breaking news
Srikakulam
-
వేడుకగా కళింగ ఆత్మీయ సమ్మేళనం
ఎచ్చెర్ల/శ్రీకాకుళం న్యూకాలనీ: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని చౌదరి సత్యనారాయణ తోటలో ఆదివారం రాష్ట్రస్థాయి కళింగ సామాజిక వర్గ ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలలతోపాటు విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, రాయలసీమ, బరంపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కళింగ సామాజికవర్గ పెద్దల సూచనలతో కళింగ సంక్షేమ సంఘ ప్రతినిధులు చింతాడ రామ్మోహనరావు, దుప్పల వెంకటరావు, దుంపల రామారావు, దానేటి శ్రీధర్, పూజారి చెల్లయ్య, పూడి తిరుపతిరావు, మొదలవలస లీలామోహన్, బీవీఎస్ఎన్రాజు తదితరులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో సుమారు 50వేల మంది హాజరయ్యారు. కళింగ సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ గాయకుడు ధనుంజయ్ తన పాటలతో ఉత్సాహపరిచారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజు, వైఎస్సార్ సీపీ కాళింగ సామాజిక వర్గం వైఎస్సార్ సీపీ మాజీ అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, తదితరులు హాజరై ఆమె చేత కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ కూన రామ్జీ, ఎమ్మెల్యే కూన రవికుమార్, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర ౖచైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, మాజీ చైర్మన్లు పేరాడ తిలక్, దుంపల రామారావు, పేడాడ రమణకుమారి, వైఎస్సార్ సీపీ నేతలు కిల్లి సత్యనారాయణ, చింతాడ రవికుమార్, తమ్మినేని చిరంజీవినాగ్, సింగుపురం మోహనరావు, ఎన్ని ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు. -
సంచలన హత్యలివే..
● మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలిని వివస్త్రగా చేసి చెవి, ముక్కు కోసేసి దారుణంగా ఓ బాలుడు హత్య చేశాడు. అనంతరం బంగారం దోచుకుని పారిపోయాడు. ● జూన్ 9న కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన వృద్ధురాలు దుంపల దాలమ్మను ఇంట్లో మోటారు రిపేర్ చేసేందుకు అదే గ్రామానికి చెందిన బల్లి రాము వచ్చి ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో చనిపోయింది. బంగారు గొలుసుతో పరారయ్యాడు. ● డిసెంబరు 1న లావేరు మండలం మురపాకకు చెందిన వృద్ధురాలు వడ్డీ పార్వతి (64) 1న అదృశ్యమై 3న ఓ పాడుబడిన బావిలో శవంగా తేలింది. చెవి, ముక్కు కొరికి, కాల్చి హత్య చేసి బంగారం దోచుకెళ్లిన దుండగులు బావిలో పడేశారు. ● జూలై 11న ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపిని అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ఎన్హెచ్–16 సమీప కొయిరాలమెట్ట వద్ద దారుణంగా హత్యచేశారు. ● ఆగస్టు 26న నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకటపార్వతీశం గుప్తాను బంగారం కోసం డ్రైవర్ సంతోష్తో పాటు పెద్దపాడు వద్ద ఆదిత్య కార్వరల్డ్ బిల్డింగ్ యజమాని ఎం.అప్పలరాజు మెడకు తాడు బిగించి హత్య చేసి రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు. ● సెప్టెంబరు 24న కంచిలి మండలం జలంత్రకోట సమీపంలో ఓ దాబాలో భోజనం చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతున్న లారీ డ్రైవర్ను ఓనర్ డబ్బులు అడగడంతో లారీతో తొక్కించి చంపేశాడు. అడ్డుకున్న మరో వ్యక్తిపైనా లారీ ఎక్కించేసి మరణానికి కారణమయ్యాడు. ● జనవరి 18న పొందూరు మండలం మొదలవలసకు చెందిన పూజారి కళావతి (53) శ్రీకాకుళం నగరం న్యూకాలనీలో హత్యకు గురైంది. శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది కాలంగా జిల్లా వరుసగా హత్యలు చూస్తూనే ఉంది. గడిచిన ఏడాదిలో 16 హత్యలు జరిగాయని అధికారులు గణాంకాల్లో పేర్కొనగా ఈ ఏడాది చివరికొచ్చేసరికి దాదాపు 30 హత్యలు జరిగాయి. వీటిలో పోలీసులు ధ్రువీకరించినవి కొ న్ని మాత్రమే. కొన్నింటిని అనుమానాస్పద మరణాలుగా చూపారు. కానీ అవి కూడా హత్యలేనని స్థానికులు, కుటుంబీకుల నుంచి గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిలో 15 హత్యలు మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఎందుకీ నేర ప్రవృత్తి..? రాజకీయ కారణాలు, మద్యం మత్తు, అనుమానం, దురాశ.. జిల్లాలో జరిగిన హత్యాకాండల వెనుక దాదాపుగా ఉన్న కారణాలివే. ఎక్కడికక్కడ మద్యం దొరుకుతుండడం, గంజాయి విక్రయాలు పెచ్చుమీరుతుండడంతో నేరాలూ పెరుగుతున్నాయి. మరోవైపు రాజకీయ కారణాలతోనూ చంపుకోవడం వంటి కొత్త సంస్కృతులు కూడా జిల్లాకు ఈ ఏడాదే పరిచయమయ్యాయి. ఇదివరకు దాడులు మాత్రమే జరిగాయి.. ఇప్పుడవి హత్యల స్థాయికి చేరుకున్నాయి. భార్యాభర్తల తగాదాలు.. జనవరి 25న ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు గురుగుబెల్లి చంద్రశేఖర్ (45), ఫిబ్రవరి 10న సోంపేట మండలం జింకిభద్ర బీసీ కాలనీలో సాహుకారి రత్నాలు (70), ఫిబ్రవరి 24న జిల్లాకేంద్రంలోని టి–ఏజెంట్ కాలనీలో మజ్జి రమేష్నాయు డు (34), మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42), మార్చి 28న కవిటి మండలం ఆర్.కరాపాడులో గర్భిణి కొంతాల మీనాక్షి, ఏప్రిల్ 15న జి.సిగ డాం మండలం సంతవురిటికి చెందిన బాలబొమ్మ భవాని (21), మే 7న కోటబొమ్మాళిలో లేడీస్కార్నర్ షాపు నిర్వహిస్తున్న నర్సిపురం లక్ష్మి (30), నవంబరు 20న నందిగాం మండలం శివరాంపురానికి చెందిన పుష్పలత నౌపడ 3 రోడ్ల కూడలిలో హత్యలకు గురయ్యారు. వీరంతా వారి వారి భార్యలు, భర్తల చేతుల్లోనే మరణించారు. వివాహేతర బంధాలు.. ● ఏప్రిల్ 19న పైడిభీమవరం కాజావారి కోనేరు గట్టు వద్ద ఓ యువతి (23), మే 17న సోంపేట మండలం పాలవలసకు చెందిన వ్యక్తి, జూన్ 1న అదే గ్రామానికి చెందిన మహిళ, ఆగస్టు 30న ఆమదాలవలస చంద్రయ్యపేటలో మహిళ(45) వివాహేతర బంధాలతోనే హత్యలకు గురయ్యారు. డిసెంబరు 2న శ్రీకాకుళం ఏఎస్ఎన్కాలనీకి చెందిన మహిళ(43) ఆస్పత్రికి వెళ్లి 2న అదృశ్యమై ఎచ్చెర్ల కేశవరావుపేట హైవే పక్కన 3న శవమైంది. వివాహేతర బంధమేనన్న చర్చ సాగుతుండగా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సొంత కుటుంబీకులే.. ● జూన్ 17న ఇచ్చాపురం మండవల్లికి చెందిన బర్రి గంగయ్యను తన అల్లుడు పాతిర్ల జీవన్రెడ్డి (దాసు) నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. ● అదే నెల 22న నందిగాం మండలం కామధేనుపురంకు చెందిన కిల్లి ధర్మారావు తన తమ్ముడు తవిటయ్యను గడ్డపారతో కొట్టి చంపేశాడు. 2025లో సిక్కోలును వణికించిన హత్యాకాండలు ఏడాదిలో దాదాపు 30 హత్యలు శాంతిభద్రతలను అదుపు చేయడంలో యంత్రాంగం విఫలం -
మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..
● మే 7న శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలికి చెందిన కన్నం నర్సింగరావు (58)తో పార్కింగ్ విషయంలో గొడవపడి పూటుగా మద్యం సేవించిన రమణ అర్ధరాత్రి నర్సింగరావు మేడపై నిద్రిస్తున్న సమయం చూసి పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. ● నవంబరు 24న టెక్కలి మేజరు పంచాయతీ గోపినాథపురానికి చెందిన కొమనాపల్లి పద్మనా భం గ్రామంలో వ్యక్తులే దాడి చేయడంతో చనిపోయాడు. ● సెప్టెంబరు 2న చిల్లంగి నెపంతో పలాస మండలం కేశుపురానికి చెందిన ఉంగ రాములు (80) అనే వృద్ధున్ని అదే గ్రామానికి చెందిన 8 మంది రాళ్లతో కొట్టి అతికిరాతకంగా చంపేశారు. 040302 02జనవరి ఆగస్టుసెప్టెంబరునవంబరు డిసెంబరు మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి మే జూన్జూలై(ఇప్పటివరకు) -
సిక్కోలు లఘు చిత్రోత్సవాలు లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలో త్వరలో జరగనున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం–2025కు సంబంధించిన లోగోను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆదివారం శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుమలరావు, ప్రసాద్, కీర్తి, రామకృష్ణ, రాము, మాదారపు వెంకటేశ్వరరావు, ఎస్.వి.రమణ మాదిగ, విశ్వేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ కణితి సూర్యనారాయణ, ఎలయన్స్ క్లబ్ సభ్యులు జామి మన్మధరావు పాల్గొన్నారు. కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శంభాజీ షిండే ఆదివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి అంతరాలయంలో పూజలు చేయించారు. ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు స్వామి చిత్రపటం, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు బస్సు నుంచి జారిపడి వృద్ధురాలికి గాయాలు వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబడాం బస్టాండ్ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి అంతరకుడ్డ గ్రామానికి చెందిన వృద్ధురాలు గొనప లక్ష్మీ గాయాలపాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీ సోంపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామం వచ్చేందుకు కాశీబుగ్గలో బస్ ఎక్కింది. అంతరకుడ్డ వెళ్లేందుకు చినబడాం బస్టాండ్ వద్ద దిగుతుండగా బస్సు ముందుకు కదలడంతో ప్రమాదవశాత్తు జారిపడింది. దీంతో గాయాలపాలైన లక్ష్మీని స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆవిష్కర్ సీజన్–3 హాక్థాన్ సాంకేతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపకల్పన చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సమాజ హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసి వాటి ప్రయోజనాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్, యాప్ అభివృద్ధి, ఐఓటీ, డైటా సైన్స్ తదితర అంశాలతో రూపకల్పన చేసిన ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. ఎంపికై న ప్రాజెక్టుల నిర్వాహకులకు సోమవారం బహుమతులు అందజేయనున్నారు. గోల్ షాట్బాల్ పోటీల్లో ప్రతిభ కంచిలి: తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లిలో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించిన జాతీయస్థాయి థర్డ్ ఫెడరేషన్ కప్ గోల్ షాట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. కంచిలి మండలం జక్కర గ్రామానికి చెందిన బసవ శ్యామల ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్యామల విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పీఈటీ కోర్సు పూర్తి చేశారు. తల్లిదండ్రులు తరిణి–తులసి వ్యవసాయ కూలీలు. పోటీలో ప్రతిభ కనబరిచిన శ్యామలను జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు, వైఎస్సార్ సీపీ నేతలు కప్పల యుగంధర్, మెండ ప్రకాశరావు, మురళి అభినందించారు. -
వైఎస్సార్ సీపీ అభిమానిపై దాడి
గార: మండలంలోని వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని కంచు మధుసూదనరావుపై స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయాలపాలయ్యారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. కంచు మధు ఓ ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సెలవు కావడంతో ఆదివారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉండగా స్థానికుడు శిమ్మ నవీన్తో మరో వ్యక్తి కవ్వించారు. అయినా పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత చల్ల ప్రభాకర్, శిమ్మ గోవింద, శిమ్మ చంద్రశేఖర్, శిమ్మ ఆనంద్, శిమ్మ సోమేష్ అనే వ్యక్తు లు వచ్చి మధుసూదనరావుపై ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేశా రు. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఆయన చిన్నాన్న వచ్చి 108లో మధుసూదనరావును రిమ్స్కు తరలించారు. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో తన ఫొటో ఉందని, అందుకే కక్ష కట్టి దాడి చేశాడని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్ గంగరాజు తెలిపారు. -
63 ఏళ్లలో ఆసక్తిగా..
ఈయన పేరు కె.ఎస్.ఎన్.మూర్తి. రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. బ్యాంకులో ఉద్యోగం వచ్చాక సంగీతం కలగానే మిగిలిపోయింది. రిటైరయ్యాక సమయం దొరకడంతో ఇలిసిపురంలోని వాణీ సంగీత విద్యాలయంలో దుంపల ఈశ్వరరావు వద్ద సంగీత సాధన ఆరంభించారు. ఇప్పటికే వర్ణాలు, కొన్ని అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు. 63ఏళ్ల వయసులో అవిశ్రాంతంగా సాధన చేస్తున్నారు. కెఎస్ఎన్ మూర్తి, రిటైర్డ్ డిజిఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
పనస రైతు ఆశలు చిగురించేనా..?
వజ్రపుకొత్తూరు: ఉద్దానం రైతులు పనసపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి ఇటు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ పనస పంటకు ఆలవాలం. ఉద్దానంలో ఈ పంటను మిశ్రమ పంటగా 7812 ఎకరాల్లో 5 లక్షల చెట్లు వరకు సాగు చేస్తున్నారు. ఈ చెట్ల నుంచి ఏడాదికి 1.50 లక్షల టన్నుల పచ్చి కా యలు దిగుబడికి వస్తాయి. ప్రస్తుతం చెట్లు పూత, పిందె దశలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో దిగుబడులు వస్తే గనక జిల్లా నుంచి మఖరాంపురం, హరిపురం, కంచిలి, పలాస, పూండి ప్రాంతాల నుంచి ఒడిశా, కోల్కత్తా, అస్సోం, వారణాశి, చత్తీస్గఢ్, బీహార్ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు. రోజుకు 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ఇక పోతే కోల్కతా నుంచి బంగ్లాదేశ్కు సైతం ఉద్దానం పనస వెళ్తుంది. అక్కడ చిన్న తరహా పరిశ్రమల్లో చిప్స్, పకోడి ప్యాకెట్లుగా తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులే కీలకం.. డిసెంబర్– జనవరి నెలల్లో పూత నుంచి పిందె దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఆడ పుష్పాలు కొమ్మ, కాండంపై వస్తా యని ఉద్యానవన శాఖ అధికారి సీహెచ్ శంకర్దాస్ తెలిపారు. ప్రస్తుతం మంచు, చలి తీవ్రత అధికంగా ఉన్న నేప థ్యంలో పిందె, పువ్వు మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఈ సీజన్లో ఎస్ఏఏఎఫ్( సాఫ్) పౌడర్లో కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపి లేకా డైతేన్ ఎం–45ను లీటరు నీటికి గ్రామున్నర కలిపి కాండం, పూత, పిందెలపై పిచికారీ చేస్తే మంచిదని సూచించారు. కొమ్ము, కాయతొలుచు పురుగు, పిండినల్లి ఆశించి ఎండు తెగులు సైతం సోకుతుంది కాట్టి నిత్యం క్షేత్ర సందర్శన చేయాలన్నారు. మార్కెట్ లేక.. మన ఉద్దానంలో పండే పంటలకు మార్కెట్ కరువనే చెప్పాలి. రైతు కష్టం దళారుల భోజ్యం చేస్తున్నారు. తక్కువ ధర కట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి ఈశా న్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కానీ వాటిని మార్కెట్ చేసి, ప్రాసెసింగ్ చేసే వ్యవసాయాధారిత పరిశ్రమలు మన రాష్ట్రంలో లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. చిప్స్, పకో డీ, పనస తాండ్ర లాంటి ఉత్పత్తులకు అవసరమైన కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులు లాభాలు ఆర్జించడమే కాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు అనుకూలించడంతో దిగుబడిపై అంచనాలు జిల్లాలో 7812 ఎకరాల్లో మిశ్రమ పంటగా పనస ఏటా రూ.1.50లక్షల టన్నుల దిగుబడి మార్కెట్ లేక నష్ట పోతున్న రైతు ఆధారిత పరిశ్రమలు కరువు -
రేషన్ బియ్యం స్వాధీనం
రణస్థలం: లావేరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగపాలెం గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా లగేజీ వ్యాన్ను అడ్డుకున్నారు. రణస్థలం మండలం సూరంపేట నుంచి వస్తున్న ఈ వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ గొరంటి గణేష్ను అదుపులోనికి తీసుకుని లావేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రణస్థలం సివిల్ సప్లయ్ డీటీ వై.అరుణ పరిశీలించగా 45 బస్తాల్లో 22.50 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. 6ఏ కేసు నమోదు చేశారు. వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పలసూరి చెప్పారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన డ్రైవర్ గణేష్ ఈ బియ్యాన్ని శ్రీకాకుళం తరలిస్తున్నాడని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. -
దళిత వ్యక్తిపై దాడికి యత్నం
● మద్యం మత్తులో వాగ్వాదం చేసిన టీడీపీ వర్గీయులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని శ్రీశయన వీధి లో ఓ దళిత వ్యక్తిపై టీడీపీకి చెందిన రెడ్డి సూర్యనారాయణ మరికొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. స్థానికులు, బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. నూతలపాటి శరత్భూషణ్రాజు తన కుటుంబంతో కలసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి రెడ్డి సూర్యనారాయణ అనే టీడీపీ నాయకుడు మద్యం మత్తులో శరత్భూషణ్ ఇంటికి వెళ్లి ఇంటిముందున్న క్రిస్మస్ స్టార్ తీసేయాలని కులాన్ని దూషిస్తూ తీవ్ర పదజాలంతో తిట్టాడు. తీయనని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వా దం జరిగింది. ఆపై తోసుకోవడం, శరత్భూషణ్ సూర్యనారాయణను చెంపదెబ్బ కొట్టడంతో గొడవ మరింత ముదిరింది. సూర్యనారాయణ అనుచరులు వచ్చి శరత్భూషణ్ తలపై, పొట్టపై పిడిగుద్దులు గుద్దడంతో కుటుంబ సభ్యు లు అతడిని రిమ్స్కు తరలించారు. ఈలోగా ఓ 20 మంది వరకు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న శరత్భూషణ్ను మంచంపైనుంచి కిందకు లాగేయడం, చంపుతామని బెదిరించడం వంటివి చేశారు. ఇదంతా అక్కడి సీసీ ఫుటేజీ నిక్షిప్తమైంది. ఎస్పీకి సైతం సమాచారం అందడంతో రెండో పట్టణ పోలీసులు అప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. ఇదే విషయమై రెండో పట్టణ పోలీసుల వద్ద ప్రస్తావించగా ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. -
పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం
మెళియాపుట్టి: చాపరలోని కృష్ణకామాక్షి ఫిల్లింగ్ స్టేషన్ (ఇండియన్ ఆయిల్) పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం విధించినట్లు శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల జలక లింగుపురం గ్రామానికి చెందిన నడిమింటి ఉమాపతి అనే వ్యక్తి 40 లీటర్ల పెట్రోల్ కొట్టించాడు. అయితే చెల్లించిన సొమ్ము కంటే 4 లీట ర్ల పెట్రోల్ తక్కువగా వచ్చింది. దీంతో ఆయ న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో తూనికలు కొలతల శాఖ అధికారులు పరిశీలించి జేసీకి నివేదించారు. అందులో భాగంగానే ఈ అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. ఉత్సాహంగా ఓపెన్ చెస్ టోర్నీ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఓపెన్ ఫెస్టివల్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం ప్రాంతంలో గల తిలక్నగర్ నర్సెస్ కాలనీలోని స్కూల్ ఆఫ్ చెస్ ఆకాడమీలో క్రిస్మస్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని ఆదివారం 209వ చెన్ టోర్నీని నిర్వహించారు. ఐదు రౌండ్ల పాటు జరిగిన చెస్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి చెస్ క్రీడాకారులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు ప్రెసిడెంట్ డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ నిరంతరం చెస్ క్రీడ సాధనతో మెదడు పదునెక్కుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహు మతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ కోచ్ భేరి చిన్నారావు, చెస్ కోచ్ కె.సాయినిరంజన్ సింగ్, చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘కళారంగాన్ని కాపాడుకోవాలి’ కొత్తూరు: సమాజంలో అంతరించిపోతున్న కళారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజ లు, ప్రభుత్వాలపై ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు అన్నారు. కొత్తూరు మండలం మెట్టూరు బిట్–3 ఆర్ఆర్ కాలనీలో గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా కొత్తూరు మండలం గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో కళాపీఠం అధ్యక్షుడు గేదెల సుందరనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటం వద్ద యడ్ల గోపాలరావు, ప్రముఖ కళాకారురాలు మంగమ్మ, సర్పంచ్ కొయిలాపు శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. హరికథలు, బుర్రకథలు వంటివి రామాయణ భారతాల్లోని ధర్మాన్ని సామాన్యులకు వివరిస్తాయ ని తెలిపారు. సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్రం జాషువా కళారంగానికి చేసిన సేవలను వివరించారు. ఈ సందర్భంగ అఖిల ప్రజా కఽళాకారుల సంక్షేమ సంఘం(ఏపీకేఎస్ఎస్) 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. -
ఐక్యతతోనే యాదవుల అభివృద్ధి సాధ్యం
గార: జిల్లాలోని యాదవులంతా ఐక్యతగా ఉన్నప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని యాదవ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్ అన్నారు. ఆదివారం అంపోలు జిల్లా జైలు సమీపంలోని వెలమ సంక్షేమ సంఘ కార్యాలయం ఆవరణలో జిల్లా యాదవుల వనభోజన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ బీసీ–డీలో ఉన్న యాదవులను బీసీ–ఏ లేదా బీలో చేర్చేలా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. యాదవ సంక్షేమ సంఘానికి మూడు ఎకరాల స్థలాన్ని మంజూరు చేసేలా ప్రయత్నం చేద్దామన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తప్పెటగుళ్ల ప్రదర్శన, జిల్లాస్థాయి సంగిడీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గద్దిబోయిన కృష్ణారావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, ఎంపీపీలు డొక్కరి దానయ్య, ఉంగ సాయి, కుజ్జ తాతయ్య, సబ్బి జానకీరామ్, డాక్టర్ నర్తు శేషగిరి, కలగ జగదీష్, జన్నెల రవికుమార్, గొర్లె రమణమూర్తి, ఇప్పిలి జగదీష్, కొరాయి వాసు తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ సెలవులకు వెళ్లి వస్తుండగా..
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో పదో తరగతి చదువుతున్న మట్టా ప్రణీత్కుమార్(15) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. జలంత్రకోట కూడలి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రి గాయాలపాలయ్యాడు. క్రిస్మస్ సెలవుల కోసం సోంపేట మండలం మామిడిపల్లిలోని తన ఇంటికి వెళ్లి తండ్రి హేమంత్రావుతో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూల్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ప్రణీత్కుమార్ తండ్రి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్లో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు కంచిలి గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి మృతిపై గురుకుల ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు, అధ్యాపక, ఉపాధ్యాయ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వైద్యం..సంగీతం
ఈమె పేరు డాక్టర్ పి.మాలతి. జిల్లాలో ప్రముఖ గైనకాలజిస్టుల్లో ఒకరు. సంగీత దర్శకుడు బండారు చిట్టిబాబు వద్ద ఆరేళ్లుగా లలితగీతాలు పాడటం నేర్చుకుంటున్నాను. ఒకసారి రేడియోలో పాడేందుకు అవకాశం వచ్చినా విఫలం కావడంతో ఎలాగైనా బెస్టు అనిపించుకోవాలని శాసీ్త్రయ సంగీతాన్ని మావుడూరు జగన్నాధశర్మ వద్ద శిక్షణ పొంది విజయం సాధించారు. ఇప్పుడు వేదికలపై కూడా ఆలపిస్తున్నారు. వైద్య వృత్తిలో ఏమాత్రం ఖాళీ దొరికినా సంగీత సాధన చేస్తుంటారు. –డాక్టర్ మాలతి. గైనకాలజిస్టు -
డీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్–2026 క్యాలెండర్లు, డైరీలను ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోత ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న ఆవిష్కరించారు. శ్రీకాకుళం రైతు బజార్ కూడలిలోని విశ్రాంత ఉద్యోగుల భవనం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిప్రసన్న మాట్లాడుతూ వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతతో డీటీఎఫ్ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి పోరాటాలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే మధ్యంతర భృతి ప్రకటన చేయాలని, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఐటీడీఏ సంఘ ఇన్చార్జిలు రమణమూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఔషధ నిల్వ కేంద్రం తనిఖీ గార: గార పీహెచ్సీలోని ఔషధ నిల్వ కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి అనిత ఆదివారం తనిఖీ చేశారు. ముందుగా రోగుల ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్యాధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రమ్య, డాక్టర్ సోనియా, ఫార్మాసిస్టు సత్యభామ పాల్గొన్నారు. -
దివ్యాంగుల హక్కులను పరిరక్షించాలి
వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పనకు ఉద్దేశించిన వికలాంగుల హక్కుల(ఆర్పీడబ్లూడీ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మోహన్రావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ గ్రామ సచివాలయాల ద్వారా అందించాలన్నారు. రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సుస్థిర అవకాశాలను కల్పిచాలని కోరారు. కార్యక్రమంలో సాధన కమిటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపతిరావు లక్ష్మీ, పలు మండలాల అధ్యక్ష కార్యదర్శులు బి.యర్రన్నాయుడు, డి.రమణమూర్తి, కె.చంద్రశేఖరరావు, పి.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
లీజు ముప్పు!
నౌపడ ఉప్పు.. ● భూముల లీజును పునరుద్ధరించని కేంద్ర ప్రభుత్వం ● సాగుకు దూరమవుతున్న ఉప్పు రైతులు ● వలసబాటలో కార్మికులు సంతబొమ్మాళి : నవరుచులకు తల్లి నౌపడ ఉప్పు గల్లి అనే నానుడి నేడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమేపి తగ్గిపోయి పరిశ్రమ అంతరించే స్థితికి చేరుకుంది. గతంలో ఉప్పు దిగుబడి లక్షల టన్నుల్లో ఉంటే నేడు వేలకు పడిపోయింది. గతంలో మూడు వేలకు పైగా ఎకరాల్లో ఉప్పు విస్తీర్ణం చేయగా నేడు సగానికి పడిపోయింది. సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, పాలనాయుడుపేట, కె.లింగూడు, సీతానగరం, మూలపేట, మర్రిపాడు, భావనపాడు, సెలగపేట, ఆర్.సున్నాపల్లి, యామలపేట, కేశునాయుడుపేట గ్రామాలకు చెందిన రెండు వేలు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగించేవి. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గి ఉప్పు రైతులు, కార్మికులు వలస బాటపడుతున్నారు. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో వాటిని సన్నకారు, చిన్నకార రైతులు సాగుచేసేవారు. ఈ లీజు 2018తో ముగిసిపోయింది. లీజును పునరుద్ధరించాలని పలుమార్లు ఈ ప్రాంత రైతులు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వినతులు అందించారు. ఈ నేపథ్యంలో భూముల లీజుకు సంబంధించి 2020లో కేంద్రం సబ్ కమిటీ వేసింది. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయినా నేటి వరకు లీజును అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో ప్రస్తుతం ఉప్పు పంట 1500 ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. పనులు లేక ఉప్పురైతులు, కార్మికులు వలసబాట పడుతున్నారు. గతమెంతో ఘనం.. నౌపడ ఉప్పు పరిశ్రమ ఒకప్పుడు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో, దేశంలో రెండో స్థానంలో ఉండేది. రైతులు ప్రతి ఏటా డిసెంబర్లో ఉప్పు సాగును ప్రారంభించి జూలై మొదటి వారం వరకు కొనసాగించేవారు. ప్రతి 40 రోజులకు ఒక సారి దిగుబడి వచ్చేది. ఆ సమయంలో ఇక్కడ ఎంతో సందడిగా ఉండేది. ఇక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఉప్పు రవాణా జరుగుతుండేది. రైల్వే రవాణా ఖర్చులు తక్కువగా ఉండటంతో అప్పట్లో రైతులకు ఉప్పుసాగు లాభదాయకంగా ఉండేది. అయితే ఈ ప్రాంతంలో రైల్వే లైన్ తొలగించడంతో నౌపడ ఉప్పు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా ఉప్పును రవాణా చేయడంతో ఖర్చులు పెరిగాయి. అయినా రైతులు సాగుకు వెనుకడుగు వేయలేదు. భూముల లీజును కేంద్రం రెన్యువల్ చేయకపోవడం వల్లే సమస్య మొదలైంది. కొంతమంది రైతులు ఉప్పు సాగుకు దూరమై కుటుంబాలతో వలస బాటపట్టారు. ఫలితంగా ఉప్పు పరిశ్రమ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైను ఉప్పు భూములు మూలపేట పోర్టుకు అప్పగించడంతో ఆయా భూముల్లో పరిశ్రమల స్థాపనకు పలుమార్లు అధికారులు పరిశీలించడంతో ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఉప్పు సంఘ నాయకులు, రైతులు అంటున్నారు. నవరుచులు అందించే నౌపడ ఉప్పు పరిశ్రమ నేడు అంతరించే స్థాయికి చేరుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి లీజును పునరుద్ధరించాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. తరతరాలుగా ఉప్పును సాగుచేస్తూ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాం. ఉప్పు పంటకు ధర ఉన్నా లేకపోయినా దీనినే నమ్ముకున్నాం. నేడు ఉప్పు పంట సాగు ప్రశ్నార్థకంగా మారడంతో వలసబాటపట్టాల్సి వస్తోంది. ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – కర్రి భాస్కరరావు, ఉప్పు రైతు, నౌపడ ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తేనే ఈ ప్రాంతంలో ఉప్పు పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది. 2018తో లీజు పూర్తయి తర్వాత కేంద్రం సబ్ కమిటి వేసినా ఇంతవరకు చర్యలు లేవు. నౌపడ ఉప్పు పరిశ్రమ పరిరక్షణ కోసం కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – పిలక రవికుమార్రెడ్డి, కార్యదర్శి, సన్నకార ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం, నౌపడ నౌపడలో అరకొరగా ఉప్పు మడులు -
అ‘విశ్రాంత’ సాధన
సంగీతంలో.. ● సంగీత కళపై పెద్దల ఆసక్తి ● వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, వైద్యులు శ్రీకాకుళం కల్చరల్ : సంగీత సాధనకు వయసు అడ్డంకి కాదని వారంతా నిరూపిస్తున్నారు. వివిధ వృతుల్లో దశాబ్దాల అనుభవం సాధించి విశ్రాంత జీవనం గడుపుతున్న వారు.. గృహిణులు.. వైద్యులు.. ఇలా ఎంతోమంది సీనియర్లు ఇప్పుడు జూనియర్లుగా మారి సంగీత సాధనలో నిమగ్నమవుతున్నారు. గురువులు వద్ద మెలకువలు సాధించి వేదికలపై ప్రదర్శనలకు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో సంగీత కళలో శిక్షణ పొందుతున్న వీరి జీవన ప్రయాణం ఆసక్తికరం. -
రమ్యమైన ప్రతిభ
● మెడిసిన్ చదువుతూ స్కేటింగ్లో రాణిస్తున్న రమ్యశ్రీ ● ఇప్పటివరకు 188 పతకాలు గెలుచుకున్న క్రీడాకారిణి శ్రీకాకుళం: ఆమె చదువుతున్నది వైద్య విద్య. ఎంతో పట్టుదల, దీక్ష ఉంటే తప్ప మెడిసిస్ పూర్తి చేయడం వీలు కాదు. అలాంటిది అటు మెడిసిన్, ఇటు స్పోర్ట్స్ రెండిండిలోనూ ఈ యువ కిరణం దూసుకెళ్తోంది. విశాఖపట్నంకు చెందిన రమ్యశ్రీ స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటును సాధించి వైద్య విద్య ను అభ్యసిస్తోంది. ఓ వైపు చదువులో చక్కటి ప్రతిభ చూపిస్తోంది. మరో ఏడాదిలో ఎంబీబీఎస్ పూర్తి చేయనుంది. ఈ అమ్మాయి ఎల్కేజీ చదువుతున్నప్పటి నుంచి స్కేటింగ్ చేస్తోంది. అదే అలవాటును కొనసాగిస్తూ ఇప్పుడు ఆ ఆటలోనూ పతకాల పంట పండిస్తోంది. ఆమె తండ్రి వివేకానంద స్వామి ఎల్జీ సర్వీస్ సెంటర్లో పని చేస్తుండగా, తల్లి అనూష గృహిణి. కుమార్తె స్కేటింగ్లో చిన్నతనం నుంచే ప్రతిభ కనబరచడంతో మరింత ప్రోత్సహించారు. రవికుమా ర్, రమణజి అనే ఇద్దరు కోచ్ల నేతృత్వంలో రమ్య స్కేటింగ్లో మెలకువలు నేర్చుకుంది. రమ్యశ్రీ ఇప్పటివరకు 188 పతకాలను సాధించింది. ఇప్పటివరకు 20 జాతీయస్థాయి ఈవెంట్లలో పాల్గొని 7 బంగారు, 7 రజత, ఏడు కాంస్య పథకాలను పొందింది. 2019 జూలై 4 నుంచి జూలై 14 వరకు యూరప్లో జరిగిన ప్రపంచ రోలర్ గేమ్స్లో పాల్గొని డౌన్ హిల్ ఈవెంట్ లో 15వ స్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి ఈ ఈవెంట్లో పాల్గొన్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది. ప్రస్తుతం వైద్య విద్య చదువుతుండడంతో ప్రాక్టీస్ చేసేందుకు శ్రీకాకుళంలో అవకాశం లేనప్పటికీ, సెలవు రోజుల్లో ప్రాక్టీస్ చేస్తూ విశాఖపట్నంలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి స్కేటింగ్ ఈవెంట్లో డౌన్ హిల్ విభాగంలో రజిత, ఆల్ ఫైన్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించి పలువురి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా రమ్యశ్రీ ‘సాక్షి’తో మాట్లాడుతూ వైద్య వృత్తిని చేపట్టినా స్కేటింగ్ కూడా కొనసాగిస్తానని, భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చా టాలన్నదే తన అభిమతమని పేర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం శిక్షకుల నేర్పిన మెలకువలతో స్కేటింగ్లో ప్రతిభ కనబరుస్తున్నానని తెలిపింది. ఇప్పటివరకు సాధించిన పతకాలు -
జనవరి 19 నుంచి రథసప్తమి మహోత్సవాలు
అరసవల్లి: రానున్న రథసప్తమి మహోత్సవాలను రాష్ట్ర పండుగగా తొలిసారిగా ఏడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు శనివారం సా యంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఊహించిన మేరకు స్వచ్ఛంద సంస్థలు, అనుభవమున్న స్థానికులు సైతం పెద్దగా హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి రథసప్తమికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథిగా హాజరయ్యేలా ప్రణాళిక వేస్తున్నామని, ఇప్పటికే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన ఖరారైందని ప్రకటించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ జనవరి 19న ఆలయ అనివెట్టి మండపంలో ప్రజాసంకల్ప పూజలు, సాయంత్రం తిరువీధి, 20న ఆదిత్యుని ఉత్సవమూర్తులకు స్నపన కార్యక్రమం, 21న ఉత్సవమూర్తుల స్వర్ణాలంకరణ సేవ, 22న లక్ష పుష్పాలంకరణ, 23న సామూహిక సూర్యనమస్కారాలు, 24న మహా సౌర హోమం, 25న రథసప్తమి నాడు అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పంచామృతాలతో అభిషేకసేవ, అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల వరకు నిజరూప దర్శనం తర్వాత అలంకార సేవ, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ప్రకటించారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శోభ, ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ మాట్లాడుతూ..ఈసారి దర్శన టిక్కెట్లతో పాటు వీఐపీ పాసులు, దాతల పాసులకు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. -
బస్సులు పెంచకుంటే సీ్త్ర శక్తి కష్టమే
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీ్త్ర–శక్తి పథకం అమలులో ఉద్యోగులపై కేసులు పెట్టి సస్పెండ్ చేస్తున్న విధానాలను ఆర్టీసీ అధికారులు మానుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల బాట పట్టక తప్పదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో శనివారం ఈయూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్ర–శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పెరిగిన పని భారం తగ్గించాలంటే ప్రస్తుతం కనీసం 3,000 అదనపు బస్సులు పెంచాలన్నారు. అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీల్లో కనీసం 10,000 పోస్టుల భర్తీ చేయాలని కోరారు. కొత్త బస్సులు, కొత్త నియామకాలు లేకుండా ఇదే సిబ్బందితో, ఇవే బస్సులతో సీ్త్ర–శక్తి పథకాన్ని విజయవంతం చేయడం ఎన్నాళ్లూ సాధ్యం కాదన్నారు. -
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు..?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు కల్పిస్తారని, ఈ ఏడాది జనవరిలోనైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ నుంచి సూర్య మహల్ జంక్షన్ వరకు నిరసన, భిక్షాటన కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. జనవరి ఒకటికై నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివరాజు, ఏఐవైఎఫ్ నాయకులు అమోస్, అన్నాజీ, వసంత్, జగదీశ్, సూర్య, వేణు తదితరులు పాల్గొన్నారు. -
సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర సంధ్య వేళల్లో సిక్కోలు బాట రక్తంతో తడుస్తోంది. 2025 అంతా ఇదే తీరు. చిరు చీకట్లు కమ్ముకుంటున్న సమయాల్లో జరుగుతున్న ప్రమాదాలు చాలా కుటుంబాల్లో చీకట్లను మిగిల్చాయి. తప్పతాగి ఒకరు, మితిమీరిన వేగంతో మరొకర
బ్లాక్స్పాట్లు గుర్తించి ప్రమాద నివారణకు చర్యలు చేపడుతున్నాం. గత ఏడాది 889 ప్రమాదాలు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికి 699 జరిగాయి. ఘోర ప్రమాదాల సంఖ్య తగ్గింది, కానీ ప్రమా దాల్లో గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్లు ధరించకపోవడం వలనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. – కలెక్టరేట్లో సమీక్షలో ఎస్పీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని రహదారులు రక్తమోడాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 699 ప్రమా దాలు జరిగాయి. లెక్కల్లోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు మూ డొందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లినవారే అధికంగా మరణించారు. అది కూడా ఎక్కువగా సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్యన మరణించారు. రానున్నది పండగల సీజన్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదని పోలీసులు సూచిస్తున్నారు. పండగ కోసం ఊళ్లకు వెళ్లే వాళ్లు నిబంధనలు పాటించాలని, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ●చాలాచోట్ల హైవే రోడ్లపై ఇసుక, గ్రావెల్ చెల్లాచెదురై ఉంది. గ్రామీణ రహదారుల్లో మరింత దారుణం. గోతులు, ఇరువైపులా పొదలుండి ఎదురుగా వస్తున్నవారు కనిపించడం లేదు. ●హైవే వెంబడి ఫ్లై ఓవర్లలో కొన్ని చోట్ల లైట్లు వెలగడం లేదు. వాహన వేగాన్ని సూచించే స్పీడోమీటర్లు కొన్ని పనిచేయడం లేదు. పీపీటీ కెమెరాలు కూడా మరమ్మతులో ఉన్నాయి. ●షార్ట్కట్ యూటర్న్ల కోసం ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం హైవే వరకు చాలాచోట్ల డివైడర్లను తవ్వి మార్గాలను చేసి ఉన్నారు. కొన్ని చోట్ల రోడ్లపైనే కాంక్రీట్ దిమ్మలు వదిలేసి ఉన్నారు. ఇవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ●నో పార్కింగ్ జోన్లలో భారీ వాహనాలను నిలుపుదల చేయకుండా, నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ పెట్టుకునేలా చేయడంలో హైవే మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు ఇప్పటికీ విఫలమవుతున్నారు. ●ప్రమాదకర మలుపుల్లో ఇంకా బారికేడ్లను అమర్చలేదు. రణస్థలం హైవేలో ఇటీవల అలానే గుంతలో పడి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ప్రమాద ప్రోన్ జోన్లలో గ్లోసైన్బోర్డులు, స్పీడ్ లిమిట్బోర్డులు, జీబ్రాక్రాసింగ్ గుర్తులు కొన్ని ప్రాంతాల్లో లేవు. ●ముఖ్య పట్టణాల్లో, కేంద్రాల్లో అడ్డదిడ్డంగా మలుపులు తిప్పేయడం, రోడ్ల మధ్యనే ఆటోవాలాలు అకస్మాత్తుగా ఆపేయడం, నిర్ణీత ప్రదేశాల్లో కాకుండా రద్దీ ప్రదేశాల్లో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ర్యాష్ డ్రైవ్ చేయడం, సడెన్గా ఆపేయడం ప్రమాదాలకు తావిస్తున్నాయి. ●హెల్మెట్ పెట్టుకోకపోవడం, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్రైడింగ్, మైనర్ రైడింగ్, షార్ట్కట్ రూట్ల ను ఆశ్రయించడం, అవసరం లేకపోయినా రాత్రి ప్రయాణాలు చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాహనాలను పరిశీలించకపోవడం వంటి చిన్నపాటి నిర్లక్ష్యాలతోనే ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 3న జిల్లాకేంద్రంలోని డేఅండ్నైట్ కూడలి సమీప నాగావళి వంతెనపై ఆర్టీసీ బస్సు నిండు గర్భిణిని ఢీకొట్టి వెళ్లిపోయింది. చక్రాల కింద గర్భిణి నలిగిపోయింది. మార్చి 15న లావేరు మండలం బుడుమూరు సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పంక్చర్ కావడంతో పాతపట్నం పెద్దలోడికి చెందిన నలుగురు చనిపోయారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వ్యాన్ ఢీకొనడంతో మధ్య ప్రదేశ్కు చెందిన ముగ్గురు మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. -
జనవరి 4న చలో విశాఖ
రణస్థలం: జనవరి 4న చలో విశాఖపట్నం జయప్రదం చేయాలని ఏపీ ఆశ వర్కర్స్ యూ నియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.నాగమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపు నిచ్చారు. ఆశ వర్కర్స్ యూనియన్ సమావేశం శనివారం కోష్టలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అంబేడ్కర్ విగ్ర హం నుంచి ప్రదర్శన అనంతరం మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభ లో ఆశాలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆశ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని, వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలని డి మాండ్ చేశారు. సెలవు లేకుండా ఆశ వర్కర్లు పని చేస్తున్నారని, ఆశ వర్కర్ల సమస్యలు పరి ష్కరించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. లీలావతి, నాయకులు పి. రాజా, సుభద్ర, పైడి లక్ష్మీ పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: 69వ ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–19 బాలికల క్రికెట్ చాంపియన్షిప్ పోటీలకు కోచ్, మేనేజర్లుగా శ్రీకాకుళం జిల్లా వాసులకు అవకాశం లభించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి వేదికగా జనవరి 1 నుంచి 6 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల క్రికెట్ జట్టు కోచ్, మేనేజర్లగా జిల్లాకు చెందిన ముగ్గురు ఫిజికల్ డైరెక్టర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి నియామక ఉత్తర్వులు అందు కున్నారు. నియామకమైన వారిలో వాన దివ్య (పీడీ– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణాపురం, మందస మండలం), బేరి లోకేశ్వరరావు (పీడీ– ఏపీ మోడల్ స్కూల్ పాతపట్నం), నెయ్యిల అనంత్రాజు (పీడీ– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీలంపేట) ఉన్నారు. డిసెంబర్ 29న ఏపీ రాష్ట్ర జట్టుతో కలిసి మధ్యప్రదేశ్ పయనమై వెళ్తున్నారు. పాతపట్నం: జాతీయ స్థా యి స్కూల్గేమ్స్ అండర్– 19 బాలికల క్రికెట్ పోటీల కు పాతపట్నం ప్రభుత్వ మోడల్ స్కూల్లో పీడీగా పనిచేస్తున్న బేరి లోకేష్కు జాతీయ బాలికల క్రికెట్ హెచ్ఓడీగా ఎంపికయ్యారని ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కేవీ రత్నకుమారి శనివారం తెలిపారు. లోకేష్ను రాష్ట్ర వ్యాయా మ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్బాబు, ఎంఈఓ సీహెచ్ తిరుమలరావు,పీఈటీలు జన్ని కృష్ణ, సిమ్మ కృష్ణారావు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు అభినందించారు. టెక్కలి రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై పడి వారిని పట్టుకునేందుకు ప్రయ త్నించాడు. అక్కడే ఉన్న కొంత మంది వ్యక్తులు ప్రశ్నించడంతో వారిని నానా మాట లు అన్నాడు. దీంతో కొందరు అతడిని పట్టు కుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని టెక్కలి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఆశ్రమ పాఠశాలలో దాడిపై విచారణ
మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై పీఈటీ భర్త దాడి చేసిన ఘటనపై శనివారం ఆశ్రమ పాఠశాలలో ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.మల్లేశ్వరరావు విచారణ చేపట్టారు. పీఈటీ కల్యాణితో పాటు విద్యార్థిని తల్లి, పాఠశాల సిబ్బందిని విచారించారు. దీనిపై ఆయన మా ట్లాడుతూ కమిషన్ చైర్మన్కు నివేదిస్తామని తెలిపా రు. అనంతరం మండల గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సవర వెంకటేష్ ఆయనకు ఫిర్యాదు చేశా రు. పాఠశాలతో సంబంధం లేనివ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించడమే కాకుండా విద్యార్థినిపై దాడి చేయ డం సమంజసం కాదని, అతనిని తక్షణమే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయా లని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి, కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలని దళిత గిరిజన సంఘాల నాయ కులు బోకర నారాయణరావు, చౌదరి లక్ష్మీనారాయణ కోరారు. పీఈటీ కల్యాణిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకునేవిధంగా ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని బీఆర్ఏయూ వీసీ కేఆర్ రజనీ సూచించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆవిష్కర్ సీజన్–3 హాకథాన్ పేరుతో మూడు రోజుల పాటు జరగనున్న సాంకేతిక వర్క్షాప్ సదస్సును శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు. సాంకేతికంగా నిర్వహిస్తున్న సదస్సుల ద్వారా విద్యార్థులు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాలని సూచించారు. అనంతరం కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం తమ కళాశాలలో సాంకేతిక వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 రాష్ట్రాల నుంచి 500 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మొదటి రోజు 50 బృందాలు పాల్గొన్నాయన్నారు. వీరంతా 48 గంటల పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుని వినూత్నమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ఐఐసీ డీన్ జి.సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
●డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యమే ముద్దు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను(ఓజేటీ) జిల్లా ఇంటర్మీడియెట్ వృత్తి విద్యాశాఖ అధికారి రేగ సురేష్ కుమార్ పరిశీలించారు. శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రాండ్ కన్వెన్షన్లో జరుగుతున్న క్షేత్రస్థాయి శిక్షణను శనివారం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గివలస రామ్ప్రసాద్తో కలిసి డీవీఈఓ సురేష్కుమార్ పరిశీలించారు. విద్యార్థులు తయారుచేసిన రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఓజేటీ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. పోలాకి కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతు పద్మలత మాట్లాడుతు లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యార్థులకు ఓజేటీ మేలు చేస్తుందని, భవిష్యత్లో ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నెలరోజుల ఓజేటీలో భాగంగా క్షేత్ర స్థాయి శిక్షణకు విద్యార్థులను తీసుకువచ్చినట్టు అధ్యాపకులు బీఎల్వి నరసింహారావు, కాయ రవీంద్ర తెలిపారు. -
కాంట్రాక్టర్లను తొలగించాలి
శ్రీకాకుళం: నగరంలోని రిమ్స్ ఆస్పత్రిలో కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్లను తక్షణమే తొలగించాలని ఐఎఫ్టీయూ నాయకులు సవలపురపు కృష్ణవేణి, గొల్లపల్లి రాజులు, బగాది శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రిమ్స్ ప్రధాన ప్రవేశద్వారం వద్ద అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెక్యూరిటీ గార్డులకు మూడు నెలలుగా ఉత్తర్వుల ప్రకారం వేతనాలు చెల్లించకుండా చట్టబద్ధమైన హక్కులను కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం కాలరాస్తోందని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులను నిత్యం వేధిస్తూ, సెలవులు మంజూరు చేయకుండా 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు కలిగిస్తున్న క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసు లిమిటెడ్ యాజమాన్యంపై కూడా రిమ్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ఉన్నతాధికారులు, రిమ్స్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన కోర్కెల సాధన కోసం ఈనెల 29, 30, 31 తేదీల్లో రిమ్స్ గేటు వద్ద నిరాహార దీక్షలు చేపడుతామని తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు డి.గణేష్, మామిడి క్రాంతి, జోగి వెంకటరమణ, దామోదర రవికుమార్, దమ్ము సింహాచలం, సూర్యకాంతం, శశిరేఖ, ససంధ్య, రాజేశ్వరి, జయప్రద, ప్రభ, విజయ, శ్రీనివాస్, రామారావు, రాజేంద్రప్రసాద్, సరస్వతి, తంగి శ్రీను, చిరంజీవి, హైమారావు తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 6లోగా వివరాలు నమోదు చేసుకోవాలి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి రూ.లక్ష లేదా అంతకుమించి విలువైన పనులు, విరాళాలు సమర్పించిన దాతలు వచ్చే ఏడాది జనవరి 6వ తేదీలోగా ప్రత్యేకంగా తమ వివరాలను ఆధార్కార్డుతో సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. దాతలు స్వయంగా లేదా వారికి చెందిన వ్యక్తులను ఆలయానికి పంపించి తమ వివరాలను నమో దు చేయించుకోవాలన్నారు. లేదంటే 63026 79236, 89789 14660, 73820 25550 నంబర్లకు వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డులు, విరా ళ రశీదును పంపిస్తే ఆలయ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. ఎచ్చెర్ల: మండలంలోని చిలకపాలేం జంక్షన్కు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒడిశా నుంచి బెంగుళూరు వెళ్తున్న ఒక కారు బోల్తా పడడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగుళూరు (కర్ణాటక) బాట్రాపురానికి చెందిన ఎన్.నవీన్ తన మిత్రులతో కలిసి ఒడిశాలోని ఆలయాల సందర్శనకు కారులో వెళ్లాడు. అనంతరం తిరిగి బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చిలకపాలేం వద్ద కారు వెనుక టైరు పేలడంతో డివైడర్ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ అర్జున్(27) తీవ్రంగా గాయపడడంతో.. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో డ్రైవర్తో సహా ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని శివశంకర్ కాలనీ కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన ఆనెం త్రినాథరావు (74) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. మృతుడు శివశంకర్ కాలనీ కూడలి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో పాతపట్నం నుంచి కొరసవాడ వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పాతపట్నం సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. త్రినాథరావుకు భార్య ఆనెం శకుంతల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్ఛాపురం రూరల్: జాతీయ రహదారిపై వెళ్తున్న గొర్రెలను లారీ ఢీకొనడంతో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గుడ్డిభద్ర కొజ్జిరియాకు చెందిన దుర్గాశి శేఖరం తన గొర్రెలను శనివారం స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో సోంపేట నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు బలరాంపురం జంక్షన్ వద్ద ఢీకొనడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో నాలుగు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ ఏదురు మోహనరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నర్తు ప్రేమ్కుమార్, నాయకుడు దట్టి అజయ్, మురపాల ధర్మా, కర్రి పొట్టయ్యలు లారీ డ్రైవర్తో మాట్లాడి బాధితుడికి రూ.80 వేల నష్ట పరిహారం ఇప్పించారు. -
ఏమైందో ఏమో..?
● పైళ్లెన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య ● జింకిభద్రలో విషాదచాయలు సోంపేట: పైళ్లెన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన ఘటన మండలంలోని జింకిభద్ర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తామాడ తేజేశ్వరరావు కుమారుడు షణ్ముఖరావుకు మామిడిపల్లి గ్రామానికి చెందిన గేదెల జ్యోతి కుమార్తె ఊర్మిళ(23)తో ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన వివాహమైంది. షణ్ముఖరావు సోంపేట తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగా సెల్షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. భార్యభర్తలు అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఊర్మిళ మూడు నెలల గర్భిణి. వారం రోజుల క్రితం షణ్ముఖరావు కుటుంబ సభ్యులు, ఊర్మిళ తల్లి జ్యోతి తీర్థయాత్రలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తీర్థయాత్రలు ముగించుకుని జింకిభద్ర గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఊర్మిళ మేడ మీద ఒక్కర్తే పడుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం లేచి తలుపుకొట్టినా తీయకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డాబా పైకి వెళ్లి వెంటిలేటర్ ద్వారా చూడడంతో ఆత్యహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఊర్మిళ ఆత్మహత్య చేసుకోవడానికి భర్తే కారణమై ఉంటాడని మృతురాలి అక్క సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం భార్య మృతిని తట్టుకోలేక షణ్ముఖరావు అనారోగ్యానికి గురవ్వడంతో సోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజాలు తెలిసే అవకాశం ఉంది. కంచిలి ఎస్ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతితో జింకిభద్రలో విషాదచాయలు అలుముకున్నాయి. -
కూర్మనాథుని సన్నిధిలో న్యాయమూర్తులు
గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని విశాఖపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.సన్యాసినాయుడు శనివారం ఉదయం దర్శించుకున్నారు. అదేవిధంగా జిల్లా నాలుగో అదనపు సెషన్సు న్యాయమూర్తి ఎస్.కవిత కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. వేర్వేరుగా వచ్చిన న్యాయమూర్తులకు అధికారులు ఎదురేగి స్వాగతం పలికి, అంతరాలయంలో మూలవిరాట్ వద్ద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహాత్యాన్ని తెలియజేయగా, కార్యాలయ సూపరింటెండెంట్ నర్సుబాబు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
అంతన్నారు.. ఇంతన్నారు..!
● అరసవల్లి కూల్చివేతలకు ఏడాది ● అభివృద్ధి పేరిట నిర్మాణాలను కూల్చేసిన వైనం ● రూ.100 కోట్లు మంజూరవుతాయని హడావుడి ● ఏడాదిగా ఒక్క ఇటుకై నా వేయని దుస్థితి ఆలయానికి చెందిన నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు (ఫైల్) అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఎదుట అభివృద్ధి పేరిట చేపట్టిన విధ్వంసానికి నేటికి సరిగ్గా ఏడాది గడిచింది. ఈ ఏడాది రథ సప్తమిని తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వహించిన కూటమి ప్రభుత్వం, రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసింది. దీనిలో భాగంగా ఆదిత్యాలయం ఎదురుగా ఉన్న పక్కా భవనాలు, షెడ్లను నేలమట్టం చేశారు. జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబ నేతలే కేంద్రం, రాష్ట్రంలోనూ మంత్రులుగా చక్రం తిప్పుతుండడంతో అరసవల్లి ఆలయ రూపురేఖలు మారిపోతాయని స్థానికులు భావించారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలకు భక్తులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ.. అభివృద్ధి పేరిట స్థానిక ఎమ్మెల్యేను ముందు పెట్టి మరీ దాతలిచ్చిన భవనాలను, జింకు షెడ్లను కూల్చివేయించారు. తీరా ఏడాది గడుస్తున్నా ఆయా పరిసరాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేకపోయారు. దీనికి తోడు గతంలో ఉన్న శాశ్వత భవనాలకు ప్రత్యామ్నాయం చూపకుండా విధ్వంసం చేయడంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు, అన్నదాన ప్రసాదాల తయారీ, విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.100 కోట్లు ఎక్కడ..? రూ.100 కోట్లతో (ప్రసాద్ స్కీమ్) కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిపోతుందని ఈ ఏడాది జరిగిన రథ సప్తమికి ముందు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ప్రగల్భాలు పలికారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను మధ్యలో పెట్టి ఆదిత్యాలయానికి ఎదురుగా ఉన్న భవనాలను కూల్చివేయించారు. అలాగే ఉన్నపళంగా దుకాణాలు ఖాళీ చేయించడంతో వ్యాపారాలను కోల్పోయి పదుల సంఖ్యలో వ్యాపారులు రోడ్డునపడ్డారు. కూల్చివేతలకు సరిగ్గా ఏడాది పూర్తవుతున్నా, ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పడలేదు. ఆలయం ముందు మాత్రం విశాలంగా ప్లాట్ఫాం వేసి, ఇంద్ర పుష్కరిణి కనిపించేలా ఖాళీగా ఉంచారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్ుట్యవల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్ కథ కంచికే అన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ పథకం ఎలాగో రాదు.. ఆ నెపంతో చేపట్టిన కూల్చివేతల ఘట్టాన్ని మరిపించడానికి అభివృద్ధి పేరిట ఆలయానికి చెందిన (భక్తులచే సమకూరిన ఆదాయం) నిధులు రూ.12 కోట్లను వినియోగించి ఆలయ పరిసరాల్లో కొత్త భవనాలను నిర్మించేలా తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో ప్రసాద్ స్కీమ్ అటకెక్కినట్లేనన్న చర్చ జోరందుకుంది. అరసవల్లి సూర్య దేవాలయానికి గత రెండున్నర దశాబ్ధాలుగా ఎందరో దాతలు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం, తమ సంస్థల పేరిట ఎన్నో రూ.లక్షలతో వసతి గదులు, శాశ్వత నిర్మాణాలతో పాటు ఎండ, వర్షం నుంచి భక్తులకు రక్షణగా జింకు రేకు షెడ్లును కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ‘రహస్య’ అజెండా ఏముందో గానీ.. అరసవల్లిలో 2004 నుంచి దాతలు సమకూర్చిన భవనాలతో పాటు దశాబ్ధాల పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గదుల సముదాయం, ఆలయ నిధులతో నిర్మించిన 12 దుకాణాల సముదాయాన్ని, ప్రసాదాల కౌంటర్లు, వంట గదులు కూడా అభివృద్ధి పేరిట కూల్చివేశారు. అలాగే ఓ దాత ఏకంగా రూ.30 లక్షలతో నిర్మించిన అన్నదాన మండపాన్ని కూడా కూల్చేశారు. అయితే దాతలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ కూల్చివేతలు చేయడంపై దాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో దాతల సహకారం తగ్గుతుందనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆలయానికి చెందిన నిధులు, దాతలిచ్చిన విరాళాలు సుమారుగా అప్పటి మార్కెట్ రేట్ల ప్రాప్తికి సుమారు రూ.7 కోట్ల విలువైన నిర్మాణాలను కూల్చివేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు మళ్లీ ఆలయ నిధులు రూ.12 కోట్లతో అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలాగే దుకాణాలు కోల్పోయిన వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. రోడ్లపై బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. జీవనమార్గంగా ఉన్న దుకాణాలను తొలిగించిన క్రమంలో ఆలయ స్థలాల్లోనే కొత్తగా దుకాణాలను నిర్మించాలంటూ వ్యాపారులు కోరుతున్నారు. -
74 ఎకరాల చెరువుపై కన్ను
హిరమండలం: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 75 ఎకరాల చెరువుపై కన్నేశాడు ఓ వ్యక్తి. తప్పుడు పత్రాలు చూపి కై వసం చేసుకోవాలని చూశాడు. ఏకంగా తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తీరా అధికారుల విచారణతో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేసేసరికి ఆ స్థలం చెరువుగా తేలింది. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతం కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలం మండలం తుంగతంపర గ్రామంలోని ఎల్పీసంఖ్య 3 సర్వే నంబర్ 1లో 52.46 ఎకరాలతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో 22 ఎకరాల్లో చెరువు ఉండేది. ఈ భూమి 22ఏలో నమోదై ఉంది. 2015లో గ్రామ అవసరాలు తీర్చేందుకుగాను విశాఖకు చెందిన జవ్వాది శ్రీరామ్మూర్తికి లీజుకు ఇచ్చారు. గ్రామాభివృద్ధికి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత కూడా అదే వ్యక్తికి లీజు కొనసాగించారు. సదరు వ్యక్తి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో హిరమండలం తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేశారు. చెరువు స్థలం మొత్తం తనదేనని.. తనకు పాస్పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఒక బోర్డు ఏర్పాటుచేశారు. (రాజుగారి)పెద్ద చెరవుగా పిలవబడే 74 ఎకరాల భూమి తమదేనని.. కొనుగోలు చేశామని..పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ చింతం నరసింహమూర్తితో పాటు గ్రామస్తులు తహశీల్దారు కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. ఆయన పరిశీలించి అది ప్రభుత్వ భూమిగా నిర్ధారణచేశారు. అనంతరం తహసీల్ధార్తో పాటు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ వెంకటేష్ చెరువు భూమి కబ్జాకు ప్రయత్నించిన శ్రీరామ్మూర్తిపై కేసునమోదు చేసి అరెస్టు చేశారు. పాతపట్నం కోర్టులో శుక్రవారం హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామ అవసరాల పేరిట లీజుకు అదే అదునుగా తనదిగా చూపుతూ స్వాధీనానికి యత్నం గ్రామస్తుల ఫిర్యాదుతో వెలుగులోకి.. రిమాండ్కు నిందితుడు -
బ్లాక్స్పాట్స్ వద్ద నిఘా పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాసీ్త్రయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లతో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య, ప్రాణనష్టం కొంత మేర తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమన్నారు. 2024లో 889 ప్రమాదాలు జరగ్గా.. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి ఆ సంఖ్య 699కి తగ్గిందన్నారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్లే అత్యధిక ప్రాణనష్టం జరుగుతోందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. నవభారత జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణకు ప్రణాళిక సిద్ధంగా చేయాలని ఆదేశించారు. భైరవానిపేట జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ప్రమాదకరంగా ఆపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. జనవరిని రహదారి భద్రత మాసంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయసారథి, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): త్యాగాలు, పోరాటాలు, సిద్ధాంతాల పునాదిపై ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వందేళ్లు పూర్తి చేసుకుందని పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్ వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ అధ్యక్షతన సీపీఐ శత వసంతాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆవిర్భవించిన జెండా ఎరజండా అని, నిత్యం ప్రజా సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటాలు చేసినట్లు చెప్పారు. సీపీఐ అంటే పేదలకు నీడనిచ్చే పార్టీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని, కమ్యూనిస్టు నాయకుల ఆశయాల కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరావు, టి.తిరుపతిరావు, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి కిరణ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కె.అప్పలరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు లక్ష్మి, పార్వతి, శిరీష, కుమారి, షేక్ బాను, పార్థసారధి, గురుమూర్తి, అర్జి మణి తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 28 నుంచి శాలిహుండం యాత్ర
● 29న వంశధార నదిలో చక్రతీర్థ స్నానం ● బ్రోచర్ ఆవిష్కరించిన ప్రతినిధులు గార: ప్రఖ్యాత శాలిహుండం కొండపై భీష్మ ఏకాదశి పర్వదినం జరిగే గిరి జాతర బ్రోచర్ను ఎమ్మెల్యే గొండు శంకర్, దేవాలయ ట్రస్టీ సుగ్గు మధురెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శుక్రవారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. అర్చకులు మహేంద్రాడ వేణుగోపాలచార్యులు జాతర విశేషాలను వివరించారు. జనవరి 28న సాయంత్రం తిరువీధి ఉత్సవంతో జాతర ప్రారంభవుతుందని, అర్ధరాత్రి తర్వాత స్వామి మూలవిరాట్కు క్షీరాభిషేక సేవ ఉంటుందన్నారు. 29న ఉదయం సమీప వంశధార నదిలో చక్రతీర్థ స్నానం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 1న ఆలయం వద్ద వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవంతో జాతర ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, బడగల వెంకటప్పారావు, గుండ భాస్కరరావు, కొంక్యాణ ఆదినారాయణ, బోర లక్ష్మీ, పుక్కళ్ల నీలవేణి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
తెల్లదొరల పాలిట.. సింహస్వప్నం పుల్లెల
● సహాయ నిరాకరణోద్యమంలో శ్యామసుందరరావు కీలకపాత్ర ● కళింగ సీమ నుంచి నాయకత్వం ● నేడు 123వ జయంతి ఇచ్ఛాపురం రూరల్: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురు నిలిచి, సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని తెల్లదొరల పక్కన బల్లెంలా మారిన పుల్లెల శ్యామసుందరరావు స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి కుగ్రామమైన ఇచ్ఛాపురం నుంచి దేశభక్తిని గ్రామగ్రామాలకు వ్యాపింపజేసి, స్వతంత్ర భారత ఉద్యమాలకు నాయకత్వం వహించి పలుమార్లు జైలుకు వెళ్లారు. అటువంటి ధీశాలి పుల్లెల శ్యామసుందరరావు 123వ జయంతి నేడు. గాంధీ పిలుపుతో.. 1903 డిసెంబర్ 27న ఇచ్ఛాపురంలో పుల్లెల వెంకటరామయ్య పంతులు, కామేశ్వరమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన శ్యామసుందరరావు స్థానిక సురంగి రాజా పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. సంపన్న కుటుంబం కావడంతో బరంపురం, విజయనగరం కళాశాలల్లో చదివారు. ఉన్నత విద్య కోసం మద్రాస్ చేరుకున్న సమయంలో ఆలోచనలు సాతంత్య్రోద్యమం వైపు మళ్లాయి. వాణిజ్యం పేరితో భారత దేశానికొచ్చి పెత్తనం చెలాయిస్తున్న తెల్లదొరలు తక్షణమే దేశాన్ని వెళ్లిపోవాలన్న మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1921లో దేశ వ్యాప్తంగా చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ‘దున్నే వాడిది భూమి’ నినాదంతో రైతు ఉద్యమానికి కళింగ సీమ నుంచి నాయకత్వం వహించిన పుల్లెల రాకతో అప్పటి వరకూ అంతంత మాత్రంగా ఉన్న కళింగసీమ స్వతంత్రోద్యమ స్ఫూర్తి ఒక్కసారిగా జూలు విదిల్చింది. అతని కృషి మొత్తం దక్షిణాది రాష్ట్రాలు శ్రీకాకుళం వైపు చూసేలా చేసింది. రైతుల అణచివేతకు కారణమైన ‘జమీందారీ విధానం రద్దు’కు పోరాటం చేశారు. 1922 ఫిబ్రవరి 8న ఆయన్ను నిర్బంధించిన బ్రిటీష్ పాలకులు బరంపురం, కడలూరు జైళ్లకు తరలించారు. విడుదలయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1933 నుంచి ఇచ్ఛాపురం సర్పంచ్గా వ్యవహరించిన పుల్లెల 1935 నుంచి జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, అవిభక్త గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1937 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆనాటి మంత్రి సర్.ఎపి.పాత్రోను ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1940లో కిసాన్ సభకు అధ్యక్షునిగా వ్యవహరించి శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగారు. నిరంతర పోరాటాలతో తెల్లదొరలకు పక్కలో బల్లెంలా మారిన శ్యామసుందరరావును 1940లో గృహ నిర్బంధం చేశారు. ‘రద్దు’ చట్టం రాకముందే 1940 జూన్ 16న అశువులు బాశారు. ఫైర్ బ్రిగ్రేడ్గా పిలిచే శ్యామసుందరరావు ప్రియ శిష్యుడుగా గుర్తింపు తెచ్చుకున్న సర్దార్ గౌతు లచ్చన్న ఈయన శిష్యుడే. పుల్లెల శ్యామసుందరరావు తన కుమారుడి పేరు సైతం తన పేరునే శ్యామసుందరంగా నామకరణ చేయడం విశేషం. పుల్లెల శ్యామసుందరం జీవిత్ర చరిత్రను ప్రముఖ రచయిత ప్రొఫెసర్ డాక్టర్ కె.ముత్యం రాశారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో పాత హైవేపై, శ్రీకాకుళం క్రొత్త బ్రిడ్జీ ప్రాంతంలో పుల్లెల శ్యామసుందరరావు కాంస్య విగ్రహాలను నెలకొల్పేందుకు ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పూనుకున్నారు. వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చడం లేదు. ఏది ఏమైనా ఫైర్బిగ్రేడ్గా పేరు తెచ్చుకున్న పుల్లెల శ్యామసుందరరావు విగ్రహం ఇచ్ఛాపురం నడిబొడ్డులో ఉంటే బావితరాలకు ఆయన చరిత్ర తెలుస్తుందని అభిమానులు అంటున్నారు. -
1104 సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి గోపాలరావు రాజీనామా
అరసవల్లి: ఆంఽధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీకాకుళం విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎం.వి. గోపాలరావు (గోపి) తన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో మళ్లీ వీఎస్ఆర్కే.గణపతిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర సీఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సంఘం నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగి, రూ.లక్షల్లో నిధులు మాయమయ్యాయంటూ కొన్ని నెలలుగా గోపాలరావుపై ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎస్.కృష్ణయ్య అధ్యక్షతన కీలక నేతల సమావేశం ఏర్పాటు చేసి విచారణ జరిపించగా నిధుల గోల్మాల్ వ్యవహారాలన్నీ వాస్తవాలని తేలడంతో గోపాలరావును పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో గత్యంతరం లేక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి గోపాలరావు స్వయంగా రాజీనామా సమర్పించాల్సి వచ్చింది. దీంతో పూర్వ ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కె గణపతినే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులంతా ఎన్నుకున్నారు. ఇదిలావుంటే స్థానిక జిల్లాలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన గోపాలరావు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు నియామకాల్లో అక్రమాలకు ప్రయత్నించి విధుల నుంచి సస్పెన్షన్ అయిన సంగతి తెలిసిందే. -
ముప్పు!
నిప్పు..● పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. ● పంటకోత పూర్తయిన తర్వాత మిగిలిన అవశేషాలను భూమిలో మురగబెట్టి దుక్కిలో కలిపిదున్నాలి. ఇలా చేస్తే వరి గడ్డి భూమిలో మురిగి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ● తర్వాత దశలో సాగుచేసే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, సూపర్పాస్ఫేట్, పొటాష్లను కలిపి పంట సాగు చేసుకొనే ముందు చల్లితే పొలంలో మిగిలిన కొయ్యలు, వరి గడ్డి రెండు వారాల్లోనే మురుగుతాయి. ● వరి కోతలు అనంతరం కొయ్య, గడ్డి దహనం ● భూసారంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న శాస్త్రవేత్తలుభూసారానికి హిరమండలం: కొనేళ్ల కిందట వరి కోతల అనంతరం గడ్డిని కుప్పలుగా వేసి పశువుల మేతకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల కొరత, సమయాభావం, వాతావరణ పరిస్థితులు తదితర కారణంతో కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలతో పాటు గడ్డికి కొందరు రైతులు పొలంలోనే నిప్పంటిస్తున్నారు. అవగాహన లోపంతో అన్నదాతలు ఇలా చేయడం వల్ల భూసారానికి ముప్పు పొంచి తప్పదని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంతో భవిష్యత్తులో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాదని చెబుతున్నారు. పంటలకు కీడుచేసే పురుగులను తినే వానపాములు, కీటకాలు నశించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భూమికి సేంద్రియ పీచు పదార్థాలుగా ఉపయోగపడే అవశేషాలు ఖనిజ, లవణాలు నశిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో ఎక్కువ మొత్తంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని చెబుతున్నారు. పంట భూముల్లో గడ్డి, వరి కొయ్యలను దహనం చేస్తే భూసారం కోల్పోతుంది. అవసరం లేని గడ్డిని భూమిలోనే కలిపి దున్నితే సేంద్రియ ఎరువుగా మారి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. గడ్డి, కొయ్యల దహనంతో వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – బి.సంధ్య, మండల వ్యవసాయాధికారి, హిరమండలం -
గంజాయి రహిత జిల్లాగా తీర్దిదిద్దుదాం: ఎస్పీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్’ (ఎన్కార్డ్) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 115 గంజాయి హాట్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. నాగావళి తీర ప్రాంతాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా కెమెరాలు అమర్చుతున్నామని, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ సాయంతో మారుమూల ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వెల్లడించారు. విద్యార్థులకు ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. మెడికల్ షాపుల్లో నిద్రమాత్రలు, మత్తు కలిగించే మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ను బలోపేతం చేస్తున్నామని, నవంబర్లో జిల్లాలో 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి విక్రేతలపైనే కాకుండా, పాత నేరస్తులపై కూడా నిరంతరం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ పూజారాణి పుండ్కర్ జిల్లాలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు పరిశీలించారు. అరుదైన జంతువుల చర్మం, గోళ్లు, కొమ్ముల అక్రమ రవాణా జరిగితే సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయ సారథి, వివిధ అధికారులు పాల్గొన్నారు. ‘సిరో’ గుర్తింపు కొనసాగింపు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన సంస్థ(సిరో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుర్తింపును 2028 మార్చి వరకు కొనసాగించినట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు.శాసీ్త్రయ పరిశోధనలు, పరిశ్రమలతో అనుసంధానమైన కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. మార్చిలోగా సమీకృత కలెక్టరేట్ సిద్ధం కావాలి శ్రీకాకుళం : వచ్చే ఏడాది మార్చి 1 కల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడరాదన్నారు. విభాగాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనుసంధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులపై దృష్టి సారించాలన్నారు. పర్యవేక్షణకు రోడ్ల భవనాల శాఖ నుంచి కార్యనిర్వాహక ఇంజినీరు (డీఈ) స్థాయి అధికారిని నియమించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ తదితరులున్నారు. తండ్రికి తలకొరివి పెట్టిన తనయ బూర్జ: కొరగాం గ్రామంలో బొద్దూరు శివయ్య(63) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు రాజు, ధనలక్ష్మి. మగపిల్లలు లేక పోవడంతో ధనలక్ష్మి ముందుకొచ్చి తండ్రికి తలకొరివి పెట్టింది. -
విద్యార్థినిపై దాడి అమానుషం
● దాడికి పాల్పడిన స్కూల్ పీడీ భర్తను అరెస్టు చేయాలి ● రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబయోగి డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబయోగి, గిరిజన సంఘాల నేతలు మెళియాపుట్టి: బందపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ భర్త రామచంద్రరావు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఘటనపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబ యోగి ఘటనపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. దాడిపై వెంటనే గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక్కరోజు వ్యవధిలో అరెస్ట్ చేయకపోతే ఆదివాసీలతో భారీ ధర్నా, ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పాపను కొట్టిన వారిని అరెస్టు చేయాలి పీడీ మేడమ్ భర్త డబ్బులు పోయాయని తనను కొట్టారని, తాను ఇక స్కూల్కు వెళ్లనని మా పాప చెబుతోంది. నేను వెళ్లి పాఠశాలలో అడిగితే హెచ్ఎం లేరు. అక్కడ వార్డెన్ వచ్చి నాపైనే కోప్పడ్డారు. ఇక్కడ గొడవపడితే మంచిది కాదని నన్ను బెదిరించారు. – గూడపు గాయిత్రి, విద్యార్థిని తల్లి -
అధిక సంఖ్యలో వినతులు.. అయిన వారికే పరిష్కారాలు
● 22ఎ సమస్య వినతుల స్వీకరణ అంతా గందరగోళం ● మూడంచెల పోలీస్ చెకింగ్లతో రైతులు ఇబ్బందులు శ్రీకాకుళం పాతబస్టాండ్: భూ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘22ఏ భూస్వేచ్ఛ మీ చేతికి మీ భూమి’ ప్రత్యేక డ్రైవ్ గందరగోళంగా మారింది. రైతులు ఎవరికి సమస్యలు విన్నవించా లో తెలీని పరిస్థితి నెలకొంది. అధికారులు ఊహించని దాని కంటే అధికంగా రైతులు రావడంతో జెడ్పీ ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయింది. కొందరికై తే కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా దక్కలేదు. ● రెవెన్యూ డివిజన్ల వారీగా వినతులు తీసుకునేందుకు ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడకు చేరాలంటేనే ఇబ్బంది పడాల్సిన పరి స్థితి నెలకొంది. ప్రధాన గేటు నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నారు. వారికి సమాధానం చెప్పుకుంటూ రావడం రైతులకు సమస్యగా మారింది. ● అక్కడి నుంచి డివిజన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్తే సిబ్బంది దరఖాస్తు పరిశీలించి సమావేశ మందిరంలోకి పంపించాలి. అక్కడా పోలీసులతో ఇబ్బందులు తప్పలేదు. అంతా దాటుకుని వెళితే 22ఎ సమస్యలను ఉదయం అధికారులు, మంత్రి పరిశీలించలేదు. వాటిని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అవస్థలు పడ్డారు. ● ముందుగా సాధారణ భూ సమస్యలను పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా అయిన వారి సమస్యలు పరిష్కరించాలనే తాపత్రయమే కనిపించింది. ఎక్కువగా నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం నియోజకవర్గవాల వారి దరఖాస్తులే పరిశీలించారు. దీంతో ఈ పరిష్కార వేదిక టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు బంధువుల భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినట్టు మారింది. ● 22ఎ సమస్యలకు సంబంధించి జేసీ, ఆర్డీఓ కోర్టులో సుమారుగా 121 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పాతవాటిని పరిష్కరించి ఈ గ్రీవెన్స్ విజయవంతమైందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ● ఫిర్యాదుల స్వీకరణపై రైతులకు సంతృప్తి లేదు. నరసన్నపేటకు సంబంధించి భూముల పరిష్కరించాలని ప్రత్యేకంగా కలెక్టర్కు మంత్రి చెప్ప డం అందులో కొంతభాగం ఎమ్మెల్యే తాలూకా భూములు ఉన్నాయని, వాటిని ఇక్కడికిక్కడే పరిష్కరించాలని మంత్రి ఆదేశించడం విశేషం. ● కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, 30 మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల సెక్షన్ అధికారులు, 22 ఏ బాధిత దరఖాస్తు దారులు ఉన్నారు. ‘22ఎ నుంచి స్వేచ్ఛ కల్పిస్తున్నాం’ అరసవల్లి: జిల్లాలో గత కొన్నేళ్లుగా వివిధ కార ణాలతో పలువురి భూములు నిషేధిత భూముల జాబితా (22–ఎ రిజిస్టర్)లో చేరిపోయాయని, అలాంటి బాధితుల భూములను స్వేచ్ఛగా వారికే అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కె.అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈమేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మీ చేతికి మీ భూమి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. -
● మత్తు వదలరా..
పూండి వాణిజ్య కేంద్రంలో కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతి ఆధ్వర్యంలో, ఎస్ఐ బి.నీహార్ అధ్యక్షతన డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో అభ్యుదయం సైకిల్ యాత్ర శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూండి సాయివినీత్ విద్యా సంస్థల ఆవరణలో సుమారు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు ఆరోగ్యకరమైన సమాజం ముద్దు వంటి స్లోగన్లతో ప్లకార్డులు ప్రదర్శించి మానవహారం చేపట్టారు. – వజ్రపుకొత్తూరు పూండికి చేరుకున్న అభ్యుదయం సైకిల్యాత్రలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చేపట్టిన మానవ హారండ్రగ్స్కి నో చెప్పాలంటూ విద్యార్థుల ప్రదర్శన -
చలి.. రోగాల కౌగిలి
● శీతల గాలుల ప్రభావంతో అనారోగ్య సమస్యలు ● గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో బాధ పడుతున్న వైనం ● పెయిన్ కిల్లర్స్, హై యాంటీబయోటిక్స్ జోలికి వెళ్లొద్దంటున్న వైద్యులు టెక్కలి: చల్లటి గాలులు అనారోగ్యాలను తెచ్చి పెడుతున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతమైన మంచు కురవడంతో పాటు పట్ట పగలు సైతం సూర్యుడి ప్రభావం కనిపించని పరిస్థితులు ఉన్నా యి. శీతల గాలుల ప్రభావంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు మంచు ప్రభావం, మరో వైపు వాతావరణ కాలుష్యం ప్రభావం అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గొంతు గర గర సమస్యతో పాటు శరీర నొప్పులతో బాధ పడుతున్నా రు. అయితే శాసీ్త్రయ పద్ధతులు పాటిస్తూ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజులు దాటి ఆయా సమస్యలు వేధిస్తుంటే కచ్చితంగా సంబంధిత వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులను వినియోగించడం మేలని చెబుతున్నారు. సొంత వైద్యంతో మందుల వినియోగం, హై డోస్ యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ వంటి మందులు వాడితే ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సొంత వైద్యం వద్దు.. శీతాకాలంలో గొంతు గర గర, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి. వీటికి యాంటీ బయాటిక్స్తో చికిత్స చేయ రు. యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు మాత్రమే పనిచేస్తాయి. వైరల్ సమస్యలకు వాడితే మితి మీరినప్పుడు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగి భవిష్యత్ లో సైడ్ ఎఫెక్ట్స్ కారణంతో ఇబ్బందులు తప్పవు. శీతల గాలుల ప్రభావం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా శీతాకాలం దుస్తులను ధరించాలి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శరీరాన్ని పూర్తి స్థాయిలో కప్పి ఉండే దుస్తులు ధరించాలి. చిట్కాలు పాటించండి.. గొంతు గర గర, ఒంటి నొప్పులు తదితర సమస్యలను ఇంటి చిట్కాలు, జాగ్రత్తలతో నివారించవ చ్చు. వేడి నీరు, లెమన్ టీ, ఉప్పునీరు పుక్కిలించండి వంటి చిట్కాలు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తాయి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని పానీయాలు తీసుకోవడం ఎంతో మంచిది. లవంగం, మిరియాలు, శొంఠి పొడి చేసి తీసుకోవడం వల్ల ఆయా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వైరల్ గొంతు నొప్పికి యాంటీబయోటిక్స్ వాడకూడదు, డాక్టర్ సూచిస్తే మాత్రమే వాడాలి. ఆందోళన వద్దు.. ప్రస్తుతం శీతల గాలుల ప్రభావంతో అధిక మంది గొంతు నొప్పి, శరీర నొప్పులతో బాధ పడుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన లేకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఆరుబయట ఆహారం కాకుండా ఇంటి వద్ద వేడి వేడిగా ఆహారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వేడి నీటిని వినియోగించడం ఉత్తమం. – కె.లక్ష్మణరావు, ఎండీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టెక్కలి ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జలుబు, దగ్గు, ఇతర సమస్యలు ఎదురైతే తక్షణమే గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి. సొంతంగా వైద్యం మానుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పగలంతా పనిచేసే వారికి ఒంటి నొప్పులు ఎదురైతే పెయిన్ కిల్లర్స్ను ఆశ్రయించకుండా వైద్యుల సలహాలను పాటించాలి. – ఎస్.గాయత్రి, వైద్యురాలు, కె.కొత్తూరు పీహెచ్సీ, టెక్కలి మండలం -
ఆస్పత్రిలో ఏం జరుగుతోంది: డీసీహెచ్
నరసన్నపేట: ‘ఏరియా ఆస్పత్రిలో ఏం జరుగుతోంది. ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలీడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తప్పవు.’ అంటూ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అఽధికారి కళ్యాణ్ బాబు నరసన్నపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిని హెచ్చరించారు. సదరం సర్టిఫికెట్ల మంజూరు విషయంలో ఆస్పత్రి కాంట్రాక్టు సిబ్బంది చేతివాటంపై ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోగు లు, ఆస్పత్రి సిబ్బంది ఒకేలా కనిపించడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఎవరెవరు ఏ సిబ్బందో తెలియడం లేదని, శానిటేషన్ సిబ్బంది వారి డ్రెస్లు వేసుకోవాలని, కాంట్రాక్టు సిబ్బంది కూడా వారికి నచ్చిన డ్రెస్లు వేసుకొని వస్తామంటే కుదరదని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు. ఓపీ, సదరం, ఫార్మశిస్టు, నర్సులు, ఆఫీస్ రూం, వైద్యుల గదులు పరిశీలించారు. సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఆర్థో వైద్యు లు రమణారావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనుబాబుకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో జరుగుతున్న సివిల్ వర్క్స్ను పరిశీలించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రహరీ, లిఫ్ట్, 108 షెడ్, పాత కొత్త భవనాలకు కలుపుతూ నిర్మాణం చేస్తున్న వంతెన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పాలశింగిలో పర్యటించిన వైద్యబృందం టెక్కలి: టెక్కలి మండలం పాలశింగి గ్రామంలో శుక్రవారం వైద్య బృందాలు పర్యటించా యి. గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వివరాలను తెలుసుకునేందుకు ఈ బృందాలు పర్యటించాయి. డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందిన ప్రొగ్రాం అధికారి శివరంజని, పీహెచ్సీ వైద్యులు పవన్తేజ, భాగ్యశ్రీతో పాటు దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు బోకర నారాయణరావు తదితరులు గ్రామంలో పర్యటించి కిడ్నీ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రతపై ఇటీవల ‘సాక్షి’లో ‘పచ్చటి పల్లెలకు ముచ్చెమటలు’ అనే కథనం వెలువడిన సంగతి విదితమే. మా ప్రాంతంలో ఇసుక పరిశ్రమ వద్దు గార: తమ తీర ప్రాంతంలో ఇసుక పరిశ్రమ వద్దు అని శ్రీకూర్మం–మత్స్యలేశం పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. శుక్రవారం మేజర్ పంచాయతీ శ్రీకూ ర్మం పరిధిలోని శ్రీకూర్మ–మత్స్యలేశం సచివాలయం పక్కన తీర ప్రాంతంలోని ఆరు గ్రామా ల ప్రజలతో ఇసుక పరిశ్రమ ఏర్పాటు, శాంపిల్స్ సేకరణపై ప్రజాభిప్రాయాలను డిప్యూటీ తహసీల్దార్ ధనలక్ష్మీ అధ్యక్షతన తెలుసుకున్నారు. ఎస్.మత్స్యలేశంతో పాటు నీలాపుపేట, పడపానపేట, చుక్కపేట, నగిరెడ్లిపేట, పడపవానిపేట ఆరు గ్రామాలకు చెందిన ప్రజ లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీఎంఐడీసీ వైస్ ప్రెసిడెంట్ రామనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర కు ఈ ప్రాంతంలో ఇసుక మైనింగ్ చేసేందుకు అనుమతి ఉందన్నారు. దీని వల్ల ఎలాంటి నష్టం జరగదని, ఈ ప్రాంతమంతా రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనిపై స్థాని క ఆరు గ్రామాల నుంచి ఎంపిక చేసుకున్న వ్యక్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూగర్భ జలం కలుషితమవుతుందని, తద్వారా అనారోగ్యం పాలవుతామని, ఇప్పటికే తాగునీరు సమస్య ఉందన్నారు. మత్స్య సంపద దెబ్బతినడంతో పాటు తీర ప్రాంతంలోని బలమైన ఇసుక వ్యవస్థ దెబ్బతింటుందని మత్స్యకార ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, అటవీ రేంజ్ అధికారి కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటే..
ఇచ్చాపురం రూరల్: పెళ్లి పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఓ యువతి వ్యవహారం బయటప డింది. ఇప్పటికే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకు న్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఈ నిజాలను దాచి మరోసారి వివాహం చేసుకుని వరుడి కుటుంబాన్ని బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న యువతి వాణిని వివాహం చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్రెడ్డి మధ్యవర్తుల ద్వారా లక్ష రూపాయల ఎదురు కట్నం ఇచ్చాడు.ఈనెల 17న సోంపేట కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. 19వ తేదీన తన స్వగ్రామం కోలార్ వెళ్లేందుకు సురేష్రెడ్డి భార్య వాణితో కలిసి పలాసలో ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వేస్టేషన్కు వచ్చే సరికి భర్త కళ్లు గప్పి ఆమె నేరుగా ఇచ్చాపురంలోని తన ఇంటికి చేరుకుంది. భార్య కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భర్త సురేష్ రెడ్డి అంతటా వెతికి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తిరిగి ఇచ్చాపురం (Ichchapuram) వచ్చి చూడగా వాణి ఇంట్లోనే ఉంది. ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించగా తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సురేష్రెడ్డి తన వారితో కలిసి గురువారం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు.ఎదురు కట్నం ఇచ్చినా.. ఇంతకు ముందే ఆమెకు పలువురితో వివాహాలు జరిగినట్లు ఫొటోలు తమకు కనిపించాయని, ఎదురు కట్నంతో పాటు వెండి పట్టీలు, మెట్టెలు, బట్టలు ఇచ్చామంటూ వరుడు సురేష్రెడ్డి, వారి బంధువులు విలేకరుల ఎదుట వాపోయారు. అయితే పెళ్లి కుమార్తెకు తాము ఇచ్చిన కట్నం, వెండి వస్తువులు తిరిగి ఇచ్చేస్తే కేసు పెట్టమని వారు డిమాండ్ చేశారు. ఆమెకు ఇప్పటికే ఇద్దరితో నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు తమ అబ్బాయితో పెళ్లి జరిగిందని తెలిపారు. అయితే వరుడు ఇచ్చిన వస్తువులు ఇచ్చేందుకు యువతి తరఫు వారు సమ్మతించడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.చదవండి: పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి -
బొమ్మిక.. సాగునీరు లేక!
బూర్జ : మండల పరిధిలోని బొమ్మిక రిజర్వాయర్ ద్వారా ఈ ఏడాది రబీ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. 1980లో అప్పటి ప్రభుత్వం మెట్ట ప్రాంత రైతుల కోసం బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ బొమ్మిక గిరిజన గ్రామం ఎగువన బొమ్మిక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. బొమ్మిక చుట్టుపక్కల కొండల్లోని నీటిని నిల్వ చేసి దిగువ భాగాన ఉన్న పెద్దపేట, మదనాపురం, జగన్నాథపురం, బొమ్మిక, కొండపేట, నీలాపురం, ఏ.పి.పేట తదితర గ్రామాల పరిధిలోని 770 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. 2015–16లో రిజర్వాయర్తోపాటు కాలువల ఆధునీకరణ పనులకు రూ.9 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టారు. మళ్లీ ఈ ఏడాది తూతూమంత్రంగా రిజర్వాయర్లో పిచ్చిమొక్కలు, పూడికలు తొలగించారు. కాలువల్లో పనులు చేపట్టినా ప్రస్తుతం రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో రబీ పంటల సాగుకు శివారు గ్రామాలకు నీరు అందడం ప్రశ్నార్థకమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. బొమ్మిక రిజర్వాయర్లో సగానికి తగ్గిన నీరు రబీ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకం తూతూమంత్రంగా పూడిక తీతలు -
ప్రొసీడింగ్ పత్రాలు అందజేత
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్, న్యాయవాది చౌదరి లక్ష్మణరావు కుటుంబానికి ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ద్వారా మంజూరైన వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ ప్రొసీడింగ్ పత్రాలను అతని భార్య స్వాతికి గురువారం అందజేశారు. న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.9 లక్షలు విడుదలైనట్లు వారు తెలిపారు. వెల్ఫేర్ ఫండ్ను రూ.4లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచిన తర్వాత ఇదే మొదటి క్లెయిమని, నామిని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుందని, ప్రభుత్వం నుంచి కూడా కొంత నగదు రానుందని చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు గేదెల వాసుదేవరావు, జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తంగి శివప్రసాద్, పెట్ట దామోదర్రావు, మాజీ అధ్యక్షుడు ఎన్.సూర్యారావు, బాలకృష్ణ చాంద్, మామిడి క్రాంతి, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగురు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి బి.ఎస్.చలం, చిన్నాల జయకుమార్ పాల్గొన్నారు. -
మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం
శ్రీకాకుళం/శ్రీకాకుళం పీఎన్కాలనీ : మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మనుస్మృతి దహనం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో గురువారం దళిత, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కె.ధర్మారావు, డి.గణేష్ అధ్యక్షతన ‘సనాతన సంస్కృతి –ప్రజాస్వామ్యం‘ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది జహా ఆరా మాట్లాడుతూ దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీల వ్యతిరేక పాలకుల వ్యవస్థలో బతుకుతున్నామని.. మను సంస్కృతి రాజ్యమేలుతున్న పాలనలో ఉన్నామని చెప్పారు. చరిత్రను మతకోణంలో చూడడం సరికాదన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగకపోతే రాజకీయ న్యాయం, అధికారం రాదని అంబేడ్కర్ పేర్కొన్నారని, దళిత, మైనారిటీ, పీడిత ప్రజలు మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ, ప్రజాసంఘాల ప్రతినిధులు మిస్క కృష్ణయ్య, సన్నశెట్టి రాజశేఖర్, పేడాడ కృష్ణారావు, గొంటి గిరిధర్, కల్లేపల్లి రామ్గోపాల్, బోనెల రమేష్, పి.మోహన్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు బి.అప్పారావు, బి.వి.రమణ, నేతల అప్పారావు, దమయంతి, చిన్నికృష్ణ, యడ్ల జానకిరావు, గరికివాడు, బెలమర ప్రభాకర్, రాయి సూర్యనారాయణ, కుర్మారావు, శ్రీనివాస్, యడ్ల గోపి, రాజేశ్వరి, గోవింద్, తేజ, కళావతమ్మ, బడే కామరాజు, అనంతరావు, గణపతి, రాముడు, మహేంద్ర, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక
టెక్కలి: మండల విద్యా శాఖా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ (మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం టెక్కలిలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా పి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కె.ఉపేంద్ర, ఆర్థిక కార్యదర్శిగా బి.రామ్ప్రసాద్, ఉపాధ్యక్షులుగా బి.శశిరేఖదేవి, సహాయ కార్యదర్శిగా ఆర్.సంతోష్కుమార్, గౌరవ సలహాదారుడిగా ఎస్.గౌరీశంకర్, డి.సిహెచ్.రాంబాబు, సభ్యులుగా జి.చంద్రశేఖర్, వై.లింగరాజు, ఎస్.కళ్యాణి, పి.విజయ్ తదితరులను ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేయాలని నినాదాలు చేశారు. శ్రీముఖలింగంలో మరుగుదొడ్లకు మరమ్మతులు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భక్తులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు వినియోగంలోకి తెచ్చేందుకు రూ.15 లక్షలతో మరమ్మతులు చేయిస్తున్నామని కేంద్ర పురావస్తు శాఖ సీఏ మూర్తి గురువారం తెలిపారు. ‘శివ..శివా’ అనే శీర్షికన ఈనెల 1న సాక్షి లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. ఢిల్లీలోని శాఖ ఉన్నతాధికారుల అనుమతితో పనులు చేయిస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివాహం.. వివాదం.. రాజీ ఇచ్ఛాపురం రూరల్: ఎక్కడో కర్నాటక నుంచి ఇచ్ఛాపురం వచ్చి ఎదురు కట్నం ఇచ్చి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, పెళ్లయ్యాక వధువు ట్రైన్ దిగి ఇంటికి వచ్చేయడం, వరుడు వధువు ఇంటికి వచ్చి తన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని కోరడం వంటి వరుస ఘటనలతో ఇచ్ఛాపురం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ యువతిని కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్ రెడ్డి ఈ నెల 17న సోంపేటలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. 19వ తేదీన పలాసలో వధూవరులు కర్నాటక వెళ్లేందుకు ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వేస్టేషన్కు వచ్చే సరికి వధువు కనిపించలేదు. దీంతో ఆయన అంతా వెతికి ఇచ్ఛాపురం రాగా యువతి ఆమె ఇంటిలోనే కనిపించడంతో నిశ్చేష్టుడయ్యాడు. పెళ్లి తనకు ఇష్టం లేదని వధువు చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి గురువారం రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఇరు వర్గాల వారు రాజీకి వచ్చేయడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. -
గంజాయి డాన్ అరెస్ట్
విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాలో డాన్గా వ్యవహరిస్తున్న పఠాన్ బాషా అలీని విజయనగరం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై కృష్ణమూర్తి పఠాన్ బాషా ఆలీనీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, కొత్తవీధికి చెందిన పఠాన్ బాషా అలీ (31) విజయనగరంలోని ఫూల్బాగ్లో నివాసం ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాను మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆలీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. విజయనగరం టూ టౌన్ పీఎస్ పరిధి బాబామెట్ట ప్రాంతంలో గత ఏడాది 10 కిలోల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పాటు మరో కేసులో 3.10 కిలోల గంజాయితో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో 2021లో గంట్యాడ పీఎస్ లో 1596.36 కిలోలు, 2023లో బాపట్ల జిల్లా నిజాంపట్నం పీఎస్ పరిధిలో 1.5 కిలోలల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా తేలింది. దీంతో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
వేర్వేరు బావుల్లో పడి ఇద్దరు మృతి
మెళియాపుట్టి : మెళియాపుట్టిలోని ఓ బావిలో వృద్ధురాలి మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. మృతురాలు అదే గ్రామానికి కొల్లి మాణిక్యం (67)గా గుర్తించారు. మాణిక్యం భర్త కొన్నేళ్ల క్రితమే విడిచిపెట్టి వెళ్లిపోవడంతో కుమార్తెను పెంచి పెళ్లి చేసింది. అనంతరం మతిస్థిమితం సరిగ్గా లేక పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో మెళియాపుట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న బావిలో మాణిక్యం మృతదేహాన్ని అక్క కొడుకు నక్కల కిరణ్ గురువారం గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బావికి స్నానానికి వెళ్లి పొరపాటున పడిపోయి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పొందూరులో.. పొందూరు: స్థానిక నాగవంశం వీధికి చెందిన నల్లి సురేష్(40) పొందూరులోని బండార్లమ్మ చెట్టు సమీపంలోని బావిలో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ ఈ నెల 22న తెల్లవారుజామున నిద్ర లేచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఏం జరిగిందో గాని గురువారం స్థానిక బావిలో సురేష్ మృతదేహం తేలింది. కొద్ది రోజులుగా మతి స్థిమితం లేకుండా ఉన్నాడని, పచ్చకామెర్లతో బాధపడుతున్నాడని, మద్యం ఎక్కువగా తాగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.చెప్పారు. -
పార్టీలో పక్షపాత ధోరణి భరించలేక..
● టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజీనామా నరసన్నపేట: తెలుగు దేశం పార్టీ అను బంధ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు, నరసన్నపేట మండలం ఉర్లాం మాజీ సర్పంచ్ జల్లు చంద్రమౌళి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి ప్రకటించా రు. స్థానిక నాయకత్వం పక్షపాత ధోరణి, తనపై చూపుతున్న వివక్షకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఎప్పటి నుంచో టీడీపీలో ఉంటూ ఆ పార్టీనే నమ్ముకొని ఉన్న తనలాంటి సీనియర్లను పక్కన పెట్టడం అవమానంగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రమౌళి టీడీపీలో నరసన్నపేట మండలంలో ప్రధాన నాయకులుగా చెలామణీ అయ్యారు. ఉర్లాం సర్పంచ్గా, ఎంపీటీసీగా, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. జల్లు చంద్రమౌళి -
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నాగుపాము
టెక్కలి రూరల్: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గురువారం ఉదయం ఒక నాగుపాము హల్చల్ చేసింది. ఆస్పత్రి లోపల నాగుపాము కనిపించడంతో ఆస్పత్రిలోని రోగులతో పాటు సిబ్బంది సైతం భయాందోళనకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆస్పత్రిలోని మొదటి అంతస్తు 44వ నంబర్ రూమ్లో ఉన్న జనరల్ ల్యాబ్ తలుపులను గురువారం ఉదయం తెరిచే సరికి అక్కడ సిబ్బందికి పాము బుసలు కొడుతూ కనిపించింది. చాలాసేపటి వరకు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోయారు. చివరకు ఆ పాము ల్యాబ్ రూము సమీపంలో ఒక రేకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో దూరే ప్రయత్నం చెయ్యడంతో సిబ్బంది దాన్ని పట్టుకుని ఆస్పత్రికి కొంత దూరంలో విడిచి పెట్టేశారు. పాము మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చిందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పాము సమీప వార్డుల్లోకి వెళ్లి ఉంటే పరిస్థితి ఏమిటని రోగులు ఆందోళనకు గురయ్యారు. -
క్రీడా స్థలంతో ఆటలు
● మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం ధారాదత్తానికి యత్నాలు ● గత ప్రభుత్వ హయాంలో ఖేలో ఇండియా క్రీడా గ్రామం నిర్మాణానికి 33.38 ఎకరాలు సేకరణ ● ఇందులో పది ఎకరాలు క్రికెట్ అసోసియేషన్కు ఇచ్చేందుకు యోచన ● గతంలో ఆమదాలవలసలో తీసుకున్న స్టేడియం స్థలాన్ని గాలికి వదిలేసిన క్రికెట్ అసోసియేషన్ శ్రీకాకుళం: జిల్లా కేంద్రం వద్ద పాత్రుని వలస సమీపంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాత్రుని వలస సమీపంలో 33.38 ఎకరాల భూమిని సేకరించి ఖేలో ఇండియా నిధులతో క్రీడా గ్రామాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ స్థలాన్ని క్రీడా ప్రాధికార సంస్థకు అప్పగించారు. ఈ స్థలంలో హాకీ సింథటిక్ కోర్టుతో పాటు అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్లను నిర్మించాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ మ ల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అన్ని క్రీడలకు పనికి వచ్చేలా సింథటిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించి ఇందుకు సంబంధించిన అంచనాలను సైతం సిద్ధం చేశారు. ఇక్కడ ఖేలో ఇండియా క్రీడా గ్రామం మంజూరైతే ఇక్కడే బాల బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు శిక్షకులకు వసతి గృహాలు ఫిజియోథెరపీ సెంటర్లు మల్టీ జిమ్ కేంద్రాలు ఫుట్బాల్, బాస్కెట్బాల్, హ్యాండ్ బాల్ కోర్టులు నిర్మించేలా అంచనాలు పొందుపరిచి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇంతలో ఎన్నికలు రావడం వల్ల ఇది పెండింగ్లో ఉండిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈలోగా ఈ స్థలంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కన్ను పడింది. ఇందులో తమకు 10 ఎకరాలు కేటాయించాలని, స్టేడియం నిర్మాణాన్ని చేపడతామని అధికారులకు ప్రతిపాదించారు. అసోసియేషన్లోని కొందరు సభ్యులు తమ కు ఉన్న సాన్నిహిత్యంతో అధికారులపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీనికి ఓ ప్రజా ప్రతినిధి కూడా వత్తాసు పలకడంతో స్థలం కేటాయించేందుకు అధికారులు నిర్ణయించారు. కొందరు క్రీడాకారులు విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నా యుడు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన ఇటీవలే క్రీడా గ్రామ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సేకరించి క్రీడా ప్రాధికార సంస్థకు కేటాయించిన స్థలాన్ని క్రికెట్ అసోసియేషన్కు ఎందుకు ఇవ్వడం అని, పక్కనే ఉన్న రైతులు 14 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండడంతో వారి నుంచి క్రికెట్ అసోసియేషన్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఖేలో ఇండియా నిధులు మంజూరయ్యేలా కేంద్రం స్థాయిలో కృషి చేస్తానని, ఆ నిధులు మంజూరైతే ఇక్కడ క్రీడా గ్రామాన్ని నిర్మించుకోవచ్చని కూడా కేంద్రమంత్రి అధికారులకు ఈ స్థల ఆవరణలోనే చెప్పారు. కానీ దీన్ని కూడా కొందరు అధికారులు బేఖాతరు చేస్తూ పది ఎకరాల స్థలాన్ని క్రికెట్ అ సోసియేషన్కు లీజు పద్ధతిపై కేటాయించేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆమదాలవలసలోని నందమూరి తారక రామారావు గ్రీన్ ఫీల్డ్ క్రీడా ప్రాంగణాన్ని లీజుకి తీసుకొని గాలికి వదిలేసింది. ఈ ప్రాంగణంలో రెండు కోట్ల నిధులతో నిర్మించిన భవనాన్ని సైతం కూల్చివేసిన అనంతరం స్థలాన్ని వదిలివేశారని, దీన్ని పరిగణనలోకి తీసుకొని అయినా స్థలాన్ని కేటాయించవద్దని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు. ప్రతిపాదనలు వాస్తవమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు 10 ఎకరాలు స్థలం ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్న విషయం నిజమే. క్రికెట్ అసోసియేషన్తో భూమిని కొనుగోలు చేయించాలని కేంద్రమంత్రి చెప్పిన విషయం కూడా వాస్తవమే. అధికారుల ఆదేశాల మేరకు కొందరు క్రికెట్ అసోసియేషన్ సభ్యుల ఒత్తిడికి తలొగ్గుతారో వేచి చూడాల్సిందే. – మహేష్, డీఎస్డీఓ -
104 ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు
● సిబ్బంది కొరతతో అదనపు భారం ● జీతాల్లో కోతలతో అవస్థలు పడుతున్న ఉద్యోగులు అరసవల్లి: పేదల పాలిట సంజీవని 104 అంబులెన్స్ సిబ్బంది సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. అరకొర సిబ్బంది, రోజుకు పది గంటలకు పైగా విధులు, అదనపు పని ఒత్తిడి, కనీసం సెలవులు ఇవ్వకుండా వేధింపులు, మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉండడంతో ఉద్యోగులు యాతన పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ సిబ్బంది రోడ్డెక్కారు. యాజమాన్యం వేధింపులను ఆపాలని కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనలకు దిగుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇది జిల్లాలో 30 మండలాలకు మొత్తం 104 మొబైల్ వాహనాలు 51 (బఫర్ 1) వరకు ఉన్నాయి. 102 మంది ఉద్యోగులకు నిబంధనల ప్రకారం సెలవులు ఇవ్వకపోవడంతో పాటు బఫర్లు కూడా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం తప్పడం లేదు. బఫర్ కింద ప్రతి డివిజన్కు ఒకరు చొప్పున జిల్లాలో మొత్తం నలుగురు డ్రైవర్లు, నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు (డీఈఓ) ఉండాల్సి ఉండగా ప్రభుత్వ ఒప్పందాలను కూడా పక్కన పెట్టి మరీ పూల్ సిస్ట మ్ ద్వారా ఏ రోజు వేతనం ఆ రోజే ఇచ్చేలా వ్యవహారాన్ని భవ్య యాజమాన్యం నడిపిస్తున్నారని ఉద్యోగుల సంఘం ఆరోపిస్తుంది. సెలవులివ్వకుండా హక్కులను హరిస్తూ.. ఉద్యోగులకు విధి నిర్వహణలో సెలవులను పొందడం కూడా హక్కులో భాగమే అయినప్పటికీ భవ్య యాజమాన్య వైఖరి మాత్రం ఈ హక్కులను హరి స్తూ ఉద్యోగులకు వేధిస్తోంది. మహిళలకు ఆయితే ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లోనూ సెలవులివ్వకపోవడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలకు ఇవ్వాల్సిన క్యాజువల్ లీవ్తో పాటు 20 రోజులకు ఇవ్వాల్సిన ఒక ఎర్న్డ్ లీవ్ను కూడా ఇవ్వకుండా యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు వేదన చెందుతున్నారు. సెలవు రోజున తగిన జీతాన్ని కూడా కట్ చేసేలా చర్యలు చేపడుతున్న యాజమాన్యం వైఖరిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత ఏడు నెలలుగా ఉద్యోగులకు నియామక పత్రాలతో పాటు పేస్లిప్లను కూడా యాజమాన్యం ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. ఇదే నెపంతో స్థానిక అఽఽధికార పార్టీకి చెందిన నేతల సిఫారసులతో కొత్తవారిని నియమించుకునేలా వెసులు బాటు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించిన అరబిందో సంస్థ ఇచ్చి న జీతాల కంటే ఈ భవ్య సంస్థ ఇచ్చిన జీతాలు తగ్గిపోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. సీనియారిటీని కూడా ప్రాధాన్యతగా తీసుకోకుండా యా జమాన్యం ఉద్యోగులకు మానసికంగా అవస్థలకు గురిచేయడంతో ఉద్యోగులంతా ఆందోళనకు దిగా రు. తాజాగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తమ అవస్థలపై భవ్య సర్వీసెస్పై మండిపడుతూ ఆందోళనలకు కార్యాచరణ చేపడుతున్నారు. జీతాల్లో కోతలు పెడుతున్నారు 104 వాహనాల్లో ఉద్యోగుల నియామకాలను 2008లో చేపట్టారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన జీతం కంటే ఇప్పుడు రూ.700 తక్కువగా వస్తోంది. సెలవు పెడితే రోజు జీతం రూ.860 కట్ చేస్తున్నారు. అదే రోజు పనిచేసిన పూల్ సిబ్బందికి దినసరి వేతనంగా రూ.500 ఇచ్చేస్తున్నారు. నెలకో సిఎల్, 20 రోజుల కొక ఈఎల్ ఉండాల్సిన నియమాలున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. – చల్లా నారాయణరావు, జిల్లా 104 వాహన డ్రైవర్లు సంఘ అధ్యక్షుడు వేధింపులు ఆపాలి భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు అన్ని విధాలుగా దగా చేస్తోంది. పూర్తి వేతనాలను చెల్లించకపోగా నిందలతో వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారు. ఎలాంటి సెలవులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తు న్నారు. గట్టిగా అడిగిన వారికి వేటు వేసేలా అడుగులు వేస్తున్నారు. – ధర్మాన కిరణ్కుమార్, కార్యదర్శి, 104 ఉద్యోగుల సంఘం -
విద్యార్థినిపై స్కూల్ పీడీ భర్త దాడి..?
మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మరో వీడియో వైరల్ అవుతోంది. పాఠశాలకు చెందిన విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ భర్త దాడి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 26న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇదే పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో రావడం కలకలం రేపుతోంది. ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంతికుమారికి ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబ యోగి కూడా స్పందిస్తూ ఈ వీడియో నిజమైతే ఐటీడీఏ పీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మండల సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు గణేష్, కార్యదర్శి సవర వెంకటేష్, గిరిజన సంఘం నేతలు గురువారం ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకుని ప్రైవేటు వ్యక్తులు పాఠశాలలోకి ఎలా వస్తున్నారో విచారణ జరపాల్గొన్నారు. కమ్మేస్తున్న పొగ మంచు హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలాన్ని పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకూ పొగమంచు కమ్ముకోవడంతో వాహదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. హిరమండలం కొత్తూరు మధ్య అలికాం–బత్తిలి ప్రధాన రహదారి పొగమంచు కమ్ముకుంది. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రతినిధులు గురువారం తెలిపారు. డ్రోన్ సర్వే టెక్నీషియన్ కోర్సులో 105 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హత పత్రం, ఆధార్కార్డు, రేషన్కార్డు, బ్యాంక్ పాస్బుక్, కుల ఆదాయ నివాస తదితర ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులే అర్హులని, వివరాలకు 8247656581, 9533170822 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత గల ఉద్యో గార్థులు వినియోగించుకోవాలని వారు కోరారు. -
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
కంచిలి: ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో మూడు మండలాల రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ఉద్దేశించి నిర్మించిన చారిత్రాత్మక సాగునీటి ప్రాజెక్టు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతోంది. వంశధార జలాలను జిల్లా శివారులో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గానికి తెస్తామని చెప్పే ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్న పురాతనమైన శాశ్వత ప్రాజెక్టు మాట గుర్తులేకపోవడం శోచనీయమని చెప్పాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న పైడిగాం ప్రాజెక్టు నేడు నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ ప్రాజెక్టు సాధన కోసం సోంపేట సమితి మాజీ అధ్యక్షుడు దివంగత గన్ని పద్మనాభరావు ఎన్నో పోరాటాలు చేశారు. చివరికి 1957లో సోంపేట మండలం బేసి రామచంద్రాపురం గ్రామంలో మహాసభను నిర్వహించడంతో, ఆ సభకు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హాజరై.. రైతుల స్పందన చూసి అప్పటికప్పుడు మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. దీని నిర్మాణం కోసం గన్ని పద్మనాభరావు ఎంతగానో కృషిచేసి, పూర్తి చేయించిన విషయం స్థానిక రైతులకు చరిత్రగా గుర్తుంది. ఎండుతున్న ఆయకట్టు భూములు ఇంతటి చరిత్ర కలిగిన ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు భూములకు ప్రస్తుతం నీరందని దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు పరిధిలో 4,894 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఇందులో కంచిలి మండల పరిధిలో ఆరు గ్రామాలు, సోంపేట మండలంలో 18 గ్రామాలు, మందస మండలంలో ఒక గ్రామంలో ఆయకట్టు భూములన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో పంట పొలాలకు నీరు వెళ్లేందుకు 16.8 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ను, 14 బ్రాంచ్ కెనాల్స్ ద్వారా 23.75 కిలోమీటర్లు వరకు నిర్మించారు. కానీ మెయిన్ చానల్ను పూర్తిస్థాయిలో సిమెంటు నిర్మాణంగా చేపట్టలేదు. కేవలం రామకృష్ణాపురం గ్రామం వరకు సిమెంట్ లైనింగ్ వేసి, తర్వాత విడిచిపెట్టేశారు. దీనివలన ప్రాజెక్టు నుంచి విడిచిపెట్టినా నీరు చివరి ఆయకట్టు వరకు సక్రమంగా రాని దుస్థితి ఏర్పడింది. కెనాల్ కూడా చాలా కాలంగా పూడిక తీయకపోవడంతో మెయిన్ కెనాల్కు ఆనుకొని ఉన్న పొలాలకు కూడా సక్రమంగా నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక బ్రాంచ్ కెనాల్స్ పరిధిలో ఉన్న భూముల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నీరు సోంపేట మండలం పలాసపురం వరకు వెళ్తుంది. ఈ శివారు భూములకు ఎప్పుడు కూడా నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు పొలాలు సాగునీటి కోసం ఇబ్బందులు పడటం ప్రతి ఏడాది కన్పిస్తోంది. కానీ ఈ పొలాల రైతుల నుంచి మాత్రం ఖచ్చితంగా శిస్తు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. తితిలీ తుఫాను ధాటికి దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షలతో తాత్కాలిక మరమ్మతుల పనులు చేపట్టారు. అయితే ఆ తర్వాత శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబుకు లేఖ పైడిగాం ప్రాజెక్టు పూర్తిగా శిథిలావస్థలకు చేరినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ఈ ప్రాజెక్టు పోరాటయోధుడు, మాజీ సమితి అధ్యక్షుడు గన్ని పద్మనాభరావు కుమారుడు గన్ని అశోక్కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. మూడు మండలాల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సిన అతి ప్రధానమైన పైడిగాం ప్రాజెక్టు ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన చతికిలబడిందన్నారు. ఇప్పటికై నా దీన్ని అభివృద్ధి చేసి వేలాది మంది రైతుల సంక్షేమానికి తోడ్పడాలని కోరారు. ఎనిమిదేళ్ల క్రితం తితిలీ తుఫాను ధాటికి ఈ ప్రాజెక్టు గోడలు పూర్తిగా దెబ్బతినడం, తదితర సమస్యలతో కునారిల్లుతోందని లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిందిగా విన్నవించారు.పైడిగాం ప్రాజెక్టు పరిధిలో సోంపేట మండలంలోని పలాసపురం గ్రామమే శివారు గ్రామం. ఇక్కడ వరకు నీరు రావడం గగనమే. ఈ గ్రామంలో పొలాలను టైల్యాండ్గా ప్రాజెక్టులో గుర్తించారు. నీరు సక్రమంగా అందకపోయినా రెవెన్యూ వారు మాత్రం భూమి శిస్తులను పక్కాగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికై నా పైడిగాం ప్రాజెక్టు పరిధిలో శివారు ప్రాంతం వరకు నీరందేలా చర్యలు చేపట్టాలి. – తడక జోగారావు, పలాసపురం, సోంపేట మండలం మూడు మండలాల రైతులకు సాగునీరందించేందుకు ఉద్ధేశించి దివంగత గన్ని పద్మనాభరావు పోరాటంతో నిర్మాణానికి నోచుకొన్న పైడిగాం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తిగా కునారిల్లిన పరిస్థితికి చేరుకోవడంతో, ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరందక ఆందోళన చెందుతున్నారు. పంటలకు గ్యారెంటీ లేని వైనం. దీనిపై అధ్యయనం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలి. – గన్ని అశోక్కుమార్, దివంగత పద్మనాభరావు కుమారుడు, సోంపేట పైడిగాం ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు ఆనుకొని ఉన్న పంట పొలాలకు సాగునీటి సమస్య తప్పడం లేదు. ప్రతిఏటా ఈ చానల్ కింద ఉన్న పంట పొలాలకు సాగునీరు అందడంలో ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కాలువలో చివరి వరకు సిమెంటు లైనింగ్ నిర్మించకపోవడంతో ప్రవహిస్తున్న నీరు ఎక్కడికక్కడే ఇంకిపోవడం, దారి పొడవునా గుర్రపుడెక్క ఏర్పడటంతో నీరందని పరిస్థితి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టాలి. – మడ్డు వెంకటరావు, బూరగాం, కంచిలి మండలం -
● డ్రగ్స్ వద్దంటూ..
టెక్కలి: మత్తు పదార్థాల బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి సూచించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ చేపట్టిన అభ్యుదయం సైకిల్యాత్ర బుధవారం టెక్కలి చేరుకుంది. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మణరావు నేతృత్వంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు పట్టణంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, సీఐ ఎ.విజయ్కుమార్, ఎంవీఐ సంజీవరావు, ఎస్ఐలు రాము, రఘునాథరావ పాల్గొన్నారు. -
రీవర్రీఫికేషన్..!
● కొనసాగుతున్న సదరం పునః పరిశీలన ● ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు ● ఆందోళన చెందుతున్న దివ్యాంగులు నరసన్నపేట: సదరం సర్టిఫికెట్స్ పునః పరిశీలన నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ప్రహాసనంగా కొనసాగుతోంది. దివ్యాంగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆపసోపాలు పడుతున్నారు. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్నా.. ఇలా ఎన్నిసార్లు వెరిఫికేషన్ పేరిట ఆస్పత్రుల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. దివ్వాంగ పింఛన్లు అనర్హులు పొందుతున్నారని అపోహలు పెట్టుకున్న కూటమి ప్రభుత్వం, దివ్వాంగుల సర్టిఫికెట్స్ను ఈ ఏడాది ప్రారంభం నుంచి మే నెల వరకు తనిఖీలు నిర్వహించింది. అప్పుడు అర్హులైన పింఛనుదారులు నానా అవస్థలు పడి తనిఖీలకు వచ్చారు. అనర్హుల ఏరివేత పేరిట అర్హులను కూడా తొలగించడంతో వీరందరూ తమకు పింఛన్ పునరుద్ధరించాలని ఎంపీడీవో కార్యాలయాలకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం మరలా రీ వెరిఫికేషన్ చేయిస్తోంది. దీనిలో భాగంగా నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో మంగళ, బుధ, గురువారాల్లో దివ్వాంగుల అంగ వైకల్యాన్ని వైద్యులు పరిశీలించి సదరం సర్టిఫికెట్స్ మంజూరు చేస్తున్నారు. దీంతో దివ్వాంగులు వివిధ ప్రాంతాల నుంచి నరసన్నపేటకు వస్తున్నారు. బుధవారం ఈ ఆస్పత్రికి హిరమండలం, పోలాకి, ఎల్ఎన్పేట మండలాల నుంచి 50 మంది వచ్చారు. వీరందరినీ ఆర్థో వైద్యుడు రమణరావు పరిశీలించారు. -
క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి
ఎచ్చెర్ల: విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకొని ముందుకు సాగాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మండలంలో కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గడిచిన మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నికల్ క్రీడల ఆటల పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. విజేతలు వీరే.. ఓవరాల్ చాంపియన్ షిప్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం (బాలికలు), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం (బాలురు)కు వచ్చింది. వ్యక్తిగత చాంపియన్ షిప్ శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కె.శివరామకృష్ణ, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన బి.సోనియాకు లభించాయి. వాలీబాల్ పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రథమ, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఎచ్చెర్లకు ద్వితీయ స్థానం లభించింది. వాలీబాల్ బాలుర విభాగంలో శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఎచ్చెర్ల ప్రథమ స్థానం, టెక్కలి ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించాయి. ఖో–ఖో పోటీల్లో బాలికల విభాగంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళంకు ప్రథమ స్థానం, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించాయి. కబడ్డీ బాలుర విభాగంలో ఆదిత్య పాలిటెక్నిక్ టెక్కలి ప్రథమ స్థానంలో, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి.పద్మారావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాస్స్ పాల్గొన్నారు. -
పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లిదండ్రులు లేని పేద విద్యార్థినులకు వసుదైక కుటుంబ యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సైకిళ్లు పంపిణీ చేశారు. నగరంలో ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెమినార్ హాల్లో బుధవారం 25 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సమన్వయకర్త హరిప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో ఐదు విడతలుగా 150 సైకిళ్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, పాతపట్నం సబ్ రిజిస్ట్రార్ జి.రాజు, పి.గోవిందరావు, ఎల్.గుణశేఖర్, సాయికుమార్, ఆర్.పాపారావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం: లావేరు మండలంలోని సుభద్రపురం జాతీయ రహదారి–16పై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఢీకొన్నట్లు లావేరు పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో వెనుక నుంచి బలంగా ఢీకొనడం జరిగింది. దీంతో వెనుక ఉన్న వెస్ట్ బెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ ఎం.కృష్ణ(54)కు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్లో గవర్నమెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఇజ్జాడ గణేష్(20) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు లావేరు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం మధ్యాహ్నం సుభద్రపురం గ్రామానికి చెందిన ఇజ్జాడ గణేష్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇజ్జాడ గణేష్కి తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడుకి తండ్రి రమణ, తల్లి సత్యవతి, అన్నయ్య ఉన్నాడు. లావేరు ఎస్ఐ అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థికి అరుదైన అవకాశం మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సహిత విద్యార్థి బి.జ్ఞాన సాయి సత్తాచాటాడు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో లోకోమోటోలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో ఎవరెస్ట్ బేస్క్యాంప్ అధిరోహణకు మార్గం సుగమమైందని ఎంఈవోలు దేవేంద్రరావు, పద్మనాభరావు పేర్కొన్నారు. దీంతో విద్యార్థిని బుధవారం అభినందించారు. -
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని మండల వీధిలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ – 2 బొడ్డేపల్లి రామారావు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు జడే కృష్ణ(39) భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి మండల వీధిలో నివసిస్తూ పాల వ్యాపారం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒక ప్రమాదంలో అతడి తలకు గాయమవ్వడంతో మతిస్థిమితం సరిగా ఉండేది కాదు. వణుకు ఎక్కువగా రావడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఒక్కోసారి 2, 3 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య లక్ష్మి మందలించిందని, బయటకు వెళ్లిన కృష్ణ 3 రోజులైనా ఇంటికి మరలా రాలేదు. పొదల్లో మృతదేహం గుర్తింపు జడే కృష్ణ తన ఆవులను ఒక పాకలో కట్టేవాడు. రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం కృష్ణ భార్య పాలు తీద్దామని పాక వద్దకు వెళ్లింది. దీనిలో భాగంగా ఆవు దూడకు కట్టిన తాడు విప్పిన వెంటనే గుబురుగా ఉన్న నిర్మానుష్య పొదల వైపు దూడ వెళ్లింది. దూడను వెతుక్కుంటూ వెళ్లిన లక్ష్మికి చెట్టుకు వేలాడుతూ పోల్చలేని విధంగా ఉన్న తన భర్త కృష్ణ మృతదేహం కనిపించడంతో లబోదిబోమంది. వెంటనే పోలీసులకు సమాచారమందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. -
కుష్టు వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం
శ్రీకాకుళం కల్చరల్: కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక కరుణ సమాజంలో రెడ్క్రాస్ సంస్థ, ఆర్ట్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడుతూ వారి సమస్యను తెలుసుకున్నారు. వ్యాధిగ్రస్తుల పెన్షన్, మరుగుదొడ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, రేషన్ తదితర విషయాలపై చర్చించారు. అనంతరం 35 మంది కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహన్రావు, సెక్రటరీ మల్లేశ్వరరావు, అప్ హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ తిమోతి, రెడ్క్రాస్ జిల్లా ఎంసీ మెంబర్లు డాక్టర్ నిక్కు అప్పన్న, నూక సన్యాసిరావు, హరి సత్యనారాయణ, చిన్మయిరావ్, జి.రమణ, సత్యనారాయణ, చైతన్యకుమార్, ఉమా శంకర్, వెంకటరమణ, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు షాపుల్లో దొంగతనాలు
నరసన్నపేట: మేజర్ పంచాయతీ పరిధి పోలాకి కూడలిలో ఉన్న రెండు షాపుల్లో మంగళవారం రాత్రి దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసి లోపలికి వెళ్లి నగదును అపహరించుకుపోయారు. రెండు చోరీల్లో రూ.15 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు బరాటం శ్రీరామమూర్తి, వి.రాజులు తెలిపారు. ఉదయం ఎప్పటిలాగే కిరాణా షాపు తెరుద్దామని వచ్చేసరికి షట్టర్ తాళాలు తీసి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూస్తే రూ.10లు, రూ.5ల కాయిన్స్ మూట కనిపించలేదని పేర్కొన్నారు. దీంట్లో సుమారుగా రూ.14 వేలు ఉన్నాయని తెలిపారు. అలాగే వి.రాజు పాన్షాపు తాళం తొలగించి బాక్స్లో ఉన్న రూ.1,100లు తీసుకుపోయారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు వచ్చి పరిశీలించారని వివరించారు. కాగా ఇటువంటి దొంగతనాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని పోలీసులు పహరా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. -
అప్పనంగా అప్పగిస్తారా..?
● ఓ ప్రైవేటు బడికి ప్రభుత్వ భూమిని అప్పగించే ప్రయత్నం ● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జేఆర్పురం వాసులు ప్రైవేటు స్కూల్ వద్ద నిరసన తెలుపుతున్న జేఆర్ పురం ప్రజా ప్రతినిధులు, స్థానికులు కాజేసే కుట్ర 1987లో డీ–పట్టా రూపంలో ఈ భూమి సంక్రమించింది. స్కూల్ యాజమాన్యానికి 2004లో అద్దెకు ఇచ్చాం. కొన్నేళ్లు అద్దె ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. అద్దె పత్రాలు, ఆస్తి పత్రాలు మా వద్దనే ఉన్నాయి. ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కాజేసే కుట్ర జరుగుతోంది. – చిన సూర్యప్రకాశరావు, ప్రైవేటు స్కూల్ అసలు యజమాని, విజయనగరం రణస్థలం: ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా ఓ ప్రైవేటు బడికి అప్పగించిన వైనంపై జేఆర్పురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడి యాజమాన్య ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి ఒత్తిళ్లకు రెవెన్యూ అధికారులు తలొగ్గి విలువైన 27 సెంట్లు భూమిని ధారాదత్తం చేయడానికి పూనుకున్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలకు కూడా తెలియకుండా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఈ తంతు నడిపిన విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో బుధవారం జేఆర్పురం వాసులు, ప్రజా ప్రతినిధులు బుధవారం స్కూల్వద్దకు వచ్చి నిరసన తెలిపారు. జేఆర్ పురం గ్రామంలో సర్వే నంబర్ 66లో 27,31,32లలో 27 సెంట్లు ప్రభుత్వ భూమి (గయాలు) ఉంది. ఆ భూమిని ఓ ప్రైవేటు స్కూల్కు రాకపో కలు సాగించేందుకు వీలుగా కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు శరవేగంగా స్పందించి ఏ–1 నోటీసు పరంగా దండోరా మూలంగా ప్రకటించి, గ్రామ సచివాలయంలో, సంబంధిత భూముల మీద ప్రచురించినట్లు ధ్రువీకరించారు. ఈ నోటీసులపై కొందరు కూటమి నాయకులు కూడా ఆ భూములు బదలాయింపునకు అనుకూలంగా సంతకాలు పెట్టడం గమనార్హం. మండల కేంద్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు కూడా స్థలం కరువైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయడం కలవరపరుస్తోంది. -
ఇదేం పంచాయితీ !
పోలాకి: పంచాయతీలను అశాసీ్త్రయంగా విభజించేందుకు, దాని ద్వారా రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పక్ష నాయకులు కుట్ర లు పన్నుతున్నారని కొందరు సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తున్నట్లు ఎంపీపీ ముద్దాడ దమయంతి భైరాగినాయుడు అధికారుల సమక్షంలోనే ప్రకటించారు. మిగిలిన మూడు మండలాల్లో సైతం మెజార్టీ గ్రామ పంచాయతీల తీర్మానాలు ఈ అశాసీ్త్రయ విభజనలను వ్యతిరేకిస్తూ జరిగాయి. మండలాల వారీగా ప్రతిపాదనలు.. ● పోలాకి మండలం బొద్దాం పంచాయతీలోని వనవిష్ణుపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా, పిన్నింటిపేట వ్యాపార కేంద్రాన్ని పూర్వ పు కోడూరు పంచాయతీలో విలీనం చేసేలా, బెలమర పంచాయతీలోని జొన్నయ్యపేటను, మగతపాడు పంచాయతీలోని ప్రకాశరావుపేట ను బొద్దాం పంచాయతీలోనూ, బెలమర పంచాయతీలోని కిల్లిబుచ్చెన్నపేటను మగతపాడు పంచాయతీలోనూ విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ ప్రస్తుతానికి వనవిష్ణుపు రం ప్రత్యేక పంచాయతీగానూ, పిన్నింటిపేటను కోడూరులోనూ విలీనం చేసేందుకు మాత్రమే గ్రామసభలు నిర్వహించినట్లు ఈఓ పీఆర్డీ పద్మావతి తెలిపారు. ● నరసన్నపేట మండలంలోని జమ్ము పంచాయతీలోని జమ్ము ప్రత్యేక పంచాయతీగాను, అదే పంచాయతీ అనుబంధ గ్రామమైన రావాడపేటను శివరాంపురం, పొన్నాడపేట, గడ్డెయ్యపేటలను కలుపుకుని ప్రత్యేక పంచాయతీగా నూ, మడపాం, బుచ్చిపేటలను వేర్వేరుగా ప్ర త్యేక పంచాయతీలుగా చేసి బుచ్చిపేటలో వీఎన్పురం పంచాయతీ చేనులవలసను విలీనం చేసేందుకుగాను ప్రతిపాదనలు చేశారు. ● జలుమూరు మండలంలోని అంధవరం పంచాయతీ నుండి, జోగులపేట, గంగన్నపేటలను విడదీసి అల్లాడ పంచాయతీ రామదాసుపేటతో కలపి రామదాసుపేటను ప్రత్యేక పంచాయతీగా ప్రతిపాదనలు చేసినప్పటికీ, జోగు లపేట, గంగన్నపేటల ప్రజలు మాత్రం మాకివలస పంచాయతీలో తమను విలీనం చేయా లని లేకపోతే అంధవరంలోనే కొనసాగించా లని కోరుతున్నారు. లింగాలవలస పంచాయ తీ నుంచి హరిక్రిష్ణంపేటను దరివాడ పంచాయతీలో విలీనంకు ప్రతిపాదించారు. తలతరియా పంచాయతీ నుంచి యర్రన్నపేట, సంతలబైలు గ్రామాలను విడదీసి యర్రన్నపేట ప్రత్యేక పంచాయతీగాను, జలుమూరు మండలకేంద్రం విడదీసిన నామాలపేట, కిల్లివాని పేట, కోనసింహోద్రిపేటను కలిపి నామాలపేటను ప్రత్యేక పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ● సారవకోట మండలం అలుదు గ్రామ పంచాయతీ నుంచి వడ్డినవలస, మాకివలసలను వేరుచేసి వడ్డినవలసను ప్రత్యేక పంచాయతీగాను, కుమ్మరిగుంట పంచాయతీ నుంచి వేరుచేసిన సింగంవలస, సోమయ్యపేట, బొంగడిపేటలతో కలపి చోడసముద్రంను ప్రత్యేక పంచాయతీగాను, వాండ్రాయి పంచాయతీనుంచి విడదీసిన బెజ్జి, సవరబెజ్జిలు కలపి కొత్త పంచాయతీగాను, గొర్రిబంద పంచాయతీలోని జగ్గయ్యపేట, కోనవానిపేట, ఆగుతుపురంకలపి గొర్రిబంద పంచాయతీ కొనసాగించేందుకు అదే పంచాయతీలోని బురుజువాడ కేంద్రంగా రైవాడ, జగన్నాథపురం, సవరపేటలతో కూడిన కొత్తపంచాయతీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అశాసీ్త్రయంగా పంచాయతీ విభజన ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్పంచ్లు, ప్రజలు రాజకీయ ఒత్తిడితో గ్రామసభలు నిర్వహించిన అధికారులు వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన పంచాయతీలు -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటన లు విడుదల చేశారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. దేవుని కృప అందరిపై ఉండాలని, ఈ శుభదినం కుటుంబాల్లో ఐక్యతను, ఆనందాన్ని నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ‘వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: వినియోగదారులు హక్కులు తెలుసుకుంటేనే నాణ్యమైన సేవలు అందుతాయని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ చైర్మన్ ఆర్.చిరంజీవి అన్నా రు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చదువుకునే సమయంలోనే ప్రాథమిక చట్టాలు తెలుసుకోవాలని చిరంజీవి సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం జరుగుతుందని జిల్లా సివిల్ సప్లై అధికారి జి.సూర్య ప్రకాష్ తెలిపారు. తూనిక లు కొలతలకు సంబంధించి మోసాలను గమనించి వినియోగదారులు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ పి.చిన్నమ్మ తెలిపారు. చిరుతిళ్లకు దూరంగా ఉండాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో, నగదు బహుమతులను అందజేశారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు శ్రీకాకుళం : విజయవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో సోంపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కృష్ణవర్ధన్ ప్రదర్శించిన స్మార్ట్ స్కానర్, పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.కౌశిక్ ఆచారి ప్రదర్శించిన రియల్ టైం సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఎంపికయ్యాయి. విద్యార్థులు వారి ఉపాధ్యాయులు చిన్నాజీవర్మ, ఎ.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వీటిని రూ పొందించారు. ఉపాధ్యాయ విభాగంలో అదపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కె.కిరణ్కుమార్కు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఎంపికై ంది. వీరు వచ్చే ఏడాది జనవరి 19 నుంచి హైదరాబాద్లో జరగబోవు సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్కు హాజరవుతారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, ఉప విద్యాశాఖాధికారు లు విజయకుమారి, విలియమ్లు ఎంపికై నవారిని అభినందించారు. ఘనంగా దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగ (విభిన్న ప్రతిభావంతులు) విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి. పాఠశాల విద్య, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జోనల్స్థాయి అడ్వైంచర్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. శ్రీకాకుళంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. 100, 400, 800 మీటర్ల పరుగు పందాలు, షాట్పుట్, లాంగ్జంప్ ఈవెంట్స్లో పోటీలను జరిపారు. జోనల్స్థాయి అడ్వెంచర్ క్రీడా పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ జోనల్మీట్ స్టేట్ పరిశీలకులు వై.నరసింహం మా ట్లాడుతూ ఇక్కడ జరిగే జోనల్ స్థాయిలో ఎంపికైన పదిమంది విద్యార్థులకు గండికోటలో నెలరోజుల పాటు శిక్షణను అందించిన తర్వాత పర్వతారోహణకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. అదపాక జెడ్పీ హెచ్స్కూల్ టీచర్ కె.కిరణ్కుమార్ సోంపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కృష్ణవర్ధన్ పోలవరం జడ్పీ హెచ్ఎస్ విద్యార్థి కౌశిక్ ఆచారి -
ఆస్పత్రి సిబ్బంది అవినీతి సదరంగం
నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రిలో అక్రమంగా సదరం సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే గతంలో పలువురు అనర్హులకు సర్టిఫికెట్లు ఇచ్చిన కథ కంచికి చేరలేదు. తాజాగా మళ్లీ సదరం సర్టికెట్ల మంజూరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్పత్రి సిబ్బంది దివ్యాంగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అమాయక ది వ్యాంగులు డబ్బులిచ్చి మోసపోతున్నారు. వైద్యు ని పరిశీలనలో వైకల్య శాతం 40 కి పైబడి డాక్టర్ ఇస్తున్నట్లు గమనించి ఆ అభ్యర్థులకు ఫోన్లు చేసి మీకు శాతం పెంచుతాం, ఇంత ఖర్చు అవుతుందని మాట్లాడి డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో డిప్యుటేషన్పై వచ్చిన డిజిటల్ అసిస్టెంట్, ఆస్పత్రిలో ఉన్న కాంట్రాక్టు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే డాక్టర్ పరిశీలనకు వెళ్లకుండానే ముగ్గురు వ్యక్తులకు సర్టిఫికెట్లు రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో వ్యక్తికి టెక్కలి ఆస్పత్రికి పరిశీలనకు నోటీసు రాగా నరసన్నపేటలో అది కూడా ఆయన రాకుండానే సర్టిఫికెట్ రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో బయటపడిన వాస్తవాలు బుధవారం ఎంకై ్వరీకి డాక్టర్ సూర్యారావు రావడంతో వాస్తవాలు బయట పడ్డాయి. గత నెల 10 వ తేదీన వైద్యుడు 8 మందికి సర్టిఫికెట్లు మంజూరు చేశారు. అయితే 12 మందికి ఆ రోజు మంజూరైనట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. దీన్ని గమనించిన ఆర్థో డాక్టర్ రమణరావు శ్రీకాకుళం డీసీహెచ్సీకి రాతపూర్వంగా ఫిర్యాదు చేశారు. తాను 8 మందికే సర్టిఫికెట్లు మంజూరు చేయగా మొత్తం 12 మందికి ఇచ్చినట్లు ఉందని దీనిపై పరిశీలన చేయమని కోరారు. దీంతో టెక్కలి వైద్యులు సూర్యారావును ఎంక్వైరీకి వేశారు. బుధవారం నరసన్నపేట వచ్చిన సూర్యారావు డాక్టర్ రమణరావుతో పాటు ఆ నలుగు రు వ్యక్తులను విచారించి వారి నుంచి వివరాలు తీసుకున్నారు. తాము డాక్టర్ పరిశీలనకు వెళ్లలేదని వారు అంగీకరించారని తెలిపారు. ఆ రోజు ఆస్పత్రిలో ఉన్న సీసీ పుటేజీలు కూడా సేక రించారు. ఇందులో సిబ్బంది దివ్యాంగులతో మాట్లాడుతున్నట్లు స్పష్టంగా రికా ర్డయ్యిందని తెలిపారు. ఆస్పత్రికి రాకుండానే ఒకరికి, ఆస్పత్రికి వచ్చి వైద్యుడు పరిశీలించకుండానే మరో ముగ్గురికి సర్టిఫికెట్లకు రికమెండ్ చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నివేదిక పంపుతున్నట్లు డాక్టర్ సూర్యారావు తెలిపారు. నరసన్నపేట కేంద్రంగా సదరం సర్టిఫికెట్ల రాకెట్ ఆర్థో వైద్యులు రమణరావు ఫిర్యాదుతో కదిలిన డొంక దర్యాప్తు చేసిన టెక్కలి వైద్యులు సూర్యారావు -
విధ్వంస కాండ
కొండలపై ● రాత్రి సమయాల్లో తరలిపోతున్న కంకర ● పలాస నియోజకవర్గంలో కొండలను కొల్లగొడుతున్న అక్రమార్కులు ● అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రకృతి వనరులు దోచేస్తున్న వైనం ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ● అయినా నోరు మెదపని అధికారులు అక్రమ తవ్వకాలతో తరిగిపోతున్న బెండి కొండ కఠిన చర్యలు తప్పవు ప్రస్తుతం జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి, ఎంఐజీ లే అవుట్, ఇతర అభివృద్ధి పనుల కోసం మాత్రమే అనుమతి ఇచ్చాం. ఈ పనులు మినహా ఇతర ఏ పనులకై నా అనుమతి లేకుండా కంకర తవ్వకాలు జరిపి అక్రమంగా తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. అధికారులు, సిబ్బందితో నిఘా పెడుతున్నాం. అక్రమంగా మైనింగ్ చేసి పట్టుబడితే ఉపేక్షించేది లేదు. – వెంకటేష్, ఆర్డీఓ, పలాస వజ్రపుకొత్తూరు రూరల్: కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు.. పలాస నియోజకవర్గంలో ఆ కూర్చుని తింటున్నదెవరో గానీ కొండలు మాత్రం కరిగిపోతున్నాయి. కాసింత కంకర ఉన్నా, ఏ మాత్రం గ్రావెల్ కనిపించినా కొండకు గుండు కొట్టే వరకు కొందరు ఊరుకోవడం లేదు. రాత్రి సమయంలో కొండలను కొల్లగొడుతున్న భారీ వాహనాలు నంబర్లతో సహా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఒక వైపు పచ్చని ఉద్దానం, తీర ప్రాతం, మెట్టు, పల్లపు ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాలతో పలాస రమణీయంగా ఉంటుంది. కానీ ఓ వైపు తీరం వెంబడి అక్రమంగా ఇసుకను తోడేస్తుంటే.. మరో వైపు యథేచ్ఛగా కొండలకు తవ్వి కంకర కొల్లగొడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. బరితెగించిన కంకర మాఫియా పలాస నియోజకవర్గంలో ఉన్న బెండి కొండ, తాడివాడ కొండ, అనంతగిరి కొండ, ఉజ్జిడి మెట్ట, రాజగోపాలపురం, రట్టికొండ, పిడిమందస, లొద్దబద్ర, కేదారపురం, వాసుదేవపురం కొట్ర ఆనంద్ క్వారీ, సూది కొండ, నెమలి కొండతో పాటు మరి కొన్ని కొండలను పగలు,రాత్రి అని తేడా లేకుండా అక్రమార్కులు గుల్ల చేసేస్తున్నారు. బెండి కొండ జగనన్న కాలనీ వద్ద అక్రమ తవ్వకాలతో తాగునీటి పైపులు, కుళాయిలు సైతం ధ్వంసమయ్యాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బరితెగించి కంకర మాఫియాను సాగిస్తూ యంత్రాలతో కొండలను తవ్వి ప్రకృతి వనరులు కొల్లగొడుతున్నారు. ఎందుకంత మౌనం..? కళ్ల ముందే ప్రకృతి సంపదను అక్రమార్కులు దోచుకుంటుంటే తమకేమీ పట్టనట్లుగా వ్యవహ రిస్తున్న అధికారుల తీరుపై స్థానికులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కొండలను తవ్వడానికి ఎవరు అనుమతి ఇచ్చారు..? ఒకవేళ అధికారులు అనుమతి ఇస్తే నిశిరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా ఈ తవ్వకాలు ఎందుకు చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుట్టగొడుగుల్లా లే అవుట్లు పలాస–కాశీబుగ్గ, పూండి, మందస, హరిపురంతో పాటు మారు మూల గ్రామాల్లో సైతం పుట్టగొడుగుల్లా లే అవుట్లు వెలుస్తున్నాయి. అదే రీతిలో అక్రమ కంకర తరలింపు కూడా జోరుగా సాగుతోంది. ప్రధానంగా లే అవుట్ యజమానులు రాత్రి 10 గంటల నుంచి వేకువజాము 4 గంటల వరకు కొండలను తవ్వి లేఅవుట్ల కోసం తరలిస్తున్నారు. ఈ బాగోతం అంతా అధికారుల కళ్ల ముందే జరుగుతున్నా వారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వన్యప్రాణులకు ఆవాసంగా ఉన్న కొండలు తరిగిపోతుంటే వనాల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. -
శ్రీకాకుళం
గురువారం శ్రీ 25 శ్రీ డిసెంబర్ శ్రీ 2025కీస్టోన్ చర్చిలో విద్యుత్ అలంకరణనింగిన ధ్రువతార మెరిసింది. బాల ఏసు జనన దృశ్యం ఆరాధనా మందిరంలో దేదీప్యమానంగా వెలిగింది. ఏసు రాక కోసం ముస్తాబైన మందిరాలు రాత్రి నుంచే స్వాగత గీతాలు ఆలపించాయి. క్రిస్మస్ సందర్భంగా ఊరూవాడల్లో చర్చిలు ఇలా మెరిసిపోయాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళంశాంతా వేషధారణ భక్తురాలి ప్రార్థన -
ఎరువుల పంపిణీకి ప్రణాళిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి ఎరువుల కొరత లేదని, రైతులకు అవసరమైన యూరియాను తగినంతగా అందుబాటులో ఉంచామని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. 2025–26 రబీలో అన్ని రకాల పంటలకు గాను మొత్తం 26,000 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి ఈ నెల 23 వరకు జిల్లావ్యాప్తంగా 11,141 మెట్రిక్ టన్నుల విక్రయాలు జరిగాయని, ప్రస్తుతం వివిధ కేంద్రాల్లో 1,859 మెట్రిక్ టన్నుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. దేశీయ ఉత్పత్తితో పాటు దిగుమతులు కూ డా ఆశాజనకంగా ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు ప్రోత్సహిస్తున్న నానో యూరియా, నానో డీఏపీలను కూడా వినియోగించుకోవాలని తెలిపారు. అధిక ధరలకు అమ్మితే చర్యలు ఎరువుల విక్రయాల్లో డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సష్టించినా, ఇతర ప్రాంతాలకు మళ్లించినా లేదా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించినా ఎరువుల నియంత్రణ చట్టం–1985 ప్రకారం లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు తప్పనిసరిగా రశీదు పొందాలని సూచించారు. -
భయోమెట్రిక్
● వేలి ముద్రలు చోరీ చేసి డబ్బులు కాజేస్తున్న వైనం● ఏఈపీఎస్పై అవగాహన లేక ప్రజల జేబులకు సైబర్ నేరగాళ్ల చిల్లు ● డబ్బులు పోతే 1930కు కాల్ చేయాలంటున్న పోలీసులుజిల్లా కేంద్రంలోని ఓ బ్యాంకు కస్టమర్ ఖాతాలో తనకు తెలియకుండానే పలుదఫాలుగా రూ. 96,500లు మాయమయ్యాయి. ఫోన్కు మెసేజ్లు కూడా రాలేదు. సడెన్గా ఓ రోజు బ్యాంకుకెళ్తే విషయం తెలిసి అవాక్కయ్యాడు. అప్పుడు గుర్తొచ్చింది. అతను తన వేలిముద్రను రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకసారి వేశారు. పలాసలో ఓ సీమెన్ విధుల్లో ఎక్కడో ఉంటారు. ఆయన ఏటీఎం కార్డు, బ్యాంకు బుక్లు అన్నీ భార్య వద్దనే ఉన్నాయి. రూ. 4 లక్షల పైగా ఉన్న తన ఖాతాలో భార్య తీయకుండానే డబ్బులు రూ. 1.50 లక్షలు వారం రోజుల్లో మాయమయ్యాయి. బ్యాంకుకు తన భార్య వెళ్లాక ఎవరో సీమెన్ ఆధార్ బయోమెట్రిక్లో ప్రవేశించి ఖాతా ను, యూపీఐ పిన్ నంబర్ తదితర వివరాలన్నీ తెలుసుకుని డబ్బులు తస్కరించాడని తెలిసింది. శ్రీకాకుళం క్రైమ్ : ప్రతి చిన్న పనికీ తప్పనిసరిగా మారిపోయిన బయోమెట్రిక్ భయోమెట్రిక్గా మారుతోంది. జిల్లాలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టు, కస్టమర్ కేర్ పేర్లతోనే కాక ఆధార్కార్డు వేలిముద్రలు, కంటి ఐరిష్ ద్వారా కేటుగాళ్లు ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వేలి ముద్రలతో వారేమైనా నేరాలు చేస్తే ఎక్కడ జైలుకెళ్లాల్సివస్తుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డేటా చౌర్యం జరుగుతోందా..? ఇప్పుడు ప్రతి చిన్న పనికీ మిషన్పై వేలి ముద్ర వేయడం పరిపాటుగా మారింది. ఈ సమాచారాన్ని ఎవరో దొంగిలిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఏఈపీఎస్ (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీస్) మోసాలకు ఆజ్యం పడేది ఆ వేలిముద్రలు వేసే చోటులోనేని బ్యాంకు వర్గాలు తమకొచ్చిన కస్టమర్ల ఫిర్యాదుల ఆధారంగా చెబుతున్నా రు. ఇదివరకు మీరు ఎక్కడైనా వేలిముద్ర వేశారా అంటే.. భూమి అమ్మినప్పుడు వేశాం. లేదంటే కొన్నప్పుడు వేశామని ఎక్కువమంది చెబుతున్నట్లు గుర్తించారు. ఫింగర్ ప్రింట్స్ తస్కరిస్తున్నారిలా.. సైబర్ మోసగాళ్లు పలు శాఖల వెబ్సైట్లలోకి అక్రమంగా చొరబడి దస్త్రాల్లోని ఫింగర్ప్రింట్ పత్రాలను డౌన్లోడ్ చేసుకుని వాటి ద్వారా ఫేక్ ఫింగర్ ప్రింట్స్ సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి యూజర్ఐడీ, పాస్వర్డ్తోనే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే అవకాశముంది. కానీ గెస్ట్ గా లాగిన్ అయ్యే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని పత్రాలను కాజేసి దస్త్రాల్లోని వేలిముద్రలను సేకరించేందుకు నేరస్తులు బటర్ పేపర్ను వినియోగిస్తున్నట్లు సమాచారం. బటర్ పేపర్పై ఉన్న ఫింగర్ప్రింట్ను గాజు గ్లాసుపై ముద్రించి రబ్బర్ పో యడం ద్వారా పాలిమర్ ప్రింట్ను తయారు చేయడంతో ఫేక్ ఫింగర్ప్రింట్స్గా మారుతాయి. బయో మెట్రిక్ మెషిన్లోకి ఈ ఫేక్ ఫింగర్ ప్రింట్ పెట్టి సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలోని నగదును ఖా ళీ చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల దగ్గర కొన్న మన ఫింగర్ ప్రింట్, ఐరిష్ డేటా ద్వారా బ్యాంకు ఖాతా లోకి చొరబడి బ్యాంకు స్టేట్మెంట్, బ్యాలె న్సు ఎంకై ్వరీ వివరాలు తెలుసుకోవడం, డబ్బులు ట్రా న్స్ఫర్ చేయడమే కాక హ్యాక్ కూడా చేసే ప్రమాదాలు ఉన్నాయి. పాటించాల్సిన జాగ్రత్తలు ● సాధ్యమైనంత వరకు ఫింగర్ ప్రింట్, ఐరిష్ వేయకుండా నేరుగా బ్యాంకు ద్వారా విత్డ్రా, డిపాజిట్ చేసుకుంటే మంచిది. ● ఏఈపీఎస్ ద్వారా నేరాలను ఆపాలంటే ఆధార్కు లాక్ పెట్టుకోవడం, ఆధార్లో ఉన్న బయోమెట్రిక్కు లాక్ పెట్టుకోవడం ఉత్తమం. ● ఆధార్ కానీ, బయెమోట్రిక్ కానీ సెకెండ్వే అథంటికేషన్ పెట్టుకుంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేముందు మన సెల్ఫోన్కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే కానీ డబ్బులు ట్రాన్స్ఫర్ కావు. సైబర్ నేరగాళ్లు బయోమెట్రిక్ లాక్ దొంగిలించినా పైవిధంగా ఓటీపీని ఎంటర్ చేస్తేనే దానిని యాక్సెస్ అయ్యేలా ఇది పనిచేస్తుంది.సైబర్ అప్రమత్తత మేలు అకౌంటులో డబ్బులు పోయాయని తెలిసిన వెంటనే సైబర్ సెల్ 1930కు కాల్చేసి వివరాలు చెప్పాలి. మీ పరిధిలో ఉన్న పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల ప్రకారం సంబంధిత బ్యాంకుకు వెళ్లి పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కాపీని లేదంటే ఆన్లైన్ ఫిర్యాదు కాపీని సమర్పించాలి. బ్యాంకులో ఉన్న లావాదేవీల డిస్ప్యూట్ ఫామ్లో వివరాలు నింపి బ్యాంకు ప్రతినిధులకివ్వాలి. వారు కన్సల్టింగ్ పై అథారిటీ వారికి పంపిస్తారు. 120 రోజుల్లో 99 శాతం డబ్బులు వచ్చే అవకాశం ఉంది. రాకుంటే బ్యాంకులు మీద కూడా అంబుడ్స్మన్లో ఫిర్యాదు చేయొచ్చు. -
ధాన్యం తూకంలో తేడాలపై ఫిర్యాదులకు ఫోన్ చేయండి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం తూకం, తరుగు లేదా ఇతర సమస్యలపై రైతులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాకుళం డివిజన్ 94942 33490 (ఆర్డీవో కార్యాలయం), టెక్కలి డివిజన్ 97040 33093, పలాస డివిజన్ 7386189275 ధాన్యం సేకరణలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని, రైతులు ఈ ఫోన్ నంబర్లను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కాశీబుగ్గ డీఎస్పీగా షాయిక్ సెహబాజ్ శ్రీకాకుళం క్రైమ్ : కాశీబుగ్గ సబ్డివిజనల్ పోలీసు అధికారి (డీఎస్పీ)గా షాయిక్ సెహబాజ్ను నియమిస్తూ మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. పాడేరు నుంచి ఆయన బదిలీపై రానున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఇదివరకు డీఎస్పీగా పనిచేసిన వి.వి.అప్పారావు పోలీస్ హెడ్క్వార్టర్స్కు వీఆర్గా వెళ్లిన సంగతి తెలిసిందే. సరుబుజ్జిలి: వ్యవసాయ శాఖలో ఎదుర్కొంటున్న పలు రకాల ఒత్తిళ్ల నుంచి విముక్తి కలిగించాలని జిల్లా రైతు సేవా కేంద్రాల ఉద్యోగుల (గ్రామ వ్యవసాయ సహాయకులు) వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేర కు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం జిల్లాకేంద్రంలో వ్యవసాయశాఖ జేడీ త్రినాథస్వామికి మంగళవారం వినతిపత్రం అందించారు. అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతూ రైతులకు చెందిన ఎరువుల సొసైటీలు, పీఏసీఎస్ల ద్వారా పంపిణీ చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ ఆర్ఎస్కేల ద్వారా పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఐదు నెలలు గడిచినప్పటికీ చాలా మండలాల్లో వార్షిక ఇంక్రిమెంట్ ఇవ్వలేదన్నారు. వ్యవసాయ పనులతోపాటు, జీఎస్డబ్ల్యూ సర్వేలు కూడా అగ్రికల్చర్ అసిస్టెంట్లకు అప్పగిస్తున్నారని, ఈ– క్రాప్ పూర్తయిన వరకు సర్వేలు ఆపాలని కోరారు. 27లోగా టీసీసీ పరీక్షల ఫీజు చెల్లించాలి శ్రీకాకుళం : వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలకు ఈ నెల 27లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు మంగళవారం తెలిపారు. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి 7వ తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు టీసీ సీ పరీక్షలు రాయడానికి అర్హులని పేర్కొన్నా రు. డ్రాయింగ్ (లోయర్ గ్రేడ్) రూ.100, డ్రా యింగ్ (హయ్యర్ గ్రేడ్) రూ.150, హ్యాండ్లూం వీవింగ్ (లోయర్ గ్రేడ్) రూ.150, హ్యాండ్లూం వీవింగ్ (హయ్యర్ గ్రేడ్) రూ.200, టైలరింగ్, ఎంబ్రాయిడరీ (లోయర్ గ్రేడ్) రూ.150, టైలరింగ్ ఎంబ్రాయిడరీ (హయ్యర్ గ్రేడ్) పరీక్ష ఫీజు రూ.200 చొప్పున చెల్లించాలన్నారు. ఆలస్య రుసుంతో జనవరి 3వ తేదీలోగా, రూ.75 ఫీజుతో జనవరి 6వ తేదీలోగా చెల్లించవచ్చని పేర్కొన్నారు. కాలువలో శ్రమదానం సారవకోట: మండలంలో అత్యంత విస్తీర్ణంలో ఉన్న రంగసాగరం ఎడమ కాలువను ఏటా ఆ యకట్టు రైతులే బాగు చేసుకుంటున్నారు. సారవకోట, జగన్నాఽథపురం, బురుజువాడ, రైవాడ, అగదల, కొత్తూరు, అలుదు, వండాన వల గ్రామాల్లో ఉన్న రైతులకు రంగసాగరం నీరు ఎంతో అవసరం. దీంతో ఏటా పూడికలతో నిండిపోయే కాలువను రైతులే బాగు చేసుకుంటారు. జాతీయ ఉపాధి హామీ పథకం అధికారులు గానీ రంగసాగరం నీటి సంఘం ప్రజాప్రతినిధులు గానీ దీనిపై దృష్టి సారించక పోవడంతో రైతులే శ్రమదానం చేసుకుంటున్నారు. మంగళవారం ఆయా గ్రామాల కు చెందిన సుమారు 30 మంది రైతులు శ్రమదానంతో కాలువలో పూడికలు తొలగించారు. సు మారు నాలుగైదు రోజుల పాటు శ్రమదానం చేసి పూడికలు తొలగిస్తూ ఉంటామని చెబుతున్నారు. -
26న రథసప్తమిపై ప్రజాభిప్రాయ సేకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లి క్షేత్రంలో రథసప్తమి వేడుకలను భక్తుల మనోభావాలకు అనుగుణంగా, అత్యంత వైభవంగా నిర్వహించడమే జిల్లా యంత్రాంగం లక్ష్యమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరి 25న జరగనున్న వేడుకలను ఈసారి ఏడు రోజుల పాటు రాష్ట్ర పండుగగా జరిపేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని, ఈ నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లపై చర్చించేందుకు ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ఉత్సవాల నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణపై ఎవరైనా తమ అమూల్యమైన సూచనలు ఇవ్వవచ్చని, వాటిని నిశితంగా పరిశీలించి తుది నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ప్రతి షాపు నుంచి ముడుపులు
● హోల్సేల్ ఎరువుల డిస్ట్రిబ్యూటర్ల చేతిలో చిక్కుకుపోయిన జిల్లా ● ఓ మంత్రి అండతో చెలరేగిపోతున్న ఆ నలుగురు ● అధికారులను సైతం శాసిస్తున్న పరిస్థితిఎరువుల షాపుల జోలికి అధికారుల రాకుండా చూస్తామంటూ జిల్లాలో ఉన్న ప్రైమ్ డీలర్లు, రిటైలర్ల దగ్గరి నుంచి ఏటా షాపు కింత అని వసూలు చేస్తున్నారు. గత ఏడాది షాపునకు రూ.5వేలు వసూలు చేస్తే ఈ ఏడాది రూ.10వేలు వసూలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఆరుగురు హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు, 30 మంది వరకు ప్రైమ్ డీలర్లు, మరో 270 వరకు రిటైలర్లు ఉన్నారు. దీన్ని బట్టి అధికారుల ముడుపుల పేరు చెప్పి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వసూలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా రిటైలర్, ప్రైమ్ డీలర్ ఇవ్వకపోతే వారిపై అధికారుల చేత దాడులు చేయించి భయపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆ నలుగురు.. జిల్లాలో ఎరువుల పంపిణీ వ్యవస్థను శాసిస్తున్నారు. ఓ మంత్రి అండదండలతో అధికారులపై సైతం పెత్తనం చెలాయిస్తున్నారు. ఎరువుల ధరలను ఇష్టారీతిన పెంచేసి, రైతులపై మోయలేని భారాన్ని మోపుతున్నారు. రైతులకు సరిపడా ఎరువులను సరఫరా చేయడంలో ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ఆ నలుగురిదీ ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఖరీఫ్లో ఎరువుల కష్టాలు ఎవ రూ మర్చిపోలేదు. రబీలోనూ అదే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. రైతుల అవసరం మేరకు ఎరువులను ప్రభుత్వం సరఫరా చేయకపోవడం, అందుబాటులో ఉన్న ఎరువుల ధరలు భారీగా పెరి గిపోవడంతో రైతులు విసిగి వేసారి పోతున్నారు. సిండికేట్గా ఆ నలుగురు.. జిల్లాలో హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు పాతుకుపోయారు. కొత్త వారు రాకుండా అడ్డుకునే స్థాయికి వెళ్లిపోయారు. ఆసక్తి చూపించే వారికి రకరకాల ఇబ్బందులను పెట్టి ఆదిలోనే నిలువరిస్తున్నా రు. పొరుగునున్న విజయనగరం జిల్లాలో 20 మందికి పైగా, విశాఖపట్నం జిల్లాలో 30మందికి పైగా, గోదావ రి జిల్లాల్లో 100 మందికి పైగా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటే మన జిల్లాలో మాత్రం ఆరుగురు మాత్ర మే హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీరిలో ఓ నలుగురు డిస్ట్రిబ్యూటర్లు అంతా తామై వ్యవహరిస్తు న్నారు. రాజకీయ అండదండలతో జిల్లాను శాసిస్తున్నారు. మూడొంతుల ఎరువులు వీరి ద్వారానే.. జిల్లాకు వచ్చిన ఎరువులో మూడొంతులకు పైగా ఇక్కడ హోల్సేల్ సిండికేట్ ద్వారానే రిటైలర్స్కు వెళ్తుంది. ఆమదాలవలసలో ఒకరు, టెక్కలిలో ఇద్దరు, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఒకరు కలిసి ఈ సిండికేట్లో కీలకంగా ఉన్నారు. వీరందరికీ అధికార పార్టీ నేతలు అండదండగా నిలవడంతో వీరి సిండికేట్ బలంగా, దృఢంగా దశాబ్దాల నుంచి కొనసాగుతుందని జిల్లాలో రిటైలర్ డీలర్లు చెబుతున్నారు. ఇప్పుడు ఓ మంత్రికి సన్నిహితంగా మెలిగే కోటబొమ్మాళికి చెందిన ఒక వర్తకుడు వీరందరికీ పెద్ద దిక్కుగా నిలబడినట్టు ఆరోపణలు ఉన్నాయి. కోరమాండల్, ఎన్ఎఫ్ఎల్, ఇఫ్కో, క్రిబ్కో, స్పిక్, ఆర్సీఎఫ్ తదితర ఫెర్టిలైజర్ కంపెనీలు తొలి నుంచి వీరికే ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నాయి. అసోసియేషన్ సైతం అసహనం జిల్లా ఫెర్టిలైజర్స్ డీలర్స్ అసోసియేషన్ సైతం ఆ నలుగురిపై పలుమార్లు తీవ్ర అసహనం ప్రకటించినట్లు సమాచారం. హోల్సేల్గా ధరలు బిల్లింగ్ కంటే అదనంగా చీకటి ధరలు సైతం వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక యూరియా బస్తా హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్కు రూ.238కి వస్తుంది. రిటైలర్కు వెళ్లే సమయానికి రూ.20 ట్రాన్స్పోర్టు చార్జీల కింద యాడ్ అవుతుంది. ఇదంతా అధికారికంగా చూపిస్తున్నది. కానీ రిటైలర్ నుంచి బస్తాకు అదనంగా రూ.50 నుంచి రూ.60 వరకు అనధికారికంగా వసూలు చేస్తున్నారు. దీంతో రిటైలర్కు వచ్చేసరికి దూరాన్ని బట్టి రూ.310 నుంచి రూ.320 అవుతుంది. దీనికి రిటైలర్లు మరికొంత వేసుకుని అమ్ముకోవాల్సి వస్తోంది. ఇదే రైతుకు భారమవుతోంది. మరోవైపు డీబీటీలో డమ్మీ అథంటికేషన్లు వేసి బస్తాకు రూ.500 వరకు అమ్ముకుని సొమ్ముచేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. అదనపు వడ్డన చాలదన్నట్టు రైతుకు లింక్ ప్రొడక్ట్స్ బల వంతంగా అంటగడుతున్నారు. లింక్ ప్రొడక్ట్స్ తీసుకుంటే తప్ప సబ్సిడీ ఎరువులను ఇచ్చే పరిస్థితి లేదు. ప్రతి బస్తాకు లింక్పెట్టి రిటైలర్స్కు అంటగట్టే సంప్రదాయం సైతం జిల్లాలో ‘ఆ నలుగురు’ నుండే ప్రారంభమైంది. ఇలా రోజుకొక కొత్త ఆలోచనతో రిటైలర్స్కు కూడా గిట్టుబాటు కాకుండా చేసి తద్వారా రైతుల నడ్డివిరిచే కార్యక్రమం జరుగుతుంది. రాజకీయ పలుకుబడి ఉండడంతో ఎరువులపై ఎన్ఫోర్స్మెంట్ చేయడానికి వచ్చే అధికారులను ఎదురించే స్థాయికి వెళ్లిపోయారు. ప్రధానంగా ఓ మంత్రి అండగా నిలవడంతో అధికారులు సైతం జీ హూజూర్ అనాల్సి వస్తోంది. అన్నీ కాకి లెక్కలు.. జిల్లాలో రబీలో 1,75,797 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు 1,05,775 ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వరి 50,255 ఎకరాలు, మొక్కజొన్న 36,180 ఎకరాలు, మినప 36,180 ఎకరాలు, పెసర 19,610 ఎకరాలు, వేరుశనగ 5310 ఎకరాలు, రాగి 2492.5 ఎకరాలు, ఉలవలు 627.5 ఎకరాలు, చెరుకు 890 ఎకరాలు, నువ్వులు 427.5 ఎకరాల్లో సాగులోకి వచ్చినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ వీటిలోనూ వాస్తవికత లేదని తెలుస్తోంది. రబీ సీజన్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరులోగా సాగు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటికే సాగులోకి వచ్చిందని అధికారికంగా చూపిస్తున్న లెక్కలే గతం కంటే భారీగా తగ్గిపోయిందని చెబుతున్నాయి. పోనీ సాగు చూపిస్తున్న మేరకై నా ఎరువులు సమకూర్చుతుందా అంటే అదీ లేదు. రబీ లెక్కల ప్రకారం 30 వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అవసరం ఉండగా, అధికార యంత్రాంగం 12,457 మెట్రిక్ టన్నులే అవసరముందని నివేదికలు రూపొందించింది. ఇందులో 9,521 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చేసిందని కూడా చూపిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. యూరియా దొరక్క ఖరీఫ్ మాదిరిగానే రబీలోనూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ బాధలు భరించలేక చాలా మంది సాగును వదులుకుంటున్నారు. సాక్షి -
ఉన్నది పోయె.. కొత్తది రాకపాయె!
హిరమండలం: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కలమట వెంకటరమణమూర్తిని పదవి నుంచి తొలగించారు. ఆ పదవిని ఆమదాలవలస నియోజకవర్గానికి చెందిన మొదలవలస రమేష్కుమార్కు కట్టబెట్టారు. 2024 ఎన్నికల సమయంలో కలమట వెంకటరమణమూర్తికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గ టిక్కెట్ మామిడి గోవిందరావుకు ఇవ్వడంతో అప్పటివరకూ ఇన్చార్జిగా ఉన్న వెంకటరమణమూర్తి కలత చెందారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో పార్టీ అధిష్టానం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పోస్టు కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ కేటాయిస్తామని చెప్పింది. కూటమి అధికారంలోకి వచ్చి 18 నెల లు అవుతోంది. నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేశారు. కానీ కలమట వెంకటరమణమూర్తి పేరును కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పుడు టీడీపీ అధ్యక్ష పదవి నుంచి సైతం తొలగించారు. దీంతో కలమట అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సుదీర్ఘ నేపథ్యం.. కలమట కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కలమట మోహనరావు రాజకీ య వారసుడిగా తెరపైకి వచ్చారు కలమట వెంకటరమణమూర్తి. 2009లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ కొద్దికాలనికే టీడీపీలోకి ఫిరాయించారు. 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కుతుందని భావించారు. కానీ వెంకటరమణకు చంద్రబాబు షాక్ ఇచ్చారు. మామిడి గోవిందరావుకు టిక్కెట్ ఇవ్వడంతో ఆయన గెలిచారు. అయితే గోవిందరావు గెలుపు కోసం కృషిచేసిన వెంకటరమణమూర్తికి టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అయితే ఏడాదిన్నరకే ఆ పదవి నుంచి తొలగించారు. పైగా ఎలాంటి నామినేటెడ్ పోస్టు కానీ, ఎమ్మెల్సీ పదవి కానీ కేటాయించలేదు. అయితే టీడీపీ అధ్యక్ష పదవి ఖర్చుతో కూడుకున్నదని.. అందుకే నామినేటెడ్ పదవి ఇవ్వాలని కలమట కోరినట్టు ప్రచారం జరుగుతోంది. టిక్కెట్ త్యాగం చేసిన తమ నేతకు పదవులు దక్కకపోవడంపై ఆయన అభిమానులు ఆవేదనతో ఉన్నారు. పొలిటికల్ కలమట వెంకటరమణకు దక్కని నామినేటెడ్ పదవి అమలు కాని ఎమ్మెల్సీ హామీ ప్రస్తుతం ఉన్న టీడీపీ అధ్యక్ష పదవి తొలగింపు తీవ్ర అంతర్మథనంలో అభిమానులు -
బోటు నుంచి జారిపడి మత్స్యకారుడు దుర్మరణం
కవిటి : కొత్తపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారుడు కర్రి విశ్వనాథం (34) సముద్రంలో వేట సాగిస్తూ ప్రమాదవశాత్తు జారిపడి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10 మంది మత్స్యకారులతో కలిసి విశ్వనాథం కొత్తపాలెం తీరం నుంచి సముద్రంలో వేటకు వెళ్లాడు. కొంతదూరం వెళ్లాక బోటుపై నిల్చొని వల వేయడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బోటు వేగానికి అదుపుతప్పి వలతో సహా సముద్రంలో పడిపోయాడు. బోటుకు అడుగున ఫ్యాన్ రెక్కలకు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరంమృతదేహాన్ని తోటి మత్స్యకారులు బుధవారం ఒడ్డుకు తీసుకొచ్చారు. విశ్వనాథంకు భార్య ఉమామహేశ్వరి, కుమారులు ప్రసాద్, వినయ్ ఉన్నారు. కవిటి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మోసాలకు చెల్లు
● సేవా లోపాలపై ఫిర్యాదులకు రశీదు తప్పనిసరి ● వినియోగదారుల ఫోరంతో మోసాలకు అడ్డుకట్ట ● నేడు జాతీయ వినియోగదారుల దినోత్సవం బిల్లుతో హిరమండలం/పాతపట్నం/శ్రీకాకుళంపాతబస్టాండ్: నిత్య జీవితంలో అవసరాలకు అనుగుణంగా ప్రతి రోజూ దుకాణంలో ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తుంటాం. కొన్నిచోట్ల కొందరు దుకాణదారులు నాసిరకం వస్తువులను అంటగడుతుంటారు. కనీసం రసీదు కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంటారు. ఇంటికెళ్లి చూశాకే అనవసరంగా మోసపోయామే.. అంటూ బాధపడు తుంటాం. నాణ్యతా లోపం స్పష్టంగా కనిపిస్తున్నా ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటాం. ఇలాంటి సమంయంలో వినియోగదారుల కోసం ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ అండగా నిలుస్తుంది. వస్తువుల నాణ్యతలో తేడాలు వచ్చినప్పుడు రశీదు ఉంటే తగిన పరిహారం పొందే వీలు కల్పి స్తుంది. బుధవారం జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం. ‘సుస్థిర జీవన శైలికి న్యాయమైన పరివర్తన’ అనే థీమ్తో ఈ ఏడాది జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చి 15న నిర్వహిస్తుండగా మన దేశంలో 1986 డిసెంబర్ 24న వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం ఏర్పడటంతో అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 24నే జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. సమస్య పరిష్కారం ఇలా.. మోసాలు, కొలతలు, ఇబ్బందులు, సేవలు ఇలా ఏ అంశంలోనైనా వినియోగదారునికి ఇబ్బంది కలిగితే వినియోగదారుల పరిరక్షణ చట్టం ద్వారా పరిష్కారంతో పాటు పరిహారం కూడా పొందే వీలుంది. వినియోగదారుల సేవలకు ఆటంకం నష్టం కలిగితే సంబంధితవ్యక్తులు, సంస్థలపై ఫిర్యాదు చేయ వచ్చు. వినియోగదారుల తూకాల్లో మోసపోయి నా, వస్తువుల్లో నాణ్యత లోపించినా సేవలు సక్రమంగా అందకపోయినా ఫిర్యాదు చేయవచ్చు. చిన్న సూది నుంచి బ్యాంకింగ్, ఆసుపత్రి, రైల్వే, విమానయానం, విద్యుత్, ఆన్లైన్ వ్యాపారాలు, కొరియర్ సర్వీస్, గ్యాస్, ఫుడ్ డెలవరీ ఇలా అన్ని రకాల సేవల విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు. మార్కెట్లో కొనుగోలు చే సే వస్తువుల నాణ్యత ప్రమాణాల్లో లో పాలు, తేడాలు, ఎంఆర్పీ కంటే ఎక్కు వ వసూలుచేసినా, వస్తువుల్లో ముద్రించిన పరిహారం పొందే అవకాశం ఉంటుంది. బిల్లు తప్పనిసరి.. జిల్లాలో 30 మండలాల పరిధిలో వేలాది దుకాణాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, కొన్ని సూపర్మార్కెట్లలో తప్ప మిగిలిన చోట్ల బిల్లులు ఇవ్వడం లేదనేది బహిరంగ సత్యం. ముఖ్యంగా వినియోగదారులే బిల్లు తీసుకునేందుకు ఆసక్తి చూపకుండా వస్తువులు కొనుగోలు చేసిన వెంటనే వెళ్లిపోతుంటారు. ఇదే అంశం దుకాణదారులకు వరంగా మారుతోంది. మరికొన్ని చోట్ల వ్యాపారులు తెల్లకాగితం రాసి ఇస్తున్నారే తప్ప సరైన బిల్లు ఇవ్వడం లేదు. అవగాహన కరువు.. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం గురించి ప్రజలకు కనీస అవగాహన ఉండటంలేదు. అధికారులు కూడా అవగాహన కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శలున్నాయి. ఇప్పటికైనా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఫిర్యాదు ఇలా.. వస్తువు కొనుగోలు చేసినప్పుడు కచ్చితమైన, సరైన రశీదు(బిల్లు) తీసుకోవాలి. వినియోగదారుని పేరు, చిరునామా, ఎవరిపై ఫిర్యాదు చేస్తున్నారో వారి పేర్లు రాయాలి. కొనుగోలు చేసిన వస్తు సేవల వివరాలు, బిల్లు నంబరు, నష్టం విలువ అంకెల్లో రాయాలి కోరుకుంటున్న పరిహారం వివరాలను దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాలి. గుర్తింపు పొందిన వినియోగదారుల సంఘాల ద్వారా మొదటి తరగతి జ్యూడిషియల్ మెజిస్ట్రేట్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. నష్టపరిహారం కోసం వినియోగదారుల జిల్లా ఫోరం సహాయం కోరవచ్చు. అక్రమ వ్యాపారులను, మోసాలను అరికట్టెందుకు తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్లు, లీగల్ మెట్రాలజీ వారికి ఫిర్యాదు చేయవచ్చు. వినియోగించుకోండి.. ఇటీవల కాలంలో విస్తరించిన ఆల్లైన్ వ్యాపారాల్లో ఎన్నో మోసాలు చోటు చేసుకున్నాయి. మోసాల నుంచి భరోసా పొందేందుకు వినియోగదారుల సంఘాన్ని ఆశ్రయించవచ్చు. – ఎ.వెంకట సురేష్, కార్యదర్శి, జిల్లా వినియోగదారుల సంఘం, హిరమండలం జాగ్రత్తలు తీసుకోవాలి సమగ్ర వివరాలు తెలుసుకున్న తర్వాతే వస్తువులు కొనేందుకు సిద్ధపడాలి. కొనుగోలు చేసిన తర్వాత మోసపోతే వినియోగదారుల హక్కుల చట్టాన్ని వినియోగించుకుని పరిహారం పొందవచ్చు. – మడ్డు తాతయ్య, విశ్రాంత ఉపాధ్యాయుడు, కొరసవాడ, పాతపట్నం మండలం నేడు అవగాహన సదస్సు శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. వినియోగదారులు, ఆహార పౌర సరఫరాలు, మానవ వనరుల అభివృద్ధి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. -
నా మాటలు వక్రీకరించారు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా టెక్కలిలో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన మాటల్లో స్వార్థం లేదని, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తన మాటల వెనుక ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, సామాజిక వర్గాలను రెచ్చగొట్టడం తన అభిమతం కాదని స్పష్టం చేశారు. ఒక వేళ తన మాటలు ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వాటిని తప్పుగా భావించొద్దని కోరారు. తప్పుడు ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని కోరారు. -
కొనసాగుతున్న క్రికెట్ సెలక్షన్ మ్యాచ్లు
శ్రీకాకుళం న్యూకాలనీ: ఫ్యూచర్ క్రికెట్ అండర్–12 బాలుర తుది జట్టు ఎంపిక కోసం జిల్లా క్రికెట్ సంఘం కసరత్తులు చేస్తోంది. త్వరలో జరిగే నార్త్జోన్ క్రికెట్ టోర్నీలో జిల్లా జట్టు రాణింపే లక్ష్యంగా ఫైనల్ టీం సెలక్షన్ కోసం ప్రాబబుల్స్ జట్టుకు సెలక్షన్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పుల్లెల శాస్త్రి, కార్యదర్శి హసన్రాజా, మెంటార్ ఇలియాస్ మహ్మద్ ఆధ్వర్యంలో కళింగపట్నం క్రికెట్ మైదానంలో చిన్నారులకు మంగళవారం ఎంపిక మ్యాచ్లు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా సంఘ ప్రతినిధి ఎర్రన్న, చీఫ్ కోచ్ కె.సుదర్శన్, జీఎస్ఎస్ ప్రసాద్, ఎం.వి.రమణ, హారికాయాదవ్, రమణమ్మ, సంఘ ప్రతనిధులు పాల్గొన్నారు. ఎంపిక పోటీలో పాల్గొన్న క్రీడాకారులు -
రామ్మోహన్రావుకు రాష్ట్రస్థాయి అవార్డు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బగాది రామ్మోహన్రావు రాష్ట్ర వినియోగదారులు కమిటీ తరఫున అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. విజయవాడలో బుధవారం జరిగే కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. బాల్య వివాహం సామాజిక శాపం శ్రీకాకుళం పాతబస్టాండ్: బాల్య వివాహాలు సామాజిక శాపమని, వీటి వల్ల బాలికల భవిష్యత్ అంధకారమవుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నల్సా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంగళవారం స్థానిక వరం మున్సిపల్ హైస్కూల్లో బాల్య వివాహాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు బాలికలకు రక్షణ కల్పించే వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని హరిబాబు పిలుపునిచ్చారు. చిన్న వయసులో వివాహాలు చేయడం వల్ల ఎదురయ్యే ఆరోగ్య, న్యాయపరమైన చిక్కులను విద్యార్థినులు గుర్తించాలని సూచించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది జి. ఇందిరా ప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. -
వర్సిటీ విద్యార్థులతో ‘క్వాంటమ్ టాక్’
ఎచ్చెర్ల్ల : క్వాంటమ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో మంగళవారం ఏపీ ప్రభుత్వంతో కలసి అమెరికాకు చెందిన వైజర్, క్యూబిట్ సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీపై ఇవ్వనున్న శిక్షణా కార్యక్రమంపై ఆన్లైన్లో వివిధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, కళాశాలల ప్రతినిధులు, విద్యార్థులతో మాట్లాడారు. ఎచ్చెర్లలోని బీఆర్ఏయూ నుంచి వైస్ చాన్సరల్ కె.ఆర్.రజినీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు పాల్గొన్నారు. తల్లి చెంతకు కుమార్తె శ్రీకాకుళం క్రైమ్ : శ్రీకాకుళం ఒకటో పట్టణ పరిధిలోని చంపాగల్లివీధికి చెందిన ఓ మహిళ మతిస్థిమితం సరిగా లేక ఈ నెల 19న పొట్టిశ్రీరాములు పెద్ద మార్కెట్లో తప్పిపోయిన సంగతి తెలిసిందే. ఎస్ఐ హరికృష్ణ సమీపంలో సీసీ ఫుటేజీలు పరిశీలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఆరు బృందాలతో సమీప ఎచ్చెర్ల, రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో గాలింపు చేపట్టారు. వీరిలో ఓ బృందానికి ఎచ్చెర్ల మండలం ఏ.జే.పేట జాతీయ రహదారి పక్కన మహిళ కనిపించడంతో వెంటనే ఆమెను ఒకటో పట్టణ స్టేషన్కు తీసుకొచ్చి ఎస్ఐ సమక్షంలో తల్లికి అప్పగించారు. స్విమ్మింగ్ పోటీలో జవహర్రాజ్కు రజతం శ్రీకాకుళం: జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో శ్రీకాకుళం నగరానికి చెందిన తంగుడు జవహర్రాజ్ రజత పతకం సాధించాడు. ఈ నెల 20, 21 తేదీల్లో మంగుళూరులో నిర్వహించిన ఐదో జాతీయ స్థాయి పోటీల్లో 50 మీటర్ల ఉపరితల ఫిన్ స్విమ్మింగ్ పోటీల్లో మూడో స్థానంలో నిలిచాడు. నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్న జవహర్రాజ్ గతంలో జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి పోటీల్లో సత్తా చాటి విజయాలు అందుకున్నాడు. కొనసాగుతున్న క్రీడాపోటీలు ఎచ్చెర్ల: కుశాలపురం పంచాయతీలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్న 28వ ఐపీఎస్జీఎం క్రీడా పోటీలు మంగళవారం కూడా కొనసాగాయి. ఖోఖో పోటీల్లో విజయమే లక్ష్యంగా క్రీడాకారులు తలపడ్డారు. అనంతరం చిలకపాలెంలోని శ్రీవేంకటేశ్వర కళాశాలలో అథ్లెటిక్స్ 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లు, లాంగ్జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, షార్ట్ఫుట్, డిస్కస్త్రో, జావెలిన్ త్రో 4/100 రిలే, 4/400 రిలే పోఈలు నిర్వహించారు. అన్ని కళాశాలల సిబ్బంది, పీడీలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వికసిత్ భారత్ లక్ష్యసాధనకు కృషి
శ్రీకాకుళం పాతబస్టాండ్: పథకాల స్ఫూర్తిని పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటూ స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమం అమలుకావాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి ‘విబి–జీ రామ్ జీ’, వైద్యారోగ్యం, విద్య, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్ , పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ తదితర పథకాలపై ఆయా శాఖల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ 185 రోజులు కూలి దొరికేలా కేంద్ర ప్రభుత్వం వీబీ జీ రామ్ జీ పథకం తీసుకొచ్చిందన్నారు. బహుళ ప్రయోజనాల పీఎం సూర్యఘర్ పథకం అమల్లో మరింత చొరవ చూపాలన్నారు. వైద్య రంగంలో మార్పులు తీసుకువస్తున్నామని, మాతా శిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. సమావేశంలో శాసన సభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె.అనిత, సీపీఓ లక్ష్మీప్రసన్న, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు, డ్వామా పీడీ లవరాజు, జిల్లా విద్యాశాఖ అధికారి రవికుమార్, ఏపీఈపీడీసీఎల్, సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు. -
రిమ్స్ సెక్యూరిటీ గార్డుల సమ్మె నోటీసు
శ్రీకాకుళం: రిమ్స్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్ుడ్సకు జీఓ ప్రకారం నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించని శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశ వైఖరికి నిరసగా సెక్యూరిటీ ఉద్యోగులు శనివారం సమ్మె నోటీసు అందజేశారు. జీతాలు అందక తాము పడుతున్న ఇబ్బందులను తెలియజేస్తూ రిమ్స్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రిమ్స్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఈ నోటీసు అందించారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఎమ్మెల్యే వరకు అందరికీ వినతిపత్రాలు అందించామని ఫలితం దక్కలేదని, చివరకు నాలుగు నెలలుగా జీతాలు నిలిపేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇస్తున్నామని తనుకు సంతోష్, రాంబిల్లి బండారి, ఐఎఫ్టీయూ జిల్లా ప్రదాన కార్యదర్శి దుర్గాసి గణేష్, మామిడి సూర్యనారాయణ తదితరులు పేర్కొన్నారు. యాజమాన్యం మొండితనమే సమ్మెకు కారణమన్నారు. 14 రోజుల్లో సమస్యలు పరిష్కరించి జీతాలు విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో అన్నెపు సూర్యనారాయణ, సతివాడ రాజేంద్రప్రసాద్, మిర్తిపాటి హైమారావు, దామోదర రవికుమార్ పాల్గొన్నారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గాయిత్రి ప్రతిభ
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్) కళాశాలకు చెందిన చల్లా గాయిత్రి రాష్ట్రస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించి శభాష్ అనిపించింది. బీఏ సెకెండియర్ చదువుతున్న గాయిత్రి ‘ఒలింపియాడ్ అసోసియేషన్ ‘తగరపువలస, రవి ప్రో ఫిట్నెస్ జోన్’ విశాఖపట్నంలో ఇటీవల నిర్వహించిన ఓపెన్ స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జూనియర్స్, సీనియర్స్ రెండు కేటగిరీల్లోనూ విజేతగా నిలిచింది. మంగళవారం కళాశాలకు చేరుకున్న గాయిత్రిని ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు అభినందించారు. క్రీడల్లో నైపుణ్యం ద్వారా ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయన్నారు. కార్యక్రమంలో కళాశాల పీడీ డాక్టర్ కె.మోహన్రాజ్, డాక్టర్ ఎస్.పద్మావతి, డాక్టర్ ఎన్.చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ఉల్లాసం
ఎచ్చెర్ల: క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని కాకినాడ, ఏయూ ప్రాంతీయ సంయుక్త సాంకేతిక విద్యా సంచాలకుడు జీవీ రామచంద్రరావు అన్నా రు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 28వ ఐపీఎస్జీఎం మహోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధిలో విద్య, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రాధాన్యతను వివరించారు. సాంకేతిక విద్యాశాఖ అకడమిక్స్ ఉప సంచాలకుడు బెహరా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐపీఎస్జీఎం నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవంలో ఎన్సీసీ క్యాడెట్ల పిరమిడ్ ప్రదర్శన, విద్యార్థుల శాసీ్త్రయ నృత్య ప్రదర్శనలు ప్రత్యే క ఆకర్షణగా నిలిచాయి. జిల్లాలోని తొమ్మిది కళాశాలల నుంచి మొత్తం 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తొలిరోజు కబడ్డీ, వాలీబాల్, ఖో–ఖో క్రీడ లు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అమదాలవలస ప్రిన్సిపాల్ డా.బి.జానకిరామయ్య, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రిన్సిపాల్ విక్టర్పాల్, సీతంపే ట జీఎంఆర్పీ ఓఎస్డీ బీవీఎస్ఎన్ మూర్తి, ప్రభు త్వ పాలిటెక్నిక్ కళావాల టెక్కలి ఓఎస్డీ డి.సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ● పీజీఆర్ఎస్కు 193 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలను ప్రాధాన్యత క్రమంలో సత్వరమే పరిష్క రించి బాధితులకు న్యాయం చేయాలని జేసీ ఫర్మా న్ అహ్మద్ఖాన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన గ్రీవెన్స్లో పాల్గొని అర్జీదారుల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. సోమ వారం సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా జిల్లావ్యాప్తంగా మొత్తం 193 ఫిర్యాదు లు నమోదయ్యాయి. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించకుండా, సంబంధిత శాఖాధికారులు ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని ఆదేశించా రు. కార్యక్రంలో డీఆర్వో ఎస్వీ లక్ష్మణమూర్తి, ప్రత్యేకాధికారి వేంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదులను పరిశీలిస్తే... ●నందిగాం మండలంలోని హరిదాసుపురంలో అనర్హురాలైన రమాదేవికి ఆశ కార్యకర్తగా అధికారులు నియమించారని, దీనిపై చర్యలు తీసుకోవా లని గ్రామానికి చెందిన అక్కూరు మీనా ఫిర్యాదు చేశారు. ●శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెద్ద గనగళ్లవానిపేట పంచాయతీ పరిధి పుక్కళ్లపేట, గాంధీ నగర్, చిన్న గనగళ్లపేట, ఖాజీపేట, నరసయ్యపేట తదితర గ్రామాలు కోతకు గురై ప్రమాదపుటంచున ఉన్నాయని, అందువలన నదీకోతకు గురవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ●పోలాకి మండలంలోని జొన్నం గ్రామానికి చెంది న గేదెల అప్పల నరసమ్మ తన పొలంలో అక్రమంగా రోడ్డు నిర్మాణం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిర్మాణాన్ని ఆపి తనకు న్యాయం చేయాలని కోరారు. అడ్డగోలు పనులు చేస్తున్నారు ఆమదాలవలస నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ కార్యకర్తల సిఫార్సుల మేరకు అధికారులు అడ్డగోలు పనులు చేస్తున్నారని ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. ఆమదాలవలస మండలం నెల్లిపర్తి పంచాయతీ సర్పంచ్ చెక్ పవర్ రాజకీయ కారణాలతో తొలగించడం జరిగిందని, చెక్కు పునరుద్ధరించాల ని కోరారు. అలాగే సరుబుజ్జిలి మండలం కూనజమునిపేటలో పంచాయతీ తీర్మానం లేకుండా అంగన్వాడీ కేంద్రం నిర్మాణాలు జరుపుతుండడంతో చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన ఇద్దరు క్యాన్సర్ పేషెంట్లకు కొత్తగా ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్ మంజూరు చేయాలని విన్నవించారు. బూర్జ మండలం తిమడాం గ్రామానికి చెందిన ఉపాధి హామీ పనిచేసిన మహిళకు సాంకేతిక కారణాలతో పది వారాల వేతనం చెల్లించలేదని, వెంటనే చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నా రు. ఆయనతో పాటు నాయకులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, బెండి అప్పలనాయుడు, బద్రి రామారా వు, మనుకొండ వెంకటరమణ, కోవిలాపు చంద్రశేఖర్, సూర్య నారాయణ, వెంకట రమణ ఉన్నారు. -
బారులు తీరిన ధాన్యం ట్రాక్టర్లు
నందిగాం: పెద్దతామరాపల్లి జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై సోమవారం ధాన్యం లోడ్లతో ట్రాక్టర్లు బారులు తీరాయి. నందిగాం మండలంలో 11 రైస్మిల్లులు ఉండగా సోమవారం నాటికి కేవలం రెండు మిల్లులకు మాత్రమే బ్యాంకు గ్యారెంటీ లు ఉన్నాయి. దీంతో 22 రైతు సేవా కేంద్రాల పరిధిలోని రైతులంతా ఆ రెండు మిల్లులకు మాత్రమే ధాన్యం పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంటూరులోని వినాయక రైస్మిల్లు, పెద్దతామరాపల్లిలోని సాయి శ్రీనివాస రైస్ మిల్లులకు ట్రాక్టర్లు పోటెత్తడంతో అన్లోడింగ్కు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పెద్దతామరాపల్లి సర్వీస్ రోడ్డుపై బారులు తీరిన ట్రాక్టర్లు -
కానిస్టేబుల్స్కు క్రమశిక్షణ ఎంతో అవసరం
శ్రీకాకుళం రూరల్: పోలీసు కానిస్టేబుల్స్కు క్రమశిక్షణతో పాటు శారీరక ధృడత్వం, సాంకేతిక నైపుణ్య త, ప్రజలకు సేవచేసే గుణం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. తండేవలసలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఎంపికై న రాజమండ్రి, కృష్ణా జిల్లాలకు చెందిన 145 మంది కానిస్టేబుల్స్కు శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణ సమయంలో చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. పోలీస్ ఉద్యోగం గౌరవప్రదమైందని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా విధు లు నిర్వహించాలని సూచించారు. పోలీస్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాదని, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే ధ్వేయంగా పనిచేయాల న్నారు. శిక్షణ పొందుతున్న ట్రైనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఉద్యోగంలో సవాళ్లతో కూడిన ఒత్తిళ్లు వస్తాయని, మానవత్వాన్ని ఎప్పుడూ వదలకూడదని పేర్కొన్నారు. అదనపు ఎస్సీ, ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్ కేవీ రమణ మాట్లాడుతూ శిక్షణ సమయంలో శారీరక ధృడత్వం, మానసిక స్థైర్యం, వృత్తి నైపుణ్యాల అభివృద్ధి ఎంతో అవసరమన్నారు. సైబర్ నేరాలు ప్రస్తుత సమా జంలో సవాలుగా మారాయని, సాంకేతికను అంది పుచ్చుకొని అందుకు తగిన శిక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో క్రైమ్ ఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, శేషాద్రి, గోవిందరావు, ఏవో సీహెచ్ గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కార్మిక హక్కులను హరిస్తే సహించం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ప్రభుత్వాలు కార్మికుల హక్కులను హరిస్తే సహించేది లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ అన్నారు. ఏఐటీయూ సీ జిల్లా మహాసభల రెండో రోజు సోమవారం స్థాని క క్రాంతి భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనేక కార్మిక చట్టాలను పెద్ద ఎత్తున ఉద్య మాల చేసి సాధించుకున్నామన్నారు. అటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పని గంటల పెంపుదల అన్యాయమని ధ్వజమెత్తారు. చట్టాలు, హక్కులు పరిరక్షించుకోవడం కోసం పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా నూతన అధ్యక్ష, కార్యదర్శులు గా ముత్యాలరావు, టి.తిరుపతిరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు గౌరవాధ్యక్షులుగా సీహెచ్ గోవిందరావు, కె.అప్పలరాజు, డి.కిరణ్, పి. సత్యం, ఉపాధ్యక్షులుగా బి.శేషు, వై.సూర్యనారా యణ, బి.అప్పలరాజు, కె.శ్రీనివాస్లతో పాటు లబ్బ రాజు, పార్థసారధి, దుర్గారావు, ఎర్రయ్య, ఆర్.సూర్యనారాయణ, షేక్ భాను, సరిత, జగదీశ్వరి, వాసు, సురేష్, దుర్గాప్రసాద్, హైమావతి, గౌరీ శ్వర్, ప్రమీల, ఆదిలక్ష్మి, సావిత్రి, రామకృష్ణ తదితరులను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. -
బాధితులకు అండగా ఉండాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో బాధితులకు అండగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలిసి అక్టోబరు నెలలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం, ఉద్యోగ నియామకాలను సత్వరమే పూర్తి చేసి వారికి భరోసా కల్పించాలన్నారు. 2017 నుంచి 2025 వరకు జిల్లాలో నమోదైన 12 హత్య కేసుల్లో బాధిత కుటుంబ సభ్యుల విద్యార్హతల ఆధారంగా 12 మందికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. భూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో పలు కేసులు దర్యాప్తులో ఉన్నాయని, వాటిని వేగంగా పూర్తి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. కలెక్టర్ దృష్టికి సమస్యలు సమావేశంలో పలువురు సభ్యులు క్షేత్రస్థాయి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రిమ్స్ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో రోస్టర్ పద్ధతి పాటించాలని, అక్కడ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని కోరారు. సోంపేట మండలంలో ఎస్టీల భూ సమస్యలు, ఐటీడీఏ సీతంపేట బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, పాతపట్నం వసతి గృహాల్లో సౌకర్యాలపై ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా మందస, మెలియాపుట్టి మండలాల్లోని ఏకలవ్య పాఠశాల వసతి గృహాల్లో పారిశుధ్యం అధ్వాన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కిల్ డవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉపాధి కల్పించాలని, సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెల్స్కు రాయితీ ఇవ్వాలని విన్నవించారు. సమావేశంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, పలాస ఆర్డీవో వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు మధుసూదనరావు, డీఎస్పీలు వివేకానంద, లక్ష్మణరావు, కమిటీ సభ్యులు గేదెల రమణమూర్తి, దాసరి తిరుమలరావు మాదిగ, దండాసి రాంబాబు, తోట రాములు, కళింగపట్నం అప్పన్న, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి అనుకూలంగా పంచాయతీల పునర్విభజన
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో పలు పంచాయతీల పునర్విభజన అశాసీ్త్రయంగా జరుగుతోందని, టీడీపీకి అనుకూలంగా విభజన చేస్తున్నారని, దీనిపై పునరాలోచన చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక(పీజీఆర్ఎస్)లో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు వినతిపత్రం అందజేశారు. ప్రభు త్వం ఇటీవల పంచాయతీల విభజన చేసే ప్రక్రియలో భాగంగా కొత్తగా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అందు లో భాగంగా సారవకోట మండలంలో అలుదు, జలుమూరు మండలంలో అంధవరం, దరివాడ, పోలాకి మండలంలో బొద్దాం, నరసన్నపేట మండలంలో మడపాం, వి.ఎన్.పురం పంచాయతీల పరిధిలో గ్రామాలను వేరుచేసి కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. సర్పంచ్, కార్యవర్గ ఆమోదం, తీర్మానం లేకుండా కొందరు వ్యక్తులు సమర్పించిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం తగదన్నారు. పంచాయతీ, ప్రజామోదం మేరకే విభజన చేయాలని కోరారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, వాన గోపి, ముద్దాడ బైరాగి నాయుడు, కనపల శేఖర్రావు, రౌతు శంకరరావు, పైడి విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ మంత్రిని కలిసిన ఆర్.నారాయణమూర్తి
వజ్రపుకొత్తూరు రూరల్: విద్యా వ్యవస్థలో మాఫియా చేస్తున్న పేపర్ లీకేజ్తో విద్యార్థులకు జరగుతున్న అన్యాయాన్ని తెలియజేసే ‘యూనివర్శీటీ పేపర్ లీక్’ చిత్రం ప్రమోషన్స్లో భాగంగా పలాస–కాశీబుగ్గ మున్సిపాలీటిలో సోమవారం సినీ దర్శక నిర్మాత, నటుడు ఆర్.నారాయణమూర్తి పర్యటించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమా వీక్షించేందుకు ఆహ్వానం పలికారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు. శ్రీకాకుళం అర్బన్: ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు సైతం వెనుకాడేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక ప్రతినిధులు హెచ్చరించారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళంలోని దండివీధి వద్ద డీసీసీబీ బ్యాంక్ ఎదుట ఐక్యవేదిక ఆధ్వర్యంలో పీఏసీఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఏపీ పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గిరిబుచ్చి రంగనాధ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోలుగు మోహనరావు, బల్లెడ రామారావు తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే జనవరి 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి దత్తి సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు బొడ్డేపల్లి సన్యాసిరావు, కె.లక్ష్మీనారాయణ, వై.పాపినాయుడు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
లేకుంటే పొమ్ము!
ఇష్టముంటే అమ్ము..ధాన్యం కొనుగోలు విషయంలో టెక్కలి నియోజకవర్గంలో దళారీలు, మిల్లర్లు కలిసి రైతులకు నరకం చూపుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవడం లేదు. విత్తనాల నుంచి ధాన్యం అమ్మకాల వరకు ఇబ్బందులు పడుతున్నారు. మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని మంత్రికి, కలెక్టర్కు చెప్పినా పరిస్థితి మారడం లేదు. రైతుల నుంచి ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు. – సత్తారు సత్యం, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, టెక్కలి టెక్కలి: ‘సార్.. ధాన్యం పట్టుకుని మిల్లర్ వద్దకు వెళితే తేమశాతం, నూకలు, తరుగు పేరుతో ఒక్కో బస్తాకు అదనంగా 2 నుంచి 5 కిలోల ధాన్యం తీసుకుంటున్నారు. ఇదేంటని మిల్లర్ను ప్రశ్నిస్తే.. ఇష్టం ఉంటే ధాన్యం అమ్ము.. లేకపోతే తీసుకెళ్లిపో అంటూ కసురుకుంటున్నారు..’ అంటూ బాధిత రైతులు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వద్ద ఇటీవల వాపోయారు. అయినప్పటికీ టెక్కలి నియోజకవర్గం పరిధిలో పలు రైస్ మిల్లుల్లో ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్కలి మండలంలో ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లు చెప్పిందే వేదంగా మారుతోంది. మిల్లరు ఎంత మేరకు డిమాండ్ చేస్తే అంత ధాన్యం కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా అధికార యంత్రాంగం మాత్రం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి రైతులకు మేలు కలిగే చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. నిలిచిన బ్యాంకు గ్యారెంటీలు.. టెక్కలి మండలంలో 23 రైస్ మిల్లులకు సంబంధించి మొదటి విడత, రెండో విడత బ్యాంకు గ్యారెంటీ(బీజీ)లతో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. కొద్దిరోజుల క్రితం బీజీ టార్గెట్ పూర్తవడంతో, మూడో విడత బ్యాంకు గ్యారెంటీ విషయంలో మిల్లర్లు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం 7 రైస్ మిల్లులకు మాత్రమే బీజీలు ఉండడంతో కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. అయితే టెక్కలి మండలానికి సంబంధించి 24 వేల మెట్రిక్ టన్నుల మేరకు ధాన్యం కొనుగోలుకు లక్ష్యం కాగా ప్రస్తుతానికి 11 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, రైస్ మిల్లుల్లో మాత్రం లెక్కకు మించి ధాన్యం నిల్వలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బీజీలు లేకపోవడంతో దళారులు, మిల్లర్లదే రాజ్యంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. మొత్తమ్మీద కల్లం నుంచి ధాన్యం బస్తాలతో బయలుదేరుతున్న రైతులు ట్రాక్టర్, లోడింగ్ చార్జీలు, పంచాయతీ ఆశీల పన్ను, వే బ్రిడ్జి, గోనె సంచులు, బస్తాలు దించేందుకు చార్జీలు, మిల్లర్ల ఇబ్బందులు కారణంగా విలవిలలాడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో టెక్కలి నియోజకవర్గంలో మిల్లర్ల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు కొంత వాటాలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. మంత్రి సోదరుడు హరివరప్రసాద్ నేతృత్వంలో మిల్లర్లు ఏకమై రైతుల నుంచి దోపిడీ చేస్తున్నారు. అందుకే మిల్లర్లు ఏం చెప్పినా.. ఏం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు పూర్తిగా విఫలమయ్యారు. – పేరాడ తిలక్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, టెక్కలి -
సుందరం.. చరిత్రాత్మకం
టెక్కలి సెంటినరీ ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో 130 ఏళ్లుగా వినియోగిస్తున్న ప్రార్థన గంట క్రిస్మస్ ముందస్తు సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. క్రైస్తవ ఆరాధకులు ప్రార్థనలు, ఏసుక్రీస్తు గీతాలాపనలు, ర్యాలీలు, కేక్ కటింగ్తో సందడి చేస్తున్నా రు. అయితే ఈ ఉత్సాహం, సందడి మన జిల్లాలో ఇప్పటిది కాదు. వందేళ్ల కిందటి నుంచే సిక్కోలులో చర్చిలు ఏర్పాటయ్యా యి. అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. సిక్కోలులో చరిత్రాత్మక అంశాలతో కూడిన చర్చిల ప్రత్యేకతలను ఒకసారి పరిశీలిద్దామా.. టెక్కలి: డివిజన్ కేంద్రమైన టెక్కలిలోని అంబేడ్కర్ కూడలిలో ఆంధ్రాబాప్టిస్టు చర్చిలో 130 ఏళ్లుగా క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. 1889లో సంఘం స్థాపించినప్పటికీ 1905లో కెనడాకు చెందిన క్రిస్టియన్ మిషనరీష్ ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధి ఆర్చి బాల్డ్ ఆధ్వర్యంలో పాస్టర్ డబ్ల్యూ.హేగెన్స్ పర్యవేక్షణలో చర్చి నిర్మించారు. సుమారు 130 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రార్థన గంటను ఇప్పటికీ వినియోగిస్తున్నారు. క్రిస్మస్ స్పెషల్శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని ఆర్సీఎం సహాయ మాత చర్చి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే అతిపెద్ద ప్రార్థనా మందిరాల్లో ఒకటిగా గుర్తింపుపొందింది. బిషప్ రాయరాల విజయకుమార్, ఫాదర్ పాల్భూషణ్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. పది రోజుల ముందుగానే చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు మొదలయ్యాయి. శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని టౌనుహాలు రోడ్డులో పునీత తోమాసు దేవాలయం పేరిట ఉన్న సెయింట్ థామస్ చర్చిని రెండో పోప్ జాన్పాల్ నిర్మించారు. 1999లో పునరుద్ధరించిన ఈ చర్చిలో ఆరోగ్యమాత మందిరం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. వెయ్యి మంది ఒకేసారి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా పెద్ద హాలు ఇక్కడి ప్రత్యేకత. ప్రస్తుతం ఫాదర్ బోనెల రాజు ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారులో పురాతనమైన తెలుగు బాప్టిస్టు చర్చిలో పెద్ద పరిశుద్ద గ్రంథం(బైబిలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. భారీ తెలుగు అక్షరాలతో చదువుకునేందుకు వీలుగా గాజు బల్లపై అందుబాటులో ఉంచారు. ఏ–3 సైజుకన్నా పెద్దసైజులో బైడింగ్ చేసిన ఈ పుస్తకాన్ని బెంగళూరులోని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా తయారు చేసింది. రూ.5 వేలుతో కొనుగోలు చేసి ఇక్కడ ఉంచారు. 1832లో ఈస్టిండియా కంపెనీకి చెందిన మిస్టర్ బ్రట్ జేమ్స్ డాసన్ క్రీస్తు ప్రార్థనా మందిరంగా ఏర్పాటు చేశారు. 1846 సెప్టెంబరు 12న తెలుగు బాప్టిస్టు చర్చి పేరిట ప్రారంభించారు. -
ఉత్సాహంగా నెట్బాల్ ఎంపికలు
టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి నెట్బాల్ ఎంపికలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ టి.గోవిందమ్మ, అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు తదితరులు ఈ ఎంపికలను ప్రారంభించారు. మహిళలు, పురుషుల విభాగంలో 12 మంది చొప్పున క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈనెల 27న తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఈ జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎంపికల్లో కె.రఘనాథరావు, కేకే రామిరెడ్డి, తిరుపతిరావు, బసవరాజు, జగదీష్, శైలజ, ప్రశాంతి, జానకి, శ్యామలరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలాకి: మండల కేంద్రం పోలాకిలో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నరసన్నపేట నుంచి పోలాకి వైపు వస్తున్న ఆటో రుంకు జగన్నాథపురం జంక్షన్ వద్దకు వచ్చేసరికి, ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డుపక్కనే పున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆటోలో ఉన్న పల్లిపేటకు చెందిన ఒక యువకుడు, వెదుళ్లవలసకు చెందిన వృద్ధురాలికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో నరసన్నపేట ఆస్పత్రికి తరలించారు. హెచ్సీ రామ్జీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పొందూరు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని సనాతన హిందూ ధర్మ ప్రచారకులు, ప్రవచన శిరోమణి చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మండలంలోని కృష్ణాపురం ఆనందాశ్రమంలో సోమవారం ప్రవచనాలు చెప్పారు. హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని కోరారు. తల్లి, తండ్రి, గురువును గౌరవించినప్పుడు ఆరోగ్యకరమైన సమాజ స్థాపన జరుగుతుందన్నారు. కార్యక్రమానికి పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. పలువురు స్వామీజీలు పాల్గొన్నారు. శ్రీకాకుళం అర్బన్: జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శ్రీకాకుళం చాప్టర్ నూతన చైర్మన్గా వాటర్ రిసోర్స్ క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ డోల తిరుమలరావు, కార్యదర్శిగా ఐతం కళాశాల ప్రొఫెసర్ జి.నాగేశ్వరరావులు ఎన్నికయ్యారు. శ్రీకాకుళంలోని హోటల్ గ్రాండ్లో ప్రస్తుత చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. నూతన కార్యవర్గ ఎన్నిక పరిశీలకులు ముని శ్రీనివాస్, చింతాడ రాజశేఖర్ పర్యవేక్షణలో నూతన కమిటీలో 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి అభినందనలు తెలిపారు. నూతన చైర్మన్ డోల తిరుమలరావు మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ శ్రీకాకుళం చాప్టర్ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎస్.నాగరాజు, హారికాప్రసాద్, వి.పాపారావు, సీహెచ్ రమేష్, బి.సంతోష్కుమార్, హెచ్.మన్మథరావు, కె.శ్రీనివాస రావు, డాక్టర్ సౌజన్యవాణి, డాక్టర్ బి.భరత్భూషణ్, ఎల్.సాయిశంకర్ దీక్షిత్, ఎస్.రుషి, ఎస్.హరీష్కుమార్, వెంకటరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి జూనియర్ ఫెన్సింగ్ ఎంపిక పోటీలు సోమవారం ఉత్సాహంగా సాగాయి. జిల్లా ఫెర్సింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ పోటీలకు 13 నుంచి 19 ఏళ్ల బాలబాలికలు హాజరయ్యారు. ముందుగా ఈ ఎంపికలను ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలభద్రుని రాజా, అసోసియేషన్ ప్రతినిధులు వైశ్యరాజు మోహన్, ఎం.సుధీర్ వర్మ ప్రారంభించారు. ఎన్ఐ ఎస్ కోచ్ జోగిపాటి వంశీ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఎంపికై న వారు ఈ నెల 26, 27 తేదీల్లో విజయవాడలో జరగనున్న రాష్టపోటీలకు పంపిస్తామని రాజా పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ, పీఈటీలు, కోచ్లు డి.భవానీ, అనిత శ్రీ, యశోద, రాహుల్, హేమంత్ రెడ్డి పాల్గొన్నారు. -
ఇదేం పద్ధతి..?
బీసీ వసతి గృహానికి సమీపంలో ఉన్న వైన్షాపు శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని సింగుపురంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహం ఎదురుగా ఒక సిమెంట్ రోడ్డుకు ఆనుకొని ఎకై ్సజ్ అధికారులు కొద్ది నెలలు క్రితం వైన్షాపును ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలకు పక్కనే ఉన్న సింగుపురం ప్రాథమిక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సాయంత్రం 4.30 గంటల తర్వాత స్కూల్ విడిచిపెట్టగానే హాస్టల్కు చేరుకుంటారు. అయితే ఆ సమయంలో వైన్షాపునకు వచ్చే వాహనాలు, మందుబాబులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్ గేటును అనుసరించి వాహనాల రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. దీంతో స్టడీ అవర్, రాత్రులు చదివే సమయంలో ఏకాగ్రత సాధించలేకపోతున్నామని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ మెయిన్ గేటు, వైన్షాపునకు మధ్య కేవలం ఒక సిమెంట్ రోడ్డు మాత్రమే ఉంది. నేరుగా గేటు నుంచి విద్యార్థులకు వైన్షాపు కనిపిస్తోంది. రాత్రి 10 గంటల వరకూ వైన్షాపుతో పాటు దాన్ని ఆనుకొని ఉన్న చిల్లర బడ్డీలు మందుబాబులతో నిండిపోతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సింగుపురం గ్రామ నడిబొడ్డున వైన్షాపును ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు, బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామానికి దూరంలో షాపు ఏర్పాటు చేయాలని అప్పట్లో ఎకై ్సజ్ అధికారులకు ప్రతిపాదనలు పెట్టినా పట్టించుకోలే దు. ఇప్పటికై నా బీసీ హాస్టల్కు ఎదురుగా ఉన్న వైన్షాపును తరలించే చర్యలు తీసుకోవాలి. – ఆదిత్యనాయుడు, సర్పంచ్, సింగుపురం సింగుపురంలోని వైన్షాపును అన్ని నిబంధనలతో ఏర్పాటు చేశాం. దీనివలన ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్కూల్స్కు దగ్గర్లో వైన్షాపు ఉండకూడదు. కానీ హాస్టల్ ఎదురుగా ఉన్నా పర్వాలేదు. – ఎస్.గోపాలకృష్ణ, ఎకై ్సజ్ సీఐ -
శ్రీకాకుళం
మంగళవారం శ్రీ 23 శ్రీ డిసెంబర్ శ్రీ 2025సింగుపురంలో హాస్టల్కు కూతవేటు దూరంలో వైన్షాపు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో కాంట్రాక్టర్లకు సంబంధించి గత అనుభవంతో పనిలేదు. ఎంత బాగా పనిచేసిందన్నది అక్కర్లేదు. సంస్థకు అర్హత ఉందా అన్నది అవసరం లేదు. విచిత్ర షరతులతో టెండర్లు పిలవడం, అనుకున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడం సర్వసాధారణంగా మారింది. ఇందుకు ఎవరైనా అడ్డు తగిలితే వారిని ఏదో ఒక విధంగా పక్కన పెట్టడం మామూలైపోయింది. జిల్లాలో ఎవరు పనిచేయాలో అధికార పార్టీ నేతలే డిసైడ్ చేస్తున్నారు. దానికోసం ముందుగానే పర్సంటేజీల ఒప్పందం చేసుకుంటున్నారు. 20, 30, 40 శాతం అంటూ ముడుపుల ఆట ఆడుతున్నారు. మొత్తానికి పీఎం అభిమ్ స్కీమ్ కింద మంజూరైన హెల్త్ సెంటర్లు కీలక నేతలకు కాసులు కురిపిస్తున్నాయి. అస్మదీయులూ..సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం నిధులతో చేపట్టే పనులపై అధికార పార్టీ కీలక నేతలు పెత్తనం చేస్తున్నారు. అస్మదీయులైన కాంట్రాక్టర్లకే టెండర్లు దక్కేలా చక్రం తిప్పుతున్నారు. తమకు కావాల్సిన వ్యక్తికి దక్కకపోతే ఏకంగా టెండర్లు రద్దు చేస్తున్నారు. సరిగ్గా డాక్యుమెంట్లు లేవని సాకులు చూపించి వాటికి మళ్లీ టెండర్లు పిలుస్తున్నారు. అస్మదీయులకు కట్టబెట్టేందుకు నిబంధనలకు పాతరేస్తున్నారు. తమ వారికి తప్ప మిగిలిన ఏ కాంట్రాక్టర్లకు పనులు దక్కకుండా టెండర్లాట ఆడుతున్నారు. నేతలదే పెత్తనం.. ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్(పీఎం అభిమ్) కింద జిల్లాలో 31 హెల్త్ క్లీనిక్ బిల్డింగ్స్కు టెండర్లు పిలిచారు. ఒక్కొక్క భవన నిర్మాణం విలువ రూ.48 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ఉంది. పంచాయతీరాజ్ ఎస్ఈ ఆఫీస్ పరిధిలో టెండర్లు పిలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా టెండర్ల విషయంలో నేతల పెత్తనం పెరిగిపోయింది. నియోజకవర్గ కీలక నేతల దిశా నిర్దేశం తప్పనిసరిగా మారింది. వారి సూచనల మేరకే కాంట్రాక్ట్ సంస్థ ఏదన్నది ఫైనలయ్యే పరిస్థితి ఏర్పడింది. కావాల్సిన వారికే కాంట్రాక్ట్ దక్కేలా చూసేందుకు అనుకూల యంత్రాంగం ద్వారా పావులు కదుపుతున్నారు. నీకింత నాకింత అని ముందే ఒప్పందం చేసుకుని కాంట్రాక్టర్ను ఖరారు చేసే పరిస్థితి నెలకొంది. కానివారికి పొరపాటున టెండర్ వస్తుందనుకుంటే రద్దు చేసే దుస్థితి చోటు చేసుకుంది. ఒప్పందం ప్రకారమే.. పీఎం అభిమ్ కింద పిలిచిన టెండర్ల విషయంలో చాలా నియోజకవర్గాల్లో కీలక నేతలు చెప్పిన వాళ్లే టెండర్లలో షెడ్యూల్ దాఖలు చేస్తున్నారు. ముందు కీలక నేతలను కలుసుకుని, వారికివ్వాల్సింది ఇవ్వడం.. పర్సంటేజీ ఫిక్స్ చేసుకోవడం పూర్తయ్యాకే టెండర్లలో పాల్గొంటున్నారు. ముందే ఒప్పందాలు జరిగిపోవడంతో చాలా చోట్ల అనుకున్నట్లుగానే టెండర్లు ఖరారయ్యాయి. కొన్నిచోట్ల మాత్రం వేరే కాంట్రాక్టర్లు పాల్గొనడంతో సమస్య వచ్చింది. ఆమదాలవలస, పాతపట్నం నియోజకవర్గాలతో పాటు రణస్థలం, నందిగాంలో అధికార పార్టీ నేతలకు కావాల్సిన వారితో పాటు ఇతర కాంట్రాక్టర్లు షెడ్యూల్స్ దాఖలు చేశారు. వీరిలో అస్మదీయేతరులకు టెండర్లు ఖరారయ్యే పరిస్థితి ఉండటాన్ని గమనించిన అధికార పార్టీ నేతలు తమదైన శైలిలో యంత్రాంగంపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. డాక్యుమెంట్లు సరిగా లేవని సాకులు చూపించి టెండర్లను రద్దు చేయించేశారు. ఇప్పుడా వర్క్లకు మళ్లీ టెండర్లు పిలిచే పనిలో పడ్డారు. అయిన వారే టెండర్లలో పాల్గొనేలా పథక రచన చేస్తున్నారు. జొన్నవలస ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రవి -
కన్నుపడిందా.. గొలుసు గోవిందా!
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో 2024 ఏడాది నుంచి ఎనిమిది చోట్ల గొలుసు దొంగతనాలు, ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన ఒడిశా నేరస్థుడు ఎట్టకేలకు ఎచ్చెర్ల పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద తన కార్యాలయంలో సోమవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా భంజూనగర్కు చెందిన రావుల వినోద్ చెడువ్యసనాలకు బానిసై మొదట్లో సెల్ఫోన్లు దొంగిలించేవాడు. తర్వాత అస్కా ప్రాంతానికి చెందిన మేకల గణేష్తో కలిసి ద్విచక్రవాహనాలు, బంగారు గొలుసులు కొట్టేయడం మొదలెట్టాడు. ఈ క్రమంలోనే 2024 నుంచి మందస, రణస్థలంలో బైక్ చోరీలు, రణస్థలం, ఎచ్చెర్ల, నందిగాం, అనకాపల్లి జిల్లా కశింకోట పరిధిలో చైన్స్నాచింగ్ లకు పాల్పడ్డారు. గతేడాది జూన్ 16న ఎచ్చెర్ల గ్రామం రామ్నగర్ కళ్లాల వద్దకు పేడను పారబోసి తిరిగి ఇంటికి వస్తున్న నేతింటి సూరమ్మ అనే మహి ళ పుస్తెల తాడు తెంచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. సీఐ ఎం.అవతారం, అప్పటి ఎస్ఐ సందీప్లు దర్యాప్తు మొదలుపెట్టారు. కడప గోల్డ్షాపులోనూ చోరీ.. ప్రస్తుత ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు తన టీమ్తో కలిసి పాతనేరస్థుల కదలికలపై నిఘా పెట్టి ఫింగర్ ప్రింట్, ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు.చిలకపాలెం వద్ద సోమవారం నిందితు డిని అరెస్టు చేశారు. సీఐ సమక్షంలో విచారించగా కడప బద్వేలులో శ్రీరామ్, పోతురాజు, మౌలాలీ అను స్నేహితులతో కలిసి రాత్రిపూట గోల్డ్షాపు మూసేస్తున్న సమయంలో యజమాని వద్ద నుంచి రెండు బ్యాగులు లాక్కొని పారిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇతర నేరాలు చేసినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడి నుంచి ఐదు తులా ల బంగారం, బైక్ స్వాధీనం చేసుకున్నారు. మరో స్కూటీని రికవరీ చేయాల్సి ఉందని, వినోద్కు సహకరించిన మేకల గణేష్ను అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ వివరించారు. కేసును ఛేదించిన సీఐ ఎం.అవతారం, ఎస్ఐ లక్ష్మణరావు, హెచ్సీ రమణయ్య, పీసీలు రవికుమార్, శంకర్, దివాకర్, హేమంత్కుమార్లను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
గరం గరంగా హైటీ!
● పాస్టర్ల మధ్య గొడవ పెట్టిన తొలి ఎమ్మెల్యే మీరే! ● క్రిస్మస్ హైటీలో గొండు శంకర్పై ఓ పాస్టర్ సంచలనం వ్యాఖ్యలు శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కళావేదికలో సోమవారం నిర్వహించిన హైటీ–2025 (క్రిస్మస్ సంబరాలు) వేడుక వివాదానికి వేదికగా మారింది. తెలుగు బాప్టిస్టు సంఘంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు గందరగోళానికి దారితీశాయి. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ వర్గం ప్రతినిధులు వేదిక బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ వచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పగా.. పార్టీ ప్రమేయంతో కార్యక్రమం నిర్వహించడం సరికాదని పలువురు నిలదీశారు. ‘పాస్టర్ల మధ్య గొడవ పెట్టిన తొలి ఎమ్మెల్యే మీరేనని’ ఎమ్మెల్యేని ఉద్దేశించి ఓ పాస్టర్ అనడంతో ఆయన అవాక్కయ్యారు. తమ మధ్య గొడవలు పెట్టారని పాస్టర్లంతా ఎమ్మెల్యేను తప్పుపట్టారు. వేదిక పైన తమకు స్థానం ఇవ్వకుండా చేశారని, సొంత పార్టీ వ్యక్తులే ఇలా చేయడం సరికాదని, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతామని చెప్పారు. అనంతరం ఇరువర్గాల ప్రతినిధులను వేదికపైకి పిలవడంతో గొడవ సద్దుమణిగింది. మరోవైపు, గతంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో జనాలు రాలేదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పిలుపు మేరకు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పాస్టర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారంతా బయకు వెళ్లిపోయారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేశారు. -
గంజాయితో యువకుడు అరెస్టు
నరసన్నపేట: ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి అక్రమంగా తరలిస్తున్న పూస దేవిచంద్ అనే వ్యక్తిని నరసన్నపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశా రు. అతడి వద్ద నుంచి 2.180 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు తెలిపారు. మడపాం టోల్గేట్ వద్ద ఎస్ఐ శేఖరరావు ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపడుతుండగా.. ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సులో దేవీచంద్ అనుమానాస్పదం కనిపించడంతో పట్టుకొని ఆరా తీయగా గంజాయి గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇతడు గుంటూరు జిల్లా మంగళగిరి మండ లం పాతూరుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశా లోని జరగడగడ గ్రామానికి చెందిన సిమంచల్ సాహు వద్ద తక్కువ ధరకు గంజాయి కొని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. ఈయన వద్ద నుంచి సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. -
క్వారీ కార్మికుల ఆందోళన
కొత్తూరు: Ð]l$…yýl-ÌS…ÌZ° ÔZ¿ýæ-¯é-ç³#Æý‡… Mö…yýl Ð]l§ýlª °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² Æð‡…yýl$ MýS…MýSÆý‡ M>ÓÈÌS M>Ç-Ã-MýS$Ë$ Ý린 MýS ™èlçßæ-ïÜ-ÌêªÆŠ‡ M>Æ>Å-ÌSĶæ$… Ð]l¬…§ýl$ ÝùÐ]l$ÐéÆý‡… B…§øâýæ¯]l ^ólç³-sêtÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> ÐéÆý‡$ Ð]l*sêÏ-yýl$-™èl*.. Mö…™èl-Ð]l$…¨ ™èl糚yýl$ íœÆ>ŧýl$Ë$ ^ólĶæ$yýl… Ð]lÌS¯]l M>ÓÈË$ °Ë$-ç³#-§ýlÌS ^ólĶæ$-yýl…™ø, çÜ$Ð]l*Æý‡$ 100 MýS$r$…-»êË$ E´ë«¨ ÌôæMýS Ò«¨¯]l ç³yézĶæ$° Ð]lÅÐ]l-ÝëĶæ$ M>Ç-ÃMýS çÜ…çœ$… hÌêÏ M>Æý‡Å-§ýlÇØ íÜÆý‡Ï {ç³Ýë§Šæ, M>Ç-Ã-MýS$Ë$ í³.íÜ…à-^èl-ÌS…, í³. Æ>gôæ‹-Ù, BÆŠ‡.ÕÐ]l, ¼.çÜ$«§é-MýSÆý‡Æ>Ð]l#, »êÌSÆ>k ™èl¨ ™èl-Æý‡$Ë$ BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. çÜ$Ð]l*Æý‡$ 25 H â¶æ$ÏV> C§ól MŠS{Ðéీ ç³Ë$ Æý‡M>ÌS 糯]l$Ë$ ^ólçÜ*¢ E´ë«¨ ´÷…§ýl$-™èl$-¯é²-Ð]l$¯é²Æý‡$. A°² Æý‡M>ÌS A¯]l$-Ð]l$-™èl$-ÌS ™ø 25 çÜ…Ð]l-™èlÞÆ>ÌS ¯]l$…_ °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² M>ÓÈ ç³¯]l$-ÌSMýS$ Br…MýS… MýSÍ-W…-^èlyýl… çÜÇ-M>-§ýl¯é²Æý‡$. A«¨-M>-Æý‡$Ë$ çܵ…¨…_ Ð]l$Æý‡Ìê M>ÓÈ ç³¯]l$Ë$ ^ólç³-sôætÌê ^èlÆý‡ÅË$ ¡çÜ$-Mø-ÐéÌS° MøÆ>Æý‡$. D Ðól$Æý‡MýS$ ™èlçßæïÜ-ÌêªÆŠ‡ Ô>ÅÐŒl$ MýS$Ð]l*ÆŠ‡MýS$ ѯ]l†-ç³{™èl… A…§ýl-gôæ-Ô>Æý‡$. -
రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
వజ్రపుకొత్తూరు: పలాస జీఆర్పీ పరిధిలోని పూండి – పలాస రైల్వేస్టేషన్ల మధ్య సోమవారం జరిగిన రైలు ప్రమా దంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీ ఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలిపారు. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి గుర్తు తెలియని రైలు ప్రమాదంలో మృతి చెందిన ట్లు చెప్పారు. మృతుడి కుడి చేతిపై రాజు అనే పేరు తో ఉన్న లవ్ సింబల్, ఇత్తడి రింగ్ ఉందని చెప్పా రు. బ్లూ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లాక్ రంగు ప్యాంటు, తెలుపు రంగులోని కట్ బనియన్ వేసుకున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. ఎవరైనా గుర్తుపడితే తక్షణమే పలాస జీఆర్పీ పోలీసుల 94406 27567 నంబర్ను సంప్రదించాలని కోరారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో సిక్కోలు ఆటగాళ్లు దుమ్మురేపారు. కర్నూలు జిల్లా డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ వేదికగా ఈ నెల 19 నుంచి 21 వరకు జరిగిన ఏపీ రాష్ట్ర స్థాయి జూడో క్యాడెట్, జూనియర్స్ జూడో చాంపియన్షిప్–2025 పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు నాలుగు పతకాలతో పాటు ఓవరాల్ చాంపియన్షిప్ను కై వశం చేసుకున్నారు. కె.సౌమ్యరాణి, బి.అక్షయ బంగారు పతకాలు, కె.శివరామరాజు రజత పతకం, ఎస్.యశ్వంత్ ప్రసాద్ కాంస్య పతకం సాధించి సత్తాచాటారు. శాప్ జూడో కోచ్ పీఎస్ మణికుమార్ జిల్లా క్రీడాకారుల బృందం వెన్నెంటే ఉంటూ ప్రోత్సహంచారు. క్రీడాకారులను జిల్లా జూడో అసోసియేషన్ అధ్యక్షుడు పి.సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఎం.వి.రమణ, కార్య నిర్వాహక కార్యదర్శి పైడి సునీత, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, డీఎస్డీఓ ఏ.మహేష్బాబు, పీడీ–పీఈటీ సంఘ అద్యక్షుడు పి.తవిటయ్య, సలహదారు పి.సుందరరావు, ఎస్జీఎఫ్ కార్యదర్శి బీవీ రమణ, ఆర్.స్వాతి, కోచ్ మణికుమార్ అభినందించారు. -
మత్తుతో జీవితం చిత్తు
శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో జరుగుతున్న అభ్యుదయ సైకిల్ యాత్ర వచ్చే నెల 3 వరకు పొడిగిస్తున్నట్లు విశాఖ రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి, ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డిలు శనివారం సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29తో ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరగాల్సివుండగా, జనాదారణ పెరగడంతో యాత్ర పొడిగించామని, వచ్చే నెల 3న ఇచ్ఛాపురంలో ముగింపు సభ జరుగుతుందని వెల్లడించారు. టెక్కలి: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా స్థాయి నెట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు పి.వైకుంఠరావు, బి.నారాయణరావు శనివారం తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 27న తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. -
సంప్రదాయాలను కాపాడదాం
శ్రీకాకుళం రూరల్ : కళలను బతికించి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందామని పద్మభూషణ్ అవార్డు గ్రహీత వరప్రసాద్రెడ్డి పిలుపునిచ్చారు. కల్లేపల్లి గ్రామంలోని సంప్రదాయ గురుకులంలో శనివారం అర్ధనారీశ్వర నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళల పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ దేశ విదేశాల్లో మన సంస్కృతి సంప్రదాయ నృత్యాలకు మంచి ప్రాధాన్యత ఉందన్నారు. రానున్న రథసప్తమికి టూరిజం తరఫున జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్లు మాట్లాడుతూ కళలకు కులం, జాతీ ఏదీ అడ్డురాదన్నారు. అనంతరం వరప్రసాద్రెడ్డి సంప్రదాయ గురుకులం ట్రస్టుకు కలెక్టర్ చేతుల మీదుగా రూ.50 లక్షలు అందించారు. కార్యక్రమంలో సంప్రదాయం గురుకుల డైరెక్టర్ స్వాతి సోమనాథ్, తోటకూర ప్రసాద్, కళాసుధ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అతివకు ఆసరా
నా యుక్త వయస్సులోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని ఒంటరి మహిళగా మిగిలిపోయాను. పింఛన్ కోసం ఎంతో మందిని కలిసినా ఎవరూ దయ చూపించలేదు. మా గ్రామంలో సాయిలక్ష్మీ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలిగా ఉండటంతో జగనన్న ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆసరా నా జీవనానికి అండగా నిలబడింది. ఆ ఆసరానే నా జీవితానికి ‘పూల బాట’గా మారింది. మా గ్రామ దేవత ఆలయం చెంత పూల వ్యాపారం, దేవుని పూజా సామగ్రి కొట్టును పెట్టుకున్నాను. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష 50వేలు పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాను. జగనన్నే ఉండి ఉంటే నాకు ఇచ్చిన ఇంటి నిర్మాణం కూడా పూర్తయి ఉండేది. – సాడి మీనాక్షి, లొద్దపుట్టి జంక్షన్, ఇచ్ఛాపురం మండలం -
విద్యాభివృద్ధి
వైఎస్ జగన్ రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్ చేశారు నా పేరు డబ్బీరు హరీష్. మాది టెక్కలి. ఓ సాధారణ కుటుంబం. నాన్న విశాఖలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. అమ్మ ఇంటి వద్దనే టైలరింగ్ చేస్తుంటారు. 2022లో టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలో మెకానికల్ విభాగం సీటు సాధించాను. అప్పటికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇంజినీరింగ్లో అయితే చేరాను గానీ ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవి. కానీ వైఎస్ జగన్ హయాంలో ఐదు దఫాలుగా రూ. 76 వేలు ఫీజు రీయింబర్స్మెంట్ రూపంలో అందాయి. రెండేళ్లు చక్కగా చదువుకుని మూడో ఏడాదికి వచ్చేశాను. ప్రభుత్వం మారాక ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బు పడలేదు. ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నాను. మరో మూడు నెలల్లో చదువు పూర్తవుతుంది. ఇటీవల అప్పు చేసి మరీ రూ.46 వేలు ఫీజు కట్టాం. -
నువ్వే అన్నా!
నాయక రత్నం ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో ఫీడర్ అంబులెన్స్ లేకపోతే నాప్రాణాలు పోయేవి. నా బిడ్డతో ఈరోజు క్షేమంగా ఉన్నానంటే అది జగనన్న పెట్టిన భిక్షే. సరిగ్గా రెండున్నరేళ్ల కిందట డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రివేళ జోరువాన, ఎటూ కదల్లేని పరిస్థితిలో సైతం టెక్నీషియన్ మా గ్రామానికి వచ్చి ఫీడర్ అంబులెన్స్ ద్వారా మెళియాపుట్టి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. ప్రాణాపాయం తప్పి డెలివరీ జరిగింది. వైద్యులు ఎంతో చక్కగా వైద్యాన్ని అందించి నా ప్రాణాలు కాపాడారు. జగనన్నకు ధన్యవాదాలు. – గొందర లక్ష్మీ, కేరాసింగి గ్రామం. సంక్షేమ సంతకం -
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
శ్రీకాకుళం రూరల్: హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, బొల్లినేని మెడిస్కిల్ సంయుక్తంగా బ్యుటీషియన్, హోటల్ మేనేజ్మెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ (నర్సింగ్), ప్రొడక్షన్ మిషన్ ఆపరేటివ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం తెలిపారు. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ మేడపై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇంటర్, డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, పదో తరగతి పూర్తి చేసిన 18 నుంచి 28 ఏళ్ల వారు అర్హులని తెలిపారు. శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. పూర్తి వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. పలాస: రామకృష్ణాపురం వద్ద సత్యసాయి విద్యావిహార్లో ఇటీవల రూ.లక్షా 40వేలు విలువైన ఐరన్ పోల్స్ను దొంగిలించిన కేసులో గౌరీశంకర్, మోహనరావు, తాతారావు, ప్రకాశరావు అనే నలుగురిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ చెప్పారు. వీరిని కోర్టులో హాజరుపరచగా పాతపట్నం సబ్ జైలుకు తరలించినట్టు తెలిపారు. అరసవల్లి : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ నెల 14 నుంచి జిల్లావ్యాప్తంగా పొదుపు వారోత్సవాల పేరిట విద్యుత్ శాఖ పలు కార్యక్రమాలను ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. వివిధ పోటీల్లో విజేతలకు శనివారం ఎస్ఈ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో టెక్నికల్ ఈఈ సురేష్కుమార్, కమర్షియల్ ఏడీఈ రామ్మోహన్, డీ–1 ఏఈ జె.సురేష్కుమార్, డీ–2 ఏఈ కింజరాపు జయరాం పాల్గొన్నారు. ఎచ్చెర్ల : కుశాలపురంలోని శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలో సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నిక్ క్రీడా పోటీలు ఈ నెల 22 నుంచి మూడు రోజులపాటు జరుగుతాయని ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.నారాయణరావు తెలిపారు. ఈ మేరకు శనివారం కళాశాలలో పోస్టర్ ఆవిష్కరించారు. తొమ్మిది కళాశాలల నుంచి సుమారు 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానాచార్యులు బి.జానకిరామయ్య, విక్టర్పాల్, అధ్యాపకులు దామోదరరావు, డి.మురళీకృష్ణ, ఇన్చార్జ్ పీడీ ఎస్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్: మునసబుపేట గాయత్రీ కళాశాల సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంతబొ మ్మాళి మండలం బలరాంపురం గ్రామానికి చెందిన కమిలి భాస్కరరావు(60), అనపాన గణేష్ ద్విచక్రవాహనంపై కోటబొమ్మాళి నుంచి శ్రీకాకుళం వెళ్లారు. తిరుగు ప్రయాణంలో గాయత్రీ కళాశాల సమీపంలో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక కూర్చున్న భాస్కరరావు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేష్ పరిస్థితి విషమంగా ఉంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేవుడి కంటే ముందు గుర్తొచ్చేది జగనే
ఈ రోజు నేను ఇలా మా కుటుంబంతో ఆనందంగా జీవించి ఉన్నానంటే వైఎస్ జగన్ చేసి న మేలే అందుకు కారణం. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందించి నన్ను బతికించా రు. మాది పోలాకి మండలం పాలవలస గ్రామం. నా భర్త జోగారావుతో కలిసి కౌలుకు భూమి తీసుకుని సాగు చేసుకుంటున్నాను. మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఉన్నంతలో ఆనందంగా ఉండే మాపై ఎవరి దిష్టి పడిందో గానీ, మాయదారి రోగం నన్ను అనారోగ్యం పాలుచేసింది. తొలుత ఆస్పత్రుల్లో డాక్టర్లకు చూపించిన తర్వాత పెద్ద జబ్బు అని చెప్పారు. ఏం చేయాలో నాకు తెలీలేదు. చేతిలో డబ్బుల్లేవు. పెద్దాస్పత్రికి వెళ్లలేను. అలాంటి టైములో నా పెద్ద కొడుకు ఆరోగ్యశ్రీ గురించి చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లి మా వివరాలు ఇచ్చిన వెంటనే నాకు పూర్తి ఉచితంగా చికిత్స చేశారు. దాదాపు నెలరోజుల తరువాత పూర్తిగా వ్యాధి నయమైందని డాక్టర్లు మాకు చెప్పినపుడు దేవుడి కంటే ముందు జగన్ మాకు గుర్తొచ్చాడు. లక్షల్లో ఖర్చు అయ్యే ఇలాంటి వైద్యం మాలాంటి కుటుంబాలకు సాధ్యం కాని పని. మాలాంటి అనేకమంది దీవెనలు ఉన్నంతవరకు జగన్కు అంతా మంచే జరుగుతుంది. మాఅందరి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి. – రాజులమ్మఆరోగ్యశ్రీ -
శ్రీకాకుళం
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ఎక్కడో హిరమండలం నుంచి ఇచ్ఛాపురం వాకిట వరకు ప్రవహించిన వంశ‘ధార’కు కారణమతడు. ఉద్దానం నుదుటిపై అసమర్థ నాయకులు రాసిన అర్ధాయుష్షు రాతను సమూలంగా మార్చిన నాయకుడతడు. సిక్కోలు గుండెలోని వెనుకబాటు వేదనను అర్థం చేసుకున్న తొలి ప్రజా ప్రతినిధి. దశాబ్దాల తరబడి ఏలిన వారి మాటలు వినడం, ప్రచారాలకు మురిసిపోవడమే తెలిసిన సిక్కోలుకు పనులు చేసి చూపించిన సమర్థుడు. వలసలే బతుకుదెరువుగా మారిన ఈ జిల్లా మంచి కోసం ఆలోచించిన అరుదైన మనిషి. వైఎస్ జగన్ పాలనలో సిక్కోలు గతమెన్నడూ చూడని ప్రగతిని చూసింది. అందుకు సాక్ష్యాలివే.. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళందశాబ్దాలుగా చావుకు అలవాటుపడిపోయిన ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం వైఎస్ జగన్ పలాసలో కిడ్నీ ఆస్పత్రి కట్టించారు. ఈ ఆస్పత్రి వచ్చాకే కిడ్నీ రోగులు ఊపిరి పీ ల్చుకున్నారు. ఈ ఆస్పత్రి మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతోంది. వైఎస్ జగన్ నిర్మించిన వైఎస్సార్ సుజలధార స్రవంతి పథకం ద్వారా స్వచ్ఛమైన తాగు నీరు అందుతోంది. నేను ఏడాది కాలంగా కిడ్నీ వ్యాధితో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. ముందుగా ఆరోగ్యం బాగులేకపోవడంతో విశాఖపట్నంలోని ఎన్.ఆర్.ఐ ఆస్పత్రికి వెళ్లాను. అక్కడ చా లా డబ్బులు ఖర్చయ్యాయి. వారు కిడ్నీ వ్యాధి ఉందని చెప్పగా అక్కడ నుంచి పలాస కిడ్నీ ఆస్పత్రికి వచ్చి అందులో చేరాను. జగనన్న ప్రభు త్వం హయాంలో 5 పాయింట్లు ఉంటే పింఛన్ ఇచ్చి ఆదుకున్నారు. ఇలాంటి ఆస్పత్రి కట్టిన జగనన్న నిజంగా దేవుడు. జగనన్నకు ధన్యవాదాలు. – అంబటి రామకృష్ణ, కిడ్నీ రోగి, డోకులపాడు, వజ్రపుకొత్తూరు -
కొత్త టీచర్లకు జీతాలు చెల్లింపు
శ్రీకాకుళం: సంతబొమ్మాళి మండలంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్సీ–25 ఉపాధ్యాయులకు ఎట్టకేలకు జీతాలు మంజూరయ్యాయి. ‘వీరు చేసిన పాపమేమిటో’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. బిల్లులో తప్పులు ఉండడంతో వాటిని సరిచేసి పంపించాలని ఎంఈఓకు టెక్కలి ఖజానా శాఖ అధికారులు సూచించారు. బిల్లులు సరిచేసి దాఖలు చేయడంతో మూడు నెలలకు సంబంధించిన జీతాలు మంజూరయ్యాయి. సర్పంచ్గా ఉంటూ ఉద్యోగానికి ఎంపిక కావడంతో సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల ఒక అభ్యర్థికి సంబంధించిన బిల్లు మాత్రం పెండింగ్లో ఉంది. అది కూడా ఒకటి రెండు రోజుల్లో క్లియర్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. -
అగ్నివీర్కు ఎన్సీసీ క్యాడెట్లు
● రికార్డు స్థాయిలో 25 మంది ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఇటీవల జరిగిన అగ్నివీర్ ఎంపికల్లో.. అదే కళాశాలలో చదువుతున్న 14వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ క్యాడెట్లు రికార్డు స్థాయిలో 25 మంది ఎంపికయ్యారు. 2025 ఢిల్లీలో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న తరుణ్, కల్యాణ్తో పాటు అనేకమంది ఎన్సీసీ–బీ సర్టిఫికెట్లు అర్హతలు పొందిన విద్యార్థులు అగ్నివీర్కు ఎంపికై నవారిలో ఉన్నారు. దీంతో వీరిని కళాశాలలో ఎన్సీసీ అధికారి కెప్టెన్ యాళ్ల పోలినాయుడు శుక్రవారం కళాశాలలో అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): సరుబుజ్జిలి మండలంలోని ఒక గ్రామానికి చెందిన 7వ తరగతి చదువుతున్న దళిత బాలికపై లైంగిక దాడి చేసిన ఆటో డ్రైవర్ గేదెల సుధాపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసు నమోదు చేసి మూడు రోజులు అవుతున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాల పెరుగుతున్నా పోలీసులు నిమ్మకునీరెత్తనట్లు ఉంటున్నారని ధ్వజమెత్తారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో దళిత సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు రాకోటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
● డ్రగ్స్ వద్దు బ్రో..!
గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడకండి.. వీటి బారిన పడి మీ అందమైన భవిష్యత్తును అంధకారం చేసుకోకండి.. డ్రగ్స్ వద్దు బ్రో..అంటూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నరసన్నపేటలో శుక్రవారం అభ్యుదయ యాత్ర చేపట్టారు. డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి యువతలో చైతన్యం తీసుకురావడానికి సత్యవరం కూడలి నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకూ భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేశారు. టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఈగల్ క్లబ్ ఇన్చార్జి సీఐ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. – నరసన్నపేట -
రైతులను మోసగిస్తే చర్యలు
ఆమదాలవలస: రైతులను దోచుకోవాలని చూస్తే చర్యలు తప్పవని శ్రీకాకుళం ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమదాలవలసలోని రాష్ట్ర గిడ్డంగుల కార్యాలయంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిల్లర్ల తప్పుడు విధానాలు అనుసరిస్తున్నారని రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపడుతున్నామన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని అందిస్తున్నా కొందరు మిల్లర్లు ఎఫ్సీఐకి పంపే బియ్యంలో నూక శాతం ఎక్కువగా వస్తోందని చెబుతూ గిడ్డంగులకు తీసుకువచ్చిన బియ్యం లారీల లోడింగ్–అన్లోడింగ్ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు గుర్తించారు. మిల్లర్లు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు మిల్లుల వద్ద రోజుల తరబడి గడపాల్సి వస్తోందన్నారు. తనిఖీల్లో తహసీల్దార్ ఎస్.రాంబాబు, వ్యవసాయాధికారి మెట్ట మోహనరావు, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
అబ్బురపరిచిన.. వైజ్ఞానిక ప్రదర్శన
● సైన్స్ ఎగ్జిబిషన్లో 310 ప్రాజెక్టుల ప్రదర్శన ● రాష్ట్రస్థాయికి 11 ప్రాజెక్టుల ఎంపిక శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని గురజాడ విద్యాసంస్థల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. దీనిలో గ్రూప్ ప్రాజెక్టులతో పాటు వ్యక్తిగత, ఉపాధ్యాయ కేటగిరికు చెందిన 310 సైన్సు ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించారు. గ్రూప్ విభాగం నుంచి 7 ప్రాజెక్టులు, వ్యక్తిగత విభాగం నుంచి 2 ప్రాజెక్టులు, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండు సైన్సు ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబు ప్రారంభించిన కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి ఆర్.విజయ్కుమారి, పి.విలియన్స్, జిల్లా సైన్సు ప్రాజెక్టు అధికారి ఎన్.కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు ● ఇప్పిలి జెడ్పీహెచ్ స్కూల్కు చెందిన విద్యార్థులు ఐ.సంజన, అనిల్లు కలిసి మల్టీపర్పస్ అగ్రికల్చర్ (సూర్యశక్తి ద్వారా సోలార్ ప్యానల్లో విద్యుత్ సరఫరాపై) ప్రాజెక్టును వివరించారు. ● సంతబొమ్మాళి మండలానికి చెందిన ఎంజేపీ స్కూల్ విద్యార్థులు బి.నరేష్, ఎ.సుధ ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడిన వాటర్ ఎక్స్ట్రాక్టింగ్ విజనరీ హౌస్(మురుగునీటి పునర్వినియోగం)ను తయారు చేశారు. ● సోంపేటకు చెందిన జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు బి.యోగేశ్వరి, నిఖిత, విజయలక్ష్మిలు గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి న్యూ క్లియర్ పవర్ ప్లాంట్ను తయారు చేశారు. ● శ్రీకాకుళం గవర్నమెంట్ బాలికల స్కూల్కు చెందిన బి.హరిశ్రీ, తనుశ్రీ, బి.కృష్ణారావులు ఎమర్జింగ్ టెక్నాలజీతో యాంటీ సూసైడ్ ఫ్యాన్ను తయారు చేసి వివరించారు. ● పొందూరు గవర్నమెంట్ హైస్కూల్కు చెందిన విద్యార్థులు కేకే పృథ్వీరాజ్, కె.దిలీప్కుమార్, బి.రమణలు హెల్త్ అండ్ హైజనిక్పై ప్రాజెక్టు తయారు చేశారు. ● జి.సిగడాం జెడ్పీహెచ్ స్కూల్కు చెందిన కె.గోపి, ఎం.ఆనంద్రాజులు కలిసి ప్యూరిఫికేషన్ ఆఫ్ వేస్ట్ వాటర్పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు. ● సోంపేట ఏపీఎంఎస్ స్కూల్కు చెందిన విద్యార్థి కృష్ణవర్దన్ స్మార్ట్ సెన్సార్పై ప్రాజెక్టును తయారు చేశారు. ● టెక్కలి జెడ్పీహెచ్ పోలవరం స్కూల్కు చెందిన ఎన్.కౌషీ, కె.ఆచార్య కలిసి రియల్ టైమ్ విజిటర్స్ కౌంటర్ ప్రాజెక్టును తయారు చేశారు. ● టీచర్స్ ప్రాజెక్టుకు సంబంధించి లావేరు మండలంలోని అదపాక జెడ్పీహెచ్ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా పనిచేస్తున్న కె.కిరణ్కుమార్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ అప్లికేషన్పై ప్రాజెక్టు తయారు చేసి ప్రదర్శించారు. ● గార మండలంలోని వాడాడ జెడ్పీహెచ్ స్కూల్కి చెందిన సైన్స్ టీచర్ బి.వెంకట్రావు ఇన్నోవేట్ లోకాస్ట్ టీచింగ్ టూల్స్పై ప్రాజెక్టును వివరించారు. -
క్రాస్ కంట్రీ పోరుకు వేళాయె..!
● రేపు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ● కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఎంపికలు ● రాణిస్తే నేరుగా రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికశ్రీకాకుళం న్యూకాలనీ: క్రాస్ కంట్రీ ఎంపికల పోటీలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జరగనున్న జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ(దూరపు పరుగు) ఎంపిక పోటీలకు నిర్వాహకులు ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. సెలక్షన్ కమిటీని, టెక్నికల్ అఫీషియల్స్ను నియమించారు. శనివారం సాయంత్రం తుది మెరుగులు దిద్దనున్నారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 300 నుంచి 500 మంది అథ్లెట్లు పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ రాణించినవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. నాలుగు వయో విభాగాల్లో పోరు జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు మొత్తం నాలుగు వయో విభాగాల్లో జరగనున్నాయి. అండర్–16, 18, 20, సీనియర్స్ విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా నిర్వహించనున్నారు. అండర్–16 నుంచి అండర్–20 మధ్య మూడు వయో విభాగాలకు 2012 జనవరి 24 నుంచి 2006 జనవరి 25 మధ్య జన్మించినవారు అర్హులుగా నిర్ణయించారు. సీనియర్స్ పురుషులు, మహిళల విభాగానికి 2006 జనవరి 24వ తేదీలోపు జన్మించినవారు అర్హులని సెలక్షన్ కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. క్రీడాకారులు మరిన్ని వివరాల కోసం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కె.మాధవరావు(9441570361)ను సంప్రదించాలని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు(వాసు), అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, కార్యదర్శి మెంటాడ సాంబమూర్తిలు తెలిపారు. ఎంపికై తే రాష్ట్రస్థాయి పోటీలకు ఇక్కడ ఎంపికై న అథ్లెట్లను రాష్ట్రస్థాయి పోటీలకు సెలెక్ట్ చేయనున్నారు. కాకినాడ వేదికగా ఈనెల 24వ తేదీన జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్–2025 పోటీలకు పంపించనున్నారు. ఇక్కడ రాణించినవారిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాం. కేఆర్ స్టేడియంలో జరిగే ఎంపికలకు హాజరయ్యే బాలబాలికలు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఉదయం 8 గంటలకు గ్రౌండ్కు చేరుకోవాలి. – మెంటాడ సాంబమూర్తి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాస్ కంట్రీ అథ్లెట్స్కు ఇదొక గొప్ప అవకాశం. జిల్లాస్థాయి ఎంపికలను క్రీడాకారులంతా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ రాణించి రాష్ట్ర పోటీలకు ఎంపికవ్వాలి. అక్కడ రాణిస్తే జాతీయ పోటీలకు ఎంపిక కావచ్చు. – కొన్న మధుసూదనరావు, అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు -
రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను హరిస్తోందని, బీజేపీని సాగనంపితేనే దేశానికి భవిష్యత్ ఉంటుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. స్థానిక ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్లో సీపీఐ జిల్లా కార్యవర్గ, సమితి సమావేశాలను శుక్రవారం నిర్వహించారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.నారాయణ స్వామి అధ్యక్షతన నిర్వహించిన సమితి సమావేశంలో ప్రభాకర్ మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరమైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ఇటీవల జరిగిన ఇండిగో సంక్షోభమే నిదర్శనమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడమే కాకుండా, గాంధీ పేరును కూడా లేకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను మోదీ వద్ద తాకట్టు పెడుతోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేట్పరం చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు. ప్రజా సమస్యలపై మున్ముందు జరిగే పోరాటాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, సీపీఐ జిల్లా కార్యవర్గ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ అభివృద్ధి కోసం పనిచేస్తాం
సరుబుజ్జిలి: మండలంలోని పురుషోత్తపురం పంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించడం జరుగుతుందని వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. గ్రామంలో తన తండ్రి కిల్లి వెంకటప్పలనాయుడు పేరుమీదుగా నిర్మించిన పీహెచ్సీ ఆవరణలో ఏర్పాటు చేసిన తమ తల్లిదండ్రులు వెంకటప్పలనాయుడు, విశాలాక్ష్మి విగ్రహాలను శుక్రవారం ఆవిష్కరించారు. ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కిల్లి రామ్మోహనరావు, శ్రీరామ్మూర్తి, వెంకటరమణ, పంచాయితీ ఉప సర్పంచ్ పైడి నర్సింహప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈక్యూ ఫర్ పీస్తో బీఆర్ఏయూ ఎంవోయూ ఎచ్చెర్ల: ఆన్లైన్ క్లాసుల బోధనపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ కాలిఫోర్నియా(అమెరికా)లోని ఈక్యూ ఫర్ పీస్ అంతర్జాతీయ సంస్థతో శుక్రవారం ఎంవోయూ కుదుర్చుకుంది. బీఆర్ఏయూ వీసీ కేఆర్ రజనీ సమక్షంలో రిజిస్ట్రార్ అచార్య బి.అడ్డయ్య, ఈక్యూ ఫర్ పీస్ ఉపాధ్యక్షులు డా.చల్లా కష్ణానీర్, అభిషేక్లు సంతకాలు చేశారు. ఎంవోయూల వలన విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన అందుతుందన్నారు. మహిళ అదృశ్యం శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని చంపాగల్లివీధికి చెందిన ఒక మహిళ అదృశ్యమైనట్లు ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ శుక్రవారం వెల్లడించారు. కూరగాయలు కొనేందుకు పొట్టి శ్రీరాములు మార్కెట్కు తల్లితో వచ్చిన ఈమె, మతిస్థిమితం సరిగాలేక తప్పిపోయిందన్నారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
మనవాడైతే చాలు..
శ్రీకాకుళంజిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలకు రంగం సిద్ధమైంది. కోడిరామ్మూర్తి స్టేడియంలో పోటీలు జరగనున్నాయి. –8లోశనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025ముంపు ముప్పును తప్పించండి హిరమండలం: గొట్టా బ్యారేజీ సమీపంలో వంశధార చెంతనే ఉన్న తుంగతంపర గ్రామానికి చెందిన మహిళలు శుక్రవారం ఆందోళనకు దిగారు. కరకట్టలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏటా వర్షాకాలంలో గ్రామంలోకి వరద నీరు చొచ్చుకొస్తోందని, పంటలు ముంపుబారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గొట్టా బ్యారేజీకి ఎగువనున్న గట్టుకు గండిపడటంతో ముంపు సమస్య తప్పడం లేదని వాపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గండి పూడ్చడంతో పాటు నదీ తీరాన కరకట్ట నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని వంశధార అధికారులు తెలిపారు. మంచినీటి పథకాల పనులు పూర్తి చేయాలి అరసవల్లి: ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ శాఖకు చెందిన మంచినీటి పథకాల పనులు వెంటనే పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షించారు. 2019 నుంచి మంజూరైన పనుల ప్రగతిపై ఆరా తీశారు. ఎక్కడైనా నిధులుమంజూరై పనుల నిలిపివేత జరిగితే వాటి వివరాలను వెంటనే తనకు సమర్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ డి.సత్యనారాయణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, డీఈలు పాల్గొన్నారు. వాజ్పేయి విగ్రహావిష్కరణ శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం నగరంలో సూర్యమహాల్ జంక్షన్ వద్ద వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ వైద్య కళాశాలలను నిర్మించి, రాష్ట్రంలో డాక్టర్ల కొరత తీర్చవచ్చన్నారు. నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్యం ఉన్నప్పటికీ యాజమాన్య హక్కులు, సీట్ల కేటాయింపుపై పూర్తి నియంత్రణ ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఏపీ చీఫ్, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, ఎమ్మెల్యేలు ఎన్.ఈశ్వరరావు, కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, గౌతు శిరీష, మామిడి గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. వెనకొచ్చినా బిల్లు !ఈ ఫొటోలో ఉన్న రోడ్డు చూడండి. 2024 మార్చి 28న జిల్లా కేంద్రంలోని పీఎన్ కాలనీ మూడో లైన్లో రూ.10.93 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రహదారిది. దీని బిల్లు ఇంతవరకు చెల్లించలేదు. ఇదే కాలనీలో ఎనిమిదో లైన్లో రూ.13.05లక్షలతో 2024 డిసెంబర్ 21 రహదారి వేసారు. దానికి సంబంధించిన బిల్లు కూడా చెల్లింపులు చేయలేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం కార్పొరేషన్లో అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు వ్యవహారం విమర్శలకు తావిస్తోంది. ఏళ్ల తరబడి బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లను పట్టించుకోకుండా.. నేతల సిఫార్సులున్న వారికి అధికారులు పెద్దపీట వేస్తున్నారు. కీలక నేత పంపించే జాబితాలో ఉన్న వారికే చెల్లింపులు చేస్తున్నారు. ఆ జాబితాలో పేరు లేకపోతే పక్కన పెట్టేస్తున్నారు. దీంతో విసిగిపోయిన కాంట్రాక్టర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే వరకు వెళ్లారు. ఏ ప్రాతిపదికన బిల్లులు చెల్లిస్తున్నారో చెప్పాలంటూ సమాచార హక్కు చట్టాన్ని సైతం ఆశ్రయిస్తున్నారు. ఏంటీ దారుణం? టీడీపీ పాలనలో కొందరు కాంట్రాక్టర్ల దుస్థితి దారుణంగా తయారైంది. ఏళ్లు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మా బిల్లులు మాకివ్వండి మహాప్రభో అంటూ ప్రాధేయపడుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో సామాన్య కాంట్రాక్టర్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. చేసిన పనులకు బిల్లులు రాక అవస్థలు పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన నలుగురైదుగురు కాంట్రాక్టర్లకే బిల్లులు చెల్లింపులు జరుగుతున్నాయి. చెల్లింపుల విషయంలో అధికారులు సైతం డమ్మీలుగా మిగిలిపోతున్నారు. కీలక నేత చెప్పిన వాళ్లకే బిల్లులు చెల్లించి, మిగతా వారికి మొండిచేయి చూపిస్తున్నారు. నిబంధనలకు తూట్లు.. కార్పొరేషన్ పరిధిలో చాలా పనులకు చెల్లింపులు జరగలేదు. దాదాపు రూ.8 కోట్లకు సంబంధించి 200 వర్క్స్ వరకు బిల్లులు పెండింగ్లో ఉండిపోయాయి. వాస్తవానికి బిల్లులు చెల్లింపుల విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలు ఉన్నాయి. ముందుగా చేసిన పనికి ముందుగా చెల్లింపులు చేయాల్సి ఉంది. ఒకేసారి జరిగిన పనులకు ఒకేసారి చెల్లింపులు చేయాలి. కానీ, శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో నిబంధనలు పాటించకుండా, ప్రలోభాలకు, సిఫార్సులకు లోనై ఇష్టానుసారంగా బిల్లులు చెల్లిస్తున్నారు. అందరికీ ఒకే విధానం అమలు చేయడం లేదు. కావాల్సిన వారికి త్వరితగతిన చెక్ల ద్వారా చెల్లింపులు చేస్తుండగా.. కాని వారికి సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి వదిలేస్తున్నారు. సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసిన వాటికి సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. ప్రభుత్వ స్థాయిలో లాబీయింగ్ చేసుకున్న వాళ్లకే త్వరితగతిన నిధులు జమ అవుతాయి. ప్రస్తుతం శ్రీకాకుళం కార్పొరేషన్లో ఇదే జరుగుతోంది. అధికార పార్టీ కోటరీ.. శ్రీకాకుళం కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కోటరీ రాజ్యమేలుతోంది. అక్కడ ఏ పనులు చేపట్టాలన్నా.. ఏ బిల్లులు చెల్లించాలన్నా వారి చేతుల్లోనే ఉంటుంది. ఆ కోటరీ అంతా కీలక నేత కనుసన్నల్లో పనిచేస్తోంది. ఏదైనా వర్క్ చేస్తే దానికి 2 శాతం కమీషన్ తీసుకోవడం ఆనవాయితీ నడుస్తోంది. కానీ, ఇక్కడ 5 శాతం, 10 శాతం, 15 శాతం కూడా ఇచ్చుకోవాల్సిందే. ఆ మేరకు పర్సంటేజీ ఫిక్స్ చేసేశారు. ఇవన్నీ కీలక నేతకే చేరుతున్నాయి. ఆ స్థాయిలో ముడుపులిచ్చిన వాళ్లకే పనులు జరుగుతున్నాయి. ఆ ముడుపులు ఇచ్చిన వాళ్లు కూడా అస్మదీయులై ఉండాలి. ఆ స్థాయిలో ముడుపులు ఇవ్వడం గిట్టుబాటు కాదనుకుంటే బిల్లు మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం కార్పొరేషన్లో అదే జరుగుతోంది. ఈ విషయంలో అధికార యంత్రాంగం డమ్మీగా మారిపోయింది. శ్రీకాకుళం కార్పొరేషన్లో అడ్డగోలు బాగోతం కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో పక్షపాతం కీలక నేత కనుసన్నల్లో వివక్ష అత్యధిక పర్సంటేజీలకే అగ్రతాంబూలం ప్రేక్షక పాత్రకు పరిమితమైన అధికారులు కలెక్టర్కు ఫిర్యాదులు.. బిల్లుల చెల్లింపుల్లో వివక్షపై సంబంధిత కాంట్రాక్టర్లు కలెక్టర్కు ఫిర్యాదులు చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులను ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఫలితం లేకపోవడంతో కలెక్టర్ను ఆశ్రయించక తప్పడం లేదు. కొందరికి చెల్లింపులు చేసి, మరికొందరివి పెండింగ్లో పెట్టడంపై సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు చేసి కాంట్రాక్టర్లు వివరణ కోరుతున్నారు. ఏ ప్రాతిపదికన కొందరికి చెల్లింపులు చేశారు...ఏ ప్రాతిపదికన కొందరివి పెండింగ్లో పెట్టారో తెలియజేయాలని కోరుతున్నారు. అధికారులు ఇచ్చే వివరణ ఆధారంగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. పండగలా జగనన్న పుట్టిన రోజు వేడుకలు నరసన్నపేట: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పండగలా నిర్వహించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో.. ఇలా అన్ని చోట్లా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ, కార్యక్రమాలు ఎంతో విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ తరహాలోనే జగనన్న పుట్టిన రోజు వేడుకలు కూడా కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తు చేశారు. పార్టీ కుటుంబ సభ్యులందరూ ఏకమై వాడవాడలా హోర్డింగులు పెట్టాలని, కేక్కటింగ్లు, సంబరాలు జరపాలని, రక్త దాన శిబిరాలు నిర్వహించాలని, పేదలకు సాయమందించేలా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విచారణ
ఎచ్చెర్ల: రాజీవ్ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో శ్రీకాకుళం ప్రాంగణంలో విద్యార్థినులు తమపై వేధింపులు జరుగుతున్నాయని మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ (ఐసీసీ) ద్వారా విచారణ కొనసాగుతోంది. విద్యార్థులు మెయిల్ ద్వారా ఇచ్చిన ఫిర్యాదు అనంతరం ఇక్కడ ఐసీసీ కమిటీ వేసిన విషయం విదితమే. కమిటీ సభ్యులు ప్రొఫెసర్ శ్రావణికనకకుమారి, అడ్వకేట్ పద్మజ, హెచ్సీ సరితలు వి ద్యార్థినుల వసతి గృహాలకు వెళ్లి వేధింపులపై ఆరా తీశారు. డీఎంపై ఫిర్యాదుపై విచారణ శ్రీకాకుళం పాతబస్టాండ్: పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్, ఆ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై గురువారం విజయవాడ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ అధికారులు విచారణ చేపట్టారు. కానీ ఈ వ్యవహరాన్ని గోప్యంగా ఉంచారు. వాస్తవానికి జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగాల్సి ఉండగా విజయవాడ కా ర్పొరేషన్ అధికారులు కమిటీగా గోప్యంగా వచ్చి ఫిర్యాదుదారు పోలాకి మండలం సుస రాం గ్రామం శ్రీదుర్గా మోడరన్ రైస్ మిల్లు యజమాని తమ్మినేని భూషణరావుని పిలిపించి విచారణ చేశారు. ఈ వైఖరిపై చాలామంది మిల్లర్లు అనుమానం వ్యక్తం చేశారు. ఒక్కరినే విచారించడం, ఆ సమయంలో డీఎం సీఎస్ లేకపోవడం వంటివి అనుమానాలకు తావిస్తున్నాయి. కార్పొరేషన్ అధికారులు కాకుండా వేరే శాఖలోని ఉన్నతాధికారులతో విచారణ చేయిస్తే మిల్లర్లకు న్యాయం జరిగేదని వారంటున్నారు. కమిటీ కూడా ఫిర్యాదు వివరాలు రాతపూర్వకంగా అడిగినందుకు ఆయన మరో ఫిర్యాదు చేశారు. 2024లో తమ మిల్లుకు 32, 908 క్వింటాళ్ల టార్గెట్ ఇస్తే ఈఏడాది 12,990 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చారని, ఒక్కో మిల్లుకు ఒక్కోలా టార్గెట్ ఇచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై అధికారులకు విన్నవించినా చర్యలు లేవని, దీంతో 8వ తేదీన గ్రీవె న్స్లో ఫిర్యాదు చేశానన్నారు. టార్గెట్ పెంచాల ని కలెక్టర్ సివిల్ సప్లై డీఎంకు ఆదేశించినా అమలు చేయలేదన్నారు. ఈ నెల 15న కలెక్టర్ తనను పిలిపించి మాట్లాడారని తెలిపారు. అయినా తనకు ఇంతవరకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. ఒక రైస్మిల్లు నుంచి ఏసీకేకు రూ.2500 వరకు డీఎం తీసుకుంటున్నారని ఆరోపించారు. -
ఆచార్య సచ్చిదానందమూర్తి జీవితం స్ఫూర్తిదాయకం
● ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు ఎచ్చెర్ల: ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ఇచ్చిన సందేశాలు, చేసిన రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఒడిశా గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ‘ద రోల్ ఆఫ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ (ఐకేసీ) ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ రెలిజియన్ పెర్సిపెక్టివ్ ఆఫ్ కె.ఎస్ మూర్తి’ అనే అంశంపై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సెమినార్ గురువారం ప్రారంభించారు. క్యాంపస్లోని ప్రధాన పరిపాలనా భవనంలో కొత్త సచ్చిదానందమూర్తి అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రా రంభ సమావేశానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరై ప్రసంగించారు. 2020 నూతన విద్యా కార్యక్రమంలో పొందుపరిచిన జాతీయ విజ్ఞాన వ్యవస్థ విశిష్టత గురించి ఆచార్య సచ్చిదానందమూర్తి దశాబ్దాల క్రితమే ప్రస్తావించారని అన్నారు. వైస్ చాన్స్లర్, చాన్స్లర్, యూజీసీ వైస్ చైర్మన్, ప్రపంచ ఫిలసాఫికల్ సొసైటీ ఉపాధ్యక్షునిగా సేవలందించి పరిపాలనాదక్షునిగా కూడా పేరు గడించారని తెలిపారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న విశ్వహిందీ పరిషత్ జాతీ య అధ్యక్షులు, రాజ్యసభ పూర్వ సభ్యులు అచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపకుడు, విద్యార్థి మధ్య సత్యాన్వేషణ బంధం ఉండాలని ఆచార్య సచ్చిదానందమూర్తి పదేపదే ప్రస్తావించేవారన్నారు. దలైలామా, ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు తదితరులతో సన్నిహితంగా మెలిగిన సచ్చిదానందమూర్తి వారసత్వాన్ని బీఆర్ఏయూ అందుకోవడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ఎస్. పన్నీర్సెల్వం (మద్రాస్ యూనివర్సిటీ) కీలక ఉపన్యాసం చేస్తూ తత్వశాస్త్ర అధ్యయనాల్లో ఆచార్య సచ్చిదానందమూర్తి ప్రపంచ మేధావిగా ఖ్యాతిగాంచారన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బీఆర్ఏయూ వీసీ ప్రొఫెసర్ కేఆర్ రజనీ మాట్లాడుతూ ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ శత వసంతాలు, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి ముగింపు కార్యక్రమాలు పురస్కరించుకొని ఈ జాతీయ సెమినార్ నిర్వహించినట్లు తెలిపారు. ఆచార్య కొత్త సచ్చిదానంద అధ్యయన కేంద్రం బీఆర్ఏయూలో ఏర్పాటు చేసి అక్షరాలు నేర్పిన గురువు రుణం తీర్చుకున్నానని తెలిపారు. అనంతరం ప్రత్యేక సంకలనం ఆవిష్కరించారు. -
నిర్మాణ రంగం కుదేలైంది
ఈ ఏడాది ఆరంభం నుంచి పూర్తిగా నిర్మాణ రంగం పడకేసింది. భూములు ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్యుడికి ఇల్లు కట్టుకోవడం కష్టమైపోయింది. బిల్డర్లు, ఇంజినీర్లు సైతం స్థలాలు కొనలేక భవనాలు నిర్మించలేక నిర్మాణాలు ఆపేశారు. దీంతో నా వద్ద పనిచేసే కూలీలు, తాపీమేసీ్త్రలందరికి పని కల్పించలేపోతున్నాం. – ఎన్.కామేశ్వరరావు, పెద్దమేసీ్త్ర, పాతబస్టాండ్. పనులు లేక తీవ్ర ఇబ్బందులు గత 20 ఏళ్లుగా పెయింటింగ్ పనులు చేస్తున్నాం. ఎప్పుడూ ఇంత దారుణంగా లేదు. పనులు లేక నా దగ్గర పనిచేసే 20 మందికి పని కల్పించలేకపోతున్నాం. తాపీ మేసీ్త్రలకు, ఇంజినీర్లను అడిగితే రియల్ఎస్టేట్ వ్యాపారాలు లేవు, నిర్మాణాలు అంతగా లేవు దీంతో పెయింటింగ్ పనులు ఇవ్వలేకపోతున్నామంటున్నారు. ఇలానే పరిస్థితి ఉంటే ఇంకో వృత్తిని ఎంచుకోక తప్పదు. – పి.వెంకటరమణ, పెయింటింగ్ మేసీ్త్ర, హాస్పటల్ రోడ్ కొనుగోలు శక్తి తగ్గింది ప్రజల వద్ద డబ్బులు లేకపోవడంతో క్రయవిక్రయాలు తగ్గాయి. పూర్తిగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. నగదు రొటేషన్ లేకపోవడంతో ఏ రంగంలోనూ వ్యాపారాలు సరిగా జరగడం లేదు. దీంతో భూముల కొనుగోలు కూడా తగ్గింది. నిర్మాణ రంగంపై ఆధారపడిన మిగతా రంగాలు కుదేలవుతున్నాయి. పెట్టుబడులు పెట్టేసి ఇబ్బందులు పడుతున్నాం. – దుంపల లక్ష్మణరావు, రియల్ ఎస్టేట్ చిరు వ్యాపారి, శ్రీకాకుళం -
ఇక డిజిటల్ విధానంలో పింఛన్ ప్రయోజనాలు
● పెన్షన్ ఆదాలత్లో ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతి ప్రియ అరసవల్లి: ప్రభుత్వ శాఖల్లో పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇకపై మరింత సరళంగా పింఛను ప్రయోజనాలు అందేలా డిజిటలైజేషన్ ద్వారా కొత్త విధానాలు అమల్లోకి తెచ్చినట్లుగా ఏపీ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్.శాంతిప్రియ ప్రకటించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన పెన్షన్ అదాలత్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై పింఛన్దారులకు అందనున్న ఆన్లైన్ సేవలను వివరించారు. అలాగే అదాలత్లో పలువురు పింఛనర్ల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్బీపీఎస్ అనే విధానం ద్వారా పింఛనర్లకు పదవీ విరమణ చేసిన 30 రోజుల్లోనే అన్ని ఆర్థిక బెనిఫిట్స్ అందించాలని సిటిజన్ ఛార్టర్ ప్రిపేర్ చేశారని, అయితే మన రాష్ట్రంలో ఈ బెనిఫిట్స్ను 20 రోజుల్లో అందించేలా చర్యలు చేపడతామని ప్రకటించారు. పెన్షన్, జిపిఎఫ్ సర్వీసుల కోసం కొత్తగా ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చామని, దీని ద్వారా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగి తన సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా పూర్తి డాక్యుమెంటేషన్ను ఇక మీదట ఆన్లైన్లో స్వయంగా అప్లోడ్ చేసేలా వ్యవస్థ పనిచేస్తుందని వివరించారు. డీడీఓ స్థాయిలో సమస్య లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించి మండలస్థాయిలో ఇలాంటి అదాలత్ను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆన్లైన్ పోర్టల్కు చెందిన పోస్టర్లను ఆమె మిగిలిన అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఏపీ ఎన్జీఓ సంఘ ప్రతినిధులు హనుమంతు సాయిరాం బృందం శాంతిప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు. -
ప్రైవేటీకరణం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ భయం సామాన్యులను ఇంకా వదలడం లేదు. వైద్య విద్య దూరమవుతుందని విద్యార్థులు బాధ పడుతుంటే, సర్కారు వైద్యం ఖరీదైపోతుందేమోనని పేద, మధ్య తరగతి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై వైఎస్సార్ సీపీ అలుపెరుగని పోరాటం చేస్తోంది. ప్రభుత్వం పునరాలోచించాలి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుంది. దీని ప్రభావంతో వైద్యం కూడా పేద, మధ్య తరగతి వర్గాలకు భారమవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. – సాడి. జ్యోత్స్న, ఇంటర్ విద్యార్థిని, కేసరపడ గ్రామం, కంచిలి మండలంవైద్య విద్య ప్రశ్నార్థకమే.. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వల్ల పేదలకు వైద్య విద్య ప్రశ్నార్థకమవుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు రూ.15 వేలు అవ్వాల్సింది ప్రైవేటు కాలేజీలో దాదాపు కోటిన్నర ఖర్చవుతుంది. – మామిడి వేణునాయుడు, మామిడివలస, బూర్జ మండలం -
ఎంఎంఎస్ ఎన్నికల్లో రాజకీయం
కొత్తూరు: రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన మండల మహిళ సమాఖ్య అధ్యక్ష ఎన్నికలను టీడీపీ వర్గీయులు రాజకీయం చేసి వదిలేశారు. కొత్తూరు మండల మహిళ సమాఖ్య కార్యాలయంలో గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన రెండు వర్గాల వారి మధ్య తోపులాట జరిగింది. ఎంఎంఎస్ ఎన్నిక కోసం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గ్రామైక్య సంఘాల అధ్యక్షులు (వీఓ) కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే తీర్మానాలను వెంట తీసుకురాని వీఓలను కార్యాలయంలోకి పోలీస్లు అనుమతించలేదు. దీంతో రెండు వర్గాల మధ్య వివాదం రేగి తోపులాటకు దా రి తీసింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. మండలంలో 46 వీఓ అధ్యక్షులకు గాను 41 మంది వచ్చినా ఇక్కడ ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఎన్నిక వాయిదా వేసినట్లు వెలుగు లీగల్ కోఆర్డినేటర్ సాహు తెలిపారు. -
ధాన్యం కొనుగోలు తీరుపై విచారణ
పోలాకి: ప్రభుత్వ ధాన్యం కొనుగోలుపై సర్వత్రా రైతుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రకమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. సివిల్ సప్లై రాష్ట్ర కమిషనర్ ఆదేశాలతో జిల్లాలో గురువారం పర్యటించి విచార ణ చేపట్టిన అధికారుల బృందం పలువురు రైతు లు, మిల్లర్లతోపాటు క్షేత్రస్థాయి సిబ్బందితో మా ట్లాడి వివరాలు సేకరించారు. కమిటీ సభ్యులు జి.శిరీష(అడ్మిన్ మేనేజర్), టి.సుశీల(విజిలెన్స్ మేనేజర్)లు జిల్లా, మండల స్థాయి అధికారులతో కలిసి పోలాకి మండలంలో గురువారం పర్యటించిన నేపథ్యంలో సాక్షిలో ప్రచురితమైన ‘మూడొంతులు దళారీలవే’ అనే కథనంపై ఆరా తీశారు. వైఎస్సార్సీపీ మండల రైతువిభాగం అధ్యక్షుడు యేదూరి శ్రీధర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యు డు ధర్మాన కృష్ణచైతన్యలను సంప్రదించే ప్రయ త్నం చేయగా వారు అందుబాటులో లేకపోవటంతో ఫోన్లోనే సివిల్ సప్లై, వ్యవసాయశాఖ అధికారులకు వేర్వేరుగా వారు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. దళారీలు, మధ్యవర్తుల కు రైతులు ఎందుకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందో వివరించారు. -
ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతీరావు పూలే పార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎస్.కిషోర్కుమార్, జిల్లా అధ్యక్షుడు ఎల్.బాబూరావు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. 2025 జూన్లో బదిలీ కోరుకున్న వందలాది ఉపాధ్యాయులు నేటికీ రిలీవింగ్కు నోచుకోలేదన్నారు. వారి స్థానంలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించి ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని, సింగిల్ టీచర్స్ స్కూల్ ఉపాధ్యాయులు సెలవులు వినియోగించుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులపై ఆ శాఖ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని, విద్యార్థుల మరణాలకు బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేస్తున్నారని, ఇంక్రిమెంట్లు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల రాత్రి బస రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వందరోజుల ప్రణాళిక నుంచి ఆదివారం, రెండో శనివారం, పండగ దినాలను మినహాయించాలని, పరీక్ష మార్కుల అప్లోడ్ చేయాలనే ఒత్తిడిని తగ్గించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో జె.వి.వి.రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్, జిల్లా సహాధ్యక్షుడు వై.ఉమాశంకర్, జిల్లా కోశాధికారి పి.సూర్యప్రకాశరావు, జిల్లా కార్యదర్శులు బి.శంకరరావు, హెచ్ అన్నాజీరావు, జి.సురేష్, జి.నారాయణరావు, టి.వి.టి.భాస్కరరావు, జి.శ్రీరామచంద్రమూర్తి, బి.గౌరీశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్.దమయంతి, రాష్ట్ర కౌన్సిలర్లు కె.దాలయ్య, బి.తవిటమ్మ, సీపీఎస్ జిల్లా కన్వీనర్ ఎన్.రవికుమార్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు పి.ఉమాభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
30న తపాలా అదాలత్
శ్రీకాకుళం అర్బన్ : శ్రీకాకుళం డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 30న ఉదయం 10 గంటలకు ‘తపాలా అదాలత్’ నిర్వహిస్తున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు గురువారం తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని రెల్ల వీధి, ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న సూపరింటెండెంట్ కార్యాలయంలో అదాలత్ జరుగుతుందని పేర్కొన్నారు. తపాలా సేవలకు సంబంధించి సమస్యలు ఉన్నవారు ఈ నెల 29లోపు తమ దరఖాస్తులను ‘తపాలా అదాలత్‘ అనే శీర్షికతో వి.హరిబాబు, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసె స్, శ్రీకాకుళం డివిజన్, శ్రీకాకుళం– 532001’ అనే చిరునామాకు పంపాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణనలో కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అదాలత్ రోజున వ్యక్తిగతంగా హాజరై కూడా ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. అయితే ఆర్థిక అవకతవకలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్రస్థాయి సీనియర్స్ కబడ్డీ చాంపియన్షిప్–2025 పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల ఎంపికలకు రంగం సిద్ధమైంది. శ్రీకాకుళం జిల్లా సీనియర్స్ పురుషులు, మహిళల జట్ల ఎంపికలను ఈ నెల 21న సింగుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా నిర్వ హించాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ నిర్ణయించింది. పురుషులు 85 కేజీలలోపు, మహిళలు 75 కేజీలలోపు బరువు ఉండాలని నిర్వాహకు లు స్పష్టం చేశారు. ఎంపికై న జిల్లా జట్లను కర్నూలు వేదికగా జరగనున్న రాష్ట్రపోటీలకు పంపిస్తామన్నారు. ఉదయం 10 గంటలకు ఎంపికలు మొదలవుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాదు ముసలినాయుడు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సంఘ కార్యనిర్వాహక కార్యదర్శి, పీడీ సాదు శ్రీనివాసరావు (94419 14214)ను సంప్రదించాలని కోరారు. నరసన్నపేట : కిళ్లాం గ్రామ పరిధిలో కోత దశ లో ఉన్న 4.70 సెంట్ల చెరకు పంట గురువారం దగ్ధమైంది. విద్యుత్ లైన్లు ఒకదానికొకటి కలవడంతో మంటలు చెలరేగడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని మాజీ సర్పంచ్ రామన్న తెలిపారు. బాన్న అప్పారావుకు చెందిన రెండున్నర ఎకరాలు, గొండు రమణకు చెందిన ఎకరా న్నర, రువ్వ రమేష్కు చెందిన 70 సెంట్ల పొలంలో పంట కాలిపోయింది. కౌలుకు తీసుకుని సా గు చేస్తున్నామని, మరో వారంలోగా పంట చేతికందుతుందనగా కాలిపోయిందని, ఈ నష్టం ఎలా తట్టుకోగలమని రైతులు వాపోయారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ) : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం ప్రమాదకరమైనదని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కె.సాయికుమార్ అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని రామలక్ష్మణ జంక్షన్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానంతో విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో వైద్య సీట్ల సంఖ్య పెరుగుతుందని, వేలాదిమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించామని, ఇప్పు డు కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 590 పేరుతో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయ డం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఈ నిర్ణయం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నాయ కులు అన్నాజీ, వసంతరావు, ఏఐవైఎఫ్ నాయకులు వై.వేణు, మహేష్, కిషోర్, రామోజీ, ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
●వైఎస్ జగన్ను కలిసిన నాయకులు
వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్కుమార్, టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి చింతాడ రవికుమార్లు కలిశారు. గవర్నర్కు కోటి సంతకాల ప్రతులు అందజేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సూచించారు. కూటమి వైఫల్యాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలన్నారు. – శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) -
ఘనంగా మహాలింగార్చన
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం మా స శివరాత్రి సందర్భంగా అనివెట్టి మండపంలో మహాలింగార్చన నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో శివ పంచాయతన సహిత మహా లింగార్చనను అర్చకులు ఇప్పిలి సాందీప్శర్మ జరిపించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. గార: ఆది కూర్మక్షేత్రం శ్రీకూర్మనాథాలయ హుండీ కానుకల ఆదాయం రూ. 20,05,150 వచ్చిందని ఇన్చార్జి ఈఓ టి.వాసుదేవరావు తెలిపారు. గురువారం ఆలయ బేడా మంట పం వద్ద పర్యవేక్షణాధికారి జి.గురునాథం ఆధ్వర్యంలో ఆలయ హుండీలతో పాటు సమీ ప పాతాళ సిద్ధేశ్వరస్వామి ఆలయ హుండీలను తెరిచి లెక్కించారు. 70 రోజులుకు గాను ఈ ఆదాయం వచ్చిందని, ఈ మొత్తాన్ని బ్యాంకు లో జమచేశామని పర్యవేక్షణాధికారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు, పాలకమండలి సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఉపాధి హామీ చట్టంలోని మార్పులను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘా ల ఆధ్వర్యంలో ఈ నెల 20న కలెక్టర్కు వినతి పత్రం, మండల కేంద్రాలు, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగరాపు సింహాచలం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కౌలు రైతుల సంఘం అధ్యక్షులు వెలమల రమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం నగరంలోని ఇందిరానగర్ కాలనీలో సీఐటీయూ కార్యాలయంలో నాలు గు సంఘాలతో కలిపి ఐక్యతా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వికసిక్ భారత్– గ్యారంటీ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్(వీజీ జీఆర్ ఏఎంజీ) బిల్లును ఖండించారు. ఉపాధి చట్టాన్ని రద్దు చేయడానికే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు దాసరి లక్ష్మీనారాయణ, కేవీపీఎస్ నాయకులు బొమ్మాలి రమణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టులంతా ఏకంకావాలి పలాస : దేశంలో కాషాయికరణకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులంతా ఏకం కావాలని సి.పి.ఐ.ఎం.ఎల్.లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగార్రావు పిలుపునిచ్చారు. పలాస మండలం బొడ్డపాడులో గురువారం లిబరేషన్ పార్టీ జాతీయ నాయకుడు వినోద్ మిశ్రా వర్ధంతి సందర్భంగా ఆయన రచనల తలుగు అనువాద పుస్తకాన్ని బొడ్డపాడు అమరవీరుల స్మారక భవనం వద్ద ఆవిష్కరించారు. లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మద్దిల మల్లేశ్వరరావు, సి.పి.ఐ జల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సి.పి.ఎం.జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూడెమొక్రసీ నాయకుడు జుత్తు వీరాస్వామి, ఉత్తరాంధ్ర మహిళా సంఘం నాయకురాలు పోతనపల్లి అరుణ, ప్రజాకళామండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొర్రాయి నీలకంఠం, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దిల రామారావు, పత్తిరి దానేసు, దాసరి శ్రీరాములు, పోతనపల్లి కుసుమ, కుత్తుం దుష్యంతు, పి.అప్పారావు, మద్దిల కై లాస్ తదితరులు ప్రసంగించారు. అమరవీరుల త్యాగాల తోవలో ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొర్రాయి నీలకంఠం బృందం ప్రజా ఉద్యమ గీతాలను ఆలపించారు. -
హక్కులను కాలరాయడమే..
ఉపాధ్యాయులకు సెలవు లేకుండా చేయడం వారి హక్కులను కాలరాయడ మే. చావుపుట్టుకలు, తీవ్ర అనారోగ్యం ఉన్నా ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సిందే అనడం సరి కాదు. ఇతర శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించి విద్యాశాఖ అధికారులను ఉత్సవమూర్తులను చేయడం మంచిది కాదు. – బి.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నోపాధ్యాయుడు, ఉప విద్యాశాఖాధికారి, ఆపైన జిల్లా విద్యాశాఖ అధికారి, వీరందరికీ సూపర్ బాస్ కలెక్టర్ ఉండగా.. రాష్ట్రస్థాయికి వచ్చి సమాధానాలు చెప్పాలని, అక్కడ సంతప్తి చెందకపోతే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయాలు మార్చుకోకుంటే ఉద్యమం తప్పదంటూ సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు. -
విద్యాశాఖపై.. పరాయి పెత్తనం!
శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఉత్తీర్ణతలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళం నెలకొంటోందని విద్యాశాఖ వర్గాలు విమర్శిస్తున్నాయి. వందరోజుల ప్రణాళిక లోపభూయిష్టంగా, విద్యార్థులకు నష్టం కలిగించేలా రూపకల్పన చేయగా, ఇప్పుడు ఉపాధ్యాయులకు సైతం ఇది ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నియమించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. ప్రతి మండలానికి రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ తోపాటు మరికొన్ని శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించి వారి ఆమోదంతో పర్యవేక్షకులను నియమించాలని సూచించారు. ఇదేం తీరు.. పర్యవేక్షకులు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఆయా మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రణాళికను పరిశీలిస్తారు. స్లిప్ టెస్ట్లు, పేపర్ల దిద్దుబాటు, మార్కులు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాలతో పాటు ఉపాధ్యాయుల హాజరు పరిశీలిస్తారు. పర్యవేక్షకులు ఎప్పుడూ పరిశీలనకు వచ్చినా వారు అడిగిన తేదీకి సంబంధించిన పరీక్ష పేపర్లను వారి ముందు ఉంచాలి. ఉపాధ్యాయులు చేపట్టిన షైనింగ్, రైసింగ్ స్టార్ల విభజన తెలియజేయాలి. సెలవు దినాల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నారా లేదా అన్నది కూడా పర్యవేక్షకులు తనిఖీ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం తేడాలు గుర్తించినా సదరు ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అయితే, పేపర్ల దిద్దుబాటు, బోధన ఇతర విషయాలపై ఇతర శాఖలకు అంతగా పట్టు ఉండదని, ఈ లెక్కన ఏదైనా ఉపాధ్యాయునిపై ఫిర్యాదు చేస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కులు హరించడమే.. 100 రోజులు పాటు ఉపాధ్యాయులకు సెలవు పెట్టే అవకాశం కూడా లేకుండా చేయడం హక్కులను కాలరాయడమేనని విద్యాసంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఏ కారణం చేతైనా సదరు ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించకపోయినా, మార్కులు నమోదు చేయకపోయినా రాష్ట్రస్థాయిలో కమిషనర్ ఎదుట సంజాయిషీ ఉంచుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడాన్ని తప్పుపడుతున్నారు. హైస్కూళ్లలో ఉపాధ్యాయునికి పర్యవేక్షణాధికారిగా ప్రధాప్రతి మండలానికి పర్యవేక్షకులను నియమించాలని రాష్ట్ర అధికారులు వెబ్ సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ నియామకాలు జరుగుతాయి. శతశాతం ఉత్తీర్ణత సాధించడం కోసమే రాష్ట్రస్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. – ఏ.రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి -
‘హద్దు’ అదుపు లేకుండా..!
● హద్దులు దాటుతున్న సారా విక్రయాలు ● ఒడిశా నుంచి ఆంధ్రా గ్రామాల్లోకి దర్జాగా రవాణా ● సరిహద్దు గ్రామాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు పాతపట్నం : ఒడిశా రాష్ట్రంలో తయారవుతున్న నాటుసారా ఆంధ్రా పల్లెల్లోకి దర్జాగా చేరుతోంది. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాల మీదుగా ప్యాకెట్ల రూపంలో విచ్చిలవిడిగా రవాణా అవుతోంది. ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ పోలీసులు జిల్లాలో సారా బట్టీలపై తరచూ దాడులు నిర్వహిస్తూ తయారీదారులు, విక్రయదారులను పట్టుకుంటున్నా ఒడిశా సారాను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. ఇదీ పరిస్థితి.. ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల పరిధిలో సారాబట్టీలు ఎక్కువ. అక్కడ తయారైన సారాను ఆంధ్రా సరిహద్దు గ్రామాలకు ఆటోలు, కార్ల ద్వారా తరలిస్తున్నారని సమాచారం. కొత్తూరు, మెళియాపుట్టి, పలాస మండలాలకు అనుకుని ఉన్న ఒడిశా గ్రామాలైన పెద్ద బురుజోల, చిన్న బురుజోల, మారంగి, సౌర తలసింగ్, గొఠాయ్, సింగిపూర్, హడ్డుబంగి బట్టి నుంచి 10 వేలు నుంచి 15 వేలు సారా ప్యాకెట్లు వారంలో రెండు, మూడు రోజులు రవాణా జరుగుతున్నా చాలావరకు పోలీసులకు పట్టుబడకపోవడం గమనార్హం. కొత్తూరు మండలం నివగా, దిమిలి, రాయల, మాకవరం, మాతల, పొనుటూరు, కుద్దిగాం, బలద, కడుము, మదనాపురం, మెళియాపుట్టి మండలం గొప్పిలి, కరజాడ, గోకర్ణపురం, బాణాపురం, మెళియాపుట్టి, చాపర, వసుంధర, పాతపట్నం మండలం కాపు గోపాలపురం, హరిజన గోపాలపురం, కింగ, సవర సిద్దమనుగు, ఎగువ సిద్దమనుగు, బొన్ని, బైదలాపురం, పెద్దసున్నాపురం, సరాలి, చంగుడి, అంతరాబ తదితర గ్రామాల్లో సాయంత్రం అయ్యే సరికి మందుబాబులు ఒడిశాలోని హడ్డుబంగి, పర్లాకిమిడితో పాటు మండలానికి ఆనుకొని ఉన్న పలు ఒడిశా గ్రామాలకు వెళ్లి నాటుసారా తాగుతుంటారు. వచ్చేటప్పుడు కూడా కొన్ని ప్యాకెట్లు తీసుకొచ్చి గ్రామాల్లో రహస్యంగా విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆంధ్రా సరిహద్దు గ్రామాల్లో సారా అరికట్టడంలో తలమునకలైన ఎకై ్సజ్ పోలీసులకు ఈ ఒడిశా సారా మరింత తలనొప్పులను తెచ్చిపెడుతోంది. ఆంధ్రా, ఒడిశా ఎకై ్సజ్ అధికారులు అప్పుడప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసినప్పటికీ, ఒడిశా రాష్ట్రంలో సరిహద్దు గ్రామాల పరిధిలో సారాబట్టీలు ఎక్కువ. అక్కడ తయారైన సారా ఆంధ్రలోకి తరలిస్తున్నారు. ఇప్పటికై నా ఎకై ్సజ్ అధికారులు స్పందించి ఒడిశా సారా రవాణాకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. నిఘా పెట్టాం ఒడిశా రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాల నుంచి ఆంధ్రా రహదారుల్లో నాటు సారా అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. అక్రమ రవాణా అరికట్టేందుకు ఒడిశా ఎకై ్సజ్ అధికారులతో కలిసి సరిహద్దు గ్రామాల్లో సారా బట్టీలపై దాడులు చేస్తున్నాం. అక్రమ రవాణా జరిపే వ్యక్తులను గుర్తించి కేసులు పెడుతున్నాం. – కోట కృష్ణారావు, సీఐ, ఎకై ్సజ్ స్టేషన్, పాతపట్నం -
సమన్వయంతో సర్వే చేపట్టాలి
పాతపట్నం: అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి రీ సర్వే పూర్తి చేయాలని జిల్లా అటవీశాఖ భూసెటిల్మెంట్ అధికారి ఎం.లావణ్య సూచించారు. పాతపట్నం ఫారెస్ట్ పరిధిలోని అంతరాబ రిజర్వు ఫారెస్ట్, పాతపట్నం రెవెన్యూ భూములకు ఆనుకుని ఉన్న స్థలాలను బుధవారం పరిశీలించారు. పాతపట్నం రెవెన్యూ పరిధిలో కొంత అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించారు. రీ సర్వేలో వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు. 15 రోజుల్లో రీ సర్వే చేపట్టి శాఖల పరంగా హద్దులు నిర్ణయించుకోవాలన్నారు. కార్యక్రమంలో అటవీ రేంజర్ పి.అమ్మన్నాయుడు, తహసీల్దార్ ఎన్.ప్రసాదరావు, మండల సర్వేయర్ మహేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం
సరుబుజ్జిలి: రొట్టవలసలోని కేరళ ఇంగ్లీషు మీడియం స్కూల్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో అవతరాబాద్ గ్రామానికి చెందిన సురవరపు రామినాయుడు(77) అనే వృద్ధుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామినాయుడు రొట్టవలస వెళ్లి తన స్వగ్రామం అవతరాబాద్ వస్తుండగా శ్రీకాకుళం నుంచి బత్తిలి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రామినాయుడు కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై బి.హైమావతి తెలిపారు. 20 నుంచి డోర్ డెలివరీ మాసోత్సవాలు శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి సీహెచ్ అప్పలనారాయణ బుధవారం తెలిపారు. శ్రీకాకుళం–1, శ్రీకాకుళం–2, టెక్కలి, పలాస డిపోల ద్వారా రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాలకు త్వరితగతిన వస్తువులు డోర్ డెలివరీ చేస్తామని పేర్కొన్నారు. వినియోగదారులు, ఖాతాదారులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైస్మిల్లుల్లో తనిఖీలు శ్రీకాకుళం రూరల్: వప్పంగి, వాకలవలస గ్రామాల్లోని రైస్మిల్లులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ బుధవారం తనిఖీ చేశారు. సీతారామ మోడరన్ రైస్మిల్, లలిత ట్రేడర్స్ ధాన్యం మిల్లుల్లో స్టాక్ రికార్డులను పరిశీలించారు. వప్పంగి, రామచంద్రపురంలలో ప్రైవేట్ వే బ్రిడ్జిలను తనిఖీ చేశారు. తూకాల్లో తేడా లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. జేసీతో పాటు జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి తదితరులు ఉన్నారు. రక్తదాన శిబిరం విజయవంతం చేయండి శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 21న మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నామని తూర్పుకాపు కుల బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం టౌన్హాల్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, వైఎస్సార్సీపీ అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ డాక్టర్స్సెల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చింతాడ వరుణ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, లుకలాపు గోవిందరావు, కరణం శ్రీనివాసరావు, రాజు, ఆబోతుల రామ్మోహన్, డాక్టర్ సుధీర్, కింజరాపు రమేష్ పాల్గొన్నారు. కలెక్టర్ల సదస్సుకు హాజరు శ్రీకాకుళంపాతబస్టాండ్: అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. డేటా ఆధారిత పాలన, ప్రభుత్వ సేవల్లో జవాబుదారీతనం తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ‘ఉపాధి’ పథకం పేరు మార్చడం తగదు శ్రీకాకుళం అర్బన్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వీబీ జీ రాంజీ’గా పేరు మార్చడం తగదని, ఇది మహాత్మా గాంధీని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పీసీసీ పిలుపు మేరకు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహం బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్చారి్జ్ గాదం వెంకట త్రినాథరావు, అంబటి కృష్ణారావు, కె.వి.ఎల్.ఎస్.ఈశ్వరి, మామిడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
ముప్పు తప్పదు!
మేలుకోకుంటే.. ● మహిళలూ.. మీ ఆరోగ్య భద్రత మీ చేతుల్లోనే ● ప్రాణాంతక వ్యాధులపై అప్రమత్తత అవసరం ● 30 ఏళ్లు దాటితే ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి టెక్కలి : ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మహిళలు కుటుంబ బాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు. ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోరు. ఈ క్రమంలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం.. పూర్తి స్థాయిలో నిద్రపోకపోవడం.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల చివరకు ప్రాణాంతకమైన వ్యాధులకు దారి తీసే ప్రమాదాలు ఉన్నాయంటూ ప్రసూతి వైద్యులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన ప్రసూతి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. కచ్చితంగా చేసుకోవాల్సిందే. ●మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత కచ్చితంగా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవాలి. ● 9 నుంచి 14 సంవత్సరాల వయసు కలిగిన ఆడపిల్లలకు వైద్య సిబ్బంది సూచనల మేరకు వ్యాక్సిన్లు వేయించాలి. హెచ్పీవీ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు పాటించాలి. ● సమయానికి ఆహారం తీసుకోవడంతో పాటు సరిపడా నిద్ర ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వారి పనుల్లో నిమగ్నమై ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాకాకుండా ఆహారం, ఆరోగ్యం విషయంలో జాగరూకతతో మెలగాలని వైద్యులు సూచిస్తున్నారు. మహిళల్లో ప్రధానంగా థైరాయిడ్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్తో పాటు ఇటీవల పీసీఓఎస్ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను గోప్యతగా ఉంచడం మంచిది కాదు. 65 ఏళ్లు దాటిన మహిళల్లో సైతం కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎటువంటి బిడియం లేకుండా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. – డాక్టర్ వి.జి.ప్రసూన, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఎన్నో రకాల వ్యాధులకు గురి కాకుండా ఉండవచ్చు. మారుతున్న జీవన శైలిలో భాగంగా ఆహారపు అలవాట్లు మహిళల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇంట్లో పనుల హడావుడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చిన్న పాటి అనారోగ్య సమస్యలు తీవ్రంగా మారుతాయి. – డాక్టర్ కె.ధనలక్ష్మి, ప్రసూతి వైద్యురాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, టెక్కలి -
కుల ధ్రువీకరణ మంజూరుపై విచారణ
గార : మండలంలోని సతివాడ, శాలిహుండం, కొమరవానిపేట గ్రామాల్లో 15 కుటుంబాలకు ఎరుకుల కుల ధ్రువీకరణ పత్రాల మంజూరుపై తహశీల్దార్ మునగవలస చక్రవర్తి అధ్యక్షతన గిరిజన సంక్షేమశాఖాధికారుల బృందం బుధవారం విచారణ చేపట్టారు. సతివాడ గ్రామంలో ఎరుకుల కుటుంబాల సమక్షంలో జరిగిన విచారణలో సీతంపేట ఐటీడీఏ అధికారుల బృందం పాల్గొంది. గతంలో గార తహశీల్దార్ బలివాడ దయానిధి మంజూరు చేసిన కుల ధ్రువీకరణ పత్రం ఇప్పుడు అమల్లో లేకపోవడంతో వీరంతా జిల్లా కలెక్టర్తో పాటు జాతీయ ఎరుకుల కులస్ధుల సంఘ నాయకులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జరిగిన విచారణలో మాజీ మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ, ఆర్ఐ దివిలి రాజేంద్ర, పెదలాపు సుందర్, ముద్దాడ రామకష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కమీషన్ కోసం కక్కుర్తి!
● డ్వాక్రా సభ్యులకు తెలియకుండా రూ.10 లక్షల రుణం మంజూరు ● పొదుపు ఖాతాలో జమ చేయించిన నౌపడ వెలుగు సీఎఫ్ ● వడ్డీ భారంతో సభ్యుల ఆందోళన సంతబొమ్మాళి: బ్యాంకులు, డ్వాక్రా సభ్యులకు అనుసంధానంగా ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన వెలుగు సీఎఫ్ (కమ్యూనిటీ ఫెసిలిటేటర్) నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సభ్యులకు శాపంగా మారింది. నౌపడ గ్రామానికి చెందిన మదర్ థెరిస్సా ఎస్హెచ్సీ గ్రూప్ సభ్యులకు తెలియకుండా గ్రూప్ పేరిట నౌపడ వెలుగు సీఎఫ్ డి.సాయిలక్ష్మి రూ.10 లక్షలు రుణాన్ని నౌపడ స్టేట్బ్యాంకులో ఈ ఏడాది సెప్టెంబర్లో మంజూరు చేయించారు. ఈ మొత్తాన్ని మదర్ థెరిస్సా పొదుపు ఖాతాలో జమ చేశారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా సభ్యులకు మాత్రం సీఎఫ్ చెప్పలేదు. దీంతో సభ్యులకు తెలియకుండా పొదుపు అకౌంట్ నుంచి ప్రతి నెలా వడ్డీ కింద రూ.7500 వేలు చొప్పున మూడు నెలలగా రూ.23వేలు కట్ అయింది. బుధవారం పొదుపు, లోన్ బ్యాంకు బుక్లను సభ్యులు పరిశీలించగా ఈ విషయం వెలుగుచూసింది. దీంతో సీఎఫ్ సాయిలక్ష్మిని సభ్యులు నిలదీశారు. తమకు తెలియకుండా తమ సంతకాలు, ఫొటోలు లేకుండా, తీర్మానం చేయకుండా రూ.10 లక్షలు రుణం ఏ విధంగా మంజూరు చేయించావని ప్రశ్నించారు. ఆ డబ్బులు తమ చేతికి రాకపోయినా ప్రతి నెలా రూ.7500 వేలు చొప్పున రూ.23వేలు వడ్డీ కింద బ్యాంకు జమ చేసుకున్నారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. కమీషన్ కోసం తమను బలి పశువులు చేశావంటూ సభ్యులు మండిపడ్డారు. కాగా, రుణం మంజూరు అయినది, లేనిదీ ఎప్పుటికప్పుడు తెలుసుకోవాలని సీఎఫ్ సాయిలక్ష్మి నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు సభ్యులను బెదిరింపులకు పాల్పడటం కొసమెరుపు. రుణం డబ్బులు తమ చేతికి రాకపోయినా రూ.23 వేలు వడ్డీ చెల్లించామని, దీనికి ఎవ్వరు బాధ్యత వహిస్తారంటూ సభ్యులు ఆందోళన చెపట్టారు. పరిశీలిస్తాం.. ఎస్హెచ్సీ గ్రూపులకు బ్యాంకులు మంజూరు చేసిన రుణాలు గురించి సభ్యులకు తెలియజేయకపోవడం అవగాహనా రాహిత్యం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. రుణం మంజూరు, వడ్డీ విషయమై బ్యాంకు అధికారులతో మాట్లాడుతాం. – శ్రీనివాసరావు, వెలుగు ఏపీఎం, సంతబొమ్మాళి -
బీఆర్ఏయూలో సౌకర్యాలపై ఆరా
ఎచ్చెర్ల : డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి బుధవారం సందర్శించారు. నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్ ప్రధాన పరిపాలనా భవనం పరిశీలించి భవనం రాజమందిరాన్ని తలపిస్తోందంటూ ప్రశంసించారు. వర్శిటీలోని ఖాళీ ప్రదేశంలో హంపీ థియేటర్ నిర్మిస్తే క్యాంపస్ మరింత శోభాయమానంగా ఉంటుందని సూచించారు. ఔషధ మొక్కలు పెంచితే పర్యావరణ సమతుల్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో వీసీ కె.ఆర్.రజనీ, మాజీ రిజిస్ట్రార్ పి.సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.స్వప్నవాహిని, ఎస్ఓ కె.సామ్రాజ్యలక్ష్మీ, ఎన్ సంతోష్రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. పశువుల మృత్యువాత ఎచ్చెర్ల: అరిణాం అక్కివలస పంచాయతీ శేషపేట గ్రామంలో పాడి రైతు దత్తుకు చెందిన పశువుల పాక బుధవారం కాలిపోయింది. ఈ ఘటనలో పాకలో కట్టిన రెండు పశువులు కాలిపోయి మృతిచెందాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. -
నాట్యం నేర్పేదెలా..?
కళా సేవ.. చూపండి తోవ● తరగతుల నిర్వహణకు ఇబ్బంది పడుతున్న నాట్య గురువు ● నాట్యాలయానికి చోటు చూపించాలని విజ్ఞప్తి శ్రీకాకుళం కల్చరల్: రఘుపాత్రుని శ్రీకాంత్.. సిక్కోలు గడ్డపై నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నాట్య కళాకారుడు. వందలాది మంది నాట్యకారులను తయారు చేసిన దిగ్గజ గురువు. కానీ ఆయన నాట్యం నేర్పించడానికి శాశ్వత ఏర్పాటు లేక అల్లాడుతున్నారు. కొన్నాళ్లు అద్దె ప్రాతిపదికన, మరికొన్నాళ్లు దాతల దయతో తరగతులు నిర్వహిస్తూ వస్తున్నారు. జిల్లా కేంద్రంలో దాదాపు మూడున్నర దశాబ్దాల కిందట శివశ్రీ నృత్య నికేతన్ పేరుతో ఆయన నృత్య శిక్షణ మొదలుపెట్టారు. కానీ ఇన్నేళ్లలో సొంతంగా ఓ నాట్యాలయాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. వేల మందిని నాట్యంలో సుశిక్షితులను చేసినా సొంతంగా ఓ భవనం కట్టుకోలేకపోయారు. శ్రీకాంత్ దగ్గర ప్రస్తుతం 300 మంది వరకు భరతనాట్య, కూచిపూడి సంప్రదాయాల్లో నృత్యం నేర్చుకుంటున్నారు. ఈయన శిష్యుల్లో జూనియర్ విభాగంలో నలుగురికి, సీనియర్ విభాగంలో ఒకరికి సీసీఆర్టీ స్కాలర్ షిప్ రావడం జిల్లా స్థాయిలో ప్రప్రథమం. అంతే కాకుండా శ్రీకాంత్ శిష్యుల్లో ఐదుగురు కూచిపూడిలో మాస్టర్స్ డిగ్రీ సాధించగా, ఒకరు పీహెచ్డీ కూడా పొందారు. ఎన్నో వినతులు అయినా.. ఎన్నో పర్యాయాలు ప్రభుత్వానికి వినతులు పెట్టుకున్నా ఆయనకు ఎక్కడా స్థలం గానీ ఇల్లు గానీ మంజూరు కాలేదు. నగర పరిధిలో స్థలం మంజూరు చేస్తే నాట్యాలయం ఏర్పాటుకు ఉపయుక్తంగా ఉంటుందని శ్రీకాంత్ శిష్య బృందం కోరుతోంది. గతంలో అఫీషియల్ కాలనీలోని పాడుపడిన భవనంలో నిర్వహించుకునేందుకు ఆప్పటి కలెక్టర్ ఇవ్వగా దాన్ని రూ.2.50లక్షలతో బాగుచేయించి కొన్నాళ్లు తరగతులు నిర్వహించారు. అప్పటి జాయింట్ కలెక్టర్ వచ్చి ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఒక దాత దయతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని శ్రీకాంత్ కోరుతున్నారు. -
పెన్షన్ వేలిడేషన్ బిల్లు రద్దు చేయాలి
శ్రీకాకుళం కల్చరల్: ిపంఛనుదారులకు అన్యాయం చేస్తూ దొడ్డిదారిన ప్రవేశపెట్టిన పెన్షన్ వేలిడేషన్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని ఫోరం ఆఫ్ పెన్షనర్స్ అసోషియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాత పెన్షన్ విధానం కొనసాగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోషియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తాత్కాలిక పద్ధతిన నియమించిన ఉద్యోగులను రెగ్యులర్ చేసి, వాళ్లు రిటైరయ్యాక పాత పద్ధతిలో నెలకు రూ.వెయ్యి మాత్రమే పెన్షన్ కింద ఇస్తున్నారని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.9 వేలు చెల్లించాల్సి ఉందన్నారు. దీన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీ, బ్యాంకులు, రైల్వే, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులంతా కలిసి అసోషియేషన్గా ఏర్పడి సమస్యలపై పోరాడుతున్నట్లు చెప్పారు. ధర్నాలో అసోసియేషన్ అధ్యక్షుడు బి.ప్రసాదరావు, కన్వీనర్ కె.చంద్రశేఖరరావు, బీఎస్ఎన్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వేంకటేశ్వరరావు, ఎం.రమేష్, ఏఐబీడీఓటీపీ ప్రతినిధి ఎం.గోవర్దనరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
హిరమండలం: పాతపట్నం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతికి సూచించారు. బుధవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సంతకాల సేకరణ ప్రతులు కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. -
ఎవరు ఇబ్బంది పెట్టినా చెప్పండి
● విద్యార్థుల్లో ధైర్యం నింపిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శైలజ ● శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ ఏర్పాటు ● చట్టాలపై అవగాహన గాయపడిన విద్యార్థికి న్యాయం చేస్తాంపొందూరు: మండలంలోని లోలుగు గ్రామంలో సుమారు 3 నెలల కిందట కేజీబీవీ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థినికి ప్రభుత్వపరంగా న్యాయం చేస్తా మని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. లోలుగు కాలనీలోని నివాసముంటున్న విద్యార్థినిని శైలజ బుధవారం పరామర్శించారు. సంఘటన పూర్వాపరాలు తెలుసుకున్నారు. మూడు నెలలుగా విద్యార్థిని నడవలేని పరిస్థితిలో ఉందని, ఆర్థికంగా ఆదుకోవాలని, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని విద్యార్థిని తల్లి చైర్పర్సన్ను వేడుకొన్నారు. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేశారని విచారణకు ఎంత వరకు వచ్చిందనే విషయంపై సమాచారం తెలుసుకున్నట్లు ఆమె తెలిపారు. ఎచ్చెర్ల: విద్యార్థినులను ఎవరు ఇబ్బంది పెట్టినా సంబంధిత కమిటీలకు ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైల జ తెలిపారు. ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో లైంగిక వేధింపులపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థినులు ధైర్యంగా ఉండాలని, మహిళా కమిషన్ తరఫున లైంగిక వేధింపులపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వారం కిందటే ఇక్కడ నిర్వహించాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల నిర్వహించలేదన్నారు. లైంగిక వేధింపులు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు ఎక్కువగా ఉన్న చోట్ల ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ(ఐసీసీ)లు తప్పనిసరిగా ఉండాలన్నారు. ఇబ్బందులు ఉంటే ఈ కమిటీకి చెప్పకోవాలని సూచించారు. ట్రిపుల్ ఐటీలోనూ ఈ కమిటీ వేసినట్లు తెలిపారు. విద్యార్థినులు యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే నిజానిజాలపై ఆరా తీయాలని, అలా జరగడం లేదని అందుకే ఐసీసీ కమిటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఈ కమిటీలో నూజివీడు ట్రిపుల్ ఐటీ ఫ్యాకల్టీని రెసిడింగ్ ఐసీసీగా శ్రీకాకుళం క్యాంపస్కు నియమించారు. ఆమెతో పాటు అడ్వకేటర్ పద్మజ, ఎచ్చెర్ల హెడ్కానిస్టేబుల్ టి.సరిత, ముగ్గురు విద్యార్థులు, వార్డెన్లు తదితరు లు ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీకి ఫిర్యాదు వచ్చిన 3 నెలల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని క్యాంపస్ సిబ్బంది తెలిపారు. విద్యార్థినులతో చర్చలు ఈ సందర్భంగా కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించి సిబ్బంది, అధికారులను బయటకు పంపించి కేవలం విద్యార్థినులతో మాత్రమే ఆమె మాట్లాడారు. విద్యార్థినుల సమస్యలన్నీ నోట్ చేసుకుని వారికి ఫోన్ నంబర్ ఇచ్చారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఈ నంబర్కు ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. అనంతరం ఆర్జీయూకేటీ చాన్స్లర్ ప్రొఫెసర్ కొత్తా మధుమూర్తి కూడా లోపలకు వెళ్లి పిల్లలతో మాట్లాడారు. ఇబ్బందులు ఎదురైతే మెయిల్ చేయవచ్చన్నారు. చర్యలు తీసుకుంటాం.. కళాశాలలో పిల్లలతో పాటు సిబ్బంది సమస్యలు కూడా తెలుసుకున్నామని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని మధుమూర్తి తెలిపారు. ఇక్కడ రెగ్యులర్ ఫ్యాకల్టీ అవసరమని, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారని వీటిపై చర్యలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేజీవీడీ బాలాజీ, పరిపాలనాధికారి డాక్టర్ మునిరామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఐసీడీఎస్ పీడీ నిర్మలారాణి, బాలల సంరక్షణాధికారి రమణ, జేఆర్పురం సీఐ అవతారం, స్థానిక ఎస్ఐ జి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
● డాక్టర్.. స్కేటర్
శ్రీకాకుళం రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఆర్.వెంకట రమ్యశ్రీ రోలర్ స్కేటింగ్లో బంగారు పతకం సాధించింది. ఈ నెల తొమ్మిది నుంచి 11 వరకు విశాఖపట్నంలో జరిగిన 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో పాల్గొని పథకం సాధించింది. ఆల్ఫెన్ ఈవెంట్లో బంగారు పతకాన్ని సాధించిన రమ్యశ్రీ డౌన్హిల్ ఈవెంట్ లో కూడా కాంస్య పథకాన్ని సాధించింది. రమ్యశ్రీ ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పలనాయుడు సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్నకుమార్ డాక్టర్ సనపల నరసింహమూర్తి డాక్టర్ బి.గౌరునాయుడు తదితరులు అభినందించారు. – శ్రీకాకుళం -
పంచాయతీల్లో విభజన రగడ
సారవకోట : మండలంలో పలు పంచాయతీలలో విభజన రగడ రాజుకుంటోంది. అలుదు, వడ్డినవలస, మాకివలస గ్రామాలు కలిసి అలుదు పంచాయతీ ఇప్పటి వరకు ఉంది. ప్రస్తుతం వడ్డినవలస, మాకివలస గ్రామాలను కలిపి ఒక పంచాయతీగా, అలుదు ఒక పంచాయితీగా విభజించాలని కొంతమంది కోరుకుంటున్నారు. అయితే ఇదివరకు మాదిరిగానే మూడు గ్రామాలతో కలిసి పంచాయతీగా కొనసాగాలని సర్పంచ్తో పాటు పలువురు వార్డు సభ్యులు కోరుకుంటున్నారు. ఇదే విషయమై సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్లో వినతిపత్రం అందించారు. ఈ క్రమంలో బుధవారం పంచాయతీ విభజనపై అలుదు రామాలయంలో నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. ఇరువర్గాలు వాగ్వాదానికి దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేసి సద్దుమణిగించారు. ఇరువర్గాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఇన్చార్జి ఈఓపీఆర్డీ సింహాచలం తెలిపారు. కాగా, గొర్రిబంద పంచాయతీలో కూడా ప్రస్తుతం ఉన్న ఎన్నికల పోలింగ్ బూత్ల ప్రకారం విభజించుకునేందుకు పలువురు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంచాయతీలోని ఎస్టీ గ్రామాలన్నీ కలిపి ఒక పంచాయతీగా ఏర్పాటు చేయాలని ఎస్టీ నాయకులు, ప్రజలు కోరుతున్నారు. దీంతో ఈ పంచాయితీ విభజన విషయంలోనూ రగడ జరుగుతోంది. -
బండిపై వచ్చారట.. బాలికను చెరువులో పడేశారట!
శ్రీకాకుళం జిల్లా: రణస్థలంలో బాలిక హత్య పేరిట చెలరేగిన పుకార్లు స్థానికంగా కలకలం రేపాయి. మంగళవారం రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొందరు వ్యక్తులు నాలుగేళ్ల బాలికను తీసుకొచ్చారని.. రణస్థలం శ్మశానం ఎక్కడ? అని అడిగారని, కొద్దిసేపటి తర్వాత శ్మశానవాటిక వద్దకు వెళ్లి అక్కడి చెరువులో బాలికను పడేసి పరారయ్యారని స్థానికులు చర్చించుకోవడం మొదలైంది. ఈ వార్త దావానంలో పాకడంతో మహిళలు, పెద్దలు భారీ సంఖ్యలో చెరువు వద్దకు చేరుకున్నారు. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో జె.ఆర్.పురం సీఐ అవతారం, ఎస్సై చిరంజీవి ఆదేశాలతో కానిస్టేబుల్ పి.రమేష్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సుమారు నాలుగు గంటల పాటు సీసీ ఫుటేజీలు పరిశీలించారు. ద్విచక్ర వాహనాల నంబర్లపై ఆరా తీశారు. చివరకు సదరు ద్విచక్ర వాహనదారులు జె.ఆర్.పురంలో మంగళవారం ఓ వ్యక్తి చనిపోవడంతో పరామర్శ కోసం వచ్చారని గుర్తించారు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో లైంగిక వేధింపుల కలకలం
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కొంత మంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తమను వేధిస్తున్నారని ఇంజినీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థినులు ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, రిజి్రస్టార్, డైరెక్టర్లకు ఈ – మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, పరీక్షల నిర్వహణ విభాగంలోని బోధనేతర సిబ్బంది పాస్ చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని మెయిల్లో ఆరోపించారు. స్కాలర్షిప్ల కోసం వేలి ముద్రలు వేసే సమయంలో కొందరు బోధనేతర సిబ్బంది అసభ్యకరంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఈ నెల 11న ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి క్యాంపస్లో దీనిపైనే చర్చ జరుగుతోంది. అయితే ఇది అనాధారిత మెయిల్ అని అధికారులు చెబుతున్నప్పటికీ... తమ పేరు బయటకు రాకుండా ఉన్నతాధికారులకు సమస్యలు నివేదించడానికి విద్యార్థులు ఇలా చేసి ఉండొచ్చని కొందరంటున్నారు. మెయిల్ ఎవరు చేశారనే కోణంలో కాకుండా ఫిర్యాదులోని వాస్తవాలపై విచారణ నిర్వహించాలని కోరుతున్నారు. మరోవైపు బోధనా సిబ్బందిలో చాలా మంది పాఠాలు చెప్పకుండా యూట్యూబ్, చాట్ జీపీటీలో చూసుకోమని సూచిస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో విద్యార్థుల భద్రత కోసం చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేజీవీడీ బాలాజీ తెలిపారు.


