breaking news
Srikakulam
-
రేపు జిల్లాస్థాయి యోగా పోటీలు
నరసన్నపేట: నరసన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఈ నెల 3న జిల్లా యోగాసనా చాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వివేకానంద ధ్యాన యోగా సమితి అధ్యక్షుడు కింజరాపు రామారావు తెలిపారు. యోగాసన స్పోర్ట్ అసోషియేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. దీనిలో భాగంగా అభ్యాసకులకు ఇచ్చే టీషర్టులను ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ , ఎన్వైఎస్ఎఫ్ కార్యదర్శి బోత్స కేదారినాథ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఉదయం 7 కల్లా సభా ప్రాంగణానికి చేరుకోవాలని కోరారు. బాక్సర్కు అభినందనలు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన యువ బాక్సింగ్ సంచలనం జి.సత్యభార్గవ్ను డీఎస్డీఓ డాక్టర్ కె.శ్రీధర్రావు అభినందించారు. శుక్రవారం కోడిరామ్మూర్తి స్టేడియం వద్ద శిక్షణకు హాజరైన సత్యభార్గవ్ను, తీర్చిదిద్దుతున్న కోచ్ పి.ఉమామహేశ్వరరావును మెచ్చుకున్నారు. హర్యానాలోని రోతక్ వేదికగా జరిగిన ఆలిండియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఈ యువ బాక్సర్ రజత పతకంతో మెరిసిన విషయం తెలిసిందే. దీంతో ఇండియన్ కోచింగ్ క్యాంప్కు ఎంపికయ్యాడు. త్వరలో శిక్షణా శిబిరాలకు హాజరుకానున్నట్టు కోచ్ తెలిపారు. రెడ్డీస్లో బ్యాటరీలు చోరీ రణస్థలం: పైడిభీమవరం పారిశ్రామికవాడలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటీస్ సీటీవో–6 పరిశ్రమలో గత నెల 23న నాలుగు పెద్ద బ్యాటరీలు చోరీ జరిగినట్లు జె.ఆర్.పురం పోలీసులు తెలిపారు. పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్.చిరంజీవి శుక్రవారం చెప్పారు. -
అర్హులందరికీ పింఛన్లు
శ్రీకాకుళం రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్ విధానం అమలు చేస్తోందని ఎస్ఎంఈ, ఎన్నారై, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పాత్రునివలసలో శుక్రవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీ ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదిన పెన్షన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో నెలకు సుమారు రూ. 2,700 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన సూపర్సిక్స్ హామీలన్నీంటినీ నెరవేర్చామని మంత్రి స్పష్టం చేశారు. ఆదివారం అన్నదాత సుఖీభవ పథకం, 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయి ప్రత్యూష, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
టెక్కలి రూరల్: స్థానిక పట్టుమహాదేవి కోనేరు గట్టుపై శుక్రవారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని, రెండు రోజులుగా టెక్కలిలోనే తిరిగాడని స్థానికులు చెబుతున్నారు. గురువారం రాత్రి సమీప షాపుల బయట పడుకుని ఉదయం వెళ్లిపోయాడని, మధ్యాహ్నానికి మృతి చెంది కనిపించాడని అంటున్నారు. మృతుడు నీలం టీషర్టు, ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని ఎస్ఐ రాము కోరారు. బోటు బోల్తాపడి మత్స్యకారుడు మృతి● గోవాలో ఘటన వజ్రపుకొత్తూరు: పల్లివూరు పంచాయతీ హుకుంపేటకు చెందిన మత్స్యకారుడు కారి రాజులు(44) గోవాలో శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజులు స్థానికంగా వేట సాగకపోవడంతో గోవాకు వలసవెళ్లాడు. అక్కడ శుక్రవారం సాయంత్రం 3.30 గంటల సమయంలో వేట సాగిస్తుండగా అలల ధాటికి బోటు బోల్తా పడింది. బోటు కిందే రాజులు చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. రాజులు తల్లిదండ్రులు బాల్యంలోనే చనిపోగా, భార్య నాగమ్మ, ఇద్దరు కుమార్తెలు స్వాతి, స్వప్న ఉన్నారు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గోవా పోలీసులు పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని గ్రామానికి పంపిస్తారని స్థానికులు తెలిపారు. -
సమాచార హక్కు చట్టంతో జవాబుదారీతనం
శ్రీకాకుళం న్యూకాలనీ: సమాచార హక్కు చట్టం అమలుతో ప్రభుత్వ శాఖల్లో జవాబుదారీతనం పెరిగిందని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ (అటానమస్) కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు అన్నారు. ఆమదాలవలస, రాజాం, పాలకొండ, తొగరాం, సీతంపేట, వీరఘట్టం, శ్రీకాకుళం(పురుషులు, మహిళలు) కాలేజీల్లో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థులతో శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం–2005 ప్రవేశపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఈ పోటీలు నిర్వహించిందన్నారు. ఈ చట్టంభారత పౌరులకు ప్రభుత్వ కార్యాలయాల నుంచి సమాచారాన్ని పొందే హక్కును కల్పిస్తుందన్నారు. పాలనలో పారదర్శకతతోపాటు జవాబుదారీతనాన్ని పెంచిందన్నారు. పోటీల విజేతలను జోనల్స్థాయికి పంపిస్తామని, చివరిగా రాష్ట్రస్థాయిలో పోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.చిన్నారావు, ఐక్యుఏసీ కో–ఆర్డినేటర్ ఎస్.పద్మావతి, అకడమిక్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఎం.మౌనిక, బోటనీ హెచ్ఓడీ ఎస్.రుద్రమరాణి, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
దళితుల భూములకు రక్షణ కల్పించాలి
ఎచ్చెర్ల : బుడతవలస దళితల భూములకు రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనారి మోహనరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం లావేరు మండలం బుడతవలస గ్రామాన్ని సందర్శించి వివాదాస్పద భూమిని వీరు పరిశీలించారు. 2006లో అప్పటి ప్రభుత్వం దళితులైన పిన్నింటి లక్ష్మీ, రమణమ్మ, కుప్పిలి అనసూయ, సింహాచలంలకు సర్వే నంబర్లు 344/4, 344/8, 344/9, 344/10 లో 6.43 ఎకరాల డీ పట్టాలను మంజూరు చేసిందని తెలిపారు. ఈ భూముల్లో నీలగిరి మొక్కలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇటీవల నడుపూరి రాంబాబు, మహాంతి రాజులు, రూప వచ్చి నీలగిరి తోటలు నరుక్కుపోయారని, ఈ విషయమై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భూములను దళితులకు అప్పగించాలని డిమాండ్చేశారు. -
జాప్యానికి సిగ్గుపడుతున్నాం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పనుల్లో జాప్యం జరగడంపై సిగ్గుపడుతున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. అయితే దీనివెనుక సవాలక్ష కారణాలు ఉన్నాయని చెప్పారు. శ్రీకాకుళం కోడి రామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల సెమినార్ కమ్ వర్క్షాప్ శుక్రవారం ప్రారంభమైంది. జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారికి పూర్తిస్థాయిలో సౌకర్యాలు, వసతులు కల్పించలేకపోతున్నామని చెప్పారు. ఈ ఏడాది ఐదు జోనల్ పరిధిలో గ్రిగ్స్మీట్ల నిర్వహణకు అవసరమైన రూ. 5లక్షల నిధులను మంజూరుకు కలెక్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఉప విద్యాశాఖాధికారులు ఆర్.విజయకుమారి (శ్రీకాకుళం), పి.విలియమ్స్(టెక్కలి) మాట్లాడుతూ పీడీ–పీఈటీలకు పాఠశాలల్లో క్రీడల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను పరిష్కారిస్తామన్నారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ స్కూల్ గేమ్ ఫెడరేషన్, గ్రిగ్స్ పోటీల కోసం జిల్లా, డివిజన్, నియోజకవర్గం స్థాయి క్రీడల నిర్వహణ తలెత్తుతున్న సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో పీఈటీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సలహాదారు పి.సుందరరావు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, గ్రిగ్స్ సెక్రటరీ కె.మాధవరావు, సంపతిరావు సూరిబాబు, మెట్ట తిరుపతిరావు, తవిటయ్య, రాజారావు, శేఖర్బాబు, నారాయణరావు, జగదీష్, నిర్మల్కృష్ణ, హెచ్ఎంలు హరిబాబు, పోలినాయుడు, ఎమ్మెస్ చంద్రశేఖర్, ఎంఈఓ సోంబాబు, విజయనగరం జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకట్నాయుడు, నియోజకవర్గ, మండల స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు, పీడీలు, పీఈటీ పాల్గొన్నారు. పీడీ–పీఈటీ వర్క్షాప్ ప్రారంభంలో ఎమ్మెల్యే శంకర్ గ్రిగ్స్మీట్ క్రీడాపోటీలకు రూ.5లక్షలు మంజూరు చేయిస్తామని హామీ నిధులు కేటాయించండి.. జోన్–1 పరిధిలో రీజనల్ ఇన్స్పెక్షర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆర్ఐ పీఈ) పోస్టును ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలి. గ్రిగ్స్మీట్లను ఐదు జోన్ల పరిధిలో నిర్వహించేందుకు కనీసం రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ప్రభుత్వం నిధులు కేటాయింపు చేయాలి. స్కూల్గేమ్స్ ఎంపికల పోటీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. స్కూల్గేమ్స్ ఫెడరేషన్ బిల్డింగ్ కోసం కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – మొజ్జాడ వెంకటరమణ, పీడీ–పీఈటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు -
క్యాంపస్ డ్రైవ్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ప్రతిభ
ఎచ్చెర్ల : శ్రీకాకుళంలోని రాజీవ్గాంధీ యూనివర్శిటీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో ఏడుగురు సీఎస్ఈ విద్యార్థులు ఎంపికయ్యారు. హైదరాబాద్లోని గ్రిడ్లైక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగాలు దక్కించుకున్నారు. నెలకు రూ. 20 వేలు స్టైపండ్తో ఇంటర్న్షిప్ పూర్తి చేశాక సంవత్సరానికి రూ.8,00,00 ప్యాకేజీ అందిస్తారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ, అడ్మినిస్ట్రేటివ్ అధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ ఆఫ్ అకడమిక్స్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, సీఎస్ఈ విభాగాధిపతి వై.రమేష్, అధ్యాపకులు అభినందిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. -
న్యాయం చేస్తారా.. చనిపోమంటారా?
టెక్కలి రూరల్: తనకు, పిల్లలకు న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ శుక్రవారం ఓ మహిళ పురుగుల మందుతో టెక్కలి పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయించింది. గతంలో తన భర్తతో తగాదా ఉంటే పోలీసులు కోర్టులో రాజీ చేయించి తమను బాగా చూసుకుంటాడని చెప్పారని, తర్వాత పూర్తిగా పట్టించుకోవడం మానేశాడని వాపోయింది. తనకు న్యాయం జరగకపోతే చావే శరణ్యమన్నారు. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి పురుగు మందు బాటిల్ను తీసుకుని స్టేషన్లోకి తీసుకువెళ్లి మాట్లాడారు. భర్తను పిలిపించి తనకు న్యాయం చేస్తామని ఎస్ఐ రాము నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించారు. కాగా, స్టేషన్ వద్ద మహిళ బైఠాయించిందన్న విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు స్టేషన్కు చేరుకుని వివరాలు సేకరించే క్రమంలో పోలీసులు అడ్డుతగిలారు. ఫొటోలు తీయడానికి వీలు లేదంటూ పంపించేశారు. పురుగుమందు బాటిల్తో మహిళ నిరసన టెక్కలి పోలీస్స్టేషన్ ఎదుట కలకలం -
కార్మికుల పొట్టకొట్టొద్దు
ఎచ్చెర్ల: రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోకు భూములిచ్చిన కార్మికుల పొట్టలను కొట్టవద్దని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ శుక్రవారం డిపో వద్ద హమాలీలు మోకాళ్లపై కూర్చుని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు తీసుకుని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఉపాధిని కల్పించారని చెప్పారు. ఇప్పటికీ దీనినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో డిపోను విడదీసి బతుకులను రోడ్డుపాలు చేయడం తగదన్నారు. నిరసన కార్యక్రమంలో హమాలీల యూనియన్ ప్రధాన కార్యదర్శి డి.బంగార్రాజు, టి.రామారావు, ఎం.సురేష్, బోనెల రాము, లింగాల రాము, జి.గురుమూర్తి, పట్నాన రామారావు, ఎల్.సీతారాం, రాజు, కె.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎంఈఓ–1 నియామకాల్లో ఉమ్మడి సీనియారిటీ పాటించారా..?
శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న విడుదల చేసిన ఎంఈఓ–1 నియామకాల ఉత్తర్వుల్లో పంచాయతీరాజ్, ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉమ్మడి సీనియారిటీ నుంచి ఎంపిక చేయకుండా కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్ర మే పరిగణలోకి తీసుకోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఏపీయూఎస్), పీఆర్టీయూ సంఘాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంతోపాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా రాష్ట్ర సంఘాల పిలుపుమేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి డీఈఓ శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని, లేకుంటే తీవ్రస్థాయి ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. అనంతరం వారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆపస్ సంఘం నాయకులు దుప్పల శివరామ్ ప్రసాద్ పీఆర్టీయూ నాయకులు తంగి మురళి మోహనరావు, పప్పల రాజశేఖర్, కీలు సోమేశ్వరరావు, పైడి కాశీ విశ్వనాథరావు, బత్తుల రవి, ఎచ్చెర్ల మురళి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
పాలకులకు గుణపాఠాలు చెప్పాలని..
శ్రీకాకుళం న్యూకాలనీ: పాలకులకు గుణ‘పాఠాలు’ చెప్పేందుకు గురువులు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ లోకానికి ఇచ్చిన హామీలపై అతీగతీ లేకపోవడంతో సర్కారు చెవులకు వినిపించేలా గర్జించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బోధనేతర పనుల నుంచి విముక్తి కలిగించి, పాఠాలు చెప్పేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ శనివారం ఆందోళన చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. సర్కారు వైఖరిపై గురువులంతా గుర్రుగా ఉన్నారు. తమ డి మాండ్లను ఎప్పటికప్పుడు చెప్పుకుంటున్నా అటు ప్రభుత్వంలో గానీ, ఇటు ఉన్నతాధికారుల్లో గానీ చలనం లేదు. కనీసం సీఎంగాని, చీఫ్ సెక్రటరీ గానీ సమావేశం నిర్వహించడం లేదని, ఒక ప్రకటన కూడా చేయడం లేదని వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలవడం కూడా కష్టంగా మారిపోయిందని అంటున్నారు. ఇలాంటి తరుణంలో, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ఉద్యమ బాటకు శ్రీకారం చుడుతున్నారు. నేడు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా.. అటు విద్యాశాఖలో ఉపాధ్యాయులకు పాఠాల బోధనకు ఎదురవుతున్న సమస్య లు, ఇటు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఆర్థిక పరమైన డిమాండ్ల సాధనకై రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 2వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఽఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో సైతం ధ ర్నాను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఫ్యా ప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 ప్రధానమైన డిమాండ్ల సాధనకు శనివారం ఉదయం 9 గంటలకు కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ జన రల్ పడాల ప్రతాప్కుమార్, కో చైర్మన్లు పూజారి హరిప్రసన్న, వాల్తేటి సత్యనారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎస్వీ రమణమూర్తి, మజ్జి మదన్మోహన్, బి.వెంకటేశ్వర్లు, కోశాధికారి కె.జగన్మోహన్రావు, కార్యవర్గ సభ్యులు ఎల్.బాబూరావు, పి.కృష్ణారావు, వై.వాసుదేవరావు, జి.రమణ, ఎస్వీ అనీల్కుమార్, బి.రవి, ఎస్ఏఎల్వీ పూర్ణిమ తదితరులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్యాప్టో ప్రధాన డిమాండ్లలో కొన్ని.. ● ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమా లు లేకుండా చేయాలి. పీ–4 వంటి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులకు నిర్బంధం చేయరాదు. ● నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలి. ● ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యలు పరిష్కరించి విద్యాశాఖలో ఉన్న అసంబద్ధతను తొలగించాలి. ● అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలి. ● 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి. ● 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని తక్షణమే ప్రకటించాలి. మూడు పెండింగ్ డీఏలను ప్రకటించాలి. డీఏ బకాయిలను, 11వ పీఆర్పీ బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. ● సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. బోధనలో ఎదురవుతున్న సమస్యలు, ఆర్థిక పరమైన అంశాల సాధనపై నేడు పోరుబాట బోధనేతర బాధ్యతలపై గుర్రుగా ఉన్న గురువులు సీపీఎస్ రద్దు, కారుణ్య నియామకాలు ఇతరత్రా డిమాండ్ల సాధనే ధ్యేయంగా ధర్నా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టేందుకు ఏర్పాట్లు -
అప్పులు చేశాక సాయం..
ఏటా నైరుతి రుతుపవనాలు జూన్ చివరిలో వచ్చేవి. ఈ ఏడాది మాత్రం మే నెల చివరి నాటికే ప్రవేశించాయి. దీంతో ఖరీఫ్ కాసింత ముందుగానే మొదలైంది. ఇది వరకు ఖరీఫ్ పనులు మొదలయ్యే నాటికే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అందజేసేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఒక ఏడాదిని మర్చిపోయి.. రెండో ఏడాది ఆగస్టు వచ్చేనాటికి జమ చేయడం దారుణమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే రైతులు పొలాలు దుక్కి దున్నడానికి, విత్తనాలు కొనుగోలు చేయడానికి ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టాక ఇంత ఆలస్యంగా పథకాన్ని అమలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
2478 మంది ఉంటే.. 800 మందికే రేషన్
సారవకోట: మండలంలో వృద్ధులు, దివ్యాంగుల ఇచ్చే రేషన్ సరుకులు 800 మందికి మా త్రమే అందజేశారు. జూలై నెల 25 నుంచి 31లోగా వృద్ధులు, దివ్యాంగుల ఇంటికెళ్లి రేషన్ సరుకులు అందజేయాలి. మండలంలో 2478 మంది వృద్ధులు, దివ్యాంగులు ఉండగా.. 800 మందికి మాత్రమే అందజేశారు. సంబంధిత అధికారులు రేషన్ డీలర్లకు దీనిపై సరైన ఆదేశాలు అందించకపోవడం వల్లనే కొందరు రేషన్కు దూరమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా జైలు ఆకస్మిక తనిఖీ గార: అంపోలు జిల్లా జైలును జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కె.హరిబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ముద్దాయిలకు అందించే ఆహార పదార్థాలను రుచి చూశారు. గ్రంథాలయం, మహిళా బ్యారక్లు పరిశీలించి ముద్దాయిలతో మాట్లాడారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రంలో నాగుపాము నరసన్నపేట: మండలంలోని బడ్డవానిపేట అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం నాగు పా ము భయోత్పాతం సృష్టించింది. 10 అడుగులకు పైగా పొడవున్న పామును సెంటర్లో ఒక్కసారిగా చూసిన అంగన్వాడీ వర్కర్ పి.వనజాక్షి ఆందోళనకు గురైంది. స్థానికులు వెంటనే స్పందించి పామును పట్టుకుని బయటకు వదిలారు. అంగన్వాడీ వర్కర్ వనజాక్షి మా ట్లాడుతూ ఉదయం 9 గంటల సమయంలో కేంద్రాన్ని తెరిచానని, నలుగురు పిల్లలను బయట కూర్చోబెట్టి తలుపులు తెరిచి వంట చేసేందుకు అట్ట పెట్టె తెరవగా పాము కనిపించిందని, స్థానికులను పిలిస్తే వారు వచ్చి పట్టుకుని బయటకు పంపారని తెలిపారు. జిల్లా డైమండ్ జూబ్లీ వేడుకలకు శ్రీకారం శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు జరిగే డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నామని జిల్లా రెవెన్యూ అధి కారి వెంకటేశ్వరరావు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వి విధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చే సిన సమీక్ష సమావేశంలో ఆయన మా ట్లాడారు. జిల్లా పురోగతిని ప్రతిబింబించేలా ప్రతి కార్యక్రమాన్ని రూపొందించాలని, ప్ర జలంతా పాల్గొనాలనిపించేలా ఉత్సవాలు ఉండాలని ఆయన అన్నారు. ● ఆగస్టు 13న ఉదయం 10 గంటలకు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో వేడుకలు ప్రారంభం. ● 1950 నుంచి 2025 వరకు జిల్లాలో అభివృద్ధిని ఆవిష్కరించే సాంస్కృతిక ప్రదర్శనలు. ● సాయంత్రం 4 నుంచి 7.30 వరకు ఆర్ట్స్ కాలేజీ రోడ్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు శోభాయాత్ర. ఆదివాసీ తెగల జానపద నృత్యాలు, సంగీతం, వారసత్వ కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణ. ● రాత్రి 6 నుంచి 10 వరకు ఫుడ్ స్టాల్స్. స్థానిక రుచులు, తెగల మిల్లెట్ ఫుడ్, తీరప్రాంత వంటకాలు అందుబాటులోకి. ● ఆగస్టు 14న ఉదయం 8 నుంచి సంప్రదాయ క్రీడల పోటీలు, చిత్రలేఖన, వ్యాసరచన పోటీలు. థింసా నృత్యాలు, స్వాతంత్య్ర పోరాట ఇతివృత్తాల నాటకాలు. ● ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకల అనంతరం డైమండ్ జూబ్లీ ప్రత్యేక పతాకం ఆవిష్కరణ. -
హాస్టళ్లను రక్షించాలని వినతి
● శ్రావణం.. పావనం పవిత్ర శ్రావణ శుక్రవారం పూట అమ్మవారి ఆలయాలు కళకళలాడాయి. జిల్లా కేంద్రంలోని బలగలో గల బాలా త్రిపుర కాలభైరవ ఆలయంలోని అమ్మవారిని లక్ష గాజులతో సలక్షణంగా అలంకరించారు. అలాగే 108 రకాల పిండి వంటలతో నైవేద్యాన్ని సమర్పించారు. సంతోషిమాత ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. – శ్రీకాకుళం కల్చరల్ ● వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలో తగ్గిన ‘అన్నదాత సుఖీభవ’ అర్హుల సంఖ్య ● ఈ ఏడాది 2.74లక్షల మందికి మాత్రమే సుఖీభవ ● వైఎస్సార్ హయాంలో 3.22 లక్షల మందికి రైతు భరోసా అందించిన వైనం ● గత ఏడాదిని పూర్తిగా విస్మరించిన కూటమి ప్రభుత్వం -
జాతీయ విద్యా విధానం ఉత్సవంలో ఉమామహేశ్వరి
ఇచ్ఛాపురం రూరల్: న్యూఢిల్లీలో జరుగుతున్న జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)–2025 ఉత్స వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ఈదుపురం కండ్రావార్డు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూరవిల్లి ఉమామహేశ్వరి పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ సెల్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈమె గురువారం విద్యార్థులు జి.లావణ్య, టి.శ్రావ్యలతో కలసి న్యూఢిల్లీ ప్రగతి మైదానంలో జరిగిన వేడుకలో పాల్గొన్నారు. గతంలో రేగిడిలో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేసిన సమయంలో ఈమె మార్గదర్శకత్వంలో రూపొందించిన ‘నేచురల్ హెయిర్ డై’ సైన్స్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికై న రెండు ప్రాజెక్ట్లలో ఒకటిగా పేరు పొందింది. ప్రాజెక్ట్ను స్వయంగా తిలకించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆమెను అభినందించారు. ఇండియాలో 27 ఉత్తమ ప్రాజెక్ట్లలో ఉమామహేశ్వరి రూపొందించిన ‘నేచురల్ హెయిర్ డై’ ప్రాజెక్ట్ ఒకటి కావడం విశేషం. ఈ సందర్భంగా ఆమెకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ డైరెక్టర్ యోగేష్ బ్రహ్మాంకర్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్నోవేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఎలంగోవన్లు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య, ఉప విద్యాశాఖాధికారి విలియమ్స్, జిల్లా సైన్స్ ఆఫీసర్ ఎన్.కుమారస్వామి, మండల విద్యాశాఖాధికారులు కురమాన అప్పారావు. ఎస్.విశ్వనాథం అభినందించారు. -
తల్లిపాలే శ్రేయస్కరం..!
ఇచ్ఛాపురం రూరల్/హిరమండలం/పాతపట్నం: పసిపిల్లలకు తల్లిపాల కంటే శ్రేష్టమైనవి ఈ సృష్టిలో ఏవీ లేవు. అయితే కొందరు బాలింతలు వివిధ కారణాలతో ముర్రుపాలు పెట్టేందుకు విముఖత చూపుతున్నారు. ఇది పసిపిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో తల్లిపాల ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రభుత్వం ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో వారం రోజుల పాటు గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా.. రోగ నిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టాల్సిందేనని, తల్లిపాలతో బిడ్డకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, వాటిలో ఉన్న పోషకాలు, విశిష్టలతను ప్రతి ఒక్కరికీ వివరిస్తారు. బిడ్డలకు ప్రయోజనాలు ఎన్నో.. ● విటమిన్లు, ప్రొటీన్లు, ఫ్యాట్ వంటివి తల్లిపాలలోనే లభిస్తాయి. ● తల్లిపాలలో ఎటువంటి హానికరమైన సూక్ష్మక్రిములు సైతం ఉండవు. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. ● బిడ్డకు జన్మనిచ్చిన నాలుగు రోజుల వరకూ లభించేవాటిని ముర్రుపాలు అంటారు. ఇవి తాగితే బిడ్డకు అలర్జీ, ఇన్ఫెక్షన్లు వంటివి సోకవు. జీర్ణ వ్యవస్థకు ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ● తల్లిపాలు తాగితే పిల్లల మెదడు చురుగ్గా పనిచేస్తుందని వివిధ పరిశోధనల్లో సైతం తేలింది. అలాంటి వారు చదువుల్లో సైతం బాగా రాణిస్తారని వివిధ అధ్యయనాల్లో తేలింది. అందుకే పిల్లలు బాగా చదవాలన్నా.. ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రాథమిక స్థాయిలో తల్లిపాలు పెట్టడం ఉత్తమం. ● తల్లిపాలలో విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన కొవ్వులు కూడా అందిస్తాయి. ఇవన్నీ బిడ్డ ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడతాయి. తల్లిపాలు సులభంగా జీర్ణం అవుతాయి. మలబద్ధకం, జీర్ణ సంబంధిత వ్యాధులు ఎదురుకాకుండా చూసుకోవచ్చు. ● ఎదిగే బిడ్డ వయసుకు తగ్గట్టు బరువు ఉంటేలా తల్లిపాలు దోహదం చేస్తాయి. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాదు..పెద్దయ్యాక అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలుబారిన పడకుండా చేస్తాయి. ● పిల్లలకు రెండేళ్ల వరకూ తల్లిపాలు ఇవ్వొచ్చు. కానీ చాలా మంది ఆరు నెలలకే పాలు ఇవ్వడం ఆపేస్తుంటారు. ఆరు నెలల తరువాత ఘన ఆహారం ఇస్తుంటారు. ఈ క్రమంలో అన్నిరకాల పోషకాలు వారికి అందవు. కాబట్టి ఆరు నెలల తరువాత ఘన ఆహారంతో పాటు అప్పుడప్పుడు తల్లిపాలు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. ● కనీసం సంవత్సరం వరకై నా కొనసాగించడంతో పిల్లలతో పాటు తల్లులకు ఎంతో ప్రయోజనకరం. తల్లి పిల్లకు పాలివ్వడం ద్వారా వారి మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది. పిల్లలు తల్లిపాలను తాగే క్రమంలో తల్లిప్రేమ, అప్యాయత చూస్తారు. తల్లి ఒడి కంటే సురక్షితమైన ప్రదేశం మరెక్కడా లేదని గ్రహిస్తారు. తల్లులకూ మేలే.. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకే కాదు అమ్మలకు కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బిడ్డ రొమ్ము పట్టినప్పుడు తల్లి మెదడు నుంచి కొన్నిరకాల సంకేతాలు వస్తాయి. ఆక్సిటోసిస్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది పాలు పడడానికే కాకుండా గర్భాశయం సంకోచించేందుకు ఎంతగానో దోహదం చేస్తుంది. కాన్పు తరువాత రక్తస్రావం తగ్గుతుంది. మాతృమరణాల్లో చాలా వరకూ రక్తస్రావం ఆగకపోవడమే కారణంగా ఉంటోంది. కాన్పు తరువాత ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు వంటివి బిడ్డకు పాలివ్వడంతో తగ్గముఖం పడతాయి. పాలివ్వడం వల్ల తల్లి బరువు తగ్గుతారు. గర్భిణిగా ఉన్న సమయంలో చాలా మంది బరువు ఎక్కువగా పెరుగుతారు. పిల్లలకు పాలివ్వడంతో వారు తగ్గుతారు. పాలు పట్టే క్రమంలో తల్లి శరీరంలో క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. అందుకే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. పాలు పట్టడంతో తల్లి మధుమేహం, బీపీ వంటి రుగ్మతలు దరిచేరవు. పాలివ్వడంతో తల్లికి హాయిగా నిద్ర వస్తుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. భావోద్వేగాల నియంత్రణకు ఎంతగానో దోహదపడుతుంది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ పొందవచ్చు. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు అంగన్వాడీ కేంద్రాలు 3385 గర్భిణులు 9667 బాలింతలు 11355 చిన్నారులు (7 నెలలు–3 ఏళ్లు) 65422 చిన్నారులు(3–6 ఏళ్లు) 39939 -
ఆటో ఢీకొని వృద్ధుడి మృతి
పొందూరు: పొందూరు పంచాయతీ పరిధిలోని జోగన్నపేట వద్ద బుధవారం రాత్రి ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన టొంపల సింహాచలం(80) అనే వృద్ధుడు మృతి చెందాడు. పొందూరు నుంచి దేవరవలస వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే వృద్ధుడు మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్కు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సింహాచలంకు ఓ కుమార్తె ఉంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. తండ్రికి తలకొరివి పెట్టిన తనయ సరుబుజ్జిలి: పాతపాడు గ్రామానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు టంకాల చినఅప్పలనాయుడు గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయనకు కుమారులు లేరు. ముగ్గురూ కుమార్తెలే. దీంతో పెద్దకుమార్తె విజయలక్ష్మి అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రి చితికి నిప్పంటించి రుణం తీర్చుకున్నారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్ మృతికి సంతాపం టెక్కలి: తలగాం పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ కిల్లి సావిత్రి గురువారం మృతి చెందారు. ఈమె వైఎస్సార్సీపీ తరఫున రెండు సార్లు సర్పంచ్గా సేవలు అందజేశారు. ఈయన సోదరుడు వెంకటేశ్వర్రావు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందజేస్తున్నారు. సావిత్రి మృతి పట్ల నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, జెడ్పీటీసీ దువ్వాడ వాణి, ఎంపీపీ ఆట్ల సరోజనమ్మ, వైస్ ఎంపీపీలు పి.రమేష్, ఎం.కిషోర్, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. తీర ప్రాంత భద్రతకు పక్కా చర్యలు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో తీర ప్రాంతాలైన బారువ, కళింగపట్నం, భావనపాడు తదితర తీర ప్రాంతాల భద్రతకు అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. ఆయన గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడారు. సముద్రంలో పని చేసే ప్రతి మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్ జాకెట్ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని, 40 శాతం సబ్సిడీతో లభించే లాబ్ జాకెట్లను 60 శాతం లబ్ధిదారు భరించాల్సి ఉన్నప్పటికీ అందులో 30 శాతం కలెక్టర్ నిధుల నుంచి సమకూరుస్తామని, మిగిలిన 30 శాతం కూడా సీఎస్ఆర్ నిధుల నుంచి అందించే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. అయితే లైఫ్ జాకెట్ల పంపిణీ అనంతరం లైఫ్ జాకెట్ లేకుండా ఏ ఒక్కరు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు. బీచ్ల వద్ద ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తీర ప్రాంత మైరెన్ పోలీస్ స్టేషన్లకు బయో ఫెన్సింగ్ విధానంలో కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. అదేవిధంగా తీర ప్రాంతాలలో వాచ్ టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. బీసీ హాస్టల్లో మౌలిక సదుపాయాలపై ఆరా శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలోని బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దష్టికి తీసుకురావాలని సూచించారు. శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాది కె.ఇందిరా ప్రసాద్, సంఘ సేవకులు పాల్గొన్నారు. -
సేవలతోనే గుర్తింపు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో పనిచేసి గురువారం ఉద్యోగ విరమణ పొందిన పలువురు పోలీసులకు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్వీసులో ఒత్తిళ్లు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చేసిన సేవలు అమోఘమని కొనియాడారు. సత్కారం పొందిన వారిలో సీఐ సీహెచ్ రాజశేఖర్, ఎస్ఐలు ఎన్.వెంకటరమణ (పోలీస్కంట్రోల్ రూం), ఎం.చంద్రరావు (కాశీబుగ్గ), ఏఎస్ఐలు ఆర్.కూర్మారావు (కవిటి), డి.నిర్మల (హిరమండలం) ఉన్నారు. టి.డి.వలసలో ఐదు బృందాల సర్వే జి.సిగడాం: టంకాల దుగ్గివలస గ్రామంలో జ్వరాలను అదుపు చేయడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. వీరంతా ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని వైద్యాధికారులు బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు తెలిపారు. గురువారం కాలువల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణ మందులను పిచికారి చేశారు. ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి అసిరయ్య పర్యవేక్షించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా క్రీడాభారతి కార్యవర్గం ఏర్పాటు శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా క్రీడాభారతి నూతన కార్యవర్గం గురువారం ఏర్పాటైంది. అరసవిల్లి సమీపంలోని చైతన్య విద్యా విహార్లో జరిగిన ఈ కార్యక్రమంలో క్రీడాభారతి జిల్లా అధ్యక్షుడిగా చెటికం రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శిగా బలగ అనంత లక్ష్మదేవ్ (అను), కోశాధికారిగా దండాసి జ్యోతిభాస్కర్ ఎన్నికయ్యారు. అనంతరం నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ కర్త, ఒలింపియన్ ఎం.వి.మాణిక్యాలు మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి ఉన్న ఒక క్రీడను మాత్రమే ఎంచుకని, అందులోనే ఉన్నతంగా సాధన చేసి రాణించాలన్నారు. సెల్ఫోన్లకు, సోషల్మీడియాకు దూరంగా ఉండాలన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతను కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారి వంగా మహేష్, క్రీడాభారతి సభ్యులు బి.ఖగేశ్వరరావు, మణికంఠ, కృష్ణారావు, ప్రసాద్, పాఠశాల ప్రతినిధులు, టీచర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ఐఎంఎల్ డిపోను విభజించవద్దు
ఎచ్చెర్ల: ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపోను విభజించి టెక్కలిలో అద్దె ప్రాతిపదికన పెట్టడం సరికాదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు అన్నారు. గురువారం ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద కార్మికులు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న కార్మికుల పొట్టకొట్టవద్దన్నారు. ఎచ్చెర్లలో సొంత గొడౌన్లలో మద్యం సరఫరా చేస్తుంటే అదనంగా టెక్కలిలో మరో డిపో అద్దెకు తీసుకుని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం అన్యాయమన్నారు. దీనివల్ల లక్షలాది రూపాయల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో చలనం లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేసి ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏపీబీసీఎల్ హమాలీస్ యూనియన్ నాయకులు డి.బంగార్రాజు, టి.రామారావు, నడిగింట్ల రమణ, గజినీ శ్రీనివాసరావు, లండ సీతారాం, లింగాల రాము, సొంట్యాన శ్రీనివాసరావు, సురేష్, పట్నాన శ్రీనివాసరావు, సురేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలో పలువురికి పదోన్నతులు
అరసవల్లి : జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ బంగ్లాలో గురువారం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఆధ్వర్యంలో పదోన్నతులు పొందిన వారికి కొత్తగా నియామక ఉత్తర్వులు అందజేశారు. పలాస మండల కార్యాలయం టైపిస్టు జి.లక్ష్మణరావును టెక్కలి మండల కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా, సీతంపేటలో టైపిస్టుగా పనిచేస్తున్న ఆర్.కిషోర్కుమార్కు రేగిడిలో సీనియర్ అసిస్టెంట్గా, జలుమూరులో టైపిస్టుగా పనిచేస్తున్న జి.ఈశ్వరరావుకు నరసన్నపేటలో సీనియర్ అసిస్టెంట్గా, కంచిలిలో టైపిస్టుగా పనిచేస్తున్న సంజయ్కుమార్ సాహును సోంపేటలో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతులు కలిపించారు. అలాగే చాపర జెడ్పీ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్.సంపత్కుమార్ను భామినిలో సీనియర్ అసిస్టెంట్గా, పాతపట్నంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జె.మీరాబాయిని కొత్తూరు సీనియర్ అసిస్టెంట్గా, శ్రీకూర్మంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న బి.శివరాంను పాలకొండ సీనియర్ అసిస్టెంట్గా, మందస జెడ్పీ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పి.మాలతిని సీతంపేట సీనియర్ అసిస్టెంట్గా, స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పివి.మిశ్రాను సంతబొమ్మాళిలో సీనియర్ అసిస్టెంట్గా, జిల్లా పరిషత్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జి.వి.రమణను ఎచ్చెర్ల మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా, ఆర్డబ్ల్యూఎస్ ఎచ్చెర్ల సబ్ డివిజన్లో టైపిస్టుగా పనిచేస్తున్న బి.గిరిని ఆర్డబ్ల్యూఎస్ పలాసలో సీనియర్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో శ్రీధర్రాజా, డిప్యూటీ సీఈవో డి.సత్యనారాయణ, సీ–సెక్షన్ సూపరింటెండెంట్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘బంగారం కొంటే రశీదు తప్పనిసరి’
నరసన్నపేట: బంగారం షాపుల్లో బంగారం, ఆభరణాలు కొనుగోలు చేసే వినియోగదారులకు విధిగా రశీదులు ఇవ్వాలని తూనికలు, కొలతల అసిస్టెంట్ కంట్రోలర్ పి.చిన్నమ్మి వ్యాపారులకు సూచించా రు. అలాగే ఈ రశీదులపై బంగారం ఏ క్యారెట్ అనేది కూడా స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. నరసన్నపేటలో బంగారు షాపులను ఆమె గురువారం తనిఖీ చేశారు. రశీదులు ఇవ్వడం లేదని, ఇచ్చిన రశీదులపై క్యారెట్ల వివరాలు ఉండడం లేదని తెలిపారు. ఇలా ఇవ్వని వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే షాపు ల్లో వ్యాపారులు వినియోగిస్తున్న తూకాలను పరిశీలించారు. వినియోగిస్తున్న ప్రతి తూకానికీ సీళ్లు వేయించుకోవాలని ఆదేశించారు. -
ఉమ్మడి సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ : పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ యాజమాన్యాల ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ రమణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అన్ని జోన్లలోనూ ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్ల ద్వారా ఎంఈఓ–1 పోస్టులు భర్తీ చేయడానికి దాదాపు కసరత్తు చేశారని, ఎంఈఓ–2 పోస్టుల్లో గెజిటెడ్ హెడ్మాస్టర్స్ ఉంటుండగా.. ఎంఈఓ–1 పోస్టులను ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్ ద్వారా భర్తీ చేయడాన్ని ఎస్టీయూ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం దాసరి క్రాంతి భవన్లో గురువారం ఎస్టీయూ నాయకులు కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లా పరిషత్ యాజమాన్య టీచర్లకు పదోన్నతులలో తీవ్ర అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గురుగుబెల్లి రమణ మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్కు సంబంధించి 72,73, 74 జీవోలు అమలు చేయాల్సి ఉండగా ప్రభుత్వ అధికారులే సమన్యాయాన్ని పాటించకుండా పక్షపాత వైఖరితో వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. వెంటనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకొని ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే ఎంఈఓ–1 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రీఅపోర్షన్ పోస్టుల్లో పని చేస్తున్న టీచర్ల జీతాలు చెల్లింపు, బోధనేతర కార్యక్రమాలను రద్దుచేయాలని, పెండింగ్ బకాయిలు విడుదల, పెండింగ్ డీఏల చెల్లింపులు, ఐఆర్ విడుదల, పీఆర్సీ చైర్మన్ నియామకం తదితర సమస్యల పరిష్కారానికి ఈ నెల 2న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ఫ్యాప్టో ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ప్రతినిధులు చింతల రామారావు, కూన శ్రీనివాసరావు, కె.గడ్డెన్నాయుడు, జి.శ్రీనివాసరావు, బి.రామారావు డీవీఎన్ పట్నాయక్ వివిధ మండలశాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నేడు, రేపు పీడీ–పీఈటీల జిల్లాస్థాయి సెమినార్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న పీడీ, పీఈటీల సెమినార్ కమ్ వర్క్షాప్ శుక్ర, శనివారం రెండు రోజులపాటు జరగనుందని డీఈఓ డాక్టర్ తిరుమల చైతన్య, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. నగరంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా గురువారం ఉదయం 9 గంటలకు మొదలవుతుందని వారు చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు, ఒలింపిక్ సంఘ నాయకులు, కలెక్టర్ వంటి ప్రముఖులు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. మారిన క్రీడాపాలసీ, నూతన క్రీడా విధానాలు, స్కూల్గేమ్స్, గ్రిగ్స్మీట్ పోటీల నిర్వహణ, వేదికలు ఖరారు చేయడం, పాఠశాలల్లో నమోదు చేయనున్న క్రీడా రిజిస్టర్లు తదితర అంశాలపై ఈ సెమినార్లో నిష్ణాతులైన వక్తలతో అవగాహన కల్పించనున్నట్టు డీఈఓ తెలిపారు. సమన్వయమే కీలకం: జేసీ శ్రీకాకుళం పాతబస్టాండ్: సునామీ వంటి విపత్తుల సమయంలో వివిధ ప్రభుత్వ శాఖల మ ధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. గురువారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. తీరప్రాంత గ్రామాల్లో సునామీ ప్రభావం ఎక్కువ గా ఉంటుందని, మత్స్యకారుల కుటుంబాలు, వారి వలలు, పడవలు, ఇతర ఆస్తులకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖలు పాటించాలన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (విపత్తుల నిర్వహణ) రాము మాట్లాడుతూ, తుఫానుల సమయంలో తుఫా ను ఆశ్రయ కేంద్రాలను ఉపయోగిస్తామని, అయితే సునామీ వంటి పరిస్థితుల్లో అవి కూడా సురక్షితం కానందున బాధితులను తరలించడానికి ప్రత్యేకమైన, సురక్షితమైన ప్రాంతాలను గుర్తించాలని కోరారు. ఆర్టీఓ గంగాధర్ మాట్లాడుతూ, ప్రజలను తరలించడానికి సరైన ప్రణాళికను రూపొందించామని, తక్షణ చర్యలకు ఎలాంటి జాప్యం జరగదని భరోసా ఇచ్చారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ జిల్లా సహాయ ఫైర్ అధికారి శ్రీనుబాబు మాట్లాడుతూ, సునామీకి ముందు, సునామీ సమ యంలో, సునామీ తదుపరి నిర్వహించాల్సిన కార్యక్రమాలను శాఖాపరమైన ప్రామాణిక పద్ధతుల ద్వారా అన్ని శాఖల సమన్వయం, సహకారంతో స్పందించేందుకు ఏర్పాట్లు, పరికరాలు సమకూర్చుకున్నామని తెలియజేశారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ఆర్టీసీలో హెవీ వెహికల్ డ్రైవింగ్లో ఇస్తున్న శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని ఇన్చార్జి జిల్లా ప్రజా రవాణా అధికారి హనుమంతు అమరసింహుడు కోరారు. శ్రీకాకుళం ఆర్టీసీ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 22 వ బ్యాచ్ను ఆయన గురువారం ప్రారంభించారు. తదుపరి 23 వ బ్యాచ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఫీజు, ఇతర వివరాలకు 7382921733 నంబర్ను సంప్రదించాలని కోరారు. అన్నదాత సుఖీభవకు రూ.184 కోట్లు ● ఆగస్టు 2న జిల్లా వ్యాప్తంగా పంపిణీ ● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: అన్నదాత సుఖీభవ పథకం కింద జిల్లాలో 2,74,301 మంది రైతులకు రూ.184 కోట్లు అందించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఆగస్టు 2న జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులకు నేరుగా నగదు మంజూరు చేస్తామని వెల్లడించారు. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. ఆగస్టు 2న ప్రతి గ్రామ సచివాలయంలో గ్రామ సభ నిర్వహించి, అర్హులైన రైతులకు లబ్ధి అందించాలన్నారు. రైతులు తమ అర్హతను తెలుసుకోవడానికి ‘అన్నదాత సుఖీభవ పోర్టల్’ లేదా ‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ను వినియోగించుకోవాలన్నారు. ఆధార్–బ్యాంక్ ఖాతా అనుసంధానం వంటి పెండింగ్ అంశాలు పూర్తిచేసుకోవాలని సూచించారు. -
ఎల్.ఎన్.పేట.. జాప్యం ఎందుకట?
హిరమండలం: లక్ష్మీనర్సుపేట.. అందరూ ఎల్.ఎన్.పేటగా పిలిచే ఈ మండలానికి ఓ సమస్య నిత్యం వెంటాడుతుంటుంది. మండల కేంద్రానికి అవసరమైన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలకమైన పోలీస్స్టేషన్ మాత్రం ఏర్పాటు కావడం లేదు. ప్రస్తుతం ఎల్ఎన్పేట మండలానికి సంబంధించి శాంతిభద్రతల పర్యవేక్షణ అంశం సరుబుజ్జిలి పోలీస్స్టేషన్ పరిధిలో ఉంది. దీంతో చిన్న చిన్న కేసులు, రోడ్డు ప్రమాదాలు వంటి విషయంలో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు సరుబుజ్జిలి పోలీస్స్టేషన్ సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఎల్ఎన్పేటలో పోలీస్స్టేషన్ ఏర్పాటుచేస్తామని దశాబ్దాలుగా చెబుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. జిల్లాలో పోలీస్స్టేషన్ లేని మండలంగా ఎల్ఎన్పేట మిగిలిపోతోంది. రెండున్నర దశాబ్దాలుగా.. జిల్లాలో భౌగోళికంగా ఉన్న అతి పెద్ద మండలం సరుబుజ్జిలి. దీంతో పాలనాపరమైన సౌలభ్యం కోసం 1999లో సరుబుజ్జిలి నుంచి ఎల్ఎన్పేట మండలాన్ని 19 పంచాయతీలతో ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఎల్ఎన్పేట మండల కేంద్రంగా కొనసాగుతూ వచ్చింది. అప్పట్లోనే శాఖలపరంగా అన్ని కార్యాలయాలను ఏర్పాటు చేయాలని భావించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కేజీబీవీ, ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వంటివి ఏర్పాటు చేశారు. కానీ పోలీస్స్టేషన్ మాత్రం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతానికి మండల పరిధి పెరిగింది. ముఖ్యంగా వంశధార ని ర్వాసిత గ్రామాలు పెరిగాయి. చిన్నకొల్లివలస, గా ర్లపాడు, పాడలి, తులగాం నిర్వాసిత గ్రామాల వా రు ఎల్ఎన్పేట మండలంలో వేర్వేరు పంచాయతీల్లో నివాసం ఏర్పాటుచేసుకున్నారు. మరోవైపు మోదుగువలస ఆర్అండ్ఆర్ కాలనీ, శ్యామలాపు రం ఆర్అండ్ఆర్ కాలనీ, తాయిమాంబాపురం ఆర్ అండ్ఆర్ కాలనీ పేరుతో మూడు పంచాయతీలు సైతం ఎల్ఎన్పేట మండలంలో చేరాయి. ప్రస్తుతం మండల భౌగోళిక పరిధి 72 కిలోమీటర్లుగా ఉంది. జనాభా పెరిగినా.. ప్రస్తుతం మండలంలో జనాభా 40 వేల వరకూ ఉంటుందని అంచనా. 2011 జనాభా లెక్కల ప్రకారం 27 వేల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం మండలం పరిధి పెరిగింది. జనాభా కూడా గణనీయంగా పెరిగింది. ప్రతి 30 వేల మంది జనాభాకు పోలీస్స్టేషన్ ఏర్పాటుచేయాలన్న నిబంధన ఉంది. ఈ లెక్కన ఇక్కడ కచ్చితంగా స్టేషన్ ఏర్పాటుచేయాలి. అయినా పోలీస్ శాఖ పట్టించుకోవడం లేదు. ఈ మండలం మీదుగా అలికాం–బత్తిలి రహదారి ఉంది. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు సైతం ఉన్నాయి. ఏటా శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నా నం జరుగుతుంటుంది. ఆ సమయంలో పక్క మండలాల నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి విధులు నిర్వహిస్తుంటారు. జిల్లాకు డీజీపీ, డీఐజీ స్థాయి అధికారులు వచ్చిన సమయంలో ఎల్ఎన్పేటలో పోలీస్స్టేషన్ ఏర్పాటుపై మాట్లాడుతుంటారు. తర్వాత మరిచిపోతుంటారు. ఇప్పటికై నా పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. పోలీస్స్టేషన్ లేని ఏకై క మండలంగా లక్ష్మీనర్సుపేట దశాబ్దాల హామీ కార్యరూపం దాల్చని వైనం కేసులు, ఫిర్యాదులకు పక్క మండలానికి వెళ్లాల్సిందే అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు హిరమండలం: ఎల్.ఎన్.పేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలోని సీ్త్ర శక్తి భవనంలో అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు ఆమదాలవలస సీఐ పి.సత్యనారాయణ తెలిపారు. అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ పనులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ విలేకరులతో మాట్లాడుతూ ఎల్.ఎన్.పేట మండలంలో పోలీస్ స్టేషన్ లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్క డ అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవుట్ పోస్టు సరుబుజ్జిలి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో పని చేస్తుందన్నారు. స్టేషన్ ఏర్పాటుచేయాలి ఎప్పుడో 1999లో మండలాన్ని ఏర్పా టుచేశారు. అయినా ఇంతవరకు పోలీస్స్టేషన్ లేకపోవడంతో కేసులు, ఫిర్యాదులు వంటి వాటి కోసం సరుబుజ్జిలి వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి పోలీస్స్టేషన్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలి. – పెనుమజ్జి విష్ణుమూర్తి, యంబరాం, ఎల్ఎన్పేట మండలం -
సర్వం స్వాహార్పణం
చెరువులు..శ్మశానం● నక్కపేటలో ఆక్రమణలు ● కబ్జాతో కనుమరుగవుతున్న చెరువులు ● సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ● శ్మశాన వాటికను వదలని ఆక్రమణదారులు ● దహన సంస్కారాలకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ● అధికారులకు ఫిర్యాదు చేసినా.. సీఎంకు ఫిర్యాదులు వెళ్లినా స్పందన శూన్యం ఆక్రమణలో ఉన్న మర్రి బంద చెరువు గట్టుపై వేసిన పశువుల పాకలివి. సర్వే నంబరు 236లో ఉందీ స్థలం. దీని విస్తీర్ణం 4.32 ఎకరాలు. కొంత మంది చెరువును కప్పేసి పొలాలుగా మార్చారు. చెరువు మదుములు పూడ్చేశారు. చెరువు చప్టాను పొడిచేశారు. అలాగే చెరువు గట్టుపై మూగజీవాల కోసం పాకలు వేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జి.సిగడాం మండలం సీతంపేట పంచాయతీ నక్కపేట గ్రామంలో సాగునీటి చెరువులు అన్యాక్రాంతమయ్యాయి. ఆక్రమించిన చెరువు గర్భంలో మట్టి వేసి పొలాలుగా మార్చుకుని సాగు చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో చెరువులు కుచించుకుపోయాయి. చెరువులు కాస్త చిన్న మురికి కాలువలుగా మారిపోతున్నాయి. సాగునీటి అవసరాల కోసం పెద్దలు చెరువులు తవ్విస్తే వాటినే కబ్జా చేసి పొలాలుగా మార్చుకుంటున్నారు. ఈ గ్రామంలో కళ్ల ముందే మర్రిబంద చెరువు, గుంటుకువాని చెరువు ఆక్రమణలకు గురైనట్టు కనబడుతున్నా చర్యలు తీసుకోవడం లేదు. చివరికి కలెక్టర్కు, సీఎంకు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. గతంలో ఒకసారి ఆక్రమణదారుల నోటీసుల డ్రామా నడిచినా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయో తెలీదు గానీ ఆక్రమణలు ఎక్కడికక్కడ అలాగే ఉన్నాయి. చెరువుల పునరుద్ధరణ జరగలేదు. శ్మశానాలకు సమాధి... ఆక్రమణలకు పునాది గ్రామంలో చెరువులే కాదు.. ఆ చెరువుల మధ్య ఉన్న శ్మశాన వాటిక భూమిని కూడా ఆక్రమించేశారు. సాధారణంగా శ్మశానాల జోలికి వెళ్లడానికి భయపడతారు. కానీ, ఇక్కడేంటో శ్మశానాలను సైతం వదల్లేదు. మర్రిబంద చెరువు, గుంటుకువాని చెరువు మధ్య ఉన్న ఐదెకరాల శ్మశానంలోనూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తమకు అనుకూలంగా మార్చుకుని అనుభవిస్తున్నారు. దీంతో శ్మశానం వాటిక కూడా ఆక్రమణదారుల చేతిలో చిక్కుకుపోయింది. ఇక్కడ ఒక్కో ఎకరం విలువ రూ.30లక్షలు దాటి ఉంటుంది. ఈ లెక్కన ఆక్రమణదారులు కబ్జా చేసిన చెరువు, శ్మశాన వాటిక భూముల విలువ రూ. కోట్లలో ఉంటోంది. ఫిర్యాదులు చేసినా పట్టించుకోని పరిస్థితి చెరువులు, శ్మశాన వాటిక ఆక్రమణలకు గురయ్యాయని అటు తహసీల్దార్, కలెక్టర్కు, ఇటు సీఎంకు ఫిర్యాదు చేసినా స్పందన ఉండటం లేదు. దీన్ని బట్టి ఇక్కడ ఆక్రమణల వెనక ఎవరున్నారో స్పష్టమవుతోంది. కొంతమంది మాత్రం పశువుల పాకలు వేసుకున్నామని, వాటిని తొలగిస్తే మరొకచోట పశువుల శాలకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదొక సమస్యగా మారడంతో అధికారులు సైతం ఊగిసలాట ఆడుతున్నారు. -
వాటిని తెరిస్తే తంటాలే..!
సోంపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడికి వారం రోజుల కిందట ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్. ఏపీకే అనే లింకు వాట్సాప్ ద్వారా వచ్చింది. దీంతో క్లిక్ చేసి అన్ని లాంఛనాలు పూర్తి చేసి లాగిన్ అయ్యారు. లాగిన్ అయ్యాక ఓటీపీ అడగడం, ఓటీపీ ఎంటర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తన ఫోన్ సిమ్ పనిచేయకపోవడం.. కొన్ని గంటల్లోనే తన బ్యాంకు ఖాతాలోని సొమ్ము మాయమవ్వడం చకచకా జరిగిపోయాయి. దాదాపు రూ.7లక్షలు పోయినట్లు తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. కాశీబుగ్గకు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ టెలిగ్రామ్ యాప్లో వచ్చిన ఇదే లింకుపై క్లిక్ చేశాడు. అంతే పై మాదిరిగానే సైబర్ కేటుగాళ్లు రూ.10 లక్షలకు పైగా తన వివిధ బ్యాంకు ఖాతాల నుంచి సొమ్మును లాగేసుకున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : ఆర్టీఓ ట్రాఫిక్ చలాన్.ఏపీకే.. శ్రీకాకుళం జిల్లాను దాదాపు నెల రోజులుగా వణికిస్తున్న లింకు ఇది. బండిపై ఎంత చలానా ఉందో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఈ యాప్లను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశారో.. ఇక అంతే.. ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే గత 20 రోజుల్లో దాదాపు 12 కేసులు దీనిపైనే నమోదయ్యాయి. పైగా దీని బాధితులంతా ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారే కావడం గమనార్హం. మోసపోతున్నారిలా.. » ముందుగా ‘ఆర్టీఓ టిఆర్ఏఎఫ్ఎఫ్ఐసి సిహెచ్ఏఎల్ఎల్ఏఎన్.ఎపికె’ ఫైల్ మెసేజ్ లింక్ రూపంలో వస్తుంది. » మనం క్లిక్ చేసిన వెంటనే లాగిన్ అని వస్తుంది. అయ్యాక వెంటనే ఓటీపీ అడుగుతుంది. » ఓటీపీ ఎంటర్ చేశామా ఇక అంతే సంగతులు.. సైబర్ నేరగాళ్ల మెసేజ్ ఇన్బాక్స్లో మన ఫోన్ నంబర్ చేరుతుంది. » వెంటనే మన ఫోన్ నంబర్ ఉన్న సిమ్ను అదే నంబర్తో ఎలక్ట్రానిక్ సిమ్గా మార్చుతారు. » మన ఫోన్పై ఉన్న స్క్రీన్ వారి ఆ«దీనంలోకి వెళ్లిపోతుంది. » మన ఫోన్ పనిచేయక తికమక పడుతున్న ఆ క్షణాల్లోనే సిమ్ అప్డేట్ అవ్వాలంటే మన మెయిల్ అడ్రస్ యాడ్ చేయాలని అందులో వస్తుంది. » మనం మెయిల్ అడ్రస్ యాడ్ చేసిన వెంటనే సిమ్ ఛేంజెస్ ఎస్ ఆర్ నో అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే ఐదు, పదినిమిషాల్లో ఓ క్యూఆర్కోడ్ రావడం.. మన ఫోన్ నంబర్తో ఉన్న సిమ్కార్డు సైబర్ నేరస్తుడి మొబైల్ నుంచి యాక్టివేట్ అయిపోవడం జరుగుతుంది. » వెంటనే సైబర్ నేరగాడు ఎమ్.ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసి మన ఫోన్ నంబరే కావడంతో వచ్చే ఓటీపీలను ఎంటర్ చేసి బయోయెట్రిక్ లాక్ చేసేస్తాడు. దాంతో మనం సిమ్ కొనాలని షాపులకు వెళ్లినా.. ఆధార్ అవసరంతో బ్యాంకు, రిజి్రస్టేషన్, ఇతర ఏ పనుల్లో మనం బయెమెట్రిక్కు థంబ్ వేయాలని అనుకున్నా అది లాక్ చేయడంతో కుదరదు. ఇక మనకు సిమ్ దొరకదు. » ఈ లోగా సైబర్ నేరగాడు మన ఆధార్ నంబర్, ఫోన్ నంబర్తో ఇంటర్నెట్ త్రూ డెబిట్ కార్డ్ లోన్స్, లోన్ యాప్స్, పేయింగ్ యాప్స్ (ఫ్లిప్కా ర్ట్, అమెజాన్, మీషో, పేటీఎం, గూగుల్పే, ఫోన్పే) తదితర మార్గాల్లో వస్తువులు కొనేయ డం,డబ్బులు మాయంచేసి మన బ్యాంకు ఖాతా లను కొల్లగొట్టేయడమే కాక రూ.లక్షల్లో లోన్లు వాడేసి మనకు రుణ భారాన్ని మిగుల్చుతారు. » ఇదే తరహాలో సోంపేట ఉపాధ్యాయునికి జరగడం, చాలా రోజుల వరకు తన నంబర్ ఉన్న సిమ్ రాకపోవడంతో తన వేలి ముద్రలు పనిచేయడం లేదని పాత (మాన్యువల్) పద్ధతిలోనే సిమ్ను పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో ఇటువంటి మోసాలు అత్యధికంగా కాశీబుగ్గ, సోంపేట, ఇచ్ఛాపురంలోనే జరిగాయని, చేసే సైబర్ నేరగాళ్లు జార్ఖండ్ వాసులుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. పోలీసులకే బురిడీసైబర్ మోసాల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన పోలీసుల్ని సైతం ఇదే తరహా లింక్తో సైబర్కేటుగాళ్లు మోసం చేశారు. జిల్లాలోని వివిధ సర్కిళ్లలో పనిచేస్తున్న ముగ్గురు ఎస్ఐలకు ఈ అనుభవం ఎదురైంది. జేబులు కూడా ఖాళీ అయినట్లు పోలీసు వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. ఈ అంశాన్ని పోలీస్ శాఖ సీరియస్గానే తీసుకుంది.ఎం.పరివాహన్ యాప్లోనే కట్టాలి.. వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆదీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్స్టేషన్లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ -
బలవంతపు భూసేకరణ నిలిపేయాలి
వజ్రపుకొత్తూరు రూరల్: ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, బలవంతపు భూసేకరణ నిలిపేయాలని కోరుతూ ఎయిర్పోర్టు బాధిత గ్రామాల్లో రైతులు, వామపక్ష నాయకులు, వివిధ సంఘాల నేతలు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బలవంతపు భూసేకరణ చేస్తే ప్రతిఘటన తప్పదని వారంతా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఒంకులూరులో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలుస్తూ వారికి ప్రయోజనాలను చేకూర్చేలా పాలన సాగించాలే తప్ప.. కార్పొరేట్ కంపెనీలకు అమ్ముడుపోయి ప్రజల భూములను లూటీ చేసేలా వ్యవహరించడం తగదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కార్గోఎయిర్ పోర్టుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వ్యవసాయ శాఖ మంత్రివా లేక విధ్వంస శాఖ మంత్రివా అంటూ అచ్చెన్నాయుడిపై మండిపడ్డారు. కొబ్బరి, జీడి, మామిడి, పనస లాంటి పచ్చని పంటలతో విరాజిల్లుతున్న ఉద్దాన ప్రాంతాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఢిల్లీలాంటి మహానగరంలో 150 ఎకరాల్లో మాత్రమే కార్గో ఎయిర్పోర్టు ఉంటే ఇక్కడ 1,400 ఎకరాలు భూమిని సేకరించాలని నిర్ణయించడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఉద్దానం జీడి పంటను కార్గో ఎయిర్పోర్టు పేరుతో నాశనం చేస్తే పర్యవరణంతో పాటు లక్షలాది మంది రైతులు, జీడి కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కార్యదర్శి జో గి అప్పారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహన్రా వు, సీపీఎంఎల్ లిబరేషన్ నాయకుడు ఎం.రామారావు, పీఓడబ్యూ జిల్లా కార్యదర్శి పి.కుసుమ తదితరులు పాల్గొన్నారు.భళా మోక్షశ్రీశ్రీకాకుళం : బలగలో నివాసముంటున్న వంజరాపు సాయికుమార్, రమ్య దంపతుల కుమార్తె మోక్షశ్రీ ప్రపంచ రికార్డు సాధించింది. రెండేళ్ల ఎనిమిది నెలల వయసులోనే కెమిస్ట్రీ సబ్జెక్టులోని 30 మూలకాలను 23.37 సెకెండ్లలో చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. జూలై 16న ఆన్లైన్ విధానంలో ఈ ఘనత సాధించింది. ప్రపంచ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రం మంగళవారం తల్లిదండ్రులకు చేరింది. మోక్షశ్రీ తల్లి రమ్య మత్స్యశాఖలో సాగర మిత్రగా పనిచేస్తుండగా, తండ్రి సాయికుమార్ సిమెంట్ బొమ్మలను తయారు చేస్తుంటారు. వీరి స్వస్థలం హిరమండలం అయినప్పటికీ ఉద్యోగరీత్యా దంపతులు బలగలో నివాసముంటున్నారు.కొత్తమ్మతల్లికి గాజుల అలంకరణ శ్రావణమాసం సందర్భంగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారికి బుధవారం గాజుల తో అలంకరణ చేశారు. ఆలయ ఈఓ వి.రాధాకృష్ణ నేతృత్వంలో అర్చకుడు కమ్మకట్టు రాజేష్ నేతృత్వంలో ప్రత్యేకంగా అలంకరించి పూజ లు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.– టెక్కలి -
రేపు పది మండలాల్లో విద్యుత్ కోత
●ఒక ఆధార్.. 50 విద్యుత్ కనక్షన్లు ఎచ్చెర్ల: కొత్తపేట పంచాయతీ గాడుపేటకు చెందిన ఆటోడ్రైవర్ బుగత గోవిందరావు పిల్లలు యశ్వంత్ 9వ తరగతి, విమల 7వ తరగతి చదువుతున్నారు. వీరికి తల్లికి వందనం వర్తించలేదు. కారణమేంటని ఆరా తీస్తే 300 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తున్నారని సిబ్బంది తెలియజేశారు. వాస్తవానికి గోవిందరావు 144 యూనిట్లు మించి వినియోగించలేదు. దీంతో శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్కు వెళ్లి ఆరా తీయగా అక్కడ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో గోవిందరావు అవాక్కయ్యారు. ఇతని ఆధార్ నెంబరుతో 50 విద్యుత్ మీటర్లు తీసుకున్నట్లు రికార్డుల్లో ఉందని చెప్పారు. ఎచ్చెర్ల, లావేరు, పొందూరు, రణస్థలం, జి.సిగడాం మండలాల్లో ఈ మీటర్లు ఉన్నట్లు తేలింది. ఆది నుంచీ అవాంతరాలే.. ●వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభం రోజున జూన్ 12న తల్లికి వందనం పథకం నిధుల్ని జమచేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. జీవోను విడుదల చేసి షాకిచ్చింది. ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తొలుత నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ఊదరగొట్టిన రాష్ట్రప్రభుత్వం.. తీరా రూ.13 వేలు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.2 వేలు ఎగ్గొట్టింది. పోనీ జమ చేసిన మొత్తం అందరికీ వేశారా? అంటే అదీలేదు. ●పునర్విభజన శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది (2024–25) ఒకటి నుంచి ఇంటర్(+2) వరకు 3.05 లక్షల మంది చదువుకున్నారు. వీరిందరికీ కలిపి మొదటి ఏడాది రూ.457 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం బాకీ పడి ఉంది. ●రెండో ఏడాది 2025–26కిగాను యూ–డైస్ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,76,593 మంది, ఇంటర్మీడియెట్ 46,761 మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఇంటర్ మొత్తం కలిపి 3,02460 మంది చదువుతున్నారు. వీరిలో ఫస్ట్ఫేజ్లో 2,28,448 మందికి లబ్ధిచేకూర్చినట్టు అధికారులు చెబుతున్నారు. అనంతరం ఒకటోతరగతి, ఇంటర్లో ప్రవేశాల తర్వాత ఎంతమందికి లబ్ధి జమచేశారో స్పష్టత రావడం లేదు. అరసవల్లి: జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా విద్యుత్ నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 10 మండలాల పరిధిలో గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు విద్యుత్ సర్కిల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి బుధవారం తెలిపారు. రణస్థలం మండలంలో కోష్ట, పిసిని ఫీడర్ల పరిధిలో వెంకటరావుపేట, వల్లభరావుపేట, దేరశాం, లావేరు మండలంలో అదపాక ఫీడర్ పరిధిలో గుర్రాలపాలెం, పైడయ్యవలస, పెద్దకొత్తపల్లి, ఎచ్చెర్ల మండలంలో కొయ్యాం, జర్జాం, ఎస్ఎం.పురం, బడివానిపేట, ఫరీదుపేట, కె.కె.నాయుడుపేట, పాతపట్నం మండలంలో పాతపట్నం టౌన్, ఆర్ఎల్పురం, కొరసవాడ, చెంగుడి, సరళి, సీతరాంపల్లి, బోరుభద్ర, తిద్దిమి, మెళియాపుట్టి మండలంలో చిన్నహంస, తిదిమి, మెళియాపుట్టి, కోటబొమ్మాళి మండలంలో అక్కుపల్లి, సరియాపల్లి, దంత, పోలాకి మండలంలో ఇండస్ట్రియల్ ఎక్స్ప్రెస్, డోల, పోలాకి, జర్జాం ఫీడర్ల పరిధిలో ఎస్ఎం.పురం, గొల్లలవలస, తోటాడ, సుసరాం, నడగాం, సుందరాపురం, చోడవరం, వెంకటాపురం, కవిటి మండలంలో డిజిపుట్టుగ, కుసుంపురం, మాణిక్యాపురం, దూగానపుట్టుగ, సరుబుజ్జిలి మండలంలో రొట్టవలస, ఆమదాలవలస మండలంలో జికె.వలస, కొత్తవలస, నిమ్మతొర్లాడ, కొరపాం, సీపన్నపేట తదితర గ్రామాల్లో విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. నోట్లు, నాణేలతో సోనూసూద్ బొమ్మ -
బెంగారం
● అబాసుపాలవుతున్న పీ–4 కార్యక్రమం ● బంగారు కుటుంబాల దత్తతకు సంపన్నుల విముఖత ● ఆ భారం ఉద్యోగులపై మోపుతున్న కూటమి సర్కారు ● ప్రభుత్వ తీరుపై సర్వత్రా మండిపాటు.. ఉద్యోగులకు బాబుగారిసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సీఎం చంద్రబాబు పేద కుటుంబాలను పైకి తీసుకొస్తానంటే ఏదో అనుకున్నారు. ఆయన చేతిలో మంత్రదండం ఉందనేలా బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడేమో పేదవాళ్లను పైకి తీసుకురావడం ప్రభుత్వంతో అయ్యే పనికాదని సంపన్నులపై దృష్టి పెట్టారు. వారంతా ముందుకు రావాలని చేయి చాపుతున్నారు. అలా ముందుకొచ్చే దాతలకు మార్గదర్శకులనే పేరు పెట్టారు. పేద కుటుంబాలకు బంగారు కుటుంబాలని నామకరణం చేశారు. స్వచ్ఛందంగా దాతలు రాకపోయినా బలవంతంగా అంటకడుతున్నారు. అయినప్పటికీ సంపన్నులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులే మార్గదర్శకులుగా(దాతలు) ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కొక్కరు ఐదారుగురు చొప్పున దత్తత తీసుకోవాలని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అబాసుపాలు.. ప్రభుత్వం గొప్పగా చెబుతున్న పీ–4 కార్యక్రమం అబాసుపాలవుతోంది. ప్రభుత్వం చెబుతున్న మా టలకు, ఆచరణకు పొంతన లేకుండాపోతోంది. సమాజంలోని సంపన్నులు పేదలైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థికంగా, ఇతరత్రా అంశాల్లో అండగా ఉంటూ పైకి తీసుకొచ్చేలా పీ–4 కార్యక్రమం రూపకల్పన చేసింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నా యి. పీ–4 కార్యక్రమం బలవంతంగా అంటగట్టే కార్యక్రమంగా మారిపోయింది. ప్రభుత్వం చెబుతున్న ప్రకారం బంగారు కుటుంబాలను దత్తత తీసుకోనున్న మార్గదర్శకులు.. ఆ కుటుంబం ఉండటానికి ఇల్లు, ఉపాధి, పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్య పరంగా ఇబ్బందులుంటే ఆదు కోవడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఉద్యోగులకు టార్గెట్.. ఆగస్టు 15 నాటికి జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చేయాలని ప్రభుత్వం డెడ్లైన్ పెట్టింది. పేదలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు మందుకు రాకపోవడంతో ఉద్యోగులనే మార్గదర్శకాలుగా నమోదు చేసుకోవాలని మెడపై కత్తి పెడుతోంది. జిల్లాలో 75,566 బంగారు కుటుంబాలను సర్వే ద్వారా గుర్తించారు. ఆగస్టు 15కల్లా 59,124 బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. సంపన్నుల నుంచి స్పందన రాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులపైనే భారం మోపింది. ఇప్పటి వరకు జిల్లాలో 7,694 మంది మార్గదర్శకులను నయానోభయానో చెప్పి ఒప్పించింది. వీరికి 29,818 కుటుంబాలను దత్తత తీసుకున్నట్టు ఒప్పించారు. ఇంకా 30 వేల కుటుంబాలు మిగిలి ఉంటాయి. సచివాలయం ఉద్యోగులతో కలిపి జిల్లాలో 35 వేల వరకు ప్రభు త్వ ఉద్యోగులు ఉన్నారు. వారిలో కొంతమంది ఇప్పటికే ఆన్లైన్లో మార్గదర్శకులుగా నమోద య్యారు. మిగతా వారంతా ఆగస్టు 15వ తేదీలోగా మార్గదర్శకులుగా చేరాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ఇదేం తీరు.. సచివాలయం ఉద్యోగులు గా ప్రభుత్వం నిర్దేశించిన విధులు నిర్వర్తిస్తాం. అయి తే బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సంపన్నులు ముందుకు రాకపోతే సచివాలయ ఉద్యోగులే దత్త తీసుకోవాలని ప్రభు త్వ పెద్దలు చెప్పడం దారుణం. రూ.30వేల జీతంతో బంగారు కుటుంబాలను ఏ రకంగా ఆదుకోగలం? – బూరాడ మధుబాబు, గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడునలిగిపోతున్న ఉద్యోగులు.. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు మందుకురాకపోవడంతో ఉపాధ్యాయులు, ఇతరత్రా ఉద్యోగులతో పాటు సచివాలయం ఉద్యోగులు కూడా ఐదారుగురు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో నమోదు చేయించేలా ఎంపీడీవోల చేత సతాయిస్తోంది. దీంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున నలిగిపోతున్నారు. ముఖ్యంగా సచివాలయం ఉద్యోగులకు 30వేల లోపే జీతం ఉంటుంది. వారు కూడా పేదలైన బంగా రు కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఏవిధంగా పైకి తీసుకురాగలరో ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పటికే ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తమకు రావాల్సిన జీతభత్యాలు, పెండింగ్ బకాయిలు ఇవ్వకుండా ఈ కొత్త డ్రామాలేంటని నిలదీస్తున్నారు. ఒత్తిడి తగదు.. పీ–4 అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతోంది. ఉపాధ్యాయులతో పాటు ఉద్యోగులకు కూడా బంగారు కుటుంబాలంటూ దత్తత స్వీకరించడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడంపై నిర్బంధం చేయకూడదు. ఇలాగే ప్రభుత్వం వ్యవహరిస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర ఆందోళన తప్పదు. – కిలారి నారాయణరావు, జిల్లా అధ్యక్షుడు, పి.ఆర్.మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం -
● జిల్లాలో విస్తారంగా వరి సాగు ● అధిక దిగుబడులకు సూక్ష్మ పోషకాలు కీలకం ● చర్యలు తీసుకోవాలని అధికారుల సూచనలు
కవిటి: ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ వరిసాగు విస్తృత స్థాయిలో సాగుతోంది. సాగు ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో పంటల్లో అధిక దిగుబడుల సాధనకు రైతులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అయితే పంటల పెరుగుదలకు సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎంతో అవసరమని సోంపేట సబ్ డివిజన్ ఏడీఏ టి.భవానీశంకర్ తెలిపారు. నత్రజని, భాస్వరం, పొటాష్ అందుబాటులో ఉన్నా, సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటే పంటల దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. జింక్, ఇనుము, బోరాన్, రాగి, మాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్ వంటి మూలకాలను సూక్ష్మపోషకాలు అంటారు. నేలలో ఏ ఒక్క సూక్ష్మ పోషక పదార్థం లోపం ఉన్నా సరైన ఫలితం ఇవ్వదు. అందువలన నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులను వేసుకొని పంట లోపాలు నివారించుకోవాలని సూచించారు. జింక్: మొక్కల పెరుగుదలకు అవసరమైన నత్రజని, భాస్వరం వంటి పోషకాల సమర్థ వినియోగానికి జింక్ చాలా అవసరం. లోపం: జింక్ లోపం ఉంటే మొక్క పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈనే పాలిపోతుంది. నాటి న రెండు నుంచి నాలుగు వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనెకు ఇరుపక్కల తుప్పు లేదా ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. ఇది మిగతా ఆకు అంతటా వ్యాపిస్తుంది. ఆకులు గిడసబారి దుబ్బు చేయవు. పైరుకు నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చగా ఉండదు నివారణ చర్యలు: వరి పండించే భూముల్లో ప్రతీమూడు సార్లుకు ఒకసారి, రబీ సీజన్ రెండు పంటలు పండించే భూముల్లో ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ చల్లుకోవాలి. భాస్వరం ఎరువుతో జింక్ సల్ఫేట్ కలిపి వేయరాదు. వీటి మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి ఉండాలి. జింక్ సల్ఫేట్ వేయలేని పరిస్థితుల్లో పైరుపై జింక్ లోపం కనిపించగానే లీటర్ నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. ఇనుము: ఆకుల్లో పత్రహరితం తయారు కావడానికి ఇను ము ఆధారం. ఇది పిండి పదార్థం తయారీకి ఉపయోగపడుతుంది. అధిక క్షార భూముల్లో, సున్నపు రాయి పాలు ఎక్కువగా గల నేలలు, తేలిక నేలల్లో, సేంద్రియ పదార్థం తక్కువగా ఉన్న నేలల్లో ఇనుప దాతు లోపాలు కనిపిస్తాయి. మెట్టవరి, మెట్ట నారుమళ్లలో ఇనుప దాతులోపం సాధారణంగా కనిపిస్తుంది. నివారణ చర్యలు: ఒక లీటర్ నీటికి 20 గ్రాముల అన్న భేది, రెండు గ్రాముల నిమ్మ ఉప్పులో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ ద్రావణాన్ని ఐదు రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక మిగతా సూక్ష్మ పోషకాలు తక్కువ మోతాదులో అవసరం అవుతాయి. మార్కెట్లో అన్ని సూక్ష్మ పోషకాల మిశ్రమం ఆగ్రోమినిమార్క్స్ రూపంలో ఫార్ములా–4 రూపంలో లభ్యమవుతాయి. సూక్ష్మ పోషకాల అవసరాన్ని బట్టి పైరులో వీటిని తగిన సమయంలో వాడి అధిక దిగుబడి పొందవచ్చు. ఖరీఫ్ వరినారులో కనిపిస్తున్న సూక్ష్మధాతు లోపం సూక్ష్మంతోనే.. దిగుబడులకు మోక్షం..! సూక్ష్మధాతు లోపాల నివారణ చర్యలు మట్టి పరీక్ష: నేలలో ఏ సూక్ష్మధాతువు లోపించిందో తెలు సుకునేందుకు పంటకాలం ప్రారంభానికి ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. ఎరువుల యాజమాన్యం:మట్టిపరీక్ష ఫలితాల ఆధారంగా సూక్ష్మధాతువులను అందించే ఎరువులను అందించాలి. పచ్చిరొట్ట పైర్లసాగు: సూక్ష్మధాతు లోపాల నివారణ కు సేంద్రియ వ్యవసాయ విధానాలు మేలు చేస్తా యి. ఇందులో ప్రధానంగా పంట సీజన్ ప్రారంభంలో కుళ్లిన పశువుల గత్తం, వర్మీ కంపోస్టును భూమి లో చల్లుకొని కలియదున్నాలి. జీలుగు, పిల్లిపెసర, నవధాన్యాల సాగువంటి విధానాలతో పచ్చిరొట్ట పైర్లను పెంచి దమ్ము సమయంలో వీటిని భూమిలో కలియదున్నాలి. దీనికి అదనంగా ఎకరానికి కనీసం 100 కిలోల సింగిల్ సూపర్ఫాస్పేట్ను పైపాటుగా వేసుకుంటే పచ్చిరొట్ట పైరును బాగా కుళ్లిస్తుంది. దీనిద్వారా ఆ భూమిలో సేంద్రియ కర్బనంతో పాటుగా సూక్ష్మధాతువుల స్థిరీకరణకు సహాయపడుతుంది. -
తండ్రికి తలకొరివిపెట్టిన కుమార్తె
సరుబుజ్జిలి: కుమారుడు ఉన్నప్పటికీ జబ్బుతో మంచానపడడంతో తండ్రికి కుమార్తె తలకొరివి పెట్టిన ఘటన సరుబుజ్జిలి మండలంలో చోటుచేసుకుంది. నందికొండ కాలనీకి చెందిన కూన సింహాచలం పక్షవాతంతో ఐదేళ్లుగా బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. కుమారుడు కూడా గత కొద్ది సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. అలాగే పెద్ద కుమార్తె అందుబాటులో లేకపోవడం వలన, పురుషోత్తపురం గ్రామానికి చెందిన చిన్న కుమార్తె పైడి అనూరాధ తండ్రి చితికి నిప్పుపెట్టి రుణం తీర్చుకుంది. -
ఉత్తర్వులను తక్షణమే వెనక్కి తీసుకోవాలి
ఎచ్చెర్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎచ్చెర్లలోని ఐఎంఎల్ డిపోను విడదీసి, టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు కోసం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి 3 తరాలుగా డిపోలో పనిచేస్తున్న కార్మికుల పొట్టకొట్టవద్దని కోరారు. ఈ మేరకు ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో హమాలీలు బుధవారం ధర్నా నిర్వహించారు. 1986లో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి 100 మంది దళిత కుటుంబాలకు చెందిన 4 ఎకరాల భూమిని ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా తీసుకొని, ఎచ్చెర్ల లో యారక్ బాటలింగ్ యూనిట్ ఏర్పాటు చేసింద ని గుర్తు చేశారు. ప్రభుత్వం సారా తయారీ కేంద్రంలో దళిత కుటుంబాలకు కార్మికులుగా, హమాలీలు గా ఉపాధిని కల్పించారన్నారు. అనంతరం ఐఎంఎల్ డిపోగా మారిన ఈ కేంద్రంలో పనిచేస్తూ 350 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నా రు. ఎచ్చెర్లలో సొంత గోడౌన్లలో మద్యం సరఫరా చేస్తుంటే, అదనంగా టెక్కలిలో మరో డిపో అద్దెకు తీసుకుని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. దీనివలన అద్దెల భారం ప్రభుత్వంపై పడుతుందన్నారు. ఎన్ని పోరాటాలు చేసి నా, వినతిపత్రాలు అందించినా ప్రభుత్వంలో చల నం లేకపోవడం శోచనీయమన్నారు.కార్యక్రమంలో ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో హమాలీస్ యూనియన్ నాయకులు టి.రామారావు, ఎం.సురేష్, రాము, జి.గురుమూర్తి, పట్నాన రామారావు,ఎల్.సీతారాం, ముద్దాడ రాజు, కేవీ రమణ పాల్గొన్నారు. -
అవినీతి తిమింగలం గోవిందరాజులు
● ఆయనకు వైఎస్ జగన్ను విమర్శించే అర్హత లేదు ● మండిపడిన వైఎస్సార్సీపీ నాయకులు టెక్కలి: కోటబొమ్మాళి మండలంలో బోయిన గోవిందరాజులు అనే వ్యక్తి ఒక అవినీతి తిమింగలమని, అతడికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత లేదని మేజర్ పంచాయతీ సర్పంచ్ కాళ్ల సంజీవరావు, ఎంపీటీసీ కె.శ్రీనివాస్రెడ్డి, నాయకులు కె.విశ్వనాథరెడ్డి, డబ్బీరు ప్రదీప్లు మండిపడ్డారు. ఇటీవల టీడీపీ నాయకుడు గోవిందరాజులు చేసిన విమర్శలను ఖండిస్తూ బుధవారం కోటబొమ్మాళిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రను తాకట్టుపెట్టిన నాయకులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడులు అని, అందుకే ఈరోజు వారికి రాష్ట్ర, కేంద్రమంత్రి పదవు లు ఇచ్చారని పేర్కొన్నారు. కోటబొమ్మాళిలో సర్వే నంబర్ 280/6లో 20 ఎకరాలు కొనుగోలు చేసుకు ని, ఆ స్థలానికి ఆనుకుని ఉన్న సుమారు 10 ఎకరా ల కొండ స్థలాన్ని కబ్జా చేసిన వ్యక్తి గోవిందరాజులు అని మండిపడ్డారు. కోటబొమ్మాళి పంచాయతీలో సుమారు 28.34 ఎకరాల చెరువులో దాదాపు 8 ఎకరాలు ఆక్రమించుకుని, ఆ భూమిలో గోవిందరాజులు రైస్ మిల్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. సుమారు 40 ఏళ్ల టీడీపీ పాలనలో కింజరాపు కుటుంబం అండతో ప్రజలు, రైతులను మోసం చేసి, బ్యాంకులను బురిడి కొట్టించి కోట్లాది రూపా యుల సొమ్మును కాజేసిన వ్యక్తి గోవిందరాజులు అని దుమ్మెత్తిపోశారు. విమర్శలు చేయడం విడ్డూరం బ్యాంకు రుణాలు తీసుకుని, వాటిని కట్టకుండా రాజకీయ అండతో అక్రమాలకు పాల్పడిన గోవిందరాజులు వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జిల్లాలో ఆయనతో పాటు ఆయన సోదరుడికి ఎంత అప్రతిష్ట ఉందో రైస్ మిల్లర్లకు తెలుసునని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో జిల్లాలో చేసిన అభివృద్ధి కనిపించలేదా అని నిలదీశారు. మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆస్పత్రి, ఉద్దానం ప్రాంతానికి సురక్షితమైన నీరు వంటి కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని గుర్తు చేశారు. కింజరాపు కుటుంబం దోచుకుంటున్న సొమ్ముతో పావలా వడ్డీకి డబ్బులు తెచ్చుకొని, వాటితో దోపిడీలు చేస్తున్న గోవిందరాజులు వైఎస్సార్సీపీ పాలనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే అతని అవినీతి బండారం మొత్తం బయటపెడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎస్.హేమసుందర్రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు అన్నెపు రామారావు, మండల నాయకులు రోణంకి ఉమా మల్లయ్య, బి.అప్పన్న తదితరులు పాల్గొన్నారు. -
లోకాయుక్త ఫిర్యాదుపై సర్వే
జి.సిగడాం: మండల కేంద్రంలోని 92/8 సర్వే నంబరులో ఉన్న భూమిని కొంతమంది ఆక్రమించి కల్యాణ మండపంతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ఇటీవల పి.జగదీశ్వరరావు అనే వ్యక్తి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈనెల 14వ తేదీన మండల సర్వేయర్, తహసీల్దార్ సమక్షంలో సర్వే చేపట్టారు. వీరు చేసిన సర్వే సక్రమంగా లేదని, జిల్లాస్థాయి అధికారులతో సర్వే చేపట్టాలని జగదీశ్వరరావు మరలా కోరారు. దీంతో బుధవా రం లోకాయుక్త అధికారి సమక్షంలో ఆ భూమిని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ఏడీలు కె.రమే ష్, కె.రమణమూర్తి, డీఐవోలు అనుపోజు వెంకటేశ్వరరావు, ఎ.మన్మథరావు అధ్వర్యంలో సర్వే చేపట్టారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని వెల్లడించారు. -
●విద్యుత్ కనెక్షన్ లేకపోయినా..
హిరమండలం: గులుమూరు పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన నిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులు వంశధార నిర్వాసితులు. ప్రస్తుతం రేకుల షెడ్లో నివసిస్తున్నారు. దీనికి అసలు విద్యుత్ కనెక్షనే లేదు.. కానీ 74 సర్వీసులు ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో వీరు ముగ్గురు పిల్లలు హేమంత్, జస్మిత, ధార్మిక్లకు తల్లికి వందనం పథకం వర్తించలేదు. పెంటయ్యకు సంబంధించి ఆధార్ అనుసంధానంలో 74 కనెక్షన్లు ఉన్నట్లు ఆన్లైన్లో ఉంది. పోలాకి మండలంలో 5, రణస్థలం–4, జి.సిగడాం–3, లావేరు–8, పొందూరు–34, ఎచ్చెర్ల–20 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు చూపిస్తుంది. న్యాయం చేయాలని బాధితుడు అధికారులను ఆశ్రయించినా ఇంకా ఫలితం దక్కలేదు. -
ఈదుపురంలో చోరీ
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ఈదుపురం గ్రామానికి చెందిన పీఏసీఎస్ డైరెక్టర్ బాసి భారతి ఇంట్లో దొంగలుపడి సొత్తును దోచుకున్నట్లు రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. బాసి భారతి కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో ఉండడంతో ఈనెల 21న ఆమె బంధువుల ఇంటికి విశాఖపట్నం వెళ్లారు. గురువారం ఆమె ఈదుపురం తన ఇంటికి రావాల్సి ఉండగా, ముందస్తుగా ఇంటిని శుభ్రపరచాలంటూ ఆమె తన బంధువుకు చెప్పారు. అయితే బుధవారం సాయంత్రం బంధువు మహిళా తలుపులు తీసేసరికి ఇంట్లో వస్తువులు, సామాగ్రి చిందరవందరగా ఉండడంతో ఇంట్లో దొంగలు పడ్డారంటూ బాసి భారతికి ఫోన్లో సమాచారం ఇచ్చింది. దీంతో ఆమె హుటాహుటిన ఈదుపురం చేరుకొని రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఇళ్లంతా క్షుణంగా పరిశీలించారు. ఎస్ఐ ఈ.శ్రీనివాస్ మాట్లాడుతూ అగంతకులు ఇంటి పెరటి నుంచి ఇంట్లోకి వచ్చారని, పోగొట్టుకున్న వస్తువులపై బాసి భారతి తమకు స్పష్టమైన సమాచారం అందించడం లేదని, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఫిర్యాదు మేరకు విచారణ చేస్తామన్నారు. -
యూరియా అందక రైతుల నిరసన
జలుమూరు: మండలంలోని మర్రివలస సచివాలయం పరిధి కరకవలసలో యూరియా పంపిణీలో తమకు మొండిచేయి చూపారని కరకవలస రైతులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. మర్రివలస సచివాలయంకు యూరియా లోడ్ వస్తే టీడీపీ నాయకులే తమ ఇష్టం వచ్చినవారికి సర్దుబాటు చేసుకున్నారని గురుగుబిల్లి సింహాచలం, సీపాన జీవరత్నం, పేడాడ కృష్ణమూర్తి, వెంకటరావులు అవేదన వ్యక్తం చేశారు. అలాగే సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో సచివాలయం ఉండడంతో తరుచూ ఇబ్బందులు పడుతున్నామని గరుకు ఏకాదశి, కృష్ణారావులు తెలిపారు. అధికారులు స్పందించి తమ సొంత గ్రామం కరకవలసలో ఎరువుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఏవో కె.రవికుమార్ వద్ద ప్రస్తావించగా మర్రివలసలో ఎరువుల పంపిణీ సమస్య తమ దృష్టికి వచ్చిందని, ఇక నుంచి అలా జరగకుండా చూస్తామన్నారు. -
వైరల్ జ్వరాల విజృంభణ
సారవకోట: గ్రామాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా జ్వరాల బారిన పడుతున్నారు. కొంతమంది ఆర్ఎంపీ వైద్యులను ఆశ్రయిస్తుండగా మరికొందరు సమీప పీహెచ్సీలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. సారవకోట, చోడసముద్రం, చిన్నగుజ్జువాడ తదితర గ్రామాల్లో జ్వరాల తీవ్రత అధికంగా కనిపిస్తోంది. తర్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు జ్వరాలతో బాధపడుతుండటంతో సారవకోట పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు దోమలు, ఈగల ఉద్ధృతి పెరగడం వ్యాధుల విజృంభణకు కారణమని తెలుస్తోంది. -
ఎవరో వస్తారని ఎదురుచూడక..!
ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. ఎదురుచూసి మోసపోకుమా అని శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆ కాలనీ ప్రజలు ఆదర్శంగా తీసుకున్నారు. టెక్కలి జగతిమెట్ట సమీపంలోని జగనన్న కాలనీలో కాలనీవాసులు సొంతంగా నిధులు సమకూర్చుకుని రోడ్లు బాగు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇక్కడ జగనన్న కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు అందజేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలనీకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో విసిగిపోయిన కాలనీవాసులు కొన్ని వీధుల్లో సొంతంగా రోడ్లు వేసుకుంటున్నారు. వీధుల్లో పూర్తిగా గోతులమయంగా ఉన్నటువంటి రహదారిపై వేస్ట్ మెటీరియల్ వేస్తూ గోతులను పూడ్చుకుంటున్నారు. పల్లె పండగ పేరుతో ప్రతీ గ్రామంలో రోడ్లు వేశామని కూటమి నాయకులు ప్రసంగాలు చేస్తున్నప్పటికీ, జగనన్న కాలనీలపై వివక్ష చూపుతూ కనీసంగా రోడ్లు కూడా వేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. – టెక్కలి -
రైల్వేగేట్ విరిగి మహిళకు గాయాలు
ఇచ్ఛాపురం టౌన్: ఇచ్ఛాపురం నుంచి రత్తకన్న వైపు వెళ్లే రోడ్డుమార్గంలో ఉన్న రైల్వేగేటు విరగడంతో ఆ మార్గం గుండా వెళ్తున్న మహిళ తలకు తీవ్రగాయాలయ్యాయి. బుధవారం రాత్రి రత్తకన్న వైపు నుంచి ఇచ్ఛాపురం వైపు టెంట్ సామాగ్రితో వ్యాన్ వస్తుండగా అప్పటికే ట్రైన్ వస్తుందని గేటు వేసి ఉంది. ట్రైన్ వెళ్లిపోయాక గేటు పైకి ఎత్తే సమయంలో కింది నుంచి వెళ్తున్న వ్యాన్పై గేటు విరిగి పడింది. అదే సమయంలో పక్కనుంచి వెళ్తున్న ఒడిశాలోని దేవులమద్రికి చెందిన మహిళ తలపై గేటుపడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మహిళను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. గేటు కోసం రైల్వే అధికారులు కొంత సమయం తాత్కాలిక ఏర్పాట్లు చేసి అనంతరం గేటు మరమ్మతులు చేపట్టారు. గేటు మరమ్మతుల సమయంలో ఈ మార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆగస్టు 2న ఉపాధ్యాయుల ధర్నా శ్రీకాకుళం న్యూకాలనీ: విద్యారంగంలో ఎదురవుతున్న సమస్యలతోపాటు, ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 2వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) శ్రీకాకుళం జిల్లా చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి, జనరల్ సెక్రటరీ పడాల ప్రతాప్ కోరారు. నగరంలోని ఎన్జీవో హోమ్లో బుధవారం సాయంత్రం జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయులపై బలవంతంగా పీ–4 కార్యక్రమాన్ని రుద్దుతూ నిర్బంధం చేయడం సరికాదన్నారు. నూతనంగా అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు తక్షణమే జీతాలు చెల్లించాలన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని, 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ను ప్రకటించాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విన్నవించారు. మజ్జి మదన్మోహన్, గురుగుబెల్లి రమణ, పూజారి హరిప్రసన్న తదితరులు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలన్నారు. జీవో నంబరు 57ను అమలు చేసి 2004 సెప్టెంబర్ 1వ తేదీకి ముందు ఉద్యోగంలో చేరిన వారందరికీ పాత పెన్షన్ పథకం అమలు, తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల అన్నింటిపై ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీలోగా స్పందించకుంటే ఆందోళనబాట పడతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 2వ తేదీన కలక్టరేట్ల వద్ద ధర్నా అనేది కేవలం ఆరంభం మాత్రమేనని.. ప్రభుత్వం దిగిరాకుంటే ఉద్యమబాట తప్పదని హెచ్చరించారు. ఫ్యాప్టో ప్రతినిధులు వి.సత్యనారాయణ, ఎ.రామారావు, బి.నవీన్, ఎస్.రమేష్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర పథకాల అమలుపై సంతృప్తి
● ముగిసిన జాతీయ స్థాయి బృందం పర్యటన ● గ్రామీణాభివృద్ధి పనుల మెరుగుదలకు సూచనలు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పథకాల అమలును పరిశీలించిన జాతీయ స్థాయి బృందం, తమ పది రోజుల పర్యటన అనంతరం బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వారు జిల్లాలో పథకాల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కొన్ని లోపాలను గుర్తించి వాటిని సరిదిద్ది మరింత సమర్దవంతంగా అమలు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. గ్రామీణ పేదలందరికీ పథకాల ప్రయోజనాలు అందాలనేదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేంద్ర బృంద సభ్యులు సునీల్ బంటా, నతూ సింగ్ మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన పర్యటనపై తాము సంతృప్తిగా ఉన్నామన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు పథకాల ద్వారా అందుతున్న లబ్ధిని అభినందించారు. విస్తృతంగా పర్యటన జూలై 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కేంద్ర బృందం జిల్లాలోని వివిధ మండలాల్లో విస్తృతంగా పర్యటించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమగ్ర పర్యవేక్షణ చేపట్టింది. దీనిలో భాగంగా సంతబొమ్మాళి మండలంలోని బోరుభద్ర, ఉమ్మిలాడ, తాళ్లవలస గ్రామాల్లో, కొత్తూరు మండలంలోని కొత్తూరు, నివగాం నేరడి గ్రామాల్లో, శ్రీకాకుళం మండలంలోని రాగోలు, శిలగాం–సింగువలస పంచాయతీల్లో పర్యటించారు. ఈ గ్రామాల్లో స్వయం సహాయ సంఘాల పనితీరు, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అమలు, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణాలు, గ్రామీణ రహదారుల పథకం (పీఎంజీఎస్వై) ద్వారా రోడ్ల నిర్మాణం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన (డీడీయూ–జీకేవై), ఆర్సెట్ఐ వంటి పథకాల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలతో నేరుగా మాట్లాడి పథకాల ప్రయోజనాల గురించి ఆరా తీశారు. సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు కిరణ్ కుమార్, డ్వామా ప్రాజెక్టు అధికారి సుధాకర్, జాబ్స్ మేనేజర్ రమణ తదితరులు పాల్గొన్నారు. -
మృతదేహాలకు భద్రతేదీ..!
మౌలిక సదుపాయాలు లేని మార్చురీ విభాగం వైద్యం దయనీయం మంత్రి అచ్చెన్నాయుడి సొంత నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్యం దయనీయంగా మారిందని చెప్ప డానికి మార్చురీ విభాగం దుస్థితి ఒక నిదర్శనం. కొన్ని నెలల క్రితం కొత్త ఆస్పత్రి వద్ద మార్చురీ భవనం పనులు ప్రారంభించినప్పటికీ అవి నత్తనడకన సాగుతున్నా యి. దీంతో పాత ఆస్పత్రి వద్ద మార్చురీ విభాగంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని చోట మృతదేహాలను భద్రపరుస్తున్నారు. ఇటువంటి పరిస్థితి లేకుండా అధికార యంత్రాంగం స్పందించాలి. – సత్తారు సత్యం, వైఎస్సార్సీపీ నాయకుడు, టెక్కలి టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పాత భవనం వద్ద మార్చురీ విభాగం పూర్తిగా దీనావస్థకు చేరుకుంది. కొత్త ఆస్పత్రిలో మార్చురీ విభాగం పనులు పూర్తి కాకపోవడంతో, పాత ఆస్పత్రికి ఆనుకుని మార్చురీ విభాగం కొనసాగుతోంది. అయితే ఇక్కడ విద్యుత్, ఫ్రీజర్ సదు పాయం, కనీసం సెక్యూరిటీ సిబ్బంది కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఒక్కోసారి చీకటిపడిన తర్వాత మార్చురీలో భద్రపరిచిన మృతదేహాలకు కనీసం భద్రత లేని దుస్థితి చోటు చేసుకుంటోంది. దీనిపై పలు సందర్భాల్లో మృతుల బంధువులు ఆస్పత్రి సిబ్బంది బహిరంగంగానే ఆందోళన చేసినప్పటికీ పరిస్థితి మాత్రం చక్కబడడం లేదు. మార్చురీ వద్ద ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కొన్ని సందర్భాల్లో మృతుల బంధువులే కాపలా కాసుకునే దుస్థితి దాపురిస్తోంది. నత్తనడకన పనులు ఇదిలా ఉండగా కొత్త ఆస్పత్రిలో మార్చురీ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అంతే కాకుండా ఆస్పత్రికి వెనుక వైపు మార్చురీ నిర్మాణం చేయాలని సూచనలు ఉన్నప్పటికీ, అవేమీ పట్టించుకోకుండా పాత గేటు మార్గంలో ఓపీకి ఎదురుగా మార్చురీ భవనం నిర్మాణం చేస్తుండడంతో అనేక విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన మార్చురీ విభాగంలో ఎటువంటి మౌలిక సదుపాయలు లేక దీనావస్థలో ఉండడం, మరోవైపు కొత్త ఆస్పత్రి వద్ద మార్చురీ భవన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతుండడంతో మృతదేహాల భద్రతపై నిర్లక్ష్యం కనిపిస్తోంది. పనులు పూర్తయితే తరలిస్తాం కొత్త ఆస్పత్రిలో ఆగస్టు నెలాఖరులోగా మార్చురీ భవనం పనులు పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. ఆ భవ న నిర్మాణం పనులు పూర్తయితే మార్చురీని తరలిస్తాం. – సూర్యారావు, ఆస్పత్రి సూపరింటెండెంట్, టెక్కలి -
●తల్లికి వందనం పథకం వర్తించక అర్హుల అవస్థలు ●కొర్రీలు, ఆంక్షలు, తప్పులతో లబ్ధిని కోల్పోయిన తల్లులు ●కూటమి ప్రభుత్వ తీరుపై మండిపాటు
శ్రీకాకుళం న్యూకాలనీ: తల్లికి వందనం పథకం అందక అనేక మంది తల్లులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తాము తప్పులు చేయకపోయినా అనర్హత పేరిట పథకానికి దూరంగా ఉంచడంపై మండిపడుతున్నారు. అసలు.. ఇచ్చే మనసు లేనప్పుడు పథకం ఎందుకు ప్రకటించాలని.. తమను ఎందుకు ఇంతలా మోసం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పాలకులకు తగిన సమయంలో బుద్ధి చెబుతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిల్లలు చనిపోయారని, తల్లి చనిపోయిందని, మీపేరిట కార్లు, మిల్లులు ఉన్నాయని, 70 విద్యుత్ మీటర్లు ఉన్నాయని, 10 ఎకరాల భూమి ఉందని, ఉచిత విద్యాహక్కు చట్టం ద్వారా చదువుతున్నారని.. ఇలా ఒకటేంటి ? లెక్కకు మించిన తప్పులు, దోషాలతో తల్లికి వందనం పథకం వర్తించక జిల్లా వ్యాప్తంగా బాధితులు నిరాశలో కూరుకుపోయారు. ఆందోళన వద్దు.. -
కాపుగోపాలపురంలో చైన్స్నాచింగ్
పాతపట్నం : చైన్స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్లే మహిళలే లక్ష్యంగా దాడులకు ఎగబడుతున్నారు. పాతపట్నం మండలం కాపు గోపాలపురంలో సోమవారం సాయంత్రం చైన్స్నాచింగ్ చోటుచేసుకుంది. పాతపట్నం మేజర్ పంచాయతీ కోటగుడి కాలనీకి చెందిన దంపతులు కాళ్ల జ్యోతి, నారాయణరావులు పశువులకు కుడితి పెట్టడానికి కాపుగోపాలపురంలోని నీలకంఠేశ్వర ఆలయం సమీపంలోని పశువులశాల వద్దకు బైక్పై వెళ్లారు. భార్యని దించేసి నారాయణరావు కాపుగోపాలపురం వచ్చేశారు. జ్యోతి పశువుల శాల వైపు కుడితి పెట్టడానికి బకెట్తో వెళుతుండగా వెనుక నుంచి బైక్పై ఇద్దరు దొంగలు వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. జ్యోతి కేకలు వేసేసరికే పర్లాకిమిడి వైపు పారిపోయారు. రెండు తులాల బంగారు పుస్తెలతాడు చోరీ జరిగిందని బాధితురాలు వాపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ బి.లావణ్య తెలిపారు. -
రాష్ట్రస్థాయి పోటీల్లో దరహాస్ ప్రతిభ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన స్విమ్మింగ్ క్రీడాకారుడు వేమకోటి ధనుష్య విజయవాడ కేంద్రంగా ఈ నెల 26, 27 తేదీల్లో జరిగిన ఏపీ రాష్ట్రస్థాయి మోడర్న్ పెంటాథ్లెన్ పోటీల్లో సత్తాచాటాడు. తేట్రాతలాన్ (స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్, రన్నింగ్) పోరులో 4వ స్థానంలో నిలవగా, రిలే (స్విమ్మింగ్, రన్నింగ్, షూటింగ్) విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి శభాష్ అనిపించాడు. తద్వారా బంగారు పతకం సాధించి సెప్టెంబర్లో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించాడు. దరహాస్ ఎంపిక పట్ల స్విమ్మింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హారికాప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఎ.ఝాన్సీ, అంతర్జాతీయ వెటరన్ స్విమ్మర్ ఎస్.కాంతారావు, డీఎస్డీఓ డాక్టర్ శ్రీధర్రావు, డీఎస్ఏ కోచ్ మురళీధర్, మోడర్న్ పెంటాథ్లెన్ జిల్లా కార్యదర్శి చక్రదర్, ఒలింపిక్, పీఈటీ సంఘ నాయకు హర్షం వ్యక్తంచేశారు. -
ఆదర్శ విప్లవకారుడు మాధవరావు
పలాస: పేద కటుంబంలో పుట్టి జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన ఆదర్శ విప్లవకారుడు గోరు మాధవరావు అని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పి.డి.ఎం) రాష్ట్ర నాయకుడు వై.వెంకటేశ్వరరావు చెప్పారు. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో మంగళవారం గోరు మాధవరావు, ఎన్.క్రాంతికుమార్ల సంస్మరణ సభ నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. పి.డి.ఎం.జిల్లా నాయకుడు సాలిన వీరాస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సభలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎ.ఐ.ఆర్.పి.ఎఫ్ ఆలిండియా అధ్యక్షుడిగా పనిచేసిన మాధవరావు అంతకుముందు శ్రీకాకుళం ఉద్యమంలో కూడా పాల్గొన్నారని, సుమారు 50 ఏళ్లు ప్రజల కోసం పనిచేసి జైలు జీవితం అనుభవించారని చెప్పారు. క్రాంతికుమార్ పి.డి.ఎం.లో పనిచేశారని, అతని త్యాగాలను వివరించారు. కార్యక్రమంలో అమరుల బంధుమిత్రుల కమిటీ రాష్ట్ర నాయకుడు జోగి కోదండరావు, పౌర హక్కుల సంఘం నాయకుడు స్వామినాథం, పి.కె.ఎస్ జిల్లా అధ్యక్షుడు ధర్మారావు, దాసరి శ్రీరాములు, తామాడ త్రిలోచనరావు, మురిపింటి గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
34 కిలోల గంజాయితో వ్యక్తి అరెస్టు
ఇచ్ఛాపురం టౌన్ : ఒడిశా నుంచి ముంబైకి 34.32 కిలోల గంజాయి తరలిస్తున్న సంతున్ దాసు అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సీఐ ఎం.చిన్నంనాయుడు తెలిపారు. పట్టణ ఎస్ఐ ముకుందరావు, పోలీసు సిబ్బంది మంగళవారం ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్, చిదంబరీశ్వర ఆలయ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశా రాష్ట్రం ఖరియాగూడా ప్రాంతానికి చెందిన సంతున్దాసు అనుమానాస్పదంగా కనిపించడంతో లగేజీని తనిఖీచేశారు. అందులో 34.32 కిలోల గంజాయి ఉండటంతో అదుపులోకి తీసుకొని విచారించారు. తన గ్రామంలోని రైతుల వద్ద గంజాయి కొని ముంబైలోని లొబొకుండ అనే వ్యక్తికి అందజేసేందుకు వెళ్తున్నట్లు గుర్తించారు. గంజాయితోపాటు ద్విచక్ర వాహనం, సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్టు సీఐ తెలిపారు. -
జె.ఆర్.పురంలో వ్యాన్ బీభత్సం
రణస్థలం: రణస్థలంలో జాతీయ రహదారిపై ఐషర్ వ్యాన్ బీభత్సం సృష్టించింది. విశాఖపట్నం వైపు నుంచి నరసన్నపేట వెళ్తున్న ఈ వ్యాన్ మంగళవారం సాయంత్రం దన్నానపేట వద్ద ద్విచక్ర వాహనంపై వస్తున్న ఈసర్ల రాంబాబు అనే వ్యక్తిని ఢీకొట్టింది. కొంతదూరం ముందుకొచ్చి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా అత్యంత రద్దీగా ఉండే రామతీర్థాలు కూడలి వద్ద మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వ్యాన్ ఆగకపోతే పెను ప్రమాదం జరిగేది. జె.ఆర్.పురం పోలీసులులు స్పందించి జేసీబీ సాయంతో వ్యాన్ను పక్కకు నెట్టారు. ఈ ఘటనలో లావేరు మండలం పైడియ్యవలసకు చెందిన ఈసర్ల రాంబాబుకు తీవ్ర గాయాలు కావడంతో రణస్థలం సామాజిక ఆసుపత్రిలో చేర్పించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ, రెండు బైకులను ఢీకొట్టిన వైనం డ్రైవర్కు దేహశుద్ధి చేసిన స్థానికులు -
దర్జాగా ప్రభుత్వ స్థలం కబ్జా
టెక్కలి: కోటబొమ్మాళి మండల కేంద్రంలో ప్రకాశ్నగర్ కాలనీలో ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ కార్యకర్తలు కొంత మంది దర్జాగా అక్రమ నిర్మా ణం చేస్తున్న విషయం అధికారులకు తెలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు నివ్వెరపోతున్నారు. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండటంతో కాలనీవాసులు స్పందించి సర్పంచ్ కాళ్ల సంజీవరావు సహకారంతో మంగళవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడ మే కాకుండా ఆందోళన చేపట్టారు. ప్రకాశ్నగర్ కాలనీలో కొంత మంది అధికార పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడమే కాకుండా ఆందోళన బాట పడతామంటూ హెచ్చరించారు. -
రైలు ఢీకొని యువకుడు మృతి
నరసన్నపేట : కామేశ్వరిపేట సమీపంలో రైల్వే ట్రాక్పై ఓ వ్యక్తి మృతదేహాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. మంగళవారం ఉదయం ఉర్లాం రైల్వేస్టేషన్ మాస్టర్ నుంచి సమాచారం రావడంతో ఘటనా స్థలానికి వెల్లి పరిశీలించగా మృతుడు శ్రీకాకుళం టౌన్ బలగ పరిధిలోని బుచ్చిపేటకు చెందిన జడుగుల చిట్టిబాబు(31)గా గుర్తించినట్లు హెచ్సీ మదుసూదనరావు తెలిపారు. ప్రమాద కారణాలు తెలియాల్సి ఉందన్నారు. సోమవారం సాయంత్రం రైలు ఢీకొని మృతి చెంది ఉంటాడని తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
ఫార్మా, హెల్త్కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం రూరల్: ఒడిశాకు చెందిన విద్యార్థులకు ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు శ్రీకాకుళం బొల్లినేని మెడ్స్కిల్స్తో మంగళవారం ఎంవోయూ కుదుర్చుకున్నామని గజపతి జిల్లా డీఎస్డీఈవో సౌభాగ్య స్మృతిరంజన్ త్రిపాఠి తెలిపారు. ఎన్యూవీ ఒడిశా శిబిరంలో భాగంగా 240 మంది విద్యార్థులకు ప్రభుత్వ సహకారంతో శిక్షణ అందించనున్నామని పేర్కొన్నారు. ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు పేషెంట్ రిలేషన్ అసోసియేట్, ఎస్ఎస్సీ, ప్లస్ టూ, ప్లస్ త్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు అసోసియేట్ స్టోర్ ఫార్మా కోర్సులో శిక్షణ ఇస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతో పాటు ఉచిత భోజన వసతి సదుపాయం, యూనిఫామ్ స్టడీ మెటీరియల్ అందిస్తామన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు 7331118019, 7680945357, 7995013422 నంబర్లను గానీ, శ్రీకాకుళం రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో గానీ సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బొల్లినేని మెడ్స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు, గజపతి జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. -
ట్రాక్కు మరమ్మతులు.. నిలిచిన వాహనాలు
ఇచ్ఛాపురం రూరల్: కేదారిపురం–పురుషోత్తపురం మధ్య ఎల్సీ గేట్ను రైల్వే అధికారులు మంగళవారం సాయంత్రం 3 నుంచి రాత్రి 8 గంటల వరకు మూసివేశారు. ట్రాక్ మరమ్మతుల సమాచారాన్ని వాహనదారులకు ముందుగానే అధికారులు తెలియజేశారు. దీంతో కేదారిపురం, ముచ్ఛింద్ర, బెన్నుగానిపేటకు చెందిన విద్యార్థులను రెండో పూటే ఇళ్లకు పంపించేశారు. మిగిలిన వాహనాలు బెన్నుగానిపేట మీదుగా ఇచ్ఛాపురం చేరుకున్నాయి పూడిలంక వంతెన పనులు పూర్తిచేస్తాం వజ్రపుకొత్తూరు: పూడిలంక వంతెన పనులు స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రూ.4 కోట్లతో నిర్మించనున్న పూడిలంక వంతెన నిర్మాణ పనులకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంచినీళ్లపేట జెట్టీ నిర్వహణకు కేంద్ర మంత్రితో మాట్లాడి నిధులు మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ పూడిలంక వంతెన పనులు పూర్తి చేసి పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తిమ్మల కృష్ణారావు, పీఏసీఎస్ అధ్యక్షుడు కణితి సురేష్, రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి.ఈశ్వరరావు, సైని భాస్కరరావు, టి.గణపతి, రంగారావు, హేమారావు తదితరులు పాల్గొన్నారు. ‘గోవిందరాజులు వ్యాఖ్యలు అర్ధరహితం’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కళింగ వైశ్య రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ వైఎస్సార్సీపీపై బోయిన గోవింద రాజులు చేసిన వ్యాఖ్యలు అర్ధ రహితమని, ఇదే సంఘంలో వైఎస్సార్సీపీ ప్రతినిధులుగా ఉన్న తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని రాష్ట్ర వైఎస్సార్ సీపీ కళింగ వైశ్య బీసీ అనుబంధ సాధికార కమిటీ అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, జిల్లా వైఎస్సార్సీపీ కోశాధికారి తంగుడు నాగేశ్వరరావు, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కోరాడ చంద్రభూషణగుప్త, వైఎస్సార్సీపీ నాయకులు తంగుడు జోగారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కొందరికి పదవులు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ ఏ రాజకీయ పార్టీ ఇలాంటి అవకాశాలు కల్పించలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 1999లో ఎన్డీఏ ప్రభుత్వంతో సీట్లు సర్దుబాటు చేసుకొని మిత్రపక్షంగా ఉంటూ విజయం సాధించిన తర్వాత టీడీపీ కేంద్ర క్యాబినెట్లో చేరకపోవడానికి కారణాలను మీ పార్టీ పెద్దలను అడిగి తెలుసుకొని సమాజానికి తెలియజేయాలని కోరారు. బీసీలను బ్యాక్బోన్గా గుర్తించిన ఏకై క పార్టీ వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి కళింగవైశ్యుల కార్పోరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్, 10 కుల కార్పొరేషన్ డైరక్టర్లను, నాలుగు బిజినెస్ కార్పొరేషన్ డైరక్టర్లను, బీసీ కళింగ వైశ్య మహిళకు శ్రీకాకుళం సుడా చైర్మన్ ఇచ్చి కళింగ వైశ్యులను గుర్తించారన్నారు. కూటమి పాలన 14 నెలల్లో పలాసలోని ఒక్క ఏఎంసీ పదవి తప్ప గతంలో ఉన్న మల్లా శ్రీనివాసరావుని కూడా తిరిగి నియమించలేదన్నారు. టి.డి.వలసలో జ్వరాలపై సర్వే జి.సిగడాం: టంకాల దుగ్గివలస గ్రామంలో జ్వరాలపై వైద్యసిబ్బంది మంగళవారం ఇంటింటా సర్వే చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జ్వరపీడితుల వివరాలను ఉన్నతాధికారులకు అందిస్తామని ఎంపీడీఓ జి.రామకృష్ణారావు, వైద్యాధికారి బి.యశ్వంత్కుమార్ తెలిపారు. ఇప్పటికే గ్రామంలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశామని, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపడుతున్నామని చెప్పారు. -
ఇసుక ర్యాంపు తాత్కాలికంగా నిలుపుదల
కొత్తూరు: కొత్తూరు మండలంలోని బలద రెవెన్యూ గ్రామం పరిధిలోని వంశధార నదిలో వసప గ్రామం సమీపంలో నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపును తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్థానిక తహసీల్దార్ కె.బాలకృష్ణ తెలిపారు. ఇసుక ర్యాంపు నుంచి వసప గ్రామానికి చెందిన రైతుల పంట పొలాల దారి మీదుగా ఇసుక టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండడంతో రైతులు నిరసన తెలిపి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అలాగే వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇసుక ర్యాంపులో అక్రమ తవ్వకాలను ఈ నెల 27 తేదీన పరిశీలించారు. దీనిపై తహసీల్దార్ బాలకృష్ణ మంగళవారం ఇసుక ర్యాంపును, పంట పొలాల మధ్య నుంచి ఇసుక వాహనాలు వెళ్తున్న దారిని పరిశీలించారు. రోడ్డు ఇరుకై పోయి పొలం పనులకు వెళ్లలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు సమస్యతో పాటు ఇసుక తవ్వకాలపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని, వారం రోజుల పాటు ర్యాంపును తాత్కాలికంగా నిలుపుతున్నట్లు తహసీల్దార్ తెలిపారు. -
ఎరువుల కృత్రిమ కొరత తగదు
ఆమదాలవలస : ఎరువులు కృత్రిమ కొరత సృష్టించి రైతులను మోసం చేయడం కూటమి ప్రభుత్వానికి తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు బస్తా యూరియా కోసం రోజూ గంటల తరబడి పనులు మానుకొని అధికారులు, ఆర్ఎస్కేల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు వస్తున్న ఎరువులు బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయని, టీడీపీ నాయకులు ఎరువులను తమ ఇళ్ల వద్ద దాచుకొని బయట అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి రైతుల కష్టాలు తీర్చాలని కోరారు. ఆమదాలవలస నియోజకవర్గంలో సాగు చేస్తున్న 53,000 ఎకరాల సాగుకు 2850 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రభుత్వం 1600 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసిందన్నారు. పొందూరు మండలంలో 4000 ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్క జొన్న పంటకు అదనంగా 600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమన్నారు. సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇవేవీ పట్టకుండా విహార యాత్రలు చేస్తూ సొంత ఆదాయాలు చూసుకుంటున్నారని మండిపడ్డారు. సమావేశంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దుంపల శ్యామలరావు, నాయకులు సాకేటి శ్రీనివాసరావు, అన్నపు కృష్ణ, ధనుజయరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏదో చెప్పుకోలేఖ..
● వీడ్కోలు సన్మానాలు వద్దు.. విరాళాలు ముద్దు అంటున్న డీఈవో ● ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు లేఖ శ్రీకాకుళం: జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. అయితే తన ఉద్యోగ విరమణ సందర్భంగా వీడ్కోలు సన్మానాలు చేయవద్దని, దీనికి బదులుగా తాను సంఘ సేవ కోసం నెలకొల్పిన పుష్పాంజలి అనే ట్రస్టుకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఆయన ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఈ ఏడాది మార్చిలో 10వ తరగతి పరీక్షల సందర్భంగా కుప్పిలిలో జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతోపాటు ఉపాధ్యాయ రంగం అంతా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన ఇలాంటి లేఖ రాయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 11,000 మంది ఉద్యోగులు ఉన్న కుటుంబం లాంటి విద్యా శాఖలో ప్రతి ఒక్కరూ 10 చొప్పున విరాళం ఇచ్చినా సంఘసేవను తక్షణం ప్రారంభించే వీలు ఉంటుందని లేఖలో తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసమే ట్రస్టును ఏర్పాటు చేసినట్లు చెబుతూ తొలిగా తాను రూ.లక్ష జమ చేస్తున్నానని, ప్రతి నెల రూ.5000 చొప్పున జమ చేస్తానని తెలిపారు. లేఖపై తీవ్ర చర్చ ఉద్యోగ విరమణ సందర్భంలో విద్యాశాఖతో పాటు ఇతర ఏ శాఖల అధికారులూ ఇలాంటి లేఖ రాసిన సందర్భాలు లేవు. తిరుమల చైతన్య రాసిన లేఖపై పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కుప్పిలిలో జరిగిన సంఘటన తర్వాత ఉపాధ్యాయ వర్గంలోని 98 శాతం మంది వ్యతిరేకులయ్యారు. విద్యాశాఖ అధికారి పదవీ విరమణ చేసిన సందర్భంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు సన్మానాలు, సత్కారాలు చేయడం పరిపాటి. విద్యాశాఖ కూడా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీడ్కోలు సభను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఉపాధ్యాయ సంఘాలు సత్కారాలు చేయడానికి సుముఖత చూపించడం లేదు. ఈ విషయం గ్రహించిన తిరుమల చైతన్య ముందుగా తానే సత్కారాలు వద్దనేస్తే బాధ పోతుందని ఈ లేఖ రాశారని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. సంఘ సేవ పేరుతో విద్యా శాఖను వదలకుండా అంటిపెట్టుకొని పెత్తనం చెలాయించవచ్చని భావిస్తూ ట్రస్టును నెలకొల్పారు అన్న వాదనను మరో వర్గం వినిపిస్తోంది. ట్రస్టును రిజిస్టర్ చేసిన సందర్భంలో దానికి పాన్ కార్డును అనుసంధానం చేయడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్లో తనకు ఉన్న పరిచయాలతో ఇన్కమ్ టాక్స్ రాయితీని ట్రస్టుకు తెచ్చుకొని ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి సంవత్సరం చివరిలో చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్కు బదులుగా ఆ మొత్తాన్ని ట్రస్టుకు జమ చేయాలని అడగవచ్చునన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఉద్యోగ విరమణ సందర్భంలో ఓ లేఖను విడుదల చేసి డీఈవో జిల్లాలో ఓ కొత్త చర్చను లేవనెత్తారు. -
పీ–4 పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్
నరసన్నపేట: సర్కారు టీచర్ల నెత్తిన ప్రభుత్వం నిత్యం కొత్త భారాలు వేస్తోంది. ఇప్పటికే పలు యాప్ల నిర్వహణలతో టీచర్లపై విపరీతమైన భారం ఉంది. దీనికి అదనంగా ప్రభుత్వం పీ–4 బాధ్యతలను కూడా ఉపాధ్యాయులకు అప్పగించింది. ప్రతి ఉపాధ్యాయుడు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని, ఆ కుటుంబాలను బంగారు కుటుంబాల పేరుతో వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రధాన ఉపాధ్యాయు లు కనీసం ఐదు కుటుంబాలను, ఉపాధ్యాయులు కనీసం రెండు కుటుంబాలను దత్తత తీసుకొని రిజిస్టర్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంపై ఉపాధ్యాయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తరగతులపై ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు విద్యాబుద్ధులు నే ర్పించాల్సిన ఉపాధ్యాయులు బోధనేతర విధులతో ఇప్పటికే సతమతమవుతున్నారు. విద్యా సంవత్స రం ప్రారంభమైనప్పటి నుంచి యోగాంధ్ర, పేరెంట్ మీటింగ్స్, యాప్లు, శిక్షణ, ఫొటోల అప్లోడ్ వంటి పనులు అప్పగించడంతో వీరంతా విసుగు చెందుతున్నారు. దీని ప్రభావం తరగతుల నిర్వహణపై పడుతోంది. బోధన సమయం తగ్గిపోయి మొక్కుబడిగా పాఠాలు చెప్పే పరిస్థితి స్కూల్స్లో నెలకొంది. దీనిపై ఒక వైపు ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టోగా ఏర్పడి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే.. తాజాగా ప్రభుత్వం పీ–4 పిడుగును వారి నెత్తిన వేసింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై నిరసన రాగం వినిపిస్తున్నాయి. మధ్య తరగతి శ్రేణిలో ఉన్న ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేరే కుటుంబాలను దత్తత తీసుకొని ఆర్థిక సాయం చేసే పరిస్థితి ఉండదనే నిజాన్ని ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలని టీచర్ల సంఘ నాయకులు చెబుతున్నారు. యాప్లో 70 రకాలకు పైగా ఉన్న టైల్స్ రద్దు చేసి బోధనా స్వేచ్ఛ కల్పించి, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మరింత దగ్గర చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు పీ–4 దత్తత బాధ్యతల అప్పగింత విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ హెచ్ఎం, టీచర్లకు ఆదేశాలు ఇప్పటికే పలు యాప్లతో పెరిగిన పని భారం మానసిక క్షోభకు గురి చేయవద్దంటున్న ఉపాధ్యాయులు ఒత్తిడి చేయడం సరికాదు పీ–4పై ఉపాధ్యాయ వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి. ఇప్పటికే హెచ్ఎంలు, ఉపాధ్యాయులపై అనేక రకాలుగా బోధనేతర బాధ్య తలు పెంచుతున్నారు. వీటితోనే సతమతమవుతుంటే మళ్లీ పీ–4 పేరున అదనపు భారం పెట్ట డం సరికాదు. –బమ్మిడి శ్రీరామ్మూర్తి, ఫ్యాఫ్టో చైర్మన్, శ్రీకాకుళం టీచర్లపై రుద్దడం అన్యాయం పీ–4 కార్యక్రమం పేరిట ఉపాధ్యాయులు కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెబుతున్నారు. ఇది అన్యాయం. టీచర్లను బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. ఉపాధ్యాయ వర్గాలు కూడా మధ్య తరగతి శ్రేణులకు చెందిన కుటుంబాలే అనే విషయాన్ని ప్రభుత్వం గమనించాలి. – తమ్మినాన చందనరావు, ఏపీఎస్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి విద్యార్థుల కుటుంబాలను దత్తత తీసుకోవాలని, వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి చేయడం బాధాకరం. బోధనేతర కార్యక్రమాలతో ఇప్పటికే పాఠాలను సక్రమంగా బోధించలేక ఒత్తిడికి గురి అవుతున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. – బి.కేశవరావు, మండల శాఖ అధ్యక్షుడు ఏపీటీఎఫ్ (1938), నరసన్నపేట శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు కూటమి ప్రభుత్వం పీ–4 విధానం ప్రవేశపెట్టిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు 75,566 బంగారు కుటుంబాలను, 5171 మార్గదర్శకులను గుర్తించామని, ఇందులో 24 వేల కుటుంబాలను దత్తత తీసుకోవడానికి దాతలు ముందుకు వచ్చారని, వారికి అనుసంధానం చేసినట్లు చెప్పారు. ప్రణాళిక విభాగం సారథ్యంలో గ్రామ, వార్డు సచివాల య సిబ్బంది సర్వే చేసి నిరుపేద కుటుంబాలను గుర్తించారని, ఆగస్ట్ 15వ తేదీ లోపు జిల్లా లో ఇంత వరకు గుర్తించిన 75 వేల కుటుంబాలను దత్తత తీసుకొనే కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్త ద్విచక్ర వాహనం ధ్వంసం
● వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడికి ప్రయత్నించిన టీడీపీ నాయకుడు ● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు టెక్కలి: మండలంలోని అయోధ్యపురం గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త దుంపల ఈశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన సర్పంచ్ భర్త టీడీపీ నాయకుడు బగాది హరి మంగళవారం ఇనుప రాడ్డుతో దాడికి ప్రయత్నించాడు. వైఎస్సార్సీపీ కార్యకర్త తప్పించుకుని తన ఇంటిలోకి వెళ్లిపోవడంతో బయ ట ఉన్న ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశాడు. ఈ మేరకు బాధితుడు ఈశ్వరరావు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు హెచ్.వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు తమ్మన్నగారి కిరణ్, వైస్ ఎంపీపీ పి.రమేష్, జిల్లా నాయకుడు సత్తారు సత్యంతో పాటు మరి కొంత మంది మండల నాయకుల సహకారంతో మంగళవారం టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఇంటి వద్ద నిలుచుని ఉండగా టీడీపీ నాయకుడు బగాది హరి ఇనుప రాడ్డు పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నించాడని, ఆ దాడి నుంచి తప్పించుకుని ఇంట్లో తలదాచుకున్నానని, దీంతో ఇంటి బయట ఉన్న తన ద్విచక్రవాహనాన్ని రాడ్డుతో ధ్వంసం చేశాడని బాధితుడు ఈశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బగాది హరి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అనంతరం వైఎస్సార్సీపీ నాయకు లు మాట్లాడుతూ దాడికి పాల్పడిన బగాది హరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. ఫిర్యాదు అందజేసిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు కె.అజయ్, వి.శ్రీధర్రెడ్డి, వి.తవిటయ్య, బి.రాజేష్, బి.కార్తీక్, మోదుగువలస గణపతిరావు, ఎం.రమేష్, ఎం.కృష్ణ ఉన్నారు. -
ప్రభుత్వ భూమి కాజేసే కుట్ర
హిరమండలం: ఎల్ఎన్పేట మండలం మల్లికార్జునపురం రెవెన్యూ పరిధిలో ఓ ఘరానా మో సం వెలుగు చూసింది. 2.80 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు తీవ్రమైన ప్రయత్నాలు జరగడంతో స్థానికులు కలెక్టరేట్ను ఆశ్రయించారు. మల్లికార్జునపురం రెవెన్యూ పరిధిలోని అటవీ భూములు ఉన్నాయి. అయితే అందులో సర్వే నంబర్ 17/3ఏ పరిధిలో 2 ఎకరాల 10 సెంట్లు, 161/3ఏలో 70 సెంట్లు భూమిని కోట సూర్యనారాయణ అనే వ్యక్తికి ప్రభుత్వం డీ పట్టా కింద మంజూరు చేసిందని చూపిస్తూ.. రూ.2కోట్లకుపైగా విలువైన ఈ భూమిని కాజే సే ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామస్తు లు చెబుతున్నారు. అయితే గత కొద్దిరోజులుగా దీనిపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టెక్కలి ఆర్డీఓ మండల రెవెన్యూ అఽధికారులను పరిశీలించి నివేదిక అందించాలని ఆదేశించారు. తాజాగా ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు కోట సూర్యనారాయణ కుమారుడు శ్రీనివాసరావు అనే హోంగార్డ్ ప్రయత్నించాడు. దీంతో గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్లో ఫిర్యాదుచేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో బొర్రంపేట సచివాలయంలో పనిచేస్తున్న వీఆర్ఏ సైలాడ దుర్గారావు సూత్రధారి అని ఆరోపిస్తున్నారు. హోంగార్డుగా పనిచేస్తున్న కోట శ్రీనివాసరావుతో కలిసి ఈ అటవీ భూమి పై కన్నేసినట్టు తెలుస్తోంది. దాదాపు దశాబ్దం కిందటే చనిపోయిన సూర్యనారాయణ పేరు మీద ఈ భూమి ఉందని చూపిస్తూ కొట్టేసే వి ధంగా ఇద్దరూ ప్లాన్ చేసుకున్నట్టు గ్రామస్తులు చెబుతున్నారు. అప్పటి ఉమ్మడి సరుబుజ్జిలి మండలం డీపట్టా రిజిస్టర్లో ఫోర్జరీ చేసి పేర్లు తారుమారు చేసి రూ.2 కోట్ల విలువైన ఆస్తిని కాజేసే కుట్ర జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని మల్లికార్జునపురం, బొర్రంపేట గ్రామస్తులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం.. మల్లికార్జునపురం భూములకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో ఉన్నతాధికారుల సలహాలు, సూచనలు తీసుకుంటాం. ప్రభుత్వ భూమిని ఆక్రమించడం నేరం. దీనిపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. – జె.ఈశ్వరమ్మ తహసీల్దారు, ఎల్ఎన్పేట నకిలీ పత్రాలతో స్వాధీనానికి ప్రయత్నం కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిన మల్లికార్జునపురం గ్రామస్తులు -
ఎచ్చెర్ల ఎంపీపీ చిరంజీవి అరెస్టు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఎచ్చెర్ల మండలానికి చెందిన ఎంపీపీ మొదలవలస చిరంజీవిని ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం వేకువఝామున ఫరీదుపేటలోని ఆయన స్వ గృహానికి జిల్లా పోలీసుల సహకారంతో ఒడిశా పోలీసులు చేరుకుని వారెంటు చూపించి అరెస్టు చేసినట్లు జేఆర్ పురం సీఐ అవతారం పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. 1999లో ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దమన్జోడి పోలీస్ స్టేషన్ పరిధిలో నాల్కో కంపెనీ తరఫున కాంట్రాక్ట్ పనులు చేయించారని, వ్యాపార లావాదేవీల్లో అక్కడ గొడవ రావడంతో చిరంజీవిపై కేసు నమోదైందన్నారు. చిరంజీవిని రిమాండ్కు తరలించారని పేర్కొన్నారు. ‘కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన రహదారు లు, భవనాల శాఖ అధికారులు, కాంట్రాక్టర్తో కలసి ఆయన నూతన కలెక్టరేట్ భవనాన్ని, అక్కడ జరుగుతున్న రోడ్డు పనులను పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యతపై ఎక్కడా రాజీ పడకూడదన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ సత్యనారాయణ, ఈఈ తిరుపతిరావు, కాంట్రాక్టర్ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ పాతపట్నం: మండలంలోని కాగువాడ గ్రామంలోని ఓ కల్యాణ మండపంలో టాస్క్ఫోర్స్ పోలీసులు జూద శిబిరంపై ఆదివారం రాత్రి దాడి చేసి ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్ఐ జి.సింహాచలం తెలిపారు. ఏఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం.. ఇక్కడ కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్లు పక్కా సమాచారం టాస్క్ ఫోర్స్కు పోలీసులకు సమాచారం అందడంతో శిబిరంపై దాడి చేసి ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, పాతపట్నం పోలీస్స్టేషన్కు అప్పగించారని, వారి వద్ద నుంచి రూ.1,12,030 నగదు, ఆరు ద్విచక్రవాహనాలు, ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. పోస్టాఫీస్ వద్ద ఖాతాదారుల ఆందోళన ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం సబ్పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులంతా సోమవారం ఆందోళన చేపట్టారు. సబ్పోస్టాఫీస్లో గడిచిన డిసెంబర్ నెలలో 33 ఖాతాలు ఆన్లైన్ మోసాల బారిన పడి సుమారు రూ.2కోట్ల86లక్షలు మాయమైనట్లు.. ఈ నెల 25వ తేదీన కొంతమంది ఖా తాదారులకు పోస్టల్ అధికారులు తెలిపారు. దీంతో ఆ రోజు నుంచి సోమవారం వరకు పోస్టాఫీస్లో గల ఖాతాల పై దర్యాప్తుని పోస్ట ల్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, కమల్హాసన్ చేపడుతున్నారు. ఇప్పటి వరకు కేవలం కిసాన్వికాస్పత్ర్ ఫిక్స్డ్ డిపాజిట్లలో మాత్రమే ఈ స్కామ్ జరిగినట్లు భావిస్తుండగా.. ప్రస్తుతం మిగిలిన ఖాతాలకు కూడా ఇదేవిధంగా జరిగిందని కొంతమంది ఖాతాదారులు పోస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఖాతాదారులు సోమ వారం పోస్టాఫీస్ వద్ద ఆందోళనకు దిగారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఒకటి, రెండు రోజుల్లో పో స్టల్ సూపరింటెండెంట్ వచ్చి ఖాతాదారులతో చర్చిస్తారని పోస్టల్ ఇన్స్పెక్టర్లు అన్నారు. -
పెద్దల కన్ను
పేదల భూములపై కవిటి: పారిశ్రామిక అభివృద్ధి పేరుతో పేదలకు ఇచ్చిన భూములను పెద్దలకు కట్టబెట్టే విష ప్రయ త్నం జరుగుతోంది. 270 మందికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరు చేసిన డీ పట్టా భూము లను స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కాజేసే కుట్ర జరుగుతోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కవిటి మండలం రాజపురంలో సుమారు 270 మందికి పైగా ఎస్సీ, బీసీ కులాలకు చెందిన పేదలకు ఇచ్చిన డీపట్టా భూముల్లో.. స్థల సమీకరణ అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వస్తున్న వార్తలు ఆ స్థలాల లబ్ధిదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వారి సాగు హక్కులో ఉన్న ఈ పట్టా భూ ముల స్థల పరిశీలనకు తాజాగా అమెరికాకు చెందిన ఓ ప్రతినిధి బృందం రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి బృందంలో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ బంధువు కూడా ఉండడం విశేషం. తమకు దఖలు పడిన ఈ కొండ పోరంబోకు భూముల్ని రెక్కలు ముక్కలు చేసి జీడి మామి డి, పనస తోటలుగా రైతులు అభివృద్ధి చేశారు. ఇవే భూములకు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో పట్టాలు కూడా తాము పొందినట్టు లబ్ధిదారులు చెబుతున్నారు. సర్వే నంబర్ 358లో 10.19 ఎకరాలు, 359లో 7.32 ఎకరాలు, 234లో 4.28 ఎకరాలు, 360లో 5.61 ఎకరాలు, సర్వే నంబర్ 199లో 17.16 ఎకరాలు, 218–4లో 12.01 ఎకరాలు, 275లో 6.49 ఎకరాలు, 279లో 4.54 ఎకరాలు, సర్వే నంబర్ 357లో 5.49 ఎకరాల భూముల్ని ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే బృందం కొలతలు వేసి వివరాల్ని యుద్ధప్రాతిపదికన సిద్ధం చేసింది. ఈ భూముల్లో ఒక్కో రైతుకు అర ఎకరానికి అటు ఇటు గా 270 మంది రైతులు డీ పట్టాలు పొందినట్టు లబ్ధిదారులు చెబుతున్నారు. ఆనాటి నుంచి ఎన్నో వ్యయప్రయాసలతో సాగు చేసిన భూమి వెనక్కి లాక్కుంటే చూస్తూ ఊరుకునేది లేదు బాధిత రైతు లు అంటున్నారు. ముందస్తు సమాచారం తెలప కుండానే రెవెన్యూ అధికారులు గోప్యంగా సర్వేలు నిర్వహించడం పై రైతులు గగ్గోలు పెడుతున్నారు. వైఎస్సార్ హయాంలో మంజూరు చేసిన భూములను లాక్కునే కుట్ర ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బంధువులతో కూడిన అమెరికన్ బృందం పరిశీలనతో లబోదిబోమంటున్న లబ్ధిదారులు -
ఇసుక అక్రమ రవాణాపై రైతుల కన్నెర్ర
కొత్తూరు: కొత్తూరు మండలంలోని బలద ఇసుక ర్యాంపు పేరుతో వసప గ్రామం సమీపంలో వంశధార నది వద్ద నిర్వహిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలపై రైతులు సోమవారం కన్నెర్ర చేశారు. భారీ వాహనాలు తమ పొలాల దారి మీదుగా వెళ్తుండడంతో నిత్యం భయపడుతున్నామని తెలిపారు. ఇసుక టిప్పర్లు వెళ్లకుండా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేశారు. ఇసుక వాహనాల రాకపోకల వల్ల తాము కనీసం బైక్పై ఎరువులు కూడా తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ సంఘీభావం తెలపడం విశేషం. బలద రెవెన్యూ పరిధిలో ఉన్న ఇసుక ర్యాంపు నిర్వహించాలని ప్రభు త్వం మంజూరు చేస్తే వసప గ్రామం వద్ద ర్యాంపు నిర్వహించడం తగదన్నారు. ఇసుక ర్యాంపును నిలుపుదల చేయాలని తహసీల్దార్ను ఫోన్లో కోరారు. వసపలో ఇసుక వాహనాలు అడ్డుకున్న రైతులు అక్రమ తవ్వకాలు ఆపాల్సిందేనని డిమాండ్ -
ఎం.పరివాహన్ యాప్లోనే కట్టాలి..
వాహన దారులు సామాజిక మాధ్యమాల్లో ఇలా వచ్చే ఏపీకే ఫైల్స్ లింక్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. జిల్లా పోలీసు కార్యాలయం ఆధీనంలో ఉండే ఈ–చలానా యాప్ అనేది ట్రాఫిక్ పోలీసులకు, ఆ పరిధి పోలీస్స్టేషన్లో ఉండే పోలీసుల మొబైళ్లకు అనుసంధానంగా ఉంటుంది. ప్లేస్టోర్లో దొరకదు. సాధారణ ప్రజల వద్ద ఉండదు. దాని ద్వారా పోలీసులు ఫైన్లు వేశాక మీసేవలో గాని సొంత మొబైల్ ఫోన్లో గాని ఎం.పరివాహన్ యాప్ ద్వారానే కట్టాలి. ఎం.పరివాహన్ యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంటుంది. – నాగరాజు, సీఐ, శ్రీకాకుళం ట్రాఫిక్ ● -
కుప్పిలి మాస్ కాపీయింగ్పై విచారణ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య మీద వచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో సోమవారం వి చారణ నిర్వహించారు. విచారణ అధికారిగా విద్యా శాఖ స్టేట్ ఎగ్జామినేషన్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ జేఏసీ నా యకుల ముందు ఎనిమిది ప్రశ్నలను విచారణ అధికారి ఉంచారు. లావేరు ఎంఈఓ–1గా వ్యవహరించిన ఎం.వాగ్దేవి, ఎచ్చెర్ల ఎంఈఓ–2 రాజ్కిశోర్ సైతం విచారణ అధికారి ఎదుట హాజరయ్యా రు. లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని విచారణ అధికారులు సూచించారు. భోజనం అనంతరం ఇస్తానని డీఈఓ దాటవేత ధోరణి ప్ర దర్శించినట్లు పలువురు తెలిపారు. పరీక్ష కేంద్రంలో దొరికాయని చెబుతున్న స్లిప్పులకు, ప్రశ్నపత్రానికి సంబంధం లేదని, ఇన్విజిలేటర్ సంతకం లేకుండా ఉద్దేశపూర్వకంగా డీబార్ చేయడం అశాసీ్త్రయమని సంఘ నేతలు తమ లిఖితపూర్వక వాగ్దానంలో రాసిచ్చినట్లు సమాచారం. బుడగట్లపాలెం, కొ య్యాం పాఠశాల ప్రధానోపాధ్యాయులను డీఈఓ పిలిపించుకొని కుప్పిలి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ కిశోర్కు డబ్బులిచ్చామని బలవంతంగా స్టేట్మెంట్లు రాయించుకున్నారని ఆరోపించారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలని కోరారు. 14 మంది టీచర్లపై చార్జీలను, క్రిమినల్ కేసులను పూర్తిగా ఉపసంహరించుకోవాలని విచారణ అధికారికి విన్నవించారు. -
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు సోమవారం స్థానిక బీసీ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ప్రభుత్వ గిరిజ న ఆశ్రమ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పిల్లల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలు, ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్స్లోని మౌలిక సదుపాయాలు, భద్రత, పరిశుభ్రత తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో అడ్వకేట్, సంఘసేవకులు కె.ఇందిరా ప్రసాద్, ఆయా వసతి గృహాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మలేరియాతో బాలిక మృతి
కంచిలి: మండలంలోని కొనక గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలిక గాయత్రి దొండియా మలేరియా జ్వరంతో మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. ఈ బాలిక గ్రామ పాఠశాలలో 8వ తరగతి చదువుతూ జ్వరం బారిన పడింది. ఈ నెల 17వ తేదీన మఠం సరియాపల్లి పీహెచ్సీలో వైద్య పరీక్షలు చేయడంతో మలేరియా జ్వరంగా తేలింది. పరిస్థితి విషమించడంతో సోంపేట సీహెచ్సీకి రిఫర్ చేయగా, అక్కడి నుంచి బరంపురం ఎంకేసీజీ ఆస్పత్రికి తరలించినట్లు పీహెచ్సీ వైద్యురాలు సుస్మితారెడ్డి వివరించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకొన్నాయి. మృతురాలి తండ్రి బైలోడు, తల్లి తిలోత్తమలు కూలీలుగా జీవిస్తున్నారు. వీరికి మృతి చెందిన బాలికతోపాటు రెండేళ్ల కుమారుడు నితిన్ ఉన్నాడు. బాలికకు మలేరియా పాజిటివ్ రావడంతో గ్రామంలో వైద్యశిబిరాన్ని కూడా నిర్వహించారు. -
ఇచ్చుకో... పుచ్చుకో.. దొరికినంత దోచుకో..?
శ్రీకాకుళం పీఎన్ కాలనీ: సుపరిపాలన పేరుతో తెలుగుదేశం నేతలు ప్రజల్లోకి వెళుతుంటే, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, బాబు ష్యూరిటీ... మోసం గ్యారెంటీ.. పేరుతో తాము ప్రజల్లోకి వెళుతుంటే పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నా రు. ఆయన శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో సోమవారం మాట్లాడారు. ఏడాది కాలంలోనే 90 మంది ఎమ్మెల్యేలపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నట్లుగా సర్వేల్లో వెల్లడైందన్నారు. ఇంత ప్రజావ్యతిరేకతను కూడా లెక్కచేయకుండా ముందుకు వెళుతున్నారంటే గత ఎన్నికల్లో మాదిరిగా ఈవీఎంల మేనేజ్మెంట్పై కూటమి ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు. అందుకే విలువైన ప్రభుత్వ భూములను కూడా ఎలాంటి జంకు లేకుండా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తున్నారని అన్నారు. ఇందులో ఇచ్చుకో... పుచ్చుకో... దొరికినదంతా దోచుకో దాచుకో అనే పద్ధతిలో డబ్బు చేతులు మారుతోందన్నారు. గత ఏడాది సెప్టెంబర్లో నారా లోకేష్ అమెరికాకు వెళ్లిన సందర్భంలో ఉర్సా ప్రమోటర్లను కలిశారని, వారు ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్కు వచ్చి ఒక కంపెనీని రిజిస్టర్ చేశారని, తర్వాత నెల రోజుల్లోనే ఉర్సాకు ఏప్రిల్లోనే 99 పైసలకు ఎకరం కట్టబెట్టేశారన్నారు. కనీస ఆర్థిక సామర్థ్యం లేని ఆ సంస్థకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీనికి ముందు టీసీఎస్, కాగ్నిజెంట్ కంపెనీలకి 99 పైసలకే భూములిచ్చారన్నారు. ఈ కంపెనీతో ఒప్పందంలో ఆ సంస్థలు 2029 తర్వాత నుంచి ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొన్నాయన్నారు. వైఎస్సార్, జగన్ హయాంలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, అమెజాన్ వంటి సంస్థలు వచ్చాయన్నారు. వారితో ఇలాగే ఒప్పందాలు చేసుకున్నారా? అని ప్రశ్నించారు. విశాఖలో ఐటీ అభివృద్దికి డాక్టర్ వైఎస్సార్ హయాంలోనే కృషి చేశారు తప్ప, చంద్రబాబు హయాంలో ఒక్కటి కూడా రాలేదన్నారు. మిట్టల్ సంస్థ చెల్లింపులకు వాయిదాలా? ఆర్సెల్లార్ మిట్టల్తో సంప్రదింపులు చేసింది జగన్ హయాంలోనేనని సీదిరి గుర్తు చేశారు. దీన్ని నారా లోకేష్ వీడియో కాల్ మాట్లాడగానే మిట్టల్ రాష్ట్రానికి వచ్చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ సంస్థ కూడా దాదాపు రూ.1100 కోట్లతో భూమిని కొనుగోలు చేయాల్సి ఉందని, ఆ కంపెనీకి మొదట రూ.450 కోట్లు కట్టించుకుని, మిగిలిన మొత్తాన్ని మూడు వాయిదాల్లో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. లక్ష కోట్లతో పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థకు కేవలం రూ.1100 కోట్లు ప్రభుత్వానికి భూమి కోసం చెల్లించాల్సి ఉంటే, ఇన్ని వాయిదాలు ఎలా ఇస్తారు? ఇవి కాకుండా పన్నుల్లో అనేక రాయితీలు ఇవ్వడం వెనుకున్న లాలూచీ ఏమిటని ప్రశ్నించారు. సత్వా అనే కంపెనీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, వేలంలో ఖరీదైన భూములను కొనుగోలు చేసే సామర్థ్యం ఉందని, ఐటీ కంపెనీల పేరుతో వాటికి భూములు కేటాయించి, రాయితీలు ఎలా ఇస్తారని సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం విధానం ఇదే.. సర్కారుపై మండిపడిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు -
రైతులకు శాపం..!
మురికి కూపం.. పంట భూములు నిరుపయోగం ఎంతో విలువైన భూముల్లో మురికి నీరు, చెత్తా చెదారం చేరింది. కాలువలు సరిగా లేకపోవడం వలనే పంట పొలాల్లోకి మురుగు నీరు చేరుతోంది. కాలుపెడితే గాజు పెంకులు గుచ్చుతాయి. గత ఎనిమిది సంవత్సరాలుగా సాగు చేపట్టడం మానుకున్నాం. – గుర్రాల హరినారాయణ, హరిజన గోపాలపురం, పాతపట్నం పంటలు వేయలేకపోతున్నాం పంట భూముల్లోకి మురుగు నీరు రావడం వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. పొలం వద్దకు వెళ్లలేకపోతున్నాం. ఎనిమిదేళ్లుగా ఇదే పరిస్థితి. – ఎండీ కృష్ణారావు, కాపు గోపాలపురం, పాతపట్నం చర్యలు తీసుకుంటాం సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో మురికి నీటిని పరిశీలిస్తాం. ఒడిశా మురుగు నీరు ఆంధ్రాలోకి రాకుండా నిలుపుదల చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. – ఎన్.ప్రసాదరావు, తహసీల్దార్, పాతపట్నంపాతపట్నం: పాతపట్నం – పర్లాకిమిడి పట్టణాలు ఇరుగుపొరుగున ఉంటాయి. పర్లాకిమిడి పట్టణంలో అలనాటి రాజుల హయాంలో భారీ ఎత్తున మురుగునీటి కాలువలను నిర్మించారు. అయితే ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి పట్టణ ప్రజలు వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ సంచులు, గాజు సీసాలు, మురుగు నీరు సరాసరి కాలువల ద్వారా ఆంధ్ర ప్రాంతం పాతపట్నం మండలంలోని హరిజన గోపాలపురం, కాపుగోపాలపురం గ్రామాలకు చేరుతుంది. ఈ గ్రామాల మీదుగా మహేంద్రతనయ నదిలో కలుస్తోంది. పంట పొలాల్లో మురికి నీరు కాలువల ద్వారా వస్తున్న మురికి నీరు, వ్యర్థాలు పాతపట్నం, కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం గ్రామాలకు చెందిన సుమారు 40 ఎకరాలు పంట పొలాల్లో చేరుతున్నాయి. దీంతో కాలుపెడితే బయటపడలేనంత దుస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితిలో కొన్నేళ్లగా ఈ పంట పొలాలను రైతులు వినియోగించలేకపోతున్నారు. ఈ ప్రాంతంలో భూములకు ఎకరాకు రూ.7 లక్షలకు పైగా విలువ ఉంది. అయితే ప్రస్తుతం ఇటువంటి భూములు నిరుపయోగం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా నుంచి వచ్చిన మురుగునీరు మహేంద్రతనయ నదిలో కలుస్తుంది. అయితే దీనివలన పంట పొలాల్లో మురుగునీరు చేరుతుండడంతో పండించలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పర్లాకిమిడి మురుగు నీరు పాతపట్నం రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒడిశా మురుగు నీటి కాలువలతో ఇక్కట్లు వ్యర్థాలతో నిండుతున్న పంట పొలాలు పంటలు పండించలేని పరిస్థితి -
అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో ఆయన అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ లాండ్ రికార్డులు, వ్యవసాయం, డ్వామా, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల సమస్యలపై 98 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్రాజ తదితరులు పాల్గొన్నారు. కొన్ని అర్జీలను పరిశీలిస్తే... ● రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు వేతనాలు చెల్లించాలని కోరుతూ రిమ్స్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందించారు. గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో 15 ఏళ్లుగా సెక్యూరిటీ గార్డులుగా సేవలందిస్తున్నామని, సకాలంలో వేతనాలు చెల్లించడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పాత కాంట్రాక్టర్ మే నెల వేతనం, ఏప్రిల్, మే ఏరియర్స్ చెల్లించలేదన్నారు. జూన్ నుంచి కొత్త కాంట్రాక్టర్ బాధ్యతలు తీసుకుని రెండు నెలలుగా గడుస్తున్నా ఇప్పటివరకు వేతనం చెల్లించలేదని వాపోయారు. కార్యక్రమంలో సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, కో–కన్వీనర్ ఎం.గోవర్ధనరావు, రిమ్స్ నాయకులు ఎం.సూర్యనారాయణ, టి.రామారావు, బి.శ్రీను, ఎస్.రాజేంద్ర, ఎం.శ్రీను, హెచ్.లక్ష్మణ, టి.భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. ● గార మండలం శ్రీకూర్మాం గ్రామ పంచాయతీ పరిధిలో 4 గ్రామ సచివాలయాలు, 7 గ్రామాలు ఉన్నాయని, ఆయా గ్రామాల రైతులకు సక్రమంగా ఎరువులు అందడం లేదని ఆ పంచాయతీ సర్పంచ్ బరాటం జయలక్ష్మి పేర్కొన్నారు. కొంతమందికే ఎరువులు అందుతుండడంతో మిగిలినవారు ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ● కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వారి పేరు మీద హౌస్ టాక్స్ మార్పు చేస్తానని దుర్భాషలాడుతున్న నగర పాలక సంస్థ మున్సివల్ అసిస్టెంట్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన కొత్తపల్లి లక్ష్మి, శ్రీనివాసరావు, పోలుమూరు మీనాక్షిలు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికకు హాజరై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ● లావేరు మండలం కొత్తకుంకాం గ్రామానికి చెందిన చిత్తూరు మాలక్ష్మికి ప్రభుత్వం ఇచ్చిన రెండెకరాల భూమిని వేరేవారు ఆక్రమించుకున్నారని ఫిర్యాదు చేశారు. ● గ్రీవెన్స్లో సమస్యలను ఆన్లైన్లో నమోదు చేయడానికి పౌరసరఫరాల శాఖ సిబ్బంది నిరాకరిస్తున్నారని లావేరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన అర్జీదారుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆన్లైన్ నమోదు కేంద్రం వద్దకు వెళ్లి సిబ్బంది వివరణ కోరారు. నమోదు కేంద్రంలోనే కలెక్టర్ కూర్చొని అర్జీదారుడి సమస్యను సిబ్బందితో నమోదు చేయించారు. ● తన కుమారులు తనను సరిగా చూడడం లేదని, తనకు న్యాయం చేయాలని పొలుమూరు మీనాక్షి అనే వృద్ధురాలు కలెక్టర్కు విన్నవించారు. తన కుమారులు పొలుమూరు ఈశ్వరరావు, సింహాచలం తనకు ప్రతి నెలా రూ.3 వేలు ఇచ్చేవారని, ఇవ్వడం మానేయడంతో తాను కుమార్తెను ఆశ్రయించి ఆమె వద్ద బతుకుతున్నట్లు వివరించారు. తనకు చెందిన ఆస్తిని కుమార్తెకు రాసివ్వడం తన కుమారులకు నచ్చలేదన్నారు. ఆ ఆస్తిని తిరిగి ఇవ్వాలని తన అన్నయ్యలు ఇద్దరు మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారని కొత్తపల్లి లక్ష్మి కూడా తల్లితో సహా వచ్చి ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మీకోసంలో 98 అర్జీల స్వీకరణ -
రావిశాస్త్రి ప్రసంగానికి శరత్బాబు ఎంపిక
శ్రీకాకుళం కల్చరల్: సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి జయంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యేక ప్రసంగ కార్యక్రమానికి నగరానికి చెందిన రచయిత జంధ్యాల శరత్బాబు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 30న రావిశాస్త్రి జయంతి పురస్కరించుకొని ‘సామాన్యుడి అండదండ రావిశాస్త్రి’ అంశంపై ప్రసంగం చేయనున్నారు. యువతి ఆత్మహత్య తడ: అనారోగ్యంతో శ్రీకాకుళం జిల్లా, నందిగాం మండలం, గొల్లవూరు గ్రామానికి చెందిన జీరు పూజిత(21) అనే యువతి ఆదివారం రాత్రి తన గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. ఎస్ఐ కొడపనాయుడు కథనం మేరకు.. తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేసే పూజిత తడకండ్రిగలోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ గదిలో అద్దెకు నివసిస్తోంది. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను అదే పరిశ్రమలో పని చేసే ఆనంద్ కృష్ణన్ అనే మిత్రుడు తరచూ పరామర్శిస్తుండేవాడు. ఈ క్రమంలో చనిపోయిన రోజు కూడా ఆనంద్ కృష్ణన్ ఆమెను ఉదయం పలకరించి వెళ్లాడు. సాయంత్రం వచ్చిన అతను పూజిత గదిలో సీలింగ్ ఫ్యాన్కి చున్నీతో ఉరి వేసుకుని ఉన్నట్టు గమనించి, అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న మరో వ్యక్తి సాయంతో తలుపులు పగుల కొట్టి ఆమెను కిందకు దించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మృతురాలి తండ్రి శ్రీనివాసరావుకు సమాచారం ఇవ్వడంతో సోమవారం తడకు వచ్చిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొడపనాయుడు తెలిపారు. -
కారులో నాటుసారా రవాణా
● ఇద్దరు వ్యక్తులు అరెస్టు కంచిలి: ఒడిశా నుంచి ఆంధ్రా గ్రామాలకు విచ్చలవిడిగా నాటుసారా రవాణా అవుతోంది. ఏకంగా కార్లలోనే దర్జాగా నాటుసారాను పాలిథిన్ సంచుల్లో, చిన్నసైజు ప్యాకెట్ల రూపంలో పల్లెలకు దిగుమతి చేసుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సోంపేట ఎకై ్సజ్ సీఐ జీవీ రమణ రవాణాపై పటిష్ట నిఘా పెట్టారు. ఒడిశా – ఆంధ్ర అంతర్రాష్ట్ర కార్ల కదలికల మీద నిఘా ఉంచారు. ఈ నిఘాలో భాగంగా ఒడిశా సరిహద్దు గ్రామమైన కేసరపడ వద్ద ఒక కారు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని పరిశీలించారు. దీంతో ఆ కారులో ఆరు ప్లాస్టిక్ గోనె సంచుల్లో ఒక్కొక్కదానిలో 150 నాటుసారా ప్యాకెట్లను ప్యాక్చేసి, మొత్తంగా 900 నాటుసారా ప్యాకెట్లు(90 లీటర్లు) తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సారాతోపాటు కారును సీజ్చేసి, నాటుసారా రవాణా చేస్తున్న ఒడిశా రాష్ట్రం మునిసిపేటకు చెందిన మొగిలి కుమార్ను, నాటుసారా తెప్పించిన పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన లోట్ల జోగారావును అరెస్టు చేశారు. నాటుసారా పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బంది మార్కారావు, భాను, అరుణ్, ఉమాపతిలను సీఐ అభినందించారు. -
వృద్ధుడు అదృశ్యం
రణస్థలం: మండలంలోని పైడి భీమవరం గ్రామానికి చెందిన కంఠస్ఫూర్తి కనకరాజు ఈనెల 21వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని జే.ఆర్.పురం పోలీసులు సోమవారం తెలిపారు. వయస్సు 78 సంవత్సరాలు, మతి స్థిమితం సరిగ్గా లేదని చెప్పారు. ఈ మేరకు కుమారుడు సత్తిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ఎస్.చిరంజీవి వెల్లడించారు. రైలు ఢీకొని వృద్ధుడు మృతి ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధి దూసి – పొందూరు రైల్వేస్టేషన్ల మధ్యలో సోమవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడికి సుమారు 65 ఏళ్ల వయస్సు ఉంటుందని, నీలం, ఎరుపు రంగు గీతల షర్టు, నీలం గళ్ల లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించామన్నారు. -
యువకుడి మృతిపై ఆందోళన
టెక్కలి రూరల్: కోట బొమ్మాళి మండలంలోని పెద్దబమ్మిడి గ్రామానికి చెందిన పినిమింటి శ్రీరాములు(20) అనే యువకుడు శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు శ్రీరాములు ఈనెల 25వ తేదీన కొంతమంది యువకులతో కలిసి ద్విచక్ర వాహనంపై సారవకోట మండలం వైపు వెళ్లాడు. అయితే అదేరోజు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తమ కుమారుడిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కానీ శ్రీరాములుది రోడ్డు ప్రమాదం కాదని, గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తీవ్రగాయాలతో బ్రెయిన్ డెడ్ కావడంతో చికిత్స పొందుతూ శ్రీరాములు 27వ తేదీన మృతి చెందాడని, తన కుమారుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి లక్ష్మణరావు, తల్లి లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సోమవారం మృతదేహంతో పెద్దబమ్మిడి వద్ద ర్యాలీ చేపట్టారు. అయితే ఇదే విషయంపై సారవకోట పోలీసులను ప్రశ్నించగా మృతి చెందిన యువకుడు ఈనెల 25వ తేదీన సారవకోట మండలం జగ్గయ్యపేట వద్ద రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను ఢీకొన్నట్లు పేర్కొన్నారు. ఇది గుర్తించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108లో శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27వ తేదీన మృతి చెందినట్లు తెలిపారు. కాగా శ్రీరాములు అవయవదానానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో జెమ్స్ ఆస్పత్రి సిబ్బంది ఆ యువకుడి అవయవాలను దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు
కొత్తూరు: కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలోని వంశధార నదిలో బలద ఇసుక ర్యాంపు పేరుతో నిర్వహిస్తున్న ర్యాంపులో అక్రమ తవ్వకా లు అరికట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఇసుక ర్యాంపుతో పాటు స్టాక్ పాయింట్ను పార్టీ శ్రేణులతో కలిసి ఆమె ఆదివారం పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న దారి లో ఆమె ప్రయాణించి ర్యాంపు వరకు చేరుకుని తవ్వకాలు పరిశీలించారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కనుసన్నల్లోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయని, ఒడిశాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని ఆరోపించారు. ఇసుక కోసం నదికి అడ్డంగా గట్టు కట్టడం దారుణమని, రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యంత్రాలతో సుమారు మూడు మీటర్ల లోతులో తవ్వ కాలు చేస్తే.. వరదలు వచ్చినప్పడు వసప, కుంటిబద్ర కాలనీ, నివగాంతో పాటు పలు గ్రామాలు మునిగిపోతాయని తెలిపారు. పొలాల మీదుగా ఈ ర్యాంపునకు దారి వేశారని, దీని వల్ల పంటలు తీసుకువచ్చే రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. దీనిపై ప్రశ్నిస్తున్న వారిని బెదిరిస్తున్నారని రెడ్డి శాంతి తెలిపారు. తవ్వకాలు ఆపకపోతే నేషనల్ గ్రీన్ ట్రిబునల్కు (ఎన్జీటి)కు ఫిర్యాదు చేస్తానన్నారు. ర్యాంపు వద్దకు రెడ్డి శాంతి వచ్చారన్న విష యం తెలియడంతో స్థానిక రైతులంతా ఆమె వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకున్నారు. నిర్వాహకులను అడిగితే కేసులు పెడతామని భయపెడుతున్నారని కామయ్య జగదీష్, చినరాయుడుతో పాటు పలువురు రైతులు రెడ్డి శాంతికి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సవర సావిత్రి, జెడ్పీటీసీ కామక భాగ్యవతి, మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ పాతపట్నం నియోజవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు అగతమూడి నాగేశ్వరరావు, జగదీ ష్, సర్పంచ్లు ధర్మారావు, బాలకృష్ణ, సాధుబాబు, వైకుంటరావు, సేపాన అశోక్ కుమార్, సింహాద్రి, ఎంపీటీసీ వనుము లక్ష్మినారాయణ, ఎ.నాగేశ్వరరావు రమేష్, నగేష్, యతిరాజు, నాగరాజు, ఆఫీస్, వాసు, అశోక్, లింగం పాల్గొన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు అరికట్టాల్సిందే మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వంశధారలో అక్రమ ఇసుక తవ్వకాల పరిశీలన -
● రాత్రంతా బావిలోనే..
చిమ్మచీకటిలో... మనుషుల అలికిడి లేని చోట.. కేకలు వేస్తే వినిపించని ప్రాంతంలో.. చుట్టూ ఉన్న నీరు బతుకును బలికోరుతున్న సమయాన.. ఓ వృద్ధురాలు ప్రాణాలు కాపాడుకున్నారు. రాత్రంతా బావిలో ఉండిపోయారు. ఈ ఘటన పట్టుపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలమేరకు.. పొట్నూరు లోకేశ్వరరావు జీడి మామిడి తోటలో ఉన్న బావి వద్ద ఆదివారం సాయంత్రం చెప్పులు ఉండడాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. దగ్గరకు వెళ్లి చూడగా ఓ డబ్బై ఏళ్ల మహిళ బావి లోపల రాళ్లను పట్టు కుని ఓ మూలన కనిపించింది. దీంతో వారు వెంటనే గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు తామా డ భాస్కరరావు, ఎన్.వెంకటరావు హుటాహుటిన బావి వద్దకు వెళ్లి మెళియాపుట్టి గ్రామానికి చెందిన రేఖాన ఢిల్లి అనే వ్యక్తి సాయంతో ఆమెను బయటకు తీసి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం చాపర పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె పేరు లక్ష్మి అని, ఊరు శ్రీకాకుళం అని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు మతిస్థిమితం లేదని, రాత్రి బావిలో పడిపోయి ఉంటుందని స్థానికులు తెలిపారు. – మెళియాపుట్టి -
టీకా..లేదుగా
అరసవల్లి: అప్పుడే పుట్టిన బిడ్డలకు ఓపీవీ జీరో వ్యాక్సిన్ వేయాలి.. కానీ జిల్లాలో అది అందుబాటులో లేదు. బీసీజీ వేయాలి.. అది కూడా లేదు. హెపటైటిస్–బి (బర్త్డోస్) ఎప్పుడు వస్తుందో తెలీదు. ఆరు వారాల నుంచి ఏడాది లోపు బిడ్డలకు ఓపీవీ–1 తప్పనిసరి. కానీ రెండు నెలలుగా ఇవి రాలేదు. ఎఫ్ఐపీ, రోటా వైరస్ వ్యాక్సిన్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఏడాదిన్నర నుంచి ఆరేళ్ల్ల లోపు చిన్నారులకు కోరింత దగ్గు, డిఫ్తీరియా, టెటానస్ల నుంచి రక్షణకు డీపీటీ బూస్టర్ వ్యా క్సిన్లు వేయాలి. కానీ ఎప్పుడూ నో స్టాక్ బోర్డు వెక్కిరిస్తూనే ఉంది. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉంది. టెక్కలి జిల్లా కేంద్రాస్పత్రి నుంచి నరసన్నపేట ఏరియా ఆస్పత్రి, కమ్యూనిటీ ఆస్పత్రులతో పాటు పీహెచ్సీల్లోనూ ఈ కొరత కనిపిస్తోంది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలోనే వ్యాక్సిన్లు లేవు. జిల్లాలో సర్వజన ఆస్పత్రి (శ్రీకాకుళం), జిల్లా ఆస్పత్రి (టెక్కలి), ఏరియా ఆస్పత్రి (నరసన్నపేట), 13 సీహెచ్సీలతో పాటు 71 పీహెచ్సీలు, 13 అర్బన్ పీహెచ్సీలు ఉన్నాయి. వీటికి కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి వచ్చే వ్యాక్సిన్లను జిల్లా వ్యాక్సినేషన్ కేంద్రం నుంచి సరఫరా చేస్తారు. ఆయా ఆరోగ్య కేంద్రాల అధికారులు పంపిన ఇండెంట్ల ప్రాప్తికి వ్యాక్సిన్లను ప్రతి నెలా పంపిస్తుంటారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్య ధోరణి కారణంగా సకాలంలో మందుల నుంచి వ్యాక్సిన్ల సరఫరాల వరకు ఏవీ సవ్యంగా జరగడం లేదనే చర్చ జరుగుతోంది. రెండు నెలలుగా ఇంటెండ్లు పెడుతున్నా వ్యాక్సిన్లు మాత్రం రావడం లేదు. నేషనల్ ఇమ్యూనైజేషన్ షెడ్యూల్ ప్రకారం అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 16 ఏళ్ల అమ్మాయిలు, గర్భిణులకు కూడా వ్యాక్సిన్లు షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు నెలల నుంచి జిల్లాలో జిల్లా ఆస్పత్రి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు ఎక్కడా వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టి సారించి వ్యాక్సిన్ల కొరత సమస్యలను పరిష్కరించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. త్వరలో సరఫరా జరిగేలా చర్యలు జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ ఇచ్చిన వివరాల మేరకు గత రెండు నెలల నుంచి కొన్ని వ్యాక్సిన్లు మాత్రం సరఫరా జరగలేదన్న సంగతి నా దృష్టికి వచ్చింది. అయితే వ్యాక్సిన్లు అన్నీ కేంద్రం ఇవ్వాల్సి ఉంది. కొరత ఉన్న వ్యాక్సిన్లను త్వరలోనే జిల్లాలో అన్ని ఆస్పత్రులకు సరఫరా అయ్యేలా చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ అనిత, డీఎంహెచ్ఓ ప్రభుత్వాస్పత్రులను టీకాల కొరత వేధిస్తోంది. పిల్లలకు వ్యాక్సిన్ వేయిద్దామని వచ్చే తల్లిదండ్రులకు వాయిదాల దండకం వినిపిస్తోంది. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదేళ్ల పిల్లల వరకు పలు రకాల టీకాలు తప్పనిసరిగా సకాలంలో వేయించాలి. కానీ జిల్లాలో టీకాల కొరత కారణంగా రెండు నెలలుగా చాలా మంది పిల్లలకు వ్యాక్సిన్లు వేయలేదు. జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో లేని వ్యాక్సిన్లు రెండు నెలలుగా తీవ్రంగా వేధిస్తున్న కొరత పిల్లలకు వ్యాక్సిన్లు వేయించలేక తల్లిదండ్రుల పాట్లు -
ఐసీడీఎస్ పీడీగా విమల
శ్రీకాకుళం అర్బన్: జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ పథక సంచాలకులుగా ఐ.విమల నియమితులయ్యారు. ఈమె ఆదివారం జిల్లా ఐసీ డీఎస్ పీడీగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కడప జిల్లా పోరుమామిళ్లలో సీనియర్ సీడీపీఓగా పనిచేశారు. ఐసీడీఎస్ పీడీగా పదోన్నతిపై శ్రీకాకుళం జిల్లాకు వచ్చా రు. ప్రస్తుతం ఐసీడీఎస్ పీడీగా పనిచేసిన బి.శాంతిశ్రీతన మాతృసంస్థ అయిన కో–ఆపరేటివ్ డిపార్ట్మెంట్కు వెళ్లారు. పిచ్చి కుక్కల స్వైర విహారం బూర్జ: మండలంలోని కొల్లివలస గ్రామంలో ఆదివారం ఉదయం పిచ్చి కుక్క స్వైర విహారం చేసి 12 మందిని కరిచింది. వీరంతా శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కొల్లివలస గ్రామానికి చెందిన సీర లక్ష్మినారాయణ, మేడి గిరి, గడే కిషోర్, గడే పార్వతి, పి.రమణమ్మ, మంతిని ఈశ్వరమ్మతో పాటు మరికొందరిపై పిచ్చి కుక్క దాడి చేయడంతో వీరిని వెంటనే 108 సాయంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. టెక్కలిలో.. టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం జర్జంగి పంచాయతీ పరిధి గుంజిలోవ గ్రామంలో ఆదివారం వేకువజామున పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆదివారం వేకువజాము న గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై నడిచి వెళ్తుండగా వారిపై దాడిచేసింది. అలానే గ్రామంలో ఉన్న 9 ఆవులు, 4 ఎద్దులు, 3 పెయ్యలు కలిపి మొత్తం 16 పశువులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం ఆ కుక్కసైతం మృతి చెందిందని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పశువైద్యాధికారులు గ్రామానికి చేరుకుని కుక్కదాడిలో గాయపడిన పశువులకు టీకాలు వేశారు. ‘ఎయిర్ పోర్టుకు అంగుళం స్థలం ఇచ్చేది లేదు’ వజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణానికి అంగుళం స్థలం కూడా ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. తోటూరు గ్రామంలో శనివా రం రాత్రి కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాంతాన్ని విధ్వంసం చేసే ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో ముందుకు వెళ్తే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, ఉపాధ్యక్షుడు ఎల్.రామస్వామి, కార్యదర్శి జోగి అప్పారావు, గుంట లోకనాథం, మడ్డు జానకిరావు, ఎం.పురుషోత్తం, ధనరాజు, పి.నారాయణ, ఉప్పాడ దుర్గారావు, ఎస్.కృష్ణవేణి, జి.చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అధికార లాంఛనాలతో డీఎస్పీ అంత్యక్రియలు
పోలాకి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డీఎస్పీ శాంతారావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామం డోలలో ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి తోపాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారు లు, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తోపాటు పలువు రు రాజకీయ నాయకులు, బంధువులు, స్థానికులు హాజరై నివాళులర్పించారు. ఎస్ఐ రంజిత్ సమక్షంలో పోలాకి మండల కేంద్రం నుంచి డోల వరకు ట్రాఫిక్ను క్లియర్ చేసి బందోబస్తు చేపట్టారు. ఎస్పీతో సహా అక్కడకు వచ్చిన పోలీసులంతా ఆయనకు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ డోలలో డీఎస్పీ జల్లు శాంతారావు కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. శాంతారావు కుమారులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల మృతిచెందిన ఎల్ఐసీ ఏజెంట్ ఎన్ని రమణ కుటుంబాన్ని కృష్ణదాస్ పరామర్శించారు. ఆయనతోపాటు మండలపరిషత్ సలహాదారు ముద్దాడ భైరాగినాయుడు, పార్టీ నాయకులు డోల సాయిరాం తదితరులు ఉన్నారు. -
ఆకాశం అందుకుందాం..
టెక్కలి: పేద విద్యార్థులు ఆకాశాన్ని అందుకోవడానికి అపూర్వ అవకాశం వచ్చింది. పైలెట్ కావాలనే ఆకాంక్ష, ఆసక్తి కలిగిన నిరుపేద విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమాన తయారీ సంస్థ బోయింగ్, ఢిల్లీకి చెందిన లెర్నింగ్ లింక్స్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో బోయింగ్ సుక న్య స్టెమ్ ల్యాబ్లను ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో టెక్కలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, సరుబుజ్జిలి మండలం వె న్నెలవలస జవహర్ నవోదయ పాఠశాలల్లో మాత్ర మే ఈ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నుంచే శిక్షణ తరగతులు ప్రారంభించారు. వీటి ద్వారా టెక్కలి బాలికోన్నత పాఠశాలలో 710 మందికి, వెన్నెలవలస నవోదయ పాఠశాలలో 465 మంది శిక్షణ అందజేస్తున్నారు. ఢిల్లీలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన ‘ఫెసిలిటేటర్’తో రెండు పాఠశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. పైలెట్ల కొరత రాకుండా.. భవిష్యత్లో ఏవియేషన్ రంగంలో పైలెట్ల కొరత లేకుండా ఉండేందుకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థుల కోసం ముఖ్యంగా బాలి కలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ స్టెమ్ ల్యాబ్లను ఏర్పాటు చేశారు. కమ్యూనికేషన్, విభిన్నమైన ఆలో చనలు, సమస్యల పరిష్కారం, సహకారం, టీమ్ స్ఫూర్తి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, ఆయా అంశాల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేస్తారు. అంతే కాకుండా ఈ ల్యాబ్ ద్వారా అడ్వాన్స్ ఎలక్ట్రానిక్స్, సెన్సార్స్, సర్వో మోటార్స్, మెకానికల్, ర్యాపిడ్ ఫొటో టైపింగ్, త్రీడీ ప్రింటింగ్, ఫ్లూటో డ్రోన్స్, ట్రాన్స్మీటర్స్, రిసీవర్స్, ఏవియేషన్ సాంకేతిక అంశాలతో శిక్షణ ఇస్తారు. పేద విద్యార్థులకు పైలెట్ శిక్షణ బోయింగ్ సంస్థ, లెర్నింగ్ లింక్స్ నేతృత్వంలో బోయింగ్ సుకన్య స్టెమ్ ల్యాబ్ నిర్వహణ జిల్లాలో టెక్కలి, వెన్నెలవలసలో ల్యాబ్లు ఏర్పాటు -
డీజే మోత.. పెడితే వాత
తీర్మానం చేసుకున్నాం గ్రామంలో ఎవరూ డీజేలు పెట్టకూడదని రామ మందిరంలో తీర్మానం చేసుకున్నాం. పెద్దల మాట కాదని ఎవరైనా డీజేలు పెడితే ఆ బాధ్యత ఆ శుభకార్యం చేసిన వారిదే. – కుమరాపు రమేష్నాయుడు, ఎంపీటీసీ, డీఆర్వలస పెద్దల ఆలోచన మేరకే.. గుండె జబ్బులు, ఇతర వ్యాధుల తో బాధపడుతున్న వారిని దృష్టి లోఉంచుకుని గ్రామ పెద్దల ఆలో చన మేరకు ఈ నిర్ణయం తీసుకు న్నాం. శుభకార్యక్రమాలకు డీజే బదులుగా బ్యాండులు, ఇతర మేళాలు ఏర్పాటు చేసుకోవాలి. – కుమరాపు శ్రీనివాసరావు, సర్పంచ్, డీఆర్వలస ●● డీఆర్వలసలో డీజేలు పెట్టకూడదని తీర్మానం ● శుభ కార్యక్రమాలకు డీజేలు పెడితే జరిమానా జి.సిగడాం: ఊరిలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా డీజేలు పెట్టడం పరిపాటిగా మారిపోయింది. పుట్టిన రోజు నుంచి షష్టి పూర్తి వరకు అన్నింటా డీజే బీట్లు వినిపిస్తున్నాయి. కానీ జి.సిగడాం మండలంలోని దాలెమ్మ రాజువలస(డీఆర్ వలస) డీజేలకు స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమంలోనూ ఇకపై డీజేలు వాడకూడదని వారు ఏకంగా దేవుడి గుడిలో ఈ నెల 20న అంతా కలిసి తీర్మానం చేసుకున్నారు. ఈ తీర్మానాన్ని మీరి ఎవరైనా డీజే ఏర్పాటు చేస్తే జరిమానా విధించడంతో పాటు పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు. ఎందుకు వద్దంటే.. డీజేల మోతతో గుండె జబ్బులు, ఇతర సమస్యలు ఉన్న వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు గుర్తించారు. డీజేలు పెట్టినప్పుడు ఇంటిలోఉన్న సామాన్లు కూడా చిందరవందరగా మారుతున్నాయని, ఇది ప్రా ణాంతకంగా మారుతోందని వారంటున్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకునే డీజీలు వాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. -
షిర్డీసాయి ఆలయంలో చోరీ
శ్రీకాకుళం రూరల్: పెదగనగళ్లవానిపేట పంచాయతీ గాంధీనగర్ కాలనీలో షిర్డీసాయిబాబా ఆలయంలో రెండు రోజులు కిందట చోరీ జరగగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి ప్రవేశించి రెండు జతల వెండి కిరీటాలు, వెండి పాదాలు, దీపం కుందెలు పట్టుకుపోయారని గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటి విలువ రూ.43,500 ఉంటుందని ప్రాథమిక అంచనా వేసారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరీక్షల పరిశీలన ఎచ్చెర్ల : చిలకపాలెంలోని శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణను జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆదివారం పర్యవేక్షించారు. జూలై 27 నుంచి ఆగస్టు 1 వరకూ రెండు విడతలుగా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. శ్రీశివానీ కాలేజీలో మొదటి రోజు జరిగిన పరీక్షకు 190 మంది అభ్యర్థులకు గాను 163 మంది హాజరయ్యారు. డీఆర్వోతోపాటు ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి భోగీశ్వరి, పద్మప్రియ, హెచ్–సెక్షన్ సూపరింటెండెంట్ జోగారావు పర్యవేక్షించారు. తీరానికి కొట్టుకొచ్చిన మృతదేహం వజ్రపుకొత్తూరు రూరల్: నువ్వలరేవు సముద్రతీరానికి ఆదివారం ఓ వ్యక్తి మృతదేహం చేరింది. అక్కుపల్లి గ్రామానికి చెందిన మడ్డు ధనరాజు కొంతకాలంగా మానసిక సమస్యలు, ఫిట్స్తో బాధపడుతున్నారు. ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి చేరుకోలేదు. ఈ క్రమంలో సముద్రంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. ఆదివారం నువ్వలరేవు తీరానికి మృతదేహం చేరడంతో సోదరుడు వాసు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ధనరాజు తల్లిదండ్రులు 18 ఏళ్ల క్రితం మృతి చెందడంతో సోదరి హైమా వద్ద ఉంటున్నాడు. అంబులెన్సుకు ప్రమాదం టెక్కలి రూరల్: మండలంలోని చాకిపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున ఓ అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్కు చెందిన అంబులెన్స్ పలాస వచ్చి తిరిగి వెళ్తుండగా చాకిపల్లి కొత్తూరు సమీప జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనుకనే వస్తున్న అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. -
ఆదిత్యా నమోస్తుతే!
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. శ్రావణ మాస మొదటి ఆదివారం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఈవో ప్రసాద్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఉచిత మంచినీటిని పంపిణీ చేయించారు. పలువురు భక్తులు కేశఖండన శాలలో తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరికొందరు ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాల పూజలు చేయించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక తులసీదళాలతో ఆదిత్యుని మూలవిరాట్టును అలంకరించి భక్తుల సర్వదర్శనాలకు ఉదయం 6 గంటల నుంచే అనుమతించారు. విశిష్ట, ప్రత్యేక దర్శనాలతో పాటు ఉచిత దర్శనాల క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరారు. ఆదిత్యుని సన్నిధిలో డ్రాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ అరసవల్లి సూర్యనారాయణ స్వామిని ది డెబ్ట్ రికవరీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (డ్రాట్–కోల్కత్తా) జస్టిస్ అనిల్కుమార్ శ్రీవాత్సవ్ సతీసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు వేదమంత్రోఛ్చారణల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం వేదాశీర్వచనాలతో అనివెట్టి మండపంలో స్వామి వారి శేషవస్త్రాలను కప్పి, తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. ఆలయ విశిష్టతను, స్వామి వారికి జరుగుతున్న సేవల వివరాలను శంకరశర్మ వివరించారు. -
శభాష్ మేజర్ కవిత
జి.సిగడాం మండలం జగన్నాథవలస ప్రాథమికోన్నత పాఠశాల చుట్టూ మురుగునీరు పేరుకుపోయింది. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనా నీరు నిల్వ ఉండిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. – జి.సిగడాం శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన మేజర్ కవిత వాసుపల్లి చేసిన ఎన్నో ధైర్య సాహసాలు యువతకు రోల్మోడల్గా నిలుస్తున్నాయి. జమెట్టూరు గ్రామానికి చెందిన కవితను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అభినందించారు. వీఎస్ఎమ్, సాహసం మరియు సేవా రంగాలలో అసాధారణ ఘనత సాధించిన ఈమె ఆదివారం రాజ్భవన్లో గవర్నర్ను కలిశారు. సాధారణ కుటుంబంలో జన్మించిన వాసుపల్లి కవిత చదువుల సరస్వతిగా కీర్తిగడించింది. శ్రీకాకుళం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, 2021లో భారత సైన్యంలో వైద్యురాలిగా చేరింది. తన కుటుంబాన్ని ఆదుకోవడమే కాక, దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతో.. కేవలం నాలుగేళ్లలో నిబద్ధత కలిగిన వైద్యాధికారిణిగానే కాకుండా.. నాయకత్వం మరియు సాహసానికి చిహ్నంగా ఎదిగారు. మౌంట్ గోరిచెన్ ఎక్కే సమయంలో, 5,900 మీటర్ల ఎత్తులో స్పృహ కోల్పోయిన సహయాత్రికుడిని ఆమె రక్షించారు. ఆమె మేధస్సు, ధైర్యానికి భారతసైన్యం ఫిదా అయింది. ఇటీవల బ్రహ్మపుత్ర నదిపై 1,040 కిలోమీటర్ల రాఫ్టింగ్ యాత్రను పూర్తి చేసిన ఏకై క మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ ఘనతకు ఆమె పేరు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో నమోదైంది. ఈ యాత్రను నిమాస్ డైరెక్టర్, షౌర్య చక్ర గ్రహీత, మౌంట్ ఎవరెస్ట్ను మూడు సార్లు అధిరోహించిన మొదటి భారతీయుడు కల్నల్ రణవీర్ సింగ్ జామ్వాల్, ఎస్ఎమ్, వీఎస్ఎమ్ నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ను కవిత ఆదివారం కలిశారు. ‘మేజర్ కవిత కథ అద్భుతమైన సంకల్పాన్ని చూపిస్తోంది. ఆమె ఆంధ్రప్రదేశ్కు , ప్రతి భారతీయుడికీ గౌరవాన్ని తీసుకువచ్చారు.. నీ రాష్ట్రానికి, దేశానికీ మరింత గౌరవం తీసుకురావాలి,’’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ కొనియాడారు. రాష్ట్ర గవర్నర్ అభినందనలు అందుకున్న సిక్కోలు మేజర్ బ్రహ్మపుత్ర నదిపై రాఫ్టింగ్ యాత్ర చేసిన ఏకై క మహిళగా రికార్డు కుటుంబ సభ్యులతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముచ్చటిస్తున్న మేజర్ కవిత లక్ష్యం ఎవరెస్ట్ ‘బ్రహ్మపుత్ర అద్భుతంగా ఉంది కానీ దయలేని నది. అనేక సార్లు, అతి పెద్ద అలలు మన రాఫ్ట్ను తిప్పేశాయి. ఆ క్షణాల్లో, మేమంతా నీటిలో మునిగి, బతికేం లేదా అనే అనుమానంలో పడ్డాం. అయినా భయపడకుండా లక్ష్యం చేరుకున్నాం. అడ్వెంచర్ స్పోర్ట్స్లో కొనసాగాలనుకుంటున్నాను. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే లక్ష్యం ఉంది. గవర్నర్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. –డాక్టర్ మేజర్ కవిత వాసుపల్లి, ఇండియన్ ఆర్మీ వైద్యురాలు -
గూడ్స్ గోదాం.. తరలిపోనుందా?
ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ ఆవరణలో సుమారు 60 ఏళ్ల కిందట ఏర్పాటైన గూడ్స్ గోదాం ఇక కనుమరుగు కానుందా? ఇక్కడి నుంచి దూసి రైల్వేస్టేషన్కు గోదాం తరలిపోనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమకు సమాచారం ఇచ్చారని గోదాం కలాసీలు చెబుతున్నారు. ఇదే జరిగితే తాము కుటుంబాలతో సహా రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో ఈ గోదాం వద్ద పెసలు, మినుములు,, జ్యూట్ వ్యాపారం జరిగేది. అనంతరం యూరియా, బియ్యం, ఐరన్ వంటి సరుకులను గూడ్స్ వేగన్లలో ఇక్కడ అన్లోడ్ చేసే పనిమొదలైంది. ఈ పని కోసం ఆమదాలవలస, శ్రీకాకుళం రూరల్ మండలాల్లోని ఊసవానిపేట, గేదెలవానిపేట, పాత ఆమదాలవలస, గేటు, పొన్నాం, నవనంబాడు, కుద్దిరాం, గొల్లపేట, అక్కవలస, పంతులపేట, మెట్టక్కివలస తదితర 20 గ్రామాల నుంచి సుమారు 400 కుటుంబాల కలాసీలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు గోదాముకు చేరుకున్న వేలాది బస్తాలను లారీల్లోకి వేసి జిల్లా వ్యాప్తంగా సరుకులు రవాణా చేస్తున్నారు. రవాణా రంగంలో లారీడ్రైవర్, క్లీనర్, ఓనర్లు సుమారు 400 మంది వరకు ఉంటారు. మొత్తమ్మీద ఈ గోదాములపై ఆధారపడి ప్రతిరోజూ 800 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. అమృత్భారత్లో భాగంగా.. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమృత్భారత్ రైల్వే స్టేషన్ పథకం కింద కోట్లాది రూపాయల వ్యయంతో శ్రీకాకుళం (ఆమదాలవలస) రైల్వేస్టేషన్లోనూ పలు అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా స్టేషన్ ఆవరణలో ఉన్న గూడ్స్ గోదామును ఆమదాలవలస పక్క రైల్వేస్టేషన్ ఉన్న దూసి రైల్వే స్టేషన్ ఆవరణలోకి మార్చేందుకు రైల్వే అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించి భువనేశ్వర్ నుంచి డీపీఆర్ కూడా తయారుచేసి శ్రీకాకుళం రోడ్ రైల్వేస్టేషన్కు పంపించినట్లు తెలిసింది. ఈ మేరకు స్టేషన్ అధికారులు గూడ్స్ గోదాం ముఖ్య కాంట్రాక్టర్లకు సైతం విషయం తెలియజేసినట్లు సమాచారం. వారు ఆ విషయాన్ని కలాసీలకు చెప్పడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. గోదాం తరలింపు ప్రయత్నాలు మానుకోవాలని, లేదంటే ఉద్యమం తప్పదని కలాసీలు చెబుతున్నారు. ఆమదాలవలస నుంచి దూసికి మార్చేందుకు సన్నాహాలు ఆందోళన చెందుతున్న గోదాం కలాసీలు సుమారు 800 కుటుంబాలపై ప్రభావం -
టీడీపీ అసమ్మతి వర్గంలో ‘కళా’!
శ్రీకాకుళం: శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీలో ఉన్న కొందరు అసమ్మతి నాయకుల ముఖాలు కళకళలాడుతున్నాయి. చీపురుపల్లి శాసనసభ్యుడు కళా వెంకట్రావును త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో మంత్రిని చేస్తారన్న ప్రచారమే ఇందుకు కారణం. శ్రీకాకుళం జిల్లాలో తొలి నుంచి తెలుగుదేశంలో రెండు ప్రధాన వర్గాలు ఉన్న విషయం బహిరంగ రహస్యం. ఓ వర్గానికి కింజరాపు కుటుంబీకులు, మరో వర్గానికి కళా వెంకట్రావు ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గ విషయానికి వస్తే మాజీ శాసన సభ్యులు గుండ అప్పల సూర్యనారాయణ, గుండ లక్ష్మి దేవి దంపతులు కింజరాపు కుటుంబంతో ఉన్న అభిప్రాయ బేధాల వల్ల కళావర్గంలో కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికల్లో గుండ దంపతులకు టికెట్ రాకుండా అడ్డుకున్నది కింజరాపు కుటుంబమేనని భావిస్తూ గుండ దంపతులు రగిలిపోతున్నారు. కొన్నేళ్లుగా కళా వెంకట్రావు స్తబ్దతగా ఉంటూ వస్తున్నారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలో కాకుండా విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన సైతం కింజరాపు కుటుంబంపై గుర్రుగా ఉన్నారు. కళా వెంకట్రావుకు తొలి విడతలోనే మంత్రి పదవి ఇస్తారని భావించినప్పటికీ అది జరగలేదు. తాజాగా మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, కళాకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కుటుంబ సమేతంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడం, ఆయన్ను మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, మరికొందరు సీనియర్ నాయకులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. అరసవల్లి ఆదిత్యున్ని దర్శించుకున్న కళా వెంకట్రావు హాజరైన మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి, సీనియర్ నాయకులు -
800 ఎకరాల్లో వరి పంట ముంపు
తురకపేట సమీపంలో మునిగిపోయిన వరిపొలాలు సరుబుజ్జిలి: అల్పపీడన ప్రభావానికి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు కిందకు ప్రవహిస్తుండడంతో శుక్రవారం బుడ్డివలస, తెలికిపెంట, పాతపాడు, అగ్రహారం, శాస్త్రులపేట, వీరమల్లిపేట, తురకపేట, వీరభద్రాపురం గ్రామాల్లో గల లోతట్టు ప్రాంతాలకు చెందిన సుమారు 800 ఎకరాల వరి పంట పొలాలు ముంపు బారిన పడ్డాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు కబ్జా చేయడం వల్ల ఇలా వరద నీరు పొలాల మీదకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. -
టైగర్ హిల్స్లో శుత్రమూకలతో..
నేను 28వ రాష్ట్రీయ రైఫిల్స్ (జమ్ము కశ్మీర్)లో విధుల్లో ఉండేవాడిని. 1999 మే 15 అర్ధరాత్రి సమయంలో మాకు ఓ మెసేజ్ వచ్చింది. 38 గంటల్లో కార్గిల్ వైపు కదలాలని సూచన. మే 16 ఉదయం బయల్దేరాం. వాహనాల్లో మా ప్రయాణం. నాలుగు రోజుల సమయం పట్టింది. భారీ ఆయుధ సామగ్రితో ముందుకు కదిలాం. ద్రాస్ సెక్టార్కు చేరుకున్నాం. పర్వతం పైకి ఎలా వెళ్లాలో మాకు రూట్ మ్యాప్ ఇచ్చారు. 20 మంది చొప్పున బృందాలుగా పర్వతంపైకి ప్రయాణం. ఏకే 47, లైట్మెషిన్ గన్, ఎంఎంజీ, మోర్టాల్స్ మా ఆయుధాలు. గుళ్ల వర్షం కురుస్తూనే ఉంది. వారం రోజుల అనంతరం కీలక ప్రాంతమైన టైగర్ హిల్స్కు చేరుకున్నాం. ఈ క్రమంలో జూలై 26వ తేదీన అర్ధరాత్రి వేళ మా కదలికలను గమనించిన శత్రుసైన్యం దాడి చేసింది. నా కుడి చేతికి తీవ్రగాయమైంది. పట్టుతప్పి పర్వతంపై నుంచి కిందికి జారిపడి స్పృహ కోల్పోయాను. బాంబుల మోత ఓ వైపు.. చిమ్మ చీకటి మరోవైపు.. వణికించే చలిలో గాయాల బాధ.. చాలా సేపటి తర్వాత కేకలు వేయడంతో.. ప్రథమ చికిత్స అనంతరం హెలికాప్టర్ శ్రీనగర్ బేస్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులు తర్వాత.. అక్కడ రద్దీ పెరగడంతో ఢిల్లీలోని ఆర్ఆర్ ఆస్పత్రికి.. అక్కడ్నుంచి విశాఖలో ఉన్న ఐఎన్హెచ్ కల్యాణికి తరలించారు. 20 రోజుల మెరుగైన చికిత్స అనంతరం స్వగ్రామానికి చేరుకున్నాను. అనంతరం మళ్లీ విధుల్లో చేరాను. ఆపరేషన్ విజయ్లో ఓపీ స్టార్, ఓపీ విజయ్, ఓపీ రక్షక్, వుండెడ్ మెడల్స్ను ప్రభుత్వం నాకు అందించింది. 1991 జూలై 26న విధుల్లో చేరగా.. 2015 జూలై 26న సైన్యం నుంచి రిటైర్ అయ్యాను. నేటి యువతకు దేశరక్షణ విధులు ఎంత అవసరమో అవగాహన కల్పిస్తూ ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాను. -
యుద్ధ వీరుల
గుండె చప్పుడునేడు కార్గిల్ విజయ్ దివస్ఎముకలు కొరికే చలి, దుర్బేధ్యమైన కొండల్లో ప్రయాణం, ఆగని గుళ్ల వర్షం.. కార్గిల్ యుద్ధం గురించి ఇలాంటి సాహసాలను దేశం కథలు కథలుగా చెప్పుకుంటోంది. పాతికేళ్ల తర్వాత కూడా ఆ విజయ గాథలు నేటి యువత నరనరాలను ఉత్తేజితం చేస్తున్నాయి. పాకిస్తాన్ను ఉక్కు పిడికిలిలో బంధించి మట్టి కరిపించిన ఈ యుద్ధంలో 300 మంది సిక్కోలు ముద్దుబిడ్డలు కూడా పోరాడారు. ఇందులో పోలాకి మండలం రామయ్యవలస గ్రామంలోని చింతాడ మోహనరావు వీరమరణం పొందగా, మరో ఇద్దరు సైనికులు ముష్కరులను మట్టుబెట్టే ప్రయత్నంలో క్షతగాత్రులయ్యారు. ఆనాటి యుద్ధగాథను వారు ఇలా గుర్తు చేసుకున్నారు. – శ్రీకాకుళం న్యూకాలనీ సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి -
● గళమెత్తిన పెన్షనర్లు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుతో పాటు ప్రవేశపెట్టిన పెన్షన్ వాలిడేషన్ రూల్స్ తక్షణమే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కన్వీనర్లు కె.ఎస్ ప్రసాద్రావు, కె.చంద్రశేఖర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫోరం ఆఫ్ పెన్షర్స్ అసోసియేషన్ ఆలిండియా పిలుపు మేరకు శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ కూడలి వద్ద మానవహారం ర్యాలీ నిర్వహించారు. రిటైర్మెంట్ తేదీల ప్రాతిపదికన పెన్షనర్ల మధ్య వివక్షతో కూడిన పెన్షన్ సవరణలు ప్రతిపాదనను విరమించాలన్నారు. -
72 గంటలు ఫైరింగ్ ఆపలేదు..
అది 1999 మే 25. శ్రీనగర్ సమీపంలో 1889 ఎల్టీ రెజిమెంట్ డ్యూటీలో ఉన్నా. మరుసటి రోజు ఉదయాన్నే కార్గిల్ వైపు బయల్దేరాలని హయ్యర్ కమాండ్ నుంచి సమాచారం వచ్చింది. దీంతో అంతా ముందుకు కదిలాం. శత్రుమూకలు కొండపైనుంచి గుళ్ల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. మే 31 నాటికి ప్రతికూల పరిస్థితుల్లో టోలోలింగ్ పర్వత ప్రాంతానికి చేరుకున్నాం. వేసవి కాలం అయినా విపరీతమైన చలి. 421 కేజీల బరువైన 121 ఎంఎంగన్ను ఐదుగురు సభ్యులం చొప్పున మోసుకుంటూ.. ఫైరింగ్ చేస్తూ ముందుకుసాగాం. దాదాపు 72 గంటలు ఫైరింగ్ ఆపలేదు. గుళ్ల వర్షం కురుస్తూనే ఉంది. బాంబుల మోతతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతోంది. అలా రోజులు గడుస్తూ జూన్ 12 మొదటి విజయం దక్కింది. ద్రాస్ సెక్టార్లోని టోలోలింగ్ పర్వత ప్రాంతం భారత సైన్యం ఆధీనంలోకి వచ్చింది. కీలక ప్రాంతం స్వాధీనం కావడంతో విజయోత్సాహంతో ముందుకు కదిలాం. అదే రోజు రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఉన్నట్టుండి పెద్ద కుదుపు. నా కుడి చేతికి తీవ్రగాయాలయ్యాయి. విపరీతంగా రక్తం పోతోంది. అయినా వెరవకుండా ముందుకు సాగాను. నా పరిస్థితి గమనించిన ఉన్నతాధికారులు అదే రోజు రాత్రి చికిత్స కోసం హెలీకాప్టర్లో ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. ఉదయం శస్త్రచికిత్స జరిగింది. మూడురోజుల తర్వాత విమానంలో చంఢీగడ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ 12 రోజులు ఉన్నాను. అనంతరం విశాఖపట్నంలోని ఐఎస్హెచ్ కల్యాణిలో వారం ఉండి అనంతరం ఊరికి వచ్చాను. అక్కడకు కొద్ది రోజుల విశ్రాంతి తర్వాత విధుల్లో చేరాను. ఓపీ స్టార్ మెడల్ను ప్రభుత్వం అందజేసింది. 1995 అక్టోబర్ 31న సైన్యంలో విధుల్లో చేరి.. 2014 ఆగస్ట్ 1న పదవీవిరమణ చేశాను. -
ఇచ్ఛాపురం సబ్ పోస్టాఫీస్లో భారీ స్కామ్
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం సబ్ పోస్టాఫీసులో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఇక్కడ 33 ఖాతాల నుంచి రూ.2.86 కోట్లను పోస్టల్ సిబ్బంది, సహాయకులు కలిసి కాజేసిన వైనం విస్మయం కలిగించింది. ఈ మేరకు శుక్రవారం సోంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీకాంత్, శ్రీకాకుళం ఈస్డ్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కమల్హాసన్ ఇచ్ఛాపురం పోస్టాఫీసులో కొందరు ఖాతాదారులతో మాట్లాడారు. అందరి డబ్బు తిరిగి వస్తుందని భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ నెల 7వ తేదీన ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో ఆన్లైన్లో అవకతవకలు జరిగాయని పైఅధికారులకు ఓ ఫిర్యాదు వెళ్లింది. దీనిపై వారు దర్యాప్తు నిర్వహించగా గత డిసెంబర్లో 33 ఖాతాల నుంచి రూ.2.86 కోట్లు కాజేసినట్లు తేలింది. దీంతో శుక్రవారం సోంపేట పోస్టల్ ఇన్స్పెక్టర్ ఎన్.శ్రీకాంత్, శ్రీకాకుళం ఈస్ట్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కమల్హాసన్ ఇచ్ఛాపురం పోస్టాఫీసుకు వచ్చారు. కొంతమంది ఖాతాదారులను పిలిపించుకుని మాట్లాడారు. ఖాతాదారులకు సంబంధం లేకుండా వారి అకౌంట్లు క్లోజ్ చేసి డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు. వీరిలో ఎక్కువగా కిసాన్ వికాస్ పత్ర్ ఫిక్స్డ్ డిపాజిట్లను క్లోజ్చేసినట్లు తెలుసుకున్నారు. ఈ స్కామ్లో 14 మంది అనుమానితులుగా ఉన్నారని, వారిలో ఐదుగురిని సస్పెండ్ చేస్తున్నామని తెలిపారు. ఉన్నత స్థాయి దర్యాప్తు జరుగుతుందని, ఖాతాదారులకు వారు కట్టిన ప్రతి పైసా కూడా అందుతుందని చెప్పారు. 33 ఖాతాల నుంచి రూ.2.86 కోట్ల నగదు మాయం ఐదుగురు సస్పెన్షన్ -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశం
నరసన్నపేట: శ్రీకాకుళం సమీపంలోని పాత్రునివల స జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక సమా వేశం ఉదయం 10 గంటల కు నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. జిల్లాలో పార్టీ నిర్మాణం, రీకాలింగ్ చంద్రబా బు, ఇంటింటి ప్రచార కార్యక్రమాల పురోగతిపై సమీక్ష ఉంటుందని తెలిపారు. అలాగే గ్రామ కమిటీల ఏర్పాటుపై సమీక్ష ఉంటుందన్నారు. సమావేశానికి పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు కుంభా రవిబాబు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయాధికారులపై కలెక్టర్ సీరియస్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో ఎరువుల కొరత ఉందని, ప్రతి గ్రామంలో రైతులు ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయాధికారులపై సీరియస్ అయ్యారు. శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో వ్యవసాయ సంచాలకు లు, వ్యవసాయ అధికారులు, గ్రామ వ్యవసా య సహాయకులు, సొసైటీ ప్యాక్ సీఈఓలతో జిల్లాస్థాయి సమీక్ష సమావేశాన్ని శుక్రవారం ని ర్వహించారు. కలెక్టరేట్లో ఎరువులకు సంబందించిన ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటుచేశామని ప్రతి ఒక్క రైతుకు తెలియజేయా లని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా ఉద్యోగాలు చేయడం మంచిది కాదని, రైతులకు ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులపై వేటు తప్పదన్నారు. జిల్లా వ్యవసాయాధికారి వద్ద సమగ్ర సమాచారం లేకపోవడం, అడిగిన దానికి సరైన సమాధానం చెప్పకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లాట్ ప్రకారం కూపన్ పద్ధతిలో సరఫరా చేసే తేదీ, సమయం తెలియజే యాలన్నారు. -
అథ్లెటిక్స్ సమరానికి వేళాయె
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్ అసోసి యేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఈనెల 27వ తేదీన జరగను న్నాయి. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఎంపిక ల ప్రక్రియ మొదలుకానుంది. అథ్లెటిక్స్ అసో సియేషన్ రాష్ట్ర, జిల్లా చైర్మన్ కొన్న వెంకటేశ్వరావు(వాసు) సూచనల మేరకు జిల్లా అథ్లెటి క్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి నేతృత్వంలో జిల్లా సంఘ ప్రతినిధులు, పీడీ, పీఈటీలు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. నాలుగు వయో విభాగాల్లో పోరు.. సౌత్జోన్ నేషనల్స్లో పాల్గొనే అథ్లెటిక్స్ క్రీడా కారుల ఎంపికలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో చేపట్టనున్నారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా 100 మీటర్ల పరుగుపందాలు, హర్డిల్స్, 200 400, 800, 1000, 2వేలు, 3వేలు, 5వేల మీటర్ల పరుగు పందాలు, నడక, లాంగ్జంప్, హైజంప్, ట్రిపుల్జంప్, షాట్పుట్, జావెలిన్ త్రో, హేమర్త్రో, పోల్వాల్ట్ తదితర అథ్లెటిక్స్ ఈవెంట్స్లో పోటీలు నిర్వహించి అందులో రాణించిన క్రీడాకారులను రాష్ట్రపోటీలకు ఎంపిక చేయనున్నారు. ఇక్కడ రాణిస్తే రాష్ట్ర పోటీలకు.. ఏపీ జూనియర్ స్టేట్మీట్(అంతర్జిల్లాల) అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలు బాపట్ల జిల్లా (చీరాల) వేదికగా ఆగస్ట్ 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్నాయి. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానం వేదికగా ఇక్కడ జరిగే ఎంపికల్లో రాణించిన అథ్లెట్లను బాపట్లలో జరిగే రాష్ట్ర పోటీలకు ఎంపిక చేయనున్నారు. అక్కడ మూడు రోజులపాటు పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు, ప్రశంసా పత్రాలను అందజేస్తారు. గోల్డ్ మెడల్స్ సాధించిన క్రీడాకారులు సౌత్జోన్ నేషనల్స్కు నేరు గా అర్హత సాధించనున్నారు. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 11వ తేదీ వరకు సౌత్జోన్ జూనియర్ నేషనల్స్ జరగనున్నాయి. క్రీడాకారులు వివరాల కో సం సంఘ జిల్లా కార్యనిర్వాహక కార్య దర్శి కె.మాధవరావు (9346903771)ను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు రాష్ట్రపోటీలకు ఎంపిక ప్రతిభే ఆధారంగా.. క్రీడాకారుల ప్రతిభే ఆధారంగా ఎంపికల ను నిర్వహిస్తాం. ఇక్కడ రాణించిన బాల బాలికలను బాపట్లలో జరిగే స్టేట్మీట్కు ఎంపిక చేస్తాం. అక్కడ రాణిస్తే సౌత్జోన్ నేషనల్స్కు నేరుగా అర్హత సాధిస్తారు. – మెంటాడ సాంబమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సద్వినియోగం చేసుకోవాలి సౌత్జోన్ మీట్ షెడ్యూల్ వెలువడింది. 27న శ్రీకాకుళంలో జరిగే జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తమ ప్రతిభను నిరూపించుకోవాలి. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు -
సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
మెళియాపుట్టి: స్థానిక సచివాలయ ఉద్యోగులు చేసిన తప్పిదానికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీఓ నరసింహప్రసాద్ పండా తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మూగి భాస్కరరావు, కృష్ణవేణిల ఇద్దరు కుమారులు మూగి మోక్షిత్, మూగి షారుఖ్లు సచివాలయ ఉద్యోగుల తప్పిదం కారణంగా తల్లికి వంద నం పథకానికి అనర్హులయ్యారు. హౌస్ హోల్డ్ సర్వేలో అధికారులు వారిద్దరూ చనిపోయిన ట్లు ఆన్లైన్లో నమోదు చేయడంతో వారికి నగదు అందలేదు. దీనిపై తల్లిదండ్రులు జేసీకి ఫిర్యాదు చేయడంతో ఆయన ఆదేశానుసారం వెల్ఫేర్ అసిస్టెంట్, కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు ఎంపీడీ ఓ తెలిపారు. జీడి రైతుకు సత్కారం కాశీబుగ్గ: వన్ డిస్ట్రిక్ వన్ ప్రొడక్టు (ఓడీఓపీ) కార్యక్రమానికి జిల్లా పలాస జీడిపప్పు ఎంపికై న సందర్భంగా.. పారిశ్రామిక వేత్తలతో పాటు వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన రైతు యంపల్లి నారాయణను సత్కరించారు. ఆలిండియా కాష్యూ అసోసియేషన్ చైన్నె మహాబలిపురంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాష్యూ మాన్యుఫ్యాక్చర్ అసోసియేషన్ ఆహ్వా నం మేరకు రైతు వెళ్లారు. పలాస పరిసర ప్రాంతంలో ఉద్దానంలో రైతులు పండించిన జీడి పంట కారణంగా పేరుప్రఖ్యాతలు వచ్చాయ ని ఏపీసీఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లా కాంతారావు తెలిపారు. అబ్బాయిపేటలో చోరీ జలుమూరు: జోనంకి పంచాయతీ అబ్బాయిపేటకు చెందిన ఉప్పాడ నరసమ్మ ఇంటిలో దొంగతనం జరిగింది. చోరీలో రూ.60వేల విలువై న బంగారం పోయినట్లు ఆమె తెలిపారు. పది రోజుల కిందట ఆమె హరిదాసుపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉద యం తిరిగి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉంది. అందులో బంగారంతో పాటు కొన్ని వస్తువులు కనిపించలేదు. ఇంటి తలుపు తీసి బీరువా పగలగొట్టి లోపల లాకర్ తెరిచారని ఆమె తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి రణస్థలం: రణస్థలంలోని ఓ ఇంటికి స్లాబ్ ఇనుప రాడ్లు కడుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో కె.గోవిందరావు(48) అనే వ్యక్తి మృతి చెందాడు. జేఆర్ పురం పోలీసు లు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని జోగిరాజుపేట గ్రామానికి చెందిన గోవిందరావు స్లాబ్ పనికి రాడ్లు కట్టేందుకు శుక్రవారం ఉదయం 8.15 గంటలకు రణస్థలం వచ్చారు. స్లాబ్పై పని చేస్తున్న సమయంలో విద్యుత్ తీగలు తగలడంతో చలనం లేకుండా పడిపోయారు. తోటి కా ర్మికులు గుర్తించి శ్రీకాకుళం రిమ్స్కు తరలించినా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
‘న్యాయవాదులకు రక్షణ చట్టం చేయాలి’
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం న్యాయవాదుల రక్షణ చట్టం చేయాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదు లు డిమాండ్ చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్, ఆంధ్రప్రదేశ్ బీసీ న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకు ళం జిల్లా కోర్టు మెయిన్ గేటు వద్ద నిరసన తెలిపా రు. న్యాయవాదుల రక్షణ చట్టం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నా యని అన్నారు. న్యాయవాదుల మరణం తర్వాత వారి వారసులకు చెల్లించే పరిహారం రూ.పది లక్ష లకు పెంచాలని, ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.పది వేలు ఇవ్వాలని కోరారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
మౌలిక వసతులపై దృష్టి పెట్టండి: కలెక్టర్
బూర్జ: విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంపై దృష్టి సారించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మండలంలో గల కొల్లివలస డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం విద్యాలయంలో శుక్రవారం జిల్లాలోగల అన్ని హాస్టళ్ల అనుబంధ శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తాగునీరు, వసతులు, డార్మిటరీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కిటికీల వద్ద దోమ తెరలు అమర్చాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాఖల వారీగా హాస్టల్ జిల్లా అధికారుల తో సమీక్ష నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విద్యాలయాల ఎస్ఎం పురం, వమ్మరవెల్లి కళాశాల ప్రిన్సిపాల్స్, కేజీబీవీ విద్యాలయాల ఏపీసీ ఎస్.శశిభూషణరావు, ఏపీ మోడ ల్ విద్యాలయాలు ఏడీ శ్రీనివాసరావు, డిప్యూటీ ఈఓ కె.విజయకుమారి, కన్వీనర్ బొడ్డేపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ఐటీఐ పాసైన విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెంటిస్షిప్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి జిల్లా ప్రజారవాణా అధికారి హనుమంతు అమరసింహుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి ఆగస్టు నెల 9వ తేదీ లోపు www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురికి గాయాలు
వజ్రపుకొత్తూరు: మండలంలోని పూండి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉద్దానం గోపినాథపురానికి చెందిన దున్న హేమారా వు, మరో మహిళ కు తీవ్ర గాయాలయ్యాయి. పూండి నుంచి పలాస వైపు పాఠశాలలకు చెందిన పుస్తకాల లోడుతో వెళుతున్న శ్రీకాకుళానికి చెందిన వ్యాన్ పలాస నుంచి ద్విచక్ర వాహనంపై వస్తున్న హేమారావును బలంగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనం ధ్వంసం కాగా వెనుక ఉన్న మహిళకు తీవ్ర గాయాలై కాలు విరిగిపోయింది. వాహనం నడుపుతున్న హేమరావుకు తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అక్కడకు చేరుకుని 108 వాహనానికి సమాచారం అందించి హుటాహుటిన పలాస ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను శ్రీకాకుళం తీసుకెళ్లా రు. వజ్రపుకొత్తూరు పోలీసులు సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. సినిమాకు వెళ్లి వస్తుండగా.. కవిటి: సోంపేటలో ‘హరిహర వీరమల్లు’ సినిమా చూసి తిరిగి వస్తుండగా ముగ్గురు యువకులు రో డ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. కవిటి మండలంలోని బొరివంక వద్ద గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి శుక్రవారం కేసు నమో దు చేసినట్టు ఎస్ఐ వి.రవివర్మ విలేకరులకు తెలిపా రు. కవిటి మండలం కపాసుకుద్దికి చెందిన కర్రి మే ఘనాథం, కర్రి జోగారావు, వంక రాజులు గురు వా రం సినిమా చూద్దామని ముగ్గురూ ఒకే బైక్పై సోంపేట వెళ్లారు. సినిమా చూసి తిరిగి వస్తుండగా తల తంపర వద్ద ఒకరిని ఢీకొన్నట్లు స్థానికులు తెలిపా రు. అక్కడ గొడవ జరుగుతుందేమోనన్న భయంతో వాహనాన్ని వేగంగా నడుపుతూ బొరివంక వద్ద స్పీడ్బ్రేకర్ను తప్పించే ప్రయత్నంలో పక్కన ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్నారు. స్థానికులు అంబులెన్స్కు సాయంతో సోంపేట ఆస్పత్రికి తరలించారు. -
అమలు మైనస్
దారి ఖర్చులు ఇవ్వలేరా..? రాకరాక వచ్చిన వానలు దారుల దారుణ రూపాలను బయటపెట్టాయి. గిరిజన గ్రామాలు, చిన్న చిన్న పల్లెలను కలిపే రహదారులు చిన్నపాటి చినుకులకే చిత్తడిగా మారిపోయాయి. ఇక పెద్ద వర్షాలు పడితే తమ గతేమవుతుందని ఆయా ప్రాంతాల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానలు రాక ముందే వీటిని బాగు చేసి ఉంటే తమకు ఈ అవస్థ తప్పేదని అంటున్నారు. ‘హైస్కూల్ ప్లస్’..● హైస్కూల్ ప్లస్ కళాశాలలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ● వెంటాడుతున్న అధ్యాపకుల కొరత ● కానరాని మౌలిక సదుపాయాలు ● ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు నరసన్నపేట: గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిలకు ఉన్నత విద్యను అందించేందుకు గత ప్రభుత్వం హైస్కూల్ ప్లస్లను ప్రవేశ పెట్టింది. జాతీయ విద్యావిధానంలో భాగంగా 2022 విద్యా సంవత్సరం నుంచి హైస్కూల్ ప్లస్ అమలు చేస్తున్నారు. దీంతో రూరల్ ప్రాంతాల్లోని బాలికలకు ఇంటర్ అందుబాటులోకి వచ్చింది. జిల్లాలో నరసన్నపేట మండలం ఉర్లాం, టెక్కలి (బాలికోన్నత పాఠశాల), వజ్రపుకొత్తూరు, మందస మండలం హరిపురం, సరుబుజ్జిలి మండలం రొట్టవలస, పలాస మండలం బ్రాహణతర్లాలో వీటిని ఏర్పాటు చేశారు. మొదటి సంవత్సరం ప్రవేశాలు అంతంతగానే ఉన్నా తర్వాత సంవత్సరం బాగా పెరిగాయి. ఆయా ప్రాంత బాలికల తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. చెంతనే 6 వ తరగతి నుంచి ఇంటర్ వరకూ విద్యా బోధన లభిస్తుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. సబ్జెక్టులకు అవసరమైన అధ్యాపకులను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అంతా సవ్యంగా సాగుతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ హైస్కూల్ ప్లస్ విద్యపై శీత కన్ను వేసింది. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఫలితంగా ప్లస్ టూ కళాశాలల్లో అడ్మిషన్లు తగ్గుతున్నాయి. వీటిని ఎత్తివేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందనే వదంతులు వినిపిస్తున్నాయి. దీంతో వి ద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వెంటాడుతున్న అధ్యాపకుల కొరత హైస్కూల్ ప్లస్టూ కళాశాలల్లో బైపీసీ, ఎంపీసీ గ్రూపులు నిర్వహిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 40 సీట్లు చొప్పున ఒక్కో విద్యా సంవత్సరంలో 80 సీ ట్లు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 6 హైస్కూల్స్లో ప్లస్ టూ కళాశాలల్లో కోర్సులు నిర్వహిస్తున్నారు. ఒక్క టెక్కలి తప్ప మిగిలిన ప్లస్ టూ కళాశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు అంత ఆశాజనకంగా లేవు. దీనికి కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో ప్లస్ టూ కళాశాలలో ఏడుగురు లెక్చరర్లు ఉండాలి. జిల్లాలో టెక్కలి, వజ్రపుకొత్తూరుల్లో తప్ప మిగిలిన చోట్ల అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేరు. ఉర్లాంలో బోట నీ, తెలుగు, ఇంగ్లిష్లకు పూర్తి స్థాయిలో అధ్యాపకు లు ఉండగా కెమిస్ట్రీ సబ్జెక్టును లుకలాం స్కూల్ నుంచి ఒక టీచర్ వచ్చి బోధిస్తున్నారు. మిగిలిన ఫి జిక్స్, లెక్కలు, జువాలజీ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే రొట్టవలసలో కూడా నా లుగు సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. హరిపురంలో లెక్కలు, జువాలజీ సబ్జెక్టులకు అధ్యాపకులు లేరు. సౌకర్యాలు కావాలి ఉర్లాం ప్రాంతానికి జూనియర్ కళాశాల కావాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. ధర్మాన కృష్ణదాస్ కృషి వల్ల గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి ఆలోచనా విధానం వల న ఉర్లాం హైస్కూల్లో రెండేళ్ల కిందట ఇంటర్ తరగతుల నిర్వహణకు అవకాశం ఇచ్చారు. మా ప్రాంతం వాళ్లు ఆనందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వర్యం చేయడాని కి చూస్తోంది. ప్రభుత్వం వచ్చి ఏడాది దాటు తున్నా వసతులు మెరుగు పరచలేదు. – పోలాకి నర్సింహమూర్తి, సర్పంచ్ ఉర్లాం మెరుగు పడని వసతులు.. ప్లస్ టూ కళాశాలల్లో వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. సైన్స్ విద్యార్థులు ప్రాక్టిక ల్స్ చేసుకునేందుకు తగిన సదుపాయాలు లేవు. తరగతి గదుల కొరత అధికంగా ఉంది. అలాగే ఆఫీస్ వర్క్ చేసేందుకు తగిన సిబ్బంది కొరత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలాంటి సదుపాయాలు మెరుగు పడలేదు. ఉర్లాంలో ఇరుకు గదుల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఇదే పరిస్థితి రొట్టవలస, బ్రాహ్మణతర్లాలో కూ డా ఉంది. అన్ని చోట్ల ప్రాక్టికల్స్ ల్యాబ్స్ లేవు. వసతులు మెరుగు పరచాలని, ఈ కళాశాలలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అదనపు నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సౌకర్యాలు మెరుగు పరచాలి గత ప్రభుత్వం తీసుకొచ్చి న ఈ ప్లస్ టూ కళాశాలల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో బాలికలకు ఇంటర్ విద్య అందుబాటులోకి వచ్చింది. కానీ దీనిపై కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. అధ్యాపకులను నియమించకుండా తాత్సారం చేస్తోంది. గత ప్రభుత్వం అమలులోనికి తెచ్చిన ఈ ప్లస్ టూ కళాశాలలను పటిష్టం చేయాలి. – తమ్మినాన చందనరావు, ఏపీఎస్టీఏ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
సురేఖా పాణిగ్రాహికి అంతిమ వీడ్కోలు
పలాస: ప్రముఖ విప్లవ కవి, శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధపోరాట నిర్మాతల్లో ఒకరైన సుబ్బారావు పాణిగ్రాహి సతీమణి సురేఖా పాణిగ్రాహి (87)కి శుక్రవారం ఉదయం పలాస మండలం బొడ్డపాడులో అంతిమ యాత్ర జరిగింది. ముందుగా బొడ్డపాడు కాలనీ నుంచి బొడ్డపాడు గ్రామ అమరవీరుల స్మారక మందిరం వద్దకు మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చారు. బంధువులు, వివిధ గ్రామా ల నుంచి వచ్చిన ప్రజాసంఘాల నాయకులు, విప్లవ కారులు, అభిమానులు పెద్ద ఎత్తున జోహార్లు అర్పించారు. అనంతరం అమరుల బంధుమిత్రుల సంఘం నాయకుడు తామాడ త్రిలోచనరావు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సురేఖా పాణిగ్రాహి మృతి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం బొడ్డపాడు శ్మశాన వాటిక వద్ద ప్రజాకళామండలి, అరుణోద య కళాకారుల పాటల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. -
సైన్స్లో మరిన్ని ఆవిష్కరణలు అవసరం
శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంలో సైన్స్, సాంకేతిక రంగంలో మరిన్ని ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణాలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ పి.అప్పారావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ, పీజీ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ కణితి శ్రీరాములు అధ్యక్షతన పాపులర్ లెక్చర్ సిరీస్ పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ బయెటెక్నాలజీ న్యూఢిల్లీ సౌజన్యంతో అప్లైడ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అప్పారావు మాట్లాడుతు సైన్స్లో ఆవిష్కృతమయ్యే సరికొత్త వంగడాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని ఆకాంక్షించారు. మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్ రాయల సురేష్కుమార్, కళాశాల అప్లైడ్ సైన్సెస్(బయోటెక్నాలజీ) విభాగాధిపతి డాక్టర్ మధమంచి ప్రదీప్, జీడీసీ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు, గురజాడ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సంయుక్త తదితరులు కార్యక్రమంలో ప్రసంగించి సైన్స్ పరిశోధనలు, విజ్ఞానం, వ్యాధులపై అవగాహన కల్పించారు. పలు అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో కార్యనిర్వాహక కార్యదర్శి పైడి సుధారాణి, సభ్యురాలు డాక్టర్ రోణంకి హరిత, కె.ప్రశాంతి, కె.అపర్ణ, అధ్యాపకులు, వివిధ కళాశాలల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. క్యాన్సర్పై అప్రమత్తం.. క్యాన్సర్ వ్యాప్తి గురించి విద్యార్ధులు సమగ్రంగా తెలుసుకోవాలిది. వ్యాధిపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తొలి దశలో క్యాన్సర్ గుర్తింపుతో కొంత నష్టనివారణ చర్యలు తీసుకోవచ్చు. ఏడాదికి కనీసం రెండుసార్లు శారీరక,ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. – ప్రొఫెసర్ రాయల సురేష్కుమార్, మద్రాస్ ఐఐటీ సైన్స్తోనే జీవితం.. నిత్యజీవితం సైన్స్తోనే ముడిపడి ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సైన్స్తోపాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధలు ఆవిష్కృతం కావాలి. పరిశోధనలతోనే గుర్తింపు లభిస్తుంది. విద్యార్థి దశ నుంచే పరిశోధనా రంగంపై ఆసక్తిను అలవర్చుకోవాలి. – కింతలి సూర్యచంద్రరావు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ నైపుణ్యం మెరుగు.. సదస్సులు, సెమినార్లతో విద్యార్థుల్లో ఆలోచన సరళి, పరిశోధనా నైపుణ్యం మరింత మెండుగా తయారవుతుంది. విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయడానికి ఇటువంటి సదస్సులు దోహదపడతాయి. కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. – డాక్టర్ మదమంచి ప్రదీప్కుమార్, బయోటెక్నాలజీ హెచ్ఓడీ హైదరాబాద్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అప్పారావు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘పాపులర్ లెక్చర్ సిరీస్’ తరలివచ్చిన నిష్ణాతులు, అధ్యాపకులు, విద్యార్థులు -
శాకంబరిగా రాజరాజేశ్వరీ దేవి
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని గుడివీధి ఉమారుద్ర కోటేశ్వర దేవాలయంలో రాజరాజేశ్వరీ అమ్మవారిని ఆషాఢ మాసం, మాస శివరాత్రిని పురస్కరించుకొని గురువారం శాకంబరిగా అలంకరించారు. అర్చకులు ఆరవెల్లి శ్రీరామమూర్తి, చంద్రశేఖరశర్మ ఆధ్వర్యంలో ఉదయం అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఔట్పోస్టు టెండర్లు ఖరారు శ్రీకాకుళం పాతబస్టాండ్: అగ్నిమాపక కార్యాలయాల నిర్వహణకు సంబంధించి పొందూరు, మందస ఔట్ పోస్ట్ టెండర్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం తెరిచారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో తక్కువ ఉన్న టెండర్లను ఖరారు చేశారు. కార్యక్రమంలో అగ్నిమాపక జిల్లా అధికారి జె.మోహనరావు, అటవీ శాఖ సబ్ డీఎఫ్ఓ నాగేంద్ర, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొన్నారు. పద్యకవితా చక్రవర్తి జాషువా శ్రీకాకుళం కల్చరల్: పద్య కవితా చక్రవర్తి గుర్రం జాషువా అని వక్తలు కొనియాడారు. సాహితీ స్రవంతి, శ్రీకాకుళ సాహితీ ఆధ్వర్యంలో కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో గురువారం జాషువా వర్ధంతి సభ నిర్వహించారు. కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు, ఆకాశవాణి కేంద్రం(విశాఖ) వ్యాఖ్యాత, రచయిత డాక్టర్ బండి సత్యనారాయణ ప్రసంగిస్తూ జాషువా ఆశయాలను, వర్తమాన స్థితిగతుల్ని వివరించారు. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కథానిలయం ట్రస్టు కార్యదర్శి దాసరి రామచంద్రరావు, రచయిత చింతాడ తిరుమలరావు, తెలుగు అధ్యాపకులు బాడాన శ్యామలరావు, రచయిత కలమట దాసుబాబు, డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్సు విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ కె.శ్రీనివాసరావు, గరిమెళ్ల విజ్ఞాన కేంద్రం సహాయ కార్యదర్శి సుధాకర్, ప్రజా సాహితీ కార్యదర్శి పి.మోహనరావు, యువ రచయితల వేదిక అధ్యక్షులు తంగి ఎర్రమ్మ, సాహితీ స్రవంతి సభ్యులు కె.భుజంగరావు, పి.దివాకర్, ఎన్.రమణారావు, భానుప్రసాద్, కె.ఉదయ్కిరణ్, లీలావరప్రససాద్, పొన్నాడ వరాహ నరసింహులు, కవీశ్వరరావు, సిహెచ్ రామచంద్రరావు, సన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. 31 మద్యం బాటిళ్లు స్వాధీనం సారవకోట: మండల కేంద్రం సారవకోటలో వైన్షాపు నుంచి 31 మద్యం బాటిళ్లను తరలిస్తున్న కుమ్మరిగుంట గ్రామానికి చెందిన లక్కోజు వెంకటరావును టాస్క్ఫోర్స్ సిబ్బంది బుధవారం రాత్రి పట్టుకున్నారు. అనంతరం సారవకోట పోలీస్స్టేషన్కు అప్పగించారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపించినట్లు ఎస్ఐ అనిల్కుమార్ గురువారం తెలిపారు. తప్పిన ప్రాణాపాయం రణస్థలం: రణస్థలం కొత్త పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. విశాఖపట్నం వైపు నుంచి శ్రీకాకుళం వైపు వస్తున్న కారును వెనుకనే వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు మలుపులు తిరుగుతూ లారీ ముందుభాగంలో ఉండిపోయి కొంతదూరం ముందుకు దూసుకొచ్చింది. లారీ డ్రైవర్ ఆప్రమత్తంగా వ్యవహరించడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు ఎటువంటి గాయాలు కాలేదు. కారు డ్యామేజ్ అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. -
పచ్చని ఉద్దానాన్ని రాళ్లురప్పలతో పోల్చొద్దు
మందస: నిత్యం పంటలతో పచ్చగా కళకళలాడే ఉద్దానాన్ని రాళ్లురప్పలతో కూడిన శంషాబాద్ ఎయిర్పోర్టు భూములతో పోల్చడం సరికాదని కార్గో ఎయిర్ పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అన్నారు. గురువారం మందస మండలం గంగువాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఓ టీవీ చానెల్తో మాట్లాడుతూ ఉద్దానాన్ని శంషాబాద్ ప్రాంతంతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించారు. అనంతరం బత్తిన లక్ష్మణ్ మాట్లాడుతూ కొబ్బరి, జీడి, పసన, మామిడి, మునగ, అరటి, జామ, నిమ్మ తదితర పంటలతో కూడిన పచ్చని నేలతల్లిని విడిచి వెళ్లిపోవాలని ఎలా అనగలుగుతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో పొట్టి ధర్మారావు, ఎర్రయ్య, నారాయణ, దున్న హరికృష్ణ, శాంతారావు, శంకర్, చలపతి, సోమేశ్వరరావు, దున్న రామారావు, సంతోష్, శ్యామ్ పాల్గొన్నారు. -
అచ్యుతానందన్ మృతి తీరని లోటు
రణస్థలం: కార్మిక, కర్షక, పేదల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన మహోన్నత పోరాట యోధుడు కామ్రేడ్ అచ్యుతానందన్ మరణించడం కార్మిక పోరాటాలకు తీరని లోటు అని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్.వి.రమణ అన్నారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్కు విప్లవ జోహార్లు అర్పిస్తూ ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలసలోని శ్యాంపిస్టన్ ప్లాంట్–3 పరిశ్రమ వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ 102 ఏళ్ల జీవన ప్రయాణంలో 85 ఏళ్ల తన జీవితాన్ని ప్రజలు, కార్మికులు కష్టజీవుల కోసం, నమ్మిన సిద్ధాంతాల కోసం వెచ్చించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎం.అశోక్, ఎల్.నాగరాజు, జె.సురేష్, ఎం.సునీల్, పి.శ్రీను, కృష్ణారావు, ఎస్.శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపో విభజన తగదు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను ఎవరి ప్రయోజనాల కోసం విడదీసి టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేస్తున్నారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమాధానం చెప్పాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.కృష్ణమూర్తి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం శ్రీకాకుళంలో వామపక్షాలు, ఉద్యోగ, కార్మిక, రైతు, మహిళా, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్అండ్బీ బంగ్లా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిపోను విభజిస్తే అనేక దళిత, పేద హమాలీ కుటుంబాలకు ఉపాధి లేకుండా పోతుందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడును జిల్లా ప్రజలు శివారు భూములకు నీరు ఇమ్మని అడుగుతున్నారు తప్ప బీరు అడగడం లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వామపక్ష, వివిధ సంఘాల నాయకులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, సంతోష్, ఎం.గోవర్ధనరావు, కె.సూరయ్య, ఎల్.రామప్పడు, ఎం.రమణ, పి.సుధాకర్బాబు, కేదారేశ్వరరావు, ఆర్.ప్రకాష్, హమాలీ యూనియన్ నాయకులు నిడిగంట్ల రమణ, గజిని శ్రీనివాసరావు, లండ సీతారాం, లింగాల రాము, శొంఠ్యాన శ్రీనివాసరావు, నవిరి సురేష్ పాల్గొన్నారు. -
కొలిక్కిరాని కిట్లు లెక్క!
ఆదేశాలు బేఖాతరు.. సమగ్ర శిక్ష ఏపీసీ రాష్ట్ర జిల్లా అధికారుల ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ప్రాజెక్టులోని ఖాళీగా ఉన్న నాలుగు సెక్టోరియల్ పోస్టులకు తక్షణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించి సుమారు 20 రోజులు కావస్తున్నా ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఏపీసీలతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా రాష్ట్ర అధికారులు సెక్టోరియల్ అధికారుల నియామకానికి సంబంధించిన అంశంపై ఆదేశాలు జారీ చేయగా, జిల్లా కలెక్టర్ సైతం తక్షణం సెక్టోరియల్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశింనా ఫలితం లేకుండా పోయింది. సెక్టోరియల్ అధికారులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలపై పర్యవేక్షణ లేకుండా పోయింది. శ్రీకాకుళం: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై 50 రోజులు కావస్తున్నా జిల్లాలో నేటికీ అనేక మంది విద్యార్థులకు స్టూటెంట్ కిట్లు అందలేదు. జిల్లాకు సరిపడినన్ని కిట్లు వచ్చినప్పటికీ కొరత ఎందుకు ఏర్పడిందని, తక్షణం పాఠశాలల వారీగా విద్యార్థులకు సరఫరా జరిగిన కిట్లు సంఖ్యను తమ కార్యాలయానికి తెలియజేయాలని రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు జిల్లా అధికారులకు ఆదేశించారు. అయితే ఈ వివరాలను సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు చెప్పలేకపోతున్నారు. పాఠశాలలపై పర్యవేక్షణ జరపాల్సిన సెక్టోరియల్ అధికారుల లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని ఏఏ పాఠశాలలకు బూట్లు, కిట్లు, యూనిఫామ్ ఎన్నెన్ని అవసరమన్నది చెప్పలేని స్థితిలో సమగ్ర శిక్ష ఏపీసీ సిబ్బంది ఉన్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన సీఎంఓ ఉన్నప్పటికీ ఆయనకి సైతం అవగాహన లేకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంఈఓలపైనా ఆధారం.. జిల్లాలోని సుమారు 19 వేల మంది విద్యార్థులకు ఇప్పటికీ యూనిఫాంం, బూట్లు, నోట్ పుస్తకాలు అందాల్సి ఉంది. ఎవరెవరికీ అవసరమో లెక్కలు తేల్చలేమని నిర్ణయానికి వచ్చిన సమగ్ర శిక్ష అధికారులు మంగళవారం ఎంఈఓలకు ఓ మెసేజ్ పంపించారు. పాఠశాలల వారీగా విద్యార్థులు సరఫరా అయిన కిట్లు సంఖ్యను కార్యాలయానికి తెలియజేయాలని పేర్కొన్నారు. సమగ్ర శిక్ష వద్ద ఉండవలసిన సమాచారాన్ని ఎంఈఓ నుంచి సేకరించాలని ప్రయత్నాలు చేస్తూ ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రొటోకాల్ ఉల్లంఘన.. సమగ్ర శిక్ష ఏపీసీ ప్రొటోకాల్ సైతం ఉల్లంఘిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించగా గార ఉన్నత పాఠశాలకు కేంద్రమంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్తో పాటు ఎంపీపీ, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యాశాఖకు సంబంధించిన అధికారులంతా హాజరైనప్పటికీ ఏపీసి మాత్రం అనారోగ్య కారణాలు చెబుతూ గైర్హాజరయ్యారు. ఆరోజు సెలవు పెడుతున్నట్లు చెప్పినప్పటికీ అదే రోజున ఉదయం 10:30 గంటలకు లావేరు మండలంలో జరిగిన పాఠశాల భవన శంకుస్థాపన కార్యక్రమానికి హాజరుకావడం గమనార్హం. ఆ రోజున కేంద్ర మంత్రి, జిల్లా అధికారులు హాజరయ్యే కార్యక్రమానికి వెళితే అక్కడ ఏర్పాట్లలో లోటుపాట్లు తలెత్తిన పక్షంలో వారి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందన్న భయంతో సెలవు పెట్టారని విద్యాశాఖ వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఊహించినట్లుగానే గారతోపాటు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ డేకు చేసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుమారు 19 వేల మంది విద్యార్థులకు అందని స్టూడెంట్ కిట్లు వివరాలు కోరిన రాష్ట్ర అధికారులు సమాచారం లేక చేతులెత్తేసిన సమగ్ర శిక్ష అధికారులు -
సమస్యల స్వాగతం
దేవదాయ మంత్రికి.. అరసవల్లి ఆదిత్యుని ఆలయంఅరసవల్లి: రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి రానున్నారు. శ్రీకూర్మంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి హాజరై ఆదిత్యున్ని దర్శించుకునే అవకాశాలున్నాయన్న సమాచారంతో అరసవల్లి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. భక్తుల సౌకర్యాలపై ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి. ప్రసాద్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయానికి తొలిసారి మంత్రి రానుండడంతో పలు సమస్యలు ఆయనకు స్వాగతం పలకనున్నాయి. ఎన్నడూ లేనంత అభివృద్ధి అంటూ అధికార పార్టీ ప్రకటనలు గుప్పిస్తుంటే.. ఎన్నడూ చూడని అరాచకం, విధ్వంసం అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.100 కోట్లతో ఆలయ అభివృద్ధి అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి.. ఇప్పుడు ఆ ప్రస్తావనే చర్చల్లోకి రాకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా చాలావరకు పరిష్కరించకుండా వదిలేసిన పలు అంశాలను బాధితులు మంత్రి ఆనం ఎదుట వెల్లగక్కనున్నట్లుగా సమాచారం. సిబ్బందితో ఇబ్బంది...! అరసవల్లి ఆదిత్యాలయానికి గత కొన్నేళ్లుగా సిబ్బంది కొరత అతిపెద్ద సమస్యగా మారింది.గత ప్రభుత్వ హయాంలో సుమారు 49 మందిని దినసరి వేతనదారులుగా నియమించి ఆలయ పరిపాలన, భక్తుల సౌకర్యాలు, అన్నదానం, ప్రసాదాలు, పారిశుద్ద్యం తదితర విభాగాల్లో నియమించారు. దీంతో ఎక్కడా అవస్థలు లేకుండా భక్తుల దర్శనాలు సాగాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఆ 49 మందిని తొలగించేసి త్రీమెన్ కమిటీ సూచనల ప్రకారం ఔట్సోర్సింగ్ ఏజెన్సీ నియామకానికి ఆదేశించారు. ఇప్పటివరకు దాని ప్రస్తావనే లేకుండా పోయింది.వీరికి ఏప్రిల్ నుంచి జీతాలు నిలుపుదల చేశారు. స్వామి వారి కార్యక్రమాల్లో భజంత్రీలు వాయించే ఆరుగురిలో ముగ్గురు ఇంటిబాట పట్టగా..మరో ముగ్గురు కూడా జీతాలివ్వని కారణంగా వారు కూడా మరికొద్ది రోజుల్లో బయటకు వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్నారు. దుకాణాలు కూల్చేసి విధ్వంసంగా.... రథసప్తమి రాష్ట్ర పండుగ చేశామంటూ ప్రకటించి ఆలయం ముందు దశాబ్దాలుగా ఉంటున్న దుకాణసముదాయాలు, అన్నదాన మండపం, సూర్యనమస్కారాల మండపం, ప్రసాదాల తయారి కేంద్రం, ప్రసాదాల విక్రయాల కౌంటర్లు, మరుగుడొడ్లు, వసతి గదులు, ఇతరత్రా శాశ్వత భవనాలన్నీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే కూల్చేశారు. ఆలయ అభివృధ్దికి దాతలు రూ.లక్షల్లో విరాళాలిచ్చి భక్తుల సౌకర్యానికై భారీగా జింకు రేకు షెడ్లు నిర్మించగా.. వాటిని దాతలకు కనీస సమాచారం ఇవ్వకుండానే కూల్చే యడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. రూ.100 కోట్లతో ‘ప్రసాద్’ స్కీం అంటూ హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్.. ఇప్పుడేమీ చెప్పలేక మిన్నకుండిపోతున్నారు. అసలు ‘ప్రసాద్’ స్కీం నిధులు రావని తెలిసినా బయటకు పొక్కకుండా అడుగులు వేస్తున్నారు. అక్రమాలపై విజిలెన్స్ దాడులు..ఆదిత్యాలయంలో గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి విచారణకు దిగారు. గతంలో ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ హయాంలో రిటైర్డ్ ఈవో జగన్మోహనరావు, మరో జూనియర్ అసిస్టెంట్, ఓ ముగ్గురు దినసరి వేతనదారుల సహాయంతో దొంగ బిల్లుల ద్వారా ఆలయంలో వివిధ రకాలుగా ఖర్చులు చూపించి సుమారు రూ.2.50 కోట్ల వరకు తినేసారని విజిలెన్స్ గుర్తించింది. దీనిపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు చేపట్టాల్సి ఉంది. నేడు శ్రీకూర్మం, అరసవల్లి ఆలయాలకు మంత్రి ఆనం రాక ఓవైపు విజిలెన్స్ దాడులు.. మరోవైపు అభివృద్ధి పేరిట విధ్వంసం సమస్యలను మొరపెట్టుకోనున్న పలువురు బాధితులు మాస్టర్ ప్లానా..అదెక్కడ! అరసవల్లి ఆదిత్యాలయానికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నామని అప్పట్లో సీఎం చంద్రబాబు 2015లో ఇదే ఆలయంలో కూర్చుని ప్రకటించారు. ఇంద్రపుష్కరిణి అభివృధ్ది, ఆధునిక రూపురేఖలతో ఆలయ ప్రాకారం, మాడవీధుల విస్తరణ తదితర ముఖ్య పనులను నాలుగు ఫేజ్ల్లో ప్లాన్ వర్కౌట్ చేయాలని ఆదేశించారు. అయితే అసలు మాస్టర్ప్లాన్కు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించనే లేదు. గతంలో ప్రతిపాదించిన ల్యాండ్ బ్యాంకు, ల్యాండ్ టు ల్యాండ్ అమలుపై స్పష్టత కరువైంది. దీంతో ఆదిత్యాలయ భూములు ఎక్కడికక్కడ ఆక్రమణలకు గురౌతున్నాయి. -
ఆరున్నర కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి బెంగళూరుకు అక్రమంగా గంజాయిని తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఇచ్ఛాపురం సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్ఛాపురం సర్కిల్ కార్యాలయంలో గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాలోని గంజాం జిల్లా అస్కాకు చెందిన ప్రశాంత్కుమార్పాఢీ, బెర్హంపూర్కు చెందిన కందులు పూర్ణచంద్ర సెనాపతిలు అదే రాష్ట్రంలోని కందమాల్ జిల్లా టికాబలి గ్రామానికి చెందిన బపూని డిఘాల్ వద్ద గంజాయి కొనుగోలు చేశారు. బెంగళూరులోని ఓ వ్యక్తి అందజేసేందుకు బస్సులో ఇచ్ఛాఫురం చేరుకున్నారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్కి వస్తుండగా ఇచ్ఛాపురం పట్టణ పోలీస్లు తనిఖీలు చేపట్టి 6.600 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. తనిఖీల్లో పట్టణ ఎస్సై ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. -
మావోయిస్టు నేతకు మాతృవియోగం
వజ్రపుకొత్తూరు రూరల్: బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు నేత, కేంద్ర కమిటీ సభ్యులు మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ మాతృమూర్తి మెట్టూరు చినపిల్లమ్మ (92) గురువారం మృతి చెందారు. ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. చినపిల్లమ్మకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో మూడో సంతానం జోగారావు. చినపిల్లమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె అంత్యక్రియలు శుక్రవారం ఉదయం అదే గ్రామంలో చేపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
ఆ గ్రామానికి ఏమైంది?
జి.సిగడాం : టంకాల దిగ్గువలస గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. నెల రోజులుగా గ్రామంలో ఏ ఇంట చూసినా జ్వర పీడితులే కనిపిస్తున్నాయి. ఇంట్లో ఒకరికి తగ్గితే వెంటనే మరొకరు మంచంపడుతున్నారు. మూడు నుంచి ఐదు రోజుల తర్వాత దురదలువచ్చి కాళ్ల పొంగులు, కీళ్లు నొప్పులు బాధిస్తున్నాయని జ్వరపీడితులు చెబుతున్నారు. స్థానిక వైద్యాధికారులు బుడుమూరు యశ్వంత్, పేకల సుమబిందు ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినా ఫలితం ఉండటం లేదు. ఇప్పటికే తాగునీటి బోర్లు, బావుల్లో నీటిని పరీక్ష చేయించారు., ఎంపీడీఓ గుంటముక్కల రామకృష్ణారావు పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు. మరోవైపు దోమల నివారణ మందులను ఫాగింగ్ చేయిస్తున్నారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆందోళనగా ఉంది.. జ్వరం రావడంతో వైద్యసిబ్బంది వచ్చి పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. జ్వరం తగ్గాక కాళ్ల నొప్పులు, కాళ్లపొంగులు వచ్చాయి. నెల రోజులుగా నరకయాతనపడుతున్నాం. – గిడిజాల శ్రీరాములు, టి.డి.వలస, జి.సిగడాం మండలం మళ్లీ జ్వరం.. వారం రోజుల క్రితం జ్వరం వచ్చి తగ్గిపోయింది. మళ్లీ జ్వ రం రావడంతో పాటు కాళ్లనొప్పులు, పొంగులు ప్రారంభమయ్యాయి. నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటోంది.– టంకాల భాస్కరరావు, టి.డి.వలస ప్రతిరోజూ వైద్యసేవలు టి.డి.వలసలో నెల రోజులుగా ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. రోగుల ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తున్నాం. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు మెరుగైన వైద్యసేలు అందిస్తున్నాం. – బుడుమూరు యశ్వంత్, వైద్యాధికారి, జి.సిగడాం ● టి.డి.వలసను కుదిపేస్తున్న జ్వరాలు కాళ్లపొంగులు, కీళ్లనొప్పులతో గ్రామస్తుల అవస్థలు -
‘టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే ఎరువులు’
టెక్కలి: టీడీపీ కార్యకర్తలు చెప్పిన వారికే ఎరువులు ఇస్తున్నారంటూ కోటబొమ్మాళి మండ లం మాసాహెబ్పేట గ్రామ సచివాలయం వద్ద గురువారం రైతులు ఆందోళనకు దిగారు. పంచాయతీ పరిధిలో రైతుల కోసం సుమారు 800 బస్తాల యూరియా, 200 బస్తాలు డీఏపీ బస్తాలు వచ్చాయని అయితే అందరికీ సమానంగా ఎరువులు ఇవ్వకుండా టీడీపీ కార్యకర్త లు చెప్పిన వారికే ఇష్టానుసారంగా ఎరువులు పంచిపెట్టేశారని రైతులు నిలదీశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావని సమానంగా ఎరువులు అందజేసేవారని గుర్తు చేశారు. కేవీకే శాస్త్రవేత్తకు అవార్డు ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ సీహెచ్ బాలకృష్ణకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. గురువారం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు పొందిన డాక్టర్ సీహెచ్ బాలకృష్ణను కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మితో పాటు పలుశాఖలకు చెందిన శాస్త్రవేత్తలు అభినందించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గ వర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డు అందుకున్నారు. ఆక్వా కల్చర్లో నూతన సాంకేతిక పద్ధతులను రైతులకు వివిధ విస్తరణ శిక్షణ కార్యక్రమాల ద్వారా అవగాహ న కల్పించడం, చేపలు రొయ్యల సాగులో వచ్చే వ్యాధులను సకాలంలో గుర్తించి వాటి నివారణలో రైతులకు సహకార మత్స్య సహకార సంఘ సభ్యులకు అవగాహన కల్పించి పలు సూచనలు ఇచ్చేవారు. జిల్లాలో చేప పిల్లల పెంపకాన్ని ప్రోత్సహించి పరిశోధనలు, ప్రముఖ జర్నల్లో పరిశోధన పత్రాల సమ ర్పించారు. వీటన్నింటినీ పరిగణించి ఉత్తమ శాస్త్రవేత్తగా ఎంపిక చేశారని, ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్న బాలకృష్ణ వివరించారు. ‘పోలీసుల ఏకపక్ష వైఖరి వల్లే ఆత్మహత్యాయత్నం’ సరుబుజ్జిలి: సరుబుజ్జిలి పోలీసుల ఏకపక్ష వైఖరి వల్ల రొట్టవలస గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త ధనుకోట శ్రీను విసుగుచెంది గురువారం పురుగులు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు పార్టీ యువ నాయకుడు తమ్మినేని చిరంజీవినాగ్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం రిమ్స్లో చికిత్స పొందుతున్న కార్య కర్తను ఆయన పరామర్శించారు. శ్రీను అధికా ర పక్షానికి చెందిన ఓ వ్యక్తికి డబ్బు ఇవ్వాల్సి ఉందనే నెపంతో బలవంతంగా శ్రీనుకు చెందిన లగేజీ వ్యాన్ను అతడికి అప్పగించేశారని, ఈ వాహనాన్నే నమ్ముకుని బతుకుతున్న శ్రీను మనస్తాపం చెందిన పురుగు మందు తాగేశాడని తెలిపారు. తక్షణమే ఎస్పీ స్పందించి బాధితునికి న్యాయం చేయాలని కోరారు. 28న కుప్పిలి సంఘటనపై విచారణ శ్రీకాకుళం: జిల్లాలో ఈ ఏడాది మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల సందర్భంలో కుప్పిలిలో జరిగిన సంఘటనకు సంబంధించి విచా రణను ఈనెల 28న చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డీజీ శ్రీనివాసులురెడ్డిని విచారణాధికారిగా నియమించింది. ఆరోజు మాస్ కాపీయింగ్ జరిగిందంటూ ప్రధానోపాధ్యాయున్ని, 13 మంది ఉపాధ్యాయులను, ఓ గుమస్తాను డీఈఓ తిరుమల చైతన్య సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో దీనిపై దుమారం చెలరేగగా ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో ఖండిస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు సస్పెండ్ అయిన వారిని రీవోక్ చేసి విధులను కేటాయించారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు విచారణకు డిమాండ్ చేయగా తాత్సారం చేస్తూ వచ్చిన రాష్ట్ర స్థాయి అధికారులు తాజాగా విచారణను చేపట్టాలని నిర్ణయించి ఈనెల 28న 11గంటలకు జరిగే విచారణకు డీఈఓ తిరుమల చైతన్యతో పాటు సస్పెన్షన్కు గురైన వారంతా హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ఈనెల 30వ తేదీన డీఈఓ తిరుమల చైతన్య పదవీ విరమణ చేయనుండడం గమనార్హం. -
27 వరకు వర్షాలు: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉందని కలెక్టర్ స్వప్ని ల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ స్థితిగతులపై రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసిన ప్రత్యేక బులెటిన్ను ఆయన జిల్లా అధికారులకు చేరవేస్తూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ నెల 24 నుంచి 27 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ముఖ్యంగా 24, 25 తేదీల్లో కొద్దిచోట్ల అతి భారీ వర్షాలు నమో దు కావచ్చని చెప్పారు. ఇప్పటికే సముద్రంలో గాలుల వేగం గంటకు 65 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం కవిటి వర కూ తీరంలో 3.0 నుంచి 3.8 మీటర్ల వరకూ అలలు ఎగసిపడే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. తీరప్రాంత గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తాత్కాలిక బస కేంద్రాలు సిద్ధం చేయాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. ప్రతి మండలంలో రెవెన్యూ, పోలీస్, రవాణా, విద్యుత్తు, ఆరోగ్య శాఖల సమన్వయంతో నిఘా ఏర్పాటు చేయా లని కలెక్టర్ ఆదేశించారు. పాతపట్నం, కొత్తూ రు, ఇచ్ఛాపురం, కవిటి, నందిగాం, సంతబమ్మాళి, గార మండలాల్లో అత్యవసర పరిస్థితులకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అవసరమైతే ఎమర్జెన్సీ నంబర్లువిపత్తుల సందర్భంలో స్పందన కోసం రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ ద్వారా 112, 1070, 18004250101 నంబర్లకు లేదా soec apsdma@ap.gov.in మెయిల్కు సంప్రదించవచ్చని కలెక్టర్ సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సూచనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ విజ్ఞప్తి చేశారు. -
ఎరువులపై సమాచారం కోసం కంట్రోల్ రూమ్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల సరఫరా, వినియోగంపై కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నియంత్రణ విభాగంలో ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కోరాడ త్రినాథ స్వామి తెలిపారు. ఎరువుల లభ్యతపై లేదా ఇతర సంబంధిత సమాచారం కోసం రైతులు 9121863788 నంబరుకు సంప్రదించవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో సరిపడినంత ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. అవసరానికి మించి ఎరువులను వినియోగించే విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. -
ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల కష్టాలు పెరిగాయని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఎరువులకు కొరత ఏర్పడితే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మొదటి విడతకే పరిస్థితి ఇలా ఉంటే రెండో విడత ఎరువులు పంపిణీ ఏంటని ఆందోళన వ్యక్తం చేశా రు. ఒక యూరియా బస్తా కోసం రైతులు నానా అగచాట్లు పడుతున్నారని, కూటమి ప్రభుత్వానికి సిగ్గు ఉందా అని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఆర్బీకేలో అవసరం మేరకు ఎరువులు ముందుగానే సిద్ధం చేసేవారమని గుర్తు చేశారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైందని అన్నారు. రైతుల పట్ల ఇంత కక్ష కట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నా రు. ఎన్నికల ముందు రైతులకు పెట్టుబడి కింద రూ.20 వేలు ఇస్తామని ప్రకటన చేశారని, ఒక ఏడాది ఎగ్గొట్టేశారని, ఈ ఏడాది కూడా కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు ఇదివరకు ఉ న్న ఉచిత బీమా పథకాన్ని ఎత్తేయడం దారుణమ న్నారు. దీంతో జిల్లా రైతులపై రూ. 5 కోట్లు వరకూ భారం పడిందని అన్నారు. గత ఖరీఫ్లో దిగుబడి అయిన ధాన్యంలో సగానికి పైగా ధాన్యాన్ని కొనకుండా రైతులకు మొండి చేయి చూపారని విమర్శించారు. ఆర్బీకేలను కూడా నిర్వీర్యం చేశారని తెలిపారు. సమావేశంలో ఎంపీపీ ఆరంగి మురళి, పార్టీ నాయకులు చింతు రామారావు, కనిత కృష్ణారావు, రాజాపు అప్పన్న, సురంగి నర్శింగరావు తదితరులు పాల్గొన్నారు. ఎరువుల పంపిణీలో ప్రభుత్వం విఫలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
ఎందుకంత నీరుత్సాహం!
హిరమండలం: జల వనరుల శాఖలో ‘నీరు’త్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మ న్యంలో ఒకే అధికారి ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్నారు. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే వంశధార ప్రాజెక్టులో ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ ఉద్యోగుల కొరత వెంటాడుతోంది. దీంతో ఇది ప్రాజెక్టులు, కాలువల నిర్వహణపై ప్రభావం చూపుతోంది. ఏళ్ల తరబడి ఇక్కడి పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఏటా ఖరీఫ్, రబీలో సాగునీటి విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆరు డివిజన్లకు ఇద్దరే ఈఈలు వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమైనది గొట్టా బ్యారేజీ. దీని పరిధిలోని కుడి, ఎడమ ప్రధాన కాలువలు, ఎత్తిపోతల పథకాలు, వంశధార ఫేజ్–2 రిజర్వాయర్, వంశధార–నాగావళి అనుసంధాన కాలువలు ఉన్నాయి. వీటి నిర్వహణ ఒకరిద్దరితో కాదు. అన్ని విభాగాల్లో అధికారులు, సిబ్బంది ఉంటేనే సాధ్యమవుతుంది. కానీ ఎక్కడా పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బంది లేకపోవడం లోటుగా మారింది. ప్రస్తుతం వంశధార ప్రాజెక్టు పరిధిలో నరసన్నపేట, టెక్కలి, ఆమదాలవలస–1, ఆమదాలవల స, శ్రీకాకుళం, హిరమండలం డివిజన్లు ఉన్నా యి. ప్రాజెక్టు కార్యకలాపాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో ఈఈల పాత్ర కీలకం. ఒక్క ఆమదాలవలసలోని రెండు డివిజన్లకు మాత్రమే ఈఈలు ఉన్నారు. మిగతా నాలుగుచోట్ల పూర్తిగా లేరు. ఇన్చార్జిలతో నెట్టుకొస్తున్నారు. అందుకే ప్రాజెక్టుల కార్యకలాపాలతో పాటు క్షేత్రస్థాయిలో నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అటు ఏఈలతో పాటు ఏఈఈలు కూడా తక్కువ మందే ఉన్నారు. ఏఈలు 13 మందికిగాను ఐదుగురు, ఏఈఈలు 58 మందికిగాను 36 మంది ఉన్నారు. దీంతో అన్నీతామై వారే వ్యవహరించాల్సి వస్తోంది. గొట్టాకు తప్పని కష్టాలు ● గొట్టా బ్యారేజీ నిర్వహణ కూడా కష్టం అవుతోంది. సిబ్బంది కొరత వెంటాడుతోంది. ● గతంలో బ్యారేజీ నిర్వహణకు సంబంధించి 22 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ● వర్క్ ఇన్స్పెక్టర్లు ముగ్గురుండాలి కానీ ప్రస్తు తం ఒక్కరే ఉన్నారు. ● హెల్పర్లు ఆరుగురు ఉండాలి కానీ ఇద్దరున్నా రు. మేన్ మజ్దూర్లు 8 మంది ఉండాలి, కనీసం ఒక్కరూ లేరు. ● ఆపరేటర్లు ముగ్గురుండాలి కానీ ఒక్కరు కూడా లేరు. ఎలక్ట్రీషియన్లు ఇద్దరుండాలి.. ఒక్కరూ లేరు. ఏఈలు నలుగురు ఉండాలి.. ఇద్దరు ఉన్నారు. లస్కర్లు పూర్తిగా లేరు. ● సిబ్బంది కొరత కారణంగా నీటి స్థిరీకరణ, నీటి విడుదల, గేట్లు ఎత్తినప్పుడు, అత్యవసర సమయాల్లో ఉన్న ముగ్గురిపై భారం పడుతోంది. మూడు జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు ఎస్ఈగా ఒకే అధికారి జలవనరుల శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత ముగ్గురితోనే గొట్టా బ్యారేజీ నిర్వహణ ఇన్చార్జి ఎస్ఈ దిక్కు.. ఏ సాగునీటి ప్రాజెక్టుకు అయినా సూపరింటెండెంట్ అధికారి (ఎస్ఈ) కీలకం. కానీ వంశధార ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎస్ఈ లేరు. గత ఆరేళ్లుగా ఇక్కడ ఇన్చార్జే కొనసాగుతున్నారు. వారు కూడా ఎప్పుడు ఉంటా రో? ఎప్పుడు ఉండరో? తెలియని పరిస్థితి. రెగ్యులర్ అధికారి పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఇన్చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో ప్రాజెక్టుల పర్యవేక్షణ, నిర్వహణపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా కూటమి ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. సిబ్బంది కొతర వాస్తవమే.. వంశధార ప్రాజెక్టుతో పాటు గొట్టా బ్యారేజీకి సంబంధించి సిబ్బంది కొరత వాస్తవమే. అయినా సరే ఉన్న సిబ్బందితో పనులు చేయిస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం. సిబ్బందికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రభు త్వం తప్పకుండా సానుకూల నిర్ణయం తీసుకుంటుంది. – ఎం.మురళీమోహన్ వంశధార ఈఈ, నరసన్నపేట డివిజన్ -
‘శ్రీకాకుళం’లో 40వేల బోగస్ ఓట్లు
శ్రీకాకుళం: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నియోజకవర్గంలో నలభై వేల బోగస్ ఓట్లు ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం సాయంత్రం బూత్ కమిటీ సభ్యులు, పార్టీ కమిటీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. నియోజకవర్గంలో 2.72 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ వాటిలో దాదాపు 30 వేల నుంచి 40వేల వరకు బోగస్ ఓట్లు ఉంటాయని, వాటిని త్వరలోనే తొలగిస్తారని చెప్పారు.అవన్నీ పట్టించుకోకుండా బూత్ పరిధిలోని 60–70 శాతం ఓటర్లను కలవాలన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా ‘తొలి అడుగు’లో ఎవ్వరూ చురుగ్గా పాల్గొనడంలేదని, ఇప్పటివరకు 35 వేల కుటుంబాలను మాత్రమే కలిశామని, మొత్తం 90 వేలు కుటుంబాలను కలవాల్సి ఉందని ఎమ్మెల్యే శంకర్ చెప్పారు. -
బ్యాంకులు నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం నుంచి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వార్షిక క్రెడిట్ ప్లాన్ 2024–25, ఎంఎస్ఎంఈ, విద్యా రుణాలు, వ్యవసాయానికి క్రెడిట్, చెల్లింపులు, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు లింకేజి, ఎంసీపీ డిజిటల్, పీఎం సూర్యఘర్, పీఎం విశ్వకర్మ, నాబార్డు తదితరు రుణాలపై బ్యాంకర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ, మత్స్య శాఖ, ఉద్యానవన శాఖ, తదితర శాఖల లక్ష్యాలపై ఆరా తీశారు. లీడ్ బ్యాచ్ మేనేజర్ పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలను బ్యాంకర్లంతా అమలు చేయాలని సూచించారు. నాబార్డు డీసీ ఎం.రమేష్ కృష్ణ మాట్లాడుతూ కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండేలా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. సమావేశంలో యూబీఐ ప్రాంతీయ అధిపతి పి.రాజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ పి.శ్రీనివాసరావు, డీసీసీబీ జనరల్ మేనేజర్ వరప్రసాద్, ఉద్యానవన శాఖ ఏడీ ప్రసాదరావు, నాబార్డ్ మేనేజర్ రమేష్కృష్ణ, మత్స్య శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ, ఏపీఎంఐపీ డీడీ శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి త్రినాథస్వామి, ఆయా బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. అప్రమత్తతతోనే నేరాల నియంత్రణ శ్రీకాకుళం క్రైమ్ : అవగాహన, అప్రమత్తతతోనే నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థి దశలో సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని, మహిళా చట్టాలపై అవగాహన ఉండాలన్నారు. శక్తియాప్ ఆవశ్యకత, గుడ్టచ్ – బ్యాడ్టచ్, బాల్యవివాహాల నియంత్రణపై అధికారులు సమీప విద్యాసంస్థల్లో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చైల్డ్హెల్ప్లైన్ 1098, సైబర్ టోల్ఫ్రీ నంబర్ 1930, డయల్ 112 నంబర్లు గుర్తుపెట్టుకుని ఆపద సమయంలో వినియోగించాలన్నారు. శాకంబరిగా మహాలక్ష్మి బలగ అయ్యప్పస్వామి దేవాలయంలో మహాలక్ష్మీ అమ్మవారిని ఆషాఢ మాసం, మాస శివరాత్రి పురస్కరించుకుని బుధవారం శాకంబరిగా అలంకరించారు. అర్చకులు దేవరకొండ శంకరనారాయణశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. – శ్రీకాకుళం కల్చరల్ స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దు శ్రీకాకుళం అర్బన్: విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపుపై ఎటువంటి అపోహలు అవసరం లేదని, వీటి వల్ల వినియోగదారులపై ఎలాంటి అదనపు చార్జీల భారం ఉండదని ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ ఎన్.కృష్ణమూర్తి స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ఎస్ పఽథకంలో భాగంగా అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రారంభించిందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల విషయంలోనూ ఎటువంటి అపోహలు వద్దన్నారు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నంబర్ 1912కు సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
ఎరువుల కోసం కొట్లాట
సరుబుజ్జిలి : రొట్టవలస గ్రామ సచివాలయం వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 245 బస్తాల ఎరువులు(యూరియా) పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో ఉదయం నుంచే రైతులు పాసుపుస్తకాలు పట్టుకొని సచివాలయం వద్దకు చేరుకున్నారు. గంటల తరబడి వేచి ఉన్నా పంపిణీ చేయకపోవడంతో రైతులతో కలిసి స్థానిక సర్పంచ్ మూడడ్ల భద్రమ్మ భర్త, వైఎస్సార్సీపీ మండల బూత్ కమిటీ అధ్యక్షుడు మూడడ్ల రమణ అధికారులను ప్రశ్నించారు. ఎటువంటి వివక్ష లేకుండా రైతులందరికీ ఎరువులు పంపిణీ చేయాలని కోరారు. దీనిపై అక్కడే ఉన్న కొందరు అనధికార వ్యక్తులు స్పందిస్తూ ‘మేమున్నది మీరు చెప్పినట్లు చేయడానికి కాదు.. మాకు నచ్చిన విధంగా మేం పంపిణీ చేస్తాం..’ అని చెప్పడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పిడిగుద్దులుతో దాడులు చేసుకున్నారు. అరుపులు, కేకలతో ఏం జరుగుందో తెలియక రైతులు పరుగులు తీశారు. ఇంతలో మరికొందరు గ్రామస్తులు కర్రలు పట్టుకొనిరావడంతో స్థానిక మహిళా పోలీసు సరుబుజ్జిలి స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సచివాలయానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన.. ఉద్రిక్తత నెలకొన్న సమయంలో ఓ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు తావిచ్చింది. సర్పంచ్ భర్తగా రైతులకు ఎరువులు ఇవ్వాలని అడిగేందుకే వచ్చామని, గొడవలు పడటానికి కాదని బూత్ కమిటీ అధ్యక్షుడు మూడడ్ల రమణ చెబుతుండగా కానిస్టేబుల్ అడ్డుతగిలారు. సర్పంచ్ భర్తవా అయితే ఏంటి అంటూ గద్దించడంతో మరోసారి రైతులు ఆందోళనకు దిగారు. బ్లాక్మార్కెట్కు ఎరువులు.... సచివాలయానికి వస్తున్న ఎరువుల వాహనాన్ని ఆమదాలవలస మండలం జొన్నవలస వద్ద నిలిపి సుమారు 70 నుంచి 80 బస్తాలను బ్లాక్మార్కెట్కు తరలించినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అందుకే ఎరువుల కొరత ఏర్పడిందని అంటున్నారు. మరోవైపు సచివాలయం బయటే కొంతమంది లిస్టులు తయారుచేసి ఎరువుల కోసం నగదు ముందుగానే వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నిలిచిన పంపిణీ... కొట్లాట నేపథ్యంలో ఎరువుల పంపిణీ విషయంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో రొట్టవలస, సూర్యనారాయణపురం, అవతరాబాద్ గ్రామాల నుంచి వచ్చిన రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. రొట్టవలస సచివాలయం వద్ద ఉద్రిక్తత సకాలంలో పంపిణీ చేయకపోవడంపై రైతుల ఆగ్రహం సరఫరా చేయకుండా చేతులెత్తేసిన అధికారులు -
చెంతనే పోలీసులు.. చింతలేని పేకాటరాయుళ్లు!
● పాతపట్నం పోలీసుస్టేషన్ సమీపంలోని కోర్టు కూడలి వద్ద ఖాళీగా ఉన్న ఒక ఇంట్లో కొన్ని రోజులుగా పేకాట శిబిరం నడుస్తోంది. స్థానిక సీఐ గానీ, ఎస్ఐ గానీ చర్యలు తీసుకోలేదు. సమాచారం జిల్లా అధికారుల దృష్టికి వచ్చింది. శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులకు ఆ బాధ్యత అప్పగించారు. ఇంకేముంది నిఘా పెట్టి దాడులు చేశారు. ఈ నెల 19న చేసిన దాడుల్లో ఏడుగురు పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ.57,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వారిలో కుమార్, శ్రీను కీలక వ్యక్తులు. వీరిలో కుమార్ అప్పట్లో కాశీబుగ్గ టౌన్ సీఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి గురండిలో పేకాట శిబిరాల రైడ్కి వెళ్లగా.. ఒడిశా పరిధిలో దాడులు చేయడమేంటని ఏపీ పోలీసులపై తిరగబడ్డాడు. అలాంటి వ్యక్తి పాతపట్నం నడిబొడ్డున, పోలీసు స్టేషన్కు సమీపంలో పేకాట శిబిరాన్ని నడుపుతున్నాడంటే ఇక్కడి పోలీసుల ఉదాసీనత ఎలా ఉందో అర్థమవుతుంది. ● పాతపట్నం పోలీసుస్టేషన్ సమీపంలో పేకాట ● శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ బృందం దాడులు చేస్తే తప్ప బయటపడని పరిస్థితి ● కాశీబుగ్గ పోలీసులపై గతంలో తిరగబడిన వ్యక్తే కీలక నిర్వాహకుడు ● గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసే విషయంలో ఉదాసీనత ● ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేయడంతో యాక్ట్ నమోదు! ● పేకాట శిబిరాలకు అడ్డాగా మారిన పాతపట్నం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : పేకాట శిబిరాలకు పాతపట్నం కేంద్రంగా నడుస్తోంది. కొన్నాళ్లుగా పాతపట్నంలోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లోనూ రోజూ రూ.లక్షల్లో గేమ్ జరుగుతోంది. అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో ఎస్పీ దృష్టికి వచ్చినట్టు సమాచారం. అప్పటికే పలు మార్లు శ్రీకాకుళం వన్టౌన్, టూటౌన్, జేఆర్పురం, నరసన్నపేట, టెక్కలి, పలాస, ఆమదాలవలస సర్కిల్ అధికారులతో పాటు పాతపట్నం సర్కిల్ అధికారులకు కూడా పేకాట శిబిరాలపై అప్రమత్తం చేయడమే కాకుండా హెచ్చరికలు కూడా చేశారు. మీ పరిధిలో పేకాట శిబిరాలపై చర్యలు తీసుకోకపోతే నా స్టైల్లో దాడులు చేసి పట్టిస్తానని హెచ్చరించినట్టు కూడా తెలిసింది. అయినా పాతపట్నంలో తీరు మారలేదు. ఉదాసీనత ఎందుకో? టాస్క్పోర్స్ పోలీసులు పట్టుకున్న వ్యక్తులను స్థానిక పోలీసు స్టేషన్కు అప్పగిస్తే.. వారిపై తొలుత సాధారణ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, ఆ తర్వాత ఎస్పీ దృష్టికి వెళ్లడంతో ఆయన గట్టిగా హెచ్చరించడంతో గేమింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్టు వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి ప్రతి నెలా పెద్ద ఎత్తున ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీరి వెనక స్థానిక నేతల అండదండలు కూడా ఉన్నాయి. ఆ కారణం చేతనే పేకాట నిర్వాహకులు రెచ్చిపోయి శిబిరాలు నిర్వహిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కారణమేదైనా పాతపట్నం పోలీసు స్టేషన్ సమీపంలోనే పేకాట శిబిరం నిర్వహిస్తూ ఉండటం, టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడటం చర్చనీయాంశంగా మారింది. ఇదే పాతపట్నం సర్కిల్, పోలీసు స్టేషన్ పరిధిలోని కాగువాడ సమీపంలో మహేద్ర తనయ నది పక్కన పంపుషెడ్ వద్ద కూడా పేకాట శిబిరం నడుస్తోంది. దీనిపైనా స్థానిక పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఈ నెల 18న శ్రీకాకుళం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఆరుగురిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.7,580 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
ఇసుక అక్రమార్కులపై చర్యలేవీ?
● కొత్తవలసలో అనధికార ఇసుక ర్యాంపు మూసివేయాలి ● బాధితులతో కలిసి అక్రమ తవ్వకాలను పరిశీలించిన మాజీ స్పీకర్ తమ్మినేని ఆమదాలవలస: కొత్తవలస, పాతనిమ్మతొర్లువాడ, ముద్దాడపేట తదితర గ్రామాల పరిధిలో అనధికార ఇసుక ర్యాంపులను వెంటనే మూసివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. ఆయా గ్రామాల పరిధిలో నాగావళి నదిలో నిర్వహిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలను బుధవారం పరిశీలించారు. పాతనిమ్మతొర్లువాడ గ్రామస్తులపై ఇటీవల జరిగిన దాడిని ఖండిస్తూ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదీగర్భంలో లోతుగా తవ్వకాలు చేపట్టడం దారుణమన్నారు. ఇలాంటి చర్యల వల్ల తాగునీటికి ముప్పు ఏర్పడుతుందన్నారు. అనధికార ర్యాంపుల వెనుక కూటమి పార్టీ ప్రముఖుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాత నిమ్మతొర్లువాడ శ్మశాన వాటిక, మైదానం సమీపంలో తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులపై దాడులు జరగడం అమానుష చర్య అని, దాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడి ఇసుక మాఫియా సీఎం చంద్రబాబునాయుడికి సంబంధించినదిగా చెబుతున్నారని.. చంద్రబాబు ఇదేనా నీ సుపరిపాలన అని ప్రశ్నించారు. కలెక్టర్ పరిశీలించి తక్షణమే ఇసుక ర్యాంపును నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అఖిలపక్షాల నేతలతో కలిసి ఉద్యమం చేపడతామని తమ్మినేని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.జి.సత్యనారాయణ, రాష్ట్ర కళింగ కుల విభాగం అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, యువ నాయకులు తమ్మినేని చిరంజీవినాగ్, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు గురుగుబెల్లి శ్రీనివాసరావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ బొడ్డేపల్లి నారాయణరావు, సర్పంచ్ సోమరాజు తేజ, నాయకులు ఎన్ని రామచంద్రయ్య, గురుగుబెల్లి అప్పలనాయుడు, బొడ్డేపల్లి మన్మధరావు, గొంటి కృష్ణ, బెండి జయరాం, తాండ్ర ధనుంజయరావు, మున్సిపల్ మాజీ వైస్ ఫ్లోర్లీడర్ అల్లంశెట్టి ఉమామహేశ్వరరావు, పార్టీ యువజన విభాగం నాయకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వేధిస్తున్న వ్యాక్సిన్ల కొరత
టెక్కలి రూరల్: టెక్కలి జిల్లా ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా చిన్నపిల్లలకు వేసే వ్యాక్సిన్ల కొరత వేధిస్తూనే ఉంది. ఎప్పటిలాగే బుధవారం తమ పిల్లలకు వ్యాక్సిన్లు వేయించేందుకు తీసుకొచ్చిన తల్లులకు ఈవారం సైతం కొన్ని వ్యాక్సిన్లు లేవనే సమాధానం రావడంతో ఇంటికి తిరుగుముఖం పట్టారు. టెక్కలి మండలం కె.కొత్తూరు పీహెచ్సీ పరిధిలోని సిబ్బంది ప్రతీ బుధ, శనివారాల్లో చిన్నారులకు వ్యాక్సిన్లు వేస్తుంటారు. అయితే ప్రధానంగా ఐపీవీ, రోటా, డీపీటీ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలువురు వాపోతున్నారు. వైద్యారోగ్యశాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
బతుకులు రోడ్డుపాలు
జగనన్న ఉన్నప్పుడు సాయం చేశాడు. అతని వలన బాగు పడ్డాం. ఇంటికే తెచ్చి ఇచ్చాడు. ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా ఆధారం లేదు. రూ.15వేలు.. రూ.50 వేలు లేదు. అది ఇది గ్యాస్ అన్నాడు. ఏదీ చేయలేదు. అంతా సొల్లే. ఎన్నికలప్పుడు ఇంటింటికీ వచ్చి జగన్మోహన్రెడ్డి కంటే అన్నీ ఎక్కువగా ఇస్తామని చెప్పి నమ్మించి ఓటేయించుకున్నారు. గెలిచిన తర్వాత ఒక్కడూ మా గడప తొక్కలేదు. చంద్రబాబు మా బతుకులు రోడ్డు పాలు చేశాడు. పథకాల కోసం ప్రశ్నిద్దామంటే ఏ టీడీపీ నాయకుడూ కన్పించడం లేదు. – శ్రీకాకుళం నగరంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం సమయంలో కె.పద్మ అనే మహిళ చేసిన వ్యాఖ్యలివి. -
ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ
మెళియాపుట్టి: ఆశ్రమ పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలని సీతంపేట ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబు స్పష్టం చేశారు. మండలంలోని పెద్దలక్ష్మీపురం గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వెంటనే పరిసరాలు బాగు చేయాలన్నారు. వసతి గృహంలో తాగునీటి పథకం, వసతి గదులు, మరుగుదొడ్లు, స్టోర్, వంటశాల ఇతరత్రా పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం మోనూ ప్రకారం ఉందా లేదా అని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కొంతమంది విద్యార్థులతో మాట్లాడి ఏవైనా సమస్యలున్నాయా అని ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు చిన్నపాటి సమస్యలు వచ్చినా పీహెచ్సీకి తీసుకెళ్లి పరీక్షలు చేయించి బాధ్యతగా వ్యవహరించాలని హెచ్ఎం మురళీకి సూచించారు. పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. -
పడవ బోల్తాపడి మత్స్యకారుడు మృతి
గార: మండలంలోని బందరువానిపేట తీరంలో పడవ బోల్తా పడడంతో మత్స్యకారుడు బడి గజేంద్ర (54)మృతి చెందాడు. మత్స్యకారులు, పోలీసులు తెలిపిన వివరాలు మేరకు.. పుక్కళ్ల కృష్ణకు చెందిన బోటులో ఐదుగురు మత్స్యకారులు బుధవారం వేకువజామున వేటకు వెళ్లారు. మరలా సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో తిరుగు ప్రయాణంలో రాకాసి అలల ఉద్ధృతికి పడవ బోల్తా పడడంతో గజేంద్ర మృతి చెందాడు. కొద్దిసేపటి తర్వాత మృతదేహం ఒడ్డుకు చేరుకుంది. మృతదేహం చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. పడవ బోల్తా పడడంతో సుమారు రూ. 3 లక్షలు ఆస్తినష్టం జరిగింది. అలాగే గ్రామానికి చెందిన చోడిపిల్లి సూర్యం పడవ కూడా బోల్తాపడిన ఘటనలో వాళ్లకు కూడా దాదాపు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగింది. మృతుడు గజేంద్రకు ముగ్గురు అమ్మాయిలు, ఒక దివ్యాంగుడైన కుమారుడు ఉన్నారు. ఎస్ఐ సీహెచ్ గంగరాజు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. భార్య పోలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాజీ సైనికుల రక్తదాన శిబిరం రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ/శ్రీకాకుళం కల్చరల్: దేశానికి సేవ చేయడంతో పాటు సమాజ సేవలో సైతం ముందుంటామని నిరూపిస్తున్నారు మాజీ సైనికులు. జిల్లా మాజీ సైనిక సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో కార్గిల్ విజయ దివాస్ను పురస్కరించుకుని జూలై 25వ తేదీన మహా రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రి సౌజన్యంతో జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయం పెద్దరెల్లివీధి వద్ద శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అలాగే జూలై 26వ తేదీన జిల్లా మాజీ సైనిక సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో కార్యేషు ఈవెంట్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని వెంకోజీపాలెంలోని చందన మోహనరావు ఫంక్షన్ హాల్లో మా క్షేమం.. మీ త్యాగం.. మా ధైర్యం అనే నినాదంతో శ్రావణ సఖి 4వ ఎడిషన్ నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా వీర మాత లు, వీర నారీమణులకు ఘనంగా సత్కార్యం చేసి, చెరో రూ.10 వేల చొప్పున ఆర్థిక లబ్ధి అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 94394 56757 నంబర్ను సంప్రదించాలని కోరారు. -
గంజాయితో నలుగురు అరెస్టు
టెక్కలి రూరల్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని, వారి వద్ద నుంచి 4.75 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎ.విజయ్కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అక్రమంగా గంజాయి రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు టెక్కలి సీఐ తన సిబ్బందితో కలిసి జాతీయ రహదారిపై ఉన్న బీహార్ దాబా సమీపంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సౌత్ 24 పరగణాల జిల్లా గొసాబా, పశ్చిమ ఆరంపూర్ గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు గోపాల్ సర్ధార్, సుమన్ దాస్, మహాదేబ్ నాయక్, సుమన్ మండల్ల వాహనాలను తనిఖీ చేశారు. దీనిలో భాగంగా గంజాయి పట్టుబడడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు బెంగళూర్ తీసుకొని వెళ్లి అక్కడ విక్రయాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని జాజ్పూర్లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. 10.26 కిలోలతో మరో వ్యక్తి అరెస్టు ఇచ్ఛాపురం టౌన్: ఒడిశా నుంచి హైదరాబాద్కు 10.26 కిలోల గంజాయి తరలిస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎకై ్సజ్ సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు. రైల్వేస్టేషన్ సమీపంలో బధవారం తనిఖీలు జరుపుతుండగా దీపక్ కుమార్ నాయిక్ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో తనిఖీ చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద గంజాయి ఉండడంతో అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒడిశాలోని బరంపురం నుంచి ఇచ్ఛాపురం వచ్చి ట్రైన్లో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా గంజాయి స్వాధీనం చేసుకొని నిందుతుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. -
సారా స్థావరాలపై దాడులు
పాతపట్నం: ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు సంయుక్తంగా రెండో రోజు బుధవారం కూడా దాడులు నిర్వహించారు. పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన శిరడా, దిద్దినూగూడ, కొత్తగూడ పరిసరాల్లో 1,400 లీటర్ల నాటుసారా, 6,300 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేశారు. అలాగే భారీగా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్నం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. సారా తయారీ, విక్రయాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ సూపరింటెండెంట్లు మురళీ, రామచంద్ర కుమార్, ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహు తదితరులు పాల్గొన్నారు. -
తూకంలో తేడా వస్తే చర్యలు
గార: నిత్యావసర సరుకుల తూకంలో తేడా వస్తే చర్యలు తప్పవని డీఎస్వో జి.సూర్యప్రకాశరావు హెచ్చరించారు. బుధవారం గార తహశీల్దార్ కార్యాలయంలో రేషన్ డిపో డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్ఓ మాట్లాడుతూ ప్రతి డిపో వద్ద తప్పనిసరిగా బోర్డులు ఉండాలని, ధరలు, స్టాకు వివరాలు నమోదు చేయాలని సూచించారు. 26 నుంచి దివ్యాంగులకు, వృద్ధులకు ఇళ్లకు వెళ్లి సరుకులు అందజేయాలన్నారు. ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు పూటలా డిపో వద్ద సరుకులు అందజేయాలని సూచించారు. సమావేశంలో తహశీల్దార్ ఎం.చక్రవర్తి, సివిల్ సప్లయ్ డీటీ అనిల్కుమార్ పాల్గొన్నారు. -
28న మెగా జాబ్మేళా
పాతపట్నం/శ్రీకాకుళం పాతబస్టాండ్: పాతపట్నం ఆల్ఆంధ్రా రోడ్డు సమీపంలో ఉన్న మహేంద్ర డిగ్రీ కళాశాల ఆవరణలో ఈనెల 28వ తేదీన ఉదయం 9 గంటలకు మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో ప్రీమియర్ ఇంజినీర్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, అపిటోరియా, ముత్తూట్ గ్రూప్, అపోలో ఫార్మసిస్ లిమిటెడ్ తదితర కంపెనీల్లో 562 ఖాళీలకు నియమకాలు జరుగుతాయన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బి.ఫార్మసీ చదివిన యువతీ, యువకులు హాజరవ్వాలని సూచించారు. ముందుగా ఎన్ఏఐపీయూఎన్వైఏఎం.ఏపీ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిఫరెన్స్ నంబర్, రెజ్యూమ్, ఆధార్, విద్యార్హతలు కాపీలు, పాస్ఫోర్ట్ సైజు ఫొటోతో జాబ్మేళాకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 83176 52552, 83320 39243 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. హాల్ టికెట్ల విడుదల శ్రీకాకుళం క్రైమ్ : ఏపీ పోలీస్ కానిస్టేబుల్ (మహిళా పీఎంటీ, మహిళా పీఈటీ) పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ అడ్మిట్కార్డులను ‘ఎస్ఎల్పిఆర్బి.ఎపి.జిఒవి.ఐఎన్’ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సంబంధిత బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు పాతపట్నం: మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ టెక్కలి ఇన్చార్జి వెంకట అప్పారావు తెలిపారు. బుధవారం పాతపట్నం పోలీస్స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మండలంలోని సీది గ్రామానికి చెందిన యువకుడు దాసరి నవీన్ అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో ప్రలోభాలకు గురిచేయడంతో జూన్ 9వ తేదీన బాలిక తల్లి ఎస్.లక్ష్మి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బుధవారం దాసరి నవీన్పై పోక్సో కేసు నమోదు చేసి, పాతపట్నం కోర్టుకు హాజరుపరిచారు. దీంతో నిందితునికి రిమాండ్ విధించినట్లు డీఎస్పీ తెలిపారు. జిల్లాకు 10 మంది ప్రొబేషనరీ సివిల్ ఎస్ఐలు శ్రీకాకుళం క్రైమ్: విశాఖ రేంజి డీఐజీ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకున్న 10 మంది ప్రొబేషనరీ సివిల్ ఎస్ఐలు ఐదు నెలల పాటు జిల్లాలో ఆచరణాత్మక శిక్షణ పొందేందుకు రానున్నారు. వీరంతా బుధవారం రేంజి కార్యాలయంలో డీఐజీ గోపినాథ్ జెట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, సాధన, ఎదుర్కొనే సవాళ్లపై అవగాహన అవసరమన్నారు. పోలీస్స్టేషన్లలో విధులు, రికార్డులు, స్థానిక చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వారితో పాటు ఎస్పీలు కేవీ మహేశ్వరరెడ్డి, వకుల్జిందాల్, అమిత్బర్ధార్, మాధవరెడ్డి ఉన్నారు. అనుమానాస్పదంగా యువకుడు మృతి ఎచ్చెర్ల: మండలంలోని కేశవరావుపేట గ్రామానికి చెందిన సీపాన చలపతిరావు (29) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చలపతిరావు మంగళవారం జర్జాం గ్రామ సమీపంలోని ఒక లే అవుట్లో అపస్మారక స్థితిలో పడిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించి లే అవుట్లో ఉండడంతో ఇంటికి తీసుకొని వచ్చారు. అనంతరం సపర్యలు చేసి మంగళవారం రాత్రి పడుకొనిబెట్టారు. అయితే బుధవారం ఉదయం సరికి అతడు నోటినుంచి నురగ కక్కుతూ మృతి చెందాడు. తండ్రి అనంతప్రసాద్ ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని రిమ్స్ తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇళ్లలోకి చేరిన బురద నీరు కంచిలి: మండల కేంద్రం కంచిలితోపాటు పలు గ్రామాల్లో బుధవారం కురిసిన కుండపోత వర్షానికి పలు ఇళ్లలోకి బురద నీరు చేరింది. దీంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ముఖ్యంగా బలియాపుట్టుగ కాలనీలో వర్షం కురవగానే ఇళ్లలోని వరద నీరు చేరుతోందని స్థానికులు వాపోతున్నారు. కాలనీకి ఎగువన ఉన్నటువంటి జెడ్పీ హైస్కూల్ నుంచి వచ్చిన నీరు ఇళ్లలోకి చేరుతుండడంతో అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. అనేకమార్లు పంచాయతీ సర్పంచ్కు పరిస్థితి విన్నవించుకున్నప్పటికీ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. తక్షణమే కాలనీలో ఉన్న వీధులకు డ్రైనేజీ సౌకర్యం కల్పించి ఇళ్లలోకి వర్షపు నీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● డీఎంహెచ్వో డాక్టర్ అనిత శ్రీకాకుళం అర్బన్: వాతావరణంలో మార్పుల కారణంతో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత సూచించారు. నగరంలోని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉందని అన్నారు. నీటి ద్వారా, కలుషిత ఆహారం ద్వారా అధికంగా వ్యాధులు ప్రబలతాయని హెచ్చరించారు. తాగునీటి ట్యాంకులు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో తాగునీటి పరీక్షలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించినట్లు తెలిపారు. జనవరి నుంచి మలేరియా, డెంగీ, చికిన్ గున్యా వంటి కేసులు కొద్దిపాటి లక్షణాలతో నమోదైనప్పటికీ తొందరగా రోగులకు కోలుకున్నట్లు తెలిపారు. పక్క రాష్ట్రమైన ఒడిశా నుండి వచ్చిన రోగుల వలన కంచిలి ప్రాంతాల్లో మలేరియా కేసులు వ్యాప్తిచెంది 24 కేసులు నమోదైనట్లు వివరించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి రామదాసు, స్టాటిస్టికల్ అధికారి రామనాగేశ్వరరావు, పరిపాలనాధికారి బాబూరావు, డిప్యూటీ డెమో అధికారి ఎం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సారా స్థావరాలపై విస్తృత దాడులు
పాతపట్నం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో అక్రమంగా నిర్వహిస్తున్న సారా తయారీ స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. పాతపట్నం, మెళియాపుట్టి, కొత్తూరు, పలాస మండలాలకు ఆనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన సింగుపూర్, కుయారా, పెద్ద బురుజోల, చిన్న బురుజోల పరిసరాల్లో 160 లీటర్ల సారా, 12,700 లీటర్ల తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటలను ధ్వంసం చేసి, భారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పాతపట్న ం ఎకై ్సజ్ సీఐ కోట కృష్ణారావు తెలిపారు. ఈ దాడుల్లో శ్రీకాకుళం జిల్లా అసిస్టెంట్ సూపరిటెండెంట్లు మురళీ, రామచంద్ర కుమార్, గజపతి జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ సాహూ, ఎన్ఫోర్స్మెంట్స్ వింగ్, పాతపట్నం, నరసన్నపేట, పొందూరు, శ్రీకాకుళం టాస్క్ ఫోర్స్ ఎకై ్సజ్ అధికారులు, పర్లాకిమిడి, కాశీనగర్, గురండి, గారబంద ఎకై ్సజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
అక్రమ ఇసుక ర్యాంపులు ఆపాల్సిందే
ఆమదాలవలస: ఆమదాలవలస మండలంలోని కొత్తవలసలో కొనసాగుతున్న అనధికార ఇసుక ర్యాంపును ఆపాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్తో కలి సి కొత్తవలస, పాత నిమ్మతొర్లువాడ ఇసుక ర్యాంపులను పరిశీలించారు. అనంతరం ఇసుకాసురుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ నదీగర్భం వరకు తవ్వకాలు చేయడం దారుణమన్నారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలోనే అనధికార ర్యాంపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంత ఘోరంగా తవ్వుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తవలస నుంచి ఆమదాలవలసకు తాగునీరు అందించే సౌకర్యం ఉందని, ఇసుక తవ్వకాలతో అది ప్రమాదంలో పడుతుందన్నారు. కొత్తవలస పక్కనే ఉన్న పాత నిమ్మతొర్లువాడలో తవ్వకాలు చేస్తున్నారని, శ్మశాన వాటిక, మైదానాన్ని విడిచిపెట్టాలని కోరితే వంద మంది కర్రలు, రాడ్డులతో దాడికి పాల్పడడం అమానుషమన్నారు. రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజలు అల్లాడిపోతున్నారని అన్నారు. ‘కూన’ సన్నిహితులే దాడి చేశారు.. ఆమదాలవలసలో నిర్వహిస్తున్న అక్రమ ఇసుక ర్యాంపులు స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆ ధ్వర్యంలోనే నడుస్తున్నాయని చాలాసార్లు ఫిర్యా దు చేశామని పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు. రాత్రివేళలో అమాయకులైన పాతనిమ్మతొర్లువాడ గ్రామ ప్రజలపై దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నా రు. సీసీ ఫుటేజీ చూస్తే ఎవరు దాడి చేశారో తెలిసిపోతుందని, పోలీసులు దాచి పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. బాధితులను పరామర్శించేందు కు వస్తున్నామని తెలిసి గాయపడిన వారిని పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బొడ్డేపల్లి రమేష్కుమార్, పార్టీ జిల్లా కార్యదర్శి పొన్నాడ చిన్నారావు, సరుబుజ్జిలి జెడ్పీటీసీ సురవరపు నాగేశ్వరరావు, బూర్జ మండల పార్టీ అధ్యక్షులు ఖండాపు గోవిందరావు, ఆమదాలవలస మున్సిపల్ అధ్యక్షుడు పొడుగు శ్రీనివాసరావు, ముఖ్యనాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, దుంపల శ్యామలరావు, మానుకొండ వెంకటరమణ, ఎ.రవికాంత్, గురుగుబెల్లి అప్పలనాయుడు, చిగురుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. శ్మశానాలనూ వదలకుండా తవ్వేయడం సబబు కాదు పాతనిమ్మతొర్లువాడ వాసులపై దాడి దారుణం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
నేరాలను నియంత్రించాలి
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో నేరాల నియంత్రణకు అధికారులు కృషి చేయాలని, పెండింగ్ వారెంట్లు త్వరితగతిన అమలుకు పంపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులు, పరిష్కారం, మాదకద్రవ్యాల నియంత్రణ, నాన్బెయిల్బుల్ వారెంట్ల అమలు, సీసీ కెమెరాల ఏర్పాటు, విజిబుల్ పోలీసింగ్, కార్టన్ అండ్ సెర్చ్ సోదాలు వంటి అంశాలపై జిల్లాలో గల డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి మందిరాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా కమిటీలను సన్నద్ధం చేయాలన్నారు. వాహనాల తనిఖీలు చేపట్టి గంజాయి అక్రమ రవాణా, క్రయవిక్రయాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించాలని, సాయంత్రం విజిబుల్ పోలీసింగ్లో భాగంగా కళాశాలలు, పాఠశాలల పరిధిలో ఎలాంటి ర్యాగింగ్, ఇతర నేరాలు జరగకుండా చూడాలన్నారు. -
పరిమళించిన మానవత్వం
నరసన్నపేట: దాతలు తమ ఔదార్యాన్ని చాటుతూ మానవత్వాన్ని చూపుతున్నారు. నరసన్నపేట మండలం దేవాది కాలనీలో ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయిన ఇద్దరు బాలికలకు దాతలు ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఈ నెల 16న ‘దేవాదిలో విషాదం’ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో బాలికలను ఆదుకోవడానికి దాతలు ముందుకు వస్తున్నారు. రెండు రోజుల క్రితం కంబకాయకు చెందిన దాతలు రూ.25500 అందించగా.. తాజాగా మంగళవారం సంతబొమ్మాళి మండలం గోవిందాపురానికి చెందిన శ్రీ రేయమ్మతల్లి యూత్(హెల్పింగ్ హ్యాండ్స్) సభ్యులు మరో రూ. 25 వేలు, టెక్కలి చెందిన అభయం సేవా సంఘం సభ్యులు రూ.50 వేలు వితరణ చేశారు. కార్యక్రమంలో అభయం సేవా సంఘం ప్రతినిధులు దేవాది శ్రీనివాసరావు, సింహాచలం, ధర్మారపు పూర్ణారావు, సర్పంచ్ మంతిన రాము తదితరులు పాల్గొన్నారు. -
అర్హత ఉన్నా అందని ‘తల్లికి వందనం’
హిరమండలం: అన్ని రకాలుగా అర్హత ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబానికి తల్లికి వందనం పథకం వర్తించలేదు. బాధిత కుటుంబానికి అసలు విద్యుత్ కనెక్షనే లేదు..కానీ 74 సర్వీసులు ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. దీంతో వీరికి పథకం రాలేదు. గులుమూరు పంచాయతీ జగన్నాథపురం సమీపంలో రేకుల షెడ్లో నిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరి ముగ్గురు పిల్లలు హేమంత్, జస్మిత, దార్మిక్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరి ఇంటికి పూర్తిగా విద్యుత్ కనెక్షనే లేదు. కానీ వీరి ఆధార్తో అనుసంధానమై 74 కనెక్షన్లు ఉన్నట్లు ఆన్లైన్లో చూపిస్తోంది. పోలాకి మండలంలో 5, రణస్థలంలో 4, జి.సిగడాంలో 3, లావేరులో 8, పొందూరులో 34, ఎచ్చెర్లలో 20 విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు చూపిస్తోంది. దీనిపై పెంటయ్య హిరమండలం విద్యుత్ ఉపకేంద్రంలో విన్నవించగా ఇన్చార్జ్ ఏఈ వెంకటేశ్వరరావు వీరి పేరున హిరమండలంలో ఎలాంటి విద్యుత్ కనెక్షన్ లేదని లేఖ ఇచ్చారు. ఆ లేఖను చూపించినా వారికి పథకం రాలేదు. గార, హిరమండలం ఎంపీడీఓలపై కలెక్టర్ ఆగ్రహం శ్రీకాకుళం పాతబస్టాండ్: వర్షాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్యం, మురుగుకాలువల శుభ్రత పనుల్లో నిర్లక్ష్యం చూపిన గార, హిరమండలం ఎంపీడీఓలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పీఆర్జీఎస్, కోర్టు కేసులు, ఎరువుల పంపిణీ, పి–4 సర్వే పురోగతి వంటి అంశాలపై విపులంగా సమీక్షించారు. నీటి నాణ్యత పరీక్షలు, కాలువల శుభ్రత, హాస్టళ్ల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణ చర్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎరువుల పంపిణీలో అలస త్వం పనికిరాదని, కొరత అనే పదం వినిపించకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఉపాధి పనుల పరిశీలన సంతబొమ్మాళి: నేషనల్ లెవల్ మానిటరింగ్ టీమ్ సభ్యులు నునీల్ బంటా, నామాసింగ్ బృందం మండలంలోని బోరుభద్ర, ఉమిలాడ పంచాయతీల్లో మంగళవారం పర్యటించారు. ఆయా పంచాయతీల్లో ఉపాధి హామీ వేతనదారులు, డ్వాక్రా మహిళలు, గృహనిర్మాణ పనుల లబ్ధిదారులతో ముచ్చటించారు. ఉపాధి పను లు గ్రామానికి ఎంత దూరంలో చేస్తున్నారు, బిల్లులు అందుతున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. రుణాలు సకాలంలో అందుతున్నాయా, ఆ రుణాలతో ఎలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేస్తారో అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఉపాధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్, ఎంపీడీఓ జయంత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎగబడితేనే ఎరువు అధికారులేమో ఎరువుల కొరత లేదని చెబుతున్నారు. రైతులు మాత్రం ఎదురుచూసీ చూసీ ఎగబడితే గానీ ఎరువు దొరకడం లేదు. ఎల్ఎన్పేట మండలంలోని పెద్దకోట 1, 2 రైతు సేవా కేంద్రం పరిధిలోని రైతులకు మంగళవారం ఎరువులు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఒకేసారి వందలాది మంది రావడంతో గందరగోళం నెలకొంది. అధికారులు అందరికీ సర్దిచెప్పేటప్పటికి వారి తల ప్రాణం తోకకు వచ్చింది. – హిరమండలం -
డబుల్ రోడ్డు పనులు పునఃప్రారంభం
వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస నియోజకవర్గంలో బెండి గేటు నుంచి బెండి మీదుగా నువ్వలరేవు, వజ్రపుకొత్తూరు నుంచి అక్కుపల్లి మీదగా కాశీబుగ్గ వరకు అధ్వానంగా మారిన రోడ్లు దుస్థితిపై ‘ఎన్నాళ్లీ రహదారిద్య్రం?’ అనే శీర్షికతో ఈ నెల 19న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి రోడ్డు అభివృద్ధి పనులు పునఃప్రారంభించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నువ్వలరేవు–రేగిలపాడు వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.23 కోట్లు, వజ్రపుకొత్తూరు అక్కుపల్లి మీదుగా కాశీబుగ్గ వరకు సుమారు రూ.21 కోట్లు వ్యయంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్రాంతి నాటికి గోతులు లేని రోడ్లు సిద్ధం చేస్తామని చెప్పి ఏడాది కాలం దాటిన తర్వాత పనులు మళ్లీ ప్రారంభించడం కొసమెరుపు. -
నవజీవన ఆశ్రమంలో తనిఖీలు
గార: మౌలిక వసతుల కల్పనతో పాటు పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా నిర్వహించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి కె.హరిబాబు అన్నారు. మంగళవారం శ్రీకూర్మంలోని నవజీవన ఆశ్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా సూచనలతో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. విద్యార్థుల హాస్టల్, తరగతి గదులు, వంటశాల పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేపట్టారు. ఏమైనా సమస్యలుంటే పరిశీలనకు వచ్చే అధికారులకు తెలియజేయాలన్నారు. కార్డన్ సెర్చ్ కలకలం టెక్కలి రూరల్: టెక్కలి మండల కేంద్రంలోని గొల్లవీధిలో సీఐ ఎ.విజయ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం వేకువజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అపరిచితులు, నిషేధిత పదార్థాలకు సంబంధించి ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 17 ద్విచక్ర వాహనాలను స్టేషన్కు తరలించారు. కాగా, ఇతర పత్రాలు సక్రమంగా ఉన్నా సీ బుక్లో ఉన్న వ్యక్తి లేకపోయినా వాహనం తీసుకువెళ్లిపోయారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. శభాష్ అయ్యవార్లు! జి.సిగడాం: మండలంలోని కొత్తపెంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పొగిరి పండు అప్పలనాయుడు, మక్క లక్ష్మునాయుడు, వి.మమత స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో కాకుండా అత్యుత్తమ ఫలితాలు అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి అభినందనలు అందుకుంటున్నారు. వీరి పిల్లలు పొగిరి నూతన్కుమార్(6వ తరగతి), మక్క మోక్ష వర్షిణిచ, వేదిత్లను కొత్తపెంట స్కూల్లోనే చేర్పించడంతో ప్రధానోపాధ్యాయులు ఎస్.భానుమూర్తి, వి.రవి, గ్రామస్తులు అభినందించారు. కర్షకులకు కొనసాగుతున్న కష్టాలు ● ఎరువుల కోసం తప్పని పాట్లు కొత్తూరు: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. పూర్తిస్థాయిలో ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. కొత్తూరు రైతు సేవా కేంద్రానికి ప్రభుత్వం 20 టన్నులు యూరియా కేటాయించింది. తక్కువ మొత్తంలో రావడంతో రైతులు రెండు రోజులుగా ఆర్ఎస్కేల చుట్టూ తిరుగుతున్నారు. మంగళవారం యూరియా విక్రయిస్తారని గ్రామ వ్యవసాయ సహాయకులు చెప్పడంతో పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. అడంగల్ పత్రాలు ఉన్న రైతులకు మాత్రమే యూరియా విక్రయిస్తామని చాలామంది నిరాశతో వెనుతిరిగారు. పెన్కాక్సిలాట్లో పతకాల పంట శ్రీకాకుళం న్యూకాలనీ: సౌత్జోన్ నేషనల్స్ పెన్కాక్ సిలాట్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు పతకాల పంట పండించారు. తమిళనాడులోని త్రిచి జిల్లాలో ఉన్న కొంగునాడు ఇంజినీరింగ్ కాలేజీ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు 6వ సౌత్జోన్ పెంకాక్సిలాట్ పోటీలు జరగగా.. అంధవరపు సాయి ప్రశాంత్, దున్న సుచెరిత, కొండేటి హరీష్, బంగారు పతకాలు సాధించారు. దున్న సుమన, రెడ్డి యోగామృత, అంధవరపు లలిత్మిదిన్, పి.షాన్, కె.దీక్సిత రజత పతకాలు, బి.నాగేశ్వరి, బి.జ్యోతి సాయి ప్రసాద్, సాన సుజిత్ శంకర్, ఎస్.సహస్ర, బి.కార్తికేయ, పి.పవన్, పి.రాకేష్ నాయుడు, మండా రామ్సాయి, విహాన్ శర్మ కాంస్య పతకాలు సాధించారు. వీరిని పెన్కాక్సిలాట్ సంఘ జిల్లా అధ్యక్షులు రేగిడి దయమయ, ప్రధాన కార్యదర్శి నక్క లక్ష్మణ్ నాయుడు, శ్రీ పరశురామ యుద్ధకళా క్షేత్రం కోచ్ లింగాల ఈశ్వర్రావు అభినందించారు. హేమంత్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ కోచ్ హేమంత్ యాదవ్, హరీష్ పాల్గొన్నారు. -
● ఉపాధ్యాయ, ఉద్యోగులకు నాలుగు డీఏల బకాయిలు ● ఐఆర్, పీఆర్సీపై కానరాని స్పష్టత ● హామీలు అమలు చేయకపోవడంపై ప్రభుత్వంపై ఆగ్రహం ● ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్న ఉద్యోగ సంఘాలు
శ్రీకాకుళం: బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులనూ వంచించింది. ఎన్నికల వేళ ఎన్నో వరాలను కురిపించి తీరా గద్దెనెక్కాక ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోందన్న వాదన ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల నుంచి వినిపిస్తోంది. 2023 జూలై నుంచి ఒక్క డీఏ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులు అందుకోలేకపోయారు. దీంతో ఇప్పటివరకు నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నట్లు అయ్యింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయా ఉద్యోగులకు ఒక్క డీఏ కూడా పెండింగ్ లేదు. కేంద్ర ప్రభుత్వంప్రకటించిన ఒకటి రెండు నెలలు అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం సైతం డీఏలను ప్రకటించాల్సి ఉంటుంది. దీనిని కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదు. చంద్రబాబు తీరే అంత.. 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులకు ఐదు డీఏలను రద్దు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పట్లో డీఏల సాధనకు డీఏ పోరాట సాధన కమిటీని ఏర్పాటు చేసుకొని ఉద్యమించినా ఫలితం లేకపోయింది. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు రద్దు చేసిన డీఏలతో పాటు కొత్త డీఏలు సైతం సకాలు చెల్లించి ఉద్యోగుల మన్ననలను పొందారు. 11వ ఆర్థిక సంఘం సమ్మిట్లో పాల్గొన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి సూచనలు చేస్తూ కేంద్రం రాష్ట్రాలతో సంప్రదించకుండా డీఏలను ఇస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుందని పేర్కొనడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వంలోనూ చంద్రబాబు ఇదే ధోరణి అవలంబిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. పీఆర్సీ ఇప్పట్లో లేనట్లేనా.. పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే రెండేళ్ల గడువు ముగిసింది. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2023 జూలై 24న పీఆర్సీ కమిటీని నియమించి దానికి చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమించిన తెలిసిందే. 2024 జూలైలోగా కమిటీ నివేదికను సమర్పించాలని గడువును విధించారు. 2024 మేలో తెలుగుదేశం అధికారంలోకి రావడంతో మన్మోహన్సింగ్ తాను ఈ ప్రభుత్వంలో చైర్మన్గా పనిచేయలేనంటూ రాజీనామా చేశారు. ఇది జరిగి ఏడాది కావస్తున్న కొత్త చైర్మన్ను నియమించకపోవడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. తక్షణం చైర్మన్ను నియమించినా అధ్యయనానికి నివేదిక సమర్పించడానికి ఏడాది సమయం పడుతుంది. ఈ లెక్కన ఇప్పుడు కమిటీని నియమించిన 2026 ఆగస్టు వరకు నివేదిక సమర్పించే పరిస్థితి ఉండదు. అటు తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమ సంఘాలతో చర్చించడం మరలా పరిశీలనకు కమిటీ అంటూ మంత్రులను నియమించడం చంద్రబాబుకు ఆనవాయితీగా వస్తుందని, అంటే తక్షణం కమిటీని నియమించిన 2027 మార్చి వరకు పీఆర్సీ అమలు కాదన్నది తేటతెల్లమవుతుందని ఉద్యోగ, ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే 2027 లోనే జరిగే అవకాశాలు ఉండడంతో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు కాదేమోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఉద్యమ బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించుకోవడంలో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు సమావేశమవుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఇవి కార్యరూపం దాల్చి ఉద్యోగులు ఆందోళన బాట పట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తక్షణం ప్రకటించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన నాలుగు డీఏలను తక్షణం అమలు చేయాలి. పీఆర్సీని నియమించి ఐఆర్ను ప్రకటించాలి. డీఏలు అందక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇప్పటికే ఎంతో నష్టపోయారు. – చింతల రామారావు, ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్ పెండింగ్ బిల్లులు చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలి. సుమారు 20 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. పీఆర్సీ నివేదిక వచ్చే వరకు మధ్యంతర భృతి ప్రకటించి, డీఏ బకాయిలు చెల్లించాలి. – కిలారి నారాయణరావు, పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం నాయకులు -
ఎమ్మెల్యేను కలిశారా..?
వేధింపులు సరికాదు సచివాలయ ఉద్యోగులపై రాజకీయ వేధింపులకు పాల్పడటం సరైన పద్ధతి కాదు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చిరుద్యోగులనే టార్గెట్ చేస్తోంది. ఇది దుర్మా ర్గమైన పద్ధతి. నిబంధనల మేరకు బదిలీలు పొందిన సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సబబు కాదు. జిల్లా అధికారులు చొరవ తీసుకుని న్యాయం చేయాలి. – పోలాకి ప్రసాదరావు, సీపీఎం, జిల్లా కార్యవర్గ సభ్యుడు, శ్రీకాకుళం ●● పాతపట్నం నియోజకవర్గంలో వింత సంస్కృతి ● సచివాలయ ఉద్యోగులతో ఎంపీడీఓల చెడుగుడు ● ఎమ్మెల్యేను కలవాల్సిందేనని హుకుం పాతపట్నం: కొత్తగా ఆఫీసులో చేరాలంటే ఎమ్మెల్యే లెటర్ ఉండాలి. ట్రాన్స్ఫర్ అయిన ఉద్యోగి మరోచోట జాయిన్ కావాలంటే ఎమ్మెల్యే ఆ ఉద్యోగి పేరు ముందుగానే చెప్పి ఉండాలి. బదిలీ తర్వాత విధుల్లో చేరాలంటే ఎమ్మెల్యేను కలిశాకే ఆఫీసుకు రావాలి.. పాతపట్నంలో అమలవుతున్న వింత సంస్కృతి ఇది. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు ఎమ్మెల్యేను కలిశాకే ఏ పనైనా చేయాలని అధికారులే హుకుం జారీ చేస్తున్నారు. తాజాగా పాతపట్నం మండలంలోని కాగువాడ సచివాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి మెళియాపుట్టి మండలం మర్రిపాడు–సి, కరజాడ, కోటబొమ్మాళి మండలం కురుడు అంటూ మూడు చోట్లకు బదిలీ చేశా రు. ఆ ఉద్యోగి అక్కడ బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు. అయితే ‘ఎమ్మెల్యే నీ పేరు చెప్పలేదు. రెండు రోజులు ఆగు మాట్లాడి చెబుతా’ అనే సమాధానం ఎంపీడీఓ నోటి నుంచి వినిపించడంతో ఆ ఉద్యోగి అవాక్క య్యారు. మరో ఉద్యోగికి పాతపట్నం మండలంలోని బడ్డుమర్రి బదిలీ అయ్యింది. తీరా అక్కడకు వెళ్తే ‘నిన్ను వేరే సచివాలయానికి మార్చేశా’ అని ఎంపీడీఓ చెప్పడంతో అతను నివ్వెరబోయారు. ఇంకో ఉద్యోగికి కొత్తూరు మండలం నుంచి పాతపట్నం మండలంలో ని ఓ సచివాలయానికి బదిలీ కాగా, విధుల్లో చేరేందుకు వెళితే ఎమ్మెల్యేని కలిసి రావాలని, లేదంటే ఆయన పీఓతోనైనా ఫోన్ చేయించాలని సాక్షాత్తు ఎంపీడీఓ తెగేసి చెప్పేశారు. పాతపట్నంలో ఈ విష సంస్కృతికి వేళ్లూనుకుంటోంది. ప్రజా ప్రతినిధుల వేధింపులతో ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొత్త స్థానాల్లో విధుల్లో చేరలేక నరకం చూస్తున్నారు. నియోజకవర్గంలోని 91 గ్రామ సచివాలయాల్లో 718 మంది ఉద్యోగులు వివిధ కేడర్లలో విధులు నిర్వహిస్తున్నారు. వీరికి జూ న్ 15 నుంచి 30వ తేదీ వరకు బదిలీల కస రత్తు నిర్వహించారు. బదిలీ అయిన వారు జూలై 10లోపు కొత్తస్థానాల్లో చేరిపోవాలి. కానీ ఇలా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చాలా మంది ఇప్పటికీ విధుల్లో చేరలేదు. ‘ఎవరి అనుమతితో ఇక్కడకు వచ్చావు’ వంటి ప్రశ్న లు ఎదురవుతుండడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. నమస్తే పెట్టి వెళ్లు.. కొత్త స్థానాల్లో చేరేందుకు వెళ్తున్న సచివాల య ఉద్యోగులను ఎంపీడీఓలు వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు ఎమ్మెల్యేల పీఏలు కాల్ చేసి, ‘ఒక సారి వచ్చి ఎమ్మెల్యేకు నమస్తే పెట్టి వెళ్లు’ అంటూ ఆదే శాలు జారీ చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, వారి పీఏలు, ఎంపీడీఓలు ఇలా ఎవరికి వారు సచివాలయ ఉద్యోగులతో చెడుగుడు ఆడుకుంటున్నారు. పట్టించుకోని జిల్లా యంత్రాంగం సచివాలయ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను జారీచేసింది. కలెక్టర్ అనుమతితో నిబంధనలను అ నుసరించి బదిలీలు చేపట్టారు. ఈ ప్రక్రియ లో నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు ఇచ్చి న సిఫార్సులు చెల్లకపోవడంతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారిపోయారు. ‘ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలి. ఇప్పుడంత డబ్బులు ఎక్కడున్నాయి’ అంటూ విజయనగరం జిల్లా కొత్తవలసలో అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ చేతగానితనాన్న
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. 50 ఏళ్లకు పింఛన్ ఊసెత్తడం మానేశారు. తల్లికి వందనం ఒక ఏడాది ఎగ్గొట్టేశారు. ఇప్పుడు కూడా అనేక ఆంక్షలు పెట్టారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం వాయిదాలు పడుతూనే ఉంది. అన్నదాత సుఖీభవ గత ఏడాది ఇవ్వనేలేదు. ఈ ఏడాది కూడా ఇస్తారో లేదో అన్నట్లు ఉంది. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పథకాలకు అతీగతి లేదు. ఉచిత గ్యాస్ హామీలు కూడా గాలి మాటలేనని తేలిపోయింది. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలట? ఇన్ని పథకాలు అమలు చేయకపోయినా అన్నీ అమలు చేసేశామని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇక 19 నుంచి 60ఏళ్ల లోపు మహిళలకు నెలకి రూ.1500 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఇస్తామన్న హామీకి తొలి ఏడాది పంగనామం పెట్టారు. ఈ ఏడాదైనా ఇస్తారేమో అని మహిళలు అంతా ఆశతో చూస్తున్నారు. ఒక్క మన జిల్లాలోనే 7,59,692మంది మహిళలు నిరీక్షిస్తున్నారు. ఇప్పుడా ఆశలపై మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలతో నీళ్లు జల్లేసినట్టు అయిపోయింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాల్సి వస్తుందని బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. దీంతో ఆడబిడ్డ నిధి పథకం లేనట్టే అని సంకేతాలు ఇచ్చినట్టయ్యింది. దీనిపై మహిళలంతా మండిపడుతున్నారు. ఏరు దాటాక తప్ప తగలేసినట్టు ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక మాట మార్చడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రతీసారి ఇదేరకంగా మోసం చేస్తోందని అంటున్నారు. సోషల్ మీడియోలో వైరల్ అచ్చెన్న తాజా వ్యాఖ్యలతో ఆయన పాత మాటలు కూడా ట్రెండింగ్లోకి వచ్చాయి. గతంలో చేసిన కామెంట్లతో పార్టీ పరువు పోగా, ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రం అమ్మేయాలన్న వ్యాఖ్యలతో ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ‘రైతులకు ఆశ ఎక్కువ. పంట పండించక ముందు ఆలోచించాలి. పండించాక నష్టపోయామని బాధపడకూడదు. మార్కెట్లో పంట అమ్మకాలను పసిగట్టి పంటలు వేసుకోవాలి’. – రైతులనుద్దేశించి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివి. ఇవ్వకపోతే పోరాటం చేస్తాం ఆడబిడ్డ నిధి కింద రూ.1500 ప్రతి నెలా ఇవ్వకపోతే పోరాటం చేస్తాం. అచ్చెన్న వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి.? దీన్ని మోసం కాక ఇంకేమంటారు.? గత ఏడాది బకాయితో కలిపి మొత్తం చెల్లించాలి. – చింతాడ రవికుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త ● దారుణ వంచన కూటమి ప్రభుత్వం దారుణంగా మోసం చేసింది. ఇంతకంటే మోసం ఉంటుందా..? ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇలాంటి ప్రకటన చేయడం ఏంటి.? మహిళలను మోసం చేస్తున్న కూటమికి గుణపాఠం తప్పదు. వైఎస్ జగన్ చిత్తశుద్ధిగా పథకాలు అమలు చేశారు. – రెడ్డి శాంతి, వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు హామీలు ఎందుకు ఇచ్చారు..? ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమని తెలిసిన కూటమి పార్టీ లు ఎన్నికలకు ముందు ఎందుకు హామీ ఇచ్చాయి. మంత్రి అచ్చెన్నాయడు ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని అనడం సరికాదు. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? – పిరియా విజయ, జెడ్పీ చైర్పర్సన్, ఇచ్ఛాపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఇవ్వలేమని తేల్చేశారు.. మంత్రి అచ్చెన్నాయుడు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా ఆడబిడ్డ ఇవ్వలేమని తేల్చి చెప్పేసినట్టే. ఎన్నికల మునుపు మహిళలకు హామీలిచ్చి అధికారం దక్కించుకోవడం ఆ తర్వాత మహిళల్ని దగా చేయడం చంద్రబాబు ప్రభుత్వానికే సాధ్యం. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలంటూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ ఓట్లేసిన ప్రజలనే మోసగించారంటూ మండిపడుతున్న నెటిజన్లు అచ్చెన్న గతంలో చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్న వైనం -
డిగ్రీ నాలుగో సెమిస్టర్ ఫలితాలు విడుదల
ఎచ్చెర్ల : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల పరిధిలోడిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు వర్శిటీ పరీక్షల యూజీ డీన్ డాక్టర్ జి.పద్మారావు మంగళవారం తెలిపారు. రెగ్యులర్ విధానంలో 6,972 మందికి గాను 42.47 శాతం మంది, సప్లిమెంటరీలో 4,837 మందికి గాను 55.53 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. పాముకాటుతో వ్యక్తి మృతి హిరమండలం: ఎల్ఎన్పేట మండలం బొత్తాడిసింగి గ్రామానికి చెందిన గుమ్మడి రామకృష్ణ (44) పాముకాటుకు గురై సోమవారం రాత్రి మృతి చెందాడు. రామకృష్ణ భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసేందుకు పొలానికి వెళ్లారు. రామకృష్ణ పని చేస్తుండగా పాము కాటు వేయడంతో వెంటనే ఎల్ఎన్పేట పీహెచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈయనకు భార్య మహాలక్ష్మి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వైద్యశాఖ పంచాయితీ
కలెక్టరేట్కు చేరిన.. ● బదిలీల్లో అంతులేని అవినీతి! ● రెండు రోజులుగా దొరకని పరిష్కారం ● ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు సిద్ధం శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ, వార్డు సచివాలయ ఏఎన్ఎంల బదిలీలకు సంబంధించిన పంచాయితీ కలెక్టరేట్కు చేరింది. గిరిజన ప్రాంతం నుంచి నగరానికి బదిలీ జరిగిన ఏఎన్ఎంలను అక్కడి అధికారులు రిలీవ్ చేయకపోవడం, నగరం నుంచి ఇతర ప్రాంతాలకు బలవంతంగా బదిలీలు చేయడం, బదిలీల్లో అక్రమ వసూళ్లు తదితర అంశాలపై బాధిత ఏఎన్ఎంలు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారాలపై సోమ, మంగళవారాల్లో కలెక్టరేట్ పాత గ్రీవెన్సు హాల్ వద్ద పంచాయితీ జరిగింది. ఎటూ తేల్చుకోలేక వైద్య శాఖ అధికారులు మళ్లగుళ్లాలు పడుతున్నారు. మొత్తం 500పైగా బదిలీలు జరిగితే ఒకే స్థానాల్లో ఇద్దరిని, ముగ్గురిని సైతం నియమించేశారు. ఇలాంటి వారు సుమారు 60 మంది ఉన్నట్లు సమాచారం. సీతంపేట ఏజెన్సీ ఏరియాకు చెందిన వారిని సైతం శ్రీకాకుళం నగరంలో నియమించడంతో ఇది నిబంధనలకు విరుద్ధమని ఐటీటీఏ పీఓ రిలీవ్ ఆర్డర్లు ఇవ్వడం లేదు. కలెక్టర్ ఆగ్రహం.. వైద్య శాఖలో నిబంధనలకు వ్యతిరేకంగా నగరంలోని సచివాలయాల్లో గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన ఏఎన్ఎంలను నియమిస్తు వైద్య శాఖ అధికారులు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడంపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లోపాలు సరిదిద్దాలని ఆదేశించడంతో సోమవారం అర్ధరాత్రి వరకు సంబంధిత అధికారులు మళ్లగుళ్లాలు పడ్డారు. అయితే తప్పిదాలు దిద్దే అవకాశం లేకపోవడంతో రెండో రోజు మంగళవారం కూడా ఈ పంచాయితీ పూర్తి కాలేదు. భారీగా ముడుపులు.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఇటీవల జరిగిన బదిలీలలో భారీగా అవినీతి చోటుచేసుకుందనే ఫిర్యాదులు వచ్చాయి. వైద్య శాఖ అధికారుల అవినీతి, లంచాలు, నజరానాలపై పలువురు ఏఎన్ఎంలు బాహటాంగానే విరుచుకుపడ్డారు. దీంతో వైద్య శాఖ అవినీతి బండారం బయటపడింది. లక్షల్లో అవినీతి జరిగినట్టు ఫిర్యాదులు కలెక్టరేట్కి చేరినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కొందరికి బదిలీలు పూర్తి కాగా, మరికొందరు పోస్టింగ్ల కోసం వేచిచూస్తున్నారు. సీనియార్టీ జాబితాను పక్కన పెట్టి ఖాళీల భర్తీలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివక్ష చూపించడాన్ని నిరసిస్తూ కొంత మంది ఆర్డర్లు తీసుకోకుండా స్థానాల మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి జరిగిన బదిలీలలో అక్రమాలతో పాటు పదుల సంఖ్యలోని అభ్యర్థులకు డబుల్ పోస్టింగ్లు, ఒకే స్థానంలో పలువురిని నియమించడం, ఒకరికి పలు చోట్ల నియామకాలు చేయడం వంటి అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ జాబితాలు కూడా కలెక్టర్కి ఫిర్యాదుల రూపంలో బాధితులు అందజేశారని తెలుస్తోంది. ఏఎన్ఎంల బదిలీలకు సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు, ఫోన్న్ ద్వారా ఒత్తిడి తీసుకు వచ్చారు. వారిని పట్టించుకోకపోవడంతో వారి తరఫు నుంచి కూడా కొంతమంది కలెక్టర్కు ఫిర్యాదుల చేశారు. చర్యలకు సిద్ధం.. వైద్యశాఖలో ఏఎన్ఎంల బదిలీల్లో జరిగిన అవినీతి అక్రమాలపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతున్నట్టు తెలిసింది. జిల్లా అధికారి సరెండర్, ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. అయితే ఈ పంచాయితీ పూర్తయ్యాకే ఈ చర్యలు ఉంటాయని కలెక్టరేట్ వర్గాలు చెబుతున్నాయి. ఎవరు చేసిన తప్పులు వారు సరిచేసిన తర్వాతే అవినీతికి పాల్పడ్డవారిపై చర్యలకు ఉపక్రమించన్నుట్టు తెలిసింది. -
పారదర్శకంగా సర్వే
గార: బంగారు కుటుంబాలు సర్వే పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రం గారలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్తో కలిసి గ్రామసభలో పాల్గొని సర్వే తీరును పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి సంక్షేమ కార్యక్రమాలు అమలును అడిగి తెలుసుకున్నారు. కొత్తూరు సైరిగాం వద్ద ఆటోలో యూరియా బస్తాలు వెళ్తుండటంతో వాటి వెనుకనే గ్రామంలోకి వెళ్లి 16 బస్తాలు ఒకేసారి ఎందుకు వెళ్తున్నామని ప్రశ్నించారు. ఎనిమిది మంది రైతులు తెచ్చుకున్నామని తెలియజేశారు. అనంతరం సమీపంలోని ఎంపీయూపీ పాఠశాలను సందర్శించి విద్యార్థుతో ముచ్చటించారు. మౌలిక వసతులపై హెచ్ఎం ఆర్.రమణమూర్తితో మాట్లాడగా.. అదనపు తరగతి భవనాలు అవసరమని తెలియజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎం.చక్రవర్తి, ఎంపీడీఓ ఏ.రఘు తదితరులు పాల్గొన్నారు. -
దాచాలన్నా.. దాగలేదు!
ఇసుక గుట్టలమాటున అక్రమాల గుట్టుముద్దాడపేటలో అక్రమ ర్యాంప్● పాత నిమ్మ తొర్లువాడ ఘటనతో వెలుగులోకి ● మీడియా పరిశీలనతో బయటపడిన బాగోతం ● అధికారులు వస్తారని తెలిసి జేసీబీ, లారీలను బయటకు పంపేసిన అక్రమార్కులు ● అయినప్పటికీ మీడియా కంటపడిన జేసీబీలు, లారీలు ● పాత నిమ్మ తొర్లువాడకు 4 కిలోమీటర్ల మేర ఇసుక కొట్టేసే ప్లాన్ ఈ ఫొటోలో ఉన్న జేసీబీలు చూడండి. ఆదివారం రాత్రి గొడవ జరిగిన పాత నిమ్మ తొర్లువాడకు దగ్గరలో ఉన్న ముద్దాడపేటలో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుకర్యాంపులో ఉన్న జేసీబీలు ఇవి. అనుమతుల గడువు మే 31న ముగిసిపోయినప్పటికీ ఇష్టారీతిన టీడీపీ నాయకులు తవ్వకాలు జరుపుతున్న దృశ్యమిది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు జేసీబీలతో నదిలో తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. -
జాతీయ పథకాలపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ స్థాయి మానిటరింగ్ (ఎన్ఎల్ఎం) బృందం జిల్లాలో అమలవుతున్న జాతీయ పథకాలపై సోమవారం సమీక్ష నిర్వహించింది. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమీక్షకు బృంద సభ్యులు సునీల్ బంటా, నాథు సింగ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి పథకాల అమలులో పారదర్శకత, సమగ్రత అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహా త్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ, పీఎం గ్రామ సడక్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన తదితర పథకాల అమలు స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. ప్రజల వద్దకు పథకాల లబ్ధి పూర్తిస్థాయిలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ బృందం జిల్లాలో ఐదు రోజులు పలు గ్రామాల్లో పర్యటిస్తుందని డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తెలిపారు. -
● ఇదేనా సుపరిపాలన..?
ఆమదాలవలస: దాడులు చేయడమే కూటమి ప్రభుత్వం సుపరిపాలనా..? అని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కోట గోవిందరావు ప్రశ్నించారు. ఆమదాలవలస మండలంలోని పాతనిమ్మతొర్లువాడ గ్రామంలో ఆదివారం రాత్రి ఇసుకాసురులు ఆ గ్రామ ప్రజలపై చేసిన దాడిని ఖండిస్తూ సోమవారం ఇసుక ర్యాంపును సందర్శించారు. ఎస్ఐ ఎస్.బాలరాజుతో మాట్లాడారు. దాడిలో ప్రాణాలు కోల్పోతే ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గ్రామస్తులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు. కూటమి నాయకులు అక్రమార్జన కోసం ఎగబడుతున్నారని, ప్రజలకు అందాల్సిన సంక్షేమానికి గండి కొడుతున్నారని అన్నారు. గాయపడిన వారికి అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఆయన తోపాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఆమదాలవలస మండలం కొత్తవలస, పాత నిమ్మతొర్లువాడ గ్రామాల మధ్య ఇసుక ర్యాంపును పరిశీలించి విచారిస్తున్న ఆర్డీవో సాయిప్రత్యూష ఆమదాలవలస: మండలంలోని నాగావళి నది పరివాహక ప్రాంతమైన కొత్తవలస, పాత నిమ్మతొర్లు వాడ వద్ద నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపు తవ్వకాలు నిబంధనల మేరకు చేపట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ర్యాంపు నిర్వాహకులకు హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి ఇసుక ర్యాంపు నిర్వాహకులకు గ్రామస్తుల మధ్య జరిగిన వివాదంపై ఆమె సోమవారం విచారణ చేపట్టారు. తొలుత ఇసుక ర్యాంపును పరిశీలించి అనంతరం పాతనిమ్మతొర్లువాడ గ్రామస్తులతో పోలీసులు సమక్షంలో మాట్లాడారు. ముందుగా గ్రామస్తులను ఆర్డీవో విచారించగా నాగావళి పరివాహక ప్రాంతంలో శ్మశాన వాటికతో పాటు యువకులు ఆటలాడే ప్రదేశం ఉందని, ర్యాంపు నిర్వాహకులు ఇక్కడ వాహనాలు తీసుకెళ్తుండడం వల్ల మైదాన ప్రాంతం కోతకు గురవుతోందని తెలిపారు. అయినా ఆపకుండా తవ్వకాలు చేస్తుండడంతో జేసీబీల వద్ద తవ్వకాలు అడ్డుకున్నామని తెలిపారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమదాలవలస ఎస్ఐ బాలరాజు, సిబ్బందితో వచ్చి మాట్లాడారని, కానీ తర్వాత ర్యాంపు నిర్వాహకులు కొందరు రౌడీలను తీసుకువచ్చి తమపై దాడి చేశారని వారు ఆర్డీవోకు తెలిపారు. దీనిపై ఆర్డీవో ర్యాంపు నిర్వాహకులను ప్రశ్నించగా స్థానికులు తవ్వకాలు వద్దు అంటే వాహనాలు నిలిపేసి వెళ్లిపోయామని, దాడులకు తమకు సంబంధం లేదని తెలిపారు. దీంతో గ్రామస్తులకు ర్యాంపు నిర్వాహకులకు వాగ్వాదం జరిగింది. ఇసుకర్యాంపు వద్ద ఉన్న సీపీ కెమెరాల్లో దాడుల దృశ్యాలు చూపించి దాడిచేసిన వారిని గుర్తించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. కెమెరాలు పనిచేయడం లేదని ర్యాంపు నిర్వాహకులు చెప్పడంతో.. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుల అండదండలతో టీడీపీ గూండాలతోనే దాడి చేయించారని గ్రామస్తులు ఆరోపించారు. ఇదంతా విన్న ఆర్డీవో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పొన్నాడ సుధాకర్ స్పందిస్తూ గ్రామస్తులు సూచించిన మూడు ప్రదేశాలను విడిచిపెట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక తవ్వకాలు చేపట్టాలని సూచించారు. ఇసుక లారీల రాకపోకలకు ఏర్పాటుచేసిన రహదారికి తక్షణమే అనుమతులు తీసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు. విచారణలో ఆమదాలవలస తహసీల్దారు రాంబాబు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష -
‘టెక్కలిలో కొత్త మద్యం డిపో ఎందుకు..?’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎచ్చెర్ల ఐఎంఎల్ డిపోను విడదీసి కొత్త డిపోను టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాసరావు, సీపీఐ (ఎంఎల్) జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్ ప్రశ్నించారు. మూడు తరాలుగా డిపోలో పనిచేస్తున్న హమాలీల ఉపాధిని కాపాడాలన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఇందిరానగర్ కాలనీలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అచ్చెన్నాయుడిని కలిసి వినతిపత్రం ఇచ్చినప్పు డు టెక్కలిలో కొత్త డిపో ఏర్పాటు చేయకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మళ్లీ టెక్కలిలో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. జిల్లా ప్రజలు శివారు భూములకు నీరు ఇవ్వమని అడుగుతున్నారే తప్ప కొత్తగా డిపోలు పెట్టి బీరు అడగడం లేదని ఎద్దేవా చేశారు. ఎచ్చెర్ల డిపోను యథావిధిగా కొనసాగించి హమాలీల ఉపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. -
‘హద్దు’మీరుతున్న నేరాలు
● రాష్ట్రాల సరిహద్దులు దాటి సిక్కోలులోకి అంతర్రాష్ట్ర దొంగలు ● ప్రశాంత సిక్కోలుపై బీహార్, రాజస్థాన్, వెస్ట్బెంగాల్ గ్యాంగుల దాడులు ● దారి దోపిడీలు, భారీ చోరీలు, గంజాయి రవాణాలో ఘనులు శ్రీకాకుళం క్రైమ్ : ప్రశాంత సిక్కోలును అంతర్రాష్ట్ర దొంగలు హడలెత్తిస్తున్నారు. దారిదోపిడీలు, భారీ చోరీలు, గంజాయి రవాణా, సైబర్ నేరాలతో వణుకు పుట్టిస్తున్నారు. ఓవైపు ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సారధ్యంలోని జిల్లా పోలీసు యంత్రాంగం డ్రోన్లు, సీసీ కెమెరాలు, సర్వైలైన్సుతో నిఘా పెడుతున్నా.. ప్రత్యేక పోలీసు బలగాలను ప్రధాన చెక్పోస్టుల వద్ద మఫ్టీల్లో పెడుతున్నా.. ఎప్పటికప్పుడు కేసులు ఛేదిస్తున్నా.. ఏదో ఓ మూల నుంచి అంతర్రాష్ట్ర నేరస్తులు చొరబడి సవాళ్లు విసురుతునే ఉన్నారు. ముఖ్యంగా బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వెస్ట్బెంగాల్, డెహ్రాడూన్, ఛత్తీస్గఢ్, జైపూర్, రాయపూర్, ఒడిశా, బెంగళూర్ నుంచి వస్తున్న గ్యాంగులు నేరాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. వివిధ కేసుల్లో పట్టుబడేవారికంటే పరారీలో ఉన్నవారే నేరంలో కీలకపాత్రధారులు కావడం గమనార్హం. ● ఇటీవల ఆటోల్లో చైన్స్నాచింగ్ గ్యాంగ్లు రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. రెండో పట్టణ పోలీసులు విజయనగరానికి చెందిన కొందరిని పట్టుకున్నారు. వీరి గ్యాంగ్ కొత్తవలసలో కొంతమంది, రాజమహేంద్రవరంలో గోకవరం కేంద్రంగా మరికొంతమంది ఉన్నారు. వీరేకాక జిల్లాలో నెలకోసారి వచ్చిపోయే ఉత్తరప్రదేశ్ ఆటోగ్యాంగ్లతోనే అత్యంత ప్రమాదమని పోలీసులు భావిస్తున్నారు. ● వెస్ట్బెంగాల్ నుంచి చైన్స్నాచింగ్ గ్యాంగులు అధికంగా వస్తున్నారు. వీరు కోలకతా నుంచి విజయవాడ వరకు హైవేల్లో నేరాలకు పాల్పడుతుంటారు. ● ఒడిశా రాష్ట్రం, గంజాం జిల్లా బరంపురానికి చెందిన సుజిత్కుమార్ పాడి, బాలకృష్ణ సాహు జిల్లాలోని నాలుగుచోట్ల చోరీలకు పాల్పడి ఏడున్నర తులాల బంగార ంతో కొత్తూరు పోలీసులకు చిక్కారు. జిల్లాలో 2016 నుంచి 2024 వరకు 32 నేరాలు చేసిన ఘనత వీరిది. బైక్పై వెళ్తూ ఒంటరి మహిళల పుస్తెలు తెంపి పారిపోవడం వీరి నైజం. వీరిని ఈ ఏడాది జనవరి 10న పట్టుకున్నారు. ● ఉత్తరాఖాండ్ రాష్ట్రం డెహ్రడూన్కు చెందిన భయంకర షేర్ మహ్మద్ 18 మంది గ్యాంగ్లో నూర్హసన్ సభ్యుడు. ఇర్ఫాన్ అహ్మద్, అబ్ధుల్గ ఫూర్లతో కలిపి 140 దొంగతనాలు చేశారు. ఏపీతో పాటు ఉత్తరాఖాండ్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్ప్రదేశ్ల్లో చేశారు. 32 కేసుల్లో అరెస్టు చేశారు. మన జిల్లాలో 14 కేసులున్నాయి. వీరిని ఏప్రిల్ 15న అరెస్టు చేశారు. ● రాజస్థాన్ జైపూర్కు చెందిన ఆదిత్య పవార్ కుటుంబసభ్యులు మూడేళ్లుగా జిల్లాలోని హైవేల్లో దారిదోపిడీలు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీలు, ఇతర వాహనదారులను దాడి చేసి మొబైళ్లు, నగదు, బండ్లు దోచేస్తుంటారు. గుడారాలు వేసుకుంటూ పగలు బొమ్మలు, దుప్పట్ల వ్యాపారం, రాత్రుళ్లు దోపిడీలు చేయడం వీరి నైజం. వీరిని జూన్ 6న అరెస్టు చేశారు. ● గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణాలో పక్క రాష్ట్రం ఒడిశాలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే స్మగ్లర్లు కోకొల్లలు. జిల్లాలో గతేడాది 50 కేసుల్లో 1322 కిలోలు, ఈ ఏడాది 40కు పైగా కేసుల్లో 600 కిలోలకు పైగా గంజా పట్టుబడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎస్పీ ఏమన్నారంటే.. అంతర్రాష్ట్ర నేరస్తులు జిల్లాలో చొరబడుతున్నారన్న అంశంపై ఇటీవల ఎస్పీ మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. అంతర్రాష్ట్ర నేరస్తులపైనా సర్వైలైన్స్ పెట్టామని చెప్పారు. ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడి ఫింగర్ ప్రింట్స్, పాత అఫెండర్స్ లిస్టు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే పర్లాఖిముడి, పాతపట్నం, ఇచ్ఛాపురం, గొప్పిలి చెక్పోస్టులలో విస్తృతం తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. సైబర్ దాడులు సైతం.. ఇటీవల జిల్లాలోని ఓ వైద్యురాలిని డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ కేటుగాళ్లు రూ.13.5 లక్షలకు టోకరా వేశారు. కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన రూమన్ షరీఫ్, నౌఫలా షెరీన్, నిజాముద్దీన్సీపీ, ఫహద్ అహ్మద్, రెయాన్ అహ్మద్ ఖురేషీతో పాటు దుబాయ్ దేశంలో ఉంటున్న సలీమ్లు లింక్ సిస్టమ్గా ఈ మోసానికి ఒడిగట్టారు. వీరిలో ముగ్గురినే పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు దర్యాప్తును మరింత లోతుగా చేస్తే హర్యానాకు చెందిన గ్యాంగ్, కీలక విదేశీ గ్యాంగ్ దొరికే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ‘కిరాయి’ కేటుగాళ్లు.. గత డిసెంబరులో శ్రీకాకుళం నగరానికి చెందిన ఓ వ్యాపారి మరో వ్యాపారి ఇంట్లో దోపిడీ చేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సయ్యద్ ఇర్షద్ అలమ్, చిగురుపాటి ఆంజనేయులు, యాకుబ్, సజ్జు, కె.భానూప్రసాద్లతో కిరాయి ఇస్తానని చేతులు కలిపి పన్నాగం పన్ని విఫలమయ్యాడు. పోలీసులు అప్పట్లో నలుగురినే అరెస్టు చేశారు. మిగతా ఇద్దరు కీలక నేరస్థులు పట్టుబడలేదు. కవిటి మండలం ఆర్.కరాపాడుకు చెందిన నిండు గర్భిణిని చంపేందుకు తన భర్తే ఒడిశా వాసులతో రూ. 3.50 లక్షలకు కిరాయి మాట్లాడి అతికిరాతకంగా తుదముట్టించాడు. -
క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మీ కోసంలో వచ్చే అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమ వారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పరిష్కారమైతే పరిష్కరించాలని లేదా క్షేత్రస్థాయిలో వెళ్లి విచారణ చేసి అర్జీదారునికి సమాచారం అందించాలన్నారు. రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, జిల్లా వైద్యారోగ్య శాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వే అండ్ లాండ్ రికార్డులు, వ్యవసాయం, పంచాయతీరాజ్, డ్వామా, మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ తదితర శాఖల సమస్యలపై 80 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులను పరిశీలిస్తే... ● శ్రీకాకుళం మండలంలోని సింగుపురం గ్రామ మండల ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 128 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం నగదు పడలేదని తల్లిదండ్రులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కేవలం ఆ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థులకు మాత్రమే ఈ పథకం నగదు వచ్చిందని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు పాఠశాల హెచ్ఎం, సచివాలయం, మండల కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. ఫిర్యాదు చేసినవారిలో పిన్నింటి హేమలత, నాగమణి, కృష్ణవేణి, గూన కుమారి, సౌజన్య, జ్యోతి తదితరులు ఉన్నారు. ● నగరంలోని ఒక ప్రైవేటు విద్యాసంస్థలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అలికాన సేతుమాధవ్కి కళాశాల యాజమాన్యం ఇంటర్ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదని విద్యార్థి మేనమామ నల్లబారికి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కళాశాలలో ప్రవేశ సమయంలో రెండేళ్లకు రూ.90,000 లు ఫీజు మాట్లాడుకున్నామని, అయితే ఇప్పుడు అదనంగా మరో రూ.40,000లు చెల్లించాలని అంటున్నారని వాపోయారు. అదనంగా ఫీజు చెల్లిస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని చెబుతున్నారన్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ● గుర్తింపు లేని పత్రికలు నడుపుతూ, ప్రభుత్వ అనుమతులు లేకుండా తప్పుడు వార్తలు ప్రచురితం చేస్తూ, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ బ్లాక్ మెయిల్ వార్తలు రాస్తున్న రెండు చిన్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని నగరానికి చెందిన పీవీ రమణ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ● ఆమదాలవలస నియోజకవర్గంలోని పలు సమస్యలపై పీజీఆర్ఎస్లో ఆమదాలవలస నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస రైల్వేస్టేషన్ ప్రాంతంలోని రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని, ప్రత్యామ్నాయంగా లక్ష్ముడుపేట జంక్షన్ నుంచి కృష్ణాపురం రోడ్డు ఏర్పాటు చేయాలని కోరారు. పొందూరు మండల కేంద్రంలోని అయ్యప్పస్వామి గుడి వద్దనున్న ప్రధాన రహదారి నుంచి జగనన్న కాలనీ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మీ కోసంలో 80 అర్జీల స్వీకరణ పారదర్శకంగా ఎరువులు సరఫరా చేయాలి ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు పారదర్శకంగా ఎరువులు సరఫరా చేయాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. పొందూరు మండలంలోని దల్లిపేట గ్రామ పంచాయతీ పరిధిలో వాస్తవ రైతులకు ఎరువులు అందకుండా, బ్లాక్ మార్కెట్కు తరలించడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ విషయమై గ్రామ సచివాలయం వద్ద రైతులు ఆందోళన చేయడం కూడా జరిగిందని తెలిపారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు వారిపై ఉన్న రాజకీయ ఒత్తిడి కారణంగా ఎటువంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపి బ్లాక్ మార్కెట్కు తరలించేందుకు ఎరువులను వెనక్కి తెప్పించి, రైతులకు సరిపడా ఎరువులను వెంటనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దల్లిపేట సర్పంచ్ నీలవేణి తదితరులు పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విన్నవించారు. -
యువకుడి ఆత్మహత్య
గార: మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్య చేసుకొని కుటుంబానికి తీవ్ర శోకాన్ని మిగిల్చాడు. కళింగపట్నం పంచాయతీ శిలగాం గ్రామానికి చెందిన దీర్ఘాశి మహేష్ (24) ఆదివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేష్ 2022లో సీమెన్గా చేరి మూడు నెలలకే తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత మద్యానికి బానిసై తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేవాడు. ఆదివారం సాయంత్రం కూడా స్వల్ప గొడవ జరిగింది. దీంతో పక్కనే ఉన్న నాన్నమ్మ ఇంట్లోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకున్నాడు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తండ్రి సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్సీ రామిరెడ్డి తెలిపారు. కాపర్ వైర్ బండిల్స్ చోరీ శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పీఎన్కాలనీ జీరో లైన్లో నిర్మాణ దశలో ఉన్న ఒక బిల్డింగ్ వద్ద ఆరు కాపర్ వైర్ బండిల్స్ చోరీకి గురైనట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు సోమవారం వెల్లడించారు. ఏవీఎం టవర్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ వద్ద ఉదయం బండిల్స్ లేకపోవడాన్ని గుర్తించిన వాచ్మెన్ వెంటనే సూపర్వైజర్ కల్లేపల్లి కోటేశ్వరరావుకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడన్నారు. దీంతో ఘటనా స్థలానికి వెళ్లి ఆయన పరిశీలించి బిల్డింగ్ యజమానికి తెలుపగా పోలీసు లకు ఫిర్యాదు చేయాలని సూచించడంతో కోటేశ్వరరావు తమను ఆశ్రయించినట్లు సీఐ చెప్పారు. దీనిపై ఎస్ఐ–2 రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
మిథున్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికం
ఇచ్ఛాపురం రూరల్: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక, ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం తెరతీసిందన్నారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నందుకే మిథున్ రెడ్డిపై లిక్కర్ స్కామ్ తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేశారన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శకంగా మద్యం పాలసీ అమలైందని గుర్తు చేశారు. అక్రమ అరెస్టులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు