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అభినందనీయం. దీనిని యువతులు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ దానేటి శ్రీధర్, సీ్త్ర వైద్య నిపుణులు -
పాతపట్నం మాజీ ఎమ్మెల్యే.. పగడాలమ్మ మృతి
● 1972లో తొలి దళిత మహిళా ఎమ్మెల్యేగా విజయం ● జీవిత చరమాంకంలో పేదరికంతో ఇబ్బంది మెళియాపుట్టి/హిరమండలం: సాధారణంగా సర్పంచ్ అయితేనే దర్పం చూపే రోజులివి. కానీ ఓ మహిళ ఎమ్మెల్యేగా ఆరేళ్ల పాటు పదవీ బాధ్యతలు నిర్వర్తించినా కనీసం సరైన ఇల్లు సమకూర్చుకోలేదు. కుటుంబ జీవనం కోసం ఉపాధి పనులకు సైతం వెళ్లారు. ఆమే పాతపట్నం మాజీ ఎమ్మెల్యే చుక్కా పగడాలమ్మ(80). బుధవారం అనారోగ్య సమస్యలు, వయోభారంతో చనిపోయారు. ఎమ్మెల్యేగా పాతపట్నం నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులు తెచ్చిన ఆమె చివరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ తుదిశ్వాస విడిచారు. మెళియాపుట్టి మండలం ముక్తాపురం గ్రామానికి చెందిన పగడాలమ్మ 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో ఏకై క దళిత మహిళా ఎమ్మెల్యే పగడాలమ్మ కావడం విశేషం. ఆ ఎన్నికల్లో 7,500 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాడు ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావు ఉండేవారు. మహిళా ఎమ్మెల్యే కావడంతో పగడాలమ్మ పట్ల చాలా అభిమానంతో ఉండేవారు. అక్కడికి ఏడాదికే జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. నాడు జై ఆంధ్ర ఉద్యమంతో ఏడాది అదనంగా అసెంబ్లీ పదవీకాలాన్ని పొడిగించారు. దీంతో ఆరేళ్ల పాటు పాతపట్నం ఎమ్మెల్యేగా కొనసాగారు. చదువు రాకపోయినా భర్త దాసు సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారు. పాతపట్నం ఆల్ ఆంధ్రా రహదారి ఆమె హయాంలోనే నిర్మించారు. అనూహ్యంగా రాజకీయాల్లోకి.. సాధారణ గృహిణిగా ఉన్న పగడాలమ్మకు అనూహ్య రీతిలో ఎమ్మెల్యేగా అవకాశం దక్కింది. అప్పట్లో పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లాలోని పార్వతీపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఉండేది. 1972 ఎస్సీలకు రిజర్వ్ కావడంతో అప్పటి మాజీ మంత్రి లుకలాపు లక్ష్మణదాస్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీని కలుసుకునేందుకు ఢిల్లీ వెళితే అప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. 1978లో పాలకొండ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందడంతో క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఈమెకు ముగ్గురు కుమార్తెలు. కుమారులు లేకపోవడంతో చిన్నల్లుడు మాధవరావు, జయసుధల ఇంట్లోనే ఉంటున్నారు. నాలుగేళ్ల కిందట భర్త అనారోగ్యంతో మృతిచెందారు. కుటుంబ జీవనం కోసం ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ కూలీగా కూడా వెళ్లాల్సి వచ్చింది. వైఎస్సార్ నుంచి పిలుపు.. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి రెండోసారి గెలుపొందిన తర్వాత పగడాలమ్మకు కబురొచ్చింది. పగడాలమ్మ వెళ్లడానికి కొన్నిరోజుల ముందే ఆయన మృతిచెందడంతో ఆమె కన్నీరుమున్నీరయ్యారు. -
● కాగితాకృతులు
నా పేరు లోకనాథం మాధురి. నేను కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నాకిష్టమైన పేపర్ క్రాఫ్ట్ నేర్చుకున్నాను. 3డి పెస్టింగ్ టెక్నిక్తో వినూత్నంగా అందమైన ఆకృతులను తయారు చేశారు. శ్రీరాముడు, సీతా దేవి రూపాలను, చెట్లు, కోతి, జింకలను కట్ చేసి 3డి పేస్టింగ్ టెక్నిక్తో అమర్చి అడవిలో ఉన్నట్లు సృష్టించాను. ఈ చిత్రంలో అరణ్యంలో శ్రీరాముడు సీతాదేవికి కొండ దిగేందుకు సహాయం చేస్తున్న పవిత్రమైన క్షణాన్ని చూపించాను. రెండో బొమ్మను కాన్వాస్ స్టిక్కర్ను చెక్క ఫ్రేమ్పై అమర్చి, దానిని నలుపు రంగుతో పెయింట్ చేసి, గోపురం ఆకృతిని ట్రేస్ చేసి, అక్రిలిక్ వైట్ పెయింట్తో గోపుర రూపాన్ని చిత్రించాను. స్విచ్ ఆన్ చేసినప్పుడు గోపురం నిజమైన దేవాలయ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ప్రకాశిస్తుంది. –శ్రీకాకుళం కల్చరల్ -
సరికొత్తగా ‘ఉపాధి’
● ‘వీబీ జీ రామ్ జీ’ జూలై 1 నుంచి అమలు ● వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో వేతనం జమ ● జిల్లాలో సుమారు లక్షన్నర మంది వేతనదారులు శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో తీసుకొచ్చిన వికసిత్ భారత్– గ్యారంటీ రోజ్ గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ)..వీబీ జీ రామ్ జీ చట్టం జూలై ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ముందుగా ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ ఒకటి) నుంచి ప్రారంభమవుతుందని భావించినా సంబంధిత పథకం సాఫ్ట్వేర్, ఇతర పరిస్థితులు సమకూరలేదు. ఈ నేపథ్యంలో జూలై ఒకటి నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం జిల్లాలో సుమారు 1,40,000 మంది ఉపాధి పనులు చేస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు పనులు నిర్వహిస్తున్నారు. నేరుగా ఖాతాల్లోకి వేతనాలు.. వీబీ జీ రామ్ జీ చట్టం ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పాటు ఉపాధి కల్పించనున్నారు. ప్రస్తుతం ఉన్న 100 రోజుల ఉపాధి దినాల సంఖ్య మరో 25 రోజులకు పెరగనుంది. పని కోరిన వారికి నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. పని ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా వేతనదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో వేతనం జమ చేస్తారు. మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించాలి. అలస్యమైతే ఆందుకు పరిహారం సైతం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే వీబీ జీ రామ్ జీ కోసం 2026–27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూ.35,692.31 కోట్లను కేటాయించింది. గ్రామీణ ఉపాధి పథకాల చరిత్రలో ఇదే అత్యధిక బడ్జెట్ కేటాయింపు అని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే రాష్ట్రాలవాటా తప్పని సరిగా ఉండాలి. ఈ రెండు వాటాలతో కలిపే బిల్లు చెల్లింపులు జరుగుతాయి. పనులు యథాతథం.. ఇప్పటికే చేపట్టిన పాత పనులు అంటే ఉపాధి హామీ పథకం ద్వారా కేటాయించి ప్రారంభించిన పనులు జూన్ 30 వరకు యధావిధిగా కొనసాగుతాయని జిల్లా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను కొత్త చట్టంలోకి మార్చనున్నారని, కార్మికులకు ఉపాధి, వేతనాల విషయంలో ఎలాంటి అంతరాయం ఉండదని అంటున్నారు. కొత్త చట్టంలో రోజ్గర్ కార్డులు వచ్చేంతవరకు ప్రస్తుతం ఉన్న జాబ్ కార్డులే అమల్లో ఉంటాయని పేర్కొంటున్నారు. -
సీఎం పర్యటన ఖరారు
నరసన్నపేట: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఉదయం 10.40 గంటలకు నరసన్నపేట మండలం తామరాపల్లి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని ప్రజావేదికకు హాజరవుతారు. మధ్యాహ్నం 1.20 గంటలకు పట్టణ శివార్లులోని డంపింగ్యార్డ్కు వెళ్లి సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తామరాపల్లి వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరై సాయంత్రం 3.40 గంటలకు తిరిగి బయలుదేరుతారు. ఈ మేరకు హెలీప్యాడ్ ఏర్పాట్లను ఎస్పీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ బుధవారం పరిశీలించారు. డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై గణేష్లకు పలు సూచనలు చేశారు. అలాగే టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తికి జేసీ పలు సూచనలు చేశారు. వైభవంగా ఆదిత్యుని కల్యాణం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి కల్యాణ సేవ బుధవారం ఉదయం అనివెట్టి మండపంలో ఘనంగా నిర్వహించారు. వైశాఖ బహుళ ఏకాదశి సందర్భంగా ఉషా పద్మిని ఛాయా దేవేరులతో కూడిన సూర్యనారాయణస్వామి వారి ఉత్సవమూర్తులను కల్యా ణమూర్తులుగా అలంకరించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ ఆగమశాస్త్రం ప్రకా రం కల్యాణం జరిపించారు. భక్తదంపతులకు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారట..! నరసన్నపేట: ‘ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు వైద్యం సక్రమంగా అందించండి.. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ వైద్యు లు ఆసుపత్రిలో ఉండాలి.. నరసన్నపేట ఆసుపత్రిలో మాత్రం వైద్యులు ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి..’ అని జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.ఎన్.విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసన్నపేట ఏరియా ఆసుపత్రిని బుధవారం తనిఖీ చేశారు. ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. పలువురు వైద్యుల ఓపీ తక్కువగా ఉండటాన్ని గుర్తించారు. గత పది రోజులుగా ఒక్క రోగికీ ఆడియోమెట్రీషన్ చూడకపోవడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరుగుదొడ్లకు తలుపు లేకపోతే రోగులు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. వైద్యుల పనితీరు మెరుగు పడాలన్నారు. మళ్లీ పరిశీలనకు వచ్చేటప్పటికి పరిస్థితిలో మార్పురావాలన్నారు. అనంతరం రోగులు, గర్భిణులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. -
అంతా దగా..!
నిగనిగ..హిరమండలం: వేసవి కాలం అంటే మామిడి పండ్ల సీజన్. చూడగానే నోరూరుంచే మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఉండరు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ వీటి రుచికి ఫిదా అవుతుంటారు. ఈ కాలంలో చాలామందికి మామిడి పండ్ల విక్రయాలే జీవనాధారం. రోడ్ల పక్కన, షాపుల్లో, తోపుడు బండ్లపై విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అయితే లేత పసుపు రంగులో మెరిసిపోతూ కనిపించే మామిడి పండ్ల వెనుక అనారోగ్యం కూడా దాగుంది. కొందరు వ్యాపారులు అత్యాశతో రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తున్నారు. దీనివల్ల రంగు చాలా బాగా కనిపిస్తుంది. చూడగానే ప్రజలు వాటిని కనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ వాటిని తింటే మాత్రం అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంది. కొన్నిచోట్ల ఎలాంటి లైసెన్సులు లేకుండా పండ్లను మగ్గబెట్టే కేంద్రాలను నిర్వహిస్తు్ాన్న.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ప్రకారం వ్యాపారులు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి కాయలు తీసుకొచ్చి రసాయనాలతో పండిస్తూ యథేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోగాలు వచ్చే ప్రమాదం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లను తింటే అల్సర్, నాడి, కాలేయం, చర్మం సంబంధిత వ్యాధులు వస్తాయని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు. చిన్నారులకు అనారోగ్యం కలుగుతుందన్నారు. గర్భిణులు ఈ పండ్లు తింటే పుట్టబోయే శిశువులకు జన్యుపరమైన లోపాలు, అనారోగ్యం, ఫిట్స్, జ్ఞాపక శక్తి తగ్గడం, చర్మంపై దద్దురులు రావడం, నల్ల బడడం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కృతిమంగా పండించిన పండు అంతా ఒకే రంగు కలిగి ఉంటుంది. కోసినప్పుడు లోపలి కొంతభాగం పక్వంగాను, మిగతా సగం అపరిపక్వంగా ఉండి సరైన రుచి లేకుండా ఉంటుంది. అందువలన పండ్లను నీటితో బాగా శుభ్రం చేసి తొక్కను తీసితింటే కొంతవరకు రసాయనాల ప్రభావం తగ్గుతుంది. – పి.సాయికుమార్, వైద్యాధికారి, పీహెచ్సీ హిరమండలం -
ఐదు కేజీల గంజాయితో ఒకరు అరెస్టు
ఇచ్ఛాపురం: గంజాయి అక్రమ రవాణాకు ప్రయత్నించిన ఝార్ఖండ్ రాష్ట్రానికి యువకుడిని స్థానిక రైల్వేస్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఈ మేరకు పోలీస్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. స్థానిక రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ఫాం వెనుక వైపునున్న రోడ్డు కూడలిలో పట్టణ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఝార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగభూమ్ జిల్లా తుంటకట గ్రామానికి చెందిన రాజ్అభిషేక్ రాజ్ఞ సింకు 5 కేజీల గంజాయి కలిగిన సూట్ కేస్తో వస్తుండగా పట్టుబడినట్లు వెల్లడించారు. నిందితుడిని విచారించగా అతని ఆర్థిక పరిస్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసే తన దగ్గరి బంధువు అయినటుంటి ఝార్ఖండ్లోని నయాగామ్ గ్రామానికి చెందిన అనురాగ్పట్ సింగ్విని కలిసి పని కల్పించాలని కోరాడు. దీంతో అతను ఒడిశా నుంచి గంజాయి తీసుకొచ్చే సమయంలో సాయం చేస్తే రూ.10 వేలు ఇస్తానని చెప్పడంతో అంగీకరించాడన్నారు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లా నుంచి పలుదపాలుగా గంజాయిని తరలించినట్లు అంగీకరించాడు. ఇదేవిధంగా కందమాల్లోని కరణ్నాయక్ అలియాస్ దేబదాస్నాయక్ వద్ద నుంచి మంగళవారం 5 కేజీల గంజాయిని కొనుగోలు చేసి గంజాం జిల్లా చీకటి మీదుగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్కి చేరుకొని, అక్కడి నుంచి భువనేశ్వర్ చేరుకొని అటుగా ఝార్ఖండ్కి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ఫాం వద్దకు వస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్దనుంచి గంజాయితో పాటు సెల్ఫోన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ఎం.ముకుందరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
రణస్థలం: లావేరు మండలంలోని రావివలస సమీపంలో జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ వృద్ధురాలిని బుధవారం సాయంత్రం ఢీకొంది. అయితే డ్రైవర్ ఆ వృద్ధురాలిని తప్పించే క్రమంలో వ్యాన్ డివైడర్ పైకి ఎక్కి ఆగింది. డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపు చేయడంతో అటు వృద్ధురాలు, ఇటు వ్యాన్లో ఉన్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వృద్ధురాలిని 108 వాహనంలో శ్రీకాకుళం తరలించి చికిత్స అందిస్తున్నారు. లావేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. -
మనదే విజయం
కలిసికట్టుగా పనిచేస్తే ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ● వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపే లక్ష్యం: నాగవంశం కుల అధ్యక్షుడు బొడ్డు అప్పలనాయుడు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నిబద్ధతగా పనిచేసే కేడర్ వైఎస్సార్సీపీలో ఉందని, కలిసికట్టుగా పనిచేస్తే విజయం మన సొంతమవుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నాగవంశ కులస్తులతో కళింగవైశ్య కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్వర్డ్ కాదని బ్యాక్ బోన్ అని నిరూపించిన వ్యక్తి మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు డిప్యూటీ సీఎంలుగా, హో మ్ మినిస్టర్లుగా అవకాశం కల్పించి తగిన గుర్తింపునిచ్చారని గుర్తు చేశారు. 2029లో వైఎస్సార్సీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ● నాగవంశకుల రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ చైర్మన్ బొడ్డు అప్పలనాయుడు మాట్లాడుతూ 139 బీసీ కులాలు, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి బీసీలను గుర్తించిన తొలి సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని పేర్కొన్నారు. చంద్రబాబు నాగవంశ కులస్తుల్ని ఏనాడూ పట్టించుకోలేదన్నారు. నాగవంశ కులస్తుల గొంతులో ప్రాణమున్నంతవరకు వైఎస్సార్సీపీతోనే ఉండాలని స్పష్టం చేశారు. జగన్మోహన్రెడ్డిల గెలుపే లక్ష్యంగా సైనికుల్లా పనిచేద్దామన్నారు. టీడీపీ తొత్తులుగా కొందరు నాగవంశ కులస్తులు సోషల్మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, నియోజకవర్గాల పరిశీలకులు ఎన్ని ధనుంజయరావు, పిన్నింటి సాయికుమార్, కరిమి రాజేశ్వరరావు, చల్లా రవికుమార్, పార్టీ ఎస్ఈసీ మెంబర్లు గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, గేదెల పురుషోత్తం, ముంజేటి కృష్ణమూర్తి, నల్లి ఆశాదీపిక, సీహెచ్ భాస్కరరావు, డొంక రమణ, ముగ్గు శ్రీనివాసరావు, నల్లి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
హోమ్ డెలివరీ సదుపాయం ప్రారంభం
పొందూరు: స్థానిక పోస్టాఫీసులో పార్శిల్ ప్యాకింగ్ యూనిట్(పీపీయూ) ద్వారా హోమ్ డెలివరీ సదుపాయాన్ని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు పోస్టల్ డిపార్టమెంటల్ లోగోతో పార్శిల్స్ సురక్షితంగా చేరుకుంటాయని చెప్పారు. సోంపేట, పాలకొండ, కాశీబుగ్గ, టెక్కలి, ఆమదాలవలస, శ్రీకాకుళం హెచ్వో, రాజాం పోస్టాఫీసుల్లోనూ పీపీయూ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ కొరియర్ల కంటే మెరుగైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలను పోస్టాఫీసుల్లో అందజేస్తామని పేర్కొన్నారు. 4 రకాల పార్శిల్స్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పారు. రూ.22ల నుంచి రూ.185ల వరకు పార్శిల్ ధరలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత ఆధార్, బయోమెట్రిక్ సేవలు పోస్టాఫీసుల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఆధార్, బయోమెట్రిక్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నూతన ఆధార్ కార్డుల సేవలతో పాటు ఆధార్, బయోమెట్రిక్ సేవల్లో సాంకేతిక సమస్యలను తీర్చడానికి, నిరంతరం సేవలు అందించేందుకు పోస్టాఫీసుల్లో ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను తెరిచిందన్నారు. 15 ఏళ్లలోపు పిల్లల ఆధార్, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేందుకు విధిగా తల్లిదండ్రులతో మాత్రమే పోస్టాఫీసులకు రావాలని సూచించారు. ఆయనతో పాటు సబ్ పోస్టు మాస్టర్ ఎం.ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు. -
గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సారవకోట: మండలంలోని కురిడింగి గ్రామానికి చెందిన నంబూరి భాస్కరరావు(57) బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కరరావు కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో భార్య నీలమ్మ ఉపాధి పనులకు వెళ్లగా, చిన్న కుమార్తె బయట ఉన్న సమయంలో ఇంట్లో ఉన్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీనిని గమనించిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతున్నాడు. ఆస్పత్రి వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా జట్టు ఎంపిక టెక్కలి రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం శ్రీకాకుళం జిల్లా రగ్బీ అసోసియేషన్ సెలక్షన్స్ నిర్వహించారు. సీనియర్ అండర్–18 బాయ్స్ అండ్ గర్ల్స్ ఛాంపియన్ షిప్ కోసం రగ్బీ ఎంపికలను జిల్లా అధ్యక్షుడు డొంకన రామకృష్ణ ప్రారంభించారు. దీనిలో భాగంగా మొత్తం 24 మంది క్రీడాకారులను (12 మంది బాయ్స్, 12 గర్ల్స్) ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికై న క్రీడాకారులను ఉద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాస్థాయికి ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రాష్ట్రస్థాయి పోటీలు పల్నాడు జిల్లా నందిగామ జిల్లా పరిషత్ హైస్కూల్లో జరుగుతాయని తెలిపారు. ఈ ఎంపికల్లో జిల్లా రగ్బీ ప్రధాన కార్యదర్శి పొన్నాడ పార్వతీశం, ఆర్గనైజేషన్ సెక్రటరీ బాడాన నారాయణరావు, ట్రెజరర్ కాపుల రఘునాధరావు, ఎస్.లక్ష్మణ్ రాజా తదితరులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి రైల్వేస్టేషన్కు సమీపంలో బుధవారం 45 ఏళ్లు వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. పూండి నుంచి నౌపడ వైపు వెళ్లే అవుట్ కట్స్ వద్ద ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతుడు చామన చాయ రంగులో ఉన్నాడని, కుడి చేతిపై సాయిరాం అని పచ్చ బొట్టు ఉన్నట్లు తెలిపారు. అలాగే తెలుపు రంగు ఫుల్ హాండ్స్ షర్టు, తెల్లటి గీతలున్న సర్ప్ కలర్ లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి మృతదేహం తరలించి ఉంచినట్లు వివరించారు. ఎవరైనా గుర్తిస్తే 92475 85743, 94922 50069 నంబర్లను సంప్రదించాలని కోరారు. నేత్రదానం శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం నగరంలోని చిన్న బరాటం వీధికి చెందిన పాలిశెట్టి జగన్నాథ (69) బుధవారం మరణించారు. దీంతో అతని నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. నేత్ర సేకరణలో భాగంగా మగటపల్లి కల్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్ పూతి సుజాత, నంది ఉమశంకర్ల ద్వారా అతని కార్నియాలు సేకరించి, విశాఖపట్నంలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబర్ను సంప్రదించాలని కోరారు. ఘనంగా శ్రీముఖలింగేశ్వరుడి తిరువీధి జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో మధుకేశ్వరుడికి వైశాఖ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా బుధవారం తిరువీధి ఉత్సవం నిర్వహించారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. పార్వతీపరమేశ్వరుల ఉత్సవ మూర్తులను అలంకరించి పల్లకీలో ఆశీనులుగా చేశారు. అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. -
పల్లె మాగాణం.. సంబరాల గానం
డప్పుల దరువులతో ఊళ్లన్నీ చిందులేస్తున్నాయి. గజముద్దలు అమ్మవారి ప్రతిరూపాలై ఊరేగుతున్నాయి. కాళికా వేషధారులతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. ఊరి సంబరాలతో పల్లె మాగాణం సంబరాల గానం ఆలపిస్తోంది. ఈ ఉత్సవాల దయ వల్ల కళాకారులకు ఉపాధి లభిస్తోంది. పల్లెలను పచ్చగా చూసే తల్లులు, గ్రామ సరిహద్దుల్లో ఉంటూ తమ బిడ్డలను కాచే కల్పవల్లులు, పల్లె పొలిమేరల్లో కొలువై ఉన్న శక్తి స్వరూపిణులను గ్రామీణులు కొలిచి తరిస్తున్నారు. జాతరలు, ఉత్సవాలు, సంబరాలు జరిగితే చాలు కళాకారులకు అసలైన పండగే. ఈ ఉత్సవాలు జరిగే సమయాల్లో క్షణం తీరుబాటు లేకుండా కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అమ్మవారి సన్నాయి మేళం కళాకారులు, వీధి వేషధారణలు వేసే కళాకారులు, కోయ నృత్యం, అంజాట, తప్పెట గుళ్లు, పాములోళ్లు, డప్పు కళాకారులు, కాళికా వేషధారణ, పులి, సింహాల వేషధారులు, కోలాటం కళాకారులు.. ఇలా ఒకటేమిటి వంద లాది మంది కళాకారులకు ఈ ఉత్సవాలు ఉపాధి కల్పిస్తుంటాయి. ఉత్సవాలు అనగానే చిన్నారుల నుంచి వృద్ధులు వరకు సరదాగా గడుపుకునే పండగ. ఈ ఉత్సవాలు సమయాల్లో చిరు వ్యాపారులకు అసలైన పండగే. వీధుల్లో చిన్నపాటి దుకాణాల నుంచి సర్కస్, జాయింట్ వీల్, డిస్కో చైర్స్ వంటి పరికరాలతో ఉపాధి పొందుతుంటారు వ్యాపారులు. ఇచ్ఛాపురం రూరల్: చైత్రాన మొదలైన సంబరాలు ఆషాఢం వరకు కొనసాగుతూనే ఉంటాయి. సంబరాల వేళ ఉద్దానం పచ్చ కోక కట్టుకుని మురిసిపోతోంది. అమ్మవారి ఆలయాలు, వీధులు రంగురంగుల విద్యుత్ దీపాల తో ముస్తాబై, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంది. ఒకనాడు పల్లెల్లో నిత్యం కరువు కాటకాలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు, తీవ్ర దుర్భిక్ష, దుర్భర పరిస్థితులు ఉండేవి. ఈ పరిస్థితుల నుంచి కాపాడాలని ఏటా పల్లె వాసులు అమ్మవార్లకు చల్లదనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి కృతజ్ఞత తెలిపే విధానం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చైత్ర మాసం మొదలైన నుంచి జ్యేష్ట మాసం వరకు ప్రతీ ఏడాది గ్రామస్తులు ఐక్యంగా గ్రామదేవతకు చల్లదనాలు చేస్తుండగా, పదేళ్లకు ఓ సారి 5,7,9 రోజులు పాటు గ్రామ దేవత ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ సమయాల్లో సహజ సిద్ధంగా పండిన తాజా జీడి, మామిడి, పనస, పైనాపిల్ వంటి ఫలాలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆది, మంగళ, గురువారాల్లో పొలి మేరలో ఉన్న దేవతలకు మేళతాళాలతో వెళ్లి మొక్కుబడులు తీర్చుకుంటారు. గ్రామ దేవత ఉత్సవాల్లో కళాకారుల ప్రదర్శన ఇంటింటా ఆధ్యాత్మికత ప్రస్తుతం సిక్కోలులోని ప్రతి ఇంటా పసుపు, కుంకుమలతో సువాసనలు వెదజల్లుతుండగా, మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలు, పూజా సామగ్రి సమర్పిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి సేవల్లో కుటుంబాలంతా నిమగ్నమవుతున్నాయి. అంబరాన్ని తాకుతున్న గ్రామ దేవత సంబరాలు వాడవాడలా అమ్మవారి జాతరలు పొటాపోటీగా గ్రామాల్లో ఉత్సవాల ఏర్పాట్లు ఉపాధి పొందుతున్న కళాకారులు -
లారీ ఢీకొని వాల్వ్ ఆపరేటర్ మృతి
టెక్కలి రూరల్: మండలంలోని మునసబుపేట సమీప రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి చిన్నచాకలి వీధికి చెందిన వెగులాడ ధర్మారావు (52) మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ధర్మారావు టెక్కలిలోని ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి ప్రాజెక్ట్ పరిధిలో కాంట్రాక్ట్ వాల్వ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం విధులు నిమిత్తం వెళ్లిన ఆయన నౌపడ వైపు వెళ్లి తిరిగి తన ద్విచక్రవాహనంపై టెక్కలి వైపు వస్తుండగా ముసనబుపేట సమీపంలో ఎదురుగా వచ్చిన ట్రాలీ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ధర్మారావు తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ధర్మారావుకు భార్య కేసవమ్మ, కుమార్తె షర్మిల ఉన్నారు. -
పరిశ్రమల ఆన్లైన్ సేవలకు హెల్ప్డెస్క్
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి శ్రీకాకుళం ప్రాంతీయ కార్యాలయంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమం కింద పరిశ్రమల ఆన్లైన్ సేవలకు ప్రత్యేక హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసినట్లు ఏపీ పీసీబీ ఈఈ బి.కరుణశ్రీ తెలిపారు. పీసీబి చైర్మన్ పి.కృష్ణయ్య, సభ్య కార్యదర్శి ఆదేశాల మేరకు మంగళవారం హెల్ప్డెస్క్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ హెల్ప్డెస్క్ ద్వారా పారిశ్రామికవేత్తలకు తప్పనిసరి అనుమతులైన కన్సెంట్ టు ఎస్టాబ్లిస్మెంట్ టు ఆపరేట్(సీటీఈ), కన్సెంట్ టు ఆపరేట్ (సీటీఓ) పొందేందుకు ఆన్లైన్ కన్సెంట్ మేనేజ్మెంట్ అండ్ మోనటరింగ్ సిస్టమ్, ఇండస్ట్రిస్ సింగిల్ డెస్క్ పోర్టల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ఏఈఈ వంశీసత్యనారాయణ, డీపీఓ హరీష్ వీటిని నిర్వహిస్తారని తెలిపారు. పరిశ్రమల రిజిస్ట్రేషన్, పత్రాల సమర్పణ ఫీజు చెల్లింపు, అనుసరణ విధానాలపై హెల్ప్డె స్క్ను సంప్రదించాలని కోరారు. అక్రమ రవాణాలపై ప్రత్యేక దృష్టి : ఎస్పీ ఇచ్ఛాపురం: అంతర్రాష్ట్ర చెక్ పోస్టు నుంచి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా చూ డాలని ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ పట్టణ, గ్రామీణ పోలీస్స్టేషన్లతో పాటు పురుషోత్తపురం అంతర్రాష్ట్ర చెక్పోస్టుని మంగళవారం అకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా పోలీస్స్టేషన్లోని రికార్డులు, రికార్డు భద్రపరిచే గదులను పరిశీలించారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. పెండింగ్లో గల కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రౌడీ షీటర్లను నిరంతరంగా కౌన్సిలింగ్ చేయాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అక్రమ రవాణా జరగకుండా బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా అంతర్రాష్ట్ర చెక్పోస్టు సందర్శించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ‘ఎరువులు తగిన మోతాదులో వాడాలి’ సారవకోట: రైతులు పంటలకు ఎరువులను తగిన మోతాదులో వాడాలని జిల్లా వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ సీహెచ్ వెంకటరావు సూచించారు. మంగళవారం ధర్మలక్ష్మిపురం సచివాలయంలో ఆత్మా కార్యక్రమంలో భాగంగా రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు ఇష్టానుసారంగా ఎరువులు వినియోగించడం వల్ల భూసారం తగ్గిపోతుందని సేంద్రియ పద్ధతులను అవలంబించాలని, దాని వల్ల భూ సారం పెరుగుతుందన్నారు. వరితో పాటు చోడి, పెసర, మినుము, పొద్దుతిరుగుడు, వేరుశనగ తదితర పంటలను సైతం పండించాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు వేయడం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించారు. ఆయనతో పాటు స్థానిక ఏఓ కెసీహెచ్ వెంకటరావు, జిల్లా వనరులు కేంద్రం ఏఓ వై సురేష్, ఏఈఓ కంఠయ్య తదితరులు ఉన్నారు. 16న సీఎం పర్యటన శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన నరసన్నపేటలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఖరారైన నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. శాఖల వారీగా ఏయే అధికారికి ఏ విధులు కేటాయించిందీ వివరిస్తూ జిల్లా అధికారులు సమర్థంగా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో వర్చువల్గా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, ఆయా డివిజన్ల ఆర్డీఓలు, తహసీల్దార్లు పాల్గొనగా కలెక్టరేట్ నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరావు, ఎస్డీసీలు పద్మావతి, లక్ష్మణరావు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వేణుగోపాల్, ఆర్ అండ్బీ ఎస్ఈ పి.సత్యనారాయణ, సీపీఓ లక్ష్మీప్రసన్న, ఏపీసీ వేణుగోపాలరావు, అదనపు డీఎంహెచ్ ఓ మేరీకేథరీన్, ఇరిగేషన్ ఎస్ఈ సుధాకర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ విజయ సారథి, డీఎస్ఓ సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. -
కనీట్ కథ
● రద్దయిన నీట్ పరీక్ష ● పరీక్ష నిర్వహణలో ఘోరంగా విఫలమైన కేంద్రం ● జిల్లాలో పరీక్ష రాసిన వారి సంఖ్య 1904 ● తీవ్ర నిరాశకు గురైన విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: నీట్ యూజీ–2026 పరీక్ష రద్దయ్యింది. పేపర్ లీకేజీ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఈనెల 3వ తేదీన మెడిసిన్ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ)చదువుల కోసం దేశవ్యాప్తంగా ఏకకాలంలో నీట్ యూజీ–2026 పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. జిల్లా నుంచి మొత్తం 1951 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేయగా.. 1904 మంది పరీక్ష రాశారు. మండిపడుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. రెండేళ్ల కిందట కూడా నీట్ పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఎన్నికలపై ఉన్న శ్రద్ధ.. పరీక్షలపై లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోసారి నీట్కు సన్నద్ధం కావాలంటే తమ మానసిక పరి స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ్చర్యపోయాను బాధ్యులను శిక్షించాల్సింది పోయి నీట్ రాసిన వారందరినీ ఇలా శిక్షించడం సరికాదు. పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేయడం ఎంత వరకు సమంజసం. ఇప్పుడు మళ్లీ పరీక్షలు రాయాలంటే ఎంత కష్టం. ఆ వాతావరణం మళ్లీ వస్తుందా.. ఇలా రద్దు చేసి ఎంత మందో అభ్యర్థుల జీవితాలను ఫణంగా పెట్టారు. లీక్ బాధ్యులను ఉరి తీయాలి. అప్పుడే మళ్లీ లీక్ చేయడానికి భయపడతారు. అలాగే గతంలో వలే ఈ పరీక్షలు రాష్ట్రాలకు అప్పగించాలి. మా అబ్బాయి పరీక్ష రాశాడు. ఎంతో వ్యయప్రయాసలకు కుటుంబమంతా గురయ్యాం. ఇప్పుడు కథ అంతా మళ్లీ మొదటికే వచ్చింది. –ఎన్.అప్పయ్య, విద్యార్థి తండ్రి, నరసన్నపేట, -
లేబర్ కోడ్లు రద్దు చేయమంటే నిర్బంధిస్తారా?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ పోరాటం సాగించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా కార్మికులను ప్రభుత్వం నిర్బంధించి అక్రమ కేసులు బనాయించడం తగదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.తిరుపతిరావు, ఇఫ్టూ జిల్లా నాయకులు ఎస్.కృష్ణవేణి అన్నారు. నోయిడా కార్మికులపై ప్రభుత్వం నిర్బంధం ఆపాలని కోరుతూ నేషనల్ డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించాలని కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం శ్రీకాకుళం అంబేడ్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కార్మికులను మరింత దోపిడీ చేసేందుకు పెట్టుబడుదారులకు అవకాశం కల్పిస్తూ లేబర్ కోడ్స్ నిబంధనల్ని నోటిఫై చేసిందన్నారు.గతంలో కూడా బీహార్ ఎన్నికల అనంతరం 2025 నవంబర్ 21 లేబర్ కోడ్స్ అమలకు నోటిఫికేషన్ విడుదల చేసిందని గుర్తు చేశారు. లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు అల్లు సత్యనారాయణ, ఎం.గోవర్దనరావు, ఎన్.బలరాం, ఎం.రాఘవ, కె.అప్పలరాజు, ఎం.వి.రమణ, యం.నాగేశ్వరావు, డి.రాము, కేదారేశ్వరరావు, పి.జగ్గారావు, బి.జనార్దనరావు, కె.అప్పారావు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
మినీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం జాతీయ రహదారిపై సూర్య స్కూల్ కూడలిలో ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న వ్యక్తిని మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండములగాం గ్రామానికి చెందిన గుంటముక్కల నర్సింహమూర్తి (52) విశాఖపట్నం వెళ్లేందుకు ద్విచక్ర వాహనంతో మంగళవారం ఉదయం 4.30 గంటలకు బయలుదేరాడు. 4.45 గంటల సమయంలో సూర్య స్కూల్ కూడలి వద్ద అవతల వైపునకు రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సింహమూర్తి తుళ్లిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. జె.ఆర్.పురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు శవపంచనామా నిమిత్తం తరలించారు. నర్సింహమూర్తికి భార్య లక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల
శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ప్రభు త్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సాధారణ సీనియారిటీ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల ఆదేశాల మేరకు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జాబితాలను సిద్ధం చేసి, డీఈఓ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. భవిష్యత్లో చేపట్టే బదిలీలు, పదోన్న తులు తదితర ప్రక్రియలన్నీ ఈ జాబితా ఆధారంగానే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉన్న ఉపాధ్యాయులు ఈనెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తగిన ధ్రువీకరణ పత్రాలతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేరుగా సంప్రదించాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని ఆయన వెల్లడించారు. -
మోసం సులువు!
ప్రభుత్వ కొలువు.. ఏజెంట్ల మోసాలే ఎక్కువ.. శ్రీకాకుళం క్రైమ్ : ఎలా అయినా ఉద్యోగం సంపాదించాలన్న నిరుద్యోగుల బలహీనతే వారి ఆయుధం. పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు, మినిస్టర్లతో పరిచయాలున్నాయి, మీ వాడికి జాబ్ పక్కా.. అంతా మా చేతుల్లో ఉందంటూ కుటుంబ పెద్దలకు నమ్మించేలా మాయమాటలు చెప్పడమే వీరి నైజం. కార్లలో దిగుతూ, చక్కని వస్త్రధారణ, చేతివేళ్లన్నింటికీ ఉంగరాలు పెట్టి మసిపూసి మారేడు కాయ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.. జిల్లాలో ఇటీవల కాలంలో ఉద్యోగాల పేరిట మోసాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా జిల్లాకేంద్రంలో నలుగురు నిరుద్యోగుల నుంచి ఓ వ్యక్తి రూ. లక్షల్లో కొట్టేశాడు. రైల్వేలోను, ఇతర ప్రభుత్వ విభా గాల్లో జాబులిప్పిస్తామని మోసగించినట్లు సమాచారం. విదేశీ ఉపాధి, ఉద్యోగాల పేరిట పలు కంపెనీలు, సంబంధిత ఏజెంట్లు సైతం గ్రామాల్లో ఉన్నవారిని మోసగిస్తుండటం ఓ దినచర్యగా మారిపోయింది. ఈ రోజుల్లో ఏ ఉద్యోగమైనా కష్టపడి చదివితేనే సంపాదించగలరని, అంతా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా జరుగుతున్న ఇలాంటి రోజుల్లో ఎలాంటి పైరవీలకు చోటుండదని నిరుద్యోగ యువ త, వారి కుటుంబ సభ్యులు గ్రహించి అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు అంటున్నారు. మోసాలను పరిశీలిస్తే.. ● వజ్రపుకొత్తూరుకు చెందిన కారి బాలకృష్ణ అనే ఏజెంటు యూరోపియన్ దేశమైన స్వీడన్లో డ్రైవర్, వెల్డర్, ఫిట్టర్లో జాబ్లిప్పిస్తానని నమ్మించి మూడేళ్ల క్రితం ఇప్పిలి గిరిబాబు (కొండవూరు), పల్లివూరుకి చెందిన దున్న ఢిల్లీరావు, దున్న జానకిరావుల వద్ద రూ. లక్షల్లో తీసుకుని మోసం చేశాడు. ప్రస్తుతం విశాఖలో ఉన్నా బాధితుల ఫోన్లు ఎత్తడం మానేశాడు. ● నెల్లూరు జిల్లాకు చెందిన గొల్ల బెనర్జీ (33) ఢిల్లీ సెంట్రల్ జోన్ ఆడిట్ అధికారినని చెప్పి బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించి కోట్లాది రూపాయల వసూలు చేసి మోసగించాడు. విశాఖలో 8 మంది నుంచి రూ. కోటి, తిరుపతిలో సుబ్రహ్మణ్యం నుంచి రూ. 25 లక్షలు, జిల్లాలో నందిగాం మండలం దేశెట్టి రమణమూర్తి నుంచి రూ. 1.05 కోట్లు, ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేశాడు. ● ఈవై మల్టీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ సత్యసాయి జిల్లాకు చెందిన గోపాల్రెడ్డి, నాగేంద్రరెడ్డిలు నగరానికి చెందిన ఎం.విజయలక్ష్మిని పావుగా వాడుకుని ఆమెతో పాటు మరికొందరికి రూ. 15.25 లక్షలు బురిడీ కొట్టారు. ● హిరమండలానికి చెందిన బోయిన జనార్ధనరావు ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని నమ్మించి నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఐదుగురి వద్ద రూ. 13.5 లక్షలు వసూలు చేశాడు. ● ఎలాంటి రాత పరీక్షలు లేకుండా పీహెచ్సీల్లో నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ సంస్థ మహిళల నుంచి రూ. లక్షల్లో దండుకుంది. ● వజ్రపుకొత్తూరు, పలాస మండలాలకు చెందిన 30 మందికి పైగా నిరుద్యోగ యువతకు రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించిన పలాస సమీప సువర్ణాపురం వాసి కె.గోపాలకృష్ణ, విశాఖకు చెందిన హరీష్ అనే వ్యక్తితో కలసి దాదాపు రూ. 2 కోట్లకు టోకరా వేశాడు. 2021 కరోనా సమయంలో విదేశాల్లో ఉన్న యువత కుప్పలు తెప్పలుగా వచ్చేశారు. మళ్లీ 2023–24 నుంచి ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఉపాధి నిమిత్తం వెళ్లినా.. దాదాపు 2126 మంది వరకు ఏజెంట్లు మోసం చేయడంతోను, మంచి కంపెనీలు కాకపోవడంతోను వెళ్లలేదన్నది సమాచారం. 2024 నుంచి ఇప్పటివర కు జిల్లాలో దాదాపు 200కు పైగా ఉద్యోగాల పేరి ట మోసపోయిన కేసు లు నమోదవ్వగా నమోదు కానివి దాదా పు 342కు పైగా ఉంటా యని అధికార వర్గాల అంచనా. నిరుద్యోగులను నమ్మిస్తున్నారు ఉద్యోగాలంటూ ముంచేస్తున్నారు జిల్లాలో ఇటీవల పెరుగుతున్న మోసాలు విదేశాల్లో ఉపాధి పేరిట ఏజెంట్లు, కంపెనీల మోసాలు డబ్బులిస్తే ఉద్యోగాలిచ్చే రోజులు పోయాయి.. డబ్బులిస్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయాయి. ఆన్లైన్ విధానంలో, పారదర్శకంగా జరుగుతున్న ప్రస్తుత రోజుల్లో ఇంకా నిరుద్యోగులు ఇలాంటివారి ఉచ్చులో పడ టం బాధాకరం. నిరుద్యోగుల బలహీనత పట్టుకుని బ్రోకర్లు, మధ్య వర్తులు, ఏజెంట్లు ఇలా చేస్తుంటే వారికి కష్టపడిన సొమ్మును ధారాదత్తం చేస్తున్నారు. – పాత్రిని శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ (క్రైమ్), శ్రీకాకుళం -
తొలిరోజు 45 మంది గైర్హాజరు
● ప్రారంభమైన ఏపీఈఏపీసెట్ పరీక్షలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో ఏపీఈఏపీసెట్– 2026 పరీక్షల పర్వం మంగళవారం మొదలైంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఏపీఈఏపీసెట్ (పాత ఎంసెట్) పరీక్షల్లో భాగంగా రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతున్నాయి. మొదటి ఐదు రోజులపా టు ఇంజినీరింగ్ స్ట్రీమ్కు పరీక్షలు జరుగుతుండగా.. తొలిరోజు రెండు సెషన్లకు కలిపి 1440 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా 1395 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 45 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్కు 720 మందికి 693 మంది, మధ్యాహ్నం సెషన్కు 720 మందికిగాను 702 మంది ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో నాలుగు కేంద్రా ల్లో పరీక్షలు జరుగుతున్నాయి. చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజినీరింగ్ కళాశాల, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల, నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ, టెక్కలిలోని ఐతమ్ ఇంజినీరింగ్ కళాశాలల కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. -
అండర్ పాసేజ్ పైనుంచి దూకి వ్యక్తి మృతి
నరసన్నపేట: దేవాది వద్ద జాతీయ రహదారిపై అండర్ పాసేజ్ వంతెన పైనుంచి ఓ వ్యక్తి దూకేశాడు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్లో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్యులు చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. నరసన్నపేట ఎస్సై బి.గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంతెన పైనుంచి వ్యక్తి దూకడం సీసీ ఫుటేజీల్లో గుర్తించారు. మృతుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నారు. లారీ ఢీకొని రిటైర్డ్ ఎంఈఓ మృతి ఎచ్చెర్ల: అల్లినగరం జంక్షన్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లావేరు మండలం చిన్నమురపాక గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈవో ఆకుల సన్యాసినాయుడు (80) మృతి చెందారు. ఈయన విశాఖపట్నం నుంచి స్వగ్రామం వచ్చేందుకు అల్లినగరం జంక్షన్ వద్ద బస్సు దిగి జాతీయ రహదారిని దాటుతుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. తలకు బలమైన గాయాలు తగలటంతో అక్కడికక్కడే మృతి చెందారు. సన్యాసినాయుడుకు భార్య సీతారత్నం, కుమారుడు నాయుడుబాబు, కుమార్తె ఉమ ఉన్నారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో బోల్తా.. నలుగురికి గాయాలు రణస్థలం: లావేరు మండలం బుడుమూరు జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్డులో ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో డ్రైవర్ కిల్లి వెంకటరావు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పరిశీలించి వివరాలు సేకరించారు. -
పలాసలో ఫొటోస్టోడియో దగ్ధం
పలాస: పలాస జీడిపిక్క బొమ్మ ఎదురుగా ఉన్న డిలైట్ ఫొటో స్టూడియోలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. యజమాని బొంతల రమేష్ షాపును మూసేసి వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి వచ్చే సరికి మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చాడు. పలాస అగ్నిమాపక అధికారి బి.సోమేశ్వరరావు, లీడింగ్ ఫైర్ ఆఫీసర్ రవికుమార్, రాము, లోకనాధం తదితరులు మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5లక్షలు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక అధికారి బి.కోటేశ్వరరావు తెలిపారు. చిన్నమ్మికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు సారవకోట: బుడితి సీహెచ్సీలో హెడ్ నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న సొమలపురి చిన్నమ్మి మంగళవారం నర్సుల దినోత్సవం పురష్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందించినందుకు ప్రభుత్వం గుర్తించి గుంటూరులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 1992 నుంచి ఈమె నర్సుగా విధులు నిర్వర్తిన్నారు. ఈమెను సీహెచ్సీ సూపరింటెండెంట్ చైతన్య, వైద్యులు, సిబ్బంది అభినందించారు. యూరియా, డీఏపీ అమ్మకాలు నిషేధం రణస్థలం : ఉన్నతాధికారుల ఆదేశాలు నేపథ్యంలో యూరి యా, డీఏపీ నిల్వ ఉన్నా అమ్మకాలు జరపరాదని రణస్థలం వ్యవసాయాధికారి డి.విజయభాస్కర్ షాపుల నిర్వాహకులకు సూచించారు. మంగళవారం మండలంలోని పలు ఎరువులు, పురుగు మందుల, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ యూరియా, డీఏపీ స్టాప్ సెల్ ఆదేశాలు జారీ అయ్యాయని, అమ్మినవారు శిక్షార్హులని హెచ్చరించారు. కొత్తగా ఎరువులు స్టాక్ వచ్చినా వ్యవసాయాధికారికి తెలియజేయాలన్నారు. స్టాక్ రిజిస్టర్ అప్డేట్గా ఉంచాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి స్టాక్ వివరాలు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ ఆఫీస్ టెక్నికల్ జి.సుహాసిని, ఏఈవో ఎం.సునీత, వై.రాజశేఖర్ పాల్గొన్నారు. చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధి జి.సిగడాం: ప్రతి మహిళా ఆర్థికాభావృద్ధి సాధించాలని డీఆర్డీఏ పీడీ పి.కిరణ్ అన్నా రు. నిద్దాంలో కొరమీను చేపల పెంపకం యూనిట్ను మంగళవారం పరిశీలించారు. యూని ట్ ఆదాయం, వ్యయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పైల కోటేశ్వరమ్మ, ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు, సీసీ లక్ష్మి, బాబ్జీనాయుడు, రామకృష్ణ పాల్గొన్నారు. -
‘సదావర్తి’లో కూన రవికుమార్ భూదందా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఆమదావలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సదావర్తి భూముల్లో అక్రమ లేఔట్ నిర్మించి ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేయడం దారుణమని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ మండిపడ్డారు. ఈ స్థలంలో ఒక్క ఇల్లూ లేనప్పటికి రోడ్లు వేయటం కూన అవినీతికి అద్దం పడుతోందన్నారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మాట్లాడుతూ బావాజీ మఠం భూములు 1600 సంవత్సరాలకు ముందువని చెప్పారు. మఠం భూముల్లో అక్రమ లేఔట్లు నిర్మించి ప్రజలకు అమ్మకం చేసి సొమ్ము చేసుకోవాలన్నా సరికాదన్నారు. పొందూరు మండలంలో అక్రమ క్వారీ తవ్వకాలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారన్నారు. సదావర్తి భూములు కాజేసేందుకేనా ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నదని మండిపడ్డారు. 1947 ఎండోమెంట్ చట్టం ప్రకారం నోటీసులు కూడా ఇచ్చారని, చారిటీ భూములు, సదావర్తి భూములు నాన్ ట్రాన్స్ఫర్ భూములు కింద నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ భూములను 22–ఏ నిషేధిత భూముల్లో కూడా పెట్టారన్నారు. రిజిస్ట్రేషన్ భూములుగా అమ్మకం ప్రారంభించిన కూన రవికుమార్ కుటుంబ సభ్యులు సామాన్యుల్ని మోసగించి అమ్మేస్తున్నారని ఆరోపించారు. అక్రమ లేఔట్కి కలెక్టర్ రోడ్లు మంజూరుచేయడం దారుణమన్నారు. కూన రవికుమార్ సోదరుడు, కాంట్రాక్టర్ నాణ్యత లోపాలతో రోడ్లు, కాలువలు వంటివి చేపట్టి ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే కూన రవికుమార్ అక్రమాలు, అవినీతిపై దర్యాప్తు చేయిస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, రాష్ట్ర బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షుడు ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి మండల పార్టీ అధ్యక్షుడు బెవర మల్లేశ్వరరావు, బూత్కమిటీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డేపల్లి వెంకట సత్యం, ఆమదాలవలస నగర అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, పొన్నపురెడ్డి తవిటినాయుడు, సాకేటి శ్రీనివాసరావు, గదిలి రమణ తదితరులు పాల్గొన్నారు. -
‘మడపాంను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలి’
నరసన్నపేట: వంశధార నదీ తీరాన ఉన్న మడపాంను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అభిప్రాయపడ్డా రు. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉందని, ఇప్పటికే రోజూ పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. మంగళవారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా మడపాం వద్ద ఉన్న విశ్వవిరాట్ వీర హనుమాన్ దేవస్థానంలో వీరు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ప్రతినిధిలు తంగుడు జోగారావుతో పాటు స్థానికులు రువ్వ వాసుదేవరావు, మారెళ్ల అప్పలనాయుడు తదితరులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
సేవామూర్తులు
● రోగుల పాలిట అపర సంజీవులు ● భరోసా కల్పించేలా సపర్యలు ● ఆస్పత్రుల్లో ఉన్నంత సేపూ సేవలు ● నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నా తమ్ముడు చాలా కాలంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఉపాధ్యాయురాలిగా స్థిరపడాలని ఉన్నప్పటికీ ఇంట్లో మా తమ్ముడు పరిస్థితి వల్ల మెడికల్ డిపార్ట్మెంట్ను ఎంచుకున్నాను. నా ఆలోచనకు అమ్మ మద్దతు తెలపడంతో నర్సింగ్ పూర్తి చేశాను. బాధితులకు ధైర్యం చెబుతూ వారి ఆరోగ్య పరిస్థితిలో మార్పు వచ్చేలా పనిచేయడం సంతృప్తినిస్తోంది. మా తమ్ముడ్ని దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చెబుతున్నాను. – ఎల్.సంధ్య, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం రూరల్: అనారోగ్యం పాలైనప్పుడు రక్త సంబంధీకులే దరిచేరని రోజులివి. ఆస్పత్రిలో ఉన్నప్పుడు వచ్చి ప్రేమగా పలకరించేందుకు మనసురాని కుటుంబ సభ్యులున్న సమాజమిదీ. అచేతన స్థితిలో ఉన్నవారికి ఏ సంబంధం లేకపోయినా చిరునవ్వుతో కొందరు నర్సులు సకల సేవలందిస్తున్నారు. అమ్మ కన్నా మిన్నగా బాగోగులు చూసుకుంటున్నారు. ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా పనిచేస్తూ రోగుల పాలిట దైవాలుగా నిలుస్తున్నారు. నేడు నర్సింగ్డే సందర్భంగా కొందరు నర్సుల గురించి.. నర్సు వృత్తి దేవుడిచ్చిన వరంగా భావిస్తా. వృత్తిలో చేరి మూడేళ్లవుతోంది. చాలా మంది రోగులకు వైద్య సహాయక చర్యలు అందించాను. ఆరు నెలలు క్రితం నేను నైట్ డ్యూటీలో ఉండగా, అర్థరాత్రి సమయంలో అంంబులెన్స్లో ఓ యువకుడ్ని తెచ్చారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఘోరంగా కొట్టి రోడ్డు పక్కన పడేశారని చెప్పారు. ఎలాగైనా కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న ఆలోచనతో సాధ్యమైనంత వరకు ప్రథమ చిక్సిత ద్వారా ఊపిరందించాను. అనంతరం మెరుగైన వైద్యం కోసం బరంపురం వెళ్లాల్సిందిగా సూచించాను. కోలుకున్న వారు కృతజ్ఞతతో చూసే చూపు మరిచిపోలేనిది. – జె.మహేశ్వరి, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం అమ్మా, నాన్నలు ప్రోత్సాహంతో నర్సింగ్ ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని హెల్త్ డిపార్ట్మెంట్ వైపు వచ్చాను. 27 ఏళ్లగా ఇదే వృత్తిలో కొనసాగుతూ అనేక మంది పేషెంట్లకు చికిత్స అందించడం సంతృప్తిగా ఉంది. ఎనిమిదేళ్ల క్రితం కోటబొమ్మాళి ఆసుపత్రిలో పనిచేస్తుండగా ఓ మహిళకు పాము కాటేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు వెంటనే ఇంజక్షన్ చేసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాను. ఆమె కోలుకోవడం, కుటుంబ సభ్యులు నన్ను అభినందించడం సంతృప్తినిచ్చింది. టెక్కలిలో ఉన్నప్పుడు ఓ మహిళా ఇంటి వద్ద ప్రసవం అయింది. ఆమె గర్భసంచి బయటకు రావడంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తెచ్చారు. చాకచక్యంగా గర్భసంచిని యథాస్థానంలో ఉంచి కుట్లు వేశాను. – ఆర్.భవానీ,హెడ్ నర్సు, ఇచ్ఛాపురం -
రియల్ ఎస్టేట్ కేంద్రంగా అమరావతి!
● ఎమ్మెల్సీ నర్తు రామారావు ఇచ్ఛాపురం రూరల్: అమరావతిని రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చారని, ప్రజల కలల రాజధాని కాకుండా అధికార పార్టీ ల్యాండ్ డిపాజిట్ బ్యాంకుగా మార్చుకున్నారని ఎమ్మెల్సీ నర్తు రామారావు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఇచ్ఛాపురంలో విలేకరులతో మాట్లాడారు. రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్సీపీ ముందు నుంచి చెబుతున్న మాటలే వాస్తవాలు అయ్యాయని గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుటుంబ సభ్యులకు కేటాయించిన ప్లాట్లు, చంద్రబాబునాయుడు అనుచరులకు ఇచ్చిన ప్లాట్ల వివరాలను పరిశీలించిన అమరావతి ప్రాంత రైతులు నివ్వెరపోతున్నారని చెప్పారు. భూములు ఇచ్చిన రైతులకు ముంపు ప్రాంతాలలోనూ ప్లాట్లు కేటాయిస్తే, చంద్రబాబునాయుడుకు భజన చేసే వారికి విలువైన ప్రాంతాల్లో ప్లాట్లు కేటాయించి నిజస్వరూపాన్ని బహిర్గతం చేయడాన్ని ఇప్పుడిప్పుడే రాజధాని రైతులు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించిన పచ్చ పత్రికలు ప్రస్తుతం ఎందుకు ఆ వివరాలు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లలో దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, పేద ప్రజలకు ఏమైనా మేలు చేశారా..?అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు నిలిపివేశారని, రాష్ట్రంలో ఒక్క వితంతువుకూ కొత్తగా పెన్షన్ మంజూరు చేయలేదని ధ్వజమెత్తారు. -
● ఒక ఫ్యామిలీ.. నాలుగు హెల్మెట్లు
జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు కలిపి మొత్తం నలుగురు హెల్మెట్లు ధరించి ప్రయాణం సాగిస్తూ సోమవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులకు కనిపించారు. నిబంధనలకు విరుద్ధంగా నలుగురు ఒకే వాహనంపై కనిపించినా.. అందులో ఇద్దరు పిల్లలుండటంతో ఇలా ఇరుకుగా రాకూడదని అవగాహనపరుస్తూనే హెల్మెట్లు పెట్టి రావడం అభినందనీయమని ట్రాఫిక్ సీఐ వి.రామారావు ప్రశంసించారు. నగరంలోనే ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న రమేష్ వినూత్న మార్పుకు నాంది పలికారని, వాహనదారులంతా హెల్మెట్ ధారణలో రమేష్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. – శ్రీకాకుళం క్రైమ్ -
వినతుల పరిష్కారంలో జాప్యం వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు అత్యంత బాధ్యతగా స్వీకరించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా అధికారులతో కలిసి 154 వినతిపత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎస్డీసీలు జయదేవి, పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే యూనిఫారాలను గతంలో మాదిరిగా కుట్టు ఏజెన్సీలు, మహిళా ఏజెన్సీలకు అందజేయాలని గాయిత్రీ మహిళా సొసైటీ ప్రతినిధులు కోరారు. ● సోంపేట మండలం జింకిభద్ర, బెంకిలి, పలాసపురం గ్రామాల్లో వడగండ్ల వాన ధాటికి టమాట, నువ్వు, కట్టెజనుము, చోడి, మిరప, మామిడి తదితర పంటలు పాడయ్యాయని, ప్రభుత్వం ఆదుకోవాలని ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో ఎంజేఆర్ పూలే రాష్ట్ర బీసీ సంక్షేమ ప్రతినిధులు బీన ఢిల్లీరావు, కె.గోపీనాథ్, టి.బిహాస్, బాపూజీ, తామాడ అప్పలస్వామి తదితరులు కోరారు. -
దాసునాయుడు మృతి పార్టీకి తీరనిలోటు
ఆమదాలవలస: సైలాడ పంచాయతీ మాజీ సర్పంచ్, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకుడు సైలాడ దాసునాయుడు ఇటీవల గుండెపోటుతో మృతిచెందడంతో కుమ్మరిపేటలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, డాక్టర్ సీదిరి అప్పలరాజు, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్టీ యువ నాయకుడు ధర్మాన కృష్ణచైతన్య సోమవారం పరామర్శించారు. దాసునాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మృతికి గల కారణాలు అడిగి తెలుకున్నారు. వారితో పాటు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, నాయకులు గొండు కృష్ణమూర్తి, సురవరపు నాగేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, బెవర మల్లేశ్వరరావు, పొడుగు శ్రీనివాసరావు, బోర చిన్నంనాయుడు, ఇసాయి వెంకటరావు, కింజరాపు సురేష్, పొన్నాడ చిన్నారావు, ఎన్ని రామచంద్రరావు, మొండేటి కూర్మారావు, మజ్జి నాగేశ్వరరావు, బొడ్డేపల్లి మన్మధరావు, పున్నపురెడ్డి తవిటినాయుడు తదితరులు ఉన్నారు. -
ఉత్సాహంగా స్విమ్మింగ్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా సోమవారం జరిగిన ఈ ఎంపికల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేశారు. ఎంపికై నవారిలో దీక్షా బెహరా, ప్రీతమ్రాజ్, అవినాష్ ఉన్నారు. వీరు ఈ నెల 24న కర్నూలులోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగే రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఏపీ స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా అద్యక్షుడు కేఎన్ఎస్వీ ప్రసాద్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, ఎస్.కాంతారావు, కోచ్ మురళీధర్, సూర్యారావు, రాధాకృష్ణ పాల్గొన్నారు. -
నీడ జాడ లేక..!
హిరమండలం: ఉపాధి హామీ పథకం(వీబీజీ రామ్ జీ) వేతనదారులు మండుటెండల్లో మాడిపోతున్నారు. నీడ కరువై విలవిల్లాడిపోతున్నారు. వేసవి అలవెన్సు రాక, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, బిల్లులు సకాలంలో మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎల్.ఎన్.పేటలో వడదెబ్బతో ఓ వేతనదారుడు మృత్యువాత చెందడంతో కార్మికుల్లో కలవరం మొదలైంది. నిప్పుల కుంపటిలా.. రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. దీంతో ఉపాధి వేతనదారులు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా పని ప్రదేశంలో గుడారాలు (టెంట్లు)వేయాల్సి ఉంటుంది. విరామ సమయంలో వేతనదారులు వీటి కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఒక వేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆ నీడలోనే ప్రాథమిక చికిత్స అందించడం, తర్వాత ఆస్పత్రికి తరలించడం వంటివి చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పని ప్రదేశంలో నిలువ నీడ కూడా కరువైంది. బడ్జెట్ లేనందువల్ల గుడారాలు ఏర్పాటు చేయలేకపోతున్నామని అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఎల్ఎన్పేట మండలంలో ఓ కార్మికుడు వడదెబ్బతగిలి పని ప్రదేశంలో మృతిచెందాడు. ఈ పరిస్థితి చూసి మిగతావారు బెంబేలెత్తుతున్నారు. పనిప్రదేశంలో చాలాచోట్ల కనీసం తాగునీరు కూడా పెట్టడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్స కిట్లు ఉన్నప్పటికీ వాటి జాడ కనిపించడంలేదు. గతంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. వసతుల్లేవ్..! ఉపాధి హామీ పథకంలో సాధారంగా వేసవి కాలంలో వేసవి అలవెన్సు కింద అదనంగా వేతనంతో కలిపి ఇస్తారు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్లో ఈ అలవెన్సులు వేతనదారులకు అందిస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేసవి అలవెన్సులు తీసేశారు. దీంతో ఉపాధి పనులపై వేతనదారుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. గతంలో జిల్లాలో వేసవిలో రెండు లక్షల మందికి హాజరు నమోదు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య లక్ష మాత్రమే ఉన్నట్లు సమాచారం. ఉపాధి పని జరిగే ప్రాంతాల్లో వేతనదారులకు టెంట్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్ లేక గుడారాలు ఏర్పాటు చేయలేకపోతున్నాం. పని ప్రదేశం వద్ద వేతనదారులు సొంతగా షెడ్ నిర్మించుకోవాలని సూచించాం. వసతులు ఉన్న చోటే పనులు పెట్టాలని చెప్పాం. మజ్జిగ పంపిణీ దాదాపు రెండేళ్లుగా ఇవ్వడం లేదు. వేతనాలు దశలవారీగా పడుతున్నాయి. వేతనదారుల సంఖ్య పెంచేందుకు కృషిచేస్తున్నాం. – ఏ.శ్రీనివాసరావు, ఏపీఓ, హిరమండలం మండుటెండలో ఉపాధి వేతనదారుల విలవిల టెంట్లు కొనుగోలుకు బడ్జెట్ లేదంటున్న అధికారులు ఇప్పటికే ఎల్ఎన్పేటలో వడదెబ్బతో ఓ వేతనదారుడు మృతి -
పుస్తెలతాడు చోరీపై ఫిర్యాదు
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ గణేష్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ కొలగాన శ్రీనివాసరావు ఇంట్లో పుస్తెలతాడు మాయమైంది. ఈ మేరకు అతని భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తన భర్త శ్రీను స్నేహితుడినని చెప్పి ఇంట్లో ప్రవేశించాడు. కూర్చోమని చెప్పి టీ తేవడానికి వెళ్లగా, ఆ వ్యక్తి టేబుల్పై ఉన్న పుస్తెలతాడు, సెల్ఫోన్ పట్టుకుని బయట గడియపెట్టి పరారైనట్లు బాధితురాలు పేర్కొన్నారు. జె.ఆర్.పురం సీఐ ఎం.అవతారం, ఎస్సై ఎస్.చిరంజీవి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించి వివరాలు సేకరించారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి హిరమండలం: ఎల్ఎన్పేట మండలంలోని స్కాట్పేట గ్రామానికి చెందిన ఎం.వెంకటరమణ (56)సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలోని చెరువులో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరమణ ప్రతిరోజులాగే సోమవారం కూడా స్నానానికి చెరువుకు వెళ్లాడు. ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో భార్య సులోచన ఆందోళన చెంది గ్రామస్తులతో చెప్పగా.. వారు చెరువులో గాలించారు. మృతదేహాన్ని గుర్తించి ఒడ్డుకు చేర్చారు. వెంకటరమణకు భార్యతో పాటు కుమార్తె పద్మ ఉన్నారు. సులోచన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. -
ఎస్పీ గ్రీవెన్స్కు 62 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (గ్రీవెన్సు)లో బాధితుల నుంచి 62 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి సత్వరమే పరిష్కారమయ్యేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ● ఆమదాలవలస ఎస్ఐపై బెలమాం గ్రామానికి చెందిన ఆబోతుల వసంతమ్మ ఎస్పీ గ్రీవెన్సులో ఫిర్యాదు చేశారు. కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇండక్షన్ ఆర్డర్ పట్టుకుని తమ భూమి వద్దకు వెళ్లామని.. అవతలి వ్యక్తులు తమనేం చేయలేక పంటతో ఉన్న భూమిని మేం కాల్చేశామని ఎస్ఐకు ఫిర్యాదు చేశారన్నారు. ఎటువంటి ఆధారం లేకపోయినా దాన్ని ఫిర్యాదుగా స్వీకరించిన ఎస్ఐ తమపై తప్పుడు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. -
మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా భాస్కర్రెడ్డి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని మహిళా పోలీస్స్టేషన్కు డీఎస్పీగా ఎన్.భాస్కర్రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వీఆర్ఎస్లో ఉన్న ఈయన నేరుగా పోస్టింగ్పై శ్రీకాకుళం వచ్చారు. 1995 బ్యాచ్కు చెందిన ఈయన అనంతపురంలో ఎస్ఐ, సీఐగా పనిచేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదే స్టేషన్కు డీఎస్పీగా బి.రాజశేఖర్ వచ్చినప్పటికీ కొన్ని నెలలు పనిచేసి వెళ్లిపోయారు. దాదాపు ఏడాదిన్నర పోస్టు ఖాళీగా ఉండటంతో సీఐలతోనే స్టేషన్ నెట్టుకువచ్చారు. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో వంటి కీలక కేసులను ఎక్కువగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీకే తమ విచక్షణాధికారాన్ని బట్టి ఉన్నతాధికారి అప్పజెప్పేవారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్లో జాప్యం రావడంతో ఇతర డివిజన్ల అధికారులకు అదనంగా బాధ్యతలు పడ్డాయి. బీచ్ కబడ్డీలో సిక్కోలు అ‘ద్వితీయం’ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం కబడ్డీ జట్లు మరోసారి సత్తాచాటాయి. ఏపీ రాష్ట్రస్థాయి సీనియర్స్ బీచ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా మహిళా జట్టు రన్నరప్గా నిలిచింది. ఈ పోటీలు ఈ నెల 7 నుంచి 10 వరకు నెల్లూరు జిల్లా దువ్వూరు వేదికగా జరిగాయి. పురుషుల జట్టు సెమీస్లో నిష్క్రమించగా..మహిళల జట్టు తుది వరకు పోరాడింది. వీరి రాణింపు పట్ల జిల్లా కబడ్డీ సంఘ చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా అధ్యక్షుడు నక్క రామకృష్ణ, కార్యదర్శి సాదు ముసలినాయుడు, సాదు శ్రీనివాస్, సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. పోక్సో కేసులో నిందితుడికి రిమాండ్ పాతపట్నం: పోక్సో కేసు నిందితుడైన అంతరాబ గ్రామానికి చెందిన యాగాటి జయరాంకు పాతపట్నం మెజిస్ట్రేట్ 15 రోజులు రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని అంపోలులోని జిల్లా జైలుకు తరలించినట్లు ఎస్ఐ కె.మధుసూదనరావు సోమవారం తెలిపారు. విద్యుత్ తీగ తెగిపడి మూగజీవి మృతి వజ్రపుకొత్తూరు రూరల్: పెదబాడాం–గుళ్లలపాడు గ్రామాల మధ్య 33 కేవీ విద్యుత్ తీగలు సోమవారం సాయంత్రం తెగి పడటంతో మూగజీవి మృత్యువాత పడింది. నగరంపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు దువ్వాడ పున్నయ్య తాను పెంచుకుంటున్న మూగ జీవాలను పంట పొలాల వైపు మేతకు తీసుకువెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో విద్యుత్ తీగ పడటంతో ఎద్దు మృతి చెందింది. సుమారు రూ. 40 వేలు నష్టం కలిగినట్లు బాధితుడు వాపోయాడు. అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరాడు. వేతనాలు పెంచాలని కార్మికుల నిరసన రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఆంధ్రా ఆర్గానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమ కార్మికులు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విధులు బహిష్కరించి పరిశ్రమ ఎదుట సోమవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల పేరుతో అతి తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమదోపిడీకి పాల్పడటం తగదన్నారు. ధరలు విపరీతంగా పెరిగాయని, వాటికి అనుగుణంగా వేతనాలు పెంచకపోతే కుటుంబ పోషణ ఎలా అని ప్రశ్నించారు. అధిక సమయం పనిచేయించి సింగిల్ ఓటీ మాత్రమే ఇస్తున్నారని, మిగతా పరిశ్రమల్లో డబల్ ఓటీ ఇస్తారని చెప్పారు. నెల వేతనం బోనస్గా ఇవ్వాలని, అతి తక్కువ బోనస్ మాత్రమే ఇస్తున్నారని తెలిపారు, చట్టబద్ధంగా వీడీఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పండుగ, జాతీయ సెలవులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కోరారు. నిరసన కార్యక్రమానికి సీఐటీయూ నాయకులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావులు మద్దతు తెలిపారు. -
కారు ఢీకొని రిటైర్డ్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
బూర్జ : మండల కేంద్రం బూర్జ గ్రామానికి చెందిన బంక రెయ్యిబాబు(38) సోమవారం ఉదయం విశాఖపట్నం షీలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రెయ్యిబాబు ఎయిర్ఫోర్స్లో పనిచేస్తూ ఆరు నెలల కిందట ఉద్యోగ విరమణ పొందాడు. షీలానగర్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ నెల 10న స్వగ్రామం బూర్జలో శుభకార్యం నిమిత్తం వచ్చి తిరిగి సోమవారం విశాఖపట్నం బయలుదేరాడు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి షీలానగర్కు ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రెయ్యిబాబుకు భార్య నళిని, కుమారులు దినకర్, కౌశిక్ ఉన్నారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి సంతబొమ్మాళి: దండుగోపాలపురం రైల్వే హాల్ట్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి సోమవారం మృతి చెందాడు. గౌహతి నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు నుంచి జారిపడినట్లు తెలుస్తోంది. మృతుడు అసోం రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
సేవాభావంతో..
రెండు నెలలు క్రితం నేను ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రిలో నైట్ డ్యూటీలో ఉండగా, రాత్రి సమయంలో ఏడాదిన్నర బాబును తల్లిదండ్రులు ఏడుస్తూ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఫిట్స్ రావడంతో పూర్తిగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. ఆ పిల్లాడ్ని చూస్తే నా ఏడాది కొడుకు గుర్తుకు వచ్చాడు. వెంటనే వైద్యం అందించా. ఇంజక్షన్ చేసి తెల్లారేవరకు ఆ పిల్లాడిని కంటికి రెప్పలా సపర్యలు చేశాను. బాబు కోలుకున్నాక ఆ తల్లిదండ్రులు నాపై చూపిన కృతజ్ఞతకు పులకించిపోయాను. నా భర్త సీఐఎస్ఎఫ్లో జాబ్ చేస్తుండటంతో పలుమార్లు నన్ను ఉద్యోగం మానేయాలని చెప్పారు. అయితే తోటి వారికి సాయం చేసే అమూల్యమైన ఉద్యోగాన్ని వదిలేయాలనిపించలేదు. – సీహెచ్.నాగశ్రీ, స్టాఫ్ నర్సు, ఇచ్ఛాపురం రోగులకు సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఓ రోజు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నేను డ్యూటీ నర్సు కావడంతో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. కొన ఊపిరితో ఉన్న ఆ వ్యక్తిని ప్రాణాలతో కాపాడేందుకు చాలా ప్రయత్నం చేశాను. చికిత్స అందిస్తుండగా నా చేతిలోనే మృతి చెందాడు. ఆ సమయంలో నిస్సహాయ స్థిఽతిలో ఉండిపోయాను. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం మూలంగా మృతి చెందాడు. ఇప్పటి కుర్రాళ్లు ప్రయాణాలు చేసే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు వహించడం లేదు. – బి.రూపావతి, స్టాఫ్ నర్స్, ఇచ్ఛాపురం ● -
జె.ఆర్.పురంలో చోరీ
రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పంచాయతీ వేంకటేశ్వర కాలనీ నడిబొడ్డున ఉన్న ఇంట్లో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. రణస్థలం మండలం నారువ పంచాయతీ కార్యదర్శి పనిచేస్తున్న డి.మల్లేష్ వెంకటేశ్వర కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి లావేరు మండలం నేతేరు లక్ష్మీపురం వెళ్లారు. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి తలుపులు తీసి ఉండటాన్ని సమీపంలో ఉంటున్న బంధువులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే మల్లేష్కు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్ బృంద సభ్యులు వచ్చి వివరాలు సేకరించారు. ఐదు తులాల బంగారం, రూ.లక్షా ఇరవై వేలు నగదు పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని ఇళ్ల వద్ద ఉన్న సీసీ కెమెరాలలో నమోదైన వివరాలు ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీతో రాత్రి 11 గంటల సమయంలో వచ్చారు. అందులో ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లాడు. 12.30 గంటల సమయంలో మిగతా ఇద్దరు స్కూటీతో రాగానే లోపలి వ్యక్తి బయటకు వచ్చి అందరూ పరారయ్యారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అత్యంత రద్దీగా, ముఖ్య కూడలిలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంతో కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ప్రాంతంలో ఆకతాయిల ఆగడం ఎక్కువైందని, అర్ధరాత్రి వేళల్లో కూడా బైక్లతో తిరగడం, అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారిందని, ఇప్పటికై న ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
పల్లకిలో పెళ్లికూతురు
సీహెచ్ కపాసుకుద్ధిలో విశ్వశాంతి మహాయజ్ఞంలో భాగంగా నిర్వహించిన తారకనామమంత్ర పారాయణ సహిత నామయజ్ఞం ఆదివారంతో వైభవంగా ముగిసింది. ఈ సందర్భంగా ఆదివారం విశ్వశాంతి మహాయజ్ఞంలో భాగంగా ఏర్పాటుచేసిన పూర్ణకుంభాలు, యజ్ఞకుండంలో మిగిలిన పదార్థాలను సమీపంలోని సముద్ర జలాల్లో నిమజ్జనం చేసే శోభాయాత్ర వేడుకగా జరిపించారు. – కవిటి కాలం మారింది. వివాహ పద్ధతులు మారిపోయాయి. ఆనాటి సంప్రదాయాలన్నీ కనుమరుగైపోయాయి. అలాంటిది ఓ పల్లెలోని పెళ్లిలో పల్లకీ మళ్లీ కనిపించింది. అంతరించిపోతున్న సంప్రదాయాన్ని ముచ్చటగా తట్టి లేపింది. ఆదివారం ఎస్పిఆర్పురం–చీపురుపల్లి, జి.సిగడాం–పొగిరి గ్రామాల్లో వివాహ వేడుకల్లో పెళ్లి కూతుళ్లను పల్లకిలో ఊరేగించారు. – జి.సిగడాం పల్లకిలో పెళ్లికూతురును ఊరేగిస్తున్న దృశ్యం (ఇన్సెట్లో) ఎస్పీఆర్పురం గ్రామంలో పల్లకిలో కూర్చున్న పెళ్లి కూతురు -
పోర్టు నిర్వాసితులకు తప్పని పాట్లు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులు సమస్యలతో సావాసం చేస్తున్నారు. నౌపడలో కేటాయించిన పునరావాస కాలనీలో కనీస వసతులు లేకపోవడంతో మూలపేట గ్రామానికి చెందిన నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. నీరు, రోడ్లు లేకపోవడం, డ్రైనేజీలు అరకొరగా ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్స్తో వస్తున్న ట్రాక్టర్, టిప్పర్లు తరచూ బురదలో కూరుకుపోతున్నాయి. ఆదివారం కూడా ఇదే సమస్య పునరావృతం కావడంతో అవస్థలు పడ్డారు. తమ భూములు, గ్రామాన్ని పోర్టుకు ఇస్తే త్యాగాలను గుర్తించకుండా సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
పలాసకు ఏమైంది..?
శ్రీకాకుళంసిగ్నల్ వస్తే ఒట్టుఏపీ ఫైబర్ నెట్ సిగ్నల్ రావడం లేదు. వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. –8లోసోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026శ్రీకాకుళం క్రైమ్, పలాస : జిల్లాలోని జంట పట్టణాలైన పలాస–కాశీబుగ్గలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. జిల్లాలోనే గొప్ప వర్తక కేంద్రంగా ఖ్యాతి పొందిన ఈ మున్సిపాలిటీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నా యి. ఏ క్షణాన ఏం జరుగుతుందో.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనంటూ ఇక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. వరుసగా ఇక్కడ జరుగుతున్న సంఘటనలే అందుకు సాక్షి. ఓ వైపు గన్ బెదిరింపులు, కిడ్నాప్లు, దాడు లు, దౌర్జన్యాలు, సోషల్ మీడియా అరెస్టులు స్థానికులను భయపెడుతున్నాయి. ఇవి జరుగుతుండగానే మరోవైపు దొంగనోట్ల ముఠా, అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల చొరబాటు, జిల్లా చోరుల హస్తలాఘవం వంటివి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇవి చాలవు అన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం దుకాణాలు, బార్లు, బెల్టుషాపుల్లో ఏరులై పారిస్తున్న మద్యానికి తోడు ఏఓబీ ప్రాంత సరిహద్దుల్లో వెలుస్తున్న గంజాయి డెన్లు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. తాజాగా శనివారం మొబైల్షాపులో పనిచేస్తున్న ఓ యువకుడిని మరో ఇద్దరు యువకులు కత్తితో గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడటం స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. పలాస–కాశీబుగ్గలో క్షీణించిన శాంతిభద్రతలు వరుసగా దొంగతనాలు, దోపిడీలు తాజాగా యువకునిపై హత్యాయత్నం సమీప ఏఓబీ ప్రాంతాల్లోనే గంజాయి, పేకాట డెన్లు ఇటీవల కాశీబుగ్గలోని ఓ బంగారం షాపులో ఒడిశా, యూపీలకు చెందిన డెకాయిట్ గ్యాంగులు పట్టపగలు చొరబడి యజమాని చేతు లకు బేడీలు వేసి గన్లతో బెదిరించి భారీగా బంగారాన్ని దోచుకుపోయారు. ఒడిశా డెకాయిట్లు పట్టుబడినా కథంతా నడిపింది కాశీబుగ్గలో ఉంటున్న ఒడిశా వలసదారుడే కావడం విశేషం. ఊరుకునేది లేదు.. భారీ చోరీలనేవి తగ్గాయి. నేరస్తులను పట్టుకుంటున్నాం. అంతర్ రాష్ట్ర వలసదారులు ఇక్కడ స్థానికంగా ఉంటూ నేరాలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్నాం. సర్వైలెన్సులు పెట్టాం. శాంతిభద్రతల పరిరక్షణలో మా పోలీసులు ముందుంటాం. – ఇటీవల మీడియాతో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఘటనలు ఇవే.. ఆమదాలవలసకు చెందిన ఓ వ్యక్తి కాశీబుగ్గ జీడివ్యాపారిని(ఇతని సొంతూరు ఆమదాలవలసనే) ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో కిరాయి గూండాలతో కిడ్నాప్ చేయించాడు. అంతకుముందు ఏడాదే జీడి వ్యాపా రి కె.రాజేంద్ర కుమారున్ని ఆర్థికలావాదేవీల్లో తేడాతోనే కొందరు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు విచారణలో రుజువైంది. ఇదే కాశీబుగ్గలో ఓ ఆర్మీ ఉద్యోగి గణేష్ అఫ్సెంట్ ప్రింటర్స్ ఓనర్ని కిడ్నాప్ చేయించాడు. పలాస రైల్వే స్టేషన్ టూవీలర్ పార్కింగ్, రైల్వే రన్నింగ్ రూమ్ మెయింటెనెన్సు (ఆశీలు) కాంట్రాక్టు విషయంలో కాంట్రాక్టర్ను గన్తో ముగ్గురు బెదిరించారు. ఈ ఏడాది జనవరిలో కాశీబుగ్గలోని చినతిరుపతిగా పేరొందిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఇదే జనవరిలో పూండిలో పంచాయతీ కార్యదర్శి ఇంట్లోనూ భారీ చోరీ జరిగింది. అంతకు ముందేడాది ఇదే పూండిలోని ఓ బంగారం షాపు లో భారీ చోరీ జరిగింది. పూండీ చోరీలు అంతర్రాష్ట్ర ముఠాల పనేనని ఇటీవల ఎస్పీ విలేకరుల సమావేశంలో సైతం చెప్పారు. -
ఏమేం చేయాలంటే..?
● వేసవిలో ప్రణాళిక ఉండాల్సిందే ● ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం ● ఆహార నియమాలు పాటించి తీరాల్సిందే ద్రవాహారమే ఉపయుక్తం సాధారణ రోజుల్లో కంటే మూడు రెట్లు అధికంగా నీరు తాగాలి. పళ్ల రసాలు, మజ్జిగ, రాగి మాల్ట్, నిమ్మరసం వంటివన్నీ ఉపయుక్తమే. ఫ్రిజ్ నీటిని తాగకుండా కుండలు, కూజాలే ఉత్తమం. విపరీతమైన దాహం వేసే వరకు ఆగకుండా ఈ సీజన్లో తరచుగా నీరు, బార్లీ వంటి ద్రవాహారం తీసుకుంటూ ఉండాలి. శ్రీకాకుళం కల్చరల్: కార్తెలు మొదలైనప్పటి నుంచి సూరీడు ఎక్క డా ఆగడం లేదు. నిప్పులు కక్కుతున్నాడు. కేవలం 4 రోజుల్లో అమాంతం పెరిగిన ఎండలు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ మే ఎండలను ఎదుర్కోవడానికి చక్కటి ప్రణాళికతో సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం మేలు వేసవిలో చెమట పూర్తిగా ఆరాక మాత్రమే స్నానం చేయాలి. కనీసం రోజుకు 2 లేదా 3 సార్లు స్నానం చేస్తే మరీ మంచిది. నీళ్లలో రోజ్ వాటర్, ఆల్మండ్ ఆయిల్ లాంటి మెడికేటెడ్ ఉత్పత్తులు కలపటం మేలు. ఉదయపు స్నానం ఒంట్లో బడలికను పోగొట్టి హుషారుగా చేసేందుకు సహకరిస్తే, రాత్రి వేళ స్నానం మలినాలను తొలగించి చక్కని నిద్రకు తోడ్పడుతుంది. ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే చన్నీళ్ల స్నానం బెటర్ అంటున్నారు ఫిజియోథెరపిస్టు కె.లక్ష్మణమూర్తి. పాటిస్తే ఆరోగ్య యోగమే వేసవిలో యోగా చాలా మంచిదని పతంజలి యోగా నిర్వాహకులు మావూరు నాగేశ్వరరావు అంటున్నారు. సూర్యనమస్కారం 12 భంగిమలు లెక్కిస్తూ చేయాలి. భంగిమకి 5 సెకండ్లు చొప్పున కేటాయిస్తూ ఓ నిమిషంలో పూర్తి చేయాలి. వేసవి కాలానికి తగ్గట్టుగా నిదానంగా చేసే ఈ సూర్యనమస్కారాలు రోజులో 6 సార్లు ఆచరిస్తే వేసవి కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఉష్ణాసనం, ఏకమ్ముక్తాసనం, శశాంకాసనం, అర్దకోణాసనం, ప్రశాంతాసనం, యోగ నిద్ర, షణ్మఖి ముద్ర ఆసనాలు కూడా మంచివే. శీతలి, చంద్రభేధిని, నాడి శోధన చేయడం ద్వారా ఎండ వేడిమి వల్ల కలిగే శారీరక ఇబ్బందులు అధిగమించవచ్చు. ఆహారమే కీలకం వేసవిలో రుచికరమైన, ఆరోగ్యకరమైన సీజనల్ ఫ్రూట్స్కి ఉంటాయి. బ్లాక్బె బెర్రీస్, బ్లూ బెర్రీస్, స్ట్రాబెరీస్, రాస్ బెర్రీస్, బొప్పాయి, పచ్చి మామిడి, చెర్రీస్, యాపిల్, పుచ్చకాయ, ఉసిరి వంటివి విరివి గా ఉపయోగించడం మంచిది. కూరగాయల్లో కాకర కాయ, క్యాబేజీ, కాలిఫ్లవర్, బ్రకోలి, దోస, గ్రీన్బీన్స్, పెద్ద వంకాయ, పుదీనా వంటివి నీటి పరిమాణాన్ని దేహంలో సమపాళ్లలో ఉంచేందుకు ఉపకరిస్తాయి. మాంసాహారం పరిమితం చేయాలి. ఓట్మిల్, బ్రౌన్రైస్, తియ్యటి బంగాళాదుంపలు ఆహారంలో భాగం చేస్తే బెటర్. ఆహారంలో ఒక టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు కలిపి తీసుకుంటే దేహానికి అవసరమైన ఫాటీ యాసిడ్స్ అందుతాయి. -
అంతులేని గ్యాస్ కష్టాలు
● సిలిండర్ల కోసం ముప్పు తిప్పలు పడుతున్న వినియోగదారులు ● ప్రయాసలు పడుతున్న గ్రామీణ ప్రజలు టెక్కలి: జిల్లాలో గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా గ్యాస్ ఇబ్బందులు లేవంటూ అధికారులు బాహాటంగా ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం సామాన్య వినియోగదారుడికి గ్యాస్ సిలిండర్ అందాలంటే పడరాని పాట్లు పడుతున్నారు. దీనికి తోడుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కావాలంటే ఏకంగా 2 వేల నుంచి 2500 రూపాయలకు పైగా అవుతోందని అంటున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర చెప్పాల్సిన పని లేదు. రెండు నెలల క్రితం వరకు రూ.1850 ఉన్న కమర్షియల్ గ్యాస్ ఇప్పుడు రూ.3270కు చేరింది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన డొమెస్టిక్ వినియోగదారులు అనేక ప్రయాసలతో ఏజెన్సీల వద్దకు రెండు మూడు సార్లు తిరిగితే తప్ప సిలిండర్ దొర కడం లేదు. గ్యాస్ కొరత ఉందనే నెపంతో ఇప్పటి కే పట్టణాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థ పెద్ద బ్లాక్ మార్కెట్గా మారుతోంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే గ్యాస్ బుక్ చేసుకుని నిర్ణీత కాలంలో గ్యాస్ సిలిండర్ పొందాలని అధికారులు ప్రకటన లు చేయడం కేవలం కంటి తుడుపు చర్యగా మా రింది. ఏజెన్సీల ద్వారా అందని గ్యాస్ సిలిండర్లు అత్యధికంగా డబ్బులు చెల్లిస్తే బయట మార్కెట్లో పుష్కలంగా లభ్యమవుతున్నాయని కొంత మంది వినియోగదారులు వాపోతున్నారు. పర్యవేక్షిస్తున్నారా..? ప్రతి రోజూ ఏజెన్సీల నుంచి ఎన్ని సిలిండర్లు సరఫరా చేస్తున్నారు, ఎక్కడకు చేరుతున్నాయి, అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారా, బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా, ఈ వ్యవహారంలో డెలివరీ బాయ్స్ పాత్ర ఎంత మేరకు ఉంది అనేది ఎవరూ పర్యవేక్షించడం లేదన్న ఆరోపణ ఉంది. టెక్కలి, నందిగాం మండలాలకు ఒకే ఒక్క సివిల్ సప్లై డీటీ ఉండడంతో పర్యవేక్షణ కొరవడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏయూఈఈటీకి 330 మంది హాజరు
ఎచ్చెర్ల : ఆంధ్రా యూనివర్సిటీలో ఆరేళ్ల డ్యూయల్ ఇంజినీరింగ్ (బీటెక్, ఎంటెక్) కోర్సుల్లో ప్రవేశానికి ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయం కేంద్రంగా ఆదివారం నిర్వహించిన ఏయూఈఈటీ– 2026కు 330 మంది హాజరయ్యారు. ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు 374 మందికి హల్టికెట్లు జారీ చేయగా 44 మంది గైర్హాజరయ్యారు. వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖరరావు పర్యవేక్షించారు. ఎచ్చెర్లతో పాటు రాష్ట్రంలో మరో ఏడు కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 14న ఫలితాలు విడుదల కానున్నాయి. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం ఉదయం కుటుంబ కలహాలతో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 వాహనంలో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య మాలతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుపతిరావుకు వివాహితులైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. శ్రీముఖలింగేశ్వరుని సన్నిధిలో మత్స్యశాఖ డైరెక్టర్ జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వెలసిన మధుకేశ్వరున్ని మత్స్యశాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎ.చంద్రశేఖర్ రెడ్డి కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు నిర్వహించి వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. అర్చకులు ఆల చరిత్ర వివరించి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, శేషవస్త్రాలు అందించారు. ఈయనతోపాటు డీడీ గోపికృష్ణ, సిబ్బంది, అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉన్నారు. పశువుల అక్రమ రవాణా అడ్డగింత నరసన్నపేట: వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది ఆవులను పట్టుకొని డ్రైవర్పై కేసు నమోదు చేశామని నరసన్నపేట ఎస్ఐ బి.గణేష్ ఆదివారం తెలిపారు. నారాయణవలస సంత వద్ద నుంచి అలమండ సంతకు ఎటువంటి అనుమతులు లేకుండా చిన్న వ్యాన్లోనే 9 ఆవులను ఎక్కించడంతో ప్రాణాపాయంగా కనిపించాయని చెప్పారు. తామరాపల్లి వద్ద వీటిని పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేసి ఆవులను గోశాలకు తరలించి వ్యాన్ సీజ్ చేశామని ఎస్ఐ తెలిపారు. నాటకరంగానికి చేయూతనివ్వాలి శ్రీకాకుళం కల్చరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా భరత్ భూషణ్ నియామకం పట్ల శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి మాట్లాడుతూ ఒడిదుడుకుల్లో ఉన్న నాటకరంగానికి, పేద కళాకారులకు చేయూతనందించాలని కోరారు. సమాఖ్య కార్యనిర్వాహక అధ్యక్షుడు పన్నాల నరసింహమూర్తి, కార్యదర్శి బి.రామచంద్ర దేవ్, న్యాయ సలహాదారు కంచరాన అప్పారావు, కార్యవర్గ సభ్యులు చైర్మన్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
20 నుంచి పాఠశాల, కళాశాల బస్సులు తనిఖీ
శ్రీకాకుళం రూరల్: ఈ నెల 20 నుంచి పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన బస్సులను తనిఖీ చేస్తామని ఉపరవాణా శాఖాధికారి ఎ.విజయసారథి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్ర రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని స్కూల్స్, కాలేజీ బస్సులను ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల చట్టం అనుసరించి రహదారి భద్రత నిబంధలను అనుస రించి తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా బస్సు నిర్వహణ, బస్సు ఫిట్నెస్, పర్మిట్, పన్ను విధానం, అత్యవసర నియమాలు, వేగ నియంత్రణ పరికరాలు, డ్రైవర్కు సంబంధించిన లైసెన్స్, బ్యాడ్జి బస్సు పనితీరు సక్రమంగా ఉండాలన్నారు. జిల్లాలోని 5 బృందాలుగా ఏర్పరచి ప్రతి రోజు తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. మొత్తంగా 614 స్కూల్, కాలేజీలకు సంబంధించిన బస్సులు ఉండగా ఇంతవరకూ 173 బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపారు. వీటిలో 49 బస్సులకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పు అవసరమన్నారు. ఆయా యాజమాన్యాలను స్పంచింది వెంటనే స్కూల్ కాలేజీ బస్సులను వెంటనే తనిఖీలు చేపట్టాలని డీటీసీ కోరారు. 16న ముఖ్యమంత్రి పర్యటన నరసన్నపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 16న నరసన్నపేట మండలంలో పర్యటించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మండలం జమ్ము కూడలి, తామరాపల్లిల వద్ద ఉన్న హెలీప్యాడ్ స్థలాలను ఆయన అధికారులతో కలసి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో శనివారం పాల్గొంటారని అన్నారు. ఆయన వెనుక ఇన్చార్జి ఆర్డీఓ వేణుగోపాలరావు, ఆర్అండ్బీఈఈ తిరుపతిరావు, డీఎస్పీ లక్ష్మణరావు, తహసీల్దార్ సత్యనారా యణ ఉన్నారు. ఇప్పటికే నరసన్నపేట మేజరు పంచాయతీలో పారిశుద్ధ్య పనులను చురుగ్గా చేపడుతున్నారు. రోజుకు 200 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను వినియోగిస్తున్నారు. ‘లేబర్ కోడ్లు రద్దు చేయాలి’ రణస్థలం: కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు, సంస్థలకు ఈ నెల 10వ తేదీ నుంచి నాలుగు లేబర్ కోడ్స్ రూల్స్ అమలులోకి తేవడాన్ని వ్యతిరేకిస్తూ, లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ ఆదివారం పైడిభీమవరం పారిశ్రామికవాడలో లేబర్ కోడ్స్ రూల్స్ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. కార్మిక వర్గాన్ని బానిసలుగా చేయాలనుకుంటే ఆ ప్రభుత్వాలే పతనం అవుతాయని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీస వేతనం వెంటనే సవరించి కనీస వేతనం రూ. 26వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే గేటును ఢీకొట్టిన వాహనం వజ్రపుకొత్తూరు రూరల్: పలాస–కాశీబుగ్గలో గల రైల్వే ఎల్సీ గేటును ఆదివారం ఓ ప్రైవేట్ వాహనం ఢీ కొట్టడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో సుమారు గంట కాలం పాటు వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు, రైల్వే సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు.. రైల్వే గేటు వేస్తున్న సమ యంలో తొందరగా గేటును దాటే ప్రయత్నంలో వాహనం అతివేగంగా వెళ్లి ఎల్సీ గేటును బలంగా ఢీ కొట్టింది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి సిబ్బంది సాయంతో ప్రత్యా మ్నాయంగా తాత్కాలిక గేటును ఏర్పాటు చేసి మరమ్మతు పనులు చేపట్టారు. ఈ పనులు చేపట్టేందుకు దాదాపుగా గంట సమయం పట్టడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అలాగే ద్విచక్రవాహనదారులు మండుటెండతో చాలా ఇబ్బంది పడ్డారు. అలా గే కొంత మంది ప్రయాణికులు బస్సులు, ఆటోలను దిగి అక్కడ నుంచి వెళ్లారు. -
సిగ్నల్ వస్తే ఒట్టు!
ఏపీ ఫైబర్ నెట్.. ● సాంకేతిక లోపంతో సరిగ్గా అందని సేవలు ● మండిపడుతున్న వినియోగదారులు ● చేతులెత్తేస్తున్న ఆపరేటర్లు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో ఏపీ ఫైబర్నెట్ సేవలను కూటమి పాలకులు గాలికి వదిలేశారు. ప్రజలు సాంకేతికతను అందిపుచ్చుకొని ఇంట్లోనే ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఏపీ ఫైబర్ నెట్ సేవలను ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఒకే ప్యాకేజీ కింద టీవీ, ల్యాండ్ ఫోన్, ఇంటర్నెట్ విత్ వైఫైతో సర్వీసులను ఏపీ ఫైబర్ లిమిటెడ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో 40 వేలకు పైగా ఏపీ ఫైబ నెట్ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన ఈ సేవలను కూటమి ప్రభుత్వం తర్వాత పూర్తిగా గాలికి వదిలేయడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. నో సిగ్నల్.. ప్రభుత్వ బడులకు, గ్రామ, వార్డు సచివాయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం ఈ కనెక్షన్లు ఏర్పాటు చేశారు. నిర్వహణ గాలికి వదిలేయడంతో సేవలు సరిగా అందని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 26 వేలకు కనెక్షన్లు తగ్గాయని అధికారులే చెబుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రారంభంలో ఈ నెట్ బేసిక్ ప్లాన్ ప్రతి నెలా రూ.149 ఉండగా నేడు రూ.349కు పెరిగింది. ఈ ప్యాకేజీ డబ్బులను నెల ముందుగానే కేబుల్ ఆపరేటర్ల ద్వారా వినియోగదారులు చెల్లించాలి. లేదంటే నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయేవి. ముందుగానే బిల్లు చెల్లించినప్పటికీ ఇంటర్ నెట్లో నో సిగ్నల్ అంటూ చూపిస్తుండటంతో వినియోగదారులు మండిపడుతున్నారు. ఎప్పుడు నెట్ వస్తుందో ఎప్పుడు తీసేస్తారో తెలియని పరిస్థితి. ఈ విషయమై కస్టమర్ కేర్ నంబర్కు కాల్ చేసినా స్పందించడం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైబర్ నెట్ ఆపరేటర్లు కూడా తామేమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. సాంకేతిక సమస్య ఉండటంతో పాటు యూపీఎస్లు పని చేయకపోవడం, డిజిటల్ బాక్స్లు ఇవ్వకపోవడంతో తాము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జియో, ఎయిర్టెల్ వంటి ప్రైవేట్ కంపెనీలు శాటిలైట్ వ్యవస్థ ద్వారా సిగ్నల్ను పంపిస్తుంటే ఏపీ ఫైబర్ నెట్ మాత్రం కేబుల్ వైర్ల ద్వారా అందిస్తున్నారు. ఏపీ ఫైబర్ సేవలలో సాంకేతిక లోపానికి వైర్లలో నాణ్యత కూడా ఒక కారణమని పలువురు చెబుతున్నారు. -
కిక్కిరిసిన కాంప్లెక్స్
జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కిక్కిరిసింది. పిల్లలకు సెలవులు కావడంతో కుటుంబ సమేతంగా జనాలు ప్రయాణాల బాట పట్టడంతో బస్సులన్నీ రద్దీగా కనిపించాయి. ఈ నెల 13 తర్వాత మూఢం రానుండటంతో వివాహ, గృహప్రవేశ ముహూర్తాలు ఇప్పుడే ఎక్కువగా జరుగుతుండటంతో జనాల రాకపోకలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లే వారితో నాన్స్టాప్ కౌంటర్ కిక్కిరిసిపోయింది. కాంప్లెక్స్కు చేరుకున్న బస్సుల్లో సీట్లు సాధించేందుకు.. ముఖ్యంగా ఉచిత బస్సుల్లో సీట్ల కోసం మహిళలు ఎగబడ్డారు. – శ్రీకాకుళం అర్బన్ -
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నల్లాన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నరసన్నపేటకు చెందిన నల్లాన వెంకునాయుడు నియమితులయ్యారు. ఆదివారం హైదరాబాద్లోని సంఘ జాతీయ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, రాష్ట్ర ఇన్చార్జి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వై.నూకానమ్మ యాదవ్ నియామక పత్రాన్ని వెంకునాయుడుకు అందజేశారు. ఈ సందర్భంగా వెంకునాయుడు మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లపై పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర అధికార ప్రతినిధి పిల్లా కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో చోరీలకు అడ్డుకట్ట పలాస: దొంగతనాలను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ కోరారు. ఆదివారం స్థానిక జి.ఎం.ఈ కాలనీలో 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సందర్భంగా స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో ఇటీవల దొంగతనం జరిగిందని, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను సకాలంలో పట్టుకోలేకపోతున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రతివీధిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అపరిచిత వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. -
32 ఏళ్ల తర్వాత..
దూసి జిల్లా పరిషత్ హైస్కూల్లో 1994 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఒకేచోట కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాలతో గడిపారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కేరింతలు కొడుతూ తమ చిన్ననాటి అనుభూతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. మాతృదినోత్సవం రోజున ఈ ఆత్మీయ సమావేశం జరగడం ఎంతో ప్రత్యేకంగా నిలిచిందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించి వారి ఆశీస్సులు అందుకున్నారు. – ఆమదాలవలస -
అధికారులూ.. ఇదేం తీరు..!
● అడ్మిషన్లపై చిన్న ప్రైవేటు స్కూళ్లపైనే దృష్టి పెట్టాలని ఆదేశం! ● కార్పొరేట్ పాఠశాలలకు రాష్ట్ర అధికారుల పరోక్ష దన్ను శ్రీకాకుళం : రాష్ట్ర విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్ విద్యాసంస్థలకు పరోక్షంగా దన్నునిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వెబ్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన చర్చలో చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలపైనే దృష్టి పెట్టాలని, కార్పొరేట్ విద్యాసంస్థల జోలికి వెళ్లవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు విద్యాశాఖలోనే చర్చ జరుగుతోంది. దీనిపై ఉపాధ్యాయవర్గాలు మండిపడుతున్నాయి. అలాగే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘ నాయకులు దీనిని తప్పుపడుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలలు టీసీలు ఇవ్వకుంటే ఎంఈఓలకు తెలియజేయాలని, వారే యూడైస్లో పేర్లను తొలగించి టీసీలు మంజూరు చేస్తారని చెప్పడంపైనా ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదని, ఇటువంటి విధానాలకు పాల్పడితే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలల పట్ల ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ఇటువంటి విధానాలకు స్వస్తిపలికి అందరినీ ఒకేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై డీఈవో రవిబాబు వద్ద ప్రస్తావించగా తాము ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో చేయాలని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను సంప్రదించి వారు సమ్మతిస్తే ప్రభుత్వ పాఠశాలలకు తరలించాలని మాత్రమే చెప్పారని, ఎంఈఓలు టీసీలు ఇస్తారనడంలో కూడా వాస్తవం లేదని పేర్కొన్నారు. -
అరసవల్లిలో భక్తుల రద్దీ
అరసవల్లి: వైశాఖమాసం సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సందడి కనిపించింది. చివరి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యున్ని దర్శించుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలు సంప్రదాయక పూజలు నిర్వహించారు. పెసల మొలకలు, ధాన్యం, బెల్లం, వడపప్పు, మామిడి పండ్లు, టెంకాయలతో ప్రత్యేకంగా స్వామి వారికి నివేదించి తమకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రీ అంటూ మొక్కుకున్నారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకున్నారు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఉక్కబోత, ఎండతీవ్రత పెరిగిపోవడంతో భక్తులు అవస్థలు పడ్డారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆధ్వర్యంలో పుష్కరిణి సమీపంలో టెంట్లు ఉన్నప్పటికీ ఏమాత్రం సరిపడకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. అన్నదాన ప్రసాదానికి భక్తులు బారులు తీరారు. పెందుర్తికి చెందిన భక్తులు ఆరిపాక సంధ్యారాణి, ఆమె కుమారుడు అయాన్ష్ నందన్లు తులాభారం మొక్కు చెల్లించుకుని 60 కేజీల బెల్లం చెక్కీలను ఈవో ప్రసాద్, సూపరింటెండెంట్ వెంకటరమణల సమక్షంలో ప్రసాదాల విభాగానికి సమర్పించారు. -
చదువుకు దూరం
ఫీజుల భారం.. శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదలకు ఉన్నత చదువులు భారంగా మారుతున్నాయి. స్కాలర్ షిప్పులు, ఫీజ్ రీయింబర్స్మెంట్లపై ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు ఫీజుల చెల్లింపు పెను భారమవుతోంది. దీని వల్ల కొందరి చదువులు అర్ధంతరంగా ఆగిపోతుంటే.. మరికొందరి సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యాలు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పేదల ఉన్నత చదువులకు మొండిచేయి చూపుతోంది. ఈ ఏడాది విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల చెల్లింపులకు చర్యలు తీసుకోలేదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ ప్రణాళిక ప్రకారం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల చేసి విద్యార్థులను ఆదుకునేది. తల్లిదండ్రులపై భారం పడ కుండా పిల్లల చదువులు సాగిపోయేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంజినీరింగ్, మెడికల్ చదువుల్లో చేరిన వారికి ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్సుమెంట్, స్కాలర్షిప్లు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 2023–24 సంవత్సరం చివరిలో ఎన్నికలు రావడంతో చివరి రెండు విడతలు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాలేదు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఈ బకాయి చెల్లించలేదు. కనీసం రెండు విడుతల్లో రూ.14.6 కోట్లు బకాయిలు ఉండిపోయాయి. దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి, ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. 2024–25 సంవత్సరంలో జిల్లాలో 52 వేల మంది విద్యార్థులు చదువుకున్నారు. వీరిలో కొన్ని డిగ్రీలకు మాత్రమే ఒక విడత నగదు వేసి, చేతులు దులుపుకున్నారు. జిల్లాలో అత్యధికంగా ఉన్న సుమారుగా 44 వేల మంది బీసీలకు ఈ నగదు జమకాలేదు. ఒక విడతలో సుమారుగా రూ.12 కోట్లు విడుదల చేయాల్సింది, కానీ ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. 2025–26 విద్యాసంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. జిల్లాలో సుమారుగా 52 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు వివిధ కోర్సులో ఉండగా.. వారిలో కేవలం 3321 మందికి మాత్రమే స్కాలర్ షిప్పులు విడుదల చేశారు. ఇది కేవలం రూ.4 కోట్లు. మిగిలిన విద్యార్థులు సుమారుగా 49 వేల మందికి రూ.48 కోట్లు వరకు బకాయిలు ఉన్నాయి. వీరంతా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఇంజినీరింగ్ ప్రవేశాలు అయ్యాయి. గతంలో చేరిన విద్యార్థులు ద్వితీయ, తృతీయ సంవత్సరాలకు వెళ్తున్నారు. వీరంతా ఫీజుల చెల్లింపుపై ఆందోళన చెందుతున్నారు. ఫీజు రీయింబర్స్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు పెరుగుతున్న బకాయిలు -
ధాన్యం కొనుగోలుకు మోక్షమెప్పుడో?
సారవకోట: కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు వీడటం లేదు. సారవకోట మండలంలోని పలు గ్రామాలలో రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యం నేటికీ కొనుగోలు కాలేదు. సారవకోట, జగ్గయ్యపేట, బురుజువాడ, కొత్తూరు, అగదల తదితర గ్రామాల రైతులకు పంట త్వరగా చేతికి రావడంతో ధాన్యాన్ని వ్యాపారులకు ఎంతోకొంత ధరకు విక్రయించుకున్నారు. ప్రస్తుతం తొగిరి, అక్కివలస, బద్రి, అడ్డపనస గ్రామాల రైతులకు పంట ఆలస్యంగా చేతికి రావడంతో రోడ్లపై ఆరబెడుతున్నారు. ప్రభుత్వం రబీలో పండిన ధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడంతో వారంతా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వ్యాపారులు సైతం సరైన ధర మార్కెట్లో లేదని, ఇప్పుడు తాము కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారు. మరోవైపు ఈదుర గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ధాన్యం భద్రపర్చుకునేందుకు అవకాశం లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మరికొన్ని రోజులలో తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో కలవరపడుతున్నారు. మరోవైపు మొక్క జొన్న సాగు చేసిన రైతులు సైతం మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
పత్రాలు.. ఇప్పుడే తీసుకుంటే మేలు
హిరమండలం: పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. పది, ఇంటర్ విద్యార్థులకు ఉన్నత చదువులకు పలు ధ్రువీకరణ పత్రాలు అవసరం. వీటిని ముందస్తుగా పొందేందుకు ఇదే మంచి తరుణమని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్న విద్యార్థుల కోసం సంబంధిత కార్యాలయాల్లోనూ అవసరమైన అన్ని పత్రాలు అందజేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఒత్తిడి పెరగక ముందే.. ఏటా మే, జూన్ నెలల్లో ముఖ్యంగా తహసీల్దార్ కార్యాలయాల్లో ధ్రువీకరణ పత్రాల జారీలో ఒత్తిడి అఽధికంగా ఉంటుంది. దరఖాస్తుదారుల రద్దీ పెరు గుతుంది. దీంతో మాటిమాటికీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ముందుగా మేల్కొంటే ఈ అవస్థ తప్పుతుంది. పత్రాలు పొందాలంటే.. తదుపరి తరగతుల్లో ప్రవేశానికి ఆదాయం, కుల, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వంటి ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి. వీటికోసం మీసేవా, స్వర్ణగ్రామం సచివాలయాలు వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత అర్జీ పూర్తి చేసి అవసరమైన నకలను జతపర్చి సచివాలయం డిజిటల్ సహాయకుడికి అందజేయాలి. ఆన్లైన్లో పొందపరిచిన ఈ వివరాలపై వీఆర్వో క్షేత్ర స్థాయిలోను, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)నేరుగాను పరిశీలిస్తా రు. అన్నీ పక్కాగా ఉంటే చివరిగా తహసీల్దార్ తన లాగిన్లో మరోసారి నిశితంగా అన్నింటినీ తనిఖీ చేసి డిజిటల్ సంతకం చేస్తారు. దీనిపై చరవాణికి వచ్చే సందేశంతో దరఖాస్తుదారులు సచివాలయం లేదా మీసేవాలో ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే సమయంలో అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే మేలు. చివరి సమయంలో హడావుడి పడుతూ ఆందోళ న చెందకుండా ప్రస్తుత సెలవుల్లోనే కార్యాలయాలను సంప్రదించాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాలు నిర్దేశించిన సమయం కంటే ముందు జారీచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – కె.బాలకృష్ణ, తహసీల్దార్, హిరమండలం -
నదీజల కాలుష్యాన్ని నివారించాలి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): నాగావళి నదీ జల కాలుష్యాన్ని ప్రభుత్వం ఎందుకు అరికట్టడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కోనారి మోహనరావు, పి.తేజేశ్వరరావు ప్రశ్నించారు. నాగావళి నది జల కాలుష్యం నివారించాలని, శ్రీకాకుళం ప్రజల ఆరోగ్యం కాపా డాలని, శ్రీకాకుళం మురికి నీరును శుద్ధిచేసి పైపులైన్ ద్వారా సముద్రానికి పంపించాలని కోరుతూ శని వారం నాగావళి నది కలుషిత జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు జలకాలుష్యాన్ని నివారించి ఎస్టీపీ ప్లాంట్ కట్టేందుకు నిధులు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించా రు. కలుషిత జలాలను తాగడం వల్ల నగరవాసులు డయేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళం నగరంలో 11 చోట్ల నుంచి నాగావళి నదిలోకి మురికి నీరు, ఆసుపత్రి వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు చేరుతున్నాయని, అవి నీటి ట్యాంకుల వద్దకు చేరడంతో అదే నీరు నగరవాసులకు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. నీటి పన్ను, నాలా పన్ను పేరిట రకరకాల పన్నులు వేసి దోపిడీ చేస్తున్న ప్రభుత్వం మంచినీరు కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. నదీజల కాలుష్యాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 12న మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు చింతాడ అమ్మన్నాయుడు, అల్లు సత్యనారాయణ, కొత్తకోట అప్పారావు, ఎం.గోవర్దనరావు, ఎం.ఆదినారాయణమూర్తి, బి.చిన్నారావు, వెంకటరావు, ప్రవీణ పాల్గొన్నారు. -
కక్ష గట్టి.. గొంతు కోసి..
● మొబైల్ షాపులో పనిచేస్తున్న వ్యక్తిపై ఇద్దరు వ్యక్తుల దాడి ● షాపు నుంచి బయటకు తీసుకొచ్చి గొంతు కోసి పరారీ పలాస : కాశీబుగ్గ కె.టి.రోడ్డులోని ఓ మొబైల్ షాపులో పనిచేస్తున్న లోలుగు ఈశ్వరరావు(20) అనే యువకుడిపై పలాస రాజమ్మకాలనీకి చెందిన రాజాం తిరుపతి, అతని స్నేహితుడు కోత సురేష్ దాడికి పాల్పడ్డారు. శనివారం షాపులోకి వెళ్లి మాట్లాడదామని చెప్పి బయట రోడ్డు మీదకు తీసుకొచ్చి అందరూ చూస్తుండగానే ఈశ్వరరావు గొంతును చాకుతో కోసేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఈశ్వరరావును పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుట్లు వేశారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ప్రేమ వ్యవహారమే కారణమా.. పోలీసుల కథనం ప్రకారం.. ఈశ్వరరావు అన్నయ్య రమేష్.. తిరుపతి చెల్లెలను ఏడాది క్రితం ప్రేమించాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఇదే సమయంలో ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిర్చారు. అయితే అతన్ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించి రమేష్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె తండ్రి మనస్థాపానికి గురై మృతి చెందాడు. దీంతో అమ్మాయి కుటుంబీకులు రమేష్, అతని కుటుంబ సభ్యులపై కక్ష పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే రమేష్ తమ్ముడు ఈశ్వరరావుపై దాడికి పాల్పడినట్లు సమాచారం. కాశీబుగ్గ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు బలి!
వరకట్న వేధింపులకు.. ● విశాఖలో శిమ్మపేట వివాహిత అనుమానాస్పద మృతి ● ఉరేసుకుందంటున్న భర్త ● అల్లుడే చంపేశాడని తల్లిదండ్రుల ఆరోపణ శ్రీకాకుళం క్రైమ్/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మినారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు. మొదటి రోజు నుంచే వేధింపులు.. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్గా ఉన్న సోమేష్ నావల్ డాక్యార్డ్లో ప్రాజెక్టు డిజైనర్గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు. గొడవవుతుందని.. ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ పట్నం త్రీటౌన్లో కేసు పెట్టామని, సోమేష్ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు. మృతిచెందిన తేజశ్రీ తేజశ్రీ కాళ్లపై వాతలు -
కిక్ కొడితే పతకమే..!
శ్రీకాకుళం న్యూకాలనీ: బాక్సింగ్లో అంచెలంచెలుగా రాణిస్తూ.. ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిధ్యమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది శ్రీకాకుళం యువ క్రీడాకారణి పెద్దింటి చైతన్య. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెరుపులు మెరిపిస్తోంది. యువ బాక్సర్లకు ఆదర్శంగా నిలుస్తోంది. సిక్కోలు నుంచి ఐర్లాండ్ వరకు.. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఐర్లాండ్లో జరిగిన అంతర్జాతీయ స్పారింగ్ క్యాంప్, టెస్టు మ్యాచ్లల్లో చైతన్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తృటిలో పతకం కోల్పోయినా.. అంతర్జాతీయ వేదికపై సిక్కోలు వనితగా చూపించిన పోరాట ప్రతిభను బాక్సింగ్ దిగ్గజాలను సైతం మెచ్చుకునేలా చేసింది. తాజాగా అసోంలో గత నెల 13 నుంచి 20వ తేదీ వరకు జరిగిన 8వ యూత్ మెన్ అండ్ ఉమెన్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్–2026 పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన చైతన్య అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. పలువురు స్టార్ ప్లేయర్లను ఓడించి సెమీస్లో అడుగుపెట్టిన ఈ యువ కిషోరం చిన్న తప్పిదం కారణంగా ఫైనల్ బెర్త్ను కోల్పోయింది. దీంతో 65 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని నిలబెట్టుకుంది. ఎంతో కఠినమైన పోటీ నడుమ చైతన్య చూపించిన పోరాట ప్రతిభ అత్యద్భుమని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఫౌండర్, ప్రధాన కార్యదర్శి బలగ అనంత లక్ష్మణ్దేవ్(అను) పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో,. ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే తన జీవిత లక్ష్యంగా సాధన చేస్తున్న చైతన్య శ్రీకాకుళం నగరంలోని పుణ్యపువీధిలో నివాసం ఉంటున్నారు. తండ్రి పెద్దింటి వేణుగోపాలరావు ఇండియన్ ఆర్మీలో సుబేదార్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తుండగా, తల్లి తేజేశ్వరి గృహిణి. చైతన్య విశాఖపట్నంలోని వాల్తేర్ కేంద్రీయ విద్యాలయంలో 10+2 (ఇంటర్) చదువుతూ.. విశాఖలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) శిక్షణా కేంద్రంలో సాధన చేస్తోంది. ఒలింపిక్స్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే నా జీవిత లక్ష్యం. కోచ్ల పర్యవేక్షణలో నిరంతర సాధన చేస్తున్నాను. తల్లిదండ్రుల ప్రోత్సాహం, బాక్సింగ్ సంఘ పెద్దలు, కోచ్ల నిరంతర కృషితో రాణించగలుగుతున్నాను. భవిష్యత్తులో మరిన్ని పెద్ద టోర్నీల్లో పతకాలు సాధిస్తాననే నమ్మకముంది. – పెద్దింటి చైతన్య, బాక్సింగ్ క్రీడాకారిణి బాక్సింగ్లో సత్తాచాటుతున్న పెద్దింటి చైతన్య ఐర్లాండ్లో జరిగిన ఇంటర్నేషనల్ స్పారింగ్ క్యాంప్, టెస్టు మ్యాచ్ల్లో రాణింపు తాజాగా యూత్ బాక్సింగ్ పోటీల్లో కాంస్య పతకంతో మెరుపులు -
●ఒక కొడుకును కోల్పోయినా..
ఇచ్ఛాపురం మండలం పాయితారి గ్రామానికి చెందిన ఈమె పేరు లోపింటి మహాలక్ష్మి. ఈమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కిషోర్కుమార్ మిలట్రీలో చేరతానంటే, తండ్రి పద్మనాభం వారించినప్పటికీ, తల్లి మహాలక్ష్మీ పెద్ద మనస్సుతో సైన్యంలోకి పంపించింది. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత 2007 డిసెంబర్13న చత్తీస్గఢ్ రాష్ట్రం బీజూపూర్లో నక్సల్స్కు, సీఆర్పీఎఫ్ జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో కిశోర్కు మార్ నేలకొరిగాడు. కుటుంబం అంతా తల్లడిల్లినా ...తల్లి మహాలక్ష్మీ మాత్రం దేశ రక్షణ కోసం తన కొడుకు ఆశువులు బాసాడు అంటూ గొప్పగా చెప్పుకుంది. అధైర్య పడకుండా తన చిన్న కొడుకు అశోక్ను సైతం అదే సైన్యంలో చేర్పించింది. ప్రస్తుతం అశోక్ రాంచీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. లోపింటి మహాలక్ష్మీ -
శ్రీకాకుళం
కిక్ కొడితే పతకమేబాక్సింగ్లో చైతన్య రాణిస్తున్నాడు. యూత్ బాక్సింగ్ పోటీలో అదరగొట్టాడు. –8లోకక్ష గట్టి.. గొంతు కోసి పలాసలో దారుణం జరిగింది. కక్ష గట్టి ఓ వ్యక్తి మృతి చెందారు. –8లోఆమె కొట్టినా ఆనందమే.. ఆమె తిట్టినా సంతోషమే.. అమ్మ ఏం చేసినా పిల్లలకు ముచ్చటే. ఇళ్లంటే అమ్మ గాజుల చప్పుడు వినిపించాలి. ఇళ్లంటే ఆమె అడుగుల సవ్వడి తెలుస్తూ ఉండాలి. మాతృత్వం అంటే ఈ లాలిత్యం ఒక్కటే కాదు. బిడ్డ ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా దేశ రక్షణకు పంపించే తల్లులు ఉన్నారు. వారసుడికి ప్రాణాపాయం ఉందని తెలిసి అవయవాన్ని దానం చేసిన మాతృమూర్తులు ఉన్నారు. కన్నపేగు అడుగుల కదలికలు లయబద్ధం చేసి నుదుటి రాతను మార్చిన అమ్మలూ ఉన్నారు. నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం. మమతల మాలలు అల్లుతూ ప్రతి ఇంటినీ పచ్చగా చూసుకుంటున్న అమ్మకు జేజేలు పలకాల్సిన రోజు. – ఇచ్ఛాపురం రూరల్, టెక్కలి, శ్రీకాకుళం కల్చరల్, జి.సిగడాం, వజ్రపుకొత్తూరు రూరల్ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన ఈమె పేరు బుడత లోలమ్మ. ఇద్దరు మగ పిల్లలు పుట్టాక పెంచి ప్రయోజకుల్ని చేయాల్సిన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న లోలమ్మ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తూ ఇద్దరు పిల్లల్ని చదివించారు. తన ఇద్దరు కొడుకుల్ని సైన్యంలో చేర్పించాలన్న ఆమె కోరికను పిల్లలు ముందుంచారు. పెద్దబ్బాయి దివాకర్, చిన్నబ్బాయి ఢిల్లీరావులు పదో తరగతి నుంచే తమ తల్లి సంకల్పాన్ని నెరవేర్చేందుకు కృషి చేశారు. 2014లో పెద్ద కొడుకు జైలర్గా, 2015లో చిన్నకొడుకు ఇండియన్ ఆర్మీలో సోల్జర్గా ఎంపికయ్యారు. గత ఏడాది ఆపరేషన్ సింధూర్లో ఢిల్లీరావు పాల్గొనగా, తల్లి లోలమ్మ దేశ రక్షణ కో సం పోరాడాలంటూ పిలుపునివ్వడం విశేషం. దేశానికి సేవ చేస్తున్న తన ఇద్దరు కుమారుల్ని చూసి ఇప్పుడు తల్లి లోలమ్మ గర్వపడుతోంది. ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి ఆయుష్షును పెంచారు. టెక్కలి రెడ్డికవీధికి చెందిన పిలక దుర్గారావుకు కిడ్నీ పాడై పోవడంతో, ఎవరైనా కిడ్నీ దానం చేస్తే మళ్లీ ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెప్పడంతో, 2013లో తల్లి ఆరుద్రమ్మ తన కిడ్నీని కుమారుడికి ఇచ్చి ఆయుష్షును పెంచారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం చక్కగా ఉంది.తల్లి లోలమ్మ ఎస్ఎన్.పుట్టుగ గ్రామానికి చెందిన ఈమె పేరు బొట్ట జానకమ్మ, రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం ఈమెది. ఈమె పెద్ద కొడుకు కృష్ణారావు ఆరేళ్ల క్రితం పంజాబ్ ఆర్మీలో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు రాజేష్ ఇండియన్ కోస్ట్ గార్డ్గా రెండున్నరేళ్ల కిందట పాండిచ్ఛేరిలో నేవీలో చేరారు. ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు కొడుకులు దేశ రక్షణ విధుల్లో చేరడం, ఎంతటి విపత్కర పరిస్థి తులు ఉన్నా దేశం తమకు ముందు అని వారు చెబుతుండటం తల్లిగా తనకు గర్వంగా ఉంటుందని జానకమ్మ చెబుతున్నారు. ‘దేశ సేవలో మేము ఉన్నాం...కానీ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన అసలు సైనికురాలు మా అమ్మే, ఆమె త్యాగం, ప్రేమ, ఆశీర్వాదం వల్లే ఈ యూనిఫాం గౌరవంగా ధరించగలుగుతున్నాం’ అంటూ ఉప్పొంగిపోతున్నారు ఈమె కుమారులు కృష్ణారావు, రాజేష్లు. తల్లి జానకమ్మతో కుమారులు కృష్ణారావు, రాజేష్ తల్లి సరోజిని -
వ్యక్తి ఆత్మహత్యాయత్నం
సారవకోట: మండల కేంద్రం సారవకోటకు చెందిన బొల్లు తిరుపతిరావు(56) శనివారం కలుపు నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో నరసన్నపేట ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలతో మనస్థాపం చెంది ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తిరుపతిరావు బుడితి విద్యుత్ సబ్స్టేషన్లో ఒప్పంద ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు సారవకోట పోలీసులు కేసు నమోదు చేశారు. -
●ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా..
ఇచ్ఛాపురం మండలం అరకభద్ర గ్రామానికి చెందిన ఈమె పేరు మంగి హేమావతి. ఈమెకు ఆనంద్, యోగానంద్, యోగేశ్వరరావు ముగ్గురు కొడుకులు. చిన్నతనంలో పుట్టిన రోజు చేస్తే తన ముగ్గురు పిల్లలకు మిలట్రీ డ్రస్సులు వేసి ఆనందించేవారు. మీరు పెద్దయితే మీ ముగ్గురూ దేశం కోసం సైనికులుగా మారి భరతమాతకు సేవ చేయాలంటూ ఉన్నత చదువులు చదివించారు. 2002లో పెద్ద కొడుకు ఆనంద్ మీరట్లో ఆర్మీలో జవాన్గా, రెండో కొడుకు యోగానంద్ 2003లో పంజాబ్లో ఆర్మీ జవాన్, మూడో కొడుకు యోగేశ్వరరావు 2004లో జమ్మూలో ఆర్మీ జవాన్గా ఎంపికయ్యారు. తన ముగ్గురు కొడుకుల్ని సైనికులుగా మార్చి తన కలలను నిజం చేసింది హేమావతి. దేశ సరిహద్దుల్లో రక్షణగా ఉంటున్న ముగ్గురు కుమారుల్ని చూసి తనకు ఎంతో గర్వంగా ఉందని ఆనందభాష్పాలతో చెబుతోంది హేమావతి. మంగి హేమావతి -
ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని శ్రీనివాసనగర్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో శుక్రవారం దొంగతనం జరిగింది. తాళం వేసిన ఇంటి తాళాలు పగలుగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఎల్.హేమశంకర్ అనే ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో కలిసి మందసలోని తన స్వగ్రామానికి వెళ్లారు. శనివారం ఉదయం వచ్చి చూసే సరికి ఇంటికి తాళాలు లేవు. లోపలికి వెళ్లి బీరువాను పరిశీలించగా అందులో రెండు తులాల బంగారు నగలు, రూ.70వేలు నగదు, కిలో వెండి ఆభరణాలు కనిపించలేదు. దీంతోకాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నర్సింహమూర్తి సిబ్బంది వచ్చి పరిశీలించారు. దొంగలు ఉపయోగించిన ఇనుపరాడ్లను పరిశీలించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అమలవుతున్న నిత్యాన్నదాన ప్రసాద ట్రస్ట్కు నగరానికి చెందిన కింతలి మురళీధర్, నిర్మల దంపతులు రూ.లక్ష విరా ళం అందజేశారు. ఈ మేరకు శనివారం ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్కు విరాళ నగదు దాతలు అందించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నదాన ప్రసాదాన్ని నిత్యం దాతల విరాళాల వడ్డీలతోనే నిర్వహిస్తున్నామని చెప్పారు. నిత్యం కనీసం వెయ్యి మందికి అన్నప్రసాదం అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. టీచర్లను ఇబ్బందిపెట్టవద్దు శ్రీకాకుళం: మండు వేసవిలో రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా ఉపాధ్యాయులకు పనులు అప్పగించడం సమంజసం కాదని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు చావలి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు శనివారం ఒక ప్రకట నలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు వెకేషన్ డిపార్ట్మెంట్కు చెందినవారని గుర్తు చేశారు. ప్రత్యేక తరగతులు, ఎన్రోల్మెంట్ డ్రైవ్, క్లస్టర్ హేబిటేషన్ ప్లాను పేర్లతో రాతపూర్వక ఆదేశాలు లేకుండా మౌఖికంగా, ఆన్లైన్ సమావేశాలు, వాట్సాప్ మెసేజ్లతో రకరకాల పనులు అప్పగించడం భావ్యం కాదన్నారు. మానసికంగా వేధింపులకు గురిచేయడం సమంజసం కాదన్నారు. ఇప్పటికే కొందరు ఉపాధ్యాయులు వ్యక్తిగత పనులకు వెళ్లారని, కొందకరు స్వగ్రామాలకు చేరుకున్నారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు నరసన్నపేట: గుండవల్లిపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏ.కుమార స్వామి, ఏ.సాంబమూర్తిలు గాయపడ్డారు. వీరు నడుపుతున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్ద, చిన్న దూగాం గ్రామాలకు చెందిన వీరు శ్రీకాకుళం నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను ఎన్హెచ్ అంబులెన్స్ సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
నియామక నోటిఫికేషన్ ఉప సంహరణ
ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాల యం కార్య నిర్వాహక మండలి తీర్మానం, ప్రభుత్వం జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 60 ఉత్తర్వుల ప్రకారం బీఆర్ఏయూలో ఖాళీగా ఉన్న 98 అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్న ట్లు రిజిస్ట్రార్ బి.అడ్డయ్య తెలిపారు. సదరు పోస్టుల భర్తీ కోసం 2023 సంవత్సరం 10 వ నెల 30వ తేదీన జారీ చేసిన అధ్యాపక నియామక నోటిఫికేషన్లు ఉపసంహరించుకున్నట్లు స్పష్టం చేశారు. అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు రుసుము తిరిగి పొందేందుకు సంబంధించిన సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ బీఆర్ఏయూ.ఈడియూ.ఇన్ ను సంప్రందించాలని సూచించారు. కొత్త నోటిఫికేషన్లు, తేదీలు, ఇతర వివరాలు విడిగా ప్రకటించనున్నామని తెలిపారు. ఎచ్చెర్ల: డాక్డర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్బీఎస్ అండ్ హెచ్ఎస్ఎస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న మజ్జి రామారావు విద్యార్థినితో అసభ్యంగా ఫోన్లో మాట్లాడిన అంశంపై విచారణ జరిపా రు. వీసీ కేఆర్ రజిని నియమించిన త్రిసభ్య క మిటీ శనివారం వర్సిటీలో విచారణ జరిపారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, విద్యార్థినితో వేర్వేరుగా కమిటీ సభ్యులు విచారణ చేపట్టి వివరణ తీసుకున్నారు. ఈ కమిటీ చైర్మన్గా నాగార్జున విశ్వవిద్యాలయం విశ్రాంత వీసీ వి. బాలహోహాన్దాస్, సభ్యులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రధానాచార్యులు కె.సీతామాణిక్యం, విశ్రాంత జిల్లా జడ్జి ధర్మారా వు ఉన్నారు. అయితే విద్యార్థిని వేధింపులపై సంబంధిత కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మ జ్జి రామారావును అధికారులు తక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేశారు. కమిటీ నివేదిక ఆధారంగా వర్సిటీ అధికారులు నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇచ్ఛాపురం: ప్రతి ఒక్కరూ ఇతర జీవులపై జా లి, దయా గుణం కలిగి ఉన్నప్పుడే అందరూ సంతోషంగా ఉండడం సాధ్యమవుతుందని జైనమత సన్యాసులు శ్వేతాంబర్ తెరపంతి ఆచార్య మహాశ్రమ అన్నారు. చైన్నె నుంచి ఒడిశాలోని కటక్ వరకు పాదయాత్ర చేపట్టిన జైనమత సన్యానులు, శిష్యులు శనివారం పట్టణం చేరుకున్నారు. వీరికి జ్ఞానభారతి పాఠశాల కార్యదర్శి జోహార్ఖాన్ స్వాగతం పలికి పాఠశా ల ఆవరణలో విడిది ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైనమత సన్యానులు మాట్లాడుతూ జైనమతంలో అత్యంత పవిత్రంగా భావించే చతుర్మాస దీక్షను నాలుగు నెలల కాలం పాటు కఠినంగా పాటించి దీక్షను పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. వజ్రపుకొత్తూరు రూరల్: వేసవి సెలవు ల్లో ఉపాధ్యాయులపై పని ఒత్తిడి పెట్టడం సరికాదని ఏపీటీఎఫ్ (1938) జిల్లా శాఖ అధ్యక్షుడు మామిడి భుజింగరావు అన్నారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలల అభివృద్ధి ప్రణాళిక, ఆవాస ప్రాంత ప్రణాళికలు అత్యవసరంగా తయారు చేసి సమర్పించాలని జిల్లా విద్యాశా ఖాధికారులు ఆదేశాలు ఇవ్వడం సబబు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వేసవి సెలవులు అని ఆలోచించకుండా ఒకటి రెండు రోజుల్లో ఆయా ప్రణాళికలు రూపొందించి అందించాల న్న అధికారుల తీరు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించేదిగా ఉందన్నారు. స్వల్పకాలంలో ప్రణాళికలు రూపొందించడం సాధ్యం కాదని, పాఠశాల కమిటీలతో కూలంకషంగా చర్చలు జరిపి ఈ ప్రణాళికలను రూపొందించాల్సి ఉన్నందున వేసవి సెలవులు ముగిసి పాఠశాల లు తెరిచిన తర్వాత ఈ ప్రణాళికలు సమర్పించేలా అధికారులు ఆదేశాలను సవరించాలని ఆయన కోరారు. హిరమండలం: ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలుకు చెందిన గౌతమి, రోజారాణి, హనీష్లు హిరమండలంలో ఓ పెళ్లికి హాజరయ్యారు. తిరిగి వెళుతుండ గా ఎల్ఎన్పేట మండలం రావిచంద్రి సమీపంలో వెనుక బైక్పై వస్తున్న రాఘవ ఢీకొట్టాడు. ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని 108లో ఆ మదాలవలస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నందిగాం: లట్టిగాం సమీపంలో జాతీయ రఽహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందిగాం మండలం కాపుతెంబూరుకు చెందిన కోమటూరు ప్రసాదరావు(44) దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రసాదరావు భార్యాపిల్లలతో కలిసి లట్టిగాంలో నివాసముంటూ స్థానిక ప్రైవేటు పాఠశాల బస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం పలాస వెళ్లేందుకు జాతీయ రహదారిపై బస్సు కోసం వేచి ఉండగా.. లఖిదాసుపురంకు చెందిన తెలిసిన వ్యక్తి తన బొలెరా వాహనం ఆపాడు. ఆ వాహనం వద్దకు వెళ్తుండగా టెక్కలి నుంచి పలాస వైపు వెళ్తున్న వ్యాను ప్రసాదరావును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రసాదరావు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమినించిన స్థానికులు వెంటనే టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రసాదరావుకు భార్య శాంతికుమారి, కుమారుడు నిరంజన్, కుమార్తె కావ్యశ్రీ ఉన్నారు. శాంతికుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగాం ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నీరు పంపినా వేధింపులేనా..?
టెక్కలి: టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులు తీవ్రమైన నీటి ఇక్కట్లు పడుతుంటే.. అధికార పార్టీ నాయకులు మాత్రం రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ నీటి ఇబ్బందులు తెలుసుకుని వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరా డ తిలక్ ఆస్పత్రికి వెళ్లి పరిశీలించి నీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టే వరకు తన సొంత ఖర్చులతో ఆస్పత్రికి ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తామని ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి తీసుకున్నా రు. ఈ క్రమంలో శనివారం మంచినీటి ట్యాంకర్ను ఆస్పత్రికి తరలించారు. అయితే మంచినీటి ట్యాంకర్ ఆస్పత్రికి చేరుకోగానే ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. ఆస్పత్రి సిబ్బంది నీటి ట్యాంకర్ను తీసుకోకుండా లేనిపోని కారణాలతో ట్యాంకర్ను నిలిపివేశారు. అక్కడితో ఆగకుండా పోలీసు లు మరో అడుగు ముందుకేసి ట్యాంకర్ డ్రైవర్తో పాటు కొంత మంది ఆస్పత్రి దిగువ స్థాయి సిబ్బందిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. మానవతా దృక్పథంతో ఆస్పత్రికి మంచినీటిని అందజేస్తే, రోగులు పడుతున్న అవస్థలను పక్కన పెట్టి ట్యాంకర్ను తీసుకోకుండా రాజకీయ కోణంలో ముప్పు తిప్పలు పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు, నీటి ఇబ్బందులపై తరచూ ఆస్పత్రికి వచ్చే వారు అవస్థలు పడుతున్నప్పటికీ, వాటిపై మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించకపోగా, మానవీయ కోణంలో రోగుల కోసం తాము పంపించిన మంచినీటి ట్యాంకర్ను తీసుకోకుండా రాజకీయం చేయ డం అత్యంత పాశవికమని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు నియంతగా ప్రవర్తిస్తున్నారనే విషయానికి ఇది ఒక పెద్ద నిదర్శనమ ని తిలక్ గుర్తు చేశారు. ఆస్పత్రిలో రోగులు నీటి ఇబ్బందులు పడుతున్నారనే విషయమై ఆస్పత్రి సూపరింటెండెంట్ అనుమతి మేర కు నీటి ట్యాంకర్ను పంపించామన్నారు. దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ రోగులకు మరింత ఇబ్బందులకు గురి చేసే విధంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రవర్తించారని దుయ్యబట్టారు. -
‘బైక్ కావాలి’ అంటూ భార్యను వేధించిన ఇంజినీర్ భర్త!
శ్రీకాకుళం క్రైమ్/గార : వరకట్న వేధింపులకు ఓ వివాహిత బలైపోయింది. ఉరేసుకుని చనిపోయిందని భర్త చెబుతుండగా.. అల్లుడే తమ కుమార్తెను చంపేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. వీరికి కుమారుడు గౌతమ్, డిగ్రీ బీఎస్సీ చదివిన కుమార్తె తేజశ్రీ(22) ఉన్నారు. తేజశ్రీకి శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెంకు చెందిన రుప్ప మల్లేషు కుమారుడు సోమేష్తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. కట్నం కింద రూ. 20 లక్షల నగదు, 20 తులాల బంగారం చెల్లించారు. మొదటి రోజు నుంచే వేధింపులు.. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్గా ఉన్న సోమేష్ నావల్ డాక్యార్డ్లో ప్రాజెక్టు డిజైనర్గా పనిచేస్తున్నాడు. విశాఖ రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తేవడంతో తేజశ్రీ భర్తను నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులకు తేజశ్రీ విషయం చెప్పడంతో నాలుగైదు రోజుల్లోనే బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్లో సగం మొత్తం రూ. 1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు సైతం ఇచ్చారు. గొడవవుతుందని.. ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీల మద్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని, వెంటనే విశాఖ బయల్దేరి వెళ్లామని పేర్కొన్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉందని, మెడ, కాళ్లపై వాతలున్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండటంతో ఆమెను చంపేసి వుంటారని తాము భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై విశాఖ పట్నం త్రీటౌన్లో కేసు పెట్టామని, సోమేష్ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు. -
ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు
మందస: స్థానిక ఎంపీడీఓ కార్యలయంలో శుక్రవారం గిరిజనుల సమస్యలపై పీజీఆర్ఎస్ కు 23 వినతులు అందా యి. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ఆర్డీఓ ఎర్.అప్పలరాజు, తహసీల్దార్ మిస్క శ్రీకాంత్ పాల్గొన్నారు. కుసుమాల గ్రామంలో తాగునీటి వాటర్ ట్యాంకు మంజూరు, రోడ్డు పనులు వేగవంతం చేయాలని కోరారు. నువాగడ గ్రామానికి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, పట్టులోగాం గ్రామంలో రోడ్డును మరమ్మతు చేయాలని, సీసీ రోడ్డును మంజూరు చేయాలని కోరారు. కుడుమసాయి గ్రామానికి పాఠశాల మంజూరు చేయాలని, ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీ రోడ్డు మంజూరు చేయాలని మరికొందరు కోరారు. సవర మధ్య గ్రామానికి వ్యవసాయ బావులకు త్రీ ఫేస్ విద్యుత్ను అందించాలని, ఒడిశా అధికారుల నుంచి ఎదురవుతున్న వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ‘వేధింపులు ఆపండి’ శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపోలో ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని, ఈ వేధింపులు తక్షణమే ఆపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ శ్రీకాకుళం రెండో డిపో అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్ బాబు, కె.బాబూరావులు అన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం ఉద్యోగులంతా ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఆర్టీసీలో మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఉద్యోగులపై పని భారం పెంచుతోందన్నారు. డబుల్ డ్యూటీలు చెయ్యమని ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, దీని వల్ల సిబ్బంది అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు దీనిపై స్పందించి సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ శ్రీకాకుళం రెండవ డిపో ఉద్యోగులు ఆనంద్, వై.దుర్గారావు, ఎస్.జోగారావు, ఎస్ఎస్ రావు, బి.సుభద్ర పాల్గొన్నారు. టెన్త్ టాపర్లకు నేడు పురస్కారాల ప్రదానం శ్రీకాకుళం : వసుదైక కుటుంబం యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రెడిట్ బి సంస్థ సౌజన్యంతో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి పది మంది ప్రభు త్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేస్తున్నట్లు వి.కె.ఫ్యామిలీ సభ్యులు, జిల్లా సమన్వయకర్త పి.హరిప్రసన్న, లాభాల గుణశేఖర్, జి.సాయికుమార్, పైల సత్యవతి, రావాడ పాపారావు, పైడి సునీత తదితరులు ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ రో డ్డులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెమినార్ హాల్లో జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేస్తామని పేర్కొన్నారు. సీరపు దేవీ ప్రియ –594(జెడ్పీ ఉన్నత పాఠశాల, పైడి భీమవరం), నౌపడ చిద్విలాస్–593(మున్సిపల్ హైస్కూల్, మెట్టక్కివలస), ఎన్.రమ్యశ్రీ –593(ఏపీ మోడల్ స్కూల్, కొండములిగాం), బి.కాత్యాయ వరప్రసన్న–591 (గవర్నమెంట్ స్కూల్ – కవిటి), కె.దీపిక–591(ఏపీ మోడల్ స్కూల్, తామాడ), పూజారి కీర్తి పండా –591(జెడ్పీ హైస్కూల్, కాశీబుగ్గ), బి.షర్మిల–591(ఎం.జె.పి, పలాస), శివ హరీష్ అంజంగి–591(ఎం.జె.పి–సంతబొమ్మాళి), పి.సత్య ఇందు–591(మున్సిపల్ హైస్కూల్, అరసవల్లి) బగాతి మౌనిక 591(జెడ్పీ హైస్కూల్, లింగాలవలస)లకు పురస్కారాలు అందజేస్తున్నట్లు వెల్లడించారు. టాప్ 10 విద్యార్థులతో పాటు, స్కూల్ హెడ్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్, తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. -
రెండేళ్లుగా గ్రీవెన్స్కు..
● భూమి కోసం రిటైర్డ్ ఉద్యోగి పోరాటం ● దక్కని న్యాయం శ్రీకాకుళం పాతబస్టాండ్: రెవెన్యూ కార్యాలయంలో పని జరిపించుకోవడం సామాన్యులకు రానురాను అసాధ్యమైపోతోంది. సామాన్యులకే కాదు రిటైర్డ్ గెజిటెడ్ అధికారులకు సైతం ఇక్కడ నిరీక్షణ తప్పడం లేదు. మట్ట మల్లేశ్వరరావు శ్రీకాకుళం నివాసి, రిటైర్డు గెజిటెడ్ అధికారి. ఆయన దివ్యాంగుడు కూడా. ఆయనకు జలుమూరు మండలంలోని జలుమూరులో సర్వే నెంబర్ 87–15 లో 20 సెంట్ల భూమి ఉండేది. కొన్నేళ్ల కిందట ఏడు సెంట్లు భూమిని విక్రయించారు. మిగిలిన భూమిని రికార్డుల్లో సెంటు సెంట్లు తక్కువగా చూపించారు. దీనిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్ర యించగా రోడ్డులో కొంత కలిసిందని అధికారులు చెప్పారు. రీ సర్వేలో రెండు సెంట్లు తేడా రావడంతో ఆయన ఫిర్యాదు చేయగా.. రో డ్డులో కలిసిపోయిందని చెప్పారు. ఆధారాలు కావాలని అడిగితే ఎవరూ స్పందించడం లేదు. దీంతో ఆయన రెండేళ్లుగా ఈ సమస్య పరిష్కరించాలని గ్రీవెన్స్సెల్కు వెళ్తూనే ఉన్నారు. రెవెన్యూ సదస్సులు, గ్రామ సభల్లోనూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. కలెక్టర్ను నేరుగా కలిస్తే.. ఆయన జలుమూరు తహసీల్దార్ను సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. కానీ అవి కూడా బుట్టదాఖలయ్యాయి. ఇక్కడ ఫిర్యాదు దారు ఒకప్పు డు గెజిటెడ్ ఆఫీసర్. అందులోనూ దివ్యాంగుడు. ఆయన సమస్య పరిష్కారం కావడానికే ఇన్నేళ్లు పడితే ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు. దీనిపై మల్లేశ్వరరావు మాట్లాడుతూ తన భూమిని తన పేరిట ఇవ్వడానికి ఇంత తాత్సారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. పలు దుకాణాల్లో చోరీ టెక్కలి రూరల్: స్థానిక అంబేడ్కర్ జంక్షన్ వద్ద ఉన్న పలు దుకాణాల్లో చోరీ జరిగినట్లు షాపు యజమానులు శుక్రవారం గుర్తించారు. అరటిగెలల షాపు, కూరగాయల షాపు, గుడ్లు షాపులతో పాటు పూజ సామగ్రి షాపుల్లో చోరీలు జరిగినట్లు గుర్తించారు. మొత్తం నాలుగు షాపులకు సంబంధించి సుమారు రూ.40వేలు వరకు నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. టెక్కలి పోలీసులకు సమాచారం అందించారు. -
సొమ్ము దోచేశాడు
గ్యాస్ ఓటీపీ అడిగాడు.. ● హిరమండలం మండలంలో వెలుగుచూసిన వైనం ● ఆన్లైన్లో వివరాలు చెబితే అంతే.. ● హెచ్చరిస్తున్న పోలీసులు హిరమండలం: హిరమండలం మండంలోని పిండ్రువాడ, రెల్లివలసలో గుర్తు తెలియ ని యువకుడు మోసాలకు గురిచేశా డు. గ్యాస్ పేరుతో ఫోన్లకు నకిలీ మెసేజ్లు పెట్టాడు. గ్యాస్ వచ్చిందని నమ్మబలికి ఒక్కొక్కరి దగ్గర రూ.1000 వసూలు చేసి ఉడాయించాడు. అయితే ఆ రెండు గ్రామాల్లోనే కాదు. పరిసర ప్రాంతాల్లో ఈ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు గ్యాస్ పేరుతో ఇలా మోసాలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల గ్యాస్ కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో విధిగా 45 రోజుల తరువాత కొత్త గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. అటు ఫోన్లకు వచ్చే ఓటీపీ చెబితే కానీ గ్యాస్ అందించడం లేదు. ఈ నేపథ్యంలో గ్యాస్ ఓటీపీ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. దీనిపై పోలీస్ శాఖ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. మరోవైపు జిల్లాలో జనగణన కూడా ప్రారంభమైంది. దీంతో ఎవరు ఎందుకు వస్తున్నారో? ఏ వివరాలు సేకరిస్తున్నారో తెలియని పరిస్థితి. అసలు జనగణన కోసం వచ్చేవారు ఏ వివరాలు తీసుకుంటారు? ప్రజలు ఏ వివరాలు ఇవ్వకూడదు? అనేదానిపై అధికారులు స్పష్టత ఇవ్వడంతో పాటు అవగాహన పెంచడం చాలా ముఖ్యం. ఆన్లైన్లోనూ వల గ్యాస్ పేరుతో ఆన్లైన్లో కూడా మోసాలు జరుగుతున్నాయి. కొరతను ఆసరాగా చేసుకొని నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. గ్యాస్ వినియోగదారుల ఫోన్లకు మెసేజ్లు పంపుతున్నారు. రెండు రోజుల్లో గ్యాస్ సరఫరా అంటూ వల పన్నుతున్నారు. వారు పంపిన లింక్లను క్లిక్ చేసిన మరుక్షణం వినియోగదారుల ఫోన్లు మోసగా ళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. వినియోగదారుడు తెలుసుకునేలోగా మోసం జరిగిపోతోంది. వారి వలకు చిక్కకుండా ఉండేందుకు పోలీస్ శాఖ, గ్యాస్ డీలర్లు వినియోగదారులకు కీలక సూచనలు చేస్తున్నారు. అలాంటి వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. గ్యాస్ వాహనాలు వచ్చి డెలివరీ బాయ్స్ సంప్రదించేవరకూ ఎవరూ స్పందించవద్దని కోరుతున్నారు. గ్యాస్ సరఫరాకు సంబంధించి ఆన్లైన్లో ఓటీపీలు అడగరన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. కేవలం గ్యాస్ వాహనంతో డెలివరీ బా య్స్ వచ్చి వివరాలు అడిగితేనే చెప్పాలని సూచిస్తున్నారు. గ్యాస్ పేరుతో అపరిచిత వ్యక్తులు వచ్చి ఓటీపీలు అడిగితే చెప్పొద్దు. గ్యాస్ వాహ నం రాకుండా ఇంటికి వచ్చి అడిగేవారు మోసం చేసేవారు అన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. అదే సమయంలో ఆన్లైన్లో సైతం ఎలాంటి వివరాలు చెప్పకూడదు. చెబితే సైబర్ నేరగాళ్ల మాయలో పడినట్టే. అందుకే అప్రమత్తంగా ఉండాలి. – వై.మధుసూదనరావు, ఎస్ఐ, హిరమండలం -
ప్రభుత్వ ఆదాయానికి గండి
● వృథాగా డ్రైవర్ల సంఘం భవనం ● సచివాలయానికి అప్పగించాలని పూర్వపు అధ్యక్షుల డిమాండ్ శ్రీకాకుళం పీఎన్ కాలనీ: జిల్లా కేంద్రంలో ఉన్న డ్రైవర్ల సంఘం కార్యాలయ భవనం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. ఈ భవనం ద్వా రా వస్తున్న ఆదాయం ఎవరికి వెళ్తోంది, ఎక్కడ ఖర్చవుతోంది అన్నది తెలియకుండా ఉందని డ్రైవ ర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాన్ని అనీల్చంద్ర పునేఠ కలెక్టర్గా ఉన్న సమయంలో డ్రైవర్ల కు అప్పగించారు. రౌతు సింహాచలం ఈ సంఘాని కి అధ్యక్షులుగా ఉన్న సమయంలో 2014లో రూ.14 లక్షలతో భవనానికి మరమ్మతులు నిర్వహించి పక్కా షాపులు నిర్మించారు. అనంతరం అద్దెల వసూలు మొదలుపెట్టారు. నెలకు సుమారు రూ.50వేలకు పైగా అద్దెలు వస్తున్నాయి. ఇన్నేళ్లలో దాదాపు లక్షల్లో అద్దె రూపంలో వచ్చిఉండాలని, కానీ ఆ డబ్బుకు లెక్కా పత్రం లేకుండా పోయిందని సంఘానికి చెందిన వారు ఆరోపిస్తు న్నారు. ఇప్పటికే డ్రైవర్లు కోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ఓ రూమ్ ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వాహనాల డ్రైవర్లు సుమారు 320 మంది ఉండేవారు. వారంతా పదవీ విరమణ చేయడంతో కేవలం నలుగురు మాత్రమే ఉన్నారు. గతంలో వాచ్మెన్లను పెట్టి అన్ని రకాల క్లీనింగ్లు వంటివి చేసేవారు. కలెక్టరేట్లో డ్రైవర్గా ఉన్న ఓ వ్యక్తి ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతానికి ఆయనే పెత్తనమంతా చెలాయిస్తున్నట్లు ఆ సంఘ నాయకులే చెబుతున్నారు. భవనానికి వచ్చిన రాబ డి అంతా సొంత ఖర్చులకు వాడుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. తాను కలెక్టరేట్ డ్రైవర్నని తనను ఎవరూ ఏమీ చేయలేరని డాంబికాలు పలుకుతున్నట్లు సమాచారం. ఓ ఇద్దరు వ్యక్తులే వచ్చిన కాడికి తినేస్తున్నట్లు ఆరోపణలు వినిస్తున్నాయి. అద్దెలు కలెక్షన్ చేస్తున్నారే తప్ప ఎలాంటి లెక్కలు చూపించడం లేదని, సంఘ భవనాన్ని అభివృద్ధి చేయడం లేదని విమర్శిస్తున్నారు. ఈ ఆదాయాన్ని ప్రభుత్వానికి మళ్లించగలిగితే బాగుంటుందని పూర్వపు అధ్యక్షులు, సంఘ నాయకులు కోరుతున్నారు. కనీసం సచివాలయాలకైనా ఇస్తే ఆ డబ్బులైనా మిగులుతాయని అంటున్నారు. -
నిదురమ్మ ఎటు బోతివే..
స్మార్ట్ స్క్రీన్ల వెలుగులో ‘మెలటోనిన్’ హార్మోను రాను రానంటోంది. మొబైల్ ఫోన్ల మాయలో పడి ‘సెరొటోనిన్’ రావడమే మానేసింది. ఈ రెండూ లేకుంటే మనిషికి నిద్ర లేదు.. జీవికి ప్రశాంతత లేదు. రాత్రంతా కొరివి దెయ్యాల్లా కళ్లు ఎర్రగా మండేంత వరకు సెల్ఫోన్ చూడడం, నిశాచరుల్లా తిరగడం, ఇష్టానుసారం తినడంతో ఈ హార్మోన్ల అసమతుల్యత తప్పడం లేదు. ఒకప్పుడు టీవీ చూస్తూ ఆవులింతలు తీయడం, మాటలు వింటూ కునికి పాట్లు పడడం అన్నది ఈ తరానికి పూర్తిగా దూరమైపోయింది. అర్ధరాత్రి దాటినా చాలా మందిని నిద్ర కరుణించడం లేదు. దీని ఫలిత మే సవాలక్ష ఆరోగ్య సమస్యలు. శ్రీకాకుళం కల్చరల్: ఉరుకులు, పరుగులు, హడావుడి.. బతుకుంతా ఇలాగే మారిపోయింది. ఈ గజిబిజి జీవనంలో కంటి నిండా నిద్రపోయే అదృష్టానికి చాలా మంది నోచుకోవడం లేదు. ఫలితంగా ఎంతో మంది ఒత్తిడికి గురై వారి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, హార్మోన్ల సమతుల్యత లోపించడం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కానరాని మానసిక ఉల్లాసం ప్రస్తుతం కుటుంబాల్లో మానసిక ఉల్లాసం కనిపించడం లేదు. నేటి పరిస్థితులలో జీవన సమస్యలు ఎదుర్కోవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. విధులు ముగించుకొని ఇంటికి వచ్చాక, ఎవరి ఫోన్తో వారు కాలక్షేపం చేస్తున్నారు. కనీసం పిల్లల గురించైనా పట్టించుకోవడం లేదు. కుటుంబం అంతా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు లేవు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం అంతకంటే లేదు. దీంతో మానసిక ఉల్లాసం కొరవడుతోందని నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం పిల్లలతో కలిసి కాసేపు పార్కులకు వెళ్లి గడపడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. నిద్ర పట్టకపోవడం. ఆకలి లేకపోవడం, ఎక్కువ తినాలనిపించడం. హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళలలో పీరియడ్స్ ఇబ్బందులు. ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లు సోకడం. నిద్రకు దూరమవుతున్న యువత చుట్టు ముడుతున్న ఆరోగ్య సమస్యలు గుండె పోట్లు, బ్రెయిన్ స్ట్రోక్లకు ఇదీ ఓ కారణం మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత రోజూ ఏడు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం. ఒకే సమయానికి రోజూ నిద్రించడం అలవాటు చేసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేషన్పై దృష్టి సారించాలి. సెల్ఫోన్ చూడడం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. నిద్ర తగ్గితే ప్రాణ హాని కలుగుతుంది. శారీరక, మానసిక ఒత్తిడులు నిద్రలేమి వల్లనే కలుగుతాయి. వృత్తిపరమైన స్ట్రెస్, పర్సనల్ లైఫ్ సమస్య, ఎగ్జైట్మెంట్ వల్ల మానసిక వ్యాధులు వస్తాయి. పిల్లలైనా పెద్దవారైనా ప్రతి వారు శారీరక వ్యాయామం, ఆటపాటల వల్ల మంచి నిద్ర పట్టి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. – జి.రోష్మల్లికార్జున్, సీనియర్ మానసిక వైద్య నిపుణులు, శ్రీకాకుళం -
కన్నీటి చార ఆరక ముందే..
● వారం వ్యవధిలో తండ్రీ కొడుకులు మృతి నరసన్నపేట: జమ్ము గ్రామంలో తీవ్ర విషాదం అలముకుంది. వారం వ్యవధిలో తండ్రీకుమారులు కోల లక్ష్మణరావు, కోల శివప్రసాద్లు మృతి చెందారు. దీంతో కుటుంబం అంతా శోకసంద్రమైంది. వారం కిందట కోల లక్ష్మణరావు కుమారుడు శివప్రసాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శివప్రసాద్ ద్విచక్రవాహనం విజయనగరం వద్ద ప్రమాదానికి గురైంది. అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. ఇంటిని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పుట్టెడు దుఖంతో తండ్రి లక్ష్మణరావు కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం అనారోగ్యానికి గురైన లక్ష్మణరావు జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. కుమారుడు మృతి నుంచి కుటుంబ సభ్యులు తేరుకోక ముందే తండ్రి కూడా మరణించడంతో ఈ కుటుంబం దిక్కులేనిదైంది. శివప్రసాద్ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇద్దరు సోదరీమణులకు వివాహాలు చేశాడు. ఇప్పుడు తండ్రీ కుమారులు ఇద్దరూ వారం వ్యవదిలో మరణించడంతో కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కావ డం లేదు. కోల లక్ష్మణరావుకు భార్య సీతమ్మ అంత్యక్రియలు నిర్వహించారు. -
విపత్తుల నిర్వహణపై శిక్షణ
శ్రీకాకుళం కల్చరల్: ప్రపంచ రెడ్క్రాస్, తలసేమియా దినోత్సవం పురస్కరించుకొని నగరంలోని శాంతా కల్యాణ అనురాగం నిలయంలో శుక్రవారం వలంటీర్లకు, విద్యార్థులకు విపత్తుల నిర్వహణ, సామర్థ్యం పెంపుపై ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు మాట్లాడుతూ విపత్తుల నుంచి నష్టాన్ని తగ్గించుకోవటానికి శిక్షణ కార్యక్రమాలు ఎంత దోహదపడతాయన్నారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహన రావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో వలంటీర్లకు నైపుణ్యాలు కలిగించడం ద్వారా తక్షణమే స్పందించి ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చు అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి బి.మల్లేశ్వరరావు, కోశాధికారి కె.దుర్గా శ్రీనివాస్, పి.శ్రీకాంత్, ఎం.కళ్యాణ్ చక్రవర్తి, బి. చిన్మయి రావు తదితరులు పాల్గొన్నారు. -
క్లాసులు చెబుతాం రండి
శ్రీకాకుళం న్యూకాలనీ: సర్కారీ జూనియర్ కళాశాలల్లో చదువుతూ.. ఇంటర్మీడియెట్ ఫెయిలైన విద్యార్థులపై ఇంటర్ విద్య డైరెక్టరేట్ ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు, తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ కోసం ఈ నెల 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. పునర్విభజన శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రభుత్వ కాలేజీలు 38 ఉన్నాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి జనరల్, ఒకేషనల్ కలిపి మొత్తం 5814 మంది పరీక్షలు రాయగా.. వీరిలో 3439 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం నుంచి 5,188 మంది పరీక్షలకు హాజరుకాగా 3,588 ఉత్తీర్ణులయ్యారు. దీంతో ఫెయిలైన విద్యార్థులతోపాటు తాము సాధించిన మార్కులపై సంతృప్తి చెందని విద్యార్థులు ఇంప్రూవ్మెంట్(మార్కులు పెంచుకునేందుకు) కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు ఈ ఏడాది నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సైతం వారి మార్కులను పెంచుకునేందుకు పరీక్షలకు హాజరయ్యేందుకు ఇంటర్బోర్డు అవకాశం కల్పించింది. ఈ విధానం అమలు చేయడం ఇదే మొదటిసారి. ఇంటర్లో సాధించిన మార్కులు ఐఐటీ, ఎన్ఎస్ఐటీల్లో సీటు సాధించేందుకు కీలకం కానున్నాయి. ఇంటర్లో రెండేళ్లు కలిపి ఎస్సీ, ఎస్టీలకు 65 శాతం, ఓసీ, బీసీ, ఓబీసీ తదితరులకు 75 శాతం మార్కులు సాధిస్తే ఈ వెయిటేజీ ఉత్తమ కోర్సుల్లో చేరేందుకు ఉపయోగపడుతుంది. కొందరు విద్యార్థులు జేఈఈలో ఉత్తీర్ణులైనా ఇంటర్లో వచ్చిన మార్కులు తగ్గడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఈఏపీసెట్లో 25 శాతం వెయిటేజీ పొందవచ్చు. తాజా ఫలితాల్లో మార్కుల శాతం తగ్గిన విద్యార్థులు లోటు పరిస్థితి అధిగమించేందుకు సప్లిమెంటరీపై దృష్టి పెట్టారు. రెమీడియల్ క్లాసులు.. ఫెయిలైన విద్యార్థులతోపాటు ఇంప్రూవ్మెట్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సర్కారీ కాలేజీల్లో రెమీడియల్ క్లాసులు (పునశ్చరణ తరగ తులు) నిర్వహిస్తున్నారు. సబ్జెక్టుల్లో సందేహాలు, ప్రశ్నలు, జవాబులతోపాటు మోడల్ పేపర్లలో ప్రశ్నలకు సాధన చేయిస్తున్నారు. ఫెయిలైనవారు ఉత్తీర్ణత సాధించడంతోపాటు మార్కులు స్కోరింగ్ చేసేలా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సమన్వయంతో పనిచేసి విద్యార్ధులను తీర్చిదిద్దాలని జిల్లా ఇంటర్ విద్య అధికారులు సూచిస్తున్నారు. మెరుగైన ఉత్తీర్ణత సాధించేలా.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు మెరుగైన ఉత్తీర్ణతను సాధించేలా రెమీడియల్ క్లాసులను నిర్వహిస్తున్నాం. ఒకవైపు రెమీడియల్ క్లాసులు నిర్వహిస్తూనే మరోపక్క పరీక్షల నిర్వహణపై ఏర్పాట్లు చేస్తున్నాం. సెకెండియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది సప్లిమెంటరీ విద్యార్థులు గణనీయంగా పెరిగారు. – ఎం.కృష్ణవేణి, ఇంటర్విద్య డీవీఈఓ, శ్రీకాకుళం జిల్లా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు పునఃశ్చరణ తరగతుల నిర్వహణ బెటర్మెంట్కు దరఖాస్తు చేసిన వారు సైతం హాజరు కావచ్చు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పడిపోయిన ఉత్తీర్ణత శాతం మెరుగుకు చర్యలు పర్యవేక్షిస్తున్న ఇంటర్ విద్య జిల్లా అధికారులు -
25, 26న ఎస్బీఐ సమ్మె
శ్రీకాకుళం అర్బన్: ఈ నెల 25వ తేదీ, 26న రెండు రోజులపాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు నిర్ణయించిన ట్లు రీజినల్ సెక్రటరీ కేసీహెచ్ వెంకటరమణ తెలిపారు. శ్రీకాకుళంలోని జీటీరోడ్లోగల ఎస్బీఐ మెయిన్ బ్రాంచి ఎస్బీఐ ఉద్యోగులంతా శుక్రవారం మౌనదీక్ష వహించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రెండు రోజులు పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమ్మె చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. సమ్మెకు దేశంలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్స్ వారి మద్దతును తెలిపారని పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీ బూర్జ: పాలవలస సచివాలయం పరిధిలోని లక్కుపురం గ్రామంలో పంచాయతీ రాజ్ అసిస్టెంట్ కమిషనర్ బి.హర్ష స్వచ్ఛ రథం కార్యక్రమాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పర్యటనలో భాగంగా లక్కుపురంలో ఎంపీడీఓ ఆర్.తిరుపతిరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛరథం కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ రఽథం కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. హిరమండలం: పెద్ద సంకిలి సమీపంలోని అన్నదమ్ముల చెరువులో పడి ఒడిశాకు చెందిన పురోనభత్ర (24) అనే యువకుడు మృతిచెందాడు. వంశధార రిజర్వాయర్ వద్ద నీరు వచ్చే గెడ్డలో పడి ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుడి సోదరుడు త్రిలోచనభత్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశాలోని నవరంగపూర్కు చెందిన పురోనభత్ర, త్రిలోచనమిత్ర అన్నదమ్ములు. ఇందులో పురోనభత్ర పెద్దసంకిలి గ్రామానికి చెందిన పల్ల శ్రీనివాసరావు వద్ద బోర్లు తవ్వే కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొత్తూరు మండలం మెట్టూరు వద్ద నివసిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పనిలేకపోవడంతో తనతో పాటు పనిచేస్తు న్న సురుభత్ర, మహేష్భత్ర, అమిత్ బడాతో కలిసి పెద్ద సంకిలి సమీపంలోని అన్నదమ్ముల చెరువు వద్ద చేపల వేటకు వెళ్లారు. అయితే అప్పటికే పురోనభత్ర మద్యం మత్తులో ఉండడంతో మిగతా ముగ్గురు వదిలేసి చేపల వేటలో నిమగ్నమయ్యారు. అయితే చేపల వేట ముగిసే సమయానికి పురోనభత్ర కనిపించలేదు. మెట్టూరులో రూములోకి వెళ్లిపోయాడని భావించి మిగతా ముగ్గురు వెళ్లిపోయారు. కానీ పురోనభత్ర ఇంటికి చేరలేదు. శుక్రవారం ఉదయం సైతం చేరకపోయేసరికి సోదరుడికి సమాచా రం అందించారు. పురోనభత్ర తన వద్దకు చేరలేదని చెప్పిన సోదరుడు త్రిలోచనభత్ర మెట్టూరుకు చేరుకున్నాడు. అనుమానంతో చెరువు వద్ద వెతకగా పురోనభత్ర మృతదేహం కనిపించింది. మద్యం మత్తులో ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ఉండాడని సోదరుడు త్రిలోచనభత్ర పోలీసులకు ఫిర్యాదుచేశాడు. -
జీడి.. ఇంటికి చేరిందండి
● ఇబ్బడి ముబ్బడిగా విదేశీ పిక్కలు ● దేశీయ పిక్కలపై ఆసక్తి చూపని వ్యాపారులు పలాస: ఉద్దానం ప్రాంతంలో ప్రజల జీవనాధారమైన జీడి పంట రైతుల ఇళ్లకు చేరింది. వాటిని అమ్ముకోవడానికి ఆశగా రైతులు ఎదురు చూస్తున్నారు. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి తోటల్లో జీడి పిక్కలు కాపునకు వచ్చాయి. వాటిని తోటల్లో సేకరించి ఎండబెట్టి గోనె సంచుల్లో నింపి భద్రపరిచారు. ప్రస్తుతం జీడి పంటలు ఆఖరి దశకు చేరుకున్నాయి. పలాస నియోజకవవర్గంలోని పలా స మందస, వజ్రపుకొత్తూరు మండలాల్లో గల జీడి తోటల్లో పిక్కలు ఇళ్ల వద్దకు చేరుకున్నాయి. అయితే గ్రామాల్లోకి వ్యాపారులు ఇంకా రావడం లేదు. ఇప్పటికే విదేశీ పిక్కలను దిగుమతి చేసుకున్న పలాస వ్యాపారులు ప్రస్తుతం వాటిపైనే ఆధార పడి తమ పరిశ్రమలను నడిపించుకుంటున్నారు. దీంతో వారంతా ధీమాగా ఉన్నారు. ఏటా ఇదే తంతు జరుగుతోందని రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పలాస పప్పు అంటే ఉద్దానం జీడి పిక్కల వల్లనే వాటికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇప్పు డు ఉద్దానం పిక్కలను కొనుగోలు చేయడానికి వెనకా ముందు ఆలోచిస్తున్నారు. ఎలాగైనా ఎప్పు డో ఒకప్పుడు తమకే అమ్ముతారన్న ధీమా వారిలో నాటుకు పోయింది. అలాగే రైతులు కూడా చిరకాలంగా వస్తున్న ఆనవాయితీ ప్రకారం, వారితో ఉన్న అవినాభావ సంబంధాల మేరకు వారికే పిక్కలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇంకా పిక్కల ధరలు తేలలేదు. రైతు సంఘాల మాత్రం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. 80 కిలోల బస్తా పిక్కలను రూ.16వేలకు ప్రభుత్వం కొనుగోలు చేయాలన్న వారి డిమాండు ఏడాది ఎంత వరకు నెరువేరుతుందో వేచి చూడాలి. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఉద్దానం ప్రాంతంలోని జీడి పిక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతు ల నుంచి నేరుగా కొనుగోలు చేయాలి. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధర ప్రకటించాలి. కనీసం బస్తా పిక్కలకు రూ.16వేలు చెల్లించాలి. – తెప్పల అజయ్కుమార్, రైతు, మాకన్నపల్లి, పలాస మండలం వాతావరణం అనుకూలించలేదు ఈ ఏడాది జీడి రైతులకు వాతావరణం అనుకూలించలేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వమే రైతులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి. వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి. – కోనేరు రమేష్, రైతు కూలీ సంఘం నాయకుడు -
ఏపీఈసెట్ ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత
శ్రీకాకుళం న్యూకాలనీ: ఏపీఈసెట్–2026 ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఈ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లా విద్యార్థులు 90.97 శాతం ఉత్తీ ర్ణతను సాధించి మెరిశారు. పాలిటెక్నిక్ చదివి ఇంజినీరింగ్ కోర్సు ల్లో నేరుగా రెండే ఏడాది ప్రవేశా లు పొందేందుకుగాను రాష్ట్రప్రభుత్వ ఆదేశాల మేరకు జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్ పరీక్ష ఏప్రిల్ 23వ తేదీన రెండు సెషన్లగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెలువడ్డాయి. ఈసారీ బాలికలే టాప్.. ఎప్పటిలాగే సారి కూడా బాలికలే టాప్లేపే ఫలితాలు సాధించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 1389 మంది దరఖాస్తు చేసుకోగా.. పరీక్షకు 1340 మంది హాజరయ్యారు. వీరిలో 1219 మంది ఉత్తీర్ణత సాధించి అర్హత సాధించారు. ఇందులో 923 మంది బాలురుకుగాను 89.17 శాతం ఉత్తీర్ణతతో 823 మంది క్వాలిఫై అవ్వగా, 417 మంది బాలికలకుగాను 94.6 శాతం ఉత్తీర్ణతతో 396 మంది అర్హత పొందారు. వివిధ బ్రాంచీల్లో పలువురు విద్యార్థులు అదిరేటి ర్యాంకులు పొందారు. మెకానికల్ ఇంజినీరింగ్ స్ట్రీమ్లో పలాస మండల పరిధిలోని తాళ్లభద్ర గ్రామానికి చెందిన కుప్పిలి నిఖిల్కుమార్ స్టేట్లో 7వ ర్యాంకు సాధించాడు. లింగాలవలస విద్యార్థికి ఈసెట్లో 33 వ ర్యాంక్ జలుమూరు: లింగాలవలసకు చెందిన పంచిరెడ్డి పవన్ కల్యాణ్కు ఈసెట్లో 33వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 973. ఒకటి నుంచి ఐదు వరకూ చల్లవానిపేట విజ్ఞాన దుర్గ, ఆరు నుంచి పది వరకూ కరవంజ ఆదర్శ పాఠశాలలో చదివాడు. తల్లి దండ్రులు జయలక్ష్మి, ప్రకాశరావు. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసు సాధనే తన లక్ష్యమని పవన్కల్యాణ్ తెలిపాడు. -
ఆస్పత్రిలో నీటి పాట్లు సిగ్గుచేటు
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నీటి సమస్యను పరిశీలించిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ● తన వంతుగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తానని హామీ టెక్కలి: ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నీటి సదుపాయం కల్పించలేకపోవడం సిగ్గు చేటని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నీటి సరఫరా సక్రమంగా అందకపోవడంపై శుక్రవారం ‘సాక్షి’ లో వచ్చిన కథనం మేరకు ఆయన ఆస్పత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.సూర్యారావును కలిసి నీటి కొరత పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం తిలక్ మాట్లాడుతూ మంత్రి అచ్చెన్నాయుడు అసమర్థతకు ఇది నిదర్శనమన్నారు. బహిరంగ సభల్లో గొప్పలు చెప్పుకుంటూ అర్థం లేని ప్రసంగాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై లేని పోని కేసు లు, విచారణలు చేయించడమే మంత్రికి తెలుసు నని తిలక్ అన్నారు. టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నీటి కొరత తగ్గుముఖం పట్టే వరకు తన సొంత ఖర్చులతో ఆస్పత్రికి ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తానని తిలక్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఆ యనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, నాయకులు సత్తారు సత్యం, జడ్యాడ జయరాం, అక్కురాడ లోకనాథం, కిల్లి అజయ్కుమార్, ఆట్ల రాహుల్ తదితరులు ఉన్నారు. -
రవి అస్తమించని మైనింగ్ సామ్రాజ్యం
వీఆర్ గూడెం ఎర్ర కొండలో అక్రమ తవ్వకాలు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో కొండలు తరిగిపోతున్నాయి. అక్రమంగా కొండల్ని తవ్వేసి గ్రావెల్ దోపిడీ చేస్తున్నా రు. ప్రకృతి వనరులు విధ్వంసం చేసి, అడ్డంగా సంపాదిస్తున్నారు. కీలక నేత కనుసన్నల్లో పచ్చనేతలు సొమ్ము చేసుకుంటున్నారు. అక్కడక్కడ క్రషర్లకు ఉన్న అనుమతులు చూపించి, ఏకంగా క్వారీలు నడుపుతున్నారు. రైల్వే లైన్లు, లేఅవుట్లకు, అపార్ట్మెంట్, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్కు విక్రయించి అక్రమంగా రూ.కోట్లు సంపాదిస్తున్నారు. నిర్మానుష్యమైన కొండ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ మై నింగ్ సామ్రాజ్యంలో ఏ ఒక్కరూ అడుగు పెట్టలేక పోతున్నారు. అధికారులు సైతం అక్కడికెళ్లడానికి భయపడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలను నియంత్రించాలంటే చెక్ పోస్టు పెట్టాలని మండల స్థాయి అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దర్జాగా దోపిడీ.. పొందూరు మండలంలో అధిక సంఖ్యలో కొండలు ఉన్నాయి. నల్ల రాయి, ఎర్ర రాయి, ఎర్ర గ్రావెల్ అధికంగా దొరుకుతుంది. ఈ మండలంలో రాపాకలోని సర్వే నంబర్ 335లో, కృష్ణాపురంలోని సర్వే నంబర్ 198లో మాత్రమే నల్ల రాళ్లను కొట్టుకోవడానికి అనుమతి ఉంది. అలాగే, వీఆర్ గూడెంలో క్రషర్కు అనుమతి ఉంది. మిగతా చోట్ల ఎక్కడా అనుమతుల్లేవు. కానీ రాపాకలో అనుమతి ఉన్న ప్రాంతంలోనే కాకుండా పక్కనున్న ఏరియాలో అక్రమంగా తవ్వేస్తున్నారు. కృష్ణాపురంలో కూడా అదే జరుగుతోంది. వీఆర్ గూడెంలోని సర్వే నంబర్ 137లోని ఎర్రకొండనైతే ఏకంగా గుల్ల చేసేస్తున్నా రు. వీటితో పాటు మరికొన్ని గ్రామాల్లోని కొండల్లో కూడా అక్రమ క్వారీ జరుగుతోంది. రైల్వే లైన్ కో సం, అపార్ట్మెంట్లు, ఇళ్ల పునాదుల ఫిల్లింగ్ కోసం, లేఅవుట్లను చదును చేసేందుకు నల్లరాయి, ఎర్ర రాయి, గ్రావెల్ను విక్రయిస్తున్నారు. రోజూ వందలాది లారీలకు వక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అంతేకాకుండా సీసీ రోడ్లు వేసే ముందు గ్రావెల్తో కప్పుతారు. దాని కోసం కూడా పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. మొత్తానికి కీలక నేత అండతో రూ. కోట్లలో తమ్ముళ్లు ఆర్జిస్తున్నారు. కొండలను తవ్వి ఆక్రమణ మండలంలోని కొండలను తవ్వి, ఆ తర్వాత చదును చేసి ఆక్రమించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. వందలాది ఎకరాలు ఈ రకంగా అక్రమార్కుల గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. ఇప్పుడా భూ ములను చూపించి క్వారీలు, క్రషర్ల ఏర్పాటు కో సం అనుమతులకు యత్నిస్తున్నారు. ప్రస్తుతానికై తే ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. అనుమతులు రాకపోయినా తమ పని మాత్రం కానిచ్చేస్తున్నారు. వందలాది ఎకరాల్లో గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు. పొందూరు మండంలో ఎక్కడైతే కొండలు ఉన్నాయో అక్కడ పచ్చ గెద్దలు వాలిపోతున్నాయి. రూ. కోట్లలో సొమ్ము చేసుకుంటున్నాయి. చెక్ పోస్టుకు సిఫార్సు చేసినా.. పొందూరు మండలంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీని అడ్డుకోవాలంటే చెక్ పోస్టు శరణ్యమని ఇక్కడ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు గతంలో నివేదిక ఇచ్చారు. అక్రమ క్వారీలు, తవ్వకాలు, రవాణాను తాము నియంత్రించలేమని, పరిస్థితి చేయి దాటిపోయిందని, రహదారి మార్గంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తే కనీసం రవాణానైనా అడ్డుకుని తద్వారా అక్రమ తవ్వకాలు నిలువరించవచ్చని మండల అధికారులు తమ నివేదికలో వి వరించారు. కానీ ఏ రకమైన ఒత్తిళ్లు ఉన్నాయో తెలి యదు గానీ చెక్ పోస్టు ఏర్పాటు ఊసేలేదు. మండల అధికారులు ఇచ్చిన నివేదిక ముందుకెళ్లలేదు. చెప్పాలంటే తుంగలోకి తొక్కేసినట్టు స్పష్టమవుతోంది. విధ్వంసం జరుగుతున్నా.. అక్రమంగా నడుస్తున్న క్వారీల్లో ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దాదాపు ఎనిమి ది మంది వరకు మృత్యువాత పట్టారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అంతేకాకుండా అక్రమ క్వారీ ల సమాచారాన్ని బయటపెట్టాలని చూసిన కొందరు లారీల కింద సమాధి అయ్యారు. అంత దారుణాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇక, గ్రావెల్ రవాణా లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నాయి. క్వారీ తవ్వకాలతో గ్రామాలు కాలుష్యం బారిన ప డుతున్నాయి. ఇంత జరుగుతున్నా అడ్డుకునే నాథు డు లేకుండా పోయారు. దట్టమైన కొండలు కావడంతో అక్కడికి వెళ్తే మైనింగ్ మాఫియా చేతులో ఏమవుతామో అన్న భయం పట్టుకుంది. అధికారు లు సైతం అక్కడికి వెళ్లడానికి హడలెత్తిపోతున్నారు. అసలే నిర్మానుష్య ప్రదేశం, మరోవైపు కీలక నేత అండదండలు ఉండటంతో వెనక్కి తగ్గిపోతున్నారు. పొందూరు మండలంలో తరిగిపోతున్న కొండలు అడ్డగోలుగా తవ్వకాలు ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ తవ్విన ప్రాంతాన్ని చదును చేసి గుప్పెట్లోకి తెచ్చుకునే యత్నం -
11న జిల్లాస్థాయి స్విమ్మింగ్ ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్విమ్మింగ్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 11వ తేదీన నిర్వహించనున్నట్టు స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా గౌరవ అద్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎన్ఎస్వీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, ఉపాధ్యక్షుడు వై.సూర్యారావు, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.కాంతారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్ వేదికగా ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఎంపికల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇక్కడ రాణించి ఎంపికైన క్రీడాకారులను ఈనెల 24వ తేదీన కర్నూలులో జరిగే ఏపీ రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ చాంపియన్షిప్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన స్విమ్మింగ్ క్రీడాకారులు తమ పేర్లను ఈనెల 9వ తేదీలోగా డీఎస్ఏ కోచ్ మురళీ (సెల్: 9908831849)ని సంప్రదించాలని వారు కోరారు. ‘ఒడిశా అధికారుల నుంచి రక్షించండి’ మందస: మాణిక్యపట్నం గిరిజనులపై ఒడిశా అధికారులు, పోలీసుల దౌర్జన్యాలు ఆపాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు విన్నవించారు. జనగణనలో భాగంగా సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో ఉంటున్న గిరిజనులపై ఒడిశా అధికారులు దాడులు జరపడాన్ని ఖండిస్తూ.. రక్షించాలని తహసీల్దార్ మిస్క శ్రీకాంత్, ఎస్ఐ కె.కృష్ణప్రసాద్, ఎంపీడీఓ వై.వెంకటరమణలకు వినతి పత్రం అందజేశారు. సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం గ్రామంలో సుమారు 30 గిరిజన కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ సచివాలయం సిబ్బంది జనగణన చేసి ఇంటి గోడలపై నంబర్లు వేశారు. అనంతరం ఒడిశా అధికారులు, పోలీసులు వచ్చి ఆ నంబర్లను చెరిపివేశారు. ఇళ్లలో ఉన్న వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. తాము చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నామని గిరిజనులు ఆవేద న వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకోని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం కార్యదర్శి సవర గురునాథ్, రైతుల సంఘం కార్యదర్శి పి.దేవేంద్ర, మట్ట ధర్మారావు, ఎన్.భాస్కరరావు, ఎస్.విప్రో, ఎస్.మధుసూదన్, ఎస్.సుదన్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయ కిటికీ అద్దాలు ధ్వంసం సారవకోట: మండలంలోని కిడిమి సచివాలయ కిటికీ అద్దాలను నాలుగు రోజుల కిందట ఆకతాయిలు పగలగొట్టారు. సచివాలయ సిబ్బంది తమ విధులు ముగించుకుని ఇంటికెళ్లిన తర్వాత రాళ్లతో కొట్టడంతో అద్దాలు పగిలి పోయాయని వీఆర్వో రాము తెలిపారు. అయితే దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఆమదాలవలస: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తొగరాం వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రి న్సిపల్ సీపాన నీలవేణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్థులు వ్యవసాయ పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 21వ తేదీ వరకు గడువు ఉందని తెలిపారు. ఈ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని వివరించారు. దరఖాస్తులు ఆచార్య ఎనన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్ www.angrau.ac.i n ద్వారా సమర్పించుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 7702394824 నంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో తెలిపారు. -
ఎందుకింత కాల్యాపన..?
108.. మూడంటే మూడే అంకెలు. లక్షలాది ప్రాణాలను కాపాడాయి. రోడ్డుపై నెత్తురోడుతూ ఆఖరి క్షణాల్లో ఉన్న వారికి సైతం పునర్జన్మను అందించాయి. నొప్పులతో విలవిలలాడుతున్న గర్భిణులను మోసుకెళ్లి పసికందులకు కొత్త జన్మనిచ్చాయి. ఎక్కడ ఉన్నా.. ఏ క్షణాన కాల్ చేసినా కుయ్కుయ్.. మంటూ శబ్దం చేస్తూ బతుకులను వెలిగించాయి. అలాంటి వాహనాలు ఇప్పుడు నిర్వీర్యమవుతున్నాయి. కాల్ చే స్తే కనెక్ట్ కాని దుస్థితి, కనెక్ట్ అయినా వేరే రాష్ట్రానికి వెళ్లిపోతున్న పరిస్థితులు దాపురించాయి. ఈ ‘కాల్’యాపన వెనుక కారణాలు సర్కారే చెప్పాలి. అరసవల్లి: దశాబ్దాలుగా ఆపద్బాంధవి అవతారమెత్తి కోట్లాది మందిని ఆదుకున్న 108 వాహనం ఇప్పుడు ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యం బాధితుల ప్రాణాలకు విషంగా మారుతోంది. ఒకప్పుడు ఎప్పు డో గానీ ఇలాంటి సంఘటనలు జరిగేవి కావు. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మాటిమాటికీ ఈ వాహనాల విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమయానికి ఎమర్జన్సీ సేవలు అందక గత ఏడాది జిల్లాలో రెండు ప్రాణాలు కోల్పోగా.. ఈ ఏడాది నాలుగైదు ఘటనలు మెరుగైన వైద్యానికి విశాఖప ట్నం రిఫర్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 31న రణస్థలం జాతీయ రహదారిలో గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా.. 108 వాహన సేవలకు కాల్ చేస్తే అది తెలంగాణ రాష్ట్ర కాల్సెంటర్కు కనెక్ట్ అయ్యింది. దీంతో లోకేషన్ చెబుతున్నా తమ పరిధి కాదని చెప్పేశా రు. వారి వాదనల నడుమ ఆ క్షతగాత్రుడు 45 నిమిషాల పాటు ప్రాణాలతో కొట్టుమిట్టాడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ కుక్కకాటు బాధితుడు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కుప్పకూలిపోతే ఒకరు 108 వాహనం కోసం కాల్లో సంప్రదిస్తే ఏ మాత్రం కాల్ కనెక్ట్ కాలేదని తెలిసింది. ఆఖరుకు ఆస్పత్రికి వెళ్లాక అతడు మృతి చెందిన ఘటన సంచలనమైంది. నిర్వహణ తీరుపై విమర్శలు జిల్లాలో మొత్తం 30 మండలాలకు మొత్తం 33 ఎమర్జన్సీ 108 వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాహనాలు రన్నింగ్ స్థితిలో ఉన్నాయి. గతంలో నిర్వహణ బాధ్యతల కంటే తాజాగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన భవ్య సర్వీసెస్ యాజమాన్య పరిధిలో నిర్వహణ చాలా అధ్వానంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో కాల్ చేసిన క్షణాల్లో ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులకు వైద్య సహాయం అందేలా చర్యలుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఆపద వచ్చిందని కాల్ చేసినా పెద్దగా స్పందన లేదు సరికదా.. కొన్నిసార్లు ఏకంగా ఆ కాల్ తెలంగాణకు కనెక్ట్ చేస్తున్నారంటే నెట్వర్క్ నిర్వహణ తీరు ఇట్టే అర్థమవుతోంది. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న పరిస్థితులు ఈ నిర్వహణ తీరుకు అద్దం పడుతున్నాయి. జిల్లాలో రెండు జాతీయ రహదారులున్న నేపథ్యంలో ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అందునా అర్థరాత్రి సమయంలోనూ. వేకువజామున రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో క్షతగాత్రులు ప్రాణాప్రాయంలో ఉంటే అక్కడివారు 108 సర్వీస్ కాల్ చేస్తున్నా.. అంతసులువుగా కాల్ కనెక్ట్ కావడం లేదు సరికదా...ఇతర రాష్ట్ర నెట్వర్క్కు కనెక్ట్ అయ్యే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. మండలానికి ఒక్కో వాహనం ఉన్నప్పుడు కాల్ చేసిన 5 లేదా 10 నిమిషాల్లో ఘటనాస్థలానికి వాహనం చేరిపోవాల్సి ఉంది. జిల్లాలో ఆ పరిస్థితి నేడు లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం 108 వాహనాల ఎమర్జెన్సీ సేవల ప్రాధాన్యతను గుర్తించి నిర్వహణ తీరును మెరుగుపరుచుకుంటే కొందరి ప్రాణాలను కాపాడే పరిస్థితులుంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ ఆలస్యంగా వస్తున్న 108 వాహనాలు బాధితుల ప్రాణాలతో చెలగాటం కాల్ వెంటనే కలవదు.. కలిసినా కొన్నిసార్లు తెలంగాణకు కనెక్ట్ -
● అలా.. ఉమ్లింగ్లా వరకు
● ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించిన కిశోర్ ● జిల్లా నుంచి బైక్పై సాహస యాత్ర చేసిన యువకుడు రణస్థలం:రణస్థలం మండలంలోని పతివాడపాలెం గ్రామానికి చెందిన పతివాడ కిశోర్ సాహస యాత్ర చేశాడు. ఉమ్లింగ్లా శిఖరాన్ని అధిరోహించాడు. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మోటారు వాహనాలు తిరగగలిగే ప్రదేశం. లఢక్ ప్రాంతంలో ఉంటుంది. ఏప్రిల్ 18న కిశోర్ ఈ సాహస యాత్ర మొదలుపెట్టాడు. ఈ నెల 5వ తేదీన అక్కడకు క్షేమంగా చేరుకున్నాడు. లఢక్ ప్రాంతం నుంచి ఉమ్ లింగ్ లా చేరుకునేందుకు ఎన్నో అవాంతరాలు ఎదురైనా అన్నీ తట్టుకుని గమ్యస్థానం చేరుకున్నాడు. జిల్లా నుంచి మొట్టమొదటి సారిగా అంతదూరం సాహసయాత్ర చేసిన వ్యక్తిగా నిలిచాడు. కిశోర్ తల్లిదండ్రు లు పతివాడ కమల, పతివాడ నర్సింహమూర్తి వ్యవసాయ కూలీలు. కిశోర్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. కొండములగాం గ్రామానికి చెందిన మేనమామ లారీతో డ్రైవింగ్ వెళుతుంటానని చెప్పారు. అలాగే అప్పుడప్పుడు సాహసయాత్రలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు. బైక్, సర్టిఫికెట్తో కిశోర్ -
ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్వాసితుల అవస్థలు
సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్వాసితులకు నౌపడలో కేటాయించిన ఆర్అండ్ఆర్ కాలనీలో వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్వాసిత కాలనీలో రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నీరు నిల్వ ఉండిపోయింది. గురువారం ఇళ్ల నిర్మాణాల కోసం మెటీరియల్స్తో వస్తున్న ట్రాక్టర్ బురదలో కూరుకుపోయింది. కూరుకుపోయిన ట్రాక్టర్ బయటకు రాని పరిస్థితి తలెత్తడంతో మెటీరియల్స్ను అక్కడే కిందకు దించారు. ఇక్కడి నుంచి పని చేసే ప్రదేశానికి మెటీరియల్స్ తీసుకుని వెళ్లడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, దానికి తోడు అదనపు భారం కూడా తమపై పెడుతున్నారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత జేసీబీ సాయంతో ట్రాక్టర్ బయటకు తీశారు. -
దారి ఖర్చులు ఏవీ?
● విద్యార్థులను మోసగించిన చంద్రబాబు ప్రభుత్వం ● రవాణా చార్జీలు చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన ప్రభుత్వం శ్రీకాకుళం: పాఠశాలల విలీనం నేపథ్యంలో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు. సమీపంలో పాఠశాలలు లేని గ్రామాల నుంచి వెళ్లే 6–14 ఏళ్ల విద్యార్థులకు నెలకు రూ.600 చొప్పున, ఏడాదికి రూ.6,000 రవాణా భత్యం అందిస్తామని పేర్కొంది. అయితే ఈ హామీ కాగితాలకే పరిమితమైంది. అమలు ఎక్కడ..? ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ పరిధిలో లేకపోయినా, ఉన్నత ప్రాథమిక, హైస్కూల్ 3 కిలోమీటర్ల దూరంలో లేకపోయినా రవాణా భత్యం ఇవ్వాలని ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. దీనిపై గ్రామ సభలు నిర్వహించి, ప్రజల విశ్వాసం పొందుతూ పాఠశాలల విలీనానికి ప్రభుత్వ యంత్రాంగం ముందడుగు వేసింది. కానీ విద్యార్థులను దూర పాఠశాలలకు తరలించిన తర్వాత ఒక్క రూపాయి కూడా రవాణా ఖర్చులుగా చెల్లించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. విలీనం పేరిట విద్యా వ్యవస్థకు దెబ్బ.. పాఠశాలలను ‘తొమ్మిది రకాల విభజన’ పేరిట పునర్ వ్యవస్థీకరించి, తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలను (3, 4, 5) ఎక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో విలీనం చేయ డంవల్ల గ్రామీణవిద్యార్థులు రోజువారీగా ప్రయాణ భారాన్ని, ప్రకృతి అవరోధాలు భరించాల్సి వస్తోంది. రవాణా భత్యం అందకపోవడంతో పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. దీనివల్ల వేల సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వదిలి ఇంటి వద్దకే వస్తున్న ప్రైవేటు పాఠశాలల బస్సులో తరలిపోతున్నారు. విద్యా హక్కు చట్టానికి విరుద్ధమా? ఆర్టీఈ చట్టం (రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్) ప్రకారం విద్యార్థులకు సమీపంలో పాఠశాల లేదా రవాణా సౌకర్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఈ రెండింటిలో ఏదీ సరైన విధంగా అమలు చేయకుండా పాఠశాలల విలీనాన్ని ముందుకు తీసుకెళ్లడం చట్టబద్ధ బాధ్యతలపై నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. కాగితాలపై పాఠశాలలు విలీనం అయినట్లు చూపిస్తున్నప్పటికీ, భౌతికంగా విద్యార్థులు ఆ పాఠశాలలకు చేరకపోవడం గమనించాల్సిన అంశం. రవాణా సౌకర్యం లేకపోవడం, రవాణా చార్జీలు చెల్లించకపోవడం వల్ల అనేక విద్యార్థులు విద్యకు దూరమవుతుండటం తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతోంది. పాఠశాల ఉనికికే ప్రమాదం.. ఈ ఏడాది ఏప్రిల్–మేలో చేపట్టబోయే కొత్త విలీన ప్రక్రియతో జిల్లా స్థాయిలో వందలాది పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే అమలు కాని హామీల నేపథ్యంలో, మరింత పెద్ద స్థాయిలో విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడే అవకాశముంది. -
రెడ్క్రాస్ ఔదార్యం
శ్రీకాకుళం కల్చరల్ : పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఒండ్రుజోల గిరిజన గ్రామానికి చెందిన నిమ్మక ప్రసాద్ (36) ఇటీవల కుక్కకాటు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శ్రీకాకుళంలోని సార్వత్రిక ఆసుపత్రిలో వైద్య సహాయం పొందుతూ మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం కేజీహెచ్కు బయలుదేరడానికి శ్రీకాకుళం బస్టాండ్కు వచ్చిన ప్రసాద్ ర్యాబిస్ వ్యాధి లక్షణాలతో కుప్పకూలి మృతిచెందాడు. ఒంటరిగా ఉన్న సహాయకుడికి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో సమీపంలో ఉన్నవారు రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహన్రావుకు తెలియజేశారు. ఆయన అంబులెన్స్ ఏర్పాటు చేసి స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించారు. ఈ సందర్భంగా డ్రైవర్ చిన్ని కృష్ణ, ఉమా శంకర్, రెడ్క్రాస్ ఎంసీ కమిటీ సభ్యుడు ఎం.కళ్యాణ్ చక్రవర్తికి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. మేడ పైనుంచి పడి వ్యక్తి దుర్మరణం పలాస: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబాడాం గ్రామానికి చెందిన కురిటి వినోద్కుమార్ (33) ప్రమాదవశాత్తు ఇంటి మేడ పైనుంచి పడి గురువారం రాత్రి మృతి చెందాడు. రాత్రి 10 గంటల తర్వాత మేడపైకి వెళ్లాడు.. తెల్లారి చూసే సరికి కింద శవమై కనిపించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వినోద్కుమార్కు భార్య, కుమారుడు ఉన్నారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ మృతి పలాస: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన అన్నాబత్తుల వెంకటరమణ అనే రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవరు గురువారం రామకృష్ణా పురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. తన పొలం వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు దాడుతుండగా కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవధాన్యాలతో నేల సారవంతం రణస్థలం: నవధాన్యాలు వేసి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ పూజారి సత్యనారాయణ అన్నారు. రావాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు, ఇతర రైతులకు నేలను సారవంతం చేయడానికి ఈ ఏడాది ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని నవధాన్యాలు కిట్స్ 1400 కిట్లు తయారు చేసి అవగాహన కల్పించారు. ప్రధాన పంట వేసే ముందు కిట్లో ఉన్న విత్తనాలు వేయడం వల్ల వేరు వ్యవస్థ నేలలోకి చేర్చుకుని రకరకాల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మొక్కకు కావాలసిన పోషకాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వస్తుందన్నారు. కిట్లు కావాల్సిన వారు రైతు సేవా కేంద్రంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, ప్రకృతి వ్యవసాయ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో విజయభాస్కర్, ఎన్ఎఫ్ఏఐసి టి.శివకృష్ణ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నరసింహులు, వెంకటలక్ష్మి, ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లు కంబపు కృష్ణ, గంట్యాడ ఏసుబాబు, పెద్దింటి రాజేశ్వరి, కలివరపు శివశంకర్ పాల్గొన్నారు. -
కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువు
మాట్లాడుతున్న జి.వి.రమణి నరసన్నపేట : టీడీపీ అధికారం చేపట్టాక మహిళలకు రక్షణ లేకుండాపోతోందని, అధికారం అండతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారని, దీనికి నిదర్శనం నరసన్నపేటలో తాజాగా జరిగిన ఈ ఘటనే నిదర్శనమని వైఎస్సార్ సీపీ నరసన్నపేట నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జి.వి.రమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా ఆదిలక్ష్మి చెప్పారు. నరసన్నపేటలోని పార్టీ కార్యాలయం వద్ద గురువారం మహిళా విభాగం ప్రతినిధులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి పాలనలో ఒంటరి మహిళలు, వితంతువులు వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్తగా పింఛన్లు ఇవ్వకపోగా పింఛన్లు ఇప్పిస్తామని అధికార పార్టీ కార్యకర్తలు, నాయకులు లైంగిక వేధింపులకు దిగడం దారుణమన్నారు. ఇటువంటి సంఘటనకు ఎన్నో జరుగుతున్నాయని, ఇది మాత్రమే వెలుగులోకి వచ్చిందన్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేకపోవడం దారుణమన్నారు. పింఛన్ ఇస్తానని చెప్పి వేధింపులకు గురి చేసిన జగన్నాథపురానికి చెందిన టీడీపీ కార్యకర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అన్యాయాన్ని ధైర్యంగా చెప్పిన మహిళకు అండగా నిలిచి రక్షణ కల్పించాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. భయపెట్టి గురువారం ఆమెతో మరో స్టేట్మెంట్ ఇప్పించారని విమర్శించారు. లైంగిక వేధింపులకు గురైన మహిళకు వైఎస్సార్ సీపీ మద్దతుగా ఉంటుందని చెప్పారు. సమావేశంలో పార్టీ మహిళా విభాగం ప్రతినిధులు సవర శైలజ, చింతు శ్రీదేవి, తర్ర మాధవి, కై బాడ వాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం అర్బన్: ఆర్టీసీ శ్రీకాకుళం 2వ డిపోలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఎస్.బాబు, కె.బాబూరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఎర్రబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులను యాజమాన్యం వేధింపులకు గురి చేస్తోందన్నారు. పని భారం పెంచుతోందన్నారు. ఓవర్ టైం సర్వీసులు రద్దు చేసి సింగల్ డ్యూటీలు చేయాలన్నారు. అత్యవసర సమయాల్లో సెలవు మంజూరు చేయడం లేదని, మహిళా ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవడంలేదని, టిక్కెట్ ఇచ్చే యంత్రాలు సరిగ్గా పనిచేయడం లేదని, డిపోలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సీ్త్ర శక్తి కేసులపై న్యాయం చేయాలన్నారు. నిరసన కార్యక్రమంలో డిపో ఉద్యోగులు బి.ఆనందరావు, బి.శేషుబాబు, ఎ.ఈశ్వరరావు, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు. పాముకాటుతో మహిళ మృతి వజ్రపుకొత్తూరు: కొండవూరుకు చెందిన యడ్ల ఆదెమ్మ(57) అనే మహిళ పాముకాటుకు గురై బుధవారం మృతి చెందింది. ఉపాధి పనులు ముగించుకుని ఇంటికి తిరిగి చేరుకున్న ఆమె విశ్రాంతి తీసుకుంటుండగా ఇంటి ఆవరణలో నాగు పాము కాటువేసింది. వెంటనే కుటుంబ సభ్యులు పూండిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదెమ్మ భర్త కొన్నేళ్లు క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కుమారుల వద్ద నివాసం ఉంటోంది. -
మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలి
హిరమండలం: కూటమి ప్రభుత్వానికి మొక్కజొన్న రైతుల ఉసురు తగులుతుందని వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. గురువారం అక్కరాపల్లిలో అకాల వర్షాలకు పాడైన పంటలను, మొలకలు వచ్చిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతులు ఈ సందర్భంగా కన్నీరుమున్నీరయ్యారు. వరి తరువాత ఎక్కువగా మొక్కజొన్న వేసుకున్నామని.. మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటుచేయలేదన్నారు. అందుకే కల్లాల్లో ఉన్న మొక్కజొన్న అకాల వర్షాలకు తడిసిపోయిన విషయాన్ని వివరించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ అన్నదాతను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. తక్షణం ప్రభుత్వం స్పందించి మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు. లేకుంటే వైఎస్సార్సీపీ ఉద్యమ బాట పడుతుందని హెచ్చరించారు. ఆమెతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసాల వెంకట రామకృష్ణ, నాయకులు చింతాడ సూర్యనారాయణ, లుకలాపు ప్రసాద్, ఎం.శంకరరావు, జి.సుధీర్, ఎల్.శ్రీనివాసరావు, సింహాచలం, జనార్దనరావు, శిమ్మ పాపయ్య, వంజరాపు చిరంజీవి, జ్యోతీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రెమిడియల్ క్లాసులపై ఉత్తర్వులు ఇవ్వాలి
శ్రీకాకుళం : టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఉపాధ్యాయులు ప్రతిరోజూ రెమిడియల్ క్లాసులకు రావాలని మౌఖిక ఆదేశాలు ఇవ్వడం సరికాదని, తక్షణం రాతపూర్వక ఉత్తర్వులు జారీ చేయాలని ఫ్యాప్టో నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆన్లైన్ సమావేశాల ద్వారా, వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులను క్లాసులు రావాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు. రెమిడీయల్ క్లాసులకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కూడా కల్పించకపోవడాన్ని వారు తప్పుపట్టారు. డీఈఓను కలిసిన వారిలో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షుడు బమ్మిడి శ్రీరామ్మూర్తి, కార్యదర్శి పి.ప్రతాప్కుమార్, ఎస్.కిషోర్కుమార్, చావలి శ్రీనివాస్, పప్పల తిరుమలరావు, పి.ఆనందరావు, పి.సూర్యప్రకాశరావు, వై.ఉమాశంకర్, జి.సురేష్,హెచ్ అన్నాజీరావు, బి.రవికుమార్, జి.శ్రీరామచంద్రమూర్తి, టి.ఉమాభాస్కర్, వి.శ్యామ్కుమార్, పి.అప్పారావు పాల్గొన్నారు. -
టమాటా రైతులకు పరిహారం అందించాలి
సోంపేట: మండలంలో గత నెల ఏడో తేదీన కురిసిన వర్షాలకు టమాట పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టమాట రైతులను ఆదుకోవాలని కోరుతూ గురువారం సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జింకిభద్రలో టమాటా పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత నెలలో కురిసిన వర్షాలకు టమాటా రైతులు, కాయగూరల రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వలల్ల టమాట పంట నీట మునిగి రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టగా.. వర్షాల వల్ల ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదన్నారు. ప్రభుత్వాలు టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలో 600 ఎకరాల్లో టమాట సాగు చేస్తే ఏప్రిల్ 7న కురిసిన వర్షాలకు పంట మొత్తం పోయిందన్నారు. నేటికీ పంటల బీమా గానీ, పంట పెట్టుబడి సహాయం గానీ అందలేదన్నారు. టమాట పంటకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్చేశారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ చొరవ తీసుకోవాలన్నారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టమాటా రైతులను ఆదుకోవాలని విన్నవించామని, అయినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, పార్టీ నాయకులు ఇప్పిలి కృష్ణారావు, సల్ల దేవరాజు, గురాల శ్రీను, బతకల మోహనరావు, తామాడ పద్మావతి, పాతిన శేషగిరి, పిన్నింటి ఈశ్వరరావు, రౌతు విశ్వనాథం, కోట రాజు, కర్రి సత్యం, మేరుతు తిరుపతిరెడ్డి, అనంత, పోకల హేమరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పీజీ సెట్
ఎచ్చెర్ల : రాష్ట్రంలో పలు యూనివర్శిటీలు, అనుబంధ కళాశాలల్లో ఆర్ట్స్, సైన్స్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 8 నుంచి నాలుగు రోజులపాటు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన వారు వెబ్ ఆప్షన్స్ ద్వారా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వ విద్యాలయంలో వివిధ కోర్సుల్లో సీట్లు పొందవచ్చు. ● ఆర్ట్స్ కళాశాలకు సంబంధించి ఎం.కాం, ఎం.ఎ (ఎకనామిక్స్), ఎం.ఎ (రూరల్ డెవలప్మెంట్), ఎంఈడీ, ఎం.ఎల్.ఐ.సీ (లైబ్రరీ సైన్స్), ఎం.ఎ(సోషల్వర్క్), ఎం.ఎ (ఇంగ్లీష్), ఎం.ఎ (తెలుగు), ఎం.జె.ఎం.సి (జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్) కోర్సులకు వెబ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష రాసిన విద్యార్థులు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ● సైన్స్ కళాశాలకు సంబంధించి ఎం.ఎస్సీ (బయోటెక్నాలజీ), ఎం.ఎస్సీ (మైక్రో బయాలజీ), ఎం.ఎస్సీ (ఆర్గానిక్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (అనలైటికల్ కెమిస్ట్రీ), ఎం.ఎస్సీ (మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (అప్లయిడ్ మేథమెటిక్స్), ఎం.ఎస్సీ (ఫిజిక్స్)లకు ఏపీపీీజీసెట్–2026 ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. పూర్తి వివరాలకు సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.ఎపీ.జీవోవి.ఇన్ వెబ్సైట్ను సంప్రదించవచ్చు. అధునాతన వసతులు.. పీజీ ప్రవేశాలు పొందినవారికి అంబేడ్కర్ వర్శిటీ పలు వసతులు కల్పిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన హాస్టళ్లు, కిచెన్లు, గ్రంథాలయాలు, వ్యాయామశాలలు, ప్రయోగశాలలు, యోగా హాళ్లు, హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. జీసీసీ కేఫ్, క్యాంటీన్, బ్యాంక్, వైఫై సదుపాయంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలకు విద్యార్థులు అర్హులేనని రిజిస్ట్రార్ బి.అడ్డయ్య తెలిపారు. -
గతంలోనూ ఇదే తీరు..
2015లో కూడా గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ యూనిట్గా 100 మంది విద్యార్థులు గల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేసినప్పుడు సమీపంలోని 2 నుంచి 3 పాఠశాలలను విలీనం చేస్తూ నాటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా పాఠశాలకు ప్రత్యేక పద్దుల్లో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ తరగతికో ఉపాధ్యాయుడిని, ప్రత్యేక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టును, గ్రంథాలయం, భాషా ప్రయోగశాల ఏర్పాటు చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. అవేవీ కార్యరూపం దాల్చకపోగా పాఠశాలలు మూతపడటం మాత్రమే మిగిలింది. – దుప్పల శివరాంప్రసాద్, ఆపస్, జిల్లా అధ్యక్షుడు -
జెమ్స్లో అంతర్జాతీయ స్థాయి వైద్యం
● దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ గుర్తింపు ● విలేకరులతో జెమ్స్–హెచ్ చీఫ్ పేట్రన్ బొల్లినేని భాస్కరరావు వెల్లడిశ్రీకాకుళం రూరల్: రాగోలులోని జెమ్స్–హెచ్ ఆస్పత్రి వైద్య కళాశాల నుంచి ఇకపై అంతర్జాతీయ స్థాయి వైద్యసేవలు అందిస్తామని జెమ్స్–హెచ్ చీఫ్ పేట్రన్ బొల్లినేని భాస్కరరావు తెలిపారు. తమ కళాశాలకు దేశంలోనే తొలిసారిగా ఇంగ్లాండ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్గా గుర్తింపు రావడంతో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాత శస్త్రచికిత్స సంస్థ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి జనరల్ సర్జరీ విభాగానికి ప్రతిష్టాత్మక గుర్తింపు వచ్చిందన్నారు. క్లిష్టమైన శస్త్రచికిత్సలు, రోగుల సంరక్షణపై శిక్షణ ఇచ్చే సీసీఆర్ఎల్ఎస్పీ ప్రొవైడర్ కోర్సును జెమ్స్ హెచ్ ఆస్పత్రిలోనే నెలకొల్పినట్లు వివరించారు. ప్రధానంగా సర్జికల్ విద్యకు సంబంధించిన మౌలిక వసతులు, అధ్యాపక బృందం, నాణ్యత ప్రమాణాలు, శిక్షణా విధానాలపై జరిగిన సమీక్షలో జెమ్స్ ఆస్పత్రికి ఈ అరుదైన అవకాశం దక్కిందన్నారు. ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ చైర్మన్, శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ పి.రఘురామ్ మాట్లాడుతూ సర్జరీ విద్యా ప్రమాణాల్లో అత్యుత్తమ నాణ్యతను గుర్తిస్తూ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈ గుర్తింపు ఇచ్చిందన్నారు. సీసీఆర్ఎల్ఎస్సీ కోర్సు డైరెక్టర్ జీఐ సర్జన్ డాక్టర్ ఎం.బి.వి.ప్రసాద్ మాట్లాడుతూ ఈ కోర్సును మే 7, 8 తేదీల్లో 16 మంది శస్త్ర చికిత్స శిక్షణార్థులకు అనస్తీషీయా విభాగాలకు చెందిన నిపుణుల బృందం శిక్షణ అందిస్తోందన్నారు. ప్రాక్టికల్ శిక్షణ, వాస్తవ పరిస్థితుల ఆధారిత అధ్యయనం, క్లినికల్ నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించేలా కోర్సు అందిస్తున్నట్లు చెప్పారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ విభాగాల్లో శిక్షణ పొందుతున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో జెమ్స్ హెచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ లలిత, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.సుధీర్ తదితరులు పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్రగాయాలు
కంచిలి: మండల కేంద్రం సోంపేట రైల్వేస్టేషన్లో రైలు నుంచి జారిపడి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం భువనేశ్వర్ నుంచి బెంగులూరుకు వెళ్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ సోంపేట రైల్వేస్టేషన్లో ఆగింది. ఒడిశా రాష్ట్రం అంకుల చండిపడ గ్రామానికి చెందిన ప్రభంజన్ నాయక్ అనే ప్రయాణికుడు సోంపేటలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి హాజరవ్వడానికి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో వచ్చాడు. దిగేటప్పుడు తన బ్యాగు జారిపడి ఆగి ఉన్న రైలు పట్టాల కిందకు చేరింది. దీంతో ఆ బ్యాగ్ తియ్యబోయి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని అంబులెన్స్లో సోంపేట ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
● దాడిలో పలువురికి గాయాలు హిరమండలం: స్థానిక అంగురు వీధిలో బుధవారం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలపై దాడిచేసి నలుగురిని గాయపరచింది. దీంతో వారిని హుటాహుటిన స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లి వైద్యసేవలందించారు. ఉదయం పిచ్చికుక్క స్థానికులపై ఎగబడింది. కనిపించిన వారిపై దాడి చేసింది. గత నెలలలో కూడా పది మందిపై దాడి చేసింది. దీంతో స్థానికులు కుక్కను కొట్టి చంపేశారు. వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని సీతాపురంలో గత రెండు రోజులుగా పిచ్చికుక్కు స్వైర విహారం చేస్తూ పలువురు మహిళలపై దాడి చేసింది. ఈ దాడిలో కె.ప్రశాంతి, టి.సీతమ్మ, టి.తులసమ్మ, టి.పద్మ, బి.శ్యామలకు గాయాలయ్యాయి. అలాగే నువ్వలరేవుకు చెందిన మహిళ చేపలు అమ్ముతుండగా ఒక్కసారిగా దాడి చేయగా ఆమె తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. కాగా పిచ్చికుక్క నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం చేతికర్రలు పట్టుకొని గ్రామంలో తిరుగుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం మెళియాపుట్టి: మండలంలోని బురద రామచంద్రాపురం గ్రామానికి వెళ్లే రహదారికి ఆనుకుని ఒక వృద్ధుడి మృతదేహాన్ని కొంతమంది పాదచారులు బుధవారం ఉదయం గుర్తించారు. వారిద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ మహ్మద్ అమీర్ అలీ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఏదో వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఆనవాలు ఉన్నాయని, ప్రమాదానికి కారణమైన వ్యక్తుల చెప్పులు, ఇతర వస్తువులు సంఘటనా స్థలంలో లభ్యమయ్యాయన్నారు. వృద్ధుడి వివరాలు తెలియడం లేదన్నారు. మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధాశ్రమానికి మతిస్థిమితం లేని యువకుడు కవిటి: మండలంలోని కుసుంపురం పంచాయతీ జుత్తుపుట్టుగలో గత కొన్ని రోజులుగా చిరునామా తెలియని ఒక మతిస్థిమితం లేని యువకుడు సంచరిస్తున్నాడు. గ్రామంలో ఆలయ నిర్మాణ వేళలో అక్కడ సంచరించాడు. దీంతో ఉదారమైన మనసుతో గ్రామస్తులు అతడికి ఆహారం, తాగునీరు అందించి ఆదరించారు. తాజాగా అతడి మానసిక స్థితిని గుర్తించి నర్తు సారధి తదితర గ్రామ పెద్దలు మానవతా దృక్పథంతో స్పందించి, మతిస్థిమితం లేని వ్యక్తిని తలతంపర సమీపంలోని వృద్ధాశ్రమం(సీతయ్య ఫౌండేషన్) నిర్వాహకులతో మాట్లాడి వారికి బుధవారం అప్పగించారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఎచ్చెర్ల: మండలంలోని కుశాలపురం గ్రామం బైపాస్ కూడలి వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం వైపు వెళ్తున్న బ్యాటరీల వ్యాను బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రైవర్ నిద్రమత్తులో డివైడర్ౖను ఢీకొనడంతో వ్యాన్ బోల్తా పడింది. ఆ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాను నుజ్జనుజ్జయ్యింది. వ్యానులో ఉన్న డ్రైవర్, క్లీనర్తో పాటు ఒక బాలిక చిన్న, చిన్న గాయాలతో బయటపడ్డారు. ఈ వ్యాన్ బీహార్ నుంచి రాజమండ్రికి బ్యాటరీలతో వెళ్తోంది. ఎచ్చెర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని పక్కకు జరిపి ట్రాఫిక్ను నియంత్రించారు. ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


