Srikakulam
-
రెవెన్యూ ఉద్యోగి బరితెగింపు
పొందూరు: మండలంలోని మజ్జిలిపేట గ్రామానికి చెందిన జి.జనకచక్రవర్తి సీనియర్ అసిస్టెంట్గా పొందూరులో పని చేస్తున్నారు. మజ్జిలిపేటలో రెండు రోజుల కిందట నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొనడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. కానీ ఆయన ఎలాంటి భయం లేకుండా టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందడిగా శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభం వజ్రపుకొత్తూరు రూరల్: జిల్లాలో అతి పెద్ద మత్య్సకార గ్రామమైన నువ్వలరేవులో సందడిగా శ్రీరామ నవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఠక్కురాణి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దాసుడు మువ్వల డోమ్మ, ఘంటోమోనరి మువ్వల పురుషోత్తంలు ప్రత్యేక అలంకరణతో, సాంస్కృతిక కార్యక్రమాలతో జన సంద్రం నడుమ ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు పూజలు చేసి ముర్రాటలు, కానుకలు సమర్పించారు. కాగా సుమారు 10 వేల మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో ఉత్సవ వేడుకలలో మొదటి తంతును భక్తిశ్రద్ధలతో జరిపారు. దీంతో గ్రామ ప్రధాన వీధి జనంతో కిక్కిరిసింది. అలాగే యువతీ యువకులు నృత్యాలతో సందడి చేశారు. ఉచిత నాట్య శిక్షణ ప్రారంభం శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని బ్యాంకర్స్ కాలనీ సత్యసాయి బృందావనంలో ఉగాది సందర్భంగా ఉచిత నాట్య శిక్షణ ప్రారంభమైంది. సంప్రదాయం కూచిపూడి గురుకులం డైరెక్టర్ స్వాతీ సోమనాథ్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంజలి, యామిని, లోకేశ్వరి, సాయి మందిరం భక్తులు పాల్గొన్నారు. -
ఆత్మీయ ఆలింగనాలు, ప్రత్యేక ప్రార్థనలు, ఇఫ్తార్ విందులతో రంజాన్ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. మసీదుల వద్ద ఈదుల్ ఫితర్ నమాజులు జరిగాయి. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో ఉండాలని, ప్రవక్త మాటలు ఆచరణీయం కావాలని మత పెద్దలు ఆకాంక్షించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్,
అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడి డైరెక్షన్లో మైనింగ్ అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతలకు చెందిన క్రషర్లు, క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకపోయినా కనీసం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో కొంత మందిపై అడ్డగోలుగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ–పర్మిట్ వెబ్సైట్ ఆగిపోతే క్రషర్లు, గ్రానైట్ బ్లాకుల రవాణా ఎలా జరుగుతున్నాయి. మైనింగ్ అధికారుల అడ్డగోలు వ్యవహారంపై అన్ని రకాల ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఆయా ఆధారాలతో కోర్టులను ఆశ్రయించి అధికారులు చేస్తున్న తప్పులకు మూల్యం చెల్లించుకునే విధంగా చేస్తాం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి -
ఆకట్టుకున్న రంజాన్ కవి సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ సందర్భంగా స్థానిక కేంద్ర గ్రంథాలయంలో రాష్ట్ర ముస్లిం రచయితల వేదిక వ్యవస్థాపకులు కరీముల్లా ఆదేశాల మేరకు సోమవారం జరిగిన కవి సమ్మే ళనం ఆకట్టుకుంది. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మహ్మద్ రఫీ అధ్యక్షతన ‘హిందూ ముస్లిం భాయిభాయి’ పై జరిగిన ఈ కవి సమ్మేళనంలో పలువురు కవులు రంజాన్ విశిష్టతను, గొప్పదనాన్ని తెలియజేస్తూ చక్కనైన కవితలను చదివారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడు తూ మత సామరస్యానికి ప్రతీక ఈ కవి సమ్మేళనం అని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సురంగి మోహనరావు చేతుల మీదుగా ఈవేమన కవితా నిలయం తరఫున విశేష వైద్య సేవలు అందిస్తున్న పి.బి.డేవిడ్ను ఆరోగ్యమిత్ర బిరుదుతో సత్కరించారు. కార్యక్రమంలో కవులు గుడిమెట్ల గోపాలకృష్ణ, వాడా డ శ్రీనివాస్, పసుపురెడ్డి శ్రీను, బోగెల ఉమామహేశ్వరరావు, గుణస్వామి, తంగి ఎర్రమ్మ, బి.సంతోష్ కుమార్, విజయలక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. టైమ్ స్కేల్ అమలు చేయాలి ఎచ్చెర్ల క్యాంపస్: సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్లకు ప్రభుత్వం మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని యూనిటీ వెల్ఫేర్ టీం జిల్లా ఉపాధ్యక్షుడు చిగిలిపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. చిలకపాలెంలో సోమవారం సమగ్ర శిక్ష ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం నిర్వహించి, ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా కనీసం వేతనం అందజేయటం లేదని అన్నారు. సమాన పనికి సమాన వేతనం అందజేయాలని డిమాండ్ చేశారు. కనీ సం మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తే ఉద్యో గులకు న్యాయం జరగుతుందని చెప్పారు. పార్ట్ టైమ్ పేరుతో ఉద్యోగులను ఫుల్ టైమ్ వినియోగించుకుంటున్నారని, పార్ట్ టైమ్ పదం తొలగించాలని అన్నారు. ఒకేషనల్ టీచర్లుగా పరిగణించాలని విజ్ఙప్తి చేశారు. ఉద్యోగ భద్రత, కుటుంబ నిర్వహణకు తగ్గ వేతనం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ ప్రతినిధులు వై.సత్యనారాయణ, ఎల్.దిలీప్కుమార్, తారకేశ్వరరావు పాల్గొన్నారు. కొనసాగుతున్న దర్యాప్తు జలుమూరు: యలమంచిలి ఎండల మల్లికార్జున దేవాలయంతోపాటు అక్కురాడ, కొండపోలవలస ఆంజనేయ ఆలయాల గోడలపై అన్య మత సూక్తులు రాసిన వారిని పట్టుకునేందుకు ఆరు బృందాలతో ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. సోమవారం యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస ఆయా దేవాలయాలను మరోసారి పరిశీలించి అర్చకులు, గ్రామస్తులతో మాట్లాడారు. అదే సమయంలో ఎక్కువ మందికి వచ్చిన ఫోన్ కాల్స్ సీడీఆర్ను పరిశీలిస్తున్నారు. అనంతరం జలుమూరు పోలీస్స్టేషన్లో ఈ బృందాల అధికారులతో మాట్లాడారు. దుండగులను త్వరలో పట్టుకుంటామన్నారు. -
అన్ని కులాలకు న్యాయం జరగాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మాల, మాదిగ, రెల్లి, వాటి ఉప కులాలు అన్నింటికి న్యాయం జరగాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వ్యవస్థాపకులు పోతల దుర్గారావు కోరారు. శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ విజ్ఞానభవన్లో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ విషయంలో అన్ని కులాలకు న్యాయం జరగాలని, గ్రామాన్ని యూనిట్గా తీసుకొని వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. మాల, మాదిగ, రెల్లి, రెల్లి ఉపకులాలు అన్ని కలిసి మెలిసి ఉన్నాయని, ఎస్సీలకు మొత్తం మీద రిజర్వేషన్ పెంచాల్సి ఉండగా, విభజించి పాలించు విధంగా చేయడం సరికాదని, సమగ్రంగా రిజర్వేషన్ ప్రక్రియ జరగాలని, రిటైర్డ్ న్యాయమూర్తులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సంఘాల నాయకుల సమక్షంలో కులాల వారీగా రిజర్వేషన్ శాతం ప్రకటించాలని కోరారు. సమావేశంలో పలు సంఘాల నాయకులు దండాసి రాంబాబు, అంపోలు ప్రతాప్, రామప్పడు, గంజి ఎజ్రా, రాము, అప్పన్న, రమేశ్బాబు, బోనేల రమేష్, రమణ, రవికుమార్, రామారావు, తవిటయ్య, పాపారావు, గౌరీ, తవిటిరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా కురిగాం పీహెచ్సీ వార్షికోత్సవం
కొత్తూరు : ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బందితో పాటు పలువురి సహకారంతో కురిగాం పీహెచ్సీ పరిధిలో రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని పూర్వ వైద్యాధికారులు, జిల్లా ఆరోగ్యశ్రీ అధికారి పి.ప్రకాశరావు, హనుమంతు రమేష్, జంపు కృష్ణమోహన్, తిరుపతిరావు రెడ్డి, నరేష్కుమార్, సందీప్, దిలీప్, శ్రీలత చెప్పారు. కురిగాం పీహెచ్సీ ఏర్పాటై 20 ఏళ్లు పూర్తి కావడంతో వైద్యాధికారి పి.ప్రసన్నకుమార్ అధ్యక్షతన వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో వార్షికోత్సవం నిర్వహించడం రాష్ట్రంలో ఇదే మొదటిసారని చెప్పారు. భౌగోళికంగా ఒడిశాకు ఆనుకుని గ్రామీణ ప్రాంతంలో ఉన్న కురిగాం పీహెచ్సీలో వైద్యం అందించడం కష్టసాధ్యమైనప్పటికీ జాతీయ స్థాయి ప్రమాణాలకు అణుగుణంగా సేవలు అందుతున్నాయని, ఈ విషయంలో కురిగాం పీహెచ్సీ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు. వైస్ ఎంపీపీ తులసీ వరప్రసాదరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్యం అందివ్వడం హర్షనీయమన్నారు. వైద్యాధికారులకు ఎల్లప్పుడూ మావంతు సహకారం ఉంటుందని చెప్పారు. అనంతరం పూర్వ వైద్యులను సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సేపాన అశోక్కుమార్, ఈవో బుజ్జిబాబు, సూపర్వైజర్ తిరుపతిరావు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
రబీలో ధాన్యం కొనుగోలు జరిగేనా?
సారవకోట: ఖరీఫ్లో ధాన్యం కొనుగోలు సేకరణ లక్ష్యం పూర్తయిందనే నెపంతో చాలాచోట్ల ధాన్యం కొనుగోలు పూర్తిస్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో రబీలోనైనా ధాన్యం కొనుగోలు జరిగేనా అంటూ రైతులు ఎదురుచూస్తున్నారు. సారవకోట మండలంలోని కొత్తూరు, గోపాలపురం, అగదల, బురుజువాడ, అక్కివలస, బద్రి, లక్ష్మిపురం, సారవకోట, జగ్గయ్యపేట తదితర గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాలలో వరి సాగు చేశారు. ప్రస్తుతం యంత్రాలతో నూర్పులు చేపట్టి ధాన్యం ఆరబెడుతున్నారు. కనీసం రబీలోనైనా తాము పండించిన ధాన్యం పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా అని రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే చాలామంది రైతులు ప్రభుత్వ ధాన్యం కొనుగోలుపై నమ్మకం లేక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ గ్రామాల నుంచి ప్రతిరోజు లారీలతో ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. -
ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుదాం
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ బడిని కాపాడుకోవడం ద్వారా సమాజంలో అందరికీ విద్య అందుతుందని, నైతిక విలువలు, రాజ్యాంగ విలువలు పరిరక్షించబడతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 12వ పీఆర్సీ చైర్మన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. సంస్కరణల పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న విద్యారంగ సంస్కరణలు సక్రమంగా లేవన్నారు. మోడల్ ప్రైమరీ పాఠశాల పేరుతో మిగిలిన ప్రాథమిక పాఠశాలలో ఉన్న ముడు, నాలుగు, ఐదు తరగతి విద్యార్థులను మ్యాపింగ్ చేయడం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాలల్లో సమాంతర మీడియంగా ప్లస్–2 పాఠశాలలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచించకపోతే తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడానికి సామాజిక ఉద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కోశాధికారి ఆర్.మోహన్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్.కిషోర్కుమార్, ఎస్.మురళీమోహన్, వి.లక్ష్మీ, ఉత్తరాంధ్రల జిల్లా పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన కె.విజయగౌరి, శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్.బాబూరావు, బి.శ్రీరామమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కబడ్డీ పోటీల విజేత సింగుపురం
పలాస: మండలంలోని చిన్నగురుదాసుపురంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఆహ్వానిత కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం సమీపంలోని సింగుపురం జట్టు విజేతగా నిలిచింది. చినగురుదాసుపురం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో మొత్తం 21 జట్లు పాల్గొన్నాయి. లింబుగాం జట్టు ద్వితీయ, గొల్లమాకన్నపల్లి తృతీయ స్థానాలు సాధించాయి. శ్రీకాకుళం కె.ఆర్.స్టేడియం జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పాలిన కృష్ణారావు, కార్యదర్శి జినగ తాతారావు, సాలిన రమేష్, జినగ ధర్మారావు, కొండే తేజేశ్వరరావు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. ఫ్యాప్టో నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం: జిల్లా ఫ్యాప్టో చైర్మన్గా బి.శ్రీరామమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని రాష్ట్ర ఫ్యాప్టో పరిశీలకులు(యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి) ఎస్.కిషోర్ తెలిపారు. నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఫ్యాప్టో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. ఫ్యాప్టో వైస్ చైర్మన్లుగా పి.హరిప్రసన్న, వి.సత్యనారాయణ, సెక్రటరీ జనరల్గా పి.ప్రతాప్కుమార్, డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఎస్.వి.రమణమూర్తి, ఎం.మదన్మోహన్రావు, బి.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా కె.జగన్మోహన్రావు, కార్యవర్గ సభ్యులుగా బాబూరావు, ఎస్.రమేష్బాబు, పి.కృష్ణారావు, వై.వాసుదేవరావు, జి.రమణ, ఎస్.వి.అనిల్కుమార్, బి.రవి, ఎస్.ఎస్.ఎల్.వి.పూర్ణిమలను ఎన్నుకున్నట్లు తెలిపారు. పాత పెన్షన్ విధానం అమలు చేయాలి శ్రీకాకుళం అర్బన్: డీఎస్సీ–2003 అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డీఎస్సీ–2003 ఏపీ ఫోరం జిల్లా కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ఎన్జీవో కార్యాలయంలో సోమవారం ఫోరం సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆలస్యం వల్లే డీఎస్సీ – 2003 నియామకాలు 2005 నవంబరులో చేపట్టారని చెప్పారు. దీంతో పాత పెన్షన్ విధానం కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57 మేరకు అర్హత వ్యక్తులందరికీ పాతపెన్షన్ విధానం వర్తింపజేయాలన్నారు. తూర్పుగోదావరికి చెందిన రూపరాజు మాట్లాడుతూ కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో జిల్లా కో–కన్వీనర్లు కె.ప్రకాష్, పి.శ్రీకర్, వి.శ్రీను, ఎ.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయం చేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో చూచిరాతలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం అవసరమేనని.. అయితే డీఈఓ తిరుమల చైతన్య ఎంచుకున్న మార్గం సరైనదికాదని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్.శ్రీనివాస్ అన్నారు. కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రంలో అన్యాయంగా డీబారైన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాకుళం నగరంలోని దాసరి క్రాంతిభవన్ వేదికగా సోమవారం ఎస్టీయూ జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పిలి కేంద్రంపై కాపీయింగ్ ఆరోపణలు ఉన్నప్పుడు పరీక్ష కేంద్రంగా ఎందుకు మంజూరు చేశారని ప్రశ్నించారు. పరీక్ష కేంద్రం నిర్వహణకు పకడ్బందీ చర్యలు ఎందుకు చేపట్టలేదో డీఈఓ తెలియజేయాలని, హోల్డ్లో ఉన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, కోర్టు కేసులను రద్దు చేయాలని కోరారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి మాట్లాడుతూ డీఈఓను వెంటనే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 400 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న కేంద్రంలో విద్యార్థులను భయాందోళనలకు గురిచేసి, పిల్లల విలువైన కాలాన్ని వృథా చేసిన డీఈఓపై కచ్చితంగా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శి గురుగుబెల్లి రమణ, ప్రతినిధులు పి.రామకృష్ణ, ఎస్.రాధాకృష్ణ, కె.శ్రీనివాసరావు, లక్ష్మణరావు, పి.రమణ, డీవీఎన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి
శ్రీకాకుళం క్రైమ్ : ఇటీవల జలుమూరు మండలం యలమంచిలి ఎండల కామేశ్వరస్వామి ఆలయ గోడలపై అన్యమత రాతలు వంటి ఘటనలతో పాటు ఆలయాల్లో చోరీలు జరగకుండా నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం రూరల్ పరిధిలోని ఆలయాల కమిటీ సభ్యులతో ఎస్ఐ ఎం.హరికృష్ణ సమావేశం నిర్వహించారు. ఆలయాలకు నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి ఆలయానికి కమిటీలుండాలని, అందులో యువకులుంటే ఇద్దరు రాత్రిపూట ఆలయం వద్దే నిద్రపోయేలా చూడాలని, లేదంటే సెక్యూరిటీ గార్డులను పెట్టుకోవాలని ఎస్ఐ సూచించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు ఎచ్చెర్ల: లావేరు మండలం రావివలస సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పిన్నింటి రాము, మరో వ్యక్తి సుభద్రాపురం నుంచి విశాఖ వైపు కారులో వెళ్తుండగా హైవే పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరికీ కాళ్లు విరగడంతో చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
తెలుగు తమ్ముళ్ల పిక్కాట!
నరసన్నపేట: మండల కేంద్రం నరసన్నపేటలో తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమకు ఏది తోస్తే అదే న్యాయమని భావిస్తూ చెలరేగిపోతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ బెట్టింగ్ కారణంగా యువత బలి అవుతుండగా తాజాగా నరసన్నపేటలో నడిరోడ్డుపై పిక్కాట(లాటరీ) ఆడిస్తున్నారు. స్థానిక జట్టు కళాశీ సంఘం శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తోంది. దీంట్లో భాగంగా తెలుగు తమ్ముళ్లే దగ్గరుండి లాటరీ ఆడిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నవమి ఉత్సవాలకు లాటరీ నిర్వాహకులు పెద్ద మొత్తంలో తెలుగు తమ్ముళ్లకు ముట్ట చెప్పినట్లు తెలుస్తోంది. దీనిని జనాల నుంచి రాబట్టడానికి మోసపూరితమైన లాటరీ ఆట నిర్వహిస్తున్నారు. ఆరు నెలలుగా మండలంలో ఎక్కడా లాటరీలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా తెలుగు తమ్ముళ్లు పోలీసులపై ఒత్తిడి చేసి వేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది యువత వ్యసనాల బారిన పడుతున్నారని, ఇప్పుడు బహిరంగంగా లాటరీలు పెడితే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, జట్టు కళాశీ సంఘం భవనం పక్కనే పబ్లిక్గా లాటరీ నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ విషయమై సీఐ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పోర్టుకు షిప్పులొస్తాయి.. ఉద్యోగాలు రావు
సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు షిప్పులొస్తాయి గానీ.. ఉద్యోగాలు రావని మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. సంతబొమ్మాళి ప్రజలు తాను చెప్పింది చేయాలన్నారు. అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తానని బెదిరించారు.సోమవారం సంతబొమ్మాళి సూర్యనారాయణస్వామి ఆలయ నిర్మాణానికి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. వేట నిషేధ పరిహారాన్ని ఈనెల 15న మత్స్యకారుల అకౌంట్లలో జమ చేస్తామన్నారు. -
వధువే వరుడై... వరుడే వధువై...
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం సహజం. కానీ ఇక్కడ వధువే వరుడి మెడలో మూడు ముళ్లేస్తుంది. వధూవరులది ఒకే ఊరు. ఇరువురి మెడలో కరెన్సీ నోట్ల దండలు.. పెళ్లిపీటలపై కళ్లద్దాలు ధరిస్తూ దర్శనం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయిల మాటకు గౌరవమిచ్చే పెద్దలు. ఒకే ముహూర్తాన వందల సంఖ్యలో సామూహిక వివాహాలు.. దశాబ్దాలుగా ఎన్నికలెరుగని ఆ గ్రామం ఇంతకీ ఎక్కడుందంటే..? శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. సుమారు 12వేల జనాభా ఈ ఊరి సొంతం. స్వాతంత్య్రానికి పూర్వం నావల రేవుగా పిలిచేవారు. కాలక్రమేణా నువ్వలరేవుగా మారింది. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం లక్ష్మీదేవిపేటగా కనిపించే ఆ గ్రామంలో అందరూ మత్స్యకారులే... చేపలవేట వీరి ప్రధాన జీవనాధారం. పెద్దవాళ్లు సముద్రంలో వేట సాగిస్తారు.చాటింపు వేసి.. వివరాలు సేకరించిఅంతగా ఉన్నత చదువులు లేకపోవడంతో ఈ ఊరి యువత ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబై, అండమాన్ ప్రాంతాలకు వలస వెళతారు. వీళ్లలో పెళ్లీడుకొచ్చిన యువకులను రెండేళ్లకోసారి గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ఏడాదికి పెళ్లికి సిద్ధమయ్యేవారు ఎవరున్నారన్న సమాచారాన్ని ముందుగా చాటింపు వేయించి వారి వివరాలను సేకరిస్తారు. అలా ఎంపికైన వారందరికీ ఒకే ముహూర్తాన సామూహిక వివాహాలను జరిపిస్తారు.వధూవరులది ఒకే ఊరు గతంలో మూడేళ్లకోసారి ఈ పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు యువత సంఖ్య పెరగడంతో రెండేళ్లకోసారి ఈ తంతు జరిపిస్తున్నారు. వరుడికి కావాల్సిన వధువు కోసం ఎక్కడో అన్వేషించరు. ఉన్న ఊరిలోనే వరసకు వచ్చిన అమ్మాయితో నిశ్చయిస్తారు. సామూహిక వివాహ ప్రక్రియలో కులపెద్దలదే కీలక భూమిక. పెళ్లిళ్లన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ముహూర్తాలు నిశ్చయించిన వేళ పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులను మరోసారి పెద్దలు పిలుస్తారు. వారి మనసులో ఎవరైనా ఉన్నారా... అని అడిగి తెలుసుకుంటారు. అలా ఇష్టపడినవారికి ఇచ్చి పెళ్లిచేయడంతో ఆ జంటల్లో ఆనందం రెట్టింపవుతుంది. నువ్వలరేవులో బైనపల్లి, బెహరా, మువ్వల అనే ఇంటి పేర్లున్న కుటుంబాలే అధికంగా ఉంటాయి. పెళ్లిళ్లన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.మూడు రోజుల పెళ్లి పండగసామూహిక వివాహ వేడుకను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంంతో కేరింతలు కొడతారు. రెండోరోజు ప్రధాన ఘట్టం. అదే మాంగల్యధారణ. అయితే ఇక్కడ తాళికట్టేది వరుడు మాత్రమే కాదు. పెళ్లికూతురు సైతం వరుడి మెడలో తాళి కట్టడం విశేషం. మూడోరోజు వధువు పుట్టింటి నుంచి వరుడి ఇంటికి సారె వస్తుంది. ఈ సందర్భంగా పెళ్లి పందిరిలో ఆ సారెను అందరికీ చూపిస్తారు. గ్రామంలోని బంధావతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి వేడుక ముగుస్తుంది. జిల్లాలో సాధారణంగా వరుడి ఇంటివద్ద పెళ్లి జరిపిస్తారు. కానీ నువ్వలరేవులో మాత్రం వధువు ఇల్లే పెళ్లి వేదిక కావడం విశేషం.ఊరంత కుటుంబం వధూవరులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఊరంతా ఒకరికొకరికి ఏదో బంధుత్వం ఉండటం ఇక్కడి వారి సొంతం. పెళ్లి విందుకు బంధువులందరినీ ఆహ్వానించరు. ఏ ఇంటి పెళ్లి విందుకు ఎవరు వెళ్లాలన్నది గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. అలా ఆహార పదార్థాలను వృథా చేయకుండా, అనవసర ఖర్చులను నియంత్రిస్తూ జాగ్రత్తపడతారు.వరకట్నానికి దూరం నువ్వలరేవులో వరకట్నం అనే మాట వినిపించదు. పెళ్లికయ్యే ఖర్చును వధూవరులిద్దరి కుటుంబాలు సమానంగా భరిస్తాయి. ఆడపిల్లను పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడమే మహాభాగ్యంగా మగపెళ్లివారు భావిస్తారు. పెళ్లిపీటలపై ఆసీనులైన వధూవరులిద్దరూ నల్లకళ్లజోడు ధరిస్తారు. ఇద్దరి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తారు. ఈ సామూహిక వేడుకను తిలకించేందుకు పరిసరప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. దీంతో మూడురోజుల పాటు నువ్వల రేవులో తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. నువ్వలరేవులో సామూహిక వివాహాలే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ముందు వరుడు.. ఆ తర్వాత వధువు పెళ్లిలో ముందుగా వరుడు వధువు మెడలో తాళికడతాడు. అనంతరం వధువు వరుని మెడలో తాళి కడుతుంది. దీన్నే స్థానికులు దురషం అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయం నువ్వలరేవు ప్రత్యేకం. ఇలా ఒకరికి ఒకరు తాళికట్టడంతో ఒకరికొకరు ఆజన్మాంతం రక్షగా ఉంటారన్నది ఇక్కడి వారి విశ్వాసం. అలాగే ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనే భావన తమలో ఉండదని, అమ్మాౖయెనా, అబ్బాౖయెనా సమానంగానే భావిస్తామని గ్రామపెద్దలు చెబుతారు.– గుంట శ్రీనివాసరావు, సాక్షి, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం -
రేపటి నుంచే ఇంటర్ తరగతులు
అడ్మిషన్లు పెంచడమే లక్ష్యం.. ప్రభుత్వ కళాశాలల్లో నిష్ణాతులైన అధ్యాపకులతో పాఠాలు బోధించడంతోపాటు అన్ని వసతులు, సౌకర్యాలతో విద్య అందుతోంది. పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, బ్యాగులతోపాటు మధ్యాహ్న భోజనం కూడా అమలవుతోంది. ఈ ఏడాది అడ్మిషన్లను భారీగా పెంచేందుకు ఇంటర్ విద్య ఉన్నతాధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. – శివ్వాల తవిటినాయుడు, ఇంటర్మీడియెట్ విద్య జిల్లా అధికారి(డీఐఈవో), శ్రీకాకుళం ● ఇంటర్మీడియెట్ విద్యలో కీలక పరిణామాలు ● ఏప్రిల్ ఒకటి నుంచి సర్కారీ జూనియర్ కళాశాలలు పునఃప్రారంభం ● 7 నుంచి అడ్మిషన్లు చేయాలని ఇప్పటికే నిర్ణయం ● ప్రైవేటు కళాశాలలకు పోటీగా అడ్మిషన్ల కోసం ఇంటర్ విద్య డైరెక్టర్ నిర్ణయాలు ● కొత్త ఏడాదిలో 235 రోజుల పాటు పనిచేయనున్న జూనియర్ కళాశాలలు శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ యాజమాన్య జూనియర్ కళాశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. సెకెండియర్ విద్యార్థులకు తరగతులు మొదలు కానున్నాయి. వాస్తవానికి ఏటా జూన్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతుండగా.. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచే తరగతులను నిర్వహించాలని ఇంటర్ విద్య డైరెక్టర్ నిర్ణయించారు. అలాగే ప్రైవేటు కాలేజీలకు పోటీగా ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫస్టియర్ ప్రవేశాలకు అడ్మిషన్లు మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జిల్లా అధికారులు, ప్రిన్సిపాళ్లకు వెబెక్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహణ.. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఇప్పటికే అధికారుల ఆదేశానుసారం అడ్మిషన్ డ్రైవ్స్ (క్యాంపెయినింగ్లు) నిర్వహించారు. ఫిబ్రవరి మూడు, నాలుగు వారాల్లో కళాశాలలకు సమీప ప్రాంతాల్లో ఉన్న సర్కారీ పాఠశాలల్లో, గ్రామాల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు అడ్మిషన్ డ్రైవ్స్ నిర్వహించారు. 235 రోజులు పనిదినాలు.. 2025–26 విద్యా సంత్సరానికి సంబంధించి ఇంటర్ కోర్సులను అందిస్తున్న జూనియర్ కళాశాలలు 235 రోజులు పనిచేయనున్నాయి. ఏప్రిల్ 1న కాలేజీలు మొదలుకానుండగా, వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ ఒకటో తేదీగా ప్రకటించారు. మళ్లీ జూన్ 2వ తేదీన పూర్తిస్థాయిలో కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఆఖరి పనిదినంగా 2026 మార్చి 18ను నిర్ణయించారు. -
ఊరిలోన.. చైత్ర వీణ
● జిల్లావ్యాప్తంగా ఘనంగా ఉగాది వేడుకలు ● ఊరూరా పంచాంగ పఠనాలు విశ్వావసుకు స్వాగతం పలుకుతూ కోయిలమ్మలు కొత్త పాటలు కట్టాయి.. వేకువన కువకువలన్నీ ఆ పాటలతోనే గడిచాయి. ఊరూవాడా కోవెల వాకిటే కూర్చున్నాయి.. ఆదాయ వ్యయాలను, రాజపూజ్య అవమానాలను ఆరారా విన్నాయి. అన్నదాతలంతా నాగళ్లు చేతబట్టారు.. ఏరువాక సాగారో అంటూ హుషారైన పాటందుకున్నారు. కొత్త చిగుర్లతో ప్రకృతి చైత్రవీణ మోగించింది. తెలుగు వారి కొత్త ఏడాది నాడు ఆలయాల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో మెరిసిపోయారు. జనమంతా వసుదైక కుటుంబంలా కలిసిమెలిసి విశ్వావసుకు స్వాగతం పలికారు. అష్ట ఫలాలతో విజయదుర్గమ్మ -
● ఆదిత్యుని ఆదాయం 11.. వ్యయం 5
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయ అనివెట్టి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికలో ఉగాది ఆస్థానాన్ని ఆలయ ఈఓ వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముందుగా పంచాంగ పూజ, ఆలయ కొత్త రికార్డు పుస్తకాలు, అకౌంట్స్ పుస్తకాల పూజా కార్యక్రమాలను చేయించారు. అనంతరం ఆదిత్యుని రాశిఫలాలుగా విశాఖ నక్షత్రం, తులా రాశి ఫలాలను శంకరశర్మ వివరించారు. ఈమేరకు ఆదాయం 11, వ్యయం 5 గాను ఉందని, గత ఏడాది కంటే మిన్నగా ఆలయంలో ప్రగతి కనిపించే అవకాశాలున్నాయని వివరించారు. అనంతరం రాష్ట్ర దేవదాయ శాఖ ఆదేశాల ప్రకారం ఆలయంలో విశిష్ట సేవలకు గాను ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, నగేష్ రాజేశ్వర కాశ్యప శర్మ, వేదపండితులు ధర్బముళ్ల శ్రీనివాసశర్మ, రంప వికాష్ శర్మలకు ఉగాది పురస్కారాలను ఆలయ ఈఓ వై.భద్రా జీ అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయం పేరిట ముద్రించిన కొత్త పంచాంగం పుస్తకాలను భక్తులకు దాతలకు అందజేశారు. ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం నిర్వహించారు. -
దేవాలయ గోడలపై అన్యమత ప్రచారం
జలుమూరు: ఉగాది రోజున మండలంలోని యలమంచిలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలోని దాదాపు 300 ఏళ్ల పురాతన మల్లికార్జున స్వామి ఆలయం గోడలపై శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శిలువ గుర్తులు వేసి, ఆ మతానికి సంబంధించిన రాతలు రాశారు. ఆదివారం వేకువజామున అర్చకులు వసనాబి వెంకటరమణ ఆలయానికి వచ్చి గోడలపై రాతలు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఆలయంతో పాటు పక్క పంచాయతీలైన అక్కురాడ, కొండపోలవలసలోని ఆంజనేయ ఆలయాల్లో కూడా ఇలాంటి రాతలే రాశారు. దీంతో మూడు గ్రామస్తులతో పాటు విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, భజరంగదళ్, బీజేపి నాయకులు, ఆనంద ఆశ్రమ వ్యవస్థాపకుడు శ్రీనివాసనంద సరస్వతి తదితరులు యలమంచిలి శివాలయం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. అంతకుముందు అక్కురాడ, కొండపోలవలసలో రాతలను చెరిపేశారు. యలమంచిలిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, టెక్కలి, శ్రీకాకుళం, పలాస డీఎస్పీలు డీఎస్ఆర్ఎస్ఎన్ మూర్తి, వివేకానంద, అప్పారావు పలువురు సీఐ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాసిన వారిని రెండు రోజుల్లో పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. ఈ రాతలు రాసిన వారిని పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పా టు చేసినట్టు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు. దీనికి ముందు ఆయన మూడు ఆలయాలను పరిశీలించారు. అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ బి.అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. యలమంచిలి, అక్కురాడ, కొండపోలవలస గ్రామాల్లో ఆలయాల గోడలపై రాతలు ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు యలమంచిలిలో ఉద్రిక్త పరిస్థితులు -
● అందరికీ మంచి జరగాలి: కలెక్టర్
శ్రీకాకుళం కల్చరల్: జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆకాంక్షించారు. స్థానిక అంబేడ్కర్ ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశ్వావసు ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ ఉగాది పచ్చడిలోని అన్ని రుచులు ఉన్నట్లే మంచి, చెడులు ఉంటాయని వాటన్నింటిని గెలుచుకొని ముందుకు సాగాలని కోరారు. ముందుగా ధర్మపురి గౌరీశంకరశాస్త్రి పంచాంగ పఠనం చేశారు. అర్చకులకు సత్కారాలు దేవాదాయశాఖ ఎంపిక చేసిన ముగ్గురు అర్చకులకు ఉగాది పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా గుడివీధిలోని ఉమారుద్రకోటేశ్వర స్వామి ఆలయ అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తిని, కవిటి మండలం బెజ్జిపుట్టుగ శ్రీచక్రపెరుమాళ్లు అర్చకులు బాలక సత్యనారాయణ, కంచిలి మండలం కొల్లూరు శ్రీజగన్నాథ స్వామి ఆలయ అర్చకులు పద్మనాభ పాడిలను సత్కరించి వారికి నగదు పారితోషికాలను అందించారు. అలాగే పంచాంగకర్త గౌరీశంకరశాస్త్రిని కూడా సత్కరించారు. ఆకట్టుకున్న కవి సమ్మేళనం ఈ సందర్భంగా గాయత్రీ కళాశాల ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కవులు కె.వి.రాజారావు, బొంతు సూర్యనారాయణ, పొట్నూరు సుబ్రహ్మణ్యం, ఈ వేమన, ఉపకలెక్టర్ సవరమ్మ, శ్రీనివాసరావు, ఆరవెల్లి అనంతరామం, దామోదరాచారి, రమణమూర్తి, నాగేశ్వరరావు, భోగిల ఉమామహేశ్వరరావు, పూడి జనార్దనరావులు కవి సమ్మేళనంలో పాల్గొని ఉగాది కవితలను వినిపించారు. అనంతరం వారిని సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఉపకలెక్టర్ లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు. -
వలంటీర్లను నమ్మించి మోసం చేశారు
నరసన్నపేట: ఎన్నికల ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి మరింతగా గౌరవ వేతనం పెంచుతామని కూటమి నాయకులు, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు గుప్పించారని అధికారం చేతికొచ్చాక వలంటీర్లను తొలగించి వారికి తీరని అన్యాయం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూ టీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉగాది సందర్భంగా కార్యకర్తలు, నాయకులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూప ర్ సిక్స్ అమలు చేయకపోగా వలంటీర్లనూ నట్టేట ముంచారన్నారు. రాజకీయ అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి ఇలా హామీలు బుట్ట దాఖలు చేయడంలో ప్రపంచ రికార్డు సాధిస్తారన్నారు. ఉగాది రోజున గత ఐదేళ్లూ బంగారం షాపులు కళకళలాడాయని ఇప్పుడు వెలవెలబోయాయన్నారు. వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకూ మేలు జరిగిందని, ఇప్పుడు కేవలం కూటమి నాయకులకే మేలు జరుగుతుందన్నారు. ధర్మాన కృష్ణదాస్ను ఎంపీపీ ఆరంగి మురళి, నరసన్నపేట సర్పంచ్ బూరల్లి శంకర్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు కేసీహెచ్బీ గుప్త, రాజాపు అప్ప న్న, సురంగి నర్శింగరావు, కనపల శేఖర్, బొబ్బాది ఈశ్వరరావు, బుద్దల రాజశేఖర్ తదితర నాయకులు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వణికించిన ఇసుక లారీ ఆమదాలవలస రూరల్: రైల్వే సిబ్బందికి ఓ ఇసుక లారీ భయం పుట్టించింది. ఆమదాలవలస మండలం ముద్దాడపేట ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ ఆదివారం దూసి రైల్వేగేటు వద్ద రెండు ట్రాక్ల నడుమ మొరాయించటంతో గేట్మెన్లు గేటు వేయలేక, తీయలేక నానా ఇబ్బందులు పడ్డారు. బండి సరిగ్గా రైల్వే ట్రాక్లు దాటాక గేటు ముందు ఆగిపోయింది. దీంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది కలగలేదు. కానీ చాలాసేపటి వరకు లారీని తీయడం కుదరకపోవడంతో రైల్వే సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఆ దారిలో వెళ్లిన వాహనాలకు కూడా ఇక్కట్లు తప్పలేదు. నిబంధనలకు మించి ఇసుక లోడింగ్ చేయటం వల్ల లారీ మొరాయించిందని పలువురు అంటున్నారు. విషయం తెలుసుకున్న ఆమదాలవలస పోలీసులు అక్కడకు చేరుకొని వేరే వాహనాలతో లారీని రైల్వేట్రాక్ నుంచి బయటకు తరలించారు. హోరా హోరీగా జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు పలాస: పలాస మండలం చినగురుదాసుపురం గ్రామంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు హోరాహరీగా జరుగుతున్నాయి. ఉగాది సందర్భంగా ఆదివారం నాడు చినగురుదాసుపురం ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆహ్వానిత పోటీలు జరిగాయి. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి మొత్తం 21జట్లు పాల్గొన్నాయి. ఇందులో ఇప్పటికే జి.ఎం.పల్లి, సింగుపురం, శ్రీకాకుళం కె.ఆర్ స్టేడియం జట్లు సెమీ ఫైనల్కు చేరుకున్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.శ్రీనివాసరావు, ఎన్.రమేష్, ఎ.ఢిల్లీరావు, ఎన్.రమేష్లు రిపరీలుగా వ్యవహరిస్తున్నారు. నేడు రంజాన్ ప్రార్థనలు శ్రీకాకుళం కల్చరల్: రంజాన్ సందర్భంగా ఇమామ్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9.30కు ప్రార్థనలు జరుగుతాయని అందరు ముస్లింలు పాల్గొనాలని జామియా మసీదు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు మహిబుల్లాఖాన్, అక్బర్ భాషాలు తెలిపారు. అందరూ మసీదుకు 9గంటలకు హాజరుకావాలని కోరారు. అందుకోసం తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. -
సాహిత్యానికి సేవ..!
ఆచార్య దేవ.. పొందూరు: ఆయన ఆంగ్ల భాష ఉపాధ్యాయుడు. కానీ తెలుగు భాషంటే ఆరోప్రాణం. ఎంఏ(తెలుగు), ఎంఏ(హిస్టరీ), ఎంఏ(రాజనీతి శాస్త్రం), ఎంఏ(ఇంగ్లిష్) పూర్తిచేసి, తెలుగు సాహిత్య రంగానికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఇప్పటివరకు 400 కవితలు, 92 వ్యాసాలు, 53 కథలు రచించారు. అలాగే యువతను చైతన్యం చేయడంతో పాటు ఉద్యోగాలకు సిద్ధమయ్యేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ద్వారా జిల్లాలో సుమారు 42 గ్రామాల్లో గ్రంథాలయాలను ప్రారంభించారు. అతనే పొందూరు మండలంలోని వావిలపల్లిపేటకు చెందిన వావిలపల్లి రాజారావు. ప్రస్తుతం జి.సిగడాం మండలంలోని ఆనందపురం అగ్రహారం ఎంపీయూపీ పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఈయన సేవలకు మెచ్చిన రాష్ట ప్రభుత్వం ఈ ఏడాది ఉగాది పురస్కారం అందజేసింది. ఎనలేని కృషి వావిలపల్లి రాజారావు ఎందరో మహానుభావులు (వ్యాస సంపుటి), మహోన్నత శిఖరాలు (శతాధిక కవితా మాలిక), నా దేశం (శతాదిక కవితా మాలిక), వికసిత విశ్వంబర (శతాదిక కవితా మాలిక) తదితర పుస్తకాలు రాశారు. అలాగే బాలభారతం, తెలుగు వెలుగు, తెలుగు విద్యార్థి, సాహితీ కిరణం, భక్తి సమాచారం, విశాఖ సంస్కృతి మొదలైన మాస పత్రికల్లో ఆయన రాసిన అనేక కథలు, కవితలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి. భగవద్గీతలో అర్జున విషాదయోగాన్ని తెలుగులో విశ్లేషణాత్మకంగా రాశారు. శ్రీకాకుళం జిల్లా శాఖ శ్రీశ్రీ కళావేదిక ప్రధాన కార్యదర్శిగా, ప్రపంచ తెలుగు రచయితల సంఘం జీవితకాల సభ్యుడిగా, ఉత్తరాంధ్ర రచయితల వేదిక క్రియాశీల సభ్యుడిగా, జిల్లా తెలుగు రచయితల వేదిక క్రియాశీల సభ్యుడిగా, ఏపీ గ్రంథాలయ సంఘం శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాహితీ రంగానికి ఎనలేని సేవలందిస్తున్నారు. యువతను చైతన్యం చేసేలా... ప్రజలను, యువతను చైతన్యం చేసేందుకు, విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు స్థాపించారు. ప్రస్తుతం పోటీ ప్రపంచాన్ని యువత తట్టుకుని నిలబడేందుకు, ఉన్నతంగా స్థిరపడేందుకు గ్రంథాలయాలు దోహదం చేస్తాయన్న విశ్వాసంతో ముందుకు నడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంస్థ ద్వారా జిల్లాలోని పొందూరు, రణస్థలం తదితర మండలాల్లో సుమారు 42 గ్రంథాలయాలు స్థాపించారు. గ్రంథాలయాలను యువత వినియోగించుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నారు. అందుకున్న పురస్కారాలు విద్యా రంగానికి రాజారావు చేసిన సేవలకు గానూ 2017లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2018లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. చేయూత సామాజిక సేవా సంస్థ 2024లో ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డును అందించింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్ుడ్స గోల్డ్ మెడల్ పురస్కారం 2024లో అందుకున్నారు. అనంతపురంలో జాతీయ తెలుగు రక్షణ వేదిక నిర్వహించిన ప్రపంచ రికార్డు కవి సమ్మేళనంలో పురస్కారం అందుకున్నారు. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభ, 5వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో పాల్గొన్నారు. 5వ, 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పురస్కారాలు, ప్రశంసాపత్రాలు పొందారు. అవనిగడ్డలో నిర్వహించిన సహస్ర కవి సమ్మేళనంలో తెలుగు లోగిలి పురస్కారం(2018), ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, ఉత్తరాంధ్ర తెలుగు రచయితల వేదిక సంయుక్త సదస్సు(విశాఖపట్నం–2018)లో పురస్కారాన్ని, 2022లో తెలుగు భాషా పరిరక్షణ సమితి(2022) పురస్కారం అందుకున్నారు. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులమీదుగా ఉగాది పురస్కారాన్ని ఆదివారం అందుకున్నారు. తెలుగు వెలుగులకు కృషి చేస్తున్న రాజారావు ఈ ఏడాది ఉగాది పురస్కారానికి ఎంపిక అనేక రచనలతో తెలుగు భాషాభివృద్ధికి కృషి -
పారదర్శకంగా విచారణ చేపట్టాలి
శ్రీకాకుళం కల్చరల్: డాక్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్, జిల్లా క్రైస్తవ సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. ఈ మేరకు నగరంలోని బాలికల హైస్కూల్ ఎదురుగా ఉన్న క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ నుంచి కొన్నావీధిలో ఉన్న కీస్టోన్ చర్చి వరకు శాంతియుత ర్యాలీ ఆదివారం చేపట్టారు. అనంతరం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రవీణ్ ప్రగడాలది ప్రమాదం కాదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ చైర్మన్ డీఎస్వీఎస్ కుమార్, ఎస్ఎంయూపీఎఫ్ ప్రెసిడెంట్ రెవ.జాన్ జీవన్, సెక్రటరీ సీహెచ్ ప్రేమన్న, బిషప్ సామ్యూల్ మొజెస్, రెవ.పి.ఎస్.స్వామి, బిషప్ బి.బర్నబస్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పదంగా ఉద్యోగి మృతి
రణస్థలం: మండలంలోని బంటుపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న యూనైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగి పిన్నింటి అప్పలసూరి(47) అనుమానాస్పదంగా మృతి చెందాడు. జేఆర్పురం పోలీసులు, పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం జనరల్ డ్యూటీకి వెళ్లిన మృతుడు అప్పలసూరి సాయంత్రం 4.30 గంటల సమయంలో పరిశ్రమలోని వాష్ రూమ్లో ప్లాస్టిక్ పైపునకు ప్యాకింగ్ రోప్తో ఉరి వేసుకుని చనిపోయి ఉన్నాడు. కొంత సమయం తర్వాత గుర్తించిన తోటి ఉద్యోగులు జేఆర్పురం పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈయన పరిశ్రమలోని కేస్ ఫ్యాకర్ మిషన్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. బంటుపల్లి పంచాయతీ ప్రజలకు ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఉరివేసుకుని చనిపోయి ఉండడంపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య అమ్ములు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు స్వగ్రామం నరసన్నపేట దగ్గర లుకలాం కాగా, గత 30 ఏళ్లుగా ఉద్యోగరీత్యా జేఆర్పురం పంచాయతీలోని జీఎంఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా మృతదేహాన్ని తీసుకెళ్లకుండా, కంపెనీ వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. -
కొబ్బరి రైతు కుదేలు..!
● వర్షాభావం, తెగుళ్ల తాకిడితో ఇబ్బందులు ● పడిపోయిన దిగుబడులు ● వలసబాట పడుతున్న రైతులు, కూలీలు అవగాహన అవసరం ఉద్దానం ప్రాంతంలో కొబ్బరికి ఆశించిన తెగుళ్ల ను నివారించడానికి రైతు లంతా ఉద్యానశాఖ సల హాలు తీసుకొని మూకుమ్మడిగా నివారణ చర్యలు చేపట్టాలి. పెద్దపేట ఉద్యాన పరిశోధన కేంద్రంలో బదనకలు అందుబాటులో ఉన్నాయి. రైతులు వీటిని మూకుమ్మడిగా వినియోగించి నివారణ చర్యలు చేపట్టాలి. రసాయన ఎరువుల జోలికి వెళ్లకూడదు. వేపనూనె పిచికారీ చేయడం వంటి చర్యలతో కొంతమేర ఉపశమనం కలుగుతుంది. – పి.మాధవీలత, ఉద్యానశాఖ అధికారి, కవిటి -
ఉగాది పురస్కారాలు ..
శ్రీకాకుళం కల్చరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉగాది పురస్కారోత్సవాల్లో భాగంగా 2025 సంవత్సరానికి గాను, శ్రీకూర్మం గ్రామానికి చెందిన శ్రీభాష్యం సుందరరామ కౌండిన్య సీఎం నారా చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డు ఆదివారం అందుకున్నారు. కూచిపూడి నాట్యంలో విశేష కృషి చేసినందుకు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. గత 25 ఏళ్లుగా కౌండిన్య రఘుపాత్రుని శ్రీకాంత్ వద్ద కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందుతున్నారు. డా.బీఎస్వీ ప్రసాద్కు పురస్కారం కవిటి: రాష్ట్రస్థాయిలో ఈ ఏడాది ప్రకటించిన ఉగాది పురస్కారాలకు గానూ కవిటి మండలం కుసుంపురం గ్రామానికి చెందిన డాక్టర్ బొంతలకోటి సత్యవరప్రసాద్కు కళా విభాగంలో అవార్డు వరించింది. ఆదివారం విజయవాడలో జరిగిన వేడుకల్లో సీఎం చేతులమీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం సత్యవరప్రసాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. -
పచ్చ తమ్ముడి బరితెగింపు
● అధికారుల మాట బేఖాతర్ ● రచ్చబండను నేలమట్టం చేసిన వైనంఇచ్ఛాపురం రూరల్: అధికారంలో ఉన్నామన్న అహంకారంతో టీడీపీ నాయకుడు బరితెగించాడు. తన స్థలానికి అడ్డుగా ఉన్నటువంటి 30 ఏళ్ల నాటి రచ్చబండను నేలమట్టం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కె.శాసనాం గ్రామంలో 30 ఏళ్ల క్రితం స్థానిక గ్రామ పెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రచ్చబండను నిర్మించాడు. అందులో రావి చెట్టును నాటి త్రినాథస్వాముల వారి విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు తన సొంత భూమికి రచ్చబండ అడ్డుగా ఉందంటూ, ఈనెల 19న రచ్చబండను పెకిలించేందుకు ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు పోలీసు, రెవెన్యూశాఖాధికారులకు ఫిర్యాదులు చేశారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు ఈనెల 21, 23 తేదీల్లో మండల, గ్రామ సర్వేయర్లు, వీఆర్వో సంఘటనా స్థలానికి వెళ్లి కొలతలు తీశారు. రచ్చబండ ప్రభుత్వ స్థలంలో ఉందని, రచ్చబండకు పది అడుగుల దూరంలో ఫకీరు స్థలం ఉందని తేల్చి చెప్పారు. రచ్చబండపై ఫకీరుకు ఎటువంటి అధికారం లేదని, తొలగించేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తమ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో అధికారుల మాటలు బేఖాతరు చేస్తూ, ఇసురు ఫకీరు తన అనుచరులతో ఆదివారం రచ్చబండను కూల్చడంతో పాటు 30 ఏళ్లనాటి చెట్టును తొలగించేశాడు. దీంతో సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
మిలటరీ క్యాంటీన్లో సెల్ఫ్ సర్వీసు
శ్రీకాకుళం కల్చరల్: స్థానిక మిలటరీ క్యాంటీన్లో లిక్కర్ సెల్ఫ్ సర్వీసును జిల్లా ఎక్స్ సర్వీసు మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు ఆదివారం ప్రారంభించారు. మాజీ సైనికులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని జిల్లా మాజీ సైనికుల ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరావు సూచించారు. క్యాంటిన్ మేనేజర్ సుబేదార్ మేజర్ పి.గోవిందరావు అందుబాటులోకి తీసుకు వచ్చినందుకు మాజీ సైనికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో హానరరీ ప్రెసిడెంట్ బి.సంజీవరావు, వైస్ ప్రెసిడెంట్ వి.సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు, కోశాధికారి ఎం.సింహాచలం, స్పోక్స్ పర్సన్ కె.కన్నారావు, చింతు రామారావు, ఏవీ జగన్మోహనరావు, వీరనాటి పి.భారతమ్మ, ఎ.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తప్పిన పెను ప్రమాదం వజ్రపుకొత్తూరు రూరల్: మండలంలోని బాతుపురం–చినవంక ఆర్అండ్బీ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఒక భారీ మర్రిచెట్టు కొమ్మ రోడ్డుపై విరిగిపడింది. అయితే ఆ సమయంలో వాహన రాకపోకలు, ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ రోడ్డులో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. చెట్టుకొమ్మ రోడ్డుకి అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్థానికులంతా కలిసి చెట్టుకొమ్మను తొలగించారు. -
అంగన్వాడీల వేతనాల్లో కోత తగదు
శ్రీకాకుళం అర్బన్: ఫేస్యాప్ పేరుతో అంగన్వాడీల వేతనాలలో కోత విధించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల తల్లులకు ప్రతినెలా ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అధికారులు ఒత్తిడి, వేతనాలలో కోత మానుకోవాలన్నారు. ఇప్పటికే యాప్ మొరాయిస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఎన్నో అవస్థలు పడి పని పూర్తి చేస్తుంటే మరింతగా పనిభారం పెంచడం తగదన్నారు. వేతనాల కోత, మెమోల జారీతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, వి.హేమలత, జె.కాంచన, డి.మోహిని, పి.బాలేశ్వరి, ఎల్.దుర్గ పాల్గొన్నారు. -
గంజాయితో వ్యక్తి అరెస్టు
మెళియాపుట్టి: మండలంలోని గొప్పిలి గ్రామానికి చెందిన బి.యువరాజు అనే వ్యక్తి కిలో 250 గ్రాముల గంజాయితో శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి పాతపట్నం సీఐ రామారావు శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. యువరాజు కొంతకాలంగా త్రినాథ మేళాల కోసం చిన్నమొత్తంలో గంజాయి విక్రయించేవాడు. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రం గండాహతి నుంచి గంజాయి తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచాడు. గురువారం సాయంత్రం ఒడిశాలోని రంప గ్రామంలో పెద్ద మొత్తంలో గంజాయి విక్రయించేందుకు వెళ్తుండగా ఎస్సై రమేష్బాబు సిబ్బందితో వెళ్లి అరెస్టు చేశారు. -
21
యూడీఐడీ.. సేవలు రెడీ ● దివ్యాంగులకు ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్ ● కొత్తపోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్రం ● ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా సులువుగా సేవలు పొందే అవకాశం ● ప్రయాస లేకుండా రైల్వేపాస్ పొందే సదుపాయం ●దివ్యాంగులకు వరం.. దివ్యాంగులకు ఆధార్ కార్డు తరహాలో కేంద్ర ప్రభుత్వం యూడీఐడీని ప్రవేశపెట్టింది. పోర్టల్లో దరఖాస్తు చేసుకొని ఐడీ నంబర్ పొందవచ్చు. ప్రత్యేక కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలన్నా ఈ కార్డు తప్పనిసరి కానుంది. – కె.కవిత, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ, శ్రీకాకుళం నరసన్నపేట: దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, ఇతర ప్రయోజనాలు, సదరం శిబిరాల సమాచారం తదితర సేవలను సులభంగా పొందేందుకు యూనిక్ డిజేబిలిటీ ఐడెంటిటీ కార్డు(యూడీఐడీ) అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పోర్టల్ దివ్యాంగులకు వరంలా మారనుంది. ఈ పోర్టల్ ద్వారా పొందిన ఐడీ నంబర్ ఆధారంగా దివ్యాంగులు రైల్వేపాస్లను కూడా పొందవచ్చు. గతంలో సదరం సర్టిఫికెట్లు పొందాలంటే స్లాట్ బుకింగ్ కోసం మీ–సేవ కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇకపై యూడీఐడీ నంబర్ ద్వారా దివ్యాంగులు ఇంటి వద్ద నుంచే శ్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. యూడీఐడీ పొందాలంటే.. హెచ్టీటీపీ://ఎస్డబ్ల్యూఏవీఎల్ఏఎంబీఏఎన్సీఏఆర్డీ.జీఓవి.ఇన్ అనే వెబ్సైట్ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా దివ్యాంగులు నేరుగా ఫోన్, ఇంటర్నెట్ సెంటర్, మీ–సేవా కేంద్రాల నుంచే కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సులభతరంగా సేవలు.. ●కొత్తగా అందుబాటులోని తీసుకువచ్చిన యూడీఐడీ పోర్టల్ ద్వారా సేవలు సులభతరం కానున్నా యి. సదరం శిబిరాల కోసం మీ సేవతో పాటు యూడీఐడీ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యపరీక్షలకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారం దివ్యాంగుల ఫోన్ నంబర్కు సంక్షిప్త సమాచారం రూపంలో వస్తుంది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో తప్పులు, అక్షరదోషాలు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ●ఇప్పటి వరకూ ఐదు రకాల సేవల వైకల్యం ఉన్న వారికే ఈ–సేవ ద్వారా సదరం శిబిరాలకు దరఖా స్తు చేసుకొనే అవకాశం ఉండేది. ఇక యూడీఐడీ పోర్టల్లో 21 రకాల సేవల వైకల్యాలను చేర్చారు. తలసేమియా, ఆటిజం, యాసిడ్ బాధితులు, న్యూరో సంబంధిత బాధితులు కూడా సదరం శిబిరాల కోసం యూడీఐడీ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ●శిబిరంలో వైకల్య నిర్థారణ పూర్తయ్యాక స్మార్ట్కార్డును పోస్టల్ శాఖ ద్వారా ఇంటికే పంపిస్తారు. ఈ కార్డు పింఛన్తో పాటు రైల్వేపాస్లు, ఇతర సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా చెల్లుబాటు కానుంది. ●యూడీఐడీ కార్డులను ఆన్లైన్ నుంచే డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కేంద్రం కల్పించింది. ఇప్పటి వరకూ సదరం సర్టిఫికెట్ మన రాష్ట్రంలో మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. దరఖాస్తు ఇలా.. ఆన్లైన్లో స్వాలంబన్కార్డు.జీఓవీ.ఇన్ వెబ్సైట్ను సందర్శించాలి. అప్లయ్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ సంబంధించి కొన్ని సూచనలు ఉంటాయి. వాటిని పూర్తిగా చదివి అంగీకరిస్తూ సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది. అడిగిన సమాచారం నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. వైద్య పరీక్షలు అనంతరం వెబ్సైట్లో అర్జీల స్టేటస్ను నిత్యం పరిశీలించుకోవచ్చు. -
అంగన్వాడీల వేతనాల్లో కోత తగదు
శ్రీకాకుళం అర్బన్: ఫేస్యాప్ పేరుతో అంగన్వాడీల వేతనాలలో కోత విధించవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.కళ్యాణి, డి.సుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకాకుళంలో ఐసీడీఎస్ పీడీ బి.శాంతిశ్రీకి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లల తల్లులకు ప్రతినెలా ఫేస్ ఎన్రోల్మెంట్ చేయాలన్న ఆదేశాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అధికారులు ఒత్తిడి, వేతనాలలో కోత మానుకోవాలన్నారు. ఇప్పటికే యాప్ మొరాయిస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. అయినప్పటికీ ఎన్నో అవస్థలు పడి పని పూర్తి చేస్తుంటే మరింతగా పనిభారం పెంచడం తగదన్నారు. వేతనాల కోత, మెమోల జారీతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు ఎన్.హైమావతి, వి.హేమలత, జె.కాంచన, డి.మోహిని, పి.బాలేశ్వరి, ఎల్.దుర్గ పాల్గొన్నారు. -
7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి ప్రారంభించనున్నట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్చార్జి డీన్ డాక్టర్ పి.పద్మారావు తెలిపారు. పరీక్షల నిర్వహణ కేంద్రంలో శుక్రవారం వివరాలు వెల్లడించారు. ఏప్రిల్ 21 వరకు పరీక్షలు జరుగుతాయని 53 కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఫిబ్రవరిలో జరగాల్సిన డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ స్పెషల్ డ్రైవ్ పరీక్షలు మే చివరి వారంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం డిగ్రీ రెండో సెమిస్టర్ ఫీజులు స్వీకరిస్తున్నామని, ఏప్రిల్ 5లోపు అదనపు రుసం లేకుండా చెల్లించవచ్చని పేర్కొన్నారు. యువకుడు అరెస్టు సోంపేట: మండలంలోని బేసిరామచంద్రాపురంలో మానసిక దివ్యాంగురాలిపై లైంగికదాడికి ప్రయత్నించిన యువకుడిని అరెస్టు చేసినట్లు బారువ ఎస్ఐ హరిబాబునాయుడు శుక్రవారం తెలిపారు. దివ్యాంగురాలి తండ్రి ఫిర్యాదు మేరకు శృంగారపు ప్రసాద్ ఆచారిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 30, 31న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు యథాతథం శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఈ నెల 30, 31 సెలవు దినాలైనప్పటికీ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని డీఐజీ నాగలక్ష్మి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. కొనుగోలు, అమ్మకందారులు రిజిస్ట్రేషన్లు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. ఫిషరీస్ డీడీకి పదోన్నతి అరసవల్లి: జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.వి.శ్రీనివాసరావుకు పదోన్నతి లభించింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్గా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడేళ్లుగా శ్రీకాకుళం జిల్లాలోనే వివిధ హోదాల్లో శ్రీనివాసరావు విధులు నిర్వర్తించారు. తాజా పదోన్నతుల్లో ఈయనకు క్యాడర్ పెరగడంతో పాటు బదిలీ చేశారు. పలాసలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సత్యనారాయణకు జిల్లా ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. సమగ్ర విచారణకు డిమాండ్ శ్రీకాకుళం పాతబస్టాండ్: పాస్టర్ ప్రవీణ్కుమార్ పగడాల మృతిపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్ జిల్లా కమిటీ అధ్యక్షుడు డాక్టర్ బిషప్ బర్నబాస్ బింకం, ప్రధాన కార్యదర్శి బ్రదర్ ఒంపూరు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 24న తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు టోల్గేట్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ మృతిచెందారని, దీనిపై పలు అనుమానాలు ఉన్నందున విచారణ జరిపి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని, క్రైస్తవుల రక్షణకు భద్రత కల్పించాలని కోరారు. జేసీని కలిసిన వారిలో సీఎస్ఎస్ నాయకులు, పాస్టర్లు ఎం.షడ్రక్బాబు, జి.శామ్యూల్ అరుణ్కుమార్, టి.పేతురు, ఇ.శామ్యూల్ జాన్, ప్రత్తిపాటి ప్రసాద్, ఎ.ఎ.పాల్, అల్లు ఇమ్మానుయేల్, ఆశిర్కుమార్, అహరోన్ తదితరులు పాల్గొన్నారు. జేసీకి వినతిపత్రం అందిస్తున్న సీసీఎస్ ప్రతినిధులు -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వద్దు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ తగదని, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీఓ 77 రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందల నాసర్జి, సహాయ కార్యదర్శి నాగభూషణం డిమాండ్ చేశారు. శ్రీకాకుళం క్రాంతిభవన్లో శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ను రద్దు చేసి ఏ యూనివర్సిటీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఆ వర్సిటీయే నిర్వహించేలా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యవిద్యను పేదలకు దూరం చేసేలా జీవో 107, 108లను రద్దు చేయాలని కోరారు. సంఘ జిల్లా కార్యదర్శి సీహెచ్ మాట్లాడుతూ వర్సిటీల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘ జిల్లా సహాయ కార్యదర్శి జి.హరిప్రసాద్, నాయకులు కూర్మా, ఈశ్వరరావు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. -
తరలిపోతున్న పశుగ్రాసం
గార: ఖరీఫ్లో పండిన వరి గడ్డి దూర ప్రాంతాలకు తరలిపోతోంది. విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వర్తకులు వచ్చి ఎండు గడ్డిని కొనుగోలు చేసి ట్రాక్టర్ల, లారీల ద్వారా తరలించుకుపోతున్నారు. ఈ ఏడాది ప్రైవేటు డెయిరీలు పాల సేకరణ ధర తగ్గించడంతో పశువుల పెంపకం కూడా తగ్గుముఖం పడుతోంది. వచ్చే ఖరీఫ్కు ఉగాది తర్వాత భూములు సిద్ధం చేసుకోవాలని రైతాంగం సమాయత్తవుతున్న పరిస్థితుల్లో పొలాల్లో ఉన్న వరి గడ్డిని అమ్మివేస్తున్నారు. దీంతో స్థానిక పశువుల పెంపకందారుకు ఇబ్బందులు తప్పవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబువన్నీ బూటకపు హామీలే
● వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి పాతపట్నం: ఎన్నికల్లో చంద్రబాబు బూటకపు హామీలతో రాష్ట్ర ప్రజలు దారుణంగా మోసపోయారని వైఎస్సార్ సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా రెడ్డి శాంతిని పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలన ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసుకునేలా ఉండేదన్నారు. చంద్రబాబు మాత్రం హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళ లు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పాతపట్నం, ఎల్.ఎన్.పేట ఎంపీపీలు దొర సావిత్రమ్మ, రెడ్డి జ్యోతి లక్ష్మి, బైపోతు ఉదయ్కుమార్, పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్, పోలా కి జయమునిరావు, మీసాల వెంకటరామకృష్ణ, గండివలస ఆనంద్, పెనుమజ్జి విష్ణుమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, అంధవరపు సురేష్, కొల్ల కృష్ణ, ఆర్టీఐ వింగ్ ఎనుగుతల సూర్యం, ఎం.తాతయ్య, శిమ్మ శాంబ, లోలుగు లక్ష్మణ, యెరుకొల వెంకటరమణ, బి.నారాయణమూర్తి, మాదవ పుల్లయ్య, ఎం.గణపతిరావు, సవర సుబాష్, అలికాన మాదవరావు, గంగధర్, సరస్వతి, రాజ్యలక్ష్మి, జానకమ్మ, ఎం.రామారావు, తులుగు ప్రవీణ్, నర్సింహమూర్తి పాల్గొన్నారు. -
పోక్సో చట్టంతో చిన్నారులకు రక్షణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారుల రక్షణకు పోక్సో చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని ఫస్ట్ అడిషనల్ జడ్జి కె.ఎం.జామరుద్ బేగం, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ తలే లక్ష్మణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ కమిటీ, జువైనల్ జస్టిస్ బోర్డు ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం ప్రాముఖ్యతను వివరించారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చట్టం ప్రకారం పిల్లలుగా పరిగణించబడతారని, బాధితులకు న్యాయ సహాయం అందించడం, వారి గుర్తింపును రహస్యంగా ఉంచడం, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం చట్టం ముఖ్య ఉద్దేశమని వివరించారు. తీవ్రమైన లైంగిక వేధింపుల కేసుల్లో మరణశిక్ష సైతం విధించే అవకాశం ఉందని చెప్పారు. పిల్లలకు మంచి చెడులను వివరించడం, వారికి అవగాహన కల్పించడం సమాజం బాధ్యతని పేర్కొన్నారు. -
సర్కారు వారి పాట.. సిండికేటుదే మాట!
టెక్కలి: టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో వివిధ రకాల ఆశీలు హక్కుల కోసం శుక్రవారం నిర్వహించిన ఆశీల వేలం పాట సిండికేట్గా మారింది. అధికార పార్టీకు చెందిన కొందరు కార్యకర్తల కన్నుసన్నల్లో వేలంపాటదారులు సిండికేట్గా మారడంతో వేలం నామమాత్రంగా సాగింది. పంచాయతీ ఆశీల హక్కు కోసం ఆరంభంలో సర్కారు వారి పాటను రూ.13.92 లక్షలుగా ప్రకటించారు. అంతా సిండికేట్గా ఏర్పడి పాటను తగ్గించాలని అధికారులపై ఒత్తిడి చేశారు. దీంతో రూ. 12.70 లక్షలకు కుదించేశారు. చివరగా అధికార పార్టీ కార్యకర్తల డైరెక్షన్లో పట్టణానికి చెందిన పుచ్చకాయల రామిరెడ్డి అనే వ్యక్తి రూ.14 లక్షలకు రోజు వారీ మార్కెట్ ఆశీల వసూళ్ల హక్కును కై వసం చేసుకున్నారు. ఇదే వ్యక్తి రూ.77 వేలకు వారపు సంత, రూ.51 వేలకు బస్ అండ్ కారు స్టాండ్లో ఆశీల హక్కు దక్కించుకున్నారు. కమేళా హక్కును రూ.1,60,200కు జోగి ధర్మారావు కై వసం చేసుకున్నారు. కాగా, 2023–24 సంవత్సరానికి సంబంధించి ఆశీల హక్కును దక్కించుకున్న జీరు వెంకటరెడ్డి పంచాయతీకి సుమారు రూ.7 లక్షల బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ జి.సుజాత, ఈఓపీఆర్డీ సింహాద్రి, ఇన్చార్జి ఈఓ శశిధర్ పాల్గొన్నారు. -
●కేజీబీవీని సందర్శించిన ఎస్పీ
కాశీబుగ్గ, మందస: మందస మండలం, గుడారి రాజమణిపురం సమీపంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాన్ని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి శుక్రవారం ఉదయం సందర్శించారు. విద్యా ర్థులు అస్వస్థతకు గురి కావడంతో వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం విద్యాల యంలోని వంటగది, తరగతి గదులు, పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని వసతిగృహ అధికారిని అదేశించారు. విద్యార్థులతో కూడా మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు వాటి పరిస్థితిని పరిశీలించి విద్యాలయం ఆవరణలో అదనంగా మరి కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, భద్రత, రక్షణ పరంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పలు ముఖ్యమైన అంశాలపై మందస ఎస్ఐకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్శనలో ఇచ్ఛాపురం సీఐ చిన్నంనాయడు, కాశీబుగ్గ రూరల్ సీఐ తిరుపతిరావు, స్థానిక ఎస్ఐ కృష్ణ ప్రసాద్, విద్యాలయం అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
●భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం భద్రాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడ పనుందని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మలు తెలిపారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వారు మాట్లాడుతూ ఏప్రిల్ 5వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో గల పలాస, టెక్కలి–శ్రీకాకుళం బస్ స్టేషన్ కాంప్లెక్స్ల నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్న ట్లు తెలిపారు. ఈ బస్సులు ఏప్రిల్ 5వ తేదీ సా యంత్రం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటాయన్నారు. తిరిగి 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయల్దేరి మరుసటి రోజు ఉదయానికి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుకుంటాయని తెలిపారు. ఈ బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థంలో రాములవారి కల్యాణం చూసేందుకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9959225608, 9959225609, 9959225610, 9959225611, 08942 223188 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
ఏప్రిల్ 1కి సోషల్ స్టడీస్ పరీక్ష వాయిదా
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఈనెల 31వ తేదీన జరగాల్సిన సాంఘికశాస్త్రం (సోషల్ స్టడీస్) పరీక్షను ఏప్రిల్ ఒకటో తేదీకి ప్రభుత్వం వాయిదా వేసింది. సో మవారం రంజాన్ పండగ కావడం, ప్రభుత్వ సెలవు దినంగా భావిస్తుండటంతో ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పరీక్ష వాయిదా పడిన విషయాన్ని విద్యార్థులకు, తల్లిదండ్రులకు తెలియజేసేలా హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య విజ్ఞప్తి చేశారు. ఉగాది, శ్రీరామనవమిలకు ఆప్కో వస్త్రాలపై భారీగా డిస్కౌంట్లు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగలైన ఉగాది, శ్రీరామనవమి సందర్భంగా ఆప్కో వస్త్రాలపై 35 నుంచి 50శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ అధికారి అనుపమ దాస్ తెలిపారు. ఈ మేరకు శుక్ర వారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేటీఎం వంటి ఆన్లైన్ స్టోర్స్లో కూడా ఆప్కో వస్త్రాలు లభిస్తాయని తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆప్కోహ్యాండ్లూమ్.కామ్ వెబ్సైట్లోనూ కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉగాది వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీ విశ్వావసునామ ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు కోరారు. ఉగాది వేడుకల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించా రు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచనలతో ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు వారి సంప్రదాయం ఉట్టిపడే విధంగా మామిడాకుల తోరణాలు, అరటి చెట్లతో అలంకరణలు చేయాలని సూచించా రు. ఉగాది పంచాంగ శ్రవణం, వేదాశీర్వచనం ఏర్పాట్లను దేవదాయశాఖ నిర్వహించాలని ఆదేశించారు. పోలీసు శాఖ శాంతిభద్రత బాధ్యతలు పరిశీలించాలని, ఉగాది పచ్చడి, పులిహోర, చక్రపొంగలి సీ్త్రశిశు సంక్షేమశాఖ, డీఎస్ఓ పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానశాఖకు వేదిక అలంకరణ బాధ్యతలను అప్పగించారు. అలాగే పలు ఏర్పాట్లను ఆయా శాఖలకు అప్పగించారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఉద్యాన అధికారి ప్రసాదరావు, డీఎస్ఓ సూర్యప్రకాష్, దేవాదాయ సహాయ కమిషనర్ ప్రసాద్ పట్నాయ క్, జిల్లా వ్యవసాయ అధికారి త్రినాథ్ స్వామి, అరసవిల్లి ఈఓ భద్రాజి, సమాచార పౌర సంబంధాల అధికారి కె.చెన్నకేశవరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, ఆయా శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
●ఆర్టీసీ సిబ్బందికి టీచర్ల సత్కారం
ఇచ్ఛాపురం రూరల్: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులను సకాలంలో పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లి, తీసుకురావడంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన ఆర్టీసీ ఉద్యోగుల్ని ఉపాధ్యాయులు సత్కరించారు. మండలం కొళిగాం ఉన్నత పాఠశాలకు చెందిన 102 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు మండపల్లి ఉన్నత పాఠశాలను పరీక్ష కేంద్రంగా విద్యాశాఖ కేటాయించింది. సుమారు పది కిలో మీటర్లు దూ రం కావడంతో ఆర్టీసీ బస్సును విద్యార్థులకు కేటాంచారు. ఆరు రోజుల పాటు విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సర్వీసు చేసిన పలాస ఆర్టీసీ డిపో డ్రైవర్ పి.పోలారావు, కండక్టర్లు కై లాష్,శ్రీనివాస్లను శుక్రవారం కొళిగాం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, పేరెంట్స్ కమిటీ ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నరేంద్రనాద్ పట్నాయక్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ మహంతీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘విద్యుత్ సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి’
అరసవల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ బిల్లుల బాదుడు దారుణంగా ఉందని, 2022 నుంచి 2024 వరకు చెల్లించిన విద్యుత్ బిల్లులపై అదనంగా సర్దుబాటు చార్జీలను రుద్దుతూ ప్రజలపై తీవ్ర భారాన్ని మోపారని, దీన్ని రద్దు చేయాలని సీపీఎం శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం స్థానిక విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద సీపీఎం శ్రేణులంతా కలిసి ధర్నా నిర్వహించాయి. పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి.కృష్ణమూర్తిలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని చెప్పి.. ఇప్పుడు దారుణంగా పెంచుకుపోతున్నార ని విమర్శించారు. అదానీ కంపెనీ ఒప్పందం ప్రకా రం స్మార్ట్ మీటర్లను అమర్చుతున్నారని, ఒక్కో స్మార్ట్ మీటర్ నుంచి రూ.13 వేల వరకు ఆయా వినియోగదారుల నుంచే వసూలు చేస్తారని గుర్తుచేశా రు. దీనికి తోడు టైమ్ ఆఫ్ ది డే పేరుతో కొత్త విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీంతో కరెంట్ను అధికంగా వాడే సమయంలో యూని ట్కు అధిక రేటు వసూలు చేసేలా ఉంటుందన్నా రు. సెకీ ఒప్పందాలను, స్మార్ట్ మీటర్లు వ్యవస్థను రద్దు చేసి, అలాగే అదనపు విద్యుత్ భారాలను తగ్గించేలా ప్రభుత్వం నిర్ణయాలను ప్రకటించాలని లేదంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు కె.నాగమణి, కె.అమ్మన్నాయుడు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
10 మంది టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేత
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో సంచలనం సృష్టించిన కుప్పిలి మోడల్ స్కూల్ మాస్ కాపీయింగ్ ఘటనలో పది మందిపై సస్పెన్షన్లు ఎత్తివేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. మిగిలిన వారి సస్పెన్షన్లు తాత్కాలికంగా హోల్డ్లో ఉంచారు. వారిపై ఆధారాలు బలంగా ఉండటం, క్రిమినల్ కేసులు నమోదు కావడంతో కొద్దిరోజులు జాప్యం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారం రోజులుగా టీచర్ల సస్పెన్షన్లను రద్దుచేయాలని, వి ద్యార్థులకు న్యాయం చేయాలని, డీఈఓపై చర్యలు తీసుకోవాలని నినదిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక తరఫున పోరాటాలు జరిగాయి. ఏప్రిల్ 3 నుంచి జరిగే టెన్త్ స్పాట్ వాల్యుయేషన్ను కూడా బాయ్కాట్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ప్రభుత్వ పెద్దల వరకు ఈ పంచాయితీ చేరడంతో.. విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనలతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చొరవ తీసుకున్నారు. తనను కలిసిన ఉపాధ్యాయ జేఏసీ నాయకులతో మాట్లాడారు. ఆర్జేడీ బి.విజయభాస్కర్, డీఈఓ తిరుమల చైతన్యలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం మొదలుపెట్టారు. శుక్రవారం ఆర్జేడీ విజయబాబు జిల్లా డీఈఓ కార్యాలయానికి వచ్చి వాస్తవ ఘటనపై వివరాలు రాబట్టారు. ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ముఖ్య ప్రతినిధులతో మాట్లాడారు. సస్పెండైన 15 మందిలో ముగ్గురు హెచ్ఎంలు, ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్ల్లు ఎత్తివేస్తున్నట్టు సంబంధిత అధికారులు ఉత్తర్వులు వెలువరించారు. వారి నుంచి లిఖితపూర్వక వివరణ తీసుకుని విధుల్లోకి తీసుకుంటున్నట్టు మార్గదర్శకాలు జారీ చేశారు. కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటనలో ‘యూ టర్న్’ ముగ్గురు హెచ్ఎంలు, ఏడుగురు టీచర్లను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఉత్తర్వులు మరో ఐదుగురి సస్పెన్షన్లను తాత్కాలికంగా హోల్డ్లో ఉంచిన అధికారులు ఆర్జేడీతో చర్చలు విఫలం శ్రీకాకుళం న్యూకాలనీ: ‘కుప్పిలి పంచాయితీ’కి ఫుల్స్టాప్ పడుతుందని ఆశించిన ఉపాధ్యాయులకు నిరాశే ఎదురైంది. పాఠశాల విద్య ఆర్జేడీ బి.విజయభాస్కర్ పిలుపు మేరకు శుక్రవారం రాత్రి ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు డీఈఓ కార్యాలయంలో చర్చలకు హాజరు కాగా.. వీరి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో చర్చలు విఫలమయ్యాయి. మిగిలిన ఉపాధ్యాయులపై స స్పెన్షన్లు ఎత్తివేయాలని, డీఈఓను తొలగించాలని, కోర్టు కేసులు వెనక్కి తీసుకోవాలని, డీబారైన విద్యార్థులకు రీ ఎగ్జామ్నిర్వహించాలని కోరగా.. ఆర్జేడీ ఒప్పుకోలేదు. దీంతో శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించతలపెట్టిన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ముట్టడి యథాతథంగా జరుగుతుందని తెలిపారు. ‘డీఈఓపై చర్యలు చేపట్టండి’ కుప్పిలి కాపీయింగ్ ఉదంతంలో అన్యాయంగా సస్పెన్షన్కు గురైన ఉపాధ్యాయులకు, డీబారైన విద్యార్థులకు న్యాయం చేసి, డీఈఓపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ కార్యచరణ ఉద్యమ షెడ్యూల్లో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యేలకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ప్రతినిధులు వినతిపత్రాలను అందజేశారు. శ్రీకాకుళంలో ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తిలకు వినతిపత్రాలు అందజేశారు. ‘విద్యార్థులకు న్యాయం చేయాలి’ కుప్పిలిలో డీబార్కు గురైన విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం డీఈఓ కార్యాలయంలో సమీక్షా సమావేశానికి హాజరైన ఆర్జేడీ బి.విజయ్భాస్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
పేదల కడుపుపై
పేదోడి బియ్యంపై కనిపించని కత్తి వేలాడుతోంది. ఈకేవైసీ చేయించుకోవడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉండడం, లక్షన్నర మందికిపైగా ఈకేవైసీ ఇంకా పూర్తి కావాల్సి ఉండడంతో బియ్యంలో కోత తప్పదనే సంకేతాలు బలపడుతున్నాయి. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారు, చదువుల కోసం ఉన్న ఊరు విడిచి వెళ్లిన విద్యార్థుల ఇప్పటికప్పుడు సొంతూళ్లకు రాలేక, ఈకేవైసీ చేయించుకోలేక సతమతమవుతున్నారు. ఈ హడావుడి పనులన్నీ బియ్యంలో కోత పెట్టేందుకేనని సామాన్యులు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ● ఈకేవైసీకి మరో రెండు రోజులే గడువు ● 1,70,598 మందికి పూర్తికాని ఈకేవైసీ ● వలసదారులు, విద్యార్థులకు తప్పని ఇబ్బందులు ● కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రజలు శ్రీకాకుళం పాతబస్టాండ్: పింఛన్ లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. సంక్షేమ పథకాల పేర్లు కూడా జనం మర్చిపోయా రు. ఖాతాల్లో డబ్బు జమ కావడం అన్నది గతంలా మారిపోయింది. ఇప్పుడు పేదోడి బియ్యంపై సర్కారు కన్ను పడింది. ఈకేవైసీ పేరిట ప్రతి రేషన్ కార్డుపైనా ప్రభుత్వం కనిపించని కత్తి వేలాడదీసింది. జిల్లాలో మొత్తం ఆరు లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీటిలో 19,39,082 మంది సభ్యులు న్నారు. వీరిలో ఇప్పటి వరకు 17,68,484 మందికి ఈకేవైసీ పూర్తి చేశారు. ఇంకా 1,70,598 మందికి ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఈకేవైసీ పూర్తి కాకపోతే ఆ సభ్యుడికి ఏప్రిల్లో రేషన్ నిలిచిపోతుందని క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగు తోంది. బియ్యంలో కోత పెట్టేందుకే కూటమి ప్రభుత్వం ఈకేవైసీ ప్రక్రియను తెర పైకి తెచ్చిందని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబాన్నీ ఒక్కో యూనిట్గా పరిగణించి ఈకేవైసీ ప్రక్రియ జరుగుతోంది. ఐదేళ్లలోపు చిన్నారులకు ఈకేవైసీ అవసరం లేదు. మిగిలిన వారు రేషన్ డీలర్లు, వీఆర్ఓలు, ఎండీ యూ ఆపరేటర్ల వద్ద తక్షణమే ఈకేవైసీ చేయించుకోవాలని పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. పేదల పొట్ట కొడతారా.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఎన్నికల హామీలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలకు కత్తెర వేస్తోందని లబ్ధిదారులు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. జిల్లా నుంచి వలస వెళ్లిన వారి సంఖ్య చాలా పెద్దది. వీరంతా రేషన్ కార్డుల్లో సభ్యులే. రేషన్ కార్డు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి ఈకేవైసీ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ఇబ్బందిగా మారింది. మన జిల్లాలో ఎక్కువ మంది వలస కూలీలు ఉన్నారు. ఎక్కడెక్కడో ఉన్నవారంతా ఇప్పటికిప్పుడు సొంత గ్రామాలకు రావడం కాని పని. దీంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. అలాగే ఇది పరీక్షల సమయం. ఇంజినీరింగ్, ఇంటర్మీడియెట్, పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. వీరు వచ్చే నెలలో గానీ ఇంటికి చేరలేని పరిస్థితి. దీంతో వీరి బియ్యానికి కూడా కోత పడుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈకేవైసీకి మరింత గడు వు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు ఈకేవైసీ వెంటనే పూర్తి చేయాలంటూ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లపై అధికారులు తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి మండలం మొత్తం ఈకేవైసీ ఇంకా యూనిట్లు అయినవి ఉన్నవి వజ్రపుకొత్తూరు 71439 63922 7517 సంతబొమ్మాళి 66247 59336 6911 రణస్థలం 83512 74877 8635 ఇచ్ఛాపురం 86492 77845 8647 కొత్తూరు 64752 58430 6322 కంచిలి 62793 56688 6105 టెక్కలి 63662 57610 6052 కోటబొమ్మాళి 65339 59401 5938 బూర్జ 36144 32861 3283 లావేరు 60735 55261 5474 పొందూరు 61664 56145 5519 శ్రీకాకుళం 167636 152698 14938 హిరమండలం 34293 31247 3046 జి సిగడాం 49628 45223 4405 గార 73764 67289 6475 మందస 74858 68309 6549 పలాస 83402 76172 7230 పాతపట్నం 58860 53882 4978 నందిగాం 52071 47717 4354 కవిటి 72177 66272 5905 సోంపేట 71646 65889 5757 పొలాకి 59327 54564 4763 ఆమదాలవలస 68794 63297 5497 ఎచ్చెర్ల 78845 72629 6216 సరుబుజ్జిలి 25872 23836 2036 జలుమూరు 53532 49462 4070 నరసన్నపేట 65507 60620 4887 ఎల్ఎన్ పేట 30192 27962 2230 మెళియాపుట్టి 49771 46098 3673 సారవకోట 46128 42942 3186 మొత్తం 19,39,082 17,68,484 1,70,598 ● గడువు పెంచే అవకాశం ఉంది.. ముందుగా ఈ నెల 31వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేయాలని చెప్పాం. అయితే గడువు పెంచే అవకాశం ఉంది. జిల్లాలో వలసలు, ఇతర పరిస్థితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ గడువు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఈకేవైసీ వేయకపోయినా రేషన్ సరకులు నిలిపివేయం. ఈకేవైసీ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనా చెందనవసరం లేదు. – గుంట సూర్యప్రకాశరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి -
రామలింగస్వామికి ‘ముంగిట సన్మానం’
శ్రీకాకుళం కల్చరల్: నాటక రంగం కోసమే లోకనాథం రామలింగస్వామి తన జీవితం అంకితం చేశారని పలువురు వక్తలు కొనియాడారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో రామలింగస్వామి ఇంటికి వెళ్లి ‘ముంగిట సన్మానం’ చేశారు. ఈ సందర్భంగా శ్రీశయన కార్పొరేషన్ చైర్మన్ డి.పి.దేవ్ మాట్లాడుతూ శ్రీకాకుళం రంగస్థల కళాకారుల సమాఖ్య ప్రతి ఏడాది కళకారుడి ఇంటికే వచ్చి సన్మానం చేయడం గొప్ప విషయమన్నారు. కళాకారుల సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి పన్నాల నరసింహమూర్తి మాట్లాడుతూ 16ఏళ్లుగా ఎందరో కళాకారుల ఇళ్లకు వెళ్లి ముంగిట సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు, సమాఖ్య కార్యదర్శి బి.రామచంద్రదేవ్, బి.ఏ.మోహనరావు, కంచరాన అప్పారావు, పైడి సత్యవతి, బీఎంఎస్ పట్నాయక్, శివప్రసాద్, పొట్నూరు వెంకటరావు, నక్క శంకరరావు, బెహరా నాగేశ్వరరావు, కేశిరెడ్డి రాజేశ్వరి, జగన్నాథనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల లే ఆఫ్ ప్రతిపాదన రద్దు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): శ్యామ్క్రగ్ పిస్టన్ కార్మికుల లేఆఫ్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని కార్మిక, ఉద్యోగ, రైతు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి కల్పించాలని కోరుతూ మార్చి 29న కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రణస్థలం మండలంలో గల శ్యాంక్రగ్ పిస్టన్స్(రింగ్స్) ప్లాంట్–2 పరిశ్రమలో 200 మంది కార్మికులను లే ఆఫ్ చేయకుండా యాజమాన్యాన్ని ఆదేశించాలని, బలవంతపు రిటైర్మెంట్ ఆపాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కార్మికులు ఏప్రిల్ 1 నుంచి పనిలో నుంచి తీసివేస్తారని భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, శ్రామిక మహిళా జిల్లా కన్వీ నర్ కె.నాగమణి, సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసు, వైఎస్సార్ ట్రేడ్ యూనియ న్ జిల్లా నాయకులు ఎస్.వెంకటరావు, ఏఐటీయూ సీ జిల్లా నాయకులు చిక్కాల గోవిందరావు, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పి.చంద్రరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె.కళ్యాణి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.ధనలక్ష్మి, జి.అమరావతి, శ్యాంపిస్టన్స్ ప్లాంట్–3 వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎన్.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఊపిరి తీసుకున్న అన్న
కొనఊపిరితో తమ్ముడు.. ● వ్యాపారంలో నష్టాలు రావడంతో యాసిడ్ తాగేసిన తమ్ముడు ● బతకడం కష్టమన్న వైద్యులు ● మనస్థాపంతో ఉరి వేసుకున్న అన్నయ్య ● అలుదులో విషాదఛాయలు శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రి బయట గదిలో ఓ వ్యక్తి గురువారం ఉదయం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన శెట్టిసూరి, ఉమామహేశ్వరావులు అన్నదమ్ములు. వీరిద్దరూ కలిసి గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టడం.. నష్టాలు రావడంతో కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల కిందట తమ్ముడు ఉమామహేశ్వరరావు తీవ్ర ఒత్తిడికి గురై యాసిడ్ తాగేశాడు. వెంటనే బాధితుడిని రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. బతకడం కష్టమేనని వైద్యులు చెప్పడంతో మనస్థాపానికి గురై అన్నయ్య శెట్టి సూరి(40) ఆసుపత్రి బయట ఓ రూమును అద్దెకు తీసుకొని గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లుంగీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రూమ్కు వెళ్లిన సూరి ఎంత కూ తిరిగి రాకపోవడంతో సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బంధువులు వెళ్లి చూడగా విగతజీవిగా కనిపించా డు. విషయాన్ని రూరల్ పోలీసులకు తెలియజేశారు. సూరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. -
రూ.1.63 లక్షలు దోచేసి..
ఏటీఎం కార్డు మార్చేసి.. శ్రీకాకుళం క్రైమ్ : ఓ రిటైర్డ్ అధికారి వద్ద ఏటీఎం కార్డు మార్చేసి రూ. 1,63,900 కొట్టేసిన వైనం జిల్లా కేంద్రంలోని అరసవల్లి మిల్లు కూడలి సమీప ఎస్బీఐ ఏటీఎంలో చోటు చేసుకుంది. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం. హరికృష్ణ, బాధితుడు తెలిపిన వివరా ల ప్రకారం.. అరసవల్లి మిల్లు జంక్షన్ సమీపంలో ఎస్బీఐ ఏటీఎం సెంటర్కు ఓ రిటైర్డ్ అధికారి వెళ్లి రూ.9 వేలు విత్డ్రా చేశారు. కార్డును మిషన్ నుంచి తీయకుండానే పక్కనే ఆ డబ్బులు లెక్కపెడుతుండగా వెనుకగా నిల్చొన్న గుర్తు తెలియని వ్యక్తి గమనించాడు. క్షణాల్లో అధికారి కార్డు తీసేసి తన కార్డును మిషన్లో పెట్టేశాడు. సార్ మీ కార్డు మిషన్లో ఉంచేశారు.. తీయండి అంటూ సాయం చేసినట్లు నటించి అక్కడి నుంచి పరారయ్యాడు. అక్కడికి రెండు రోజుల తర్వాత ఎస్బీఐ యోనోయాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేయగా రూ.1,63,900 ఎవరో ఏటీఎం కార్డు ద్వారా విత్డ్రా చేసినట్లు అధికారి గ్రహించారు. వెంటనే తన వద్దనున్న ఏటీఎం కార్డు తీసుకెళ్లి తనిఖీ చేయ గా బ్యాలెన్స్ తక్కువగా కనిపించడంతో వెంటనే సంబంధిత మెయిన్ బ్రాంచి (ఎస్బీఐ) అధికారులను కలవగా కార్డును బ్లాక్ చేసి స్టేట్మెంట్ తీసి చూపించి పోలీసులను ఆశ్రయించాలన్నారు. పలుచోట్ల తీసి.. చివరికి ఒడిశాలో.. స్టేట్మెంట్లో మోసం చేసిన వ్యక్తి ముందుగా విశాఖపట్నం శ్రీ సంఘవి జ్యూయలర్ మాల్ ఏటీఎం వద్ద రూ.75 వేలు, అశీల్మెట్ట ఏటీఎం వద్ద రూ.10 వేలు, అదే చోట రెండుసార్లు రూ.10 వేలు, మరోసారి రూ.వెయ్యి తీశాడు. అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలోకి వెళ్లి బరంపురం సిటీ హాస్పిటల్ రోడ్డులో రూ.10 వేలు, అదేచోట మూడుసార్లు రూ. 10 వేలు చొప్పున, చివరికి గజపతి జిల్లా సూర్యా హాల్మార్క్ వద్ద రూ.17,900 తీశాడు. ఈ ఘటనపై గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
● హైవే, సర్వీసు రోడ్లపై అనుమతి లేనిచోట ఆపుతున్న భారీ లారీలు ● వీటిని ఢీకొడుతూ ప్రమాదాలకు గురవుతున్న ఇతర వాహనాలు ● చోద్యం చూస్తున్న అధికారులు
శ్రీకాకుళం క్రైమ్ : ఇటీవల లావేరు మండలం బుడుమూరు హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో అదుపు తప్పిన కారు.. రోడ్డుపక్కనే ఆగివున్న స్కూటీ, లారీలను ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం జరుగుతున్నాయి. అధిక శాతం ఆగి ఉన్న వాహనాలు ముఖ్యంగా భారీ లారీలను ఢీకొట్టడం వల్లే చోటుచేసుకుంటున్నాయి. నిర్దేశిత పార్కింగ్ ప్రాంతం తప్ప మిగతా చోట్ల భారీ వాహనాలను ఆపవద్దనే నిబంధనలు ఉన్నా వాటిని డ్రైవర్లు పట్టించుకోవడం లేదు. వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సైతం చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్కింగ్ అనుమతి లేనిచోట.. హైవే రహదారులు, సర్వీసు రోడ్లు, గ్రామీణ రహదారులపై ఎక్కడపడితే అక్కడ భారీ వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు, కార్లు, ఇతర వాహనాలు అదుపుతప్పి నేరుగా ఆగివున్న లారీలను, ఇతర భారీ వాహనాలను ఢీకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అనధికారికంగా ర్యాంపుల్లోని ఇసుకను తరలిస్తున్న లారీలైతే ఒకేసారి గుంపుగా రావడం.. జిల్లాలోని రోడ్లపై వారి కంపెనీ తాలుకా మోటార్ రిపేర్ పాయింట్ల వద్ద గంటలు సేపు ఆపేయడం, ఇసుకను తరలించేందుకు అనుకూల సమయంలో ఒకేసారి వెళ్లడం వల్ల మిగతా వాహనదారులకు ఇబ్బంది కలగడమే కాక ట్రాఫిక్ అంతరాయమవుతోంది. లోపల ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం ఉన్నా బయట సర్వీసు రోడ్లపైనే ఆపేస్తున్నారు. ఇది జిల్లాలోని నదీ పరివాహక ఇసుక ర్యాంపులున్న అన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది.. కలెక్టర్, ఎస్పీ మాటలు బేఖాతరు.. ఇటీవల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఎస్పీలు రోడ్డు భద్రతా చర్యలపై సమీక్షించారు. జిల్లాలో ఆంక్షలను కఠినతరం చేయాలన్న ఆదేశాలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రధాన రహదారుల్లో డివైడర్లను బ్రేక్ చేసి ప్రమాదాలకు అవకాశం కల్పిస్తున్న వారిపై కేసులు నమో దు చేయాలని, ప్రమాదాలపై విశ్లేషించి చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ శాఖల వారీగా ఆదేశాలిచ్చారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జాతీయ రహదారిపై బ్లాక్స్పాట్లలో చోటుచేసుకుంటున్నాయని, జాగ్రత్తలు తీసుకోవడంలో హైవే అధికారులు విఫలమవుతున్నారని ఎస్పీ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తాం కలెక్టర్ ఉత్తర్వులు ఇప్పటికే అందాయి. హైవేపై అనుమ తి లేనిచోట్ల పెద్ద పెద్ద వాహనాలు ఆపితే కఠిన చర్యలు, కేసులు నమోదు చేస్తాం. – ఎ.పార్థసారధి, డీటీసీ, శ్రీకాకుళం -
4న రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ : రాష్ట్రస్థాయి బాడీ బిల్డింగ్ ఫిజిక్ మోడలింగ్ కాంపిటేషన్ పోటీలను ఏప్రిల్ 4న భీమవరంలో నిర్వహించనున్నట్టు జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రిన్ డాక్టర్ బాడాన దేవభూషణరావు తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో గురువారం పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ 55, 60, 65, 70, 75, 80, 85 కేజీల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు, స్టార్ బాడీబిల్డింగ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.విజయ్కుమార్, బాడీబిల్డర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కె.గౌరీశంకర్, కోశాధికారి బట్న నవీణ్, యువత పాల్గొన్నారు. -
దళిత సంఘాల జేఏసీ నిరసన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): దళిత పాస్టర్, సామాజికవేత్త ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం అంబేడ్కర్ కూడలిలో దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, మాన వ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి. జగన్నాథం,సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కళ్లేపల్లి రామ్ గోపాల్ మాట్లాడుతూ నిందితులను శిక్షించడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభు త్వం ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు బోసు మన్మధరావు, డేనియల్, అనంతరావు, సుధాకర్, రాంబాబు, రమణ, జాన్, కోటి, గోవింద్, శ్యామ్, ఈశ్వరరావు పాల్గొన్నారు. -
శ్రీకాకుళం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శివప్రసాద్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం(2025–26) ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అనంతరం లెక్కింపు చేపట్టారు. 604 మందికి గాను 529 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకొన్నారు. అధ్యక్ష పదవికి ముగ్గురు పోటీ చేయగా తంగి శివప్రసాద్ 272 ఓట్లతో విజయం సాధించారు. ఉపాధ్యక్షుడిగా ఇప్పిలి సీతరాజు, ప్రధాన కార్యదర్శిగా పిట్టా దామోదరరావు, మహిళా ప్రతినిధిగా గురుగుబెల్లి వనజాక్షి విజయం సాధించారు. ఇప్పటికే కార్యదర్శిగా మాటూరి భవానీప్రసాద్, కోశాధికారిగా కొమర శంకరరావు, గ్రంథాలయ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు ఏకగ్రీవంగా ఎన్నికై న సంగతి తెలిసిందే. సీనియర్ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, ఎన్.విజయ్కుమార్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. నూతన కార్యవర్గాన్ని బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు అగూరు ఉమామహేశ్వరరావు, మామిడి క్రాంతి, బి.వి.రమణ తదితరులు అభినందించారు. -
అప్రోచ్ రోడ్డుకు స్థల పరిశీలన
ఆమదాలవలస రూరల్: మండలంలోని ఇసక లపేట, తొగరాం, కొత్తవలస తదితర గ్రామా ల మీదుగా బలసలరేవు బ్రిడ్జికి నిర్మించనున్న అప్రోచ్ రోడ్డుకు గురువారం జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ స్థల పరిశీలన చేశారు. పనులు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సాయిప్రత్యూష, తహశీల్దార్ రాంబాబు, సర్వేయర్ బి.గోపి, ఆర్ఐ పి.గోవిందరావు పాల్గొన్నారు. గంజాయితో మహిళ అరెస్టు ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి సికింద్రాబాద్కు గంజాయి తరలిస్తున్న మహిళను గురువా రం అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ మొబైల్ సీఐ జి.వి.రమణ తెలిపారు. శ్రీకాకుళం ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి తనిఖీలు చేస్తుండగా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్ద రంజువాలిక్ అనే మహిళ అనుమానాస్పదంగా కనిపించింది. తనిఖీ చేయగా 10.3 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ తనిఖీల్లో సిబ్బంది విఠలేశ్వరరా వు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆరు ప్రైవేటు బస్సులు సీజ్ శ్రీకాకుళం అర్బన్: జిల్లా ప్రజారవాణా శాఖ, రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువా రం బుడుమూరు, సీపన్నాయుడుపేట తదితర చోట్ల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అనుమతులు లేకుండా తిరుగుతున్న ఆరు ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. కాంట్రాక్ట్ క్యారేజ్గా అనుమతులు తీసుకుని స్టేజ్ క్యారేజీలుగా నడుపుతున్నట్లు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులో సీట్లు, నేమ్ బోర్డులు ఏర్పాటు చేయడాన్ని గమనించి సీజ్ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐలు గంగాధర్, అనిల్, శిరీష, శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజ ర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్. ఎస్.శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం టెక్కలి రూరల్: టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సివిల్ సప్లయ్ గోదాము నుంచి బియ్యం తీసుకెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. తొట్టెకు ఉన్న లింకు తెగిపోవడంతో కూలీలు ఒక్కసారిగా గెంతేశారు. అనంతరం అడ్డుగా రాళ్లు పెట్టి తొట్టె వెనుక జారకుండా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. బియ్యం బస్తాలను మరో ట్రాక్టర్లోకి లోడ్ చేసుకుని వెళ్లారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు టెక్కలి రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఆర్మీ హవల్దార్ పైల ప్రతాప్ రెడ్డి మృతదేహం గురువారం ఢిల్లీ నుంచి స్వగ్రామమైన టెక్కలి చేరుకుంది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆర్మీ అధికారులు మృతుని కుటుంబసభ్యుల సమక్షంలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. -
థర్మల్ ప్లాంట్తో ముప్పు
సరుబుజ్జిలి: ఆదివాసీ హక్కుల పరిరక్షణకు కలిసికట్టుగా ఉద్యమం చేయాలని కేఎన్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పి.దానేష్ పిలుపునిచ్చారు. గురువారం థర్మల్ ప్లాంట్ ప్రతిపాదిత గ్రామాలైన వెన్నెలవలస, మసానుపుట్టి, జంగాలపాడు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చని పంట పొలాల్లో థర్మల్ప్లాంట్ నిర్మించడం వల్ల భూములు బీడుగా మారే ప్రమాదముందని చెప్పారు. కూటమి నేతలు స్వప్రయోజనాల కోసమే థర్మల్ ప్లాంట్ ప్రతిపాదన ముందుకు తెచ్చారని ఆరోపించారు. కార్యక్రమంలో థర్మల్ పోరాట కమిటీ నేత సవర సింహాచలం, పీడీఎం రాష్ట్ర నేత పాలిన వీరాస్వామి, ఉద్యమనేతలు, సురేష్దొర, ధర్మారావు, దుర్యోధన, వంకల మాధవరావు, గణేష్, గంగయ్య, వైకుంఠరావు, రామానాయుడు, నాగమణి, కోటి పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్పై ఎస్పీ ఆరా నరసన్నపేట: ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి నరసన్నపేట పోలీసు స్టేషన్ను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుమారు మూడు గంటలు స్టేషన్లో ఉండి పోలీసులు పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. నరసన్నపేటలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్లపై ఆరా తీశారు. పెండింగ్ కేసుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం గోదాముల తనిఖీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాములను త్రైమాసిక తనిఖీలలో భాగంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రత పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈవీఎంలను ట్రిపుల్ లాక్ సిస్టమ్ ద్వారా భద్రపరిచామని, 24 గంటల సీసీటీవీ నిఘా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు రౌతు శంకరరావు, పీఎంజే బాబు, సురేష్బాబుసింగ్, ఎం.గోవింద్, బి.అర్జున్కుమార్, సీహెచ్ భాస్కరరావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి పాల్గొన్నారు. -
టీచర్ల అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలి
● క్రిమినల్ కేసులు ఎత్తివేయాలి ● డీఈఓను తొలగించాలి ● కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాల ఆందోళనశ్రీకాకుళం పాతబస్టాండ్: కుప్పిలిలో పదో తరగతి పరీక్షల కాపీయింగ్ ఘటన నేపథ్యంలో ఉపాధ్యాయులపై అక్రమ సస్పెన్షన్లు, క్రిమినల్ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ.. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీ సీట్ల కోసం రూ.30 వేల నుంచి రూ.50 వేలు వరకు వసూలు చేశారన్న నెపంతో ఉపాధ్యాయులపై కేసులు పెట్టడం, సస్పెండ్ చేయడం దారుణమన్నారు. దీనికి పూర్తి బాధ్యులైన డీఈఓను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక, స్టీరింగ్ కమిటీ సభ్యులు డీఆర్ఓ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సూర్యనారాయణలతో సమావేశమయ్యారు. వాస్తవ పరిస్థితి, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఇబ్బందులపై చర్చించారు. డీఈఓను తొలగించి విచారణ చేయించాలని కోరారు. ఈ ఘట నలో సస్పెన్షన్లు ఎత్తివేయాలని, క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని, బాధిత విద్యార్థులకు వెంటనే పరీక్ష నిర్వహించాలని, లేనిపక్షంలో సప్లిమెంటరీ పరీక్షకైనా అనుమతించాలని విన్నవించారు. కార్యక్రమంలో సంఘాల ప్రతినిధులు ఎస్.కిషోర్, చౌదరి రవీంద్ర, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.నేడు ఎమ్మెల్యేలకు వినతిపత్రాల అందజేత శ్రీకాకుళం న్యూకాలనీ: ఉపాధ్యాయులు, సిబ్బందిపై అక్రమ సస్పెన్షన్లను ఎత్తివేయాలని, డిబారైన విద్యార్థులకు న్యాయం చేయాలని, డీఈఓ తిరుమలచైతన్యను విధుల నుంచి తప్పించాలని కోరుతూ శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేపట్టి ఎమ్మెల్యేలకు వినతిపత్రాలను అందజేయనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ముఖ్య నాయకులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్మోహన్, దుప్పల శివరామ్ప్రసాద్, పిసిని వసంతరావు, ఎస్వీ రమణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు డీఈఓ కార్యాలయాన్ని మరోసారి ముట్టడిస్తామని, ఉపాధ్యాయులంతా హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం
అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే 101కాల్ చేయండి● 14 శకటాలు, 184 మంది సిబ్బందితో సన్నద్ధం ● ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి ● ‘సాక్షి’తో జిల్లా అగ్నిమాపక అధికారి జడ్డు మోహనరావు శ్రీకాకుళం క్రైమ్ : వేసవి ఎండలు భగ్గుమంటున్నాయి. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని.. సిబ్బంది సైతం ఫైర్ ఎమెర్జెన్సీ కాల్స్ పట్ల అలర్ట్గా ఉండాలని జిల్లా అగ్నిమాపక, విపత్తుల నిర్వహణ అధికారి జడ్డు మోహనరావు అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రమాదాల అప్రమత్తత, సిబ్బంది విధివిధానాలు, శకటాలు, పరికరాల పనితీరును వివరించారు. మరో 68 మంది అవసరం.. జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, ఆమదాలవలస, కొత్తూరు, రణస్థలంలోని అగ్నిమాపక కేంద్రాలకు శాశ్వత భవనాలు ఉన్నాయి. సోంపేట, నరసన్నపేటలో సెమీ పర్మినెంట్ భవనాలున్నాయి. మందస, పొందూరుల్లో ఔట్పోస్టు ఫైర్స్టేషన్లు ఉన్నాయి. జిల్లాలో 45 మంది ఫైర్మ్యాన్లు, 23 మంది డ్రైవింగ్ ఆపరేటర్లు, 33 మంది లీడింగ్ ఫైర్మ్యాన్లు, ఎనిమిది మంది స్టేషన్ అధికారులున్నారు. జిల్లా సహాయక అగ్ని మాపక అధికారిగా వరప్రసాద్ కొనసాగుతున్నారు. ఔట్పోస్టు స్టేషన్లలో 25 మంది ఫైర్మ్యాన్లు, ముగ్గురు డ్రైవింగ్ ఆపరేటర్లున్నారు. వీరే కాక జూనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ ఒక్కరేసి చొప్పున, హోంగార్డులు 44 మంది వరకు ఉన్నారు. తనతో పాటు మొత్తం 184 మంది ఉన్నారని చెప్పారు. మరో 56 మంది ఫైర్మ్యాన్లు, పది మంది డ్రైవింగ్ ఆపరేటర్లు, సోంపేట, కోటబొమ్మాళి కేంద్రాల్లో ఫైర్స్టేషన్ అధికారులు భర్తీ కావాల్సి ఉంది. ఇవి పాటించాల్సిందే.. ● అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు 101కు గానీ, సంబంధిత స్టేషన్ ఫోన్ నంబర్కు గానీ, స్టేషన్ అధికారికి గానీ ఫోన్ చేయాలి. ● ప్రజల నుంచి వచ్చే ఫైర్ కాల్స్ పట్ల క్షణాల్లో స్పందిచకపోయినా, మరమ్మతులకు గురైన వాహనాలు తీసుకెళ్లి ప్రమాదాన్ని నియంత్రించలేకపోయినా సిబ్బందిపై చర్యలుంటాయి. కచ్చితంగా కండిషన్లో ఉన్న వాహనాలు, పరికరాలే తీసుకెళ్లాలి. ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. ● మండలాలు, గ్రామాల పరిధిలో గుడిసెలు ఉన్న కాలనీలను సంబంధిత ఫైర్మ్యాన్, లీడింగ్ ఫైర్మ్యాన్లు దత్తత తీసుకుని ఎప్పటికప్పుడు ప్రమాద అవకాశాలున్న వీకర్ లొకేషన్లపై సమాచారం తెలుసుకోవాలి. అక్కడి ప్రజలకు ప్రమాదాలపై అవగాహన పర్చాలి. ● సర్పంచ్, వార్డుమెంబర్లు, అంగన్వాడీ కేంద్రాలు, ఎఫ్పీషాప్ డీలర్లు, విలేజ్ సర్వెంట్లు, పోస్ట్మాస్టర్లే కాక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీల ఫోన్ నెంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. ● తక్షణ చర్యల్లో భాగంగా పరికరాలతో కూడిన మిస్ట్ బుల్లెట్ అందుబాటులో ఉంచుకోవాలి. ● 101 ఎమెర్జెన్సీ నెంబర్, స్టేషన్ ఎస్టీడీ నంబర్తో పాటు ప్రజలు ఫోన్ చేస్తే వెంటనే స్పందించేలా స్టేషన్ అధికారులు, సర్వీస్ ప్రొవైడర్లు మొబైల్ ఫోన్ నెంబర్లు ఉన్న సిమ్లు యాక్టివేట్ చేసుకోవాలి. ● గ్రామాలు, మండలాలు, వార్డులు, మున్సిపాలిటీలు పరిధి ముఖ్య కూడళ్లు, హోటళ్లు, సచివాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, కమ్యూని టీ హాళ్లు, దేవాలయాలు, హెల్త్ సెంటర్లు, ఎఫ్పీఎస్ డీలర్ షాపులు, రైతుబజారు, మార్కెట్లలో స్కూళ్లు, పోస్టాఫీస్లు, బ్యాంకులు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో సంబంధిత ఫైర్స్టేషన్ అధికారి మొబైల్ నెంబర్, స్టేషన్ నెంబర్, ఎమెర్జెన్సీ కాల్ 101 నెంబర్లు కనిపించేలా ప్రదర్శించాలి. ● జిల్లాలో గడ్డి ఇళ్లు, గుడిసెలు బాగా తగ్గాయి. పరిశ్రమలు, మాల్స్లో నిబంధనలు పాటించకపోవడం, సంబంధిత అగ్ని ప్రమాద పరికరాలు ఉండకపోవడం, అనుమతులు తెచ్చుకో కపోవడం వల్లే ఇటీవల ప్రమాదాలు సంభవించాయి. భారీ ప్రమాదాలు సంభవించినప్పుడు ఆస్తి నష్టం ఎక్కడ సంభవిస్తుందోనని పలువురు ప్రమాదమని తెలిసినా చొరబడేందుకు చూస్తారు. అది మంచిది కాదు. అత్యవసర నంబర్లు.. స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ మొబైల్ ఆఫీస్ నంబర్ శ్రీకాకుళం ఎం.వరప్రసాద్ 9963726782 08942222099 ఇచ్ఛాపురం కె.ప్రశాంత్కుమార్ 8317587461 08947231101 సోంపేట ఎస్ మోహన్ 9963744295 08947234101 పలాస బి.సోమేశ్వరరావు 9963730662 08945241101 టెక్కలి బి.సూర్యారావు 9000505945 08945244277 కోటబొమ్మాళి పి.ఆర్.రెడి 9963730845 08942238659 నరసన్నపేట ఎస్.వరహాలు 7680089447 08942276777 ఆమదాలవలస కె.అప్పారావు 9963730658 08942286401 కొత్తూరు ఎన్.బుచ్చోడు 9000873349 08946258444 రణస్థలం పి.అశోక్ 9963731326 08942234499 మందస పి.కృష్ణారావు 9440939909 08947237101 పొందూరు జి.ఇందుమతి 9491325930 08941242101 -
శ్రీకాకుళం
మాట తప్పడం బాబు నైజంశుక్రవారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2025గిరిజనులకు చెందిన జీవో నంబర్ 3 పునరుద్ధరిస్తాను. గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం ఉద్యోగాలు గిరిజనులకే. జిల్లాలో ఐటీడీఎ ఏర్పాటు చేస్తాను. 1/70 చట్టం సమర్ధంగా అమలు చేస్తాను.. – పాతపట్నం, పలాసలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలివి. ●● ఓవైపు థర్మల్ పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం ● మరోవైపు ఐటీడీఏ కోసం ఆందోళన ● ఇంకోవైపు గిరిజన భూముల ఆక్రమణలపై నిరసన ● భవిష్యత్ కోసం ఎందాకై నా వెళ్తామని ప్రభుత్వానికి హెచ్చరిక న్యూస్రీల్ -
● వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్
నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనాలు ఇరుక్కున్నా, నీటిలో మునిగిన వాహనాలను బయటకు తీయాలన్నా దీనిని ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ రిమోట్ సాయంతో ఆపరేటర్ చేస్తారు. ఆయిల్ ప్రమాదాలు (పెట్రోల్, డీజిల్, ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి) ఫోమ్ మేకింగ్ బ్రాంచిని ఉపయోగించి ఫోమ్ను స్ప్రే చేస్తారు. 360 డిగ్రీల కోణంలోనూ వాటర్ స్ప్రే చేయొచ్చు. సింగిల్ యూనిట్ అయితే 16 మంది, డబుల్ యూనిట్కు 32 మంది సిబ్బంది ఉంటారు. ● అడ్వాన్స్ (మల్టీపర్పస్)వాటర్ టెండరింగ్ ఫైర్ ఇంజిన్ నీటి సామర్థ్యం 4,500 లీటర్లు. సాధారణంగా వాటర్ ట్రెండింగ్ ఇంజిన్లో కింద నుంచి వాటర్ ప్రెజర్ కొడతారు. దీనికై తే పైన హ్యాండిల్ పట్టుకుని వాటర్ కొట్టవచ్చు. ఫోమ్, కార్బన్ డయాకై ్సడ్ ఉంటుంది. -
కేజీబీవీలో ఫుడ్ పాయిజన్
కాశీబుగ్గ / మందస : మందస మండలం గుడారిరాజపురం(జి.ఆర్.పురం) గ్రామంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయం వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ జరగడంతో 20 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి అన్నం తిని నిద్రపోతున్న సమయంలో ఒక్కసారిగా వాంతులు, విరేచనలు కావడంతో వెంటనే సిబ్బంది స్పందించారు. సచివాలయ ఏఎన్ఎం సాయంతో ప్రథమ చికిత్స చేయించారు. అందులో 13 మంది విద్యార్థినులు గురువారం ఉదయానికి కూడా కోలుకోకపోవడంతో 108 అంబులెన్సులో హరిపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. వైద్యాధికారులు డాక్టర్ మద్దిల సంపతిరావు, డాక్టర్ స్వరాజ్యలక్ష్మిలు వైద్యసేవలు అందించారు. ప్రమాదమేమీ లేనప్పటికీ ఎనిమిదో తరగతి విద్యార్థులైన భారతి, యమున, మోహిని, నవ్య, జాహ్నవి, గోపిక, సాహితి, శృతి, జ్ఞానశ్రీలను ఆస్పత్రిలోనే అబ్జర్వేషన్లో ఉంచారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై ఆస్పత్రికి చేరుకున్నారు. మందస పోలీసులు, మండల విద్యాశాఖ, ఇతర శాఖల అధికారులు ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిల వినోద్కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రవికుమార్ పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ లేకే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మండిపడ్డారు. అనంతరం పాఠశాలను సందర్శించి వసతుల లేమి, భోజనం సరిగ్గా లేకపోవడంపై మండిపడ్డారు. 20 మందికి అస్వస్థత.. 13 మందికి ఆస్పత్రిలో చికిత్స ఆందోళనకు గురైన తల్లిదండ్రులు -
లబ్ధిదారులకు ఈకేవైసీ తప్పనిసరి
పోలాకి: జిల్లాలో రేషన్కార్డు లబ్ధిదారులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని డీఎస్ఓ జి.సూర్యప్రకాశరావు అన్నారు. బుధవారం మబగాం, ఈదులవలస రేషన్డిపోల్లో ఈకేవైసీ నమోదుకాని వారి వివరాలు, అందులో ఎంతవరకు ఈనెలలో అప్డేట్ అవుతున్నాయో అని పరిశీలించారు. పలువురు లబ్ధిదారులతో మాట్లాడి వారికి సమాచారం ఎంతవరకు వచ్చిందో అన్న విషయాలపై ఆరాతీశారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది, డిపో డీలర్ సమన్వయంతో ఈనెల 31నాటికి శతశాతం ఈకేవైసీ అప్డేట్ జరిగేలా చూడాలని సూచించారు. ఆయన వెంట సీఎస్ డీటీ రామకృష్ణ, స్థానిక రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. యోగా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం, ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి యోగా అవార్డులు–2025 కోసం అర్హులైన వ్యక్తులు/సంస్థల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డాక్టర్ కె.శ్రీధర్రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి లో యోగా అభివృద్ధి, యోగా ప్రచారం కోసం అత్యుత్తమ సహకారాన్ని అందించిన వారు, యోగా అభివృద్ధి కోసం విశేషమైన కృషి చేసి, అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన వ్యక్తులు/ సంస్థలు ఈనెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని శ్రీధర్రావు పేర్కొన్నారు. కిడ్నీ ఆస్పత్రిలో తాగునీరు కరువు కాశీబుగ్గ: ఉద్దాన కిడ్నీ రోగుల కోసం నిర్మించిన పలాస కిడ్నీ ఆస్పత్రి, డయాలసిస్ యూనిట్లో తాగడానికి మంచినీరు కరువైంది. ఆస్పత్రికి వచ్చిన వారంతా బయటే వాటర్ బాటిళ్లు కొనాల్సి వస్తోంది. ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసి ఫ్రిడ్జ్ పనిచేయడం లేదు. దీంతో రోగులతో పాటు వందమందికిపైగా సిబ్బందికి సైతం సమస్యగా మారింది. రోజుకు మూడుసార్లు వాటర్ బెల్ శ్రీకాకుళం న్యూకాలనీ: మండే ఎండల నేపథ్యంలో పాఠశాలల్లో విద్యార్థుల కోసం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు తప్పనిసరిగా నీళ్లు తాగేలా రోజుకు మూడుసార్లు వాటర్ బెల్ మోగించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, 11 గంటలకు, మళ్లీ మద్యాహ్నం 12 గంటలకు విధిగా వాటర్బెల్ పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఉత్తర్వులు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. గురుకులాల్లో బ్యాక్లాగ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం మెళియాపుట్టి : 2025–26 విద్యా సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతుల్లో ప్రవేశాలకు(బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బుధవారం సీతంపేట ఐటీడీఏ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 9లోగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. -
పెద్దపేట కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్
నరసన్నపేట: నరసన్నపేటలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. పెద్దపేటకు చెందిన ఇద్దరు యువకులు ఈ బెట్టింగ్ వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. బజారు వీధితో పాటు ఆదివరపుపేట కూడలి, తమ్మయ్యపేట జంక్షన్ తదితర చోట్ల గుట్టుచప్పుడు కాకుండా బెట్టింగ్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ఆరు గంటల నుంచి మొదలవుతున్న బెట్టింగులు రాత్రి 10 వరకూ నిర్వహిస్తున్నా రు. ఓవర్కు ఎంత స్కోర్ చేస్తారు.. ఏ ప్లేయర్ ఎంత స్కోర్ చేస్తారు.. ఏ ప్లేయర్ ఎన్ని సిక్స్లు కొడతారు, ఎన్ని ఫోర్లు కొడతారు.. అనే వాటితో పాటు అనేక రకాల బెట్టింగ్లు జరుగుతున్నట్లు భోగట్టా. స్థానిక పెద్దపేటకు చెందిన చైన్నెలో బీటెక్ మొదటి సంవ త్సరం విద్యార్థి ఒకరు ఈ బెట్టింగ్ల్లో రూ. 30 లక్షలు వరకూ పొగొట్టుకున్నట్లు తెలుస్తోంది. విషయం తె లుసుకున్న తండ్రి లబోదిబోమంటూ స్థానిక మాజీ ఎంపీటీసీ జామి వెంకటరావు వద్ద మొరపెట్టుకున్నారు. దీనిపై ఎస్పీ కార్యాలయం కూడా ఆరా తీస్తోంది. బెట్టింగ్కు పాల్పడితే కఠిన చర్యలు: సీఐ క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని యువత బెట్టింగ్ల వైపు వెళ్లవద్దని నరసన్నపేట సీఐ జే. శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో బెట్టింగ్లో పాల్గొనడం నేరమ ని అన్నారు. -
పెళ్లయిన 48 రోజులకే..
కాశీబుగ్గ: తాళి కట్టి రెండు నెలలైనా అవ్వలేదు.. నూతన వధువు కాళ్ల పారాణి కూడా పూర్తిగా ఆరలేదు.. కొత్త దంపతుల ముచ్చట్లే తీరలేదు.. అంతలోనే విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూ పంలో ముంచుకొచ్చిన మృత్యువు వరుడిని తనతో తీసుకెళ్లిపోయి వధువుకు తీరని శోకం మిగిల్చింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కోసంగిపురం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాస మండలం గొల్లమాకన్నపల్లి గ్రామానికి చెందిన కోరాడ మధుసూదన్ యాదవ్ (28) మృతి చెందారు. ఆయన వివాహం జరిగి కేవలం 48 రోజులైంది. గొల్లమాకన్నపల్లికి చెందిన మధుసూదన్ మంగళవారం పలాసలో మార్కెట్కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి తన బుల్లెట్పై బయల్దేరారు. అక్కడ పనిచూసుకుని తిరిగి వస్తుండగా కోసంగిపురం జాతీ య రహదారిపై అతడి బండి ప్రమాదానికి గురై 50 మీటర్ల దూరం అవతల పడిపోయాడు. రాత్రి పూట ప్రమాదం జరగడంతో వెనుక నుంచి వాహనం ఢీకొట్టిందా, లేదా బండి స్కిడ్ అయ్యిందా అన్నది రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి -
ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టు ట్యాంకుకు స్థల పరిశీలన
పాతపట్నం: మండలంలోని కొరసవాడ–బోరుబద్ర గ్రామాల మధ్య కొండ సమీపంలో ఉద్దానం ఫేజ్–2 ప్రాజెక్టుకు వాటర్ ట్యాంకు నిర్మించేందుకు నాలుగు ఎకరాల స్థలాన్ని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, తహశీల్దార్ ఎస్.కిరణ్కుమార్ బుధవారం పరిశీలించారు. రూ.260 కోట్లతో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలంలోని వివిధ గ్రామాలలకు తాగునీరు అందించేందుకు వాటర్ ట్యాంకు నిర్మాణం, పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ఉద్దానం ప్రాజెక్టు పనులు త్వరితగతిని చేయాలని ఆర్డీఓ ఇంజినీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ పి.చంద్రకుమారి, ప్రాజెక్టు డీఈఈ ఆశలత, మండల సర్వేయర్ రామగణపతి, ప్రాజెక్టు ఇంజినీర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
అరసవల్లిలో విజిలెన్స్
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మంగళ,బుధవారాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను క్షుణ్నంగా పరిశీలించారు. మంగళవారం ఓ వైపు హుండీ కానుకల లెక్కింపు జరుగుతున్న క్రమంలో మరోవైపు కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల బృందం తనిఖీలు చేపట్టడం గమనార్హం. అయితే ఇప్పుడు విధుల్లో ఉన్న ఈవో కొత్తగా రావడంతో ఆయనకు గత నిధుల దుర్వినియోగంతో సంబంధం లేకున్నప్పటికీ సిబ్బందిలో మాత్రం ఆందోళన నెలకొంది. ప్పట్లో ఈవోలుగా పనిచేసిన రమేష్బాబు, చంద్రశేఖర్ల హయాంలో నిధుల వినియోగంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లుగా తెలిసింది. నిధుల దుర్వినియోగంలో గత ఈవో చంద్రశేఖర్కు ఆలయంలో పనిచేస్తున్న రిటైర్డ్ ఈవో జగన్మోహనరావుతో పాటు మరో రెగ్యులర్ ఉద్యోగి, ముగ్గురు దినసరి వేతనదారులు చాలా వరకు సహకరించారని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. డిప్యుటేషన్ విధుల్లో ఉన్న అటెండర్ శ్రీనివాస్కు ఎరియర్స్తో కూడిన పీఆర్సీని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టడాన్ని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గతంలో ఆలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ సస్పెన్షన్కు గురైన కృష్ణమాచార్యులు లిఖితపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగానే తాజాగా ఆలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలను చేస్తున్నట్లు సమాచారం. ప్రశ్నలకు సమాధానమేదీ.! గత ఈవో చంద్రశేఖర్ హయాంలో జరిగినట్లుగా భావిస్తున్న నిధుల దుర్వినియోగాలపై విజిలెన్స్ అధికారులు స్థానిక ఆలయ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. దేనికీ సరైన రికార్డు లేకపోగా.. సమాధానం కూడా కరువైపోయి నీళ్లు నమలడమే తరువాయిగా మారింది. వారినే అడగండి..ముందుగా ఆలయ ఈవో అధికారిక వాహనం కొనుగోలు, వాహన ఇఽంధనం వినియోగ బాకీలు, కంప్యూటర్లు కొనుగోళ్లు, ఇతర సామగ్రి కొనుగోళ్లు, రూ.లక్షల బిల్లులతో పట్టుచీరలు, వస్త్రాల కొనుగోళ్లు, భక్తులకు ఇచ్చినట్లుగా చూపుతున్న మజ్జిగ, పాలు బిల్లులతో పాటు ఆలయానికి రంగులకు రూ.26 లక్షల వినియోగం.. ఇలా చాలావరకు ఆలయానికి చెందిన నిధులు దుర్వినియోగం అయినట్లు దాదాపుగా నిర్ధారణకు వచ్చిన విజిలెన్స్ అధికారులు.. ఈమేరకు ఆలయ సిబ్బందిని ప్రశ్నిస్తే గత ఈవోలకు అడగండని సమాధానాలను దాటవేసినట్లు సమాచారం. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ నేరుగా ఫిర్యాదుదారుడు కృష్ణమాచార్యులతో ఫోన్లో సంప్రదించి.. అవసరమైతే ప్రత్యక్షంగా ఆధారాలు ఇస్తూ స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా...విజిలెన్స్ అధికారులు మంగళవారం సాయంత్రం వరకు రికార్డులను, బిల్లులను తనిఖీలు చేస్తుంటే.. అప్పట్లో క్యాష్బుక్ బాధ్యుడిగా ఉన్న రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు మాత్రం విజిలెన్స్ అఽధికారులకు కనిపించకుండా రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే వెళ్లాలంటూ తాను మాత్రం తప్పించుకుని వెళ్లిపోయారు. దీన్ని విజిలెన్స్ సిబ్బంది ఒకరు గమనించి పెద్దాయన ఎందుకు వెళ్లిపోయారంటూ ప్రశ్నించడంతో పరిస్థితి మారిపోయింది. కంప్యూటర్ల కొనుగోళ్లు, సామగ్రి, సీసీ కెమెరాల ఏర్పాటు, భక్తులకు సౌకర్యాల కల్పన పేరుతో భారీగా నిధులు స్వాహా జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించి విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావుకు నివేదించనున్నట్లు తెలిసింది. దీనిపై ఆలయ అధికారులు గానీ సిబ్బంది గానీ ఎవ్వరూ నోరుమెదపడం లేదు. ఏదిఏమైనా ఆదిత్యుని ఆలయ నిధుల స్వాహా జరిగిందనే అభియోగాలు, ఆరోపణలపై త్వరలో తుది నివేదిక సిద్ధమై కారకులపై చర్యలు తీసుకోవచ్చనే చర్చ జోరందుకుంది. వాస్తవమే..ఈ విషయమై ఈఓ వై.భద్రాజీ వద్ద ప్రస్తావించగా మంగళ, బుధవారాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టిన విషయం వాస్తవమేనన్నారు. ఆలయ రికార్డులు పరిశీలించగా, వారికి సహకరించామని చెప్పారు. -
భాషా శాస్త్రవేత్తల సదస్సుకు గౌరీశంకర్
శ్రీకాకుళం కల్చరల్: తెలంగాణలోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ నెల 25, 26 తేదీల్లో కేంద్రీయ భాషా ప్రాధికార సంస్థ, తెలుగు భాషా వేదిక, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సంయుక్తంగా నిర్వహించిన 13వ అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్తల సదస్సులో మునసబుపేటలోని గాయత్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో తెలుగు విభాగాధిపతి భమిడిపాటి గౌరీశంకర్ పాల్గొన్నారు. నూతన విద్యావిధానం–భారతీయ భాషలు అనే అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా గౌరీశంకర్ను గాయత్రీ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామినాయుడు, ప్రిన్సిపాల్ పులఖండం శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ కె.వి.వి.సత్యనారాయణ, డాక్టర్ మార్తాండ కృష్ణ, సీతారాంనాయుడు, మేజర్ వి.మహేష్ అభినందించారు. -
వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ)/శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా యంత్రాంగం అర్హులైన వీఆర్ఏలకు వీఆర్వో, అటెండర్లుగా పదోన్నతులు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పదోన్నతులు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 5న విజయవాడ ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న వీఆర్ఏ రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం సీఐటీయూ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. సంఘం జిల్లా నాయకులు ఎన్.సీతప్పడు, డి.అప్పారావు, కె.పురుషోత్తం, బి.రాములమ్మ, మీనాక్షి, రాజారావు, లోకనాథం, శంకర్, బొమ్మాలి, వెంకటరమణ, రామ్మూర్తి, లక్ష్మణరావు, ముకుంద తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు సంఘ ప్రతినిధులు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. -
డీఈఓను విధుల నుంచి తప్పించాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో కుప్పిలి కేంద్రంలో మాస్ కాపీయింగ్ ఘటనలో సస్పెండైన 14 మంది ఉపాధ్యాయులను వెంటనే విదుల్లోకి తీసుకోవాలని, ముందస్తు ప్రణాళికతో దాడిచేసి వ్యక్తిగత మైలేజ్ కోసం జిల్లా పరువు, ప్రతిష్టతలను మంటగలిపి ఉపాధ్యాయులను అన్యాయంగా సస్పెండ్ చేసిన డీఈఓ తిరుమల చైతన్యను వెంటనే విధుల నుంచి తప్పించాలనికి జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ చేశారు. సస్పెండైన టీచర్లతోపాటు డిబారైన ఐదుగురు విద్యార్థులకు న్యాయం చేయాలని నినదించారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడివేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట రెండో రోజు బుధవారం కూడా నిరసన కార్యక్రమం కొనసాగించారు. ఉమ్మడి వేదిక ముఖ్య ప్రతినిధులు చౌదరి రవీంద్ర, తంగి మురళీమోహన్, మజ్జి మదన్మోహన్, డి.శివరాంప్రసాద్, పిసిని వసంతరావు తదితరులు మాట్లాడుతూ డీఈఓ ఉపాధ్యాయుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 2023 సాధారణ బదిలీల నుంచి ఉపాధ్యాయులను దోషులుగా చిత్రీకరించే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. కుప్పిలి కేంద్రంలో జరిగిన సంఘటన అతిగా చిత్రీకరించి విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురిచేసి ప్రశాంతంగా పరీక్షలు రాయటంలో తీవ్ర ఆటంకం కలుగజేసిన డీఈఓపై, దాడిలో పాల్గొన్నవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 4 గంటలకు కలెక్టర్ కార్యాలయం వద్ద వందలాది మంది ఉపాధ్యాయులతో చేపట్టనున్న ఉపాధ్యాయుల పోరాట ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేదిక ప్రతినిధులు కొప్పల భానుమూర్తి, బమ్మిడి శ్రీరామ్మూర్తి, గొంటి గిరిధర్, సంపతిరావు కిషోర్కుమార్, గురుగుబెల్లి రమణ, పేడాడ కృష్ణారావు, బల్లెడ రవి, శీర రమేష్బాబు, ఎంవీ రమణ, ఎస్.సత్యనారాయణ, బలివాడ ధనుంజయ్, బోనెల రమేష్, కె.పద్మావతి, బి.మోహనరావు, పప్పల రాజశేఖర్, దామోదరావు, వెంకటరమణ, శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు డిమాండ్ రెండోరోజూ కొనసాగిన నిరసన -
కుక్కల దాడిలో జింక మృతి
ఇచ్ఛాపురం: పురపాలక సంఘం పరిధిలోని రత్తకన్న గ్రామంలో వీధి కుక్కల దాడిలో జింక మృతి చెందింది. సమీప కొండల నుంచి దారితప్పి గ్రామంలోనికి ప్రవేశించిన సమయంలో వీధికుక్కలు వెంటపడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే గ్రామస్తులకు అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాశీబుగ్గ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎ.మురళీకృష్ణనాయుడు ఆదేశాల మేరకు డిప్యూటీ రేంజ్ అధికారి ఐ.రాము, ఫారెస్టు బీట్ అధికారులు సిబ్బంది మృతిచెందిన జింకను పరిశీలించారు. గ్రామస్తుల సమక్షంలో బెల్లుపడ వెటర్నరీ సిబ్బంది పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని దహనం చేశారు. ఇదిలా ఉండగా రత్తకన్న సమీపంలోని ఎర్రమట్టి కొండల నుంచి గ్రావెల్ను కొందరు అక్రమంగా తవ్వేయడంతో కొండలు కరిగిపోతున్నాయని, అక్కడి వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి మృత్యువాత పడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. -
కోచింగ్ సెంటర్ ఎంపికకు గడువు పెంపు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎంపికై న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వెబ్ ఆప్షన్లో కోచింగ్ సెంటర్ ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 28 వరకు గడువు పొడిగించినట్లు డీడీ విశ్వమోహన రెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.టెన్త్ విద్యార్థికి గాయం నరసన్నపేట: స్థానిక సెంట్క్లారెట్ స్కూల్లో పరీక్ష రాస్తున్న టెన్త్ విద్యార్థి బి.వెంకటరమణ గాయపడ్డాడు. స్కూల్లో గోడకు ఉన్న మేకు తలకు తగలడంతో రక్త స్రావమైంది. వెంటనే పీహెచ్సీ సిబ్బంది, మహిళా కానిస్టేబుల్ స్పందించి ప్రాథమిక చికిత్స అందించారు. బీపీ చెక్ చేసిన అనంతరం పరీక్షకు హజరయ్యాడు. జలుమూరు మండలం బసివాడకు చెందిన వెంకటరమణ నరసన్నపేట మండలం కంబకాయ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గుండెపోటుతో వీఆర్ఓ మృతి ● ఒత్తిడే కారణమంటున్న ఉద్యోగ సంఘాలు ఎచ్చెర్ల క్యాంపస్: మండలంలోని బడివానిపేట వీఆర్వో పుట్ట రాజారావు (50) బుధవారం గ్రామ సచివాలయంలో విధి నిర్వహణలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది సీపీఆర్ చేసి 108 అంబులెన్సుకు సమాచారం అందించారు. సిబ్బంది వచ్చి రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. రాజారావు స్వస్థలం చిలకపాలెం. ఇతనికి భార్య, కుమా రుడు ఉన్నారు. కాగా, రాజారావు పనిఒత్తిడి కారణంగానే మృతిచెందారని ఉద్యోగ సంఘాల నాయకులు, వీఆర్వోలు చెబుతున్నారు. రెవెన్యూ, మండల పరిషత్, పంచాయతీరాజ్ ఇలా అన్ని సర్వేలు, పనులు తమతోనే చేయిస్తున్నారని మండిపడుతున్నారు. తాము ఎవరి పనిచేస్తున్నామో తమకే తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు కూడా ఎక్కువయ్యాయని వాపోతున్నారు. కాగా, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ఆర్డీఓ సాయిప్రత్యూష, తహశీల్దార్ గోపాలరావు బుధవారం రాత్రి రాజారావు ఇంటికి వెళ్లి నివాళులర్పించారు.మృతిపై ఆరా తీశారు. రాజారావు(ఫైల్) -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రణస్థలం: మండలంలోని బంటుపల్లి రాధాగోవింద మందిరం సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఎస్పీ రమణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీని వెనుక నుంచి ద్విచక్రవాహనంతో వచ్చిన రమణ బలంగా ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన రమణను 108 అంబులెన్సులో శ్రీకాకుళంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. కొవ్వాడ గ్రామానికి చెందిన రమణ పైడిభీమవరం పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈదురుగాలుల బీభత్సం పాతపట్నం: మండలంలోని కొదూరు పంచాయతీ ప్రహరాజపాలెం సమీపంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా భారీ గాలులు వీయడంతో రైతులు రావాడ వెంకటరావు, ప్రసాద్ మహంతి, జాడ సవరయ్య, చిప్పాడ నారాయణ, మంత్రి సోమేష్, మంత్రి లచ్చయ్య, రావాడ రవికిరణ్, కుంటుమహంతి వేణుగోపాల్కు చెందిన ఐదు ఎకరాల స్వీట్కార్న్ పంట నేలకొరిగింది. మరో పది రోజుల్లో పంట చేతికి వచ్చేదని, ప్రభుత్వం స్పందించి పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
మెళియాపుట్టి: కూటమి ప్రభుత్వం ప్రటించిన ఉచిత ఇసుక విధానం కొంతమందికి కాసులు కురిపిస్తోంది. పగటి పూట అధికారులు దాడులు చేస్తారని భావించి రాత్రివేళల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు దర్జాగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. హిరమండలం, ఎల్ఎన్పేట, కొత్తూరు మండలాల నుంచి ఇసుకను పాతపట్నం మీదుగా ఆల్ ఆంధ్రా రహదారిలో మెళియాపుట్టి గ్రామ వీధుల్లో నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. గతంలో ఇసుక అక్రమ రవాణాపై మీడియాలో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు రూ.2000 చొప్పున అపరాధ రుసుం విధించారు. తర్వాత వారిని వదిలేయడంతో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రతి రోజూ సాయంత్రమైతే పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ఇసుకను ఒడిశాకు తరలిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. ఒడిశాకు రాత్రివేళల్లో తరలించుకుపోతున్న వైనం ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు అడ్డుకుంటాం.. గతంలో ఇదేవిధంగా చేస్తే ఒడిశా బోర్డర్ వద్ద మా సిబ్బందితో కలిసి పరిశీలన చేయించాం. ఇసుక తరలిస్తున్న వారిని వీఆర్వోలు అడ్డుకున్నా ఆపకుండా వెళ్లిపోయారు. ఇప్పుడు రాత్రివేళల్లో, సెలవురోజుల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. పోలీసుల సాయంతో అడ్డుకుంటాం.. – పాపారావు, మెళియాపుట్టి తహశీల్దార్ కట్టడి చేస్తాం.. ఇదివరకే మహేంద్రతనయ నదీ తీరంలో నిఘా పెట్టాం. మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా మావంతు చర్యలు తీసుకుంటున్నాం. – రమేష్ బాబు, మెళియాపుట్టి ఎస్సై -
డీఈఓ తీరుపై టీచర్ల మండిపాటు
భారీ సంఖ్యలో ర్యాలీగా వస్తున్న ఉపాధ్యాయులు శ్రీకాకుళం న్యూకాలనీ: కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటనలో డీఈఓ తీరును టీచర్లు నిరసిస్తూ మంగళవారం భారీ ఎత్తున జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. డీఈఓ తిరుమల చైతన్యను వెంటనే సస్పెండ్ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నగరంలో వైఎస్సార్ స ర్కిల్ వద్ద మొదలైన ఈ ర్యాలీ జీటీరోడ్, సూర్యమహల్ మీదుగా డీఈఓ కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ నిరసన చేపట్టారు. ముందుస్తుగా పోలీసులు మోహరించడంతో డీఈఓ కార్యాల యం లోపలకు అనుమతించలేదు. జిల్లా పరు వును, ప్రతిష్టను జిల్లా విద్యాశాఖాధికారిగా తిరుమల చైతన్య మంటగలిపారని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక నాయకులు కొప్పల భానుమూర్తి, గొంటి గిరిధర్, తంగి మురళీమోహన్, చౌదరి రవీంద్ర, పిసిని వసంతరావు, మజ్జి మదన్మోహన్, దుంపల శివరామ్ప్రసాద్, ఎస్వీ రమణమూర్తి, బలివాడ ధనుంజయరావు, ఎంవీ రమ ణ, గురుబెల్లి దామోదరరావు, సూర పాపారావు, తదితరులు ఆరోపించారు. కుప్పిలిలో డీబారైన విద్యార్థులు, తల్లిదండ్రులు, సస్పెండైన టీచర్లు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విద్యార్థుల డీబార్లను రద్దు చేసి, వారికి న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్, మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లను కలిసి విషయాన్ని తెలియజేశామని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నేతలు బొడ్డేపల్లి గోపీచంద్, రమణ, బి.భాస్కరరావు, సూర స్వర్ణకుమారి, బి.వెంకటేశ్వరరావు, శ్రీరామ్మూర్తి, దామోదరరావు, ఎంవీ రమణ, ఎం.సాంబమూర్తి, తంగి రాజారావు, శ్రీనివాసరావు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మార్చి 26 సాయంత్రం 4 గంటలకు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఉపాధ్యాయులతో భారీ ధర్నా నిర్వహించనున్నారు. 27 సాయంత్రం 4 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయనున్నారు, అలాగే మార్చి 29న సాయంత్రం 4 గంటలకు డీఈఓ కార్యాలయం ముట్టడి, ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. కుప్పిలి మాస్ కాపీయింగ్ ఘటన జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయుల భారీ ర్యాలీ టీచర్ల సస్పెన్షన్లు రద్దు చేయాలని డిమాండ్ -
డ్వామా.. సిఫార్సుల చిరునామా
ఆ లేఖ ఉంటేనే బదిలీ, ఆ లేఖ ఉంటేనే పోస్టింగు, ఆ లేఖ ఉంటేనే అన్ని పనులు. కూటమి ప్రభుత్వం తన రూటే సెప‘రేటు’ అనిపించుకుంటోంది. ఉద్యోగుల బదిలీకి ఎమ్మెల్యే సిఫార్సు లేఖలను తప్పనిసరి చేసింది. దీంతో అధికారులు, ఉద్యోగులు ఆపసోపాలు పడుతున్నారు. కోరుకున్న చోటుకు వెళ్లడానికి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ ఆమదాలవలస అంటే మాత్రం హడలిపోతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల్లో సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతోంది. ఉద్యోగుల బదిలీల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా సిఫార్సు లేఖల సంస్కృతిని తెరపైకి తెచ్చింది. దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈనెల 20వ తేదీన జిల్లా కేంద్రంలోని డ్వామా కార్యాలయంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ (ఉపాధి హామీ) పథకంలో పనిచేస్తున్న ఎపీఓ, ఇంజినీరింగ్ కన్సల్టింగ్ (ఈసీ), టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ), కంప్యూటర్ ఆపరేటర్లు (సీఓ) తదితర ఉద్యోగుల బదిలీలను నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కానీ ఈ బదిలీల్లో ఎమ్మెల్యేలు కలుగజేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే మీరు కోరుకున్న చోటు లభిస్తుందని డ్వామా అధికారులు చేతులేత్తేయటంతో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు గత ఐదు రోజులుగా జిల్లాలోని ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు చేయాల్సిన బదిలీలను ఎమ్మెల్యేలు చేతుల్లోకి తీసుకున్నారని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఒక ఉద్యోగి.. మూడు మండలాలు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏపీఓలు ఇప్పుడు పనిచేస్తున్న క్లస్టర్లో ఉండకూడదని పక్క క్లస్టర్కు వెళ్లాలని, ఈసీ, టీఏ, సీఓ వంటి మిగిలిన ఉద్యోగులు వారి సొంత మండలాల్లో ఉండకుండా పక్క మండలాలకు వెళ్లాలని అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగి వారికి నచ్చిన మూడు మండలాలను ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. దీంతో ఉద్యోగులు వారికి నచ్చిన మూడు మండలాలను ఎంపిక చేసుకుని డ్వామా అధికారులకు వారి అంగీకారాన్ని తెలియజేశారు. బదిలీలు సజావుగా జరిగిపోతాయనుకున్న సమయంలో ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అంటూ సరికొత్త సంస్కృతి తెరమీదకు రావటంతో రాజకీయ నాయకులతో పాటు ఎమ్మెల్యేల కార్యాలయాలు చుట్టూ ఉద్యోగులు తిరుగుతున్నారు. ఆమదాలవలస అంటే హడల్.. జిల్లాలో పనిచేస్తున్న ఉపాధి హామీ పథకం ఉద్యోగుల్లో ఒక భయం వెంటాడుతోంది. ఆమదాలవలస నియోజకవర్గం అంటే హడలిపోతారు. అక్కడ పనిచేయాలంటే భయమని చెబుతారు. ఈ నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఎక్కడ పనిచేసినా చిన్న విషయాన్ని కూడా రాజకీయం చేస్తారని, ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి తమను దోషులుగా నిలబెడతారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖ ఉంటేనే పోస్టింగ్ డ్వామా బదిలీల్లో సరికొత్త సంస్కృతి ఎమ్మెల్యే లేఖ తప్పనిసరి అంటున్న అధికారులు అధికారుల తీరుతో ఉపాధి హామీ ఉద్యోగుల్లో ఆందోళన ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న ఉపాధి ఉద్యోగులు -
అందరికీ అందని అధనం
ఫిర్యాదు చేసినా.. అదనపు పరిహారం అందలేదని కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేశాం. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా అదనపు పరిహారం అందలేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించిన అదనపు పరిహారం అందించి న్యాయం చేయాలి. – చింతాడ దమయంతి, శ్రీహరిపురం, ఆమదాలవలస మండలం రాజకీయ కారణాలతోనే.. కొందరు అధికారులు, సిబ్బంది తీరు కారణంగా ఇంతవరకు పరిహారం అందలేదు. రాజకీయ కారణాలతోనే జాప్యం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పరిహారం అందలేదు. – పొలం శ్రీనివాసరావు, గాజులకొల్లివలస, ఆమదాలవలస మండలం అన్యాయం.. నిర్వాసిత కాలనీకి భూములు అందజేసిన బాధితులకు అదనపు పరిహారం ప్రకటించినా రెవెన్యూ సిబ్బంది వివరాలు తప్పుగా నమోదు చేయటం వల్ల ఇంతవకు పరిహారం అందలేదు. భూములు కోల్పోయి రోడ్డున పడ్డ బాధితులను ఇప్పటికై నా ఆదుకోవాలి. – లంక అప్పలరాజు, గాజులకొల్లివలస, ఆమదాలవలస మండలం ఆమదాలవలస రూరల్: కొంతమంది అధికారుల నిర్లక్ష్యం.. భూములు అందజేసిన రైతుల పాలిట శాపంగా మారింది. తమ తోటి రైతులు అదనపు పరిహారం అందుకున్నా తమకు మాత్రం అందకపోవడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై కార్యాలయాలు, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తున్నా కాలయాపన చేస్తున్నారు తప్ప న్యాయం చేయడం లేదని వాపోతున్నారు. తరతరాలుగా పచ్చని పంటలు పండించే భూములు ఎంతో ఉదారతమైన ఆశయంతో ప్రభుత్వానికి అప్పగిస్తే తమకు ఇలా చేస్తారా అంటూ మండిపడుతున్నారు. వంశధార రెండో దశ నిర్వాశితుల కాలనీ కోసం భూములు అందించిన పలువురు రైతులకు అదనపు పరిహారం అందక కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఇదీ పరిస్థితి.. హిరమండలం రిజర్వాయర్ కోసం తులగాం గ్రామంలో సర్వం కోల్పోయిన బాధితుల కోసం ప్రభుత్వం ఇళ్లు నిర్మించేందుకు ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస గ్రామంలో సంగమేశ్వర ఆలయం వద్ద సుమారు 115 ఏకరాలు భూమిని గుర్తించారు. ఇందులో రైతుల వద్ద నుంచి సుమారు 100 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. ఒక్కో బాధిత కుటుంబానికి ఐదు సెంట్ల స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ కాలనీ కోసం భూములు ఇచ్చిన రైతులకు రూ.5,25,000 పరిహారం కింద 2009లో అప్పటి ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ పరిహారం ఏ మాత్రం చాలకపోవటంతో 2022లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఎకరాకి రూ.1,00,000 చొప్పున అదనపు పరిహారం అందించాలని నిర్ణయించారు.దీ మేరకు రైతుల ఖాతాల్లో జమ చేశారు. అధికారుల నిర్వాకం.. అధికారులు చేసిన తప్పులు కారణంగా సుమారు 30 మంది బాధిత రైతులు అదనపు పరిహారానికి నోచుకోలేకపోయారు. రెవెన్యూ శాఖ నుంచి భూసేకరణ శాఖకు పంపాల్సిన బాధితుల జాబితాలో బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐ.ఎఫ్.ఎస్సి.కోడ్, ఆధార్ నంబర్ వంటివి తప్పుగా నమోదు చేయటంతో బాధితులకు ఇంతవరకు అదనపు పరిహారం అందని ద్రాక్షగానే మిగులుతోంది. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేస్తాం.. ఈ విషయమై ఆమదాలవలస తహశీల్దార్ ఎం.రాంబాబు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అదనపు పరిహారం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పారు. వంశధార నిర్వాసిత కాలనీకి భూములు ఇచ్చిన రైతులకు తప్పని ఎదురుచూపులు అధికారుల నిర్వాకం కారణంగా అదనపు పరిహారానికి నోచుకోని వైనం న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత రైతులు -
వేలం పాడుకో.. నచ్చినంత దోచుకో
ఇచ్ఛాపురం టౌన్: మున్సిపాలిటీలో ఆశీలు వ్యాపారం మూడుపువ్వులు ముప్పై కాయలుగా సాగుతోంది. మున్సిపాలిటీలో 23 వార్డుల్లోని ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాలు, రోడ్ల పక్కన ప్రదేశాల్లో పంటలు అమ్మినా, చిన్న బడ్డీ కొట్లు పెట్టినా మున్సిపాలిటీకి ఆశీలు చెల్లించాలి. ఈ పన్నుల వసూలుకు ఏడాదికి ఓ సారి వేలం నిర్వహిస్తారు. ఈ పన్నులకు సంబంధించి ధరల బోర్డు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించాలి. కానీ ప్రదర్శించడం లేదు. రశీదులు కూడా ఏదో కొద్దిమందికే ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అధికారుల తనిఖీలు కూడా కానరావడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు ఇదే అదనుగా దోచుకుంటున్నారు. ధరల బోర్డు పెడతాం ఆశీలుకు సంబంధించి ధరల బోర్డు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్ తెలిపారు. ఆశీలు వసూళ్లపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. -
28న దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
కాశీబుగ్గ: దివ్యాంగులకు ఉచితంగా ఈనెల 28న ఉపకరణాలను పంపిణీ చేయనున్నట్టు మదర్ చారిటబుల్ ట్రస్ట్ (దివ్యాంగుల సేవా కేంద్రం)సొండిపూడి వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లారెడ్డి భాస్కరరావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న దివ్యాంగులకు వివిధ రకాలైన ఉచిత ఉపకరణాలు ఇస్తామని అన్నారు. చంక కర్రలు, బ్లైండ్ స్టిక్, వినికిడి యంత్రాలు, చక్రాల కుర్చీ, వాకింగ్ వాకర్స్, సింగల్ వాకింగ్ స్టిక్స్, కృత్రిమ కాళ్లు, చేతులు, పోలియో వారికి కాలిపర్స్ వంటి ఉపకరణాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు. ఈనెల 27 తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా అభ్యర్థి పూర్తి వివరాలు 9989371952 ఫోన్ నంబర్కు వాట్సాప్లో గాని ఫోన్ చేసి గానీ తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకున్న వారికి మరుసటిరోజు 28 తేదీన ఉపకరణాలు ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. -
సిఫార్సు లేఖ లేకుంటే..?
బదిలీ కోసం ఎమ్మెల్యే సిఫార్సు లేఖ లేకుంటే ఉద్యోగి పరిస్థితి ఏమిటా..? అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు ఎమ్మెల్యేల వద్ద నుంచి ిసిఫార్సు లేఖలు తీసుకుని వారి వారి ప్రయత్నాలు ప్రారంభించి డ్వామా అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీన్నే కొందరు ఎమ్మెల్యేలు క్యాష్ చేసుకుంటున్నారు. బదిలీల సిఫార్సు లేఖల ముసుగులో చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. పైరవీలకు తావిచ్చేలా అధికారులు సూచించడంతో ఉపాధి హామీ పథకం ఉద్యోగుల పరిస్థితి దయానీయంగా తయారైంది. ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చారంటే భవిష్యత్లో వారు చెప్పినట్లు తప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని అంతర్మథనం చెందుతున్నారు. -
గురుకుల ప్రవేశ పరీక్ష వాయిదా
శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల (బాలికలు/బాలురు) 2025–2026 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరంలో చేరేందుకు ఏప్రిల్ 6న జరగాల్సిన పరీక్షలు ఏప్రిల్ 13 నాటికి వాయిదా పడినట్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా సమన్వయాధికారి ఎన్.బాలాజీ తెలిపారు. విద్యార్థులు పరీక్షల్లో మార్పులు గమనించాలని. సందేహాలు ఉంటే 9701736862 – 8331005217 – 08942– 279926 నంబర్లను సంప్రదించాలన్నారు.నాటుసారాతో దొరికిన టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు కంచిలి: కుంబరినౌగాం టీడీపీ ఎంపీటీసీ సభ్యుడు సింహాద్రి జన్ని నాటుసారాతో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీసులకు పట్టుబడ్డారు. సింహాద్రి జన్ని ఇంట్లో 5 లీటర్ల నాటుసారా నిల్వ ఉందని సమాచారం రావడంతో సోంపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కె.బేబీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి దాడి చేసి పట్టుకున్నారు. ఈ విషయమై సిఐ బేబీ మాట్లాడుతూ.. నాటుసారా అమ్ముతున్నారని సమాచారం రావడంతో దాడిచేసి పట్టుకుని కేసు నమోదు చేసి, అరెస్టు చేశామని తెలిపారు. తొలిరోజు ఏపీపీఎస్సీ పరీక్షలు ప్రశాంతం శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలు తొలి రోజు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు ఎచ్చెర్ల శివాని ఇంజనీరింగ్ కాలేజీ పరీక్ష కేంద్రం వద్ద భద్రత, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, పరీక్షలు జరుగుతున్న తీరు తెన్నులను మంగళవారం పరిశీలించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్, విశ్లేషకుడు గ్రేడ్–ఐఐ, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు మార్చి 25 నుంచి 27 వరకు పరీక్షలు జరుగనున్నాయి. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎచ్చెర్లలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్లో 100 మంది విద్యార్థులకు గాను 50 మంది గైర్హాజరయ్యారు. సాయంత్రం సెషన్లో 68 మంది విద్యార్థులకు గాను 41 మంది గైర్హాజరయ్యారు. శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చిలకపాలెంలో జరిగిన పరీక్షకు ఉదయం సెషన్ లో 124 మంది విద్యార్థులకు గాను 56 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 69 మంది విద్యార్థులకు గాను 31 మంది గైర్హాజరయ్యారు. కోర్ టెక్నాలజీ నరసన్నపేటలో జరిగిన పరీక్షకు 319 మంది విద్యార్థులకు గాను 171 మంది గైర్హాజరయ్యారు. జాబ్మేళా నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఆధ్యర్యంలో ఈ నెల 26న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పలాసలోని మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఉదయం 9.30నుంచి సాయంత్రం 4 గంటల వరకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. ఫ్యూషన్ ఫైనాన్స్ కంపెనీలో రిలేషన్షిప్ ఆఫీసర్, శ్రీసిటీలోని బ్లూస్టార్ కంపెనీలో ఆపరేటర్, శ్రీసిటీలోని యూనికార్న్ కంపెనీలో ఆపరేటర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు 81065 08318 నంబరును సంప్రదించాలని కోరారు. 27న పరిశ్రమల అవగాహన సదస్సు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం మేధో సంపత్తి హక్కులపై ఈ నెల 27న ఉదయం 10 గంటల నుంచి ఎచ్చెర్ల అంబేడ్కర్ యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీధర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ బ్యాంకు సహాయంతో రాంప్ పథకం కింద ఏపీఎంఎస్ఎంఈ స్పాన్సర్ చేసిన ఈ కార్యక్రమాన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈ జిల్లా పరిశ్రమల కేంద్రం సహకారంతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ యజమానులు, ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, పరిశోధకులు హాజరుకావచ్చని, ముందుగా డాక్టర్ గడ్డం సుదర్శన్ (9494959108)ని సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. -
ఉగాది పురస్కారాలకు ఎంపిక
శ్రీకాకుళం కల్చరల్: అరసవల్లి ఆదిత్యానగర్ కాలనీలోని మణిపాత్రుని క్రియేటివ్ అకాడమీ (ఎంసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 30న విశ్వావసు నామ ఉగాది పురస్కారాలను వివిధ రంగాలలో ప్రముఖులకు అందజేస్తున్నట్లు నిర్వాహకులు భాగ్యలక్ష్మి, నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. బాలరంజని సంస్థ ఆధ్వర్యంలో వివిధ నైపుణ్యాలలో ప్రతిభ సాధించిన బాలలకు పురస్కారాలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.వాండ్రంగి కొండలరావు (సాహిత్యరత్న), బద్రి కూర్మారావు (సేవా రత్న), కంటు మురళీగోవింద్ (నాట్యరత్న), ఎర్రపాటి అప్పారావు (నటరత్న), నేరెళ్ల సత్యనారాయణ (గానరత్న), ఆచింటు లక్ష్మణరావు (వాయిద్యరత్న), వడగ సుబ్రహ్మణ్యం (హరికథారత్న), ఇంజరాపు మోహన్రావు (వైద్యరత్న), యాపార శ్రీనివాస్ (యువ సేవారత్న), ఎలినాటి ధరణి (బాలరత్న–కోలాటం), బి.సన్నిహిత్ (బాలరత్న–చిత్రలేఖనం), ఎం.లిప్సి శ్రీవల్లి జయదేవ్కుమార్ (కూచిపూడి, సంగీతం), శ్రీకాకుళం చిట్టి (బాలరత్న– ఇన్స్ట్రాగామ్), బిన్నాడ దీక్షిత్ (శ్లోకపఠనం)లకు పురస్కారాలు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. అదే విధంగా, నగరంలోని సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షుడు ఉమాకవికి నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు విశిష్ట ధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారానికి ఎంపికై నట్లు ఆచార్య మాడభూషి సంపత్కుమార్ ఒక ప్రకనటలో తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికలు రేపు శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈ నెల 27న ఉదయం ఉదయం 10నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడిస్తారు. ఏడాదికోసారి జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి కార్యదర్శి, కోశాధికారి, క్రీడా, లైబ్రరీ కార్యదర్శుల పోస్టులకు ఒకే నామినేషన్ పడటంతో ఏకగ్రీవమయ్యాయి. కార్యదర్శిగా మోటూరి భవానీప్రసాద్, కోశాధికారిగా కొమర శంకరరావు, లైబ్రరీ కార్యదర్శిగా కొమ్ము రమణమూర్తి, క్రీడా కార్యదర్శిగా త్రిపురాన వరప్రసాదరావు ఎన్నికయ్యారు. మిగిలిన పదవులకు ఎన్నిక జరగనుంది. ఉప సర్పంచ్పై చర్యలకు వినతి శ్రీకాకుళం పాతబస్టాండ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంతో గెలిచి మరో పార్టీలో చేరి ఇప్పుడు మేజర్ పంచాయతీ పరిపాలనకు ఆటంకంగా మారిన నరసన్నపేట మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబుపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళం రెవెన్యూ డివిజినల్ అధికారి సాయి ప్రత్యూషకు ఫిర్యాదు చేశారు. ఉపసర్పంచ్పై పాలకవర్గంలోని 16 మంది సభ్యుల సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేశారు. ఆర్డీఓను కలిసిన వారిలో మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డు మెంబర్ కోరాడ చంద్రభూషణ గుప్తా, మెంబర్లు వార్డు రఘుపాత్రుని శ్రీధర్, బంకుపల్లి శర్మ, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జెడ్పీటీసీ చింతు రామారావు, మాజీ చైర్మన్ రాజాపు అప్పన్న, ఎంపీటీసీ బగ్గు రమణయ్య, నేతింటి రాజేశ్వరరావు, మాజీ డైరెక్టర్ బబ్బోది ఈశ్వరరావు, సతివాడ రామినాయుడు, తోట భార్గవ్ తదితరులు ఉన్నారు. 27న వర్సిటీలో క్యాంపస్ డ్రైవ్ ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ఈ నెల 27న ముత్తూట్ గ్రూఫ్ ఆధ్వర్యంలో క్యాంపస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ప్లేస్మెంట్ అధికారి విద్యాసాగర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వంద పీవోలు, ఇతర ఉద్యోగాల నియామకాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఎంబీఏ 60 శాతం, ఎం.కాంలో 70 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 8247630064 నంబరును సంప్రదించాలని కోరారు. -
విద్యుత్ షాక్తో అటెండర్ మృతి
అరసవల్లి: ఆర్డబ్ల్యూఎస్ జిల్లా ఎస్ఈ కార్యాలయం నీటి కోసం మోటార్ స్విచ్ వేయడానికి వెళ్లిన కార్యాలయ అటెండర్ మల్లారెడ్డి ఆనందరావు(47) విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో అందరూ విధుల్లో ఉండగా ఈదుర్ఘటన జరగడంతో ఇటు ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అటు జిల్లా పరిషత్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు నిర్ఘాంతపోయారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా పరిషత్ సీఈవో శ్రీధర్ రాజా ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉదయం మోటార్ వేయడానికి వెళ్లి ఇంకా రాలేదని మరో అటెండర్ శార్వాణి వెళ్లినప్పటికే అచేతనంగా ఆనందరావు పడి ఉండటంతో మిగిలిన సిబ్బందికి సమాచారాన్ని అందించింది. 108 వాహనం సిబ్బంది వచ్చేసరికే మృతి చెందినట్లు వారు ధృవీకరించారు.వన్టౌన్ ఎస్సై హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. స్థానిక దేశెల్ల వీధిలో నివాసముంటున్న ఆనందరావు స్వస్థలం నందిగాం మండలం కల్లాడ గ్రామం. భార్య దుర్గ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆనందరావు మృతి పట్ల జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజా, జెడ్పీ చైర్పర్సన్ కార్యాలయ సీసీ అప్పన్న, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రంగప్రసాద్, డీఈ లలితకుమారి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. మరో ఘటనలో.. బూర్జ: మండలంలోని చీడివలస గ్రామానికి చెందిన బూరి మణికుమార్ (18) విద్యుత్ షాక్కు గురై మంగళవారం మృతి చెందాడు. మామయ్య నూతనంగా నిర్మాణం చేపడుతున్న ఇంటి గోడలను నీటితో తడుపుతూ ఇనుప నిచ్చెన తీస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసేసరికే మృతిచెందాడు. మణికుమార్కు తల్లిదండ్రులు దుర్గారావు, కేసరి, సోదరి ఉన్నారు. చేతికందిన కుమారుడు విద్యుత్ షాక్కు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శ్రీకాకుళం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఘటన కల్లాడలో విషాదఛాయలు -
దాహం తీరే దారేదీ..?
చర్యలు తప్పవు ఈ విషయం నా దృష్టికి రాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపడతాం. ఈ విషయాన్ని ఇరిగేషన్ అధికారులకు కూడా తెలియజేస్తాం. –డి.హరి, డిప్యూటీ తహసీల్దార్, సంతబొమ్మాళి ●సంతబొమ్మాళి: నౌపడ, మర్రిపాడు, సీతానగరం తదితర గ్రామాల్లో మూగజీవాలు దాహంతో అల్లాడుతున్నాయి. ఈ మండలాల్లో చెరువులు, సాగునీటి కాలువలు, గుంటల్లో ఉన్న నీటిని పోర్టు కోసం తీసుకెళ్లిపోతుండడంతో పశువులకు గుక్కెడు కరువైపోతోంది. మూలపేట పోర్టు పనులకు సంబంధించి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ట్యాంకర్ల ద్వారా నీరు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ట్యాంక్ (2వేల లీటర్లు) రూ.700లకు, లారీ ట్యాంక్ (5వేల లీటర్లు) రూ.1500లు చొప్పున రోజుకు సుమారు 100 లోడులు వరకు పోర్టుకు నీటిని తరలించుకుని వెళ్లిపోతున్నారు. చెరువులు, కాలువల వద్ద ఇంజిన్ సాయంతో ట్యాంకర్లకు నీటిని లోడింగ్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. కాలువలు తవ్వి మరీ ఉన్న నీరు తోడేస్తున్నారు. దీంతో మేత కోసం తిరుగాడే మూగజీవాలకు వేసవిలో తాగేందుకు నీరు లేకుండా పోతోంది. కాపర్లు పశువులను బయటకు తీసుకువెళ్లడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి పశువులను కాపాడి చెరువులు, కాలువల్లో నీరు తోడి అమ్ముకుంటున్న ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు. -
అండగా ఉంటాం.. అధైర్యపడవద్దు
ఇచ్ఛాపురం రూరల్/ఇచ్ఛాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కక్షపూరిత దాడులతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే తరచూ కార్యకర్తలపై దాడులు, ఆస్తుల ధ్వంసం, వైఎస్సార్ సీపీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు నిలుపుదల, అధికారులతో ఒత్తిడికి గురి చేస్తున్నారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రామారావు, విజయ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని, కూటమి ప్రభుత్వం మాత్రం సొంత కార్యకర్తలకు పెద్దపీట వేయడం దారుణమన్నారు. ఈ విధానాలపై ప్రతిఒక్క కార్యకర్త గళమెత్తాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల మశాఖపురం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త కె.భీమారావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేయడంతో మంగళవారం బాధితుడిని పరామర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు, వివక్షలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ ఎం.చిన్నంనాయుడికి వినతిపత్రం అందించారు. రౌడీషీట్లు ఓపెన్చేస్తామని బెదిరిస్తున్నారని, మహిళలతో అగౌరవంగా మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మండల పార్టీ కన్వీనర్ పాతిర్ల రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ బోర పుష్ప, సీడాప్ మాజీ చైర్మన్ సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సల్ల దేవరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పోక్సో చట్టంపై అవగాహన
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి పి.భాస్కరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ 4వ లైన్లో ట్రైబల్ హాస్టల్ల్లో పిల్లలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం–పోక్సోపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల పట్ల అనేక నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. అశ్లీల చిత్రాలు చూపించడం నేరమని తెలిపారు. కార్యక్రమంలో అడ్వకేట్ జి.ఇందిరాప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ.రాజారావు, ఆర్.అప్పలస్వామి, జి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
బెట్టింగ్లకు పాల్పడవద్దు
గుర్తుంచుకోండి ● తెలియని లింక్లపై క్లిక్ చేస్తే చిక్కులు ● డేటా కాజేసి దోచేస్తారు ● అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ నిపుణులు శ్రీకాకుళం క్రైమ్: ● జిల్లా కేంద్ర సమీపంలోని అపార్ట్మెంట్లో ఒక వివాహిత నివాసముంటోంది. ఆమెకు ఫ్యాషన్స్పై మోజు ఉండడంతో ఎఫ్బీలో తక్కువ ధరకే సిల్క్ శారీస్ అంటూ ఆఫర్తో కూడిన ఒక లింక్ వస్తే క్లిక్ చేసింది. దీనికోసం ఆమె రూ.1,200 లు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసింది. అయితే కొద్దిరోజులకే వచ్చిన పార్సిల్లో కనీసం రూ.200 లు విలువైనా చేయని చీర రావడంతో లబోదిబోమంది. ● నగరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. విజిల్ అప్డేట్స్ పేరుతో లోన్ అప్రూవ్డ్ అంటూ ఒక మెసేజ్ అతడి సెల్ఫోన్కు వచ్చింది. డియర్.. యువర్ 25,000 లోన్ హేజ్ బీన్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ, చెక్ యువర్ డీటైల్స్ హియర్ అంటూ ఓ లింక్ వచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఆ లింక్పై క్లిక్ చేసిన వెంటనే అతని అకౌంట్, ఆధార్, యూపీఐ డీటైల్స్ అన్నీ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోయాయి. అకౌంట్లో ఉన్న రూ.60 వేలు మాయమయ్యాయి. ఇలా మెసేజులు, ఈ–మెయిల్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో తక్కువ అక్షరాలతోనే షార్ట్ వెబ్ లింక్లు పంపించి సైబర్ కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. జిల్లాలో ఇటువంటి మోసాలు కోకొల్లలు. చిన్నవిగా వచ్చే ఈ లింక్లపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా చోరీ వాస్తవానికి పెద్దవిగా, గజిబిజి అక్షరాలతో ఉండే వెబ్లింక్లను చిన్నవిగా షార్ట్ లింక్ల మాదిరిగా చేసి ఎవరికై నా పంపే ఆప్షన్లు ఇప్పుడొచ్చేసాయి. దీంతో దీనినే ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ఏమార్చుతున్నారు. షార్ట్లింక్స్లో మాల్వేర్లను పంపి వైరస్లను వ్యాప్తి చేస్తున్నారు. దీనిద్వారా మన ఫోన్ లేదంటే కంప్యూటర్లో ఉన్న పర్సనల్ డేటా హ్యాక్ చేస్తారు. ఈ–మెయిల్ ద్వారా వచ్చే లింక్ క్లిక్ చేస్తే ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అయ్యి తెలియక మన వివరాలన్నీ ఎంటర్ చేసేస్తాం. హ్యాకర్లు ఈ లింక్లతో మన సిస్టమ్ను వారి కంట్రోల్లోకి తీసు కుని క్రిప్టో మైనింగ్ ద్వారా డబ్బులు దోచేస్తారు. హలో అంటూ అందినకాడికి.. వేసవి సమీపిస్తుండడంతో మన ఇంట్లో ఉపయోగించే ఏసీ, ఫ్రిజ్, టీవీల వంటివి రిపేర్ అవుతుంటాయి. అలాంటి సమయంలో కస్టమర్ కేర్ నంబర్ కోసం నెట్లో వెదికితే అవే కంపెనీల పేరిట ఫేక్ కాల్ సెంటర్ల నుంచి సైబర్ ఫ్రాడ్స్ ఎరవేస్తారు. టెలీ కాలర్స్లా మాట్లాడి బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ డీటైల్స్, ఓటీపీ, యూపీఐ పిన్ అడుగుతారు. ఎన్నో ప్రముఖ కంపెనీల పేరిట పుట్ట గొడుగుల్లా ఫేక్ కస్టమర్ కేర్ సెంటర్లు నడుస్తుండడం, ఇంటర్నెట్లో దర్శనమిస్తుండడంతో మోసపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే యువత కాల్ సెంటర్లలో డబ్బులు ఎక్కువగా వస్తాయని ఆశించి, టెలీ కాలర్స్గా చేరితే తీరా అవి మోసపూరితమైనవని తెలిశాక అవాక్కవుతున్నారు. సైబర్ అలెర్ట్ సెల్ఫోన్కు వచ్చే మెసేజ్లు, వాట్సాప్, ఈ–మెయిల్కు వచ్చే లింకుల్లో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టాలి. తెలియని లింక్లు క్లిక్ చేయకూడదు. ఒక వేళ తెలియక క్లిక్ చేసినా డబ్బులు పంపించకూడదు. ఓటీపీ, నెట్ బ్యాంకింగ్, యూపీఐ పిన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే సైట్స్లో ఎంటర్ చేయరాదు. తెలియని క్యూఆర్ కోడ్లు స్కాన్ చేయరాదు. క్రెడిట్ కార్డులో నగదు పెంచేందుకు గడువు ఒక్కరోజే ఉంది. ఓటీపీ చెబితే వెంటనే అప్డేట్ చేస్తామంటారు. ఇలాంటివి నమ్మవద్దు. మీరు ఆన్లైన్లో కొన్న వస్తువుకు గిఫ్ట్ వచ్చింది. అడ్రస్ చెబితే ఇంటికి పంపిస్తామని ఫేక్ కాల్ సెంటర్ నుంచి ఫోన్ వస్తుంది. చిరునామా గానీ, బ్యాంకు ఖాతా వివరాలు కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరాదు. ఎవరైనా పైన పేర్కొన్న సైబర్ మోసాలకు గురైతే 1930 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేయాలి. లేదంటే https://www.cybercrime. gov.inలో ఫిర్యాదు చేయాలి. మీ పరిధిలో ఉండే పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. సంబంధిత బ్యాంకువారిని మోసపోయిన గంటలోనే సంప్రదించాలి. శ్రీకాకుళం క్రైమ్: ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైన నేపథ్యంలో యువత బెట్టింగ్లకు పాల్పడి, జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెడుతున్నామని, మ్యాచ్లను వినోద ప్రక్రియలో చూడాలి తప్ప కుటుంబంలో విషాదం నింపేదిగా ఉండరాదన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల జోలికి పోకూడదని సూచించారు. బెట్టింగ్లో ఒకసారి ఆదాయమొచ్చినట్లు అనిపించినా, పలుమార్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. నష్టాలను భర్తీ చేసేందుకు, అప్పులు తీర్చేందుకు నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారని, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్లకు పాల్పడినా, బెట్టింగ్లను నిర్వహించినా ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడినట్లు సమాచారముంటే డయల్ 112/100కు లేదా సంబంధిత పరిధి పోలీసులకు తెలపాలని కోరారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి -
నిఘా నడుమ టెన్త్ పరీక్షలు
ఓటీపీ.. వెతలు కాశీబుగ్గ: పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ఓపీ కోసం రోగులకు వెతలు తప్పడం లేదు. రోగి ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సెల్ఫోన్కు వచ్చే ఓటీపీని చెబితేనే ఓపీ చీటి ఇస్తున్నారు. దీంతో నిరుపేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చదువు రాని, మారుమూల పల్లెలు నుంచి సెల్ఫోన్ లేకుండా వస్తున్న రోగులను పక్కకు జరిగి ఉండాలని చెబుతుండడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 200–300 వరకు నమోదయ్యే ఓపీలు, ఒక్కసారిగా 90–100 లోపునకు మాత్రమే నమోదు అవుతుండడంతో అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అనారోగ్యంతో ఆస్పత్రి వస్తున్నవారికి ఓపీ చీటీ కోసం క్యూలైన్ లేకుండా సులభతరం చేయాలని, సెల్ఫోన్ లేకపోయినా వైద్య సేవలు సక్రమంగా అందేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అధికారుల నిఘా నడుమ కొనసాగుతున్నాయి. ఇటీవల కుప్పిలి మోడల్ స్కూల్ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా 149 పరీక్ష కేంద్రాల్లో జరిగిన మ్యాథ్స్ పరీక్షకు రెగ్యులర్, ప్రైవేటు కలిపి 28,584మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 28,384 మంది పరీక్షకు హాజరయ్యారు. వివిధ కారణాలతో 199 మంది గైర్హాజరయ్యారు. సోమవారం మ్యాథ్స్ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదని డీఈఓ స్పష్టం చేశారు. జిల్లా పరిశీలకులు మస్తానయ్య కుప్పిలి మోడల్ స్కూల్ ఏ, బీ కేంద్రాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఏర్పాట్లు, సౌకర్యాలతో పాటు పరీక్షలు జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. డీఈవో డాక్టర్ తిరుమలచైతన్య జలుమూరు, సారవకోట మండల పరిధిలో ని పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కుప్పిలిలో ప్రశాంతం ఎచ్చెర్ల క్యాంపస్: కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్ష కేంద్రంలో సోమవారం 10వ తరగతి గణితం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. గణితం పరీక్షను రాష్ట్ర పరిశీలకులు, మస్తానయ్య, మండల విద్యా శాఖ అధికారి కె.పున్నయ్య పరీక్ష పరిశీలించారు. ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 9 గదుల్లో 425 మంది పరీక్ష రాస్తున్నారు. పరీక్ష నిర్వహణ విధుల్లో ఉన్న ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు 21 మందిని మార్పు చేశారు. ిసట్టింగ్ స్క్వాడ్గా వ్యవహరించిన డీఈఓ సారవకోట: మండలంలోని బుడితి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జరిగిన 10వ తరగతి లెక్కలు పరీక్షకు సిట్టింగ్ స్క్వాడ్గా డీఈఓ తిరుమల చైతన్య వ్యవహరించారు. ఇక్కడ పరీక్షలు జరుగుతున్న విధానంపై అనుమానం రావడంతో పాటు ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన పరీక్ష కేంద్రాన్ని తొలుత పరిశీలించి అనంతరం పరీక్ష ముగిసే వరకు అక్కడే ఉన్నారు. 10వ తరగతి పరీక్షలలో మాస్ కాపీయింగ్కు అవకాశం లేకుండా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించే మూడు విభాగాల పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు సోమవారం తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, నిరంతర విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు షిఫ్ట్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు షిఫ్ట్–2లు పరీక్షా సమయంగా నిర్ణయించామన్నారు. పరీక్షకు అరగంట ముందుగా గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. సమావేశంలో డీఎస్పీ సీహెచ్ వివేకానంద, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఈశ్వరి, పద్మప్రియ, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి టీవీ బాలకష్ణ, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు -
గంజాయితో యువకుడు అరెస్టు
కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తూ ఒక యువకుడు సోమవారం పట్టుబడినట్లు సీఐ సూర్యనారాయణ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్, సబరాపల్లికి చెందిన ఆమద్ ఆనంద్ సోమవారం ఉదయం 10 గంటలకు గంజాయితో పట్టుబడ్డాడు. స్వగ్రామం నుంచి పలాస రైల్వేస్టేషన్ వరకు తరలించేందుకు రూ.3 వేలకు ఒప్పందం కుదుర్చుకుని, పలాస రైల్వేస్టేషన్ రన్నింగ్ రూం పక్కరోడ్డులో నడుచుకుంటూ స్టేషన్లోకి వచ్చే సమయంలో పోలీసులను చూసి రెండు బ్యాగులు వదిలి ఇద్దరు వ్యక్తులు పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వెంబడించగా నిఖిల్ పాని తప్పించుకోగా, ఆమద్ అనంద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడి వద్దనుంచి 21.7 కేజీల గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమ్మకందారులు, మధ్యవర్తులు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. -
తూర్పు కాపుల ఐక్యతను చాటిచెప్పాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో తూర్పుకాపుల ఐక్యతను చాటిచెప్పాల్సిన అవసరం ఉందని జిల్లా తూర్పుకాపు సామాజికవర్గం ప్రతినిధులు సురంగి మోహనరావు, డోల జగన్మోహన్, లంక గాంధీ, శాసపు జోగినాయుడు, ఇజ్జాడ శ్రీనివాసరావులు అన్నారు. నగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో తూర్పుకాపుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా మండల కేంద్రాల్లో ముందుగా తూర్పు కాపు జాతి ఐక్యత చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పుకాపులు నేడు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 38 మండలాల్లో జాతి ఐక్యత చైతన్య సదస్సులు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా స్కిల్ డవలప్మెంట్ అథారిటీ సారథ్యంలో శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. త్వరలో దీనికి సంబంధించిన టూర్ ప్రోగ్రాం విడుదల చేస్తామన్నారు. పరిహారం ఇవ్వకపోవడం దారుణం వంశధార ప్రాజెక్టు రెండో దశ నిర్మాణం వలన దెబ్బతిన్న నిర్వాసితులకు ఇంతవరకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికై నా అర్హులైన నిర్వాసితులకు గత ప్రభుత్వం పెంచిన పరిహారాన్ని సత్వరమే అందించి ఆదుకోవాలని కోరారు. నిర్వాసితులకు కేటాయించిన కొత్తూరు మండలం గూనభద్ర కాలనీ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలని తీర్మానించారు. హిరమండలాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. తూర్పు కాపు సామాజికవర్గం భవన నిర్మాణానికి విరాళాలు ప్రకటించిన దాతలు వెంటనే కమిటీ ప్రతినిధులకు అందజేయాలని, చిరకాల స్వప్నం కాపు భవన్ నిర్మాణం త్వరలో సాకారం కాబోతుందన్నారు. లావేరు మండలం నుంచి తూర్పు కాపు చైతన్య యాత్రలు ప్రారంభమవుతాయని, అదేవిధంగా భవనం నిర్మాణానికి సంబంధించి విరాళాల సేకరణ కూడా పునః ప్రారంభమవుతుందన్నారు. రాజకీయాలకతీతంగా అన్ని వర్గాల వారు విరివిగా విరాళాలు అందించాలని కోరారు. సమావేశంలో శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులు డోల తిరుమలరావు, పొగిరి సుగుణాకరరావు, కిళ్లారి నారాయణరావు, డాక్టర్ ఎం.రామజోగినాయుడు, పడాల తమ్మునాయుడు, వాళ్ల శ్రీరాములునాయుడు, రౌతు గోపి, సురవరం పార్వతీ, గెడ్డాపు రాజేంద్ర ప్రసాద్, ఎస్.సత్యనారాయణ, పిసిని వసంతరావు, కురిటి దుర్గారావు, డాక్టర్ చందక రామకృష్ణ, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధులు పల్లి సురేష్, పాండ్రంకి రమేష్ నాయుడు, డోల బాలమురళీకృష్ణ, ఎం.శంకర్నారాయణ, నేతల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
టెన్త్ పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురైన విద్యార్థిని
మెళియాపుట్టి: మండలంలోని పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాస్తున్న శ్వేత అనే విద్యార్థిని అస్వస్థతకు గురై కింద పడిపోయి స్పృహ కోల్పోయింది. నందిగాం మండలం సవరలింగుపురం గ్రామానికి చెందిన శ్వేత మెళియాపుట్టి మండలం పెద్దమడి బాలికల సంక్షేమ వసతి గృహంలో పదో తరగతి చదువుతుంది. సోమవారం గణితం పరీక్ష రాస్తూ.. కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సపర్యలు చేశారు. పరీక్షలకు ముందు అనారోగ్యం బారిన పడడంతో తల్లిదండ్రులు పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందజేసినట్లు విద్యార్థి తెలిపింది. నీరసంగా ఉండడంతోనే కళ్లు తిరిగాయని వైద్య సిబ్బంది తెలిపారు. సపర్యల అనంతరం ఆమె మళ్లీ పరీక్ష రాసింది. -
దుప్పలపాడులో చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు గ్రామంలో సోమవారం సాయంత్రం అల్లు మహేశ్వరరావు అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన అల్లు మహేశ్వరరావు, అతని భార్య లక్ష్మి ఇరువురు తమ ఇంటికి తాళం వేసి ఉదయం కూలి పనులకు వెళ్లిపోయారు. వారు సాయంత్రం తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడ్డారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో దొంగలు పడ్డారని గుర్తించారు. కష్టపడి సంపాదించి కూడబెట్టుకున్న నగదుతో పాటు సుమారు 10 తులాల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితుడు కోటబొమ్మాళి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వి.సత్యనారాయణ ఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేశారు. -
నిధుల గోల్మాల్పై ఫిర్యాదు
హిరమండలం: మండలంలోని తంప పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్కు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మామిడి చిన్నబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీపీవోకు ఆదేశించారు. పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ శాఖలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి అయినటువంటి తన పేరును ఉప సర్పంచ్గా రికార్డుల్లో చూపి దుర్వినియోగం చేసినట్లు వాపోయాడు. న్యాయం చేయండి నందిగాం: చట్టబద్ధంగా కొనుకున్న ఇంటిని ఖాళీ చేయించి, దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని మండలంలోని కొత్తగ్రహారానికి చెందిన ఏదూరు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సోమేశ్వరరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. 2022 మార్చి 30వ తేదీన కొత్త అగ్రహారంలో ఉన్నటువంటి ఇల్లు, ఖాళీ స్థలాన్ని పొట్నూరు ఆనందరావు, అతని సోదరులు, సోదరి తనకు అమ్మినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కాశీబుగ్గ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారని తెలియజేశారు. అప్పటినుంచి ఆ ఇంట్లోనే తాను, తన పిల్లలు, అత్తతో కలిసి ఉంటున్నానని తెలిపారు. భర్త గల్ఫ్ దేశంలో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అయితే గ్రామానికి చెందిన దుంప కృష్ణారావు మరలా ఆనందరావుతో కోటబొమ్మాళి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకొని, ఇంటి నుంచి తమను వెళ్లగొట్టడానికి పలుమార్లు దాడులు చేశారని వాపోయారు. కోర్టులో కేసు నడుస్తున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడవారు, పిల్లలపై ఈ దాడులు మరింత తీవ్రంచేస్తూ దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నందిగాం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడిని కలిసినా న్యాయం జరగలేదని తెలిపారు. అనంతరం దుంప కృష్ణారావు తదితరులు ఇంట్లో సామాన్లు పగలుగొట్టి, దాడులు చేసి ఇంటి నుంచి గెంటేశారని తెలిపారు. దీంతో ప్రస్తుతం వేరే వాళ్ల ఇంట్లో తలదాచుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. మృతుడు అంబకండి వాసిగా గుర్తింపు పొందూరు: స్థానిక రైల్వేగేటు సమీపంలో ఆదివారం జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుడు రేగిడి ఆమదాలవలస మండలంలోని అంబకండి గ్రామానికి చెందిన బోడిసింగి వెంకటరమణ(25)గా గుర్తించినట్లు సోమవారం జీఆర్పీ ఎస్ఐ ఎస్.మధుసూదనరావు తెలిపారు. మృతుడు విజయవాడలో తాపీ పనులు చేస్తుంటాడని, వారం రోజుల క్రితం ఊరు వచ్చాడని పేర్కొన్నారు. తిరిగి మరలా విజయవాడ వెళ్లేందుకు పొందూరు రైల్వేస్టేషన్కు వచ్చాడన్నారు. ఈ క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందినట్లు తండ్రి చిన్నారావు ఫిర్యాదు చేశారన్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఆదిత్యుని హుండీ కానుకల లెక్కింపు నేడు అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆల య హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ మంగళవా రం ఉదయం 8 గంటల నుంచి అనివెట్టి మండపంలోనిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ ప్రక టనలో తెలియజేశారు. ఈమేరకు నిబంధనల ప్రకా రంగ్రామపెద్దలు, ఆలయ పాలకమండలి సభ్యులు, అఽధికారులు, ప్రధానార్చకులు సమక్షంలో హుండీ లను తెరిపించి లెక్కింపును చేపడతామని ఆయన వివరించారు. -
● మా.. ఊరికి రండి..!
విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1990లో చదువుకున్న విద్యార్థులంతా, మూడున్నర దశాబ్ధాల తర్వాత మరలా మెడికల్ కళాశాలలో కలుసుకొని గత స్మృతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, డాక్టర్ హర్షవల్లి నేతృత్వంలో మా ఊరికి రండి పేరిట పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమం వైభవంగా జరిగింది. రోజంతా ఆనందోత్సహాల నడుమ గడిపిన వైద్యులంతా, ప్రజలకు మరింత వైద్య సేవలు అందజేసేందుకు వినూత్న ఆలోచనలు చేశారు. వైద్యరంగంలో ప్రజా ఆరోగ్య సమస్యలను రూపుమాపేందుకు ప్రతిజ్ఞ చేశారు. –శ్రీకాకుళం అర్బన్ -
మట్టి మాఫియా
దంతలోమట్టి తరలిస్తున్న టిప్పర్సోమవారం రాత్రి చీకటిలో మట్టి తవ్వకాలుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సొంత మండలం కోటబొమ్మాళి మండలంలోని దంత గ్రామంలో గల పెద్ద చెరువు నుంచి అక్రమంగా రాత్రి పూట మట్టి తరలిస్తున్నారు. కీలక నేత పేరు చెప్పుకుని మట్టి రవాణా చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా ఇప్పుడా అక్రమాల్లో మట్టి కూడా చేరింది. టెక్కలి నియోజక వర్గంలో ఇప్పటికే మైనింగ్ దందా నడుస్తోంది. అనుమతి లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రానైట్ అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా చేస్తున్నారు. పర్మిట్లతో పని లేకుండా బ్లాకులు తరలిపోతున్నాయి. ముఖ్యంగా కోటబొమ్మాళి మండలంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతోంది. ఇప్పుడు అదే మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రిపూట పెద్ద పెద్ద చెరువులను తవ్వేసి అక్రమంగా తరలిస్తున్నారు. అందులో భాగంగా దంత గ్రామంలోనీ పెద్ద చెరువును కూడా తవ్వేసి వందల లారీల్లో తరలించేస్తున్నారు. సోమవారం రాత్రి 10గంటల సమయంలో అధిక సంఖ్యలో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నా పట్టుకునే నాథుడు లేకుండా పోయారు. టిప్పర్ల ద్వారా పెద్ద చెరువు నుంచి రాత్రి పూట మట్టి తరలిస్తున్నారని స్థానికులు అటు పోలీసులకు, ఇటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మాఫియా దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చీకటిలో వెళ్తున్న టిప్పర్ -
డప్పు కళాకారులను ఆదుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): డప్పు కళాకారులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, డప్పు కళాకారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిరిపురం గురువులు, గొర్లె రవి డిమాండ్ చేశారు. నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్లో జిల్లాస్థాయి సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డప్పు ప్రాచీన కాలం నుంచి సమాజాన్ని చైతన్య పరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో డప్పు కళాకారులు ఉన్నారని, ప్రధానంగా వీరంతా తరతరాలుగా డప్పు కళను వృత్తిగా చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారన్నారు. ప్రభుత్వం రూ.7 వేల పెన్షన్, గుర్తింపు కార్డులు మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. 2014 టీడీపీలో పెన్షన్లు పూర్తిస్థాయిలో అమలు కాలేదని, 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరలా సర్వే పేరుతో పెన్షన్లు తొలగించే ప్రక్రియ ప్రారంభించడం సరికాదన్నారు. అర్హులైన వారందరికీ పెన్షన్లు యథావిధిగా కొనసాగించాలని, కొత్త పెన్షన్లు ఇవ్వాలని విన్నవించారు. అధికారంలోకి వచ్చి సుమారు 10 నెలలు కావస్తున్నా ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరుకి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమన్నారు. సమావేశంలో ఆరవ డిల్లీ, బాలు, దమ్ము కృష్ణ, బోనేల రామయ్య, సవాలపురపు అప్పన్న, కాళ్ల అప్పారావు, గెడ్డపు రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
● వ్యక్తికి తీవ్రగాయాలు కంచిలి: మండలంలోని జాడుపూడి కాలనీ వద్ద ఆదివారం అర్థరాత్రి ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న కారు, రోడ్డు క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి తీవ్రగాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన కప్పల జగదీష్ రెడ్డి అనే యువకుడు ఆదివారం కొల్లూరు గ్రామానికి వెళ్లాడు. అనంతరం అతను జాడుపూడి వద్ద భోళా శంకర్ దాబాకు ఆదివారం రాత్రి డిన్నర్కు వచ్చాడు. డిన్నర్ పూర్తి చేసుకొని తన బైక్ మీద జాడుపూడి కాలనీ వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా, ఇచ్ఛాపురం నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న కప్పల జగదీష్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని 108 అంబులెన్స్లో ఇచ్ఛాపురం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం వేకువజామున కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు తెలిపారు. -
గురుకుల పరీక్షల షెడ్యూల్లో మార్పులు
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల/జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు దుప్పలవలస బాలురు, ఎచ్చెర్ల బాలికలు పాఠశాలల ప్రిన్సిపాళ్లు బోర బుచ్చిబాబు, లక్ష్మి సోమవా రం ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర, ఐదో తరగతి ప్రవేశ పరీక్ష లు ఏప్రిల్ ఆరు నుంచి 13వ తేదీకి వాయిదా పడినట్లు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఐదో తరగతి ప్రవేశ పరీక్ష, మధ్యాహ్నం 2 గంటలు నుంచి 4.30 గంటల వరకు ఇంటర్ ప్రవేశ పరీక్ష నిర్వహించ నున్నట్లు చెప్పారు. విద్యార్థులు గమనించాలని, హాల్ టిక్కెట్లతో పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుందని అన్నారు. టీచర్ల సస్పెన్షన్లు రద్దు చేయాలని డిమాండ్ శ్రీకాకుళం అర్బన్: ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారి చేపట్టిన ఉపాధ్యాయ సస్పెన్షన్లను వెంటనే రద్దు చేయాలని జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ముక్త కంఠంతో డిమాండ్ చేసింది. శ్రీకాకుళంలోని ఎన్జీఓ సంఘ కార్యాలయంలో సోమవారం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం చౌదరి రవీంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. 25న సాయంత్రం 4గంటలకు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. తదుపరి కొన్ని నిరసనల అనంతరం ఏప్రిల్ 3న టెన్త్ స్పాట్ బహిష్కరించాలని నిర్ణయించారు. నేడు శ్రీకూర్మనాథాలయ హుండీ ఆదాయం లెక్కింపుగార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథాలయ హుండీలను మంగళవారం తెరిచి ఆదాయం లెక్కించనున్నామని ఆలయ ఇన్చార్జి ఈఓ జి.గురునాథం ఒక ప్రకటనలో తెలిపారు. కూర్మనాథాలయంతో పాటు పాతాళ సిద్ధేశ్వర, తండ్యాలపేట అభయాంజనేయ స్వామి ఆలయ హుండీలను లెక్కించనున్నామని ఆ ప్రకటనలో తెలిపారు. -
నిశిరాత్రి విధ్వంసం
కొత్తూరు అతలాకుతలం విద్యుత్ తీగ నుంచి మంటలు స్థానిక ఆదిఆంధ్ర వీధిలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత కురిసిన వానకు విద్యుత్ తీగ తెగి పడిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సోమవారం ఉదయం 6గంటలు సమయంలో కరెంటు రావడంతో ఒక్కసారిగా ఆ విద్యుత్ వైరు నుంచి మంటలు చెలరేగాయి. దీంతో విద్యుత్ వైరు పడిన భాగంలో ఉన్న కాగితాలు, కవర్లు మంటకు అంటుకున్నాయి. ఎవరైనా అటువైపుగా వెళ్లి ఉంటే పెను ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు విద్యుత్ లైన్లు సరిచేశారు. –టెక్కలి రూరల్అరసవల్లి: ఆదివారం అర్ధరాత్రి దాటాక ఉరుముల వాన జిల్లాకేంద్రంపై విరుచుకుపడింది. భారీ గాలు లు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో బీభత్సం సృష్టించింది. ఈ వాన దెబ్బకు జిల్లా కేంద్రం అంతా చీకటిగా మారిపోయింది. గాలుల తీవ్రత అధికంగా ఉండడంతో పలు చోట్ల భారీ చెట్లు, కొమ్మలు పడిపోవడంతో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పిడుగుల ధాటికి పదుల సంఖ్యలో ట్రాన్స్ఫార్మర్లు కూలిపోయాయి. దీంతో సోమవారం జిల్లా కేంద్రం సరిహద్దుల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు చోట్ల రహదారులన్నీ స్తంభించిపోయాయి. జిల్లాలో టెక్కలి, పలాస డివిజన్లలో ఈ వర్షం ప్రభావం పెద్దగా లేకపోవడంతో తీర ప్రాంతాల్లో పెద్ద ప్రభావం చూపలేదు. అయితే స్థానిక డివిజన్లో మాత్రం విద్యుత్ శాఖకు పెద్ద నష్టమే మిగిల్చి ంది. ప్రధానంగా జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్, ఇల్లిసిపురం, ఏఎస్ఎన్ కాలనీ, బొందిలీ పురం, పాలకొండ రోడ్డు, బలగ కూడలి, ఆసుపత్రి జంక్షన్, కత్తెర వీధి ఫీడర్ తదితర నగర ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం రూరల్ గ్రామాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆయా ప్రాంతాల్లో సుమారు 30 వరకు విద్యుత్ స్తంభాలు కూలిపోగా, పిడుగులు పడి సుమారు 16 ట్రాన్స్ఫార్మర్లు పాడయ్యాయి. దీంతో పాటు భారీ వృక్షాలు నేలకూలిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. ఫలితంగా విద్యుత్ శాఖకు రూ.35లక్షలు నుంచి రూ.40 లక్షల వరకు నష్టం వచ్చిందని అంచనా వేసినట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈ పైడి యోగేశ్వరరావు, టెక్నికల్ ఈఈ సురేష్కుమార్లు తెలియజేశారు. శరవేగంగా పునరుద్ధరణ అకాల వర్షాలకు శ్రీకాకుళం డివిజన్లో ప్రధానంగా జిల్లా కేంద్రంలోనే అత్యధిక ప్రభావం కనిపించింది. పిడుగుల ధాటికి ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో పాటు ధ్వంసం కావడంతో విద్యుత్ సరఫరాకు బ్రేక్ పడింది. అలాగే గాలుల కారణంగా ఫ్లెక్సీలు విద్యుత్ వైర్లపై పడటంతో కూడా విద్యుత్ సరఫరా కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సోమ వారం వేకువజాము నుంచే విద్యుత్ శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆదేశాల మేరకు టెక్నికల్ ఈఈ సురేష్, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులు యుద్ధప్రాతిపదికన క్షేత్ర స్థాయిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు బృందంతో కలిసి ఇల్లిసిపురం, బొందిలీపురంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో సోమవారం సాయంత్రానికి దాదాపుగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అయితే ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో మాత్రం సోమవారం రోజంతా విద్యుత్ సరఫరా జరగలేదు. రోజంతా కాంప్లెక్స్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షాలు అన్నదాతకు అపార నష్టం కలిగించాయి. ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వాన పడడంతో కొత్తూరు, కర్లెమ్మ, బడిగాం, మహసింగి, సిరుసువాడ, కుంటిభద్ర, నివగాం, మెట్టూరు గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సాగు చేస్తున్న వందలాది ఎకరాల అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. గాలులకు నష్టపోయిన పంటలకు ప్రభు త్వం నష్ట పరిహారం చెల్లించాలని బాధిత రైతు లు తోకల ధర్మారావు, భాస్కరరావు, పెద్దకోట ఆనందరావుతో పాటు పలువురు కోరుతున్నా రు. ఈదురు గాలులకు మండలంలో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు గ్రామాల్లో చెట్లు విరిగి పడిపోయాయి. – కొత్తూరు కోలుకోలేని నష్టం చేతికి అందిన అరటి పంట ఈదురుగాలులకు నేలమట్టమైంది. ఎకరాకు సుమారు రూ. 75 వేల వరకు పెట్టుబడి పెట్టాము. ఏడాది పాటు కష్టపడి సాగు చేసిన అరటి పంట గాలులకు నేలకొరిగిపోయింది. ఎకరాకు సుమారు రూ. 2 లక్షలు వరకు నష్టపోయాం. మమ్మల్ని ఆదుకోవాలి. – పెద్దకోట ఆనందరావు, అరటి రైతు, కొత్తూరు జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ వాన శ్రీకాకుళం, రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలుపుదల తెగిపడిన విద్యుత్ వైర్లు, కూలిన ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు రూ.40 లక్షల వరకు విద్యుత్ శాఖకు నష్టమని అంచనా -
‘ప్రసాద్’ పథకం కోసం ప్రయత్నాలు
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఇంకా ఎలాంటి ఫాలోఅప్ చేయకపోవడంపై తనకు అసంతృప్తిగా ఉందని రాష్ట్ర మంత్రి కె.అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం కుటుంబసమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈవో వై.భద్రాజీ, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే రథసప్తమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఇందుకోసం ఆలయం ముందర నిర్మాణాలన్నీ యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి.. అద్భుతంగా అభివృద్ది పనులు చేపట్టాలని భావించామని, తర్వాత ఫాలో అప్ సరిగ్గా లేకపోవడంతో పనులు ప్రారంభించలేకపోయామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ‘ప్రసాద్’ స్కీం మంజూరు కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని.. ఆ నిధులు వచ్చేవరకు భక్తులకు తాత్కాలికంగా సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకోసం కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, మంత్రి సోదరుడు హరిప్రసాద్, టీడీపీ ఇన్చార్జిలు తెలుగు నాగరత్నం, ఉంగటి రమణమూర్తి, ఉంగటి పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో అన్నీ ఇబ్బందులే
పాతపట్నం: అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ప్రజలను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర తూర్పుకాపు కుల రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ విమర్శించారు. పాతపట్నంలోని రెడ్డి అపార్ట్మెంట్లోని తన కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్లు కోసం సూపర్ సిక్స్ పథకాలైన తల్లికి వందనం, ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటూ అన్నివర్గాలనూ కూటమి నాయకులు మోసం చేశారన్నారు. వెరిఫికేషన్ పేరుతో గత 20 ఏళ్లుగా ఉన్న పింఛన్లను తొలగిస్తున్నారని, దివ్యాంగులను ఎండల్లో తిప్పి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన పది నెలల్లోనే ప్రజలను నుంచి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. రెడ్ బుక్ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, వాటికి భయపడేది లేదన్నారు. ప్రజల సమస్యలపై ప్రతీ సోమవారం మండల, జిల్లా స్థాయి గ్రీవెన్స్లో ఫిర్యాదులు చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో ఎల్.ఎన్.పేట జెడ్పీసీటీ సభ్యుడు కిల్లారి త్రినాథరావు, పార్టీ నాయకులు తూలగాపు తిరుపతిరావు, ఎన్ని తిరుపతి, నాగరాజు, గూరాడి అప్పన్న, బొని గిరి, బోసి రామారావు, కనకాల కర్రెన్న, పల్లి గోవిందరావు, కీర్తి తిరుమలరావు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
మారణకాండపై న్యాయ విచారణ జరిపించాలి
పలాస: మధ్య భారతదేశంలో ఆదివాసీలపై జరుగుతున్న మారణకాండపై సుప్రీం కోర్టు న్యాయమూర్తిచే విచారణ జరపాలని, ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని, అడవులు ఆదివాసీ గూడేల్లో ఏర్పాటు చేసిన పోలీసు క్యాంపులను ఎత్తివేయాలని ప్రజాతంత్ర ఉద్యమ వేదిక (పి.డి.ఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. పలాస మండలం మాకన్నపల్లిలో భగత్సింగ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా స్వాతంత్య్రోద్యమ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పి.డి.ఎం. జిల్లా అధ్యక్షుడు జె.వెంకట్రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి వీరులు దోపిడీ రహిత సోషలిస్టు సమాజం నిర్మాణం కోసం కలలు గన్నారని, నేడు ఆ కలలు కల్లలయ్యావని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆఽశలు ఆశయాలు నేటికి ఇంకా మిగిలే ఉన్నాయని, వారి తోవలోనే దండకారణ్యంలో ఆదివాసీలు పోరాటాలు చేస్తున్నారని చెప్పారు. అయితే పాలకవర్గాలు ఆ పోరాటాన్ని అణిచివేయాలని కగార్ పేరుతో ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి పథకం రచించారని, వాటిని పౌర సమాజం వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కె.ఎన్.పి.ఎస్.రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, డి.టి.ఎఫ్ జిల్లా నాయకుడు డి.ధర్మారావు, చింతాడ ధర్మారావు, ఎం.ధర్మారావు(పి.కె.ఎస్), జోగి కోదండం, మద్దిల వినోద్కుమార్(పి.డి.ఎస్.యు), తెప్పల అజయ్, కృష్ణమూర్తి, నాగమణి, వీరాస్వామి, లక్ష్మణ్, పి.దానేసు తదితరులు పాల్గొన్నారు. -
దూసుకొచ్చిన మృత్యువు
ఎచ్చెర్ల క్యాంపస్: విధి నిర్వహణకు బయలుదేరిన ఓ ఉద్యోగిని మృత్యువు వెంటాడింది. ఇంటి నుంచి బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే రోడ్డు ప్రమాదంలో తన భర్త మృతి చెందాడనే విషయం తెలిసి అతని భార్య విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఎచ్చెర్ల కేశవరెడ్డి పాఠశాల సమీపంలోని రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశరాజు వెంకట కిరణ్కుమార్ (40) అనే వ్యక్తి రణస్థలం సమీపంలోని కొండములగాం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. ఎచ్చెర్ల కేశవరెడ్డి పాఠశాల సమీపంలోని అపార్ట్మెంట్లో కొన్నేళ్ల క్రితం ప్లాట్ కొనుక్కుని కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఇక్కడి నుంచే ఆస్పత్రికి స్కూటీపై రాకపోకలు సాగిస్తున్నాడు. ఎప్పట్లాగే ఆదివారం కూడా ఆస్పత్రి విధులకు హాజరయ్యేందుకు స్కూటర్పై బయలుదేరాడు. పాత జాతీయ రహదారిపై కేశవరెడ్డి ప్రైవేట్ పాఠశాల సమీపంలో సర్వీస్ రోడ్డు నుంచి రణస్థలం వైపు వెళ్లేందుకు యూటర్న్ తీసుకుంటుండగా రాజాం నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న మ్యాక్సీ క్యాబ్ వాహనం ఢీకొట్టింది. దీంతో స్కూటీ కొన్ని మీటర్లు ముందుకెళ్లి ఎగిరిపడింది. ఈ ఘటనలో కిరణ్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి స్క్రాప్ షాపులోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. కిరణ్కుమార్ గతంలో ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశారు. అనంతరం రణస్థలం బదిలీ అయ్యారు. ఇతనికి భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు జ్యోతితాశ్రీ, నితీషాశ్రీ ఉన్నారు. స్వస్థలం శ్రీకాకుళమైనా ఇక్కడే సొంతంగా ప్లాట్ కొనుక్కొని పిల్లలను చదివిస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. సంతోషంగా సాగుతున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకొని పొలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మ్యాక్సీక్యాబ్ ఢీకొని ల్యాబ్ టెక్నీషియన్ మృతి విషాదంలో కుటుంబ సభ్యులు -
నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు హెడ్కానిస్టేబుల్, కానిస్టేబుళ్ల కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నిర్వహించినట్లు శ్రీకాకుళం స్టేషన్ సీఐ ఎం.వి.గోపాలకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రిటర్న్ అధికారిగా తనతో పాటు నరసన్నపేట సీఐ ఎస్.వి.రమణమూర్తి వ్యవహరించినట్లు తెలిపారు. అధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, ఇతర కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఆదిత్యాలయానికి భక్తుల తాకిడి అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. ప్రత్యేక ఆదివారంతో పాటు వత్సవలస రాజమ్మతల్లి ఉత్సవాల కొనసాగింపు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కొందరు సూర్యనమస్కారాల పూజలు చేయించుకోగా...మరికొందరు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లుతో పెద్దగా ఉపశమనం కలుగకపోవడంతో భక్తులు విమర్శలకు దిగారు. వీఐపీల పేరిట చాలా మంది ఫేక్ వీఐపీలు దర్శనాలకు వెళ్లడంపై క్యూలైన్లలో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.3,76,300, విరాళాల రూపంలో రూ.1,41,803, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.1.75 లక్షల వరకు ఆదాయం లభించిందని ఆలయ ఈవో వై.భద్రాజీ వెల్లడించారు. సీఆర్పీఎఫ్ జిల్లా సలహాదారుడిగా చందనరావు శ్రీకాకుళం న్యూకాలనీ: బాలల హక్కుల వేదిక పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్) జిల్లా సలహాదారుడిగా తమ్మినేని చందనరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం జాతీయ కన్వీనర్ ఆర్.వెంకటరెడ్డి నియామక పత్రం అందజేశారు. చందనరావు సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమానికి జిల్లా కమిటీ చొరవతో చిత్తశుద్ధితో సేవలు అందిస్తానని తమ్మినేని పేర్కొన్నారు. ఈయన నియామకం పట్ల సీఆర్పీఎఫ్ రాష్ట్ర ఇన్చార్జి డి.ప్రకాష్, రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ అరుణ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి ఆమదాలవలస గేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం రూరల్ మండలం నైర పంచాయతీ చల్లపేటకు చెందిన కరిమెళ్ల సూరిబాబు(55) ఆమదాలవలస గేటు ప్రాంతంలో వడ్రంగి దుకాణంలో పనిచేస్తున్నాడు. కుటుంబం లేకపోవడంతో అక్కడే ఉంటున్నాడు. ట్రాక్ దాటేందుకు వచ్చాడో, ఇంకేం జరిగిందో తెలియదు గానీ ఆదివారం పట్టాలపై విగతజీవిగా పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్కు శవ పంచనామా కోసం తరలించారు. రైలు ఢీకొని యువకుడు మృతి పొందూరు: పొందూరు రైల్వేగేటు సమీపంలో ఆదివారం అమరావతి రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు మృతిచెందినట్లు ఆమదాలవలస జీఆర్పీ ఎస్ఐ ఎం.మధుసూదనరావు తెలిపారు. సుమారు 30 ఏళ్ల గల ఈ యువకుడు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. యువకుడు ఎరుపు టీషర్టు, నీలం ప్యాంట్ ధరించాడని, ముఖం గుర్గు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. వివరాల కోసం 9493474582 నంబరును సంప్రదించవచ్చని పేర్కొన్నారు. శ్రీకూర్మంలో భక్తజన సందోహం గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సాధా రణ భక్తులతో పాటు చిన వత్సవలస రాజమ్మ తల్లి సంబరాల నుంచి తిరుగుపయనమైన వారు కూడా క్షేత్రానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దర్శనాల క్యూలైన్లు కిక్కిరిసి కనిపించాయి. ఆలయ ఇన్చార్జి ఈవో జి.గురునాథం పర్యవేక్షించారు. మరోవైపు సరైన పార్కింగ్ స్థలం లేక వాహనదారులకు ఎప్పటిలాగే ఈ వారం కూడా ఇబ్బందులు తప్పలేదు. కారు, ఆటో, బైక్లు పెట్టేందుకు స్థలం చూపించకపోయినా ఆశీలు మాత్రం పంచాయతీ పేరిట వసూలు చేస్తుండటంపై పలువురు వాహనచోదకులు అసహనం వ్యక్తం చేశారు. -
జిల్లా బేస్బాల్ సంఘ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా బేస్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా గుంటముక్కల వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శిగా వాసుపల్లి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి కె.రవికుమార్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సీనియర్ అడ్వకేట్ మొదలవలస రాజేంద్రకుమార్ పర్యవేక్షణలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు, రాష్ట్ర బేస్బాల్ సంఘ పరిశీలకులు సీహెచ్ రాజేష్ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ ప్రతినిధులు మాట్లాడుతు జిల్లాలో బేస్బాల్ అసోసియేషన్ను ఏకతాటిపై ముందుకు తీసుకెళ్తామని.. గేమ్ అభివృద్ధికి, క్రీడాకారుల ఎదుగుదలకు పాటుపడతామన్నారు. అంతకుముందు జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయస్థాయి బేస్బాల్ పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్ సంఘ జిల్లా సీఈఓ పి.సుందరరావు, బి.విజయ్కుమార్, వై.పోలినాయుడు, సాధు శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, సీహెచ్ జగదీష్, నిర్మల్కృష్ణ, కె.మాధవరావు, సతీష్రాయుడు, పేడాడ బాబూరావు, ఈశ్వరరావు, వెంకటరమణ, పీడీలు, పీఈటీలు, మాజీ, తాజా సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. నూతన కార్యవర్గమిదే.. జిల్లా బేస్బాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా కిల్లంశెట్టి అరుణ్కుమార్ గుప్తా, జిల్లా అధ్యక్షుడిగా గుంటముక్కల వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శిగా వాసుపల్లి రాంబాబు, కోశాధికారిగా చీకటి మూర్తి, కార్యనిర్వాహక కార్యదర్శిగా కొండపల్లి రవికుమార్, సంఘ సహధ్యక్షులుగా డి.రామాంజనేయులు, లకిలి రాంబాబు, నిమ్మాన విజయమ్మ, సంయుక్త కార్యదర్శులుగా తోటాడ శ్రీను, అంధవరపు సంతోష్కుమార్, ఇప్పిలి అరుణ్కుమార్, కార్యవర్గ సభ్యులగా వి.గురుమూర్తి, కె.రమేష్, ఐ.సాయికిరణ్, ఐ.గౌరీశంకర్, డి.రాజేష్, ఎం.మధు, కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
వానర సైన్యం!
వామ్మో..టెక్కలి : గూడేం.. టెక్కలి మండలంలోని ఈ గ్రామం పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది కార్గిల్ పోరాట యోధులే. పలువురు సైనికులు అప్పటి యుద్ధంలో పాల్గొని గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు. ఇదే గ్రామం మామిడి పంటకు సైతం ప్రసిద్ధి. ఇక్కడి మామిడిపండ్లకు ఇతర రాష్ట్రాల్లో ఎంతో గిరాకీ. అటువంటి గూడేం గ్రామస్తులకు ఇప్పుడు వానరాల గుంపు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ గుంపులుగా సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. మామిడి పంటలు, మునగ, మొక్కజొన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి అకస్మాత్తుగా దాడులకు తెగబడుతున్నాయి. గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్తులు భయాందోళనతో బిక్కుబిక్కుమంటున్నారు. ఏటా మామిడి పంటతో లాభాలను చవిచూస్తున్న తమకు ఈ ఏడాది ఈ కోతుల బెడద వల్ల ఇప్పటికే తీవ్రమైన నష్టం వాటిల్లిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖాధికారులు కనీస చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖాధికారులు స్పందించి గ్రామంలో కోతుల బెడద లేకుండా చూడాలని కోరుతున్నారు. బెంబేలెత్తిపోతున్న గూడేం గ్రామస్తులు గుంపులుగా తిరుగుతున్న కోతులు మామిడి, మునగ, మొక్కజొన్న పంటలు నాశనం -
వామపక్ష పార్టీలు ఏకం కావాలి
నరసన్నపేట: ప్రజల సమస్యలు పరిష్కారానికి, వారికి అండగా ఉండేందుకు వామపక్ష పార్టీల తలో మార్గంలో ఎర్రజెండా నీడన ఉద్యమాలు చేస్తున్నారని, బూర్జువా పార్టీలు కలిసి పనిచేస్తున్న తీరులో వామపక్ష పార్టీలు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని సినీ నటుడు, దర్శకుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి, పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. నరసన్నపేట మండలం కోమర్తిలో మామిడి అప్పలసూరి వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ అమరవీరుల స్మారక కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిల్లాలో ఉన్న ప్రధాన వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. 1960 నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొన్న అప్పలసూరి ఆయన మరణించే వరకూ విప్లవ పార్టీలతో పాటు సీపీఐ, సీపీఎంలు కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని భావించే వారని, ఈ మేరకు చివరి వరకూ తన వంతు ప్రయత్నాలు చేశారని అధ్యక్షోపాన్యాసం చేసిన ప్రముఖ కథా రచయత అట్టాడ అప్పలనాయుడు గుర్తు చేశారు. ఎర్ర జెండాలన్నీ ఒక గొడుగు కిందకు రావడమే అప్పలసూరికి మనమిచ్చే ఘన నివాళి అవుతుందని నారాయణమూర్తి పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ అప్పలసూరి వ్యక్తిత్వం ఆదర్శప్రాయమన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యులు దంతులూరి వర్మ, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాశిరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, ప్రజా కళామండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి కొర్రాయి నీలకంఠం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, విజయనగరం పౌరహక్కుల సంఘం కార్యదర్శి సీహెచ్ పకీరునాయుడు, ప్రజా కళాకారుల సమాఖ్య ప్రతినిధి రౌతు వాసుదేవరావు, రచయిత గంటేటి గౌరినాయుడు, న్యాయవాది మామిడి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రజాకళామండలి ఆధ్వర్యంలో కార్యకర్తలు గీతాలు ఆలపించారు. అప్పలసూరి ఆశయం నెరవేర్చాలి జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ సభలో వక్తలు -
● జయహో రాజమ్మ తల్లి
గార: చినవత్సవలస గ్రామంలోని రాజరాజేశ్వరి (రాజమ్మ తల్లి) సంబరాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఏడాది ఏడో వారం ఉత్తరాంధ్ర కాకుండా రెండు ఉభయ రాష్ట్రాల నుంచి శనివారం సాయంత్రానికి కుటుంబ సభ్యులతో వచ్చిన భక్తులు గ్రామ పరిసరాలకు చేరుకున్నారు. రాత్రి జాగరణ చేసి ఉదయం సమీప సముద్రంలో పవిత్ర స్నానాలాచరించారు. అనంతరం గ్రామంలోని రాజమ్మ తల్లి, భూలోకమ్మను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గ్రామంలోనే వంటా వార్పు చేసుకొని సహపంక్తి భోజనాలు చేశారు. సముద్ర తీరంలో ఎస్ఐ హరికృష్ణ, మహాలక్ష్మి ఆధ్వర్యంలో మైరెన్ సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. గార ఎస్ఐ ఆర్.జనార్ధన్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యవేక్షించారు. -
‘కుప్పిలి’పై ప్రత్యేక దృష్టి
ఎచ్చెర్ల క్యాంపస్: మాస్ కాపీయింగ్తో అందరి దృష్టిలో పడిన కుప్పిలి టెన్త్ పరీక్ష కేంద్రంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. టెన్త్ గణితం పరీక్ష సోమవారం జరగనుంది. తర్వాత సైన్స్, సోషల్ పరీక్షలు కూడా ఉన్నా యి. ఈ నేపథ్యంలో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కుప్పిలి మోడల్ స్కూల్లోని ఏ, బీ పరీక్ష కేంద్రాల్లో 425 మంది పరీక్ష రాస్తున్నా రు. 17 గదుల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 21 మంది విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం పాత వారిని అందరినీ మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇన్విజిలేటర్లు, కస్టోడియన్ కం సిట్టింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్లు ఇలా అందరినీ మార్పు చేస్తున్నారు. జిల్లా విద్యా శాఖ అధికారి తిరుమల చైతన్య ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కొత్తూరులో చిరు జల్లులు కొత్తూరు: కొత్తూరులో ఆదివారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. సుమారు నాలుగు నెలల నుంచి వర్షాలు లేవు. గత రెండు రోజుల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో మండలంలోని కర్లెమ్మ, పారాపురం, ఎన్ఎన్ కాలనీలతో పాటు పలు గ్రామాలలో వర్షం కురిసింది. వర్షం జీడి, మామిడి, నువ్వుతో పాటు కూరగాయ పంటలకు ఎంతో ఉపయోగపడింది. భగత్సింగ్కు నివాళి కవిటి: భారత స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుడు భగత్సింగ్ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని హెచ్ఎం బెజ్జిపల్లి దేవదాస్ అన్నారు. ఆదివారం భగత్సింగ్ 94వ జయంతి సందర్భంగా పెద్ద ఎర్రగోవిందపుట్టుగ పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి భగత్సింగ్ వేషధారణతో అలరించాడు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు
ఇచ్ఛాపురం రూరల్: ‘ఏరా.... ఏ ఊరు నీది...?. మీ నాన్న ఎవ డ్రా...?!’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వెటకారంగా మాట్లాడి యువకుడ్ని ఒంటర్ని చేసి ముకుమ్మడిగా పిడుగుద్దులు గుద్ది పైశాచికానందం పొందారు టీడీపీ సానుభూతిపరులు. వివరాలలోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం మశాఖపురం గ్రామంలో కొత్తపల్లి దేవరాజుది ఒకే ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబం. దేవరాజు కుమారుడు భీమారావు వైఎస్సార్సీపీలో చురుగ్గా ఉంటా డు. భీమారావు అదే గ్రామంలో ఆదివారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొన్నాడు. అదే గ్రామానికి చెందిన పైల బైరాగి, రంగు కామేష్ అనే టీడీపీ సానుభూతిపరులు భీమారావును పిలిచి ‘మీది ఈ ఊరు కాదు కదా.. మరి ఏ ఊరు, మీ నాన్న ఎవడ్రా...?’ అంటూ వెటకారంగా మా ట్లాడటంతో భీమారావు ప్రతిఘటించాడు. దీంతో పైల భైరాగి, రంగు కామేష్లతో పాటు ఉప సర్పంచ్ ఆశి మాధవరావు, ఆశి లక్ష్మీనారాయణ, రోకళ్ల కుమార్లు భీమారావును చుట్టిముట్టి పిడుగుద్దులతో దాడికి పాల్పడ్డారు. దీంతో అక్కడే ఉన్న మహిళలు అడ్డుకున్నారు. భీమారావు స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో తనకు ప్రాణహాని ఉందంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై సీఐ ఎం.చిన్నంనాయుడు మాట్లాడుతూ ఇరువురు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలను విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎచ్చెర్ల క్యాంపస్: వైఎస్సార్ సీపీ కార్యకర్త, పూర్వపు వలంటీర్ కూన కిరణ్కుమార్పై టీడీపీ వర్గానికి చెందిన వారు ఆదివారం దాడికి పాల్పడ్డారు. కిరణ్కుమార్ బైక్పై ఫరీదుపేట వస్తుండగా ముగ్గురు వ్యక్తులు దారి కాచి కర్రలు, రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడి విషయాన్ని ఎచ్చె ర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా గ్రామానికి డీఎస్పీ వివేకనంద, ఎస్ఐ సందీప్కుమార్ చేరుకున్నారు. గ్రామంలో పోలీస్ పికెట్ ఇప్పటికే కొనసాగుతోంది. ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉల్లాసంగా రగ్బీ జిల్లా జట్ల ఎంపికలు
టెక్కలి: జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఉల్లాసంగా జిల్లా జట్లు ఎంపికలు నిర్వహించారు. కర్నూల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు సంబంధించి జిల్లా జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు డి.రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి పి.పార్వతీశం, ఆర్గనైజింగ్ కార్యదర్శి బి.నారాయణరావు పర్యవేక్షణలో నిర్వహించిన ఎంపికల్లో ఒక్కో జట్టుకు 12 మంది చొప్పున ఎంపిక చేశారు. జిల్లా అధ్యక్షుడు డి.రామకృష్ణ క్రీడాకారులకు అవసరమైన దుస్తులు, రవాణా చార్జీల ను అందజేశారు. ఈ ఎంపికల్లో ఎన్.జనార్ధన్, కేకే రామిరెడ్డి, రాజా, కె.రఘనాథరావు, సత్యనారాయణ, శ్యామలరావు, మోతీలాల్, నారి, సీతయ్య, నర్మద తదితరులు పాల్గొన్నారు. ‘ఉల్లాస్’ అపహాస్యం సారవకోట: వయోజనులకు విద్య నేర్పించి వారికి స్వయం శక్తి సంఘాలలో జరుగుతున్న కార్యకలాపాలపై అవగాహన పెంచేందుకు ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ఒక వలంటీర్ను నియమించి వారి ద్వారా గ్రామాలలో వయోజనులకు విద్య నేర్పించాలి. ఇదంతా స్థానిక సీఎఫ్ ఆద్వర్యంలో జరిగాలి. ఆదివారం ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా పరీక్ష నిర్వహించారు. అయితే మండలంలో ఈ పరీక్ష నిర్వహణ అపహాస్యమైంది. లక్ష్మీపురం, బుడితి, చీడిపూడి గ్రామాల్లో పరీక్షలు చేపట్టినట్లు చూపించారే తప్ప పరీక్షలు జరిగిన దాఖలాలు కనిపించలేదు. అవలింగిలో స్థానిక సీఎఫ్ కోట సంతోషి ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిన్నారులతో పరీక్ష పత్రాలను నింపించేశారు. లక్ష్మీపురంలో పరీక్ష కోసం సీఎఫ్ సుశీలను విచారించగా గ్రామంలో ఫంక్షన్ జరుగుతోందని పరీక్ష ఉదయం నిర్వహించామని చెప్పారు. ముగిసిన నాటిక పోటీలు శ్రీకాకుళం కల్చరల్: స్థానిక బాపూజీ కళామందిర్లో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన హనుమంతు చిన్నరాములు స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రముఖ సినీ, టీవీ హాస్యనటులు అప్పారావు ప్రదర్శించిన ‘హాస్యవల్లరి’ అందరినీ నవ్వించింది. అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి వారి ఆధ్వర్యంలో ‘విడాకులు కావాలి’ నాటిక ఆకట్టుకుంది. వల్లూరి శివప్రసాద్ రచించగా, గంగోత్రి సాయి దర్శకత్వంలో చక్కనైన ప్రదర్శన చేశారు. విశాఖకు చెందిన చైతన్య కళా స్రవంతి వారిచే ‘అసత్యం’ నాటిక కూడా అలరించింది. అనంతరం హా స్యనటుడు అప్పారావును సుమిత్రా కళాసమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, డాక్టర్ పులఖండం శ్రీనివాసరావు, సుమిత్రా కళాసమితి అధ్యక్ష, కార్యదర్శులు ఇప్పిలి శంకర శర్మ, గుత్తు చిన్నారావు, లోకనాథం రామలింగేశ్వరరావు, నక్క శంకరరావు, మండవిల్లి రవి, కిల్లా ఫల్గుణరావు, మూర్తి, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తమ ప్రదర్శనగా ‘స్వప్నం రాల్చిన అమృతం’ సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి నాటి క పోటీల్లో.. ఉత్తమ ప్రదర్శన బహుమతి కరీంనగర్, చైతన్య కళాభారతి ‘స్వప్నం రాల్చిన అమృతం’ నాటికకు దక్కింది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, విశాఖ, చైతన్య కళాస్రవంతి వారి ‘అసత్యం’ నాటికకు, ఉత్తమ జ్యూరీ ప్రదర్శన తాడేపల్లి, అరవింద్ ఆర్ట్స్ వారి ‘విడాకులు కావాలి’నాటికకు దక్కాయి. న్యాయనిర్ణేతలుగా మానాపురం సత్యనారాయణ, గెద్దా వరప్రసాద్, లండ రుద్రమూర్తిలు వ్యవహరించారు. విజేతలకు ప్రముఖ టీవీ, సినీ హాస్యనటులు అప్పారావు చేతుల మీదుగా బహుమతులను అందించారు. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వొద్దు
శ్రీకాకుళం క్రైమ్/పాతపట్నం/హిరమండలం : వైద్యులిచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మినా.. గడువు ముగిసిన మందులు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం రీజనల్ విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాదరావు మెడికల్ దుకాణదారులను హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలో ఏకకాలంలో తొమ్మిది మెడికల్ షాపుల్లో విజిలెన్సు, డ్రగ్ కంట్రోల్, ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఎక్కడెక్కడ అంటే.. శ్రీకాకుళం కేంద్రంగా డేఅండ్నైట్ సమీప శ్రీనివాస మెడికల్స్, అమరావతి మెడికల్స్, ఇలిసిపురం రైతు బజారు సమీప మహలక్ష్మి మెడికల్స్, గుజరాతీపేట కూడలి సమీప నీలిమ మెడికల్స్, యునైటెడ్ మెడికల్స్ (చిత్తరంజన్ వీధి), పలాసలో తర్లాన వాసుదేవరావు మెడికల్స్, కాశీబుగ్గలో శ్రీ మెడికల్స్, పాతపట్నంలో మధు మెడికల్స్, హిరమండలంలో విజయశంకర్ మెడికల్స్ దుకాణాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. గుజరాతీపేట నీలిమ మెడికల్స్తో పాటు పలాస, కాశీబుగ్గ, పాతపట్నం, హిరమండలం మెడికల్స్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందుల అమ్మకాలు, గడువు దాటిన మందుల అమ్మకాలు జరిగినట్లు గుర్తించారు. మిగతా చోట్ల చిన్న చిన్న లోపాలున్నట్లు గుర్తించి సరిచేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ ప్రసాదరావు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం సరిలేనివారు, నిద్రపట్టని వారికి ఇచ్చే మందులకు ప్రిస్క్రిప్షన్ ఉన్నవీ లేనివీ గుర్తించమని డీజీ హరీష్కుమార్ నుంచి ఉత్తర్వులు రావడంతో ఈ దాడులు జరిపామన్నారు. సైక్రియాట్రిక్, హ్యాబిక్యులర్, షెడ్యూల్డ్– హెచ్ డ్రగ్లు ఈ జాబితాలోకి వస్తాయని వివరించారు. ఈయనతోపాటు జిల్లా డ్రగ్ కంట్రోలర్ ఏడీ చంద్రరావు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ నాయుడు, విజిలెన్సు ఎస్ఐ అశోక చక్రవర్తి,,హెచ్సీ కామేష్ తదితరులు పాల్గొన్నారు. కాగా, దాడులు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పాతపట్నం మండల కేంద్రంలోని పలు మందుల దుకాణాలను యాజమానులు ముందుగానే మూసివేశారు. విజిలెన్స్ ఎస్పీ బర్ల ప్రసాదరావు ఏకకాలంలో తొమ్మిది మెడికల్ షాపుల్లో విజిలెన్సు దాడులు -
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
అరసవల్లి: విద్యార్ధి దశ నుంచే అడవులు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా అటవీ శాఖాధికారి శంబంగి వెంకటేష్ పిలుపునిచ్చారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని అరణ్య భవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు ర్వహించారు. శ్రీకాకుళం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన కె.షర్మిళకు ప్రథమ బహుమతి, టీపీఎం పాఠశాలకు చెందిన నూకరాజుకు ద్వితీయ బహుమతి, ఏవీఎన్ పాఠశాలకు చెందిన శ్రీవల్లి, భరత్లకు తృతీయ బహుమతులు లభించాయి. వీరికి డీఎఫ్వో వెంకటేష్, ఏపీఎన్జీసీ జిల్లా కో–ఆర్డినేటర్ పూజారి గోవిందరావులు బహుమతులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఉపఖజానా అధికారిగా పదోన్నతి శ్రీకాకుళం పాతబస్టాండ్: జోన్–1 ఖజానా శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఐదుగురు సీనియర్ అకౌంటింగ్ అఽధికారులకు ఉప ఖజానా అధికారులుగా పదోన్నతి లభించింది. వీరిలో జిల్లా ఖజానా కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్గా పనిచేస్తున్న జి.వి.ఎస్.ఎన్.మూర్తిని పార్వతీపురం మన్యం జిల్లా ఖజానా కార్యాలయంలో ఉప ఖజానా అధికారిగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎముకల విభాగాధిపతిగా డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్ శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఎముకల విభాగాధిపతిగా డాక్టర్ లూకలాపు ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన డాక్టర్ ధర్మారావు ఉద్యోగ విరమణ చేయడంతో ప్రసన్నకుమార్ ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించగా రెగ్యులర్ హెచ్ఓడీగా బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ పేడాడ రాము పిల్లల విభాగాధిపతిగా నియమితులయ్యారు. ఆయన కూడా ప్రస్తుతం రెగ్యులర్ హెచ్ఓడీగా బాధ్యతలు స్వీకరిచారు. విద్యుత్శాఖ ఏఈలకు పదోన్నతులు అరసవల్లి: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలోని శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో ఏఈలుగా పనిచేస్తున్న పలువురు ఇంజినీర్లకు డిప్యూటి ఈఈ క్యాడర్లో పదోన్నతులు కల్పిస్తూ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కోటబొమ్మాళి ఏఈగా పనిచేస్తున్న జి.వి.సురేష్కు నరసన్నపేట ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈగా, ఎంఆర్టీ ఏఈగా పనిచేస్తున్న టి.వి.శంకర్ శ్రీనివాస్కు సీటీఎం శ్రీకాకుళం డిప్యూటి ఈఈగా, విశాఖపట్నం మురళీనగర్లో ఏఈగా పనిచేస్తున్న ఎం.రాజేష్కు రణస్థలం ఆపరేషన్స్ డిప్యూటీ ఈఈగా పదోన్నతులు కల్పించారు. ఇంతవరకు నరసన్నపేట డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న కె.ఇందిరకు టీఆర్ఈ శ్రీకాకుళం డిప్యూటీ ఈఈగా బదిలీ చేశారు. -
గడ్డి ట్రాక్టర్ దగ్ధం
బూర్జ: మండలంలోని కొల్లివలస జంక్షన్లో గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధమైంది. సింగన్నపాలెం గ్రామానికి చెందిన ట్రాక్టర్ నారాయణపురం జంక్షన్ వైపు నుంచి గడ్డి లోడుతో విశాఖ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గడ్డి కుప్పకు విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వచ్చి మంటలు అదుపుచేశారు. ట్రాక్టర్ ఇంజిన్ నుంచి ట్రాలీ వేరు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫీజుల వసూలుపై ఫిర్యాదు శ్రీకాకుళం పాతబస్టాండ్: టెక్కలిలో ఓ కళాశాల యాజమాన్యం విద్యార్థుల నుంచి ప్రభుత్వ నిబంధనలు, సూచనలకు వ్యతిరేకంగా ఫీజు వసూలు చేస్తున్నారంటూ ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ప్రతినిధులు శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు ఆయన చాంబర్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తామని, విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని ఇటీవల ప్రకటన చేశారని, అయితే ఆ కళాశాల యాజమాన్యం ఆ ప్రకటన నమ్మడం లేదని, సకాలంలో ఫీజులు కట్టలేని వారికి ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొంతమంది చదువులు పూర్తయినా డబ్బులు చెల్లించలేదంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని చెప్పారు. పూర్తి ఫీజులు కట్టిన వారికే హాల్టికెట్లు ఇస్తున్నారని తెలిపారు.జిల్లాలో పలు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. అనంతరం డీఆర్వో సంబంధిత కళాశాల డైరెక్టర్తో మాట్లాడి ఆరా తీశారు. -
జిల్లా పోలీసులకు.. ఉగాది పురస్కారాలు
రమేష్బాబుకు ఉత్తమ సేవా పతకం.. శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్ఐ బి.రమేష్బాబుకు ఉత్తమ సేవా పతకం దక్కింది. 1990 కానిస్టేబుల్ బ్యాచ్కు చెందిన రమేష్బాబు 2011లో హెచ్సీగా, 2017లో ఏఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. 2024లో కూడా సేవాపతకం వరించింది. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసులు వారి సర్వీసులో కనబర్చిన అత్యుత్తమ ప్రతిభకు గాను ఉగాది – 2025 పురస్కారాల్లో సేవా పతకాల పంట పండింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి శుక్రవారం వెలువడ్డాయి. సేవా పతకాలు వరించిన వారిలో.. జిల్లా ట్రాఫిక్ రికార్డ్ బ్యూరో (డీటీఆర్బీ) ఎస్ఐ వి.నేతాజీ, సీసీఎస్ ఎస్ఐ ఎస్ గఫూర్, ఓడలరేవు(మైరెన్) సీఎస్పీఎస్ ఎస్ఐ జి.విలియమ్స్, ఏఆర్ ఏఎస్ఐ వై.రామారావు, ఏఆర్ హెచ్సీ సీహెచ్ విశ్వనాథం, జి.సిగడాం హెచ్సీ కె.నాగేశ్వరరావు, సీసీఎస్ పీసీ ఎ.విశ్వనాథం, ఏఆర్ పీసీ ఆర్.మీరాబాబు, భావనపాడు సీఎస్పీఎస్ పీసీ యు.లక్ష్మీపతి ఉన్నారు. శ్రీకాకుళం ఒకటో పట్టణ ఏఎస్ఐకి ఉత్తమ సేవా పతకం విజిలెన్సులో ముగ్గురికి, ఫైర్ విభాగంలో ముగ్గురికి పతకాలు జిల్లా అగ్నిమాపక విభాగంలో.. పలాస స్టేషన్ అధికారి బి.సోమేశ్వరరావు, శ్రీకాకుళం ఫైర్ స్టేషన్ లీడింగ్ ఫైర్మేన్ బి.శృంగారినాయుడు, డ్రైవింగ్ ఆపరేటర్ షేక్ రహీమ్లకు సేవా పతకాలు వరించాయి. విజిలెన్సు అండ్ ఎన్ఫోర్స్మెంట్లో.. ఎస్ఐ ఎన్.అశోక చక్రవర్తి, కానిస్టేబుళ్లు ఇజ్జాడ ఈశ్వరరావు, పి.లక్ష్మీనారాయణలకు ఏపీ పోలీస్ సేవా పతకాలు వరించాయి. -
రచ్చబండ ధ్వంసంపై ఆరా
ఇచ్ఛాపురం రూరల్: సుమారు ముఫ్పై ఏళ్ల క్రితం నిర్మించిన రచ్చబండను టీడీపీ నాయకుడు అధికార అహంతో కూలదోస్తున్నట్లు గురువారం సాక్షి దినపత్రికలో ‘రెచ్చిపోయిన పచ్చ తమ్ముడు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. తహసీల్దార్ ఎన్.వెంకటరావు ఆదేశాల మేరకు శుక్రవారం వీఆర్వో రాజారావు, విలేజ్ సర్వేయర్ మీనాకుమారీలు కె.శాసనాం గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. తన సొంత ఆస్తికి ఎదురుగా రచ్చబండ ఉండటంతో దాన్ని అడ్డు తొలగించేందుకు కూలదోసినట్లు అధికారుల ఎదుట టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరు ఒప్పుకున్నాడు. గ్రామస్తుల సమక్షంలో కొలతలు తీయడంతో అసలు రహస్యం బట్టబయలైంది. రచ్చబండతో పాటు మరో పది అడుగుల వరకు ప్రభుత్వ పోరంబోకు స్థలం ఉందని, రచ్చబండను తొలగించే అధికారం ఫకీరుకు గానీ, వారి కుటుంబ సభ్యులకు లేదని, అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు సైతం పచ్చ తమ్ముడికి చీవాట్లు పెట్టడంతో వెనుదిరిగాడు. -
రైలు నుంచి జారిపడి యువకుడు మృతి
సారవకోట: మండలంలోని బుడితి గ్రామానికి చెందిన చిత్తిరి ఆర్య (21) శుక్రవారం రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్య వ్యక్తిగత పనిపై శుక్రవారం చీపురుపల్లిలో రైలు ఎక్కి ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ వెళ్లాడు. అక్కడి నుంచి జాజ్పూర్ వెళ్లేందుకు రైలు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి దగ్గరున్న ఆధార్ కార్డు, ఫోన్ సహాయంతో అక్కడి రైల్వే పోలీసులు విజయవాడలో ఉంటున్న తల్లిదండ్రులు బుజ్జి, మహాలక్ష్మిలకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన బుడితికి చెందిన కొందరితో కలిసి భువనేశ్వర్ బయల్దేరారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు
ఎచ్చెర్ల: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలని లావే రు తహశీల్దార్ జోగారావు సిబ్బంది ని ఆదేశించారు. శుక్రవారం తామా డ, బుడతవలస పంచాయతీల రెవె న్యూ పరిధిలో అక్రమంగా చదును చేస్తున్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ చదునుచేసిన భూ ముల్లో సర్వే చేపట్టి ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈయనతో పాటు ఆర్ఐ శ్రీనివాసరావు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. -
లారీ చోరీకి విఫలయత్నం
ఇచ్ఛాపురం: పట్టణంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పార్కింగ్ చేసిన లారీని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి చోరీ చేశారు. సకాలంలో పోలీసులు రంగంలోకి దిగడంతో తిరిగి లారీని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం లారీ కోసం వచ్చిన యజమాని పైల వాసుదేవరావుకు పార్కింగ్ ప్రదేశంలో వాహనం కనిపించలేదు. తోటి డ్రైవర్లను, చుట్టుపక్కల వారిని అడిగినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పట్టణ పోలీస్స్టేషన్లో లారీ యజమాని ఫిర్యాదుచేశాడు. పట్టణ ఎస్సై ముకుందరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఒడిశా పరిధిలోని పితాతోళి గ్రామంలో లారీ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చోరికి పాల్పడింది కటక్ చెందిన వ్యక్తిగా అనుమానించి నిందితుడిని అదుపులోనికి తీసుకొని విచారిస్తున్నారు. -
యువతిని మోసగించిన యువకుడు అరెస్టు
జి.సిగడాం: యువతిని మోసగించిన కేసులో దేవరవలస గ్రామానికి చెందిన సిగటాపు కిరణ్ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రణస్థలం సీఐ అవతారం తెలిపిన వివరాల ప్రకారం.. దేవరవలసకు చెందిన కిరణ్ అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకోవాలని బాధితురాలు కోరడంతో నిరాకరించాడు. పెద్దలను ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితురాలు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్ఐ వై.మధుసూదనరావు, ఏఎస్ఐ కె.రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంధనం.. మోసాలే ఘనం..
● పెట్రోల్ బంకుల్లో చాలా విధాలుగా మోసాలు జరుగుతున్నాయి. కొన్ని బంకుల్లో నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా.. చాలా బంకుల్లో మాత్రం బహిరంగంగానే మోసాలకు పాల్పడుతున్నారు. ● బంకుల్లో పంప్ నుంచి పెట్రోల్ విడుదల చేసే మిషన్ డిజిట్ను ఎక్కువగా వాడుతున్నారు. మీటరుపై చూపించే సరికే ఈ ఆయిల్ విడుదల జరుగుతోందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ● ఈ డిజిటల్ మీటర్ ఫీడింగ్ ప్రైవేటు టెక్నీషియన్లతో చేయించుకుంటారు. పెట్రోల్ పంపింగ్ వేగం ఆధారంగా చేసే ఈ ప్రక్రియలో లోపాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ● దీనికి తోడు పంపింగ్ జరిగినప్పుడు ఆ పంపు ఆపరేటర్లు చేతివాటం ఉంటుంది. ● పెట్రోల్ కల్తీ కూడా చాలా చోట్ల జరుగుతోంది. ట్యాంకులో పెట్రోల్ను ఫిల్లింగ్ చేసేటప్పుడు పెట్రోల్తో పాటు ఇథనాల్ కూడా వెళ్తుంది. దీంతో పెట్రోల్తో పాటు ఇథనాల్ కూడా పంపింగ్ జరిగి వాహనాలు పాడవటం, ఇంధనం తక్కువగా రావడం వంటివి జరగుతున్నాయి. ఎక్కువగా వర్షాకాలం శీతాకాలంలో ఈ సమస్యలు ఉంటాయి. ● ఇక బంకుల్లో ముందుగా చెల్లించిన డబ్బుకి ఫీడ్ చేసి ఆయిల్ కొడతారు. ఇక్కడ కూడా సాంకేతిక సాకుతో తప్పిదాలు జరుగుతున్నాయి. -
పైడిభీమవరం హైస్కూల్లో సీసీ కెమెరాలు చోరీ
రణస్థలం: మండలంలోని పైడిభీమవరం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8 సీసీ కెమెరాలు, వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల కిందట దొంగిలించారు. ఈ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పాఠశాల సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్ పురం ఎస్సై చిరంజీవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దివ్యాంగులను ప్రోత్సహిద్దాం శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల్లో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ మండలాల నుంచి వచ్చిన ది వ్యాంగుల నుంచి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు, జిల్లా పరిషత్ సీఈఓ శ్రీధర్ రాజ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ కవితతో కలిసి వినతులు స్వీకరించారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ శ్రీకాకుళం కార్యాలయ అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారులను కూర్చోబెట్టి మంచినీళ్లు, టీ, స్నాక్స్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారి సుధ, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సాయికుమార్ పాల్గొన్నారు. -
ప్రిస్క్రిప్షన్ లేకుండా..విజిలెన్స్ అధికారులు మెడికల్ షాపులు తనిఖీ చేశారు. చీటీ లేకుండా మందులు అమ్మరాదన్నారు. –8లో
‘నన్ను చూడగలవా..?’ అంటూ ఓ బంకులో రీడింగ్ బోర్డు సవాల్ విసురుతూ ఉంటుంది. ‘అంకెలు లెక్క పెట్టగలవా..?’ అని మరో బంకులో రీడింగ్ చూపులకు అందనంత స్పీడులో పరుగులు పెడుతూ ఉంటుంది. ‘ఏం పోశావురా.. బాబూ’ అంటూ ఇంకో బంకులో ఆయిల్ పోసిన వెంటనే సైలెన్సర్ సాయంతో బండి ఏడుస్తూ ఉంటుంది. మోసపోవడం సామాన్యుడి జన్మహక్కు అన్నట్లు బంకుల యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. రీడింగు నుంచి పెట్రోల్ నాణ్యత వరకు ఏదో ఒక దశలో మోసాలకు పాల్పడుతున్నాయి. వీరి వైఖరి వల్ల నిజాయితీగా ఉండే బంకులకు కూడా చెడ్డపేరు వస్తోంది. ‘సాక్షి’ శుక్రవారం నిర్వహించిన పరిశీలనలో పలు విషయాలు వెలుగు చూశాయి. ● -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నందిగాం: మండలంలోని హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కురాడ ఢిల్లేంద్ర(35) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నందిగాం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కురాడ కరువులుకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు ఢిల్లేంద్ర జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య సుశీల, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న తమ్ముడు భుజంగరావును ష్యూరిటీగా పెట్టి భార్య సుశీల పేరిట రూ.3 లక్షల లోన్ తీసుకున్నాడు. కొద్ది రోజులుగా లోన్ డబ్బులు కట్టకపోవడంతో కుటుంబంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య సుశీల సారవకోట మండలం కుమ్మరిగుంటలో ఉన్న కన్నవారింటికి వెళ్లిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఢిల్లేంద్ర శుక్రవారం ఉదయం టెక్కలి వెళ్లాడు. అటు నుంచి బస్సులో బెండిగేటు వరకు టికెట్ తీసుకొని తురకల కోట వద్ద దిగాడు. అక్కడినుంచి మాదిగాపురం సమీపంలో ఉన్న తమ జీడి తోటకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. ఘటనా స్థలంలో హిట్ దోమల కాయిల్స్, మద్యం బాటిల్ ఉండటంతో మందులో కాయిల్స్ కలిపి తాగి ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడి తమ్ముడు తోటలో జీడి పిక్కలు ఏరేందుకు వెళ్లగా అక్కడ చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులకు, గ్రామస్థులకు తెలియజేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య సుశీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
65 ఏళ్ల వయసులో పరీక్ష కేంద్రానికి..
చదువుకు వయస్సు అడ్డురాదు. కొంత మందికి న్యాయ విద్యలో డిగ్రీ అన్నది దీర్ఘకాలిక కల. 65 ఏళ్ల వయస్సులో బీకే కళావతి అనే మహిళ శ్రీకాకుళంలోని ప్రైవేట్ న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఎల్ఎల్బీ చదువుతున్నారు. ప్రస్తుతం ఈమె డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో మూడో సెమిస్టర్ పరీక్ష రాస్తున్నారు. ఈమెది తమిళనాడు రాష్ట్రం. బార్ కౌన్సిలాఫ్ ఇండియా నిబంధనలు మేరకు దేశంలో ఎక్కడైనా న్యాయ విద్య చదివే అవకాశం ఉంది. – ఎచ్చెర్ల క్యాంపస్ ఉద్దండపాలెం విద్యార్థికి కోటి రూపాయల కొలువు సంతబొమ్మాళి మండలంలోని పాలతలగాం పంచాయతీ ఉద్దండపాలెం గ్రామానికి చెందిన ఆర్ట్స్ విద్యార్థి హనుమంతు సింహాచలం భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సు మేనేజ్మెంట్ (ఎంహెచ్ఆర్ఎం) పూర్తిచేసిన సింహాచలం రూ. 1.3 కోట్ల వార్షిక ప్యాకేజీతో పోలాండ్కు చెందిన ప్రముఖ డెయి రీ సంస్థ కోవైస్కోలో హెచ్ఆర్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించాడు. సింహాచలం తల్లిదండ్రులు హనుమంతు భీమారావు, కమలకుమారి వ్యవసాయం చేస్తుంటారు. సింహాచలం విద్యాభ్యాసమంతా ప్రభుత్వ పాఠశాల, కాలేజీల్లో సాగింది. 2022 ఎంహెచ్ఆర్ఎం కోర్సులో చేరినప్పటి నుంచి అధ్యాపకులు, ప్లేస్మెంట్ ఆఫీసర్ సలహా మేరకు కమ్యూనికేషన్ స్కిల్పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2024లో కోర్సు పూర్తయిన వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్లో హిందుస్థాన్ ఫుడ్స్ లిమిటెడ్లో రూ.3.6లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. అక్కడే పనిచేస్తూ మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో పోలాండ్లోని డెయిరీ సంస్థ తమ హెచ్ఆర్ విభాగంలో పోస్టుల భర్తీకి యూనివర్సిటీ అధికారుల ను సంప్రదించగా ప్లేస్మెంట్ ఆఫీసర్ తనకు సమాచా రం ఇచ్చారని సింహాచలంతెలిపారు. ఇంటర్వ్యూ సక్సెస్ కావడంతో సంస్థ హెచ్ఆర్ అసిస్టెంట్గా ఎంపిక చేసింది. మే నెలలో విధులకు సిద్ధం కావాలని సమాచారం ఇచ్చిందని హనుమంతు సింహాచలం తెలిపారు. – సంతబొమ్మాళి -
చూచి రాతల దోషి ఎవరు..?
సస్పెండైన వారు వీరే.. 1.కుప్పిలి బి–కేంద్రంలో సీఎస్గా వ్యవహరించిన పీవీ దుర్గారావు– హెచ్ఎం, జెడ్పీహెచ్స్కూల్ కేశవరాయినిపాలెం (లావేరు మండలం) 2. కుప్పిలి ఏ– కేంద్రంలో సీఎస్గా వ్యవహరించిన ఎం.లక్ష్మణరావు–హెచ్ఎం, జెడ్పీహెచ్ స్కూల్ కొత్తపేట (ఎచ్చెర్ల మండలం) 3. కుప్పిలి బి–కేంద్రం డీఓగా వ్యవహరించిన బీవీ సాయిరాం (ఎస్ఏ మ్యాథ్స్), జెడ్పీహెచ్స్కూల్ కేశవరావుపేట (ఎచ్చెర్ల మండలం) 4.కుప్పిలి ఎ–కేంద్రం డీఓగా వ్యవహరించిన పి.హరికృష్ణ (ఎస్ఏ), జెడ్పీహెచ్స్కూల్ ధర్మవరం (ఎచ్చెర్ల మండలం) 5. జె.పద్మకుమారి– హెచ్ఎం, జెడ్పీహెచ్స్కూల్ కుప్పిలి 6. ఎం.కనకరాజు (ఎస్ఏ ఇంగ్లీషు)–జెడ్పీహెచ్స్కూల్ బుడగట్లపాలెం 7. ఎస్.కృష్ణ (ఎస్ఏ హిందీ) జెడ్పీహెచ్స్కూల్ కొయ్యాం 8. పి.నాగేశ్వరరావు (ఎస్ఏ మ్యాథ్స్) జెడ్పీహెచ్స్కూల్ కుప్పిలి 9. కె.కామేశ్వరరావు (ఎస్ఏ హిందీ) జెడ్పీహెచ్స్కూల్ కుప్పిలి 10. కారు కస్టోడియన్ కమ్ సిట్టింగ్ స్క్వాడ్గా వ్యవహరించిన ఎంవీ కామేశ్వరరావు (ఎస్ఏ) జెడ్పీహెచ్స్కూల్ అదపాక (లావేరు మండలం) 11. ఏ.శ్రీరాములునాయుడు (ఎస్ఏ తెలుగు) జెడ్పీహెచ్స్కూల్ కేశవరాయునిపాలెం 12. ఎస్.శ్రీనివాసరావు (ఎస్ఏ మ్యాథ్స్), ఎంపీయూపీ స్కూల్ బడివానిపేట 13. బి.రామ్మోహనరావు (ఎస్ఏ మ్యాథ్స్), జెడ్పీహెచ్స్కూల్ కేశవరాయినిపాలెం 14. పి.ఫల్గుణరావు (ఎస్ఏ పీఈ), జెడ్పీహెచ్స్కూల్ మురపాక. ● కుప్పిలి టెన్త్ పరీక్ష కేంద్రంలో చూసి రాస్తూ అధికారులకు దొరికిపోయిన విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖలో సంచలనం నమోదైంది. ఎచ్చెర్ల మండలం కుప్పి లి మోడల్ స్కూల్ ఏ,బీ కేంద్రాలుగా జరుగుతున్న పదోతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో ఐదుగురు విద్యార్థులు డీబారయ్యారు. జిల్లా చరిత్రలో ఓ పరీక్ష కేంద్రంలో ఒకే రోజు ఇంతమందిపై మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీనికి తోడు ఏకంగా 14 మంది టీచర్లను సస్పెండ్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇంగ్లిషు పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 149 కేంద్రాల్లో రెగ్యులర్, ప్రైవేటు కలిపి మొత్తం 28,323 పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 160 మంది గైర్హాజరయ్యారు. ఏమైందంటే..? కుప్పిలి ఏ, బీ కేంద్రాల్లో కాపీయింగ్పై నిఘా వర్గాల పక్కా సమాచారంతో అధికారులు శుక్రవా రం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. స్వయంగా డీఈఓ డాక్టర్ ఎస్.తిరుమల చైతన్యతోపాటు విద్యాశాఖ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్, ఎచ్చెర్ల ఎంఈఓ–2 గాలి రాజ్కిశోర్, లావేరు ఎంఈఓ–1 ఎం.వాగ్దేవిలు తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో రెండు కేంద్రాల్లో యథేచ్ఛగా కాపీయింగ్లు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. తనిఖీ చేయగా రెడ్హ్యాండెడ్గా ఐదుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. వీరిని డీబార్ చేశారు. కేంద్రాల సీఎస్లు, డీఓల ప్రోత్సాహంతో ఇన్విజిలేటర్ల వద్ద కూడా జవాబుపత్రాలు, జిరాక్స్ కాపీలు ఉన్నట్టు గుర్తించారు. కార్యాలయ సిబ్బంది, బయట నుంచి సహకరించిన వ్యక్తులను సైతం అధికారులు గుర్తించారు. 14 మంది టీచర్లపై వేటు మొత్తం ఈ రెండు కేంద్రాల్లోని సీఎస్లు, డీఓలు, ఇన్విజిలేటర్లుగా ఉన్న ఉపాధ్యాయులు, నాన్టీచింగ్ స్టాఫ్పై శాఖాపరమైన ఆదేశాలకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. డీఈఓ కూడా నోట్ తయారు చేసి కలెక్టర్కు ఇచ్చారు. దీంతో కుప్పిలి ఏపీ మోడల్ స్కూల్ ఏ, బీ రెండు పరీక్ష కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న చీఫ్ సూపరింటెండెంట్లతో కలిపి మొత్తం 14 మంది ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య ఆదేశాలు జారీ చేశారు. ఇటు జిల్లాలో, అటు రాష్ట్రంలో పరీక్ష నిర్వహణలో భాగస్వామ్యమైన 14 మంది టీచర్లు ఏకకాలంలో సస్పెన్షన్కు గురికావడం చర్చనీయాంశమైంది. వీరిలో 11 మంది టీచర్లను డీఈఓ, ముగ్గురు హెచ్ఎంలను ఆర్జేడీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాపీ వెనుక ఉన్నదెవరు..? గత ప్రభుత్వం కంటే మెరుగైన ఫలితాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే కాపీయింగ్కు ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో సాధించిన ఫలితాల కంటే అధికంగా సాధించాలని విద్యాశాఖ మంత్రి ఆదేశించినట్టు భోగట్టా. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకే మాస్ కాపీయింగ్లు జరుగుతున్నాయని పరీక్ష కేంద్రాల్లో పనిచేస్తున్న వివిధ శాఖల సిబ్బంది చెబుతున్నారు. అధికారులు, స్క్వాడ్లు ఎంపికచేసుకున్న కేంద్రాల్లో మాత్రమే ‘అతి’గా ఫోకస్ చేస్తున్నారని, మిగిలిన కేంద్రాల సంగతేంటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. కుప్పిలి మోడల్ స్కూల్విద్యాశాఖ చరిత్రలో సంచలనం 14 మంది టీచర్ల సస్పెన్షన్ 5మంది విద్యార్థుల డీబార్ -
వంశధార గట్టు.. నీరు దొరికితే ఒట్టు
పాలకుల్లో చలనం లేదు.. అధికారులు పట్టించుకో వడం లేదు. పాలకుల్లో చలనం లేదు. దీంతో మాకు ఇబ్బందులు తప్పడం లేదు. నది పక్కన ఉన్నామే తప్ప నీరు మాత్రం లేకుండా పోతోంది. – ఇద్దుబోయిన ఆదిలక్ష్మి, హిరమండలం హిరమండలం: అక్కడ రోజూ ‘పానీ’పట్టు యుద్ధమే. ఊరు వంశధార గట్టు కిందే ఉన్నా.. నీటి బొట్టు కూడా దొరకని వింత పరిస్థితి వారి ది. వేసవి కాలం వచ్చిందంటే బిందెలు పట్టుకుని గంటల కొద్దీ వేచి ఉండాల్సిన దుస్థితి. చుక్క చుక్క నీటి బొట్లు రాలుస్తూ వెక్కిరించే కుళాయిలు, ఎప్పుడు వస్తాయో తెలీని ట్యాంకర్లపై విసుగెత్తిపోయిన హిరమండలం మహిళలు శుక్రవారం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలు పట్టుకుని అలికాం–బత్తిలి ప్రధాన రహదారిపై నిరసన తెలిపా రు. రహదారి గుండా ఎలాంటి వాహనాల రాకపోకలు జరగకుండా అడ్డుకున్నారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్ది చెప్పారు. హిరమండలం మేజర్ పంచాయతీలో సుమారు 18 వేల మంది జనాభా ఉంది. ప్రతి మనిషికి రోజుకు సగటున 20 లీటర్ల నీరు అవసరం. ఈ లెక్కన 3,60,000 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడో దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన పైపులైన్, మంచినీటి పథ కం సామర్థ్యం చాలడం లేదు. అటు సమగ్ర మంచినీటి పథకం, జలజీవన్ మిషన్ వంటి పథకాలు ఉన్నా ఏవీ అక్కరకు రావడం లేదు. వేసవికి ముందస్తు చర్యలు లేవు. ఇటీవల ఒకే సారి నీటికి ఇబ్బందులు రావడంతో అప్పటికప్పుడు బోర్లు తవ్వి పథకానికి అనుసంధానం చేశారు. అయినా తాగునీరు అందని దుస్థితి. కుళాయిల ద్వారా అంతంత మాత్రమే నీరు అందిస్తున్నారు. రోజువిడిచి రోజు నీరు రావడంతో మహిళలు పడరాని పాట్లు పడుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడి ఉంటుందని తెలిసినా ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై వారు మండిపడుతున్నారు. దీనిపై ఆర్డబ్లూఎస్ డీఈ వెంకటప్పలనాయుడు వద్ద సాక్షి ప్రస్తావిస్తే మేజర్ ఇప్పటికే అదనంగా బోర్లు తవ్వామని వాటి నుంచి నీటిని పథకానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. గుక్కెడు నీటి కోసం .. ఏటా వేసవి వచ్చిందంటే చాలు.. తాగునీటి కోసం చా లా ఇబ్బందులు పడతాం. నది చెంతనే ఉన్నామన్న మాటే కానీ.. గుక్కెడు నీటి కోసం కూడా పాట్లు పడాల్సిన పరిస్థితి. – కొటివాడ లీలావతి, స్థానిక మహిళ, హిరమండలం -
కూటమి నేతలు కక్షగట్టారు
● అధికారులకు ఫిర్యాదు చేసిన అల్లాడపేట సర్పంచ్ చిన్నమ్మడు జలుమూరు: కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాని కి చెందిన టీడీపీ నాయకులు అలజడులు, వివాదా లు సృష్టిస్తున్నారని జలుమూరు మండలం అల్లాడ పేట సర్పంచ్ కల్యాణం చిన్నమ్మడు అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అల్లాడపేట ఫీల్డ్ అసిస్టెంట్ పంగ వెంకటరమణపై గ్రామానికి చెంది న మెండ శిమ్మయ్య, ఎం.రాంబాబు, కల్యాణం జనార్దనరావు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టేందుకు గురువారం నరసన్నపేట క్లస్టర్ ఏపీడీ పూడి లోకేశ్ గ్రామానికి వచ్చారు. పంచాయతీ కార్యాలయంలో వేతనదారులతో మాట్లాడారు. గ్రామంలో లేనివారికి ఉపాధి హాజరు వేస్తున్నారని, తమకు పనులు కల్పించడం లేదని ఓ వర్గం చెప్పగా.. అందరికి పనులు కల్పిస్తున్నారని గ్రామానికి చెందిన మెండ అప్పారావు, నేతింటి చిన్నమ్మడు, మెండ ఆరుద్ర, మెండ రామచంద్రరా వు, కల్యాణం సూర్యారావు తదితరులు వివరించా రు. ఈ నేపథ్యంలో సర్పంచ్ చిన్నమ్మడు అధికారి తో మాట్లాడుతూ తన భర్త కల్యాణం అచ్చెన్నను హత్య చేసిన వారే మళ్లీ ఇలాంటి తప్పుడు ఫిర్యాదు లు చేస్తున్నారని చెప్పారు. వీరిపై పలు కేసులు కూడా నడుస్తున్నాయని తెలిపారు. వంట ఏజెన్సీ, అంగన్వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్ ఇలా అందరినీ బెది రిస్తున్నారని అధికారి దృష్టికి తీసుకొచ్చారు. నిత్యం గొడవలు సృష్టిస్తున్న వీరిపై ఇప్పటికే ఎస్పీకి ఫిర్యా దు చేశామన్నారు. గ్రామంలో వైఎస్సార్సీపీ సాను భూతిపరులపై కుట్ర పన్నుతున్నారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరారు. కా ర్యక్రమంలో ఏపీఓ శేఖర్, వైఎస్సార్సీపీ నాయుకు లు కల్యాణం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
విద్యుత్ మీటర్ రీడర్ల ధర్నా
అరసవల్లి: విద్యుత్ మీటర్ల రీడింగ్ బాధ్యతలను నుంచి క్రమక్రమంగా తప్పించేలా యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాలు దారుణమని, ఈ చర్యలతో వేలాది మంది మీటర్ రీడర్లు రోడ్డున పడనున్నారని బాధిత సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా విద్యుత్ మీటర్ల రీడర్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం సర్కిల్ కార్యాలయం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరేళ్లుగా నాట్ స్కాన్ మీటర్లు ఉన్నప్పటికీ, వాటిని మార్చకుండా వెరిఫై చేయకుండానే..మేమే స్కాన్ చేయడం లేదన్న సాకుతో భారీగా జీతాల్లో కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థకు చెందిన మొబైల్స్ కూడా రీడర్లుకు ఇవ్వకుండా ప్రణాళికబద్ధంగా వేటు వేసేలా కుట్రలు చేస్తున్నార ని ఆరోపించారు. ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలను ఇవ్వాలని తామంతా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నామని.. తక్షణమే యాజమాన్యం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో సంఘ నేతలు ఎస్.అఖిల్, జి.తేజ, ఎల్.భాస్కర్, ఆర్.రమేష్, ఎన్.గోవిందరావు, పి.సంతోష్, బి. దేవీవరప్రసాద్ తదితరులున్నారు. అనంతరం విద్యుత్ శాఖ సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఆపరేషన్స్ ఈఈ పైడి యోగేశ్వరరావులకు వినతిపత్రాలు అందజేశారు. -
నిమ్మాడలో పట్టపగలే చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నిమ్మాడ ప్రధాన రహదారిలో మంత్రి సోదరుడి ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న శిమ్మ కృష్ణారావు ఇంట్లో గురువారం పట్టపగలే చోరీ జరిగింది. కోట బొమ్మాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణారావు తన భార్య లక్ష్మీతో కలిసి పొలం పనికి వెళ్తూ ఇంటి తాళం చెవిని ఆవరణలో పెట్టి వెళ్లిపోయారు. కుమారుడు, కోడలు పనుల నిమిత్తం నరసన్నపేట వెళ్లారు. తాళం చెవి ఇంటి ఆవరణలో పెట్టడం గమనించిన దుండగులు దర్జాగా తాళం తీసి ఇంట్లో ప్రవేశించి 6 తులాల బంగారం, కొంత నగదు అపహరించుకుపోయారు. కృష్ణారావు పొలం పనులు ముగించి ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానంతో ఇంట్లోకి వెళ్లి చూడగా బంగారం, నగదు పోయినట్లు గుర్తించారు. అనంతరం కోటబొమ్మాళి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఎస్ఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక శ్రీకాకుళం కల్చరల్: క్రైస్తవ సమాజానికి సేవలు అందించడమే లక్ష్యంగా క్రిస్టియన్ సెక్యూర్ సర్వీసెస్(సీఎస్ఎస్) ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మెర్సి చర్చిలో సీఎస్ఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బిషప్ డాక్టర్ బర్నబాస్ బింకం(శ్రీకాకుళం), ప్రధాన కార్యదర్శిగా ఓంపూరు రమేష్ (శ్రీకాకుళం), కోశాధికారిగా పాస్టర్ ఎం.షక్ర్బాబు (రావాడపేట), ఉపాధ్యక్షులుగా పాస్టర్ జి.ఇ.శామ్యూల్ అరుణ్కుమార్(ఆమదాలవలస), పాస్టర్ టి.పేతురు(ఎచ్చెర్ల), సహాయ కార్యదర్శిగా పాస్టర్ ఆర్.శామ్యూల్ (కొయ్యాం), సహాయ కార్యదర్శిగా పాస్టర్ టి.సూరిబాబు (రణస్థలం), గౌరవాధ్యక్షులుగా పాస్టర్ ఇ.శామ్యూల్ జాన్ (సరుబుజ్జిలి), గౌరవ సలహాదారులుగా పాస్టర్ ఎ.ఎ.పాల్ (సొట్టవానిపేట), కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ సీహెచ్.మోజేష్ (గార), పాస్టర్ కె.వి.జాషువ (పాతపట్నం), పాస్టర్ బి.చిన్నారావు (సారవకోట), ప్రచార కార్యదర్శిగా పాస్టర్ అల్లు ఇమ్మానుయేలు (లావేరు), ప్రేయర్ కో–ఆర్డినేటర్గా పాస్టర్ ఆశిర్ కుమార్ (ఆమదాలవలస), యూత్ వింగ ప్రెసిడెంట్గా పాస్టర్ అహరోన్ నియమితులయ్యారు. -
నేత్రదానం స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని విశాఖ– ఏ కాలనీలో నివాసముంటున్న పొట్నూ రు ధర్మరాజు(71) మృతి చెందడంతో ఆయన కుమారుడు పి.వెంకటరమణ, కుమార్తె ఎ.ప్రవీణ, అల్లుడు రమణమూర్తి నేత్రదానానికి ముందుకొచ్చారు. రెడ్క్రాస్ ప్రతినిధి తవుడు ద్వారా విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ పి. జగన్మోహనరావుకు తెలియజేయగా నేత్ర సేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, పి.సునీతలు హాజరై ధర్మరాజు కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి తరలించారు. దాత కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, కార్యదర్శి మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గాశ్రీనివాస్ అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు. నేడు డీఎంఈ రాక శ్రీకాకుళం: డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ రఘునందన్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు రిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాలలను పరిశీలించి వైద్యులతో సమీక్షిస్తారు. మధ్యాహ్నం జిల్లాలోని మరికొన్ని ఏరియా ఆస్పత్రులను పరిశీలించే అవకాశం ఉంది. పేకాట శిబిరంపై దాడి కవిటి: మండలంలోని మాణిక్యపురం సమీప కొబ్బరితోట్లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడిచేసి నలుగురిపై కేసు నమోదు చేసినట్టు కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.8600 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. టీజీఐ పరిశ్రమలో అగ్ని ప్రమాదం గార: మండలంలోని సతివాడ జంక్షన్లో ట్రాన్స్వర్డ్ గార్నెట్ ఆఫ్ ఇండియా(టీజీఐ) ఇసుక పరిశ్రమలో గురువారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్ బ్లాక్ పక్క ఉన్న స్టాకు గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న శ్రీకాకుళం అగ్నిమాపక సిబ్బంది పరిశ్రమ వద్దకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున అగ్నికీలలు చెలరేగడంతో సాయంత్రం వరకు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అగ్నిమాపక శాఖాధికారి వరప్రసాద్ తెలిపారు. ఇసుక లోడింగ్ చేసే బ్యాగులు కాలిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు. అదనపు వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయండి శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్యాస్ సరఫరా సమయంలో సిబ్బంది అధిక మొత్తం వసూళ్లు చేస్తే పౌర సర ఫరా అధికారులకు ఫిర్యాదు చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజె న్సీ నుంచి వినియోగదారులు ఇంటికి 15 కిలోమీటర్ల పైన దూరం ఉంటే రవాణా చార్జి నిమిత్తం ఒక్కో సిలిండర్కు రూ.30 మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. 15 కిలోమీటర్ల లోపు ఉంటే ఎటువంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్ నేడు శ్రీకాకుళం పాతబస్టాండ్: విభిన్న ప్రతిభావంతుల గ్రీవెన్స్ స్వాభిమాన్ వినతుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సహాయ సంచాలకులు కె.కవిత తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. యోగా అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానం శ్రీకాకుళం న్యూకాలనీ: కేంద్ర ప్రభుత్వం (ఆయుష్ శాఖ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన సర్వీసుల శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు 2వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి యోగా అవార్డు–2025కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సెట్శ్రీ సీఈఓ బి.వి.ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ/అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వ్యక్తిగత విభాగంలో దరఖాస్తుదారుకు కనీస వయసు 40 ఏళ్లు ఉండాలని, 20 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని స్పష్టం చేశారు. నాలు గు అవార్డులను జూన్ 21న ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 31తో దరఖాస్తు నమోదు గడువు ముగుస్తుందని తెలిపారు. -
ఉగాది కవితా పురస్కారాల విజేతలు వీరే
శ్రీకాకుళం కల్చరల్ : వేమన కవితా నిలయం (శ్రీకాకుళం), తపస్వి మనోహరం (హైదరాబాద్) సంయుక్త నిర్వహణలో విశ్వావసు నామ ఉగాది (2025) పురస్కార కవితా సంపుటాల విజేతలను నిర్వాహకులు మహ్మద్ రఫీ (ఈవేమన), నిమ్మగడ్డ కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 23న కేంద్ర గ్రంథాలయ సమావేశ మందిరంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలను ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో పద్మావతి రాంభక్త (మెతుకు వెలుగులు), యాములపల్లి నరసిరెడ్డి (శిలావృక్షం), వైరాగ్యం ప్రభాకర్ (ఆకాశమంత), బగాది వెంకటరావు (బగాది బాసలు), వైతాళీయ కుచేలోపాఖ్యానం (మంత్రవాది వీరవెంకట సత్యనారాయణ), కడలి కవితా ప్రసూనాలు (కడలి ప్రకాశరావు) విజేతలుగా నిలిచారని ప్రకటించారు. స్టేడియానికి వైఎస్సార్ పేరు తొలగింపు సరికాదు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): విశాఖపట్నం మధురవాడలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం బోర్డులో వైఎస్సార్ పేరును తొలగించడం సరికాదని వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షుడు ఎం.వి.స్వరూప్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో ఒక పేజీని ఇలా పేర్లు మార్పుకే కేటాయించడం దారుణమన్నారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి మానవతా దృక్పథంతో ఓ జిల్లా పేరును ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని గుర్తు చేశారు. ఇటువంటి నిస్వార్థ రాజకీయాలు చేసేది ఒక్క వైఎస్సార్ కుటుంబమేనని స్పష్టం చేశారు. కుల్లు, కుతంత్రా లు, మోసాలతో రాజకీయం చేసేది చంద్రబాబు, లోకేష్లని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్టేడియం పేరు మార్చలేదని, ఇప్పుడే ఎందుకు మార్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కక్షసాధింపు చర్యలు మానుకోవాలన్నారు. -
గేట్ ర్యాంకులపై హర్షం
ఎచ్చెర్ల క్యాంపస్: ఇంజినీరింగ్ పూర్తి చేసి జాతీయ విద్యా సంస్థల్లో పీజీ (ఎంటెక్) చదివేందుకు ఉద్దేశించిన అర్హత పరీక్ష ‘గేట్’లో శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్ ఐటీ) విద్యార్థులు ర్యాంకులు సాధించటం పట్ల క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కొక్కిరాల వెంకటగో పాల ధన బాలాజీ హర్షం వ్యక్తం చేశారు. అధికారు లు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి గురువారం కేక్ కట్ చేసి ఆనందం పంచుకున్నారు. కొమరాల శేతశ్రీ ఈసీఈ విభాగంలో 241వ ర్యాంకు, అప్పాన శ్రీనివాస్ సీఎస్ఈలో 663వ ర్యాంకు సాధించారు. సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈలలో 60 మంది వరకు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జాతీయ విద్యా సంస్థల్లో పీజీ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ట్రిపుల్ ఐటీ వంటి ప్రభుత్వ సంస్థ విద్యార్థులు అత్యున్నత ర్యాంకులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పరిపాలన అధికా రి ముని రామకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్ కొర్ల మోహన్కృష్ణ చౌదరి, ఎఫ్వో వాసు, డీన్ ఆఫ్ వెల్పేర్ గేదెల రవి, సీఎస్ఈ హెచ్వోడీ రమేష్కుమార్, పీఆర్వో మామిడి షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. అదరగొట్టిన నివాస్ శ్రీకాకుళం న్యూకాలనీ: గేట్ ఫలితాల్లో శ్రీకాకుళం నగరంలోని వాంబేకాలనీకి చెందిన అడ్డూరి నివాస్ ప్రతిభ కనబర్చాడు. ఆలిండియా స్థాయిలో 204వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. తండ్రి వెంకట్ మృతిచెందడటంతో తల్లి అనూరాధ టైలరింగ్ చేస్తూనే పిల్లలను చదివిపిస్తుంది. సోదరి ట్రిపుల్ ఐటీలో చదువుతోంది. నివాస్ ప్రతిభ కనబరచడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తంచేశారు. -
ఆత్మగౌరవం
● మాతృ భాషను మృతభాషగా మార్చొద్దు ● జూనియర్ కాలేజీల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయాలి ● ఇంటర్ స్పాట్ కేంద్రం వద్ద అధ్యాపకుల నిరసన శ్రీకాకుళం స్పాట్ కేంద్రం వద్ద నిరసన చేపడుతున్న జూనియర్ కళాశాలల తెలుగు అధ్యాపకులు శ్రీకాకుళం న్యూకాలనీ: దేశభాషలందు తెలుగు లెస్స అని ఓ మహానుభావుడు.. కీర్తించారని, కానీ తెలుగుభాష మాట్లాడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మాతృభాషను స్వయంగా ప్రభుత్వమే మృతభాషగా మార్చుతుండటం బాధాకరమని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియెట్ విద్యలో తెలుగు సబ్జెక్టునే లేకుండా నిర్వీర్యం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండటాన్ని తెలుగు అధ్యాపకులు తప్పుబడుతున్నారు. సంస్కరణల పేరిట తెలుగు సబ్జెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని జూనియర్ కళాశాలల తెలుగు అధ్యాపకు ల సమాఖ్య ప్రతినిధులు డాక్టర్ పేడాడ రాజేశ్వరరా వు, హనుమంతు సుధాకర్, సనపల రమణ, పైడి శ్యామలరావు, పేడాడ ఉమామహేశ్వరరావు, డి.గిరిబాబు, బి.రామలక్ష్మి, తదితరులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సంఘం పిలుపు మేర కు ఇంటర్మీడియెట్ జవాబు పత్రాల మూల్యాంకన కేంద్రం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వం తీరును, ఇంటర్ విద్య ఉన్నతాధికారుల దుందుడుకు చర్యలకు ఎండగడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇంటర్ విద్యలో తప్పనిసరి గా ద్వితీయభాషగా ఉన్న తెలుగును.. సంస్కరణల పేరిట ఐచ్ఛిక (ఆప్షనల్)సబ్జెక్టుగా చేయడం ద్వారా భవిష్యత్తులో తెలుగుభాష మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి మాతృభాషను వేరుచేయడమంటే.. తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని మండిపడ్డారు. ఆర్ఐఓకు వినతిపత్రం అందజేత.. అనంతరం స్పాట్ కేంద్రం నుంచి జిల్లా ఆర్ఐఓ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లారు. ఆర్ఐఓ ప్రగడ దుర్గారావుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి, ఇంటర్ విద్య ఉన్నతాధికారులకు తమ గోడును తెలియజేయడమే కాకుండా తెలుగు భాష ఉనికిని, తెలుగు సబ్జెక్టు మనుగడను, తెలుగు అధ్యాపకుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులతోపాటు అన్నెపు లక్ష్మణరావు, ఎన్.సంతోష్కుమార్, కె.లక్ష్మి, పైడి హేమలత, తారకేశ్వరరావు, వెంకటరమణ, కె.అసిరినాయుడు, ఎం.రమేష్, పైలా శశిధర్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. నాడు గొప్పన్నారు..? ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యలో భాగమే నని.. అలాంటి పాఠశాల విద్యలో గత ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను తీసుకొ స్తే.. పూర్తిగా వ్యతిరేకించి తెలుగు మీడియం కో సం పట్టుబట్టిన కూటమి పార్టీలు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు సబ్జెక్టే ఉండకూడదని భావించడం ఎంతమాత్రం తగదు. – హనుమంతు సుధాకర్, తెలుగు అధ్యాపకుడు తెలుగు ఆప్షనల్ కాదు.. -
దివ్యాంగులకు తప్పని పాట్లు
ఇచ్ఛాపురం టౌన్: వైకల్య ధ్రువపత్రాల పరిశీలన కోసం ఇచ్ఛాపురం సామాజిక ఆస్పత్రికి గురువారం వచ్చిన దివ్యాంగులకు అధికారుల తీరు కారణంగా ఇబ్బందులు తప్పలేదు. కంచిలి మండలం బెల్లుప డ గ్రామానికి చెందిన దివ్యాంగులు బి.సీతమ్మ, సీహెచ్ పాపారావు, కె.హరికృష్ణ, సీహెచ్ లత, నర్తు గీతలు అంగవైకల్య ధ్రువపత్రం కోసం దరకాస్తు చేసుకున్నారు. వైద్య పరిశీలనకు గురువారం ఇచ్ఛాపురం సీహెచ్సీకి హాజరుకావాలని నమోదుపత్రంలో సమయం కేటాయించారు. తీవ్ర వ్యయ ప్రయాసలకోర్చి దివ్యాంగులు రాగా.. పరిశీలకులు రాలేదని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం అధికారులు ముందుగా చెప్పకపోవడంతో సుమారు 40 కిలోమీటర్ల దూరం నుంచి ఆటోలో రావాల్సి వచ్చిందని వాపోయారు. కా గా, దివ్యాంగులకు బుధవారం మాత్రమే వైద్య పరిశీలన చేస్తారని వైద్యాధికారి దేవేంద్రరెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ముందుగానే ఆయా మండల అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. -
పల్లె గూటికి పండగొచ్చింది
● నేటి నుంచి పోలవరంలో పాశిపోలమ్మ సిరిమానోత్సవాలు ● తొమ్మిదేళ్ల తర్వాత ఉత్సవాల నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన కమిటీ సభ్యులు టెక్కలి: ఆ పల్లెకు నవ వసంతం వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత పండగొచ్చింది. టెక్కలి మండలం పోలవరంలో తొమ్మిదేళ్ల అనంతరం పాశిపోలమ్మ సిరిమానోత్సవాలు జరగనున్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు ఈ నెల 25 వర కు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. 2016లో జరిగే ఈ వేడుకలకు ఉత్సవ కమిటీ సభ్యు లు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సుదూర ప్రాంతాల నుంచి బంధువులు పోలవరం చేరుకోవడంతో గ్రామం కళకళలాడుతోంది. ఉత్సవాల్లో భాగంగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సిరిమానోత్సవం ఇలా.. గ్రామానికి ఆనుకుని వంశధార ప్రధాన కాలువ గట్టుపై గల రావిచెట్టు వద్ద వెలసిన పాశిపోలమ్మ గ్రామదేవతకు సిరిమానోత్సవాలను తొమ్మిదేళ్లకో సారి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో నాయుడుగా పిలవబడే బగాది గంగాధ ర చౌదరి సిరిమానుపై ఆశీనులై అమ్మవారికి పూజ లు చేస్తారు. ప్రతీ ఇంటి నుంచి కొత్త చీరను సిరిమానుకు (చింత కర్రకు) కడతారు. ఆ మానుపై గంగాధర చౌదరి ఆశీనులయ్యాక ఊరేగింపు నిర్వహిస్తా రు. రావిచెట్టు వద్ద పూజలు చేసి ఉత్సవాలను ముగిస్తారు. ఉత్సవ కార్యక్రమాలివే.. ●శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అమ్మవారి గుడి నుంచి మేళ తాళాలతో దేవర తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ●22న ఉదయం 8 నుంచి పగటి వేషాలతో అమ్మ వారి ఊరేగింపు ఉంటుంది. రణస్థలం, తాడేపల్లిగూడేం కళాకారులతో కోలాటం, తలకాయ డ్యాన్స్, చిన్నారులతో కోలాట ప్రదర్శనలు నిర్వహిస్తారు. ●23న అమ్మవారి ఊరేగింపు, తాడేపల్లిగూడేం కళాకారులతో కాంతార, లేడీస్ స్పెషల్ గ్రూప్ డ్యాన్స్ లు, మెగా ఈవెంట్స్ జరుగుతాయి. ●24న ఉదయం అమ్మవారి ఊరేగింపు, బాడసూర న్న బృందం జాలారి నాటకం, మధ్యాహ్నం విశాఖ పట్నం కళాకారులతో దాండియా నృత్యాలు, ఇచ్ఛాపురం కళాకారులతో కోయి డ్యాన్స్లు, రాత్రి 7 గంటలకు గుంటూరు, రాజమండ్రి కళాకారులతో సినీ సూపర్ డూప్స్ కార్యక్రమాలు, రాత్రి 10 గంటలకు రామాంజనేయ యుద్ధం, సత్యహరిశ్చంద్ర నాటకాలు నిర్వహించనున్నారు. ●25న ఉదయం ఒడిశా కళాకారులతో ధూమ్ ధడాకా, సాయంత్రం బిందెల డ్యాన్స్లు, తీన్మార్, అమ్మవారి వేషాలు, సాయంత్రం మేళ తాళాలతో సిరిమానోత్సవం (అంజలి రథోత్సవం అనుపు పండగ) నిర్వహించనున్నారు. అందరి సహకారంతో... గ్రామస్తుల సహకారంతో పాశిపోలమ్మ సిరిమానోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. తొమ్మిదేళ్ల తర్వాత జరిగే ఈ వేడులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరి సహకారంతో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. – గురుబెల్లి చిన్నంనాయుడు(బాలకృష్ణ), సర్పంచ్, పోలవరం, టెక్కలి మండలం -
ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించండి
● ట్రాఫిక్ పోలీసులకు ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలు ● సాక్షి కథనానికి స్పందనశ్రీకాకుళం క్రైమ్: ‘డే అండ్ నైట్.. వెరీ టైట్..’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనానికి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. నగరంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించాలని ట్రాఫిక్ సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు ట్రాఫిక్ సీఐ నాగరాజు గురువారం సాయంత్రం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఆటోయూనియన్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలో ఎక్కడి పడితే అక్కడ ఆటోలు పార్కింగ్ చేస్తూ ఉంచరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సీఐ సూచించగా దానికి ఆటో యూనియన్ వారు తమ యూనియన్ పరిధిలో ఎవరూ అలా పార్కింగ్ చేయరని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లే అలా చేస్తుంటారన్నారు. ఆర్టీసీకి లెటర్ పెట్టాం.. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ నాగరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ డే అండ్ నైట్ బ్రిడ్జిపై ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేస్తున్న విషయంపై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి లెటర్ పెట్టామని, జంక్షన్ సమీపంలో టీవీఎస్ షోరూం వద్ద ఆపమని చెప్పామన్నారు. ఆటోలు కూడా రన్నింగ్లో ఉంటే ట్రాఫిక్ ఏర్పడదని వారికి సూచనలు అందించామన్నారు. సెయింట్ జోసెఫ్ స్కూల్ మార్గంలోను, సింధూర జంక్షన్లో ఇప్పటికే బీట్ కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తిస్తున్నారని వివరించారు. -
గంజాయి నిర్వీర్యం
7,378 కిలోలనిర్వీర్యానికి సిద్ధంగా ఉంచిన గంజాయి ●సాధారణంగా గంజాయి నిర్వీర్యం అంటే చాలా చోట్ల కాల్చివేస్తారు. ● కానీ పాతకుంకాం రెయిన్బో ఇండస్ట్రీలో మాత్రం పోలీసులు శాసీ్త్రయ పద్ధతిలో గంజాయిని నిర్వీర్యం చేశారు. ● ఈ పరిశ్రమలో ఈ ప్రక్రియ నిర్వహించడం ఇదే మొదటిసారి. ● ఇక్కడ బయో మెడికల్ వ్యర్థాలు నిర్వీర్యం చేస్తారు. ● గంజాయిని తగల బెట్టటం, గోతుల్లో వేసి పూడ్చటం వల్ల కాలుష్య సమస్యలు రావచ్చు. ● అందుకే ఈ పరిశ్రమను ఎంచుకున్నారు. ఇక్కడ పొగ కూడా బయటకు రాకుండా ఏకంగా 16 గంటల పాటు గంజాయిని నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ● కాలుష్య రహిత నిర్వీర్య ప్రక్రియ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదని పోలీసులు వివరించారు. ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం (మన్యం) జిల్లాల్లో 2024 నుంచి ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న 7378 కిలోల గంజాయిని గురువారం పోలీసులు నిర్వీర్యం చేశారు. లావేరు మండలం పాతకుంకాంలో ఉన్న రెయిన్బో పరిశ్రమలో ఈ ప్రక్రియ చేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్ జిందాల్, ఎస్వీ మాధవ్ రెడ్డి పర్యవేక్షించారు. మూడు జిల్లాల నుంచి గంజాయిని ఇక్కడకు వాహనాల్లో తీసుకువచ్చి తూకం వేసి.. శాసీ్త్రయ పద్ధతిలో నిర్వీర్యం చేశారు. మొత్తం మూడు జిల్లాల్లో 226 కేసుల్లో ఈ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నియంత్రణపై ప్రత్యేక నిఘా: డీఐజీ గోపీనాథ్ జెట్టి రాష్ట్రంలోని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలు మేర కు రాష్ట్రంలో గంజాయిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి చెప్పారు. పాతకుంకాంలో గంజాయి నిర్వీర్య కార్యక్రమంలో భాగంగా మీడియాతో ఆయన గురువారం మాట్లాడారు. 2025లో మూడు దశల్లో స్వాధీనం చేసుకున్న గంజాయిని నిర్వీర్యం చేశామన్నారు. మొదటి దశలో అనకాపల్లిలో జనవరిలో 3449 కిలోల గంజాయి, 39.04 లీటర్ల హాషిష్ అయిల్, రెండో దశలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3075 కిలోల గంజాయి, 25.05 లీటర్ల హాషిష్ ఆయిల్, మూడో దశలో ప్రస్తుతం పాత కుంకాంలో 7378 కిలోల గంజాయిని నిర్వీర్యం చేశామన్నారు. గంజాయి నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టిపెడుతున్నట్లు చెప్పారు. ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి అక్రమంగా సరఫరా అవుతోందని గుర్తించామన్నారు. ఆపరేషన్ గంజా ఇలా..ఎందుకు కాల్చలేదంటే..? -
ఇసుక అక్రమ తరలింపుపై ఆగ్రహం
నరసన్నపేట: గోపాలపెంట ఇసుక ర్యాంపు నుంచి రాత్రి సమయాల్లో ఇసుక తరలింపు జరుగుతోందని పోతయ్యవలస గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం రాత్రి ఇసుకతో వెళ్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, లారీ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని గ్రామస్తులకు నచ్చజెప్పి లారీలను ముందుకు పంపించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ రాత్రి సమయాల్లో ఇసుక లారీలు అధికంగా వస్తున్నాయని, దీంతో ఇబ్బందిగా ఉంటోందని తెలిపారు. రాత్రి వేళల్లో ఇసుక తరలింపు నిలుపు చేయాలని కోరుతున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. యాప్ అమలు తప్పనిసరి ఆమదాలవలస: అంగన్వాడీ వర్కర్లు తమకు ఇచ్చిన ఫోన్లో గల పోషణ ట్రాకర్ అనే యాప్లో ప్రతి ఒక్క లబ్ధిదారుని ఫేస్ క్యాప్చర్ చేయాలని జిల్లా ఉమెన్ అండ్ చైర్డ్ డెవలప్మెంట్, సాధికారత అధికారి బి. శాంతిశ్రీ సూచించారు. ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ ఎస్.అనురాధ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ భీ పడాయి భీ 3 రోజుల శిక్షణలో మొదటిరోజు గురువారం ఆమె పరిశీలించారు. కార్యకర్తలకు సదుపాయాలు ఉన్నాయా లేదా అన్న అంశాలు తొలుత అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలకు వచ్చే చిన్నారులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని కార్యక్తలకు సూచించారు. శిక్షణలో అందించే అంశాలు క్షుణ్ణంగా నేర్చుకొని అంగన్వాడీ కేంద్రాల్లో వాటిని విధిగా నిర్వహించాలన్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ‘కూటమి’ చేసిన మేలేంటి? కవిటి: జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూటమి ప్రభుత్వం చేసిన మేలు ఏమిటో చెప్పాలని ఎమ్మెల్సీ నర్తు రామారావు ప్రశ్నించారు. ఆయన గురువారం శాసనమండలి సమావేశాల సందర్భంగా మీడియాపాయింట్ వద్ద ఈ అంశంపై మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో రూ.700 కోట్లు ఖర్చుపెట్టి హిరమండలం నుంచి ఉద్దానం ప్రాంతానికి తాగునీరు తీసుకువచ్చారని గుర్తు చేశారు. రూ.79 కోట్లు వెచ్చించి 200 పడకలతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ కేంద్రాన్ని నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం కిడ్నీ రోగులను ప్రస్తుతానికి గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఒక డెత్ జరిగితే గానీ మరో బాధితుడికి డయాలసిస్ కేంద్రాల్లో బెడ్ ఇచ్చే దుస్థితి దాపురించిందన్నారు. ఇచ్ఛాపురంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ఈ సెంటర్ను తక్ష ణం ప్రారంభించాలన్నారు. సోంపేట, కవిటి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న సెంటర్లలో డయాలసిస్ బెడ్స్ యూనిట్లు పెంచాలని డిమాండ్ చేశారు. పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ద్వారా కిడ్నీ వ్యాధి గ్రస్తులకు మరింత వైద్య సదుపాయాలు సమకూర్చాలని కోరారు. ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే రూ.10వేల పింఛన్ ఇచ్చారని, దానికి మరో రూ.5వేలు కలిపి కూటమి ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. -
శ్రీకాకుళం
కాలువ భూమి సమర్పయామిశుక్రవారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2025లావేరు మండలం బుడతవలస, తామాడ రెవెన్యూ పరిధిలో అన్నీ ఆక్రమణలేనని అధికారులు తేల్చి చెప్పారు. ఈ ప్రాంతాల్లో టీడీపీ నాయకులు చేసిన కబ్జాపై ‘సాక్షి’లో ఈ నెల 20వ తేదీన ‘కాలువ భూమి.. సమర్పయామి’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. చదును చేసిన ఆక్రమిత భూములను రెవెన్యూ అఽధికారులు గురువారం పరిశీలించారు. కొలతలు వేసి ఆక్రమణలను గుర్తించారు. ఆక్రమణలివే.. ● లావేరు మండలం బడుతవలస, తామాడ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను, రస్తాను, గెడ్డ పోరంబోకు ఆక్రమించినట్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలోని వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు తేల్చారు. ● బుడతవలస రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు గల 113/1, 113/2, 113/3, 113/4, 113/5లో గతంలో పలువురికి డీ పట్టాలు ఇచ్చారు. వీటిని సాగు చేయడం లేదు. సమగ్ర భూ సర్వే చేసినప్పుడు వీరంతా అందుబాటులో కూడా లేరు. దీంతో అవన్నీ ప్రభుత్వ భూములే (గయాలు) అని రికార్డుల్లో పేర్కొన్నారు. ● ఇప్పుడా 4.57 ఎకరాల భూములను టీడీపీ నాయకుడు ముళ్ల సాయి ఆక్రమంగా చదును చేసేసి అనుభవంలోకి తెచ్చుకున్నారు. ● అదే విధంగా ఈ భూములకు ఆనుకుని ఉన్న 28 సెంట్ల ప్రభుత్వ రస్తాను కూడా ఆక్రమించి చదును చేసేశారు. ● అదేవిధంగా తామాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 105–1లో సాగునీటి కాలువ ఉంది. దాన్ని కూడా కొందరు ఆక్రమించారు. దీంట్లో కొమ్మి నీలవేణి పేరుతో ఎకరా వరకు, కొమ్మి శాంతి పేరుతో 15సెంట్లు, పురుషోత్తపు ఆదినారాయణ అనే వ్యక్తి పేరుతో 10సెంట్లు ఆక్రమించారు. ఇవన్నీ ‘సాక్షి’లో కథనం వచ్చాక పరిశీలించి, ఆక్రమణలని తేల్చారు. చదును చేసిన ముళ్ల సాయి స్టేట్మెంట్ రికార్డు ప్రభుత్వ భూములను అక్రమంగా చదును చేసిన దానిపై టీడీపీ నాయకుడు ముళ్ల సాయిని రెవెన్యూ అధికారులు విచారణ చేశారు. మీరెలా చదును చేస్తున్నారని, మీకు సంబంధమేంటి? అని, మీకెలా భూములొచ్చాయని ఆరాతీశారు. దానికి ఆయన తెలివిగా వ్యవహరించి, డీ పట్టా దారులు చదును చేయమని చెబితే చేశానని, దాని కోసం తమకు సొమ్ము ఇస్తున్నారని వివరణ ఇచ్చారు. పక్కనే ఉన్న రస్తాను ఎలా చదును చేశారని అడిగితే దానికి తనకు తోచిన సమాధానం ఇచ్చారు. ఇదంతా రికార్డు చేసి తహసీల్దార్కు అందించేందుకు నివేదిక సిద్ధం చేశారు. అసైన్డ్దారులకు పిలుపు సమగ్ర భూసర్వేలో ప్రభుత్వ గయాలు 4.57ఎకరాలు చూపిస్తుండగా, వాటిలో తమ పట్టా భూములు ఉన్నాయని కొందరు సమాచారం ఇవ్వడంతో వారంతా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పట్టాలు చూపించాలని, సక్రమంగా ఉంటే అప్పగించడానికి, లేదంటే ప్రభుత్వ భూములుగానే పరిగణించడానికి, ఒకవేళ అమ్ముకుంటే పీఓటీ కింద స్వాధీనం చేసుకునే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఏదైనా శుక్రవారం జరిగే పట్టాల పరిశీలనలో తేలుతుంది. ఇదిలా ఉండగా, ఇదే భూమిలో కొంత రహదారి కూడా ఉంది. అది కూడా ఆక్రమణకు గురైంది. దీని బాగోతం కూడా బయటపడనుంది. న్యూస్రీల్ ‘సాక్షి’ కథనంతో రంగంలోకి రెవెన్యూ అధికారులు బయటపడిన టీడీపీ నాయకుడి నిర్వాకం 4.57 ఎకరాల ప్రభుత్వ భూములు దర్జాగా చదును 28 సెంట్ల దారి సైతం కబ్జా -
కాలువ భూమి సమర్పయామి
● సాగునీటి కాలువపై టీడీపీ నేత కన్ను ● ఆక్రమణకు గురైన ఐదు ఎకరాలు ● భూమి విలువ రూ.రెండు కోట్లు పైమాటే ● యంత్రాలతో చదును చేస్తున్న వైనం ● చోద్యం చూస్తున్న అధికారులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. ఇప్పటికే ఎచ్చెర్లలో రోజుకొకచోట ఆక్రమణకు పాల్పడుతున్నారు. అవన్నీ ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడా జాబితాలోకి లావేరు మండలం చేరింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములతో పాటు సాగునీటి కాలువలను కబ్జా చేసేస్తున్నారు. దానిలో భాగంగా తామాడ, బుడతవలస పంచాయతీల రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలం, ఇరిగేషన్ కాలువను ఆక్రమించుకునేందుకు చదును చేస్తున్నారు. బుడతవలస రెవెన్యూ పరిధిలోని 113/1, 113/2, 113/3, 113/4, 113/5, 113/7 సర్వే నంబర్లులో ప్రభుత్వ భూమిని, తామాడ రెవెన్యూ పరిధిలో 105 సర్వే నెంబర్లో ఉన్న సాగునీటి కాలువను మొత్తం 4 నుంచి 5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి బుడతవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పూనుకున్నాడు. నెలరోజులుగా చదునుచేసే పనులు ప్రారంభించేశాడు. ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు, డోసర్లు ద్వారా ముందుగా బుడతవలస రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని సాగుచేసేశాడు. అంతటితో ఈయన దాహం తీరలేదు. పక్క పంచాయతీ తామాడ రెవెన్యూ పరిధిలోని తిమ్మప్ప చెరువు నుంచి తాతమానుచెరువు, తూటిబంద, పాతరౌతుపేట చెరువులకు కలుపుతూ ఉన్న కాలువను ఆక్రమించుకునేందుకు చదును చేసే పనులు చేపట్టాడు. ఇక్కడ జరుగుతున్న ఆక్రమణలను ప్రశ్నిస్తుంటే.. తన అనుచరులతో కేసులు పెట్టిస్తామని తిరిగి బెదిరిస్తున్నాడు. దీంతో స్థానికులు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. తామాడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రౌతు నారాయణరావు ఈ విషయమై జిల్లా కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఇటీవల ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని విన్నవించారు. లావేరు మండలం తామాడ రెవెన్యూ పరి ధిలోని 105 సర్వే నంబర్లలో తాజాగా సాగు చేసి న భూమి ఇది. ఇక్కడ సాగునీటి కాలువ ఉండేది. ఇప్పుడా కాలువను కప్పేసి సమతలంగా చదును చేసేసి కబ్జాకు పాల్పడుతున్నారు. వాస్తవంగా బుడతవలస, తామాడ రెండు పక్కపక్క గ్రామాలు. ఈ రెండు గ్రామాల పరిధిలోని భూములు కలిసే ఉంటాయి. ఈ రెండింటిమధ్య ప్రభుత్వ భూములు, సాగునీటి కాలువలు ఉన్నాయి. వాటిపై టీడీపీ నాయకుడు కన్నుపడింది. పట్టపగలు జేసీబీలు, ట్రాక్టరు డోసెర్లు పెట్టి చదును చేసేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా ఏ అధికారీ ఆపే ప్రయత్నం చేయలేదు. చర్యలు తీసుకోవాలి లావేరు మండలం బుడతవలస, తామాడ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములను, సాగునీటి కాలువను సాయి అనే వ్యక్తి ఆక్రమించుకుని చదును చేస్తున్నారు. ఇక్కడ సాగునీటి కాలువ కూడా ఉంది. దీన్ని సైతం కబ్జా చేసి చదును చేస్తున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. – రౌతు నారాయణరావు, తామాడ, లావేరు మండలం నోటీసులు ఇచ్చాం.. తామాడ, బుడతవలస రెవెన్యూ పరిధిలో ఆక్రమణలు చేపడుతున్నవారికి నోటీసులు ఇచ్చాం. ఆక్రమణలను నిలిపివేయాలని ఆదేశించాం. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారిపై చర్యలు తప్పవు. – జోగారావు, లావేరు తహశీల్దార్ -
వెరీ టైట్
Traffic Jamపద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడు తిరిగి వస్తాడేమో గానీ.. జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ జంక్షన్కు రద్దీ వేళ వెళ్లి తప్పించుకోవడం అంత సులువు కాదు. నిన్న కాక మొన్న ఓ నిండు గర్భిణి ఇదే దారిలో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదిలేసింది. ట్రాఫిక్ రణగొణ ధ్వనులు అలవాటైపోయిన చెవులు ఆ ఆర్తనాదాలను అప్పుడే మర్చిపోయాయి. ఒక శ్మశానం, పక్కనే పెద్ద స్కూల్, పదుల సంఖ్యలో ఆస్పత్రులు, ల్యాబ్లు, వందల సంఖ్యలో ప్రయాణికులు, ఆపై ఆటోస్టాండ్.. అన్నీ ఇక్కడే ఉండడంతో ట్రాఫిక్కు నిరంతరం ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అవే కొందరికి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మనసు పెడితే దీనికీ పరిష్కార మార్గాలున్నాయి. – శ్రీకాకుళం క్రైమ్ బ్రిడ్జి చివరన కుడివైపు మలుపులో సెయింట్ జోసెఫ్ స్కూల్ వైపు పాఠశాల విద్యార్థులు.. మరో వైపు అత్యవసరం వైద్యం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారు.. మరో వైపు అంత్యక్రియలకు హాజరయ్యే వారితో పాటు సాధారణ ప్రజానీకం.. చాలా క్లిష్టమైన పరిస్థితే. గంటల కొద్దీ వాహనాలు నిలిచి చికాకుకు కలిగించే పరిస్థితులు రోజుకీ కో కొల్లలు. దీనిపైన ట్రాఫిక్ వ్యవస్థ.. బాగా స్టడీ చేయాలి. పరిమిత వేళల్లోనైనా సరే ఒన్ వే ఏర్పాటు చేయాలి. వెళ్లడం వరకు ఓకే గానీ తిరిగి మాత్రం కేఎల్నాయుడు ఆస్పత్రి మీదుగా పాత సీఎంఆర్ వెనుక వైపు నుంచి విజయగణపతి ఆలయం చౌరస్తా నుంచి వాహనాలు వెళ్లే విధంగా చూస్తే కొంత సమస్యకు పరిష్కారం దక్కుతుంది. బ్రిడ్జి చివరన కుడివైపు మలుపులో సెయింట్ జోసెఫ్ స్కూల్, శ్మశాన వాటిక, కొన్ని ల్యాబ్లు, ఆస్పత్రులు ఉండడంతో ఆ మార్గంలో తీవ్రమైన రద్దీ నెలకొంటోంది. కేవలం 10 నుంచి 12 అడుగుల ఇరుకై న దారిలో ఇటు ద్విచక్రవాహనాలు.. ఆటోలు.. కార్లు రాకపోకలు సాగిస్తుండటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. బ్రిడ్జి నుంచి డే అండ్ నైట్ సిగ్నల్ వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. 7 -
● ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరింతగా పోరాడాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ ముఖ్యనేతలకు ఆదేశించారు. ఇటీవల యువత పోరు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి, డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి గొర్లె కిరణ్కుమార్, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్, కళింగ వైశ్య కుల రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబులను అభినందించారు. కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పార్టీ నేతలు స్పందిస్తున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి నియోజకరవర్గంలోనూ నాయకులంతా కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు అండగా ఉండాలని సూచించారు. కార్యకర్తలకు ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా వెన్నుదన్నుగా నిలబడాలన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా ముఖ్య నేతలతో వైఎస్ జగన్ -
ఆక్రమణ స్థలం పరిశీలన
కవిటి: మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని టీడీపీ నేత చదును చేయించడంపై సాక్షి పత్రికలో ‘చదును ఇదే అదును..!’ శీర్షికతో బుధవారం ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ మురళీమోహనరావు స్పందించారు. ఈ మేరకు మండల సర్వేయర్ మల్లికార్జున పాణిగ్రాహి, ఆర్ఐ రమణమూర్తి, వీఆర్వో ఎస్.నారాయణతో కలిసి సంబంధిత స్థలాన్ని బుధవారం పరిశీలించారు. ఈ స్థలం చుట్టూ ఉన్న రైతులతో ఆయన మాట్లాడి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వాస్తవానికి ఇది రోడ్డు పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇది ప్రభుత్వ స్థలమని అందువలన చదును చేసిన ఖాళీ స్థలంలో బోర్డులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ స్థలాన్ని అనుమతి లేకుండా ఎలా చదును చేశారని చదును చేయించిన వజ్జ రంగారావును ప్రశ్నించారు. అయితే తన కొబ్బరి తోటకు ఆనుకొని ఉండడంతో వ్యవసాయేతర అవసరాలకు వాడుకునేందుకు చదును చేసినట్లు ఆయన తెలిపారు. రైలు ఢీకొని ఆవు మృతి టెక్కలి రూరల్: స్థానిక తెంబూర్ రోడ్డు జంక్షన్ వద్ద ఉన్న రైల్వే గేటు సమీపంలో రైలు ఢీకొని ఆవు మృతి చెందింది. మంగళవారం రాత్రి గుణుపూర్ నుంచి నౌపడ వైపు వెళ్లే రాజారాణి ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతి చెందిన ఆవుని బుధవారం జేసీబీ సాయంతో తొలగించి, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. అయితే మృతి చెందిన ఆవు ఎవరిది అనేది తెలియలేదు. ఆవు మృతదేహాన్ని తొలగిస్తున్న సిబ్బంది -
‘ఉపాధి’లో వెలుగు చూసిన అక్రమాలు
కంచిలి: మండలంలో 2024–25 ఆర్థిక సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వివిధ రకాల పనుల్లో జరిగిన అక్రమాలు బయటపడ్డాయి. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు 31 పంచాయతీల పరిధిలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. చివరిగా బుధవారం ఈ నివేదికలు వెల్లడించే ప్రజావేదిక కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా 31 పంచాయతీల పరిధిలో ఏడాదిపాటు చేపట్టిన వివిధ రకాల పనులకు సంబంధించి నాణ్యత, కొలతలు, వేతనదారులకు అందిన బిల్లులు, హాజరు పట్టిక పరిశీలన, రశీదుల పంపిణీ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో సోషల్ ఆడిట్ సిబ్బంది సేకరించిన వివరాలను నివేదించారు. అవకతవకలు బయటకు ఏడాది కాలంలో ఉపాధి హామీ, హౌసింగ్, ఐటీడీఏ, పంచాయతీరాజ్, ఆర్వీఎం విభాగాల్లో మొత్తంగా 1,783 పనులు చేపట్టారు. వీటికి సంబంధించి సోషల్ ఆడిట్ చేపట్టిన నేపథ్యంలో జరిగిన అవకతవకలు బయటకు వచ్చాయి. దీంతో ఉపాధి హామీ సిబ్బంది నుంచి రూ.64,446లు రికవరీకి అధికారులు ఆదేశించడంతో పాటు రూ.38,500లు జరిమానాగా విధించారు. మొత్తంగా రూ.1,01,946లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పంచాయతీలవారీగా సోషల్ ఆడిట్ నివేదికలు చదివిన సందర్భంగా చాలా వరకు పంచాయతీల పరిధిలో ఉపాధిహామీ పనులు చేపట్టినచోట కనీసం మస్టర్లలో హాజరు కూడా సక్రమంగా వేయడం లేదని, వేతనదారుల బిల్స్కు సంబంధించి రశీదు పత్రాలు పంపిణీ చేయలేదని పేర్కొన్నారు. హాజరు పట్టికలో సంతకాలు, వేలిముద్రలు కూడా లేవని సోషల్ ఆడిట్ డీఆర్పీలు నివేదించారు. అంతేకాకుండా మెటీరియల్ కాంపొనెంట్ పనులకు సంబంధించి పూర్తిగా చేపట్టని నిర్మాణాలకు సైతం బిల్లులు విడుదల చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పనుల కొలతల్లో కూడా తేడాలు ఉన్నట్లు తెలిపారు. ఇలా అడుగడుగునా పర్యవేక్షణ లోపం, పనుల్లో డొల్లతనం అనేవి ఈ ప్రజావేదిక సాక్షిగా వెల్లడయ్యాయి. సమావేశంలో డ్వామా పీడీ సుధాకరరావు, స్థానిక ఎంపీపీ పైల దేవదాస్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు ఇప్పిలి లోలాక్షి, ఏపీడీ సీహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీవో వి.తిరుమలరావు, విజిలెన్స్ డీవో స్వరూపారాణి, ఏపీడీ పంచాది రాధ, విజిలెన్స్ అధికారి శ్రావణ్, ఏపీవో జి.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. రూ.64,446ల రికవరీకి అధికారుల ఆదేశం రూ.38,500ల జరిమానా విధింపు -
రెచ్చిపోయిన పచ్చ తమ్ముడు
ఇచ్ఛాపురం రూరల్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చనివాటిపై కక్ష పూరితంగా వ్యవహరిస్తూ అడ్డు తొలగించుకుంటున్నారు. మండలంలోని కొత్త శాసనం గ్రామంలో 30 ఏళ్ల క్రితం అప్పటి గ్రామపెద్ద కారంగి కారయ్య అనే వ్యక్తి రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలంలో సొంత నిధులతో రచ్చబండను నిర్మించాడు. రచ్చబండ మధ్యలో రావి చెట్టు, పక్కనే త్రినాథ స్వాములవారి విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామస్తులు వేసవి విడిది చేయడం, సమావేశాలు నిర్వహించడం, బాటసారులు విశ్రాంతి తీసుకోవడం చేస్తున్నారు. అయితే రచ్చబండకు వెనుకన స్థానిక టీడీపీ నాయకుడు ఇసురు ఫకీరుకు చెందిన భూమి ఉంది. దీంతో స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతో తన భార్య జానికమ్మతో కలిసి బుధవారం గునపాలతో రచ్చబండను పెకిలించే ప్రక్రియకు పూనుకున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అడ్డుకున్నప్పటికీ తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అడ్డుకున్నవారి అంతు చూస్తానంటూ భయబ్రాంతులకు గురిచేశాడు. దీంతో సర్పంచ్ కారంగి త్రినాథ్రెడ్డి తహసీల్దార్కు, రూరల్ పోలీస్స్టేషన్కు ఫిర్యాదు చేశాడు. రచ్చబండ ధ్వంసం చేసిన భాగాలకు మరమ్మతులు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. రచ్చబండ తొలగింపునకు యత్నం -
గ్రామ బహిష్కరణలు పునరావృతమైతే కఠిన చర్యలు
● గెద్దలపాడు గ్రామపెద్దలను హెచ్చరించిన ఆర్డీఓ కృష్ణమూర్తి టెక్కలి: గ్రామ బహిష్కరణ సంఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి హెచ్చరించారు. సంతబొమ్మాళి మండలం గెద్దలపాడులో ఆశా వర్కర్ చంద్రమ్మ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటనపై బుధవారం టెక్కలి ఆర్డీఓ కార్యాలయంలో గ్రామపెద్దలు, యూనియన్ నాయకులు, బాధితులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఉద్యోగాల అమ్మకాలు, బలవంతపు రాజీనామాలు చేయించడం, కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేయడం వంటి సంఘటనలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా బాధితురాలు చంద్రమ్మ, కుటుంబ సభ్యులు కలిసి టెక్కలి డీఎస్పీ డీఎస్ఆర్వీఎస్ఎన్.మూర్తికి ఫిర్యాదు చేశారు. తన ఉద్యోగానికి బలవంతంగా రాజీనామా చేయించి ఆ ఉద్యోగాన్ని అమ్మకానికి పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
నమ్మించి మోసం చేసిన వ్యక్తిపై కేసు
జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన శిర్రాకిరణ్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై.మధుసూదనరావు తెలిపారు. దేవరవలసలో అగ్ని ప్రమాదం జి.సిగడాం: మండలంలోని దేవరవలస గ్రామంలో అప్పారావు, అప్పలదాస్, సూర్యారావులకు చెందిన సుమారు వంద బస్తాల ధాన్యం కట్టలు, ఐదు ఎకరాల గడ్డివాములు బుధవారం రాత్రి 2 గంటల సమయంలో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.3 లక్షల మేరకు నష్టం చేకూరింది. రాత్రి సమయంలో ఎవరైనా దుండగులు నిప్పుపెట్టారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆందోళన వద్దు.. అండగా ఉంటా..
పొందూరు: వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అనునిత్యం అండగా ఉంటానని ఆ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి చింతాడ రవికుమార్ అన్నారు. రాజకీయ కక్షలతో మండలంలోని ఖాజీపేట గ్రామంలో జరిగిన కొట్లాటలో 42 రోజులుపాటు రిమాండ్లో ఉండి బెయిల్పై వచ్చిన బాధితులను పరామర్శించారు. పరామర్శించిన వారిలో పార్టీ నాయకులు చింతాడ వెంకట సత్యప్రసాద్, తమ్మినేని మురళి, బొమ్మాళి గిరి, పైడి నాగభూషణం, సూర ఆనందరావు, పైడి లోకనాథం, సింగూరు తేజేశ్వరరావు, కూటికుప్పల రాజు, కిల్లి సన్యాసిరావు, గురుగుబెల్లి శేఖర్ ఉన్నారు. -
కేజీబీవీ
లుపిలుస్తున్నాయ్..! కేజీబీవీ అందుబాటులోని కోర్సు ఆమదాలవలస(తాళ్లవలస) ఎంపీసీ బూర్జ(కొల్లివలస) బైపీసీ ఎచ్చెర్ల(పొన్నాడ) ఎంపీసీ జి.సిగడాం ఎంపీసీ గార(శాలిహుండం) బైపీసీ హిరమండలం(పాత హిరమండలం) బైపీసీ ఇచ్ఛాపురం(బెల్లుపాడ) సీఈసీ జలుమూరు ఎంపీసీ కంచిలి(జాడుపుడి) ఎంపీసీ కవిటి(కొత్తపాలెం) ఎంపీసీ కోటబొమ్మాళి(కొత్తపేట) బైపీసీ కొత్తూరు(వసప) ఎంపీసీ ఎల్ఎన్పేట ఎంఎల్టీ లావేరు(మురపాక) ఎంపీసీ మందస(జీఆర్పురం) ఎంఎల్టీ మెళియాపుట్టి బైపీసీ నందిగాం(మదనాపురం) ఎంపీసీ పాతపట్నం(ఇందిరమ్మకాలనీ) ఎంపీసీ పోలాకి(గంగివలస) బైపీసీ పొందూరు(లోలుగు కాలనీ) బైపీసీ రణస్థలం(లంకపేట) ఎంపీసీ సంతబొమ్మాళి ఎంపీసీ సారవకోట(మెయిన్రోడ్) ఎంపీసీ సోంపేట(రాజాం) బైపీసీ శ్రీకాకుళం(సింగుపురం) ఎంపీసీ ఇంటర్మీడియట్ కోర్సులు కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ కోర్సులకు సంబంధించి ఒక్కొక్క చోట ఒక్కో కోర్సును ప్రభుత్వం అందుబా టులోకి తీసుకొచ్చింది. వాటి వివరాలు పరిశీలిస్తే... ● ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● 6వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు దరఖాస్తులు ● ఈనెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ ● మొత్తం 2,224 సీట్ల భర్తీకి చర్యలు శ్రీకాకుళం న్యూకాలనీ: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ)ల్లో ప్రవేశాలకు వేళయ్యింది. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సమగ్ర శిక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 22వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు గడువు విధించారు. అర్హులైన బాలికలు 6వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలు పొందవచ్చు. 25 కేజీబీవీల్లో ప్రవేశాలు పునర్విభజన అనంతరం 30 మండలాల శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీలు ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమంలో బోధించే ఈ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు ఒక్కొక్క పాఠశాలలో 40 సీట్లను భర్తీ చేయనున్నారు. ఈ లెక్కన 1,000 సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఒక్కొక్క కేజీబీవీకి ఒక ఇంటర్ కోర్సును కేటాయించడంతో కేజీబీవీకి 40 చొప్పున మొత్తం 1,000 సీట్లను భర్తీ చేస్తారు. అలాగే 7, 8, 9, 12 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను సైతం భర్తీ చేపట్టనున్నారు. ఇందులో 7వ తరగతిలో 34, 8వ తరగతిలో 11, 9వ తరగతిలో 4, 12వ తరగతి ఇంటర్ సెకండియర్లో 172 సీట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తం మీద కొత్త విద్యా సంవత్సరంలో 2,224 సీట్లను భర్తీ చేయనున్నారు. పేద, అనాథ పిల్లలతో పాటు బడిబయట ఉన్న పిల్లలు, డ్రాపౌట్స్ (బడి మానేసినవారు), ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) జీవిస్తున్న బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులు. 6వ తరగతిలో ప్రవేశం కోసం ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వ తరగతి చదివిన బాలికలై ఉండాలి. అలాగే ఇంటర్లో ప్రవేశాలకు టెన్త్క్లాస్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. జ్ట్టిఞ:// ్చఞజుజఛఠి. ్చఞఛిజటట. జీుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మెరుగైన ఫలితాలు కేజీబీవీలు 2004లో ప్రారంభమయ్యాయి. అన్ని వసతులు, సదుపాయాలతో కూడిన ఉచిత విద్యను అందిస్తూ ఏటా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేవిధంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాయి. 2018 నుంచి ఇంటర్మీడియట్ కోర్సులను కూడా అందిస్తున్నారు. 2018లో జిల్లాలో జి.సిగడాం, కోటబొమ్మాళి కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టగా, 2019లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మరో 19 కేజీబీవీల్లో ప్రవేశాలకు గత రాష్ట్ర ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. 2021 నుంచి అన్ని చోట్ల ఇంటర్మీడియట్ కోర్సులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థినుల భద్రతకు పెద్దపీట ● కేజీబీవీల్లోకి పురుషులకు ప్రవేశం పూర్తిగా నిషేధం. ఉపాధ్యాయులు (టీజీటీ/ పీజీటీలు) సైతం మహిళలే. ● అలాగే ప్రహరీ, గేటు, వాచ్మ్యాన్లతో కూడిన రక్షణ, భద్రత ఉంటుంది. ● అధికారుల తనిఖీలు, పరిశీలన నిమిత్తం తప్పిస్తే ఇతరులకు వెళ్లేందుకు అవకాశం లేదు. ● ఎటువంటి ఖర్చు లేకుండా అత్యుత్తమ బోధన, నాణ్యమైన భోజనం, వసతి సదుపాయాలతో కేజీబీవీల్లో సీట్లకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ● మనబడి నాడు–నేడు ద్వారా కేజీబీవీలను సుందరంగా తీర్చిదిద్దారు. అన్ని వసతులు, మౌలిక సదుపాయాలకు తోడు ఐఎఫ్పీ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులను మరింత చేరువ చేశారు. ● అత్యద్భుతమైన మెనూ, యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, కాస్మోటిక్స్ అందిస్తున్నారు. ● సైన్స్ ప్రాజెక్టులు, యోగా, క్రీడలు, ఆటపాటలు నిర్విరామంగా ఉంటాయి. నీట్, జేఈఈ, ఏపీఈఏపీసెట్ వంటి వివిధ పోటీ పరీక్షలకు కూడా విద్యార్థినులను సన్నద్ధం చేస్తున్నారు. ● ప్రభుత్వం అందించాల్సిన తల్లికి వందనం, విద్యాకానుక వంటి పథకాలకు వీరంతా అర్హులు. హెల్ప్లైన్ కేంద్రం ఏర్పాటు కేజీబీవీల్లో ఆన్లైన్లో దరఖాస్తుల సమయంలో ఏర్పడే సందేహాలు, సమస్యల నివృత్తి కోసం ప్రభుత్వం టోల్ఫ్రీ నంబర్ 18004258599ను ఏర్పాటు చేసింది. అలాగే జిల్లా సమగ్రశిక్ష కార్యాలయంలో హెల్ప్లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు లేదా తల్లిదండ్రులు సందేహాల కోసం సమగ్రశిక్ష జీసీడీవో 94401 12221 నంబర్ను సంప్రదించవచ్చని ఏపీసీ డాక్టర్ శశిభూషణ్ సూచించారు. మంచి అవకాశం కేజీబీవీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ప్రత్యేకంగా బాలికలు చదువుకోవడం గొప్ప అవకాశమని చెప్పాలి. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత చదు వు, వసతి కల్పిస్తూ ప్రభుత్వం నాణ్యమైన, విలువలతో కూడిన విద్యను అందిస్తుంది. స్టేట్ ఎస్పీడీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాం. – డాక్టర్ సంపతిరావు శశిభూషణ్, సమగ్ర శిక్ష ఏపీసీ, శ్రీకాకుళం -
జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మాల, రెల్లి, వాటి అనుబంధ కులాల నేతలు కోరారు. ఈ మేరకు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రం యూనిట్గా వర్గీకరణ చేస్తే తమకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. అందువలన ఆ ఆలోచనను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. 2011 జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేపట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 14 ఏళ్ల క్రితం జనాభా లెక్కలను ఎలా పరిగణలోకి తీసుకుంటారని ప్రశ్నించారు. జేసీని కలిసినవారిలో తైక్వాండో శ్రీను, కంఠ వేణు, అర్జి కోటి, అర్జీ ఈశ్వరరావు, జలగడుగుల గోవిందరావు, జలగడుగుల శ్రీరామ, గొల్లపల్లి మోహన్, అర్జి రామ్మోహన్రావు, అర్జి చిన్న, కె.కూర్మారావు, కల్యాణి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అదుపులోకి రాని మంటలు మందస: మండలంలోని చీపి గ్రామ సమీపంలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్లో మంగళవారం చెలరేగిన అగ్నికీలలు ఇంకా అదుపులోకి రాలేదు. దీంతో అటవీ ప్రాంతంలోని ఔషధ వనరులు, వన్యప్రాణులు మంటల్లో కాలి బూడిదవుతున్నాయి. బుధవారం నాటికి రుక్కి పర్వత ప్రాంతానికి మంటలు వ్యాపించాయి. అటవీ శాఖ అధికారులు ఈ ప్రమాదంపై స్పందించకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్య కేసులో నిందితుడు అరెస్టు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారంపురంలో భార్య గాలి నాగమ్మను అతి కిరాతకంగా హత్యచేసి, ఎచ్చెర్ల పోలీస్స్టేషన్లో స్వచ్ఛందంగా లొంగిపోయిన అప్పలరెడ్డిని జేఆర్పురం సీఐ ఎం.అవతారం బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో అతడిని అంపోలు సబ్జైల్కు తరలించారు. సోమవారం రాత్రి మద్యం మత్తులో అనుమానంతో భార్యను దారుణంగా కత్తితో నరికాడు. హత్యలో ఒకడికి మాత్రమే ప్రమేయం ఉండడం, నిందితుడు లొంగిపోవడంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి అరెస్టుకు ఎస్ఐలు వి.సందీప్కుమార్, నక్క కృష్ణారావు సహకరించారు. గ్రేట్ అనిపించారు..! కవిటి: దేశంలోని పలు ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యూయే ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్)– 2025 ఫలితాల్లో కవిటి మండలం బల్ల ఎర్రగోవిందపుట్టుగకు చెందిన బల్ల తనూజ మెరిసింది. బుధవారం విడుదల చేసిన ఫ లితాల్లో జాతీయ స్థాయిలో 396వ ర్యాంకు కై వసం చేసుకుంది. సాయి తనూజా తండ్రి జానకిరావు సోంపేట మండలంలో జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. సత్తాచాటిన పూజిత ఎల్.ఎన్.పేట: మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా పనిచేస్తున్న పైడి శ్రీనివాసరావు కుమార్తె పైడి పూజిత గేట్–2025లో సత్తా చాటింది. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 25వ ర్యాంకు సాధించినట్లు ఆయన తెలిపారు. దీంతో ఆమెను పలువురు అభినందించారు. ఎచ్చెర్ల క్యాంపస్: టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్యూటేషన్పై అధ్యాపకునిగా పనిచేస్తున్న కొండ వినోద్ కుమార్కు గేట్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో జాతీయ స్థాయిలో 28 ర్యాంకు వచ్చింది. అతను శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2012–15 మధ్య పాలిటెక్నిక్, అనంతరం టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తిచేసి పాలిటెక్నిక్ అధ్యాపకుడిగా ఎంపికయ్యాడు. జాతీయ విద్యా సంస్థల్లో ఎంటెక్ చేయాలన్న ఆకాంక్షతో గేట్ రాయగా మంచి ర్యాంకు సాధించాడు. ప్రతిష్టాత్మక ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేసి, బోధన రంగంలో అత్యున్నత స్థాయికి చేరడమే తన లక్ష్యమన్నారు. -
కట్టుకున్నోడే.. కాలయముడు
ఇరవై రెండేళ్లు కాపురం చేశారు. ఇద్దరు బిడ్డలను పెంచి పెద్ద చేశారు. కూతురి పెళ్లిని కూడా ఘనంగా చేశారు. చేతికి దొరికిన పనిచేస్తూ బతుకును చక్కగా పండించుకున్నారు. కానీ మద్యం మత్తు మగవాడి ఆలోచనను మార్చేసింది. కష్టసుఖాల్లో ఇన్నేళ్లుగా తోడుగా ఉండి నీడలా నడిచిన జీవన సహచరిపై కోపం పెంచుకునేలా చేసింది. అతడి మనసులో అనుమానపు విషాన్ని కలిపింది. దాని ఫలితం భార్య మరణం.. భర్తకు ఖైదు. కొడుక్కి జీవితకాలపు విషాదం. ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురంలో భర్త చేతిలో భార్య హతమైంది. శ్రీకాకుళం: ఎచ్చెర్ల మండలంలోని సంత సీతారాంపురంలో గాలి నాగమ్మ(42) అనే మహిళను ఆమె భర్త అప్పలరెడ్డి సోమవారం రాత్రి దారుణంగా నరికి చంపేశాడు. ఈ హత్య స్థానికంగా సంచలనం రేకెత్తించింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అప్పలరెడ్డి, నాగమ్మ దంపతులకు ఇద్దరు బిడ్డలు. రెండేళ్ల కిందటే అమ్మాయికి పెళ్లి చేశారు. కొడుకు త్రినాథరావుతో కలిసి విశాఖలో ఉండేవారు. త్రినాథరావు తాపీమేస్త్రీ కాగా.. తల్లిదండ్రులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసేవారు. కుటుంబం మొత్తం కష్టాన్నే నమ్ముకుని బతికేది. గత నెలే వీరు స్వగ్రామం సంతసీతారాంపురం వచ్చేశారు. ఇక్కడ సొంతిల్లు ఉండడంతో కుమారుడికి పెళ్లి చేసి మళ్లీ విశాఖ వెళ్లిపోవాలని అనుకునేవారు. స్థానికంగా ఉండటంతో సరుగుడు, నీలగిరి చెట్లు కొట్టటం, తొక్క తీయటం వంటి పనులు చేస్తున్నారు. సోమవారం కూడా రణస్థలంలో నీలగిరి తోట కొట్టేందుకు, తొక్క తీసే పనికి భార్యాభర్తలు వెళ్లారు. సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేశారు. కుమారుడు ఇంటి బయట మంచం వేసుకొని పడుకున్నారు. రాత్రి దంపతుల మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది. అప్పలరెడ్డికి మద్యం తాగే అలవాటు ఉంది. దీంతో మందు తాగి గొడవపడడం, భార్యను అనుమానించడం వంటి పనులు చేసేవాడు. రాత్రి కూడా ఇలాగే దంపతులిద్దరూ గొడవ పడ్డారు. అయితే రాత్రి పది గంటల సమయంలో ఒక్కసారిగా సరుగుడు, నీలగిరి చెట్లు నరికే కత్తితో ఆమెపై దాడికి తెగబడ్డాడు. మద్యం మత్తులో అతి కిరాతకంగా కత్తితో మెడ, తలపై దాడి చేశాడు. నాగమ్మ పెద్దగా కేకలు వేయడంతో కుమారుడు, చుట్టుపక్కల వారు కంగారు పడి ఇంటిలోకి వెళ్లబోతుండగా.. అప్పలరెడ్డి తలుపులు తీసి బయటకు వెళ్లిపోయాడు. లోపల చూస్తే నాగమ్మ విగతజీవిగా పడి ఉంది. హత్య చేసిన వ్యక్తి అర్ధరాత్రి సమయంలో ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. జేఆర్పురం సీఐ ఎం.అవతారం, ఎస్ఐ వి.సందీప్కుమార్, క్లూస్ టీమ్ సంఘటన స్థలాన్ని సందర్శించింది. కుమారుడు త్రినాథరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాగమ్మ మృతదేహానికి శ్రీకాకుళం రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ హత్యతో గ్రామమంతా విషాదం నెలకొంది. జేఆర్ పురం సీఐ అవతారం కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాశీబుగ్గ పోలీసులకు చుక్కెదురు
కాశీబుగ్గ: పేకాట రాయుళ్లను పట్టుకోవడానికి వెళ్లి పొరపాటున ఒడిశా భూభాగంలోకి వెళ్లిన కాశీబుగ్గ పోలీసులకు చుక్కెదురైంది. ఆంధ్రా–ఒడిషా సరిహద్దులో జూదం ఆడుతున్నారన్న సమాచారం మేరకు కాశీబుగ్గ పోలీసులు ఒడిశా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సోమ వారం అర్ధరాత్రి వేళ రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడం వివాదాస్పదమైంది. పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని వాహనాలలో ఎక్కించి త రలించగా స్థానికులు అడ్డుకున్నారు. గజపతి జిల్లా ఎస్పీకి కాశీబుగ్గ పోలీసులపై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ బృందంతో పాటు రెండు వాహనాలను ఒడిశా సరిహద్దులో గురండి పోలీసుస్టేషన్ సమీపంలో స్థానికులు అడ్డుకున్నారు. -
ఏప్రిల్ 7 నుంచి డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు
ఎచ్చెర్ల క్యాంపస్: ఏప్రిల్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అండర్ గ్రాడ్యుయేషన్ ఇన్చార్జి ఎగ్జామినేషన్స్ డీన్ పి.పద్మారావు మంగళవారం తెలిపారు. జిల్లాలో 64 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 7221 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని పేర్కొన్నారు. సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: అనుమతులకు వచ్చే దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దని జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కార్యాలయ సమావేశ మందిరంలో పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహంపై సంబంధిత అధికారులతో మంగళవారం ఆయన జూమ్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ డెస్క్ విండోకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని జీఎంను అడిగారు. 15 దరఖాస్తులు రాగా 13 ప్రాసెస్లో ఉన్నట్లు జీఎం విజయరత్నం చెప్పారు. ిపీఎంఈజీపీలో 69 లక్ష్యం కాగా 90 మంజూరు చేశామని ఇందుకు రూ.4.39 కోట్లు మంజూరు చేసినట్లు జీఎం తెలిపారు. ఏప్రిల్ 13 న జిల్లాస్థాయి మేధా సమ్మాన్ పరీక్ష కవిటి: జిల్లాలోని అన్ని ఒడియా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏప్రిల్ 13న ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్(అపోటా) ఆధ్వర్యంలో మేధా సమ్మాన్ ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నట్టు అపోటా ప్రధాన కార్యదర్శి బృందావన్ దొళాయి తెలిపారు. మంగళవారం సహలాలపుట్టుగ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ఆయన వివరాల్ని వెల్లడించారు. ఈ నెల 25 లోగా ఏ పాఠశాల నుంచి ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొంటున్నారన్న సమాచారాన్ని ఆయా మండలాల అపోటా అధ్యక్ష,కార్యదర్శులకు నివేదించాలన్నారు. ఐదో తరగతి చదువుతున్న వారు ప్రతి పాఠశాల నుంచి 5 మందికి మించకుండా బాలబాలికలు పాల్గొనే అవకాశం ఉందన్నారు. వ్యక్తిపై పోక్సో కేసు నమోదు కవిటి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తిపై కవిటి పోలీసులు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు మంగళవారం తెలిపారు. అదే గ్రామానికి చెందిన ఓ బాలికపై ఈ వ్యక్తి లైంగికదాడికి పాల్పడినట్లు తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రాథమికంగా విచారణ చేశారు. ఈ వ్యక్తి ఈ నెల 11న బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు గుర్తించారు. మళ్లీ 14వ తేదీన కూడా అలాగే ప్రవర్తించినట్లు గ్రామంలో జరిపిన విచారణలో గుర్తించామని పోలీసులు తెలిపారు. పూర్తిస్థాయి విచారణను కాశీబుగ్గ రేంజి డీఎస్పీ కె.వెంకట అప్పారావు పర్యవేక్షణలో చేపడుతున్నామని చిన్నంనాయుడు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్కు తరలించామన్నారు. రిమ్స్లో అత్యవసర సమాచార సేకరణకు ఫోన్ నంబర్ శ్రీకాకుళం: శ్రీకాకుళం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి, ప్రసూతి విభాగంలో అత్యవసర సమాచార సేకరణ కోసం ఓ నూతన కార్యక్రమాన్ని ప్రారభించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బాలమురళీ కృష్ణ అన్నారు. రిమ్స్లో ప్రసూతి విభాగాధిపతి డాక్టర్ డి.పార్వతి ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటాచలం చేతుల మీదుగా మంగళవారం మొబైల్ నంబర్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పార్వతి మాట్లాడుతూ.. ప్రసూతి విభాగంలో అత్యవసర సేవలకు ఈ ఫోన్ నంబర్ వాడుకోవచ్చన్నారు. ఫోన్ నంబర్ను డీఎంహెచ్ఓ కార్యాలయం ద్వారా అన్ని పీహెచ్సీలకు అందిస్తామని డీసీహెచ్ఎస్ డాక్టర్ కల్యా ణ్ బాబు తెలిపారు.