breaking news
Srikakulam
-
అక్రమ బోర్లు
అనుమతుల కోసం యత్నాలు.. విషయం బయటకు పొక్కడంతో కంపెనీ ప్రతినిధులు హడావుడిగా అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లాలో కాకుండా ఏకంగా భూగర్భ జల శాఖ డైరెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పది బోర్లలో రెండు మాత్రమే వర్కింగ్లో ఉండటంతో తెలివిగా రెండు బోర్లకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఆ మేరకు డైరెక్టర్.. జిల్లా అధికారులు పరిశీలించి, అనుమతుల కోసం నివేదిక ఇవ్వాలని కోరారు. ముగ్గురు అధికారులు రెండు రోజులుగా యూబీ బీర్ల కంపెనీలో పరిశీలించారు. అప్పటికే అక్కడ 10 వరకు బోర్లు ఉండటంతో సంబంధిత అధికారులు అవాకై ్కనట్టు తెలిసింది. అయినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలు కారణంగా అక్కడ గుర్తించిన అంశాలను ఫైండింగ్స్ కింద పంపించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. బీర్ల కోసం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) బీర్ల కంపెనీ మరోసారి వివాదాస్పదంగా మారింది. కూటమి నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతో ఇప్పటికే ఏకపక్షంగా వ్యవహరించి ఓ వర్గం ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేసింది. రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయి అకారణంగా ఉద్యోగుల పొట్ట కొట్టింది. తాజాగా అనుమతులు లేకుండా ఏకంగా 10 మంచినీటి బోర్లను తవ్వించి, అడ్డగోలుగా నీటి వినియోగం చేస్తుందన్న విషయం వెలుగులోకి రావడంతో మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఉత్పత్తుల వ్యర్థ జలాలు కాలువలో కలిసిపోతుండటంతో భూగర్భ జలాలు కలుషితమై తమ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందంటూ చుట్టు పక్కల గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతి లేకుండానే.. వ్యక్తిగతంగా కానీ కంపెనీ అయినా మంచినీటి బోర్లు వేసుకోవాలంటే తప్పనిసరిగా భూగర్భ జల శాఖ అనుమతి ఉండాలి. జలాల లభ్యత మేరకు అనుమతులివ్వడం, ఇవ్వకపోవడం అనేది జరుగుతోంది. కానీ యూబీ బీర్ల కంపెనీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 10 బోర్లను అక్రమంగా వేసుకుంది. వాటికి పైపులు బిగించి, కంపెనీలో ఏర్పాటు చేసుకున్న సంపులోకి తరలిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆ మధ్య బంటుపల్లి పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా తమకున్న రికార్డుల మేరకు యూబీ బీర్ల కంపెనీకి అధికారిక అనుమతులు జారీ చేయలేదని లిఖిత పూర్వకంగా భూగర్భ జల శాఖాధికారులు రాసిచ్చారు. దీంతో ఆ కంపెనీలో ఉన్న బోర్లు అన్నీ అక్రమమే అని తేలిపోయింది. యూబీ బీర్ల కంపెనీ వెనక నుంచి వదిలేస్తున్న వ్యర్థ జలాలుయూబీ బీర్ల కంపెనీలో అనుమతుల్లేకుండా వేసిన బోర్లు వివాదాస్పదంగా మారిన యూబీ బీర్ల కంపెనీ భూగర్భజల శాఖ అనుమతి లేకుండా 10 మంచినీటి బోర్ల తవ్వకం సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి.. బయటికి పొక్కడంతో ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు వ్యర్థ జలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు బయటకు వ్యర్థ జలాలు.. బీర్ల కంపెనీలో ఉత్పత్తుల వ్యర్థజలాలను వెనక నుంచి బయటకు వదిలేస్తున్నారు. అవి సమీపంలోని కాలువలో కలుస్తూ మరింత ప్రమాదకరంగా మారాయి. భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. వ్యర్థ జలాలు ఆయా గ్రామాల తాగునీటి వనరులపై ప్రభావం చూపితే ముప్పు తప్పదు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అసలు అక్కడేం జరుగుతుందో.. వ్యర్థ జలాల వల్ల హాని లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలియడం లేదు. -
● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం
● నేలకొరిగిన వేలాది ఎకరాల వరి పంట ● పలుచోట్ల పడిపోయిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ● కూలిన ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మోంథా తుఫాన్ తీరం దాటింది. జిల్లా రైతాంగానికి తీరని నష్టం మిగిల్చింది. తీరం దాటిన సమయంలో జిల్లాపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలు ఎక్కడికక్కడ ముంపునకు గురయ్యాయి. పంట కోత దశలో ఉన్న సమయంలో వరి పంట నేలమట్టం కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వానల ధాటికి పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. అన్నదాతపై ప్రభావం.. ఇటీవల వాయుగుండం ప్రభావంతో కొంత నష్టం జరగ్గా, తాజా తుఫాన్తో రైతుకు మరింత నష్టం సంభవించింది. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు గుర్తించిన మేరకు సుమారు 7500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 10 ఎకరాల 50 సెంట్లలో మొక్కజొన్న, సుమారు 100 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 278 కొబ్బరి చెట్లు పూర్తిగా పడిపోయాయి. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 44 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పూర్తిగా ఏడు ఇళ్లు కూలిపోగా, 34 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 16.38 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. ● ఉగ్రరూపం దాల్చిన బాహుదా! ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో ఇచ్ఛాపురం అతలాకుతలమైంది. ఒడిశా భగలట్టీ డ్యామ్ మూడు గేట్లు ఎత్తివేయడంతో బుధవారం ఉదయం బాహుదానదిలో 55 వేల క్యూసెక్కుల నీరు చేరింది. సాయంత్రానికి 41,025 క్యూసెక్కులకు తగ్గింది. ● గొట్టాకు వరదనీటి తాకిడి హిరమండలం: వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. తుఫాన్ నేపథ్యంలో ఒడిశాతో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీటి ప్రవాహం పెరిగి గొట్టా బ్యారేజీకి ఇన్ఫ్లో పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నానికి 38138 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. 22 గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. శ్రీకాకుళం నగరంలో జోరువానవజ్రపుకొత్తూరు మండలం పెదబాడాంలో కోతకు గురైన రోడ్డుకళింగపట్నం– మత్స్యలేశం పంచాయతీలోని బీచ్పై ‘మోంథా’ తుఫాన్ ప్రభావం చూపించింది. సముద్రపు అలల తాకిడికి వంశధార నది నీరు తోడవ్వడంతో ఒడ్డునున్న హరిత రిసార్టు ప్రాంతం కోతకు గురైంది. రెండు నీటి ట్యాంకుల్లో ఒకటి పూర్తిగా విరిగిపోయింది. మరొకటి పాక్షికంగా దెబ్బతింది. గత ప్రభుత్వంలో బీచ్ కోత నివారణకు మంజూరైన రూ.7.58 కోట్లలో రూ.2 కోట్లు నిధుల మేర పనులు పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత కొత్త పభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. 18 నెలలు వచ్చినా పనులు ఊపందుకోకపోలేదు. నిర్లక్ష్యపు ధోరణి వల్లే పర్యాటక శాఖ ట్యాంకు కూలిపోయిందని, ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. –గారమూడు రోజులుగా ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పటికీ 10మండలాల్లోని 53గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపాయి. మందస, పలాస, ఇచ్ఛాపురంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8.30 నుంచి 28వ తేదీ ఉదయం 8.30గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 189 సెంటీమీటర్ల వర్షం పడగా, సరాసరి 6.3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 28నుంచి 29వ తేదీ వరకు 159.3 సెంటీమీటర్ల వర్షం పడగా, సరాసరి వర్షపాతం 5.3 సెంటీమీటర్లుగా నమోదైంది. రెండు రోజుల్లో అత్యధికంగా మందసలో 19 సెంటీమీటర్లు, గారలో 16.4సెంట్లీమీటర్లు, వజ్రపుకొత్తూరు, పలాసలో 16.3సెంటీమీటర్ల చొప్పున, ఇచ్ఛాపురంలో 15సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
ఆ గ్రామాలకు రాకపోకలు కట్
● మోంథా తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరద నీటితో టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి సమీపంలో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● పొందూరు మండలంలో రెల్లిగెడ్డకు వరద నీరు పోటెత్తెంది. లైదాం కల్వర్టు బ్రిడ్జి పైనుంచి వరద నీరు పారుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ● పొందూరు మండలం పెనుబర్తి–గోరింట రైల్వే అండర్ పాసేజ్ పూర్తిగా నీటితో నిండి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. –టెక్కలి/పొందూరు -
దరఖాస్తుల గడువు పెంపు
శ్రీకాకుళం రూరల్: బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును నవంబర్ 2 వరకు ఎన్టీఆర్ వైద్య, ఆరోగ్య విశ్వ విద్యాలయం పెంచిందని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని బైపీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 91219 99654 నంబర్లను సంప్రదించాలన్నారు. ఆర్మీ జవాన్ మృతి శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వెంపటాపు రాజు (33) కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. అక్కడ చలి తీవ్రత కారణంగా గుండెపోటు రావడంతో వెంటనే డిల్లీలో ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పాముకాటుతో తీవ్ర అస్వస్థత టెక్కలి రూరల్: మండలంలోని అంజనేయపురం గ్రామ సమీపంలో ఉన్న ఒక క్వారీలో పనిచేస్తున్న వ్యక్తికి పాము కాటువేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్థాన్కు చెందిన నిఖిల్ అనే వ్యక్తి క్వారీలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. అది గుర్తించిన తోటి కార్మికులు ఆ వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పేకాటరాయుళ్లు అరెస్టు శ్రీకాకుళం రూరల్: మండల పరిధి కుందువానిపేట గ్రామంలోని రచ్చబండ వద్ద బుధవారం పేకాడుతున్న 11 మందిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి రూ.7,250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నాగుపాము హల్చల్ నరసన్నపేట: స్థానిక కలివరపుపేటలోని సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం నాగుపాము హల్చల్ చేసింది. ఆలయం లోపలి గోడల వద్ద చాలా సమయం ఉంది. ఆలయ గర్భగుడి వైపునకు వెళ్లేందుకు పాము ప్రయత్నించగా.. భక్తులు గమనించి బయటకు తరలించారు. ముంపు పంటల పరిశీలన ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు బాహుదా నది పరివాహక ప్రాంతంలో సుమారు 1,118 హెక్టార్ల వరిపంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం రాగోలు వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త డాక్టర్ కె.ఉదయ్బాబు, ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్తవేత్తలు డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్లు తులసిగాం, ఇన్నేశుపేట, డొంకూరు, ఈదుపురం, జగన్నాథపురం, రత్తకన్న, బెల్లుపడ గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. పంట పొలాల్లో వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత యూరియా, ఎంవోపీ ద్రావణాన్ని పిచికారీ చేయాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. పంట నష్టం, తీవ్రతను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. వారితో పాటు సోంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు భవానీశంకర్, మండల సీనియర్ వ్యవసాయాధికారి పీపీవీవీ అజయ్కుమార్ తదితరులు ఉన్నారు. -
పుస్తకావిష్కరణ
పాతపట్నం: ఆంగ్లభాషపై ఆసక్తిని పెంచే పుస్తకాలను కవులు రచించారని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో రొంపివలస హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు బీవీ రమణ రచించిన మై లిటిల్ వరల్డ్ ఆఫ్ క్యూసెన్ ఆంగ్ల పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో వివిధ రకాల ప్రశ్నలు ఎలా వేయాలనే అంశాలతో కూడిన పుస్తకమని తెలియజేశారు. కార్యక్రమంలో జిత్తు సింహాచలం, ఎంఈవోలు ఎ.గోవిందరావు, సీహెచ్ తిరుమలరావు, కె.రాంబాబు, ఎం.వెంకటరమణ, హెచ్ఎంలు ఎన్.కుమారస్వామి, బి.సింహాచలం, కె.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలు అదృశ్యం
నందిగాం: మండలంలోని మర్లపాడుకు చెందిన కొత్తపల్లి ఆదెమ్మ(61) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ బుధవారం తెలియజేశారు. ఆదెమ్మ ఈనెల 24వ తేదీన ఇంటికి కావాల్సిన సామగ్రి కొనుగోలు చేయడానికి పూండి వెళ్లింది. అనంతరం ఇంటికి రాకపోవడంతో అనేక చోట్ల వెదికారు. కానీ ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు జనార్ధనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ మృతదేహం లభ్యం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెద గనగళ్లవానిపేట తీరంలో ఒక మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం నగర పరిధిలోని హయాతీనగర్కు చెందిన దువ్వు రాజ్యలక్ష్మి (42) ఆర్థిక ఇబ్బందులు కారణంగా కొత్త బిడ్జి మీద నుంచి దూకేసింది. ఈమె భర్త మోహన్రావు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె నగరంలోని ఒక డెంటల్ క్లినిక్లో పనిచేసేది. వచ్చిన సంపాదన సరిపోకపోవడంతో మనస్తాపం చెంది దూకేసినట్లు పోలీసులు వెల్లడించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు జిల్లా టెన్నికాయిట్ పోటీలు పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా టెన్నికాయిట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మల్లా సంతోష్కుమార్, సుడియా జోగారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉత్తరప్రదేశ్ యువకుడు ఆత్మహత్య
నాలుగు షాపుల్లో చోరీ శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్ యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ కె.జగన్నాథరావు తెలియజేశారు. కళింగ రోడ్డులోని మైలపల్లి కృష్ణారావు ఇంటి మేడపై గదిలో అద్దెకు ఉంటున్న ఇబ్రహీం(21) యూపీలోని బాస్పూర్ సమీప ఉద్ధమ్సింగ్ నగర్కు చెందినవాడు. గత కొంతకాలంగా సూర్యమహల్ కూడలి సమీపంలోని ఒక సెలూన్ షాపులో పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం యూపీ వెళ్లిన ఇబ్రహీం మళ్లీ నగరానికి తిరిగొచ్చాడు. అక్కడ పెళ్లిచూపులు నచ్చకపోవడంతో బుధవారం ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్థానికులు ఇబ్రహీం ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
రైతులతో ఆడియో కాన్ఫరెన్స్
ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్లు బుధవారం మల్టీ లొకేషన్ ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమదాలవలస, గార, శ్రీకాకుళం, రణస్థలం, పలాస, టెక్కలి తదితర మండలాల్లోని 70 మందికి పైగా రైతులకు సలహాలు అందజేశారు. మోంథా తుఫాన్ ప్రభావంతో వరిలో పొట్ట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులతో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి జి.తిరుమలరావు, శ్రీకాకుళం సపోర్టర్ బి.లక్ష్మణరావు పాల్గొన్నారు. -
పత్తి రైతు చిత్తు..!
● తుఫాన్తో నేలరాలిన కాయలు ● నష్టాలు తప్పవని ఆందోళన కొత్తూరు: ప్రకృతి వైపరీత్యాలు, కూటమి ప్రభుత్వ తీరుతో పత్తి రైతులు చిత్తయ్యారు. జిల్లాలో సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంట్లో పత్తిపంట ఒకటి. కొత్తూరు, లావేరు, హిరమండలం, సరుబుజ్జిలి, బూర్జ తదితర మండలాల్లో సుమారు 2,500 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట కాపు అంతంతమాత్రంగానే వచ్చింది. అయితే వచ్చిన పత్తికాయలు కూడా మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కుళ్లిపోతున్నాయి. పిందెలు, పువ్వులు పూర్తిగా నేల రాలిపోయాయి. దీంతో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిళ్లింది. పెరిగిన పెట్టుబడులు మరోవైపు ఈ ఏడాది పత్తిపంట సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా యూరియాతో పాటు ఇతర ఎరువులు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. దీంతో ఒడిశా నుంచి బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కొత్తూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం మంజూరు కాలేదు. నవంబర్ నెల వస్తున్నా ఇంతవరకు పత్తి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రావడం లేదు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
శ్రీకాకుళం : పీపీపీ విధానం పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం తగదని జన విజ్ఞాన వేదిక వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రచురించిన ‘పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు’ బుక్లెట్ను శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో ప్రజా సంఘాల నేతలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజానీకానికి వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, జీడీపీలో ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ రంగాల బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. కార్పొరేట్ల దయదాక్షిణ్యాలపై ప్రజా వైద్యం ఆధారపడటం సరికాదన్నారు. కేరళ తరహా ప్రజా వైద్య విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చింతాడ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా జిల్లా నాయకులు కె.నాగమణి, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.కూర్మారావు, కోశాధికారి వీఎస్కుమార్, శివకుమార్, గరిమెళ్ల అధ్యయన వేదిక అధ్యక్షుడు పి.సుధాకర్, రచయిత కంచరాన భుజంగరావు, ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బాడాన శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల సంరక్షణకు ముందడుగు
జలుమూరు: మండలంలోని చల్లవానిపేట పరిసర ప్రాంతాల్లో మతి స్థిమితం లేని తల్లి లక్ష్మితో పాటు చిన్నారులు పద్మ, బోడెమ్మ, కరువమ్మల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తామని సారవకోట సీడీపీవో సీహెచ్ వంశీ ప్రియ తెలియజేశారు. ఈనెల 26వ తేదీన ‘ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు’ శీర్షికతో సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. బుధవారం చల్లవానిపేటలో అనాథ చిన్నారులతో మాట్లాడారు. అలాగే సారవకోట మండలం బద్రి గ్రామానికి వెళ్లి బంధువులు, సోదరి కుటుంబ సభ్యులతో చర్చించారు. న్యాయస్థానం అనుమతితో లక్ష్మిని మానసిక వైద్యశాలకు తరలించి మంచి వైద్యం అందించడంతో పాటు చిన్నారులకు చైల్డ్ వెల్ఫేర్ బోర్డు కమిటీ ద్వారా విద్య, వసతి ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షరాలు మనోరమ, సిబ్బంది ఉన్నారు. -
అంగన్వాడీ... సమస్యల ఒడి..!
● కేంద్రాల్లో సిబ్బంది కొరత ● సక్రమంగా అందని పౌష్టికాహారం ● పనిభారంతో సిబ్బంది అవస్థలు ● పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు పరిధిలో దమ్మలవీధి–2 అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్ తన జాబ్కు రాజీనామా చేసింది. జబ్బావీధి–1 అంగన్వాడీ కేంద్రం, అలాగే కత్తెరవీధి–1 అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్లు కూడా రిజైన్ చేశారు. దీంతో ఈ కేంద్రాల్లో ఆయాలే ఉండడంతో.. పక్కనున్న సెంటర్ల టీచర్లు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తూ నెట్టుకొస్తున్నారు. అయితే ఆయా టీచర్లు రెండేసి కేంద్రాలను ఎలా సమర్ధవంతంగా నిర్వహించగలరన్నది ప్రశ్నార్థకం. జిల్లాలో మరిన్ని కేంద్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అదనపు భారం వాస్తవానికి ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక ఆయా ఉండాలి. టీచర్ ప్రతిరోజూ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యనందించాలి. అలాగే ఆయా అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలకు టేక్ హోం రేషన్(టీహెచ్ఆర్) రెండు విడతల్లో అందజేస్తారు. అయితే కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 28 టీచర్ పోస్టులు, 62 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 14 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు క్లియర్ వేకెన్సీ ఉండగా.. ఆయా పోస్టులు 38 క్లియర్ వేకెన్సీ ఉన్నాయి. అయినా టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పక్క కేంద్రాల వారికి అప్పగించంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి... జిల్లాలో 16 ప్రాజెక్టులు ఉండగా.. వాటి పరిధిలో 130 సెక్టారులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,385 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 9,270 మంది గర్భిణులు, 8,935 మంది బాలింతలు, ఆరు నెలల లోపు చిన్నారులు 7,252 మంది, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 49,589 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 45,265 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వలన సమర్ధవంతంగా చిన్నారులకు విద్యను అందించలేకపోతున్నారు. పౌష్టికాహారం సకాలంలో అందించడం కష్టసాధ్యంగా మారుతోంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఆటంకంగా మారుతోంది. కార్యకర్తలపై పనిభారం పెరుగుతోంది. ప్రీ స్కూల్ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. సెలవులు పెట్టుకునే అవకాశం ఉన్నా ఆ హక్కును సిబ్బంది కోల్పోతున్నారు. -
● విద్యుత్ శాఖకు రూ.11.93 లక్షల నష్టం
మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజుల్లో సర్కిల్ పరిధిలోని శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్లలో విద్యుత్ శాఖకు రూ.11,93,935 మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 61 ఎల్టీ విద్యుత్ స్తంభాలు, 11 కె.వి.విద్యుత్ స్తంభాలు 36 నేలకూలిపోగా, 27 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని వివరించారు. 33 కె.వి.ఫీడర్లు 03, 11 కె.వి.ఫీడర్లు 12 వరకు దెబ్బతిన్నాయని వివరించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పునరుద్ధరణ పనులకు రూ.11,93,935 మేరకు నిధులు ఖర్చుచేసినట్లు వెల్లడించారు. –అరసవల్లి -
2న సబ్ జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నవంబర్ 2న జరగనున్నాయని జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాధు ముసలినాయుడు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఇండోర్ స్టేడియం (స్విమ్మింగ్ ఫూల్) వద్ద కబడ్డీ శిక్షణా కేంద్రంలో ఉదయం 9 నుంచి ఎంపికల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. 2009 డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. బాలురు 60 కేజీలు, బాలికలు 55 కేజీల్లోపు బరువు కలిగి ఉండాలని స్పష్టంచేశారు. మ్యాట్పై జరిగే ఈ ఎంపికలకు క్రీడాకారులు విధిగా మ్యాట్ షూ ధరించి హాజరుకావాలన్నారు. కాగా, ఏపీ రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ చాంపియన్షిప్–2025 పోటీలు నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. కర్నూల్ జిల్లా మంత్రాలయం వేదికగా జరిగే ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఇక్కడ ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు జిల్లా కబడ్డీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు(సెల్: 94419 14214)ను సంప్రదించవచ్చు. -
పూడిలంకకు దారి
వజ్రపుకొత్తూరు: తుఫాన్, వరదలు వస్తే చాలు ఉప్పుటేరు పొంగడం.. ఆపై వరద ముప్పు అంటూ నిత్యం వార్తల్లో నిలిచే పూడిలంకకు దారి దొరికింది. ఇటీవల రహదారి నిర్మాణంపై సాక్షి పత్రికలో ‘నత్తే నయం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రావెల్ను శరవేగంగా వేసి తాత్కాలిక రహదారి నిర్మించారు. దీంతో కొంతమేర కష్టాలు తీరాయి. బుధవారం అధికారులు, సర్పంచ్ తిమ్మల కృష్ణారావు తదితరులు రహదారిని పరిశీలించారు. అయితే ఇంకా రహదారిపై వంతెన, బీటీ నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
నరసన్నపేట: మండలంలో ఇసుకాసురుల అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా పోతోంది. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ వంశధార నదిలో ఇసుకను ఎటువంటి అనుమతులు లేకపోయినా తవ్వి, రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం గోపాలపెంట కేంద్రంగా ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నారు. పగలంతా అక్రమంగా మాకివలసకు వెళ్లే రోడ్డులో డంపింగ్ చేయడం, రాత్రి సమయాల్లో లారీల్లో లోడు చేసి పంపిస్తున్నారు. ఇదంతా ఓపెన్గా జరుగుతున్నా.. అటు మైన్స్ అధికారులు గానీ.. రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. కాగా అక్రమ తవ్వకాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను గ్రామంలోని ప్రధాన వీధి మీదుగా తరలిస్తుండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.అలాగే మడపాం, బుచ్చిపేట, ఉప్పరిపేట, లుకలాం, వెంకటాపురంల్లో కూడా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో అటు ట్రాక్టర్లు, ఇటు ట్రిప్పర్లు, లారీల యజమానులు అప్పనంగా ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
65 బస్సులు రద్దు
శ్రీకాకుళం అర్బన్ : మోంథా తుఫాను తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బోసిపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లేకపోవడంతో నాన్ స్టాప్ కౌంటర్ ఖాళీగా దర్శనమిచ్చింది. వర్షాల ప్రభావం ఆర్టీసీ పై కూడా పడింది. జిల్లాలో శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో 19 బస్సులను, శ్రీకాకుళం 2వ డిపో పరిధిలో 18 బస్సులను, టెక్కలి డిపో పరిధిలో 10 బస్సులను, పలాస డిపో పరిధిలో 18 బస్సులను కలిపి మొత్తం 65 ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. వర్షాలు ఉంటే బుధవారం కూడా పలు సర్వీసులు రద్దే చేసే అవకాశం ఉంది. -
జాగ్రత్తలే శ్రీరామరక్ష
ఆమదాలవలస/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు ముంపునకు గురవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సంరక్షణకు ఆమదాలవలసలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రాయ్లు రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం వరి పంట 1.45 లక్షల హెక్టార్లలో సాగులో ఉందని, వరి పంట పూత దశ, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే, దశ కోత దశలలో ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి పంట ఎం.టి.యు–1061, ఎం.టి.యు–1318, స్వర్ణ, సంపద స్వర్ణ, బీపీటీ 5204 వంటి రకాలు పూత దశలో ఉన్నాయి. వర్షాల వల్ల పూత దెబ్బతినడంతో పాటు గింజలు ఏర్పడకపోవడం, రంగు మారడం, మాగుడు తెగులు రావడం, నిద్రావస్థ తొలగి మొలకలు వచ్చే ప్రమాదముంది. దీని నివారణకు పొలాల్లో నీరు నిల్వ కాకుండా వెంటనే కాలువల ద్వారా తొలగించాలి. ఎండాకు, మాగుడు తెగులు నివారణకు తగిన ఫంగిసైడ్ పిచికారీ చేయాలి. పాలు పోసుకునే దశలో పంటలు పడిపోతే నీరు నిల్వ కాకుండా మోటారు ద్వారా నీటిని బయటకు పంపించాలి. గింజల రంగు మారడం మాగుడు తెగులు నివారణకు ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో ఉంటూ కంకిలో మొలకలు కనపడితే 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలి. కోత దశలో ఉండి పంట నేలపై పడిపోతే నీరు పూర్తిగా బయటకు పోవటానికి కాలువలు ఏర్పాటు చేయాలి. గింజ మొలకలు రాకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం పనలపై పిచికారీ చేయాలి. సాంబ మసూరి వంటి నిద్రావస్థ లేని రకాలలో వారం రోజుల పాటు నీరు నిలిచితే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉంది. వర్షాల అనంతరం పొలాల్లో నీటిని తొలగించి ఫంగిసైడ్/ఉప్పు ద్రావణం వినియోగిస్తే నష్టం తగ్గించుకోవచ్చు. పత్తిపంట పత్తి కాయపగిలే దశలో ఉన్నందున, వర్షాలు తగ్గిన వెంటనే మురుగు నీరు తొలగించి నేల ఆరేలా చూడాలి. 2శాతం యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పోషక లోపాలను సవరించవచ్చు. కాయకుళ్లు నివారణకు ముందు జాగ్రత్తగా మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ (3 గ్రా/లీటరు నీటికి) పిచికారీ చేయాలి. మొక్కజొన్న మొక్కజొన్న కోత దశలో ఉంటే వెంటనే కోత చేపట్టాలి. తడిసిన కండెలను పలుచగా పేర్చి ఆరబెట్టి నూర్పిడి చేయాలి. కోతకు చేరువలో ఉన్న పంట పడిపోతే నీటిని బయటకు పంపించాలి. తర్వాత ప్రొపికోనాజోల్ (1 మి.లీ/లీ) గానీ, హెక్సాకొనజోల్ (2 మి.లీ/లీ) గానీ పిచికారీ చేయాలి. నూర్పిడి కోసం ఆరబెట్టిన తడి కండెలపై మొలక రాకుండా 5శాతం ఉప్పును పలుచగా చల్లి కలపాలి. ఉద్యానపంటలు అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటల తోటలలో నిల్వ ఉన్న నీటిని త్వరగా బయటకు తీసివేయాలి. అరటిలో సిగటోక ఆకు మచ్చ తెగులు అరికట్టేందుకు ప్రొపికోనాజోల్ గానీ, మాంకోజెబ్ గానీ పిచికారీ చేయాలి. బొప్పాయి, కూరగాయ నారుమడుల్లో వేరు కుళ్లు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ (3 గ్రా/లీ) మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. ఆక్వా చేపలు, రొయ్యల పెంపకందారులు వర్షాల సమయంలో మేతను 50 శాతం వరకు తగ్గించి, చెరువు గట్లను గట్టిపరచుకోవాలి. వర్షాలు అనంతరం నీటిలో పీహెచ్ తగ్గితే సున్నం వాడకం, ఆక్సిజన్ తగ్గితే ఎయిర్షన్ పెంచుకోవాలి. చేపలు, రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా విటమిన్ సి, ప్రోబయోటిక్స్ వాడాలి. నీటమునిగిన పొలాలు జలమయమైన తోటలు అప్రమత్తంగా ఉండాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు -
గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు
పలాస: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుల్బా గ్రామానికి చెందిన మహిళ మిక్కికుమారి మాలిక్ను మంగళవారం సుమారు రూ.55వేలు విలువైన 11 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు. ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మాల్యాద్రి సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ మహిళ కనిపించింది. ట్రాలీ బ్యాగ్ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కళాశాలలో తనిఖీలు ఇచ్ఛాపురం: పట్టణంలోని స్వర్ణభారతి జూనియర్ కళాశాలను ఆర్ఐఓ తవిటినాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ల్యాబ్లను పరిశీలించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చాట్ల తులసీదాస్, రాము, ప్రిన్సిపాల్ జె.జయప్రకాష్, సందీప్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ సర్వీసులో ఎలాంటి పొరపాట్లు చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి లంచాలకు తావు ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.వి.రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు అక్టోబరు 27 నుంచి నవంబరు 2 వరకు ఏసీబీ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, ఏసీబీ ఇన్స్పెక్టర్ కె.భాస్కరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవీఎం) గోదామును ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మంగళవారం పరిశీలించారు. నెలవారీ తనిఖీలో భాగంగా కలెక్టరేట్లో ఉన్న గోదామును ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్తో కలిసి తనిఖీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ ఔదార్యం శ్రీకాకుళం కల్చరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ఇండియన్ రెడ్క్రాస్ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు ఆదేశాల మేరకు సంతబొమ్మాళి మండలం ఆర్.సన్నపల్లి, ఎం.సన్నపల్లి, పాత మేఘవరం, ఎం.మేఘవరం, మరువాడ, మూలపేట, గులిగిపేట, లక్కీవలస, గిద్దలపాడు తదితర గ్రామాల్లో వలంటీర్లు మత్స్యకారులను అప్రమత్తం చేశారు. పలుచోట్ల టార్పాలిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ జి.రమణ, పి.సుజాత, ఎన్.హర్షవర్ధన్, పి.వెంకటరమణ, పి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి
పోలాకి: జిల్లాలో వేర్వేరు చోట్ల విద్యుత్ షాక్కు గురై ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోలాకి మండలంలో తీరప్రాంత గ్రామమైన గుల్లవానిపేటలో కారి రామచంద్రరావు(37) దీపావళి సందర్భంగా ఇటీవల ఇంటికి సీరియల్సెట్ అలంకరించాడు. తుఫాన్ నేపథ్యంలో ఎక్కువగా గాలులు వీస్తున్నందున మంగళవారం సీరియల్ సెట్ తొలగించే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రామచంద్రరావుకు భార్య మమత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇంటికి ఆసుకుని ఉన్న విద్యుత్లైన్ తగలడంతోనే ప్రమాదం జరిగిందని, హైటెన్షన్ వైర్లు తొలగించాలని కోరినా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్కో సిబ్బంది మాత్రం ఇంటి వద్దే విద్యుత్షాక్కు గురైనట్లు చెబుతున్నారు. పోలాకి ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బొంతలకోడూరులో వీఆర్ఏ.. ఎచ్చెర్ల : బొంతలకోడూరు పంచాయతీ వీఆర్ఏ బి.నర్సింహులు (45) మంగళవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. భవానీ మాల వేసిన ఈయన సన్నిధానానికి విద్యుత్ సరఫరా రాకపోవడంతో జాయింట్ కలిపేందుకు వెళ్లి షాక్కు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహులకు ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. రామచంద్రరావు(ఫైల్)నర్సింహులు (ఫైల్) -
వృద్ధురాలిపై దాడి..బంగారం చోరీ
● వేటకు దూరమై.. తీరానికే పరిమితమై..సారవకోట: బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ (80) అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి బంగారం చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడితిలో నక్క చెల్లెమ్మ తన ఒంటరి వృద్ధురాలు సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోయింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తికి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి చెవి, ముక్కుకు ఉన్న అరతులం బంగారు వస్తువులు తెంచేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు ఇనుప చువ్వతో దాడికి పాల్పడటంతో మెడపై తీవ్ర గాయమైంది. వృద్ధురాలి కేకలు విని స్థానికులు చేరుకునే లోపే దుండగుడు పరారయ్యాడు. అవంతరం బాధితురాలిని బుడితి సీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు బుడితి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
వైద్య, రేషన్ సేవలు నిరంతరాయంగా అందించాలి
పలాస: పలాసలో జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మంగళవారం పలాసలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించి తగిన సలహాలు,సూచనలు చేశారు. వైద్యం, రేషన్ సేవలను నిరంతరాయంగా అందించాలని కోరారు. ఈ సందర్భంగా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు ఆయా విభాగాలను నిశితంగా పరిశీలించారు. తుఫాన్ సమయంలో రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్ఎస్ పాయింటును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో సిబ్బందితో చక్రధర్బాబు -
అడుగుకో గుంత.. గజానికో గొయ్యి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని రహదారులు గోతులమయంగా మారాయి. అడుగుకో గుంత...గజానికో గొయ్యిలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ఎక్కడ గుంత ఉందో...ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతర్గత రోడ్ల పరిస్థితి మారింత దారుణంగా ఉంది. దుష్ప్రచారంతో నాడు తప్పుదోవ వైఎస్ జగన్ ప్రభుత్వంలో జిల్లాలో రూ.526.69 కోట్లతో ఆర్అండ్బీ పరిధిలో 432 రోడ్లు నిర్మించింది. పంచాయతీరాజ్ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78కోట్లతో 312 రోడ్లు వేసింది. ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96కోట్లతో 23 రోడ్ల నిర్మాణం చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 42సీసీ, బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టింది. కానీ ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రోడ్లపై దుష్ప్రచారానికి దిగాయి. నేడు గుంతలు పూడ్చలేని పరిస్థితి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండగ పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేసింది. వేసిన రోడ్లు కంటే ప్రచారమే ఎక్కువ జరిగింది. 2025 జనవరి నాటికి రోడ్లను అద్దంలా మార్చేస్తామంటూ చంద్రబాబుతో సహా అందరూ డాంబికాలు పలికారు. కానీ ప్రచారం చేసినంత వేగంగా పనులు చేయలేదు. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లింపులు చేయకపోవడంతో చాలా పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఆర్అండ్బి పరిధిలోని రోడ్లు పరిస్థితి కూడా అంతే. నరకయాతన.. ప్రస్తుతం రోడ్ల నిర్వహణ గాలికి వదిలేయడంతో ఉన్న రోడ్లు కూడా పాడైపోతున్నాయి. శ్రీకాకుళం నగరంలోని సెవెన్ రోడ్డు జంక్షన్ నుంచి డే అంట్ నైట్ జంక్షన్ ఉన్న రోడ్డు చూస్తే కూటమి ప్రభుత్వం, పాలకుల చిత్తశుద్ధి ఎలా ఉందో అవగతమవుతుంది. రోడ్డు పొడవునా గుంతలే. రోజూ అధికారులు రాకపోకలు సాగించే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతలనే పూడ్చకపోతే జిల్లాలో మిగతా రహదారుల పరిస్థితిని ఊహించుకోవచ్చు. క్వారీలు, ఇసుక ర్యాంపుల నుంచి వచ్చే వాహనాలతో పల్లె దారులు ఛిద్రమవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో రోడ్లపైన ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వాహనచోదకులైతే మరింత వణుకుపోతున్నారు. ఇచ్ఛాపురం రూరల్:బాలకృష్ణాపురం–డెప్పూరు రోడ్డుమెళియాపుట్టి: కొత్తూరు గ్రామానికి వెళ్లే దారి జిల్లాలో అధ్వానంగా రహదారులు పట్టించుకోని కూటమి ప్రభుత్వం చినుకు పడితే చాలు మరింత వణుకు -
గూడు.. గోడు..
● కవిటి: జగతిలో పులకల మల్లేశ్వరరావు ఇంటి రేకు పైకి ఎగిరిపోయింది. ఎర్రగోవిందపుట్టుగలో సైతం మరో పేదవారి ఇంటి గోడకూలింది. ● ఆమదాలవలస రూరల్: పొన్నంపేటలో ఐదు ఇళ్లు, రామచంద్రాపురం గ్రామంలో రెండిళ్ల గోడలు కూలాయి.● గార: రామచంద్రాపురం పంచాయతీ పాత జొన్నలపాడు గ్రామంలో దూబ సూరమ్మ మంచంపై పడుకొని ఉండగా ఒక్కసారిగా ఇల్లు కూలింది. తోణంగిలో సుగ్గు లక్ష్మీకి చెందిన పురింటి గోడలు కూలిపోయాయి. ● మెళియాపుట్టి: భరణికోట పంచాయతీ పరిధి కాటంవీధిలో సవర సురేష్ అనే గిరిజనుడికి చెందిన మట్టి ఇల్లు కూలిపోయింది. కూలిన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న బియ్యం ఇతర నిత్యావసర సరుకులు మొత్తం పాడైపోయినట్లు బాధితులు చెబుతున్నారు. ● రణస్థలం: అల్లివలస గ్రామంలో గింతు లక్ష్మి, తిరుపతిపాలెం గ్రామంలో దువ్వాన పైడమ్మ, దుప్పాడ రాజమ్మలకు చెందిన పూరిళ్లు, పెంకుటిళ్లు కూలిపోయాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ● పొందూరు: తుఫాన్ ప్రభావంతో లోలుగులో సెగళ్ల పైడిరాజుకు చెందిన పూరిల్లు కూలింది. కొంచాడలో సిడగ సూర్యనారాయణకు చెందిన పూరిల్లు కూడా కూలింది. వీఆర్ గూడెంలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. -
ఖబడ్దార్...!
కామాంధులారా..పోక్సో యాక్ట్● చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే జైలుకే ● నేర తీవ్రత ఆధారంగా జీవిత ఖైదు లేదంటే మరణ శిక్షే ● బాధితులకు అండగా పోక్సో చట్టం భయపడకూడదు పరువు పోతుందేమోనని, ఎవరో ఏదో చేస్తారని జరిగేదానిపై ఫిర్యాదు ఇవ్వడానికి భయపడకూడదు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీడియా రంగాలు కూడా ఎట్టిపరిస్థితుల్లో బాలిక,బాలిక కుటుంబం, గ్రామం పేర్లు రాయవద్దు. పోక్సో కేసుల్లో ఉపేక్షించేదే లేదు. రాజకీయ పైరవీలు అస్సలుండవు. గుడ్టచ్ – బ్యాడ్టచ్పై నిత్యం బాలికలను అవగాహన కల్పించాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం తల్లిదండ్రుల పాత్ర కీలకం పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. తల్లి అతిగా మద్యం సేవించే వీక్నెస్ వలనే ఇటీవల ఓ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఇంటర్నెట్ వాడకం, పోర్నుసైట్లు ఎక్కువగా చూడటం, తల్లిదండ్రులు విడిపోవడం, వారి వివాహేతర సంబంధాలు, భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉంటూ పిల్లలను పట్టించుకోకపోవడం కూడా కొన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. ఆటోల్లో, బస్సుల్లో విద్యార్థినుల రోజువారీ పరిస్థితి తెలుసుకోవాలి. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో బాలికలపై రోజురోజుకీ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. కీచక కామాంధులు రెచ్చిపోతున్నారు. పోలీసు అధికారులు దారుణాలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ చిన్నారులపై కామాంధుల ఆగడాలకు ఫుల్స్టాప్ పడడం లేదు. అనేక చోట్ల చిన్నారులను చిదిమేసే మృగాళ్లు తారసపడుతూనే ఉన్నారు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ భయం లేకుండా బరితెగిస్తున్నారు. కారణాల్లో కొన్ని పరిశీలిస్తే... బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ఉండడంతో కొన్నిచోట్ల యజమానులు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అలాగే విద్యాసంస్థలు, వసతి గృహాల్లో సిబ్బంది మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తు, అశ్లీల వెబ్సైట్లు యువత నుంచి వృద్ధులు వరకు వక్రబుద్ధికి ప్రేరేపిస్తున్నాయి. దీనికితోడు పల్లె ప్రజల్లో అమాయకత్వం, పెద్దల్లో రాజీతత్వం, అన్నింటికీ మించి తల్లిదండ్రుల్లో, కుటుంబీకుల్లో అవగాహనా రాహిత్యం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. ఏంటీ పోక్సో చట్టం..? 1992లో ప్రపంచంలో పెరుగుతున్న జనాభాలో యువతపై అధిక శాతం లైంగిక దాడులు పెరుగుతాయనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి కొన్ని సభ్యత్వ దేశాలతో చట్టాలను చేయాలని తీర్మానాలు చేసింది. దీనిలో భాగంగా బాలికలు, మహిళలపై జరుగు ఆకృత్యాలకు కొన్ని శిక్షలు అమలయ్యేవి. అయితే ఆధునిక సమాజంలో బాలికలపై మరిన్ని విశృంఖల దాడులు పెరగడంతో 2012లో చట్టాన్ని సవరించి పోక్సో యాక్ట్(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం మైనర్ బాలికపై ఒక గీత పడినా.. తాకరాని చోట తాకినా.. ఆమె ఇష్టంతో చేయి వేసినా, అంగీకారంతో తీసుకుపోయినా, అక్రమ రవాణా చేసినా, అశ్లీల, వాణిజ్య ప్రయోజనాలకై అసాంఘిక కలాపాల్లో ప్రేరేపించినట్లు చేసినా జైలు ఊచలు లేదంటే మరణ శిక్ష అమలు చేస్తారు. అమాయక బాధిత బాలికలను సంరక్షించాలి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన నేరస్తులకు కఠినంగా శిక్షించాలన్నదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ప్రత్యేక కోర్టులు బాలిక నేరుగా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తనపై అసభ్యంగా ప్రవర్తించారని ఒక్క మాట చెబితే చాలు అదే ఫైనల్ అని.. వెంటనే పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని సుప్రీంకోర్టే చెప్పింది. ఆ తర్వాత దర్యాప్తులో తనేం తప్పు చేయలేదని నిందితుడు నిరూపించుకుంటే తప్ప శిక్ష తప్పదు. బాలికపై అఘాయిత్యానికి సంబంధించి తల్లిదండ్రుల వద్ద స్టేట్మెంట్, బాలిక స్టేట్మెంట్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్, దర్యాప్తు, విచారణ, మెడికల్ అవిడెన్స్, సపోర్ట్లు అన్నీ వీడియో రికార్డు చేయాల్సి ఉంటుంది. ఆకరికి పోక్సో కేసులకంటూ ఉండే ప్రత్యేక కోర్టులో సైతం నాలుగు గోడల మధ్య బాలిక వాంగ్మూలం మేజిస్ట్రేట్ తీసుకోవడం కూడా రికార్డు అవుతుంది. కోర్టులో ట్రయల్ రన్స్ నుంచి కన్విక్షన్ (నేరారోపణ రుజువయ్యేవరకు) వరకు వీడియో రికార్డు అవిడెన్స్లు భద్రపరుస్తారు. ఇదంతా చేసేది దర్యాప్తు, విచారణలో అనుమానాలుండకూదని, బాలికల వయసు నిర్ధారణ, సాక్ష్యాల తారుమారు కాకూడదని, మళ్లీ ఫిర్యాదులు రాకూడదనే ఉద్దేశంతోనే. ఫిర్యాదు చేసేందుకు 100, 112, 1098, సమీప పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో నుంచి జిల్లా ఎస్పీ వరకు నేరుగా ఎవరినైనా సంప్రదించవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారి–16పై కిల్లారి జగదీష్ (28) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లవలస గ్రామానికి చెందిన జగదీష్ తన కోళ్లఫారానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తండ్రి నారాయణరావు తాళ్లవలస గ్రామానికి రోడ్డు అవతల ఉన్న కోళ్లఫారం నడుపుతున్నాడు. తల్లి శశిరేఖ జేఆర్పురం పోలీస్స్టేషన్ సమీపంలోని గణేష్ కాంప్లెక్స్లో పేపర్ ప్లేట్ల వ్యాపారం చేస్తుంటారు. మృతుడికి ఇద్దరు అన్నదమ్ములు హరీష్, యశ్వంత్ ఉన్నారు. జగదీష్ మృతితో తాళ్లవలస గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తుఫాన్ పునరావాస కేంద్రం పరిశీలన
పోలాకి: తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో కో ఆర్డినేట్ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి కేవీఎస్ చక్రధరబాబు సూచించారు. సోమవారం పోలాకి మండలంలోని డీఎల్పురం తుఫాన్ షెల్టర్ను పరిశీలించారు. ముఖ్యంగా తీరప్రాంత గ్రామాలు, లోతట్టు గ్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో సేవలందించేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నా రు. మండలంలో నాలుగుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు వివరించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్తోపాటు వివిధ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నారు. -
ముమ్మరంగా గాలింపు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ కొత్త వంతెన పైనుంచి నాగావళి నదిలో ఆదివారం అర్ధరాత్రి దూకేసిన మహిళ కోసం ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం ముమ్మర గాలింపు చేపట్టాయి. రోప్లతో కొందరు నదిలోకి దిగగా, బోట్లలో ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగింది. నదిలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వలన ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారిందని ఏడీఎఫ్వో శ్రీనుబాబు అన్నారు. కాగా రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు మాట్లాడుతూ.. మహిళ దువ్వు రాజ్యలక్ష్మి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామన్నారు. రైలు నుంచి జారిపడిన మహిళకు గాయాలు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయంలో రైలు నుంచి దిగుతూ జారిపడిన మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని బొడ్డకాళి గ్రామానికి చెందిన దారపు లోలాక్షి కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని పారాదీప్లో నివాసముంటుంది. ఆమె బంధువుల ఇంట్లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్సప్రెస్లో సోమవారం ఇచ్ఛాపురం వచ్చింది. ఈ క్రమంలో ట్రైన్ స్టేషన్లోని మొదటి ప్లాట్ఫారంపై ఆగింది. తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్లాట్ఫారంపై వర్షపు నీరు చేరింది. ఆమె రైలు నుంచి లగేజీతో పాటు దిగుతుండగా కాలుజారి కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రురాలిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య రణస్థలం: మండలంలోని కొండములగాం పంచాయతీ ముక్తుంపురం గ్రామానికి చెందిన మంత్రి పెద్ద అప్పలనాయుడు (37) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 18వ తేదీన అప్పలనాయుడికి భార్య రోజాతో ఇంట్లో గొడవ జరిగింది. దీంతో భార్య రోజా ఇద్దరు పిల్లలను పట్టుకుని తమ కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి కరెంట్ వైర్లతో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్య రోజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అంతా నా ఇష్టం..? సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తానేమి చెబితే అదే జరగాలని.. తాను చెప్పే వారికే బిల్లులివ్వాలని.. తనకు చెప్పకుండా టెండర్లు పిలవడానికి కుదరదంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులకు హకుం జారీ చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు చెప్పకుండా ఏ పనులు చేయడానికి లేదని, ఏవైనా పనులు చేసినా.. ఎవరికై నా పనులు అప్పగించినా తనకు తెలియజేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇటు అధికారులు.. అటు కాంట్రాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు, మున్సిపల్ ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలి
శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలని దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆదివారంపేటలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయం వద్దకు దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయులను నియమించవద్దని జునైల్ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. గురుకులాల సొసైటీ కార్యదర్శి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కో–ఆర్డినేటర్ యశోదలక్ష్మి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం చంద్రమౌళి, మామిడి అప్పలరాం, యడ్ల జానకిరావు, బోనేల చిరంజీవి, తారక, అక్కెన రాజారావు, అనిల్, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు పాల్గొన్నారు. -
బాలికా విద్యపై శీతకన్ను..?
శ్రీకాకుళం: ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ను తొలగించాలని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇంటి వద్దకే రేషన్ బియ్యం, వలంటీర్ వ్యవస్థ రద్దు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి చర్యలకు పాల్పడింది. కాగా ఇప్పుడు ప్లస్ టూ హైస్కూళ్లపై కూడా శీతకన్ను వేస్తున్నట్లు తెలుస్తోంది. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయస్సు కలిగిన బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. అయితే బాలికలకు గ్రామస్థాయిలో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు పంపించేందుకు ఇష్టంలేని తల్లి దండ్రులు పదో తరగతి తర్వాత చదువు మాన్పించేస్తున్నారు. దీనిని గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్లస్ టూ హైస్కూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూళ్లలో బాలికలకు ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ఈ విద్యను ప్రారంభించారు. జిల్లాలో 6 ప్లస్ టూ పాఠశాలలు శ్రీకాకుళం జిల్లాలో 6 ప్లస్ టూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వజ్రపుకొత్తూరు, టెక్కలి, నరసన్నపేట మండలంలోని ఉర్లాం, పలాస మండలంలోని బ్రాహ్మణతర్ల, సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలసల్లో బాలికల కోసం ప్రత్యేకించి ప్లస్ టూ హై స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోగ్రూపులో 40 నుంచి 50 మంది వరకు చేరే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ 6 పాఠశాలల్లో మొత్తం 12 సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సందర్భంలో ఇప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పేరిట నిర్వహించిన పాదయాత్రలో ప్లస్ టూ ఉన్నత పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని, ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల్లో టీజీటీ, పీజీటీలుగా పదోన్నతులు కల్పిస్తామని హామీని ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా, మరిన్ని సమస్యలు పెరిగాయని పలువురు వాపోతున్నారు. ప్రారంభమవ్వని సిలబస్ ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు పోస్టులను ఖాళీగా ఉంచితే వచ్చే ఏడాది ఇంటర్మీడియట్లో కొత్తగా విద్యార్థులు చేరే అవకాశాలు ఉండవు. ఇదే జరిగితే వీటిని ఎత్తివేయొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం వీటిలోని సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. అందువలన ఇప్పటికై నా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను నియమించకుంటే మరో ఐదు నెలల్లో జరగనున్న పరీక్షలకు విద్యార్థినులు సన్నద్ధమయ్యే అవకాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య క్యాలెండర్ ప్రకారం నవంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి అటు తర్వాత రివిజన్ చేయించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వలన ఇప్పటికీ పలు సబ్జెక్టుల్లో పాఠాలు ప్రారంభమవ్వకపోవడం విచారించదగ్గ విషయం. అందువలన ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ప్లస్ టూ హైస్కూళ్లలో 12 పోస్టులు ఖాళీ మరో ఐదు నెలల్లో పరీక్షలు సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఆందోళన బాల్య వివాహాల నిర్మూలన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా పాలసీ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ప్లస్ టూ విద్య వలన బాల్య వివాహాల నిర్మూలన సాధ్యపడుతుందని స్పష్టంగా పేర్కొంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్లస్ టూ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. ఇది 2009 విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. – పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ జిల్లా నాయకుడు -
నేడు భారీ వర్షాలకు అవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మోంథా మోత మొదలైంది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ మంగళవారం సా యంత్రం, లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వర్షా లు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులు వంశధార, నాగావళి ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. వర్షాలు అధికమైతే వరద వచ్చే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్ చక్రధరబాబు సోమవారం పోలాకి తదితర మండలాల్లో పర్యటించారు. ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు 11 మంది సభ్యులు గల ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ జిల్లాలోనే సామగ్రితో సిద్ధంగా ఉంది. కొనసాగుతున్న కంట్రోల్ రూమ్లు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయాన్ని పొందేందుకు అందుబాటులో కంట్రోల్ రూమ్లు ఉంచారు. రెండు రోజుల నుంచి కలెక్టర్, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు కొనసాగుతున్నాయి. ప్రజలు బయటకు రాకూడదు తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు తుఫాన్ ప్రభావం ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మన తీరంలో 11 మండలాలు, 236 గ్రామాలు, సుమారుగా 1.90 లక్షల జనాభా ఉన్నారు. తీర ప్రాంతంలో 41 తు ఫాన్ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో అవసరం మేరకు అన్నీ సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల్లో మరో 80 తాత్కాలిక పునరావాస కేంద్రాలు గుర్తించి సిద్ధం చేశారు. 41 తాగునీటి ట్యాంకర్లు ఉంచారు. 185.4 మిల్లీమీటర్ల వర్షం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 185.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం వరకు 592.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇంకా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఈ వానలు మరింత ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం (మిల్లీమీటర్లలో) ఎక్కడెక్కడ.. ఎంతెంత.. -
అటు నిర్బంధం.. ఇటు నినాదం
సరుబుజ్జిలి: థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వ ర్యంలో సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని పోలీసు బృందాలు అడ్డుకున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు పోరాట కమిటీ నాయకులు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ అరెస్టులు మహాధర్నా చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐలు వివి ధ రకాల పోలీసు సిబ్బందితో పవర్ ప్లాంట్ ప్రతిపాదిత ప్రదేశాలు, రహదారుల వద్ద మోహరించారు. మహాధర్నా కార్యక్రమానికి వస్తున్న థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగిని అదుపులోకి తీసుకొని పోలాకి, నరసన్నపేట పోలీసులు స్టేషన్లకు తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావుని శ్రీకాకుళంలో టూ టౌన్స్టేషన్కు తరలించారు. సరుబుజ్జిలి జంక్షన్లో ఫ్లెక్సీతో నిరసనలు తెలిపి తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్, మండల కన్వీనర్ అదపాక రాజేష్, సింగూరు గోపాలరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు కోనాడ మోహనరావులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. స్థానిక గిరిజన నాయకులను బూర్జ పోలీసుస్టేషన్కు తరలించారు. ప్రధాన రహదారిపై నిరసనలు మహాధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మండలాలకు చెందిన గిరిజనులు భారీగా తరలిరాగా.. పోలీసులు చిగురువలస జంక్షన్ వద్ద వారి ని అడ్డుకున్నారు. దీంతో పాలకొండ రహదారిపై నిరసనలు తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. అదుపులో ఉన్న ఉద్యమకారులను విచిపెట్టే వరకు కదిలేది లేదని గిరిజనులు భీష్మించారు. ఒక దశలో నిరసనలు తెలుపుతున్న గిరిజనులను పోలీస్స్టేషన్లకు తరలించేందుకు పోలీసులు వాహనాలు సిద్ధం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గిరిజనులు ధర్నా విరమించారు. నిర్బంధాలతో ఉద్యమం ఆగదు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఉద్యమకారులను నిర్బంధిస్తే థర్మల్ ప్లాంట్ ఉద్యమం ఆగదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి తెలిపారు. ధర్నాకు వస్తున్న సమయంలో సోమవారం పోలీసులు అదపులోకి తీసుకొని విడి చిపెట్టిన తర్వాత సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని వెన్నెలవలస, అడ్డూరిపేట, తిమడాం గ్రామాల్లో పర్యటించి అధైర్యపడవద్దని గిరిజనులకు భరోసా కల్పించారు. థర్మల్కు వ్యతిరేకంగా నినదించిన గిరిజన లోకం అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు పోరాట కమిటీ నేతలను అదుపులోకి తీసుకున్న వైనం -
నవంబర్ 12న యాదవ మహాసభ
కంచిలి: అఖిల భారత యాదవ మహాసభ సమావేశాన్ని నవంబర్ 12వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు తెలియజేశారు. ఆరోజున సోంపేట పట్టణంలోని వీబీఆర్ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ విషయమై కంచిలిలో రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలోని సంఘ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ మహాసభకు జిల్లావ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యాదవుల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. సమావేశంలో రాపాక చిన్నారావు, నర్తు ప్రేమ్కుమార్, సాలిన లక్ష్మణమూర్తి, ఈశ్వరరావు, జోగారావు, వెంకటరావు, దాలయ్య, రామదాసు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
బతుకుల్లో అలజడి
● సముద్రంలో ఎగసి పడుతున్న అలలు ● 250 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ● మంచినీళ్లపేటలో కిలో మీటరు మేర కోతకు గురైన తీరం ● నెల రోజులుగా మత్స్యకారులకు సాగని వేట వజ్రపుకొత్తూరు: సముద్రం కల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల ఉద్ధృతి తీరాన్ని కుదిపేస్తోంది. మంచినీళ్లపేట, దేవునల్తాడ, డోకులపాడు, అక్కుపల్లి, గుణుపల్లి తీరాల్లో అలజడి ఎక్కువైంది. సముద్రం దాదాపు 250 మీటర్లు ముందుకు రావడంతో మంచినీళ్లపేటలో తీరం కిలోమీటరు మేర కోతకు గురైంది. మత్స్యకారులు తమ 30 బోట్లను నువ్వలరేవు, పూడిలంక ఉప్పుటేరులో లంగరు వేయగా, మరో 40వరకు తెప్పలను తీరంలోని ఇసుక దిబ్బలపై ఉంచారు. వల లు, ఇతర సామగ్రిని తాత్కాలిక షెడ్డుల్లో భద్ర పరిచారు. కోనేం సీజన్ కొల్లేరే.. వరుస తుఫాన్ల నేపథ్యంలో మత్స్యకారులకు నెల రోజులుగా వేట సాగడం లేదు. ట్యూనా ఫిష్, కోనేం, రొయ్యిలు సీజన్ అయినా తుఫాన్ వల్ల మత్స్యకారులు సముద్రంలోపలకు వెళ్లలేకపోతున్నారు. గత ఏడాది ఈ సీజన్లో భావనపాడు, మంచినీళ్లపేట, గుణుపల్లి, అక్కుపల్లి, డోకులపా డు, నువ్వలరేవు, దేవునల్తాడ, కేఆర్ పేట తదితర తీరాల్లో దాదాపు 150 టన్నుల వరకు కోనేం, మరో 50 టన్నుల వరకు ట్యూనా (సూరలు), మరో 6 టన్నుల వరకు రొయ్యిలు మత్స్యకారుల వలకు చిక్కాయి. కానీ ఈ ఏడాది కోనేం ధర రూ.1000 వరకు ఉన్నప్పటికీ వలకు చిక్కడం లేదని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజుల వరకే సీజన్ అనుకూలిస్తుందని, ఆ తర్వాత ఈ చేపలకు వేట చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి రింగ్ వలలు, అలి వలలు ఇతర ఖరీదైన బోట్లు కొనుగోలు చేశామని, ఆ అప్పులు ఇంకా తీరలేదని చెబుతున్నారు. ఇంటి వద్దే ఉండిపోవాల్సి వస్తోందని, తుఫాన్ సమయంలో వేట సాగ ని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం కనీసం బస్తా బియ్యం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇచ్ఛాపురం రూరల్: వలలు అల్లుకుంటున్న మత్స్యకారులు బియ్యం అందించాలి నెల రోజులుగా వేట సాగక ఇంటి వద్దే ఉంటున్నాం. పైసా ఆదాయం లేదు. వలలు షెడ్డుల్లోనే ఉన్నాయి. అప్పులు చేసి ఎన్నాళ్లు తినగలం. ప్రభుత్వం కనికరించి కనీసం ఒక బస్తా బియ్యం అయినా ఇస్తే బాగుటుంది. – ఎస్. మోహనరావు, మత్స్యకారుడు, మంచినీళ్లపేట పస్తులుంటున్నాం నెల రోజులుగా వేట సాగక పస్తులు ఉంటున్నాం. మూడు పూటలు తినాల్సిన పరిస్థితి నుంచి ఒక పూట తినే పరిస్థితి ఎదురైంది. సంద్రంలో మర బోట్ల విహారం తగ్గించాలి. దాని వల్ల మత్స్య సంపద దొరకడం లేదు. – సీహెచ్ నీలయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట -
దెబ్బకు ఠా.. దొంగల ముఠా
● కాకినాడ ముఠాను పట్టుకున్న పోలీసులు ● ఒక్కొక్కరిపై లెక్కకు మించి కేసులు ● నిందితుల నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి స్వాధీనం శ్రీకాకుళం క్రైమ్: రాత్రిపూట ఇళ్లకు కన్నాలు వేసి ఆభరణాలు దోచుకుపోయే కాకినాడ దొంగల ముఠాను శ్రీకాకుళం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులైన రేకడి వెంకటేశ్వర్లు, ధర్మాది ప్రసాద్, మాడెం మోహన్కుమార్ల వద్ద నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ(క్రైమ్) పి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి నేరాలు కాకినాడ జగన్నాయకపురానికి చెందిన వెంకటేశ్వర్లు, ప్రసాద్లు గత పదేళ్లు నుంచి చోరీలు చేస్తున్నారు. ఒకరు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ల తలుపులను విరగ్గొట్టే రకమైతే, మరొకడు బీరువా తాళాలు అలవోకగా తెరిచేవాడు. వెంకటేశ్వర్లుపై 23 కేసులుండగా, ప్రసాద్పై 36 ఉన్నాయి. ఇద్దరిపై కాకినాడ–4 టౌన్, 1 టౌన్లో సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నాయి. కాకినాడలో చోరీలకు సంబంధించి అక్కడి సెంట్రల్ జైల్కు ఈ ఏడాది ఏప్రిల్లో వెళ్లిన వీరికి, అక్కడ హత్యానేరంతో వచ్చిన కాకినాడ రాసిల్లిపేటకు చెందిన మాడెం మోహన్కుమార్ పరిచయమయ్యాడు. ఆగస్టు వరకు అదే జైలులో వీరి సావాసం బలపడింది. మోహన్కుమార్ చోరీ సొత్తు అమ్మడంలో, జైలుకు వెళ్లిన నేరస్తులను బెయిల్పై తీసుకొచ్చి కొత్త నేరాలు చేయించడంలో దిట్ట. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన రాత్రి గార మండలంలోని కె.మత్స్యలేశం – కళింగపట్నం పోర్టులో వరుసగా మూడిళ్లపై చోరీకి ఎగబడ్డారు. అలాగే నందగిరిపేట, రూరల్ మండలం రాగోలులో కూడా చోరీలు చేశారు. ఫింగర్ ప్రింట్ సాయంతో గారలో మూడిళ్లవారు ఒకరు 45 తులాలని, మరొకరు 25 తులాలని, ఇంకొకరు 10 తులాలు పోయాయని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతిపెద్ద కేసు అని డీఎస్పీ వివేకానంద పర్యవేక్షక్షణలో సీఐ పైడపునాయుడు, గార, రూరల్ ఎస్ఐలు టీమ్లుగా ఏర్పడ్డారు. ఫింగర్ ప్రింట్ సీఐ భరత్కుమార్ తన క్లూస్టీమ్తో ఆధారాలు సేకరించి వెరిఫై చేయడం, అవి కాకినాడ జిల్లాకు చెందిన ముద్దాయిలుగా ట్రేస్ కావడంతో విచారణ చేపట్టారు. వీరు ఈనెల 26న తండేవలస వైపు వెళ్లే తారురోడ్డుకు కుడివైపున ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రాము రెవెన్యూ అధికారుల సమక్షంలో తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. తప్పుడు ఫిర్యాదులు గారలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదులో 45 తులాలు పోయిందని చెప్పారని, కానీ 15 తులాలే పోయాయని, మిగతా ఇద్దరిళ్లల్లో ఏమీ పోలేదని, దూసిలో ఒక ఫిర్యాదుదారు 17 తులాలు పోయిందని అన్నారని, కానీ వారింట్లో పోయింది కేవలం రూ.800 లేనని అదనపు ఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గలో కూడా తొమ్మిది బంగారు వస్తువులు 43 తులాలున్నాయని ఫిర్యాదిచ్చారని, వాస్తవంగా 30 తులాలు పోయిందన్నారు. ఇకపై ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు ఇస్తే న్యాయపరంగా సలహాలు తీసుకుని కేసులు కడతామన్నారు. పట్టుకోవడంలో కృషి చేసిన ఫింగర్ ప్రింట్ సీఐ భరత్కుమార్, సీఐ పైడపునాయుడు, ఎస్ఐ రాము, కానిస్టేబుల్ జగదీష్లను అభినందించారు. -
మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు
శ్రీకాకుళం: తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ ఆదేశాలను అన్ని యాజమాన్యాల పాఠశాలలు పాటించాలని, మండల విద్యాశాఖాధికారులు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి జిల్లా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు తుఫాన్ సన్నద్ధతపై ఆరా తీశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేశారు. 94924 23420, 97018 61629, 63059 58501 నంబర్లకు కాల్ చేయాలని డీఈఓ రవిబాబు సూచించారు. -
ప్రైవేటీకరణతో నష్టం
సంతబొమ్మాళి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ టెక్క లి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని తాళ్లవలస, కాళీపురం గ్రామాల్లో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. వైద్యశాలలో ఆరోగ్యశ్రీ సేవలో పూర్తిగా నిలిపివేశారని అన్నారు. విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బి.మోహనరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కోత సతీష్, నక్క భీమారావు, మార్పు నాగభూషణరావు, మార్పు ఆశోక్ చక్రవర్తి, కె. ఇందిర. కె.కృష్ణారావు, తదితరులు ఉన్నారు. -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: కార్తిక మాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ పిలుపునిచ్చారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం 1, 2 డిపోల మేనేజర్లు అమరసింహుడు, శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తిక మాసంలో నాలుగు వారాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. ఈ బస్సులు సోమవారం పంచారామాలను దర్శించుకుని మళ్లీ మంగళవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుతాయని పేర్కొన్నారు. ఈ సర్వీసుల్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో గల శివాలయాల దర్శనానికి వెళ్తారని చెప్పారు. అక్టోబరు 2, 9, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతామన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి న్ని వివరాలకు 99592 25608, 99592 25609, 99592 25610, 99592 25611 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు రాజు, సెక్యూరిటీ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉన్నాం
● విద్యుత్శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అరసవల్లి: తుఫాన్ ప్రభావం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్శాఖ పరంగా అన్ని చర్యలతో అప్రమత్తంగా ఉన్నామని ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ జిల్లాలో తుఫాన్ తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా లోని తీర ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా విద్యుత్శాఖ తరఫున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు జిల్లాలో 36 సెక్షన్లలో 500 ట్రాన్స్ఫార్మర్లు, 1500 విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశామని, అలాగే 347 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని, రెగ్యులర్ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. తాజా సమాచారం మేరకు భారీ వర్షాలు మాత్రమే జిల్లాలో ప్రభావం చూపుతాయన్న సమాచారంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే కోనసీమ ప్రాంతమైన అమలాపురంలో ఈ తుఫాన్ ప్రభావ విధులకు జిల్లా నుంచి 80 మంది సిబ్బందిని పంపించినట్లు తెలిపారు. -
నిషా వల..
జలుమూరు మండలం కొమనాపల్లి మద్యం షాప్ను ఆనుకొని ఉన్న పర్మిట్ రూమ్ వద్ద పరిస్థితి ఇది. కొమనాపల్లి మద్యం షాప్ జిల్లా మంత్రి సమీప బంధువుది కావడంతో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడకు సమీపంలోనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ప ర్మిట్ రూమ్ ఒకటి ఉండగా మరో రెండు పర్మిట్ రూమ్లు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. – జలుమూరురణస్థలం కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో ఉండే దాబాల్లో మద్యం సేవిస్తున్న దృశ్యమిది. ఇదే మండలంలోని పైడిభీమవరం, వరిసాం, కొత్తపెట్రో ల్ బంకు, తాళ్లవలస గ్రామాల్లోని జాతీయ రహదారి–16కు ఆనుకుని ఉండే దాబాల్లో విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. రణస్థలం ఎకై ్సజ్ సీఐ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి. – రణస్థలం -
వైఎస్సార్సీపీ ర్యాలీ నవంబర్ 4కి వాయిదా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మోంథా తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 28వ తేదీన వైఎస్సార్సీపీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీని నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళ అవయవ దానం సోంపేట: మండలంలోని మాకన్నపురం గ్రామానికి చెందిన మహిళ ఉలాల హేమావతి(33) అవయవాలను దానం చేసి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. మండలంలోని మాకన్నపురం గ్రామానికి చెందిన ఉలాల హేమావతి ఈ నెల 22న బుధవారం కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తూ ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి గాయపడ్డారు. సోంపేటలోని సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం జెమ్స్కు తరలించారు. రెండు రోజులుగా చికి త్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో కళ్లు, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, హృదయం, కాలేయం దానం చేశారు. ఆరుగురికి ఇవి ప్రాణదానం చేయనున్నాయి. హేమావతిది నిరుపేద కుటుంబం. భర్త వెంకటరావు బెంగళూరులో వలస కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. హేమావతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన పలువురు ఉలాల హేమావతికి నివాళులు అర్పించారు. ఇంత విషాదంలోనూ అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను అభినందిస్తున్నారు. చదరంగంతో మెదడుకు పదును టెక్కలి: చదరంగంతో మెదడుకు ఎంతో పదును పెట్టవచ్చునని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కలి ఆల్ఫాజెన్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్స్ చాంపియన్స్ ట్రోఫీ పోటీలను డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చదరంగంపై మక్కువ పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం చిన్నారులతో సహా విద్యార్థులంతా సెల్ఫోన్లకు బందీలుగా మారుతున్నారని, దీని వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటోందని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా చదరంగం ఆడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు, జిల్లా ప్రతినిధి ఐ.అభినాష్ తో పాటు ఆల్ఫాజెన్ పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. సందడిగా కార్తిక వన భోజనాలు కవిటి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం కార్తీక వన భోజనాలు, లక్ష్మీనారాయణుల పూజల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజలు చేసి సామూహిక వనభోజనాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక వికాసంతో పాటు ఐక్యతాభావం పెరుగుతాయన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఏటా ఈ విధంగా ఒక రోజు అంతమంది కలిసి ఒక చోట చేరి పూజలు చేస్తామని కృష్ణారావు మాస్టారు తెలిపారు. -
‘ఽథర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించాలి’
సరుబుజ్జిలి: థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే పోరాటా లు మరింత ఉద్ధృతం చేస్తామని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి స్పష్టం చేశారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని వెన్నెలవలస, అడ్డూరిపేట, బొమ్మిక, చీదిరివలస, తిమడాం గ్రామాల్లో థర్మల్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాల గురించి ఆదివారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సరుబుజ్జిలి జంక్షన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ దమన కాండకు వ్యతిరేకంగా సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ధర్నాలు, నిరసనలు తెలిపి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాలు అందిస్తామని వెల్లడించారు. రైతుల అనుమతులు లేకుండా పంటపొలాల్లో రాత్రివేళ రహస్య డ్రోన్ల తో సర్వేలు చేసి వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. సమావేశంలో పోరాట కమిటీ కార్యదర్శి సింహాచలం, రైతుకూలీసంఘం జిల్లా కా ర్యదర్శి వంకలమాధవరావు, మిన్నారావు, బాబూ రావు, రమేష్,సవరఽ ధర్మారావు పాల్గొన్నారు. -
ప్రాణనష్టం లేకుండా చూడాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా, జిల్లా ప్రజలంతా సురక్షితంగా ఉండే విధంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర్’ను ఏ అధికారి వృథా చేయకుండా, మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి కేవీఎన్ చక్రధర బాబు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోంథా’ తీవ్ర తుఫాన్ ఈ నెల 28వ తేదీన తీరం దాటనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కోస్టల్ జిల్లాలు హై అలర్ట్లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, తిత్లీ తుఫాను అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలని చక్రధర బాబు స్పష్టం చేశారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి తక్షణమే తరలింపు తుఫాన్ను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం పనికిరాదని, ప్రమాదకర ప్రాంతాలు గుర్తించి, సురక్షితం కాని ఇళ్లలోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రత్యేక అధికారి సూచించారు. గర్భిణులు, తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడు తున్న వారికి పోషకాహార మద్దతు ఇచ్చి, వారి భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ సిబ్బంది కూలిన చెట్ల ను తొలగించడానికి ట్రీ కట్టర్లు డీజిల్ నిల్వలు సిద్ధం చేసుకుని, తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యంపై దృష్టి సహాయక చర్యల కోసం రేషన్ దుకాణాలకు పీడీఎస్ బియ్యాన్ని వీలైనంత త్వరగా పంపాలని చక్ర ధర బాబు ఆదేశించారు. ప్రత్యేక శిబిరాల్లో వంట, పాలు ఇతర అవసరాలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు పొలాల్లో నీరు నిలవకుండా చూసుకుని, పంట నష్టం తగ్గించాలని అన్నారు. వర్షాల తర్వాత పారిశుద్ధ్యం సవాలుగా మారుతుందని, వ్యాధులు ప్రబలకుండా చూడటానికి సిబ్బందిని సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. 24/7 కంట్రోల్ రూమ్ పని చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఆయనకు వివరణ ఇచ్చారు. రాబో యే మూడు రోజులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, సెల్ ఫోన్ ఆపరేటర్లు విద్యుత్ సరఫరా వ్యవస్థ సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని చక్రధరబాబు కోరారు. -
ప్రభుత్వరంగంలోనే వైద్య కళాశాలలు కొనసాగాలి
● జనవిజ్ఞాన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ శ్రీకాకుళం: ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, ప్రజారోగ్య వ్యవస్థను కొనసాగించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు అనే అంశంపై ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గొంటి గిరిధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్–21లో జీవించే హక్కు కల్పించారని, అందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడు ప్రభుత్వం ద్వారా వైద్యం పొందవచ్చన్నారు. ప్రభుత్వం నిర్మించి నిర్వహించాల్సిన 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను జీవో 590తో పీపీపీ విధానంలోకి మార్చడం ప్రజల హక్కులను కాలరాయడమేనని చెప్పారు. వైద్య కళాశాలల్లో వైద్య విద్యను పొందడమే కాకుండా ప్రతి కళాశాలకు అనుబంధంగా 420 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఉచిత వైద్యం పొందవచ్చని తెలిపారు. వైద్య కళాశాలల ఆస్పత్రుల ప్రైవేటీకరణ వల్ల ఈ అవకాశాన్ని పేద ప్రజలు కోల్పోతారన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను పేద ప్రజల వైద్యానికి హామీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సాధ్యమవుతుందన్నారు. గతంలో మంజూరైన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర జీడీపీలో ఐదు శాతం వైద్య రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల రక్షణకు జేవీవీ చేస్తున్న కృషిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. త్వరలో ప్రముఖులతో సంతకాల సేకరణ నిర్వహించాలని, కరపత్రాలతో ప్రజానీకాన్ని చైతన్యపరచాలని, వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ ఆగేంత వరకు ఉద్యమించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మేధావులు, జిల్లా ప్రముఖులు నల్లి ధర్మారావు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, డాక్టర్ కె.శ్రీనివాస్ (ప్రజారోగ్య వేదిక ), కుప్పిలి కామేశ్వరరావు (జేవీవీ), పేకల తేజేశ్వరరావు(సీఐటీయూ), బమ్మిడి శ్రీరామ్మూర్తి(యూటీఎఫ్), కె.శ్రీనివాస్(సాహితీ స్రవంతి), బలివాడ ధనుంజయరావు(ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంఎస్), బోనెల రమేష్(ఏపీ ఎస్సీఎస్టీయూఎస్), బొడ్డేపల్లి మోహనరావు(ఐలు), మిస్కా కృష్ణయ్య(కేఎన్పీఎస్), సీహెచ్ శ్రీనివాస్, రామ్మోహన్(ఏపీటీఎఫ్ 257), బి.వెంకటేశ్వర్లు(ఏపీటీఎఫ్ 1938), కింజరాపు నూకరాజు(ఎస్సీఎస్టీటీఎఫ్), రమేష్బాబు(బీటీఏ), పి.మోహనరావు(జన సాహితీ), ఎం.రామ్మోహనరావు(ప్రైవేటు విద్యాసంస్థలు), ఆర్.చిన్నారావు(రిమ్స్), భాస్కరరావు(సీపీఎస్యూఎస్), డాక్టర్ కె.ఉదయ్కిరణ్(బి.ఆర్.ఎ.యు), గణపతి (పోస్టల్), గణేష్ (దళిత ఐక్యవేదిక), బి.ధనలక్ష్మి(యూటీఎఫ్), తంగి ఎర్రమ్మ(రచయిత), కె.గణపతి, ఎం.గోవర్ధనరావు(పట్టణ పౌర సంక్షేమ సంఘం), రౌతు శంకరరావు(వైఎస్సార్ సీపీ), పి.సుధాకర్బాబు, బి.జగన్నాథరావు(జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు), కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహనరావు, ఎం.పద్మనాభరావు, పాలవలస ధర్మారావు, పాలకొండ కూర్మారావు, బొడ్డేపల్లి జనార్ధన రావు, పేడాడ వేదవతి, హెచ్ మన్మధరావు, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి భగవద్గీత పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసన్నపేట: భగవద్గీతలోని 15వ అధ్యాయంలో శ్లోకాల పఠనంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆరుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు చిన్మయిమిషన్–చిన్మయి సుగుణం స్థానిక ఆశ్రమం స్వామీజీ పరమాత్మానంద ఆదివారం తెలిపారు. నరసన్నపేట శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా 44 పాఠశాలల నుంచి 4500 మంది పాల్గొనగా జిల్లా స్థాయికి 120 మంది ఎంపికయ్యారని చెప్పారు. వీరికి ఆదివారం నరసన్నపేటలో పోటీలు నిర్వహించి వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 16 మందిని ఎంపిక చేశామన్నారు. వీరిలో ఆరుగురు దేవశ్యగౌతమి, పి.సుసాధ్య, ఏ.నైషిత, ఏ.జాహ్నవి, వి.గీత, ఎం.శివాణి నవంబర్ 9న కడపలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం
టెక్కలి : కలియుగ కై లాసంగా పేరుగాంచిన టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి దేవాలయం కార్తీకమాస తొలి సోమవారం పూజలకు సన్నద్ధమైంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 27న తొలి సోమవారం, నవంబర్ 3న రెండవ సోమవారం, 11న మూడవ సోమవారం, 17న నాల్గవ సోమవారాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీర్షాభిషేకం టికెట్ ధర రూ.40, ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.20, కేశఖండన రూ.40, రుద్రాభిషేకం రూ.58 రూపాయల చొప్పున ధరలు నిర్ణయించారు. ఇదీ స్థల చరిత్ర.. ఎండల మల్లికార్జున స్వామి ఆలయం చరిత్రను ఎంతో మంది వేదపండితులు ఎన్నో రకాలుగా అభివర్ణించారు. వారి మాటల్లో చెప్పాలంటే... ‘త్రేతా యుగంలో రావణ సంహారం అనంతరం రాముడు తన పరివారంతో అయోధ్యకు వెళ్తూ మార్గ మధ్యలో సుమంచ పర్వతంగా పిలువబడే ప్రస్తుతం రావివలస ప్రాంతంలో తపస్సు చేయాలని వానర వైద్యుడు సుశేణుడికి ఆజ్ఞ చేశారు. కొన్ని సంవత్సరాలు తరువాత సుశేణుడి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు ఆంజనేయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించగా, సుశేణుడు ధ్యాన సమాధి కావడం గమనిస్తాడు. దీంతో సుశేనుడు పార్థివ దేహాన్ని పూడ్చి వేసి, ఆ సమాధిపై జింక చర్మాన్ని ఆనవాలుగా వేసి విషయాన్ని రామునికి తెలియజేస్తాడు. రాముడు తన పరివారంతో సుశేణుడి సమాధి వద్దకు చేరుకోగా, ఆ సమాధిపై స్వయంభూలింగం వెలియడంతో పాటు దానిపై మల్లెపూల దండ ఉండటం గమనిస్తారు. జింక చర్మం, మల్లెపూల దండతో ఉన్న ఆ లింగానికి ‘మల్లికాజినుడు’ అని నామకరణం చేసి, సమీపంలో ఉన్న కోనేరులో సీతమ్మ స్నానం చేసి కొండపై విశ్రమించి ఆ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అప్పటి నుంచి మల్లికాజినుడు నామకరణం కొనసాగగా, తర్వాత ద్వాపరయుగంలో అర్జునుడు ఈ ప్రాంతంలో శివుని కటాక్షం కోసం తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడుగగా.. నీ నామం తర్వాత నా పేరు ఉండాలని అని కోరగా, దీంతో శివుడు ఆ వరాన్ని ప్రసాదించగా, ఆ కాలంలో ‘మల్లికార్జునుడు’ అనే నామం కొనసాగింది. కాలానుగుణంగా ఈ లింగం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుండడంతో, ఈ యుగం నాటికి ‘ఎండల మల్లికార్జునుడు’గా నామం స్థిరపడింది. అప్పటి నుంచి రావివలస ఎండల మల్లికార్జునుడు వెలసిన ప్రాంతం కలియుగ కై లాసంగా కొనసాగుతోంది. ఎండల మల్లికార్జునుడుఆలయానికి చేరుకోండిలా.. ఎండల మల్లికార్జునుడు ఆలయానికి చేరుకునేందుకు రోడ్డు, రైల్వే మార్గాలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుని అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలసలోని ఆలయానికి చేరుకునేందుకు అనేక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైల్వే మార్గం విషయానికి వస్తే టెక్కలితో పాటు సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నౌపడ రైల్వే స్టేషన్, 20 కిలోమీటర్ల దూరంలో పలాస రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి బస్సులు, చిన్నపాటి వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. -
బ్రహ్మ మురారి సురార్చిత లింగం..!
● ‘బ్రహ్మసూత్ర శివలింగాలు’ కొలువైన క్షేత్రంగా శ్రీముఖలింగం ● అరుదైన దేవాలయంగా గుర్తింపు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగం మరో ప్రత్యేకతనూ కలిగి ఉంది. ఎంతో అరుదైన ‘బ్రహ్మసూత్రాల శివలింగాలు’ కలిగిన క్షేత్రంగా ప్రాశస్త్యం పొందింది. భీమేశ్వరుడు, సోమేశ్వరుడు, వరుణేశ్వరుడు, ఈశాన్య ఈశ్వరుడు, ఎండల మల్లికార్జునులను బ్రహ్మసూత్రాల శివలింగాలుగా పిలుస్తారు. ఇవి కొలువైన క్షేత్రాలు దేశంలో వేలిపై లెక్కపెట్టవచ్చు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శివాలయం మన జిల్లాలో ఉండటం సిక్కోలు ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. బ్రహ్మసూత్రాల శివలింగాలను దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వురుడిని దర్శనం చేసుకోవడంగా, పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శ్రీముఖలింగం క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ జరిగే కార్తీక మాస ఉత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తుంటారు. కృతయగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనాకాకృతిలో, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృతిలో, ద్వాపరయుగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలో, కలియగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. -
మాదినకు రైతునేస్తం పురస్కారం ప్రదానం
కంచిలి : పశు సంవర్థక శాఖలో 31 సంవత్సరాలుగా అందించిన సేవలకు గుర్తింపుగా పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన విశాఖపట్నం పశుసంవర్థకశాక ఉపసంచాలకుడు డాక్టర్ మాదిన ప్రసాదరావు రైతునేస్తం పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని స్వర్ణభారతి ట్రస్ట్లో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినూత్న సేవలు అందించే శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, ఆదర్శ రైతులకు ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రసాదరావు పురస్కారం అందుకున్నారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం శ్రీకాకుళంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఎన్నికల అధికారి బి.బాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులు చల్లా దుర్గాప్రసాద్, గురుగుబెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గురుగుబెల్లి భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడిగా చల్ల సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా అంపోలు షణ్ముఖరావు, సహాధ్యక్షుడిగా బొడ్డు శేఖర్, ఆర్థిక కార్యదర్శిగా యాళ్ల శ్యాంసుందర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, మహిళా అధ్యక్షురాలుగా పి.జయమ్మ, రాష్ట్ర కౌన్సిలర్లగా కరిమి రాజేశ్వరరావు, వడమ శరత్బాబు, సూర్య, బుసకల ఈశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులుగా బోణిగి శ్యాం కుమార్, పైడి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులుగా బొడ్డేపల్లి శ్రీనివాస్, సుంకర్ విజయ్, పి.సిమ్మన్న, బి.ప్రదీప్చంద్ర వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బాలియాత్ర విజయవంతం చేయండి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో కార్తీక పౌర్ణమి అనంతరం నవంబరు 9న జరగనున్న బాలియాత్రను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం శ్రీముఖలింగంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొనాలని కోరారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. కటక్ నుంచి రాజమండ్రి వరకూ మహానది, గోదావరి నదుల మధ్య విరాజిల్లిన కళింగ రాజ్యం పూర్వ వైభవం భావితరాలకు తెలియజేసేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. యాత్ర నిర్వహణకు ఎటువంటి విరాళాలు స్వ్కీరించబడవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ టి.సతీష్కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, గ్రామపెద్దలు బి.వి.రమణ, అర్చకులు పాల్గొన్నారు. -
క్వాంటమ్తో సమూల మార్పులు
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో జరుగుతున్న క్విస్కిట్ ఫాల్ –2025 ఉత్సవంలో ఆరో రోజు ఆదివారం విద్యార్థుల్లో నూతనోత్సాహాన్నినింపింది. ఈ సందర్భంగా ఐబీఎం శాస్త్రవేత్త డాక్టర్ రతజిత్ మజుందార్ మాట్లాడుతూ క్వాంటం ద్వారా ప్రపంచంలో అనేక మార్పులను తీసుకురాగలమని చెప్పారు. అనంతరం క్వాంటమ్ ఆల్గారిథమ్స్పై పేరణాత్మక సెషన్ నిర్వహించారు. క్వాంటమ్ సూత్రాలు, ప్రయోగాత్మక అన్వయాలు, భవిష్యత్తు సాంకేతికతలలో పాత్రను వివరిస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆసక్తిని పెంచారు. డాక్టర్ జాన్ యల్లా మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో క్వాంటమ్ సమస్యల పరిష్కారాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకట బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృస్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, గేదెల రవి, రమేష్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అబుదాబిలో వలస కూలీ మృతి కంచిలి: పురుషోత్తపురం పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన వలస కూలీ నక్క నరసింహారావు(49) అబుదాబిలో శుక్రవారం మృతిచెందాడు. నెల రోజుల క్రితం అబుదాబిలో ఎన్.ఎస్.హెచ్. కంపెనీలో వెల్డర్గా పనిచేసేందుకు వెళ్లాడని, అక్కడ కడుపునొప్పితో మృతిచెందినట్లు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్లను కోరారు. బావిలో పడి యువకుడు మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి పంచాయతీ ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరినాయుడు(32) ఆదివారం బావిలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరినాయుడుకు మద్యం అలవాటు ఉంది. మద్యం అతిగా సేవించి స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియడం లేదు. గమనించిన స్థానికులు వెంటనే బావి నుంచి వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకుని వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌరినాయుడుకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు చిన్న, కల్పన ఉన్నారు. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
1 నుంచి చెకుముకి సంబరాలు
శ్రీకాకుళం: జిల్లాలో నవంబర్ 1న మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 మండలాల్లో ఎంఈఓలు, హెచ్ఎంలు, చెకుముకి మండల కన్వీనర్లు, ఉపాధ్యాయులు, సైన్స్ ఉద్యమాభిమానులు, విద్యార్థులు హాజరై సంబరాలు విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా నవంబర్ 11 నుంచి 20 వరకు శ్రీకాకుళంలో జరిగే సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి మోహనరావు, బొడ్డేపల్లి జనార్దనరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాలకొండ కూర్మారావు, సైన్స్ అండ్ కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ హనుమంతు మన్మధరావు, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ పాలవలస ధర్మారావు, సమత జిల్లా కన్వీనర్ పేడాడ వేదవతి, ఆడిట్ జిల్లా కన్వీనర్ బి.ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి పాల్గొన్నారు. -
దళిత కుటుంబాలపై అక్రమ కేసులు అన్యాయం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని, దళిత కుటుంబాలపై అక్కసుతో అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎనిమిది మంది నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్రంలోని దళితులంతా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయడాన్ని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ, జిల్లాలలోనూ దళితులపై అక్రమ కేసులు బనాయించి గ్రామాల్లో వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంటు పథకం తీసుకొచ్చారని, ఎంతోమంది దళిత బిడ్డలకు ఉన్నత స్థానాలు రావడానికి కారణమైందని గుర్తు చేశారు. తర్వాత తండ్రి ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనతో కొనసాగించారని చెప్పారు. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీనివల్ల దళితులు వైద్య విద్యకు దూరమవుతారన్నారు. నియోజకవర్గాల్లోని ఉన్న దళిత విభాగాన్ని చైతన్యంచేస్తూ అంబేడ్కర్ విగ్రహాల నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. కల్తీ మద్యం వల్ల ఎక్కువగా ఆర్థికంగా వెనకబడిన దళిత కుటుంబాలే బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సతివాడ రామినాయుడు. నియోజకవర్గాల అధ్యక్షులు యజ్జల గురుమూర్తి, కల్లేపల్లి లక్ష్మణరావు, గుజ్జల యోగేశ్వరరావు, నేతల కృష్ణ, జె.జయరాం, వావిలపల్లి శ్రీనివాసరావు, లండ కిరణ్, రేగిడి లక్ష్మణరావు, మజ్జి రమణ పాల్గొన్నారు. -
ప్రసాద్ కథ కంచికే..!
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి నగర నలువైపులా విలువైన భూములున్నాయి. సెంటు భూమి రూ.50 లక్షల ధరకు అమ్ముడుపోయే మార్కెట్ ఉంది. ఆలయ పరిసరాలను విస్తరించే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో కూడా పలుచోట్ల ప్రైవేటు స్థలాలను గుర్తించి కొనుగోలు చేసేందుకు అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేటు జిరాయితీ స్థలాలను కొనుగోలు చేయకుండా ప్రత్యామ్నయంగా ఆలయానికి చెందిన విలువైన భూములు ఇచ్చేసేందుకు తాజాగా మంత్రి అచ్చెన్న ఆదేశాలిచ్చేశారు. ఇందులో భాగంగా ఆలయం ముందున్న కొందరి ఇళ్లను ఖాళీ చేయించి వారికి ప్రధాన రోడ్డుపై ఉన్న కమర్షియల్ స్థలాలను అదే విస్తీర్ణం అప్పగించేలా మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం దేవదాయ శాఖాధికారులకు విస్మయానికి గురిచేసింది. 2013 భూసేకరణ చట్టం ద్వారా అవసరమైన స్థలాలను తీసుకుని పరిహారాలను ఇచ్చే మార్గాన్ని ఆలోచిస్తున్న అధికారులకు...తాజాగా మంత్రి ఆదేశాలు మేరకు ఖరీదైన స్థలాలను ఇచ్చేయమనడం చూస్తుంటే..తెరవెనుక ఏం జరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన స్థలాలను ఆలయ అభివృద్ధికి తీసుకోవాలంటే అందుకు తగిన మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో పరిహారాన్ని చెల్లించే అవకాశముంది. అది కాదని విలువైన స్థలాలన్నీ ఇలా పంచేస్తే..భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆలయానికి మిగిలే భూమి దాదాపుగా తగ్గిపోయే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యాలయాన్ని రూ..100 కోట్లతో కనీవినీ ఎరుగని అభివృద్ధి అన్నారు. అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ గత రథసప్తమికి ముందు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ప్రగల్భాలు పలికారు. ఎమ్మెల్యే గొండు శంకర్ను మధ్యలో పెట్టి స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ల చేతనే ఆలయానికి చెందిన భారీ భవనాలు, దుకాణ సముదాయాలు, వసతి గదులను.. ఇలా ఆదిత్యాలయానికి ఎదురుగా ఉన్న ఏ ఒక్క భవనాన్ని వదలకుండా కూల్చివేయించారు. దీంతో సర్వం కోల్పోయి పదుల సంఖ్యలో వ్యాపారులు రోడ్డునపడ్డారు. కూల్చివేతలకు ఏడాది కావస్తోంది. అయినా.. ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. ఆలయం ముందు మాత్రం విశాలంగా ప్లాట్ఫాం వేసేసి ఇంద్రపుష్కరిణి కనిపించేలా ఖాళీగా ఉంచారు. ఈఏడాది జనవరిలో మంత్రి అచ్చెన్న ప్రకటనలకు, తాజాగా గురువారం అరసవల్లిలో చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే..మరి కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కథ కంచికే..అన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ పథకం ఎలాగూ రాదు.. ఆ నెపంతో చేపట్టిన కూల్చివేతల ఘట్టాన్ని మరిపించడానికి అభివృద్ధి పేరిట ఆలయానికి చెందిన (భక్తులచే సమకూరిన ఆదాయం) నిధులు రూ.12 కోట్లను వినియోగించి ఆలయ పరిసరాల్లో కొత్త భవనాలను నిర్మించేలా ప్రతిపాదించారు. దీన్ని వెంటనే ఆమోదించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్కు మంత్రి గురువారం ఫోన్లో ఆదేశించారు. దీంతో ప్రసాద్ స్కీం అటకెక్కినట్లే అన్న స్పష్టత చర్చ జిల్లాలో జోరందుకుంది. మండిపడుతున్న దాతలు.. అరసవల్లి ఆలయానికి పెద్ద ఆస్తి దాతలే...అలాంటి ఎందరో దాతలు తమ పూర్వీకుల జ్ఞాపకార్ధం..తమ సంస్థల పేరిట రూ.లక్షలతో భక్తుల సౌకర్యార్ధం జింకు రేకు షెడ్లుతో పాటు వసతి గదులను నిర్మించిన సంగతి తెలిసిందే. దశాబ్దాల పూర్వం టీటీడీకి చెందిన వసతి గదుల సముదాయంతో పాటు ఆలయ నిధులతో నిర్మించిన 12 దుకాణాల సముదాయం, ప్రసాదాల కౌంటర్లు, వంటగదులు కూడా కూల్చివేశారు. ఓ దాత ఏకంగా రూ.30 లక్షలతో నిర్మించిన అన్నదాన మండపాన్ని సైతం నేలమట్టం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేయడంపై దాతలు తీవ్రంగా మండిపడ్డారు. సుమారు రూ.7 కోట్ల విలువైన నిర్మాణాలను కూల్చివేసిన కూటమి పెద్దలు..ఇప్పుడు మళ్లీ ఆలయ నిధులు రూ.12 కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు, భక్తులు అంటున్నారు. భక్తులకు ఎండ, వానల నుంచి రక్షణగా భక్తుల విరాళాలతో ఆలయం ముందు భాగంలో నిర్మించిన జింకు షెడ్లును పూర్తిగా కూల్చివేసి.. ఆ స్థానంలో చలవపందిళ్లు వేయాలని మంత్రి చేస్తున్న ప్రకటనపై భక్తులు మండిపడుతున్నారు. ‘‘రాష్ట్రంలో ప్రసిద్ధ సూర్యదేవాలయంగా వెలుగొందుతున్న అరసవల్లి క్షేత్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం మంజూరు చేయిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. అందుకే కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అంతా దగ్గరుండి కేంద్రం నుంచి ఈ పథకం ద్వారా సుమారు రూ.100 కోట్లు తెప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ పరిసరాలన్నీ అత్యంత సుందరంగా తయారుచేయనున్నాం...’’ – ఈ ఏడాది జనవరిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘‘అరసవల్లికి ‘ప్రసాద్’ స్కీం చాలా ఆలస్యమయ్యేలా ఉంది. దేశంలో చాలా మంది ‘ప్రసాద్’ స్కీం అడుగుతున్నారు. ఈ పథకం కోసం తర్వాత చూద్దాం. మన కేంద్రమంత్రి రామ్మోహన్ ఆ పనులు చూసుకుంటున్నారు.. వచ్చే ఏడాది జనవరి 25న రథసప్తమిని ఏడు రోజుల పాటు శ్రీకాకుళం ఉత్సవ్ పేరిట ఘనంగా నిర్వహిద్దాం. ఆలయానికి చెందిన నిధులు రూ.12 కోట్లతో ఇంద్రపుష్కరిణి, అన్నదాన, ప్రసాదాల తయారీ మండపాలు, కేశఖండన శాల, గోశాల తదితర అభివృద్ధి పనులు చేసుకుందాం. ఈమేరకు ప్రతిపాదనలను వెంటనే ఆమోదించేలా చర్యలు చేపడతాం.. – ఈనెల 23న అరసవల్లిలో మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు ఆదిత్యాలయానికి ప్రసాద్ స్కీం వర్తింపు అనుమానమే.. మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో భక్తుల నిరాశ గత రథసప్తమి సందర్భంగా ఇదే స్కీం పేరిట భవనాల కూల్చివేత ఆలయానికి చెందిన నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు (ఫైల్) -
నాలుగు పూరిళ్లు దగ్ధం
మందస: బుడారుసింగ్ పంచాయతీ పద్మపురంకాలనీ గిరిజన గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత వల్ల చెలరేగిన కార్చిచ్చు వల్ల నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో గిరిజనులకు పనులకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కొందరు స్థానికులు గుర్తించి మందస అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా.. అక్కడ సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో పలాస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే సవర లాలు, సవర ఉదయ్, సవర ఢిల్లీ, సవర నోబిల్కు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
● అక్టోబర్ 26 నుంచి వచ్చే నెల 16 వరకు క్షేత్రాల దర్శనం ● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: డీపీటీవో పంచారామాలను దర్శించుకునే భక్తులు ఒక్కొక్కరికి టికెట్ ఖరీదు సూపర్లగ్జరీ బస్సుకు రూ.2400, అల్ట్రాడీలక్స్ బస్సుకు రూ.2,350 ప్రయాణచార్జీగా నిర్ణయించారు. ముందస్తు టికెట్ కోసం ఆన్లైన్/అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. గ్రూప్గా అయ్యప్పభక్తులు వస్తే శబరిమలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ టికెట్ల కోసం www.apsrtconline.in సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు 9959225608 నంబర్లను సంప్రదించవచ్చు. శ్రీకాకుళం అర్బన్: హిందువులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెల రోజులు వ్రతాలు, నోములు ఆచరించడం, దేవాలయాల సందర్శన ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా జిల్లాలోని శైవక్షేత్రాలతో పాటు పంచారామాలకు భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఒకటి, రెండో డిపోల నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం ఒకే రోజు రాష్ట్రంలోని ఐదు శైవ క్షేత్రాలు అనగా అమరావతిలో అమరేశ్వరస్వామి, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయాలకు తీసుకెళ్తారు. కార్తీకమాసంలో ప్రతి ఆదివారం అనగా ఈ నెల 26, నవంబర్ 2, 9, 16వ తేదీలలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆదివారం సాయంత్రం 4గంటలకు బస్సు బయలుదేరుతుంది. సోమవారం ఒకేరోజున ఐదు పుణ్యక్షేత్రాలైన పంచారామాలను దర్శింపజేసి మరలా మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్కు చేరుకుంటుంది. కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పంచారామాల దర్శనం కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 26, అక్టోబరు 2, 9, 16వ తేదీలలో ప్రత్యేక బస్సులు నడపనున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీహెచ్, అప్పలనారాయణ, డీపీటీఓ -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
శ్రీకాకుళం క్రైమ్ : మోంథా తుఫాన్ నేపథ్యంలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ ఆదేశించారు. రేంజి పరిధిలోని ఎస్పీలతో శనివారం రాత్రి వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత గ్రామాలను సందర్శించి మత్స్యకారులకు, గ్రామస్థులకు హెచ్చరికలు ఇవ్వాలన్నారు. 24/7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి తగినంత సిబ్బందిని నియమించాలని, ముంపు, లోతట్టు ప్రాంతాల రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. దొంగతనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించరాదని, సోషల్మీడియా దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, డిజిటల్ అరెస్టు, ఆర్థిక నేరాలను అరికట్టాలని, సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన బాధితుని సొమ్ము తిరిగి అందేలా చూడాలన్నారు. -
డైట్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: వమరవల్లి డైట్ శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న మూడు సీనియర్ లెక్చరర్, 8 లెక్చరర్ పోస్టులు డిప్యుటేషన్పై భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధి కారి ఎ.రవిబాబు తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తులను గూగుల్ ఫారంలో స్వీకరించారని, ఇకమీదట లీప్ యాప్ ద్వారా స్వీకరిస్తారని అన్నారు. గతంలో గూగుల్ యాప్లో దరఖాస్తు చేసుకున్న వారు సైతం మళ్లీ లీప్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తును పూర్తి చేసి అన్ని సర్టిఫికెట్ల నకళ్లను జతచేసి డీడీఓ ద్వారా జిల్లా డైట్ కార్యాలయంలో అందించాలన్నారు. ఈనెల 31వ తేదీ నాటికి 58 ఏళ్లు నిండని వారు, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం, ఎంఈడీలో 55 శాతం మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొన్నా రు. రెండు సబ్జెక్టులలో అర్హత కలిగి ఉంటే రెండింటికి ఒక దరఖాస్తులో మాత్రమే పొందుపరచాలని సూచించారు. గతంలో ఎఫ్ఎస్టీసీ, డైట్లలో పనిచేసిన వారు అనర్హులని, ఎంపికై న ఉపాధ్యాయులు ఒక ఏడాది కచ్చితంగా డైట్ లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆరు విడతల్లో పరీక్షలు జరుగుతాయని, నవంబర్ 14, 15 తేదీల్లో త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూ చేస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం అనే అంశంపై ఆదివా రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నాయకులు గుంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలోని యూటీఎఫ్ భవనంలో ఈ సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాల ని కోరారు. శ్రీకాకుళం రూరల్ : జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు, జిల్లాకు చెందిన 22 బస్సులను స్థానిక విజయాదిత్య పార్క్ వద్ద ఆపి తనిఖీలు జరిపారు. సంబంధిత పత్రాలు సరిగ్గానే ఉన్న ట్లు గుర్తించారు. జిల్లాకు సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ గల 18 బస్సులకు స్టేట్ పర్మిట్లు, ఒక బస్సుకు ఆలిండియా పర్మిట్ ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం డీటీసీ విజయసారధి తెలిపారు. తనిఖీలు చేసిన బస్సులకు ఫైన్లు గాని, సీజ్ చేయడం గాని జరగలేదన్నారు. -
8 నెలల నరకం
శ్రీకాకుళం క్రైమ్ : మరో అకృత్య కాండ వెలుగులోకి వచ్చింది. మన ఇంటి బిడ్డల భద్రతను ప్రశ్నిస్తూ ఇంకో కీచక పర్వం బయటపడింది. ఎనిమిది నెలల హింసను భరించిన ఓ బాలికకు ఎట్టకేలకు విడుదల లభించింది. కనిపెంచిన తల్లే కామాంధుని చెరలో చిక్కడం, నమ్మకం ఉంచిన ఆటో డ్రైవర్ కీచకుడిలా మారి వేధించడంతో ఆ బాలిక నరకం చూసింది. బంధువుల సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఈ శోకానికి తెర పడింది. జేఆర్ పురం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ 14 ఏళ్ల అమ్మాయిని 8 నెలలుగా లైంగికంగా వేధిస్తున్నా డు. బాలిక తల్లితోనూ అక్రమ సంబంధం నడిపాడు. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడైన డ్రైవర్ను, సహకరించిన బాలిక తల్లిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించా రు. శనివారం శ్రీకాకుళం సబ్డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బాలిక తండ్రి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఉదయం వెళ్లి రాత్రయితే గానీ ఇంటికి రారు. ఇంటి విషయాలేవైనా భార్యే చూసుకునేవారు. వారి కుమార్తెను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు వేరే గ్రామంలో ఉన్న హైస్కూల్కు తీసుకెళ్లేవాడు. బాలికతో పాటు మరో తొమ్మిది మంది కూడా అదే వాహనంలో స్కూల్కు వెళ్లేవారు. ఒకే ఊరు కావడంతో డ్రైవర్ బాలిక ఇంటికి వెళ్లి తల్లితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతటితో ఆగక బాలికపైనా కన్నేశాడు. మద్యానికి బానిస చేసి.. బాలిక తల్లిని మద్యానికి బానిస చేసి.. ఆమె మత్తు లో ఉండగా బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవా డు. ఆటోలో కూడా అదే రీతిలో బాలికను ఏడిపించేవాడు. తట్టుకోలేని బాలిక మొదట్లో తల్లితో చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఈ విషయం తండ్రితో చెప్పకూడదని బెదిరించేది. బాలిక తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడి ఎనిమిది నెలలు ఆ నరకం భరించింది. తల్లి కొట్టడంతో.. ఈ క్రమంలో నాలుగు రోజుల ముందు బాలికను స్కూలుకు దిగబెట్టే క్రమంలో డ్రైవర్ రామారావు దారిలో ఆటో ఆపేసి లైంగికదాడికి యత్నించాడు. ఎంత వద్దన్నా వినిపించుకోలేదు. ఇంటికొచ్చి తల్లితో చెబితే బాలికనే తిరిగి కొట్టడంతో.. రాత్రి విధుల నుంచి వచ్చిన తండ్రితోను, ఎదురింటిలో ఉన్న చిన్నాన్న, పిన్ని, మామయ్యలతో ఆమె విషయమంతా చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయగా డీ ఎస్పీ వివేకానంద దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, తాను వచ్చాక 15 కేసులు నమోదయ్యాయన్నారు. పోక్సో కేసులో డ్రైవర్కు వర్తించిన జైలు శిక్ష ఆమెకు కూడా పడవచ్చన్నారు. -
వైద్య కళాశాలలను ప్రజలే రక్షించుకోవాలి
పలాస: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రజలే రక్షించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడో వార్డు పద్మనాభపురం గ్రామంలో శనివారం సాయంత్రం రచ్చబండ, కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి పేదవాడికి వైద్య విద్య చేరువ చేయాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే.. కూటమి ప్రభు త్వం పేదలకు వైద్య విద్య దూరం చేస్తోందన్నారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిష్టు గోపి ఆధ్వర్యంలో మూడో వార్డు కౌన్సిలర్ సవర సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీ పీ నాయకులు డొక్కరి దిలీప్కుమార్, బదకల బాల మ్మ, రంది రాజారావు, డిక్కల రాంబాబు, కుమ్మరి బోగేషు, కిక్కర ఆధినారాయణ, కొండే రాజారావు, బడగల బల్లయ్య, బోరబుజ్జి, గుజ్జు జోగారావు, నర్తు వెంకటరమణ, తూముల శ్రీనివాసరావు, కంచరాన చినబాబు, బమ్మిడి సంతోష్కుమార్, సనప ల సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలాస నాయకులకు చోటు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పలాస నియోజవర్గానికి చెందిన నాయకులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా డొక్కరి దానయ్య, రాష్ట్ర బూత్ కమిటీ సంయుక్త కార్యదర్శి చింతాడ మాధవరావు, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శిగా పాలిన శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా ఉంగ సాయికృష్ణ, రాష్ట్ర గ్రీవెన్స్సెల్ సంయుక్త కార్యదర్శిగా సొర్ర ఢిల్లీరావు, రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం కార్యదర్శిగా మొదవలస మన్మధరావు, రాష్ట్ర పబ్లిసిటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా సురేంద్ర త్యాడిలను నియమించారు. రాష్ట్రస్థాయి మృదంగ పోటీల విజేతగా గౌతమ్ కంచిలి: జాడుపూడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి బోరిశెట్టి గౌతం రాష్ట్రస్థాయి మృదంగం పోటీల్లో విజేతగా నిలిచాడు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో భాగంగా మృదంగ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. గౌతమ్ గురువు చలపరాయి వినోద్కుమార్ శిష్యరికంలో మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో కూడా ప్రథమస్థానం దక్కించుకున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ సంగీతం పట్ల మక్కువ పెంచుకోవడంతో తండ్రి మోహనరావు ప్రోత్సహించారు. గౌతమ్ను మాజీ సర్పంచ్ పిలక చిన్నబాబు, వైఎస్సార్ సీపీ నేత పలికల జయరాం, గ్రామస్తులు శనివారం అభినందించారు. -
వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలోని పేర్లవీధికి చెందిన కోరాడ రమణమ్మ(96), ప్రశాంతినగర్కు చెందిన పొట్నూరు వెంకటనారాయణ(83), రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో కలిగి ఆదినారాయణ (67) మృతి చెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదాతల కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్తో పాటు సెక్రటరీ మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, సభ్యులు శనివారం అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. రమణమ్మ ఆదినారాయణ వెంకటనారాయణ -
రొయ్యిల కోసం వెళ్లి.. విగతజీవిగా మారి..
● బందరువానిపేటలో 8వ తరగతి విద్యార్థి మృతి గార: సరదాగా రొయ్యిల కోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన గంగాడ లక్ష్మణరావు (బేతాళుడు), లక్ష్మమ్మల రెండో కుమారుడు అప్పలరాజు (12) స్థానిక హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు ఇంటిదగ్గర పెట్టి సమీపంలోని గెడ్డలో తోటి స్నేహితులతో కలిసి రొయ్యిలు పట్టుకునేందుకు వెళ్లాడు. స్నేహితులు ఇంటికి వచ్చినా కుమారుడు ఇంటికి చేరలేదు. చాలా రోజులుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న అప్పలరాజు ఆచూకీ కోసం గ్రామంలోని బందువుల ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం నాగులచవితి నాడు గెడ్డ–సముద్రం కలిసే ప్రాంతంలో అప్పలరాజు విగతజీవిగా కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతుడికి అన్న, తమ్ముడు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చోడిపల్లి గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ఫోసిస్కు 117 మంది ఎంపిక
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 117 మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఓడీలు, అధ్యాపకుల కృషి, విద్యార్థుల శ్రమ కారణంగా మంచి ఉద్యోగాలు సాధిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ హెచ్ఓడీ ఎం.సంతోష్కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెచ్ఓడీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తల్లికి అంత్యక్రియలు చేసిన తనయ సోంపేట: తల్లికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించిన ఘటన సోంపేట మండలం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి పార్వతి (46) అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె భర్త భాస్కరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కుమారుడు మానసిక రోగి. దీంతో కుమార్తె గౌరి పుట్టెడు దుఃఖంతోనే తల్లికి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
ఆదిత్యున్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జిలు
అరసవల్లి/గార: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ గేదెల తుహీన్కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులంతా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. న్యాయమూర్తులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సాందీప్శర్మ, ఇప్పిలి షణ్ముఖశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో జరిగిన కార్యక్రమంలో ఈఓ కోట నరసింహనాయుడు, అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల తనిఖీ పాతపట్నం: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో శాతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఎయిమ్స్ వైద్యుడు మహమ్మద్ షాజాద్ మాట్లాడుతూ కౌమార దశలో వచ్చే శారీరక, మానసిక మార్పులు, వాటి ప్రభావం వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాత్రూమ్లో నాగుపాము మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టిలోని ఎగువవీధిలో ఈశ్వరరావు ఇంటి బాత్రూంలో శనివారం నాగుపాము కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ముందు భయపడినప్పటికీ నాగుల చవితి నాడు దర్శనమివ్వడంతో పాలు పెట్టి పూజలు చేశారు. -
బాలికల గురుకులాల్లో పురుషుల నియామకం వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాలికలు చదువుతున్న గురుకులాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా పురుష ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించిందని, వారిని వెంటనే గురుకులాల నుంచి రిలీవ్ చేయాలని దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు నేపథ్యంలో ఇలాంటి నియామకాలు చేపట్టడం తగదన్నారు. జువైనల్ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా గురుకులాల్లో డీఎస్సీ ద్వారా పురుష ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్న గురుకులాల సొసైటీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు, అంబేద్కర్ యూనివర్సిటీ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టి.రమణ, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, మాలమహానాడు జిల్లా నాయకులు ముచ్చ శ్యాంసుందర్, బి నర్సింహం పాల్గొన్నారు. -
బీల భూముల్లో.. మొగలి పరిమళాలు
కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం బీలప్రాంతంలో పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న మొగలిచెట్లు రైతులకు పెట్టుబడి లేని ఆదాయవనరుగా మారాయి. ఏడాదిలో ఆరు నెలలకు పైగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పండగలు, ఇతర సీజన్లో ఒక్కో పువ్వు రూ.40 నుంచి రూ.42 వరకు అమ్ముడుపోతుంటాయి. ఇక్కడి రైతులు వేకువజామునే చేతిలో దొనికత్తి పట్టుకుని వెళ్లి మొగలిపూల సేకరణలో నిమగ్నమవుతుంటారు. అదృష్టం కలిసివస్తే ఒక్కోవ్యక్తి రోజుకు 20 పువ్వుల వరకు దొరుకుతాయి. ప్రభుత్వపోరంబోకు భూమిలోనివైతే ఎవరైనా కోసుకోవచ్చు. అదే రైతు తన తోటలో మొగలిచెట్లు నాట్లు వేస్తే వాటిని సదరు రైతు మాత్రమే కోయాల్సి ఉంటుంది. ప్రత్నామ్నాయ పంటగా.. ఇటీవల కాలంలో రైతులు తమ భూముల్లో వరి, చోడి తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా మొగలిపంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాధారంగా కవిటి ఉద్దానం బీలలోని చిత్తడి నేలల్లో నీటి ఊ టలే పదునుగా మొగలి పంట వస్తోంది. ఇప్పటికే కొంతమంది రైతులు తమ భూముల్లో మొగలి డొంకల్ని పెంచుతున్నారు. వారి వద్ద నుంచి పంట కోసుకునేందుకు ఏడాదికి కొంత మొత్తం చెల్లించి కాంట్రాక్ట్ పొందుతారు. అలా రైతుల భూములు లీజుకు తీసుకున్న కొందరు ఇదే పంటపై మంచి ఆదాయం పొందుతున్నారు. స్వల్పవ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లి నాణ్యమైన మొగలి అంట్లను కూడా ఇక్క డికి తీసుకొస్తున్నారు. మన వద్ద లభించే మొగలి మొక్కల కన్నా ఒడిశా మొక్కల నుంచి వచ్చే పూల కు గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. వీరంతా ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. భలే ఆదాయం.. కపాసుకుద్థి రెవెన్యూలో రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో రెండు ఎకరాలలో వరిసాగు చేస్తున్నాం. మిగిలిన 30 సెంట్ల భూమిలో గట్టు చుట్టూ మొగలి మొక్కలు నాటాం. ఏడాది కి రూ.40,000 లీజుకు కుదుర్చుకోవడం ద్వారా మొగలిపంట నుంచి ఆదాయం వస్తోంది. – ఆరంగి శివాజీ, చిక్కాఫ్ సంస్థ ఎండీ, ముత్యాలపేట ఒడిశా నుంచి మొక్కలు.. కొబ్బరి, వరికి ప్రత్యామ్నాయంగా ఒడిశా వెళ్లి మొగలి అంట్లు తెచ్చినాటాను. బాగా ఎదిగేందుకు ఆవుపేడ మొదళ్లలో వేశాను. మొక్కలు చక్కగా పెరిగాయి. బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో మొగలిసాగు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. – బంజు పాపారావు, మొగలిసాగుదారు, కె.కపాసుకుద్ధి -
పట్టుకెళ్తూ.. పట్టుబడుతూ..!
గంజాయి రవాణాపై నిఘా పెట్టాం. సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించాం. ఈ విషయంలో సర్కిల్ పరిధిలో అన్ని పోలీస్స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. గంజాయి రవాణా తీవ్ర నేరం. ఈ విషయంలో ఎవరూ ట్రాప్లో పడొద్దు. జీవితాన్ని పాడు చేసుకోవద్దు. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –ఎన్.సన్యాసినాయుడు, సీఐ, పాతపట్నం హిరమండలం: సెప్టెంబర్ 4న కొజ్జిరియా జంక్షన్ వద్ద కవిటి పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒడిశాకు చెందిన సాగర్ బెహరా 21.30 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ●సెప్టెంబర్ 22న ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లో అజయ్ అనే వ్యక్తి 15 కిలోల గంజాయితో పట్టుబడ్డా డు. తమిళనాడుకు చెందిన విజయ్ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తమిళనాడుకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ●సెప్టెంబర్ 26న పలాస రైల్వేస్టేషన్లో తమిళనా డు రాష్ట్రం తూత్కుడికి చెందిన మారిష్ 14 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. రాయగడ ప్రాంతానికి చెందిన రాహుల్ వద్ద గంజాయి కొనుగోలు చేసి రవాణా క్రమంలో పలాస రైల్వేస్టేషన్లో దొరికిపోయాడు. ●ఈ నెల 8న పలాస రైల్వేస్టేషన్లో గంజాయి తరలిస్తున్న కర్ణాటకకు చెందిన సాకత్ ఆలీ పట్టుబడ్డా డు. బరంపురంలో గంజాయి కొనుగోలు చేసి తరలిస్తుండగా 3 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. ఒడిశాలో సాగవుతున్న గంజాయి మన జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ప్రధానంగా ఇచ్ఛాపురం, పలాస రైల్వేస్టేషన్ల వరకు బస్సులు, ఇతర వాహనాల ద్వారా గంజాయి తీసుకొస్తున్న అక్రమ రవాణాదారులు అక్కడి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతున్నారు. మొత్తానికి గంజాయి అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. గంజా యి మూలాలన్నీ ఒడిశా వైపే ఉన్నా రవాణాకు మన జిల్లానే వినియోగిస్తున్నారు. ఒడిశా నుంచి వచ్చిన వారి విషయంలో పోలీస్ నిఘా ఉంది. తనిఖీల్లో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారే పట్టుబడుతున్నారు. కొందరు నేరుగా ఒడిశాకు వెళ్లి సరుకు తీసుకెళ్లే క్రమంలో పట్టుబడతుండగా.. మరికొందరు రవాణాకు రూ.5 వేల వంతున కమీషన్ తీ సుకొని తరలిస్తూ పోలీసులకు దొరికిపోతున్నారు. ఒడిశా నుంచి అధికం.. జిల్లాకు ఆనుకొని ఎక్కువగా ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఒడిశాలో ని జయపురం, రాయగడ, గుడారి, గుణుపూర్, గుమ్మ, శరంగో, చంద్రగిరి, దిగపొండి, మోహన, ఆర్.ఉదయగిరి తదితర ప్రాంతాల్లో గంజాయి ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గంజా యి కొనుగోలు చేస్తున్నారు. అనంతరం జిల్లాలోని పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, నౌపడ, శ్రీకాకుళం రోడ్డు మీదుగా కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, తెలంగాణ, బీహార్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గంజాయి మాఫియాలో సామాన్యులే ఎక్కువ గా సమిధులుగా మారుతున్నారు. అమాయక గిరిజనులు, మహిళలు, విద్యార్థులు ఎక్కువగా పట్టుబడుతున్నారు. ఇటీవల పలాస రైల్వేస్టేషన్లో మహిళలు పట్టుబడ్డారు. వారు బీహార్లో హోటల్లో పనిచేసే వారు కావడం గమనార్హం. రూ.5 వేలు వరకూ కమీషన్ అందిస్తామని చెప్పడంతో వారంతా ఒడిశా నుంచి గంజాయి తెచ్చి పలాస రైల్వేస్టేషన్ నుంచి తరలించే క్రమంలో పట్టుబడ్డారు. మాఫియాకు కారణమైన అసలు సూత్రధారులు మాత్రం పట్టుబడటం లేదు. అవసరాలను, కుటుంబ పరిస్థితులను ఎరగా వేసుకొని ముగ్గులోకి దించుతూ బంగారు భవిష్యత్ను పాడుచేస్తున్నారు. -
బీజేపీ ఎమ్మెల్యేతో నాకు ప్రాణహాని
రణస్థలం: ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావుతో తనకు ప్రాణహాని ఉందని రణస్థలం మండలం బంటుపల్లిలో పాశపు శ్రీనివాసరావు అనే టీడీపీ కార్యకర్త ఆందోళన వ్యక్తం చేశారు. తన భూమిని లాక్కునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. బంటుపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 26/9లో 3.71 ఎకరాల భూమిపై తన కుటుంబం, కొరిపిల్లి రాధాకుమారి కుటుంబాల మధ్య వివాదం ఉండగా, ఈ సమస్య ఇప్పటికే న్యాయస్థానంలో ఉందన్నారు. భూమిలో ఉన్న జీడి, టేకు చెట్లను పొందూరు మండలంలోని బొట్లపేటకు చెందిన గురాల సుమంత్, రణస్థలం మండలంలోని యాగాటిపాలేనికి చెందిన కొరిపల్లి రాధాకుమారి, కొరిపల్లి శ్రీనివాసరావు, కొరిపల్లి వీరబాబులు 15 రోజుల కిందట దౌర్జన్యంగా నరికివేశారని తెలిపారు. ఈ నెల 13న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు చెట్ల నరికివేతను నిలిపివేసినప్పటికీ, మళ్లీ గురువారం చెట్లను నరికి కలప తరలించుకుపోయారన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే తన భూమిని కబ్జా చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని, అందుకు పోలీసులు సహకరిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేతో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. చెట్లు కొట్టిన వ్యక్తికి, భూమికి ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై గురాల సుమంత్ స్పందిస్తూ అగ్రిమెంట్ ప్రకారం ప్రస్తుతం భూమి తన ఆధీనంలో ఉందన్నారు. ఎమ్మెల్యేకు సంబంధం లేదని, తనకు అడ్డొస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. -
● ఏడు నెలలు క్రితం ఉపాధి కోసం అన్నతో పయనం ● సన్యాసిపుట్టుగలో విషాద ఛాయలు
జలుమూరు: కార్తిక మాసంలో శ్రీముఖలింగం రాలేని భక్తులకు వారి గోత్రనామాలు వాట్సాప్ ద్వారా తెలియజేస్తే ఉచితంగా పూజలు నిర్వహిస్తామని అనువంశక అర్చకులు నాయుడుగా రి రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. జన్మనక్షత్ర, గ్రహదోషాలు పోవడానికి ఉచిత పూజలు చేస్తామని, దీనికోసం ఎటువంటి రుసుం చెల్లించనవసరం లేదని పేర్కొన్నారు. ఆసక్తిగల భక్తు లు 9493577098 నంబర్కు వాట్సాప్ ద్వారా వివరాలు తెలియజేయాలని కోరారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నవంబర్ 14న జరి గే బాలల సంఘం రాష్ట్ర సమ్మేళనం విజయవంతం చేయాలని అఖిల భారత యువజన సమా ఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ కోరారు. ఈ మేరకు శ్రీకాకుళం క్రాంతిభవన్లో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ రోజురోజుకూ పెరుగుతోందన్నారు. పేరుకు చట్టాలు ఉన్నా యి తప్ప బాలకార్మికుల నియంత్రణ జరగడంలేదన్నారు. బాల్య వివాహాలు జరుగుతున్నా నియంత్రణ కరువైందన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్లు మాట్లాడుతూ నేటి సమాజంలో బాలలు గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును దూరం చేసుకుంటు న్న నేపథ్యంలో రాష్ట్ర యువజన సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘ నాయకులు గిరిబాబు, సురేష్, వెంకట రావు తదితరులు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం రూరల్: పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన కన్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలుసుకుని ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి విజయ్(21) ఉపాధి కోసం ఏడు నెలలు క్రితం తన అన్నయ్య బన్నీతో కలిసి అబుదాబి వెళ్లాడు. అన్నదమ్ములిద్దరూ అబుదాబిలోని ఎన్హెచ్ఎస్ కంపెనీ కన్స్ట్రక్షన్లో స్ట్రాచలర్ ఫిట్టర్గా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు తామంతా క్షేమంగా ఉన్నామంటూ తల్లిదండ్రులతో విజయ్ మాట్లాడాడు. ఇంతలో ఏమైందో ఏమో గానీ గురువారం ఉదయం పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు కుప్పకూలిపోయారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తెప్పించాలని ప్రభుత్వాన్ని కన్నీటిపర్యంతంగా వేడుకుంటున్నారు. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 6 సంవత్సరాల 3 నెలల సుదీర్ఘ కాలం సేవలందించడం సంతోషంగా ఉందని ఏసీబీ డీఎస్పీ వి.ఎస్.ఎస్.రమణమూర్తి అన్నారు. విశాఖపట్నం ఏసీబీ డీఎస్పీగా నియమిస్తూ ఉన్నతాధికారుల నుంచి బదిలీ ఉత్తర్వులు వచ్చాయన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి రిలీవ్ అయ్యానన్నారు. విజయనగరం ఏసీబీ డీఎస్పీ ఎన్.రమ్య శ్రీకాకుళం జిల్లాకు ఇన్చార్జి ఏసీబీ డీఎస్పీగా కొనసాగనున్నారని తెలిపారు. జిల్లా ప్రజలు సౌమ్యులని పేర్కొన్నారు, టెక్కలిలో రూ.4 లక్షలతో తహసీల్దారును పట్టుకోవడం, రాజాం కొత్తూరులో అగ్రికల్చర్ అసిస్టెంట్ను పట్టుకోవడం, విజయవాడలో రూ.25 లక్షలతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్ను పట్టుకోవడం మర్చిపోలేనివన్నారు. ఎన్నికల సమయంలో సిట్ టీమ్లో కీలక సభ్యునిగా ఉన్నానని పేర్కొన్నారు. రణస్థలం: మండల కేంద్రం రణస్థలంలోని కొత్త పెట్రోల్ బంకు సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో రెండు వాహనాలూ బోల్తాపడ్డాయి. ఆటోలో ఎవరూ లేకపోవడం డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లారీ క్యాబిన్లో క్లీనర్ ఇరుక్కుపోయాడు. స్థానికులు గంట సేపు శ్రమించి జేసీబీ సాయంతో లారీని ఎత్తి క్లీనర్ను బయటకు తీశారు. ప్రమాద సమయంలో రోడ్డుపైనే వాహనాలు పడిపోవడంతో సుమారు కిలోమీటరు మేర ట్రాఫిక్ స్తంభించింది. -
బీల భూముల్లో.. మొగలి పరిమళాలు
● సిరులు కురిపిస్తున్న మొగలి పూలు ● ఒడిశా మొక్కలతో సాగు ● పెట్టుబడి లేని పంట కావడంతో ఆసక్తి చూపుతున్న రైతులు కవిటి: ఉద్దానం బీలప్రాంతంలో పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న మొగలిచెట్లు రైతులకు పెట్టుబడి లేని ఆదాయవనరుగా మారాయి. ఏడాదిలో ఆరు నెలలకు పైగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పండగలు, ఇతర సీజన్లో ఒక్కో పువ్వు రూ.40 నుంచి రూ.42 వరకు అమ్ముడుపోతుంటాయి. ఇక్కడి రైతులు వేకువజామునే చేతిలో దొనికత్తి పట్టుకుని వెళ్లి మొగలిపూల సేకరణలో నిమగ్నమవుతుంటారు. అదృష్టం కలిసివస్తే ఒక్కోవ్యక్తి రోజుకు 20 పువ్వుల వరకు దొరుకుతాయి. ప్రభుత్వపోరంబోకు భూమిలోనివైతే ఎవరైనా కోసుకోవచ్చు. అదే రైతు తన తోటలో మొగలిచెట్లు నాట్లు వేస్తే వాటిని సదరు రైతు మాత్రమే కోయాల్సి ఉంటుంది. ప్రత్నామ్నాయ పంటగా.. ఇటీవల కాలంలో రైతులు తమ భూముల్లో వరి, చోడి తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా మొగలిపంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాధారంగా కవిటి ఉద్దానం బీలలోని చిత్తడి నేలల్లో నీటి ఊ టలే పదునుగా మొగలి పంట వస్తోంది. ఇప్పటికే కొంతమంది రైతులు తమ భూముల్లో మొగలి డొంకల్ని పెంచుతున్నారు. వారి వద్ద నుంచి పంట కోసుకునేందుకు ఏడాదికి కొంత మొత్తం చెల్లించి కాంట్రాక్ట్ పొందుతారు. అలా రైతుల భూములు లీజుకు తీసుకున్న కొందరు ఇదే పంటపై మంచి ఆదాయం పొందుతున్నారు. స్వల్పవ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లి నాణ్యమైన మొగలి అంట్లను కూడా ఇక్క డికి తీసుకొస్తున్నారు. మన వద్ద లభించే మొగలి మొక్కల కన్నా ఒడిశా మొక్కల నుంచి వచ్చే పూల కు గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. వీరంతా ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. కపాసుకుద్థి రెవెన్యూలో రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో రెండు ఎకరాలలో వరిసాగు చేస్తున్నాం. మిగిలిన 30 సెంట్ల భూమిలో గట్టు చుట్టూ మొగలి మొక్కలు నాటాం. ఏడాది కి రూ.40,000 లీజుకు కుదుర్చుకోవడం ద్వారా మొగలిపంట నుంచి ఆదాయం వస్తోంది. – ఆరంగి శివాజీ, చిక్కాఫ్ సంస్థ ఎండీ, ముత్యాలపేట కొబ్బరి, వరికి ప్రత్యామ్నాయంగా ఒడిశా వెళ్లి మొగలి అంట్లు తెచ్చినాటాను. బాగా ఎదిగేందుకు ఆవుపేడ మొదళ్లలో వేశాను. మొక్కలు చక్కగా పెరిగాయి. బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో మొగలిసాగు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. – బంజు పాపారావు, మొగలిసాగుదారు, కె.కపాసుకుద్ధి -
స్కూల్గేమ్స్ అథ్లెటిక్స్లో పతకాల పంట
శ్రీకాకుళం న్యూకాలనీ: స్కూల్గేమ్స్ పోటీల్లో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించారు శ్రీకాకుళం జిల్లా అథ్లెట్స్. ఏలూరులోని డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గురుకులం కళాశాల మైదానంలో ఈనెల 21 నుంచి 23 వరకు జరిగిన ఏపీ రాష్ట్రస్థా యి స్కూల్గేమ్స్ అండర్–19 బాలబాలికల అథ్లెటి క్స్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో జిల్లా క్రీడాకారులు 34 పతకాలు సాధించారు. ఇందులో 14 బంగారు, 8 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి. బాలబాలికల చాంపియన్స్గా మనమే.. ఎస్జీఎఫ్ రాష్ట్ర అండర్–19 అథ్లెటిక్స్ పోటీల్లో బాలురుతోపాటు బాలికల రెండు విభాగాల్లోనూ చాంపియన్స్గా జిల్లా క్రీడాకారులు కావడం గమనార్హం. వ్యక్తిగత విభాగంలో కె.కృష్ణవేణి చాంపియన్గా నిలిచింది. జిల్లా క్రీడాకారుల బృందానికి కోచ్, మేనేజర్లగా ఇ.అప్పన్న, ఎం.నీలంనాయుడు, ఎం.సతీష్, బి.శ్రీనివాసరావు వ్యవహరించారు. క్రీడాకారులు రాణింపు పట్ల ఇంటర్ విద్య డీవీఈఓ ఆర్.సురేష్కుమార్, డీఈఓ ఎ.రవిబాబు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బి.వి.రమణ, మహిళా సెక్రటరీ ఆర్.స్వాతి, పీఈటీ సంఘ నాయకులు ఎం.వి.రమణ, పి.తవిటయ్య, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, నౌపడ విజయ్కుమార్, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, డీఎస్డీఓ డాక్టర్ శ్రీధర్రావు తదితరులు హర్షం వ్యక్తంచేశారు. -
అంధులకు ఏఐ టెక్నాలజీ కళ్లద్దాలు
శ్రీకాకుళం రూరల్: రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అంధుల కోసం ఏఐ టెక్నాలజీతో రూపొందించిన కళ్లద్దాలను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతుల మీదుగా గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేఎఫ్ఆర్సీ ఆర్గనైజేషన్ అఛలా హెల్త్ సర్వీస్ ఆర్థిక సహాయంతో జెమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అంధులకు కళ్లద్దాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ కళ్లద్దాలు ఖరీదుతో కూడుకున్నవి అయినప్పటికీ కేంద్ర రాష్ట్రాల ద్వారా వచ్చే ఫండ్స్ నుంచి కొనుగోలు చేసేలా తక్కువ ధరకు అందించేందుకు సహకరిస్తామన్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ జెమ్స్ ఆసుపత్రి పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోందన్నారు. జెమ్స్ ఆస్పత్రి ఫౌండర్ బొల్లినేని భాస్కరరావు మాట్లాడు తూ ఏఐ టెక్నాలజీ కళ్లద్దాల వల్ల అంధులమనే భావన వారిలో తొలగిపోతుందన్నారు. కార్యక్ర మంలో కేఎఫ్ఆర్సీ చైర్మన్ డాక్టర్ వి.భుజంగరావు, అఛలా హెల్త్ సర్వీస్ సీఈఓ రాజేష్రాజు, కళాశాల డీన్ డాక్టర్ లక్ష్మీలలిత, వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ అశోక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
15 క్వింటాళ్ల మొక్కజొన్న పిక్కలు చోరీ
కొత్తూరు : కర్లెమ్మ పంచాయతీ బడిగాం గ్రామ సమీపంలో మర్రిపాడు రోడ్డుకు ఆనుకొని ఆరబెట్టేందుకు ఉంచిన సుమారు 15 క్వింటాళ్ల మొక్కజొన్న పిక్కలను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ మేరకు కొత్తూరుకు చెందిన బాధిత రైతు పెద్దకోట ఆనందరావు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 31న జాతీయ సమైక్యత యాత్ర ఎచ్చెర్ల : దేశ ఉపప్రధాని, భారత్ ఐక్యతకు ఎనలేని కృషి జరిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన క్రీడా వ్యవహరాల మంత్రిత్వ శాఖ, మేరా భారత్ జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) జిల్లా శాఖలు సంయుక్తంగా ఈ నెల 31న శ్రీకాకుళంలో జాతీయ సమైక్యత యాత్ర నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్శిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజిని గురువారం తన చాంబర్లో ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 31 నుంచి నవంబర్ 25 వరకు విద్యార్థులను, యువతను భాగస్వామ్యం చేసి వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అంబేడ్కర్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, మేరా భారత్ జిల్లా సహాయ సంచాలకులు కె.వి.ఉజ్వల్, వర్శిటీ కళాశాలల ప్రిన్సిపాళ్లు డా.ఎస్.ఉదయభాస్కర్, ఎం.అనురాధ, ఎస్ఓ కె.సామ్రాజ్యలక్ష్మి, ఎన్ఎస్ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ డి.వనజ, అకడమిక్ అఫైర్స్ డీన్ కె.స్వప్నవాహిని పాల్గొన్నారు. -
బంగారం ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా
గార: అప్పుతో సహా వడ్డీ చెల్లిస్తానని చెప్పినా తాను తాకట్టు పెట్టిన బంగారం ఇవ్వడం లేదంటూ గార మండలం బందరువానిపేటకు చెందిన మైలపల్లి పద్మశ్రీ అనే వివాహిత గురువారం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన పొట్నూరు కూర్మారావు ఇంటి వద్ద నిరసన చేపట్టింది. తన కుమారుడితో కలిసి పురుగుమందు డబ్బా పట్టుకొని న్యాయం జరగకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడంతో కలకలం రేగింది. 2022లో స్థానిక ఏపీజీవీబీలో 22 తులాలు బంగారం తాకట్టు ఉందని, డబ్బులిస్తే బంగారం విడిపిస్తానని చెప్పడంతో కూర్మారావు డబ్బులిచ్చారని, ఆ సమయంలో బ్యాంకు నుంచి విడిపించి కూర్మారావు దగ్గర బంగారం తాకట్టు పెట్టానని పద్మశ్రీ చెప్పింది. ఆ బంగారం విడిపించేందుకు రెండు రోజుల క్రితం వెళ్లగా డబ్బులెక్కువ లెక్క చెప్పారని, పెద్దలకు చెప్పినా న్యాయం జరగకపోవడంతో నిరసన చేపట్టాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయమై ఎస్ఐ సీహెచ్.గంగరాజు వద్ద ప్రస్తావించగా తమకు ఫిర్యాదు రాలేదని చెప్పారు. -
అత్తింటి ఎదుట కోడలి న్యాయదీక్ష
వజ్రపుకొత్తూరు రూరల్ : అత్తామామలు ఇంట్లోకి రానివ్వడం లేదంటూ కోడలు న్యాయదీక్షకు దిగిన ఘటన వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు చెప్పిన వివరాలు మేరకు. అక్కుపల్లి గ్రామానికి చెందిన యంపళ్ల అనూషకు అదే గ్రామానికి చెందిన మడ్డు సుధీర్తో 2022లో వివాహం జరిగింది. ఇద్దరూ సాప్ట్వేర్ ఉద్యోగులు కావడంలో బెంగళూరులో కాపురం పెట్టారు. వీరికి 10 నెలల చిన్నారి ఉంది. అనూష ప్రస్తుతం కన్నవారి ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 21న అత్తవారింటికి పాపతో కలిసి వచ్చిన అనూషను ఇంట్లోకి అనుమతించకుండా అత్తమామలు అడ్డుకున్నారు. అప్పటికి ఇంట్లోనే భర్త సుధీర్ కూడా ముఖం చాటేశాడు. అయితే నీ భర్త ఇంట్లో లేడని, బెంగళూరులో ఉన్నాడంటూ బదులిస్తూ ఇంట్లోకి రానివ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తమకు జరిగిన అన్యాయం కోసం బాధితురాలు డయల్ 100కు కాల్ చేయడంతో స్థానిక పోలీసులు సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయింది. దీంతో తప్పని పరిస్థితిలో మూడు రోజులుగా భర్త ఇంటి ముందు న్యాయ దీక్షకు బాధితురాలు పూనుకుంది. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో గురువారం ఘటన స్థలానికి చేరుకొని బాధితరాలికి మద్దతుగా నిలిచారు. అత్తమామలకు సర్దిచెప్పడంతో తాత్కాలికంగా ఇంట్లోకి అనుమతించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. -
‘మెడికల్ సీట్లు అమ్ముకోవడానికే ప్రైవేటీకరణ’
టెక్కలి: కాలేజీలను ప్రైవేటీకరించి మెడికల్ సీట్లు అమ్ముకోవడానికి సీఎం చంద్రబాబు పన్నాగం పన్నుతున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి, దంత, సరియాపల్లి గ్రామాల్లో నియోజకవర్గ ఇన్చార్జి పేరా డ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన రచ్చబండ–కోటిసంతకాల సేకరణ కార్యక్రమంలో ముఖ్య అతి థిగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్రంలో వైద్యం పరిస్థితి దయనీయంగా మార్చేశారని, ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేశారని తమ్మినేని దుయ్యబట్టారు. కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని, ఆధారాలతో సహా పట్టుబడినప్పటికీ వారిని అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా 75 వేల బెల్టు దుకాణాలతో గ్రామాల్లో కుటుంబాలను నాశనం చేస్తున్నారని, ఇలాంటి ప్రభుత్వానికి మహిళలే గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు. -
ఏడు రోజుల పాటు రథసప్తమి మహోత్సవాలు
అరసవల్లి: వచ్చే ఏడాది జనవరి 25 నుంచి రథసప్తమి మహోత్సవాలను ఏడు రోజుల పాటు ‘శ్రీకాకుళం ఉత్సవ్’ పేరిట నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. గురువారం సాయంత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయ ప్రగతిపై ఆయన ఆలయ అధికారులు, జిల్లా అధికారుల సమక్షంలో సమీక్షించారు. ‘ప్రసాద్’ స్కీమ్ నిధుల మంజూరు అంశం మరింత ఆలస్యమవుతోందని, ఈలోగా ఆదిత్యాలయ నిధులు రూ.12 కోట్ల తో అభివృద్ధి పనులు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీపై టెండర్ నిబంధనల ప్రకారం వెంటనే ఆమోదించాలని, అలాగే ఇంతవరకు విధులు నిర్వర్తించిన సిబ్బందికి జీతాలు చెల్లించాలని ఆదేశించారు. అనంతరం ఆలయానికి భవిష్యత్ అవసరాల దృష్ట్యా చుట్టుప్రక్కల పరిసరాల స్థలాలను ఆలయ నిధులతో కొనుగోలు చేయడమో లేదా, అవసరమైతే ప్రత్యామ్నాయంగా ఇతర చోట్ల ఉన్న ఆలయ స్థలాలను వారికి అప్పగించడమో చేయాలని ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్కు సూచించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో సాయి ప్రత్యూష, ఎస్ఈ డాక్టర్ పొగిరి సుగుణాకరరావు తదితరులు పాల్గొన్నారు. -
అపూర్వ ఆదరణ
● మెడికల్ కాలేజీలు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకోవడం దారుణం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పోస్టర్ ఆవిష్కరణలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తదితరులుశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): పేదవారి కోసం వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే వాటిని అమ్మి సొ మ్ము చేసుకోవాలనుకోవడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో పేదల కోసం ఆలోచన చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదని గుర్తు చేశారు. తన తాబేదారులకు మెడికల్ కాలేజీలు అప్పగించి జేబులు నింపుకోవాలనే ఆలోచన పక్కన పెట్టాలని హితవు పలికారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 28న నిర్వహించనున్న కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతూ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని పేర్కొన్నారు. ఓ ఉద్యమంలా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. ఈ నెల 28 లోపు కోటి సంతకాలు పూర్తి చేసి గవర్నర్ను కలిసి పరిస్థితి వివరిస్తామన్నారు. ప్రజాఉద్యమం బలపడి ప్రైవేటీకరణ ఆగే వరకు పోరాడుతామని తెలిపారు. చంద్రబాబు వైఫల్యాల్ని అందరికీ తెలియజేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కాళింగకుల, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణ రావు, అంబటి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యద ర్శి కేవీజీ సత్యన్నారాయణ, కరిమి రాజేశ్వరరా వు, శాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, రాష్ట్రకార్యవర్గసభ్యు లు గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, జి ల్లాపార్టీ ఉపాధ్యక్షురాలు ఎంవీ పద్మావతి, యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనంజయరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, మహిళావిభాగం రాష్ట్ర కార్యదర్శి కొర్ల శిరీష, గ్రీవెన్స్ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృధ్వి, గొండు రఘురాం, సాధు వైకుంఠరావు, గుండ భాస్కర్, లుకలాపు గోవిందరావు, వజ్జ వెంకటసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
●భారీ వర్షాలకు అవకాశం
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో జల్లులు పడుతున్నాయి. వీటి ప్రభావం మరో రోజు వరకు ఉంటుందని వాతావారణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో రాబో యే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం పేర్కొంది. ఈ మేర కు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అఽధికారులను ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రైతులు అంతా అప్రమత్తంగా ఉండి పంటలను వీలున్నంత సురక్షిత ప్రాంతాలలో భద్రపరుచుకోవాలని పేర్కొన్నారు. –శ్రీకాకుళం పాతబస్టాండ్ -
శ్రీకాకుళం
పట్టుకెళ్తూ.. పట్టుబడుతూజిల్లా మీదుగా అక్రమంగా గంజాయి రవాణా జరుగుతోంది. అసలు సూత్రధారులు దొరకడం లేదు. –10లోసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కంచిలి మండలంలో దీపావళి బాంబు పేలింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాల నుంచి ముడుపులు తీసుకోవడమే కాకుండా.. ఫిర్యాదులు వెళ్లాయని మందుగుండు సామగ్రి సీజ్ చేశారని పోలీసులపై వ్యాపారులు భగ్గమంటున్నారు. దీనికి సంబంధించి వ్యాపారుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో బయటకు వచ్చింది. ఇప్పుడీ ఆడియో సంభాషణలు చర్చనీయాంశమవుతున్నాయి. ఆ ఆడియో సంభాషణల్లో ఉన్న వివరాల ప్రకారం.. షాపునకు రూ.58 వేలు..! కంచిలి మండలంలో నాలుగు బాణసంచా దుకాణాలకు అనుమతి ఇచ్చారు. కంచిలిలో ఒకటి, అంపురంలో ఒకటి, జాడుపుడిలో రెండు దుకాణాలు ఏర్పాటు చేశారు. కానీ షాపులు నుంచి ముడుపుల విషయంలో ఆ తర్వాత సంప్రదింపులు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఒక్కో షాపు నుంచి రూ.70వేలు అడిగినట్టు, ఆ తర్వాత రూ. 58 వేలకు ఒప్పందం కుదిరినట్టు, దాని ప్రకారం షాపుల నుంచి చెల్లింపులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతలో అక్కడ జరిగిన ముడుపుల బాగోతంపై ఓ వ్యక్తి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని ఏ షాపులైతే ముడుపులు ఇచ్చాయో వాటిపైనే తనిఖీలు చేసి, పరిమితికి మించి మందుగుండు సామగ్రి ఉందని, విక్రయించారని చెప్పి పెద్ద ఎత్తున సామగ్రిని సీజ్ చేసినట్టుగా తెలిసింది. దీంతో ఆ వ్యాపారులకు మండింది. ఒకవైపు ముడుపులు తీసుకుని, మరోవైపు సీజ్ చేస్తారా? అని ఓ పోలీసు అధికారి వైఖరిపై ఆవేదనకు లోనయ్యారు. ఇంతలో అధికార పార్టీకి చెందిన ఒక వ్యాపారి దుకాణం వద్ద ఒక పోలీసు అధికారి పెద్ద ఎత్తున హడావుడి చేయడమే కాకుండా వచ్చే కొనుగోలుదారులను ఇబ్బంది పెడుతున్నారని స్పాట్లోనే ఏకంగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు తలంటినట్టుగా వ్యాపారులు చర్చించుకున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే జోక్యం చేసుకోవడంతో వ్యవహారం బెడిసికొట్టింది. మా వాళ్లను కూడా ఇబ్బంది పెడతారా? అని ఆ ఎమ్మెల్యే సీరియస్ కావడంతో పోలీసులు డిఫెన్స్లో పడిపోయారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. -
ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు
ఆకలి అని చెప్పడం తప్ప అయిన వారి గురించి చెప్పడం ఆమెకు తెలీదు. పద్మ, బోడెమ్మ, కరువమ్మ అని పిల్లల్ని పిలవడం తప్ప చిరునామా చెప్పేంత తెలివి ఆమెకు లేదు. స్నానపానాదుల పట్టింపు అసలే లేదు. మట్టి కలిసిన మెతుకులైనా మహా ప్రసాదంగా తీసుకోవడమే తెలుసు. స్థానికులు కనికరిస్తే ఆ పూట కడుపు నిండుతుంది. లేదంటే ఎండిన డొక్కల వెక్కిరింపులు తప్పవు. చల్లవానిపేటలో మూడేళ్లుగా కనిపిస్తున్న ఓ తల్లి ముగ్గురు బిడ్డల కథ ఇది. జలుమూరు: మూడేళ్ల కిందట చల్లవానిపేటకు ఓ తల్లి తన బిడ్డలతో వచ్చింది. అప్పటి నుంచి ఆ చెత్త కుప్పలే ప్రపంచంగా బతుకుతోంది. చెత్త సేకరణ కేంద్రంలోనే తల దాచుకుంటోంది. ఒక రోజు మాది బుడితి దగ్గర బద్రి గ్రామం అని చెబుతారామె. మరోరోజు మా ఊరు సుబ్రహ్మణ్యపురం అంటా రు. ఇంకోరోజు నేను ఈదులవలస నుంచి వచ్చానంటారు. మాటలో స్థిమితం లేదు. చేతల్లోనూ స్థిరత్వం లేదు. కట్టుకున్న వారు ఎవరో, కన్నవారు ఎవరో కూడా ఆమె చెప్పలేకపోతున్నారు. రోజంతా ఎటో తిరగడం పొద్దుపోయే వేళకు ఈ చెత్త కుప్పల మధ్యకు చేరుకోవడం, స్థానికులు ఏదైనా పెడితే తినడం, లేదంటే పస్తులుండడం ఆమె దినచర్య. మూడేళ్లుగా స్థానికులకు కనిపిస్తున్న దృశ్యాలివే. పిల్లల పేర్లు మాత్రం పద్మ, బోడెమ్మ, కరువ మ్మ అని చెబుతున్నారు. తల్లి పేరు లక్ష్మి అని కూడా చెబుతున్నారు. ఈ తల్లీబిడ్డల వద్ద ఎలాంటి వస్తువులు ఉండవు. కేవలం చేతి సంచీ, అందులో కొన్ని దుస్తులు మాత్రమే కనిపిస్తున్నాయి. రేషన్ కార్డు, ఆధార్ వంటి గుర్తింపు కార్డులేవీ లేవు. రెండేళ్ల కిందట ఈమె గర్భిణిగా ఉన్న సమయంలో పురిటి నొప్పులు వస్తే స్థానిక ఆశా కార్యకర్త నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించినట్లు సమాచారం. పాపం చిన్నారులు.. ఈ తల్లికి ముగ్గురూ ఆడ పిల్లలే. ముగ్గురూ ఏడేళ్ల వయసు లోపు వారే. ఎవరైనా ఏదైనా ఇస్తే తినడం, లేదంటే పరధ్యానంగా ఎటో చూస్తూ కూర్చోవ డం చేస్తుంటారు. వర్షం పడితే చాలు రోడ్డు మీద ప్రవహించే నీటిలో స్నానాలు చేస్తారు. అటుగా వెళ్తున్న వారు చూసి పాపం అంటూ నిట్టూర్చడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. స్థానిక సర్పంచ్ పంచిరెడ్డి రామచంద్రరావు చొరవ తీసుకుని రోజూ ఉదయం పూట టిఫిన్ పెట్టి వారి కష్ట సుఖాలు అడుగుతుంటారు. అలాగే సీడీపీఓ వంశీప్రియకు సమాచారం ఇచ్చానని తెలిపారు. దీనిపై సీడీపీఓ వంశీ ప్రియ మాట్లాడుతూ సమాచారం వచ్చిన వెంటనే వారు ఎక్కడ ఉంటారో అడ్రస్ ఆరా తీస్తున్నామని, దొరికిన వెంటనే పిల్లలను హోమ్కు తరలించి వారికి వసతి, చదువు తదితర ఏర్పాట్లు చేస్తామన్నారు. తల్లికి ఉన్నతాఽధికారులతో మా ట్లాడి అవసరమైన వైద్యం అందిస్తామన్నారు. -
బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి
● అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఉండడం లేదు ● సైబర్ నేరాల్లో పురోగతి లేదు ● డీఐజీ గోపీనాథ్ జెట్టి శ్రీకాకుళం క్రైమ్ : గ్రామాల్లో, విద్యా సంస్థల్లో ఎంతగా అవగాహన కల్పిస్తున్నా బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపీనాథ్ జెట్టి అన్నారు. తెలిసిన వారే ఈ అకృత్యాలకు పాల్పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని రెండో పట్టణ పీఎస్, సబ్డివిజనల్ కార్యాలయం, ట్రాఫిక్ పీఎస్లే కాక లావేరు పీఎస్లను ఆయన గురువారం తనిఖీ చేశా రు. గంజాయి కేసుల్లో ప్రధాన మూలాలను గుర్తించి చెక్పోస్టుల పనితీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అనంతరం రెండో పట్టణ పీఎస్లో విలేకరులతో మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ మత్తులో బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు రేంజ్ పరిధిలో జరగలేదని స్పష్టం చేశారు. ఫేక్ ఐడీ, ప్రొఫెల్ క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారా లు చేస్తున్నవారిపై కఠిన చర్యలుంటాయని, సైబర్ నేరాల కేసులు తక్కువని, ఫ్రాడ్స్ ఎక్కువవుతున్నా యని, పురోగతి లేదన్న వాస్తవం నిజమని డీఐజీ అన్నారు. ఫేక్ వాట్సాప్, ఇతర మాధ్యమాల్లో మెసేజ్ల పట్ల ఆకర్షితులై ఓటీపీలు చెప్పి మోసపోతున్నారని, ఎలాంటి మెయిల్స్కు స్పందించకుండా ప్రజ లు అప్రమత్తతతో మోసాలను తిప్పికొట్టాలన్నారు. నక్సల్స్ ప్రభావం తక్కువే.. రేంజ్ పరిధిలో నక్సల్స్ ప్రభావం తక్కువేనని, ఎవరైనా ఉద్యమాల్లో ఉంటే ఇప్పటికే లొంగిపోవా లని పిలుపునిచ్చామన్నారు. జిల్లాకు చెందిన మా వోయిస్టు నేత దున్న కేశవ్ జనజీవన స్రవంతిలో కలిసిపోయినా ఒడిశా పోలీసులు 2011లో విచార ణ పేరిట పిలిచి జైలులో ఉంచి విచారణలో పురో గతి లేకుండా ఒకదాని వెంట ఒకటి కేసులపేరుతో జైలులోనే మగ్గిపోయేలా చేస్తున్నారని, ఇటీవలే ఎనిమిది రోజులుగా ఆమరణ దీక్ష సైతం అదే జైలు లో చేశారని విలేకరులు డీఐజీ వద్ద ప్రస్తావించారు. కేసుల వివరాలు ప్రభుత్వం అడిగిందని, అదంతా కోర్టు పరిధిలో ఉందని డీఐజీ అన్నారు. కేశవ్పై 16 ఏపీలో, ఒడిశాలో 36 కేసులున్నట్లు సమాచారం. రెండో పట్టణ పీఎస్ పరిధిలో ప్రాపర్టీ నేరాల్లో పురోగతి లేకపోవడంతో స్టేషన్ ఎస్హెచ్ఓకు కొంత సమయం ఇచ్చి క్లియర్ చేయాలని సూచించామన్నారు. డీఐజీ వచ్చిన రోజే.. హిరమండలంలోని ఓ ప్రైవేటు స్కూల్కు సంబంధించిన వ్యక్తే విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో 100కు డయల్ చేసి ఫిర్యాదు ఇచ్చారు. హుటాహుటిన టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు, కొత్తూరు సీఐ ప్రసాద్ ఘటనాస్థలికి వెళ్లారు. నిందితునిపై పోక్సో నమోదైనట్లు అక్కడ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. -
పేదలకు ఉచిత వైద్యం
● ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ నిర్ణయం ● కోటి సంతకాల సేకరణలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రైవేటీకరణ అడ్డుకుంటేనేశ్రీకాకుళం రూరల్: ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల తీర్పే అంతిమ నిర్ణయమని, ఇలాంటి తీర్పుతోనే వైద్య విద్య ప్రైవేటీకరణను అడ్డుకుందామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. పెదపాడులోని నియోజకవర్గ (ధర్మాన క్యాంప్) కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి జనార్దన్రావు అధ్యక్షతన నియోజకవర్గ సమావేశం, కోటి సంతకాల సేకరణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో చేపట్టనున్న కోటి సంతకాల సేకరణకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలన్నారు. 60 వేలు సంతకాలు చేయించే దిశగా ప్రతిఒక్కరూ సమాయత్తం కావాలన్నారు. కోటరీ కోసమే పీపీపీ సీఎం చంద్రబాబు వ్యక్తిగత స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని, తన కోటరీ నాయకులకు పీపీపీ విధానాన్ని కట్టబెట్టేందుకు చట్టం చేయడం, దాన్ని అమలు చేయడం వంటి అనైతిక చర్యలకు పూనకుంటున్నారని ధర్మాన మండిపడ్డారు. పీపీపీ విధానంతో పేదలు నష్టపోతారని, అటువంటి వారి పిల్లలు వైద్య విద్యను అభ్యసించడం కలగా మిగిలిపోతుందన్నారు. ఈ నేపథ్యంలో కోటి సంతకాలతో ప్రజలను చైతన్యపరచాలన్నారు. ప్రభుత్వ వైద్యం, విద్యను ప్రైవేట్పరం చేస్తే భవిష్యత్తరం పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రకరకాల కులాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. తారస్థాయికి వ్యతిరేకత.. రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై వ్యతిరేకత తారస్థాయికి చేరిందని ధర్మాన పేర్కొన్నారు. చంద్రబాబు తన వక్రబుద్ధిని పేదప్రజలపై చూపిస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని బైరి, అలికాం, నైరా, కుందువానిపేట గ్రామాల్లో పెన్షన్కు అర్హత సాధించిన పింఛన్ అందకుండా అడ్డుపడటం సిగ్గుచేటన్నారు. నాలుగు మెతుకులు పేదవాడి నోటికి వెళ్లాలంటే పెన్షనే ఆధారమని గుర్తు చేశారు. పీపీపీ ద్వారా పేదవాడికి వైద్యవిద్యను దూరం చేస్తున్న టీడీపీ కుటిల కుట్రలు, కక్షపూరిత రాజకీయాలను బయటపెట్టేందుకు కోటి సంతకాలు సేకరణ చేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని ధర్మాన వివరించారు. ● యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్నాయుడు మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు కలిసి ఈ నెల 24న కోటి సంతకాల సేకరణ డివిజన్లు, గ్రామాల వారీగా సేకరించాలన్నారు.28న పార్టీ ఆదేశాల మేరకు ర్యాలీలు, నిరసనలు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, కళింగవైశ్యకుల, తూర్పుకాపు, వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, అంబటి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా శ్రీను, గొండు కృష్ణమూర్తి, పార్టీ సీనియర్ నాయకులు ఎం.వి.పద్మావతి, సాధు వైకుంఠరావు, ఎన్ని ధనుంజయ, మార్పు పృథ్వీ, గొండు రఘురామ్, మూకళ్ల తాతబాబు, చల్లా రవికుమార్, రౌతు శంకరావు, పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, కామేశ్వరి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు -
బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటీకరణ
● మెడికల్ కళాశాలల కోసం కలిసికట్టుగా ఉద్యమించాలి ● కోటి సంతకాల సేకరణలో మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మాజీ స్పీకర్ సీతారాం, మాజీ మంత్రి అప్పలరాజు వజ్రపుకొత్తూరు/మందస : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకించాలని, అందుకూ ప్రతిఒక్కరూ ఉద్యమించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. బుధవారం మందస మండలం హొన్నాళిలో సర్పంచ్ త్రినాథ్ గౌడు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రతిపేదవాడికీ వైద్యం అందాలన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పం సాకారం అవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు తన బినామీలకు, పెత్తందారులకు కట్టబెట్టేందుకు పూనుకున్నారని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ ఈ నెల 28న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టబోయే భారీ ర్యాలీల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ● మాజీ స్పీకర్, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేద విద్యార్థులు సీట్లు కోల్పోయే ప్రమాదముందన్నారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి 40 శాతం రాయితీ ఉందని, అవి పూర్తి కావాలంటే రూ.3వేల కోట్లు సరిపోతాయని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ రూ.4800 కోట్లు బకాయిపడ్డారని చెప్పారు. ● మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ప్రతిఒక్కరికీ తమ పిల్లలను డాక్టర్లు, ఇంజినీర్లను చేయాలన్న ఆలోచన ఉంటుందని, అయితే రాష్ట్రంలో అందుకు తగ్గ సీట్లు లేవని చెప్పారు. 1995 తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాల కూడా తేలేదన్నారు. 2004లో వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక శ్రీకాకుళంలోని బలగ ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ఆవశ్యకత చెబితే దేశంలో ఎక్కడా లేని విధంగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, అందులో ఐదు పూర్తి చేశారని, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. పేదల ఆస్తులను అమ్మేందుకు చంద్రబాబు పూనుకున్నారని, అందులో భాగంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని మండిపడ్డారు. దీనికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దుంపల లక్ష్మణరావు, మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, మండల పార్టీ అధ్యక్షుడు దల్లి జానకిరెడ్డి, ఉపాధ్యక్షుడు పీతాంబరం, జెడ్పీటీసీ సవర చంద్రమ్మ, మాజీ జెడ్పీటీసీ అందాల శేషగిరి, జిల్లా కార్యదర్శి అగ్గున్న సూరి, వైస్ ఎంపీపీలు సీర ప్రసాద్, ఆదినారాయణ, నియోజకవర్గ ఐటీ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్, యువజన అధ్యక్షుడు దున్న హరికృష్ణ, డాక్టర్స్ విభాగం అధ్యక్షుడు మట్ట జయరాం, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, రాపాక శేషగిరిరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు దివ్య, చింతాడ గణపతి, కిషోర్, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి జీవన్, యువనేత హేమరాజు, సోషల్ మీడియా కన్వీనర్ రామారావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రూ. 2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక
పొందూరు: జిల్లాలో డ్వాక్రా గ్రూపు సంఘాలకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,928.90 కోట్లతో సూక్ష్మరుణ ప్రణాళిక రూపొందించినట్లు డీఆర్డీఏ పీడీ పి.కిరణ్కుమార్ తెలిపారు. సూక్ష్మరుణ ప్రణాళిక లక్ష్యంపై వీవోలు, సీఎస్లు, సీసీలతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా ఇప్పటికే రూ.2,356 కోట్లు రుణాలు మంజూరు చేయించినట్లు తెలిపారు. సమీక్షలో డీపీఎం మోహనరావు, ఏపీఎంలు జి.శ్యామలరావు, రామ్మూర్తి, సీసీలు, సీఎఫ్లు పాల్గొన్నారు. పాలకొండకు బస్సుల్లేవ్! శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో బుధవారం సాయంత్రం గందరగోళం నెలకొంది. పాలకొండకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు, ప్రయాణికులు గంటల తరబడి వేచి చూశారు. చీకటిపడినా బస్సులు రాకపోవడంతో పడిగాపులు కాశారు. కొత్తరోడ్– రాగోలు మధ్య చిన్న వంతెన వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా బస్సులన్నీ అక్కడే ఉండిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చాలాసేపటి తర్వాత మూడు బస్సులు ఒకేసారి రావడంతో అందరూ సీట్ల కోసం పరుగులు పెట్టారు. పనులు ప్రారంభించకపోతే రీ టెండర్లు శ్రీకాకుళం పాతబస్టాండ్: జల జీవన్ మిషన్ (జేజేఎం) కింద చేపట్టిన పనుల్లో అగ్రిమెంట్ సమయం పూర్తయినా, ఇంతవరకు ప్రారంభించని కాంట్రాక్టులను రద్దు చేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జేజేఎం పనులపై సమీక్ష నిర్వహించారు. వెంటనే పనులు ప్రారంభించకపోతే, ఆ కాంట్రాక్టులను రద్దు చేసి, రీ–టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఎంతమాత్రం సహించబోమని, ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు. జిల్లాలో 4,87,307 ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికీ 2,56,499 కనెక్షన్లు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరులోగా పనుల వేగాన్ని పెంచకపోతే, సంబంధిత అధికారులపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీపీఓ భారతి సౌజన్య, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా కార్తీక మాసోత్సవాలు
టెక్కలి: రావివలస ఎండల మల్లికార్జునస్వామి ఆలయ సన్నిధిలో కార్తీక మాసోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం ఆలయ ప్రాంగణంలో అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు సోమవారాలు జరగనున్న ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. సుమారు రూ.5 కోట్లతో మల్లన్న ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సమావేశంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, డీఎస్పీ డి.లక్ష్మణరావు, ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, తహసీల్దార్ బి.సత్యం, ఆలయ ఈఓ జి.గురునాధరావు, నాయకులు ఎల్.ఎల్.నాయుడు, బి.జగదీష్, కె.కిరణ్, ఎం.సుందరమ్మ, ఎం.దమయంతి పాల్గొన్నారు. -
నెట్వర్క్ ఆస్పత్రుల పోరాటం షురూ!
● పెండింగ్ బిల్లుల కోసం నేడు మహాధర్నా ● ఇప్పటికే 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ● జిల్లాలో 13 ఆస్పత్రులకు రూ.147 కోట్ల బకాయిలు అరసవల్లి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై 17 నెలల్లోనే ఓ స్పష్టత వచ్చేసింది.. ఏ వర్గాన్ని చూసినా నిరసనలు, ధర్నాల్లోనే కనిపిస్తున్నారు. పలు శాఖలకు చెందిన ప్రభుత్వ శాఖ ఉద్యోగులు, పీహెచ్సీ వైద్యులంతా కొద్ది రోజులుగా నిరసనలను చేపడుతుండగా.. తాజాగా ఆరోగ్యశ్రీ పథకం పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఏకంగా ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు ధర్నాలకు సమాయత్తమయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కీలకమైన వైద్యారోగ్యంపై వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందునా ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం చేయడం, ఎన్టీఆర్ వైద్యసేవల పేరిట పేరు మార్చడంతో పాటు పథకాన్ని బీమా కంపెనీలకు అప్పగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో పెద్ద దుమారమే నడుస్తోంది. తాజాగా రాష్ట్రంలో నెట్వర్క్ ఆస్పత్రులకు రూ. 2700 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉండగా.. ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 13 నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.147 కోట్ల వరకు పెండింగ్ బిల్లులున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోషియేషన్ (ఆశ) ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో మహాధర్నా చేపట్టనున్నారు. పెండింగ్ బిల్లుల కోసం ప్రైవేటు డాక్టర్లు, ఆసుపత్రుల యాజమాన్యాలు వీధి పోరాటానికి దిగుతుండడం రాష్ట్రంలో 2007 నుంచి (ఆరోగ్యశ్రీ ప్రారంభం) నేటి వరకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అటకెక్కిన సేవలు ఆశ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో 15 రోజుల నుంచి ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవలు) పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దశలవారీగా నిరసనలకు దిగిన నెట్వర్క్ యాజమాన్యాలు సర్కార్కు ఇచ్చిన గడువు ముగియడంతో ఉద్యోగుల ఈహెచ్ఎస్ సర్వీసులతో పాటు సాధారణ ప్రోసీసర్లు, సర్జరీలతో పాటు అత్యవసర సర్వీసులను కూడా నిలిపివేశాయి. దీంతో వేలాది మంది రోగులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రులకు రాగానే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్లుగా ఫ్లెక్సీలను పెట్టడంతో రోగులు తీవ్ర ఆవేదనతో భయాందోళనతో వ్యయప్రయాసలకు గురికావాల్సి వచ్చింది. అత్యవసర కేసుల విషయంలో చాలా వరకు డబ్బులిచ్చి సర్జరీలు చేయించుకున్నారు. నేటి ధర్నాకు సమాయత్తం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో 13 నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సేవల బంద్ పాటిస్తున్న ప్రతినిధులంతా గురువారం విజయవాడలో మహాధర్నా చేసేందుకు సమాయత్తమవుతున్నారు. వాస్తవానికి పెండింగ్ బకాయిల్లో ప్రస్తుతానికి రూ.670 కోట్లు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించితే.. ధర్నా నిరసనలను ఆపేసి ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరిస్తామని ఆశ ప్రతినిధులు ప్రకటిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం ‘బీమా పథకం’ ఎలాగైనా అమలు చేసే క్రమంలో ధీమాగా ఉన్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన 17 నెలల్లోనే ఆరోగ్యశ్రీని అంపశయ్యపై చేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. -
పైసలిస్తేనే పనులు..?
ఆమదాలవలస రూరల్: అక్రమార్జనలో ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అగ్రగామిగా నిలుస్తోంది. దస్త్రావేజులకు అక్రమ ధరలు పలికించడంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది కీలకంగా నిలుస్తున్నారు. వాస్తవంగా భూములకు సంబంధించి క్రయ, సెటిల్మెంట్, కుటుంబ పంపకం, సవరణ, మార్ట్గేజ్ వంటి దస్త్రావేజులు నిత్యం రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. అయితే భూములకు సంబంధించి గానీ, నివాస స్థలానికి సంబంధించి గానీ చిన్న, చిన్న తప్పులను బూచీగా చూపించి తిరస్కరణ పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. అనంతరం రిజిస్ట్రేషన్లలో భారీగా వసూలు చేస్తున్నారు. ఒక్కో దస్త్రావేజుకు సుమారుగా రూ.10 వేలు నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా తహసీల్దార్ సర్వే నంబర్ నిర్ధారణ కోసం జారీ చేసిన ధ్రువీకరణ పత్రంతో భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు రూ.10 వేలు నుంచి రూ.50 వేల వరకు ఇక్కడ సిబ్బంది వసూలు చేస్తున్నారు. జీతాల కంటే అక్రమార్జనే ఎక్కువ ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చే జీతాలు కంటే అధిక మొత్తంలో నిత్యం అక్రమార్జన చేకూరుతోంది. దీంతో భూములు కొనుగోలు చేసినవారు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఈ కార్యాలయానికి రావాలంటే భయపడుతున్నారు. వాస్తవంగా ఇటీవల ఆమదాలవలస మున్సిపాలిటీలోని రావికంటిపేటకు చెందిన ఒక వ్యక్తి వద్ద సర్వే నంబర్ను తప్పుగా చూపించి రూ.లక్షల్లో వసూలు చేయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతేకాకుండా ఇదే మున్సిపాటీలోని అక్కివలస రెవెన్యూ గ్రామంలో లింక్ దస్త్రావేజులో చిన్న తప్పును చూపించి ఇదే తరహాలో దోచుకున్నారు. అలాగే ప్రభుత్వం గతంలో అందించిన కాలనీలు ప్రభుత్వ భూములు అయినందున రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ఉండదు. అయితే ఇటీవల కాలంలో ఆమదాలవలస మున్సిపాలిటీ, ఐ.జె.నాయుడు కాలనీ, సొట్టవానిపేట కాలనీ తదితర ప్రాంతాల్లో అనేక గ్రామాల నుంచి గ్రామకంఠం సర్వే నంబర్తో తహసీల్దార్లు, వీఆర్వోలు అందించిన ధ్రువీకరణ పత్రాలతో పలు రిజిస్ట్రేషన్లు చేయించి రూ.లక్షల్లో దోచుకునే దందా ఈ కార్యాలయంలో కొనసాగుతుండడం గమనార్హం. కార్యాలయంలో కలెక్షన్ కింగ్ ఆమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక సాధారణ ఉద్యోగి చక్రం తిప్పుతున్నాడు. దస్త్రావేజులకు అక్రమ ధరలు నిర్ధారించడంలో ఆయనకు సాటి మరొకరు ఉండరనే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సాధారణ ఉద్యోగి కార్యాలయంలో కొందరు బినామీ ఉద్యోగులను ఏర్పాటు చేసుకొని భూ కొనుగోలు దారులనుంచి భారీ ముడుపులు అందుకుంటున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఉండే కొందరు లేఖర్లును అడ్డం పెట్టుకొని, అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆయనకు అక్కడ పనిచేసే అధికారి కూడా ఏమీ చేయలేరనే విధంగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇక్కడ జరుగుతున్న భారీ అవినీతి, అక్రమాల నియంత్రణపై జిల్లా అధికారులు కూడా కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అందువలన ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు అమదాలవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉత్సాహంగా క్విసిక్ ఫాల్ ఉత్సవం
ఎచ్చెర్ల: స్థానిక ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న క్విసిక్ ఫాల్ ఉత్సవం రెండో రోజు బుధవారం క్వాంటమ్ కంప్యూటింగ్ క్విసిక్ ఫాల్ నూతన ఆవిష్కరణలకు వేదికై ంది. దీనిలో భాగంగా అస్ట్రేలియా బాండ్ యూనివర్సిటీ సొసైటీ అండ్ డిజైన్ ఫ్యాకల్టీ సహ ఆచార్యులు గ్రెగొరీ జె.స్కుల్మోస్కీ ఆన్లైన్లో అతిథి ఉపన్యాసం ఇచ్చారు. కోల్కత్తాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ఐ)కు చెందిన క్రిప్టాలజిస్ట్ సమాచార సిద్దాంత నిపుణుడు డాక్టర్ గౌతమ్పాల్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీలో వస్తున్న కొత్త అంశాలు, సమాచార భద్రతపై వాటి ప్రభావాన్ని వివరించారు. డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ మాట్లాడుతూ ఈ శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు క్వాంటమ్ ప్రోగ్రామింగ్, సమస్యల పరిష్కారంపై మెరుగైన అవగాహన లభించిందన్నారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఆర్థికాధికారి వాసు, సమన్వయకర్త గేదెల రవి, కంప్యూటర్ శాస్త్ర విభాగాదిపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
తేనెటీగల పెంపకంతో ఉపాధి
ఆమదాలవలస: తేనెటీగల పెంపకాన్ని శాసీ్త్రయ పద్ధతిలో అభివృద్ధి చేసుకొని, తద్వారా యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చునని కేవీకే ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అన్నారు. స్థానిక కృషి విజ్ఞాన కేంద్రంలో నాబార్డు, కేవీకే సంయుక్తంగా తేనెటీగల పెంపకంపై యువతకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తేనెటీగల పెంపకం ద్వారా రైతులు, మహిళలు, యువత ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందన్నారు. శిక్షణలో పాల్గొన్నవారు తేనెటీగల పెంపకాన్ని వృత్తిగా స్వీకరించి, పరిశ్రమలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నాబార్డు డీడీఎం కె.రమేష్ కృష్ణ మాట్లాడుతూ తేనెటీగల పెంపకాన్ని వ్యాపారపరంగా అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి నాబార్డు నుంచి తగిన ఆర్థిక సాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. డీఆర్డీఏ డీపీవో బి.నారాయణరావు మాట్లాడుతూ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణలో పాల్గొన్న రైతులు, యువత తేనెటీగల పెంపకానికి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుని, అనుభవజ్ఞులైన వ్యాపారవేత్తలతో అనుసంధానం కావాలని సూచించారు. అనంతరం సస్యరక్షణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.అనూష తేనెటీగల సంరక్షణ, వ్యాధుల నివారణ, శాసీ్త్రయ మెలకువలపై వివరించారు. విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ జి.ఎస్.రాయ్ తేనెటీగల పెంపకాన్ని వ్యాపారవేత్తల దిశగా విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ బి.సునీత తేనె ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇచ్చారు -
అచ్చెన్నా.. నీవు చేసిన అభివృద్ధి ఎక్కడా..?
● ధ్వజమెత్తిన పేరాడ తిలక్ నందిగాం: టెక్కలి నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు టెక్కలి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఒక్కటైనా శాశ్వతమైన పని చేశారా అని నిలదీశారు. మూలపేట పోర్టు పనులు వైఎస్సార్సీపీ హయాంలో 70 శాతం పూర్తయితే, అధికారంలోకి వచ్చాక ఆ పనులను నిలుపుదల చేసింది అచ్చెన్నాయుడు కాదా అని నిలదీశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ సొంత నియోజకవర్గంలోనే రైతులకు యూరియా ఇచ్చుకోలేని అసమర్థ మంత్రిగా మిగిలారని ఎద్దేవా చేశారు. అధికారం అడ్డం పెట్టుకొని గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ యూనిట్లు, మద్యం దుకాణాలు బినామీల పేర్లుతో ఏర్పాటు చేసుకొని దోచుకుంటున్నారన్నారు. మంత్రిగా ఉంటూ తన అన్నతో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించి, గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలతో బెల్టు షాపులు నడుతున్న అచ్చెన్నాయుడికి మెడికల్ కాలేజీల పీపీపీ విధానం నచ్చుతుందని ఆరోపించారు. ఇప్పటికై నా టెక్కలి నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి యర్ర చక్రవర్తి, మండల పార్టీ అధ్యక్షుడు తమిరె పాల్గుణరావు, చిన్ని జోగారావు, కురమాన బాలకృష్ణారావు, అక్కురాడ లోకనాథ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్యాణి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో గత రెండు సంవత్సరాలుగా చనిపోయిన, రిటైర్డ్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉపాధి కల్పించాలన్నారు. 12వ (పీఆర్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీల్లో పెరిగిన జనాభాకనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని విన్నవించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఉన్న బ్యాంక్ ఖాతాలను బలవంతంగా యాక్సిస్ బ్యాంకులోకి మార్చవద్దని, అలాగే కార్మికులపై ఒత్తిడి తెస్తున్న మున్సిపల్ కమిషనర్పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. లేనిపక్షంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి, నవంబర్ 3వ తేదీన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనుబంధ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు అర్జీ మణి, ఆర్.గణేష్, గురుస్వామి, చంద్రారావు, పొట్నూరు గణేష్, కిరణ్, రామచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రమెక్కడ..?
కొత్తూరు: అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తూరు ప్రాంతంలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి, పత్తి రైతులకు మద్దతు ధర కల్పిస్తామని 2024 ఎన్నికల సమయంలో కూటమి నేతలు రైతులకు హామీ ఇస్తూ ఊదరగొట్టారు. అయితే ఏడాదిన్నర గడుస్తున్నా ఇంతవరకు పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఊసెత్తకపోవడంతో కూటమి నేతల తీరుపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంటల్లో పత్తి పంట ఒకటి. సుమారు 25 వేల ఎకరాల్లో పత్తి పంటను రైతులు సాగు చేస్తున్నారు. దోచుకుంటున్న దళారులు జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. దీంతో గుంటూరు, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పత్తి మిల్లు యజమానులు జిల్లాలో పత్తిని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులు అడిగిన ధరలకు రైతులు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువ ధరకు గతేడాది దళారీలు కొనుగోలు చేయడం జరిగింది. దీంతో రైతులకు గిట్టబాటు ధర రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారు. కాగా మరలా ఈ ఏడాది పత్తి సీజన్ మొదలైనప్పటికీ ఇంతవరకు కొనుగోలు కేంద్రం మంజూరు చేయలేదు. ఈ ఏడాది పత్తి సాగుకు పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోయాయి. యూరియా వంటి ఎరువులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే అధికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలు కేంద్రాన్ని కొత్తూరులో ఏర్పాటు చేసి పత్తి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారీలు నిర్ణయించిన ధరకు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకోవాలి. – పెద్దకోట జగన్నాథం, పత్తి రైతు, కొత్తూరు -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి
● ప్రభుత్వ విద్యా సంస్థల ప్రైవేటీకరణ సరికాదు ● ఏఐఎస్ఫ్ అధ్వర్యంలో బస్సుజాత ఇచ్ఛాపురం: ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేస్తోందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ, రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బుధవారం నుంచి బస్సుజాత కార్యక్రమం ఇచ్ఛాపురం నుంచి చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్దేవాంగ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించామన్నారు. కానీ పోలీసులు అనుమతులివ్వలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ షెడ్యూల్ ప్రకారం హిందూపురం వరకు యాత్రను కొనసాగించి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరిస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేడు నెలలు కావస్తున్నా విద్యార్థులకు ఎటువంటి సదుపాయాలు, అవకాశాలను కల్పించలేక విఫలమైందని ధ్వజమెత్తారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల వలరాజు మాట్లాడుతూ.. ఇటీవల మన్యం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఒక హాస్టల్లో 116 మంది విద్యార్థులు పచ్చ కామెర్లకు గురయ్యారంటే విద్యా సంస్థలపై ప్రభుత్వం ఎటువంటి పర్యవేక్షణ చేస్తుందో సంబంధిత మంత్రి, విద్యాశాఖామంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్ కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మస్తాన్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనా వైఫల్యాలపై గళమెత్తాలి
● నవంబర్ 20లోగా మండల, గ్రామ, వార్డు స్థాయి కమిటీలు పూర్తి చేయాలి ● వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్షలో నేతల పిలుపు సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై గళమెత్తాలని వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా యువజన విభాగం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఎండాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి యువజన విభాగం ఉత్తరాంధ్ర జోనల్ ఇన్చార్జి అంబటి శైలేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, ఉత్తరాంధ్ర జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు హాజరయ్యారు. తొలుత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదీప్రాజ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో యువజన విభాగాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రానున్న రోజుల్లో గ్రామ, మండల యువజన విభాగం కమిటీలను త్వరితగతిన పూర్తి చేసి, పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మీ నియోజకవర్గ సమన్వయకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని.. వారి సూచనలు, సలహాల మేరకు యువజన విభాగ కమిటీలను వేగంగా పూర్తిచేయాలని సూచించారు. అంబటి శైలేష్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మండల, గ్రామ, వార్డు స్థాయిలో యువజన విభాగ కమిటీలను నవంబర్ 20 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికలే లక్ష్యంగా మీ పరిధిలో సమస్యలు, ప్రజా సమస్యలపై పోరాడి.. వాటిని ప్రభుత్వం పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని తెలిపారు. రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందని, ప్రధానంగా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేసిందని ఆరోపించారు. వీటిపై పోరాటం చేయడంలో యువజన విభాగం ఎప్పుడూ ముందుండాలని సూచించారు. విశాఖ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, కార్పొరేటర్ ఉరుకూటి చందు మాట్లాడుతూ.. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి అనుబంధ కమిటీల్లో అత్యంత ప్రధానమైనది యువజన విభాగం.. అలాంటి విభాగంలో ఉన్న మనమందరం పార్టీ బలోపేతంలో ముఖ్య భూమిక పోషించాలన్నారు. మన రాజకీయ భవిష్యత్తులో ముందుకు దూసుకెళ్లడానికి ప్రధాన మార్గం కూడా ఇదే అవుతుందని, పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొని విజయవంతం చేసే బాధ్యతను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పుల్లేటి వెంకటేష్(అనకాపల్లి), శరత్బాబు(పార్వతీపురం), పృథ్వీరాజ్(శ్రీకాకుళం), అల్లు అవినాష్(విజయనగరం), గాబడి శేఖర్(అల్లూరి), రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి, కార్పొరేటర్ ఇమ్రాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి సురేష్ రాజ్, దొడ్డి కిరణ్, కార్యదర్శులు చింతకాయల వరుణ్, జగుపిల్ల నరేష్, కనకాల ఈశ్వర్ రావు, సత్యం నాయుడు, శివాజీ చక్రవతి, వివిధ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మంత్రి అచ్చెన్న ఆగ్రహం
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్రెడ్డి, ఏవో ప్రదీప్లపై మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన రిమ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్యులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, నిఘా, మెస్ పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై వైద్యాధికారులను ప్రశ్నించగా ప్రస్తుతం జాబ్ చార్ట్ మారిందని, మెగా పారిశుద్ధ్యం, మెస్ నిర్వహణ అన్ని అడ్మినిస్ట్రేటర్ పరిధిలో ఉన్నాయని మంత్రికి చెప్పారు. దీంతో అడ్మినిస్ట్రేటర్ను ప్రశ్నించగా ఆయన సరైన సమాధానాలు చెప్పలేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు తెలియజేయాలని కోరగా.. ఆ పుస్తకం తీసుకు రాలేదని అడ్మినిస్ట్రేటర్, ఏవోలు చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. మంత్రి సమీక్షకు వస్తున్నారని తెలిసిన తర్వాత కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇద్దరూ విధుల్లో చేరి ఆరు నెలలు కావస్తున్నా ఇప్పటివరకు తనను కలవకపోవడమేంటని నిలదీశారు. ఆస్పత్రుల్లో నియామకాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురాకపోవడాన్ని కూడా తప్పుపట్టారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం గైనిక్ విభాగానికి వెళ్లి ఇటీవల సమకూర్చిన యంత్రాలను ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సైతం అడ్మినిస్ట్రేటర్, ఏవోల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సుముఖంగా ఉన్నప్పటికీ, అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో అధికారులు విఫలమవుతున్నారని మండిపడ్డారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఇకమీదట తాను ఎప్పటికప్పుడు రిమ్స్ను తనిఖీ చేస్తానని చెప్పారు. సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఇన్చార్జి సూపరింటెండెంట్ రమేష్ నాయుడు, ఆర్ఎంవో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ ఆర్ఎంవో డాక్టర్ సీపీ శ్రీదేవి, వైద్యులు సనపల నరసింహమూర్తి, డాక్టర్ సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. నోటిఫికేషన్ రద్దు చేయండి రిమ్స్ వైద్య కళాశాలలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు రిమ్స్ అధికారులను ఆదేశించారు. ప్రతీ నియామకానికి సంబంధించి రోస్టర్ విధానం అమలు చేయాలని, ఆ విధంగా చేశారా.. లేదా అని మంత్రి ప్రశ్నించగా అడ్మినిస్ట్రేటర్, ఏవోలు తమకు గుర్తు లేదని, పరిశీలించాల్సి ఉందని వింత వింత సమాధానాలు చెప్పడంతో మంత్రి అవాక్కయ్యారు. తక్షణం నోటిఫికేషన్ను రద్దు చేయాలని ఆదేశించారు. ఇకమీదట పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
ఈదురుగాలులతో తీరని నష్టం
హిరమండలం: ఇటీవల కురిసిన వర్షాలకు, ఈదురుగాలులకు వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం వరి పొట్ట దశకు మించి పక్వానికి వచ్చింది. ఈ క్రమంలో చేను బరు వెక్కి నేలవాలింది. దీంతో మట్టిలో, నీటిలో కంకులు నానుతున్నాయి. దీంతో మొలకలు వస్తాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఎన్పేట మండలం దబ్బపాడు, తురకపేట సమీపంలో వరికి నష్టం ఎక్కువగా వాటిల్లుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. దళితులపై వివక్ష.. త్రిసభ్య కమిటీ విచారణ కంచిలి: మండలంలోని జిల్లుండ గ్రామంలో నివసిస్తున్న దళిత కుటుంబాల పట్ల అదే గ్రామంలో ఉన్న అగ్రకులాల వారు వివక్ష ప్రదర్శిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు మండల త్రిసభ్య కమిటీ అధికారులు మంగళవారం గ్రామంలో విచారించారు. గ్రామంలో గల దేవాలయానికి రానివ్వడం లేదని, అంగన్వాడీ కేంద్రంలోను, మంచినీటి బోరు వద్ద దళితుల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించడంపై, రెండు వర్గాలను ఒక చోట కూర్చోబెట్టి సమన్వయం చేశారు. ఇకముందు ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని హెచ్చరించారు. విచారణలో స్థానిక తహసాల్దార్ ఎన్.రమేష్కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఎస్ఐ పి.పారినాయుడు, అంగన్వాడీ సూపర్వైజర్ ధనలక్ష్మి, దళిత సంఘాల నేతలు నగిరి మోహనరావు, గుండ్ర జగ్గారావు, సిర్ల మాధవరావు, డొప్ప వెంకటరావు, రుక్మంగధరావు, బడియా నాగరాజు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం రూరల్: స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడు నర్తు రామారావు యాదవ్ 23వ సారి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ యాదవ సంఘం అధ్యక్షుడు లాకా వెంగళరావు, యానాం రాష్ట్ర అధ్యక్షుడు మట్ట సురేష్ యాదవ్ అధ్యక్షతన సోమవారం యానాంలో జరిగిన ఏపీ, పుదుచ్ఛేరి రాష్ట్రాల సంయుక్త అఖిల భారతీయ యాదవ మహాసభలో శ్రీకాకుళం జిల్లా యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని జాతీ య ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్ర యాదవ్ ప్రకటించారు. జిల్లా యాదవ యువజన అధ్యక్షుడిగా నర్తు ప్రేమ్కుమార్ యాదవ్, జాతీయ యువజన కార్యదర్శిగా కొర్రాయి వాసుదేవ్, జి ల్లా మహిళా అధ్యక్షురాలిగా బద్రి సీతమ్మ, ఉ పాధ్యక్షుడిగా రాపాక చిన్నారావు, ప్రధాన కా ర్యదర్శిగా వంజరాపు కసవయ్య, గజ్జి షణ్ముఖరావు, మడ్డు వెంకటరావు, చిన్ని జోగారావు, లింగమూర్తి తదితరులను ఎన్నుకున్నారు. -
షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ ప్రమాదం
ఇచ్ఛాపురం: పట్టణంలోని బెల్లుపడ కాలనీలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. బెల్లుపడ కాలనీలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ సీహెచ్ అనిల్ మేడ పైగదిలో పొగలు రావడం గమనించి స్థానికులు అతనికి తెలియజేశారు. వెంటనే పై గదిలోకి వెళ్లి తలుపు తీసి చూడగా గది మొత్తం మంటలు, పొగ వ్యాపించి ఇంట్లోని గృహోపకరణాలు కాలిపోతున్నాయి. వెంటనే విద్యుత్, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విద్యుత్ సరఫరాని నిలిపి వేయడంతో స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్, ఫైర్ సిబ్బంది ఇంటిని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని, సుమారుగా రూ.2 లక్షల ఆస్థి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ తెలిపారు. సమాచారం అందుకున్న వార్డు కౌన్సిలర్ జి.ప్రదీప్ కుటుంబ సభ్యులను పరామర్శించి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. -
అమరులకు అశ్రు నివాళి
● ఘనంగా పోలీసు అమరవీరుల స్మారకోత్సవాలు ● పోలీసుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం క్రైమ్ : పోలీసులు సమర్థంగా పనిచేస్తే సమాజానికి మేలు జరుగుతుందని, ఎందరో పోలీసులు విధుల్లో అసువులు బాసి అమరులయ్యారని, వారిని నివాళులర్పించడం మన బాధ్యత అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసు అ మరవీరుల స్మారకోత్సవం తొలిరోజు మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. ముందుగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీలతో కలసి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి పూలమాలలతో నివాళుర్పించారు. అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. ఏఆర్ దళాల పరేడ్ ఆకట్టుకుంది. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళలపై అ త్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని, గంజాయి, డ్రగ్స్మత్తులో యువత చెడిపోతున్నారని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి కృషి చేయాలన్నారు. సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బాధితులుగా మారుతున్నారని, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ క్వార్టర్లు, స్టేషన్లు పోలీస్ హౌసింగ్ కా ర్పొరేషన్ ద్వారా నిర్మించేలా నివేదిస్తానన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలీసుల త్యాగాలు, సేవలు మరువలేనివన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఈ ఏడాది దేశంలో 191 మంది పోలీసులు విధుల్లో మరణించారని, ఏపీలో ఇద్దరు మరణించారన్నారు. జిల్లాలో అమరులైన ఆరు కుటుంబాలకు కారుణ్య నియామకాల్లో కొనసాగుతున్నారని, మరణించిన హోంగార్డు కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ జాబ్ వచ్చే లా కార్యాచరణ చేస్తున్నామన్నారు. విధుల్లో భాగంగా అసాంఘిక శక్తుల నడుమ ఉండేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, శాఖాపరంగా మద్దతిస్తామన్నా రు. ఆరోగ్య భద్రత పరంగా పెండింగ్ బిల్లులు లేవని, ఐదు కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇస్తామన్నా రు. ప్రమాద ఇన్స్యూరెన్సులు, బ్యాంకులతో టైఅప్ ఇన్స్యూరెన్సులు చేయిస్తున్నామన్నారు. -
27 నుంచి మల్లన్న సన్నిధిలో కార్తీక సోమవారాలు
టెక్కలి: కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 27 నుంచి టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లికార్జునస్వామి సన్నిధిలో కార్తీక సోమవారాలు పూజలు నిర్వహించనున్నారు. 27న మొ దటి సోమవారం, నవంబర్ 3న రెండో సోమవారం, 11న మూడో సోమవారం, 17న నాల్గో సోమవారాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీర్షాభిషేకం టికెట్ ధర రూ.40, ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.20, కేశఖండన రూ.40, రుద్రాభిషేకం రూ.58 చొప్పున దేవ స్థానంలో టికెట్ ధరలు నిర్ణయించారు. అలాగే ఆన్లైన్ ద్వారా స్వామికి సేవలు చేయవచ్చునని దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఆర్టీసీలో 23 కేటగిరీల్లో పదోన్నతులు శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళంలోని ఆర్టీసీ సంస్థలో 23 కేటగిరీలకు చెందిన వివిధ ఉద్యోగులకు త్వరలో పదోన్నతి ఉత్త ర్వులు ఇస్తామని జిల్లా ప్రజా రవాణా అధికా రి సీహెచ్ అప్పల నారాయణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నా రు. అర్హత కలిగిన ఉద్యోగులకు నియమ,నిబంధనల మేరకు పదోన్నతులు ఇచ్చే ప్రక్రియపై జిల్లా పదోన్నతుల కమిటీ ఆధ్వర్యంలో పూర్వపు ప్రాంతీయ మేనేజర్ కార్యాలయం విజయనగరంలో పూర్తి కసరత్తు జరుగుతుందన్నారు. సుమారు 264 మందితో పాటు మరో 38 మంది (10 శాతం రిజర్వ్) మొత్తం 302 మంది ఉద్యోగులకు రెండు లేదా మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ‘సహకార’ ఉద్యోగులకు శిక్షణ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం డీసీసీబీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం సహకార శిక్షణ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని సహకార శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ సర్చార్జి, అవార్డు, ఈపీలపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి బి.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రామదాసు సహకార శిక్షణ కేంద్రం, రాజమహేంద్రవరం ప్రిన్సిపాల్ గండేపల్లి శ్రీనివాసరావు శిక్షణ విశిష్టతను వివరించారు. శ్రీకాకుళం నగరంలో.. -
మా సొమ్ము ఇచ్చేదెప్పుడు..?
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పోస్టాఫీస్లో జరిగిన భారీ స్కామ్తో 34 మంది ఖాతాదారుల రూ.2.78 కోట్ల సొమ్ము మాయమైన సంగతి తెలిసిందే. మూడు నెలలుగా దీనిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో మంగళవారం బాధితులంతా పోస్టల్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ గేటు బయట టెంట్లు వేసి సుమారుగా నాలుగు గంటల పాటు కార్యాలయ సిబ్బందిని కార్యాలయంలోనికి వెళ్లనీయకుండా అడ్డుపడ్డారు. పోస్టాఫీస్లో దాచుకొన్న సొమ్ముని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. స్థానిక పోస్టుమాస్టర్ షణ్ముఖరావు బాధిత ఖాతాదారులకు ఎంతగానో నచ్చచెప్పినప్పటికి ఖాతాదారులెవరూ వినలేదు. దీంతో చేసేదేమీ లేక పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ సోంపేట నుంచి స్థానిక పోస్టల్ కార్యాలయానికి చేరుకున్నారు. పోస్టల్ ఇన్స్పెక్టర్ కూడా బాధితులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికి స్పష్టమైన హామీ లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని బాధితులు కోరడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ క్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్, పోస్టల్ అసిస్టెంట్ డెరెక్టర్ రాజు, పోస్టల్ సూపరిండెంట్ హరిబాబుకి ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. దీంతో పోస్టల్ ఉన్నతాధికారులు బాధిత ఖాతాదారులతో ఫోన్లో మాట్లాడారు. 15 రోజుల్లో అందరికీ న్యాయం చేస్తామని వాయిస్ మెసేజ్ పంపించారు. దీంతో ఖాతాదారులంతా తాత్కాలికంగా నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే నిరసనలు ఉద్ధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాధిత ఖాతాదారులు చాట్ల లోహిదాస్, బాలరాజు, కిరణ్మయి, శ్రీను, మమాపాత్రో తదితరులు పాల్గొన్నారు. -
పండ్ల ధరలు ౖపైపెకి..!
మెళియాపుట్టి: ప్రస్తుతం మార్కెట్లో పండ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయ్యప్ప మాలధారణలు, ఈరోజు నుంచి కార్తీకం మొదలవ్వనుంది. ప్రతీరోజూ భక్తులు పండ్లు కొనుగోలు చేస్తారు. దీంతో ఇదే అదునుగా హోల్సేల్ వ్యాపారులు ధరలు పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా ఇటు ప్రజలు.. అటు సామాన్య భక్తులు, రోగులు కొనలేక, తినలేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పండ్ల ధరలు సామాన్యులకు దడపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా యాపిల్, జామ, డ్రాగన్, నారింజ, కమలా, ద్రాక్ష, అరటి, దానిమ్మ, కివీ రకాల పండ్ల ధరలకు రెక్కలొచ్చాయి. వీటిలో ఏది చూసుకున్నా కిలో రూ.150లు దాటి రూ.300 వందలకు పైచిలుకు ధర పలుకుతుండడంతో సామాన్యులు కొనలేకపోతున్నారు. కాగా ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు పంటల దిగుబడిపై ప్రభావం చూపాయి. దీంతోనే డిమాండ్ వలన అధిక ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అందువలన కొనుగోళ్లు మందగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో మేము కూడా అధిక ధరలకే పండ్లను కొనుగోలు చేస్తున్నాం. దీనివలన నిత్యం మా దగ్గర కొనుగోలు చేసేవారికి కూడా తగ్గించి అమ్మలేని పరిస్థితి నెలకొంది. తగ్గించి అమ్మితే నష్టపోతాం. అలాగని అమ్మకాలు మానేయలేం. ఎన్నో ఏళ్లుగా పండ్ల వ్యాపారం మీదే బతుకుతున్నాం. ధరలు తగ్గితే మా వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. – కె.సంజీవరావు, పండ్ల వ్యాపారి, మెళియాపుట్టి -
ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదాం
● వైఎస్సార్సీపీ నాయకుల పిలుపు మెళియాపుట్టి: కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడదామని మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. మండలంలోని కరజాడ, ముక్తాపురం, మురికింటిభద్ర తదితర గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారని, దీనికి ప్రతీ కార్యకర్త నడుం బిగించాలని సూచించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతీ పల్లెలో చంద్రబాబు మోసాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. కార్యక్రమంలో కరజాడ సర్పంచ్ బమ్మిడి పున్నయ్య, ముక్తాపురం సర్పంచ్ అలికాన జయప్రద, మర్రిపాడు.కె సర్పంచ్ పైల దివ్య, హరి, మాజీ ఎమ్మెల్యే చుక్క పగడాలమ్మ, మండల కన్వీనర్ పోలాకి జయమునిరావు, సీనియర్ నాయకులు ఉర్లాన బాలరాజు, బమ్మిడి ఖగేశ్వరరావు, బైపోతు ఉదయ్కుమార్, భాస్కర దాస్, అలికాన మాధవరావు, లింగాల సంజీవరావు, కరణం శశిభూషణరావు తదితరులు పాల్గొన్నారు -
చెస్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి: ఆలిండియా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26న టెక్కలిలో నిర్వహించనున్న జిల్లాస్థాయి చెస్ పోటీల పోస్టర్ను ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మంగళవారం ఆవిష్కరించారు. స్థానిక ఆల్ఫాజెన్ పాఠశాలలో నిర్వహించనున్న పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని ఆలిండియా చెస్ ఫెడరేషన్ సభ్యుడు ఎస్.భీమారావు, జిల్లా సభ్యుడు ఐ.అవినాష్ కోరారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద స్పృహ లేకుండా పడివున్న వ్యక్తిని రిమ్స్లో చేర్పించగా, చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు తెలిపారు. ఈనెల 19న ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద ఎటువంటి గాయాలు లేకుండా స్పృహ లేకుండా శృంగవరపు సూర్యనారాయణ (55) పడి ఉండటాన్ని చూసిన స్థానికులు రిమ్స్కు తరలించారన్నారు. ఏ గ్రామస్తుడో తెలియనందున తెలిసినవారు స్టేషన్కు సమాచారమివ్వాలని, లేదంటే 63099 90824 నంబర్కు డయల్ చేసి తెలియజేయాలన్నారు. -
ఇలా వెళ్లాలి...
● నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం ● ఈ ఏడాది నాలుగు సోమవారాలు ఆధ్యాత్మిక సౌరభం శ్రీముఖలింగం జలుమూరు: ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం శ్రీముఖలింగం దక్షిణ కాశీగా పేరొందింది. ఎక్కడైనా శివుడు లింగాకారంలో ఉంటాడు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం ముఖం దాల్చి ఆవిర్భవించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీముఖలింగమని, ఇక్కడ కొలువైన శివుడుని ముఖలింగేశ్వరుడని పిలుస్తారు. కాశీలో లింగం, గంగలో సాన్నం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ జరిగే కార్తీక సోమవారాల ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు దేశం నలుమూలలు నుంచి తండోపతండాలుగా వస్తారు. ఈ ఏడాది కార్తీక మాసం నాలుగు సోమవారాలుగా పడ్డాయి. ఈ క్షేత్రం కాశీకి తల్యమైనదిగా అభివర్ణిస్తున్నారు. కృతయుగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనకాకృతిలోను, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజితాకృతిలోను, ద్వాపర యగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలోను, కలియుగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుతాయి శ్రీముఖలింగంలో మూడు ప్రధాన ఆలయాలతో పాటు ఎన్నో శివలింగాలు ఉన్నాయి. కోటికి ఒక్కటి తక్కువగా ఉండడం వల్ల కాశీగా పేరొందాల్సిన శ్రీముఖలింగం దక్షిణ కాశీగా మిగిలి పోయిందని అర్చకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆలయ గర్భగుడిలో ఉన్న గోలెంను ముట్టుకొని మనస్సులో కోర్కెలు తల్చుకొని మొక్కితే ఆ న్యాయమైన కోర్కెలు తీరుతాయని శ్రీముఖలింగేశ్వర క్షేత్ర మహత్యంలో ఉంది. ప్రధాన ఆలయానికి తూర్పు దిక్కున ఉన్నది భీమేశ్వరాలయం కాగా.. దక్షిణ దిశలో ఉన్నది సోమేశ్వరాలయం. ఈ ఆలయాల్లో కూడా సాధారణ రోజలతోపాటు కార్తీక, శివరాత్రి పుణ్య దినాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలాగే శ్రీముఖలింగేశ్వరునికి క్షేత్ర పాలకుడుగా విష్ణుమూర్తి వ్యవహరిస్తున్నట్లు చరిత్ర వివరిస్తోంది. కరకవలస గ్రామ సమీపాన రత్నగిరి కొండమీద కృష్ణార్జునులు ఉంటారు. అలాగే ఈ క్షేత్రాన్ని ఆశ్రయించి చాలా తీర్థాలు ఉన్నాయి. ఆలయం మొత్తం ఇండో –అర్బన్ శిల్ప కళతో ఎరుపు రాతితో చెక్కారు. అక్టోబర్ 22 నుంచి కార్తీక ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో ఏడుకొండలు తెలిపారు. శ్రీకాకుళం కాంప్లెక్స్ నుంచి శ్రీముఖలింగంనకు సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ క్షేత్రం చేరుకునేందుకు శ్రీకాకుళం నుంచి రెండు రూట్లు ఉన్నాయి. ఒకటి నరసన్నపేట నుంచి చల్లవానిపేట మీదుగా, మరొకటి కోమర్తి నుంచి ఉర్లాం మీదుగా శ్రీముఖలింగం చేరుకోవచ్చు. బస్సు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. ఒకవేళ ట్రైన్లో వెళ్తే శ్రీకాకుళం రోడ్డులో దిగాలి. ఆలయం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. -
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
● శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష జలుమూరు: కార్తీక మాసంలో శ్రీముఖలింగం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో బందోబస్తు నిర్వహించాలని శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష అధికారులను ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. నెల రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, అందువలన ఉచిత ప్రసాదం, తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లపై గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీ విస్తరణ అధికారులు, ఎంపీడీవోలకు పలు సూచనలు చేశారు. అలాగే క్యూలో భక్తులు ఎండలో ఉండకుండా నీడ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా భక్తులు ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్నారని, వీరి ప్రయాణానికి బస్సుల ఏర్పాట్లు చూడాలన్నారు. పారిశుద్ధ్య లోపం లేకుండా చూడడంతో పాటు మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేయాలని తహసీల్దార్ను అదేశించారు. సమావేశంలో ఎంపీడీవో చిన్నమ్మడు, ఈవోపీఆర్డీ ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా క్విసిక్ఫాల్ ఫెస్ట్ ప్రారంభం
ఎచ్చెర్ల: రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో (ఐఐఐటీ) శ్రీకాకుళం క్విసిక్ ఫాల్ ఫెస్ట్ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అమరావతి క్వాంట్ం వ్యాలీ సలహాదారులు, నిపుణులు డాక్టర్ వెంకటసుబ్రమణ్యం ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు. విద్యార్థులు ఈ ఫెస్ట్ను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా 55 విద్యా సంస్థలను ఈ ఫెస్ట్కు ఎంపికచేయగా వాటిలో శ్రీకాకుళం ట్రిఫుల్ఐటీ ఒకటిగా నిలిచిందన్నారు. విద్యార్థులు కాటం నిఖిల్తేజ, దూదేకుల కాసింవలి, చెరుకూరి ప్రవీణ్ కుమార్, చదువుల జాన్బాబు, కిమిడి గుణశ్రీల ప్రజెంటేషన్ ఈ ఘనత తీసుకువచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వర్క్షాప్లు, గైడెడ్ జూపిటర్ నోట్బుక్లు, క్యాంపస్ హ్యకథాన్లు, క్వాంటమ్ రీసెర్చ్పై నిపుణుల ప్రసంగాలు ఉంటాయని అన్నారు. కా ర్యక్రమంలో వైజాగ్ ఎంపీ, గీతం విద్యాసంస్థల అధినేత శ్రీభరత్ మాట్లాడుతూ ఆర్టీయూకేటీ ఎంపికపై ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ కేవీజీ బాలాజీ మాట్లాడుతూ ఇది మన క్యాంపస్కు వ చ్చిన మంచి అవకాశమని, విద్యార్థులు వినియోగించుకోవాలని అన్నారు. -
ఆ ఊళ్లే దీపావళి
గార, టెక్కలి: శ్రీకాకుళం జిల్లాలో దీపావళి పేరిట రెండు గ్రామాలు ఉన్నాయి. గార మండలంలోని ఓ గ్రామం ఉంటే.. టెక్కలి మండలంలో మరో గ్రామం ఉంది. గార మండలంలోని దీపావళి గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. ఓ కళింగ రాజు ఇటుగా వస్తూ ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని గూడెం అని పిలిచేవారట. ఆ రాజు ప్రతి రోజూ శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం వరకు గుర్రంపై వెళ్లేవారట. మార్గం మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద ఆగి స్వామిని దర్శించుకునేవారు. ఒక రోజు శ్రీకూర్మం వెళ్లి వస్తూ ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. ఇక్కడి వారు ఆయనకు సాయం చేయగా కోలుకున్నారు. ఊరి వారిని గ్రామం పేరు అడగ్గా పేరేమీ లేదని చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ ఊరికి దీపావళి అనే పేరును పెట్టారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ పేరే ఉంది. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో ‘దీపావళి’ గ్రామం ఒకటి. టెక్కలి నుంచి బన్నువాడ గ్రామం మీదుగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ దీపావళి గ్రామం ఉంది. పండగ పేరుతో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. -
పరమ పవిత్రం.. కార్తీకం
● 22 నుంచి కార్తీక మాసం ఆరంభం ● ముస్తాబవుతున్న దేవాలయాలు హిరమండలం: పరమ పవిత్రమైన కార్తీక మాసం రానే వస్తోంది. ఈ నెల రోజులూ దైవ భక్తిలో ఉంటే ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషా లు కలుగుతాయన్నది భక్తుల ప్రగాడ విశ్వాసం. ఈ మాసంలో దీపారాధనకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. దీపాన్ని దైవ స్వరూపంగా భావించి పూజలు చేస్తారు. కార్తీక సోమవారాల్లో చేసే దీపారాధన, ఉసిరి చెట్టు కింద పూజలు, వనభోజనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పండితులు చెబుతున్నారు. అక్టోబర్ 22 నుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసంలో నాలుగు వారాలు ఈ పూజలు కొనసాగుతాయి. దీపారాధన ప్రత్యేకత కార్తీక మాసంలో ఒక్కో రకమైన ప్రమిదలో దీపం వెలిగిస్తే ఒక్కో రకమైన మంచి జరుగుతుందని నమ్ముతారు. మట్టి ప్రమిదలో వెలిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని, పింగాణి ప్రమిదలో దీపం వెలిగిస్తే ఆ ఇంటి వారికి అలంకరణ వస్తువులు సమకూరుతాయని, ఇత్తడి ప్రమిదలో దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లో దైవశక్తి అధికవవుతుందని, కంచు ప్రమిదలో వెలిగిస్తే ఆయుష్సు పెరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. నిమ్మ ప్రమిదల్లో వెలిగిస్తే అన్ని కార్యాల్లోని విజయం సిద్ధిస్తుందని, అరటి దోనెలో దీపం వెలిగించి నీటిలో వదిలితే మానసిక సంతృప్తి, ధన రక్షణ కలుగుతుందని, ఉసిరికాయల దీపం వెలిగిస్తే పాపాలు తొలగిపోతాయని కూడా చాలా మంది విశ్వసిస్తారు. శివకేశవులకు సమప్రాధాన్యం కార్తీకమాసం శివుడికి, విష్ణువుకి ప్రతీకరమైంది. అందుకే ఈ మాసం ప్రతి సోమవారం శివుడికి, ప్రతి శుక్ర, శని వారాల్లో విష్ణుమూర్తికి ప్రత్యేక పూజ లు చేస్తారు. శివపార్వతుల పుత్రుడైన అయ్యప్ప దీక్షలు ఈ మాసంలోనే ప్రారంభమవుతాయి. శివుడికి రుద్రాబిషేకం, బిళ్వార్చన, విష్ణువుకి తులసీ దళార్చన ఈ మాసంలోనే అత్యంత భక్తిశ్రద్దలతో నిర్వహిస్తారు. లక్ష్మీదేవి, కార్తికేయుడు, చంద్రుడు, ఇంద్రుడు, తులసిమాత, ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. -
ఆ ఊళ్లే దీపావళి
గార, టెక్కలి: జిల్లాలో దీపావళి పేరిట రెండు గ్రామాలు ఉన్నాయి. గార మండలంలోని ఓ గ్రామం ఉంటే.. టెక్కలి మండలంలో మరో గ్రామం ఉంది. గార మండలంలోని దీపావళి గ్రామానికి ఆ పేరు రావడానికి ఓ కథ ప్రచారంలో ఉంది. దాని ప్రకారం.. ఓ కళింగ రాజు ఇటుగా వస్తూ ఈ గ్రామానికి దీపావళి అనే పేరు పెట్టారు. అప్పటి వరకు ఈ ప్రాంతాన్ని గూడెం అని పిలిచేవారట. ఆ రాజు ప్రతి రోజూ శ్రీకాకుళం నుంచి శ్రీకూర్మం వరకు గుర్రంపై వెళ్లేవారట. మార్గం మధ్యలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వద్ద ఆగి స్వామిని దర్శించుకునేవారు. ఒక రోజు శ్రీకూర్మం వెళ్లి వస్తూ ఇక్కడ సొమ్మసిల్లి పడిపోయారు. ఇక్కడి వారు ఆయనకు సాయం చేయగా కోలుకున్నారు. ఊరి వారిని గ్రామం పేరు అడగ్గా పేరేమీ లేదని చెప్పారు. ఆ రోజు దీపావళి కావడంతో ఆ ఊరికి దీపావళి అనే పేరును పెట్టారు. రెవెన్యూ రికార్డుల్లోనూ ఈ పేరే ఉంది. టెక్కలి మండలం అయోధ్యపురం పంచాయతీ పరిధిలో ‘దీపావళి’ గ్రామం ఒకటి. టెక్కలి నుంచి బన్నువాడ గ్రామం మీదుగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో ఈ దీపావళి గ్రామం ఉంది. పండగ పేరుతో ఉన్న ఈ గ్రామంలో మొత్తం 50 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. దీపావళి పేరుతో గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. -
కొనకుండానే పేలుతున్నాయ్!
నరసన్నపేట, శ్రీకాకుళం కల్చరల్: తగ్గిన జీఎస్టీలతో బాణసంచా ధరలు తగ్గుతాయని భావించిన వారికి మందుగుండు ధర దడ పుట్టిస్తోంది. ధరలు గత ఏడాది కంటే ఎక్కువ ఉండడం గమనార్హం. జిల్లాలో శనివారం నుంచి వి క్రయాలు ప్రారంభించారు. శాశ్వత దుకాణాల్లో ముందు నుంచే విక్రయాలు ఉన్నా తాత్కాలిక లైసెన్సులు పొందిన దుకాణాల వద్దనే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అధికంగా సేల్ అయ్యే అగ్గిపెట్టెలు, తారా జువ్వలు, మతా బులు, క్రాకర్లు, భూచక్రాలు, చిచ్చుబుడ్డీలు, థౌజెండ్ వాలా వంటి సామగ్రి ధరలు అధికంగా ఉన్నాయి. గత ఏడాది కంటే 20 శాతం వరకూ ధరలు అధికంగా ఉన్నాయని వినియోగదారులు అంటున్నారు. -
అవగాహనే వెలుగు
● జిల్లావ్యాప్తంగా 100 దుకాణాలకు తాత్కాలిక లైసెన్సులు ● దీపావళికి జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచన శ్రీకాకుళం క్రైమ్ : ప్రశాంత వాతావరణంలో, ప్రమాదాలకు తావివ్వకుండా జిల్లా ప్రజలు దీపావళి పండగ జరుపుకోవాలని, తక్కువ కాలుష్యం ఉన్న గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. ఇళ్లలో, దుకాణాల్లో లైసెన్సు లేకుండా బాణసంచా నిల్వలు ఉంటే దా డులు నిర్వహించి కేసులు పెడతామన్నారు. బహిరంగంగా మద్యం సేవించి న్యూసెన్సు చేసినా, వాహనాలు నడిపినా, పేకాట నిర్వహించినా జైలు కు వెళ్లడం ఖాయమన్నారు. జిల్లాలో వంద దుకాణాలకు బాణసంచా సామగ్రి విక్రయించేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చారు. పర్మినెంట్ షాపులు 12 ఉన్నాయి. హద్దులు దాటితే అనర్థమే.. ● టపాసుల్లో టాక్సిక్ కారకాలైన రాగి, కాడ్మియం, సీసం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం, గంథఽకం వంటివి ఉండటంతో శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా భూచక్రాలు, పాము మాత్రలు, మతాబులు, చిచ్చుబుడ్లు వల్ల అధికంగా పొగ వ్యాపిస్తుంది. ● టపాసులు పేల్చినప్పుడు వెలువడే ధ్వని అపరిమితంగా ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పు డు 125 నుంచి 130 డెసిబుల్స్ శబ్దం వెలువడుతుంది. సాధార ణ మనిషి వినికిడి శక్తి 50 డెసిబుల్స్ మాత్ర మే. అంతకు మించి శబ్దాలను వింటే వినికిడి సమస్యల బారినపడ్తారు. అనర్థాలే అధికం.. భారీ శబ్దాలు, రసాయనాలు వెలువరించే బాణసంచా స్థానంలో మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలను వెలిగించాలి. గాలి, శబ్ద కాలుష్యం నివారించేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. టపాసుల త యారీలో కాపర్, కాడ్మియం, లెడ్, అమ్మోనియం, నైట్రోజన్ ఆకై ్సడ్, సల్ఫర్ డయాకై ్సడ్, సోడియం, మెర్క్యురీ, లిథియం, పొటాషియం వంటి అనేక మిశ్రమాలతో తయారు చేస్తారు. వీటి నుంచి వచ్చే వెలుగులతో కన్ను, ఘాటు వాసనతో ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడతాయి. ప్రమాదాలు సంభవిస్తే.. ● టపాసులు కాల్చినప్పుడు అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణమే దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రాలకు లేదా 101 నంబర్కు డయల్ చేసి సమాచారమివ్వాలి. 100, 108 నంబర్లనూ సంప్రదించాలి. -
కొండ దగ్గర కాపుకాసి..
విజయనగరం జిల్లా డెంకాడ మండలం గునపురం పేట గ్రామానికి చెందిన ఎస్.బంగారునాయుడు శ్రీకాకుళం జిల్లాలో పలు పోలీస్స్టేషన్లలో పనిచేశారు. 1992 మార్చి 24న కాశీబుగ్గ ఎస్హెచ్వోలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో మందస మండలం భేతాళపురంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో స్పెషల్ బ్రాంచి ఎస్ఐ జగన్మోహనరావు, ఏడుగురు రిజర్వ్ సిబ్బందితో కలిసి రైడ్కు వెళ్లారు. ఇద్దరు నిందితులను పట్టుకుని వస్తున్న సమయంలో రట్టికొండ దగ్గర కొండచాటు నుంచి నాగావళి దళం కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులు జరిగినా.. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో వీరోచితంగా పోరాడి అదే రోజున బంగారునాయుడు వీర మరణం పొందారు. -
మందుగుండు సామగ్రి సీజ్
పొందూరు: పొందూరులో ఎటువంటి లైసెన్సు లేకుండా మందుగుండు సామగ్రి విక్రయిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని సామగ్రి సీజ్ చేసినట్లు ఎస్సై వి.సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మార్కెట్ వీధిలో దీపావళి సామాన్లు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా రూ.1,09,623 విలువైన మందుగుండు గుర్తించామన్నారు. పొట్నూరు వెంకటరావు వద్ద రూ.40,088, జామి మణికంఠ వద్ద రూ.59,717, గుడ్ల రవి వద్ద రూ. 9,818 విలువైన సామగ్రి స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ‘నాభూమి..నాదేశం’ స్మారక శిలాఫలకం కూల్చివేత టెక్కలి: గత వైఎస్సార్సీపీ హయాంలో ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా టెక్కలి మండలం విక్రంపురం వద్ద ఎర్ర చెరువు గట్టుపై ఏర్పాటు చేసిన ‘నాభూమి నాదేశం’ స్మారక శిలా ఫలకాన్ని కూల్చివేశారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగానికి గుర్తుగా.. భావి తరాలకు పుడమితల్లి విలువను తెలియజేసే విధంగా.. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరులకు గుర్తుగా ప్రతి పంచాయతీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో వీటిని నిర్మించారు. దీనిలో భాగంగా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ విక్రంపుర వద్ద స్మారక శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు దానిని కూల్చివేసి ఒక వైపు కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని.. మరో వైపు స్వాతంత్య్ర సమరయోధులు, వీరుల త్యాగాన్ని నేలమట్టం చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కంచిలి: బూరగాంలో జాతీయ రహదారి పక్కన ఇటీవల మతిస్థిమితం లేని వ్యక్తి ఫిట్స్వచ్చి పడి ఉండగా శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 17న మృతిచెందాడు. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉండవచ్చని, గోధుమ రంగు టీ షర్టు, నలుపు ప్యాంట్ ధరించి ఉన్నాడని, వివరాలు తెలిస్తే కంచిలి పోలీస్స్టేషన్లో సమాచారం అందించాలని పోలీసులు కోరారు. -
రాష్ట్రంలో నిర్బంధ పాలన
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, అనుకూల మీడియాపై అక్రమ కేసులు బనాయించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన చల్ల శ్రీనివాసరావు అభినందన సభ శ్రీకాకుళం టౌన్హాల్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించామన్నారు. పేదవాడు అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే ఆయుధమని నమ్మిన వైఎస్సార్, జగన్మోహన్రెడ్డిలు తమ పాలనలో అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. అటువంటి ఇంగ్లిష్ మీడియం విద్యపై కక్షగట్టి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. రాజకీయాలంటే డబ్బు సంపాదన కాదు.. కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా పేదవాడికి వైద్యం అందకుండా చేయడం సరికాదని ధర్మాన అన్నారు. ఎంతోమంది జీవితకాలం సంపాదించుకున్న డబ్బులు ఒక్క అనారోగ్యంతో మొత్తం కోల్పోతున్నారని చెప్పారు. రాజకీయాల్లో పదవులు చేపట్టడం అంటే డబ్బులు సంపాదించుకోవచ్చన్న అపోహ చాలా మందిలో ఉందని, అలాకాకుండా సమాజానికి సేవ చేసే అదృష్టంగా భావించాలన్నారు. రాజకీయ పార్టీ కోసం కష్టపడి పనిచేసి న్యాయం చేయగలిగితేనే పదవులకు సార్ధకత చేసినట్టవుతుందన్నారు. పార్టీలో కష్టాలు, గుర్తింపు ఉంటాయని, అన్నింటినీ ఒకేలా స్వీకరిస్తేనే రాజకీయాల్లో రాణించగలమన్నారు. ప్రతిపక్షంలో వచ్చే అవకాశాలు ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో పదవులొస్తాయని వాటిని సక్రమంగా వాడుకుని నాయకుడిగా ఎదిగేందుకు అవకాశాల్ని అందిపుచ్చుకోవాలన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో అనేక మార్పులు, సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. పరిపాలన ప్రజల వద్దకు తీసుకొచ్చేందుకు రెండు వేలు మంది జనాభా ఉన్న ప్రతిగ్రామంలో సచివాలయాలు నిర్మించి అనేక సేవలు అందించగలిగామన్నారు. చంద్రబాబు 40 ఏళ్లలో చేయలేనివి జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసి చూపించారన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తే కేసులా? అధికార పార్టీ నాయకులు ఎంతోమంది అర్హులకు పథకాలు ఇవ్వకుండా ఇబ్బందిపెట్టే పరిస్థితి ప్రతిగ్రామంలో ఉందని, వైఎస్సార్సీపీ హయాంలో అవేమి లేకుండా పాలన సాగిందని ధర్మాన అన్నారు. ఏ పోలీస్స్టేషన్కు వెళ్లినా వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు చిట్టానే కనిపిస్తుందని, ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఎంతకాలమూ సాగవన్నారు. బీదలకు అనుకూలంగా అనేక యాక్ట్లపై చంద్రబాబు దుష్ప్రచారం చేసి వాటిని నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. అధికార పార్టీ నేతలు చేసే అరాచకాలు, అన్యాయాలు ప్రశ్నించడమే నిజమైన ప్రతిపక్షమన్నారు. విజిలెన్స్, ఏసీబీ వంటి అవినీతి నిర్మూలన శాఖల్ని వాడుకుని అవినీతిలేని సమాజాన్ని తయారుచేసేందుకు ప్రతిపక్ష నాయుకులు కృషి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అధ్వానంగా ఉండబట్టే ప్రజల్లో అతివేగంగా బలహీనపడిందన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలు గొండు నర్శింగరావు, తంగి సత్యనారాయణ, అంధవరపు తవిటయ్య, పసగాడ సూర్యనారాయణ, గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మిదేవితో పాటు తాను అవినీతిరహిత పాలన అందించాం కాబట్టే ప్రజల్లో మంచి గుర్తింపు పొందగలిగామన్నారు. ప్రజలు నాయకుల వద్ద నుంచి డబ్బులు ఆశిస్తే ప్రభుత్వ ఫలాలు సక్రమంగా తీసుకోలేరన్నారు. అధికార పార్టీ నాయకులు అధికంగా డబ్బు ఖర్చుపెట్టి గెలిచాక ఆ డబ్బులు ఎలా వసూలు చేయాలనే తాపత్రయంతో పాలన చేస్తారే తప్ప నీతివంతంగా చేయలేరన్నారు. పేదల కోసం చంద్రబాబు ఏనాడైనా ఎకరం భూమి అయినా సేకరించి పంచిపెట్టగలిగారా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ హయాంలో నగరంలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలతో పాటు నిర్మాణం పూర్తిచేసి ఇచ్చామన్నారు. శ్రీకాకుళం నగరానికి ఇప్పటికే చాలా చేశానని, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, ప్రజల ఆశీర్వాదంతో మిగిలిన పనులు పూర్తిచేసేందుకు అవకాశం కల్పించాలన్నారు. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం సులువుగా సాధించుకోగలమన్నారు. అందరినీ చైతన్యవంతులు చేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మంచి పనుల్ని అందరికి తెలియజేయాలని కోరారు. జిల్లాకు ఇప్పటికే తీవ్ర అన్యాయం జరుగుతుందని మౌనంగా ఉంటే పనులు జరగవన్నారు. సౌమ్యుడైన చల్ల శ్రీనును వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి బాధ్యతాయుతమైన పదవిని అప్పగించడం సంతోషమన్నారు. పార్టీకోసం మరింత కష్టపడి పనిచేసి సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం చల్ల శ్రీనివాసరావుదని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ●వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన చల్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, న్యాయవాదిగా మంచి గుర్తింపు ఉందని, ఆయన ఆశయాల కోసం పనిచేస్తానన్నారు. సమాజంలో గౌరవంగా బతకాలన్నదే తన లక్ష్యమని, తనకు అప్పగించిన బాధ్యతలను విధిగా నిర్వర్తిస్తానన్నారు. తనకు పదవిని అప్పగించిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్కు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తూర్పుకాపు, కళింగ వైశ్య, పోలినాటి వెలమ కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, అంబటి శ్రీనివాసరావు, గొండు రఘురాం, ముంజేటి కృష్ణ, పొన్నాడ రుషి, శిమ్మ రాజశేఖర్, ఎన్ని ధనుంజయరావు, మండవల్లి రవి, చిట్టి జనార్ధనరావు, టి.కామేశ్వరి, అంబటి నిర్మల, కోణార్క్ శ్రీనివాసరావు, తంగుడు నాగేశ్వరరావు, వైశ్యరాజు మోహనరావు, మూకళ్ళ తాతబాబు, యజ్జల గురుమూర్తి, డాక్టర్ ధర్మాన లక్ష్మీనారాయణ, డాక్టర్ అమ్మన్నాయుడు, చల్ల రవి, బొడ్డేపల్లి పద్మజ, గంగు శారద తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకాల వర్తింపు వైఎస్సార్ సీపీపై అక్కసుతో మంచి పథకాలను సైతం ఆపేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులకు ఏళ్లు గడిచినా మోక్షం కలగడం లేదు చల్ల శ్రీను సన్మాన సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు -
బస్సు ఆపలేదని నిరసన
పోలాకి : బస్సు ఆపడం లేదంటూ బెలమర జంక్షన్ సమీపంలో జీడిపప్పు ఫ్యాక్టరీ వద్ద మహిళలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 5.30 సమయంలో గుప్పెడుపేట–నరసన్నపేట ఆర్టీసీ బస్సు ఫ్యాక్టరీ వద్ద ఆగడంతో మహిళా కార్మికులు ఎక్కేవారు. ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపడంలేదు. ఇదేంటని మహిళలు ప్రశ్నిస్తే అక్కడ స్టాప్లేదని, ముందున్న స్టాప్ దగ్గరకు రావాలని దురుసుగా సమాధానం చెప్పడంతో మహిళలు ఆగ్రహించి బస్సును రోడ్డుమీదే ఆపేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రంజిత్ డ్రైవర్, మహిళలతో మాట్లాడారు. రిక్వెస్ట్ స్టాప్గా పరిగణించాలని సూచించడంతో వివాదం సద్దుమణిగింది. దాదాపు 20 మంది మహిళలు నిత్యం బస్సుకోసం వేచి ఉన్నచోట కాదని, ఇంకోచోట స్టాప్ ఉందని తప్పించుకుంటే ఊరుకునేది లేదని మహిళలు స్పష్టం చేశారు. టికెట్ తీసుకున్నపుడు ఉన్న స్టాప్, ఉచితం అన్నప్పుడు ఎందుకుండదని నిలదీయటం గమనార్హం. వృద్ధుడు ఆత్మహత్య రణస్థలం: లావేరు మండలం బెజ్జిపురం గ్రామానికి చెందిన గురజాపు అప్పలనాయుడు (69) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పలనాయుడు ఈ నెల 10న సాయంత్రం మద్యం సేవించి కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. భార్య మందలించడంతో మనస్థాపం చెంది పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు హెచ్సీ ఎం.విజయానంద్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పుట్టినరోజు నాడే విషాదం
● మొగదాలపాడు బీచ్లో యువకుడు గల్లంతు ● కింతలి ఖాజీపేటలో విషాదఛాయలు గార/పొందూరు: పుట్టిన రోజు వేడుకల కోసం స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వచ్చిన యువకుడు గల్లంతైన ఘటన మొగదాలపాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం కింతలి ఖాజీపేట గ్రామానికి చెందిన అలబాన జగదీష్కుమార్ విశాఖపట్నంలోని ఐటీఐ చదువుతున్నాడు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన జగదీష్కు ఆదివారం పుట్టిన రోజు కావడంతో మరో నలుగురి స్నేహితులతో కలిసి గార మండలం వత్సవలస పంచాయతీ మొగదాలపాడు వచ్చారు. సాయంత్రం బీచ్లో స్నానానికి దిగిన ఐదుగురు కేరింతల్లో ఉండగా భారీ అలకు జగదీష్ గల్లంతయ్యాడు. వెంటనే గాలించినా జాడ దొరకలేదు. మైరెన్ సీఐ బి.ప్రసాదరావు ఘటనా స్థలానికి వెళ్లి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జగదీష్ తండ్రి గోవిందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు, గాలింపు చర్యలు చేపట్టామని ఏఎస్ఐ తెలుగు చంద్రశేఖర్ తెలిపారు. -
సలామ్
త్యాగాలకు వీరోచితంగా పోరాడి.. కోటబొమ్మాళి మండలం జర్జంగి గ్రామానికి చెందిన ఎ.పాపారావు 1971లో పోలీస్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో పలాస మండలం నీలిభద్రలో కంబిరిగాం చౌదరి అనేవ్యక్తిని హతమార్చి ఆస్తిని దోచుకునేందుకు నక్షలైట్లు ప్రణాళిక రచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురు కానిస్టేబుళ్లతో పికెట్ ఏర్పాటుచేసి హెడ్ కానిస్టేబుల్ పాపారావును ఇన్చార్జిగా నియమించారు. 1997 జులై 17న అర్ధరాత్రి మావోయిస్టులు ఆ ఇంటిపై తుపాకుల గుళ్లతో దాడికి ఎగబడ్డారు. చౌదరిని రక్షించే క్రమంలో వీరోచితంగా పోరాడిన పాపారావు వీరమరణం పొందారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తూ.. పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి వెంకటరమణ 1998లో కానిస్టేబుల్గా చేరారు. జిల్లా స్పెషల్ టాస్క్ఫోర్స్లో విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందారు. బత్తిలి పీఎస్ పరిధిలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో అక్కడి ఎస్ఐ, ఆర్ఎస్ఐ వెంకునాయుడు, 27 మంది స్పెషల్ టాస్క్ఫోర్స్ సిబ్బందితో కలిసి నులకజోడు గ్రామానికి చేరుకున్నారు. 16 మంది మావోయిస్టులు ముందుగా ఐదుచోట్ల పాతిపెట్టిన మందుపాత్రలను పేల్చి పోలీసులపై కాల్పులు జరిపారు. వెంకటరమణ వీరోచితంగా పోరాడి కాల్పుల్లో మరణించారు. శ్రీకాకుళం క్రైమ్: లక్షలాది జనాభా పాల్గొనే సమావేశాలు.. ఇసుకేస్తే రాలనంత రద్దీగా ఉన్న దేవాలయాలు.. మండుతున్న ఎండల్లో భోజనం లేకపోయినా బందోబస్తు కాయాల్సిందే. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో విధులంటే కత్తిమీద సామే. అలా నక్సలైట్ల దాడుల్లో అశువులు బాసిన పోలీసులు ఎందరో అమరులయ్యారు. ప్రతీ ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారిని స్మరిస్తూ జిల్లాలో ఈ నెల 21 నుంచి 31 వరకు స్మారకోత్సవాలను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధమయ్యారు. స్మారకోత్సవం ఎందుకంటే.. 1959 అక్టోబరు 21న దేశ సరిహద్దులో చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం దీటుగా ఎదురొడ్డి పోరాడింది. జవాన్లు పది మంది ప్రాణాలను కోల్పోవడమే కాక ఎంతోమంది పోలీసులు సైతం వివిధ ఘటనల్లో ప్రాణాలు సైతం కోల్పోయారు. వీరి సేవలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరులు సంస్మరణ దినాన్ని ఏటా నిర్వహిస్తున్నారు. జిల్లాలో పలువురు అమరులైన పోలీసులను, వారి త్యాగాలను స్మరించుకుందాం. పీపుల్స్ గ్రూప్ చేతిలో బలి.. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని సంతకవిటి మండలం వాల్టేరు గ్రామానికి పి.కృష్ణమూర్తి 1988లో పోలీస్ కానిస్టేబుల్గా చేరారు. మావోయిస్టుల కార్యకలాపాల సమాచార సేకరణలో కీలకంగా వ్యవహరించడంతో ఇతన్ని మట్టుబెట్టేందుకు నక్షక్సల్స్ పథక రచన చేశారు. మందస పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో 2000 జూన్ 5న పీపుల్ గ్రూప్ నక్సలైట్లు మాటువేసి హరిపురం కూడలికి చేరుకున్న కృష్ణమూర్తి, పీసీ కె.రమేష్లపై దాడిచేశారు. ఆ దాడిలో కృష్ణమూర్తి నేలకొరిగారు.సమాచార సేకరణలో దిట్ట .. టెక్కలి గ్రామానికి చెందిన ఎం.నరేంద్రదాస్ 1976లో పోలీస్ కానిస్టేబుల్గా విధుల్లో చేరారు. మావోయిస్టుల సమాచార సేకరణలో దిట్టగా పేరుగాంచారు. వారి ఉద్యమాలను నీరుగార్చేందుకు విశేష కృషి చేశారు. మావోయిస్టుల కదలికలను గమనించి వారి ఆకృత్యాలను నిరోధించడంలో నరేంద్రదాస్ సఫలమవుతుండటాన్ని వారు సహించలేకపోయారు. 1997 మార్చి 17న కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు వెళ్లే సమయంలో దారిలో దైవ దర్శనానికి ఆగి ఉన్న సమయం చూసి మావోయిస్టులు కాల్పులు జరపగా దాస్ వీరమరణం పొందారు. రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జిల్లాలో అమరులైన ఐదుగురు పోలీసులు స్మారకోత్సవాలకు సన్నద్ధమైన పోలీసు అధికారులు -
డీఏ ప్రకటన కంటితుడుపు చర్య
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగులకు అనేక అమలు చేయలేని హామీలిచ్చిన చంద్రబాబునాయుడు 16 నెలల తరువాత ఒక్క డీఏ మాత్రమే ప్రకటించడం భావ్యం కాదని వైఎస్సార్సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్కూరు ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఉద్యోగులకు ఆశ కల్పించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ముఖం చాటేయడం సిగ్గుచేటన్నారు. పీఆర్సీ, ఐఆర్ కాకుండా ఒక్క డీఏ ఇవ్వడం దారుణమన్నారు. సీఎం, డిప్యూటి సీఎం, విద్యాశాఖ మంత్రులు సొంత పనులకోసం కోట్లాది రూపాయిలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కూటమి సర్కారుకు పెన్షనర్లు, ఉద్యోగుల సంక్షేమం పట్టడం లేదని దుయ్యబట్టారు. ఇదే వైఖరి కొనసాగిస్తే భవిష్యత్లో తగిన మూల్యం చెల్లంచుకోక తప్పదన్నారు. శ్రీకాకుళం: రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు కంటితుడుపు చర్యగా రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే ప్రకటించడం సరికాదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పేడాడ కృష్ణారావు, పూజారి హరిప్రసన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు, విశ్రాంత ఉద్యోగులకు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నా వాటిని చెల్లించకుండా బకాయిపడిన నాలుగు డీఏలలో కేవలం డీఏ చెల్లించడం ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిదర్శనమన్నారు. మధ్యంతర భృతి ప్రకటన చేయకుండా, మూడేళ్లుగా ఉద్యోగుల సంపాదిత సెలవుల డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఒకవైపు చెబుతూనే, మరోవైపు విశాఖపట్నంలో ప్రతిపాదిత గూగుల్ డేటా సెంటర్కు సంవత్సరానికి 22 వేల కోట్ల రూపాయలు రాయితీని ప్రకటించడం దేనికి నిదర్శనమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పకుండా, ఉద్యోగ వర్గాలను నిర్లక్ష్యం చేయడం భావ్యం కాదన్నారు. బుక్కూరు ఉమామహేశ్వరరావు పేడాడ కష్ణారావు -
హోటల్ రంగంతో ఉపాధి అవకాశాలు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): హోటల్ రంగం ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లోజిల్లా హోటల్స్, రెస్టారెంట్స్, బేకర్స్, ఫంక్షన్ హాల్స్ అసోసియేషన్, టౌన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం శనివారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మెట్ట నాగరాజు నాయకత్వంలో ప్రధాన కార్యదర్శిగా కెల్ల కిశోర్ కుమార్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా అంధవరపు సతీష్, కోశాధికారిగా అంధవరపు తిరుమలరావు ప్రమాణస్వీకారం చేశారు. టౌన్ అధ్యక్షుడిగా అరవల సతీష్, జనరల్ సెక్రటరీగా తుంబలి సుదర్శన్ పట్నాయక్, కోశాధికారిగా టంకాల కృష్ణ, ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా ఏ.సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, శ్రీకాకుళం జిల్లా సెంట్రల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వి.ఆనంద్, ఎస్.వి.డి మురళీ తదితరులు పాల్గొన్నారు. -
పాములు వద్దు.. పాఠశాల ముద్దు
● పాములు పట్టేందుకు వెళుతున్న పిల్లల్ని గమనించిన ఎంఈఓ, హెచ్ఎం ● తల్లిదండ్రులను ఒప్పించి బడిలో చేర్పించిన వైనం కంచిలి : ఇటీవల కంచిలి మండలం చొట్రాయిపురం పాఠశాలకు సందర్శనకు వచ్చిన ఎంఈఓ ఎస్.శివరాంప్రసాద్కు.. పాములు పట్టేందుకు వెళుతున్న రాఘవ అనే బడిఈడు పిల్లాడు కనిపించాడు. వెంటనే ప్రధానోపాధ్యాయుడు మడ్డు తిరుపతిరావుతో కలిసి బాలుడి తల్లిదండ్రులు గురించి వాకబు చేశారు. అక్కడ సమీపంలో కొండపై నివసిస్తూ పాములు పట్టుకొని జీవనోపాధి సాగిస్తున్న దంపతులు చెరుకూరి రమేష్, లక్ష్మీల వద్దకు వెళ్లారు. వారి పిల్లలు రాఘవ, దీప్తిలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించమని చెప్పి ఒప్పించారు. దీంతో వారు తమ ఇద్దరు పిల్లలను శనివారం పాఠశాలకు తీసుకొచ్చారు. అబ్బాయి రాఘవను ప్రాథమిక పాఠశాలలో, బాలిక దీప్తిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. కార్యక్రమంలో సీఆర్పీ యారడి దీనబంధు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం అపహాస్యం
కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ పంచాయతీ మహాసింగిగూడ ఆర్ఆర్ కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అపహ స్యం చేసేవిధంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏకోపా ధ్యాయ పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. 18 మంది పిల్లలకు పాఠశాల అవరణలో వంట చేయడం లేదు. ఇంటి వద్ద వంట చేసి పాఠశాలకు వంట ఏజెన్సీ సభ్యురాలికి బదులు ఆమె భర్త ప్రతిరోజూ తీసుకొచ్చి విద్యార్థులకు వడ్డన చేస్తుంటారు. శనివారం మధ్యాహ్నం భోజనా న్ని పాఠశాలలో కేవలం నలుగు విద్యార్థులు మాత్ర మే చేశారు. అయితే నలుగు విద్యార్థులకు కేవలం అన్నం, కూర పెట్టారు తప్ప, చారు మాత్రము తీసుకు రాలేదు. చారులేక పోవడంతో విద్యార్థులు భోజనం చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. మిగిలిన 14 మంది విద్యార్థులు గ్రామంలో జరిగిన అన్నదా న కార్యక్రమానికి హాజరైనట్లు పాఠశాల ఉపాధ్యాయుడు తెలిపారు. పాఠశాల వద్ద గదులు సక్రమంగా లేకపోవడం వలన ఇంటి వద్ద వంట చేయిస్తున్నట్లు చెప్పారు. -
భారీగా మందుగుండు నిల్వలు సీజ్
కంచిలి: మండలంలో అనుమతి పొందిన నాలుగు మందుగుండు దుకాణాల్లో అధిక మొత్తంలో టపాసులు నిల్వలు ఉన్నాయనే కారణంతో పోలీసులు ఆ సరుకును సీజ్ చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో వివరాలు తెలియజేశారు. కంచిలిలో బలియాపుట్టుగ వద్ద తెల్లి వైకుంఠరావుకు చెందిన రూ.2,69,470ల సరుకు, అంపురం వద్ద సుంకర మణికంఠకు చెందిన రూ.1,71,900ల సరుకు, జాడుపూడిలో దూపాన సునీల్కు చెందిన రూ. 1,16,497లు విలువ కలిగిన సరకు, అదే గ్రామంలో దూపాన శ్రీనివాసరెడ్డికి చెందిన రూ.1,15,300 లు విలువ గల సరకును సీజ్ చేసినట్లు వెల్లడించారు. సారవకోట: మండలంలోని కొమ్ముసరియాపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ సిబ్బంది రూ.50 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన పైల సుశీల, లుకలాపు తిరుపతిరావు బాణసంచాతో పాటు బాణసంచా తయారు చేయడానికి కావాల్సిన ముడి సరుకులు కలిగి ఉండడంతో టాస్క్ఫోర్స్ సిబ్బంది వారి ఇళ్లపై దాడిచేసి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బాణసంచాను సారవకోట పోలీసుస్టేషన్కు అప్పగించారు. దీంట్లో పైల సుశీల వద్ద నుంచి రూ.30 వేలు విలువ కలిగిన బాణసంచా, లుకలాపు తిరుపతిరావు నుంచి రూ.20 వేలు విలువ కలిగిన బాణసంచా స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేశారు. -
అనుమతులెలా ఇచ్చారు..?
టెక్కలి: జనావాసాలు, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో బాణసంచా విక్రయాలకు ఎలా అనుమతులిచ్చారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ టెక్కలి అగ్నిమాపక అధికారి సూర్యారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో ప్రత్యేక పారిశుద్ధ్య పనుల పరిశీలన కోసం విచ్చేసిన ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎదురుగా ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిశీలన, స్థానిక అభ్యంతరాలు చూడకుండా కేవలం పత్రాలు చూసి అనుమతులు ఇచ్చారా అని నిలదీశారు. తక్షణమే అభ్యంతరకంగా ఉన్న దుకాణాన్ని మార్పు చేయాలని ఆదేశించారు. ఆయనతో పాటు టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, తహసీల్దార్ బి.సత్యం, డీఎల్పీవో ఐ.వి.రమణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఇచ్ఛాపురం రూరల్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో స్వగ్రామం లొద్దపుట్టిలో విషాదచాయలు అలముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లొద్దపుట్టి గ్రామం అంబుగాం వీధికి చెందిన పిట్ట మోహనరావు, కుమారీల కుమారుడు పిట్ట వసంత్(32) కాకినాడలో చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం తండ్రి మోహనరావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ భారాన్ని మోస్తున్న వసంత్, ఈ ఏడాది మార్చి 7న ఇచ్ఛాపురం బెల్లుపడకు చెందిన సంధ్య ఉరఫ్ ఇందును వివాహం చేసుకున్నాడు. శనివారం అరకు విహార యాత్ర కోసం తన ద్విచక్ర వాహనంపై భార్య సంధ్యను తీసుకొని వెళ్తుండగా, ప్రత్తిపాడు మండలంలోని ధర్మవరం గ్రామ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంజరిగింది. ఈ ప్రమాదంలో వసంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్య తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలై చికిత్స పొందుతోంది. జాతీయ రహదారిపై ధర్మవరం గ్రామ సమీపంలో రొయ్యల మేత తీసుకెళ్తున్న వ్యాన్ మరమ్మతులకు గురికావడంతో నిలిపివేశారు. ఆగి ఉన్న వ్యాన్ను వసంతకుమార్ బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నవ దంపతులను మృత్యువు విడగొట్టిందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. -
అమోనియా కంటైనర్ బోల్తా
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలంలోని జర్జంగి గ్రామ సమీప జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒక భారీ కంటైనర్ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు అమోనియా లోడ్తో వెళ్తున్న భారీ కంటైనర్ జర్జంగి గ్రామ సమీపంలోకి రాగానే అదుపు తప్పి డివైర్ను ఢీకొని బోల్తాపడింది. సమాచారం అందుకున్న కోటబొమ్మాళి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు జరుగకుండా చర్యలు తీసుకున్నారు. అరసవల్లి: రాష్ట్రంలో మన జిల్లాను స్వచ్ఛంగా మార్చుకుందామని కేంద్రమంత్రి కె.రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. మూడో శనివారం పురస్కరించుకొని వాయు కాలుష్య నివారణ థీమ్తో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని అరసవల్లి ఇంద్ర పుష్కరిణి వెనుక భాగంలో కాజీపేట కూడలి వద్ద చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్యకర సమాజాన్ని రూపొందించవచ్చన్నారు. అనంతరం కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే గొండు శంకరరావు, కార్పొరేషన్ కమిషనర్ ప్రసాదరావు, అరసవల్లి ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్, జిల్లా పర్యాటక శాఖాధికారి ఎన్.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఆమదాలవలస: ఇటీవల కొన్ని పత్రికలు, ఛానళ్లలో వచ్చిన వార్త కథనాలు పూర్తి అవాస్తవమని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. తనకు ఎటువంటి గ్యాంగ్లు లేవని, తన బలం ప్రజలేనని తెలిపారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు ఎవరు నమ్మవద్దని కోరారు. కొంతమంది వ్యక్తులు బాధితులను ఉసుగొల్పి తప్పుడు ఆరోపణలు చేయించారన్నారు. బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులకు తన సాను భూతి తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసు అధికారులు సమగ్ర విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. వార్తలు ప్రచురించే ముందు ధ్రువీకరించుకోవాలని మీడియా ప్రతినిధులకు సూచించారు. -
పరేషన్..!
జలుమూరు: అక్టోబర్ నెలకు సంబంధించి నిత్యావసర సరుకుల దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం తక్కువగా రావడంతో రేషన్ బియ్యం అందక వందల సంఖ్యలో లబ్ధిదారులు నష్టపోయారు. ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద ఉన్న వే బ్రిడ్జి పాడైపోవడంతో బియ్యం బ్యాగుల్లో నాలుగు కేజీల వరకూ తరుగుతో తూకం వేయడం వలనే ఈ సమస్య వచ్చిందని డీలర్లు చెబుతున్నారు. దీంతో రేషన్ కార్డుదారులకు ఇవ్వాల్సిన బియ్యం సరిపోలేదు. ఫలితంగా రేషన్ దుకాణాల్లో బియ్యం లేకపోవడంతో డీలర్లు లబ్ధిదారులను తిప్పి పంపారు. మండలవ్యాప్తంగా 53 రేషన్ డిపోలకు 18,583 రేషన్ కార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 450 టన్నుల బియ్యం రావడంతో వాటిని ఆయా డీలర్లకు పంపించడం జరిగిందని ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి కోటేశ్వరరావు తెలిపారు. ఇంతవరకూ బాగున్నా ఎంఎల్ఎస్ పాయింట్ వద్ద వే బ్రిడ్జి పాడైపోవడంతో బస్తాల్లో రెండు నుంచి నాలుగు కేజీల వరకూ తరుగు వస్తోందని దీనివల్ల అర్హులైన లబ్ధిదారులు నష్టపోతున్నారని సీఎస్డీటీ షరీప్ చెబుతున్నారు. వీటితోపాటు కొత్త రేషన్ కార్డుదారులకు బియ్యం ఇవ్వాలని నిబంధన ఉన్నా.. వాటికి సంబంధించిన అలాట్మెంట్ పౌర సరఫరా అధికారులు ఇవ్వకపోవడంతో బియ్యం సరిపోలేదని డీలర్లు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈనెల బియ్యం 955 కార్డుదారులకు ఇంకా అందలేదు. దీనిపై సీఎస్డీటీ షరీఫ్ మాట్లాడుతూ ఎవరెవరికి బియ్యం అందలేదో ఆయా డీలర్ల ద్వారా అడిగి వారికి బియ్యం అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నాకు ఈనెల బియ్యం ఇంకా ఇవ్వలేదు. అలాగే ఇంటికి వచ్చి వేలిముద్రలు తీసుకుంటామన్నారు. డీలర్లను అడితే పక్క గ్రామం వెళ్లమన్నారు. ఇదెక్కడ న్యాయం. నేను 75 ఏళ్ల ముసలిదానిని. నేను కిలోమీటర్ల దూరం ఎలా వెళ్లగలను. అధికారులు స్పందించి నా బియ్యం నాకు ఇప్పించాలి. – మెట్ట చిన్నమ్మి, వృద్ధురాలు, గంగాధరపేట రేషన్ పంపిణీలో వృద్ధులకు అవస్థలు తప్పడం లేదు. జగన్ ప్రభుత్వంలో వలంటీర్లతో ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ప్రతినెలా ఇబ్బంది అవుతోంది. ఈనెల ఏకంగా బియ్యమే లేవంటున్నారు. మా పరిస్థితి ఏంటి. – మామిడి మల్లమ్మ, వృద్ధురాలు, గంగాధరపేట -
దీపావళిజాగ్రత్తలతోనే ఆనంద కేళీ..!
●ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు ●21 ఏళ్ల క్రితం జిల్లాలో భారీ విషాదం ●జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలుశ్రీకాకుళం క్రైమ్: దీపావళి అంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ. ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చుతూ.. మిఠాయిలు పంచుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. అయితే దీపావళి ఆనందంగా జరుపుకోవాలంటే జాగ్రత్తలు పాటించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం, అలసత్వం వహించినా ఆస్తి, ప్రాణ నష్టం జరిగి విషాదం మిగులుతుంది. అలాంటి చీకటి రోజును జిల్లా 21 ఏళ్ల క్రితం చూసింది. 2004వ సంవత్సరం నవంబర్ 4వ తేదీన జిల్లా కేంద్రంలో చిన బజారులోని ఒక నివాస గృహం గ్రౌండ్ ఫ్లోర్లో అక్రమ పేలుడు పదార్థాల నిల్వలు పేలడంతో ఘటనా స్థలంలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృత్యువాత పడ్డారు. ఆనాటి ఘటన తలచుకుంటే ఇప్పటికీ జిల్లా ప్రజలకు ఒళ్లు గగుర్పొడుస్తుంది. పేలుళ్లు జరిగిన మరుసటి రోజు జరిగిన ప్రాంతమంతా క్లీన్ చేశారు. ఆ మరుసటి రోజు నిల్వల డంప్ అంతా (కాలిపోయినవే అని) డే అండ్ నైట్ సమీప నాగావళి నది వద్ద పారబోసేందుకు వ్యాన్లో వెళ్లారు. ప్రమాదవశాత్తు అక్కడ కూడా ఆ చెత్తలో కొన్ని పేలుడు పదార్థాలు పేలడంతో అక్కడికక్కడే డ్రైవర్, క్లీనర్, మరో హెల్పర్ మృత్యువాత పడ్డారు. నువ్వలరేవులో సైతం.. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో దాదాపు 25 ఏళ్ల క్రితం శ్రీరామనవమి ఉత్సవాల్లో బాణాసంచా పేల్చేందుకు కొందరు అక్రమంగా భారీ ఎత్తున పేలుడు పదార్థాలు నిల్వలు ఉంచారు. ప్రమాదవశాత్తు అవి కూడా పేలడంతో అప్పట్లో అధిక సంఖ్యలో మృత్యువాత పడినా.. నలుగురైదుగురే చనిపోయినట్లు రికార్డులకెక్కించారు. మృతదేహాలను సమీప ఇసుక దిబ్బల్లో పాతివేసినట్లు ఇప్పటికీ ఆ ప్రాంతంలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పటి ఎస్ఐ కృష్ణ సస్పెండయ్యారు. నాణ్యమైన కంపెనీలు తయారు చేసిన బాణసంచాను వినియోగించాలి. వేగంగా కాలే స్వభావం ఉన్నవి ఇళ్లల్లో నిల్వ ఉంచరాదు. కిరోసిన్, గ్యాస్ నిల్వ చేసే గదుల్లో, వంట గదుల్లో బాణసంచా ఉంచరాదు. చిన్నపిల్లలను దూరంగా ఉంచాలి. కాల్చేటప్పుడు పొడుగాటి కర్రకు కాకర్లు, వగైరా కట్టి కాల్చాలి. చేతిలో గానీ, దగ్గరలో గానీ బాంబులు కాల్చకూడదు. సగం కాలిన మందుగుండుని నిర్లక్ష్యం చేయరాదు. బాణసంచా కాల్చేటప్పుడు సమీపంలో నీళ్లు, ఇసుక ఉంచుకోవాలి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలి. రోగులు, వృద్ధులు, పసిపిల్లలు, గర్భిణులు దూరంగా ఉండాలి. రాకెట్లు, ఫైర్ క్రాకర్లు వంటి క్షిపణులను టిన్ బాటిళ్లలో పెట్టి వెలిగించకూడదు. గుడిసెలు, గడ్డివాములు, పెట్రోల్ బంకులకు దూరంగా రాకెట్లను, పటాకులు కాల్చాలి. అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణమే దగ్గరలో ఉన్న అగ్నిమాపక కేంద్రం లేదా 101కి ఫోన్ ద్వారా సమాచారమివ్వాలి. తాత్కాలిక షాపులకు లైసెన్సులను ఆయా పరిధి ఆర్డీవోనే అందజేస్తారు. పోలీస్, ఫైర్, రెవెన్యూ, పంచాయతీ (లేదా) వార్డు అన్ని అనుమతులు అందులోనే ఉంటాయి. క్వాలిటీ అయినవి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవి కాల్చి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. – జడ్డు మోహనరావు, జిల్లా అగ్నిమాపక అధికారి అక్రమంగా మందుగుండు సామాగ్రి తయారు చేసినా, నిల్వలు కలిగి ఉన్నా, అమ్మినా కఠిన చర్యలు తప్పవు. లైసెన్సులు లేకుండా మందుగుండు అమ్మితే కేసులు నమోదు చేస్తాం. ఇప్పటికే దాడులు చేస్తున్నాం. ఎవరైనా లైసెన్సులు లేకుండా అమ్మినా నేరుగా ప్రజలు సమాచారమివ్వవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు వహించి ప్రజలు దీపావళి జరుపుకోవాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం -
మోసం చంద్రబాబు నైజం
జలుమూరు: ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా మోసం చేయడమే చంద్రబాబు నైజమని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని కరవంజ – టెక్కలిపాడు క్లస్టర్ సమావేశంలో శనివారం మాట్లాడారు. పేదలకు వైద్యం దూరం చేయడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. అందుకు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు కార్యక్రమం తలపెట్టామని తెలియజేశారు. అన్నమయ్య జిల్లాలోని మునకల చెరువుతో పాటు నరసన్నపేట నియోజకవర్గంలో బుడితి వద్ద అవలింగి గ్రామంలో మినీ పరిశ్రమ పెట్టి టీడీపీ నాయకులు మద్యం కల్తీ చేస్తున్నారని మండిపడ్డారు. నరసన్నపేటలో ఎమ్మెల్యే రమణమూర్తిదే సిండికేట్ అని, వారి కుటుంబ సభ్యుల పేరిట మద్యం షాపులు ఉన్నాయని వివరించారు. అవలింగిలో కల్తీ జరిగిన మద్యం పట్టుకున్న అధికారులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరించాలన్నారు. రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతు పండించిన పంటలకు మద్దతు ధర లేదని మండిపడ్డారు. అనంతరం డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాన గోపి, జిల్లా కార్యదర్శి ఎం.శ్యామలరావు, సర్పంచ్ జుత్తు నేతాజీ, గొల్లంగి జగన్నాథరావు, జిల్లా బూత్ లెవెల్ అధ్యక్షుడు దామ మన్మథరావు, రకావాడ చందనబాబు, ధర్మాన జగన్, ధర్మాన బువాజీ, తర్ర జీవరత్నం, కె.కూర్మారావు, బండి ఎర్రన్న, బలగ లక్ష్మీ, అర్జున్, ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
టపాసుల విక్రయాలకు అనుమతులు తప్పనిసరి
శ్రీకాకుళం పాతబస్టాండ్: దీపావళి టపాసుల విక్రయాలు జరిపేందుకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో కలసి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షాపుల వద్ద అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 11 అర్జీల స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన స్వాభిమాన్ దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్పుండ్కర్తో పాటు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ వినతులు స్వీకరించారు. 11 శుక్రవారాల్లో 169 అర్జీలు వచ్చాయన్నారు. ప్రతి నెలా జాబ్మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్ మరమ్మతులకు గురైతే వాటి మరమ్మతులకు జిల్లా పరిషత్లో ఒక రూం కేటాయించి అక్కడే మరమ్మతులు చేపడతారని చెప్పారు. ఈ వారం స్వాభిమాన్కు 11 అర్జీలు అందాయి. అర్జీల స్వీకరణలో జెడ్పీ సీఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు బలికావద్దు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పలాస: రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు బలి కావద్దని, శాంతిని కోరుకునే జిల్లాలో హింసను ప్రోత్సహించవద్దని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు కోరారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కల్తీ మద్యం నిరసనకు సంబంధించి జరుగుతున్న వ్యవహారంపై ఆరా తీశారు. పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణులను రెచ్చగొడుతున్నారని, ఇది సరికాదన్నారు. ప్రభు త్వం ఇలాంటి చర్యలకు పాల్పడడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలో గుణపాఠం చెబుతారని అన్నారు. అప్పలరాజును పరామర్శించిన వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్, ఇచ్ఛాపురం మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి, స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు తదితరులు ఉన్నారు. -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలైన పంచారామాలను దర్శించుకునేందుకు వీలుగా ఆర్టీసీ సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను ప్రయాణికులు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ పిలుపునిచ్చా రు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో కార్తీకమాసంలో శైవ క్షేత్రాలకు నడుపు ప్రత్యేక బస్సులకు సంబంధించిన కరపత్రాలను శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో పంచారామాలను దర్శించుకునేందుకు వీలుగా ఈ నెల 26వ తేదీన, అక్టోబరు 2వ తేదీన, అక్టోబరు 9వ తేదీన అక్టోబరు 16వ తేదీల్లో జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పంచారామాలకు బయల్దేరుతాయని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఒక్కొక్కరికి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సునకు రూ.2,400గాను, అల్ట్రా డీలక్స్ బస్సునకు రూ.2,350గా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణీకులు, భక్తులందరూ ఉపయోగించుకోవాలని కోరారు. -
షిర్డీసాయిబాబా మందిరంలో చోరీ
పాతపట్నం: పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు సమీపంలోని షిర్డీగిరిపై షీర్డీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి చోరీ జరిగింది. ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం షిర్డీసాయి బాబా మందిరం వెనుక పక్క ఉన్న వెంటిలేటర్ రంధ్రం ద్వారా దొంగలు లోపలికి వెళ్లి 500 గ్రాముల వెండి పల్లెం, పెట్టెలో రూ.23,150 నగదు, హుండీ కానుకలను చోరీ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు భక్తులు వచ్చి చూసేసరికి చోరీ జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్ టీం వచ్చి మందిరం, హుండీని పరిశీలించారు. సీసీ కెమెరాల వైర్లు తెంచినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
తప్పులతడకగా రీ సర్వే
● నరసన్నపేటలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు నరసన్నపేట: భూ సమస్యలను పరిష్కరించేందుకు గత ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేను కూటమి ప్రభుత్వం సక్రమంగా నిర్వహించడం లేదని, ఇప్పుడు కూడా భూములపై తమకు హక్కులు కల్పించరా.. అంటూ చెన్నాపురం, నడగాంకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నరసన్నపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి లోపల బైఠాయించారు. ఎన్నో ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న రీ సర్వేలో కూడా హక్కులు కల్పించకపోతే ఎలా అని అధికారులను నిలదీశారు. వెబ్ల్యాండ్ ప్రకారం, అడంగల్ ప్రకారమే మళ్లీ పేర్లు వస్తున్నాయని, ఒకరి పొలం మరొకరి పేరున వస్తుందని.. అసలు పొలమే లేని వారిపేరున ఎకరాలు చూపుతున్నారని ఆందోళన చెందారు. భూములు అమ్ముకున్న వారి పేరిటే మళ్లీ భూమి హక్కులు కనిపిస్తున్నాయని, ఇష్టానుసారంగా రైతుల పేర్లు మార్చేశారని రైతులు కె.రమణమూర్తి, గొనపు బాబూరావు, సనపల సూరిబాబు, దుప్పట్ల రాజశేఖర్, ధర్మారావు, రమణ, బాబ్జీ, కొంక్యాన నర్శింహమూర్తి, చిట్టిబాబు తదితరులు వాపోయారు. రికార్డులు సక్రమంగా తీర్చిదిద్దాలని, మళ్లీ రీ సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాగా, నిబంధనల మేరకే రీ సర్వేలో భూహక్కులు కల్పిస్తున్నామని, మీరు అనుకున్న విధంగా హక్కులు కల్పించమంటే తమవల్ల కాదని తహసీల్దార్ సత్యనారాయణ, సూపరింటెండెంట్ పి.శ్రీనివాసరావులు చెప్పడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. గ్రామానికి వస్తామని, తప్పులుంటే నిబంధనల మేరకు సరిచేస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు వెనుదిరిగారు. -
చెరువులో ఆక్రమణలు కూల్చివేత
పొందూరు: లోలుగు గ్రామంలో చెరువు గర్భంలో ఆక్రమణలను రెవెన్యూ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లోలుగు గ్రామంలోని 111 సర్వే నంబర్లో 5.44 ఎకరాల్లో కూర్మగుండం చెరువు ఉంది. అందులో సుమారు 25 సెంట్లలో 17 మంది షెడ్డ నిర్మాణంతో పాటు కొంతభాగం ఇళ్ల నిర్మాణం చేపట్టారు. చెరువు గర్భం ఆక్రమణపై కొందరు గ్రామస్తులు పొందూరు తహసీల్దార్ కార్యాలయంతో పాటు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ఆరు నెలలు క్రితం పొందూరు రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో 17 మంది 25 సెంట్ల స్థలం ఆక్రమించినట్లు గుర్తించారు. ఆక్రమణలు తొలగించాలని రెండు నెలల క్రితం పొందూరు తహసీల్దార్ ఆర్.వెంకటేష్ నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందన లేకపోవడంతో శుక్రవారం పోలీసుల సమక్షంలో ఆక్రమణలను తొలగించారు. ఈ సమయంలో బాధితులు మాట్లాడుతూ తాము ఈ స్థలాలను 15 ఏళ్ల క్రితం కొనుగోలు చేశామని, వాటిని ఎలా తొలగిస్తారంటూ అధికారులను నిలదీశారు. సంబందిత స్థలాన్ని కొనుగోలు చేసి షెడ్డును నిర్మించుకుని పిండిమిల్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని అధికారులకు పిసిని శ్యామలరావు తెలిపారు. ఇదే షెడ్డును తొలగించాలని తమకు ఇబ్బంది పెడుతూ, దౌర్జన్యం చేస్తున్నారని, కలెక్టర్ గ్రీవెన్సులో సైతం ఫిర్యాదు చేశానని చెప్పారు. తొలగింపుల్లో వివక్షత చూపుతున్నారంటూ బాధితులు వాదించారు. చెరువు గర్భాలలో చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటిని తొలగించారా అని నిలదీశారు. ఈ సమయంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తమ విధులకు అడ్డుపడితే చర్యలు తప్పవని తహశీల్దార్ వెంకటేష్, సీఐ సత్యనారాయణలు ఆక్రమణదారులను హెచ్చరించారు. ఎస్సై వి.సత్యనారాయణ, జి.బాలరాజు, సర్వేయర్ గణపతి, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ట్యాంకర్ షిప్లో పనిచేసేందుకు వెళ్తూ..
గార: ట్యాంకర్షిప్లో విధుల్లో చేరేందుకు వెళ్తూ బోటు బోల్తా పడిన ఘటనలో గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపిల్లి తారకేశ్వరరావు గల్లంతయ్యాడు. ఈ మేరకు షిప్పింగ్ సంస్థ కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చింది. స్కార్పియో షిప్పింగ్ సంస్థ, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. సంస్థలో ట్యాంకర్షిప్లో బూసన్ (సూపర్వైజర్)గా పనిచేస్తున్న తారకేశ్వరరావు ఈ నెల 12న స్వగ్రామం నుంచి బయలుదేరాడు. గురువారం మోజాంబికా సముద్రతీరంలో ఉన్న ట్యాంకర్ షిప్లో డ్యూటీ ఎక్కేందుకు గానూ 12 మంది బృందంతో కలసి లాంచ్ బోటులో ప్రయాణం చేస్తుండగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఐదుగురు సురక్షితంగా కాగా, ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన ఐదుగురిలో తారకేశ్వరరావు ఒకరు. దీంతో భార్య లక్ష్మీకాంతమ్మ, ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యుల్లో విషాదఛాయలు అలముకున్నాయి. మత్స్యకార సామగ్రి దగ్ధం రణస్థలం: కొవ్వాడ గ్రామంలో బడె మహందాతకు చెందిన కమ్మల షెడ్ శుక్రవారం తెల్లవారుజామున అగ్నికి ఆహుతైంది. తహసీల్దార్ సనపల కిరణ్ కుమార్, బాధితుడు మహందాతకు తెలిపిన వివరాల ప్రకారం.. కొవ్వాడ తీరంలోని సముద్రం ఒడ్డున తాటి, కొబ్బరి కమ్మలతో షెడ్ ఉంది. అందులో మత్స్యకారులకు చెందిన 12 పెద్ద వలలు, మర బోటు, ఇంజన్ బోటు, తాళ్లు ఉన్నాయి. ఈ షెడ్కు విద్యుత్ సరఫరా లేదు. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు గ్రామస్తులు చూసేసరికి కమ్మల షెడ్ కాలిపోయి కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు షెడ్ కాల్చి వేసి ఉంటారని బాధితుడు అనుమానిస్తున్నాడు. సుమారు రూ.25 లక్షలు వరకు నష్టం చేకూరిందని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని ఎఫ్డీవో గంగాధర్, జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి పరిశీలించారు. -
వైఎస్సార్ సీపీలో పలువురి చేరిక
కవిటి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేయడం మరెవ్వరికీ సాధ్యం కావని కొత్తగా పార్టీలో చేరిన పలువురు కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కవిటి మండలం కొత్తపుట్టుగలో ఎమ్మెల్సీ నర్తు రామారావు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో టీడీపీ నుంచి పలువురు కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. శావసానపుట్టుగకు చెందిన వీరికి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ, తమకున్న నమ్మకానికి భరోసా పెరిగి వైఎస్సార్సీపీలో చేరినట్టు వారు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్సీపీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కార్యదర్శులు సాడి శ్యాంప్రసాద్రెడ్డి, నర్తు నరేంద్రయాదవ్, పిలక రాజలక్ష్మి, ఉలాల భారతీదివ్య, కడియాల ప్రకాష్, ఇప్పిలి కృష్ణారావు, పూడి నేతాజీ, నర్తు ప్రేమ్కుమార్, నర్తు శివాజీ, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
కొర్ని కుర్రాడి ‘పవర్’
● పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్నరాజశేఖరరావు ● జాతీయ స్థాయి పోటీల్లో పతకాల కై వసం గార : సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కుర్రాడు జాతీయ స్థాయిలో ‘పవర్’ చూపిస్తున్నాడు. ఓవైపు ఉద్యోగ సాధనలో నిమగ్నమవుతూనే.. మరోవైపు ఎక్కడ పోటీలు జరిగినా పతకం రావాల్సిందే అన్నట్లుగా ప్రతిభ కనబరుస్తున్నాడు. గార మండలం కొర్ని గ్రామానికి చెందిన చమల్ల రాజశేఖరరావు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలలో భాగంగా రాజమండ్రిలో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఓవైపు చదువుతూనే, మరోవైపు వ్యాయామం పట్ల ఆసక్తి ఉండటంతో అక్కడే భారతీయ వ్యాయామ కళాశాలకు వెళ్లి రెండు పూటలా వ్యాయామం చేసేవాడు. అక్కడ వివిధ రకాలైన కోచ్ల పరిచయంతో క్రీడాపోటీలకు కూడా శిక్షణ తీసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు స్పోర్ట్సు కోటా కూడా ఉండటంతో ఆసక్తి మరింతగా పెరిగింది. రెండు సంవత్సరాలుగా పలు పోటీల్లో పాల్గొన్న రాజశేఖర్ జాతీయ స్థాయి పోటీల్లో మెరిసాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన నేషనల్ పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్–2015 పోటీల్లో ఫుల్పవర్ లిఫ్టింగ్, ఫుష్పుల్, బెంచ్ప్రెస్ మూడు విభాగాల్లో స్వర్ణ పతాకాలు సాధించాడు. గతంలోనూ జంషెడ్పూర్లో ఇండియన్ పవర్లిప్టింగ్ ఫెడరేషన్ నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాడు. తూర్పుగోదావరి జిల్లా స్థాయి పోటీలు, రాష్ట్ర చాంపియన్షిప్ పోటీల్లో మూడు సార్లు పాల్గొని ప్రథమ స్థానం సాధించాడు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం.. చంద్రశేఖర్ పదో తరగతి వరకు కొర్ని హైస్కూల్, ఇంటర్మీడియెట్ గురజాడ, డిగ్రీ ఆదిత్య కళాశాలలో చదివాడు. మావయ్యలు మళ్ల యేగీశ్వరరావు, మళ్ల లక్ష్మీనారాయణల ప్రోత్సాహం, అన్నయ్య చమల్ల కృష్ణారావు, సుమలత ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ సూచనలు చంద్రశేఖర్కు ఉపయోగపడ్డాయి. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి పోటీల్లో రాణించడంపై గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుల్ పవర్లిఫ్టింగ్ రాణించడమే లక్ష్యం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యమైనా, జాతీయ స్థాయి పోటీలతో పాటు అంతర్జాతీయ పోటీల్లో కూడా రాణించాలన్న కోరిక ఉంది. అసోషియేషన్లు సహకారం అందించాలి. – చమల్ల రాజశేఖరరావు, కొర్ని, గార మండలం -
యూకే స్కాలర్షిప్కు అనూష ఎంపిక
పాతపట్నం: బూరగాం గ్రామానికి చెందిన పోలాకి అనూష యునైటెడ్ కింగ్డమ్లోని చెస్టర్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ హెల్త్ సర్వీసెస్ మేనేజ్మెంట్లో చదివేందుకు వైస్ చాన్స్లర్ స్కాలర్షిప్కు ఎంపికై ంది. దీనిలో భాగంగా మొదటి ఏడాది 6,500 పౌండ్లు (రూ.7,67 లక్షలు), రెండో ఏడాదికి ప్లెస్మెంట్ పొందింది. ఐఈఎల్టీఎస్ పరీక్షలో మంచి స్కోర్ సాధించింది. అనూష తండ్రి పోలాకి గణపతి రైతు, తల్లి పోలాకి వరలక్ష్మి గృహిణి. అనూష జెమ్స్లో బీఎస్సీ నర్సింగ్, నాగార్జున యూనివర్సిటీలో డిప్లమా ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చదివింది. అర్జీల పరిష్కారానికి సత్వర చర్యలు పలాస: ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా అర్జీలు పరిష్కారానికి పోలీసు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి చెప్పారు. కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో శుక్రవారం ప్రజాగ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కాశీబుగ్గ, టెక్కలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజల కోసం ప్రత్యేకంగా ఈ గ్రీవెన్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. పౌర సంబంధాలు, కుటుంబ, ఆస్తి గొడవలు, మోసపూరితమైనవి ఇతరత్రా అంశాలపై పలు ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించామని తెలిపారు. 300 గ్రాముల వెండి చోరీ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని చినబొందిలీపురం సమీపంలో బాయన్నతోటలో నివాసముంటున్న రిటైర్డ్ డైట్ లెక్చరర్ ఇంట్లో 300 గ్రాముల వెండి చోరీకి గురైంది. రెండో పట్టణ సీఐ పి.ఈశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 8న సంపతి పురుషోత్తం తన పెద్ద బావమరిది ఇంట్లో జరిగే శుభకార్యానికి భార్యతో కలిసి విశాఖపట్నం వెళ్లారు. కుమార్తె, కుమారులు పుణేలో జాబ్ చేస్తున్నారు. శుక్రవారం ఉదయం వీరి నివాసగృహం మేడ మీద అద్దెకుంటున్న వ్యక్తి కిందకొచ్చి చూడగా తలుపుల తాళాలు పగలగొట్టడాన్ని గమనించి పురుషోత్తంకు ఫోన్లో సమాచారమందించారు. ఇంటికి చేరిన పురుషోత్తం బీరువా అరలో వెండి పోవడాన్ని గమనించాడు. లోపలి లాకర్లలో బంగారు వస్తువులు, నగదు భద్రంగానే ఉన్నాయి. కాగా ఈ చోరీ గురువారం అర్ధరాత్రి 1:30 నుంచి 4:20 గంటల మధ్య జరిగినట్లు సమీప సీసీ ఫుటేజీలో దృశ్యాలు కనిపించాయని స్థానికులు అనుకుంటున్నారు. పక్కనే మరో రెండు గృహాల్లోనూ చోరీకి యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. సీఐ ఈశ్వరరావు, హెచ్సీ శివాజీ, క్లూస్టీమ్ ఘటనా స్థలికి చేరి పరిసరాలను పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో విజిలెన్స్ తనిఖీలు శ్రీకాకుళం : శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు రెండు రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీ చేసిన అధికారులు, శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా చేపట్టిన వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి రికార్డులు, కొనుగోలు చేసిన సామగ్రి బిల్లులను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే శ్రీకాకుళం నగరపాలక సంస్థలో కూడా తనిఖీలు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పనుల్లో కొన్ని అవకతవకలు జరిగాయని, రాష్ట్రస్థాయికి ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో దీనికి సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కొనుగోలు జరిగినప్పుడు పని చేసిన ఇంజినీరింగ్ అధికారులను, గుమస్తాలను రప్పించి వారి నుంచి వివరాలు సేకరించినట్లు సమాచారం. వివరాలు వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. -
వసతిగృహాల పనులు వేగవంతం చేయాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అత్యవసరంగా చేయాల్సిన పనులు వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, కార్పొరేషన్ ద్వారా జరుగుతున్న పనుల ప్రగతిపై శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని తొమ్మిది గురుకులాలకు అత్యవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, నిర్మాణాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దుప్పలవలస (మైదానం పాత నిర్మాణాలు, రోడ్లు), శ్రీకాకుళం పెదపాడు (దోమతెరలు, డ్రైనేజీ, లీకేజీలు), ఆమదాలవలస (కొల్లివలస డార్మిటరీ, ప్రహరీ, శానిటేషన్, విద్యుత్), తామరపల్లి (ఆధునీకరణ, నీటి సరఫరా) హాస్టళ్లలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన నిధులపై చర్చించారు. కొల్లివలసలో మోడ్రన్ కిచెన్ కోసం రూ.15 లక్షలు, పలాసలో మరమ్మతులకు రూ.10 లక్షలు అవసరమని అధికారులు తెలియజేశారు. నందిగాం హాస్టల్లో రూ.1.79 కోట్లతో జరుగుతున్న డైనింగ్ కం కిచెన్ హాల్, తరగతి గదుల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని గడువు విధించారు. మరుగుదొడ్ల నిర్మాణం కోసం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని హాస్టల్స్లో పారిశుధ్యం, మంచినీటి సౌకర్యం సరిగా లేదని ఫిర్యాదులు రావడంతో, ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం, నాణ్యతలో రాజీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఈఈ బి.రామకృష్ణ, డీఈఈ బి.శ్రీరాములు, జిల్లా కో ఆర్డినేటర్ వై.యశోద లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
దాతలే దిక్కు..!
అరసవల్లి: ఆరేళ్ల క్రితం జరిగిన బస్సు ప్రమాదం ఆ ఇంటి యజమాని కాళ్లను చచ్చుబడేలా చేసి మంచానికే పరిమితం చేసింది. అలాంటి స్థితిలో ఉన్న భర్త, పిల్లల బాగోగులు చూసుకుంటూ కుట్టుమిషనే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న ఆ ఇల్లాలికి విధి మరో సమస్యను తెచ్చిపెట్టింది. దీంతో దాతల సాయం కోసం ఆమె ఎదురుచూస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. అరసవల్లి ఆదిత్యనగర్ కాలనీలో పేద కుటుంబానికి చెందిన కళ్లేపల్లి రమేష్, సుజాత దంపతులు. రమేష్ ఓ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఆరేళ్ల క్రితం ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడటంతో రెండు కాళ్లకు ఆపరేషన్ చేశారు. సుమారు రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు అయినప్పటికీ నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారు. ఇక ఇంటర్ చదువుతున్న కుమారుడు లీలా సాయికృష్ణకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ స్థాయి అధికమవ్వడంతో రక్తవాంతులతో బాధపడుతున్నాడు. ఈ కుర్రాడికి బ్రాన్కోసిస్ సమస్య ఉండటంతో బ్రాన్కోస్రోప్ పరీక్షలు చేయించాల్సి ఉంది. ఈ పరీక్షలకు విశాఖపట్నం ఆసుపత్రిలో సుమారు రూ.లక్ష వరకు అవుతుందని.. అంతటి ఆర్ధిక స్థోమత తమకు లేదని వాపోతున్నారు. భార్య కళ్లేపల్లి సుజాత ఎంతో కష్టపడి లేడీస్ టైలరింగ్ నేర్పిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంతటి దీన పరిస్థితిలో ఉన్న తమను దాతలెవరైనా ఆదుకుని (ఫోన్పే నంబర్ 9381442744) కాపాడాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. అరసవల్లిలో దయనీయ స్థితిలో పేద కుటుంబం మంచానికే పరిమితమైన తండ్రి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కుమారుడు వైద్యఖర్చులకు సాయం కోసం ఎదురుచూపులు రమేష్కు సదరం సర్టిఫికెట్ ద్వారా 66 శాతం అంగవైకల్యం ఉన్నట్లు వైద్యులు ధృవీకరించినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఇంతవరకు పింఛన్ మంజూరు చేయలేదు. రెండు కాళ్లకు ఆపరేషన్ జరిగి మంచానికే పరిమితమైనప్పటికీ సర్కార్ పెద్దలు దృష్టి సారించడం లేదు. నెలనెలా పింఛన్ వస్తేకుటుంబానికి కొంత భరోసా దక్కుతుందని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని రమేష్ కోరుతున్నారు. -
సెమినార్ విజేతలకు ప్రశంసాపత్రాలు
శ్రీకాకుళం: నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి సైన్స్ సెమినార్లో విజేతలకు డీఈఓ రవిబాబు ప్రశంసాపత్రాలను అందజేశారు. క్వాంటం ఏజ్ బిగిన్స్ పొటెన్షియల్స్ అండ్ చాంలెంజర్స్ అనే అంశంపై జిల్లాస్థాయి సెమినార్ నిర్వహించారు. ఇందులో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ విద్యార్థి పి.అభిషేక్ కుమార్ రెడ్డి, హయాతినగరం ఎంజేపీబీఎస్ పాఠశాల విద్యార్థి పి.హేమలత ద్వితీయ స్థానాన్ని సాధించారు. వీరు ఈ నెల 18న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. వీరిని డీఈఓతో పాటు ఉప విద్యాశాఖ అధికారి ఆర్.విజయ్కుమారి, సైన్స్ ఆఫీసర్ ఎం.కుమారస్వామి, ప్రధానోపాధ్యాయులు పి.సతీష్కుమార్, సూర్యప్రకాష్ తదితరులు అభినందించారు. -
పత్రికలు పంచాక ముఖం చాటేసిన ప్రియుడు..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఐదేళ్ల పాటు ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ముహూర్తం పెట్టి.. పెళ్లి కార్డులు పంచాక ప్లేటు ఫిరాయించాడు. ఇదేమని అడిగితే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గ్యాంగ్ పేరు చెప్పి బెదిరిస్తున్నాడు. ఈ గ్యాంగ్ పేరుతో ఇప్పటికే ఇసుక, ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. రూరల్ పోలీసు స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేయక తప్పలేదు. వివరాల్లోకి వెళితే..విశాఖ జిల్లా పరవాడ మండలానికి చెందిన యువతి శ్రీకాకుళం నగరంలోని విశాఖ ఏ కాలనీలో గల పెద్దమ్మ ఇంటిలో ఉంటుంది. రజక సామాజిక వర్గానికి చెందిన ఆమెకు ఆమదాలవలస మండలం గోపీనగర్కు చెందిన మెట్ట శరత్ చంద్రతో పరిచయం ఏర్పడింది. విశాఖలో ఇంటర్ చదువుతున్న సమయంలో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యాడు. ఆ సమయానికి ఆ అమ్మాయి మైనర్. వారి ప్రేమ ప్రయాణం కొనసాగుతున్న తరుణంలోనే శరత్ చంద్ర సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా మారాడు. అతనికి ఇన్స్టాలో పెద్ద ఎత్తున ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ప్రేమాయణం కొన్నాళ్లు నడిచాక పెళ్లి చేసుకోమని ఆ యువతి కోరింది. ఎప్పటికప్పుడు అతడు నమ్మిస్తూ వచ్చాడు. ఒక రోజు గట్టిగా నిలదీసేసరికి రజక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తివని, పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని మాట మార్చాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి తను నివాసం ఉంటున్న పెద్దమ్మ ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. కుటుంబ సభ్యులు గమనించి రిమ్స్కు సకాలంలో తీసుకెళ్లి చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. పోలీసుల వరకు వ్యవహారం వెళ్లింది.ఈ సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఒప్పందం జరిగింది. 100 రూపాయల బాండ్ పేపర్లో ఒప్పందం చేసుకున్నట్టు లిఖిత పూర్వకంగా రాసుకున్నారు. పెద్ద మనుషులు కూడా సంతకాలు చేశారు. యువతి తల్లిదండ్రులు కట్న కానుకల కింద రూ. 3లక్షల నగదు, 4తులాల బంగారం, 20సెంట్లు భూమి ఇచ్చేందుకు కూడా అంగీకారపత్రం రాసుకున్నారు. ఈ మేరకు అక్టోబర్ 10న వివాహం ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికార్డులు కూడా ముద్రించి బంధువులకు, స్నేహితులకు యువతి కుటుంబ సభ్యులు పంచారు. కట్నం డబ్బులు అడ్వాన్సుగా ఇచ్చేందుకు యువతి కుటుంబ సభ్యులు గోపీనగర్ గ్రామానికి వెళ్లగా శరత్ చంద్ర ఆయన కుటుంబంలోని వారు పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పేశారు. కూన రవికుమార్ పేరు చెప్పి గ్యాంగ్గా చెలామణి అవుతున్న చైతన్య అనే యువకుడి ప్రోద్బలమే దీనికి కారణమని తెలిసింది. వాళ్లు ఏం చేయలేరని, మామయ్య వెనకున్నారని భరోసా ఇవ్వడంతోనే శరత్ చంద్ర కుటుంబం కఠిన నిర్ణయం తీసుకున్నట్టు గుర్తించారు. ఎంత నిలదీసినా అటువైపు నుంచి ఒకటే సమాధానం రావడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో చేసేది లేక యువతి కుటుంబ సభ్యులు శరత్ చంద్ర ఇంటి వద్ద వద్ద ఆందోళనకు దిగారు. అయినప్పటికీ పెళ్లికి ససేమిరా అనడంతో శ్రీకాకుళం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైనర్గా ఉన్నప్పటి నుంచి ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన శరత్ చంద్రతో పాటు అతడి తల్లిదండ్రులు, అతడికి సహకరించిన స్నేహితులపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం రూరల్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఎమ్మెల్యే కూన రవి పేరు చెప్పి జడిపిస్తున్నారు..ఎమ్మెల్యే కూన రవికుమార్ మేనల్లుడట. మెట్ట శ్రీను అట, చైతన్య అట, కిల్లి సాయి, చల్లా వాసు ఇంటికొచ్చి జడిపిస్తున్నారు. తేల్చుకుని రండని కూన రవికుమార్ పంపించారట. మమ్మల్ని భయపెడుతున్నారు. కూన రవి సర్. మేము పేదవాళ్లం. ఐదేళ్లుగా ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. మా పిల్లను ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు. మాకు డబ్బు వద్దు, కేసులు వద్దు, న్యాయం కావాలి. ఆ అబ్బాయితో పెళ్లి చేయాలి.– రమణమ్మ, యువతి పెద్దమ్మ -
ఒడిశా ఉత్తరప్రదేశ్
● 208.7 కిలోల గంజాయితో పట్టుబడిన ఉత్తరప్రదేశ్ వాసులు ● రూట్ మార్చి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు ● గంజాయి తరలిస్తున్న కారు అద్దాలపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ ట్యాగ్స్ వయా శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్ : ఉత్తరప్రదేశ్లో ఉన్న ఓనరు ఆదేశిస్తాడు.. వీరు పాటిస్తారు. ఎవరి దగ్గరకు వెళ్లాలి.. ఎక్కడ గంజాయి కొనాలి.. ఎలా తిరిగి రావాలి.. చెక్పోస్టులు ఉంటే ఎలా తప్పించుకోవాలి.. ఇలా అన్ని ప్లాన్లు ఓనరే వేస్తాడు. అతను చెప్పింది చెప్పినట్లు వీరు పాటిస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరు ఖాకీల నుంచి తప్పించుకోలేకపోయారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్, మీరట్లకు చెందిన సునీల్ (38), విశాల్ (28)లు ఒడిశాలోని కొరా పుట్ నుంచి టొయోటో కారులో 208.7 కిలోల గంజాయిని చెక్పోస్టులు తప్పించి.. రూట్ మార్చి మళ్లించే యత్నంలో చిలకపాలెం వద్ద ఎచ్చెర్ల పోలీ సులకు పట్టుబడ్డారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఎప్పటి నుంచో.. మీరట్లోని డౌట్లో స్పై హోటల్ నడుపుతున్న గౌర వ్ వద్ద సునీల్, విశాల్లు కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఎప్పటి నుంచో వీరు గంజాయి క్రయవిక్రయాల్లో సిద్ధహస్తులు. ఈ క్రమంలో ఒడిశాలోని కొరాపుట్ జిల్లా దంతపురి సమీప లంపటాఫుట్ గ్రామానికి చెందిన సమర మాటం అలియాస్ డొంబురు వద్ద ఈనెల 14న 40 ప్యాకెట్లలో 208.7 కిలోల గంజాయిని తీసుకున్నారు. శ్రీకాకుళం చెక్పోస్టులను తప్పించి దారి మళ్లించి విశాఖ చేరేందుకు వీరు టొ యాటో కారులో కొరాపుట్ నుంచి బయల్దేరారు. కారుపై ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ స్టిక్కర్లు వీరు ప్రయాణిస్తున్న కారుపై ఢిల్లీ హైకోర్టు బార్ కౌన్సిల్, జాతీయ చిహ్నం గుర్తుతో అడ్వకేట్ 2019, అడ్వకేట్ 2021 స్టిక్కర్లు ఉండటంతో అనుమానం వచ్చి లోపల తనిఖీ చేయగా 40 ప్యాకెట్లలో గంజా యి పట్టుబడింది. వీరు చిలకపాలెం నుంచి విశాఖ చేరి అక్కడి నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్ మీదుగా నాగపూర్ హైవేకు చేరి అక్కడి నుంచి మీర ట్ వెళ్లి తమ ఓనరుకు అప్పగిస్తామని విచారణలో పేర్కొన్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుతం గంజాయిని వీరికి అందించిన ఒడిశా సమరమాటం, అతనికి సహకరించిన మరో వ్యక్తి పరారీలో ఉన్నారని, మీర ట్ ఓనర్ అయిన గౌరవ్ వద్దకు పోలీసులను పంపించామని, వీరేకాక మరో ముగ్గురిని నిందితులుగా గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. రూట్ మార్చారిలా.. ఒడిశా కొరాపుట్ నుంచి చత్తీస్గఢ్ రాష్ట్ర బోర్డర్ ఆనుకొని ఉన్న సిమిలిగుండ మీదుగా పొత్తంగి వద్ద అడ్డుదోవ తీసుకుని సమీపంలోని ఒడిశా సుంకి చెక్పోస్టును తప్పించారు. అక్కడి నుంచి సాలూరు, రామభద్రాపురం, రాజాం, పొందూరులు దాటి చిలకపాలెం జంక్షన్ వద్దకు వచ్చి పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డారు. అప్పటికే ఎచ్చెర్ల ఎస్ఐ కు ఈగల్టీమ్ సమాచారం ఉండటంతో కారును తనిఖీ చేశారు. -
దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్వాభిమాన్’ నేడు
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతి నెల మూడో శుక్రవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల ప్రత్యేక కార్యక్రమం ‘స్వాభిమాన్’ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. డైస్ సెంటర్ ఆకస్మిక తనిఖీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్ సెంటర్ (డైస్)ను గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదరి కె.హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 0–6 ఏళ్ల లోపు అంగవైకల్య ప్రమాదం ఉన్న పిల్లలకు సమగ్రమైన సమగ్ర సేవలను అందించాలని సూచనలు ఇచ్చారు. వైకల్యాన్ని ముందుగానే గుర్తిస్తే వ్యాధి నయం చేసే వీలుంటుందని పేర్కొన్నారు. తలసేమియా వంటి వ్యాధులను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి మెరుగైన సేవలు అందించాలని సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఎన్ చైతన్య, మేనేజర్ అప్పలనాయుడు, ఇతర వైద్య నిపుణులు ఉన్నారు. ‘మహిళా హోంగార్డుపై అనుచితంగా ప్రవర్తించినందుకే’ శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ కేంద్రంగా వైఎస్సార్ సీపీ శ్రేణులు కల్తీ మద్యంపై ఇటీవల జరిపిన నిరసన ఘటనకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి గురువారం విలేకరులతో మా ట్లాడారు. అనుమతి లేని ర్యాలీలు, ధర్నాలకు గుంపులుగా రావడమే కాక విధుల్లో ఉన్న ఓ మహిళా హోంగార్డుపై అనుచిత ప్రవర్తనకు వేణు గోపాలరెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు తెలిపారు. ప్రోత్సహించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూడా కేసులు పెట్టామన్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన నకిలీ స్టాంపుల వ్యవహారంపై విలేకరులు ఎస్పీ వద్ద ప్రస్తావించగా.. కేసుకు సంబంధించి ఫేక్ రబ్బరు స్టాంపుల తయారీదారులిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించా మని, పక్కా ఎవిడెన్సులతో కొన్ని నకిలీ డాక్యుమెంట్లను గుర్తించామన్నారు. ఇంకా విచారణ పూర్తి కాలేదని, ఎవరున్నా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమ్మె శ్రీకాకుళం (పీఎన్కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నవంబర్ 3 నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె చేయనున్నట్లు ఏఐటీయూసీ కౌన్సిల్ సభ్యులు టి.తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కళ్యాణి.అప్పలరాజు తెలిపారు. ఈ మేర కు గురువారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, మున్సిపల్ కార్మికులకు ఇల్లు, స్థలాలు కేటాయించి మున్సిపల్ కాలనీలు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు జె.గురుమూర్తి, ఎన్. పార్థసారథి, ఆర్. గణేష్, పి.సురేష్, రామచంద్ర, రసూల్, తంగి.నారాయణరావు, పుష్ప ,సీతయ్య, ప్రతినిధి అరుగుల రమణ తదితరులు పాల్గొన్నారు. దళిత చట్టాలపై అవగాహన శ్రీకాకుళం పాతబస్టాండ్: దళితులు సమాజంలో గౌరవం పొందేందుకు, వారు ఆత్మాభిమానంతో మెలిగేందుకు ప్రభుత్వం, చట్టాలు రక్షణగా ఉంటాయని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ సమావేశ మందిరంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ సంక్షేమ పథకాలపై గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది. లీడ్ జిల్లా మేనేజర్ పేడాడ శ్రీనివాసరావు, యూనియన్ బ్యాంక్ మేనేజర్ లలిత కుమారిలు మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో ఎస్సీలకు ప్రత్యేక రుణాలు, రాయితీలు ఉన్నాయని, వీటిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. -
ప్రమాద స్థలం పరిశీలన
నరసన్నపేట: మేజరు పంచాయతీ నరసన్నపేటలోని భవానీ పురంలో బుధవారం రాత్రి సంభవించిన ప్రమాదంపై టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు ఆరా తీశారు. ప్రమాద సంఘటన స్థలాన్ని గురువారం పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ప్ర మాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈ ప్రమాదం దురదృష్టకరమని, ఇందులో ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. ప్రమాదంలో గాయపడిన అగనంపూడి రాధ, ఆమె కుమార్తె సోనియాలు విశాఖలో చికిత్స పొందుతున్నారు. రాధ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. అలా గే బండి బాలకృష్ణ, బండి పూర్ణ, పన్నీరు చిరంజీవిలు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బండి సంతు, అమృతలు నరసన్నపేటలో చికిత్స పొందుతున్నారు. ఒకే కుటుంబంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు ఈ ప్రమాదంలో గాయాలు కావడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. -
ఎచ్చెర్ల ఎంపీపీపై పీడీ యాక్ట్
● విజయవాడలో ఎచ్చెర్ల ఎంపీపీ ఎం.చిరంజీవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● ఖాకీల తీరును ఖండించిన ఎంపీపీ వర్గీయులు ● ఫరీద్పేటపై నిఘా పెట్టాం: ఎస్పీ మహేశ్వర రెడ్డి శ్రీకాకుళం క్రైమ్, ఎచ్చెర్ల : ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిని మంగళవారం రాత్రి జిల్లా పోలీ సులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తున్నట్లు చెప్పి విశాఖ కారాగారానికి తరలించారు. దీంతో ఎంపీపీ వర్గీయులు, ఫరీద్పేట గ్రామస్తులు పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు. గ్రామంలో హత్యలు జరిగాయని, లెక్కకు మించి కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని వదిలేసి ఒక్క ఎంపీపీ చిరంజీవి పైనే పీడీ యాక్టు పెట్టడం సరికాదని అన్నారు. అయితే శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే వారు కావ డం వల్లనే ఎంపీపీపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి చెబుతున్నారు. ఇది అన్యాయం ఎంపీపీ చిరంజీవిని పీడీ యాక్ట్పై పోలీసులు అరెస్టు చేయడం అన్యాయం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫరీద్పేటలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలను చంపేశారు. మళ్లీ ఇప్పుడు అదే వర్గానికి చెందిన ఎంపీపీ చిరంజీవిని ఊరి నుంచి తరిమేందుకే చూస్తున్నారు. ఇది న్యాయమా..? – మొదలవలస సతీష్, ఫరీద్పేట చంపిన వారిని అరెస్టే చేయలేదు వైఎస్సార్ సీపీకి చెందిన కూన ప్రసాద్ని గత ఏడాది చంపేశారు. అందులో ఇద్దరు ముద్దాయిలను ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. నాలుగు నెలల కిందట మరో వైఎస్సార్ సీపీ కార్యకర్త గోపిని చంపేశారు. అదే కేసులో బెయిల్పై వచ్చి న ముద్దాయిలు రోజూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాయకుడు చిరంజీవిని ఇలా ఇరికించడం అన్యాయం. – మొదలవలస ఫాల్గుణ, ఫరీద్పేట రాజకీయం చేస్తున్నారు.. వైఎస్సార్ సీపీ వాళ్లని చంపేసి.. తిరిగి అదే వర్గానికి చెందిన మా నాయకుడిని అన్యాయంగా పోలీసులు అరెస్టు చేశారు. చంపిన వారిని విడిచిపెట్టి ఎంపీపీని అక్రమ అరెస్టు చేశారు. ఒక వైపే ఇలా చేస్తూ రాజకీయం చేస్తున్నారు. న్యాయపరంగా ఎదుర్కొంటాం. – కూన కిరణ్, ఫరీద్పేట అన్ని గ్రామాలపై దృష్టి పెట్టాం ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవిపై 14 కేసులు ఉన్నాయి. ఫరీద్పేటలో గడిచిన రెండు హత్యాఘటనల నాటి నుంచి నిఘా పెట్టాం. 33 మందిని గుర్తించాం. ఒక్క ఫరీద్పేటలోనే కాదు జిల్లాలో ప్రతి చోటా శాంతి భద్రతలకు, ప్రజాశాంతికి భంగం కలిగించేలా వ్యవహరించేవారి లి స్టు మా వద్ద ఉంది. అలాంటి వారిపై ఒక్కొక్కరి గా రౌడీ షీట్లు, సస్పెక్టు షీట్లు, ఆపై పీడీయాక్టులు పెడుతున్నాం. నిఘాలో ఎంపీపీ శాంతిభద్రతలను విఘాతపరిచే వ్యక్తిగా నిర్ధారణ కావ డంతో కలెక్టర్కు నివేదిక పంపి ఆయన ఉత్తర్వులతోనే పీడీ యాక్టు పెట్టాం.– మహేశ్వర రెడ్డి, ఎస్పీ -
సేన.. జగడాలేనా
అరసవల్లి: జనసేన పార్టీలో కుమ్ములాటలు తప్పడం లే దు. పార్టీ బలపడేందుకు ఓ వైపు మంత్రి నాదెండ్ల మనోహర్, మరోవైపు ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యుడు కొణిదెల నాగబాబు వరుసగా జిల్లాలో పర్యటిస్తున్నా పార్టీ శ్రేణుల్లో మాత్రం సంతృప్తి కనిపించడం లేదు. పైగా వీరు ఉంటున్న వేదికల్లోనే వర్గ విబేధాలు, కుమ్ములాటలు కనిపిస్తున్నాయి. ఇటీవల మంత్రి మనోహర్ జిల్లా పర్యటనలో కార్యకర్తల సమావేశంలో కొందరు నియోజకవర్గ ఇన్చార్జిలను అగౌరవ పరిచారని స్థానిక కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. తాజాగా ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో కూడా శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్చార్జి సర్వేశ్వరరావుకు తెలియకుండానే పాతపట్నం నేతలు అన్నీ తామై కార్యక్రమాలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తుండడం వివాదాన్ని సృష్టించింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరాడ సర్వేశ్వరరావుకు వ్యతిరేకంగా పాతపట్నం నియోజకవర్గం నుంచి గేదెల చైతన్య వర్గం పట్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందనే వాదన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలో తేటతెల్లమైంది. ఈ రెండు వర్గాలు దాదాపుగా బాహాబాహీ దిశగా తోపులాటలకు దిగారు. ఎమ్మెల్సీ నాగబాబు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశీలన అనే కార్యక్రమం వేదికగా వర్గాల పోరు బయటపడింది. సుడా చైర్పర్సన్గా ఉన్న జనసేన నేత కొరికాన రవికుమార్ అండదండలతోనే సొంత నియోజకవర్గానికి చెందిన పాతపట్నం నేత గేదెల చైతన్య దూసుకుపోతున్నారని స్థానికంగా చర్చనీయాంశమైంది. అలాగే మరోవైపు ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి, సీనియర్ నేత పేడాడ రామ్మోహనరావును కూడా ప్రధాన వేదికలపై పిలవకుండా ఓ వర్గం కుట్ర పన్నుతుందనే వాదనను ఆ నియోజకవర్గ క్యాడర్ తెరపైకి తెస్తోంది. ఇక జిల్లాకు జనసేన అగ్రనేతలొస్తే స్వాగతం నుంచి సాగనింపు వరకు ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి విశ్వక్సేన్ అంతా తానై వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం అధిష్టానం దృష్టిలో ఉంది. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన రాజు ఇటీవలే కుటుంబ వ్యవహారాల్లో పోలీసు కేసుల్లో ఇరుక్కున్న సంగతి విదితమే. మిగిలిన నియోజకవర్గాల్లో ఇన్చార్జిలైతే టీడీపీకి అనుబంధంగా వ్యాపారాల్లో భాగస్వామ్యులవుతూ ఉన్నారంటే ఉన్నారనేలా వ్యవహరిస్తున్నారు. ఇక పార్టీ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న చంద్రమోహన్ పనితీరుపై జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి ఉందన్న సంగతి విదితమే. కూటమి ప్రభుత్వంలో భాగంలో ఉన్నామనే ధీమాలో జనసేన నేతలు చాలా చోట్ల నామినేటెడ్ పోస్టులకు, మరికొందరు త్వరలో జరగనున్న ‘స్థానిక’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఎవ్వరూ పదవులు అడగొద్దని, మనకు అంత అనుభవాలు లేవని, అర్హతలు లేవంటూ అగ్రనేతలు వ్యాఖ్యానించడం పార్టీ శ్రేణులను దిక్కుతోచని ఆలోచనలో పడేసింది. పార్టీ ఎమ్మెల్సీగా వరుసగా రెండు సార్లు జిల్లాలో పర్యటించిన నాగబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ అధినేత పవన్ కల్యాణ్ కోరిక మేరకు మరో 15 ఏళ్ల వరకు కూటమి ప్రభుత్వం ఉంటుందని, మనం కూడా ఇలాగే టీడీపీకి మద్దతివ్వాలని చెప్పడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. అలాగే కార్యకర్తలకు దిశానిర్దేశం చేయకపోగా కసుర్లు, విమర్శలు, ఆగ్రహాన్ని ప్రదర్శించడం కూడా కొందరికి మింగుడు పడలేదు. తాజాగా మంత్రి మనోహర్ కూడా జిల్లాలో కార్యకర్తలు, నేతలతో మాట్లాడుతూ అదే 15 ఏళ్ల జపం చేశారు. దీంతో జనసేన శ్రేణులు ఆలోచనలో పడ్డాయి. -
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిశీలన
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్లో 20 ఏళ్లుగా వరద నీటి సమస్య ఉంద ని జనసేన నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ను ఆయన గురువారం పరిశీలించారు. అధికారులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ అవసరం ఉందని తెలిపారు. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ పర్యటనకు వచ్చిన నాగబాబు వెంట జనసేన పార్టీకి సంబంధించిన శ్రీకాకుళం సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు, పాతపట్నం సమన్వయకర్త గేదెల చైతన్య వర్గాల మధ్య పోరు కనిపించింది. ఆర్టీసీ అధికారులతో నాగబాబు మాట్లాడుతుండగా చైతన్య లోపలకు వెళ్లారు. సర్వేశ్వరరావు కూడా వెళ్లేందుకు ప్రయత్నించగా గేదెల చైతన్య వర్గం అడ్డుకుంది. దీంతో కొంతసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా నాన్స్టాప్ కౌంటర్ వద్ద నాయకులు కార్లు ఉంచడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.


