Srikakulam
-
సోదాలు అప్రజాస్వామికం
శ్రీకాకుళం: బ్రిటిష్ పాలనను కూటమి ప్రభుత్వం గుర్తుకు తెస్తోందని ‘సామ్నా’ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు నల్లి ధర్మారావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు చేయడాన్ని ఆయన ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసు బలగంతో సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్టగా అభివరి్ణంచారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఏమన్నారంటే... ఇలాంటి ఘటనలు లేవు పత్రికా సంపాదకులపై దాడులకు శ్రీకారం చుట్టింది బ్రిటిష్ ప్రభుత్వంలోనే. మన దేశంలో ఒక సంపాదకీయం రాసినందుకు గాడిచర్ల హరిసర్వోత్తమరావుపై రాజద్రోహం నేరాన్ని ఆపాదించి జైలు శిక్ష విధించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు మళ్లీ జరగలేదు. 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఆ నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నిర్బంధాన్ని అమలు చేశారు. అయితే పత్రికల కార్యాలయాలు, సంపాదకుల ఇళ్లపై మాత్రం దాడులు జరిగిన దాఖలాలు లేవు. నచ్చకపోతే అణగదొక్కుతారా? నచ్చిన పత్రికలను ప్రోత్సహించడం, నచ్చని పత్రికలను అణగదొక్కడం చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే మొదలైంది. పత్రికా రంగాన్ని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా ప్రజాభిప్రాయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలమనే భావన సరైనది కాదని వైఎస్ రాజశేఖరరెడ్డి ఘన విజయంతో రుజువైంది. చంద్రబాబు పాలనలో భావప్రకటన స్వేచ్ఛపై మునుపెన్నడూ లేని విధంగా అణచివేతకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికార బలంతో వేధింపులు దేశానికి ఒకటే పవిత్ర గ్రంథం. అది రాజ్యాంగం. వ్యవస్థలన్నీ దీనికి లోబడే పనిచేయాలి. కూటమి ప్రభుత్వం అలా పనిచేయడం లేదని ఏపీ హైకోర్టు అనేక కేసుల విచారణ సమయంలో మందలిస్తూ కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అయినా కూటమి ప్రభుత్వం వాటిని గౌరవిస్తున్నట్టు కనిపించడం లేదు. మీడియాలో వచ్చిన వార్త, కథనంపై లీగల్గా చర్యలు తీసుకోవడానికి చట్టం కొన్ని అవకాశాలు కల్పించింది. వాటిని విస్మరించి నేరుగా అధికార బలంతో క్రిమినల్ కేసులు బనాయించి, వేధించడం ఈ ప్రభుత్వమే ప్రారంభించింది. ఒక ఎడిటర్ ఇంట్లో ముందస్తు సమాచారం ఇవ్వకుండా సోదాలు చేయించడం కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానానికి పరాకాష్ట. ఏముంటాయి అక్షరాలు తప్ప ఎడిటర్ ఇంట్లో ఏముంటాయి. అక్షరాలే తప్ప ఆయుధాలు కాదు కదా. అక్షరాలను కూడా ఆయుధాలుగా భావించిన ఒకనాటి బ్రిటిష్ వైఖరి బయట పెట్టుకోవడం తప్ప సాధించిందేమీ లేదు. అణచివేతలతో చరిత్రహీనులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చేయలేరు. మన ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజలు సరైన సమయంలో తమ చైతన్యాన్ని ప్రకటిస్తారు. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే, సామ్నా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు, ఫొటో జర్నలిస్టు సంఘాలు కలిసి ‘సాక్షి’ పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణిలకు వ్యతిరేకంగా గళం వినిపిస్తూనే ఉంటాయి. -
ఎత్తిపోతలు.. ఉత్తి మాటలు
హిరమండలం వద్ద నత్తనడకన సాగుతున్న ఎత్తిపోతల పథకం పనులు హిరమండలం: పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా జిల్లాలోని కీలక ప్రాజెక్టు గొట్టా బ్యారేజీ వద్ద ఎత్తిపోతల పథకం పనుల విషయంలో ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదిలో 33 శాతం పనులు జరిగితే.. కూటమి ప్రభుత్వం ఏడు శాతానికి మించి పనులు చేయలేకపోయింది. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు ఒక సాగునీటి ప్రాజెక్టు అవసరమని 2003 పాదయాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటగా గుర్తించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా వంశధార రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ రిజర్వాయర్ నిండాలంటే నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కానీ దీనికి ఒడిశా అభ్యంతరాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒడిశాతో జల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూనే.. ప్రత్యామ్నాయంగా 2022 సెప్టెంబరు 14న గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథ కం నిర్మాణానికిగాను రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్కు చెందిన సంస్థకు టెండర్లు కేటాయించారు. దీంతో శరవేగంగా పనులు జరిగాయి. 2024 ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా 33 శాతం పను లు పూర్తిచేసింది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిలో కేవలం 7 శాతం పనులను మాత్రమే పూర్తిచేసింది. ఇంకా ప్రధాన విభాగాలకు సంబంధించి పనులు ఇంతవరకూ ప్రారంభం కాలే దు. పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. ఇప్పట్లో పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. వాస్తవంగా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం పూర్తయితే రిజర్వాయర్లో నీటి స్థిరీకరణకు ఎలాంటి ఢోకా ఉండదు. కానీ ఒడిశా ప్రభుత్వంతో వివాదం కారణంగా ఎడతెగని జాప్యం జరుగుతోంది. దీంతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది. ఒడిశాతో ఒకవైపు జలాల సమస్యకు పరిష్కార మార్గం చూపుతూనే.. గొట్టా బ్యారేజీ కుడి ప్రధాన కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా 12 టీఎంసీలను రిజర్వాయర్లోకి తరలించాలని ఆలోచన చేశారు. 2022 సెప్టెంబరు 14న రూ.176.35 కోట్లు మంజూరు చేశారు. 2023 ఆగస్టులో హైదరాబాద్కు చెందిన సంస్థ టెండర్లు దక్కించుకొని పనులు ప్రారంభించింది. అక్కడకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేవరకూ రూ.140.07 కోట్లతో 33 శాతం పనులు పూర్తిచేసింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి న తర్వాత పనులు మందగించాయి. చెల్లింపులు నిలిచిపోయాయి. ఆ ప్రభావం పనులపై పడింది. కూటమి ప్రభుత్వం రూ.182 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పినా.. పనులు మాత్రం ఆశించిన స్థాయి లో జరగలేదు. ఈ ఏడాది కూటమి పాలనలో ఎత్తిపోతల పథకానికి సంబంధించి పనులు 7 శాతం మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కానరాని పురోగతి.. ప్రస్తుతం ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన జరుగుతున్నాయి. పనుల తీరు చూస్తుంటే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే పనులు కొలిక్కి వచ్చేవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గొట్టా బ్యారేజీ ఆర్ఎంసీ హెడ్ రెగ్యులేటర్ నుంచి 2.4 కిలోమీటర్ల పొడవున కాలువ వెడల్పు ఐదు మీటర్ల చొప్పున పెంచాల్సి ఉంటుంది. మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సబ్స్టేషన్ ఏర్పాటుచేయాల్సి ఉంది. పంపుహౌస్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఏపీ ట్రాన్స్కోకు రూ.9.18 కోట్ల బకాయిల చెల్లించాల్సి ఉంది. 3.2 మీటర్ల 110 పైపులను తయారుచేశారు. వీటిని అమర్చాల్సి ఉంది. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జలాశయం గట్టుపై డెలివరీ సిస్టమ్స్కు ఇంతవరకూ అనుమతి రాలేదు. ఇన్ని పనులు పెండింగ్లో ఉంటే కూటమి పాలకులు ఎత్తిపోతల పథకం విషయంలో ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. బహుళ ప్రయోజనాలు ఎన్నో.. ఇక్కడ ఎత్తిపోతల పథకం పూర్తయితే కానీ జలాశ యం లక్ష్యం నెరవేరదు. కేవలం వర్షాకాలంలో అతిగా వచ్చే వరదలు సైడ్ వీయర్ ద్వారా రిజర్వాయర్లోకి నీరు చేరుతుంది. అంతే తప్ప వంశధారలో సాధారణ ప్రవాహం ఉన్నప్పుడు రిజర్వాయర్లోకి నీరు చేరే అవకాశమే లేదు. అందుకే అత్యవసరంగా ఇక్కడ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేయాల్సి ఉంది. రిజర్వాయర్లోకి 12 టీఎంసీల నీటిని నిల్వ ఉంచవచ్చు. అదే జరిగితే ఏడాది పొడ వునా శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయవ చ్చు. వంశధార కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2.11 లక్షల ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందించవచ్చు. ఖరీఫ్తో పాటు రబీలో కూడా ఇబ్బందులు లేకుండా చూడవచ్చు. నదుల అనుసంధానం, నారాయణపురం ఆనకట్ట ద్వారా మరో 25 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఉద్దానం ప్రజల దాహార్తిని తీర్చే ఉద్దానం సమగ్ర మంచినీటి పథకానికి 1.12 టీఎంసీల తాగునీరు అందిచవ చ్చు. ఇన్ని ప్రయోజనాలున్న ఈ ఎత్తిపోతల పథకంపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం జిల్లా రైతులకు శాపంగా మారుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా ప్రజల ఆకాంక్షను తీర్చేందుకు.. పుష్కలంగా సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఆలోచన చేశారు. వెనువెంటనే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏడాదిలో 33 శాతం పనులు చేయిస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాదిలో 7 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగింది. కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. – రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే, పాతపట్నం గొట్టా బ్యారేజీ ఎత్తిపోతల పథకం పనుల్లో చిత్తశుద్ధి కరువు వైఎస్సార్సీపీ హయాంలో ఏడాదిలో 33 శాతం పూర్తి కూటమి ఏడాది పాలనలో కేవలం 7 శాతమే పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం -
కులమతాల అడ్డుగోడలు పోవాలి
● సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ శ్రీకాకుళం కల్చరల్: కులమతాల అడ్డుగోడలు పోవాలని, దాని వల్ల ఎదగలేకపోతున్నామని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్తేజ అభిప్రాయపడ్డారు. స్థానిక బాపూజీ కళామందిర్లో సుద్దాల అశోక్ తేజ రచించిన శ్రీశూద్రగంగ కావ్యగాన కార్యక్రమం శ్రీకాకుళ సాహితీ, సాహితీ స్రవంతి సంయుక్త నిర్వహణలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా ఇంట్లో రంగఖూని అనే ప్రేమ్చంద్ నవల చదివిన తర్వాత దానికి బానిసనయ్యాను. అందులోని పాత్రలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 30 ఏళ్ల కిందటే నాకు కులమతాల కోసం తెలిసి ఉంటే నా పేరును సుద్దాల అశోక్ శూద్ర తేజ అని పెట్టుకునేవాడిని’ అని అన్నారు. పేరు పక్కన శూద్ర అని పెట్టుకుంటే కులమతాల అడ్డుగోడలు తొలగిపోతాయన్నారు. సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో కవిని, కావ్య పరిచయాన్ని శ్రీకాకుళ సాహితీ ప్రతినిధి అట్టాడ అప్పలనాయుడు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శ్రీకాకుళం సాహిత్య చరి త్రలో ఇది ఒక సువర్ణ ఘట్టమని తెలిపారు. ఈ సందర్భంగా సుద్దాల అశోక్ శూద్రగంగ కావ్యగానం చేశారు. అనంతరం ఆయనను సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.ఉదయ్కిరణ్, కంచరాన భుజంగరావు, చీకటి దివాకర్, కారసాల శ్రీనివాసరావు, కల్లేపల్లి రామ్గోపాల్, ఎస్.రుద్రమరాణి, బాడాన శ్యామలరావు పాల్గొన్నారు. -
దేవుడి పేరిట దోపిడీ
● పొనుటూరులో ఇసుక దందా ● ఒడిశాకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా ● వరద గట్టును సైతం తవ్వేసిన వైనం కొత్తూరు: దేవుడి పేరు చెప్పి మరీ అధికార పార్టీ నేతలు ఇసుక దోపిడీకి తెగబడుతున్నారు. ఉచిత ఇసుక పథకం ఆ నాలుగు గ్రామాల టీడీపీ నేతలకు దేవుడి వరంగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఆలయాలు నిర్మిస్తున్నామంటూ పొనుటూరు పంచాయతీ పరిధిలోని పాతపొనుటూరు, పొనుటూరు కాలనీ, కొత్తపొనుటూరు, బంకి గ్రా మాలకు చెందిన కొంత మంది నేతలు ఇసుక ట్రాక్టర్ల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులతో పాటు మైన్స్ అధికారులు పట్టించుకోకపోవడంతో వీరి దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. కొత్తూరు మండలంలోని పాత పొనుటూరుకు అనుకొని ఉన్న వంశదార నదిలో అక్రమ ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారు. ర్యాంపు నుంచి ఇసుక తీసుకెళ్లే ఆంధ్రా వాహనాల నుంచి రూ.200, ఒడిశా వాహనాల నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. అసలే అక్రమ ర్యాంపు. ఆపై అక్రమ వసూళ్లు కావడంతో స్థానికులు కూడా నిశ్చేష్టులవుతున్నారు. గత 8 నెలలుగా ఈ దందా సాగుతోంది. నాలుగు గ్రామాలకు చెందిన కొంత మంది టీడీపీ నేతలు, కార్యకర్తలు ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రెవెన్యూ, మైన్స్, పోలీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో వీరికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాస్తవానికి ఆంధ్రా నుంచి ఇసుక ఒడిశాకు రవాణా చేయకూడదని నిబంధన ఉన్నా.. ఒడిశాకు చెందిన ట్రాక్టర్లతో పొనుటూరు నుంచి ఇసుక తీసుకెళ్తున్నారు. ఒడిశాకు తరలిస్తున్న ట్రాక్టర్ నుంచి రూ. 500ను దేవుడి పేరుతో గుంజుకుంటున్నారు. సాక్షాత్తు గ్రామ సచివాలయం పక్క నుంచే అక్ర మంగా ఇసుక రవాణా జరుగుతున్నా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం. ఇదే పంచాయతీ పరిధి బంకి గ్రామం నుంచి నదిలో ఇసుక అక్రమ రవాణా కోసం పూర్తిగా వరద గట్టును తవ్వేశారు. నదికి వరదలు వస్తే వరద నీరంతా పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా వంశధార ఇంజినీరింగ్ అధికారులకు పట్టడం లేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారి ఆట కట్టించాలని, అక్రమ ఇసుక రవాణా ఆపాలని కోరుతున్నారు. ●తగిన చర్యలు తీసుకుంటాను పొనుటూరు వంశధారలో నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంటే చర్యలు తీసుకుంటాను. ఒడిశాకు ఇసుక తరలించకూడదు. దేవుడి పేరుతో అక్రమ వసూళ్లు చేయడం నేరం. – కె.బాలకృష్ణ, తహసీల్దార్ కొత్తూరు -
దళిత విద్యార్థులకు న్యాయం చేయండి
కాశీబుగ్గ: పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం జిల్లా దళిత సంఘాల సంయుక్త మండలి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బాలికల/బాలుర గురుకుల పాఠశాలలు 1983లో స్థాపించారని సుమారుగా 30 ఏళ్ల నుంచి అవే భవనాలు ఉండడం, కొత్త భవనాలు అరకొరగా ఉండడం, మౌలిక వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని అన్నారు. గత 15 ఏళ్లుగా గురుకులాల్లో దళిత విద్యార్థుల చేరికలు తగ్గుతున్నాయని, అందుకు గల కారణాలు విశ్లేషించాలని కోరారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేకమైన కమిటీతో అధ్యయనం చేయించాలని, వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏ రకమైన సమస్యలు లేకుండా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య, బెలమర ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి మద్దిల వినోద్, జిల్లా కార్యదర్శి యడ్ల గోపి, ధర్మారావు, కరుణాకర్, బి.దుర్యోధన, ఎన్జీఓ నాయకులు బోనెల గోపాల్, చల్లా రామారావు, గెజిటెడ్ అధికారుల సంఘం గోజ్జ నాగరాజు, ఆదివాసీ సంఘం నాయకులు వరహాల భాగ్యరావు, వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఇప్పిలి చంద్రశేఖర్, పిలక శ్రీను, ఉదయపురం శ్రీనివాసరావు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నేళ్లకు పెద్ద పండగ వచ్చె..
● మెట్టవలసలో ఎట్టకేలకు గ్రామదేవత పండుగలు ● సిరిమాను, ఘటాలు లేకుండా ఉత్సవాల నిర్వహణ నా చిన్నప్పుడు జరిగింది.. నాకు 85 ఏళ్లు. నా చిన్నప్పుడు మా ఊరిలో గ్రామదేవత పండగ చేశారు. నాకు తెలిసీతెలియని వయసులో జరిగింది. ఇప్పుడు మళ్లీ మా గ్రామస్తులంతా కలిసి గ్రామదేవత పండగను నిర్వహిస్తున్నాం. – డకర లక్ష్ముంనాయుడు, మెట్టవలస 80 ఏళ్లవుతోంది.. నాకు 90 ఏళ్లు. నేను 5వ తరగతి చదువుతున్నప్పు డు మా గ్రామంలో తాత లు, పెద్దలు గ్రామ దేవత పండగ చేశారు. మా ఊరిలో మొదటి ఉద్యోగం చేసిన వాడిని నేనే. ఈ వయసులో మళ్లీ గ్రామదేవత పండగ చూసే అదృష్టం కలగడం ఆనందంగా ఉంది. – యడ్ల ఆదినారాయణ, విశ్రాంతి పంచాయతీ అధికారి, మెట్టవలస జి.సిగడాం: మండలంలోని మెట్టవలసలో ఎట్టకేల కు గ్రామదేవత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయం చేశారు. గ్రామంలో 650 ఇళ్లు ఉన్నాయి. అంతా కలిసికట్టు గా పండుగ నిర్వహించేందుకు తీర్మానించారు. 80 ఏళ్ల తర్వాత.. గ్రామంలో ఈ ఉత్సవాలు జరిగి 80 ఏళ్లయ్యాయి. అప్పటి నుంచి ఉత్సవాలు జరగనేలేదు. మళ్లీ ఆ నాటికి ఉత్సవం నిర్వహిస్తుండడంతో ఊరు ఊరంతా సంబరపడుతోంది. దాదాపు రూ.7కోట్ల వ్య యంతో జాతర నిర్వహిస్తున్నారు. అయితే సిరిమాను గానీ, ఘటాలు గానీ లేకుండా పండుగ జరిగేలా ఏర్పాట్లు చేశారు. గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ప్రత్యేక పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశారు. -
21,572
● 56 కేంద్రాలు.. మంది విద్యార్థులు శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో సోమవారం నుంచి మొదలుకానున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్ష కేంద్రాలకు మెటీరియల్స్ను చేరవేశారు. మార్చిలో రాసిన పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు ప్రథమ సంవత్సరంలో మార్కులు పెంచుకునేందుకు (ఇంప్రూవ్మెంట్/బెటర్మెంట్) మరికొంతమంది విద్యార్థులు ఈ పరీక్షలను రాస్తున్న విషయం తెలిసిందే. మొత్తంమీద ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలల నుంచి 21,572 మంది విద్యార్థులు ఫీజులను చెల్లించారు. పరీక్షల కోసం 56 కేంద్రాలను కేటాయించారు. వీటిలో ప్రభుత్వ యాజమాన్య కళాశాలలే అధికంగా ఉన్నాయి. అధికారులు, సిబ్బంది నియామకం పూర్తి.. పరీక్షల నిర్వహణకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించారు. మూడు ఫ్లయింగ్, 6 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. జిల్లా స్పెషల్ ఆఫీసర్/డీవీఈఓ ఆర్.సురేష్కుమార్, ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు, డీఈసీ కమిటీ సభ్యులు ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఫర్నీచర్ను సిద్ధం చేశారు. సీసీ కెమెరాలను ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసి అమర్చారు. రెండు సెషన్స్లలో పరీక్షలు.. సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు అర్ధగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయానికి హాజరుకాకుంటే.. పరీక్ష కేంద్రంలోపలకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 144 సెక్షన్ పక్కాగా అమలయ్యేందుకు, పరీక్ష కేంద్రాల వద్ద పహారా కాసేందుకు పోలీసు సిబ్బందిని నియమించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను పూర్తిగా నిషేధించారు. ఇన్విజిలేటర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లోని 10 ప్రత్యేక రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు. నేటి నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన యంత్రాంగం ఎండల నేపథ్యంలో సౌకర్యాలు.. మండే ఎండల నేపథ్యంలో ఇంటర్ బోర్డు అధికారులు, కలెక్టర్ సూచనల మేరకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్, మెడికల్ కిట్లతో మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం. విద్యార్థులు తమ హాల్టిక్కెట్లను బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. – ప్రగడ దుర్గారావు, ఆర్ఐఓ/డీఈసీ కమిటీ కన్వీనర్ -
కూటమిది కక్షపూరిత పాలన
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కక్షపూరిత పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజినిపై సీఐ సుబ్బనాయుడు అనుచిత ప్రవర్తన, గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన దళిత మహిళ, ఎంపీటీసీ కల్పన పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద పార్టీ నా యకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య, పార్టీ నాయకులు ముంజేటి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడుదల రజినిపై సీఐ సుబ్బనాయుడు అనుచితంగా ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. మాజీ మంత్రి, మహిళ అని కూడా చూ డకుండా సీఐ రజినిని పక్కకు తోసేయడం పోలీ సుల దుశ్చర్యకు నిదర్శనమన్నారు. మహిళలపై కూటమి ప్రభుత్వానికి, పోలీసులకు ఎంతటి గౌర వం ఉందో ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలు స్తోందన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కల్పన ఒక దళిత మహిళ అని చూడకుండా అర్ధరాత్రి ఆమెను అరెస్ట్ చేసి నైటీలోనే పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారని, ఇది అత్యంత దారుణమన్నారు. రాష్ట్రంలోని రైతులకు, నిరుద్యోగులకు, మహిళలకు కూటమి ప్రభుత్వం, నాయకులు హామీలు ఇచ్చారని, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. తమ తప్పులు కప్పి పుచ్చుకునేందుకు, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాకుళం రూరల్ జెడ్పీటీసీ రుప్ప దివ్య, వైఎస్సార్సీపీ దళిత విభాగం జిల్లా అధ్యక్షుడు పొన్నాడ రుషి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. ఎల్లకా లం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదని గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, నాయకులు అంబటి శ్రీనివాసరావు, యజ్జల గురుమూర్తి, మూకళ్ల తాతబాబు, గుంట జ్యోతి, సీపాన రామారావు, రావాడ జోగినాయుడు, ఎస్.వెంకటరావు, సతివాడ రామినాయుడు, పి.రాజశేఖర్, అలపాన త్రినాథ రెడ్డి, ఎన్.కృష్ణ, తవిటినాయుడు, ఎ.రమేష్, సీహెచ్ గడ్డెయ్య తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు మహిళలపై అనుచిత ప్రవర్తన ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకుల ధ్వజం -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి (మీకోసం.ఏపీ.జివోవి.ఇన్) వె బ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి వాటి స్థితి దానికి సంబంధించి సమాచారం గురించి తెలుసుకోవాలంటే డయల్ 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శ్రీకూర్మనాథాలయంలో ‘సదస్యం’ గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథుని కల్యా ణోత్సవాల్లో భాగంగా ఆదివారం సదస్యం జరిగింది. ఆస్థాన మంటపంలో ప్రత్యేక ఆసనంపై ‘చక్ర పెరుమాళ్’ను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతా రామనృసింహాచార్యులు, వైదికులు వివిధ పురా ణాలను స్వామికి విన్నవించారు. ఆలయ అర్చకులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు, శ్రీభాష్యం పద్మనాభాచార్యులు, దాసుబాబు, మురళీకృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులుపాల్గొన్నారు. ముమ్మరంగా తనిఖీలు శ్రీకాకుళం క్రైమ్ : దేశ సరిహద్దులో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఉత్తర్వులతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ముఖ్య కూడళ్లలోను, ఆర్టీసీ బస్కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణ, పేలుడు పదార్థాల గుర్తింపు, సంఘ విద్రోహక శక్తుల అడ్డుకట్ట, కొత్త, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై పోలీసులు పూర్తి నిఘా పెట్టారు. -
నేను కుందువానిపేట.. వింటారా నా మాట
ప్రియమైన పర్యాటకులకు.. మీ కుందువానిపేట సముద్ర తీరం.. ఆశీర్వదించి రాయు విన్నపం.. మీకు గుర్తుందో లేదో.. ఒకప్పుడు మీలో చాలా మంది నా ఒడిలో ఆడుకునేవారు. పొద్దు పోయే వరకు ఇక్కడే ముచ్చట్లాడుకునేవారు. ఈ తీరాన ఉండే చిన్ని పాకల్లో చిరుతిళ్లు కొనుక్కుని ఇంటిల్లిపాదీ ఆనందించేవారు.. మీ ముఖాల్లో వెల్లివిరిసే సంతోషం చూసి నాకూ ముచ్చటేసేది.. కానీ ఏ దిష్టి తగిలిందో.. ఇప్పుడు నా వద్దకు రావడమే మానేశారు.. ఒక ఆదివారం కాకపోతే మరో వారమైనా వస్తారని ఎదురు చూస్తున్నాను.. కానీ ఎవరూ రావడం లేదు.. పోనీలే.. కార్తీకంలో వస్తారు అనుకునేదాన్ని.. కానీ నా అంచనా తప్పైపోయింది.. ఒకప్పుడు కళకళలాడిన ఈ పాకలు ఇప్పుడు కూలిపోయాయి.. స్వచ్ఛమైన నా ఇసుక తిన్నెల మధ్య ఏవేవో సీసా ముక్కలు గుచ్చుకుంటున్నాయి.. ఒకప్పుడు రాత్రి 8 గంటల వరకు నా ఒడిలో చాలా మంది సేదతీరేవారు.. కానీ ఇప్పుడు రాత్రయితే చాలు ఇటుగా రావడానికే చాలా మంది భయపడుతున్నారు.. విద్యుత్ బల్బులన్నీ పాడైపోయాయి.. అనాదిగా అందాలు పంచిన ఈ ప్రదేశం.. ఇప్పుడు అందవిహీనమవుతోంది.. ఇది నేను తట్టుకోలేకపోతున్నా.. నాకు మళ్లీ వెనకటి రోజులు కావాలి.. పిల్లలంతా నా ఒడిలో ఆడుకోవాలి.. మీరంతా ఉదయాస్తమయాలు ఇక్కడి నుంచి మళ్లీ ఆస్వాదించాలి.. ఆ పాకలన్నీ మళ్లీ కళకళలాడాలి.. సీసా ముక్కలు కనిపించని ఇసుక తిన్నెలు మిమ్మల్ని స్వాగతించాలి. నా అలల ఘోషనే నా విన్నపంలా భావించండి.. నా కెరటాలు మీ కోసమే వస్తున్నాయని తెలుసుకోండి.. నా విన్నపాన్ని మన్నిస్తారని భావిస్తూ.. మీ కుందువానిపేట సముద్ర తీరం – శ్రీకాకుళం రూరల్ సచివాలయాలకు ఫైబర్ నెట్ కష్టాలు సారవకోట: మండలంలో సచివాలయాలకు ఫైబర్ నెట్ కష్టాలు తప్పడం లేదు. సచివాలయాలతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఏపీ ఫైబర్ నెట్ ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఫైబర్ నెట్వర్క్ గత కొన్ని రోజులుగా రాకపోవడంతో సచివాలయాల్లో ఆన్లైన్ పను లు చేసేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వాళ్లు వారి సొంత మొబైల్స్కు వైఫై ద్వారా కంప్యూటర్లకు కనెక్ట్ చేసుకుని ఆన్లైన్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాగే మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయా ల్లో కూడా ఈ ఏపీ ఫైబర్ నెట్ వినియోగిస్తుండటంతో వారు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నెట్వర్క్ వచ్చేటట్లు చూడా లని కోరుతున్నారు. -
మరణించిన 22 రోజులకు..
కాశీబుగ్గ: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి ఊహించని రీతిలో మరణించిన యువకుడి మృతదేహం ఇరవై రెండు రోజుల అనంతరం స్వదేశానికి చేరుకుంది. పలాస మండలం తర్లాకోట పంచాయతీ ఖైజోల గ్రామానికి చెందిన బుడత దామోదర (33) గత నెల 21వ తేదీ సోమవారం మరణించినట్లు ఇక్కడకు సమాచారం వచ్చింది. పోలాండ్ దేశంలో వెల్డర్గా పనిచేసేందుకు వెళ్లి ఓ పార్కులో ఊయల వద్ద మరణించడం సంచలనంగా మారింది. దామోదర్కు అమ్మ పున్నమ్మ, పెరాలిసిస్తో బాధపడుతున్న తండ్రి లక్ష్మీనారాయణ, భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దివ్యాంగుడైన అన్నయ్య, అతని భార్య పిల్లలతో కలిసి ఉమ్మడిగా జీవిస్తున్నారు. వారందరి కీ దామోదర్ మాత్రమే ఆధారం. కుటుంబం కోసమే ఆయన పోలాండ్ వెళ్లాడు. ఇంటి కోసం అంతదూరం వెళ్లి తిరిగి విగతజీవిగా రావ డంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన చనిపోయిన ఘటనపై ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనికి అధికారులు స్పందించారు. అయితే అక్కడ నిబంధనల ప్రకారం ప్రక్రియలు అన్నీ పూర్తయ్యి మృతదేహం స్వగ్రామానికి చేరేందుకు 22 రోజులు పట్టింది. ఆదివారం అంత్యక్రియలు దామోదర్ మృతదేహానికి స్వగ్రామం ఖైజోల గ్రామంలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రబాను, చంద్ర అల్లూరి, రమేష్లు కష్టపడగా ఇండియన్ ఎంబసీ ఎంతో సహకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
శ్రీముఖలింగంలో భక్తుల సందడి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో వైశాఖిమాసం మొదటి ఆదివారం భక్తులు సందడి చేశారు. హిరమండలం పరిధి అంబా విల్లి త్రినాథ స్వామికి మొదటి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు శ్రీముఖ లింగం తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహించారు. అలాగే జిల్లా నలుమూలలతోపాటు పక్క రాష్ట్రాలైన వియనగరం, విశాఖపట్నం, అనకాపల్లి తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశా నుంచి భక్తులు తరలి వచ్చారు. అర్చకులు గణ పతి పూజతో ప్రారంభించి స్వామివారికి ఏకవార అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే వారాహి అమ్మవారికి కూడా కుంకుమ పూజలు చేశారు. మరికొంద రు తమ కోర్కెలు తీరడంతో గోలెంలో బియ్యం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీముఖలింగంలో నరసింహ జయంతి జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగం ఆలయ పరిధి నరసింహ స్వామి ఆలయంలో వైశాఖ మాసం ఆదివారం ఘనంగా నరసింహ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజతో ప్రారంభించి స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతి అయిన బెల్లం, పానకాలు నైవేద్యం సమర్పించి భక్తులు పంచిపెట్టి నట్లు అర్చకులు విశ్వనాథ్ దాస్, ప్రసాద్ పాడి తెలిపారు. అనంత రం స్వామివారికి హారతులిచ్చారు. రోడ్డు ప్రమాదంలో క్లీనర్కు గాయాలు రణస్థలం: మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, హైవే పెట్రోలింగ్ ఏఎస్ఐ కె.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీ ముందు వెళుతున్న లారీని బలంగా ఢీ కొట్టింది. దీంతో క్లీనర్ సదాశివం కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. వెంటనే హైవే పోలీసులు అంబులెన్సులో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఈ ప్రమాదంపై జేఆర్ పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కళకళలాడిన కాంప్లెక్స్ శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో కళకళలాడుతూ కనిపించింది. అరసవల్లి శ్రీసూర్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ప్రయాణికుల తాకిడి మరింత అధికమైంది. తిరుగు ప్రయాణంలో కాంప్లెక్స్లో నాన్స్టాప్ కౌంటర్ వద్ద ప్రయాణికులు టికెట్ల కోసం క్యూలో బారులు తీరుతూ కనిపించారు. నాన్స్టాప్ బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్టీసీ అధికారులు త్వరితగతిన స్పందించి ప్రయాణికుల రద్దీకి తగ్గట్లు నాన్స్టాప్ బస్సుల స్థానంలో పల్లెవెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ సర్వీసులను నడిపారు. ‘బకాయి వేతనాలు చెల్లించండి’ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించాల్సిన మార్చి నెల బకాయి వేతనం రూ. 7,200 వెంటనే చెల్లించా లని ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌర వ అధ్యక్షులు కె.నాగమణి, డి.ధనలక్ష్మి, జి.అమ రావతి డిమాండ్ చేశారు. ఆదివారం శ్రీకాకుళంలో సీఐటీయూ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్తో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మార్చి నెల పూర్తి వేతనం చెల్లించినా శ్రీకాకుళం జిల్లాలో జిల్లా అధికారుల జాప్యం వల్ల జీతం రాలేదని అన్నా రు. ఆశాలకు రికార్డులు అవసరం లేదని మొబై ల్ యాప్లో పని చేయాలని రాష్ట్ర అధికారులు ఆదేశాలిస్తే జిల్లాలో రికార్డు పని, ఆన్లైన్ పని రెండు రకాలు పనులు చేయిస్తూ పని భారం పెంచుతున్నారన్నారు. లేబర్ కోడ్లు రద్దు, కనీ స వేతనం 26 వేలు ఇవ్వాలని కోరుతూ కార్మి క సంఘాలు పిలుపుమేరకు మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను ఆశాలంతా జయప్రదం చేయాలని కోరారు. -
మాజీ మంత్రి రజినిపై పోలీసుల చర్య హేయం
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట: కూటమి పాలనలో అంతా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, కోర్టులు ఎన్ని మొట్టికాయులు పెడుతున్నా పోలీసులు అత్యుత్సాహానికి పోయి ఇష్టానుసారం వ్యవహరించడం శోచనీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీసీ నేత, మహిళా నాయకురాలు, మాజీ మంత్రి విడుదల రజినిపై చిలకలూరిపేట సీఐ సుబ్బనాయుడు ప్రవర్తన హేయమైన చర్య అని అన్నారు. ఒక మహిళపై ఇలా దురుసుగా ప్రవర్తించడం దారణమని పేర్కొన్నారు. మాజీ మంత్రిని ఇలా పక్కను నెట్టడం, ఆమైపె దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. అలాగే గుంటూరు జిల్లా కంతేరులో కూడా ఎంపీటీసీ అయిన దళిత మహిళ కల్పనను రాత్రి 3 గంటలకు అరెస్టు చేయడం రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమన్నారు. ఈ అన్యాయాలపై పోరాటం చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. -
మొక్కజొన్నకు ‘మద్దతు’ కరువు..!
● తక్కువకు కొనుగోలు చేస్తున్న దళారులు ● బస్తాకు రూ.125ల వరకు నష్టపోతున్న వైనం ● పట్టించుకోని అధికారులు నరసన్నపేట: ఎన్నో ఆశలతో మొక్కజొన్న పండించిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడం లేదు. ప్రస్తుతం పంట పూర్తిగా కోతకు వచ్చి దిగుబడులు రైతుల చేతికొచ్చాయి. అయితే ఆశించిన ధర లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ రెండో వారం నుంచి మొక్కజొన్న కోతకు రాగా.. ఇప్పటికీ ధర పెరగగపోవడంతో రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో 9000 ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. ఎకరాకు 30 నుంచి 45 బస్తాల వరకు దిగుబడి వస్తున్నా మద్దతు ధర రాకపోవడంతో ఆశించిన ఆదాయం పొందలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న వంద కేజీల బస్తాకు రూ.2,225లుగా మద్దతు ధర ప్రకటించింది. అయితే జిల్లాలో అధికారికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులే దిక్కు అయ్యారు. వీరితో పాటు ప్రైవేటు వ్యాపారులు నిర్ణయించిన ధరకే రైతులు విక్రయాలు చేయాల్సి వస్తోంది. దళారులు బస్తాకు 101 కేజీలు తీసుకుంటున్నారు. అరువు పద్ధతిన బస్తాను రూ.2,100 కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు బస్తాపై సుమారుగా రూ.125లు మేరకు మద్దతు ధర నష్టపోతున్నారు. అదే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అంటున్నారు. వ్యవసాయ మంత్రి ఇదే జిల్లాలో ఉన్నా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమని రైతులు అంటున్నారు. బస్తాపై రూ.125 చొప్పున లెక్క వేస్తే ఒక ఎకరా పండించే రైతు దాదాపు రూ.3,100 నుంచి రూ.5 వేల వరకు నష్టపోతున్నాడు. -
ఉత్సాహంగా ఉషూ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా స్థాయి ఉషూ ఎంపిక పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగాయి. జిల్లా ఉసూ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం జిల్లాస్థాయి సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఉషూ ఎంపిక పోటీలు నిర్వహించారు. అంతకుముందు ఉదయం ఈ ఎంపిక పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డాక్టర్ కె.శ్రీధర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ప్రశాంతతతో పాటు ఉజ్వల భవిష్యత్ కూడా సొంతమవుతుందన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి మాట్లాడుతూ ఉషూ క్రీడాకారులు దశాబ్దకాలంగా రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం సంతోషకరమన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 12 నుంచి 14 వరకు కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి ఉషూ చాంపియన్షిప్ పోటీలకు పంపిస్తామని ఉషూ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డి శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, ఎస్.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో జరిగింది. కమిటీ చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులపై ప్రమాదాలకు అవకాశాలు ఉన్న చోట్ల ఎన్ఫోర్స్మెంట్ను బలోపేతం చేయాలన్నారు. డివైడర్లను తొలగిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజినీరింగ్ శాఖలు ఇటీవల జరిగిన ప్రమాదాలను విశ్లేషణ చేసి నివారణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో 108 వాహన సేవలు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ జాన్ సుధాకర్, డిప్యూటీ ట్రాన్స్ఫోర్ట్ కమిషనర్ విజయ సారథి, ఎన్హెచ్ ప్రాంతీయ ప్రాజెక్టు డైరెక్టర్ తివారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గంగాధర్, డీఎస్సీ సీహెచ్ వివేకానంద, డీఎంహెచ్వో అనిత తదితరులు పాల్గొన్నారు. -
నర్సింగ్ కళాశాలకు.. నిబంధనలు పట్టవా..?
శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న నర్సింగ్ కాలేజీకి ప్రభుత్వ నిబంధనలు పట్టడం లేదు. ఇటీవల మంగళవారం ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని నిబంధనలకు విరుద్ధంగా విజయవాడకు పంపించగా, అక్కడ సదరు ఉద్యోగి మృత్యువాతపడిన విషయం పాఠకులకు విధితమే. ఈ విషయం సాక్షిలో ప్రచురితమైన అనంతరం అక్కడి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లేడీస్ హాస్టల్లో పురుషులకు డ్యూటీ నర్సింగ్ కాలేజీ హాస్టల్లో యువతులు ఉండగా.. ఇక్కడ పురుష ఉద్యోగులకు సెలవు రోజుల్లో డ్యూటీలను వేస్తున్నారు. రొటేషన్ పద్ధతిపై వారికి డ్యూటీలను వేస్తూ కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ అసిస్టెంట్ అజయ్ సంతకాలతో సర్క్యూలర్లను కూడా జారీ చేస్తున్నారు. వాస్తవానికి బాలికలు, యువతులు, మహిళల విద్యాసంస్థల్లో గానీ, హాస్టల్స్లో గానీ 55 ఏళ్లలోపు ఉన్న పురుషులను విధుల్లో నియమించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. దీనిని పట్టించుకోకుండా 27 ఏళ్ల వయసున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను సెలవు రోజుల్లో డ్యూటీలకు వేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. వార్డెన్ లేకుండా వసతి గృహం ఇదిలా ఉండగా హాస్టల్ను వార్డెన్ లేకుండానే నడిపిస్తున్నారు. నాలుగు నెలల క్రితం అవుట్ సోర్సింగ్ పద్ధతిపై ఒక మహిళను వార్డెన్గా నియమించారు. ఆమె విధుల్లో చేరిన తర్వాత 24 గంటలపాటు హాస్టల్లో ఉండాలని, బయటకు వెళ్లేందుకు వీళ్లేదని ప్రిన్సిపాల్ నిబంధనలు విధించారు. దీంతో వారం రోజుల్లోనే ఆమె ఉద్యోగం నుంచి వైదొలిగినట్లు పలువురు చెబుతున్నారు. నర్సింగ్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్, ఒక ట్యూటర్, సూపరింటెండెంట్, ఏవో, ముగ్గురు సీనియర్ అసిస్టెంట్లు రెగ్యులర్ ఉద్యోగులు కాగా, వీరిలో 70 శాతం మంది విజయనగరం, విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. వీరెవరూ సెలవు రోజుల్లో ఇక్కడ ఉండకపోవడం వలన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వీరెవరికీ విజయవాడ వెళ్లడం ఇష్టంలేకపోవడంతో కిశోర్ను విజయవాడ పంపించారని పలువురు చెబుతున్నారు. ఆయనను విజయవాడ పంపించిన విషయంలోనూ నిబంధనలు పాటించలేదు. కాన్ఫిడెన్షియల్ సమాచారం పంపించినప్పుడు అందుకు సంబంధించిన సమాచారం రిజిస్ట్రార్లో నమోదు చేసి సంబంధిత ఉద్యోగితో సంతకం చేయించుకోవాల్సి ఉంటుంది. అతడిని కార్యాలయం పనిమీద ఎక్కడికి పంపిస్తున్నారో మూమెంట్ రిజిస్ట్రార్లో నమోదు చేసి సంబంధిత ఉద్యోగితో పాటు కాలేజీ యాజమాన్య ప్రతినిధి కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. అతడిని పంపిస్తున్నట్లు ఒక లేఖను సిద్ధం చేసి ఉద్యోగికి ఇవ్వాలి. అలాగే టీఏ, డీఏగా అడ్వాన్స్ చెల్లిస్తే దాన్ని నమోదు చేయాలి. కానీ కిశోర్ విషయంలో ఇవేవీ పాటించలేదు. ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపిస్తే నిబంధనలు పాటించకుండా జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాశాలలో నిబంధనలకు నీళ్లు స్థానికంగా ఉండని రెగ్యూలర్ ఉద్యోగులు డ్యూటీలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇబ్బందులు లేడీస్ హాస్టల్పరిశీలనకు నియామకం సెలవు రోజుల్లో విద్యార్థినులు ఔటింగ్ అంటూ బయటకు వెళ్తారు. వారు సరైన సమయానికి వస్తున్నారా.. లేదా అనే పరిశీలన కోసమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్నాం. – ఝాన్సీలక్ష్మి, ప్రిన్సిపాల్, నర్సింగ్ కాలేజీ -
యాక్సిస్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందే
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం యాక్సిస్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని వామపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల అదనుపు భారం, యాక్సిస్ ఒప్పందాల రద్దు కోరుతూ శుక్రవారం విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ యూనిట్ విద్యుత్ను రూ.4.60 చొప్పున కొనుగోలు చేసుకునేందుకు ఏకంగా 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకోవడం దారుణమన్నారు. గత ప్రభుత్వం ఆదానీ సంస్థలతో సోలార్ విద్యుత్ యూనిట్ ధర రూ.2.49కే కొనుగోలు ఒప్పందం చేసుకుంటే.. ఇవే అధిక రేట్లంటూ పత్రికల్లో రాయించి రాద్ధాంతం చేసిన టీడీపీ.. ఇప్పుడు అఽధికారంలోకి వచ్చాక అంతకు రెట్టింపు డబ్బులు పెట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. తాజా యాక్సిప్ ఒప్పందం ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15 వేల కోట్ల భారం పడనుందని, తక్షణమే ఈ దొంగ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యుత్ చార్జీలను పెంచకుండా తగ్గిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు ఇప్పుడు ఏడాదిలోనే మూడు సార్లు విద్యుత్ చార్జీలను పెంచేసి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ట్రూ అప్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, సర్చార్జీల పేరిట విద్యుత్ వినియోగదారులపై బాదుడే బాదుడు అంటే ఏంటో చూపించారని విమర్శించారు. దేశంలో అనేక రాష్ట్రాలు రూ.2, రూ.2.50కే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటుంటే మన రాష్ట్రంలో మాత్రం రూ.4.60కి కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నారంటే.. అక్రమాలకు తెరతీసినట్లుగా ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు సీహెచ్ అమ్మన్నాయుడు, వివిధ సంఘాల నేతలు ఎం.ఆదినారాయణమూర్తి, కొత్తకోట అప్పారావు, అల్లు సత్యన్నారాయణ, కె.సూరయ్య, ఎన్.వి.రమణ, ఆర్.ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. -
కోచింగ్ సెంటర్లో దారుణం
● విద్యార్థిని చితకబాదిన నిర్వాహకులు ● తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వ్యవహారం నరసన్నపేట: స్థానిక ప్రశాంత్ నగర్లో కుందనా నవోదయ కోచింగ్ కేంద్రం నిర్వాహకులు విద్యార్థులను చితకబాదుతున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలను మంచిగా చదివిస్తామని నవోదయ ఎంట్రన్స్ పరీక్షలకు సిద్ధం చేస్తామని తల్లిదండ్రులను నమ్మించి జాయిన్ చేసుకున్నారు. తీరా అక్కడ విద్యార్థులను ఇష్టం వచ్చినట్లు కొడుతుండడంతో తల్లిదండ్రులు వీధికెక్కారు. దీంతో వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. పోలాకి మండలం ఈదులవలస గ్రామానికి చెందిన ముద్దాడ శ్రీనివాసరావు తన కుమారుడు శ్రీకర్ను కోచింగ్ కోసం కుందనా నవోదయ కోచింగ్ సెంటర్లో చేర్పించారు. అయితే గురువారం అబ్బాయి ఇంటికి వచ్చాక స్నానం చేయిస్తున్నప్పుడు వీపు, చెవులుపై గాయాలు ఉండడాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో విద్యార్థిని ప్రశ్నించగా కోచింగ్ సెంటర్లో టీచర్ కొట్టారని, చాలా అవమానకరంగా మాట్లాడారని తెలిపాడు. పోలీసుల హెచ్చరిక ఈ విషయంపై విద్యార్థి తండ్రి శ్రీనివాసరావు కోచింగ్ సెంటర్ నిర్వాహకులను ప్రశ్నించగా అతడినే కొడతామని వారు సమాధానం చెప్పారు. దీంతో విషయాన్ని శుక్రవారం పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏఎస్ఐ సింహాచలం కోచింగ్ కేంద్రం వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఇలా కొట్టడం మంచిది కాదని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న ఏబీవీపీ ప్రతినిధి మదన్కుమార్ కోచింగ్ సెంటర్ వద్దకు వచ్చి నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. బాలల హక్కులను కాలరాస్తున్న ఈ కోచింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలబాలికలకు రోజుకు 10 గంటలకు పైగా శిక్షణనిస్తున్నారని తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఘటనపై కోచింగ్ కేంద్రం నిర్వాహకుడు వైకుంఠరావు మాట్లాడుతూ.. అనుకోకుండా గట్టిగా దెబ్బ తగిలిందని, అంతేతప్ప కావాలని పిల్లలను ఇబ్బంది పెట్టలేదన్నారు. -
సెల్ఫోన్ చోరీకి యత్నం
టెక్కలి రూరల్: స్థానిక రెడ్క్రాస్ వీధి సమీపంలో శుక్రవారం ఒక ద్విచక్ర వాహనంపై గుర్తు తెలియని ఇద్దరు యువకులు వచ్చి ఒక్కసారిగా కింద పడిపోయినట్లు నటించారు. అక్కడే ఉన్న పండిత శ్రీను అనే వ్యక్తి వారిని పైకి లేపేందుకు ప్రయత్నిస్తుండగా ఆ ద్విచక్ర వాహనం వెనుకనున్న వ్యక్తి అతని షర్ట్జేబు నుంచి సెల్ఫోన్ చోరీకి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన శ్రీను వారి చేతి నుంచి సెల్ తీసుకున్నాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై అక్కడ నుంచి పరారయ్యారు. ఇది గుర్తించి మరో వ్యక్తి వారిని వెంబడించాడు. స్థానిక ఇందిరాగాంధీ జంక్షన్ వద్ద ట్రాఫిక్లో వారిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనం అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ తరహాలో అనేకసార్లు చోరీలు జరగడంతో ఆ చోరీలతో ఈ యువకులకు సంబంధంపై పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోందని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పల భానుమూర్తి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సంఘ జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్మోహన్ అధ్యక్షతన ధర్నా శిబిరాన్ని ప్రారంభించారు. పాఠశాలలకు సంబంధించి పాత విధానాన్నే కొనసాగించాలన్నారు.ఉపాధ్యాయుల, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 55 ప్రకారం పోస్టులు కొనసాగించాలని కోరారు. సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కార్యదర్శి డి.సరస్వతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.వి.అనిల్కుమార్, జిల్లా కార్యదర్శి దాసరి రామ్మోహనరావు, జిల్లా కార్యదర్శి వి.నవీన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
వేగం పెంచిన విజిలెన్స్
● ఆదిత్యాలయంలో అక్రమాలపై వడివడిగా విజిలెన్స్ విచారణ ● గతేడాది ప్రసాదాల విభాగం ఖర్చులపై వాంగ్మూలాల సేకరణ ● వాస్తవాలు చెప్పేసిన రికార్డు అసిస్టెంట్పై అక్రమార్కుల గుర్రు అరసవల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక అరసవల్లి ఆదిత్యుని ఆలయంలోని పలు విభాగాల్లో జరిగిన అవినీతి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గతేడాది ఆలయ ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ హయాంలో రూ.లక్షల్లో అవినీతి అక్రమాలు జరిగాయంటూ.. ఇదే ఆలయంలో పనిచేసి విధుల నుంచి సస్పెండైన సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యులు విజిలెన్స్ అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆలయంలో అప్పట్లో జరిగిన పలు అక్రమాలపై విజిలెన్స్ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టింది. వాస్తవాలు చెప్పాడని కక్ష.. రికార్డు అసిస్టెంట్ శిమ్మ మల్లేశ్వరరావు పేరిట మొత్తం 19 చెక్కులను రాసేసి..అతని ప్రమేయం లేకుండానే నేరుగా బ్యాంకుల్లో నగదు డ్రా చేయించుకున్నారని కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భక్తులకు మజ్జిగ, పాలను పంపిణీ చేయకుండానే సుమారు రూ.3.50 లక్షల వరకు ఆలయ ఉద్యోగులే జేబులు నింపుకొన్నారని తేలింది. ఈ సమాచారంలో వాస్తవాలన్నీ శిమ్మ మల్లేశ్వరరావు పూసగుచ్చినట్లుగా విజిలెన్స్ అధికారులకు చెప్పడంతో ఆ దిశగా విచారణ వేగవంతం చేస్తున్నారు. కాగా, వాస్తవాలన్నీ విజిలెన్స్ అధికారులకు మల్లేశ్వరరావు ఒక్కడే చెప్పేశాడనే విషయం బయటకు పొక్కడంతో అక్రమార్కులంతా కలిసి అతనిని టార్గెట్ చేశారు. ఈయనపై ఇంతవరకు ఎలాంటి రిమార్క్ లేదన్న గుర్తింపు స్థానికంగా ఉంది. అయితే తమ అక్రమాలను బయటపెట్టాడన్న కారణంతో ఎలాగైనా మల్లేశ్వరరావుపై ఏదో ఒక అవినీ తి మరక అంటించాలనేలా ఆ ‘ఉద్యోగులు’ కుట్రలకు దిగినట్లు సమాచారం. ప్రసాద విక్రయాలను సాకుగా చూపించి.. కొత్తగా ఆలయ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కె.శోభారాణి ఈ నెల 4న ప్రసాదాల విక్రయాలను తనిఖీ చేయగా తక్కువగా విక్రయాలు జరుగుతున్నాయని గుర్తించారు. గతేడాది వైశాఖ తొలి ఆదివారంలో ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.4 లక్షల వరకు ఆదాయం రాగా.. మొన్నటి తొలి ఆదివారం (ఈనెల 4న) కేవలం రూ.2.20 లక్షల వరకు మాత్రమే ఆదాయం రావడంపై ఈవో మండిపడ్డారు. గత ఏడాది వైశాఖంలో పక్కా భవనాల్లో ఆలయానికి ఎదురుగా విక్రయాలు జరిగాయని, ఇప్పుడు భవనాలన్నీ కూల్చేయడంతో తాత్కాలిక భవనాల్లో ప్రసాదాల కౌంటర్లకు భక్తుల రాక తగ్గిందని అందుకే ఆదాయం కొంత తగ్గిందనే విషయం ఆలయ వర్గాలకు తెలిసినా.. దాన్ని ప్రస్తావించకుండా ఆదాయం తగ్గడానికి ప్రసాదాల విభాగంలో పనిచేస్తున్న మల్లేశ్వరరావు మాత్రమే కారకుడనేలా ఈవోకు ఫీడ్బ్యాక్ అందించారు. ఇక్కడి రాజకీయాలు తెలియని ఈవో శోభారాణి తొలి ఆదివారం ఆదాయం తగ్గడానికి కారకుడిగా మల్లేశ్వరరావుపై చర్యలు చేపడతానంటూ శివాలెత్తడం గమనార్హం. -
శ్రీకాకుళం
శనివారం శ్రీ 10 శ్రీ మే శ్రీ 2025మొక్కజొన్నకు ‘మద్దతు’ కరువు! మొక్కజొన్న రైతుకు మద్దతు కరువైంది. దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో భారీగా నష్టపోతున్నారు. –12లోనిబంధనలు పట్టవా..? నర్సింగ్ కళాశాలలో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నిబంధనలకు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నారు. –12లో●సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో అక్రమంగా సోదాలు పత్రికా స్వేచ్ఛ ను హరించడమే. ఇలాంటి దుశ్చర్యలు ప్రభుత్వం మానుకోవాలి. కూటమి ప్రభుత్వం రెడ్బుక్ తెరిచి పత్రికా ఎడిటర్లు, జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలు చేపట్టడం ప్రభుత్వానికి మంచిదికాదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు పనిచేసినా జర్నలిస్టుల జోలికి ఎవరూ పోలేదు. ఇప్పుడు సెర్చ్ వారెంట్, నోటీసులు లేకుండా సాక్షి ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు చొరబడటం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమే. – బొడ్డేపల్లి మోహన్రావు, ప్రజా న్యాయవాది, ఆమదాలవలస సిటిజన్ ఫోరం ఉపాధ్యక్షుడు ఆమదాలవలసలో.. ఆమదాలవలస: కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమదాలవలసలో జర్నలిస్టులు శుక్రవారం ధర్నా చేపట్టారు. అక్రమంగా సోదాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దారు ఎస్.రాంబాబుకు వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో ఆమదాలవలస సిటిజన్ ఫోరం ఉపాద్యక్షులు, ప్రజా న్యాయవాది బొడ్డేపల్లి మోహన్రావు, సీనియర్ జర్నలిస్టులు యల్లాపంతుల శ్రీనివాసరావు, తమ్మినేని వాసుదేవరావు, మొజ్జాడ అన్నంనాయుడు, చంద్రశేఖర్, పి.రామారావు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాశీబుగ్గలో.. కాశీబుగ్గ: పత్రికా స్వేచ్ఛపై దాడిని ఖండిస్తూ కాశీబుగ్గ గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓ జి.వెంకటేష్కు వినపతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చిగురువలస జగదీ ష్, జాతీయ కన్వీనర్ దానేశ్వర మహారణ, అరసం జిల్లా కార్యదర్శి చింతాడ కృష్ణారావు, సీఐటీయూ నేత నెయ్యిల గణపతి, పీడీఎస్యూ ప్రతినిధి మద్దిల వినోద్కుమార్, కోనారి హేమసుదన్, వంకల రాజారావు, శర్వాణ రవికుమార్, నంబాళ్ల రమేష్కుమార్, రట్టి జోగారావు, మురళి, పత్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పలాస ఆర్డీఓ వెంకటేష్కు వినతిపత్రం అందిస్తున్న పాత్రికేయులు, ప్రజా సంఘాల నాయకులు న్యూస్రీల్ -
యూబీ బీర్లలో సెడిమెంట్స్
● ఎకై ్సజ్ అధికారుల ల్యాబ్ పరీక్షల్లో వెల్లడి ● అవక్షేపాలు ఉండటంతో బీరుగా గుర్తించని అధికారులు ● మార్కెట్కు వెళ్లకుండా అడ్డుకట్ట ● గత ఐదు నెలలుగా కంపెనీకే పరిమితమైన రూ.6కోట్ల విలువైన బీర్లు ● ప్రమాణాల మేరకే ఉన్నాయంటున్న కంపెనీ ప్రతినిధులు సేగ్రిగేషన్కు ఆదేశాలు.. తాజాగా ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ సెడిమెంట్స్(అవక్షేపాలు)తో ఉన్న బాటిల్స్ ప్రతీ ఒక్కదాన్ని పరిశీలించి, సేగ్రిగేషన్(విభజన) చేయాలని యాక్షన్ ప్లాన్ జారీ చేశారు. ●అవక్షేపాలతో ఉన్న బీర్లు ఏవీ? క్లియర్గా ఉన్నవేంటి? అనేది విభజన చేయాలని అధికారులను ఆదేశించారు. ●ముగ్గురు నలుగురు అసిస్టెంట్ కమిషనర్ల పర్యవేక్షణలో 30 లేదా 40మంది అనుభవజ్ఞులైన కార్మికులను నియమించాలని, ఒక్కొక్క కార్మికుడు గంటకి 800 నుంచి 1000 బాటిల్స్ పరిశీలించాలని, రోజుకి 8 నుంచి 16 గంటల పాటు షిప్టుగా చేసుకుని 10రోజుల పాటు సేగ్రిగేషన్ చేయాలని ప్రత్యేక షెడ్యూల్ ఇచ్చారు. ●పరిశీలించిన వాటిలో అవక్షేపాలు ఉన్న బాటిల్స్ ఎన్ని, క్లియర్గా ఉన్న బాటిల్స్ ఎన్ని నిర్ధారించి, క్లియర్గా ఉన్న బాటిల్స్ను మరోసారి ప్రభుత్వ ల్యాబ్తో పాటు మరో ల్యాబ్కు పంపించి పరీక్షలు చేయించాలని సూచించారు. ●ఈ నెల 7వ తేదీ నుంచే ఈ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ఆదేశించారు. అసలే ప్రభుత్వ ల్యాబ్లో అవక్షేపాలున్నట్టు గుర్తించిన బాటిల్స్ అవి.. ఆ పైన వాటి ఎకై ్స్పరీ డేట్ కూడా సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సేగ్రిగేషన్కు ఆదేశాలివ్వడం వెనక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇందులో ఏదో మాయాజాలం, గూడుపుఠాణి నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. 10 రోజుల పాటు పరిశీలించి, ఆ తర్వాత ల్యాబ్కు పరీక్షలకు పంపించి, రిపోర్టులు తెచ్చుకునేలోపే ఆ బాటిల్స్ కాలం చెల్లనున్నాయి. ఈ పరిస్థితుల్లో సేగ్రిగేషన్కు ఆదేశించడం గమనార్హం. ఒకవేళ సేగ్రిగేషన్లో ప్రమాణాల మేరకు ఉన్నాయని తేలినా, ఎకై ్స్పరీ డేట్ కారణంగా మార్కెట్లోకి పంపించడానికి అవకాశం ఉండదు. అలాంటప్పుడు ఇప్పు డెందుకు ఈ తంతు అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. యూబీ ప్రతినిధులు కోరినట్టు మార్కెట్లోకి పంపించడానికి వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రణస్థలంలోని యూబీ కంపెనీలో తయారైన బీర్లు ప్రమాణాల మేరకు లేవా? వాటిలో అవక్షేపాలు ఉంటున్నాయా? మందుబాబుల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా బీర్లు ఉంటున్నాయా? అంటే అవుననే అన్పిస్తోంది. గతేడాది నవంబర్, డిసెంబర్లో తయారైన బీరు శాంపిల్స్ను అధికారులు ల్యాబ్లో పరీక్షించేసరికి డొల్లతనం బయటపడింది. దాదాపు 12,76,128 బీర్లు తేడాగా ఉన్నట్టు గుర్తించారు. 10 బ్యాచ్లకు చెందిన సుమారు రూ.6కోట్ల విలువైన బాటిల్స్లో తేడా ఉందని నిగ్గు తేల్చారు. యూబీ కంపెనీలో తయారైన ఉత్పత్తులు బీరుగా పాస్ కాలేదని అధికారులు స్పష్టం చేయగా, అన్నీ బాగున్నాయని, తాము చేసిన పరీక్షల్లో ప్రమాణాల మేరకే ఉన్నాయని యూబీ కంపెనీ ప్రతినిధులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క బాటిల్ను పరిశీలించి, అవక్షేపాలతో ఉన్న బాటిల్స్ ఏవీ? క్లియర్గా ఉన్నవేవీ? గుర్తించాలని ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ తాజాగా యాక్షన్ ప్లాన్ జారీ చేశారు. మార్కెట్లోకి అనుమతివ్వని అధికారులు.. రణస్థలంలోని యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీలో తయారైన బీరు బాటిల్స్లో అవక్షేపాలు(సెడిమెంట్స్) కన్పించాయి. సేవించడానికి వీల్లేని బీర్లుగా అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని ఎకై ్సజ్ ల్యాబ్లో సదరు బీరు శాంపిల్స్ను పరీక్షించగా, ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ల్యాబ్ నివేదిక ఆధారంగా 267,268,269,270, 271,272, 273, 274, 275, 325బ్యాచ్లకు చెందిన 1,60,344 కేసులను (ఒక్కొక్క కేసుకు 12 బాటిల్స్) బీరుగా అధికారులు గుర్తించలేదు. వీటిని మార్కెట్లోకి పంపించడానికి వీల్లేదని అభ్యంతరం తెలిపారు. గతేడాది నవంబర్, డిసెంబర్లో ఈ ఉత్పత్తులు జరిగాయి. తాము మరో ల్యాబ్లో చేసిన పరీక్షల్లో ప్రమాణాల మేరకే ఉన్నాయని యూబీ కంపెనీ ప్రతినిధులు అపీలు చేసుకున్నా అనుమతి లభించలేదు. ప్రస్తుతానికి ఆ బీర్లు అన్నీ యూబీ కంపెనీలో ఉన్నాయి. సమీపించిన ఎకై ్స్పరీ డేట్.. అధికారులు చేసిన ల్యాబ్ పరీక్షల్లో అవక్షేపాలున్న బీర్లలో 267, 268 బ్యాచ్లకు చెందిన 4,01,820 బాటిల్స్ ఈనెల 29న ఎకై ్స్పరీ కానున్నాయి. 3,06,456 బాటిల్స్ ఈనెల 30న, మరో 56,832బాటిల్స్ జూన్4న, 3,59,004 బాటిల్స్ జూన్ 5న, 1,52,016 జూన్ 28న కాలం చెల్లనున్నాయి. అయినప్పటికీ వాటిని మార్కెట్లోకి పంపించడానికి అనుమతి ఇవ్వాలని యూబీ ప్రతినిధులు కోరుతున్నారు. తమదైన శైలిలో లాబీయింగ్ చేస్తున్నారు. ఎౖక్సైజ్ శాఖలోని కొందర్ని ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఇక్కడ తయారైన బాటిల్స్ ఐఎంఎల్ గొడౌన్కు పంపించాలి. అక్కడి నుంచి లైసెన్సుడ్ షాపులకు, బార్లకు పంపించాలి. ఇదంతా చేయడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపే ఈ బీరు బాటిల్స్ కాలం చెల్లనున్నాయి. -
ఇంటర్ సప్లిమెంటరీ హాల్టికెట్ల పంపిణీ
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లు కళాశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఐపీఈ మార్చి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులతోపాటు వివిధ సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు బెటర్మెంట్ రాసుకునేందుకు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్టియర్కు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు సెకెండియర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. బీఐఈ.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్ నుంచి కూడా విద్యార్థులు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. ఏపీఎస్పీ కమాండెంట్గా పద్మనాభరాజు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లలో ప్రారంభించిన 1వ ఏపీఎస్పీ (ఐఆర్) నూతన కమాండెంట్గా పద్మనాభరాజును నియమిస్తూ పోలీస్ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తు నిర్వహణ, తీవ్రవాద నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట వంటి చర్యల్లో సివిల్ పోలీసులకు సహాయం చేయటం, సలహాలు ఇచ్చేందుకు ఉద్యోగోన్నతిపై ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ప్రాంతంలో బెటాలియన్ నిర్మాణం ఏర్పాట్లు సైతం పర్యవేక్షిస్తున్నారు. అడిషనల్ కమాండెంటెంట్ పి.సత్తిబాబు, అధికారులు ఆయనకు అభినందనలు తెలియజేశారు. దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ 21వ బ్యాచ్కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎ.విజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని తెలిపారు. ఈ నెల 3వ వారంలో ప్రారంభమయ్యే శిక్షణకు 16 మందికే అవకాశం ఉందని, పూర్తి వివరాలకు 9441161051, 9390886033 నంబర్లను సంప్రదించాలని కోరారు. అనుమానితులతో జాగ్రత్త గార : సముద్రం, తీర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు సంచరిస్తే వెంటనే సమాచారమివ్వాలని కళింగపట్నం మైరెన్ సీఐ బి.ప్రసాదరావు కోరారు. శుక్రవారం గార మండలం బందరువానిపేట, కె.మత్స్యలేశం గ్రామాల్లో భారత్–పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో మత్స్యకారులకు అవగాహన కల్పించారు. సముద్రంలో వేట సాగిస్తున్నప్పుడు వేరే దేశాల బోట్లు వస్తుంటే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజాభద్రతకు అందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై మహాలక్ష్మీ, సిబ్బంది పాల్గొన్నారు. బాధితులకు న్యాయం చేయాలి కాశీబుగ్గ: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో స్వీకరించిన అర్జీలకు ప్రాధాన్యమిచ్చి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాశీబుగ్గ పోలీసుస్టేషన్లో పోలీసు గ్రీవెన్స్సెల్ నిర్వహించారు. పలువురి నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. విచారణ చేపట్టి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశీబుగ్గ సబ్ డివిజన్ పరిధిలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం సరికాదు
● ‘సాక్షి’తో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు టి.తిరుపతిరావు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ప్రజల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించే పత్రికల గొంతు నొక్కే ప్రయత్నాల ను పాలకులు మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా నాయకుడు టి.తిరుపతిరావు అన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో నిబంధనలకు విరుద్ధంగా సోదాలు నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ●సమాజంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేసేవి పత్రికలే. అటువంటి వారి గొంతు నొక్కేయాలన్న ప్రయత్నం రాజకీయ పార్టీలు మానుకోవాలి. రాజ్యాంగంలో ఫోర్త్ఎస్టేట్గా భావించే నాలుగో స్తంభాన్ని విరగ్గొట్టాలని చూడటం పాలకులకు తగదు. ●ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛను హరించే రాజకీయ పార్టీలు, వ్యాపారవేత్తలు ప్రపంచ చరిత్రలో మనుగడలేకుండాపోయారు. ●కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలుచే యడం మానేసి వాస్తవాల్ని తెలియజేసే పత్రికలు, మీడియాలపై పోలీసులతో కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ●కూటమి ప్రభుత్వం తీరును ప్రశ్నిస్తున్న సోషల్మీడియా వాదులపైనా కేసులు పెట్టడం దారుణం. ●ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని తరహాలు రెడ్బుక్ పేరిట కక్షసాధింపులు చర్యలు చేపడుతున్నారు. ఇటువంటివి తగ్గించుకుని ప్రజలకిచ్చే హామీలపై దృష్టి సారిస్తే మంచిది. ●పత్రికాస్వేచ్ఛను కాపాడితేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది. లేదంటే కార్పొరేట్ శక్తులకు, రియల్టర్ల హవా కొనసాగి సామాన్యుడికి తిండిలేని దుస్థితికి ప్రభుత్వాలు తీసుకొస్తాయి. ప్రజాస్వామ్యం బతికేదెలా..ప్రభుత్వం ఇలా -
‘మత్తు’ను చిత్తు చేద్దాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, వర్కర్లు, ఆటో డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్లు తెలిసిందని, డ్రగ్స్ విక్రయాలు జరిగే ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు కౌన్సిలింగ్, పునరావాసం కల్పించాలన్నారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మెడికల్ షాపులన్నింటిలోనూ సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశించారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈగల్ టీంలు మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక నిఘా పెట్టాయని చెప్పారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే 112, 1972 నంబర్లకు తెలియజేయాలని కోరారు. రిమ్స్లోని డీ–అడిక్షన్ సెంటర్ను అందుబాటులో ఉంచుతామన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. -
అదిగదిగో అలనాటి జీవన స్వర్గం!
అనగనగా ఓ కాలంలో.. సెల్ కోడి కూయకుండానే నిద్ర లేచేవారు. కరెంటు, రెంటు, ఎక్స్ట్రా.. వంటి కష్టాలు లేకుండా ప్రకృతితో మమేకమయ్యేవారు. ఉదయాస్తమయాల మధ్య కాలాన్ని అత్యంత సహజంగా గడిపేవారు. పున్నమి వెలుగు, అమావాస్య చీకటి, వాసంతపు వేకువ, శరత్ కాలపు రాత్రుళ్ల కాలాన్ని ఆస్వాదించేవారు. ఆధునికత వచ్చింది. యంత్రాలను తెచ్చింది. బతుకుల్లో సహజత్వం మాయమైపోయింది. కూర్మ గ్రామం మళ్లీ ఆ సహజత్వానికి దగ్గరగా బతుకుతోంది. వందల ఏళ్ల కిందటి జీవన విధానాన్ని అనుసరిస్తోంది. ఆ బతుకుల్లో తీపిని రుచి చూపేందుకు వేసవిలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.హిరమండలం: కరెంటు లేని నివాసాలు.. రసాయనాలు లేని పంటలు, ఆధునికత అంటని బతుకులు.. వెరసి కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తుందీ గ్రామం. కృష్ణ చైతన్య సమాజం పేరుతో 2018లో గ్రామం ఏర్పాటైంది. భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశాల మేరకు భక్తి వికాస్స్వామి ఆధ్వర్యంలో ఈ పల్లె ఏర్పడింది. ఏడాది పొడవునా ఇక్కడకు వేలాది మంది భక్తులకు తరలివస్తుంటారు. కాగా ప్రస్తుతం కూర్మ గ్రామంలో యువతకు నెల రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అన్నీ సొంతంగానే.. కూర్మ గ్రామంలో 80 మంది వరకూ నివాసముంటున్నారు. 20 వరకూ గృహస్తు జీవన కుటుంబాలు ఉన్నాయి. ఓ 20 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. సరళ జీవనం, ఉన్నత చింతన వీరి విధానం. మనిషికి నిత్యావసరాలుగా భావించే కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తున్నారు. ప్రకృతి సేద్యంతోనే వీటిని సంపాదించుకుంటున్నారు. ఏడాదిలో వీరికి అవసరమైన వందలాది బస్తాల ధాన్యాన్ని పండిస్తుంటారు. టన్నుల కొద్దీ కూరగాయలను సాగు చేస్తున్నారు. అక్కడ గృహస్తులతో పాటు విద్యార్థులు, ఏడాది పొడవునా ఇక్కడకు వచ్చే భక్తులకు వాటితోనే ఆహారం తయారుచేసి అందిస్తుంటారు. దంపుడు బియ్యాన్ని మాత్రమే వండుకుంటారు. వారి దుస్తులను వారే తయారుచేసుకుంటారు. ఇళ్లకు వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మెంతులు, కరక్కాయలు, మినుములు మిశ్రమంగా చేసి గానుగ ఆడిస్తారు. గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో కలిపి ఇళ్లు కట్టుకున్నారు. కుంకుడు కాయ రసంతోనే దుస్తులను ఉతుక్కుంటారు. వర్ణాశ్రమ విద్య.. ఇక్కడ విద్యార్థులు వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తుంటారు. పూర్వపు గురుకులాలతరహాలో ఇక్కడ వాతా వరణం ఉంటుంది. విద్యార్థులు సంస్కృతం, ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. వయసు, ఆసక్తిని బట్టి చేతివృత్తులపై శిక్షణ ఇస్తారు. మనిíÙని సనాతన మార్గం వైపు నడిపించాలన్నదే కృష్ణచైతన్య సమాజం కూర్మ గ్రామం ఏకైక లక్ష్యం. అందుకే ఒక ఇంటితో ప్రారంభమైన ఈ శ్రీకారం ఇప్పుడు దాదాపు 80 ఇళ్ల వరకూ చేరుకుంది. ఏటా యువతకు శిక్షణప్రకృతి సమాజాన్ని విస్తరించాలని.. సనాతన ధర్మం వైపు ఈ సమాజం అడుగులు వేయాలని ఏటా యువతకు ఇక్కడ వేసవి శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. నెలరోజుల పాటు చేతివృత్తులు, పురాతన జీవన విధానం, సనాతన ధర్మం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. వర్ణాశ్రమ కళాశాలలో ఈ శిబిరాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. చేనేత మగ్గం, మట్టికుండల తయారీ, వడ్రంగి, కర్రసాము, నూనెగానుగ, సున్నం గానుగ, వైదిక గృహ నిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, గో సంరక్షణ, ఆయుర్వేదం వంటి వాటిపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల శిక్షణ కూడా ఉంటుంది. మంత్రధ్యానం, శ్రవణం, కీర్తనం, వైదిక జీవన ప్రాముఖ్యత, రసాయనాలు లేని ఆహారం, మనస్సుకు, శరీరానికి అనుకూలమైన జీవన విధానం, గృహస్థ జీవన శిక్షణ, బ్రహ్మచారి శిక్షణ, సంస్కృత సంభాషణ అభ్యాసనం, మృదంగం, కరతాళ వాదనం శిక్షణ వంటి అంశాలపై నెలరోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. జీవిత లక్ష్యంపై అవగాహన మనిషి జీవిత లక్ష్యంపై అవగాహన కల్పించడమే కృష్ణచైతన్యం. వర్ణాశ్రమ కళాశాలలో బతుకు తెరువు, వృత్తి కళలపై శిక్షణ ఇస్తున్నాం. నెల రోజుల పాటు వేసవి శిబిరాలు కొనసాగుతాయి. గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులో కూర్మ లాంటి గ్రామా లను నెలకొల్పాం. హంగేరిలో అయితే 800 ఎక రాల విస్తీర్ణంలో గ్రామం విస్తరిస్తోంది. చెక్ రిపబ్లిక్లోనూ ఒక పల్లె ఉంది. – నటేకర్ నరోత్తమదాస్, వర్ణాశ్రమ బోధకుడు, కూర్మ గ్రామం -
దళారులు చెప్పిందే
● ఉద్దానంలో జీడి పిక్కల అమ్మకాలు ప్రారంభం ● ఒక్కో గ్రామంలో ఒక్కో రేటు ● రైతుకు దక్కని మద్దతు ధరపలాస: మద్దతు ధరపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్దానంలో జీడిపిక్కల రైతులు అన్యాయానికి గురవుతున్నారు. దళారులు చెప్పిన ధరకే పిక్కలు అమ్ముకుంటున్నారు. ఇటీవలే పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో జీడి పిక్కల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. తోటల్లో మార్చి నుంచి సేకరించిన జీడిపిక్కలను ప్రస్తుతం అమ్మకాలు చేపడుతున్నారు. అయితే పలాస మార్కెట్లో 80 కిలోల బస్తా ధర రూ.13,500 ఉందని పలాస పారిశ్రామికవాడ జీడి ఉత్పత్తులదారుల సంఘం అద్యక్షుడు మల్లా రామేశ్వరరావు చెబుతున్నారు. అయితే మూడు నెలల తర్వాత మాత్రమే చెల్లింపులు జరుగుతాయని అంటున్నారు. మరోవైపు గ్రామాల్లో ఒక్కో చోట ఒక్కో ధర వినిపిస్తోంది. వజ్రపుకొత్తూరు మండలం పెద్ద బొడ్డపాడు గ్రామంలో రైతులు తమ గ్రామానికి వచ్చిన చిల్ల వర్తకులు(దళారులు)కు మార్కెట్ ధరతో సంబంధం లేకుండా బస్తా ధర రూ.12వేలుకు విక్రయిస్తుండగా, సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామంలో బస్తా ధర రూ.13000కు రైతులు అమ్మకాలు చేపట్టారు. పలాస మండలం బొడ్డపాడు పరిసర గ్రామాల్లో మాత్రం రూ.13,500 బస్తా ధర పలుకుతోంది. అయితే ఈ గ్రామాల్లో ధర ఇంకా నిర్ణయం కాలేదు. కానరాని సమావేశాలు.. గ్రామాల్లో ప్రజలంతా ఒక చోట సమావేశమై మార్కెట్ ధరను పరిశీలించి పలాస వ్యాపారులతో సంప్రదించాక జీడిపిక్కలు ధర నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి మాత్రం గ్రామాల్లో ఇంకా అటువంటి సమావేశాలు జరగలేదు. గ్రామ కమిటీలు ధర నిర్ణయించలేదు. త్వరలో సమావేశాలు జరుగుతాయని, అప్పటి వరకు జీడి పిక్కలను అమ్మరాదని ఆయా గ్రామాల ప్రజలకు గ్రామ కమిటీలు పెద్దలు చెబుతున్నారు. జీడి పిక్కల రైతాంగ కమిటీలు మాత్రం గత కొన్నేళ్లుగా జీడి మద్దతు ధర కోసం పోరాటాలు చేస్తున్నారు. కనీస మద్దతు ధర 80 కిలోల బస్తాకు రూ.16వేలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఈ ధరలు పెరుగుతాయా లేక ఇంతకన్నా తక్కువకు దిగజారుతాయా అన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. రైతు సమాజంలో పండించిన అన్ని పంటలకు అన్నిచోట్లా ఒకే ధర ఉండగా జీడి పిక్కకలకు మాత్రం ఎప్పుడు కూడా ఒక ధరంటూ లేకపోవడం గమనార్హం. రైతు చేతిలో ధర లేదనేది మాత్రం వాస్తవం. పలాస వ్యాపారులు ఏది చెబితే అదే రేటనే అపవాదు మాత్రం ఒకటి ఉంది. ఈ ఏడాది ప్రభుత్వ అధికారులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ధర విషయం ఏం చేస్తారో వేచి చూడాల్సిందేనని జీడిపిక్కల రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోసపోతున్నారు.. జీడి రైతులు ప్రతి ఏడాది దళారుల చేతిలో మోసపోతున్నారు. ఉద్దానం జీడి రైతులు మద్దతు ధర కోసం ప్రతి ఏడాది పోరాడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ప్రభుత్వాలు ఎన్నికల్లో మద్దతు ధర ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నారు. ఆ తర్వాత వ్యాపారులతో కలిసిపోతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకొని దోపిడీ చేస్తున్నారు. మద్దతు ధర విషయంలో అధికార పార్టీ మాట నిలబెట్టుకోవాలి. – తెప్పల అజయ్కుమార్, రైతు, మాకన్నపల్లి, జీడి రైతాంగ పోరాట నాయకుడు, పలాస దిగుబడులు లేవు.. మా గ్రామంలోకే వచ్చి కొనుగోలు చేసిన వ్యాపారికి 80 కిలోల బస్తా పిక్కలను రూ.13వేలకు అమ్ముకున్నాను. నాకు 4 ఎకరాల జీడి తోట వుంది. మొత్తం 12 బస్తాల పిక్కలయ్యాయి. ఇంట్లో నిల్వ ఉంచుకోవడం కంటే అమ్మేయడమే మంచిదని అమ్ముకున్నాను. పెట్టుబడులకు తగ్గ దిగుబడులు రాలేదు. – మోస బాలమ్మ, జీడి రైతు, ఎర్రముక్కాం, సోంపేట మండలం -
యువగళం హామీలు ఏమయ్యాయి?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పేరిట విద్యార్థుల కోసం అనేక అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోర గోపి మండిపడ్డారు. ఏడాది కావస్తున్నా ఫీజు రీయింబర్స్మెంట్పై స్పందించకపోవడం దారుణమన్నారు. యువగళం హామీలు ఏమయ్యాయంటూ జిల్లా కేంద్రంలోని సూర్యమహాల్ కూడలిలో స్వామి వివేకానంద విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కన్వీనర్ మాట్లాడుతూ లోకేష్ విద్యాశాఖ మంత్రి కాదని, ఫేక్ మినిస్టర్ అని ఎద్దేవా చేశారు. విద్యా సంసవత్సం బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్రకార్యవర్గ సభ్యులు మదన్, శ్రీకాకుళం మండల కన్వీనర్ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
16 నుంచి జీడి కార్మికుల సమ్మె
కాశీబుగ్గ: జీడి పరిశ్రమల్లో పనిచేసే అన్ని రకాల కార్మికులు ఈ నెల 16 నుంచి సమ్మె చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు కాష్యూ లేబర్ యూనియన్ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తి అన్నారు. కార్మికులకు వేతన ఒప్పందం ఈ నెల 16తో రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పలాస కాష్యూ మాన్యుఫ్యాక్షర్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు పాత వేతనాలే ఇస్తామని చెబుతుండటంతో సమ్మెకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. వేతనాలు పెంచే వరకు సమ్మె చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీ, డీసీఎల్, ఏసీఎల్, కాశీబుగ్గ సీఐలకు సమ్మె నోటీసులు అందించారు. కార్యక్రమంలో నాయకులు లొడగల కామేశ్వరరావు, బొంపల్లి సింహాచలం, కోనారి రాము, సానా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి వేతనదారు మృతి
టెక్కలి రూరల్: మండలంలోని రావివలస గ్రామానికి చెందిన ఉపాధి వేతనదారు అనపాన పార్వతి(45) గురువారం మృతిచెందింది. గ్రామ సమీపంలో ఉపాధి పని చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తోటి కూలీలు వెంటనే టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగా మృతిచెందింది. వడదెబ్బ తగలడం వల్లే మృతిచెంది ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. పార్వతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కొత్తూరు: మండలంలోని కర్లెమ్మ గ్రామం వద్ద అలికాం–బత్తిలి రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్లెమ్మ గ్రామానికి చెందిన బొడ్డు నానాజి, తన భార్యతో కలిసి భామిని నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఎదురుగా బైక్పై వస్తున్న యువకుడు ఢీకొట్టాడు. ఈ ఘటనలో దంపతులు, యువకుడు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్సీలో చేర్పించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ బి.గోవిందరావు తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్గా తాతయ్య శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సంఘం జిల్లా చైర్మన్గా కుజ్జ తాతయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఈడీ డాక్టర్ బి.యోగేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం నగరంలో పశుసంవర్థకశాఖ కార్యాలయంలో ఎన్నికల అధికారి డాక్టర్ పి.రామ్మోహన్రావు ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఈ ఎన్నికలో సంఘం ఉపాధ్యక్షులుగా పల్ల నరహరితో పాటు 11మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జేడీ బి.రాజ్గోపాల్, పర్సన్ ఇన్చార్జి డాక్టర్ టి.పి.మనోజ్కుమార్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. కాగా, సంఘంలో 123 మంది ఓటర్లు ఉన్నప్పటికీ నామమాత్రంగా హాజరై ఎన్నిక మమా అనిపించేశారు. మంత్రి సిఫార్సు చేసిన వారికే చైర్మన్, ఉపాధ్యక్ష పదవుల్ని కట్టబెట్టారని పలువురు సంఘ నాయకులు ఆరోపించడం గమనార్హం. ఆదిత్యుని సన్నిధిలో సినీ గాయకులు శ్రీకృష్ణ, యామిని అరసవల్లి: సూర్యనారాయణ స్వామిని ప్రముఖ సినీ గాయకులు శ్రీకృష్ణ, యామినిలు గురువారం దర్శించుకున్నారు. తొలిసారిగా ఆదిత్యున్ని దర్శించుకోవడం నిజంగా తమ అదృష్టమని వారు తెలియజేశారు. వీరికి ఆలయ అధికార వర్గాలు సంప్రదాయ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ శ్రీకాకుళం న్యూకాలనీ: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించిన తాత్కాలిక సీనియారిటీ జాబితా డీఈఓ అధికారిక వెబ్సైట్లో సిద్ధంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కార్యాలయ పనివేళల్లో తగిన ఆధారాలతో సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులకు సంబంధించి తాత్కాలిక సీనియారిటీ జాబితాపై ఆర్జేడీ కార్యాలయంలో అభ్యంతరాలను ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా తగిన ఆధారాలతో సమర్పించాలని డీఈఓ పేర్కొన్నారు. -
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి
పాతపట్నం: ప్రజలు ఇచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, కింజరాపు రామ్మోహన్నాయుడు అధికారులను ఆదేశించారు. పాతపట్నం నీలమణిదుర్గ ఆలయం సమీపంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపై గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. తాగునీరు, పింఛన్, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీ తదితర సమస్యలపై పలువురు దరఖాస్తులు అందజేశారు. పాతపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం మద్యం షాపును తొలగించాలని స్థానిక మహిళలు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, డ్వామా పీడీ బి.సుధాకర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం ద్వారకపురంలో బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో చంద్రకుమారి, సర్పంచ్ అన్నెపు సుజాత తదితరులు పాల్గొన్నారు. -
సంస్కరణలకు సన్నద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు నిర్వహించిన ఓరియంటేషన్ తరగతులు ముగిశాయి. జాతీయ విద్యావిధానం, జాతీయస్థాయిలో జరిగే పరీక్షలకు విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో మార్పులు–చేర్పుల ద్వారా మారిన సిలబస్లు, ప్రశ్నపత్రాల పేట్రన్లలో మార్పులు, రూపుదిద్దుకున్న ఇతరత్రా కొత్త అంశాలపై అధ్యాపకులకు శిక్షణను అందించారు. జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో గత నెల 24న మొదలైన ఈ ఓరియంటేషన్ శిక్షణా తరగతులు గురువారం సాయంత్రంతో ముగిశాయి. 38 కళాశాలల నుంచి.. శ్రీకాకుళం జిల్లాలో 38 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్, ఎంటీఎస్, పార్ట్టైం, కాంట్రాక్ట్, గెస్ట్ లెక్చరర్లకు ఈ ఓరియెంటేషన్ క్లాసులు నిర్వహించారు. లాంగ్వేజ్లు, మ్యాథ్స్, సైన్స్, ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టుల్లో అధ్యాపకులు బోధించారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మరళా మధ్యామ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విషయపరిజ్ఞానాన్ని బోధించారు. ప్రధానమైన అంశాలపై వెబెక్స్ ద్వారా నిష్ణాతులు రిసోర్స్పర్సన్గా హాజరై క్లాసులు నిర్వహించారు. ఇంటర్మీడియెట్ విద్యలో తీసుకొచ్చిన సంస్కరణలను ఇంటర్విద్య డైరెక్టర్ వివరించారు. సంస్కరణలకు సహకరించాలి: డైరెక్టర్ ఇంటర్విద్యలో రాష్ట్రప్రభుత్వం మార్చిన సంస్కరణలకు అందరూ సహకరించి, విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించేలా ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఇంటర్విద్య డైరెక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఓరియెంటేషన్ ఆన్లైన్ క్లాసుల్లో ఆమె మాట్లాడుతూ జూన్ 1కి బదులు ఏప్రిల్ ఒకటో తేదీనే కొత్త విద్యా సంవత్సరం ప్రారంభించామని, ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లను మొదలుపెట్టామన్నారు. నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో ఏపీ విద్యార్థులు పోటీపడేలా చేసేందేకే సిలబస్లలో సమూలంగా మార్పులు చేశామని, ప్రశ్నపత్రం పేట్రన్లో మార్పులు చేసినట్టు వివరించారు. ఐచ్ఛిక సబ్జెక్టులను ఎంపికచేసుకునే అవకాశం కూడా విద్యార్థులకు కల్పించినట్టు వివరించారు. ఐపీఈ మార్చి–2025 ఫలితాల్లో ఫెయిలైన విద్యార్థుకు రెమీడియల్ క్లాసులు నిర్వస్తున్నామన్నారు. ఈ ఏడాది ఫస్టియర్ విద్యార్థులకు మారిన సిలబస్ ప్రకారం పాఠ్యపుస్తకాలు రానున్నాయని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం క్లాసులకు హాజరయ్యే అధ్యాపకుల హాజరు, ఏర్పాట్లు, సౌకర్యాలను ఆర్ఐఓ/ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగడ దుర్గారావు స్వయంగా పర్యవేక్షించారు. అధ్యాపకుల హాజరును ఇంటర్మీడియెడ్ విద్య ఉన్నతాధికారులు సీరియస్గా పరిగణనలోకి తీసుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల లెక్చరర్లకు విషయపరిజ్ఞానం పెంచేలా చర్యలు ముగిసిన ఓరియంటేషన్ క్లాసులు సిలబస్లు, ప్రశ్నపత్రాల మార్పులపై నిష్ణాతులతో బోధన విజయవంతంగా ముగిశాయి.. శ్రీకాకుళంలో గత నెల 24 నుంచి మే 8వ తేదీ వరకు 13 సబ్జెక్టుల్లో అధ్యాపకులకు నిర్వహించిన ఓరియెంటేషన్ క్లాసులు విజయవంతంగా ముగిశాయి. దాదాపు అన్ని సబ్జెక్టుల అధ్యాపకులు క్లాసులకు హాజరయ్యారు. ఇంటర్విద్య డైరెక్టర్ అనేక అంశాలపై దిశానిర్దేశం చేశారు. మారిన సిలబస్, పేట్రన్ ప్రకారం రిసోర్స్పర్సన్ల పలు కీ పాయింట్లను లెక్చరర్లకు వివరించారు. – ప్రగడ దుర్గారావు, ఆర్ఐఓ శ్రీకాకుళం ఓరియెంటేషన్ క్లాసులు జరిగిన షెడ్యూల్ సబ్జెక్టులు ఏప్రిల్ 24, నుంచి 26 వరకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఏప్రెల్ 28, 29 తేదీల్లో మాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మే 5, 6 తేదీల్లో కామర్స్, హిస్టరీ, సంస్కృతం మే 7, 8 తేదీల్లో సివిక్స్, ఎకనామిక్స్, జువాలజీ -
కుట్టు మిషన్ల శిక్షణ పేరిట మోసం
అక్రమ తవ్వకాలకు నిలువెత్తు సాక్ష్యం.. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 51వ సర్వే నంబర్ సూదికొండ వెనుకభాగంలో కంకర తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరిగాయి. విద్యుత్ స్తంభం తప్ప మిగిలిన ప్రాంతాన్ని ఆక్రమార్కులు తవ్వకాలు జరిపి తరలించేశారు. స్తంభం కూలి ప్రమాదం జరగకముందే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. – కాశీబుగ్గ ఎల్.ఎన్.పేట: బీసీ మహిళలకు కుట్టు మిషన్ల పేరుతో కూటమి ప్రభుత్వం రూ.150 కోట్లు మోసానికి పాల్పడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతప ట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం బలహీన వర్గాలకు చెందిన మహిళలను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. కుట్టు శిక్షణ కార్యక్రమం ప్రారంభం నాటికే భారీ మోసానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. 1,02,832 మంది మహిళలకు శిక్షణ కోసం రూ.221.08 కోట్లు నిధులు కేటాయించారని, ఒక్కొక్క కుట్టు మిషన్ రూ.4,300, కుట్టు శిక్షణ కోసం మహిళకు రూ.3 వేలు ఖర్చు అవుతుందన్నారు. వాస్తవ వ్యయం రూ.750 కోట్లు మాత్రమే ఉంటుందన్నారు. మిగిలిన డబ్బులు ఎవరి ప్రయోజనం కోసం ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. గతంలో ఆదరణ పథకం పేరుతో చేతి వృత్తులు, కుల వృత్తులు వారిని మోసం చేయటంతో పాటు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పుడు కుట్టు శిక్షణ, మిషన్ల పేరుతో అవినీతికి పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళల ఆర్థిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిచ్చారని గుర్తు చేశారు. రెడ్డి శాంతి -
పత్రికల గొంతు నొక్కేయడం సరికాదు
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాల్ని ప్రజలకు తెలియజేసేందుకే ప్రతికలు ఉన్నాయి. అలాంటిది ఎడిటర్ స్థాయి వ్యక్తి ఇంటిలో పోలీసులు తనిఖీలు చేసి భయపెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. – కంఠ వేణు, దళిత సంఘాల జేఏసీ నాయకుడు పత్రికా స్వేచ్ఛకు భంగం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉండదు. ఎడిటర్ ఇంటికి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లి భయబ్రాంతులకు గురిచేయడం హేయం. ప్రజలకిచ్చిన హామీలను అమలుచేసి ప్రజాసంక్షేమానికి పాటుపడాలే తప్ప ఇలా దాడులు చేయడం సరికాదు. – డి.గణేష్, సామాజిక న్యాయపోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి తలసేమియా బాధితుల కోసం రక్తమార్పిడి కేంద్రం శ్రీకాకుళం కల్చరల్: ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా బాధితుల కోసం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఏర్పాటు చేసిన రక్తమార్పిడి కేంద్రాన్ని రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర రెడ్క్రాస్ అధ్యక్షుడు అబ్దుల్ నజీర్ వర్చువల్ విధానంలో గురువారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తలసేమియా బాధితుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తలసేమియా బాధితుల కోసం రక్తమార్పిడి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పి.జగన్మోహనరావు మాట్లాడుతూ ప్రతి బుధవారం తలసేమియా బాధిత పిల్లలకు రక్తమార్పిడి జరుగుతుందని, అవసరమైన వైద్యపరీక్షలు చేయిస్తామని తెలిపారు. రానుపోను రవాణా ఖర్చులు, పౌష్టిక ఆహారం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆరుగురికి రక్త మార్పిడి చేయగా, శివాని గ్రూప్ ఆఫ్ కాలేజీలకు చెందిన 30మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ‘మావోయిస్టులతో చర్చలు జరపాలి’ పలాస: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ కగార్ను ఆపి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వివిధ వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేశారు. పలాస మండలం బొడ్డపాడు జిల్లా అమరవీరుల స్మారక మందిరంలో గురువారం ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరిట జరుతున్న యుద్ధం వల్ల దండకారణ్యంలో ఆదివాసీల జీవితాలు ఛిద్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 14 నెలల్లో 450 మంది ఆదివాసీలను అమానుషంగా హత్య చేశారని, ఇది అప్రజాస్వామ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎల్పీ నాయకుడు దానేసు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కా ర్యదర్శి తాండ్ర ప్రకాష్, సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సీపీఎం జిల్లా నాయ కుడు కె.మోహనరావు, లిబరేషన్ నాయకులు దుష్యంత్, మద్దిల రామారావు పాల్గొన్నారు. ● -
కలం గళంలో నిరసన స్వరం
బ్రిటిష్ పాలనకు వారసత్వం.. ఒక ఎడిటర్ ఇంట్లో పోలీస్ సోదాలు బ్రిటిష్ పాలనా కాలంలో జరిగాయని చదివాం. స్వాతంత్య్ర భారత చరిత్రలో ఇలా ఏనాడూ జరగలేదు. కూటమి ప్రభుత్వం సొంత రాజ్యాంగం తయారు చేసుకుందే మో. డాక్టర్ అంబేడ్కర్ చూపుడు వేలులా ప్రశ్న జీవిస్తూనే ఉంటుంది. ఎడిటర్ ఇంట్లో అక్షరాలు తప్ప మారణాయుధాలు ఉండవు గదా.. కూటమి ప్రభుత్వం బాగా దిగజారిపోతోంది. – నల్లి ధర్మారావు, స్సామ్నా రాష్ట్ర అధ్యక్షులు అక్రమ సోదాలు సరికాదు.. రాజకీయ రెడ్ బుక్ తెరిచి జర్నలిస్టులు, ఎడిటర్లపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎవరిది తప్పుంటే వారిపై న్యాయస్థానాలు అంతిమ తీర్పు వెలువరిస్తాయి. ఇలా దాడులు చేయడం రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. – కొంక్యాణ వేణుగోపాల్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సర్కారు నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ధిక్కార స్వరమొకటి వినిపించింది. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడికి నిరసనగా అక్షర శరమొకటి హెచ్చరిక జారీ చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగిస్తూ కలాలన్నీ గళమెత్తాయి. అణచివేత ప్రభుత్వ నైజమైతే.. పోరాటం పాత్రికేయుల పంథా అని తెలియజేస్తూ జిల్లావ్యాప్తంగా మీడియా ప్రతినిధులు ఆందోళనలు చేశారు. ‘సాక్షి’ ఎడిటర్పై ప్రభుత్వ కక్ష సాధింపులకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ●భయభ్రాంతులకు గురిచేస్తూ.. ● ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఇంటిలో పోలీసుల అక్రమ సోదాలపై అక్షరాగ్రహం ● కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడిన శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాలు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం పూర్తి కక్ష పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఎటువంటి సెర్చ్ వారెంటు లేకుండా, నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో పోలీసులు సోదాలు జరిపి గంటల తరబడి తలుపులు మూసి భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు. – ఎన్.ఈశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీకాకుళం/శ్రీకాకుళం క్రైమ్ : ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంటిపై పోలీసుల అక్రమ సోదాలకు నిరసనగా పాత్రికేయ లోకం గళమెత్తింది. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కూడలిలో జిల్లా జర్నలిస్టు సంఘాలు నల్ల రిబ్బన్లు కట్టుకుని, చేతిలో ప్లకార్డులతో ధర్నా చేసి నిరసన తెలిపాయి. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీగా స్థానిక తహసీల్దారు కార్యాలయానికి వెళ్లారు. ఎడిటర్ ధనుంజయరెడ్డికి సంఘీభావాన్ని తెలుపుతూ.. ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని కోరు తూ డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఒకప్పటి బ్రిటిష్ పాలనకు వారసత్వపు హక్కులా ప్రస్తుత కూటమి పాలన ఉందని, పూర్తి కక్షసాధింపు చర్యలకు దిగుతుందని, రాజకీయ రెడ్బుక్ తెరిచి పత్రికా ఎడిటర్లు, జర్నలిస్టులపై అరాచక విధానానికి సరికొత్త నాంది పలుకుతున్నారని శ్రీకాకుళం జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సెర్చ్ వారెంటు లేకుండా గురువారం ఉదయం విజయవాడలోని ఆయన నివాస గృహంలో పోలీసులు సోదాలు జరపడం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి పత్రి కా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమేనన్నారు. కార్యక్ర మంలో ఏపీడబ్లూజేఎఫ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కొంక్యాణ వేణుగోపాల్,ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్న లిస్ట్ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఎన్.ఈశ్వరరావు, సాక్షి ఎడిషన్ ఇన్చార్జిలు కడారి రాజా, పి.చినప్పలనాయుడు, టీవీ బ్యూరో సునీల్, సీనియర్ జర్నలిస్టులు యు.శ్రీనివాస్, వీవీఎన్ శ్రీనివాస్, బగాది అప్పలనాయు డు, శివప్రసాద్, భీమారావు, షణ్ముఖ, రవి, అప్పలనాయుడు, రామకృష్ణ, భీమారావు, జగదీష్ పాల్గొన్నారు. డిప్యూటీ తహిసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు కక్ష సాధింపు మంచిది కాదు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రశ్నిస్తున్న సాక్షి పత్రికపై కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు. పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు నమోదు చేయడం, అక్రమ సోదాలు వంటి అప్రజాస్వామ్యకమైన చర్యలు సరికాదు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సాక్షి దినపత్రిక గొంతు నొక్కే ప్రయత్నంగా ఎడిటర్పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జిముమ్మాటికీ కుట్రపూరిత చర్యే.. ఎన్నికల మునుపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ అక్రమాలపై కథనాలు రాస్తున్న సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కుంటి సాకులతో అక్రమంగా సోదాలు చేయడం కుట్ర పూరిత చర్య అని అందరికీ అర్థమైంది. – సింగుపురం మోహన రావు, న్యాయవాది,వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, టెక్కలి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు ఏపీలో పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు పడ్డాయి. కూటమి ప్రభుత్వం ‘సాక్షి’పై కక్ష సాధింపు చర్యలు చేయడం మంచి పద్ధతి కాదు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా ఎడిటర్ ఇంటిలోకి వెళ్లి సోదాలు చేయడం మంచి పద్ధతి కాదు. – పేడాడ శ్రీరామమూర్తి, న్యాయవాది, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి -
ఘనంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి కల్యాణోత్సవం గురువారం ఉదయం ఘనంగా జరిగింది. వైశాఖ శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్బంగా శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీవా రి కల్యాణ మూర్తులను అనివెట్టి మండపంలో ఉంచి ఆగమశాస్త్రం ప్రకారం అర్చకులు వేదమంత్రోచ్ఛరణల నడుమ కల్యాణాన్ని జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీప్ శర్మ కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించగా, రూ.500 చెల్లించిన భక్తదంపతులు కల్యాణ సేవలో పాల్గొని స్వామి వారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. -
సంబరాలు ఆ శాఖవి..
పండగలేమో ఊరివి..● కుందువానిపేటలో మద్యం విక్రయాలకు వేలంపాట ● రూ.4లక్షలకు పాట దక్కించుకున్న వైనం ● దొడ్డిదారిన అనుమతులు ఇస్తున్న ఎకై ్సజ్ అధికారి ● పట్టించుకోని ఉన్నతాధికారులు శ్రీకాకుళం రూరల్: కల్లేపల్లి, కణుగులవాని పేట పంచాయతీల్లో మరో వారం రోజుల్లో అమ్మవారి పండుగలు జరగనున్నాయి. అలాగే ఈ నెల 20న బలివాడ, కుందువానిపేట గ్రామాల్లో సైతం అమ్మవారి పండుగలకు గ్రామపెద్దలు శ్రీకారం చుట్టారు. గమ్మత్తు ఏమిటంటే పండగలు మాత్రమే ఊళ్లవి.. అసలు సంబరాలు ఎకై ్సజ్ శాఖవి. పండగ రోజుల్లో బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలకు ఎకై ్సజ్ అధికారులు దగ్గరుండి వేలంపాట పాడించారు. నెల రోజుల కిందట కుందువానిపేట గ్రామానికి చెందిన కొందరు ఊరిపాటలో ఏకంగా రూ.4లక్షలకు బెల్టుషాపును నిర్వహించేందుకు పాటను కైవసం చేసుకున్నారు. ఈ గ్రామం నుంచి చుట్టు పక్కల గ్రామాలు సైతం బాటిల్పై ఎంత పెంచి అమ్మినా ఇక ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోరు. ఈ ఊరిపాటను ధిక్కరించి కొత్త బెల్టుషాపులు పెడితే మాత్రం ఎకై ్సజ్ అధికారులు ఫైన్లు వసూలు చేసేలా ఆ గ్రామపెద్దలు నిర్ణయం చేశారు. ప్రతి వైన్షాపులోనూ అదనపు ధరలు ప్రస్తుతం శ్రీకాకుళం రూరల్ మండలాల్లో గల కల్లేపల్లి, రాగోలు, సింగుపురం, ఎస్ఎస్వలస, వప్పంగి, అలికాం గ్రామాల్లో వైన్షాపులకు కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక అనుమతులు ఇచ్చారు. ఈ షాపులను అనుసరించి విక్రయిస్తున్న మద్యంకు అదనంగా ప్రతి బాటిల్పై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక వైన్షాపుల నుంచి బెల్ట్షాపులు వెళ్లే కొద్దీ ఒక్కో బాటిల్పై దూరాభారాన్ని బట్టి రూ. 20 నుంచి రూ.50 వరకు లాగేస్తున్నారు. ఈ వేలంపాటలు, నిర్ణయాలు అన్నీ ఎకై ్స జ్ అధికారి కనుసన్నల్లోనే జరగడం గమనార్హం. ఇంత వ్యవహారం జరిగినా ఎకై ్సజ్శాఖ ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. పరిశీలిస్తాం.. గ్రామాల్లో బెల్టు షాపులు గానీ, ఊరిపాటలకు గానీ ఎలాంటి అనుమతులు లేవు. ఎమ్మార్పీ ధర కంటే అధికంగా వైన్షాపుల్లో ఎవరైనా అధిక వసూళ్లకు పాల్పడితే అలాంటి వారిపై కఠిన చర్య లు తీసుకుంటాం. ఎకై ్సజ్ శాఖలో ఏ అధికారైనా బెల్డుషాపుల నిర్వహణ, ఊరిపాటల్లో పాల్గొని ఉంటే అలాంటి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. – తిరుపతినాయుడు, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ -
అంతుచూసిన అనుమానం..!
శ్రీకాకుళం: కోటబొమ్మాళిలో బ్యూటీపార్లర్, లేడీస్ కార్నర్ షాపు నిర్వహిస్తున్న మహిళ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిపురం లక్ష్మి (30) తన భర్త తిరుపతిరావుతో కలిసి కోటబొమ్మాళి విద్యుత్నగర్లో నివాసముంటోంది. లక్ష్మి స్థానికంగా హర్షిణి పేరుతో బ్యూటీ పార్లర్, లేడీస్ కార్నర్ నిర్వహిస్తోంది. తిరుపతిరావు కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరికీ తరచూ గొడవలు జరుగుతుండేవి. గతంలో పలుమార్లు పోలీస్స్టేషన్కు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భార్య లక్ష్మిని భర్త తిరుపతిరావు దారుణంగా గొంతు కోశాడు. దీంతో లక్ష్మి తీవ్ర రక్తస్రావంతో విగత జీవిగా పడిపోయింది. అనంతరం తిరుపతిరావు మద్యం షాపునకు వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న కోటబొమ్మాళి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని పరిశీలించగా అప్పటికే మృతి చెందింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు మద్యం షాపు వద్ద ఉన్న తిరుపతిరావును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతురాలికి భర్తతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇన్చార్జి సీఐ విజయకుమార్, ఎస్ఐ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలంలో దర్యాప్తు నిర్వహించి కేసు నమోదు చేశారు. -
అర్జీలు వేగవంతంగా పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజలు ఇచ్చే అర్జీలను వేగవంతంగా అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం) కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ప్రజల నుంచి 154 విజ్ఞప్తులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి పారదర్శకమైన విచారణ జరిపి, నిర్ణీత సమయంలో అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని ఆదేశించారు. ఈవోపై విచారణ చేయాలి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర ఆలయ ఈవో అవినీతికి పాల్పడుతున్నాడని, ఆయన అవినీతిపై విచారణ చేయాలని మీకోసంలో శ్రీముఖలింగంకి చెందిన ఎన్.రాజశేఖర్ ఫిర్యాదు చేశారు. కార్తీక మాసం, మహా శివరాత్రి పర్వదినాలు, ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలకు, తాత్కాలిక మౌలిక వసతులకు అయ్యే ఖర్చు, ఆలయానికి వచ్చిన భక్తులకు నిర్వహణ ఖర్చులకు దొంగ బిల్లులు పెట్టి అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ర్యాంపు నిర్వహణ ఆపాలి గార మండలంలోని గార గ్రామంలో నడుపుతున్న ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నారని ఎంపీపీ గొండు రఘురాం, పీస గోపీ, ముంజేటి కృష్ణమూర్తిలు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఈ తవ్వకాల వలన గ్రామ ప్రజలతో పాటు మండలంలో ఉన్న వంశధార నదీ పరివాహక గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశం నుంచి 100 మీటర్ల దూరంలో గార మండలానికి మంచినీటిని అందించే ప్రాజెక్టు ఉందన్నారు. అక్రమ ఇసుక తవ్వకాల వలన ప్రాజెక్టుకు నీరు అందే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న రైతులకు చెందిన సుమారు 100 వ్యవసాయ పంపునట్లు ద్వారా వ్యవసాయానికి నీరు అందించే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికై నా అక్రమ ఇసుక తవ్వకాలపై తగు చర్యలను తీసుకోవాలని విన్నవించారు. ఐదు ల్యాప్టాప్ల పంపిణీ డిగ్రీ ఆపైన చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు విభిన్న ప్రతిభావంతులు, వయో వద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐదు ల్యాప్టాప్లు, ఒక స్మార్ట్ఫోన్ను కలెక్టర్ చేతుల మీదుగాా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిజబుల్ డిపార్టుమెంట్ ఏడీ కవిత తదితరులు ఉన్నారు. దౌర్జన్యాలను కట్టడి చేయండి కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్సార్సీపీ ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు మీకోసంలో సోమవారం ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలు, ప్రతిపక్షపార్టీ సానుభూతిపరులు, చిరుద్యోగులకు రక్షణ కరువైయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరుబుజ్జిలి మండలంలోని తెలికిపెంట గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ పంచాయతీ నిధులు తన భర్త పేరుమీద అన్యాక్రాంతం చేశారన్నారు. దీనిపై ఫిర్యాదు చేసిన వారిపై, విచారణకు వచ్చిన అధికారులపై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. ఘటనపై విచారణ జరిపాలని కోరారు. సరుబుజ్జిలి మండలంలోని మతలబుపేట పంచాయతీలో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేస్తూ, టీడీపీ నాయకులు తమ సొంత పొలాలకు సీసీ రోడ్లు వేస్తున్నారని, ఆ పనుల బిల్లులు నిలుపుదల చేయాలని విన్నవించారు. ఆమదాలవలస మున్సిపాలిటీలోని వూసవానిపేటకు చెందిన దివ్యాంగ బాలుడికి పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. బూర్జ మండలంలోని కటకమయ్యపేట గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు వితంతు పెన్షన్లు రాజకీయ కారణాలతో మంజూరు చేయడంలేదని, వారికి పెన్షన్లు ఇప్పించాలని కోరారు. పొందూరు మండలంలోని గోకర్ణపల్లి గ్రామంలో ఉపాధి పనుల్లో టీడీపీ నాయకులు చేస్తున్న అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు.ఎస్పీ గ్రీవెన్స్కు 45 ఫిర్యాదులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (గ్రీవెన్సు)లో 45 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు ప్రజల ఫిర్యాదులపై జాప్యం వహించరాదని, సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేశారు. -
‘విద్యార్థులపై సర్కారు నిర్లక్ష్యం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో దళిత విద్యార్థులను కూటమి ప్రభు త్వం చిన్నచూపు చూస్తోందని దళిత సంఘాల జేఏసీ నాయకులు మండిపడ్డారు. శ్రీకాకుళంలోని అంబేడ్కర్ విజ్ఞానమందిర్లో సోమవారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు ఇస్తున్న కాస్మోటిక్స్ చార్జీలు ఇవ్వకుండా రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల, విశాఖ జిల్లా గొలుగొండ, విజయనగరం జిల్లా కొప్పేర్ల మొదలుకొని చిత్తూరు జిల్లా వరకు దళిత విద్యార్థులు గురుకులాల్లో దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బాలికల/బాలుర గురుకుల పాఠశాల 1983 స్థాపించారని సుమారుగా 30 సంవత్సరాల నుంచి అవే భవనాలు ఉండడం దారుణమన్నారు. ప్రజాప్రతినిధులు పూర్తిగా పట్టించుకోకపోవడం వల్లనే దళిత విద్యార్థులు విద్యా అవకాశాలకు దూరమైపోతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉన్న సమస్యలపై ప్రత్యేకమైన కమిటీతో అధ్యయనం చేయించాలని సూచించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మిస్క కృష్ణయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్యానికి శాపాలు
పాపాలు..● ఒడిశా మార్కెట్లో కాలం చెల్లిన హెరిటేజ్ ఉత్పత్తులు ● ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో వెలుగు చూసిన వాస్తవాలు ● విక్రయిస్తున్న దుకాణాలు సీజ్ ● సోషల్ మీడియా పొరాటంతో బయటపడిన బాగోతం కొరాపుట్: ఆంధ్రా నుంచి ఒడిశాకు వస్తున్న హెరిటేజ్ ఫుడ్స్ అసలు బండారాన్ని అధికారులు బయటపెట్టారు. కాలం చెల్లిన సరుకులు అమ్ముతున్న వైనాన్ని జనం ముందు ఉంచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జయపూర్ వస్తున్న హెరిటేజ్ పెరుగు, పాల ప్యాకెట్లే లక్ష్యంగా పుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. సోమవారం కొరాపుట్ జిల్లా కేంద్రం నుంచి వచ్చిన జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠి నేతృత్వంలో అధికారులు హెరిటేజ్ ఉత్పత్తులు విక్రయిస్తున్న షాపులపై మెరుపు దాడులు చేశారు. ఎంజీ రోడ్డు, మెయిన్ రోడ్డు, సంగీత జంక్షన్ల వద్ద జరిపిన సోదాల్లో కాలం చెల్లిన పాడైన పెరుగు ప్యాకెట్లు పెద్ద ఎత్తున దొరికాయి. అంతా మా ఇష్టం వాస్తవానికి పాల ఉత్పత్తుల సంస్థల అవుట్ లెట్లలో విక్రయించే వారికి కొత్త ఉత్పత్తులు ఇచ్చేటప్పుడు కాలం చెల్లిన ఉత్పత్తులు తిరిగి తీసుకొని వెళ్తారు. ఇదే పద్ధతి ఒడిశా ప్రభుత్వ పాల ఉత్పత్తి సంస్థ అమలు చేస్తుంది. ప్రతి రోజూ కొత్త ఉత్పత్తులు ఇవ్వడంతో పాటు కాలం చెల్లిన ఉత్పత్తులను తమ వ్యాన్లోనే తిరిగి తీసుకొని పోతారు. కానీ హెరిటేజ్ ఈ నిబంధన పాటిండం లేదు. ఆంధ్రా నుంచి ఉత్పత్తులు తేవడమే తప్ప పాడైన వాటిని తిరిగి తీసుకువెళ్లడం లేదు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పక్క జిల్లా అధికారి రాక.. హెరిటేజ్ పై జయపూర్ ప్రజలు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు రాష్ట్ర రాజధాని వరకు వెళ్లాయి. దాంతో పక్కనే ఉన్న మల్కన్ గిరి జిల్లా నుంచి ఫుడ్సేఫ్టీ అధికారి ప్రబాత్ కుమార్ శెఠిని ఇన్చార్జి హోదాలో పంపించి ప్రభుత్వం దాడులు చేయించింది. కొత్త ముఖాలు కావడంతో దాడుల నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. దాడుల అనంతరం ప్రబాత్ కుమార్ మీడియాతో మాట్లాడారు. హెరిటేజ్ పై వస్తున్న విమర్శలు నిజమేనని ప్రకటించారు. తానే స్వయంగా కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు పట్టుకున్నానని మీడియాకి చూపించారు. ఇంకా ఎక్కడైనా ఫిర్యాదులు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. బాధిత మహిళల ఇంటికి హెరిటేజ్ సిబ్బంది ఇటీవల జయపూర్ పట్టణంలో హెరిటేజ్ పెరుగు ప్యాకెట్లు కొన్న మహిళలు అందులో కలుషిత పదార్థాలు చూసి సోషల్ మీడియాలో పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో హెరిటేజ్ కంపెనీ ప్రతినిధులు మీడియా ముందుకు వచ్చి అవి కాలం చెల్లినవని వివరణ ఇచ్చారు. మహిళల పోస్టింగ్స్ పెద్ద ఎత్తున వైరల్ కూడా అయ్యాయి.ప్రజారోగ్యంతో చెలగాటం హెరిటేజ్ సంస్ధ ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడింది. కాలం చెల్లిన పాలు, పెరుగు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. పట్టణంలో దాడులు జరుగుతున్నప్పటికీ ఇతర షాపులలో విక్రయాలు యథేచ్ఛగా కొనసాగించారు. అందుకే అధికారులు హెరిటేజ్ సిబ్బందిని వెంటబెట్టుకొని వెళ్లి దాడులు చేసి తాము పట్టుకున్న కలుషిత హెరిటేజ్ ఉత్పత్తులు వారికి చూపించి వారి సమక్షంలోనే మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేశారు. ఈ దాడులు జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు వారి వెంట తరలి వెళ్లారు. పెద్ద మెత్తంలో పాడైన హెరిటేజ్ ఉత్పత్తులు ఉన్న షాపులను సీజ్ చేశారు. పలు షాపుల యజమానులకు ఫైన్లు విధించారు. -
పాత పింఛన్ విధానం అమలు చేయాలి
శ్రీకాకుళం అర్బన్: కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని 2003 డీఎస్సీ జిల్లా ఫోరం కన్వీనర్ కొత్తకోట శ్రీహరి డిమాండ్ చేశారు. పాత పింఛన్ విధానం అమలు కోరుతూ శ్రీకాకుళంలోని జిల్లా ప్రధాన తపాలా కార్యాలయం వద్ద పోస్టుకార్డులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిలకు సోమవారం పంపించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ బలగ శ్రీను మాట్లాడుతూ రాష్ట్రంలో సీపీఎస్ విధానం అమలైన తేదీ 2004 సెప్టెంబర్ ఒకటి కంటే ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా తాము నియమితులయ్యామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు కేంద్ర మెమో 57 ప్రకారం పాత పింఛన్కు అర్హులని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ మెమో ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పింఛన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విడతలు వారీగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్సీ 2003 ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు గురుగుబెల్లి భాస్కరరావు, బుచ్చిబాబు, అనిల్ కుమార్, మాధవి, శ్రీదేవి, లోకనాథం, రామకృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో బాలికకు తీవ్రగాయాలు
కవిటి: మండలంలోని సీహెచ్ కపాసుకుద్ది గ్రామంలో విద్యుత్ షాక్తో మైలపల్లి తులసీ(13) అనే బాలిక తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం వీధిలో నుంచి బాలిక నడిచి వెళ్తుండగా ట్రాన్స్ఫార్మర్కు సమీపంలోని వర్షపునీటి మడుగుకు బాలిక కాలు తగలడంతో షాక్కు గురయ్యినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ట్రాన్స్ఫార్మర్కు ఏర్పాటు చేసిన ఎర్త్ సిస్టం వైఫల్యం కారణంగానే సమీపంలోని వరద నీటికి విద్యుత్ ప్రసరించిందన్నారు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలికను కవిటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికకు ప్రథమ చికిత్స అందజేసి, మెరుగైన చికిత్స కోసం బరంపురం సిఫారుసు చేశారు. అయితే ట్రాన్స్ఫార్మర్ వద్ద తలెత్తిన ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ప్రభుత్వ ఐటీఐ స్థలం కబ్జాకు యత్నం
కాశీబుగ్గ: పలాసలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల స్థలాన్ని కబ్జా చేసి పునాదులు వేసేందుకు పలాసకు చెందిన ఇద్దరు వ్యక్తులు సోమవారం ప్రయత్నించారు. స్థలాన్ని జేసీబీ ట్రాక్టర్ పెట్టి చదును చేయగా సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ పైల జవహర్ సంఘటన స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రిన్సిపల్ పై తిరగబడగా.. వారు ప్రిన్సిపాల్ జవహర్తో అసభ్యకరంగా మాట్లాడటంతో కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూదికొండకు వెళ్లే రహదారిలో ప్రైవేటు ఐటీఐ కళాశాలను మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం 25 సెప్టెంబరు 2010లో ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. దానికి ముందు అప్పటి తహసీల్దార్ సహకారంతో సర్వే చేయించి నాటి నివేదికలు ఆధారంగా సర్వే నంబర్ 232 /2ఎ3లో మూడు ఎకరాల 27 సెంట్లు భూమి, కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాలను ఉచితంగా ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అప్పగించారు. అయితే ఐటీఐకి సెలవు దినాలలో, సిబ్బంది లేని సమయం చూసుకుని భూబకాసురులు స్థలాలను ఆక్రమించుకునేందుకు పునాదులు తవ్విస్తున్నారు. గతంలోనూ దీనిపై కలెక్టర్ గ్రీవెన్స్కు ఫిర్యాదులు వెళ్లాయి. సర్వే చేయించినా ఆ తర్వాతి కార్యకలాపాలు జరగలేదు. సెలవు దినాల్లో కూడా రోజుకొకరు చొప్పున కాపలా కాయాల్సిన వస్తోందని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఐటిఐ ప్రిన్సిపాల్ పైల జవహర్ కోరారు. -
ఉపాధ్యాయులకు ‘ప్రత్యేక పరీక్ష’
● పదో తరగతి ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులపై ఆదేశాలు ● ఆలస్యంగా ఉత్తర్వులు వెలువరించడంపై ఆవేదన శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మూడు రోజుల కిందట విడుదల చేసిన ఉత్తర్వులు ఉపాధ్యాయుల ఆవేదనకు దారి తీస్తున్నాయి. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేవరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించడంపై ఉపాధ్యాయ వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. వేసవి సెలవుల్లో విహారయాత్ర, తీర్థయాత్రలకు వెళ్లేందుకు పలువురు ఉపాధ్యాయులు కొన్ని నెలల కిందటి నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం గతంలోని లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక తరగతులపై ఆదేశాలు జారీ చేయడం, అదికూడా ముందస్తుగా కాకుండా వేసవి సెలవుల అయిన ఏప్రిల్ 23 తర్వాత ఉత్తర్వులు విడుదల చేయడంపై ఉపాధ్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల సెలవులు వినియోగించుకుంటే ఈఎల్సి మంజూరు చేయడం పరిపాటి. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈఎల్సీ ప్రస్తావన లేదు. దీనిపైన కూడా ఉపాధ్యాయులు పెదవి విరుస్తున్నారు. అందుబాటులో ఉన్న పలువురు ఉపాధ్యాయులు బోధన కోసం పాఠశాలలకు వెళ్లినా కొన్ని పాఠశాలల్లో ఒకరిద్దరు హాజరువుతుండటం, మరికొన్ని పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరుకాకపోవడం తలనొప్పిగా మారింది. విద్యార్థులకు ఫోన్లు చేసినా వారు తరగతులుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. తరగతులు బోధించినపుడు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాల్సి ఉండగా, విద్యార్థులు హాజరుకాని సందర్భంలో ఏం చేయాలో పాలుపోక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేదు ఈఎల్సీలు ఇవ్వకుండా ఉపా ధ్యాయుల సేవలు వినియోగించుకున్న సందర్భాలు గతంలో లేవు. సప్లిమెంటరీ పరీక్ష మరో పది రోజులుండగా, ఇప్పుడు ప్రత్యేక తరగతులపై ఉత్తర్వులు జారీ చేయడం విడ్డూరం. ప్రభుత్వం తీసు కుంటున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదంగానే ఉంటుంది. – పేడాడ కృష్ణారావు, డీటీఎఫ్ నాయకుడు -
భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత
రణస్థలం: మండలంలోని సంచాం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలిస్తుండగా జేఆర్పురం పోలీసులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి తెలిపిన వివరాల మేరకు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు సంచాం జంక్షన్ వద్ద పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఒక పల్సర్ బైక్ మధ్య మూడు అట్టపెట్టెలు పెట్టుకుని వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నలువైపుల నుంచి పోలీసులు వాళ్లను వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడినవారిలో మీసాల రాము(పండు), గంట్యాడ సాయికుమార్లు ఉన్నారు. వివిధ మద్యం షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి సంచాం గ్రామానికి చెందిన బొంతు గణేష్ ద్వారా అధిక ఆదాయం కోసం అమ్ముతున్నట్లు గుర్తించారు. దీంతో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 193 మద్యం బాటిళ్లు, ఒక పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. అరైస్టెనవారిని రిమాండ్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు రణస్థలం: మండలంలోని కొండములగాం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. జేఆర్పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మన్నెల మహాలక్ష్మి, వడ్డి మణికంఠ, మన్నెల వెంకటేష్లు కొండములగాం గ్రామంలో సోమవారం ఉదయం ఉపాధి హామీ పనులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరారు. శ్మశానాల చెరువు దగ్గర నుంచి ఇటుకబట్టీ పక్కనున్న మట్టి రోడ్డు మీదుగా రామతీర్ధాలు తారురోడ్డుపైకి వేగంగా వచ్చారు. అదే సమయంలో కమ్మసిగడాం వైపు నుంచి రణస్థలం వస్తున్న కూల్ డ్రింకుల లగేజీ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఇద్దరు, బైక్పై ఉన్న ముగ్గురు గాయపడ్డారు. ముగ్గురు వేతనదారులకు, అటో డ్రైవర్ మహంతి రమణకు తొలుత రణస్థలం సామాజిక ఆస్పత్రిలో చికిత్స అందించారు. తదుపరి ఇద్దరు వేతనదారులు మన్నెల మహాలక్ష్మి, వడ్డి మణికంఠలను శ్రీకాకుళంలో రిమ్స్, మరొక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆటోలో ఉన్న మరో వ్యక్తి గొర్లె రమణకు కాలర్ బోను విరగడంతో శ్రీకాకుళంలో ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మన్నెల మహాలక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వీఎంఆర్డీఏ మాజీ అధికారులపై విచారణ శ్రీకాకుళం(పీఎన్ కాలనీ): శ్రీకాకుళంలో తుపాను నీటి కాలువ నిర్మాణంలో అవకతవకలపై వీఎంఆర్డీఏ మాజీ అధికారులపై విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో చిన్న బజార్ నుంచి ఇల్లిసిపురం రోడ్డు మధ్య తుఫాను నీటి కాలువ నిర్మాణం చేపట్టారు. ఈ పనుల నిర్వహణ విషయంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో అప్పటి వీఎంఆర్డీఏ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ డి.విజయభారతి, క్వాలిటీ సెల్ ఏఈ ఎ.వి.రమణారావు, డీఈఈ జి.శ్యాంసుందర్లపై విచారణ చేయాలని నిర్ణయించింది. వీరు 15 రోజుల్లోగా ఈ ఆరోపణలపై రాత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ఉద్దానం ప్రాజెక్టు ద్వారా ఇచ్ఛాపురానికి తాగునీరు
ఇచ్ఛాపురం: వైఎస్ జగన్ సర్కారు నిర్మించిన వైఎస్సార్ సుజలధార ఉద్దానం ప్రాజెక్టు ఇప్పుడు ఇచ్ఛాపురం మున్సిపాలిటీ దాహం తీర్చనుంది. మున్సిపాలిటీలో తాగునీటి కొరత ఏర్పడడంతో ఉద్దానం ప్రాజెక్టే పెద్దదిక్కుగా మారింది. మున్సిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చడానికి సంతపేట వద్ద ఉద్దానం వాటర్ ప్రాజెక్టుని మున్సిపల్ నీటి సరఫరా పంప్హౌస్కి అనుసంధానం చేశారు. ఈ నీటి సరఫరాను సోమవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ ప్రారంభించారు. నదిలో ఇసుక తవ్వకాల వల్లనే మున్సిపాలిటీకి తాగునీటి కొరత ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన వైఎస్సార్ సుజ లధార ఉద్దానం వాటర్ ప్రాజెక్టు ద్వారా కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస, ఇచ్ఛాపురం మండలాలకు నీటి సరఫరా చేస్తున్నారు. దీనిపై అధికార పక్ష నాయకులు ఎన్ని విమర్శలు చేసినా ఆఖరకు అదే ప్రాజెక్టు ఇప్పుడు దాహం తీరుస్తోంది. అయితే మున్సిపాలిటీ పంప్హౌస్కు అనుసంధానం చేసిన ఘనత తమదే అని ఎమ్మెల్యే గొప్పలు చెప్పుకోవడం కనిపించింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజలక్ష్మి, ఈఈ సుగుణాకర్రావు, మున్సిపల్ కమిషనర్ ఎన్.రమేష్, జనసేన ఇన్చార్జి దాసరి రాజు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఏయూఈఈటీ పరీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని ఇంజినీరింగ్ కాలేజ్లో ఏ యూఈఈటీ – 2025 (ఆంధ్రా యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ టెస్ట్) సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఐదేళ్ల సమీకృత బీటెక్ కోర్సు కోసం ఏయూ ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. జిల్లాలో ఈ పరీక్ష కేంద్రానికి 433 మందిని కేటాయించగా, 391 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటలు వరకు పరీక్ష నిర్వహించారు. చీఫ్ సూపరింటెండెంట్గా ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతాడ రాజశేఖర్రావు, జాయింట్ చీఫ్ సూపరింటెండెంట్గా పొన్నాడ రామకృష్ణారావు వ్యవహరించారు. ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు వద్దు మందస: దశాబ్దాలుగా ఉద్దానంలో కొబ్బరి, జీడి, పనస, మామిడిపై ఆధారపడి ప్రజలు జీవిస్తున్నారని, కార్గో ఎయిర్పోర్టు రాకతో వీరంతా ఉపాధి కోల్పోతారని భేతాళపురం, గంగువాడ, రాంపురం ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చటి ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్టు వద్దని చెబుతున్నా ప్రభుత్వం వినకపోవడం బాధాకరమన్నారు. ఎయిర్పోర్టును వ్యతిరేకిస్తూ వారంతా భేతాళపురంలో సోమ వారం ఆందోళన నిర్వహించారు. గత 180 రోజుల నుంచి నిరంతరం నిరసనలు చేస్తున్నామని, అయినా ప్రభుత్వం స్పందించడం లేదని తెలిపారు. ఎయిర్పోర్టు పేరుతో 1394 ఎకరాల భూమితో పాటు మూలపేట పోర్టు నుంచి కార్గో ఎయిర్పోర్టు వరకు 55 కిలోమీటర్ల రోడ్డు వెడల్పు కోసం కూడా రైతులు భూములు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు మెళియాపుట్టి: ప్రేమ పేరుతో మభ్యపెట్టి బాలికను హైదరాబాద్ తీసుకుపోయిన యువకుడిపై టెక్కలి అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. టెక్కలి ఎస్డీపీఓ, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక కనబడటం లేదని 22 ఏప్రిల్ 2025న ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. గంగరాజపురం గ్రామానికి చెందిన ఫ్రఫుల్లో ప్రధాన్ అనే 21 ఏళ్ల యువకుడు బాలికను తీసుకెళ్లినట్లు సమాచారం అందడంతో ఈనెల 3వ తేదీన గంగరాజపురం గ్రామంలో యువకుడిని అరెస్ట్ చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఎస్ఐ రమేష్ బాబు ఉన్నారు. -
స్కీమ్ కాదు.. అదో పెద్ద స్కామ్
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ హామీలు నెరవేర్చకుండా అవినీతి మహిళలకు కుట్టుమిషన్ల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి ప్లాన్ వేసింది. తల్లికి వందనం, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తానని హామీ ఇచ్చి చివరకు ఇలాంటి పనులు చేస్తున్నారు. హామీలు నెరవేర్చకుండా ఒకసారి మోసం చేశారు. అవినీతితో రెండోసారి మోసం చేస్తున్నారు. అన్ని వ్యవస్థల్లో అవినీతికి పాల్పడుతూ గుట్టు చప్పుడు కాకుండా కోట్లాది రూపాయలు కాజేయడం చంద్రబాబు నైజం. – పేరాడ తిలక్, వైఎస్సార్ సీపీ టెక్కలి సమన్వయకర్త శ్రీకాకుళం (పీఎన్ కాలనీ)/ టెక్కలి: బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ అని నమ్మిన వ్యక్తి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఎక్కడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అర్హతే ప్రామాణికంగా నేరుగా లబ్ధిదారుని ఖాతాల్లోకే డబ్బులు జమ చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చంద్రబాబునాయుడికి మాత్రం స్కీమ్లు స్కామ్లతో సమానమని మండిపడ్డా రు. శ్రీకాకుళం నగరంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం మీడియా తో ఆయన మాట్లాడారు. మహిళా దినోత్సవం నాడు ప్రారంభించిన కుట్టుమిషన్ల శిక్షణ స్కీమ్ లో రూ.150కోట్లు స్కామ్ చేయడం అన్యాయమ న్నారు. వాస్తవానికి ఒక్కో మహిళకు కుట్టుమిషన్ ఇచ్చేందుకు రూ.4300, శిక్షణకు రూ.3 వేలు మొత్తం రూ.7300 అవ్వగా టెండర్లో మాత్రం ఏకంగా రూ.21500 చూపించడం దారుణమన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా ఈ పథకానికి యూనిట్, శిక్షణ ఇవ్వడానికి అయిన ఖర్చు కేవలం రూ.75.06 కోట్లు పోగా మిగిలిన రూ.146.02కోట్లు స్వాహా చేసేశారన్నారు. ఈ శిక్షణ కేవలం 50రోజుల్లో పూర్తిచేసి మిగతా మొత్తాన్ని చంద్రబాబునాయుడు కోట రీ బొక్కేయడం సరికాదన్నారు. కమ్మ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కులాలకు కుట్టు మిషన్ల పంపిణీ అంటూ రూ.115 కోట్లకు టెండర్లు పిలిచి అందులో మరో రూ.81.05 కోట్లు స్కామ్ చేశారని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్ లోన్ల కోసం టీడీపీ నేతల వెనక తిరగాల్సి వస్తోందని, వైఎస్సార్ సీపీ హయాంలో ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలన్నారు. కళింగవైశ్య కుల, తూర్పుకాపు, కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం మాట్లాడుతూ 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి బీసీ సంక్షేమాన్ని వైఎస్ జగన్ గొప్పగా నిర్వర్తించారని గుర్తు చేశారు. అర్హతే ప్రామాణికంగా తీసుకుని అందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. బీసీలకు లోన్లు, కుట్టుమిషన్ల పేరు తో ఈ ప్రభుత్వం స్కామ్ చేస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకట సత్యనారాయణ, గ్రీవెన్స్సెల్ అధ్యక్షుడు రౌతు శంకరరావు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ గొండు కృష్ణ, సాధు వైకుంఠరావు, గొండు రఘురాం, రాజాపు అప్పన్న, గుప్తా, బొబ్బాది ఈశ్వరరావు, భార్గరావు, తంగి అప్పన్నస్వామి తదితరులు పాల్గొన్నారు. కూటమి స్కామ్లతో ఖజానా ఖాళీ కూటమి స్కామ్లతో ఖజానా ఖాళీ అవుతోంది. దాదాపు రూ.150 కోట్ల నిధులను దోపిడీ చేశారు. టెండర్ల దశ నుంచే అక్రమాలు జరిగాయి. రాష్ట్రంలోని బీసీ కార్యకర్తలు, బీసీ మహిళా సంఘాలు దీనిపై దృష్టి సారించాలి. –దుంపల లక్ష్మణరావు, వైఎస్సార్సీపీ కాళింగ కుల రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రుణాల పేరుతో కూటమి నేతలు జేబులు నింపుకుంటున్నారు బీసీలను ఆదుకున్నది వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ -
ఎస్బీఐ మరో బ్రాంచిలో
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచుల్లో వరుస పెట్టి అక్రమాలు బయటపడుతున్నాయి. గతంలో గార ఎస్బీఐలో తాకట్టు బంగారం బ్రాంచి నుంచి మాయమై, వేరే ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టిన ఘటన వెలుగు చూడగా, ఆ మధ్య నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరుతో రుణాలను నొక్కేసిన బాగోతం బయటపడింది. తాజాగా కవిటి మండలం సిలగాం ఎస్బీఐ బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన వ్యవహారం వెలుగు చూసింది. ఇవన్నీ గతంలో జరిగినప్పటికీ కాలక్రమేణా బయటకు వస్తున్నాయి. కవిటి మండలం సిలగాం బ్రాంచిలో డ్వాక్రా సంఘాల పేరుతో రుణాలను కాజేసిన తాజాగా వ్యవహారం వెలుగు చూసింది. శాఖా పరమైన విచారణలో అవినీతి బయటపడింది. దాంట్లో బాధ్యుడైన ఉద్యోగిని సస్పెండ్, డిస్మిస్ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఆడిట్లో అభ్యంతరం వస్తూ ఉండటంతో తాజాగా క్రిమినల్ చర్యల కోసం ఎస్బీఐ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. బ్యాంకు అధికారుల అంతర్గత పూర్తి విచారణ నివేదిక తీసుకొస్తే తప్ప ముందుకు వెళ్లలేమని పోలీసులు చెప్పడంతో ఇప్పుడా విచారణ నివేదికను, చర్యల ఫైల్ను పట్టుకుని వెళ్లే పనిలో బ్యాంకు ఉన్నతాధికారులు ఉన్నారు. డ్వాక్రా సంఘాలకు బురిడీ.. కవిటి మండలం సిలగాం బ్రాంచి పరిధిలోని డ్వాక్రా సంఘాలను బురిడీ కొట్టించారు. సంఘాలకు ఇచ్చింది కొంతైతే... వాటి పేరున నొక్కేసింది మరికొంత. డ్వాక్రా సంఘాలకు అధికారికంగా ఉన్న ఖాతాలకు కొంతమేర రుణాలిచ్చినట్టు చూపించగా, ఆ సంఘాల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టించి, మరికొంత రుణాలు తీసుకున్నారు. దీంతో బ్యాంకు లెడ్జర్లలోనూ, డీఆర్డీఏ రికార్డుల్లోనూ రుణాల లెక్కల్లో తేడా వచ్చింది. దీనిపై శాఖా పరమైన విచారణ చేపట్టడంతో గతంలోనే అవినీతి బట్టబయలైంది. కాకపోతే, వ్యవహారాన్ని గట్టు చప్పుడు కాకుండా ఉంచారు. అంతర్గతంగానే సెటిల్ చేసేశారు. కాకపోతే, బ్యాంకు ఆడిట్లో ఆ అక్రమంపై అభ్యంతరం వ్యక్తం కావడంతో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి సదరు బ్యాంకు అధికారులకు ఎదురైంది. దానిలో భాగంగా ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించారు. అవినీతి మాఫీ.. సిలగాం బ్రాంచిలో నాలుగేళ్ల క్రితం అవినీతి జరిగింది. ఆ అవినీతి కూడా మాఫీ అయిపోయింది. డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు ప్రభుత్వం ఇస్తున్నందున ఈ సంఘాల పేరుతో రుణాలు నొక్కేసి, ఆ సొమ్మును బయట వడ్డీలకు తిప్పి మొత్తంలో సంపాదించుకున్నారు. అదేవిధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేయడంతో బ్యాంకు అధికారులు సొంతానికి వాడుకున్న రుణాలు కూడా మాఫీ అయిపోయాయి. ఈ విధంగా మాఫీలో ఎంత లబ్ధి పొందారు, నకిలీ ఖాతాల పేరుతో ఎంత మేర రుణాలను కొట్టేశారో అన్నది ఇంతవరకు బయటికి వెల్లడి కాలేదు. బ్యాంకు అధికారులు గుట్టుగానే ఉంచారు. మౌఖికంగా ఫిర్యాదు చేయడానికి పోలీసుల వద్దకొస్తే ఆ మొత్తం అవినీతి నివేదిక తీసుకురావాలని చెప్పడంతో వెనక్కి వచ్చేశారు. నాటి బాగోతంలో క్యాష్ ఇన్చార్జి సరోజ్కుమార్ కీలక పాత్ర పోషించారని, ఆ కేసులో సస్పెండ్తో పాటు డిస్మిస్ అయినట్టు కూడా తెలిసింది. ఇప్పటికే నరసన్నపేట బజారు బ్రాంచిలో ఉద్యోగుల పేరు చెప్పి రుణాలు తీసుకుని, ఆ సొమ్ము దిగమింగేసిన ఘటనలో ఒకరు సస్పెండ్ అవ్వగా, గారలో తాకట్టు బంగారం మాయం చేసిన ఘటన అరెస్టులు, సస్పెన్ష్లు జరిగాయి. తాజాగా సిలగాం సరోజ్ కుమార్ ఒక్కరేనా? మిగతా వారి పాత్ర ఎంత? అనేది పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తేలే అవకాశం ఉంది. కవిటి మండలం సిలగాం ఎస్బీఐ బ్రాంచి వార్తల్లోకి ఎక్కిన సిలగాం బ్రాంచ్ డ్వాక్రా సంఘాల పేరుతో రుణాల కాజేసిన వైనం ఇప్పటికే బాధ్యుడిగా ఒకరిపై సస్పెన్షన్, డిస్మిస్ వరుస ఘటనలతో ఎస్బీఐకు అప్రతిష్ట -
సూదికొండ మిగలకుండా..
ఈ ఫొటోలో కనిపిస్తున్న కొండ పేరు సూదికొండ. పలాస–కాశీబుగ్గలో ఉంది. కూటమి ప్రభుత్వంలో కొండల్ని ఎలా కొల్లగొడుతున్నారో చెప్పడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. గ్రావెల్ కోసం మట్టి మాఫియా దాష్టీకానికి ఒడిగట్టింది. అక్రమార్కులకు సూదికొండ ఆదాయ వనరుగా మారింది. అనుమతుల పేరుతో ఇప్పటికే సగానికి పైగా కొండను తవ్వేశారు. మిగతాది తవ్వేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇలాగే వదిలేస్తే సూదికొండ మిగలకుండా పోతుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కూటమి ప్రభుత్వంలో విధ్వంసం పతాకస్థాయికి చేరుతోంది. ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయి. పచ్చని కొండలు ఛిద్రమైపోతున్నాయి. కొండలు వన్యప్రాణులకు నెలవుగా ఉంటాయి. పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. తుఫాన్లు ఇతరత్రా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణగా నిలుస్తాయి. కానీ, ఇప్పుడా కొండలపైనే కూటమి నేతల కన్ను పడింది. అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టి దర్జాగా సొమ్ము చేసుకుంటున్నారు. పలాస నియోజకవర్గంలో సూదికొండపై గ్రావెల్ మాఫియా బరితెగించింది. రేయింబవళ్లు దర్జాగా తవ్వి తరలించేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికే సూదికొండ సగానికి పైగా తరిగిపోయింది. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురం రెవెన్యూ పరిధిలో గల సర్వే నంబర్ 51లో 60 ఎకరాల విస్తీర్ణంలో సూదికొండ ఉంది. 2014–19లోనే పట్టణంలోని సూదికొండపై తమ్ముళ్ల కన్ను పడింది. ఇష్టారీతిన తవ్వకాలు చేపట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చాలావరకు నిలువరించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక బరితెగించారు. ఎవరి హయాంలో విధ్వంసం ప్రారంభమైందో వారి హయాంలోనే మళ్లీ జడలు విప్పింది. విచిత్రమేమిటంటే అక్కడ క్వారీకి అధికారులు అనుమతులు ఇచ్చారని చెప్పి చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన నాయకుడు ఇదే మంచి అవకాశంగా తీసుకున్నారు. ఇష్టారీతిన తవ్వి తరలించేస్తున్నారు. మరోవైపు ఎంఐజీ లే అవుట్కు తరలిస్తున్నామంటూనే ఎక్కడెక్కడికో రవాణా చేసేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం కోసమని కూడా తవ్వకాలు జరుపుతున్నారు. చదును పేరుతో గ్రావెల్ బిజినెస్ చేస్తున్నారు. రూ.కోట్లలో అక్రమార్కులు ఆర్జిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే కొన్నాళ్లకు ఇక్కడొక సూదికొండ ఉండేది అని చెప్పుకునే పరిస్థితి వచ్చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కొండను కొల్లగొట్టేస్తున్న కూటమి పెద్దలు ఇప్పటికే సగానికిపైగా గుండు కొట్టేసిన వైనం పతాక స్థాయికి చేరిన విధ్వంసం -
భవిష్యత్కు గ్యారెంటీ
● ట్రిపుల్ ఐటీ.. ఆర్జీయూకేటీ ప్రాంగణం ఎచ్చెర్ల క్యాంపస్: ట్రిపుల్ ఐటీ సందడి మొదలైంది. పదో తరగతి తర్వాత అధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఈ సంస్థలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ప్రత్యేక వెయిటే జీ ఇవ్వడమే దీనికి కారణం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందుతున్నారు. ట్రిపుల్ ఐటీలో చేరితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్ముతున్నారు. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ప్రకాశం. శ్రీకాకుళం విద్యా సంస్థలో 1100 సీట్లు ఉన్నాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నా రు. ట్రిపుల్ ఐటీలో సమీకృత ఇంజినీరింగ్ కోర్సు ఆరేళ్లు. రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు), నాలుగేళ్లు ఇంజినీరింగ్. పీయూసీ పూర్తయిన విద్యార్థులు ఇంజినీరింగ్లో చేరుతారు. నూతన విద్యా విధానం–2020 మేరకు పీయూసీ పూర్తిచేసిన విద్యార్థులు రిలీవ్ కావచ్చు. ఇంజినీరింగ్ విద్యార్థులు సైతం ఏటా రిలీవ్ కావచ్చు. విద్యార్హత బట్టి ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజినీరింగ్లో సివి ల్, మెకానికల్, ట్రిపుల్ఈ, సీఎస్ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. రిలీవ్ అయ్యే విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించటంతో పాటు గేట్ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం చదువుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. రెసిడెన్షియల్ పద్ధతిలో.. పూర్తిగా రెసిడెన్షియల్ విధానంలో విద్యా బోధన ఉంటుంది. అర్హులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తారు. పీయూసీకీ రూ.45 వేలు, ఇంజినీరింగ్కు రూ.50 వేలు ఏడాదికి ట్యూషన్ ఫీజు. ఇతర తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశం పొందితే రూ. 1.50 లక్షలు ఏడాదికి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు ఆంధ్రా విశ్వావిద్యాలయం పరిధిలో 17 జిల్లాలకు 65.62 శాతం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో 9 జిల్లాలకు 34.38 శాతం సీట్లు కేటాయించి ప్రవేశాలు నిర్వహిస్తారు. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం ఈ నెల 20 చివరి తేదీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రవేశాల్లో వెయిటేజ్ ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సు చదివే అవకాశం రెసిడెన్షియల్ విధానంలో విద్య మంచి ప్లేస్మెంట్లు సాధిస్తున్న రిలీవైన విద్యార్థులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి ఆర్జీయూకేటీలో ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తాం. మంచి భవిష్యత్ ఉంటుంది. రిలీవ్ నాటికి మంచి ప్లేస్మెంట్లు లభిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎక్కువగా ప్రవేశాలు లభిస్తున్నాయి. విద్యార్థులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. పూర్వపు విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆన్లైన్లో గడువు లోగా దరఖాస్తులు చేసుకోవాలి. – ప్రొఫెసర్ కొక్కిరాల వెంకట గోపాల ధన బాలాజీ, శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ దరఖాస్తుల స్వీకరణ.. 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఏప్రిల్ 27 వ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 20 చివరి తేదీ. జూన్ ఐదున ఎంపికై న విద్యార్థుల మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. 11 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూన్ 30 నుంచి క్లాస్వర్క్ ప్రారంభించి అకడమిక్ ఏడాది ప్రారంభిస్తారు. 10వ తర గతి మార్కులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వెయిటేజీ, రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దివ్యాంగులు, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్, వంటి ప్రత్యేక కేటగిరీలకు న్యూజివీడు క్యాంపస్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
నీట్
● ప్రశాంతంగా ముగిసిన శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన జాతీయస్థాయి మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్(నీట్) ప్రశాంతంగా ముగిసింది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంలో 480 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 11 మంది గైర్హాజరయ్యారు. దీంతో 469 మంది పరీక్ష రాశారు. సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి అవస్థలు పడ్డారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ కణితి శ్రీరా ములు సీఎస్గా వ్యవహరించి పర్యవేక్షించారు. ఎచ్చెర్ల క్యాంపస్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశ పరీక్ష నీట్–2025 ఆదివారం ప్రశాంతంగా జరిగింది. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎస్ఎంపురం క్యాంపస్లో 720 మంది విద్యార్థులకు 713 మంది హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారు. కుశాలపురం పరిధి శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 240 మంది వద్యార్థులకు 233 మంది హాజరయ్యారు. ఏడుగురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల్లోనికి 11.30 నుంచి విద్యార్థులను అనుమతించారు. మధ్యాహ్నం రెండు గంటలు నుంచి సాయంత్రం ఐదు గంటలు వరకు పరీక్ష నిర్వహించారు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉదయం 11 గంటలకే పరీక్ష కేంద్రాలను చేరుకున్నారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ట్రిపుల్ ఐటీ ఏఓ ముని రామకృష్ణ, డీఎస్పీ వివేక నంద, తహసీల్దార్ బి.గోపాలరావు పరీక్షలు పర్యవేక్షించారు. -
లక్ష్యానికి దూరం..
శ్రీకాకుళం పాతబస్టాండ్: పేదలకు దినసరి వేతనం కల్పించి, వలసల నివారణకు ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లాలో తగ్గుతోంది. ఈ పనులను నమ్ముకుని ఉన్న వేతనదారులకు న్యాయం జరగడం లేదు. అధికారులు–సిబ్బంది కుమ్ములాట, వ్యక్తిగత ప్రతిష్టలు ఈ శాఖలో మిగులుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో కూలీలకు న్యాయం జరగడం లేదు. ఒక పక్క అధికారుల అసమర్థత, మరో పక్క ప్రభుత్వం విధానాలతో ఈ పనులు మందగిస్తున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో పనులపై ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు జిల్లా రాష్ట్రస్థాయిలోనే పనుల కల్పనలో మొదటి, ద్వితీయ స్థానాల్లో ఉండేది. ఎన్ఆర్ఈజీఎస్ పనులు, వేతనదారులకు పనిదినాల కల్పన, వేతనాల చెల్లింపులు, మెటీరియల్ కాంపోనెంట్ జనరేషన్లో గుర్తింపు పొందింది. తాజాగా 2024–25 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ ఫలితాలు దిగువ స్థాయికి చేరాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో కేవలం కాంపోనెంటు మొ త్తంలో మాత్రమే మూడో స్థానంలోకి చేరారు. మిగిలిన ప్రమాణాల్లో జిల్లా వెనుకబడిపోయింది. ఆర్ధిక సంవత్సరం లక్ష్యాలు 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రణాళిక ప్రక్రియలో అంచనా విలువ రూ.1499.03 కోట్లుగా వేశారు. మొత్తం 41,523 పనులను గుర్తించారు. ఈ పనుల్లో భాగంగా గోశాల నిర్మాణం, సేద్యపు నీటి కుంటలు, సమతల, రింగు, కాంటూరు కందకాలు, కాలువలు, చెరువులు, పశువులకు నీటి తొట్టెలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, సోక్ పిట్స్, కంపోస్ట్ పిట్స్, చేపల చెరువులు, వరద కట్టలు, మట్టి రోడ్లు, భూ అభివృద్ధి పనులు, మినీ పెర్కొలేషన్ ట్యాంక్లు, హౌసింగ్ లబ్ధిదారులకు 90రోజులు పనిదినాలు, సరోవరాలు, కోనేరులు పూడిక తీత, పల్లె పుష్కరిణిలు తదితర పనులు చేపట్టేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లాలో తగ్గిన ఉపాధి పనులు లక్ష్యాలకు దూరంగా ఎన్ఆర్ఈజీఎస్ పనులు -
ఆయుష్షు మిగలదు
ఆనవాలే ఉండదు.. పురుగు బారిన పడి నేలకొరిగిన కొబ్బరి మొక్కలు ఇచ్ఛాపురం రూరల్: ఉద్దానం కొబ్బరిపై ఎర్రముక్కు పురుగు పంజా విసురుతోంది. దీంతో దిగుబడి గణనీయంగా తగ్గుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిత్లీ తుఫాన్కు నేలకొరిగిన కొబ్బరి చెట్ల ప్రాతంలో రైతులు కొబ్బరి మొ క్కలు నాటారు. మొక్కలు పెరుగుతున్న సమయంలో ఎర్రముక్కు పురుగు ఆశిస్తుండటంతో పచ్చగా కనిపిస్తూనే కొబ్బరి మొక్కలు నేలకొరుగుతున్నా యి. దీంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఈ పురుగు అన్ని వయస్సుల కొబ్బరి చెట్లను, తోటలను ఆశిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. కొబ్బరి చెట్ల మొవ్వులో రంధ్రాలు చేసి, చెట్టు మరణానికి కారకాలుగా మారుతున్నాయి. మొక్కకు ఎర్ర ముక్కు పురుగు ఆశించినప్పటికీ చెట్టు పచ్చగానే ఉంటుండటంతో రైతులు త్వరగా మేలుకోలేకపోతున్నారని, కొబ్బరిదిగుబడి తగ్గడం, కొద్ది రోజుల తరువాత చెట్టును నష్టానికి గురిచేస్తుందని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు. ఆనవాలు లేకుండానే.. చెట్టు లోపలి భాగంలో ఆవాసం ఏర్పాటు చేసుకు న్న ఎర్రముక్కు పురుగు అక్కడే సంతానోత్పత్తి చేసి ఆరోగ్యకరంగా ఉన్న కొబ్బరి చెట్టును నాశనం చేస్తుంది. చెట్టు నేలకొరిగే వరకు రైతు ఎలాంటి ఆనవాలు పసిగట్టలేకపోవడంతో నష్టపోతున్నాడు. దీంతో ఏడాదికి ఎకరానికి నాలుగైదు చెట్లను రైతు కోల్పోతున్నాడు. లేత కొబ్బరి చెట్లకు ఇది ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానం కొబ్బరిని ఆశిస్తున్న ఎర్రముక్కు పురుగు నేలకొరుగుతున్న కొబ్బరి మొక్కలు పచ్చగా కనిపిస్తూనే పాడైపోతున్న వైనం సామూహిక సస్యరక్షణే మేలు -
ధ్రువపత్రాలు సిద్ధమేనా..
హిరమండలం: పదో తరగతి, ఇంటర్మీడియెట్ తదితర పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఉన్నత చదువుల్లో భాగంగా కళాశాలల్లో చేరేందుకు పలు ధ్రువపత్రాలు తప్పనిసరి. వీటినిముందస్తుగా పొందేందుకు ఇదే మంచి తరుణమని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఏడాది అధిక సంఖ్యలో రానున్న విద్యార్థుల కోసం సంబంధిత కార్యాలయాల్లోనూ అవసరమైన అన్ని పత్రాల అందజేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒత్తిడి పెరగకముందే.. సాధారణంగా మే, జూన్ నెలల్లో ముఖ్యంగా తహసీల్దార్ కార్యలయాల్లో సిబ్బందిపై ధ్రువపత్రాల జారీకి సంబంధించి అధిక ఒత్తిడి ఉంటుంది. దరఖాస్తుదారుల రద్దీ పెరుగుతుంటుంది. వీఆర్వో, ఆర్ఐల క్షేత్ర స్థాయి పరిశీలన, డిజిటల్ సంతకాలు తదితర పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు పలుమార్లు తిరగాల్సిరావడం, మధ్యవర్తులను ఆశ్రయించడం వంటి ఇబ్బందులు రావచ్చు. ఫలితంగా అనుకున్న సమయానికి ధ్రువపత్రాలు చేతికి అందకపోవచ్చు. ముందుగా మేల్కొంటే హైరానా తప్పుతుందని అధికారులు చెబుతున్నారు. ధ్రువపత్రాలు పొందాలంటే.. ● ప్రస్తుతం చదువుతున్న క్లాసుల నుంచి తదుపరి తరగతుల్లో ప్రవేశానికి ఆదాయం, కులం, ఈడబ్ల్యూస్, ఓబీసీ వంటి ధ్రువపత్రాలు తప్పనిసరి. వీటి కోసం మీ–సేవా కేంద్రాలు, సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ● ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హత ధ్రువపత్రాలతో సంబంధిత అర్జీ పూర్తిచేసి అవసరమైన నకలను జతపర్చి సచివాలయం డిజిటల్ సహయకుడికి అందజేయాలి. ● ఆన్లైన్లో పొందపరిచిన వివరాలపై వీఆర్వో క్షేత్ర స్థాయిలో, మండల రెవెన్యూ ఇన్స్టెక్టర్ (ఆర్ఐ)నేరుగాను పరిశీలిస్తారు. అన్నీ పక్కాగా ఉంటే చివరిగా తహసీల్దార్ తన లాగిన్లో మరోసారి నిశితంగా పరిశీలించి డిజిటల్ సంతకం చేస్తారు. దీనిపై మొబైల్కు వచ్చే సందేశంతో దరఖాస్తుదారులు సచివాలయంలో గానీ, మీసేవా కేంద్రంలో గానీ ధ్రువపత్రాలు పొందవచ్చు దరఖాస్తు చేసుకోండి.. కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల్లో చేరే సమయంలో అవసరమయ్యే ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే మేలు. చివరి సమయంలో హడావుడి పడుతూ ఆందోళన చెందకుండా ప్రస్తుత సెలవుల్లోనే కార్యాలయాలను సంప్రదించాలి. కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీకి నిర్దేశించిన సమయం కంటే ముందు వీటిని జారీచేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్.హనుమంతురావు, తహసీల్దార్, హిరమండలం కుల, ఆదాయ తదితర సర్టిఫికెట్లకు ఇదే సమయం విద్యాసంస్థల్లో ప్రవేశాలు నేపథ్యంలో ముందస్తుగా సిద్ధం కావడం మేలు -
అరసవల్లిలో వైశాఖ సందడి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో వైశాఖ మాసం సందడి మొదలైంది. పవిత్ర వైశాఖ మొదటి ఆదివారం కావడంతో స్థానికులతో పాటు ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతరాలయంలో ప్రత్యేక అలంకరణలో ఆదిత్యుడు సర్వదర్శనాలకు అనుమతించేలా ఆలయ అర్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కేశఖండన శాలలో తలనీలాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకోగా మరికొందరు భక్తులు ఆరోగ్యం కోసం సూర్యనమస్కార పూజలు చేయించుకున్నారు. ఇంద్ర పుష్కరిణిలో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సంప్రదాయ పూజలు ఆశ్రయించారు. పంటల తొలిఫలాలను స్వామివారికి ప్రత్యేక ప్రసాదంగా నివేదించారు. పుష్కరిణి ప్రాంతంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ ఈవో కె.శోభారాణి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేసినప్పటికీ కేశఖండనశాల, ఉచిత దర్శనాల క్యూలైన్లు తదితర చోట్ల భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. ఒక్క రోజు ఆదాయం రూ.10.38లక్షలు.. వైశాఖ మొదటి ఆదివారం సందర్భంగా ఒక్కరోజులో రూ.10,38,252 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కె.శోభారాణి ప్రకటించారు. వివిధ దర్శన టికెట్ల విక్రయాల ద్వారా రూ.7.36 లక్షలు, విరాళాలు, పూజలు ద్వారా రూ.98,252, లడ్డూ, పులిహోర విక్రయాల ద్వారా రూ.2.04 లక్షల వరకూ ఆదాయం లభించినట్లు వివరించారు. ట్రాఫిక్జామ్.. అరసవల్లి ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం ట్రాఫిక్ స్తంభించింది. గార, శ్రీకాకుళం నుంచి వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో సుమారు గంట సేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతరం అసిరితల్లి ఆలయం పక్క నుంచి దేవాలయ తోట వరకూ వాహనాలను దారి మళ్లించారు. -
దర్గాలో చందనోత్సవం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చౌక్బజారు దర్గాలో హజరత్ సయ్యద్ రోషన్ షావళిబాబా రహమతుల్లా షరీఫ్ చందనోత్సవం ఘనంగా నిర్వహించారు. బాబా సమాధికి గంధం పూసి పూలదండలతో అలంకరించి చాదర్ కప్పి ఖురాన్ పఠించారు. షేక్సలీం సోదరుల ఆధ్వర్యంలో లంగర్ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జామియా మసీదు ప్రతినిధులు షాన్, రఫీ, బాషా, అహమ్మద్, నజీరుద్దీన్, వహబ్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారి అనుమానాస్పద మృతి కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో కాశీబుగ్గ పాత జాతీయ రహదారిలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మూడు రోడ్ల కూడలిలో ఉన్న ఓ దుకాణం అరుగుపై విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. మృతుడు స్థానిక వ్యాపారి వూన నాగరాజుగా గుర్తించి కుటుంబానికి తెలియజేశారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలం జరజాం సమీపంలో బైపాస్ రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో వ్యక్తి మృతిచెందాడు. బైక్ నడుపుతున్న అడపా సింహాచలం (39) ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే మృతి చెందిన విషయం తెలిసిందే. వెనుక కూర్చున్న బాలి సింహాచలం (64) తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని కార్పొరేట్ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో రణస్థలం మండలం వేల్పురాయి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఎచ్చెర్ల ఎస్సై వి.సందీప్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుక్కల దాడిలో ఆవుదూడ మృతి పొందూరు: మండలంలోని తండ్యాం గ్రామంలో కుక్కల దాడిలో ఆదివారం ఉదయం లంకలపల్లి వెంకటరావుకు చెందిన ఆవుదూడ మృతి చెందింది. రైతు తన కల్లంలోని ఏడాది వయస్సు కలిగిన ఆవుదూడను కట్టి ఇంటికి వెళ్లే సరికి కుక్కలు గుంపు ఒక్కసారిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి. గ్రామపెద్ద భాస్కరరావు పొందూరు పశుసంవర్ధకశాఖ ఏడీకి సమాచారం ఇవ్వడంతో వైద్యులు వచ్చి చికిత్స చేసినా అప్పటికే దూడ మృతిచెందింది. కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ‘కూర్మ’లో వేసవి శిక్షణ శిబిరాలు హిరమండలం: ఆధ్యాత్మిక గ్రామం కూర్మలో యువతకు వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయని వర్ణాశ్రమ నిర్వాహకులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31 వరకూ శిబిరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భారత సనాతన సంస్కృతిని నెలకొల్పడం, స్వయం సమృద్ధి సాధించడం, పూర్వపు వృత్తులను పునరుద్ధరించాలన్న లక్ష్యంతో చేనేత, గానుగ ఆడింపు, మట్టికుండల తయారీ, వడ్రంగి, కర్రసాము, వైదిక గృహనిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, మంత్రధ్యానం, శ్రవణం, కీర్తనం, వైదిక జీవనం ప్రాముఖ్యత, రసాయనాలు లేని ఆహారం, శాస్త్ర అధ్యయనం, ఆధ్యాత్మిక సాధన తదితర అంశాల్లో యువతకు శిక్షణ ఇస్తామని వివరించారు. 15 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించాలని, సెల్ఫోన్కు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యుత్తో పాటు ఇతరత్రా ఆధునిక సదుపాయాలేవీ ఉండవని, సరళం, సహజం, సంప్రదాయకం, ధార్మిక జీవనం కోసమే ఈ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు 7732075607, 8712011776 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
బారువలో బారులు తీరిన పర్యాటకులు
బారువ తీరంలో ఆదివారం నిర్వహించిన బీచ్ ఫెస్టివల్కు పర్యాటకులు పోటెత్తారు. ఉత్సవం చివరి రోజు కావడంతో స్థానికులతో పాటు ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, ఒడిశా నుంచి వేలాది సంఖ్యలో పర్యాటకులు బారువ తీరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జానపద, సాంస్కృతిక ప్రదర్శనలు, ఫైర్ షో, ముగింపు వేడులు ఆకట్టుకున్నాయి. బోట్రైడింగ్ వంటి కార్యక్రమాలతో చిన్నారులు సందడి చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక అధికారులు పర్యాటకులకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. – సోంపేట -
తవ్వకాల కలకలం
లుకలాంలో.. ● తాగునీటి ప్రాజెక్టు సమీపంలోనే ఇసుక తవ్వకాలు ● ఆందోళన చెందుతున్న స్థానికులు నరసన్నపేట : ఉచితం విధానం పేరిట వంశధార నదిలో ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. నదిలో తమకే హక్కులు ఉన్నాయన్న చందంగా నది మొత్తం జేసీబీలతో గుల్ల చేసేస్తున్నారు. మంజూరు చేసిన విస్తీర్ణానికి మించి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. చెంతనే తాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయని కూడా చూడకుండా ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. దీంతో లుకలాం గ్రామస్తులతో పాటు నరసన్నపేట మండలవాసులు ఆందోళన చెందుతున్నారు. లుకలాంలో అధికారికంగా ఇసుక ర్యాంపు ఇవ్వకపోయినా ఎదురుగా శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరు ర్యాంపునకు అధికారులు అనుమతులిచ్చారు. వారికిచ్చిన పరిధిని దాటి నదిలో నరసన్నపేట మండలం లుకలాం వైపు వచ్చి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నదీ గర్భాన్ని ఛిద్రం చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ గోతులు పెట్టి జేసీబీలతో ఇసుకను తవ్వి లారీలతో తరలిస్తున్నారు. మిగిలిన ప్రాంతం మాట ఎలా ఉన్నా లుకలాం వద్ద ఉన్న రక్షిత మంచినీటి ప్రాజెక్టుకు సమీపాన భారీ ఎత్తున తవ్వకాలు చేస్తున్నారు. తాగునీటి సరఫరాకు ముప్పు.. ఇక్కడి తాగునీటి ప్రాజెక్టు నుంచి 18 గ్రామాలకు నీరు సరఫరా అవుతుంటుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టును రూ.7 కోట్లతో నిర్మించారు. అప్పట్లో 30 గ్రామాలకుపైగా తాగునీరు సరఫరా అయ్యేది.. ప్రస్తుతం 18 గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. అప్పట్లో నీటి ఫిల్టర్లు నదిలో నిర్మించారు. ఇప్పుడు వీటికి దగ్గర్లోనే ఇసుక తవ్వకాలు చేస్తుండటంతో నీటి కొరత ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నీటి ప్రాజెక్టుకు ఇబ్బంది.. వంశధార నదిలో శ్రీకాకుళం రూరల్ మండలం బట్టేరు ఇసుక ర్యాంపు నిర్వాహకులు తమ పరిధిని దాటి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. నరసన్నపేట మండలం లుకలాం వైపు వచ్చి ఇసుక తవ్వేస్తున్నారు. రూ.7 కోట్లతో నిర్మించిన తాగునీటి ప్రాజెక్టు సమీపంలోనే తవ్వకాలు జరుపుతుండటంతో గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో నీటి ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. – ఎస్.తవిటినాయుడు, సర్పంచ్, లుకలాం తవ్వకాలు ఆపాలి.. తాగునీటి ప్రాజెక్టు సమీపంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలుపుదల చేయాలి. ఇదే విధంగా తవ్వకాలు జరిగితే లుకలాంతో పాటు మరో 18 గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రమాదముంది. ముందుగానే అదికారులు మేల్గొని తగు చర్యలు తీసుకోవాలి. – చింతల సత్యం, మాజీ సర్పంచ్, లుకలాం -
అఖిల భారత సమ్మె విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): కార్మిక హక్కులు కాలరాసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 20న చేపట్టనున్న అఖిలభారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో కార్మిక, ప్రజా సంఘాల జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారీ ప్రయోజనాలు కోసం నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి వేసిందన్నారు. కార్మిక సంఘాలను బలహీనం చేసి, మరింత శ్రమదోపిడీ చేసేందుకు, పనిభారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేసేందుకు, పని గంటలు పెంచడానికి లేబర్ కోడ్లు తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ సలహాదారు చిక్కాల గోవిందరావు, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్.వెంకటరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మణికొండ ఆదినారాయణమూర్తి, బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.శ్రీనివాస్, బీఎస్ఎన్ఎల్ నాయకుడు ఎం.గోవర్ధనరావు, రైతు సంఘం నాయకుడు కొత్తకోట అప్పారావు, పెన్షనర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పార్వతీశం, రిమ్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాకోటి చిన్నారావు, ఏపీ మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు టి.ప్రవీణ, పద్మ, కళాసీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బోర చిన్నారావు, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, పట్టణ కన్వీనర్ ఆర్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం
శ్రీకాకుళం పాతబస్టాండ్: భగీరథ మహర్షి దివి నుంచి భువికి గంగను తెచ్చిన మహానుభావుడని, ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని జి ల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు అన్నారు. ఆదివారం భగీరథ మహర్షి జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మరుగునపడిన వా రి జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇ.అనురాధ, బీసీ సంక్షేమ శాఖ జాతీయ కార్యదర్శి డాక్టర్ బి.దేవభూషణరావు, ఉప్పర సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట రామారావు, సెక్రటరీ గజ్జల మాధవ రావు ఉపాధ్యక్షులు పిండి రాము, కలెక్టరెట్ ఏఓ సూర్యనారాయణ, బీసీ వెల్ఫేర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
50 ఏళ్ల తర్వాత బేసి పోలమ్మ అమ్మవారి సంబరాలు
సోంపేట: మండలంలోని బేసి రామచంద్రాపురం గ్రామంలోని బేసి పోలమ్మ అమ్మవారి గ్రామ దేవత సంబరాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. తొమ్మిది రోజుల పాటు సంబరాలు నిర్వహించనున్నారు. యాభై ఏళ్ల తర్వాత గ్రామంలో ఉత్సవాలు నిర్వహిస్తుండడంతో అంతటా పండగ వాతావరణం నెలకొంది. 5 నుంచి 13వ తేదీ వరకు ప్రతి రోజూ రాత్రి 9 గంటల తర్వాత గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. 5న రాజమండ్రి వారి డ్యాన్స్ ఈవెంట్స్, 6న ఒడిశా వారి సాంస్కృతిక కార్యక్రమాలు, 7న కండక్టర్ ఝాన్సి, రమేష్ మాస్టర్ స్టేజ్ ఈవెంట్స్, 8న ఒరియా రామాయణం, 9న పల్సర్ బైక్ రమణ ఈవెంట్స్, 10న ప్రకాష్ మాస్టారు గ్రూప్ డ్యాన్స్లు, 11న విశాఖపట్నం రోషన్లాల్ ఆర్కెస్ట్రా, 12న బుల్లెట్ భాస్కర్ టీమ్ జబర్దస్త్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జోగిపోలమ్మ సిరిమాను పండగలు టెక్కలి: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో సోమవారం నుంచి గ్రామదేవత జోగిపోలమ్మ సిరిమాను పండగలు జరగనున్నాయి. దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సర్పంచ్ కోరాడ కామేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొదటి రోజు దేవర ఉత్సవంతో పాటు 13వ తేదీ సిరిమాను సంబరం, అమ్మవారి ఘటాల ఊరేగింపుతో 9 రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. దశాబ్దాల తర్వాత నిర్వహిస్తున్న ఉత్సవాల కోసం సుదూర ప్రాంతాల నుంచి బంధువులంతా గ్రామానికి చేరుకోవడంతో సందడి చోటు చేసుకుంది. ఉత్సవాలతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. -
వేలానికి వేళ కాలేదా?
జలుమూరు : ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భూముల సాగు వేలం జరగక ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఏడాదిన్నర కావస్తున్నా అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలం జరగడం లేదు. శ్రీముఖలింగేశ్వర స్వామి పేరిట సుమారు 24 ఎకరాలు సాగు భూమి ఉంది. మూడున్నరేళ్ల క్రితం ఎకరాకు రూ.21 వేలు చొప్పున ముందు కౌలుకు పాట పాడేవారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఓసారి స్వామివారి భూములకు సంబంధించి దేవదాయ శాఖ అధికారులు బహిరంగ వేలంపాట నిర్వహించేవారు. ఎక్కువ మొత్తం పాడిన రైతులకు వాటి సాగుకు అనుమతిచ్చేవారు. జాప్యమెందుకో? దేవదాయ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఏడాదిన్నర గడుస్తున్నా పాట నిర్వహించడంలేదని గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు. గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా కౌలుసాగుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే దేవదాయ శాఖ నుంచి మాత్రం ఎటువంటి పాట నిర్వహించడం లేదని రైతులు చెబుతున్నారు. వేలం నిర్వహించి ఇందులో కొంత భాగం మొత్తం ముందుగానే బ్యాంక్ ఖాతాలో జమ చేయాలి. అన్ని నిబంధనలకు లోబడి కౌలు వేలం పాడేందుకు ఈ ఏడాది రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్ కాలం కూడా ప్రారంభమైంది. ఇదే సమయంలో వేలం నిర్వహిస్తే ముందస్తు పనులు చేసేందుకు వీలు కలుగుతుందని రైతులు చెబుతున్నారు. ప్రతిపాదనలు పంపిస్తాం.. శ్రీముఖలింగేశ్వర ఆలయ భూములు కౌలుకు సంబంధించి దేవదాయ శాఖ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. అక్కడి నుంచి అనుమతి వచ్చాక కౌలుకు వేలం నిర్వహిస్తాం. – పి.ప్రభాకరరావు, ఈఓ, శ్రీముఖలింగం దేవస్థానం ఏడాదిన్నరగా జరగని శ్రీముఖలింగం భూముల కౌలు వేలం అధికారులు నిర్లక్ష్యం వీడాలంటున్న రైతులు జాప్యం కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి -
రసాభాసగా పంచాయతీ నిధుల విచారణ
సరుబుజ్జిలి: మండలంలోని తెలికిపెంట పంచాయతీ నిధుల దుర్వినియోగంపై శనివారం నిర్వహించిన విచారణ రసాభాసగా మారింది. పంచాయతీలో 6వ అంశం నుంచి 11వ అంశం వరకు ఖర్చుచేసిన మెటీరియల్కు సంబంధించి రూ.2 లక్షల 70 వేల నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఈ ఏడాది జనవరి 6న పర్వతాలపేటకు చెందిన బెవర మల్లేశ్వరరావు కలెక్టర్ గ్రీవెన్స్కు ఫిర్యాదు చేశారు. అదే నెల 31న ఈఓపీఆర్డీ బొడ్డేపల్లి రామారావు పంచాయతీలో విచారణ నిర్వహించి, ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. ఆ నివేదికల ప్రకారం సచివాలయంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు డీఎల్పీఓ ఐ.వి.రమణ శనివారం గ్రామానికి వచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చోటు చేసుకున్నాయి. వ్యక్తిగత దూషణలు, తిట్ల దండకంతో సభలో గందరగోళ స్థితి ఏర్పడింది. దీంతో అధికారులు తలోదిక్కుకు పరుగులు తీశారు. ఒకానొక దశలో ఇరువర్గాలు కొట్లాటకు దిగే పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యాయి. ఇంతలో అధికారులు కల్పించుకుని ఇరువర్గాలు సహకరిస్తేనే విచారణ నిర్వహిస్తామని చెప్పి బయటకు వచ్చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని డీఎల్పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డీ రామారావు, సర్పంచ్ నందివాడ రాజ్యలక్ష్మి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. -
అడ్డగోలు పదోన్నతులు!
బీసీ సంక్షేమంలో..శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా బీసీ సంక్షేమ శాఖలో అవినీతి చుక్కలనంటుతోంది. రెండు రోజుల కిందట వసతి గృహ సంక్షేమాధికారులకు పదోన్నతులు కల్పించారు. ఇద్దరు హెచ్డబ్ల్యూఓలకు గ్రేడ్–2 నుంచి గ్రేడ్–1కు ప్రమోషన్ ఇచ్చారు. కానీ సీనియారిటీ పాటించకుండా ఈ పదోన్నతులు కల్పించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు గ్రేడ్–1 పదోన్నతులు ఇచ్చారని కొందరు మండిపడుతున్నారు. వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల ముందే ఈ పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని, వారిపై ఉన్న క్రమశిక్షణ అంశాలను దృష్టిలో పెట్టుకుని పదోన్నతులు కల్పించాలి. కానీ ఈ నిబంధనలేవీ పాటించలేదని తెలుస్తోంది. పదోన్నతులు కల్పించే ముందు సీనియారిటీ జాబితా విడుదల చేయాలి. ఆపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి. ఈ సారి కూడా సీనియారిటీ జాబితాపై నాలుగు అభ్యంతరాలు వచ్చాయి. కానీ వాటిని పట్టించుకోకుండా 2008 నాటి సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు కల్పించారు. ఇది పూర్తిగా నిబంధనలకు వ్యతిరేకమని సిబ్బంది అంటున్నారు. అయితే ఎవరూ పదోన్నతులపై నోరు మెదపడం లేదు. డీబీసీ ఆదేశాల మేరకు అడ్డగోలుగా ఫైలును పెట్టి పదోన్నతులు కల్పించారని ఆరోపించారు. అవుట్ సోర్సింగ్ సంగతేంటి..? ఈ బీసీ సంక్షేమంలో ఆరు కారుణ్య నియామకాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కలెక్టర్ అనుమతి ఇచ్చారు. ఈ ఫైల్కి సంబంధించిన అన్ని ప్రక్రియలు ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పూర్తయ్యాయి. అయితే కావాలనే జాప్యం చేశారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ నియామకాలు చేయలేదు. ఎన్నికల కోడ్ పూర్తయి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ నియామకాలు జరగలేదు. దీంతో వారు రోజూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మంత్రి సిఫార్సులు చేయించుకుని వచ్చినా జిల్లా అధికారి కనికరించడం లేదు. కారుణ్యంలో కూడా కాసులు దండుకునే స్థాయికి దిగజారిపోయారని సిబ్బంది అంటున్నారు. పదోన్నతుల్లో చేతివాటం గ్రేడ్–2 హెచ్డబ్ల్యూఓ నుంచి గ్రేడ్–1 వసతి గృహ సంక్షేమాధికారులుగా పదోన్నతులు పొందేందుకు రూ.లక్షల్లో చేతులు మారినట్లు ఆ శాఖ సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఒక్కో పదోన్నతిపై రూ.లక్ష వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ పదోన్నతులు పొందిన వారిలో ఒకరు ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. అంతే కాకుండా సంఘ నాయకులుగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నందునే ప్రమోషన్ వచ్చిందని మిగిలిన అధికారులు చెబుతున్నారు. సీనియారిటీ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమోషన్లలో అవకతవకలు, అవినీతి వ్యవహారాలు, అడ్డగోలు పనితీరు వంటివి బీసీ సంక్షేమ శాఖకు పరిపాటిగా మారిందనే అపవాదు ఉంది. జిల్లాకు చెందిన మంత్రి పేరు చెప్పి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు పదవుల్లో ఉన్నా వారి పేరును వాడుకుని కలెక్టర్ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీనియారిటీ జాబితాలను పక్కన పెట్టిన వైనం నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్ణయాలు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
పాతపట్నం: పాతపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో కాకితోట వద్ద శనివారం ఉదయం గుణుపూర్ నుంచి పూరీ వెళుతున్న రైలు ఢీకొని పాతపట్నం మేజర్ పంచాయతీ శివశంకర్ ఒకటో వీధికి చెందిన బోయిన కామేశ్వరరావు(57) మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ తెలిపారు. ఈయన పాతపట్నం ఆల్ఆంధ్ర రోడ్డు కూడలిలో పకోడి బండి నడుపుతూ జీవనం సాగించేవాడు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమర్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్ఐ తెలిపారు. కామేశ్వరరావుకు భార్య బోయిన రవణమ్మ, కుమారుడు సంతోష్కుమార్ ఉన్నారు. మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: కల్లేపల్లి గ్రామంలో కొయ్యి తాతారావు (66) అనే వ్యక్తి శనివారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన విశాఖపట్నంలో కూలి పనులు చేసుకుంటూ కుటుంబంతో ఉంటున్నాడు. ఈ నెల 1న పెన్షన్ తీసుకునేందుకు స్వగ్రామానికి వచ్చాడు. మద్యానికి బానిస కావడం, అనారోగ్య సమస్యలు ఉండటంతో మన స్థాపం చెంది పక్కనే గల తోటలోకి వెళ్లి లుంగీతో ఉరివేసుకున్నాడు. అటుగా వెళ్తున్న ఉపాధి వేతనదారులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. తాతారావుకు భార్య పార్వతి, కుమార్తె ఉన్నారు. పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సీహెచ్ఓల సమస్యలు పట్టవా?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గ్రామీణ ప్రాంతాల్లో ఎంతోమంది పేద ప్రజలకు వైద్యసేవలందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించమంటే కూటమి ప్రభుత్వం కనీసం కన్నెత్తి చూడకపోవడం బాధాకరమని వైఎస్సార్సీపీ నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎం.వి.పద్మావతి అన్నారు. కొన్ని రోజులుగా మండుటెండలో ర్యాలీలు, ధర్నాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. శ్రీకాకుళం నగరంలో మహాత్మాజ్యోతిరావుపూలే పార్కు వద్ద జరుగుతున్న ధర్నా వద్దకు వెళ్లి మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సీహెచ్ఓలు రెండేళ్లుగా జీతభత్యాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఆరేళ్లు దాటిన సీహెచ్ఓలను క్రమబద్ధీకరించాలన్న జీవోను వెంటనే అమలుజేయాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ చేయాలని కోరారు. పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్ధీకరించాలని, ఈపీఎఫ్ ఓను పునరుద్ధరించాలని, క్లీనిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఉషారాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి, జిల్లా కో–ఆర్డినేటర్ సీహెచ్ రాజీవ్, జి.రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం
గార: ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. శనివారం అంపోలు జిల్లా జైలును ఆయన సందర్శించారు. ముద్దాయిల ఆరోగ్య పరిస్థితి, వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆర్థిక స్థోమత లేనివారికి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆసరాగా నిలుస్తుందన్నారు. ఆయనతో పాటు న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, జైలు సిబ్బంది ఉన్నారు. జనావాసాల్లోకి జింక ఇచ్ఛాపురం : ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ సమీపంలోని సూదికొండ, పీర్లకొండ మధ్య ప్రాంతంలో సంచరిస్తున్న జింకల సమూహం నుంచి ఓ జింక దారి తప్పి జనావాసాల్లోకి చొరబడింది. బంగ్లారోడ్డులోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఉండిపోయింది. స్థానికులు గుర్తించి కమిషనర్ ఎన్.రమేష్కు సమాచారం అందించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ భానుమూర్తికి కమిషనర్ సమాచారమివ్వగా సిబ్బంది వచ్చి జింకను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఇంతలో పొదల్లోకి వెళ్లిపోవడంతో అందరూ వెనుదిరిగారు. ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా బుక్కూరు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ కార్యదర్శిగా బుక్కూరు ఉమమామహేశ్వరరావును నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంలకు కృతజ్ఞతలు తెలిపారు. సెలవుల్లోనే బదిలీలు పూర్తిచేయాలి శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేయాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్వీ రమణమూర్తి, జి.రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. మే 31 నాటికి అన్ని కేటగిరీల టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని, జూన్ 5 తర్వాత స్కూల్ రెడీనెస్ ప్రోగ్రాం ప్రారంభమవుతుందని గుర్తుచేశారు. అప్పటికే నూతన ఉపాధ్యాయులు పాఠశాలలో జాయినైతే ఎన్రోల్మెంట్ డ్రైవ్ నూతనోత్సాహంతో చేపట్టడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. పాఠశాల పని దినాల్లో బదిలీలు జరగడం వల్ల ఉపాధ్యాయులు.. విద్యార్థుల మీద దృష్టిపెట్టే విషయంలో కొంత సతమతమవుతారని విషయాన్ని అధికారులు మర్చిపోవద్దన్నారు. లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు నందిగాం: మండలంలోని ఆకుల రఘునాథపురం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం వేకువజామున లారీ బోల్తా పడిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. నందిగాం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కటక్ నుంచి రైలు బోల్టు, నట్లు లోడ్తో వచ్చిన లారీ ఆకుల రఘునాథపురం వద్దకు వచ్చే సరికి బస్ ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అజమ్, క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్లీనర్ ఫిర్యాదు మేరకు ఎస్సై షేక్ మహమ్మద్ అలీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాలు శ్రీకాకుళం అర్బన్/ఎచ్చెర్ల: గ్రంథాలయాల్లో వేసవి శిక్షణా శిబిరాలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం హిందీ పండిట్ రాజశేఖర్, గణిత ఉపాధ్యాయుడు జగదీష్ చిన్నారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. బలగ హడ్కో కాలనీ గ్రంథాలయంలో లైబ్రేరియన్ పి.ఉగ్రసేన ఆధ్వర్యంలో పిల్లలకు నీతి కథలు చెప్పారు. లావేరు శాఖా గ్రంథాలయంలో రిసోర్స్పర్సన్ పి.పద్మావతి మాట్లాడుతూ అతిగా సెల్ఫోన్ వినియోగిస్తే కలిగే అనర్థాలను వివరించారు. -
టీచర్లకు ఆర్జిత సెలవులు మంజూరుచేయాలి
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇటీవల వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వేసవి సెలవుల్లో సైతం హెచ్ఎంలు, ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి స్వచ్ఛందంగా పనిచేస్తున్న నేపథ్యంలో వారందరికీ ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.రవి, ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4.30 వరకు పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదన్నారు. విద్యార్థుల మానసిక స్థితి, మండే ఎండలు, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యాశాఖ మార్గదర్శకాలు ప్రతిబంధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటుసారా స్థావరాలపై విస్తృత దాడులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లావ్యాప్తంగా నాటుసారా స్థావరాలెక్కడ ఉన్నా విస్తృతంగా దాడులు జరిపి అరికట్టాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (డీసీ) దోసకాయల శ్రీకాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి జిల్లాలో గల స్టేషన్ ఆఫీసర్స్, ఇన్స్పెక్ట ర్లు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో 80 అడుగుల రో డ్డు సమీప ఎకై ్సజ్ కార్యాలయంలో డీసీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 110 సారా గుర్తింపు గ్రామాలను సారా రహిత గ్రామాలుగా మార్చాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 212 ఐడీ కేసులు నమోదై 162 మందిని అరెస్టు చేసి 2231 లీటర్ల సారా, ఏడు వాహనాలను స్వాధీనపర్చుకున్నామన్నారు. 6735 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశామన్నారు. అక్రమంగా మద్యం విక్రయించేవారిపై 874 కేసులు నమోదు చేసి అంతేమందిని అరెస్టు చేశామని తెలిపారు. సమావేశంలో సంబంధిత శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, జిల్లా అధికారి తిరుపతినాయుడు, అధికారులు పాల్గొన్నారు. ఎన్సీఈఆర్టీ అవార్డుకు ప్రాజెక్టు ఎంపిక కంచిలి: మండలంలోని చొట్రాయిపురం ప్రాథమి క పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, గణిత అవధాని మడ్డు తిరుపతిరావు రూపొందించిన గణిత ప్రాజెక్టు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎన్సీఈఆర్టీ)వారు నిర్వహించిన అవార్డుకు ఎంపికై ంది. ఈ మేరకు ఆయనకు ఎన్సీఈఆర్టీ నుంచి సమాచారం వచ్చిందని ఆయన శనివారం ఓ ప్రకట నలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ వారు జనవరి 13న జాతీయ గణిత విద్యా సమావేశాల నిర్వహణ సందర్భంగా దేశవ్యాప్తంగా గణిత ప్రాజెక్టులను ఆహ్వానించారు. అందులో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ‘గణిత ప్రాథమిక కార్యకలాపాల సన్నాహక దశలో విద్యార్థుల పనితీరు అంచనా వేయటానికి బోర్డు గేమ్ ప్రయోగం’ అనే ప్రాజెక్టుకు రూపకల్పన చేశా రు. దేశవ్యాప్తంగా 105 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో మన రాష్ట్రం నుంచి 4 మాత్రమే ఉన్నాయి. అందులో తిరుపతిరావు ప్రాజెక్టు చోటు సంపాదించుకోవడం విశేషం. శ్రామికులే దేశానికి వెన్నెముక శ్రీకాకుళం పాతబస్టాండ్: శ్రామికులే దేశానికి వెన్నెముక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్లో శనివారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై వివరించి, న్యాయ సహా యం అందించాల్సిన విధానాలను తెలియజేశారు. కార్మికులు తమ చెమటతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఆయన అన్నారు. 1886 మే 1న అమెరికాలో ఎనిమిది గంటల పనిది నం కోసం కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని, షికాగోలో హే మార్కెట్ కాల్పులను గుర్తుచేశారు. ఈ చరిత్రను యువతకి తెలియజేసి కా ర్మికుల హక్కులను గుర్తించాలన్నారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, డి ప్యూటీ లేబర్ కమిషనర్ కె.అజయ్ కార్తికేయ, తదితరులు పాల్గొన్నారు. -
వంతెనల నిర్మాణానికి శంకుస్థాపన
ఇచ్ఛాపురం రూరల్/సోంపేట: బూర్జపాడు నుంచి డొంకూరు మత్స్యకార గ్రామం మధ్య రెండు నూతన వంతెనల నిర్మాణానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు శనివారం శంకుస్థాపన చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బూర్జపాడు నుంచి పెద్ద లక్ష్మీపురం వరకు 5.45 కిలోమీటర్ల పొడవున రూ.486 లక్షలతో ప్రధానమంత్రి సడక్ యోజన కింద తారురోడ్డు నిర్మాణం చేపట్టారు. అదే సమయంలో పీఎంజీఎస్వై పథకం ద్వారా డొంకూరు ఉన్నత పాఠశాల వద్ద నూతన వంతెన నిర్మాణానికి రూ.6కోట్ల 30 లక్షలు, బూర్జపాడు ఉప్పుటేరు(కాజ్వే)పై రూ.10 కోట్ల 50 లక్షలతో మరో వంతెన నిర్మాణానికి రెండు సార్లు టెండర్లు వేసినప్పటికీ కంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం, అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అదే నిధులతో శనివారం వంతెన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జిల్లాలో 110 మత్స్యకార గ్రామాల వద్ద మత్స్య సాగర పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం రూ.4కోట్లు నిధులు మంజూరు చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పండ్కర్ తదితరులు పాల్గొన్నారు. సోంపేట మండలంలోని కొండిరేవు వంతెన, మహేంద్ర తనయ వంతెనలకు కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎమ్మెల్యే బి.అశోక్ శనివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్, సర్పంచ్ యర్ర రజని, బారువ గ్రామస్తులు పాల్గొన్నారు. -
సాగునీటి కోసం చలో కలెక్టరేట్
కాశీబుగ్గ: పలాస మండలం రేగులపాడు వద్ద చేపట్టిన ఆఫ్షోర్ రిజర్వాయర్ను త్వరతగతిన పూర్తి చేసి శివారు భూములకు సాగునీరు, పలాస కాశీబుగ్గ జంట పట్టణాలకు తాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనారి మోహనరరావు డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి శివారు భూములకు సాగునీరు అందించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7న కలెక్టర్ వద్ద చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు. శనివారం కాశీబుగ్గ బస్టాండ్ వద్ద జీపుజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములను త్యాగం చేసిన రైతుల నిర్వాసితుల కాలనీల్లో నేటికీ మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం దారుణమన్నారు. గొట్టాబ్యారేజ్ ఆధునీకరణకు రూ.1600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వంశధార నదిని బాహుదా నదితో అనుసంధానం చేసి ఇచ్ఛాపురం వరకు సాగునీరు అందించాలని కోరారు. మందస మండలం గోపాలసాగరాన్ని మినీ రిజర్వాయర్ చేసి మహేంద్రగిరి నుంచి వచ్చిన నీటిని గోపాలసాగరానికి మళ్లించాలన్నారు. నారాయణపురం ఆనకట్ట ఆధునీకరణ చేసి కుడి, ఎడమ కాలువల ద్వారా శివారు భూములకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. మహాధర్నాలో రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదరులు వి.రమణ, వి.పసాద్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.భాస్కరరావు, వాసు, సూరయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమ్మర్ క్రికెట్ కోచింగ్కు వేళాయె
● రేపటి నుంచి జిల్లాలో క్రికెట్ కోచింగ్ క్యాంప్లు మొదలు శ్రీకాకుళం న్యూకాలనీ: సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపులకు రంగం సిద్ధమైంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సూచనల మేరకు జిల్లా క్రికెట్ సంఘం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 5వ తేదీ నుంచి సమ్మర్ కోచింగ్ క్యాంప్లకు నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 31వ తేదీ వరకు జరిగే ఈ శిక్షణ శిబిరాల్లో క్రికెట్పై ఆసక్తి కలిగిన బాలబాలికలు ఎవరైనా హాజరుకావచ్చని జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. 5 కేంద్రాల్లో శిక్షణ.. జిల్లాలో శ్రీకాకుళం జిల్లా కేంద్రం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాలతోపాటు కళింగపట్నం, నరసన్నపేట, టెక్కలి, ఇచ్ఛాపురం సబ్సెంటర్లలో ఈ సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్లను నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రతిరోజు ఉద యం 6 ఉదయం 8.30 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 నుంచి 6.30 వరకు సబ్ సెంటర్లలో నిష్ణాతులైన కోచ్లు శిక్షణ ను అందించనున్నారు. శిక్షణకు హాజరయ్యే చిన్నారులు, బాలబాలికలకు ఫిట్నెస్తోపాటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ తదితర విభాగాల్లో తర్ఫీదును అందిస్తారు. తల్లిదండ్రులు వారి పిల్లల జనన ధ్రువీకరణ పత్రాలని సబ్సెంటర్ల కోచ్లకు అందజేయాలని జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు పీవైఎన్ శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా షేక్, మెంటార్ ఇలియాస్ మహ్మద్, కోశాధికారి మదీనా శైలానీ పేర్కొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్రీడాకారులకు జూన్ ఒకటో తేదీన ఆయా సబ్సెంటర్లలో సర్టిఫికెట్లను అందజేయనున్నట్టు వారు వెల్లడించారు. -
గంధపు చెట్లు నరికివేతపై ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ సమీప జామియా మసీదు వద్ద గంధం చెట్ల నరికివేతకు అంశం శుక్రవారం వెలుగులోకి వచ్చిన సంగతి విధితమే. శుక్రవారం నాటికి ఒక చెట్టునే తరలించారనుకున్న మత పెద్దలు శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అటవీశాఖ అధికారులతో కలసి మొత్తం 12 ఎకరాలను కలియదిరగ్గా మరో మూడు చెట్లు నరికివేతకు గురై మాయమైనట్లు నిర్ధారణకొచ్చారు. ఒకటో పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచి పోలీసులు సైతం శనివారం ఈ ఘటనపై ఆరా తీశారు. ఎస్ఐ ఎం.హరికృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మొత్తం 12 ఎకరాల్లో కొబ్బరి, టేకు, గంధం, ఇతర చెట్లు అనేకమున్నాయని, గంధం చెట్లు నరికివేయడం ఘోరమని, చివరిసారిగా కొబ్బరి, టేకు చెట్లు ఫలసాయాన్ని వేలం పాట ద్వారా దక్కించుకున్న సర్ఫరాజ్ భయ్యాపై అనుమానాలున్నాయని న్యాయవాది ఎం.అసదుల్లా, ఎం.ఏ.రఫీ, జాఫర్ ఘోరీ, బాషా, రవూఫ్ ఖాన్, ఆర్.టి.ఖాన్, అమానుల్లా, ఢిల్లీఖాన్, షేక్ మదీనాలు అనుమానం వ్యక్తం చేశారు. అటవీశాఖ, పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్ సాధిక్ మాట్లాడుతూ రంజాన్తో పాత కమిటీ కాలం ముగియడంతో ప్రస్తుతం తానే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాని, శుక్రవారం సమాచారం మత పెద్దల ద్వారా చేరిందని, శనివారం నాలుగు చెట్లు పోయినట్లు లిఖితపూర్వక ఫిర్యాదు అందడంతో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వక్ఫ్బోర్డు పరంగా కేసు నమోదు చేస్తామన్నారు. అటవీశాఖ శ్రీకాకుళం ఇన్స్పెక్టర్ సాయిరాం మహాపాత్రో మాట్లాడుతూ రంపంతో తొలగించిన ఆనవాళ్లున్నాయని, వాటిని శ్రీగంధం చెట్లుగా నిర్ధారించామన్నారు. వన్టౌన్ ఎస్ఐ ఎం.హరికృష్ణ మాట్లాడుతూ ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని చెప్పారు. -
గ్రావెల్ విధ్వంసం
● సంచాం గ్రావెల్ కొండను పరిశీలించిన వీఆర్ఓలు ● సాక్షిలో కథనం వచ్చినా ఆగని తవ్వకాలు ● అనుమతులు లేవని చెప్పి నిలువరించి యంత్రాలను పంపించేసిన వైనం ● డంపింగ్ ప్రాంతానికి వెళ్లే సాహసం చేయని అధికారులు అధికారుల సాక్షిగా అక్రమం బట్టబయలైంది. సాక్షిలో వార్త ప్రచురితమై జనమంతా చర్చించుకుంటున్నా గ్రావెల్ అక్రమార్కులు మాత్రం తవ్వకాలను ఆపలేదు. వీఆర్ఓలు వెళ్లి అనుమతులు లేవని చెప్పి యంత్రాలను నిలువరిస్తే గానీ.. అక్కడ అక్రమ తవ్వకాలు ఆగలేదు. రణస్థలం మండలంలోని సంచాం, అర్జునవలస పరిధిలోని గ్రావెల్ తవ్వకాల విధ్వంసం వాస్తవమేనని అధికారుల పరిశీలనతో స్పష్టమైంది. రణస్థలం: సంచాం, అర్జునవలస రెవెన్యూ పరిధిలోని గల సంచాం కొండలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపే ప్రాంతాన్ని సంచాం, అర్జునవలస వీఆర్ఓలు డీవీ మురళీధర్, ఎ.చిన్నారావు శనివారం పరిశీలించారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు గత నాలుగు రోజులుగా అక్రమంగా వందలాది లారీలతో గ్రావెల్ తరలించుకుపోయిన వైనంపై శనివారం ‘కొండను చెరబట్టి గ్రావెల్ కొల్లగొట్టి’ అనే శీర్షికతో ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు సంచాం కొండలో తవ్వకాలు జరిపిన ప్రాంతానికి వెళ్లారు. సాక్షిలో వార్త వచ్చినప్పటికి ఇంకా తవ్వకాలు జరుపుతుండడం చూసి అధికారులే ఆశ్చర్యపోయారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యం తవ్వకాలు జరపడమేమిటని దగ్గరకు వెళ్లి పనులు ఆపి పొక్లెయినర్లు, లారీలను అక్కడి నుంచి పంపించేశారు. అధికారులు కొండను పరిశీలిస్తే చాలా ఎక్కువగానే తవ్వకాలు జరిపినట్లు గుర్తించారు. ఈ నివేదికను ఉన్నతాధికారులు అందజేస్తామని, ప్రస్తుతం తహసీల్దార్ ఎన్.ప్రసాద్ అందుబాటులో లేరని వీఆర్ఓలు తెలిపారు. డంపింగ్ ప్రాంతానికి వెళ్లలేదు.. సుమారు వందలాది లోడ్లు గ్రావెల్ తరలించి డంపింగ్ చేసిన ఎన్ఈఆర్ స్కూల్ ప్రాంతానికి అధికారులు పరిశీలనకు వెళ్లకపోవడం కొసమెరుపు. ఎవరైనా సామాన్యుడు ఒక ట్రాక్టర్ గ్రావెల్ పట్టుకుని వెళితేనే అధికారులు ఎన్నో రూల్స్ మాట్లాడి బండిని సీజ్ చేస్తారు. సాక్షాత్తు ఎమ్మెల్యే ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తుంటే అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. దీనికి తోడు అధికారులు పరిశీలనకు వెళ్లినప్పుడు లారీలు, పొక్లెయినర్లు అక్కడే ఉన్నా సీజ్ చేసే సాహసం చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
శ్రీకాకుళం
బీసీ సంక్షేమ శాఖలో..బీసీ సంక్షేమ శాఖలో అవినీతికి హద్దు లేకుండాపోతోంది. పదోన్నతులపై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. –IIలోఎక్కడో ఊరవతల ఓ మర్రి చెట్టు.. ఎండన పడి తిరిగే వారిని కాసేపు కూర్చోండర్రా.. అని పిలుస్తూ ఉంటుంది. ఊరి మధ్యన రావి చెట్టు.. ఎర్రటి ఎండకు ఆకులతో గొడుగు పట్టి తన ఒడిలో కూర్చున్న వారికి ప్రాణ వాయువు అందిస్తూ ఉంటుంది. ఇంటివెనుక జామ చెట్టు.. తీయటి ఫలాలు అందించడంతో పాటు సందె వేళ కింద కూర్చుకుంటే చల్లటి గాలిని కానుకగా ఇస్తుంది. అందుకే వేసవిలో చెట్టుతో జట్టు కట్టడం అత్యవసరం. వేలానికి వేళ కాలేదా..? శ్రీముఖలింగం భూముల కౌలువేలం జరగడం లేదు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. –IIలోఆదివారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2025కూల్ స్పాట్గండ్రేడులోని మర్రి చెట్టు కింద కూర్చున్న ప్రజలు ●విశాలమైన ప్రాంగణం మాది గండ్రేడు. శివారు గ్రామం. నాగావళి నది ఒడ్డున ఉంది. నది నుంచి వచ్చే చల్లని గాలి మర్రిచెట్టు కిందకు వచ్చి మరింత కూల్గా మారిపోతుంది. దీంతో పెద్దలు ఇక్కడే నిద్రపోయేందుకు, సేద దీరేందుకు వస్తుంటారు. చిన్నపిల్లలు ఆడుకునేందుకు అనువుగా చెట్టు నీడ ఉంది. ఈ చెట్టు మా గ్రామానికి వరం. – చింతాడ సూర్యారావు, గండ్రేడు, పొందూరు మండలం ●ఎండ నుంచి ఉపశమనం మాది మలకాం గ్రామం. చి న్న పల్లెటూరు. వేసవి కాలం వచ్చిందంటే గ్రామంలోని ప్రజలు ఈ మర్రి చెట్టుకిందకే కూర్చునేందుకు వస్తుంటారు. ఇక్కడే సేద దీరుతుంటారు. మర్రిచెట్టు వయస్సు సుమారు 200 ఏళ్లు ఉంటుంది. బయట నుంచి వచ్చేవారంతా కచ్చితంగా ఇక్కడ కూర్చొని ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. – జాడ అసిరినాయుడు, మలకాం, పొందూరు మండలం పొందూరు: పల్లెటూరు.. సందె వేళ.. మర్రి చెట్టు కింద మకాం.. కాసిన్ని కబుర్లు.. కావాల్సినంత చల్లని గాలి. అంతే వేసవి ఇట్టే గడిచిపోతుంది. చుట్టూ ఎండ తాండవం చేస్తున్నా చెట్టు నీడలో మాత్రం ఏసీ పెట్టినట్టే చల్లటి గాలి వీస్తుంది. అదే ఇప్పుడు పల్లెవాసులను రక్షిస్తోంది. పొందూరు మండలంలోని దళ్లవలస, కోటిపల్లి, మజ్జిలిపేట, గండ్రేడు, మలకాం, వీఆర్ గూడెం గ్రామాల్లో పెద్ద మర్రి చెట్లు వేసవి విడిదులుగా దర్శనమిస్తున్నాయి. ఈ చెట్లు సుమారు 60 ఏళ్ల నుంచి 200 ఏళ్ల వయస్సు ఉన్నవి. విశాలంగా వ్యాపించిన ఊడలతో నీడ అల్లుకుంటుంది. దీంతో ఎండకు దొరకకుండా పిల్లలు, పెద్దలు వాటి కిందనే సేద దీరుతున్నారు. మధ్యాహ్న సమయాల్లో చెట్ల కిందకు వచ్చి ముచ్చటించుకునేవారు కొందరు, నిద్రపోయే వారు మరికొందరు, ఆడుకునే పిల్లలు, వలస కూలీలు అక్కడే ఉంటున్నారు. న్యూస్రీల్ పచ్చని చెట్లే వేసవి విడిదులు పల్లెటూళ్లలో వృక్షాల కిందనే సేద దీరుతున్న ప్రజలు -
కష్టార్జితం కాలిపోయింది..
కొత్తూరు: కష్టార్జితం కాలిపోయింది. కుమార్తె పెళ్లి కోసం దాచిపెట్టిన నగదు, బంగారం బూడిదైంది. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రం కొత్తూరులోని కొత్తపేట కాలనీలో శుక్రువారం కొగాన పద్మావతి శుక్రవారం ఉదయం దేవుడి పటం వద్ద దీపం వెలిగించి ఉపాధి పనికి వెళ్లిపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు గమనించి అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే పద్మావతి కుమార్తె వివాహం కోసం ఇనుప పెట్టెలో దాచిన రూ. 2.80 లక్షల నోట్లు కాలిబూడిదయ్యాయి. తులంన్నర బంగారం, పిల్లల విలువైన పత్రాలు, దుస్తులు, నిత్యావసర సరుకులు కాలిపోయాయి. సర్వం కోల్పోయిన పద్మావతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కొత్తూరుకు చెందిన గోగుల చిట్టిబాబు బాధిత కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం కుమార్తె వివాహం కోసం దాచిన రూ.2.80 లక్షల నగదు బూడిద -
గారలో వైద్య శిబిరం
గార: మండల కేంద్రం గార గ్రామంలోని సెగిడివీధిలో పలువురికి విషజ్వరాలు సోకడంతో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ‘గార గ్రామంలో విష జ్వరాలు’ శీర్షికన సాక్షిలో వార్త ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో గార పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమ్య, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి రక్తనమూనాలు సేకరించారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి డాక్టర్ సూర్యం గ్రామంలో పర్యటించారు. ప్రస్తుతానికి జ్వరాలు అదుపులోనే ఉన్నాయని, మలేరియా లార్వా ఎక్కడా లేవన్నారు. మరో రెండు రోజుల పాటు వైద్య శిబిరం నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. కొద్ది నెలల క్రితమే ఈ వీధిలో కొత్త పైపులైను వేసి సురక్షితమైన తాగునీరు అందిస్తున్నామని సర్పంచ్ మార్పు దుర్గాపృథ్వీరాజ్ తెలిపారు. -
ఉచిత శిక్షణతో ఉపాధి
నరసన్నపేట: సేవే పరమావధిగా సత్యసాయి సేవా సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా స్వల్పకాలిక ఉచిత నైపుణ్య శిక్షణలు అందిస్తున్నాయి. నిరుద్యోగ యువతీ యువకులకు, గృహిణులకు వారి ఆసక్తి బట్టి శిక్షణలు ఇస్తూ ఉపాధి అవకాశాలపై నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, కంప్యూటర్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణలు ఇస్తున్నారు. నరసన్నపేట మండలంతో పాటు పరిసర మండలాలకు చెందిన వారూ వచ్చి ఉచిత శిక్షణలకు వినియోగించుకుంటున్నారు. నరసన్నపేటలోని మారుతీనగర్ –1 లో సత్యసాయి మందిరం, చిత్తిరి వీధిలోని సాయి పెద్ద మందిరంలో ఏడాది కాలంగా ఈ స్వల్ప కాలిక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. మారుతీనగర్లో 510 మంది, పెద్దమందిరంలో 260 మంది శిక్షణ పొందారు. కంప్యూటర్ శిక్షణకు మంచి ఆదరణ లబిస్తుంద పెద్ద మందిరం కన్వినర్ నాగేశ్వరరావు చెబుతున్నారు. ఇప్పటికే రూ. 3.5 లక్షలు వెచ్చించి కంప్యూటర్లు, స్క్రీన్ సిద్ధం చేశామన్నారు. సత్యసాయి మందిరాల్లో వివిధ కోర్సుల్లో శిక్షణ నరసన్నపేటలో ఇప్పటివరకు 770 మందికి తర్ఫీదు ఆసక్తి చూపుతున్న మహిళలు -
ఉద్యోగ భద్రత కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ ఆస్పత్రుల్లో పనిచేసే మిడ్ లెవెల్ హెల్త్ అధికారులు సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్కెక్కారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో తొలుత సమావేశం నిర్వహించారు. అక్కడి జ్వోతిరావు పూలే పార్కు వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టరేట్ గేటు వద్ద ధర్నా చేపట్టారు. చిన్నారులు, కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మిడ్వెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్సు అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎం.ఉషారాణి, పి.ఇందుమతి తదితరులు పాల్గొన్నారు. -
16 మంది వైద్య సిబ్బందికి నోటీసులు
నరసన్నపేట: విధులకు ఆలస్యంగా వస్తుండటంపై నరసన్నపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిలో 16 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనుబాబు తెలిపారు. గడిచిన మూడు నెలల్లో పదిరోజులకు మించి ఆలస్యంగా ఎఫ్ఆర్ఎస్ నమోదైనట్లు ఉన్నతాధికారులు గుర్తించారని, వారి ఆదేశాల మేరకు నలుగురు వైద్యులతో పాటు మరో 12 మంది సిబ్బందికి నోటీసులు ఇచ్చామన్నారు. శుక్రవారం వారి నుంచి వివరణ తీసుకున్నామని అన్నారు. ఇదే పరిస్థితి పునరావృతమైతే అధికారుల ఆదేశాల మేరకు ఆలస్యమైన రోజు లను సెలవు దినాలుగా మార్చుతామని శ్రీనుబాబు తెలిపారు. సాగునీటి సమస్యలు పరిష్కరించాలి ఎచ్చెర్ల క్యాంపస్: సాగునీటి సమస్యలు కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాలు తప్పవని ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు ముర్రాపు సూర్యనారాయణ అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సాగునీటి కాలువలు, ప్రాజెక్టుల సందర్శనకు పూడివలస కూడలిలో జీపు యాత్రను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్ల మండలంలో నారాయణపురం కుడి కాలువ కింద గత ఖరీఫ్లో పంటలు రైతులు కోల్పోయారని, ఈ ఏడాదైనా మరమ్మతులు నిర్వహించి సాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎచ్చెర్ల నియోజక వర్గంలోని తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టు కింద సైతం సాగునీటి కష్టాలు ఉన్నాయని తెలిపారు. వంశధార, నాగావళి నధుల ఆధారంగా ఉన్న ప్రా జెక్టుల మరమ్మతులు నిర్వహించాలని చెప్పా రు. తక్కువ కేటాయింపులు రైతులకు శాపంగా మారుతున్నాయని అన్నారు. సాగునీటి సమస్యలపై కలెక్టర్ కార్యాలయం ముందు 7వ తేదీ ధర్నా చేస్తామన్నారు. రైతు సంఘం ప్రతినిధులు పొందూరు చంద్రరావు, కె. మోహనరావు, విశ్రాంత ప్రిన్సిపాల్ కొత్తకోట అప్పారావు, వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు, భవిరి కృష్ణమూర్తి, స్థానిక సర్పంచ్ జరుగుళ్ల కృష్ణారావు, కొత్తకోట అచ్యుతరావు పాల్గొన్నారు. -
మళ్లీ బీచ్ ఫెస్టివల్
సోంపేట: బారువ తీరం మరోసారి బీచ్ ఫెస్టివల్కు సిద్ధమైంది. గత నెల 18, 19 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే పర్యాటకులకు వసతుల కల్పనలో నిర్వాహకులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నెలలో మరో రెండు రోజులు బీచ్ ఫెిస్టివల్ నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. అయితే బారువ తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. పర్యాటకులు సేద తీరేందుకు టెంట్లు వేయాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తాగునీటి సరఫరా కూడా ఏర్పా టు చేయలేదని గుర్తు చేశారు. ట్రాఫిక్, విద్యుత్ కష్టాలు ఏప్రిల్లో బీచ్ ఫెస్టివల్కు వచ్చిన పర్యాటకులను ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వేధించింది. బారువ ప్రధాన రహదారి వద్దకు చేరుకోవడానికి గంటల సమయం పట్టింది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాల్సి ఉంది. సాయంత్రం అయితే బారువ తీర ప్రాంతం నుంచి బారువ కొత్తూరు గ్రామం వరకు విద్యుత్ వీధి దీపాలు లేకపోవడంతో పర్యాటకులు చీకటిలో ఇబ్బందులు పడ్డారు. ఏర్పాట్ల పరిశీలన.. బీచ్ ఫెస్టివల్పై స్థానిక అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం బారువ తీరంలో ఏర్పాట్లు పరిశీలించారు. ఆదివారం సాంస్కృతిక కార్యక్రమాలు, బోట్ రైడింగ్, బైక్ రైడింగ్, కిడ్స్ ప్లేజోన్, వాటర్ సర్ఫింగ్, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. బారువ తీరంలో నేటి నుంచి ప్రారంభం సమస్యలు పరిష్కరించాలని స్థానికుల విన్నపం -
ఉగ్ర చర్యలను ఖండించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఉగ్రవాదం దేశ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని, అభివృద్ధికి ఆటంకమని డాక్టర్ కె.సుధీర్ అన్నారు. శ్రీకాకుళంలో నగరంలో ప్రజావేదిక ఆధ్వర్యంలో శుక్రవారం ఏడురోడ్లు కూడలి నుంచి కోడిరామ్మూర్తి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. డాక్టర్లు, లాయర్లు, కవులు, రచయితలు, పెన్షనర్లు, జేసీస్, మానవతా, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘం, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతం రంగు పులమకూడదన్నారు. విద్యావేత్తలు డాక్టర్ జామి భీమశంకరం, ప్రొఫెసర్ విష్ణుమూర్తి మాట్లాడుతూ ఉగ్రవాదం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో కేతవరపు శ్రీనివాస్, బి.కృష్ణమూర్తి, ఎం.ప్రభాకరరావు, ఎస్.కిషోర్కుమార్, కె.నాగమణి, ఉషారాణి, ఆర్.మల్లేశ్వరరావు, జోగినాయుడు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
3806
● 23 ఐటీఐలు..సీట్లు ● ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల ● 24 వరకు దరఖాస్తుల స్వీకరణ ఎచ్చెర్ల క్యాంపస్ : పదో తరగతి పూర్తి చేసిన పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చే కోర్సుల్లో ఐటీఐ(ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్) ఒకటి. ఇందులో చేరిన విద్యార్థులకు అప్రెంటీస్ తర్వాత 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభించే అవకాశాలు అధికంగా ఉంటాయి. నైపుణ్యాలు ఆధారంగా విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుంది. మరోవైపు పాలిటెక్నిక్ డిప్లమాలో నేరుగా రెండో ఏడాది లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు లభిస్తాయి. అందుకే ఐటీఐలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. జిల్లాలో మూడు ప్రభుత్వ ఐటీఐలు(శ్రీకాకుళం డీఎల్టీసీ, ఎచ్చెర్ల, పలాస)లలో 760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 20 ప్రైవేట్ ఐటీఐలలో 3056 సీట్లు కలిపి మొత్తం 23 ఐటీఐలలో 3806 సీట్లలో ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. కోర్సులివే.. ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో రెండేళ్లు, సంవత్సరం వ్యవధి గల ట్రేడులు ఉన్నాయి. విద్యార్థుల ఆసక్తి మేరకు ట్రేడ్లు ఎంచుకోవచ్చు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్టస్మ్యాన్ సివిల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, మోటార్ మెకానిక్ రెండేళ్ల ట్రేడులు కాగా, వెల్డర్, కోపా, డీజిల్ మెకానిక్, హార్టికల్చర్ ఏడాది చదవాల్సి ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేకంగా సూయింగ్ టెక్నాలజీ ట్రేడ్లు సైతం అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ.. ఐటీఐ ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ‘ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్లో ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం ప్రభుత్వ ఐటీఐల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. జూన్లో ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు. కౌన్సెలింగ్ సమాచారాన్ని విద్యార్థుల ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు. 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ రోస్టర్, ప్రత్యేక కేటగిరీల రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అర్హులకు నిబంధనల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి 10వ తరగతి తర్వాత ఉపాధికి అవకాశం ఉన్న కోర్సు ఐఐటీ. ఈ కోర్సుల్లో ఎటువంటి ఒత్తిడి ఉండదు. ప్రయోగాలకు, నైపుణ్యాలకు ప్రాధాన్యముంటుంది. అప్రెంటీస్, నైపుణ్యం ఆధారంగా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆసక్తి గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ ఐటీఐలకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలి. – ఎల్.సుధాకరరావు, ప్రవేశాల కన్వీనర్, ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ -
గాయపడిన వ్యక్తి మృతి
ఎచ్చెర్ల క్యాంపస్:కింతలి మిల్లు సమీపంలో జాతీయ రహదారిపై బైక్పై వెళుతున్న బత్తిలి సత్యం (48) మార్చి 2న ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీ కొట్టడంతో గాయపడిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం రిమ్స్లో చేరి చికిత్స పొందుతుండగా.. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం తోటపాలెం పంచాయతీ పెయిలవానిపేట. పోలీసులు కేసు నమోదు చేశారు. స్తంభించిన ఆర్టీఏ సేవలు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని తండేవలసలో ఉప రవాణా శాఖ కార్యాలయంలో శుక్రవారం సేవలు స్తంభించాయి. గురువారం రాత్రి కురిసిన ఈదురుగాలులు, వర్షాలకు ఎక్కడికక్కడే విద్యుత్ వైర్లు, కేబుల్ వైర్లు తెగడంతో సేవలు నిలిచిపోయాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల ఆర్టీఏ సేవలు మొరాయించాయి. దీంతో వివిధ పనుల కోసం వచ్చిన వాహనచోదకులకు నిరీక్షణ తప్పలేదు. -
కిడ్నీ సమస్యతో ఇంటర్ విద్యార్థి మృతి
పొందూరు: మండలంలోని కేసవదాసుపురం గ్రామానికి చెందిన లింగాల కిషోర్(16) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ప్రస్తుతం ఎచ్చెర్లలో ఇంటర్ మొదటి ఏడాది చదువుతున్న కిషోర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు విశాఖలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పూర్తిగా పాడైనట్లు గుర్తించారు. పేద కుటుంబం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయింలేక కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కిషోర్ పదో తరగతి లోలుగు హైస్కూల్లో చదివాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు సుజాత, రాజు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎన్బీడబ్ల్యూ అమలు చేయాలి శ్రీకాకుళం క్రైమ్ : నిందితులపై పెండింగ్ ఉన్న నాన్బెయిల్బుల్ వారెంట్ (ఎన్బీడబ్ల్యూ) త్వరితగతిన అమలు చేయాలనిఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో ప్రాపర్టీ కేసుల్లో పెండింగ్ ఎన్బీడబ్ల్యూ అమలు, చైన్స్నాచింగ్, వాహనాల చోరీ, ఆలయాల్లో దొంగతనాలు తదితర నేరాలపై జూమ్ కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో వంటి కేసుల్లో ఎన్బీడబ్ల్యూ ఉంటే గుర్తించి వారి చిరునామా, ఇతర ఆధారాలను బట్టి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు కోటేశ్వరరావు, నేతాజీ పాల్గొన్నారు. -
మసీదులో గంధంచెట్లు నరికివేత
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని సూర్యమహాల్ కూడలి పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న జామియా మసీదులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు గంధం చెట్లు నరికి తరలించే యత్నం చేశారు. ఈ విషయమై ఇప్పటికే వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్కు మసీదు మౌజన్ (గురువు) ఎస్.కె.మహ్మద్ ఫిర్యాదు చేసినట్లు మత పెద్దలు కె.ఎస్.అమానుల్లా, మరికొందరు చెప్పారు. మసీదులో సుమారు 40 వరకు చిన్నవి, పెద్దవి గంధం చెట్లున్నాయని, శుక్రవారం ఉదయం చెట్లను వాచ్మెన్ నాయుడు దగ్గరుండి ట్రిమ్మింగ్ చేసినట్లు తెలిసిందన్నారు. సాయంత్రం 4 గంటలకు 30 అడుగుల పొడవుండే ఒక గంధం చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు తరలించేశారని అదే వాచ్మెన్ మౌజన్కు చెప్పడంతో ఆయన ఫిర్యాదు చేశారు. ఇంకా లోపల ఎన్ని చెట్లు కొట్టేశారో తెలియాల్సి ఉందన్నారు. గంధం చెట్టు కొమ్మ -
గత ప్రభుత్వంలోనే అనుమతులు
సోంపేట: మండలంలోని తీరప్రాంత మత్స్యకారుల ప్రయాణ సమస్యలు పరిష్కరించడానికి, సోంపేట మండల కేంద్రానికి వేగంగా చేరుకోవడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే చర్యలు తీసుకున్నట్లు ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొండిరేవు వంతెన, మహేంద్రతనయ నదిపై బ్రిడ్జిల నిర్మాణానికి జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, జిల్లా పార్టీ పెద్దలు చొరవతో గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద జీఓ నంబరు–788తో 2023 నంబర్ 23న అనుమతులు వచ్చాయని గుర్తు చేశారు. కొండి రేవు బ్రిడ్జికి రూ.3.45 కోట్లు, మహేంద్రతనయ నది బ్రిడ్జికి రూ.14.60 కోట్లు మంజూరయ్యాయని, టెండర్లు పిలిచే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, అదే జీవోతో ప్రస్తుతం టెండర్లు ఖరారైనట్లు పేర్కొన్నారు. సమస్య పరిష్కరించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుంతుందని ఎంపీపీ స్పష్టం చేశారు. మా పార్టీకి అనుకూలంగా ఉంటేనే పింఛన్ ● ఒంటరి మహిళ పింఛన్ నిలిపివేసిన టీడీపీ నేతలు నరసన్నపేట: ‘మా పార్టీకి అనుకూలంగా ఉండటం లేదు. మాకు వ్యతిరేకంగా ఉంటున్నావు.. మా ప్రభుత్వంలో నీకు ఎందుకు పింఛన్ ఇస్తాం.. నువ్వు మా పార్టీకి అనుకూలంగా ఉంటేనే పింఛను ఇప్పిస్తాం’ అంటూ టీడీపీ నేతలు తన పింఛన్ ఆపేశారని నరసన్నపేట మండలం రావులవలసకు చెందిన వెలమల శకుంతల అనే ఒంటరి మహిళ వాపోయింది. రెండు నెలలుగా పింఛన్ ఇవ్వలేదని, మే నెలలో ఇస్తామని అధికారులు హామీనిచ్చారని, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లగా స్థానిక ఎమ్మెల్యే ఆపమని చెప్పినందునే ఇవ్వలేదని అంటున్నారని కన్నీటిపర్యంతమైంది. ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదలైనా టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పంపిణీ చేయకుండా నిలిపేశారని వాపోయింది. ఈ విషయమై ఎంపీడీఓ మధుసూదనరావు వద్ద ప్రస్తావించగా పింఛన్పై పిర్యాదు వచ్చినందున నోటీసు ఇచ్చి విచారణ చేయించామని, ఒక ఇంట్లోనే కుటుంబంతో నివాసముండటంతో పింఛన్ నిలుపుదల చేశామని చెప్పారు. వివాహిత అనుమానాస్పద మృతి కంచిలి: మండల కేంద్రం కంచిలిలో ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతిచెందింది. గురువారం రాత్రి వరకు మెయిన్రోడ్డులో తమ కుటుంబానికి చెందిన కూరగాయల షాపులో చలాకీగా ఉన్న ఆమె శుక్రవారం ఉదయానికి ఉరికి వేలాడుతూ విగతజీవిగా కనిపించడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. ఈమె భర్త ఉపాధి కోసం వలస వెళ్లడంతో ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటోంది. ఆర్థిక వ్యవహారాలే మృతికి కారణమని తెలుస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో గురువారం అర్ధరాత్రి వరకు ఇంట్లో ఘర్షణ చోటుచేసుకొందని, తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. మృతురాలు కన్నవారు కూడా కంచిలిలోనే ఉంటున్నారు. కాగా, పోలీసులకు సమాచారం ఇవ్వకుండా, భర్త రాకుండానే ఆదరాబాదరాగా అంత్యక్రియలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కంచిలిలో మాయం.. కోయంబత్తూరులో ప్రత్యక్షం కాశీబుగ్గ: కంచిలి గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ బొడ్డేపల్లి ధనలక్ష్మి ఐదు రోజుల కిందట అనుకోకుండా తమిళనాడు వెళ్లే రైలు ఎక్కింది. కోయంబత్తూరులో దిగడంతో అక్కడి స్థానికులు, పోలీసులు చేరదీశారు. ఇంతలో ఆన్లైన్ పోలీసింగ్ వారికి ఆమె ఆచూకీ మ్యాచ్ అవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు కోయంబత్తూరు వెళ్లి శుక్రవారం స్వగ్రామం కంచిలికి తీసుకువచ్చారు. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం రణస్థలం: జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొట్టిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 10.40 గంటల సమయంలో జె.ఆర్.పురం బస్స్టేషన్ సమీపంలో విశాఖపట్నం వైపు నుంచి వస్తున్న లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. లారీ డ్రైవర్ గమనించక 50 మీటర్ల వరకు కారును ఈడ్చుకెళ్లాడు. అదృష్టవశాత్తు కారులో ఉన్న నలుగురికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో ఉన్న నలుగురు విశాఖపట్నం నుంచి జలుమూరు వెళుతున్నారు. ఘటనా స్థలాన్ని ఏఎస్సై ఉమామహేశ్వరరావు పరిశీలించి ట్రాఫిక్ చక్కదిద్దారు. -
అర్ధరాత్రి విధ్వంసం
ఊళ్లన్నీ ఆదమరిచి నిద్దరోతున్న వేళ.. గురువారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఓ వైపు ఉరుములు, మెరుపులతో ఆకాశం భయపెడుతుంటే.. బలంగా వీచిన గాలులు విద్యుత్ స్తంభాలు, చెట్లు, ఇళ్లపైకప్పులను నేల కూల్చాయి. అరటి, మామిడి వంటి పంటలను నాశనం చేశాయి.● అరటి తోటలు ధ్వంసం నరసన్నపేట: ఈదురుగాలులతో కూడిన వర్షానికి అరటి తోటలు ధ్వంసమైపోయాయి. కోమర్తి, మాకివలసల్లో రైతులు బాగా నష్టపోయారు. కోమర్తిలో లబ్బ రాము, లబ్బ శ్రీను, పంచిరెడ్డి సింహాచలం లతో పాటు పలువురు రైతుల అరటి తోటలు పడిపోయాయి. ● గాలి తీవ్రతతో విద్యుత్కు అంతరాయం అరసవల్లి: గురువారం అర్ధరాత్రి తీవ్రమైన గాలు లు జిల్లాపై విరుచుకుపడ్డాయి. ఈ ప్రభావం జిల్లా కేంద్రంతో పాటు డివిజన్లో పలు మండలాల్లో విద్యుత్ సరఫరాపై పడింది. దీంతో అర్ధరాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కూడా పలు చోట్ల విద్యుత్ అంతరాయం వాటిల్లింది. శ్రీకాకుళం, గార, బూర్జ, నరసన్నపేట, ఆమదాలవలస తదితర మండలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. అర్ధరాత్రి గాలుల తీవ్రత కొనసాగడంతో విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరించే వీలు లేకపోయింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి విద్యుత్ శాఖ ఆపరేషన్స్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఈఈ పైడి యోగేశ్వరరావులు రంగంలోకి దిగి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. కాంట్రాక్టర్ ఉంగటి పాపారావు ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్లుగా పంపించి ఎక్కడికక్కడ విద్యుత్ పునరుద్ధరణ పనులను మొదలు పెట్టించారు. దీంతో మ ధ్యాహ్నం సమయానికి విద్యుత్ సరఫరాను పలు ప్రాంతాలకు అందించారు. అయినప్పటికీ శ్రీకాకు ళం రూరల్, గార తదితర మండలాల్లో శుక్రవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ శాఖ పరంగా నష్టాన్ని అంచనాగా రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అలాగే ట్రాన్స్ఫార్మర్లను పరిశీలించి అవసరమైన చోట కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయించారు. ఇదిలావుంటే నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలడంతో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఈఈ యోగేశ్వరరావు స్వయంగా పునరుద్ధరణ పనులను పర్యవేక్షించారు. ● వర్షం, గాలుల బీభత్సం ఎచ్చెర్ల క్యాంపస్: వర్షం, గాలులు గురువారం రాత్రి బీభత్సం సృష్టించాయి. పొన్నాడలో రాము, రవి అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లపై విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. గ్రామస్తులు ఫిర్యాదు చేయగా విద్యుత్ సరఫరా నిలిపివేసి, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. కేశవ రావుపేట శివారులో చీడిఖాన్ చెరువు గట్టుపై ఉన్న అమ్మవారి వేప చెట్టు కూలిపోయింది. మండలంలో జీడి మామిడి, మామిడి పంటకు తీరని నష్టం వాటిల్లింది. విద్యుత్ అంతరాయాలు కలగగా శుక్రవారం సాయంత్రం నాటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. శ్రీకాకుళం డివిజన్లోనే రూ.10 లక్షల వరకు విద్యుత్ నష్టం -
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
పలాస : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను ఆపి వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలని సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు వివిధ ప్రజా సంఘాలతో కలిసి శుక్రవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు దండకారణ్యంలో ఆదివాసీలు సుమారు 400 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టు పార్టీ నాయకులను, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే కార్యక్రమం చేపట్టడం అప్రజాస్వామ్యమన్నారు. కర్రెగుట్ట కొండలను జల్లెడ పడుతున్నారని, అన్నిరకాల భద్రతా బలగాలను ఈ ఆపరేషన్కు వినియోగించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, చాపర వేణు, కొర్రాయి నీలకంఠం, పోతనపల్లి అరుణ, లక్ష్మణరావు, పుచ్చ దుర్యోధనరావు, మద్దిల రామారావు, ఎం.వినోద్, గొరకల బాలకృష్ణ, వంకల పాపయ్య, మామిడి భీమారావు, రాపాక మాధవరావు, జడ్డే అప్పయ్య, పోతనపల్లి కుసుమ, బర్ల గోపి, ఎస్.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
చీడిపూడిలో రేషన్ సరుకుల పంపిణీలో కోత
● గిరిజనులకు అందని ఏప్రిల్ నెల రేషన్ సరుకులు ● స్పందించని అధికారులుసంపాదనలో సగం బియ్యానికే.. మా కుటుంబానికి బియ్యం ఇవ్వకపోవడంతో నా భర్త చేసిన కూలి డబ్బులతో సగం బియ్యం కొనాల్సి వస్తోంది. మా లాంటి వారికి రేషన్ బియ్యం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. – బెజ్జి అరుణ, బాధితురాలు ఊరివారే సాయం చేశారు నేను ఒక్క దాన్నే ఇంట్లో ఉంటాను. ఎలాంటి ఆధారం లేదు. రేషన్ బియ్యంతో నెల మొత్తం గడుస్తుంది. ఇప్పుడు బియ్యం ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నాను. ఊర్లో వాళ్లంతా పిడికెడు బియ్యం సాయం చేస్తున్నారు. – మంగపేట ఆదమ్మ, బాధితురాలు పక్కింటి నుంచి తెచ్చుకుంటున్నాం.. మాకు గత నెల రేషన్ బియ్యం ఇవ్వలేదు. రేషన్ బియ్యం కో సం వేలిముద్రలు తీసుకున్నా రు. అయినా సరుకులు ఇవ్వలేదు. పక్కింటి నుంచి బియ్యం అప్పు తెచ్చుకుని రోజులు గడుపుతున్నాం. – మంగపేట నారాయణరావు టెక్కలి: రేషన్ ఇచ్చేస్తామన్నారు.. అందరి దగ్గరా వేలి ముద్రలు తీసుకున్నారు.. అదిగో ఇదిగో అంటూ నెల గడిపేశారు. ఆఖరికి ఏప్రిల్నెల రేషన్ ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సవరసొర్లిగాం గిరిజన గ్రామంలో సుమారు 200 మంది గిరిజనులకు గత నెల రేషన్ సరుకులు పంపిణీ చేయలేదు. వేలిముద్రలు సైతం తీసుకుని చివరకు రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఆయా కుటుంబాలు అనేక అవస్థలు పడుతున్నాయి. పంచాయతీ పరిధిలో డిపో నంబర్ 791 పరిధిలో సొర్లిగాం, సవరసొర్లిగాం, సన్యాసిపేట, హరిపురం, సతివాడ, బలరాంపు రం తదితర గ్రామాలు ఉన్నాయి. వాటిలో ఒక్క సవర సొర్లిగాం గ్రామంలో 62 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిలో సుమారు 200 మంది జనాభా ఉన్నారు. వారందరికీ ఏప్రిల్లో రేషన్ ఇవ్వలేదు. రెండు రోజుల కిందట ఎండీయూ సిబ్బంది రేషన్ పంపిణీ కోసం వెళ్తే ఏప్రిల్ నెల రేషన్ ఇస్తే తప్ప మే నెల రేషన్ తీసుకోబోమని వారు చెప్పడంతో, తమకేమీ సంబంధం లేనట్లుగా ఆ సిబ్బంది వెళ్లిపోయారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఏప్రిల్, మే నెలల రేషన్ అందించాలని గిరిజనులు కోరుతున్నారు. సారవకోట: మండలంలోని చీడిపూడి గ్రామంలో రేషన్ సరుకుల పంపిణీలో కోత విధిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామ రేషన్ డీలర్ను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలగించారు. అప్పటి నుంచి రేషన్ సరుకులు వీఆర్వో అథంటికేషన్తో ఇస్తున్నారు. అయితే ఏప్రిల్లో లబ్ధిదారులకు రేషన్ సరుకులు ఇవ్వకుండానే లబ్ధిదారులతో బయోమెట్రిక్ వేయించుకున్నారు. మే నెల రేషన్ సరుకులు గురు వారం నుంచి సరఫరా చేస్తున్నారు. అయితే 5 కిలోలు, 10 కిలోలు ఉన్న లబ్ధిదారులకు మాత్రమే పూర్తిస్థాయి సరుకులు ఇస్తున్నారని మిగిలిన వారికి 3 కిలోలు చొప్పున కోత విధిన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని పై వీఆర్ఓ రాపాక లక్ష్మీనారాయణను వివరణ కోరగా అలాట్మెంట్ తక్కువగా వచ్చిందని, అందుకే కోత విధిస్తున్నామని తెలిపారు. -
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల ధర్నా
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో పనిచేస్తున్న కెప్టెన్(డ్రైవర్లు)లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇప్పించాలని ఏపీ తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, ఎం.దశరథరావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో సమయంతో నిమిత్తం లేకుండా సేవలందిస్తున్నామని, తమ సేవలను ప్రభుత్వాలు గుర్తించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు. పదేళ్లుగా అతి తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు వినతిపత్రం అందజేశారు. వీరికి సీఐటీయూ టౌన్ కన్వీనర్ ఆర్.ప్రకాశరావు సంఘీభావం తెలిపారు. నిరసన కార్యక్రమంలో కె.రాజేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, ఎల్.రాంబాబు, పి.వెంకటరావు, ఎం.మణికంఠ, పి.అనంత్, ఎస్.రాజశేఖర్, బి.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్.. ‘సాక్షి’ కదిలించెన్..!
టెక్కలి: వారంతా వృద్ధులు.. నెలనెలా అందే పింఛను వైద్య ఖర్చులకో, మందులకో పనికి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి రెండు నెలలుగా పింఛను పెండింగ్ పెట్టారు.. మే నెలలో అయినా వస్తుందేమోనని ఆశిస్తే నిరాశే ఎదురైంది. వారి బాధను వివరిస్తూ ‘సాక్షి’లో శుక్రవారం కథనం రావడంతో అధికారులు కదిలారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురంలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన 8 మంది వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు ఎలాంటి కారణం లేకుండా మార్చి, ఏప్రిల్ నెలల పింఛన్ ఇవ్వలేదు. తాజాగా వీరికి అధికారులు ఒకేసారి మూడు నెలల పింఛన్ అందజేశారు. గ్రామ సర్పంచ్ సంపతిరావు ధనలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు సంపతిరావు హేమసుందర్రాజు, గ్రామస్థులు కొందరు బాధితుల తరఫున పోరాటం చేశారు. సమస్యను వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్తో కలిసి మండల అధికారులతో పాటు కలెక్టర్, డీఆర్డీఏ పీడీ దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. పింఛన్ జాప్యంపై కమలనాభపురం పంచాయతీ కార్యదర్శి రమేష్, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్కు ఉన్నతాధికారులు మెమోలు జారీ చేసినట్లు కోట»ొమ్మాళి ఈవోపీఆర్డీ ఆనందరావు వెల్లడించారు. ఆనందంగా ఉందివరుసగా మూడో నెల కూడా పింఛన్ రాదని భయాందోళన చెందాం. ఇప్పుడు ఒకేసారి డబ్బులు ఇచ్చారు. ఎంతో ఆనందంగా ఉంది. మా లాంటి వారి కోసం సర్పంచ్, నాయకులు, గ్రామస్థులు అండగా నిలిచారు. – నెయ్యిల లక్ష్మీనారాయణ పింఛన్ కోల్పోతామనే భయం ఉండేది రెండు నెలల పాటు పింఛన్ ఇవ్వలేదు. మూడో నెల కూడా ఇవ్వరేమోనని భయం ఉండేది. సాక్షి కథనానికి అధికారులు స్పందించి పింఛన్లు మంజూరు చేయడం మాకు ఎంతో సంతోషం. – బొడ్డేపల్లి ధర్మారావు సర్పంచ్, ఆమె భర్త పోరాడారు మా గ్రామంలో నాతో పాటు 8 మందికి పింఛన్ ఇవ్వడం ఆపేశారు. మా సర్పంచ్ ధనలక్ష్మిమ, ఆమె భర్త హేమసుందర్రాజు, మరికొంత మంది మా కోసం ఎంతగానో పోరాటం చేశారు. మా ఆవేదనని సాక్షి వెలుగులోకి తెచి్చంది. చివరకు మాకు పింఛన్ డబ్బులు అందాయి. – మొజ్జాడ సూర్యనారాయణ -
పింఛను కట్..
టెక్కలి, శావల్యాపురం: పింఛనో రామచంద్రా అంటూ రాష్ట్రంలో లబ్ధిదారులు వేడుకుంటున్నారు.. నెలవారీగా తమకు రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.. ఎప్పుడు ఇస్తారో తెలియక కలవరపడుతున్నారు.. కూటమి ప్రభుత్వం కట్ చేసేసిందని తెలిసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడ్డాక నాలుగు లక్షల పింఛన్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వృద్ధులు, వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, పల్నాడు జిల్లా శావల్యాపురంలో నిరసనలకు దిగారు.మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలిలోని కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురంలో వృద్ధులు దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణకు రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ నిలిపేశారు. బాధితులు స్థానిక, జిల్లా అధికారుల చుట్టూ తిరిగినా మంజూరు చేయలేదు. గురువారం మే నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ కోసం సచివాలయ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కొందరు గ్రామస్థులు బాధితులకు అండగా నిలిచి అధికారులను నిలదీశారు. గ్రామంలో పింఛన్లు పంపిణీ చేస్తే అందరికీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఏ కారణాలు లేకుండా ఆపేసిన 8 మందికి.. పింఛను తొలగిస్తున్నట్లుగా నోటీసులిచ్చి, మిగతావారికి ఇవ్వాలని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సచివాలయ సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పింఛన్ల పంపిణీ జరగలేదు. చివరకు సచివాలయ సిబ్బంది విషయాన్ని ఈవోపీఆర్డీ ఆనందరావు దృష్టికి తీసుకువెళ్లి వెనుదిరిగారు. గ్రామస్థులు, బాధితులు.. కోటబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఈవోపీఆర్డీ చాంబర్లో బైఠాయించారు. ఆయన డీఆర్డీఏ అధికారులకు నివేదించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తప్పించుకున్నారు. కాగా, రెండు నెలలుగా ఇదే మాట చెబుతున్నారని, ఇప్పుడు మూడో నెల పింఛన్ కూడా ఇవ్వకపోతే శాశ్వతంగా పింఛన్లకు దూరమవుతారంటూ లబ్ధిదారులు వాపోయారు. కాగా, పింఛన్ల వ్యవహారం ప్రారంభమైనప్పటి నుంచి కోటబొమ్మాళి ఎంపీడీవో ఫణీంద్రకుమార్, ఇన్చార్జిగా వ్యవహరించిన సంతబొమ్మాళి ఎంపీడీవో జయంత్ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి రమేష్ తదితరులు మూకుమ్మడిగా సెలవులు పెట్టడం గమనార్హం. సంతబొమ్మాళి మండలం కోటపాడులో లింగూడు ఏకాశి అనే వృద్ధురాలికి పింఛను కట్ చేశారు. గ్రామ టీడీపీ నాయకుడు ఫిర్యాదు చేయడంతో పింఛను నిలిచిపోయింది.రెండు గ్రామాల్లో 31 మందికి పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరులో 22 మందికి, పిచికలపాలెం గ్రామంలో 9 మందికి పింఛను కోత పెట్టారు. దీంతో లబ్ధిదారులు గురువారం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయ సూపరింటెండెంట్కు పిర్యాదు చేశారు. పొట్లూరు, పిచికలపాలెంలో పింఛనుదారుల నుంచి ఫిర్యాదు అందిందని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని శావల్యాపురం ఎంపీడీవో మీనా సీతారామయ్య తెలిపారు.ముగ్గురు ఆడపిల్లల కుటుంబానికి పింఛనే ఆధారంరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాను. మూడు ఆపరేషన్లు చేశారు. ఎలాంటి పనులు చేయలేను. నాకు ముగ్గురు ఆడపిల్లలు. నెలవారీగా వచ్చే రూ.6 వేల పింఛనుతోనే కుటుంబ పోషణ ఆధారపడి ఉంది. అధికారులు స్పందించి పింఛను వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రాథేయపడుతున్నా. – అమృతపూడి అలెగ్జాండర్ (పిచికలపాలెం, పింఛనుదారుడు) -
పోస్టర్ ఆవిష్కరణ
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో డిసెంబర్లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు. ఎమర్జింగ్ మెటిరీయల్స్ ఫర్ టెక్నాలజికల్ అప్లికేషన్స్ అనే అంశంపై రెండు రోజుల పాటు సదస్సు నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం కళాశాలకు చెందిన ఎంబీఏ అధ్యాపకులు కె.వేణుగోపాల్, డి.విష్ణుమూర్తి తదితరులు రాసిన మార్కెటింగ్ స్మాల్ బిజినెస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, అధ్యాపకులు ఎ.ఎస్.సంతోష్కుమార్, బి.వి.రమణ, డి.శ్రీరాములు, ఎం.వి.రత్నమణి, ఎం.రమణయ్య, బి.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.సత్తాచాటిన విద్యార్థినులుగార: జాతీయ టార్గెట్ బాల్ జూనియర్ క్రీడా విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి జట్టు పాల్గొని గోల్డ్ మెడల్ సాధించగా, ఈ జట్టులో గార మండలం శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులు ఆరుగురు ఉన్నారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆగ్రాలోని విద్యా ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన ఈ పోటీల్లో రాష్ట్రస్థాయి జట్టు పాల్గొంది. ఈ జట్టులో శాలిహుండం కేజీబీవీ విద్యార్థినులు పడపాన మాధవి (పదో తరగతి), బచ్చు కీర్తి (పదో తరగతి), నీలాపు సుస్మిత (పదో తరగతి), పరపతి లావణ్య (పదో తరగతి), కోనారి రజిని (పదో తరగతి), చుక్క గాయత్రి (ఇంటర్)లు పాల్గొన్నారు. పీడీ జె.నాగరత్నం శిక్షణలో వీరంతా క్రీడలో పాల్గొని విజయం సాధించడంపై ప్రిన్సిపాల్ ఎస్.లలితకుమారి అభినందించారు.గార గ్రామంలో విషజ్వరాలుగార: మండల కేంద్రం గార గ్రామంలో విష జ్వరాలతో పలువురు బాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజలు జ్వరాలతో ఉన్నా ప్రభుత్వ వైద్య సిబ్బంది కనీసం రోగుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు. దీంతో స్థానికులు ప్రైవేటుగా వైద్యం చేయించుకుంటున్నారు. స్థానిక సిబ్బందికి చెబుతున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అదే సమయంలో తాగునీటిని పరీక్ష చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చంద్రకళను కలిసి తెలియజేశామని, ఇంతవరకు పరీక్షలు కూడా జరపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం నీటి నమూనాలు సేకరించి విశ్లేషణ చేయాలని, రోగాల బారినపడిన ప్రజలకు వైద్యమందించేందుకు తక్షణమే మెడికల్ క్యాంపులు పెట్టాలని కోరుతున్నారు. -
తాగునీరు అందించేందుకు కృషి
మున్సిపాలిటీ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను అధిగమించడానికి ఒడిశాలోని చీకటి ఎమ్మెల్యే మనోరంజన్ ధ్యానో సమంతరని కలిసి బగలట్టి డ్యామ్ నుంచి నీటిని విడిచిపెట్టాలని కోరాము. అదేవిధంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు ఉద్దానం వాటర్ ప్రాజెక్టుని మున్సిపాలిటీ వాటర్ హెడ్వర్క్స్కి అనుసంధానం చేస్తున్నాం. ఈ పనులు మూడు రోజుల్లో పూర్తి చేసి మున్సిపాలిటీ ప్రజలకు నీటిని సరఫరా చేయడానికి కృషి చేస్తున్నాం. – ఎన్.రమేష్, మున్సిపల్ కమిషనర్, ఇచ్ఛాపురం -
స్టైఫండ్తో కూడిన శిక్షణ
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రి బొల్లినేని మెడిస్కిల్స్ నందు డిగ్రీ చదివిన విద్యార్థులకు స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సును నిర్వహిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుకు డిగ్రీ పాసైన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులన్నారు. 18 నుంచి 30 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు. 6 నెలలు శిక్షణ ఉంటుందన్నారు. ఎంపికై నవారికి శిక్షణలో స్టైఫండ్ అందిస్తామన్నారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 79950 13422 నంబర్లను సంప్రదించాలన్నారు. 8న సహకార సంఘ ఎన్నికలు శ్రీకాకుళం (పీఎన్కాలనీ): గొర్రెలు, మేకలు పెంపకందారుల సహకార యూనియన్ లిమిటెడ్ శ్రీకాకుళం ఎన్నికలు ఈనెల 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి డాక్టర్ పి.రామ్మోహన్రావు గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడి కార్యాలయంలో ఎన్నికల రూల్ 22(బీ) పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. చేతు లు పైకెత్తే పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తామన్నా రు. ఎన్నికల అధికారి ప్రకటించిన నోటీసు, ఓటర్ల జాబితా సంయుక్త సంచాలవారి కార్యా లయంలో నోటీసు బోర్డులో పెట్టినట్లు పేర్కొన్నారు. అదేరోజు నామినేషన్ల అనంతరం ఎన్ని కలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎటువంటి సందేహాలున్నా పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నాటుసారాతో పట్టుబడిన వ్యక్తి కవిటి: మండలంలోని బంజుపుట్టుగ తోటల్లో గురువారం మొబైల్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన బంజు శ్యామరావు అనే వ్యక్తిని 100 నాటుసారా ప్యాకెట్లతో పట్టుకున్నామని మొబైల్ టీమ్ సీఐ జీవీ రమణ తెలిపారు. ఈ మేరకు స్వాధీనం చేసు కున్న నాటుసారా ప్యాకెట్లు, సదరు నిందితుడి ని ఎకై ్సజ్శాఖ సిబ్బందికి తదుపరి చర్యల నిమిత్తం అప్పగించినట్టు తెలిపారు. -
నైపుణ్యాలతో ఉద్యోగ అవకాశాలు
వజ్రపుకొత్తూరు రూరల్: యువతకు నైపుణ్యాలతోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మండలంలోని గరుడభద్రలో సైనింగ్ స్టార్ యువజన సంఘం 25వ వార్షికోత్సవంలో భాగంగా రాష్ట్రస్థాయి డీఎస్సీ టాలెంట్ టెస్ట్ను గురువారం నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్లో రాష్ట్రవ్యాప్తంగా 500 మంది అభ్యర్థులు పాల్గొని ఆన్లైన్లో ప్రతిభ పరీక్ష రాశారు. ఈ పోటీ పరీక్షలో కె.స్వప్న (శ్రీకాకుళం) ప్రతిభ కనబ ర్చి ప్రథమ స్థానంలో నిలిచింది. కె.భారతి(శ్రీకాకుళం) ద్వితీయ స్థానం, ఎన్.శ్యామల(విజయనగరం) తృతీయ స్థానంతో పాటు మరో ఏడు స్థానాల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులకు నగదు బహుమతి తో పాటు జ్ఞాపికలను మాజీ మంత్రి చేతులమీదు గా అందజేశారు. కార్యక్రమంలో సైనింగ్ స్టార్ యువజన సంఘ అధ్యక్షుడు వై.సంతోష్కుమార్, సర్పంచ్ గూడ గిరిజ ఈశ్వరరావు, సైనింగ్ స్టార్ యువజన సంఘ కార్యదర్శి జి.నగేష్, గ్రామ సంఘ కార్యదర్శి చెల్లూరి పాపారావు, గాయిత్రి కళాశా ల ప్రిన్సిపాల్ షణ్ముఖరావు, జగన్ కోచింగ్ సెంటర్ అధినేత జగన్, గూడ భాస్కరరావు, వై.ధర్మారావు, వై.అప్పారావు, వై.అనందరావు, ఎ.దానేష్ పాల్గొన్నారు. -
క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం
● జిల్లావ్యాప్తంగా 50 కేంద్రాల్లో శిక్షణ శ్రీకాకుళం న్యూకాలనీ: వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు (సమ్మర్ కోచింగ్ క్యాంప్లు) గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు శాప్ సూచనలతో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా 50 శిక్షణ శిబిరాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. 22 క్రీడాంశాల్లో జరుగుతున్న ఈ శిబిరాల వద్దకు క్రీడాకారులు, బాలబాలికలు తరలివస్తున్నారు. దీంతో క్రీడా మైదానాల్లో సందడి వాతావరణం నెలకొంది. క్రీడాకారులు శారీరక ఫిట్ నెస్తోపాటు నిర్దేశిత క్రీడలో సాధన చేపడుతున్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడి యం వేదికగా వేసవి క్రీడా శిక్షణా శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సీఈవో పి.సుందరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. చదువుతోపాటు క్రీడలు కూడా అవ సరమేనన్న విషయాన్ని విద్యార్థులతో పాటు తల్లి దండ్రులు గుర్తించాలన్నారు. ఒలింపిక్ అసోసియేష న్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి బీవీ రమణ మాట్లాడుతూ క్రీడాకారులు తయారయ్యేది,ఓనమా లు దిద్దుకునేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలతోనేనని తెలిపారు. డీఎస్డీవో డాక్టర్ కె.శ్రీధర్రావు మాట్లాడుతూ జిల్లాలో 50 కేంద్రాల్లో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నామని, అత్యంత ఆదరణ కలిగిన క్రీడాంశాలకు పెద్దపీట వేశామన్నారు. కేంద్రాని కి రూ.7 వేలు చొప్పున శాప్ కేటాయించిందన్నారు. 8 ఏళ్లు పైబడిన బాలబాలికలు సద్వినియోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పర్యాటకాధికారి ఎన్.నారాయణరావు, టీటీ కోచ్ ఎం.మాధురీలత, పీడీలు చల్లా జగదీష్, ఎన్వీ రమణ, జి.అర్జున్రెడ్డి, రాజీవ్, పురుషోత్తం, క్రీడాసంఘాల ప్రతినిధులు, కోచ్లు, సీనియ ర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొనడంతో మహిళకు గాయాలు
ఇచ్ఛాపురం: మున్సిపాలిటీలోని వీకేపేట రోడ్లో ఒక ట్రాక్టర్ స్కూటీని ఢీకొనడంతో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం అత్యంత రద్దీగా ఉన్న వీకేపేట రోడ్లో రత్తకన్న వైపు నుంచి మార్కెట్ వైపు ఒక వ్యక్తి ట్రాక్టర్ని వేగంగా నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న స్కూటీనీ తప్పించే క్రమంలో ఢీకొన్నాడు. దీంతో స్కూటీ నడుపుతున్న పెద్ద ఆకుల వీధికి చెందిన కిల్లంశెట్టి శరణ్య అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం బరంపురం తరలించారు. ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉండడం కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న పట్టణ ఎస్ఐ ముకుందరావు పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్ సవరాశి దుదిష్టిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దుకాణాలు సర్దేయండి!
● ఆమదాలవలస రైల్వేస్టేషన్ పరిధిలోని షాపుల నిర్వాహకులకు నోటీసులు ● 15 రోజుల్లో ఖాళీ చేయాలని రైల్వే అధికారుల ఆదేశం ● రోడ్డున పడతామంటున్న వ్యాపారులు ఆమదాలవలస రూరల్ : రైల్వే స్టేషన్ పరిధిలో పలు దుకాణాలు నిర్వహిస్తున్న వారికి రైల్వే అధికారులు షాకిచ్చారు. తక్షణమే ఖాళీ చేయాలంటూ దుకాణ యజమానులకు నోటీసులు జారీ చేశారు. దీంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. వ్యాపారాలు కోల్పోయి రోడ్డున పడతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి రైల్వే స్థలంలో సుమారు 40 సంవత్సరాలుగా రైల్వే అధికారులు గుర్తించిన స్థలంలోనే సుమారు 46 దుకాణాలను వ్యాపారులు ఏర్పాటు చేసుకున్నారు. 1980 నుంచి ఈ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా 10 అడుగులు వెడల్పు, 10 అడుగు పొడవున విస్తీర్ణం గల స్థలంలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి తొలుత రూ.200 చొప్పున ఆక్రమణ పన్ను రైల్వేశాఖకు చెల్లిస్తూ వచ్చేవారు. అయితే ప్రతి మూడు, నాలుగేళ్లకోసారి రైల్వేశాఖ ఆక్రమణ పన్ను పెంచుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఆక్రమణ పన్ను ఒక్కో దుకాణానికి రూ.12,000 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే ఏం జరిగిందో గానీ నోటీసు అందిన 15 రోజుల్లో దుకాణాలు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు ఆదేశించడంతో వ్యాపారులు దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యామ్నాయమేదీ..? నాలుగు దశాబ్దాలుగా ఇవే దుకాణాల్లో వివిధ వ్యాపారాలు చేసుకొని కుటుంబాలతో జీవనం సాగిస్తున్నామని వ్యాపారులు చెబుతున్నారు. ఉన్నఫలంగా దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసి తమ పొట్ట కొట్టవద్దని వాపోతున్నారు. అర్ధంతరంగా ఖాళీచేయమంటే తాము ఎక్కడికి వెళ్లాలని ఆవేదన చెందుతున్నారు. గతంలో రైల్వే బుకింగ్ కార్యాలయం, ఇతర అభివృద్ధి పనుల కోసం కొన్ని షాపులు తొలగించినప్పటి వారికి ప్రత్యామ్నాయంగా మరో చోట అవకాశం కల్పించారు. తమకు మాత్రం ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించడంపై పలువురు మండిపడుతున్నారు. అభివృద్ధిపై ప్రభావం.. రైల్వేస్టేషన్ పరిధిలో ఉండే దుకాణాలు ఖాళీచేస్తే వ్యాపారాలు లేక ఆమదాలవలస అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికే ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం మూతపడటంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోవటమే కాకుండా మున్సిపాలిటీ రావాల్సిన ఆదాయ వనరులు తగ్గిపోయాయని, ఇప్పుడు షాపులు కూడా తొలగిస్తే అనేక మంది జీవనోపాధి కోల్పోతారని చెబుతున్నారు. మరోవైపు, జిల్లా కేంద్ర రైల్వేస్టేషన్గా గుర్తింపు పొందిన ఈ స్టేషన్కు నిత్యం పెద్ద ఎత్తున ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటువంటి తరుణంలో దుకాణాలు తొలగించటం వల్ల ప్రయాణికులు అందక ఇబ్బందులు పడే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టును ఆశ్రయించనున్న వ్యాపారులు.. అర్ధంతరంగా దుకాణాలు తొలగించటం వల్ల వ్యాపారులతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉన్నందున కొందరు వ్యాపారు లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అయితే రైల్వే అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించక తప్పదని అంటున్నారు. -
అమరావతి కోసం ఆపసోపాలు
● మోదీ సభకు జనాలు తరలించే బాధ్యత అధికారులకు అప్పగింత ● నియోజకవర్గానికి 500 మంది టార్గెట్ ● ప్రతి బస్సుకు వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి కేటాయింపు ● సభకు వెళ్లాక ఫొటోలు పెట్టాలని హుకుం సాక్షి ప్రతినిఽధి, శ్రీకాకుళం: అమరావతి సభ.. అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. ప్రధానమంత్రి మోదీ హాజరయ్యే సభకు ఇక్కడి నుంచి జనసమీకరణ చేసి తీసుకెళ్లారు. జనాల్ని ఒప్పించి తీసుకెళ్లడానికి అధికారులు ఆపసోపాలు పడ్డారు. డ్వాక్రా మహిళలకు, ఉపాధి మేట్లకు, అంగన్వాడీ కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గానికి 500 మందిని సమీకరించాలని మంత్రులు ఆదేశించినా క్షేత్రస్థాయిలో స్పందన లేకపోవడంతో అరకొరగా సమీకరణ చేసి తీసుకెళ్లారు. ఒక్కొక్క బస్సుకు వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శిని కేటాయించారు. బస్సు అమరావతికి చేరుకున్నాక ఫొటోలు తీసి పెట్టాలని హకుం జారీ చేశారు. ఏమాత్రం తేడా వచ్చినా సంబంధిత వీఆర్ఓ, కార్యదర్శులే బాధ్యతని చెప్పారు. పెద్ద ఎత్తున బస్సుల సేకరణ.. అమరావతి సభకు జనాల్ని తరలించేందుకు ఆర్టీసీ బస్సులనే కాకుండా వివిధ విద్యా సంస్థల ప్రైవేటు బస్సులను వదల్లేదు. ఇప్పటికే జనాల తరలింపు కోసం జిల్లా నుంచి 55 ఆర్టీసీ బస్సులను తీసుకున్నారు. వాటిన్నింటిని అమరావతి చుట్టు పక్కల జిల్లాలకు పంపించేశారు. దీంతో ఆయా రూట్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అంచనాలు తలకిందులు.. ఒక్కొక్క మండలం నుంచి మూడేసి బస్సుల్లో జనాల్ని తరలించాలని తొలుత ఆదేశించినా స్పందన కనిపించలేదు. బస్సు ఏర్పాటు చేసినా, భోజనాలు పెట్టినా, దారి ఖర్చులు ఇచ్చినా బయలుదేరలేమని చాలామంది చెప్పడంతో అధికారులు ఖంగుతిన్నారు. చివరి నిమిషంలో ఉపాధి మేట్లు, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా కొందరిని బయలుదేరించారు. సదుపాయాలపై స్పష్టతేదీ? జనాల్ని సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకుందే తప్ప తీసుకెళ్లే వారికి భోజన, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా జిల్లాకు కేటాయించలేదు. దీంతో తహశీల్దార్లు, ఎంపీడీఓలు తమ జేబుల్లో నుంచి కొంతపెట్టారు. మిగతాది బస్సుల్లో లైజనింగ్ అధికారులుగా వెళ్లిన కార్యదర్శి, వీఆర్ఓలు చూసుకోవాలని ఒప్పించారు. గురువారానికి సరిపడా భోజనం, రూ.10 వేలు చొప్పున తహశీల్దార్, ఎంపీడీవోలు ఇచ్చారు. శుక్రవారం పరిస్థితి ఏంటన్నదానిపై స్పష్టత లేదు. -
విధి నిర్వహణలో అలసత్వం తగదు
జి.సిగడాం: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. గురువారం జి.సిగడాం మండలం వాండ్రంగి పింఛన్ల పంపిణీని పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలన్నారు. రహదారిపై ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా ఇంటి సామగ్రి వేస్తే వాహనాలు ఎలా వెళ్తాయని ప్రశ్నించారు. ప్రతిఇంటి వద్ద ఇంకుడు గుంత నిర్మించేలా చర్యలు తీసుకోవా లని ఏపీఓ చోళ్ల సత్యనారాయణకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గౌరీశంకరరావు, సర్పంచ్ సాకేటి నాగరాజు, ఎంపీటీసీ సభ్యులు బూరాడ శ్రీదేవి, బూరాడ వెంకటరమణ, తహసీల్దార్ ఎం.శ్రీకాంత్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏఈఈలు కుసుమ, సత్యనారాయణ, ఏపీఎం రెడ్డి రామకృష్ణంనాయుడు పాల్గొన్నారు. -
ఆస్తులు అప్పగింత..
శ్రీకాకుళం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, పొట్టి శ్రీరాముల మార్కెట్, బాపూజీ కళా మందిర్, పెద్దపాడు చెరువు లోపల స్థలంతో పాటు మరో రెండు కీలక ప్రదేశాల్లోని స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని కూటమి సర్కార్ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం ఉన్న వాటిని కూల్చి పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ ప్రైవేటు వ్యక్తులే పొందేలా ప్లాన్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ కార్పారేషన్ అధికారుల ద్వారా ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా తీసుకుంది. దానిలో భాగంగానే పొట్టి శ్రీరాములు మార్కెట్లో ప్రస్తుతం ఉన్న వ్యాపారులు ఖాళీ చేయాలని తాఖీదులిచ్చారు. వాస్తవంగా పొట్టి శ్రీరాముల మార్కెట్ను గత వైఎస్ జగన్ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేసింది. మార్కెట్లో అడుగు పెట్టాలంటేనే ఇబ్బంది పడే పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చింది. వరదనీరు, మురుగునీరు నిల్వలేకుండా, పక్కా సీసీ రోడ్లతో సుందరంగా తీర్చిదిద్దింది. కానీ, కూటమి ప్రభుత్వానికి అదేం కనిపించడం లేదు. తమ దారి తమదే అని ప్రైవేటు మోజులో పడింది. ● మున్సిపల్ కార్యాలయాన్ని కూలగొట్టి, ఆ స్థలంలో ప్రైవేటు వ్యక్తులతో నిర్మాణం చేపట్టి, అందులో కొన్ని ఫ్లోర్లను మున్సిపల్ కార్యాలయం కోసం, మిగతా ఫ్లోర్లను కమర్షియల్ కోసం వినియోగించేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కమర్షియల్ కాంప్లెక్స్ ద్వారా వచ్చే ఆదాయం నిర్మాణం చేపట్టే వ్యక్తులే పొందేలా వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ కార్యాలయాన్ని కూలగొడితే...ఉన్న ఫలంగా ఇంటిగ్రేటేడ్ కలెక్టర్ కార్యాలయానికి మార్చాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ● ఎంతో చరిత్ర గల బాపూజీ కళామందిర్తో పాటు మరికొన్ని మున్సిపల్ ఆస్తులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. చెప్పాలంటే ఆ ఆస్తులను వారికి ధారాదాత్తం చేసినట్టే. వాళ్లు చేసే నిర్మాణాలు చూసి మురిసిపోవడం తప్ప ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఒరిగిందేమి ఉండదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ‘ప్రైవేటు’ యాక్షన్ మొదలవుతుంది. తర్వాత ఏమవుతుందో నగర ప్రజలు వేచి చూడాల్సిందే. -
ఏడిపింఛెన్
● కక్షగట్టి..● పండుటాకులపై కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ కక్షసాధింపు ● అకారణంగా పింఛన్ల పంపిణీ నిలిపివేత ● కమలనాభపురం, కోటపాడులో బాధితుల ఆవేదన టెక్కలి/సంతబొమ్మాళి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలు వర్తింపజేసేవారు. కూటమి ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తమకు ఓటు వేయని, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఎటువంటి కారణాలు చూపకుండానే పింఛన్ల పంపిణీ అడ్డుకుంటోంది. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి మండలం మాసాహెబ్పేట పంచాయతీ కమలనాభపురంలో ఎనిమిది మంది వృద్ధులకు పింఛన్ల పంపిణీ నిలిపివేసింది. గ్రామానికి చెందిన దువ్వారపు అప్పన్న, కర్రి లక్ష్మణ, రోణంకి సింహాచలం, గురువెల్లి గోపాలరావు, కూన సుగ్రీవులు, మొజ్జాడ సూర్యనారాయణ, బొడ్డేపల్లి ధర్మారావు, నెయ్యిల లక్ష్మీనారాయణ అనే ఎనిమిది మంది వృద్ధులకు ఎటువంటి కారణాలు చూపకుండా రెండు నెలలుగా పింఛన్ల పంపిణీ ఆపేశారు. క్యాన్సర్ బాధితురాలిపై పగ.. సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితురాలు లింగుడు ఏకాశి అనే వృద్ధురాలికి ఓఏపీ కోటాలో పింఛన్ అందుతోంది. అయితే తన భర్త రామోజీకి మాజీ సైనిక ఉద్యోగి పేరిట పింఛన్ అందుతోందంటూ మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు చాట్ల అప్పలస్వామి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పింఛన్ ఆపేశారని బాధితురాలు గురువారం వాపోయింది. 1987లో తన భర్త స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారని, రూ.10 వేలు లోపు మాత్రమే పింఛను అందేదని, అధికారులకు లిఖిత పూర్వకంగా గత నెలలోనే సమాధానం చెప్పామని, దీంతో ఎంపీడీవో జయంతిప్రసాద్ ఫిబ్రవరి, మార్చి నెలల పింఛన్ను ఒకేసారి గత నెలలో ఇచ్చారని పేర్కొంది. ఇప్పుడు రాజకీయ కక్షతో ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మే నెల పింఛన్ ఆపేశారని వాపోయింది. తన భర్త ఇటీవలే చనిపోయారని, ఈ పరిస్థితిలో పింఛన్ కూడా ఆపేయడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈవోపీఆర్డీ పద్మజ వద్ద ప్రస్తావించగా, ప్రభుత్వం నుంచి పింఛను ఇస్తున్నారని ఫిర్యాదు రావడంతో నిలుపుదల చేసినట్లు తెలిపారు. -
రేపటి నుంచి బీచ్ ఫెస్టివల్
శ్రీకాకుళం పాతబస్టాండ్: బారువ బీచ్ వేదికంగా ఈ నెల 3, 4 తేదీల్లో బీచ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం అన్ని శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లపై పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి 70–80 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని చెప్పారు. గత వారం జరిగిన ఫెస్టివల్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వర్సిటీకి రెండు నెలలు సెలవులు ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయానికి రెండు నెలలు సెలవులు ప్రకటిస్తూ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. ఈ నెల 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు సెలవులు అమల్లో ఉంటాయని పోస్టు గ్రాడ్యుయేషన్, ఇంజినీరింగ్ విద్యార్థులకు సెలవులు వర్తిస్తాయని పేర్కొన్నారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి ఎచ్చెర్ల క్యాంపస్ : సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గురువారం ఎచ్చెర్ల పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఎస్సై వి.సందీప్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. అల్లర్లు, ఘర్షణలు, కుట్రలకు పాల్పడే వారు, పాల్పడే అవకాశాలు ఉన్న వారిపై నిఘాపెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎచ్చెర్ల ఇన్చార్జి ఎంపీడీఓ సస్పెన్షన్ ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల ఇన్చార్జి ఎంపీడీఓ బత్తుల మల్లేశ్వరరావుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మల్లేశ్వరరావు 2023–24 ఆర్థిక సంవత్సరంలో టెక్కలి మండల పరిషత్ కార్యాలయంలో ఈవోపీఆర్డీగా పనిచేస్తూనే, టెక్కలి గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో పంచాయతీ నిధులు దుర్వినియోగంలో పాత్ర ఉందంటూ మల్లేశ్వరరావును సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఎచ్చెర్ల ఈవోపీఆర్డీగా పనిచేస్తున్న మల్లేశ్వరరావు మార్చి 10 నుంచి ఇన్చార్జి ఎంపీడీవోగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ ఎంపీడీవో సీపాన హరిహరరావు రెండు నెలల దీర్ఘకాలిక సెలవుపెట్టారు. కర్రసాము పోటీల్లో ప్రతిభ నరసన్నపేట: ఏలూరులో రాష్ట్ర స్థాయిలో ఏప్రిల్ 30న జరిగిన కర్ర సాము పోటీల్లో నరసన్నపేటలోని కృష్ణా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు సత్తాచాటారు. 38 మంది ప్రథమ స్థానం, 16 మంది ద్వితీయ స్థానం సాధించారు. ఆలిండియా కర్రసాము ఫెడరేషన్ గుర్తింపు పొందిన ఎస్వీఆర్కే ఇండియన్ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. విజేతలతో పాటు కోచ్ ఆవల చిన్నను పలువురు అభినందించారు. -
చీమలమందు తాగి మహిళ ఆత్మహత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ ఊడికలపాడు గ్రామానికి చెందిన పినిమింటి లక్ష్మీ(37) చీమల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ భర్త రామారావు రోజు మద్యం సేవించి భార్యాపిల్లలతో గొడవ పడేవాడు. ఇంట్లో దాచిపెట్టిన డబ్బులను ఈ నెల 27న తీసుకుపోయి రోజంతా పూటుగా తాగి సాయంత్రం ఇంటికి వచ్చి గొడవకు దిగాడు. మనస్థాపానికి గురైన లక్ష్మీ ఇంట్లో ఉన్న చీమల మందును నీటిలో కలుపుకొని తాగింది. గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుశం రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. లక్ష్మికి కుమార్తె జగదీశ్వరి, కుమారుడు శ్యాం ఉన్నారు. లారీని ఢీకొట్టిన కారు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు జాతీయ రహదారి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కోల్కతా నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ట్యాంకర్ను నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కారు అతివేగంతో వచ్చి అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ సైనికుల సమస్యలు పరిష్కరిస్తాం శ్రీకాకుళం కల్చరల్: మాజీ సైనికుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలంగాణ – ఆంధ్ర సబ్ ఏరియా హెడ్ క్వార్టర్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ అజయ్ మిశ్రా అన్నారు. జిల్లాలో బుధవారం పర్యటించిన ఆయన కొత్త రోడ్డు వద్ద ఆర్మీ క్యాంటీన్ని సందర్శించారు. మాజీ సైనికులకు, వీర నారీమణులకు ఉపయోగపడేలా ఈ–రిక్షా ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం సింహద్వారం దగ్గర ఉన్న ఎక్స్ సర్వీసు మెన్ కంట్రిబ్యూటరి హెల్త్ స్కీమ్ పోలిక్లినిక్ని సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మాజీ సైనికులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ–ఆంధ్ర సబ్ ఏరియా ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామాంజలి మిశ్రా, కల్నల్ విక్రాంత్ పాండే, కల్నల్ ఆర్.ఎన్.ముతల్లిక్, డిస్ట్రిక్ట్ ఎక్స్సర్వీస్మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి.ఈశ్వరరావు, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.శైలజ, ఇ.సి.ఎచ్.ఎస్. అధికారి, విశ్రాంత లెఫ్ట్నెంట్ కల్నల్ బి.చంద్రశేఖర్, శ్రీకాకుళం క్యాంటీన్ మేనేజర్ విశ్రాంత సుబెదార్ మేజర్ పి.గోవిందరావు, విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ అధికారి కృష్ణారావు, శ్రీకాకుళం అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, ఉపాధ్యక్షుడు వి.సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ పి.మురళీధరరావు తదితరులు పాల్గొన్నారు. బసవన్నకు నివాళులు శ్రీకాకుళం పాతబస్టాండ్: కుల, వర్ణ, లింగ భేదాలను వ్యతిరేకించిన మహాత్మ బసవేశ్వర తత్వాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో బసవన్న జయంతి వేడుకలు నిర్వహించారు. బసవన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బసవన్న 12వ శతాబ్దపు తత్వవేత్తగా సమానత్వాన్ని బోధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వరరావు, టూరిజం అధికారి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీ లేదు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో ఇటీవల జరిగిన సీఎం చంద్రబాబునాయుడు పర్యటన పూర్తిగా తప్పుడు ప్రచారాల మీదే ఆధారపడిందని తప్ప జిల్లాకు ఒరిగిందేమి లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేయాలని చూసిన చంద్రబాబు, నిజాలను పూర్తిగా మర్చిపోయారన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మత్స్యకారుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చిన వాస్తవాన్ని ఆయన గానీ, ఆయన పార్టీ నాయకులు గానీ గుర్తించకపోవడం దారుణమన్నారు. భావనపాడు పోర్టు విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం అర్థరహితమన్నారు. పోర్టుకు భూముల సేకరణ, పునరావాస పనులు వంటి అన్ని పనులు వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, బీమా ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది జగన్మోహన్రెడ్డి సారథ్యంలోనే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు చేయటానికి ముందు 14 ఏళ్ల టీడీపీ పాలనలో ప్రజల కోసం ఏం చేసారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. హామీలిచ్చి విస్మరించడం సరికాదన్నారు. -
వీఆర్ఏలకు వేతనాలు పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: గ్రామ రెవెన్యూ సహాయకులకు వేతనాలు పెంచాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.అమ్మన్నాయుడు, వీఆర్ఎల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు అల్లు సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.త్రినాథరావు, కె.రమణమూర్తి డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విధంగా పే స్కేల్ జీతాలు అమలు చేయాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నిబంధనలకు విరుద్ధంగా విధించిన నైట్ డ్యూటీలు, ఇసుక ర్యాంపులు, రైస్ మిల్లులు డ్యూటీలు రద్దుచేయాలని, డీఏను జీతంలో కలపాలని, వీఆర్వో, అటెండర్, రికార్డు అసిస్టెంట్, వాచ్మేన్, డ్రైవర్ ఖాళీ పోస్టుల్లో అర్హులైన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అంతకుముందు ఆర్అండ్బీ అతిథి గృహం రోడ్డు నుంచి నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నా అనంతరం డీఆర్ఓ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో వీఆర్ఏలు ఎన్.సీతప్పడు, బి.అప్పారావు, జి.రామ్మూర్తి, కె.లక్ష్మణ, ఎం.రాముడు, బి.రాములమ్మ, ఢిల్లీశ్వరరావు, రాంబాబు, పద్మ, మీనాక్షి, రాజులమ్మ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
ఆటాడుకుందాం రా..!
అథ్లెటిక్స్: జీహెచ్ స్కూల్ పలాస– 9494379648, టెక్కలి– 9492417570, జెడ్పీహెచ్ స్కూల్ కేకే రాజపురం– 8464906752, టీపీఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 8500271575, కేవీకే ఇచ్ఛాపురం– 9441024555, పాతపట్నం– 9100736583, జెడ్పీహెచ్ స్కూల్– 8688872304. వాలీబాల్: జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9441011391, జెడ్పీహెచ్ స్కూల్ పైడి భీమవరం– 9849326018, జెడ్పీహెచ్ స్కూల్ ప్రగడపుట్టుగ– 9491569394, జెడ్పీహెచ్ స్కూల్ కొర్ని– 9440955034, జెడ్పీహెచ్ స్కూల్ మాకివలస– 9963753719, జెడ్పీహెచ్ స్కూల్ పాతపట్నం– 9440955034, ప్రభుత్వ డిగ్రీ కళాశాల బారువ– 9494814087. కబడ్డీ: బలగ శ్రీకాకుళం – 9010406706, జెడ్పీహెచ్ స్కూల్ సింగుపురం– 9642287746, ప్రభుత్వ డిగ్రీ కళాశాల టెక్కలి– 9441262515, జెడ్పీహెచ్ స్కూల్ పల్లెసారధి– 9502983175. ఖోఖో: జెడ్పీహెచ్ స్కూల్ పలాస– 9618583449, కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9866288802, ఎంజీహెచ్ స్కూల్ ఇచ్ఛాపురం– 9177914135. హ్యాండ్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ అల్లినగరం– 9493764447, జెడ్పీహెచ్ స్కూల్ పిల్లలవలస– 9966849462, జెడ్పీహెచ్ స్కూల్ పాతటెక్కలి– 7330831517. సాఫ్ట్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ ఇప్పిలి– 9440436317, జెడ్పీహెచ్ స్కూల్ కేశవరావుపేట– 9705302968, జెడ్పీహెచ్ స్కూల్ కురుడు– 9052500720. ఫుట్బాల్: కేఆర్ స్టేడియం శ్రీకాకుళం– 9533691018, కలెక్టరేట్ వద్ద ఆర్అండ్బీ గెస్ట్హౌస్ హెచ్–గ్రౌండ్ శ్రీకాకుళం– 9177564623, జెడ్పీహెచ్ స్కూల్ నరసన్నపేట– 8639629920. బాల్ బ్యాడ్మింటన్: జీహెచ్ స్కూల్ ఎచ్చెర్ల– 8074452351, ఎంజేపీ నరసన్నపేట– 7013473337. బాక్సింగ్: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్,శ్రీకాకుళం– 8977496979, పీఎస్ఎన్ఎంహెచ్ స్కూల్ శ్రీకాకుళం– 9989364548. జూడో: జెడ్పీహెచ్ స్కూల్, వప్పంగి– 9440688828, జెడ్పీహెచ్ స్కూల్ పోలవరం– 9550743035. తైక్వాండో: ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం శ్రీకాకుళం– 9393178455, టౌన్ హాల్ శ్రీకాకుళం– 8919591487. వెయిట్ లిఫ్టింగ్: జీహెచ్ స్కూల్ నరసన్నపేట: 9492299769, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆమదాలవలస– 9390745150. బ్యాడ్మింటన్: టెక్కలి– 7799335725 బేస్బాల్: జెడ్పీహెచ్ స్కూల్ లావేరు– 8639000705. బాస్కెట్బాల్: టెక్కలి– 8986951096. చెస్: కోడిరామ్మూర్తి (కేఆర్) స్టేడియం శ్రీకాకుళం– 9908162634. క్రికెట్: పాతపట్నం– 9701454500. ఫెన్సింగ్: టౌన్హాల్ శ్రీకాకుళం– 7660874844. సెపక్తక్రా: ఎన్టీఆర్ఎం హెచ్స్కూల్ శ్రీకాకుళం– 8500828965. టేబుల్టెన్నిస్: బాలభాను విద్యాలయం – 9290577033. టెన్నీకాయిట్: జీహెచ్స్కూల్ పలాస– 9441089592. ఉషూ: ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం శ్రీకాకుళం– 9885734313. ● నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు ప్రారంభం ● జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో నెలరోజుల పాటు శిక్షణ ● 22 క్రీడాంశాలకు చోటు ● 8 ఏళ్లు పైబడిన బాలబాలికలకు అవకాశం శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో బాలబాలికలంతా మైదానబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులంతా మరో నెల రోజులపాటు ఆటల్లో ముగినితేలనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు(సమ్మర్ కోచింగ్ క్యాంప్)లను నిర్వహిస్తున్న విషయం విదితమే. జిల్లాలో గురువారం నుంచి శిక్షణా శిబిరాలు మొదలుకానున్నాయి. అరకొర నిధులతోనే.. మే ఒకటి నుంచి మొదలుకానున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాలకు రాష్ట్ర ప్రభుత్వం అరకొర నిధులు విధిల్చి చేతులు దులుపేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలలో మే నెలాఖరు వరకు ఈ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. ఒక్కొక్క శిబిరానికి కేవలం రూ.7వేలు మాత్రమే కేటాయించారు. ఇందులో శిక్షకుడు/కోచ్కు రూ.1500, ఫ్లెక్సీకి రూ. 500, స్పోర్ట్స్ మెటీరియల్కు రూ.5వేలు వెచ్చించనున్నారు. శిక్షణ సమయంలో క్రీడాకారులకు పోటీ లను నిర్వహిస్తారు. ఆఖర్లో ఆన్లైన్లో సర్టిఫికెట్లు అందజేస్తారు. అరకొరగా నిధుల కేటాయింపు పట్ల క్రీడాసంఘాల ప్రతినిధులు పెదవివిరిస్తున్నారు. ఇవీ విధివిధానాలు.. ● సమ్మర్ కోచింగ్ క్యాంపులలో 8 నుంచి 16 ఏళ్లలోపు బాలబాలికలకు శిక్షణ అందిస్తారు. 16 ఏళ్లపైబడి ఆసక్తి కలినవారు కూడా హాజరుకావచ్చు. ● ప్రతిరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మరళా సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శిక్షణ ఉంటుంది. ● శాప్ కోచ్లతోపాటు పీడీలు/పీఈటీలు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు వివిధ క్రీడాంశాల్లో శిక్షణ అందించేందుకు అర్హులు. ● ప్రతిరోజు క్రీడాకారులకు హాజరు వేయాల్సి ఉంటుంది. ● వారంతాల్లో క్రీడాకారులకు పోటీలు నిర్వహించి ప్రోత్సహించాలి. ● శిబిరాల సమయంలో గ్రామీణ, పాఠశాల స్థాయి స్పోర్ట్స్ క్లబ్లను క్రీడాంశాల వారీగా ఏర్పాటు చేయాలి. ● శిక్షణా శిబిరాల సమయంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, వారిని ప్రత్యేకంగా సానబెట్టి భవిష్యత్తులో జరిగే పోటీలకు సిద్ధంచేయాలి. ● దాతల సహకారం, చేయూతతో శిక్షణా శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలకు క్రీడాపరికరాలు, క్రీడాదుస్తులు, షూ, సాక్సులు, స్నాక్స్, మెడల్స్, బహుమతులు, అందించేలా ఆయా కేంద్రాల శిక్షకులు చొరవ తీసుకోవాలి. గ్రామీణ క్రీడలకు పెద్దపీట.. సమ్మర్ కోచింగ్ క్యాంప్ కేటాయింపులో గ్రామీణ క్రీడలకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా 22 కేంద్రాలను కేటాయించారు. అత్యధికంగా అథ్లెటిక్స్కు, వాలీబాల్కు ఏడేసి చొప్పున కేంద్రాలను కేటాయించగా.. కబడ్డీ 4, ఫుట్బాల్ 3, హ్యాండ్బాల్ 3, సాఫ్ట్బాల్ 3, ఖోఖో 3, బాల్ బ్యాడ్మింటన్ 2, బాక్సింగ్ 2, జూడో 2, తైక్వాండో 2, వెయిట్లిఫ్టింగ్ 2, బ్యాడ్మింటన్, బేస్బాల్, బాస్కెట్బాల్, చెస్, క్రికెట్, ఫెన్సింగ్, సెపక్తక్రా, టేబుల్టెన్నిస్, టెన్నికాయిట్, ఉషూ క్రీడాంశాల్లో చెరో కేంద్రం చొప్పున శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నారు. అత్యంత ఆదరణ కలిగిన ఆయా ప్రాంతాల్లో పాఠశాలల మైదానాల్లోనే శిక్షణ అందించనున్నారు. శిబిరాలు ఎక్కడెక్కడంటే.. సద్వినియోగం చేసుకోవాలి.. బాలబాలికల ప్రతిభ బయటపడేది వేసవి క్రీడా శిక్షణా శిబిరాలలోనే. జాతీయస్థాయిలో తీర్చిదిద్దే శిక్షకులు జిల్లాలో ఉన్నారు. క్రమం తప్పుకుండా హాజరై శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ఒలింపిక్ అసోసియేషన్, క్రీడాసంఘాలు, పీఈటీ సంఘ నాయకులతో కలిసి శిక్షణా కేంద్రాలను కేటాయించాం. కేంద్రానికి రూ.7వేలు చొప్పున కేటాయించారు. ఇందుకు సంబంధించిన విదివిధానాలను శాప్ ప్రకటించింది. – డాక్టర్ కె.శ్రీధర్రావు, డీఎస్డీఓ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, శ్రీకాకుళం -
టెండర్ షెడ్యూల్లో మార్పులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పౌరసరఫరాల సంస్థకు చెందిన 14 మండల స్థాయి. గోదాములలో పి.డి.ఎస్.బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను రెండో దశ రవాణాకు వేసిన టెండరు షెడ్యూల్లో మార్పులు చేస్తున్నట్టు జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ ఒక ప్రకటనలో తెలపారు. వివరాలకు సహాయ మేనేజరు 7732098637 నంబర్ను సంప్రదించాలని కోరారు. రిటైర్డ్ పోలీసులకు సత్కారం శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి బుధవారం ఉద్యోగ విరమణ పొందినవారిని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. సన్మాన గ్రహీతలైన ట్రాిఫిక్ ఎస్ఐ వి.దేవదానం, ఆఫీస్ సూపరింటెండెంట్ పి.కోటేశ్వరరావు, వజ్రపుకొత్తూరు ఏఎస్ఐ ఎన్.అప్పలనాయుడు, ఏఆర్ హెచ్సీ ఎన్.చిన్నబాబులకు ఎస్పీ దుశ్శాలువ, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏవో సీహెచ్ గోపినాథ్, ఏఆర్ ఆర్ఐ నర్సింగరావు, కార్యాలయ సూపరింటెండెంట్లు బాలరాజు, లిల్లీభాయ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘించి అవమానిస్తారా?
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ బల్ల గిరిబాబు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కౌన్సిల్ సమావేశం అర్ధాంతరంగా వాయిదా పడింది. మున్సిపల్ కమిషనర్ రామారావు ప్రొటోకాల్ ఉల్లంఘించి తనను అవమానించారని చైర్మన్ బల్ల గిరిబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభ వాయిదా వేసి వెళ్లిపోయారు. మున్సిపల్ సమావేశం ప్రారంభంలో చైర్మన్ తాగునీటి సమస్యపై ప్రారంభ ఉపన్యాసం చేశారు. అనంతరం బోర్లు, పవర్ బోర్లు ఏర్పాటు అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చైర్మన్ ఒక్కసారిగా కమిషనర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న 26వ వార్డులో ఇటీవల పవర్ బోరును కమిషనర్, టీడీపీ కౌన్సిలర్ శంకుస్థాపన చేసుకున్నారని, కనీసం తనకు సమాచారం ఇవ్వలేదని, కమిషనరే ప్రొటోకాల్ ఉల్లంఘిస్తే ఇక తానెందుకని మండిపడ్డారు. ఇటీవల ప్రొటోకాల్ పాటించకుండా పలు కార్యక్రమాలు చేపడుతున్నారని, అలాంటప్పుడు 31 మంది కౌన్సిలర్లు, అధికారులతో సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం తమకేం ఉందని, కమిషనర్ ఏకచత్రాధిపతిగా పాలన సాగించుకోవాలంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్లు కూడా సమావేశం నుంచి వెళ్లిపోయారు. పలాస–కాశీబుగ్గ మున్సిపల్ కమిషనర్ తీరుపై చైర్మన్ ఆగ్రహం ఏక చత్రాధిపత్యం వహిస్తున్నారంటూ సభ వాయిదా -
వైశాఖం వచ్చినా.. మీనమేషాలేనా.?
అరసవల్లి: వైశాఖ మాసం వచ్చేసింది. ఈ మాసంలో అరసవల్లి ఆదిత్య క్షేత్రంలో ప్రత్యేక సందడి నెలకొంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తుంటారు. కానీ అందుకు తగ్గట్టు భక్తులకు సౌకర్యాలు కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గడిచిన రథసప్తమి మహోత్సవాలు సందర్భంగా ఆల యం ముందు భాగంలో ఉన్న నిర్మాణాలు, షెడ్లు అన్నింటినీ తొలగించేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఎండ తీవ్రత పెరిగిపోతున్న క్రమంలో భక్తులకు ఎండ దెబ్బలు తప్పవని అర్థమవుతోంది. ఆలయంలో గత వైశాఖ మాసానికి వేలల్లో భక్తులు తరలి వచ్చినప్పటికీ అందుకు తగిన షె డ్లు, మరుగుదొడ్లు, ఇతరత్రా వసతి ఏర్పాట్లు ఉండడంతో ఇబ్బందులు కలుగలేదు. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆలయం ముందు నిర్మాణాలు, షెడ్లు తొలగించేయడంతో పాటు అన్నదాన ప్రసాదం, ల డ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయాలు కూడా తాత్కాలికంగా మారాయి. దీంతో భక్తులు గత మూడు నెలలుగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఎండ అవస్థలతో పాటు మౌలిక వసతులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఆలయం ముందు మంచినీటి పంపిణీకి, భక్తులు సేద తీరడానికి చిన్నపాటి పందిళ్లతో సరిపెట్టిన ఆలయ అధికారుల తీరు రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. మూడు నెలల కిందట కూల్చేసిన షెడ్ల భాగాలతోనే ఇంద్రపుష్కరిణి ఒడ్డున అన్నదానం కోసం ఓ షెడ్డును వేసి మిన్నకుండిపోయారు. మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా తాత్కాలికంగానే ఏ ర్పాటు చేయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింకు రేకులతో మరుగుదొడ్లు వేయడంతో ఈ వేసవిలో వైశాఖ మాసంలో అవస్థలు తప్పే లా లేవు. దుకాణాలు కూల్చేసేటప్పుడు చెప్పిన హామీలను అధికార పార్టీ నేతలు పట్టించుకోవ డం లేదంటూ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నా రు. ఇప్పటికై నా న్యాయం చేయాలంటూ ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ బాధితులు కోరుతున్నారు. అరసవల్లిలో కానరాని ఏర్పాట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు -
● రోడ్డుపై కూలిన మర్రి చెట్టు
మందస: బుధవారం తెల్లవారు జామున వీచిన భారీ గాలులకు మందస మండలం సొండిపూడి–ముకుందపురం గ్రామాల మధ్య భారీ మర్రిచెట్టు కూలిపోయింది. దీంతో చాలాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు రోడ్డుపై కూలిన మర్రి చెట్టు ● ధాన్యం..దైన్యం నరసన్నపేట: అకాల వర్షాలు రైతులను దెబ్బతీశాయి. మంగళవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం వర్షానికి తడిచిపోయింది. మండలంలో కరగాం, లింగాలపాడు, యారబాడు, కోమర్తి, మతలబుప్పేట, చిక్కాలవలస తదితర గ్రామా ల్లో ధాన్యం బాగా తడిచిపోయింది. -
కొందరికే కొత్త పింఛన్లు
● పాత ఐడీ ఉన్న వితంతువులకే పింఛన్లు ● ఐడీ లేని విడోలకు పింఛను లేదు ● కొత్త పింఛన్లకు నోచుకోని దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ● 50 ఏళ్ల పింఛన్ హామీ బూటకమే శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లలోనూ మెలికలు పెడుతోంది. ఎన్నికలు జరిగిన నాటి నుంచి దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు పింఛన్ల కోసం కళ్లు కాయ లు కాసేలా ఎదురు చూస్తుంటే కొందరికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్లు తప్ప కొత్తవారికి ఒక్క పింఛను ఇవ్వలేదు. కేవలం పింఛను పెంచామని కూటమి పాలకులు బాకాలు ఊదుతున్నారు తప్ప కొత్త వారి పరిస్థితిపై ఎవరూ మాట్లాడటం లేదు. 50 ఏళ్ల పింఛన్ ఊసే లేదు ● ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారు. కానీ ఇప్ప టివరకు దానిపై ఎలాంటి కసరత్తు చేయలేదు. ● దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మెడికల్ పింఛను దారులు వేల సంఖ్యలో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఎవరినీ ప్రభుత్వం కరుణించలేదు. ● తాజాగా ప్రభుత్వం వితంతు పింఛను మంజూరుకు అనుమతులు ఇచ్చింది. దీంతో చాలా మంది వితంతువులకు పింఛను వస్తుందని ఆశ పడ్డారు. అయితే దీనిలో మెలిక పెట్టారు. గతంలో పింఛను పొంది, ఆ వ్యక్తి పింఛన్ ఐడీ కలిగి ఉండి, ఆయన మరణిస్తే అతని భార్యకు మా త్రమే వితంతువు పింఛను ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చారు. భర్త పింఛను భార్యకు తప్ప ఇతర వితంతువులకు పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. ● మే నెలకు గాను జిల్లాకు 3.10 లక్షల పింఛన్లు విడుదలయ్యాయి. ఈ పింఛన్లు గత ఏడాదిగా ప్రతి నెలా తగ్గుతూ వస్తున్నాయి. ● ఇవన్నీ పాత పింఛన్లే. కొత్తగా చనిపోయిన వారి స్థానంలో 4623 పింఛన్లు మంజూరు కావాల్సి ఉండగా.. వీటిలో కూడా కోత పెట్టేందుకు ప్రభుత్వం సాకులు వెతుకుతోంది. ● జిల్లాలో గత ఏడాదిన్నరగా 4623 మంది పింఛన్దారులుమరణించినట్టు చెబుతున్నారు. అయి తే వీరి ఐడీల ద్వారా వారి భార్యలకు (స్పౌజ్) లో 2911 పింఛన్లు మాత్రమే ఇవ్వనున్నారు. ● ఒక కుటుంబంలో భర్త పింఛను పొందుతూ 01.12.2023 నుంచి 31.10.2024 మధ్య మరణిస్తే.. అలాంటి పింఛనుదారు భార్యకు మాత్ర మే వితంతు పింఛను మంజూరు చేశారు. ఇతరులకు మొండి చేయిచూపారు. ● భర్త పింఛన్దారుడు కాకపోతే.. వితంతువైనా పింఛన్ కోసం దరఖాస్తు చేసేందుకు అనుమతులు లేవు. -
‘ప్రజల భద్రత గాలికి’
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికి వదిలేసిందని, ఇటీవలే తిరుపతి తొక్కిసలాటలో కొందరు చనిపోయారని, ఇప్పుడు సింహాచలంలోనూ భక్తులు ప్రాణాలు కోల్పోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల్లో ఉత్సవాలు జరిగేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం విచారకరమన్నా రు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని, వాళ్లు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింహాచలం ఘటన బాధాకరం ఇచ్ఛాపురం రూరల్: సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవానికి వచ్చిన భక్తులపై గోడ కూలి కొందరు భక్తులు చనిపోవడంపై ఎమ్మెల్సీ నర్తు రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రు. గోదావరి పుష్కరాలు, తిరుపతిలో తొక్కిసలాట, వందల సంఖ్యలో గోవుల మృతి, శ్రీకూర్మంలో తాబేళ్ల మృతి, ఇప్పుడు సింహాచలంలో దుర్ఘటన అన్నీ టీడీపీ హయాంలోనే జరుగుతున్నాయని గుర్తు చేశారు. భక్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. ప్రశాంతంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఎచ్చెర్ల క్యాంపస్: ఏపీ పాలిసెట్–2025 జిల్లాలో బుధవారం సజావుగా జరిగింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. టెక్కలి, శ్రీకాకుళం డివిజన్ల పరిధిలో 39 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. జిల్లా నుంచి 11373 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 10217 మంది హాజరయ్యారు. శ్రీకాకుళం డివిజన్లో 6973 మందికి 6183 మంది, టెక్కలి డివిజన్లో 4400 మందికి 4034 మంది హాజరయ్యారు. పరీక్ష నిర్వహణను ప్రవేశాల జిల్లా ఇన్చార్జి బి.జానకి రామయ్య, జిల్లా అబ్జర్వర్ కె.విజయలక్ష్మి, టెక్కలి అబ్జర్వర్ గోవిందరావు, శ్రీకాకుళం అబ్జర్వర్ కె.రత్న కుమార్ పరీక్షలు పర్యవేక్షించారు. పి–4 సర్వే ద్వారా 75,566 కుటుంబాల గుర్తింపుశ్రీకాకుళం పాతబస్టాండ్: పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి–4 విధానాన్ని జిల్లాలో ప్రభావవంతంగా అమలు చేస్తున్నట్టు కలెక్టర్ స్వప్నిల్ దింకర్ పుండ్కర్ తెలిపారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న 20 శాతం వెనుకబడిన కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా గుర్తించామని, జిల్లాలో మొత్తం 75,566 కుటుంబాలు ఈ దిశగా ఎంపికయ్యాయని వెల్లడించారు. వీరిని సమాజంలో ఉన్నత స్థితికి చేర్చేందుకు 10 శాతం మంది ‘మార్గదర్శులు’గా ముందుకు వచ్చి, ఒక్కో బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకుని వారికి విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, ఇతర అవసరాల కోసం తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ–ప్రైవేట్–ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సర్వేలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలనుకునే వారు zeropovertyp4. ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాత్రమే కాకుండా రాష్ట్రం, దేశం నలుమూలలలో ఉన్న శ్రీకాకుళం వాసులు ముందుకు రావాలని ఆయన కోరారు. ఎచ్చెర్లలో పరీక్ష కేంద్రం వద్ద అధికారులు -
శ్రీకాకుళం
ఆటాడుకుందాం రా..!నేటి నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఏర్పాట్లు పూర్తయ్యాయి. –8లోతమ్ముళ్లకు వెన్నుపోటుగురువారం శ్రీ 1 శ్రీ మే శ్రీ 2025● నరసన్నపేట నియోజకవర్గ కీలక నేత చేతిలో మోసపోయిన తెలుగు తమ్ముళ్లు ● మద్యం వ్యాపారంలో వాటాలిస్తామని రూ. 20కోట్లకు పైగా సేకరణ ● వసూలయ్యాక మాట మార్చిన కీలక నేత ● లబోదిబోమంటున్న తమ్ముళ్లు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రైవేటు మద్యం దుకాణాలు వస్తున్నాయనగానే తెలుగు తమ్ముళ్లు సంబరపడ్డారు. ఎవరికీ దక్కకుండా దుకాణాలు కొట్టేద్దామని భావించారు. నాయకులంతా సిండికేటై దుకాణాలన్నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని కలలు కన్నారు. ఇంకేముంది నరసన్నపేట నియోజకవర్గ కీలక నేత సిండికేట్కు నాయకత్వం వహించారు. అంతా కలిసి వ్యాపారం చేసుకుందామని గ్రామాల వారీగా నాయకుల నుంచి పెట్టుబడి కింద రూ. 20కోట్లకు పైగా వసూలు చేశారు. కానీ అనుకున్నదొకటైతే జరిగింది మరొకటి అయింది. డబ్బులిచ్చిన నాయకుల పేరున కాకుండా తన కుటుంబ సభ్యుల చేత నియోజకవర్గంలోని దుకాణాలకు దరఖాస్తు చేయించారు. వా టిలో కొన్ని దుకాణాలు లాటరీలో వారికే దక్కాయి. ఇతరులకు వచ్చిన మరికొన్ని దుకాణాలను భయపెట్టి తన సిండికేట్లో కలిపేసుకున్నారు. అంతా అయ్యాక సిండికేట్ వ్యాపారం కోసం గ్రామాల వారీగా భారీగా డబ్బులిచ్చిన నాయకులను విస్మరించారు. వ్యాపారంలో కలుపుకోకపోగా వారిచ్చిన డబ్బులు కూడా వెనక్కి ఇవ్వడం లేదు. పెట్టుబడి కోసం వివిధ వ్యక్తుల వద్ద వడ్డీలకు తీసుకొచ్చిన సొమ్ము ఆ కీలక నేత చేతిలో ఉండిపోయిందని లబోదిబోమంటున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీ.. నరసన్నపేట నియోజకవర్గంలో కీలక నేత పంట పండింది. అటు మద్యం, ఇటు ఇసుక ద్వారా రోజు కి రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న ఆ నేత రెండు చేతులా సంపాదిస్తున్నారు. కానీ, ఆయన్ని నమ్మి వెనుక నడిచిన నాయకులు మాత్రం చాలా వరకు మోసపోయారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టపోతున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. అక్కడి కీలక నేత ఒకరు అంతా తానై వ్యవహరించారు. మద్యం వ్యాపారం కలిసి చేసుకుందామని నమ్మబలికి నాయకుల దగ్గరి నుంచి రూ. 20కోట్లకు పైగా సొమ్ము సేకరించారు. డబ్బులిచ్చిన ప్రతి ఒక్కరికీ వ్యాపారంలో వాటా కావాల్సిన వారికి ఇసుకలో వాటా మద్యం వ్యాపారం కోసం డబ్బులిచ్చిన వారిలో తనకు కావాల్సిన కొందరికి మాత్రం ఇసుకలో వాటాలిచ్చారు. తప్పని పరిస్థితుల్లో అనధికారికంగా నడిపే ర్యాంపుల్లో కొంత పర్సంటేజీ ఇచ్చారు. పైసా పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో ఇసుక ర్యాంపులను కీలక నేత వదిలేశారు. ముఖ్యంగా నరసన్నపేట, పోలాకి, జలుమూరు తీర ప్రాంత గ్రామాలకు చెందిన నాయకుల్లో బలమైన వ్యక్తులకు మాత్రమే ఈ ఆఫర్ ఇచ్చారు. మిగతా వారిని సముదాయిస్తూ వస్తున్నారు. ఒకే దుకాణానికి ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వేయడం వల్ల ఆ ఫీజు కింద చాలా వరకు పోయిందని, అనుకున్నంతగా లాభాలు కూడా రావడం లేదని, ఇప్పుడిప్పుడే బెల్ట్ దుకాణాల ద్వారా ఆదా యం పెరిగిందని, త్వరలోనే వ్యాపారం కోసం ఇచ్చినదంతా వెనక్కి ఇచ్చేస్తానంటూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఇప్పుడా నేత తీరుపై మిగతా ప్రజలు పక్కన పెడితే సొంత నాయకులే కస్సుబుస్సులాడుతున్నారు. ఇస్తామని చెప్పారు. నాయకుల పేరునే దుకాణాల కోసం దరఖాస్తులు చేయిస్తామని భరోసా ఇచ్చారు. కానీ, దరఖాస్తుల ప్రక్రియకు వచ్చేసరికి తన కు టుంబ సభ్యుల పేరున ఎక్కువగా దరఖాస్తులు చేశారు. ఒక్కో దుకాణానికి 30నుంచి 70వరకు దరఖాస్తులు చేసినప్పటికీ ఆ కుటుంబ సభ్యులకే లాటరీలో ఎక్కువగా దుకాణాలు వచ్చాయి. న్యూస్రీల్హ్యాండ్ ఇచ్చిన కీలక నేత దుకాణాలు దక్కాక ఆ నేత మొహం చాటేస్తున్నారు. వాటా సంగతేంటని అడిగితే దాట వేస్తున్నారే తప్ప లబ్ధి చేకూర్చడం లేదు. ఎప్పటికీ వాటాలు ఇవ్వడం లేదని కొందరు విసిగి పోయి అడుగుతుంటే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. తరచూ అడిగే వాళ్లకు వడ్డీతో కలిపి చెల్లించేస్తానని చెప్పడమే తప్ప వెనక్కి ఇచ్చిన దాఖాల్లేవు. ఒకవైపు వడ్డీలు పెరిగిపోతున్నాయి, మరోవైపు కీలక నేత వెనక్కి ఇవ్వడం లేదు. దీంతో నాయకులంతా కుమిలిపోతున్నారు. గట్టిగా అడిగితే అధికారం ఉండటంతో ఏం చేస్తారోనన్న భయంతో ప్రాధేయ పడుతూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో సమావేశాలు పెట్టుకుని కీలక నేత తీరుపై ఆవేదన వ్యక్తం చేయడమే కాకుండా ఏం చేస్తే...ఆ డబ్బులు వెనక్కి వస్తాయో అన్నదానిపై సమాలోచనలు చేస్తున్నారు. -
వైఎస్ జగన్ను కలిసిన కృష్ణదాస్
వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. జగన్ను కలిసిన వారిలో పార్టీ మహిళా సీనియర్ నాయకురాలు బొడ్డేపల్లి పద్మజ కూడా ఉన్నారు. – శ్రీకాకుళం (పీఎన్కాలనీ) శ్రీకాకుళం పాతబస్టాండ్: నీట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని, అందుకు అన్ని శాఖల సమన్వయంతో చేయాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మే 4న జరగనున్న నీట్ పరీక్షలపై మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు నీట్ పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆయన సమీక్షించారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఆర్జేయూకేటీ–ఎచ్చెర్ల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ–గుజరాతీపేట, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల–శ్రీకాకుళం, కేంద్రీయ విద్యాలయం–శ్రీకాకుళం ఉన్నాయి. మే 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. సమావేశంలో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిరణ్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్, నీట్ సిటీ కోఆర్డినేటర్ సుహాయిబ్ ఆలం, చీఫ్ సూపరింటెండెంట్ పీవీ రమణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పకడ్బందీగా నీట్ పరీక్షలు -
ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ల విలీనం
శ్రీకాకుళం అర్బన్: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న గ్రామీణ ప్రాంతీయ బ్యాంక్ల విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఏర్పాటు చేస్తున్నట్లు బ్యాంక్ రీజనల్ మేనేజర్ లావేటి అనంతరావు మంగళవారం తెలిపారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ (ఏపీజీబీ), ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబీ), చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్(సీజీజీబీ), సప్తగిరి గ్రామీణ బ్యాంక్(ఎస్జీబీ) తదితర బ్యాంక్లన్నీ విలీనమై మే 1 నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా ఏర్పడతాయని చెప్పారు. ఖాతాదారుల నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, బ్రాంచి చిరునామాలలో ప్రస్తుతానికి ఎటువంటి మార్పులు చేయడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న అన్ని సేవలు నిరంతరాయంగా కొనసాగుతాయన్నారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ శ్రీకాకుళం అర్బన్: జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్లో ఉన్న సీనియారిటీ జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మే 2వ తేదీ సాయంత్రం 5గంటలలోగా తెలియజేయవచ్చని డీఈవో ఎస్.తిరుమలచైతన్య మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గడువు దాటిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. -
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకుడిగా
● పార్టీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడిగా కిల్లి సత్యనారాయణ సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు పరిశీలకునిగా ఎమ్మెల్సీ కుంభా రవిబాబు నియమితులవ్వగా, విజయనగరం పార్లమెంటు పరిశీలకునిగా కిల్లి సత్యనారాయణ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీనియారిటీకి ప్రాధాన్యత కల్పించారు. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు జిల్లా నాయకులందరికీ సుపరిచితులు. మంచి వాగ్ధాటి, సమస్యలపై అవగాహన ఉన్న నాయకునిగా గుర్తింపు ఉంది. కిల్లికి పెద్ద బాధ్యతలు.. పార్టీలో సీనియర్ నేతగా, రెండు పర్యాయాలు ఎంపీపీగా, సుదీర్ఘకాలం సర్పంచ్గా పనిచేసి ఆమదాలవలస నియోజకవర్గ నేతగా గుర్తింపు, అనుభవం ఉన్న కిల్లి సత్యనారాయణను విజయనగరం పార్లమెంటు పరిశీలకునిగా నియమించడం ఆయనకు దక్కిన గౌరవంగా కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న కిల్లి సత్యనారాయణకు ఇప్పుడు పార్లమెంటు పరిశీలకుడు అనే పెద్ద బాధ్యతను వైఎస్ జగన్ అప్పగించారు. అధినేత నమ్మకాన్ని నిలబెట్టి, ఇచ్చి న బాధ్యతను వందశాతం నిర్వర్తించి పార్టీ విజయానికి అహర్నిశలు పనిచేస్తానని చెబుతూనే, తనను గుర్తించిన అధినేతకు కిల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. కుంభా రవిబాబు కిల్లి సత్యనారాయణ -
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
రణస్థలం: రణస్థలం మండల కేంద్రంలోని దన్నానపేట సమీపంలో సోమవారం రాత్రి మూడు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. జె.ఆర్.పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటరావుపేటకు చెందిన అమరాపు బ్రహ్మాజీరావు రణస్థలం నుంచి స్వగ్రామం బైక్పై వెళ్తుండగా, అతనే పక్కనే మరో ద్విచక్ర వాహనం ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన మరో ఒక ద్విచక్రవాహనం పరస్పరం ఢీకొట్టుకున్నాయి. మూడు బైకులు కింద పడటంతో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రణస్థలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. బ్రహ్మజీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఏఎస్ఐ సీహెచ్ లక్ష్మణరావు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి బండిపాలెం వద్ద సగం వేసి వదిలేసిన రోడ్డే కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లింట విషాదం సరుబుజ్జిలి: మండలంలోని మూల సవలాపురం గ్రామానికి చెందిన గుడాల అప్పారావు(57) సోమవారం రాత్రి కొత్తకోట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. ఇతని కుమారుడి వివాహం మే 13న నిశ్చయించారు. భార్య కుమారితో కలిసి పెళ్లి కార్డులు పంచేందుకు వెళ్లి ఏబీ రోడ్డులో స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి భార్య కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ జనార్దనరావు తెలిపారు. వీఆర్కు గార ఎస్ఐ గార : గార పోలీస్ స్టేషన్ ఎస్ఐ రెళ్ల జనార్దనరావును శాఖాపరమైన చర్యల్లో భాగంగా శ్రీకాకుళం వీఆర్కు బదిలీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గార ఇన్చార్జి ఎస్ఐగా శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణకు బాధ్యతలు అప్పగిస్తారని విశ్వసనీయ సమాచారం. -
బాలికపై అఘాయిత్యం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా కేంద్రంలో తొమ్మిదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం వేరే నగరంలో నివసిస్తున్న బాలిక సెలవుల్లో శ్రీకాకుళంలో తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. బాలికకు తండ్రి లేరు. ఈ నెల 28న ఆ బాలిక ఎదురింటిలో ఉన్న 26 ఏళ్ల యువకుడు ఇంటిలో ఎవరూ లేని సమయం చూసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత తన మేనత్త వద్ద బాలిక ఈ విషయాన్ని చెప్పగా.. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా తొమ్మిదిరోజులు రిమాండ్ విధించారని ఎస్ఐ హరికృష్ణ వెల్లడించారు. -
మూడు తులాల బంగారం చోరీ
ఎల్.ఎన్.పేట: మండలంలోని చింతలబడవంజ కాలనీలో రొంపివలస రమణ ఇంట్లో సోమవారం రాత్రి చోరీ జరిగింది. సోమవారం వర్షం పడిన తరువాత విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో బయట వరండాలో నిద్రపోయామని, మంగళవారం ఉదయం నిద్రలేచిన తరువాత ఇంట్లోకి వెళ్లేసరికి బీరువా తలుపులు తెరిచి ఉన్నాయని బాధితుడు రమణ తెలిపారు. బీరువాలో మూడు తులాల బంగారు నగలు, పది తులాల వెండి, రూ.9వేలు నగదు దొంగలు ఎత్తుకెల్లిపోయారని బాధితుడు మంగళవారం సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆమదాలవలస సీఐ సత్యనారాయణ, ఎస్సై బాలరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
రమణమూర్తికి ఈఓగా పదోన్నతి
అరసవల్లి: అరసవల్లి ఆలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కుప్పన్నగారి రమణమూర్తికి గ్రేడ్–3 ఈవోగా పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి గతేడాది అరసవల్లి ఆలయానికి బదిలీపై రాగా.. తాజా పదోన్నతితో మళ్లీ విజయనగరంలో 6–సి ఆలయానికి కార్యనిర్వహణాధికారిగా మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం అరసవల్లి ఆలయంలో అన్నదాన ప్రసాదాల సెక్షన్ ఇన్చార్జిగా ఉన్న ఈయనకు పదోన్నతి రావడంపై ఆలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ‘ఆదిత్య’లో జాతీయ స్థాయి పోటీలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆన్లైన్ ద్వారా జాతీయ స్థాయి పోటీలు నిర్వహించినట్లు కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల, ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యూత్ అసోషియేషన్ ఆధ్వర్యంలో క్విజ్, డిజిటల్ పోస్టర్ మేకింగ్, వ్యాసరచన, స్లోగన్ రైటింగ్, అవేర్నెస్ రీల్స్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. హోంగార్డు కుటుంబానికి సాయం శ్రీకాకుళం క్రైమ్ : హోంగార్డు పి.పైడిరాజు ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి రూ.4.07 లక్షల నగదు చెక్కును మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అందజేశారు. సహచర హోంగార్డుల ఒక్కరోజు వేతనాన్ని ఈవిధంగా అందించారు. నీలమణి దుర్గ ఉత్సవాలు ప్రారంభం పాతపట్నం: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం నీలమణిదుర్గ అమ్మవారి 50వ వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమపూజ, అష్టోత్తర శతనామ పూజ, హోమాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సుదీష్ఠ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మే 7 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని ఈవో టి.వాసుదేవరావు చెప్పారు. పూజా కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ సన్యాసిరావు, బాబ్జీ, సతీష్, మడ్డు రామారావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఒడిశా గవర్నర్కు స్వాగతం కంచిలి: మండలంలోని దాలేశ్వరం గ్రామంలోని సోలార్ ప్లాంట్ వద్దకు మంగళవారం విచ్చేసిన ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుకు మండల అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన్ను కలిసి రోడ్డును అభివృద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ ఎన్.రమేష్కుమార్, ఎంపీడీఓ వి.తిరుమలరావు, ఈఓపీఆర్డీ పి.ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
నిషేధమేనా..?వేటకు వెళ్లేవారిపైనా ప్రభుత్వం నిషేధం విధిస్తోంది. భృతి ఇవ్వకుండా వేధిస్తోంది. –8లో
వైఎస్సార్సీపీ శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్తగా తమ్మినేని సీతారాం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం పార్లమెంట్ వైఎస్సార్ సీపీ సమన్వయకర్తగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం నియమితులయ్యారు. తాజాగా పార్టీ పరిశీలకుల నియామకాల నేపథ్యంలో తమ్మినేని సీతారాంను పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తమ్మినేని నియామక ఉత్తర్వులను పార్టీ కార్యాలయం మంగళవారం రాత్రి జారీ చేసింది. అపార అనుభవం ఉన్న నాయకుడిగా, పార్లమెంట్ పరిధిలో అందరికీ పరిచయం ఉన్న నేతగా, పార్టీలో సీనియర్ నేతగా గుర్తించి పార్లమెంట్ సమన్వయకర్త బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే పార్టీ రాజకీయ సలహా కమిటీ(ిపీఏసీ) సభ్యులుగా ఉన్న తమ్మినేనికి తాజా గా పార్లమెంట్ బాధ్యతలు అప్పగించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. -
రోడ్డు పక్కనే వ్యర్థాలు ఎన్నెన్నో అనర్థాలు
ఈ చిత్రం ఎచ్చెర్ల నుంచి చిలకపాలెం వెళ్లే దారిలో ఉన్న ఫ్లై ఓవర్ సమీపంలోనిది. పారబోసిన వ్యర్థాలు ఏమిటో తెలుసా.. కాలం చెల్లిన సిరప్లు. ఇలా ఎక్స్పైర్ అయిన మందుల్ని ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. ఇలా భూమిలో కలిపేయడం కూడా ప్రమాదమే. కానీ ఇలా మందుల్ని ఇష్టానుసారం పారవేయడం ఈ ప్రాంతంలో నిత్యకృత్యంగా మారింది. పొందూరు మండలం రాపాక జంక్షన్ నుంచి కృష్ణాపురం వచ్చే మార్గంలోని రహదారి ఇది. చిత్రంలో ఉన్నవేమిటో తెలుసా.. బాయిలర్ కోళ్లకు సంబంధించిన వెంట్రుకలు.. ఇతర పౌల్ట్రీ వ్యర్థాలు. అసలే బర్డ్ ఫ్లూ వంటి వ్యాధుల ముప్పు పొంచి ఉన్న తరుణంలో ఇలా పౌల్ట్రీ వ్యర్థాలను జాతీయ రహదారి పక్కనే పారవేయడం ఎంత వరకు సమంజసం. డంపింగ్ యార్డులుగా రహదారులు ● కుప్పలుతెప్పలుగా వ్యర్థాల పారబోత ● రహదారుల వెంబడి దుర్వాసన ● అధికారుల చోద్యం ● ఇబ్బందుల్లో ప్రజానీకం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రహదారుల పక్కన వ్యర్థాలు డంపింగ్ అవుతున్న విషయంపై ‘సాక్షి’కి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఎచ్చెర్ల నుంచి పొందూరు మండలం రాపాక వరకు 25 కిలోమీటర్ల దూరాన్ని ‘సాక్షి’ క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. పరిశీలనలో భయంకరమైన వ్యర్థాలు ఎలా పారబోస్తున్నారో వెల్లడైంది. పర్యవేక్షణ లేదనే విషయం కూడా పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. చాలా కాలంగా ఈ తంతు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే చాలు.. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిలో చీకటి పడితే చాలు. వ్యర్థాల డంపింగ్ గుట్టుగా సాగిపోతోంది. భవన నిర్మాణ వ్యర్థాలు.. మెడికల్ వేస్టేజ్.. ఫౌల్ట్రీ వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక పాలిథిన్ మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడైనా ఫంక్షన్ జరిగిందో అంతే సంగతులు.. ఆ ఊరి చివరి గుట్టలుగుట్టలుగా పాలిథిన్ వ్యర్థాలు దర్శనమివ్వడం పరిపాటిగా మారిపోయింది. వందలాది మంది రాకపోకలు.. ● ‘సాక్షి’ పరిశీలించిన ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు.. వందలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. ● డంపింగ్ జరుగుతున్న ప్రదేశాలకు సమీపంలో కళాశాలలు.. వసతి గృహాలు ఉన్నాయి. ● అత్యధిక సంఖ్యలో విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ● కూరగాయల విక్రయాలు కూడా వీటికి సమీపంలోనే సాగుతున్నాయి. ● మూగజీవాలు అత్యధికంగా సంచరించే ప్రదేశాలు కూడా ఇందులో ఉన్నాయి. ● ఇవేమీ పట్టనట్టుగా వ్యర్థాలను పారబోస్తూ కొందరు పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారు. ● ఈ అంశంపై పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ● ఈ వ్యర్థాల పారబోతకు అడ్డుకట్ట వేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని వారు కోరుతున్నారు. ఇది కూడా పొందూరు మండలం రాపాక జంక్షన్ నుంచి కృష్ణాపురం వచ్చే మార్గమే. ఈ చిత్రంలో మూటలా ఉన్నవి ఏమిటో తెలుసా.. సోఫాలకు వినియోగించే లెదర్ షీట్ ముక్కలు. వీటిని ఇలా మూటలుగా కట్టి డంప్ చేస్తున్నారు. పౌల్ట్రీ వ్యర్థాలతో అనర్థాలు హైవే పక్కన దాదాపు వెయ్యి వరకు పౌల్ట్రీ ఫారాలు ఉన్నా యి. వీటి వ్యర్థాలను నిర్వీ ర్యం చేసే విషయంలో ఎవరికీ అవగాహన లేదు. వ్యర్థాలను రోడ్డు పక్కనే పడేస్తున్నారు. దీని వల్ల వెంట్రుకలు గాలిలోకి ఎగిరి వాహనదారుల కళ్లలో పడుతున్నాయి. అలాగే సింథటిక్, లెదర్, ప్లాస్టిక్ వంటి వాటిని గొయ్యి తీసి పూడ్చాలి. లేదంటే ప్రమాదకరం. ఎలక్ట్రానిక్ వేస్టు వల్ల కూడా ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతాయి. – కొమ్ము రమణమూర్తి, డైరెక్టర్, స్వీప్ స్వచ్ఛంద సేవా సంస్థ డంపింగ్ పెరిగింది జనావాసాల్లో విచ్చలవిడిగా చెత్త డంపింగ్ పెరుగుతోంది. మనం వినియోగించే వస్తువుల్లో ఎలక్ట్రికల్తో పాటు పాలిథిన్ వస్తువులు పర్యావరణానికి, ప్రజల జీవన మనుగడకు ఎంతో ప్రమాదకరం. సాగునీటి వనరుల సమీపంలో వ్యర్థాలు వేయడం వలన ఒక వైపు వ్యవసాయంతో పాటు మరో వైపు భూగర్భ జలాలు విష పూరితంగా మారుతున్నాయి. దీనిపై పంచాయతీ యంత్రాంగం జాగ్రత్తలు తీసుకోవాలి. –కె.ధర్మారావు, ప్రజా సంఘాల నాయకుడు, టెక్కలి అత్యంత ప్రమాదకరంగా పర్యావరణం చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఊర్లను నదులను స ముద్రాలను చెత్తకుండీలుగా మార్చడం వల్ల నేల, నీరు, గా లి, భూగర్భ జలాలు కలుషితం కావడమే కాక అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. మనం వాడి పడేసే అనేక వ్యర్థ పదార్థాల్లో గంధకం ఒకటి. ఇది వాతావరణంలో సల్ఫర్ డైఆకై ్సడ్ విడుదల చేస్తుంది. ఇది విష వాయువు. వస్తువులను రీసైకిల్ చేసి వాటి నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం అనేది చాలా కీలకం. దీనిపై అవగాహన కలిగి ఉండాలి. – ఎం.పద్మనాభరావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, టెక్కలి ఈ ప్రాంతమూ రాపాక పరిసరమే. తెల్లగా ఉన్నదేమిటో తెలుసా.. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్. భవన నిర్మాణాల్లో సీలింగ్ కోసం వినియోగించి ఆ వ్యర్థాలను ఇలా రహదారి పక్కనే పారవేస్తున్నారు. ఇవి గాజు పెంకులు కాదండోయ్. అత్యంత ప్రమాదకరమైన వాయువులుండే టీవీలకు సంబంధించిన పిక్చర్ ట్యూబ్లు. వీటిని పెద్ద ఎత్తున రాపాక సమీపంలో డంప్ చేసేస్తున్నారు. వాటిని పగలకొట్టి మరీ పారేస్తున్నారు. ఆ సమయంలో ప్రమాదకర వాయు వులు పర్యావరణంలో కలుస్తున్నాయి. చిలకపాలెం నుంచి పొందూరు వెళ్లే రోడ్డు ఇది. చిలకపాలెం గ్రామ సరిహద్దుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా డంప్ అవుతున్నా అడిగే నాథుడే లేడు. చూడండి రోడ్డు పొడ వునా ఎలా స్వాగతం పలుకుతున్నాయో..! -
గురుకులాల సమస్యలపై వినతి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకులాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని, భవనాలకు మరమ్మతులు చేయించాలని, పారా మెడికల్ కోర్సులు ప్రవేశ పెట్టాలని, డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచాలని దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. 2024 డిసెంబర్లో అంబేడ్కర్ వర్థంతి నుంచి 2025 ఏప్రిల్లో అంబేడ్కర్ జయంతి వరకు చేపట్టిన గురుకులాల సర్వే వివరాలను సైతం కలెక్టర్కు అందించారు. కార్యక్రమంలో సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పేడాడ కృష్ణారావు, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల గోపి, సమతా సైనిక్ దళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్ల రామారావు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్గోపాల్, ఎస్సీ ఎస్టీ విజిలెనన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దండాసి రాంబాబు, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు, రెల్లి కుల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు అర్జి కోటి, మాదిగ రిజర్వేషన్ల పోరాట సాధన సమితి నగర కార్యదర్శి కానుకుర్తి గోవింద్, మాలమహానాడు నాయకులు ముచ్చ శ్యామ్, సమతా సైనిక్ దళ్ జిల్లా నాయకులు వన్నెలు లక్ష్మీనారాయణ, బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు చీర రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే మద్యం వ్యాపారం
● మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ధ్వజం పాతపట్నం: మండల కేంద్రం పాతపట్నంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. మద్యం షాపు వద్ద స్థానికులు, పార్టీ నాయకులతో కలిసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రోత్సాహంతోనే ఇళ్ల మధ్య మద్యం వ్యాపారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కాలనీకి చెందిన మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. అధికారులు వెంటనే మద్యం దుకాణం ఎత్తివేయించాలన్నారు. లేకపోతే ఎమ్మెల్యేపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామన్నారు. మద్యం దుకాణాలు దేవాలయాలు, పాఠశాలలు, హైవేకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఐటీ వింగ్ విభాగం ప్రతినిధి ఎనుగుతల సూర్యం, జిల్లా సెక్రటరీ అమర రమణ, నాయకులు గోకవలస రాము, వంశీ, ఫల్గుణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వేటకు వెళ్లేవారిపైనా.. నిషేధమేనా?
ఈ చిత్రంలో ఉన్న మత్స్యకారుడి పేరు వారాధి ఎర్రయ్య. రణస్థలం మండలం ఎర్రముక్కాం గ్రామం. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సార్లు వేట నిషేధ భృతి అందుకున్నాడు. ఈ ఏడాది కూడా వేటనిషేద భృతి తొలి జాబితాలో పేరుంది. చివర్లో రాజకీయ కారణాలతో పేరు తప్పించేశారు. అర్హత ఉన్నా తన పేరును తప్పించేసి కూటమి నాయకులు తమకు నచ్చినవాళ్లకు ఇప్పించుకున్నారని వాపోతున్నాడు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 11 మండలాల్లో మత్స్యకార కుటుంబాలు సముద్రపు వేటతో జీవనాధారంగా సాగిస్తున్నారు. ఇందులో వేటనిషేధ కాలంలో అందాల్సిన భృతికి అనర్హులుగా మత్స్యశాఖాధికారులు మొత్తం 511 మంది అని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్లో 31, గారలో 106, ఎచ్చెర్లలో 60, రణస్థలంలో 106, కవిటిలో 61, వజ్రపుకొత్తూరులో 35, పోలాకిలో 41, సోంపేటలో 32, సంతబొమ్మాళిలో 27, ఇచ్ఛాపురంలో 08, మందసలో నలుగురు చొప్పున మత్స్యకారులు అనర్హులుగా గుర్తించారు. వాస్తవానికి ఒక్క శ్రీకాకుళం రూరల్ మండలంలోనే వంద మందికి పైగా అర్హులకు కరెంట్ బిల్లు పెరుగుదల, ఇతర కారణాలు చెప్పి పథకాన్ని వర్తింపజేయలేదు. గార, సంతబొమ్మాళిలలో కూడా ఈ సంఖ్య రెట్టింపుగా ఉంది. దీని ప్రకారం జిల్లా వ్యాప్తంగా మరో 1200 మంది వరకు అర్హులకు ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉందనే మత్స్యకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.● వేట నిషేధ భృతి మంజూరులో వెలుగుచూస్తున్న ‘కూటమి’ నేతల లీలలు ● పథకం వర్తించక ఆవేదనలో సుమారు 1200 మంది మత్స్యకారులు ● సుమారు ఐదు వేల మందితో ‘సగం వాటా’ ఒప్పందం! ● గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పథకం వర్తింపు అరసవల్లి: గడిచిన ఐదేళ్లలో కనిపించని, వినిపించని మత్స్యకార జీవన కష్టాలు, అవస్థలు కూటమి ప్రభుత్వంలో మళ్లీ మొదలయ్యాయి. సముద్రంలో వేట నిషేధ కాలంలోనే ఉపాధి కోల్పోయిన వేట మత్స్యకారులకు రాష్ట్ర సర్కార్ పొట్టకొట్టింది. ఇప్పటికే గతేడాది వేట నిషేధ కాలంలో రావాల్సిన భృతిని ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు వివిధ రకాల ఆంక్షల కారణంగా అర్హులైన వేట మత్య్సకారులకు భృతి రాకుండా అడ్డుపడింది. ఇదే సమయంలో అనేక మంది అనర్హులకు పథకం వర్తింపజేసి వారికి మంజూరైన సొమ్మును కూటమి నాయకులు సగం.. సగం పంచుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 11 మండలాల్లో 15548 మంది మాత్రమే మత్స్యకార చేయూత పథకానికి అర్హులంటూ అధికారికంగా ప్రకటించి ఇటీవల ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున లబ్దిదారుల ఖాతాల్లో ఇటీవల జమ చేసింది. ఇదిలావుంటే అన్ని అర్హతలుండి.. కేవలం కూటమి సర్కార్ ఆంక్షలు, రాజకీయ కుట్రల ఫలితంగా పథక లబ్ధికి దూరమైన సుమారు 12 వందల మంది వరకు మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, వాస్తవ సర్వేను క్షేత్ర స్థాయిలో మళ్లీ చేపట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అనర్హులంటూ జాబితాలో తప్పించేసి..! అనర్హుల విషయంలోనే లెక్కల్లో భారీ తేడాలు కనిపిస్తున్నాయి. మత్స్యశాఖ లెక్కలు ప్రకారం మొత్తం 511 మంది మాత్రమే ఈ పథకానికి అనర్హులుగా తేల్చారు. వీరంతా నిబంధనల ప్రకారం పథక లబ్ధికి అర్హులు కారని స్పష్టం చేశారు. వాస్తవానికి కూటమి అధికారిక జెండాలు పట్టుకున్న కార్యకర్తల చేతిలోనే చాలావరకు జాబితాలు గల్లంతయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చాలావరకు ఇవే కారణాలతో తుది జాబితాలో పేర్లను మార్చేశారని సమాచారం. దీంతో అనధికారికంగా ఈ అనర్హుల జాబితా 1200 మందికి పైగా ఉందనే లెక్కలున్నాయంటూ మత్స్యకార సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అయినప్పటికీ కూటమి సర్కార్ మాత్రం సంఘ ప్రతినిధులు, వాస్తవ లెక్కలను బేఖాతరు చేస్తూ..తాము ప్రకటించిన వారికే పథకాల లబ్ధి అంటూ వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారికి ఇతర సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి జరగదని, ఇతర పథకాలకు అనర్హులంటూ కూటమి సర్కార్ మెలిక పెట్టడంపై ఇప్పటికే మత్య్సకారులు మండిపడుతున్నారు. సీఎం వద్దకు వెళ్లకుండా ఆంక్షలు.. బుడగట్లపాలెంలో మత్స్యకారులకు భృతి అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వచ్చిన సందర్భంగా గత ఏడాది వేట నిషేధ భృతి అందని వారు, అలాగే తాజాగా భృతి అందాల్సిన జాబితాలో పేరులేని అర్హులు, బాధితులెవ్వరూ సీఎం సభకు వెళ్లకుండా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పక్కాగా వ్యవహారం నడిపించారు. సీఎం వద్దకు ఎవ్వరి నినాదాల స్వరాలు వెళ్లకుండా, వినిపించకుండా అడ్డుకున్నారు. ఇతర సంక్షేమ పథకాలకు దూరమవుతారంటూ హెచ్చరికలు జారీ చేశారని తెలుస్తోంది. వాటాల పంపకాల్లో పొరపచ్చాలు! జిల్లాలో 11 మండలాల్లో ఇప్పటికి 15548 మంది అర్హులకు మాత్రమే మత్స్యకార చేయూత కార్యక్రమాన్ని అందించారు. ఒక్కొక్కరికి రూ.20 వేలు కాగా, అందులో నీకు రూ.10 వేలు..నాకు 10 వేలు అంటూ...వారికి అందుబాటులో ఉన్న వారి పేర్లను (మత్స్యకార కుటుంబాలకు చెందిన వారు) జాబితాలో చేర్చుకుని.. ముందస్తు ఒప్పందం ద్వారా బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ కాగానే సగం సగం సర్దుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఇలా సుమారు ఐదు వేల మంది వరకు ఉన్నారని సమాచారం. ఈ వాటాల పంపకాల్లో కూటమి నేతల్లో సైతం పొరపొచ్చాలు వచ్చేశాయని తెలుస్తోంది. -
మార్గాలు..దుర్మార్గాలు
టీడీపీ నేతల భూములకు ఉపాధి నిధులతో రోడ్లు సరుబుజ్జిలి మండలం దాకరవలస పంచాయతీలోని సూర్యనారాయణపురం రహదారి ఇది. ఏబీ రోడ్డు నుంచి టీడీపీ నాయకుడు అంబల్ల రాంబాబు పొలాల వరకు రూ.40 లక్షలతో సీసీ రోడ్డు వేసేందుకు మంజూరు చేశారు. ఈ రోడ్డు వేస్తే టీడీపీ నాయకుడికి తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదు. చెరువు గర్భం మీదుగా రోడ్డు ప్రతిపాదించడంతో దిగువ ప్రాంతాలైన నక్కలపేట, పెద వెంకటాపురం, చిన వెంకటాపురం గ్రామాలకు సాగునీటి సమస్య కూడా ఉత్పన్నం కానుంది. ● మెటీరియల్ కాంపోనెంట్ నిధులు దుర్వినియోగం ● నాయకుల పొలాలు, కొబ్బరి తోటలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు సీసీ రోడ్లు ● టీడీపీ నాయకులు చెప్పినట్టుగా వ్యవహరించిన అధికారులు ఆమదాలవలస మండలం కొర్లకోట గ్రామంలో కొత్తగా వేసిన సీసీ రోడ్డిది. ఇక్కడ అప్పటికే మంచి సీసీ రోడ్డు ఉంది. చెక్కు చెదరలేదు. కానీ, మళ్లీ అదే రోడ్డుపై కొత్తగా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో సీసీ రోడ్డు వేశారు. కవిటి మండలం డి.గొనపుట్టుగలో కొత్తగా వేసిన సీసీ రోడ్డిది. ఇక్కడేమి జనసంచారం లేదు. కానీ, కొబ్బరి తోటలు ఉన్నాయి. ఆ తోటల మధ్య సీసీ రోడ్డు వేశారు. భవిష్యత్ లేఅవుట్ వేయాలన్న ఆలోచనలో భాగంగానే వ్యూహాత్మకంగా సీసీ రోడ్డు వేసినట్టు తెలుస్తోంది. రికార్డుల్లో ఆర్అండ్బీ రోడ్డు నుంచి హనుమాన్ విగ్రహం వరకు అంటూ శిలాఫలకంపై రాతలు రాశారు. కానీ, సగం వరకు(కొబ్బరి తోటలకు ఉపయోగపడే విధంగా) వేసి వదిలేశారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్ స్వగ్రామం పక్కనున్న పంచాయతీ ఇది. కవిటి మండలం సీహెచ్ జల్లుపుట్టుగలో వేసి రోడ్డు ఇది. ఇక్కడ కూడా జనసంచారం లేదు. కొబ్బరి తోటలకు విలువ పెరిగేలా వాటి మధ్య వేసిన రోడ్డు ఇది. భవిష్యత్ లేఅవుట్ వేసి లబ్ధి పొందాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగా ముందస్తుగా వేసిన రోడ్డుగా తెలుస్తోంది. మరిడమ్మ గుడి వరకు సీసీ రోడ్డు వేసినట్టు శిలాఫలకంలో రాసినప్పటికీ సగం వరకు మాత్రమే వేశారు. పొందూరు మండలం బాణాం పంచాయతీ తానేం గ్రామ శివారులో కొత్తగా వేసిన సీసీ రోడ్డు ఇది. వాస్తవానికి, ఈ రోడ్డు వేసిన వైపు ఒక్క ఇళ్లు లేదు. అలాగని మరో గ్రామం లేదు. కేవలం టీడీపీ నాయకుడి రియల్ ఎస్టేట్ వెంచర్కు ఉపయోగపడే విధంగా మాత్రమే రోడ్డు వేశారు. దానికోసం రూ.37లక్షలు ఖర్చు పెట్టారు. -
శ్రీకాకుళం
గ్రీవెన్స్కు 165 వినతులుకలెక్టర్ గ్రీవెన్స్కు 165 వినతులు వచ్చాయి. బాధితులు సమస్యలు ఏకరువు పెట్టారు. –8లో మంగళవారం శ్రీ 29 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025● రాణిస్తున్న సిక్కోలు నాట్యకారులు ● జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం బరంపురంలో డిగ్రీ చదువుతున్న మోనాలీదాస్ నృత్య ప్రదర్శనల్లో జాతీయ స్థాయిలో రాణిస్తోంది. మోనాలీ తల్లి మనోజ్ మంజరీ త్రిపాఠీ ఇ చ్ఛాపురం మండలం తేలుకుంచి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒడియా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి లక్ష్మణదాస్ ఒడిశాలో ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. తండ్రి వద్దే నృత్యం నేర్చుకున్న మోనాలీ కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీలో ప్రావీణ్యం సంపాదించింది. పలు చానెళ్లలోనూ ప్రదర్శనలు ఇచ్చింది. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన మంగి మాధవరావు లారీ డ్రైవర్. తల్లి దాలమ్మ గృహిణి. వీరి కుమార్తె దివ్య పలు రాష్ట్రాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి ప్రదర్శనలు ఇచ్చింది. స్వేచ్ఛా నృత్య తరంగణి నృత్య శిక్షణాలయంలో నృత్యం నేర్చుకున్న దివ్య గిన్నిస్ రికార్డు అందుకున్న సిలికానాంధ్ర కూచి పూడి ప్రదర్శనలోనూ పాల్గొంది. విజయవాడలో జరిగిన పోటీల్లో మూడు సార్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. సుమారు 800 వరకు నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. న్యూస్రీల్జాతీయ స్థాయిలో రాణిస్తూ.. లారీ డ్రైవర్ కుమార్తె -
పట్టుబట్టి.. పూర్తి చేసి..
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గకు చెందిన హరిముకుందపండా అనే వ్యక్తి కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లగా అక్కడ దర్శన సమయంలో అవమానం జరిగిందని భావించి ఏకంగా రూ.పది కోట్లతో 12 ఎకరాల విస్తీర్ణంలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి పూను కున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆలయ నిర్మాణం పూర్తికావడంతో సోమవారం నుంచి ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఎవరి నుంచి చందాలు వసూలు చేయకుండా, ఏ ఇంజినీర్ల సలహాలు, సూచనలు లేకుండా 83 ఏళ్ల వయసులో హరి ముకుందపండా స్వీయ పర్యవేక్షణలో కోవెల పనులు పూర్తి చేయడం విశేషం. మూడు రోజులు పాటు ప్రతిష్టామహోత్సవాలు, సహస్ర చండీ మహాయజ్ఞం జరగనున్నాయి. కాశీబుగ్గలో నిర్మించిన వెంకన్న గుడి -
ఎమ్మెల్యే తండ్రి, సోదరులు..రౌడీలతో బెదిరిస్తున్నారు!
ఎమ్మెల్యే తండ్రి, సోదరుడు..రౌడీలతో బెదిరిస్తున్నారు! శ్రీకాకుళం క్రైమ్ : తాత వారసత్వంగా వచ్చిన తమ ఆస్తిని ఎమ్మెల్యే తండ్రి, సోదరుడు ఆక్రమించుకోవడమే కాక కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణం చేపడుతున్నారని.. అడ్డుకోవాల్సిన మున్సిపాలిటీ అధికారులు రాజకీయ పలుకుబడికి తలొగ్గుతున్నారని.. ఎమ్మెల్యేతో గొడవపడొద్దు.. ఆస్తి వదిలి వెళ్లిపోండని పోలీసులు కూడా అంటున్నారని ఓ మహిళ వాపోయింది. ఈ మేరకు కొత్తూరు మండల కేంద్రానికి చెందిన లోతుగెడ్డ కృష్ణవేణి తన భర్త శ్రీరామదూతం, కుటుంబీకులతో కలిసి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్కు హాజరై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరుడు గొండు గంగాధర్, వారి తండ్రి, ఎంపీపీ గొండు జగన్నాథంలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 27న బలగ వార్డులో ఉన్న తమ ఆస్తి ఉన్న ప్రాంతానికి వెళ్తే గంగాధర్, జగన్నాథంలు రౌడీలతో వచ్చి బెదిరించి తోసేయడమే కాక మారణాయుధాలతో దాడి చేసే ప్రయత్నం చేశారని, తమ ప్రాణానికి హాని ఉన్నందున రక్షణ కల్పించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అన్యాయం చేయడం తగదు.. అనంతరం బాధితురాలు విలేకరులతో మాట్లాడారు. బలగ వార్డులో డోల సూర్యానారాయణకు ఆస్తులండేవని.. అందులో 690/1లో 86 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు గల స్థలాన్ని తన తల్లి కాండవ జ్యోతికి రిజిస్ట్రేషన్ చేసి తాత ఇచ్చారన్నారు. తన తల్లి జ్యోతి తాత సూర్యనారాయణ ద్వారా దాఖలు పడిన స్థలాన్ని కుమార్తైనెన తనకు ఇచ్చారని కృష్ణవేణి చెప్పారు. ఈ మేరకు 1981 మార్చి 16న రిజిస్టర్ సెటిల్మెంట్ దస్తావేజు నెంబరు 837/1981 దఖలుపరిచారన్నారు. ఇదే స్థలంపై తమకి ఎటువంటి రక్తసంబంధీకురాలు కాని రౌతు జయలక్ష్మి అనే మహిళ గిఫ్ట్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యిందని తెరపైకి వచ్చిందన్నారు. వివాదాలు నడిచి కోర్టుకు వెళ్లగా జయలక్ష్మి పిటిషన్ను డిస్మిస్ చేశారన్నారు. ఇంతలో స్థలాన్ని జయలక్ష్మి తనకు విక్రయించిందని ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గొండు శంకర్ సోదరుడు గంగాధర్ తెరపైకి తీసుకురావడం అన్యాయమన్నారు. ఇదే విషయమై ఎమ్మెల్యే గొండు శంకర్ వద్ద ‘సాక్షి’ ఫోన్లో ప్రస్తావించగా ల్యాండ్కు సంబంధించి డాక్యుమెంట్లు తమ సోదరుని వద్దనున్నాయని, అధికారులు నిర్మాణాలకు అనుమతులిచ్చారని, స్థలాన్ని తమ సోదరుడు గంగాధర్కు కాంగ్రెస్ సీనియర్ నేత రౌతు సీతారాంస్వామి కుమారుడు అమ్మారని.. వివాదంలో ఉన్నవి తామెందుకు కొంటామని అన్నారు. ఇవన్నీ ఓ వ్యక్తి వెనకుండి నడిపిస్తున్నారని, గతంలో నిర్మాణం చేపట్టినప్పుడు మున్సిపాలిటీ వారు కూల్చేశారో.. కృష్ణవేణికి సంబంధించిన రౌడీమూకలు కూల్చేశారో తెలియదని స్పష్టం చేశారు. ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి.. ఎస్పీ గ్రీవెన్స్లో మొరపెట్టుకున్న మహిళ -
వలస కూలీ అనుమానాస్పద మృతి
టెక్కలి రూరల్: టెక్కలి మండలం అక్కవరం గ్రామానికి చెందిన నెయ్యిల జోగారావు(45) అనే వలస కూలీ విశాఖపట్నం జిల్లా ఆనందపురంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జోగారావు జీవనోపాధి కోసం ఇటీవల ఆనందపురంలోని రైస్ మిల్లులో డ్రైవర్గా జాయినయ్యాడు. రెండు రోజుల క్రితం మిల్లు నిర్వాహకులు ఫోన్ చేసి జోగారావు నిత్యం మందు తాగుతున్నాడని, పనికి సైతం సరిగా రావడం లేదని భార్యకు విషయం తెలియజేశారు. ఇంతలో సోమవారం ఉదయం టాటా మ్యాజిక్ వ్యాన్లో ఐదుగురు కలాసీలు జోగారావు మృతదేహాన్ని తీసుకొచ్చారు. దీంతో భార్య, గ్రామస్తులు నిర్ఘాంతపోయారు. మృతిపై తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఇలా ఇంటికి తీసుకురావడం వెనుక ఏదో కుట్ర ఉందంటూ టెక్కలి పోలీసులను ఆశ్రయించారు. అయితే ముందుగా పోలీసులు తమకు సంబంధం లేదని, ఏదైనా ఉంటే విశాఖ పోలీసులతో మాట్లాడుకోవాలని చెప్పారు. చివరకు జీరో ఎప్ఐఆర్ వేసి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. జోగారావుకు భార్య నీలవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 165 వినతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల ఫిర్యాదులు ఆలస్యం కాకుండా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్(గ్రీవెన్స్) కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ వివిధ సమస్యలపై 165 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని నిర్ణీత గడువులోపే పరిష్కరించాలన్నారు. ఆలస్యం చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో కొన్ని శాఖలు వెనుకబడి ఉన్నాయని.. ఆయా విభాగాల అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యపడని ఫిర్యాదులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు అవకాశం కల్పించాలి ● కుప్పిలి మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో అన్యాయంగా డీబారైన ఐదుగురు విద్యార్థులకు మే నెలలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలు పరీక్ష రాయడానికి అనుమతి మంజూరు చేయాలని ప్రజా సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేశారు. ● దివ్యాంగులకు, దీర్ఘకాలిక రోగులకు పింఛను మంజూరి చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే తమకు పింఛన్ మంజూరు చేయాలని ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేటకు చెందిన యతిరాజుల ఢిల్లేశ్వశ్వరరావు తదితరులు వినతిపత్రం అందించారు. -
బొంతలకోడూరు సర్పంచ్ చెక్ పవర్ రద్దు
ఎచ్చెర్ల క్యాంపస్: స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తూ కూటమి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ సర్పంచ్లపై కక్ష సాధిస్తోంది. కారణం లేకుండా తప్పుడు నివేదికలతో చెక్ పవర్ రద్దు చేస్తోంది. తాజాగా బొంతలకోడూరు గ్రామ సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు చెక్ పవర్ రద్దు చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామంలో కూటమి నాయకులు వ్య క్తిగత కక్షతో, ప్రజాప్రతినిధులు ఒత్తిడితో చెక్ పవర్ తొలగించారు. ఇటీవల కూటమి నా యకులు గ్రామంలోని మలిపెద్దివాని చెరువు ఆక్రమణలకు ప్రయత్నించారు. సర్పంచ్ అడ్డుకున్నారు. మరోపక్క పంచాయతీలో కూటమి నాయకులకు వేలు పెట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో వీరు చెక్ పవర్ రద్దుకు కారణాలు అన్వేషించారు. గ్రామానికి రూ. 40 లక్షలు గ్రామ సచివాలయం భవనం మంజూరైంది. ఈ సచివాలయ భవనం కాంట్రాక్టర్కు అప్పగించా రు. కాంట్రాక్టర్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణం ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ఇతర నిర్మాణాలు వద్దని హైకోర్టు తీర్పు మేరకు ఈ భవనం పనులు నిలిపివేశారు. ఇంజినీరింగ్ అధికారుల ఎం–బుక్ రికార్డు మేరకు కాంట్రాక్టర్కు పంచాయతీ నుంచి రూ.1.80 లక్షలు చెల్లించారు. ఇది సర్పంచ్ విధులు దుర్వినియోగంగా కూటమి నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ వ్యక్తిగత దుర్వినియోగం లేదని, పనికి చెల్లింపు మాత్రమే జరిగిందని ఇంజినీరింగ్ అధికారులు సైతం నివేదిక ఇచ్చారు. పంచాయతీ అధికారులు సైతం క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్వహించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చివరికి చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని సర్పంచ్ తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని గూడేం గ్రామంలో వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యలకు పాల్పడిన తల్లీకూతుళ్లు మోదు సావిత్రమ్మ, ఈదల వరలక్ష్మీ మృతదేహాలకు సోమవారం రిమ్స్ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సావిత్రమ్మ తల్లి బిలాయి నుంచి గూడేం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
30లోగా రిటర్న్లు దాఖలు చేయాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లాలో ఫ్యాక్టరీల చట్టం, 1948 ప్రకారం రిజిస్టరైన రైస్ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, గ్రానైట్ కర్మాగారాలు, స్టోన్ క్రషర్లు, షా మిల్లులు (కర్రల మిల్లులు), ఇతర పెద్ద కర్మాగారాలన్ని ఇంటిగ్రేటెడ్ మాన్యువల్ రిటర్న్లను సమర్పించాలని కర్మాగారాల ఉపముఖ్య తనిఖీ అధికారి రాంబాబు కోరారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 30వ తేదీలోగా సింగిల్ డెస్క్ పోర్టల్ ఏపీ ఇండస్ట్రీస్.జీఓవి.ఇన్లో తప్పనిసరిగా సమర్పించాలని కోరారు. పాలిసెట్కు ముమ్మర ఏర్పాట్లు ఎచ్చెర్ల క్యాంపస్: పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్–2025 నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ ఆర్జేడీ జె.సత్యనారాయణ మూర్తి తెలిపారు. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పరీక్ష నిర్వహణపై అధికారులు, ఎగ్జామినర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. దరఖాస్తు చేసి హాల్ టిక్కెట్లు రాని విద్యార్థులు శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రాన్ని సంప్రదిస్తే సమస్య పరిష్కరిస్తామని అన్నారు. పరీక్ష 30వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షకు నిమిషం అలస్యమైనా అనుమతింబోచమని చెప్పారు. ఆధార్ జిరాక్స్, రెండు పా స్ పోర్టు సైజ్ ఫొటోలతో విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని అన్నారు. శ్రీకాకళం, టెక్కలి డివిజన్లలోని 39 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా నుంచి 1152 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. షెడ్యూల్ మేరకు పరీక్ష నిర్వహణ, ఫలితాలు వెల్లడి, కౌన్సెలింగ్ నిర్వహణ ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రిన్సిపాల్, జిల్లా ప్రవేశాల ఇన్చార్జి బి.జానకి రామయ్య, అధికారులు పాల్గొన్నారు. నేటి నుంచి నీలమణి దుర్గమ్మ మహోత్సవాలు పాతపట్నం: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాతపట్నం నీలమణి దుర్గమ్మ ఆలయ సన్నిధిలో మంగళవారం నుంచి 50వ వార్షిక నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజు ల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి టి.వాసుదేవరావు తెలిపారు. సోమవారం ఆలయాన్ని విద్యుత్కాంతులతో అలంకరించారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఆలయంలో హోమాలు, వర్ధినీ కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, దేవ పుణ్యాహవచనం, కుంకుమ పూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాలిన మామిడి కాయలు నరసన్నపేట: మండల పరిధిలో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా రైతులు ఆందోళన చెందారు. పొలాల్లో నువ్వు, పెసర పంటలు ఉన్నాయి. పెసరకు ఇబ్బంది లేకపోయినా నువ్వు పంటకు నష్టం వాటిల్లుతుందని రైతులు అంటున్నారు. అలాగే గాలులకు మామిడి కాయలు పలు చోట్ల రాలాయి. వీఎన్ పురం, యారబాడు, ఉర్లాం, బడ్డవానిపేట చిక్కాలవలస, తెలగవలస, కరగాం తదితర గ్రామాల్లో వరి ధాన్యం వర్షానికి కొంత నష్టం కలుగుతుందని రైతులు అంటున్నారు. అరటి చెట్లకు కొంత వరకూ నష్టం కలిగినట్లు తెలుస్తోంది. నరసన్నపేటలో ఫ్లెక్సీలు గాలికి ఎగిరి పడ్డాయి. మెయిన్ రోడ్డుపై కాంప్లెక్స్ సమీపంలో ఒక ఫ్లెక్సీ గాలికి విద్యుత్ వైర్లపై పడింది. వెంటనే విద్యుత్ అధికారులు అప్రమత్తమై తొలగించారు. -
శివానీ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
ఎచ్చెర్ల క్యాంపస్: చిలకపాలేంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్కు యూనివర్సిటీ ఆఫ్ గ్రాంట్స్ కమిషన్ అటానమస్ హోదా మంజూరు చేసిందని కళాశాల యాజమాన్య ప్రతినిధులు వెల్లడించారు. ఎచ్చెర్లలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ 2025–26 విద్యా సంవత్సరం నుంచి అటానమస్ అమల్లోకి వస్తుందని చెప్పారు. యూజీసీ బృందం ఫిబ్రవరి 16న కళాశాల సందర్శించి ఈ నెల 24న అటానమస్ హోదా ప్రకటించిందని తెలిపారు. నాక్, ఎన్బీఏ, జేఎన్టీయూ శాశ్వత గుర్తింపు వంటి ఆధారంగా అటానమస్ హోదా లభించిందని వివరించారు. ఇంజినీరింగ్ కాలేజ్లో ఆరు ఇంజినీరింగ్ బ్రాంచ్లు, ఎంటెక్ కోర్సులు, ఎంబీఏ కోర్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కరిక్యులమ్, సిలబస్లో మార్పులు, మెరుగైన ప్లేస్మెంట్లు లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. 80 శాతం కామన్ కోర్ సిలబస్, స్థానిక అవసరాలకు అనుగుణంగా 20 శాతం బీవోఎస్ ద్వారా మార్పు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మేనేజ్మెంట్ సభ్యులు డాక్టర్ సనపల శ్రీనివాసరావు, దుప్పల వెంకటరావు, పి.దుర్గాప్రసాద్రావు, కె.దుర్గా శ్రీనివాస్, ఎంఎం సాయినాథ్ రెడ్డి, హరీ ష్, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ జి.టి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తిపై గొడ్డలితో దాడి
సంతబొమ్మాళి: మండలంలోని నౌపడ గ్రామానికి చెందిన దుక్క సంతోష్కుమార్పై అదే గ్రామానికి చెందిన జీరు శంకర్ రెడ్డి సోమవారం రాత్రి గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుక్క రమేష్ అనే వ్యక్తి స్నానం చేస్తుండగా ఆ నీరు జీరు శంకర్రెడ్డి ఇంటి ముందునుంచి వెళ్తుండటంతో గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో రమేష్ అన్న కుమారుడు సంతోష్కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. మద్యం మత్తులో ఉన్న శంకర్ రెడ్డి తన ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకువచ్చి సంతోష్కుమార్ తలపై దాడిచేశాడు. గాయపడిన సంతోష్కుమార్ను నౌపడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం టెక్కలి జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. నౌపడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొలం గొంతులో గరళం
● రాగోలు పరిసర ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితి ● పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం రూరల్: జిల్లా కేంద్రానికి సమీపంలోని రాగోలు ప్రధాన ఆస్పత్రి నుంచి సమీప పంట పొలాలకు మెడికల్ వ్యర్థాలతో కూడిన కలుషిత నీరు వెళ్తోంది. ఇది రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆస్పత్రి చుట్టూ ఉన్న పంట పొలాల్లోకి ఈ నీరు చిన్నచిన్న పైపుల ద్వారా చేరుకుంటోంది. అక్కడి నుంచి ప్రధాన కాలువలో కలిసి స్థానికంగా ఉన్న కొర్లగండం చెరువులోకి చేరుకుంటోంది. ఈ చెరువు నీటిని పశువులు తాగడానికి, వాటికి స్నానాలు చేయించడానికి రైతులు వినియోగిస్తున్నారు. దీంతో పశువులకు అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నట్లు రాగోలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యానికి చెప్పాం.. కలుషిత నీరు విషయంపై ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే విషయాన్ని పలు మార్లు ఆస్పత్రి యాజమాన్యానికి వివరించాం. వారి నుంచి స్పందన లేదు. – తిరుమలదేవి, పంచాయతీ సెక్రటరీ రీసైకిల్ప్లాంట్ ఏర్పాటు చేయాలి రాగోలు జెమ్స్ నుంచి బయటకు వస్తున్న కలుషితమైన మురికినీరు బయ టకు పంపకుండా ఆస్పత్రి ఆవరణంలోనే రీసైక్లింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలి. దీంతో రీసైక్లింగ్ అయిన నీరు అక్కడే గల మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. – గేదెల శంగల్వరావు, రాగోలు సర్పంచ్ -
బధిరులకు టచ్ ఫోన్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన మీకోసం వినతుల స్వీకరణ కార్యాక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ద్వారా ఐదుగురు బధిరులకు టచ్ ఫోన్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కవిత తదితరులు ఉన్నారు. స్వాతీసోమనాథ్కు ఐకాన్ అవార్డు శ్రీకాకుళం కల్చరల్: హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన కళాదర్బార్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సంప్రదాయ గురుకులం డైరెక్టర్ స్వాతీ సోమనాథ్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా సంప్రదాయం బృందం సభ్యులు యామిని, బలరామ్, లోకేశ్వరి, అంజలి, లిఖిత, తేజస్వి, హేమాంజలి, హేమవ ల్లి, జోషిత, శ్రీజ, భవ్య, భానులు చక్కటి ప్రదర్శనతో ఆహూతులను అలరించారు. రెండు ఆవులు మృతి బూర్జ: మండలంలోని అన్నంపేటలో పేడాడ రంగారావుకు చెందిన రెండు పాడి ఆవులు మృతి చెందినట్లు కొల్లివలస పశువైద్యాధికారి డాక్టర్ జి.వెంకటరావు సోమవారం తెలిపారు. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పశువులు తినే దాణాలో విషం కలపడం వల్ల మృతిచెందినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.80 వేలు వరకు ఉంటుందని చెప్పారు. -
డీసీఎంఎస్ చైర్మన్గా అవినాష్
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్గా ఎస్ఎంపురం మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో ఎస్ఎంపురం సర్పంచ్గా వ్యవహరించారు. తల్లి చౌదరి ధనలక్ష్మి జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. తండ్రి నారాయణమూర్తి (బాబ్జి) గతంలో జిల్లా టీడీపీ అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు. డీసీసీబీ చైర్మన్గా శివ్వాల సరుబుజ్జిలి: డీసీసీబీ చైర్మన్గా సరుబుజ్జిలి మండలం షళంత్రి గ్రామానికి చెందిన శివ్వాల సూర్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో జెడ్పీటీసీ, సర్పంచ్గా, ప్రస్తుతం షలంత్రి ఎంపీటీసీ సభ్యునిగా వ్యహరిస్తున్నారు. ఈయన భార్య శివ్వాల కృష్ణవేణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. -
బోధనోపకరణాల కిట్లు పంపిణీ
శ్రీకాకుళం అర్బన్: కొత్తూరు , పాతపట్నం, మెళియాపుట్టి, సారవకోట, పొందూరు, సంతబొమ్మాళి మండలాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన బుద్ధి మాంద్యం గల విద్యార్థులకు బోధనోపకరణాలతో కూడిన కిట్లను డీఈఓ ఎస్.తిరుమల చైతన్య, సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ శశిభూషణ్ సమవారం అందజేశారు. జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఈఓ మాట్లాడుతూ సుమారు రూ.12000 విలువైన ఒక్కో కిట్లో ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన, సులభతరమైన అభ్యసనకు దోహదం చేసే పరికరాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీఆర్సీ (కాంపోజిట్ రీజినల్ సెంటర్) నెల్లూరు ద్వారా వీటిని సరఫరా చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్యా సమన్వయకర్త బుడుమూరు గోవిందరావు, అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ వి.ఉమ, నెల్లూరు ప్రతినిధి ధర్మేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసిస్టెంట్ కలెక్టర్గా పృథ్వీ రాజ్కుమార్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాకు అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణలో ఉన్న దొనక పృథ్వీ రాజ్కుమార్ను నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకు ఈ పదవిలో ఉంటారు. పృథ్వీకుమార్ వయసు 23 ఏళ్లు. ఈయన 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. మన్యం జిల్లా పార్వతీపురానికి చెందిన పృథ్వీ తండ్రి విజయకుమార్ మండల విద్యాధికా రి (ఎంఈఓ)గా, తల్లి వెంకటరత్నం గృహిణిగా ఉన్నారు. సోదరి పూజిత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. పృథ్వీ ప్రాథమిక విద్య నుంచి పదో తరగతి వరకు పార్వతీపురంలోనే చదివారు. ఇంటర్ నారాయణ లో చేసి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియాలజీ సబ్జెక్టులతో డిగ్రీ పట్టా అందుకున్నారు. అనంతరం ఇగ్నో యూనివర్సిటీ, ఢిల్లీ ద్వారా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ సాధించారు. తర్వాత సివిల్ సర్వీసెస్లోకి వచ్చారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో పరిపాలనా వ్యవహారాల్లో అనుభవం సేకరించేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రజలకు చేరువగా ఉంటూ సేవలందించడమే తన లక్ష్యమని పృథ్వీ రాజ్ కుమార్ తెలిపారు. -
సీఎం మెప్పు కోసం సీఐటీయూను విమర్శిస్తారా?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సీఎం చంద్రబాబునాయుడు వద్ద గొప్పలు, మెప్పు కోసం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు సీఐటీయూపై అక్కసు వెళ్లగక్కడం సరికాదని సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీహెచ్.అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ కార్మిక సంఘాలను, సీఐటీయూను కంట్రోల్ చేస్తున్నానని సీఎం ముందు ఎన్ఈఆర్ ప్రసంగించారని, కార్మికోద్యమాలను అడ్డుకోవడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. ఇటువంటి ప్రగల్భాలు పలికిన వారు అనేకమంది కాలగర్భంలో కలిసిపోయారని గుర్తు చేశారు. జిల్లాలో ట్రేడ్ యూనియన్లు చేసిన పోరాటాల ఫలితం ఏ పరిశ్రమ కుంటుపడలేదని, ప్రభుత్వ విధానాల వల్లేనని తెలుసుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు ఎవరూ పరిశ్రమల్లో కాంట్రాక్టులు తీసుకోవడం లేదని, యాజమాన్యాలకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసి, యాజమాన్యాలను బెదిరించి కాంట్రాక్టులు తీసుకుంటున్న వారెవరో ప్రజలకు తెలుసునన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో అనేక పరిశ్రమల్లో కార్మికులు గాయపడుతున్నా, చనిపోతున్నా యాజమాన్యాలపై నోరెత్తని ఎమ్మెల్యే.. కార్మికుల సమస్యలపై పోరాటాలు చేసే సీఐటీయూపై అనుచితంగా మాట్లాడటం శోచనీయమన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో కార్మికుల ఓట్లతో గెలిచి కార్మిక వ్యతిరేక వైఖరిని అవలంబించడం తగదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తోందని దుయ్యబట్టారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.వి.రమణ, అల్లు.సత్యన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎంఎల్హెచ్ఓల సమ్మెబాట శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ల(ఎంఎల్హెచ్ఓ)ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఇప్నటికే పలుమార్లు వినతిపత్రాలు, నిరసనల ద్వారా తెలియజేసినా పరిష్కరించకపోవడంతో ఈ నెల 28 నుంచి సమ్మెబాట పడుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమీపంలోని జ్యోతీరావు పూలే పార్కులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెల 15 నుంచి చేస్తున్న నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోతో ఏప్రిల్ 28 నుంచి నిరవదిక సమ్మె చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నిరంజన్, ప్రధాన కార్యదర్శి బి.సందీప్కుమార్, వినోద్కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం యలమంచిలి గ్రామానికి చెందిన బందాపు ఆనందరావు(38) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు ఆనందరావు నిత్యం మద్యం సేవిస్తుంటాడు. అతని భార్య తేజావతి రెండు రోజులు క్రితం మద్యం తాగవద్దని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన అతడు పురుగుల మందు తాగేశాడు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు హుటాహూటిన కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కోటబొమ్మాళి పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య తేజావతితో పాటు కుమార్తెలు నాగమణి, మీనా, కుమారుడు భవానీ ప్రసాద్లు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
విద్యుత్కు వేసవి షాక్..!
పాతపట్నం: వేసవి వచ్చిందంటే ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి విద్యుత్ వినియోగాన్ని పెంచుకుంటాం. ఇంతవరకు బాగానే ఉన్నా కన్సీల్డ్ వైరింగా, గోడలపైనే గొట్టాల్లో వైరింగ్ ఏర్పాటు చేశారా, సరైన ప్రమాణాలతో తగిన మందం ఉన్న వైర్లు వైశారా అనేది అందరూ గుర్తించాల్సిన విషయం. వైరింగ్లో ఏవైనా లోపాలుంటే విద్యుత్ షార్ట్ సర్క్యూట్కు గురయ్యే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తించాలి. రానున్న రోజుల్లో ఉష్ణాగ్రతలు మరింతగా పెరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలతో పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధిక లోడుతో అనర్థమే వేసవి కాలంలో విరివిగా విద్యుత్ ఉపకరణాల వినియోగం వల్ల ఒక్కొక్కసారి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుంటాయి. గృహాల్లో, కార్యాలయాల్లో వాడుతున్న విద్యుత్ వాడకాన్ని బట్టి లోడ్ను నిర్ధారించుకుని ఆమేరకు విద్యుత్శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. దీంతో విద్యుత్ సబ్స్టేషన్ నుంచి వినియోగదారునికి అవసరమైన లోడ్ను ఆ ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ శాఖ అందుబాటులో ఉంచుతుంది. ఎవరైనా వినియోగదారుడు కేవలం 1కేవీ లోడుకు మాత్రమే అనుమతి పొంది. వేసవి తీవ్రత దష్ట్యా అధికంగా విద్యుత్ను వినియోగిస్తే ఆ ప్రభావం సమీప ట్రాన్స్ఫార్మర్పై పడి తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. వినియోగదారులందరూ విద్యుత్శాఖకు సహకరించి వాడుతున్న లోడ్కు అనుగుణంగా అనుమతి పొందితే భవిష్యత్లో విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశం తక్కువగా ఉంటుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఏసీలు, ఫ్రిజ్లు, టీవీలు ఇతరత్రా విద్యుత్ ఉపకరణాలు వాడే సమయంలో కచ్చితంగా స్టెబిలైజర్లను వినియోగించాలి. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు వస్తుంటే సత్వరమే సంబంధిత విద్యుత్ సిబ్బందికి ఫిర్యాదు చేయాలి. ఇలా చేయవద్దు ● గృహాల్లో 15 యాంప్స్ విద్యుత్ ఉపయోగించేచోట, 30 యాంప్స్ విద్యుత్ భారంపడే పరికరాలు వినియోగిస్తే తీగలు కాలిపోయే ప్రమాదముంది. ● ఒకే స్విచ్ బోర్డుకు ఎక్కువ ప్లగ్లు ఉపయోగిస్తే ఒక్కసారిగా లోడ్ పెరిగి స్పార్క్ వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశముంటుంది. ● ఎండలో విద్యుత్ తీగలు ఉంచితే భవిష్యత్తులో తీగలపై ఉన్న రబ్బర్ మెత్తబడి ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. ● ఇంట్లో ఒకేసారి విద్యుత్ ఉపకరణాలన్నింటినీ ఆన్చేసి ఉంచవద్దు. ● కంప్యూటర్ పరికరాలు, టీవీల వద్ద విద్యుత్ తీగలను చిందరవందరగా ఉంచరాదు. ● రక్షణ పరికరాలైన ఎంసీబీ(మైక్రో సర్క్యూట్ బ్రేకర్), ఎంసీసీబీ(కరెంట్ కంట్రోలర్ బ్రేకర్) ఫ్యూజులను బైపాస్ చేయకూడదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వేసవికాలం ప్రారంభమయ్యే ముందు ప్రతి ఒక్కరూ ఇళ్లు, కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో తీగల వ్యవస్థను తనిఖీ చేయించుకోవాలి ● విద్యుత్ వైరింగ్ చేయించేటప్పుడు పూర్తిగా ఐఎస్ఐ, బీఐఎస్ మార్క్ కలిగిన ఎలక్ట్రికల్ సామగ్రిని మాత్రమే ఉపయోగించాలి. ● ఇంట్లో విద్యుత్ వినియోగం ఆధారంగా విద్యుత్శాఖ నుంచి లోడ్ను తీసుకోవాలి. ● అందుకు తగినట్లు వైరింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏసీలు, కూలర్లు, వాటర్ హీటర్లు, మైక్రో ఒవెన్ ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు వినియోగించాలి. ● ఎలక్ట్రానిక్ ఉపకరణాన్ని బట్టి దానికనుగుణంగా నాణ్యత కలిగిన విద్యుత్ తీగలను వినియోగించాలి. ● నాసిరకం విద్యుత్ పరికరాలతో విద్యుత్ వృథా కావడంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వైరింగ్ మరింత పటిష్టంగా ఉండేలా చూసుకోవాలి. ● గృహాలు, వాణిజ్య సంస్థలు, కార్యాలయాల్లో తప్పనిసరిగా న్యూట్రల్ పరికరాల కోసం సరిపడినంత ఎర్త్ ఎలక్ట్రోడ్ ఏర్పాటు చేసుకోవాలని. ● ఎండాకాలంలో రక్షణ పరికరాలు సరిగ్గా పనిచేయాలంటే ఎర్తింగ్ సరైన పద్ధతిలో ఉంచేందుకు అవసరమైన ప్రదేశంలో నీరు, దొడ్డుఉప్పు ఉపయోగించాలి. ● విద్యుత్ వాడేందుకు మూడు పిన్నుల ప్లగ్లు, సాకెట్లు మాత్రమే ఉపయోగించాలి. ● విద్యుత్ స్తంభాల నుంచి మీటర్ వరకు ఉండే సర్వీస్ వైర్లు అతుకులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. X లోడ్ ఎక్కువైతే వైర్లు కాలిపోయే ప్రమాదం షార్ట్ సర్క్యూట్తో గృహోపకరణాలకు ముప్పు సరఫరాలో లోపాలుంటే సిబ్బందికి ఫిర్యాదు చేయాలి అప్రమత్తత అవసరం వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ తీగలు వ్యాకోచం చెందే అవకాశం ఉంది. షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. గృహాల్లో వినియోగించే విద్యుత్ ఉపకరణాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వైరింగ్ను చేయించుకోవాలి. ఎటువంటి సమస్యలు ఉన్నా సిబ్బందికి తెలియజేయాలి. – జి.ప్రసాదరావు, డీఈఈ, విద్యుత్శాఖ, పాతపట్నం -
నీటికుండీలో పడి కార్మికుడు మృతి
టెక్కలి: కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి గ్రామ సమీపంలోని సాయిరాం గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమలో పనిచేస్తున్న అస్సాం రాష్ట్రం బొంగైగో జిల్లా, గురునానక్ నగర్కు చెందిన కార్మికుడు కాళీరాయ్ (34) పరిశ్రమకు సంబంధించిన రీసైక్లింగ్ నీటి కుండిలో పడి మృతి చెందాడు. మృతుడు రాయ్ ఈ పరిసర ప్రాంతాల్లోని అనేక పరిశ్రమల్లో ఇదివరకు పనిచేశాడు. అయితే రాయ్ రెండు రోజులుగా పనికి రాకపోవడంతో తన స్వగ్రామానికి వెళ్లి ఉంటాడని భావించామని గ్రానైట్ యాజమాన్యం, తోటి కూలీలు చెబుతున్నారు. నిత్యం మద్యానికి అలవాటుపడిన రాయ్ ఆదివారం తెల్లవారేసరికి కంపెనీకి చెందిన 10 అడుగుల లోతు ఉన్నటువంటి రీసైక్లింగ్ నీటి కుండిలో శవమై తేలాడు. ఇది గమనించిన తోటి కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి రణస్థలం: ఈనెల 25వ తేదీన రాత్రి 9 గంటల సమయంలో ఎన్హెచ్–16 రహదారిపై యూబీ పరిశ్రమ దగ్గర రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మరణించినట్లు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి ఆదివారం తెలిపారు. మృతుడికి 40–45 సంవత్సరాలు ఉంటాయని, తలకు బలమైన గాయమవ్వడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడని పేర్కొన్నారు. గుండుతో ఉన్నాడని, కాఫీ కలర్ ప్యాంట్, ముదురు నీలిరంగు టీషర్టు ధరించినట్లు వెల్లడించారు. వ్యక్తి వివరాలు తెలిసినవారు 63099 90816, 63099 90850 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ఆరోగ్యం భద్రం..!
వేసవికాలం.. జాగ్రత్తలు తప్పనిసరి వేసవిలో ఎండలు మండుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బయట ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎండలో పనిచేయడం, తిరగడం వలన శరీరంలో నీటిశాతం తగ్గి డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో క్రమం తప్పకుండా నీటిని తాగాలి. పండ్ల రసాలు, ఓఆర్ఎస్ ద్రావణం వంటివి తీసుకుంటే వడదెబ్బ బారిన పడకుండా ఉంటారు. – ఆర్.కాళీప్రసాద్, ఎంపీడీవో, హిరమండలం ● రోజురోజుకూ పెరుగుతున్న వేసవి తాపం ● వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ● అప్రమత్తంగా ఉండాలని సూచనలు హిరమండలం: వేసవితాపం రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజంతా మండుటెండలో కష్టించి పనిచేసే వేతనదారులు, కార్మికులు తగు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత శాఖాధికారులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా వడదెబ్బకు గురవ్వడంతో పాటు అనారోగ్య సమస్యల బారినపడతారని హెచ్చరిస్తున్నారు. ఎండల్లో ఇబ్బందులు పడకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలు ప్రస్తుతం ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండడంతో బయటకి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. కాగా రానున్న రోజుల్లో మరింత తీవ్రస్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో ప్రజలు మరింత భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అన్నివర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. పని ప్రదేశాల్లో చల్లని నీరు, నీడ వసతి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్స్ అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవడం ఉత్తమం. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాల్లో కార్మికులు పనిచేయకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఉపాధి వేతనదారులు, కార్మికులు, దుకాణాల్లో పనిచేసేవారు, భవన నిర్మాణ కార్మికులు తదితర శ్రామికులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేనిపక్షంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడక తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాధ్యమైనంత వరకు చల్లని ప్రదేశాల్లో పనులు చేసుకోవాలి. వదులైన పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. తలకు టోపీ పెట్టుకోవడం మంచిది. మధ్యాహ్నం 12 గంటట నుంచి 4 గంటల మధ్య ఎండలో తిరగకూడదు నీటిని ఎక్కువగా తాగాలి, మజ్జిగ తీసుకోవాలి. గది ఉష్ణోగ్రతలను తగ్గించుకోవాలి. చక్కని వెంటిలేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి పైకప్పు మీద గడ్డిలాంటివి ఉంచి చల్లటి నీరు పట్టించాలి. వడదెబ్బకు గురైన వ్యక్తికి చల్లని గాలి అందేలా చూడాలి. దుస్తులు వదులు చేయాలి. వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలి. బాధితుడిని సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి తరలించాలి.