breaking news
Srikakulam
-
ఉర్రూతలూగించిన ‘రేలా రే రేలా’
శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య(నెలవారీ సాంస్కృతిక విభాగం) 315వ నెల కార్యక్రమం శనివారం నగరంలోని బాపూజీ కళామందిర్లో ఘనంగా నిర్వహించారు. ధర్మశాస్త సన్నిదానం ట్రస్ట్ సౌజన్యంతో నూతన వస్త్రాలు, పేద కళాకారులకు పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం గజపతినగరానికి చెందిన శ్రీ విజయ జానపద కళాబృందం ‘రేలా రే రేలా‘ ప్రదర్శన ఉర్రూతలూగించింది. ఉత్తరాంధ్ర జానపదాలను పి.రఘు బృందం చక్కగా ఆలపించారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షుడు ఎల్.రామలింగస్వామి, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నడిమింటి నారాయణరావు, వ్యాపారవేత్త బరాటం సంతోష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బెండి శివప్రసాద్, సమాఖ్య సభ్యులు బి.ఎ.మోహనరావు, ఐ.రమణారావు, కంచరాన అప్పారావు, మెట్ట పోలినాయుడు, తాయి రవి, ఎన్ని రాజేశ్వరరావు, మజ్జి మోహనరావు, ప్రసాదరావు రౌళో, పైడి సత్యవతి, బత్తుల జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వాలీబాల్ పోటీలకు ఇద్దరు ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా సీనియర్స్ వాలీబాల్ పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి కేంద్రంగా ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు 72వ సీనియర్ నేషనల్స్ వాలీబాల్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు రణస్థలం మండలం కొవ్వాడ మత్స్యలేశం గ్రామానికి చెందిన మైలపల్లి సత్యం, కవిటికి చెందిన మరిడి సుధీర్కుమార్ ఎంపికయ్యారు. వీరిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి ఎంపిక పట్ల శ్రీకాకుళం వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ప్రధాన కార్యదర్శి కె.రామచంద్రుడు, యాళ్ల పోలినాయుడు, మొజ్జాడ వెంకటరమణ, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.సాంబమూర్తి, సలహాదారు పి.సుందరరావు మాస్టారు, టి.రవి, ఎన్వీ రమణ, సతీష్, డీఎస్డీఓ ఎ.మహేష్బాబు, డీఎస్ఏ కోచ్ కె.హరికృష్ణ హర్షం వ్యక్తంచేశారు. ఎం.సత్యం ఎం.సుధీర్ -
మరింత ముందుకు మహిళా క్రికెట్
● మహిళా క్రికెట్ అభివృద్ధికి జిల్లా క్రికెట్ సంఘం కృషి ● శ్రీకాకుళంలో టర్ఫ్ వికెట్, నెట్స్ ప్రారంభం నేడు శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళా క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) నడుం బిగించింది. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తోడ్పాటుతో శ్రీకాకుళం ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో మహిళా క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక హంగులతో టర్ఫ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించేందుకు చిన్న కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రికెట్ నెట్స్ను ఆదివారం ప్రారంభించేందుకు జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. మెరుపులు లేమితో.. జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారిణులు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ వరకు వెళ్తున్నప్పటికీ అంతర్రాష్ట్ర, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకునేలా రాణించలేకపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ఆది నుంచి మహిళా క్రికెట్పై బాలికల తల్లిదండ్రుల్లో ఆసక్తి లేకపోవడం, క్రికెట్ సంఘాల ప్రతినిధుల ప్రేక్షకపాత్ర, టర్ఫ్వికెట్ వంటి నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడం తదితర కారణాలతో ఎలాంటి మెరుపులు లేకపోయాయి. జిల్లా నుంచి కేవీఎస్పీ చందన, హారిక యాదవ్, బి.నవ్య, కుమూదిని రాష్ట్రస్థాయి వరకు ఆడగలిగారు. జాహ్నవి, వనజాక్షి స్టేట్ ప్రాబబుల్స్ వరకు ఎంపికయ్యారు. ఆధునిక హంగులతో నెట్స్.. తాజాగా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్స్ వద్ద అత్యాధునిక వసతులు, సౌకర్యాలు కల్పించారు. రెండు వికెట్లతో కూడిన నెట్స్ ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్లను అమర్చారు. నెట్స్ వద్ద సాధనకు హాజరయ్యే క్రీడాకారిణులకు ఇబ్బంది లేకుండా డ్రెస్సింగ్ రూమ్, రెస్ట్ రూమ్లను నిర్మించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు శిక్షణ అందించనున్నారు. కనీసం 10 ఏళ్లు పైబడి క్రికెట్పై ఆసక్తి కలిగిన బాలికలు ఈ నెట్స్ వద్దకు సాధనకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళా క్రికెట్ కోచ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఫిట్నెస్ను మెరుగుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మహిళా క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. తాజాగా అన్ని హంగులతో కూడిన నెట్స్ను శ్రీకాకుళం నగరం మధ్యలో ఏర్పాటు చేశాం. – ఇలియాస్ మహ్మద్, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ బాలికల క్రికెట్ను విస్తరించాలని జెడ్సీఎస్ సంకల్పించింది. శిక్షణకు హాజరయ్యే మహిళలకు, బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రెస్సింగ్రూమ్ను, రెస్ట్రూమ్లను ఏర్పాటు చేశాం. అన్ని వసతులు, సౌకర్యాలతో నెట్స్ సిద్ధం చేశాం. – మదీనా శైలానీ, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి -
గోడ కూలి కార్మికురాలు దుర్మరణం
మందస: భేతాళపురంలోని కొత్త వీధిలో శనివారం భవన నిర్మాణ పనులు జరుగుతుండగా గోడ కూలిన ఘటనలో కార్మికురాలు మృతి చెందింది. బచ్చల కాంతమ్మ(35), కీలు కనకదుర్గలు ఇటుకలు మోస్తుండగా ఒక్కసారిగా పక్కింటి గోడ వీరిపై కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో కాంతమ్మ అక్కడికక్కడే మరణించింది. కనకదుర్గ గాయాలుపాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. కాంతమ్మకు భర్త పాపారావు, ఇద్దరు పిల్లలు. ఎస్ఐ కె.కృష్ణప్రపాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వెంకన్నకు విశేష అలంకరణ శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని చిన్నబజారులో దూది వారి వేంకటేశ్వరాలయంలో శనివారం స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు. అర్చకులు శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామికి అష్టోత్తర శతనామాలతో అర్చనలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. మొండేటివీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో స్వామివారిని తులసిమాలలతో అలంకరించారు. -
10 వేల వాటర్ బాటిళ్లు ఇస్తే 4 పాసులు
అరసవల్లి: ఈ నెల 25న జరగనున్న రథసప్తమి ఉత్సవాలకు సంబంఽధించి భారీగా భక్తులు తరలిరానున్నారని.. వీరి కోసం 10 వేల వాటర్ బాటిళ్లు (250 మి.లీ.)ను ఆలయానికి సమర్పించిన దాతలకు, ఆలయంలో పుష్పాలంకరణకు అధికంగా పూలదండలను ఇచ్చిన వారికి విశిష్ట దర్శనంగా నాలుగు దాతల పాసులను ఇస్తామని ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ప్రకటించారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఆర్వో ప్లాంట్ నిర్వాహకులు తమ సంస్థ పేరును బాటిల్పై ముద్రించుకోవచ్చునని చెప్పారు. దాతలను ప్రోత్సహించే క్రమంలో కార్యాలయంలో పేర్లను రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేస్తున్నామని వివరించారు. నగరానికి చెందిన దీపక్ కర్ణాణి అనే వ్యాపారి శనివారం పది వేల వాటర్ బాటిళ్లు, రూ.లక్ష విలువైన ఏడు వాటర్ డిస్పెన్షరీలను ఆలయానికి సమర్పించారు. వసతి గృహాలపై ప్రత్యేక శ్రద్ధ శ్రీకాకుళం పాతబస్టాండ్: వసతి గహాల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. శనివారం శ్రీకాకుళం రామలక్ష్మణ కూడలి వద్ద వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల గదులను పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్డబ్ల్యూఓకు దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని స్పష్టం చేశారు. విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో మెలగాలన్నారు. సామాజిక మాధ్యమాల దుష్ప్రభావానికి గురికాకుండా కేవలం చదువుపైనే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి ఇ.అనురాధ, సిబ్బంది పాల్గొన్నారు. రౌడీషీటర్కు రిమాండ్ శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని మంగువారితోటకు చెందిన రౌడీషీటర్ యలమంచిలి కోటేశ్వరరావు మద్యం మత్తులో పబ్లిక్ న్యూసెన్సు చేసినందుకు కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో పట్టణ ఎస్ఐ తెలిపారు. కోటేశ్వరరావు శనివారం ఉదయం కిన్నెర థియేటర్ వద్ద మద్యం సేవించి ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాడని, అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. -
మార్కులు..మార్పులు!
శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల్లో భాగంగా ఇంటర్మీడియెట్ విద్యామండలి అధికారులు ఈ ఏడాది నుంచి ఫస్టియర్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు అమలవుతున్న ఆరు పేపర్ల విధానానికి బదులు ఐదు పేపర్లకు కుదించారు. మ్యాథ్స్, బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల ప్రశ్నపత్రాల్లో మార్కుల కేటాయింపు, ప్రశ్నపత్రం సైతం మార్పు చేశారు. అయితే ఈ విషయమై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రిన్సిపాళ్లకు, సీనియర్ లెక్చరర్లకు బోర్డు అధికారులు పరీక్షల పేట్రన్పై అవగాహన కల్పించి మమ అనిపించారని, పరీక్షల తీరుతెన్నులపై విద్యార్థులకు మాత్రం అవగాహన కల్పించలేదని సమాచారం. సెకెండియర్ విద్యార్థులకు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త పేట్రన్ అమలుచేయనున్నారు. 39,733 మంది విద్యార్థులు.. జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 39,733 మంది చదువుతున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 19,825 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19,908 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. సర్కారీ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రభుత్వం ‘సంకల్ప్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతర్గత పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను గ్రేడ్లుగా విభిజించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఒకే పేపర్గా.. ప్రథమ సంవత్సరం పరీక్షల విధానం, సబ్జెక్టులవారీగా పేపర్లకు మార్కుల కేటాయింపుల్లో కీలక మార్పులు చేశారు. ఎంపీసీ గ్రూపును 500 మార్కులగా నిర్ణయించారు. రాత పరీక్షలకు 470 మార్కులు, ప్రాక్టికల్స్కు 30 మార్కులు (ఫిజిక్స్15, కెమిస్ట్రీ15 చొప్పున) కేటాయిస్తున్నారు,. ● ఇప్పటివరకు మ్యాథ్స్ పరీక్షను రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. పేపర్–1ఏకు 75 మార్కులు, పేపర్–2ఏకు 75 మార్కులు కలిపి 150 మార్కులకు పరీక్షలు జరిగేవి. ఇకపై మొదటి సంవత్సరంలో 100 మార్కులకు ఒకటే మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. పాస్ మార్కులు 35గా నిర్ణయించారు. ● గతంలో ఫిజిక్స్ 60 మార్కులు, కెమిస్ట్రీ 60 మార్కులకు ప్రశ్నపత్రం ఉండేది. వాటి స్థానంలో ఈ రెండు సబ్జెక్టులు ఒక్కొక్క పేపర్ 85 మార్కులకు మార్పు చేశారు. వీటితో పాటు రెండు లాంగ్వేజి సబ్జెక్టులు ఒక్కొక్కటి వంద మార్కులకు ఉంటుంది. కొత్తగా బయాలజీ పేపర్.. బైపీసీ గ్రూపునకు సంబంధించి 500 మార్కులగా నిర్ణయించారు. ఇందులో రాత పరీక్షలకు 455 మార్కులు, ప్రాక్టికల్స్కు 45 మార్కులు (ఫిజిక్స్ 15, కెమిస్ట్రీ15, బోటనీ, జువాలజీతో కలబోసిన బయాలజీ 15 మార్కులు)గా కేటాయించారు. ● ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ రెండు సబ్జెక్టులు కలిపి 85 మార్కులకు ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఇందులో బోటనీకి 43 మార్కులు, జువాలజీకి 42 మార్కులు నిర్దేశించారు. మూల్యాంకనానికి వీలుగా జవాబు పత్రాలు మాత్రం వేర్వేరుగా ఇవ్వనున్నారు. గతంలో బోటనీ 60 మార్కులు, జువాలజీ 60 మార్కులకు ఉండేవి. ● విద్యార్థులు రెండు జవాబు పత్రాల్లో బోటనీ, జువాలజీ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. బయాలజీలో ఉత్తీర్ణత 29.5 మార్కులుగా నిర్ధారించారు. కానీ అరమార్కు ఉండదు కాబట్టి 29 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు పరిగణిస్తారు. ● 2025–26 విద్యా సంవత్సరంలో నూతన విధానంలో పరీక్షలు రాసిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలో సెకెండియర్లోనూ ఇలాగే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో సెకండియర్ పరీక్షలు రాయబోయే విద్యార్థులు మాత్రం పాత విధానంలోనే పరీక్షలు రాస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పలు సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ప్రిన్సిపాళ్లకు, లెక్చరర్లకు అవగాహన కల్పించాం. విద్యార్థులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – రేగ సురేష్కుమార్, డీవీఈఓ/ఆర్ఐఓ ఇంటర్మీడియెట్ బోర్డు, శ్రీకాకుళం ఇంటర్ పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు ఫస్టియర్ ఎంపీసీ, బైపీసీ పరీక్షల్లో ఐదు పేపర్లే.. విద్యార్థులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారించని ప్రభుత్వం -
●ఒత్తిడి తట్టుకోలేక..
ఇచ్ఛాపురం మండలం కేశుపురం పంచాయతీ సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన మాసుపత్రి శంకర్, లోలమ్మల రెండో కొడుకు మాసుపత్రి విజయ్(21) ఏడు నెలల కిందట తన అన్నయ్య బన్నీతో కలసి అబుదాబి వెళ్లాడు. సోదరులిద్దరూ ఓ కంపెనీలో ఫిట్టర్లుగా పనిచేసేవారు. అక్టోబర్ 22 తెల్లవారుజామున ఆరు గంటలకు విజయ్ తల్లిదండ్రుల తో బాగానే మాట్లాడాడు. తర్వాత ఏమైందో గానీ పెద్ద కొడుకు బిన్నీ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్తను చేరవేశాడు. తమ్ముడు బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. దీంతో తల్లిదండ్రులు శంకర్, లోలమ్మలు ఉన్నచోటనే కుప్పకూలిపోయారు. వారం రోజుల తర్వాత మృత దేహం స్వగ్రామం చేరుకుంది. సంబంధిత కంపెనీ నుంచి పరిహారమే దక్కలేదు. -
బోధన సామర్థ్యాలు పెంపొందించాలి
కంచిలి: బోధన సామర్థ్యాలు మరింతగా పెంపొందించి, ఉత్తమ ఫలితాల సాధనకు అధ్యాపకులు కృషిచేయాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారి, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి ఆర్.సురేష్కుమార్ అన్నారు. ఆయన కంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో గత ఏడాది కంటే మెరుగవ్వాలని కళాశాల ప్రిన్సిపాల్ ఉరిటి జగదీష్ కుమార్ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆదేశించారు. అంతకన్నా ముందు కళాశాల ఆవరణలో నిర్మించిన ఫిజిక్స్ ల్యాబ్ను ప్రారంభించారు. ప్రిన్సిపాల్ సొంత నిధులతో నిర్మించిన కెమిస్ట్రీ ల్యాబ్ను పరిశీలించారు. విద్యార్థుల పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమ లు తీరును పరిశీలించారు. ఆయనతో పాటు కళాశాల ప్రిన్సి పాల్, అధ్యాపకులు వేణుగోపాల్, దాస్ పాల్గొన్నారు. -
శ్రీకాకుళం
మార్కులు.. మార్పులుఇంటర్ పరీక్ష విధానం మారుతోంది. దీనిపై అవగాహన కరువవుతోంది. –8లోకన్నీటి కథలు తెలుసా..? సారవకోట: మండలంలోని చీడిపూడి కల్యాణ వేంకటేశ్వర స్వామికి శనివారం 25 కిలోల వెన్నతో అలంకరించారు. శ్రీదేవి, భూదేవి సహిత వేంకటేశ్వరస్వామి మూల విరాట్లను ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అలంకరించినట్లు అర్చకులు రామానుజాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక, విశేష పూజలు, అభిషేకాలు, తులాభారం నిర్వహించారు. శ్రీకాకుళం న్యూకాలనీ: జాతీయ స్థాయి గట్కా(మార్షల్ఆర్ట్స్) స్కూల్ గేమ్స్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పంజాబ్లోని లూథియానా వేదికగా ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–19 బాలబాలికల గట్కా చాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ఎం.మోహన్ (10వ తరగతి), జి.అగస్థ్యరాం (10వ తరగతి), ఎల్.కీర్తి (8వ తరగతి) ఎంపి కయ్యారు. అలాగే ఇవే పోటీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బృందానికి మేనేజర్గా ఫిజికల్ డైరెక్టర్ నిమ్మక పార్వతి నియామకమయ్యారు. ఈ పోటీల కోసం వీరంతా ఆదివారం ఇక్కడ నుంచి లూథియానా పయనమై వెళ్తున్నారు. నరసన్నపేట: విద్యార్థి దశలో టెన్త్ చాలా కీలకమని, ఈ తరగతి మీ భవిష్యత్కు పునాది వేస్తుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. కంబకాయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బమ్మిడి మన్మధరావుతో పాటు ఉపాధ్యాయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాగోటి ఉమామహే శ్వరి, విశ్రాంత ఉపాద్యాయులు అప్పలనాయు డు తదితరులు ఉన్నారు. ఇచ్ఛాపురం మండ లం ధర్మపురం గ్రామానికి చెందిన ఉప్పాడ సోమేశ్ (32) ఎనిమిది నెలల కుమార్తె కావ్యశ్రీని విడిచి 2023 అక్టోబర్ నెలలో పోలెండ్ వెళ్లిన కొన్నాళ్లకు అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. ఊరు కాని ఊరు, భాష రాని మనుషుల మధ్య ఆస్పత్రిలో నరకయాతన అనుభవించాడు. తన కు చాలా భయంగా ఉందని, తన వద్ద ఎవ్వరూ లేరని, వైద్యం అందడం లేదంటూ భార్యకు వీడియో కాల్ ద్వారా తెలిపాడు. మరుసటి రోజే ఆయన ప్రాణాలు వదిలేశాడు. తన భర్త మృతదేహం స్వగ్రామానికి తెప్పించాలని భార్య అధికారులను బతిమలాడినా స్పందించలేదు. పో లెండ్లోనే దహన సంస్కారాలు పూర్తి చేసి బూడిదను మాత్రం ఇక్కడకు పంపారు. ప్రభుత్వం కూడా ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి పారా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలను ఈనెల 10వ తేదీన నిర్వహిస్తున్నామని స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేష న్ ఆఫ్ శ్రీకాకుళం ఉపాధ్యక్షుడు ఎన్.గిరిధర్, కార్యదర్శి డి.అచ్యుతరావు, ఎన్.మోహనరావు, కోశాధి కారి ఎన్.స్రవంతి, మజ్జియ్య, రమేష్ పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక్కడ ఎంపికైన పారా అథ్లెట్స్ను త్వరలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు పంపించనున్నట్టు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డుతో ఎంపికల కు హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 80081 62432, 9177693836 నంబర్లను సంప్రదించాలని వారు కోరారు. -
కేజీబీవీల్లో పోస్టుల భర్తీ కేజీబీవీల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 55 పోస్టులు భర్తీ చేయనున్నారు. –8లో
●ఈ ఏడాది మార్చి 21న పోలెండ్లో పలాస మండలం తర్లకోటకు పంచాయతీకి చెందిన బుడత దామోదర్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలెండ్ శ్రీకాకుళం తెలుగు సంఘం వారు చందాలు వేసుకుని సాయం చేశారు. ●ఈదుపురం గ్రామానికి చెందిన దల్లి గురుమూర్తి పోలెండ్లో వలస కూలీగా పనిచేస్తూ అనారోగ్యానికి గురయ్యాడు. స్నేహితుల సహాయంతో స్వగ్రామం చేరుకున్న గురుమూర్తి ఈ ఏడాది సెప్టెంబర్ 27న ఇంటి వద్ద మృతి చెందాడు. ●కంచిలి మండలం పురుషోత్తపురం పంచా యతీ గద్దలపాడు గ్రామానికి చెందిన నక్క నరసింహరావు అబుదాబిలోని ఎన్.ఎస్.హెచ్ కంపెనీలో వెల్డర్గా పనిచేస్తున్నా డు. ఈ ఏడాది అక్టోబ ర్ 26న కడుపునొప్పిగా ఉందంటూ చెప్పడంతో తోటి కార్మికులు ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం మొండి చేయి
విదేశాలకు వలస వెళ్లి దురదృష్టవశాత్తు చనిపోతున్న వారికి ప్రభుత్వ సాయం చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మాదిరి మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నష్ట పరిహారం అందిస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో మృతి చెంది తే మృతదేహం స్వదేశానికి తీసుకురావడానికి అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వం భరించాలని, మృతదేహం రాకపోతే, విదేశాల్లోనే అంత్యక్రియ లు నిర్వహిస్తే ఖర్చు చెల్లించడం, కేంద్ర ప్రభుత్వం ప్రవాస భారతీయ బీమా పథకం(పీబీబీంఐ) కింద ప్రమాద మరణమైతే రూ.10 లక్షలు, సాధారణ మరణం అయితే రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రవాసాంధ్రులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా ప్రమాదం ఉద్యోగ స్థల నిర్లక్ష్యంతో జరిగితే యజమానిపై కేసు నమోదు చేసి అధిక పరిహారం సాధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మృతుల కుటుంబాలకు ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. -
వలస.. దశాబ్దాలుగా సిక్కోలు గుండె మోస్తున్న భారమిది. పసి వయసులో ఉన్న బిడ్డ నాన్నా అని పిలిస్తే ఆ మనిషి ఇంటిలో కనిపించడు. అర్ధరాత్రి ఓ నిండు గర్భిణి ఉలిక్కిపడి నిద్ర లేస్తే ధైర్యం చెప్పేందుకు మగడు పక్కన ఉండడు. పండగొచ్చినా, పబ్బమొచ్చినా కన్నపేగుకు వండి పెడదా
కవిటి మండలం బొరివంక గ్రామానికి చెందిన శివ మజ్జి(23) చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నాడు. కుటుంబ బాధ్యత ను భుజానికెత్తుకున్నాడు. తల్లి మాట ప్రకారం ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లికి రెండే ళ్లు గడువు పెట్టి స్నేహితుడితో కలసి 2024 మార్చి లో దుబాయ్ వెళ్లాడు. ఆగస్టు 28న కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందినట్లు స్వగ్రామానికి సమాచారం అందడంతో కుటుంబమంతా హతాశుతులయ్యారు. వారం రోజుల తర్వాత మృత దేహం గ్రామానికి చేరుకుంది. నేటికి 16 నెలలు కావస్తున్నా ఆ కంపెనీ నుంచి నయా పైసా తన చేతికి అందలేదని మృతుడి తల్లి ఊర్మిళ మజ్జి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇచ్ఛాపురం మండలం డొంకూరు మత్స్యకార గ్రామానికి చెందిన బడే భాస్కరరావు ఉరఫ్ చంటి(22) ఏడాదిన్నర కిందట జీవనోపాధి కోసం అబుదాబికి వెల్డింగ్ హెల్పర్గా వెళ్లాడు. మీ కుమారుడు చంటి ఆత్మహత్య చేసుకున్నాడంటూ కంపెనీ ఎండీ ఈ ఏడాది నవంబర్ 25న ఫోన్లో సమాచారం అందివ్వడంతో గ్రామం విషాదంలో మునిగిపోయింది. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని తల్లి దండ్రుల ఆవేదన అరణ్య రోదనగా మిగిలింది. అబుదాబి పోలీసులు మరణాన్ని నమోదు చేసి వా రం రోజుల్లో మృతదేహాన్ని డొంకూరు పంపించా రు. కంపెనీ నుంచి ఎలాంటి పరిహారం అందలేదు. -
కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
సారవకోట: కంచు, ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు డీఆర్డీఏ పీడీ పెద్దింటి కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని బుడి తి గ్రామంలో మన ఊరు మన ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుడితి కంచు, ఇత్తడి పరిశ్రమ ప్రపంచ ప్రసిద్ధి చెందిందని, ఆ పరిశ్రమను జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ, బ్యాంకుల సహకారంతో రుణాలు మంజూరు చేసి వివిధ రకా ల యంత్రాలను ఏర్పాటు చేసి మరింత ఉత్పత్తి పెరిగేందుకు కృషి చేస్తామన్నారు. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రుణాల గురించి వివరించారు. బుడితితో పాటు నరసన్నపేట మండలంలోని మాకివలస గ్రామంలో ఈ కంచు, ఇత్తడి పరిశ్రమ ఉందని వారికి సైతం తగిన రుణాలు మంజూరు చేసి అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆయనతో పాటు జిల్లా పరిశ్రమల శాఖ ఇన్చార్జి డీఓ పీవీ రఘునాఽథ్, ఆర్జీఈఐటిటి రామ్జి, డీఆర్డీఏ డీపీఎం నారాయణరావు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రామినాయుడు ఉన్నారు. -
తైక్వాండో స్టేట్మీట్ ప్రారంభం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో ఏపీ రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ తైక్వాండో కుర్గీ, పూమ్సే చాంపియన్షిప్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ కల్యాణ మండపంలో జరుగుతున్న రెండు రోజుల టోర్నీలో భాగంగా తొలిరోజు వివిధ జిల్లా నుంచి చేరుకున్న క్రీడాకారులకు వేయింగ్ (బరువు) పూర్తి చేశారు. స్థానికంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. రెండోరోజు ఆదివారం పోటీలను పూర్తిచేసి, విజేతలకు పతకాలు, బహుమతులు, ప్రసంశాపత్రాలు అందజేయనున్నారు. బరువు పరిశీలిస్తున్న దృశ్యం -
వినూత్నంగా బోధిస్తూ.. విద్యా దీపాలు వెలిగిస్తూ..
● ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తున్న మహిళలు ● అత్యుత్తమంగా బోధన ● నేడు అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం ఇచ్ఛాపురం రూరల్: తరగతి గదిలో జ్ఞాన దీపాలు వెలిగిస్తూ, సమాజానికి దిశా నిర్దేశం చేస్తున్నారు పలువురు మహిళా ఉపాధ్యాయులు. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా విలువలు–వినయం–విజ్ఞానం నేర్పుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తల్లిలాంటి స్నేహం, గురువు లాంటి క్రమశిక్షణను విద్యార్థులకు అందిస్తూ పిల్లలను కంటిరెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కొంత మంది ఉపాధ్యాయినుల గురించి అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఇచ్ఛాపురం మండలం ఈదుపురం కండ్రావార్డు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె పేరు బూరవెల్లి ఉమామహేశ్వరి. తరగతిలో సామాన్య విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠం చెప్పడం ఈమె ప్రత్యేకత. టీఎల్ఎంతో పాటుగా, క్షేత్రస్థాయి పర్యటనలు, ఫ్లో చార్టులు, ప్రోజెక్ట్, బృంద కృత్యాలతో ప్రతి విద్యార్థి అన్నింటిలో భాగమయ్యేలా ప్రోత్సహిస్తుంటారు. నేషనల్ గ్రీన్ కోర్ నోడల్ ఆఫీసర్గా 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్న ఈమెకు కేంద్ర ప్రభుత్వం ‘సారాభాయి టీచర్ సైంటిస్ట్’ అవార్డుతో గౌరవించింది. గత ఏడాది ఆగస్టులో న్యూ ఢిల్లీ ప్రగతి మైదానంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతులు మీదుగా ఉత్తమ బహుమతి అందుకున్నారు. ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన ఊర్మిళా కుమారీ రథోకు చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఆసక్తి. ఇచ్ఛాపురం బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు అథ్లెటిక్స్లో పాల్గొని బహుమతులు సాధించారు. బీపీఈడీ పూర్తిచేసి వ్యాయోమాపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. రాజపురం గర్ల్స్ హైస్కూల్లో తన ప్రస్థానం మొదలు పెట్టిన ఈమె ప్రస్తుతం లొద్దపుట్టి ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు క్రీడలు, యోగా విద్యలో తర్ఫీదు ఇస్తున్నారు. ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాద్యా యురాలిగా పనిచేస్తున్న పి.హేమలత గణితం సులభంగా బోధిస్తుంటా రు. లెక్కలంటే భయపడే విద్యార్థులకు ఆమె పాఠం మొదలు పెడితే తర గతి అంతా నిశ్శబ్ధం అలముకుంటోంది. కష్టతరమైన లెక్కల్ని సైతం అలవోకగా చెబుతుంటారు. మరోవైపు ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యత లు నిర్వర్తిస్తూ బడికి బాసటగా నిలుస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల కు పబ్లిక్ పరీక్షల సన్నద్ధతపై స్వయంగా అవగాహన కల్పిస్తున్నారు. -
ఏఎన్ఎంల పదోన్నతులపై ఫిర్యాదు
సారవకోట : జిల్లాలోని వైద్యారోగ్య శాఖ ఏఎన్ఎంల పదోన్నతుల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ జరపాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు కోరారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం ఆ శాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఏఎన్ఎం సీనియారిటీ లిస్టు విడుదల చేయలేదని, పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, ఆదివాసీలకు ఆరు శాతం రిజర్వేషన్లు కల్పించలేద ని ఆరోపించారు. లక్షలాది రూపాయలు వసూలు చేసి అడ్డగోలుగా మెరిట్ లిస్టు తయారు చేసిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావు, జిల్లా అధ్యక్షు డు గురాడి అప్పన్న, మెళియాపుట్టి మండల అధ్యక్షుడు ఎస్.గణేష్ పాల్గొన్నారు. -
బడి బస్సులు భద్రమేనా?
హిరమండలం: జిల్లాలో బడి బస్సుల భద్రతపై అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విద్యాసంవత్సరంలో సామర్థ్య పరీక్షలు, త్రైమాసిక తనిఖీలు చేపడుతున్నామని చెబుతున్నా ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. ఈ విషయంలో రవాణా శాఖ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి కాలం చెల్లిన బస్సులు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలకు దిగితేనే ప్రమాదాలు అరికట్టవచ్చని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 398 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ప్రైవేటు జూనియర్ కాలేజీలు 71, డిగ్రీ కాలేజీలు 85, ఇంజినీరింగ్ కాలేజీలు 3 ఉన్నాయి. వీటికి సంబంధించి 580 బస్సులు ఉన్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో మే నెలలో సామర్థ్యం పరీక్షలు నిర్వహించారు. గతంలో రవాణా శాఖ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టేవారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. దీంతో తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి పాఠశాల, కాలేజీ బస్సుల్లో ఇటీవల తనిఖీలు చేశారు. చాలా వాటిలో అగ్నిమాపక పరికరాలు లేవు. కొన్నిచోట్ల ఉన్నా పనిచేయట్లేదు. ప్రథమ చికిత్స కిట్లలో మందులు కాలం చెల్లినని ఉన్నుట్ల గుర్తించారు. స్పీడ్ గవర్నెన్స్లోనూ లోపాలు బయటపడ్డాయి. ఇటువంటి లోపాలు బయటపడిన 208 బస్సులకు నోటీసులు జారీచేశారు. మరోవైపు చాలా బస్సుల్లో వయసుకు మించిన వారు, డ్రైవింగ్ లైసెన్స్లు లేని వారు డ్రైవర్లుగా నియమించినట్టు ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ●గత ఏడాది ఫిబ్రవరిలో మందస మండలం ఉమాగిరి సమీపంలో చెరువులో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు పడిపోయింది. ఆ సమయంలో ఐదుగురు విద్యార్థులు బస్సులో ఉన్నారు. సమీపంలో ఉన్నవారు హుటాహుటిన చెరువులో దిగి విద్యార్థులను రక్షించారు. స్కూల్ బస్సులకు సంబంధించి యాజమాన్యాలు నిబంధనలు పాటించాలి. ఎప్పటికప్పుడు వాహన సామర్థ్య పరీక్షలు చేసుకోవాలి. ఎటువంటి లోపాలు ఉన్నా సరి చేసుకో వాలి. అనుభవం ఉన్న డ్రైవర్లను నియమించుకోవాలి. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. – కె.వెంకటేష్ ఇన్చార్జ్ ఎస్ఐ, హిరమండలం పాఠశాల బస్సుల విషయంలో యంత్రాంగం ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఫీజు లు వసూలు చేస్తున్నవారు అందుకు తగ్గట్టు పాఠశాల బస్సుల నిర్వహణ చేపట్టడం లేదు. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే బస్సు సామర్థ్యంగా ఉండాలి. నిపుణులైన డ్రైవర్ ఉండాలి. ఈ విషయంలో అధికారు లు జాగ్రత్తలు తీసుకోవాలి. – కె.చిన్నారావు విద్యార్థి తండ్రి, ఎల్ఎన్పేట -
రోడ్డు భద్రత అందరి బాధ్యత
శ్రీకాకుళం అర్బన్: రోడ్డు భద్రత మనందరి బాధ్యత అని ఆర్టీవో గంగాధర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ ఒకటో డిపో గ్యారేజీ ఆవరణలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. జిల్లా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మనమంతా కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కె.ఆర్.ఎస్.శర్మ, అసిస్టెంట్ మేనేజర్లు పి.సంతోష్కుమార్, ఎ.గంగరాజు, ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు ఏఎన్ఎస్ శ్రీనివాస్, ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆదిత్యుని సన్నిధిలో గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిస్
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ని గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సునీత అగర్వాల్ కుటుంబసమేతంగా శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. వీరి వెంట జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా తదితరులున్నారు. ఎచ్చెర్ల : రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ క్యాలెండర్ను శుక్రవారం ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ఆవిష్కరించారు. ఉన్న త విద్యారంగ అభివృద్ధిలో వర్సిటీతో కలిసి పనిచేయాలని సంఘ ప్రతినిధులకు వీసీ సూచించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.చక్రపతి, కార్యదర్శి ఎస్.రామకృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్.ఢిల్లీశ్వరరావు, రాష్ట్ర అకడమిక్ కార్యదర్శి డి.పైడితల్లి, యూనివర్సిటీ కార్యదర్శి బి.మోహనరావు పాల్గొన్నారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం కిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. గత నెల 28 ఏళ్ల మహిళ కిడ్నీ సంబంధిత వ్యాధితో కిమ్స్ వైద్యులను సంప్రదించింది. ఆమెకు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యు లు గుర్తించారు. ఓ 32 ఏళ్ల మహిళ కిడ్నీని ఇచ్చేందుకు సమ్మతించారు. దీంతో కిమ్స్ వైద్యులు డిసెంబర్ 24న శస్త్రచికిత్స జరిపారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకోవడంతో శనివా రం ఆమెను డిశ్చార్జి చేసేందుకు నిర్ణయించా రు. శస్త్రచికిత్స విజయవంతం కావడంలో వైద్యులు ఉమామహేశ్వర్, మురళి, బి.రమణ, గౌతమి, బాలకష్ణ, మురళీ, ఝాన్సీలక్ష్మి, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ జోగినాయుడు కీలక పాత్ర పోషించారు. వీరిని కిమ్స్ చైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, డాక్టర్ గూడెన సోమేశ్వరరావు శుక్రవారం అభినందించారు. శ్రీకాకుళం రూరల్: అరసవల్లి రథసప్తమి ఉత్సవాలను ఈ ఏడాది వారం రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ వెల్లడించారు. శుక్రవారం సింగుపురం పంచాయతీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రథసప్తమి ఈ నెల 25 కాగా.. 19 నుంచి వారం రోజుల పాటు ఉత్సవాలను ప్రణాళికాబద్ధగా నిర్వహిస్తామ న్నారు. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో వైద్యం కోసం ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇటీవల వైద్యం కోసం రిమ్స్ ఆస్పత్రి లో చేరిన వారిని డబ్బులు డిమాండ్ చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సింగుపురంలో ని నర్సింగ్ వైద్య కళాశాల ఫిబ్రవరి మొదటి వా రంలో ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పి.ఎం.జె.బాబు, సర్పంచ్ ఆదిత్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు మహాసభలకు శరత్బాబు శ్రీకాకుళం కల్చరల్ : గుంటూరులో కరుణశ్రీ, జాషువా సాహితీ వేదికపై ఈ నెల మూడో తేదీ నుంచి జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల కవి సమ్మేళనం సహ సమన్వయకర్తగా శ్రీకాకుళం రచయిత, విశ్వసాహితీ కళావేదిక సంస్థ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధి జంధ్యాల శరత్బాబు నియమితులయ్యారు. గజల్ శ్రీనివాస్ నేతృత్వంలో తెలుగు తోరణం ప్రదర్శన, గ్రంథాల ఆవిష్కరణ తదితర కార్యక్రమాలు ఉంటాయని శరత్బాబు శుక్రవారం తెలిపారు. -
మృదంగ తరంగం
● రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన కుర్రాడు కంచిలి: డ్రమ్స్ అంటూ జాక్బాక్స్ అంటూ పాశ్చాత్య శైలికి బాగా ఆకర్షితులమవుతున్న రోజు ల్లో ఓ పదో తరగతి విద్యార్థి మృదంగం ధ్వనిని ఇష్టపడుతున్నాడు. తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సంగీతాన్ని బతికించేందుకు మృదంగం వాయించడం నేర్చుకున్నాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి కళకు కాపలా ఉంటానని ప్రకటించాడు. కంచిలి మండలం జాడుపూడి గ్రామానికి చెందిన బొయిరిశెట్టి గౌతమ్ మృదంగ విద్యలో నిష్ణాతుడవుతున్నాడు. కొద్దినెలల క్రితం విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవ పోటీ ల్లో సత్తా చాటాడు. ఆమదాలవలసకు చెందిన మావుడూరు సూర్యప్రసాద్ శర్మ ఆశీస్సులతో శ్రీ మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ప్రచార కార్య దర్శి, ప్రముఖ మృదంగ వి ద్వాంసుడు చలపరాయి వినో ద్ కుమార్ శిష్యరికంలో గౌతమ్ రాటుదేలుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. గౌతమ్ తాత ఒడిశా పరిధి గుడ్డిపద్ద గ్రామానికి చెందిన ధవలశెట్టి కూర్మారావు గాత్ర కళాకారుడు. తండ్రి మోహనరావు హార్మోనియం వాయిస్తారు. తల్లి జీవేశ్వరి గృహిణి. ప్రస్తుతం తండ్రి మోహనరావు బయటి దేశానికి ఉపాధి కోసం వెళ్లారు. సంగీతంపై ఆసక్తి ఉండడంతో గౌతమ్ను చిన్నప్పుడే చలపరాయి వినోద్కుమార్ వద్ద చేర్పించారు. అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి పోటీల వరకు ఎదిగాడు. ఇటీవల స్వగ్రామం జాడుపూడిలోను, ఆర్.బెలగాం పాఠశాలలో గౌతమ్ను సత్కరించారు. -
104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం చేస్తోందని సీఐటీయూ నాయకులు(యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్) మురళి, 104 ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎం.గోవర్ధనరావు మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో అనుబంధ సంఘాల అఖిలపక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. జిల్లా అధ్యక్షుడు చల్ల నారాయణ మాట్లాడు తూ క్యాజువల్ లీవ్లు పునరుద్ధరించాలని, ప్రభు త్వ సెలవులు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రామారావు మాట్లాడుతూ బఫర్ సిబ్బందిని తిరిగి నియమించి ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ దాసరి మహేష్, సీఐటీయూ నాయకులు సాయి ప్రకాష్, అంగన్వాడీ నాయకురాలు కళ్యాణి, ఆశ వర్కర్లు యూనియన్ నాయకులు నాగమణి, 108 ప్రెసిడెంట్ విజయమోహన్, సీతారాం రాజు, డివిజన్ నాయకులు కూర్మారావు, మహేష్ కిరణ్, బాలకృష్ణ పాల్గొన్నారు. -
6 నుంచి కార్గో ఎయిర్ పోర్టు కోసం భూ సర్వేలు
మందస: కార్గో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం ఈ నెల 6 నుంచి విజయవాడ రైట్ సంస్థ వారు భూ సర్వేలు (సాయిల్ టెస్ట్) చేస్తారని, అలాగే ఎన్హెచ్–16 రోడ్డుకు ఎంత దూరంగా ఉందో ఆర్అండ్బీ శాఖ కూడా సర్వే చేస్తారని కార్గో ఎయిర్ పోర్టు లీగల్ అడ్వైజర్ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన శుక్రవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కార్గో ఎయిర్ పోర్టు బాధిత రైతులకు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఒక ఎకరాకు 20 సెంట్లు భూమి ఇస్తారని, ప్రతి కుటుంబంలోని చదువుకున్న యువతకు వారి క్వాలిఫికేషన్ ప్రకారం ఉద్యోగ కల్పన జరుగుతుందని, లేదంటే కుటుంబానికి ప్యాకేజీ రూపంలో చెల్లింపులు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వరరావు, ఆర్ఎంఓ మిస్క శ్రీకాంత్, డీటీ వై.రామకృష్ణ, ఎంఈఓ లక్ష్మణరావు, మండల సర్వేయర్ బాబురావు అధికారులు పాల్గొన్నారు. సైనికుడికి ఘన స్వాగతం రణస్థలం: భారత సైన్యంలో ముప్పై ఏళ్లు పని చేసి ఉద్యోగ విరమణ పొందిన సుబేదార్ ఆళ్ల అప్పన్న రెడ్డికి స్వగ్రామం నారువ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ గ్రామ యువత సుమారు వంద బైక్లు, పదుల సంఖ్యలో కార్లతో పైడిభీమవరం నుంచి నారువ గ్రామం వరకు భారీ ఊరేగింపుగా జాతీయ జెండాలు చేతబూని జై భారత్, జై సైనికా నినాదాలతో తీసుకువచ్చారు. మహిళలందరూ హారతులు పట్టి స్వాగతం పలికారు. 1995 డిసెంబర్ 30న సైనికుడిగా విధుల్లో చేరిన అప్పన్న, 2025 డిసెంబర్ 31 ఉద్యోగ విరమణ పొందారు. 4న క్రికెట్ నెట్స్ ప్రారంభం శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళంలో క్రికెట్ అబివృద్ధి కోసం సహకరించాలని జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహ్మద్ విన్నవించారు. ఈ మేరకు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను అతని క్యాంపు కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్స్ను ఈ నెల 4న ఎమ్మెల్యే, అధికారులు, జిల్లా క్రికెట్ సంఘం ముఖ్య ప్రతినిధుల సమక్షంలో ప్రారంభించాలని నిర్ణయించినట్టు ఇలియాస్ చెప్పారు. ఎరువుల కొరత ఉండకూడదు: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఎరువుల కొరత ఉండకూడదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ శాఖ జేడీ త్రినాథ స్వా మి, ఇతర అధికారులకు సూచించారు. ఆయన శుక్రవారం సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రైతుల అవసరాలకు తగ్గట్టుగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వ్యవసాయ సహాయకులకు దిశానిర్దేశం చేశారు. రైల్వే గేట్ల తొలగింపునకు అవసరమైన కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. అంతకుముందు ఆయన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. రైల్వే బోర్డు నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని రైల్వే గేట్ల స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిల నిర్మాణానికి రైల్వే శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఫిబ్రవరి 10లోగా ‘యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే’ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన గడువు విధించారు. -
రిమ్స్లో కొనసాగుతున్న నిరసన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్లో సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం జీతాలు చెల్లించాలంటూ శుక్రవారం కూడా నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం చట్టవిరుద్ధమన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తూ కార్మికులను వేధిస్తున్న శ్రీ కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్, క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ లిమిటెడ్ యాజమాన్యాలపై ప్రభుత్వం సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారు లు, ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు, పారిశుద్ద్య కార్మికుల ప్రధాన కార్యదర్శి దమ్ము చిన్నారావు, సాదు శ్రీనివాస్, దమ్ము వామనరావు, తంగి ప్రభ, కొర్లకోట విజయ, దువ్వి జయప్రద, మిర్తిపాటి మోహన్, చంద్రకళ, కొప్పల రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్త పేరుకుపోతుంటే ఏం చేస్తున్నారు?
● ఎంపీడీఓపై జెడ్పీ సీఈఓ ఆగ్రహం శ్రీకాకుళం రూరల్: ిసంగుపురం రహదారిపై నిత్యం దుర్వాసన వస్తోందని, ప్రధాన రహదారిపై ఎక్కడికక్కడే చెత్తచెదారాలు కుప్పలుగా పేరుకుపోయినా పంచాయతీ అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నా రని జెడ్సీ సీఈఓ సత్యనారాయణ శ్రీకాకుళం ఎంపీడీఓ ప్రకాశరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆ ప్రాంతం మీదుగా ప్రయాణిస్తున్న సీఈఓ వాహనం ఆపి పరిశీలించారు. జాతీయ రహదారిపై నిత్యం ఇదే దారిలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తుంటారని, ఇలా ఎక్కడికక్కడే చెత్తచెదారాలు పారబోస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రధాన రహదారి పరిస్థితే ఇలా ఉంటే గ్రామ వీధుల్లో పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని అసహనం వ్యక్తం చేశారు. -
భూముల రీసర్వేతో రైతులకు లబ్ధి
గార: భూముల రీసర్వే 4.0తో రైతులకు లబ్ధి చేకూ రుతుందని కేంద్ర పౌరవిమానాయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహననాయుడు అన్నారు. గార మండలం అంపోలు పంచాయతీలో సర్పంచ్ గొండు జయరాం అధ్యక్షతన భూమి రీసర్వే 4.0ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి ప్రారంభించారు. ముందుగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామస భ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ వారం రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ చేపట్టిందన్నారు. అనంతరం అంపోలు పంచాయతీలో డ్రోన్ ద్వారా తీసిన సర్వే మ్యాపును తహశీల్దార్ మునగవలస చక్రవర్తి చూపించి వివరాలు తెలియజేశారు. స్థానిక అగస్త్యేశ్వర చేనేత సహకార సంఘాన్ని సందర్శించిన కేంద్రమంత్రికి చేనేత కార్మికులు సమస్యలు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె.సాయిప్రత్యూష, ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓలు కేవీవీ జగన్నాథం, ఆర్.సత్యనారాయణ ఎంపీటీసీలు గొండు అచ్యుతరావు, పొదిలాపు రామజోగి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయుల దాడి
● లావేరు మండలం వేణుగోపాలపురంలో ఘటన రణస్థలం: లావేరు మండలంలోని గుమడాం పంచాయతీలో గల వేణుగోపాలపురం (ఆగ్రహారం) లో వైఎస్సార్ పీపీ కార్యకర్తపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. బాధితుడు మీసాల రామప్పడు పోలీ సులకు తెలిపిన వివరాలు ప్రకారం.. రామప్పడు శుక్రవారం ఉదయం ఇంటికి వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులైన ఇజ్జురోతు సూర్యారావు, ఆశ వర్కర్ భూలక్ష్మి ఆయనను పిలి చారు. దుర్భాషలాడుతూ మీద మీదకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇజ్జురోతు బ్రహ్మాజీ రాయితో ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో చుట్టుపక్కల వారు చూసి రక్తపు మడుగులో ఉన్న రామప్పడును రణస్థలం సీహెచ్సీకి తరలించారు. అక్కడకు లావేరు ఏఎస్ఐ ఎస్.ప్రసాదరావు వచ్చి వాంగ్మూలం సేకరించారు. ఈ ఘటనలో నిందితు డు ఇజ్జురోతు బ్రహ్మాజీ కూడా పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి తెలిపారు. గొడవకు దారి తీసిన కారణాలివే.. ఇజ్జురోతు బ్రహ్మాజీకి సంబంధించి ఒక భూమి వివాదంలో ఉంది. ఆ వివాదం వైఎస్సార్ సీపీ సర్పంచ్ ప్రతినిధి దుర్గాశి ధర్మారావు క్లియర్ చేశారు. దీంతో బ్రహ్మాజీ సర్పంచ్పై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయాన్ని మీసాల రామప్పడు సర్పంచ్ ధర్మారావుకు చేరవేశారు. మూడు రోజుల కిందట ఎందుకిలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావని గ్రామపెద్దలు, సర్పంచ్ ధర్మారావు బ్రహ్మాజీని మందలించారు. తాను తిడుతున్న విషయం సర్పంచ్కు రామప్పడు చేరవేశాడనే అక్కసుతో అతనిపై దాడికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. -
ఇంట్రస్ట్ ఉందా.. లేదా..?
● అరసవల్లిలో ట్రస్ట్ బోర్డు నియామకాలెప్పుడో..? ● గడువు ముగిసి 120 రోజులు దాటినప్పటికీ కానరాని ఆదేశాలు అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయానికి పాలకమండలి సభ్యుల నియామకానికి ఇంకా గ్రహణం వీడలేదు. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలన్నింటికీ ట్రస్ట్ బోర్డులను నియమించేలా ఆదేశించిన ప్రభుత్వం అరసవల్లి ఆలయ విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోంది. కూటమి రాజకీయాల నడుమ స్థానిక ఎమ్మెల్యే మంత్రుల చొరవతో ఇంకా ఈ ట్రస్ట్ బోర్డు నియామకాలకు లెక్కలు తేలలేదని తాజా పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తుల గడువు కూడా ముగిసి వందరోజులు దాటినప్పటికీ.. ఇంతవరకు పాలకమండలి సభ్యుల నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ రాలేదు. ఈ నియామకాల ఉత్తర్వులు ఎప్పుడెప్పుడొస్తాయో అని తెలుగు తమ్ముళ్లతో పాటు జనసేన, బీజేపీ కీలక కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ‘ట్రస్ట్’ రికార్డు లేని టీడీపీ టీడీపీ గతంలో రాష్ట్రంలో పలుమార్లు అధికారం చేపట్టినప్పటికీ అరసవల్లి ఆలయానికి ట్రస్ట్ బోర్డు నోటిఫికేషన్తో పాటు నియామకాలను చేపట్టడం విషయంలో ఎప్పుడూ వెనుకడుగే కనిపించింది. గత రికార్డులను పరిశీలిస్తే అప్పట్లో ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉన్నప్పుడు కూడా ఎన్నడూ ఈ ఆలయానికి ట్రస్ట్ బోర్డును నియమించలేదు. అలా గే గత 2014–19లోనూ, స్థానికంగా ట్రస్ట్ బోర్డు నియామకానికి చెందిన నోటిఫికేషన్ను తొలిసారిగా వేసినప్పటికీ నియామకాలు లేకుండా కాలం గడిపేశారు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వంలో కూడా గత ఏడాది ఆగస్టు 7న నియామకాలకు చెందిన నోటిఫికేషన్ను విడుదల చేసింది. అయితే నిబంధనల ప్రకారం అదే నెలాఖరు వరకు దరఖాస్తులకు గడువు ఇవ్వగా.. సుమారు 83 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా సమాచారం. అయితే గడువు ముగిసి కూడా 120 రోజులు దాటినప్పటికీ ఇంతవరకు స్థానిక టీడీపీ పెద్దలు దీనిపై ఎలాంటి దృష్టి సారించలేదు. ఫలితంగా ఈ నెల 25న జరుగనున్న రథసప్తమి మహోత్సవాల్లో కొత్త ట్రస్ట్ బోర్డు కళ లేకుండా ఉండనుందని తెలుస్తోంది. రథసప్తమిని రాష్ట్ర పండుగగా ఈనెల 19 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించేలా మంత్రి అచ్చెన్నా యుడు ప్రకటించిన నేపథ్యంలో పాలకమండలి నోటిఫికేషన్ వేసినప్పటికీ నియమించని పరిస్థితి నెలకొంది. తమ్ముళ్ల ఎదురుచూపులు జిల్లాలో అతిపెద్ద ఆలయంగా శ్రీ సూర్యనారాయణ స్వామిఆలయం డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉంది. అయితే జిల్లాలో శ్రీకూర్మం, శ్రీముఖలింగం, కోటబొమ్మాళి, రావివలస తదితర ఆలయాలతో పాటు గ్రేడ్–1, 2 ఆలయాల్లో కూడా చాలావరకు ట్రస్ట్ బోర్డు నియామకాలను చేపట్టారు. కీలకమైన అరసవల్లి ట్రస్ట్ బోర్డు నియామకాలు మాత్రం జరగకపోవడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నగర పార్టీ, వివిధ విభాగాల్లో తెలుగు తమ్ముళ్ల నియామకాలను పూర్తిచేసిన ప్రభుత్వం, అఽధికార పార్టీ పెద్దలు, అరసవల్లిలో నియామకాలకు సంబంధించి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర పండుగగా రథసప్తమిలోగానే ఈ నియామకాలు జరిగితే తమ గౌరవంతో పాటు ఆలయ అభివృద్ధికి కూడా మార్గం సుగమం అవుతుందని పలువురు నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. -
మాట వంకరం తీరు సంకరం
● కార్పొరేషన్లో బూతు పంచాంగంపై అంతర్మఽథనం ● ఉద్యోగులకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న నియోజకవర్గ కీలకనేత ● ప్రతి ఫైల్ తన అనుమతితోనే కదలాలని ఆదేశం ● మాట వినని అధికారులపై పరుష పదజాలంతో దూషణ ● కీలక నేత తీరుపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఆయనకెవరైనా చెప్పండి’.. అంటూ కార్పొరేషన్ ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. అధికార అహంభావంతో నోటికొచ్చిన మాట విసిరేస్తున్న కీలక నేత వైఖరిపై వారు విసుగెత్తిపోతున్నారు. జిల్లా కేంద్రంలో అధికార పార్టీకి చెందిన నియోజకవర్గ కీలక నేత ‘సొంత నిర్ణయాలు వద్దు.. చెప్పిన చోట సంతకాలు చేయాలి.. లేదంటే విధులు నుంచి తప్పుకోవాలి’ అంటూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. నోటికేది వస్తే అదే మాటలాడుతున్నారు. ఆయనకు నచ్చకుండా ఏదైనా చేసినట్లు తెలిసినా, ఆయన దృష్టిలో లేకుండా ఏ పనైనా చేసినా, తన అనుచరులు చెప్పినా నోటికొచ్చినట్లు చెప్పలేని భాషలో బూతుపురాణం మొదలెట్టి చివరికి ఉద్యోగం చేయాలంటే ఉండండి లేకుంటే వెళ్లిపోండని సీరియస్గా హెచ్చరికలు జారీ చేసేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు ఎప్పుడు అవకాశం వస్తే వేరే చోటకు వెళ్లిపోదామా అని చూస్తున్నారు. ● కొన్ని నెలల కిందట శ్రీకాకుళం నగరం పీఎన్కాలనీకి చెందిన ఓ సీనియర్ మున్సిపల్ ఇంజినీర్ (ఎమ్ఈ) కీలక నేత ఒత్తిడికి కొన్నాళ్లు సెలవు పెట్టి ఆ తర్వాత విశాఖపట్నంకు బదిలీపై వెళ్లిపోయారు. ● గత ఏడాది జూన్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమం సమయంలో పలుచోట్ల టాయిలెట్స్తో పాటు సౌకర్యాలు కల్పించడం చేతకాలేదని మున్సిపల్ అధికారులను ఉద్దేశించి ‘మీరు తాగుబోతులు.. తాగి పడుకోండి.. నీలాంటోడికి ఉద్యోగం ఎందుకు’ అంటూ చెప్పలేని భాషలో తిట్టడంతో ఎవరికీ చెప్పుకోలేక ఉండలేక మిన్నకుండిపోయారు. ● ఇంజినీరింగ్ విభాగంలో సచివాలయం ఇంజినీర్లతో పాటు ఏఈలు, డీఈలు, ఎమ్ఈ, కాంట్రాక్టర్లకు సైతం నోటికొచ్చినట్లు తిడుతున్నారని గగ్గోలు పెడుతున్నారు. ఆ నాయకుడు కార్పొరేషన్ కార్యాలయానికి రెండురోజులకోసారి వచ్చి రాత్రి 11 గంటల వరకు ఉద్యోగుల్ని టార్చర్ చేస్తున్నారని గొల్లుమంటున్నారు. అంతా తానై.. కార్పోరేషన్లో ఎవరికి ఏ వర్క్ ఇవ్వాలి, ఆ కాంట్రాక్టర్ ఎవరై ఉండాలి ఇలా అంతా ఆయనే నిర్దేశిస్తున్నారు. కార్పోరేషన్లో చీమ కదలడానికై నా తన అనుమతి ఉండాలన్న హుకుం జారీచేస్తున్నా రు. నియోజకవర్గ కీలక నేతకు కోటరీగా ఉన్న నాయకులకే అన్నీ జరిగేలా చూసుకుంటున్నారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో వర్కుల కాంట్రాక్టుల కేటాయింపులో వివక్ష చూపిస్తూ తన వాళ్ల జేబులు నింపే పనిలో పడ్డారు. అందులోంచి తనకు రావాల్సిన వాటా కోసం ఆరాటపడుతున్నారు. గత కొంత కాలంగా కార్పొరేషన్లో మంజూరైన పనులు, వాటి కాంట్రాక్టు దక్కించుకున్నవారి జాబితా చూస్తే కీలక నేత పచ్చపాతం ఏంటో తెలుస్తోంది. పనులు కేటాయింపులే కాకుండా ఆ పనుల బిల్లులు చెల్లింపు విషయంలో కూడా తన మార్క్ కనబడాలని చెప్పినట్టు జరగాలని అజమాయిషీ చేస్తున్నారు. ఇప్పటివరకు కార్పొరేషన్లో జరిగిన చెల్లింపులను పరిశీలిస్తే జరుగుతున్న తంతు కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. తన అభిరుచుల మేరకు తన ఆలోచనల మేరకు తన అభిప్రాయం ప్రకారం తన ఆదేశాలకు అనుగుణంగా నడుచుకునే అధికారులే ఉండాలని దర్పం ప్రదర్శిస్తున్నారు. ఎవరైనా మాట వినకపోయినా, చెప్పినట్టు జరగకపోయినా సంబంధిత అధికారులపై ఒంటి కాలిపై లేచి నోటికి పనిచెబుతున్నారు. ఆ సమీక్షల పేరిట నిర్వహించిన సమావేశాల్లో సహనం కోల్పోయి విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు. బెదిరించే ధోరణితో మాట్లాడి ఉద్యోగుల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆ దూషణలు, బూతుపురాణం వినలేక చెప్పినట్టే చేసుకుపోతున్నారు. ఆత్మగౌరవంతో పనిచేయాలనుకున్నవారు ఇక్కడ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. మానసిక క్షోభలో కూడా కొందరు ఉద్యోగులు తప్పని పరిస్థితిలో పనిచేస్తున్నారు. -
వినరో భాగ్యము
● శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా గోదాగోష్టి ● ధనుర్మాస వేళ శ్రీకూర్మనాథాలయంలో ప్రత్యేక ఉత్సవం గార: పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో 44 ఏళ్లుగా ఆండాల్ గోదాగోష్టి పేరిట గ్రామ సంకీర్తన కొనసాగుతోంది. గోదా దేవి శ్రీకృష్ణుని పొందే విధానాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుని చిత్రపటాన్ని పట్టుకొని శ్రీకూర్మనాథాలయ తిరువీధుల్లో ధనుర్మాస వేకువల్లో సంకీర్తన జరుపుతున్నారు. తొలుత శ్రీభాష్యం తిరువేంగలమ్మ, శ్రీభాష్యం అనంత లక్ష్మమ్మ ప్రారంభించగా, 20 ఏళ్లుగా తిరుమల పెద్దింటి సుశీలరాణి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీకృష్ణుని లీలలు వివరించే గీతాలను మహిళలు ఆలపిస్తారు. ఇంటి వద్ద భక్తులు మేలుకొలుపు వద్ద ఉన్న స్వామి చిత్రపటానికి హారతినివ్వడంతో పాటు దక్షిణలు సమ ర్పిస్తారు. ఇలా వచ్చిన డబ్బులతో గోదాదేవి కల్యా ణం రోజున మంగళసూత్రం, ప్రసాదాలను శ్రీకూర్మనాథాలయానికి అందించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ప్రతి రోజూ 5 గంటల తర్వాత శ్రీకూర్మనాథాలయంలో తిరుప్పావై ప్రవచనాల ముందుగా జరిగే బేడా సేవలో మహిళలతో పాటు భక్తులు పా ల్గొంటారు. ఆలయ ప్రధానార్చకులు సీహెచ్ సీతారామనృసింహాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు పల్లకిలో గోదాదేవి మూర్తితో పాటు సుదర్శన ఆళ్వా ర్ మూర్తులను ఎదురెదుగా ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ప్రధాన గోపురం చుట్టూ ఉన్న బేడా మంటపంలో బేడా సేవ నిర్వహించి శ్రీకూర్మనాయకి సన్నిధిలో తిరుప్పావై పఠనం నిర్వహిస్తారు. -
రెక్కాడితేనే.. డొక్క నిండేది!
కుటుంబంతో కలిసి ఇచ్ఛాపురం, కంచిలి, సోంపేట, కవిటి ప్రాంతాలకు వచ్చి దాదాపు 20 ఏళ్లు కావొస్తోంది. మేము తయారు చేసిన పనిముట్లు ఎవరైనా కొంటేనే మా పొట్ట నిండేది. రోజంతా పనిచేస్తే వచ్చేది చాలా తక్కు వ. వేరే పనులు చేయలేక ఈ పనితోనే నెట్టుకొస్తున్నాం. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలి – ఛత్రసింగ్, ఇచ్ఛాపురం కొలిమి పనులు చేసేటప్పు డు, సమ్మెట దెబ్బ వేసేటప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది. అయినా తప్పడం లేదు. చేసిన పని ము ట్లు అమ్ముతాం. ఒక్కోసారి డబ్బులు సరిగా రా వు. అయినా పొట్ట కూటి కోసం తిప్పలు పడుతున్నాం. – నరేంద్ర సింగ్, ఇచ్ఛాపురం ఇచ్ఛాపురం రూరల్ : ప్రదేశం ఎక్కడైనా కష్టపడే తత్వం వారి సొంతం. కొలిమి వృత్తిని నమ్ముకుంటూ పుట్టిన ఊరును వదిలి బతుకుదెరువు కోసం వలస బాటపట్టారు. రెక్కల కష్టమే బతుకుదెరువుగా మార్చుకున్నారు. ఇంటిల్లపాదీ పొద్దంతా పనిచేసి కడుపు నింపుకుంటున్నారు. రోడ్ల వెంట గుడారాలు వేసుకొని, మండుతున్న కొలిమిలో ఇనుము కాలుస్తూ, సమ్మెట దెబ్బలు వేస్తూ చిన్నచిన్న పనిముట్లు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కొన్నేళ్ల క్రితం జిల్లాకు వచ్చి గ్రామాల్లో సంచరిస్తూ కొలిమి పనులు చేస్తూ ఇక్కడే నివాసముంటున్నారు. అందరూ కష్టపడితేనే.. పనిముట్లు తయారు చేసే క్రమంలో పురుషులు ఇనుమును కొలిమిలో కాల్చి బయటకు తీసినప్పుడు మహిళలు సమ్మెట దెబ్బలు వేయల్సి వస్తుంది. బరువైన పెద్ద సుత్తితో వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. కానీ బతుకుదెరువు కోసం తప్పని పరిస్థితి. కొలిమి పనుల్లో వచ్చే పొగ, సెగతో ఆరోగ్యం క్షీణించిపోతోంది. ఎండైనా..వానైనా.. కొలిమి పనులు చేస్తూ పొట్ట పోసుకుంటున్న కార్మికుల భవితాలు దుర్భరంగా మారాయి. వారికి చిన్నచిన్న గుడారాలే ఇళ్లు. ఎండైనా, వానైనా కుటుంబం అంతా వాటిలో ఉండాల్సిందే. రోడ్డు పక్కనే జీవనం, కనీస సదుపాయాలు కరువయ్యాయి. ప్రస్తు తం చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు. వారి పిల్లల చదువులు, ఆరోగ్యం అంతంత మాత్ర మే. ఊరుకాని ఊరు వచ్చి వారు అనేక కష్టాల నడు మ జీవనం సాగిస్తున్నామని, పాలకులు, ప్రభు త్వం ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. పేద కుటుంబానికి శాపం!
హిరమండలం: సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి విరుద్ధంగా ఉంది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలుచేసినట్టు కూటమి ప్రభుత్వం చెప్పింది. కానీ హిరమండలం మండలంలో నిరుపేద కుటుంబంలో ముగ్గురు పిల్లలకు ఈ పథకం వర్తించలేదు. దీంతో ఆ కుటుంబం కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. అయినా కనికరించేవారు కరువయ్యారు. జగన్నాథపురంలో లిమ్మక పెంటయ్య, ఈశ్వరి దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరంతా వంశధార నిర్వాసితులు. నిరుపేదలు కావడంతో పూరిగుడిసెలో నివాసముంటున్నా రు. ముగ్గురు పిల్లలూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కనీసం వీరికి విద్యుత్ మీటరు కూడా లేదు. కానీ ఏకంగా ఏడు మీటర్లు ఉన్నట్టు చూపడంతో తల్లికి వందనం పథకం వర్తించలేదు. విద్యు త్ శాఖ అధికారులు వీరికి ఎటువంటి మీటరు లేదని ధ్రువీకరించినప్పటికీ తల్లికి వందనం పథకం మాత్రం అందలేదు. కార్యాలయాల చుట్టూ తిరగడమే కానీ ఫలితం లేకపోతోంది. కొత్త సంవత్సరంలోనైనా అధికారులు స్పందించి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. -
ఘనంగా హిందూ సమ్మేళనం
శ్రీకాకుళం కల్చరల్ : ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం శ్రీకాకుళం నగరంలోని విశాఖ–బీ కాలనీ షిర్డీసాయిబాబా మందిరంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన షిర్డీసాయిబాబా సేవా సత్సంగం చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్ మాట్లాడుతూ హైందవ సమాజం అభివృద్ధి చెందాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. గురజాడ విద్యా సంస్థల డైరెక్టర్, సేవా భారతి సంయుక్త కార్యదర్శి జి.సంయుక్త మాట్లాడుతూ హైందవ సమాజం ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం పనిచేస్తుందన్నారు. సమాజ వికాసానికి దోహదపడే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అనంతరం షిర్డీసాయిబాబా ఆలయ ప్రాంగణంలో నారాయణసే వా సమితి ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో షిర్డీసాయిబాబా మందిరం ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు, ట్రెజరర్ ఇప్పిలి భవానీ, బంగార్రాజు, శేఖర్, ప్రసాద్, వడ్డి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాధనం వృథా!
● నిరుపయోగంగా ప్రభుత్వ కార్యాలయ భవనాలు ● పట్టించుకోని అధికారులు ఎచ్చెర్ల : ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ఎచ్చెర్ల మండలంలో అవసరం లేకుండా కోట్ల విలువ చేసే భవనాలను నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించే కార్యాలయాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలో పౌరసరఫరాల గోదామును పదేళ్ల క్రితం నిర్మించారు. ఆహార పదార్థాల నిల్వకు, సరుకుల సరఫరాకు అన్ని విధాలా ఉపయోగపడేలా మోడల్గా నిర్మించారు. తర్వాత వివిధ కారణాలతో ప్రారంభించకుండానే వదిలేశారు. చిలకపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని వికలాంగుల పునరావాస కేంద్రాన్ని నిర్మించారు. ఇది కూడా అధునాతన పద్ధతిలో 15 ఏళ్ల కిందట నిర్మించారు. కొన్నాళ్లు దివ్యాంగుల కార్యకలాపాలు కొనసాగించారు. వారికి అవసరమైన పరికరాలు అందించడంతో పాటు పిజియోథెరపి అందించడానికి నిర్మించిన ఈ భవనాన్ని తర్వాత మూసివేశారు. ప్రస్తుతం పిచ్చిమొక్కలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. మరోవైపు మండలంలో పీఏసీఎస్ కేంద్రాన్ని అద్దె భవనంలో నడిపిస్తున్నారు. వీటితో పాటు అంగన్వాడీ కేంద్రాలను కూడా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. -
పారా, మాస్టర్ అథ్లెట్లకు సత్కారం
శ్రీకాకుళం న్యూకాలనీ: లక్ష్యసాధన దిశగా క్రీడాకారులు అడుగులు వేయాలని ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు, బాస్కెట్బాల్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో క్రీడాకారులతో కలిసి 2026 నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నారు. ఈసందర్భంగా సౌత్ ఏషియన్ పారా త్రోబాల్ రజత పతకం సాధించిన బగ్గు రామకృష్ణ, మాస్టర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించిన మాస్టర్స్ను ఘనంగా సత్కరించారు. అనంతరం బాస్కెట్బాల్, సెపక్తక్రా, మాస్టర్స్ అథ్లెటిక్స్, పారా దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్ఏ బాస్కెట్బాల్ కోచ్ గాలి అర్జున్రావురెడ్డి, ఎండీ కాసీంఖాన్, కళావతి దంపతులు, గాలి జగన్నాథ్రెడ్డి, బి.సోములు, జి.కొర్లయ్య, వి.శశి, యు.రవి, జి.వేణుగోపాల్రెడ్డి, సంతోష్, నవీన్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. -
25న జిల్లాస్థాయి హిందీ ప్రతిభా పరీక్ష
శ్రీకాకుళం కల్చరల్: హిందీ సేవా సదన్ (అనంతపురం) ఆధ్వర్యంలో గత నెల రాష్ట్రవ్యాప్తంగా 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు నిర్వహించిన పాఠశాల స్థాయి హిందీ టాలెంట్ టెస్ట్లో జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికై న విద్యార్థుల వివరాలను విశ్రాంత డీఈఓ బలివాడ మల్లేశ్వరరావు గురువారం విడుద ల చేశారు. హిందీ మంచ్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగిన కార్యక్రమంలో మల్లేశ్వరరావు మా ట్లాడుతూ హిందీ సేవా సదన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో మొదటిసారిగా హిందీ భాష పట్ల అభిరుచి పెంచేందుకు టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు తెఇపారు. జిల్లా స్థాయి పోటీకి ఎంపికై న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మంచ్ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోనే శ్రీధర్ మాట్లాడుతూ హిందీ మంచ్ సంస్థ సమన్వయంతో ఉత్తరాంధ్రలో 2,300 మందికిపైగా విద్యార్థులు పాఠశాల స్థాయి ప్రతిభా పోటీ లో పాల్గొన్నారని వివరించారు. వీరిలో 150 మంది పాఠశాల స్థాయిలో ప్రతిభావంతులుగా నిలిచి జిల్లా స్థాయి పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ నెల 25న శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లాస్థా యి ప్రతిభా పరీక్ష నిర్వహించనున్నామని పేర్కొ న్నారు. హిందీ పండిట్లు రొంపివలస రామారావు, బి.మంజుల, కనుగుల సత్యం సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని చెప్పారు. ఎంపికై న విద్యార్థులను రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ పోలుమహంతి జగన్మోహనరావు, విశ్రాంత సెట్శ్రీ సీఈవో సురంగి మోహనరావు, బలివాడ మల్లేశ్వరరావు అభినందించారు. కార్యక్రమంలో మంచ్ జోనల్ కమిటీ ప్రతినిధి ఎం. వి.మల్లేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు దొంతం పార్వతీశం, జిల్లాశాఖ ప్రతినిధులు కనుగుల సత్యం, రొంపివలస రామారావు, ఈరంకి ఉమారా ణి, సింగూరు రాధ, శిరీష, సత్యనారాయణ, విజయ్, తంగివానిపేట హైస్కూల్ హెచ్ఎం రామకృష్ణ, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. -
ఒడియా విద్యార్థుల అభివృద్ధికి కృషి
ఇచ్ఛాపురం: ఆంధ్రప్రదేశ్లో ఒడియా మైనారి టీ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామని ఒడి యా లింగ్విస్టిక్ మైనారిటీ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ పాడీ అన్నారు. ఇచ్ఛాపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ఒడియా టీచర్స్ అసోసియేషన్ (అపో టా) ప్యాకెట్ క్యాలెండర్ను గురువారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఒడియా డీఐ దుర్గాప్రసాద్ చౌదరి, ఆపోటా రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ పాఢీ, ప్రధాన కార్యదర్శి బృందావన్ దొళాయి, ఒడియా సంఘం పెద్దలు రఘునాథ్ గౌడో తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్ : మాజీ సైనికుల సంక్షేమ సంఘం వెబ్సైట్, క్యాలెండర్ను ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు గురువారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, సభ్యులు పాల్గొన్నారు. శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల జంక్షన్ ప్రాంతంలో నివా సముంటున్న పట్నాల శ్యామలాంబ(86) మృతిచెందడంతో ఆమె నేత్రాల ను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకువచ్చారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియ న్ పూతి సుజాత, పి.సుమతి ద్వారా ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నం ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరుకు సంప్రదించాలని నిర్వాహకులు కోరారు. వజ్రపుకొత్తూరు రూరల్ : పలాస మండలం బొడ్డపాడు జంక్షన్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యా యి. పలాస మున్సిపాలిటీ పరిధి రామకృష్ణా పురం గ్రామానికి చెందిన లండ శశికుమార్ బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో శశికుమార్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. ద్విచక్ర వాహన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందా.. లేక అదుపు తప్పి ప్రమాదం జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. శ్రీకాకుళం క్రైమ్ : కలెక్టరేట్కు వెళ్లే దారిలో అపార్ట్మెంట్స్ వెనుక భాగంలో 2.4 కిలోల గంజాయితో ఉన్న ఆరుగురు యువకులను గురువారం పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ పైడపునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు ఎస్ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో మాటు వేసి భానుగురి చంద్రశేఖర్, కిల్లంశెట్టి నిఖిల్, పొన్నాడ కిషోర్, కుందు గోపాల్, కొన్న రాందేవ్, దండి వేణులను పట్టుకున్నారు. వీరిన విచారించగా ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి పరస్పరం పంచుకుంటున్నట్లు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి యువకులను కోర్టులో హాజరుపర్చగా.. జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. -
ఏపీ గట్కా టీమ్ కోచ్గా సత్యవరం స్కూల్ పీడీ
నరసన్నపేట: జాతీయ స్థాయిలో పంజాబ్ రాష్ట్రం లూథియానాలో జరగనున్న గట్కా(కర్రసాము) పోటీలకు వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ టీమ్ కోచ్గా సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ జ్యోతీరాణి నియమితులయ్యారు. జాతీయ స్థాయిలో గట్కా పోటీ లు 5 నుంచి 10 వ తేదీల్లో జరగనున్నాయని పీడీ తెలిపారు. ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. శుక్రవారం పయనం అవుతున్నట్లు తెలిపారు. విజయవాడ చేరుకొని అక్కడ నుంచి లూథియానాకు వెళ్లనున్నట్లు వివరించారు. నేటి నుంచి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు ప్రభుత్వం ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను శుక్రవారం నుంచి అందజేయనున్నారు. ఈ నెల 9వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పాత భూహక్కు పత్రాల స్థానంలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో రీసర్వే పూర్తయిన 652 గ్రామాల్లో రెవెన్యూ గ్రామ సభల ద్వారా 2,54,218 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో 13 మండలాల్లో 277 రెవెన్యూ గ్రామాల్లో 1,25,716 పాస్ పుస్తకాలు అందజేయనున్నారు. టెక్కలి డివిజన్లో 9 మండలాల్లో 192 రెవెన్యూ గ్రామాల్లో 65,618 మంది రైతులకు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. పలాస డివిజన్లో 8 మండలాల్లో 183 రెవెన్యూ గ్రామాల్లో 62,884 పాస్ పుస్తకాలు అందజేస్తారు. జిల్లాను హరితమయం చేద్దాం: కలెక్టర్ శ్రీకాకుళం పాతబస్టాండ్: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మ ద్ ఖాన్లను పలు శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కలెక్టరేట్ సముదాయం వద్ద నూతనంగా నిర్మిస్తున్న రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కొత్త ఏడాదిలో జిల్లాను హరితమయంగా మార్చేందుకు అధికారులు, ప్రజలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. -
మద్యం తాగేశారు
● డిసెంబరు 31 రాత్రి విపరీతంగా మద్యం విక్రయాలు డిసెంబర్ 31 అర్ధరాత్రి మందు ప్రియులు ‘ఫుల్లు’గా ఎంజాయ్ చేశారు. ఎప్పటికంటే దాదాపు దాదాపు కోటి రూపాయల అదనపు మద్యాన్ని గుటకేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా మద్యం ప్రియులు డిసెంబరు 31న రూ.3.75 కోట్ల మందు తాగేశారు. అర్ధరాత్రి వరకు ప్రభుత్వం విక్రయాలకు ఇచ్చిన అనుమతిని వినియోగించుకుని మందుషాపుల గల్లా పెట్టెలు నింపారు. ఈ మేరకు జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సీహెచ్ తిరుపతినాయుడు ఓ ప్రకటన గురువారం విడుదల చేశారు. సాధారణ రోజుల్లో రూ. 2.50 కోట్ల నుంచి రూ. 2.70 కోట్ల సరాసరిన మద్యం అమ్మకాలు జరిగేవని ఆ లెక్కన రూ.1.20 కోట్లు మద్యం అధికంగా అమ్ముడు పోయిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో రూ. 80 లక్షల మేర మద్యం అమ్మకాలు సాగినట్లు సీఐ ఎంవీ గోపాలకృష్ణ ప్రకటించారు. సాధారణ రోజుల్లో రూ. 60 లక్షలు అమ్మకాలు సాగేవన్నారు. మందుబాబులపై కేసులు.. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ 36, ఓపెన్ డ్రింకింగ్ 15 కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఒకటో పట్టణ పరిధిలో 14, ట్రాఫిక్ పీఎస్ పరిధిలో 6 నమోదు కాగా రెండో పట్టణ పరిధిలో 4 ఓపెన్ డ్రింకింగ్ కేసులు పోలీసులు కట్టారు. వీరిని శుక్రవారం కోర్టు ముందు హాజరుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మద్యం అమ్మకాలకు సమయం ఒంటి గంట వరకు పెట్టిన ప్రభుత్వం రోడ్లపై మద్యం తాగి తిరగవద్దని, అదే ఒంటి గంట తర్వాత తిరిగితే కేసులు కట్టి జైలుకు పంపిస్తామని పోలీసుల చేత ప్రకటించడంపై జిల్లావ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. – శ్రీకాకుళం క్రైమ్ -
కనికుట్టు విద్య
● నృత్య ప్రదర్శనలు ఇచ్చే చిన్నారుల డ్రెస్ డిజైనింగ్లో ప్రతిభ చూపుతున్న దర్జీ ● 40 ఏళ్లుగా ఇదే వృత్తిలో రాణిస్తున్న ఏకై క వ్యక్తి ● వేల మందికి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ శ్రీకాకుళం కల్చరల్: నృత్య ప్రదర్శన ఎక్కడ చేసినా ముందు ఆయన వద్దకు వెళ్లాల్సిందే. శిక్షణ నుంచి ఆరంగేట్రం వరకు అన్ని దశల్లోనూ ఆయనను కలవాల్సిందే. నాట్య ప్రదర్శనలో అడుగులు ఎంత లయబద్ధంగా కదపాలో, ము ఖ కవళికలు ఎంత అందగా ఉండాలో, భంగిమ లు ఎంత శ్రద్ధగా కుదరాలో ఆహార్యం కూడా అంతే సుందరంగా అమరాలి. అందుకు 40 ఏళ్లుగా ఏకై క చిరునామా వీరభద్రరావు. రంగురంగుల పట్టు వస్త్రాలు, కచ్చితమైన కొలతలతో కూడిన ఆ దుస్తుల వెనుక ఒక సామాన్య టైలర్ అసామాన్య కృషి దాగి ఉంది. ఆయనే శ్రీకాకుళంలో సుపరిచితులైన మల్లెమొగ్గల వీరభద్రరావు (భద్రం). చదివింది ఐదో తరగతి అయినా, శాసీ్త్రయ నృత్య దుస్తుల తయారీలో ఆయనది అందెవేసిన చేయి. 40 ఏళ్లుగా ఈ వృత్తిలోనే.. వీరభద్రరావు బాల్యంలో తన మేనమామ చాగంటి నాగేశ్వరరావు కుట్టు మిషన్పై దుస్తులు కుడు తుంటే చూసి ఆసక్తి పెంచుకున్నారు. కుట్టు వృత్తి పైనే మక్కువతో 40 ఏళ్లుగా ఇవే దుస్తులు కుడుతున్నారు. ప్రారంభంలో పౌరాణిక సినిమాల ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా నంద మూరి తారకరామారావు ధరించే వైవిధ్యమైన దుస్తులను చూసి, డ్రామా కళాకారులకు అలాంటి దుస్తులు కుట్టడం మొదలుపెట్టారు. 1990వ దశకంలో నాట్య గురువు రఘుపాత్రుని శ్రీకాంత్ ప్రోత్సాహంతో శాసీ్త్రయ నృత్యాల వైపు మళ్లింది. ఎలాంటి అధికారిక శిక్షణ లేకపోయినా, కేవలం స్వయంకృషితో అవగాహన పెంచుకున్నారు. విదేశాలకు సైతం.. నేడు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహినియాట్టం వంటి ఏ శాసీ్త్రయ నృత్యానికై నా భద్రం కుట్టిన దుస్తులు ఉండాల్సిందే. ఆయన నైపు ణ్యాన్ని గుర్తించిన డ్యాన్స్ మాస్టర్లు తమ విద్యార్థులకు భద్రం చేతనే దుస్తులు కుట్టించడానికి మొగ్గు చూపుతారు. అమెరికా వంటి దేశాల నుంచి సైతం ఆర్డర్లు వస్తున్నాయంటే ఆయన పనితనం అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్లు శ్రీకాంత్, శివ కుమార్, మెహర్ విద్యావిహార్, నీరజలతో పాటు స్వాతి స్వామినాథన్ వంటి జాతీయ స్థాయి గురువులకు ఈయన అంటే ఎంతో ఇష్టం. ఆయనకు భార్య సుబ్బలక్ష్మి, ఆయన శిష్యురాలు బాలనాగమణి సహకారం అందిస్తున్నారు. వీరభద్రరావు రూపొందించిన డ్రెస్లో చిన్నారి నృత్య భంగిమ డ్యాన్స్ మాస్టర్ల సహకారంతోనే.. నేను ఇంతగా ఎదగడానికి కారణం డ్యాన్స్ మాస్టర్లు నాకు ఇస్తున్న సహకారం. నాట్యగురువు శ్రీకాంత్ నన్ను ముందుగా ప్రోత్సహించారు. నాటి నుంచి నా జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగుతోంది. – ఎం.వీరభద్రరావు, దర్జీ, శ్రీకాకుళం -
సముద్రంలో బోటు మునక
● లక్షల్లో ఆస్తినష్టం కొత్తపాలెంలో వలల్ని తీస్తున్న మత్స్యకారులు కవిటి : మండలంలోని కొత్తపాలెం సముద్రతీరంలో లంగరువేసిన గంగామాత అనే బోటు సము ద్రంలో కూరుకుపోయిందని బోటుకు చెందిన 11 మంది మత్స్యకారులు డొంక సోమయ్య, సూర్ని లచ్చయ్య తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి గురువారం సాయంత్రం మత్స్యకారులు మీడియాకు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం వేట నుంచి వచ్చిన తర్వాత కొత్త పాలెం సముద్ర తీరంలో లంగరు వేసి బోటు సురక్షితంగానే నిలిపారు. గురువారం ఉదయం వేటకు వెళదామని అంతా తీరానికి వెళ్లారు. చూసేసరికి బోటు సముద్రంలో భారీగా కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో దానిలో ఉన్న లక్షల రూపాయల విలువైన వల కూడా పాడైపోయింది. బోటును మరికొన్ని బోట్ల సాయంతో బయటకు తీసేందుకు గ్రామస్తులంతా శతవిధాలుగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో అది ముక్కలుగా విరిగి బాగా దెబ్బతిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో బోటులో రెండు జీపీఎస్ మిషన్లు, ఇంజిన్లలో ఉన్న ఇంజిన్ ఆయిల్ పడిపోయింది. బోటులో ఉన్న టీవీ కూడా దెబ్బతింది. జేసీబీ సాయంతో బయటకు తీసేందుకు ప్రయ త్నించామని మత్స్యకారులు తెలిపారు. వలతో పాటు బోటు కూడా పాడైపోయిందని లక్షల్లో నష్టపోయామని తెలిపారు. కొత్తబోటు కొనాలంటే ప్రస్తుతం రూ.16 నుంచి రూ.18 లక్షల వరకు ఖర్చవుతుంది. జీపీఎస్ మిషన్లు, టీవీ తదితర సౌకర్యా లు అన్నీ సమకూర్చడం ఇప్పుడు తమకు తలకు మించిన భారమని మత్స్యకారులు వాపో తున్నా రు. అధికారులు సంఘటనా స్థలానికి వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
మహాసభలను విజయవంతం చేయండి
పలాస : రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన గొంతు వినిపించేందుకు ఈ నెల 10, 11వ తేదీలలో చేపట్టనున్న 20వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు బొడ్డపాడులో గురువారం పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా, ప్రజా నిర్బంధాలు, అణచివేతతో పాటు అన్ని వర్గాల ప్రజలను పీడిస్తున్న ప్రభుత్వ విధానాలను ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజా హక్కులను కాపాడుకోవాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమొక్రసీ జిల్లా సహాయక కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిల రామారావు, దుష్యంత్, ప్రగతిశీల మహిళా సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ, ప్రజా సంఘాల నాయకులు ఈశ్వరమ్మ, మద్దిల వినోద్, కోనేరు రమేష్, వీరాస్వామి, లక్ష్మణ్, జోగి కోదండరావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ బాక్సింగ్ పోటీలకు విశ్వేశ్వరరావు
శ్రీకాకుళం న్యూకాలనీ : జాతీయ బాక్సింగ్ పోటీల కు జిల్లాకు చెందిన బాక్సర్ పి.విశ్వేశ్వరరావు ఎంపికయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని నోయిడా వేదికగా ఈ నెల 4 నుంచి 10 వరకు తొమ్మిదో ఆలిండియా ఎలైట్మెన్ బాక్సింగ్ చాంపియన్షిప్–2025–26 పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం విశ్వేశ్వరరావు గురువారం ఇక్కడి నుంచి పయనమైవెళ్లాడు. ఇటీవ ల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించడంతో జా తీయ పోటీలకు ఎంపికయ్యాడు. డీఎస్ఏ బాక్సింగ్ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావు నేతృత్వంలో కఠోర సాధన చేస్తూ జాతీయస్థాయికి చేరుకోవడం అభినందనీయమని డీఎస్డీఓ ఎ.మహేష్బాబు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీఏ లక్ష్మణ్దేవ్, వంగా మహేష్ ప్రోత్సా హం, శిక్షకుల చొరవ ప్రసంశనీయమని సీనియర్ బాక్సర్లు రాజీవ్, అప్పలరాజు, రాము, మనోజ్కుమార్ తదితరులు పేర్కొన్నారు. విశాఖ రేంజ్ ఐజీగా గోపీనాథ్ జట్టి బాధ్యతల స్వీకరణ విశాఖసిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జట్టి పదోన్నతి పొందారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. పోలీసు యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వర్రెడ్డి (శ్రీకాకుళం) మర్యాదపూర్వకంగా కలిశారు. రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్న తాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరిస్తున్న గోపీనాథ్ జట్టి -
78 గంటలైనా నా భర్త జాడలేదు
శ్రీకాకుళం క్రైమ్ : నిమ్మాడ.. శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రివర్యులైన కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుల స్వగ్రామం. ఇదే గ్రామానికి చెందిన కింజరాపు చంద్రకళ అనే వివాహిత తన భర్త కింజరాపు అప్పన్న ఈనెల 29 నుంచి కనపడటంలేదని, ఇద్దరు కానిస్టేబుళ్లు తీసుకెళ్లినట్లు తెలిసిందని, 78 గంటలైనా తన భర్త జాడలేదని, ఆయన ప్రాణానికి హాని ఉందని మీడియా ముందు కన్నీటిపర్యంతమైంది. ఏడాదిన్నరగా నిమ్మాడలోకి అడుగు పెట్టలేకపోతున్నామని, తెలుగుదేశం పార్టీ వాళ్లు రానీయడంలేదని ఆరోపించారు. ఇదే విషయమై జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న ఎస్పీ మహేశ్వరరెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఆమె గురువారం మీడియాకు వివరించారు. 29 నుంచి కనిపించడంలేదు.. గతనెల 29న మా కన్నవారి గ్రామమైన మెళియాపుట్టి మండలం కొసమాలలో కింజరాపు అప్పన్నను ఉ.8–10 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. అప్పుడు నేను వైజాగ్లో ఉండటంతో తెలీలేదు. సాయంత్రం వచ్చేస్తున్నానని చెప్పేందుకు నా భర్తకు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. కన్నవారింటికి వచ్చాక బైక్, హెల్మెట్ అయితే ఉందిగానీ భర్త లేడు. ఇదే విషయం అక్కడ కొందరిని అడగ్గా ఎవరో ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారని చెప్పారు. ఆ తర్వాత నా భర్తకు చాలాసార్లు ఫోన్ చేశా. స్విచ్చాఫ్ రావడంతో అదేరోజు సా.6.30కు మెళియాపుట్టి స్టేషన్కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశా.ఎఫ్ఐఆర్ రాయమంటే.. ‘డైరీలో రాసి రేపు 9 గంటలకు రండి.. ఈలోగా విచారణ చేసి కనుక్కొని చెబుతాం’ అని అన్నారు. అయితే, మర్నాడు ‘ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చారు. రెండేళ్ల కిందట పనిచేసిన మెళియాపుట్టి కానిస్టేబుల్ చందు, మరొకతను తీసుకెళ్లారు’ అని స్థానికులు చెప్పారు. వెంటనే అక్కడి ఎస్ఐకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నానని అనడంతో బుధవారం మళ్లీ స్టేషన్కు వెళ్లి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాను. ఎస్ఐను అడిగితే.. తమ వాళ్లయితే తీసుకెళ్లలేదని, చందు ఎవరో తెలీదని, ఎస్పీ దగ్గరకు వెళ్లమన్నారు. దీంతో బుధవారం రాత్రి ఎస్పీని కలవడానికి శ్రీకాకుళం వచ్చా. ఆయన లేకపోవడంతో మళ్లీ గురువారం వచ్చి ఎస్పీని కలిశాను.టీడీపీ వాళ్లు నిమ్మాడకు రానీయడంలేదు.. ‘ఏడాదిన్నర నుంచి టీడీపీ వాళ్లు మమ్మల్ని నిమ్మాడ గ్రామంలో అడుగుపెట్టనీయడం లేదు. పొలం ఉన్నా.. సాగుచేయకుండా ఉండిపోయింది. అత్తయ్యకు పింఛను, మామయ్య రేషన్కార్డు తీసేశారు. మా చుట్టాలంతా బయటకెళ్లి బతుకుతున్నారు. మేం ఒడిశా వెళ్లిపోయాం. నా భర్తను ఎవరేం చేశారోనని భయంగా ఉంది. ప్రాణహాని ఉందని ఆ ఊరికి వెళ్లడంలేదు. ఇదంతా రాజకీయపరంగా ఎవరో చేస్తున్నారు. నా భర్త ఎవరికీ ఏ అన్యాయం చేయలేదు. ఎవరినీ చంపలేదు, మోసంచేసి డబ్బులు, ఆస్తులు తీసుకోలేదు’ అని చంద్రకళ తెలిపింది. -
ఆలయ చోరులు చిక్కారు
● ముగ్గురుని అరెస్టు చేసిన నరసన్నపేట పోలీసులు ● 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం నరసన్నపేట: జిల్లాలో నరసన్నపేటతో పాటు పోలాకి, నౌపడ, సంతబొమ్మాళి, సారవకోట, కాశీబుగ్గ పోలీసుస్టేషన్ల పరిధిలోని పలు ఆలయాల్లో చోరీ కేసులను నరసన్నపేట పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వీరి వద్ద 28 గ్రాముల బంగారం, 175 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నరసన్నపేట సీఐ మరడాన శ్రీనివాసరావు బుధవారం స్థానిక పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. వివిధ ప్రాంతాలకు చెందిన చేవూరి శేఖర్, మోతి జీవరత్నం, చింతాడ మధు ముగ్గురూ నరసన్నపేటలోని గొట్టిపల్లికి వలస వచ్చి చెరువు గట్టుపై కుటుంబాలతో నివసిస్తున్నారు. వీరు ముగ్గురూ గ్రామాల్లో తిరుగుతూ పాత ఇనుము సామాగ్రి కొనుగోలు చేస్తుంటారు. దీంట్లో భాగంగా గ్రామ శివారుల్లోని ఆలయాలను గమనించి రాత్రి ఎవరూ లేని సమయాల్లో తాళాలు విరగ్గొట్టి చోరీలకు పాల్పడుతుంటారు. దీంట్లో భాగంగా పోలాకి మండలంలోని తెల్లవానిపేటలో అసిరితల్లి అమ్మవారి ఆలయం, గుప్పెడుపేటలోని నీలమ్మ తల్లి ఆలయం, రహెమాన్పురంలో అమ్మవారి కోవెల, శివరాంపురంలో అసిరితల్లి ఆలయం, మబగాం కాలనీలో చెన్నమ్మ తల్లి ఆలయం, నౌపాడలో రామాలయం, సంతబొమ్మాళిలో అమ్మవారి ఆలయం, సారవకోటలో వేంకటేశ్వరాలయం ఇలా పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడ్డారని తెలిపారు. అయితే వీరు ముగ్గురు పోలాకి మండలం వనవిష్ణుపురంలోని ఆలయంలో దొంగతనం చేయడానికి వెళ్తుండగా పక్కా సమాచారంతో పోలాకి ఎస్ఐ రంజిత్ కుమార్ సిబ్బందితో కలిసి మాటువేసి వీరిని పట్టుకోవడం జరిగిందన్నారు. వీరి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని నిందితులను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచామన్నారు. -
భారీగా గంజాయి పట్టివేత
ఇచ్ఛాపురం: పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రైల్వే ఎల్సీ గేట్ వద్ద పట్టణ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 86.950 కేజీలు భారీగా గంజాయి పట్టుబడినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిశాకి చెందిన ఒక కారులో తరలిస్తున్న గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒడిశాలోని బరంపురం లంజిపల్లికి చెందిన ప్రపుల్కుమార్ జలి అనే వ్యక్తి కారులో గంజాయిని తీసుకొని విజయనగరంలోని హిమాన్సుశేఖర్ మజి అనే వ్యక్తికి ఇచ్చేందుకు తీసుకెళ్తుండగా పట్టణ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ గంజాయిని ఒడిశాలోని మోహన బ్లాక్ గుమిగుడ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ నాయక్ వద్ద నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోనికి తీసుకొని అతని వద్దనుంచి గంజాయి, సెల్ఫోన్, కారుని సీజ్ చేశారు. రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజలు ఆనందంగా గడపాలి
హిరమండలం: నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలు నిత్యం ఆనందంతో గడపాలని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, వినియోగదారుల హక్కుల సంఘం ప్రతినిధి అంధవరపు వెంకట సురేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వస్తువుల క్రయ, విక్రయాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. మోసాలకు గురవ్వకుండా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు రశీదు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ బలమైన శక్తిగా ఎదగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
డీసీసీబీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
శ్రీకాకుళం అర్బన్: డీసీసీబీ బ్యాంక్ అందించే పథకాలను ఖాతాదారులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ బ్యాంక్ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని డీసీసీబీ బ్యాంక్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతులు, చేతివృత్తులవారు, వ్యాపారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. అన్ని బ్యాంకుల కంటే డీసీసీబీ అధిక వడ్డీ చెల్లిస్తున్న బ్యాంకు అని, నవతి ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బ్యాంకు జనరల్ మేనేజర్లు శిమ్మ జగదీష్, డి.వరప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్లు ఎస్వీఎస్ సత్యనారాయణ, శిల్లా రమేష్, జి.సునీల్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఆర్కే భాస్కరరావు, బి.దశరథరామ్, బి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అదే మేలిమలుపు
పొదుపు.. అదుపు.. కాలగతిలో మరో ఏడాది మలిగిపోతున్నది. కోటి ఆశలు రేపుతూ కొత్త వత్సరాది ఆహ్వానం పలుకుతోంది. ఆ ఆశలు ఫలించాలంటే.. జీవితం కొత్త మార్పులను అందిపుచ్చుకొని కొత్త పుంతలు తొక్కాలంటే .. జీవన ప్రణాళికలో మార్పులు చేసుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా పొదుపు, అదుపు, మదుపు పాటించాలి. మీ జీవితం, మీ కుటుంబం మీకే సొంతం.. వాటిని తీర్చిదిద్దుకోవడంలో మీరే నిర్ణేతలు కావాలి. ఆ నిర్ణయాలు మిమ్మల్ని విజేతలుగా నిలబెట్టేలా ఉండాలి. ఇదే అందరి కొత్త సంవత్సర లక్ష్యం కావాలి. ఇచ్ఛాపురం రూరల్: ఎన్నో ఆనందాలు.. అనుభవాలు.. విషాదాలు.. వివాదాలను చరిత్రలో కలిపేస్తూ 2025 ఏడాది ముగిసింది. సరికొత్త ఆలోచనలకు 2026 స్వాగతం పలుకుతోంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. దురల వాట్లు మానేద్దామని కొత్త సంవత్సరం ప్రారంభంలో మూడు, నాలుగు రోజుల పాటు నిష్టగా నియమాలను కొనసాగిస్తాం. అయితే వివిధ కారణాలతో ఎప్పటిలాగే అవే అలవాట్లను పునఃప్రారంభిస్తాం. ఈ బలహీనతలే కాలం గడుస్తున్న కొద్దీ మార్చుకోలేని వ్యసనాలుగా మారిపోయి, మనల్ని, మన కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తాయి. అందుకే ఈ సారి తీసుకునే నిర్ణయాలను కచ్చితంగా అమలు చేసేందుకు కట్టుబడి ఉందాం. మనకూ ఉండాలో రాజ్యాంగం.. పాలన వ్యవస్థకు రాజ్యాంగ అనుసరణ ఎంత ముఖ్యమో.. కుటుంబ నిర్వహణకు ఓ రాజ్యాంగం ఉండి తీరాలి. పెరుగుతున్న ఖర్చులు, సరిపడని జీతం, శుభకార్యాలు, ఏటా పెరిగే ద్రవ్యోల్బణం.. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని, రోజువారీ ప్రణాళికను ఒకరోజు ముందే తయారు చేసి పెట్టుకోవడం మంచిది. వ్యసనాలు వదిలేద్దాం.. మద్యపానం, ధూమపానం, జూదం తదితర వ్యసనాల వల్ల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. వీటికి దూరంగా ఉండాలన్న నిర్ణయాన్ని కచ్చితంగా పాటించి తీరాలి. పొదుపు మంత్రం.. చేసే పని, ఉద్యోగం ఏదైనా సరే అందులో కనీసం 30 శాతం పొదుపు చేయాలన్న నిర్ణయం ఐదేళ్లలో మిమ్మ ల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ప్రతి వంద రూపాయల్లో రూ.30 దాచిపెడితే అది మిమ్మల్ని సమాజంలో ఎవరి ముందూ చేయి చాచే అవసరం లేకుండా చేస్తుంది. అలాగే, మనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు మనం నమ్మకంగా ఇవ్వగలిగింది జీవిత బీమా, ఆరోగ్య బీమా. వాటిలో సరైనవి ఎంచుకోవాలి. బరువు కాదు..పరువు ఏటా కాలంతో పాటు సమాజంలో మన పరువు పెరగాలి.. అంతే తప్ప బరువు కాదని అందరూ గుర్తించాలి. రోజుకో అరగంట వ్యాయామం, వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఏదైతే అది చేయాలి. మీకు మీరే పోటీ.. జీవితంలో విజేతలుగా మారాలంటే వేరెవరితోనూ పోల్చుకోనవసరం లేదు. మీరు పోల్చు కోవాల్సింది నిన్నటి వరకు ఉన్న మీతో.. ఏడాది తర్వాత మీరుండాలని కోరుకున్న మీతోనే పోల్చుకోవాలి. మీకు మీరే పోటీపడండి. ప్రణాళికతోనే జీవన వికాసం సరికొత్తగా ఏడాదిని ప్రారంభిద్దాం దురలవాట్లను దూరం పెడదాం మంచి మార్గానికి బాటలు వేద్దాంమార్పు దిశగా.. 2025 పాత అలవాట్లకు గుడ్ బై చెబుతూ కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. ఉరుకులు పరుగుల జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేస్తూ ఆధ్మాత్మిక చింతనలో గడపాలి. కోరికలు తగ్గించి, సమయం వృథా కాకుండా ముందస్తు ప్రణాళికతో 2026లోకి అడుగుపెట్టాలి. ఆర్థిక నియమాలను పాటిస్తూ పొదుపు, సామాజిక బాధ్యతలను గుర్తించి మంచి మార్పునకు కృషి చేయాలి. – దూగాన చిరంజీవులు, రిటైర్డ్ అడిషనల్ చీఫ్ జడ్జి, సోంపేట -
సహకార రంగం బలోపేతమే లక్ష్యం
శ్రీకాకుళం అర్బన్ : సహకార వ్యవస్థ కోట్లాది మంది సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉందని, ఈ రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం శ్రీకాకుళంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ సహకార సంవత్సరం – రాష్ట్ర స్థాయి సహకార సదస్సు 2025’ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 2025ను సహకార సంవత్సరంగా ప్రకటించిందని, ముగింపు వేడుకలు శ్రీకాకుళం జిల్లాలో జరగడం సంతోషదాయకమన్నారు. అనంతరం డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్కు సిక్కోలు డ్వాక్రా బజార్ నిర్వహణకు నాబార్డ్ నుంచి రుణ సహాయాన్ని అందించారు. కార్య క్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్, నాబార్డ్ సీజీఎం గోపాల్, జీఎం కేవీఎస్ ప్రసాద్, మూడు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, శివ్వాల సూర్యనారాయణ, తాతారావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, నాబార్డ్ ప్రతినిధి డీవీఎస్ వర్మ, డీసీసీబీ సీఈఓ దత్తి సత్యనారాయణ పాల్గొన్నారు. -
విశ్రాంత జవానుకు సైబర్ షాక్
కోటి కలల కొత్త ఏడాది సంబరం● సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట రూ.1.31 కోట్లు టోకరా.. శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని ఓ విశ్రాంత జవాన్ సైబర్ మోసానికి గురయ్యారు. ఏకంగా రూ.1.31 కోట్లను సీబీఐ డిజిటల్ అరెస్టు పేరిట మోసపోయాడు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. కాశీబుగ్గ రోటరీనగర్కు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దువ్వాడ షణ్ముఖరావు (67)కు ఈ ఏడాది మార్చి 3న ఓ వీడియో కాల్ వచ్చింది. అందులో పోలీస్ యూనిఫామ్లో ఉన్న వ్యక్తి మీ ఆధార్ కార్డుతో లింక్ వున్న ఫోన్ సిమ్ హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైందని, దానికి సంబంధించి సయ్యద్ఖాన్ అనే వ్యక్తి మీతో టచ్లోకి వచ్చి అంతా చేశాడని, ఇప్పటికే అతన్ని అరెస్టు చేశామన్నారు. దీనికి ప్రతిగా సయ్యిద్ఖాన్ ఖాతా నుంచే కాకుండా వేర్వేరు ఖాతాల నుంచి రూ. 30 లక్షలు మీ బ్యాంకు ఖాతాలకు నగదు మళ్లిందనడడానికి రుజువులు ఉన్నాయన్నారు. తక్షణమే మీ బ్యాంకు బుక్లు, ఇతర ఆధారాలన్నీ మెయిల్ చేయాలని, బయట వ్యక్తులకు తెలియపర్చరాదని బెదిరించాడు. మరుసటి రోజు మళ్లీ వీడియో కాల్లో సీబీఐ వాళ్లమని, మిమ్మల్ని డిజిటల్ అరెస్టు చేస్తున్నామని చెప్పారు. దీంతో బెదిరిపోయిన షణ్ముఖరావు తన పేరనున్న ఫిక్సిడ్ డిపాజిట్లు, బంగారు నగలు తనఖా పెట్టి రెండు నెలలు దఫదఫాలుగా రూ.1,31,85,000 వారు చెప్పిన ఖాతాలకు మళ్లించాడు. రెండు నెలల తర్వాత మళ్లీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పేరుతో మళ్లీ ఫోన్ చేయడంతో మోసపోయానని గ్రహించిన షణ్ముఖరావు తన కుమారుడికి తెలపడంతో పోలీసులను ఆశ్రయించారు. బుధవారం కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
'గ్రీటింగ్'.. 'చీటింగ్'
శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది తెలియని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా..న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయతి్నంచాలి. కొత్త బృందాలు ఏర్పాటుశ్రీకాకుళం జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం. – శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి జాగ్రత్తలు తప్పనిసరి.. » అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. » ఫోన్లోని సెట్టింగ్లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిసేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. » మొబైల్ సెట్టింగ్లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. » తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్ను రీసెట్ చేయాలి. » ఈ–మెయిల్స్, టెక్ట్స్æ, ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా నకిలీ లింక్స్ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. » గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్వెబ్కు అమ్మేస్తారు. » మన మొబైల్, ల్యాప్టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రోగ్రామ్, అధికారిక యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. -
అధర్మాస్పత్రిలో అరణ్యరోదన
శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని, ఇక్కడి సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆమదాలవలస మండలం కొర్లకోటకు చెందిన హేమలత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కుమార్తె హైందవితో కలిసి బుధవారం ఉదయం రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆమె మాట్లాడుతూ తన కుమార్తెను రెండు రోజుల క్రితం రిమ్స్కు తీసుకురాగా వైద్యులు మంగళవారం ఉదయం శస్త్రచికిత్స(కొండనాలుక వ్యాధి) పూర్తయ్యాక ఐసీయూలో ఉంచారని తెలిపారు. అక్కడకు వెళ్లినప్పటి నుంచి ఆపరేషన్ థియేటర్ సిబ్బంది తరచూ వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వార్డుకు తరలించిన వారు సైతం డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేవని, మరుగుదొడ్లలో నీరు రావడం లేదని చెబితే తనపై కేకలు వేశారని వాపోయారు. కొందరు సిబ్బంది, వైద్యులు వచ్చి బయటకు వెళ్లి చికిత్స చేయించుకోమన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పోలీస్ శాఖలో పని చేస్తున్నారని చెప్పినా డబ్బులు అడుగుతున్నారని, తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక పేదల పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అధికారులు ఆలోచించాలని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రిమ్స్లో సిబ్బంది పనితీరు అసలు బాగలేదని, ప్రతిదానికీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని ఆరోపించారు. సుమారు అరగంటకు పైగా ఆమె ఆస్పత్రి వద్ద బైఠాయించగా.. సూపరింటెండెంట్ ప్రసన్నకుమార్ ఆమెకు నచ్చజెప్పి వార్డుకు తీసుకువెళ్లారు. సిబ్బందిని పిలిపించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై గురువారం విచారణ జరిపిస్తామని హేమలతకు హామీ ఇవ్వడంతో ఆమె ఆందోళన విరమించి తిరిగి తన కుమార్తెను ఐసీయూలోకి తీసుకెళ్లారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ ‘సాక్షి’కి తెలిపారు. -
జిల్లా ఓటర్ల సంఖ్య 18,92,149
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 18,92,149 మంది ఉన్నారని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబి తా, ఈవీఎంల పరిశీలనపై సమావేశం నిర్వహించారు. ఓటర్లలో పురుషులు 9,37,191 మంది కాగా, మహిళా ఓటర్లు 9,54,848 మంది ఉన్నారని వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధికంగా 2,75,568 మంది ఓటర్లు ఉండగా, ఆమదాలవలసలో అత్యల్పంగా 1,94,209 మంది ఓటర్లు ఉన్నారని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,358 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు. గత జనవరి 6 నుంచి ఈ డిసెంబర్ 30 వరకు ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు కోసం 37,586 దరఖాస్తులు అందాయని, వాటిలో 29,795 దరఖాస్తులను ఆమోదించామని కలెక్టర్ వివరించారు. జిల్లాలో ఈవీఎంలు అత్యంత భద్రంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే తనిఖీల్లో భాగంగా గోదాము సీళ్లను తెరిచి యంత్రాలను పరిశీలించారు. అనంతరం తనిఖీ పుస్తకంలో కలెక్టర్తో పాటు ప్రతినిధులు సంతకాలు చేశారు. -
జోష్
మార్కెట్కు న్యూ ఇయర్ ● ఆర్డర్లతో కిటకిటలాడుతున్న బేకరీలు, మిఠాయి దుకాణాలు ● నోరూరిస్తున్న విభిన్న కేకులు శ్రీకాకుళం కల్చరల్: మార్కెట్లో న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. పండ్లు, పూల బొకేలు, పూలు, ప్లాస్టిక్ పూల బొకేలు, రకరకాల గ్రీటింగు కార్డులు, డైరీలు కొనుగోళ్లతో బజార్లు హడావుడిగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్లాస్టిక్ బొకేలకు కాలం చెల్లి పోయింది. నిజమైన పూలన్నీ ఒక గుచ్చంగా చేసి లైవ్ బొకేలను విక్రయిస్తున్నారు. వీటి కోసం పూలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి అనేక రంగులతో రకాలు తెప్పిస్తున్నారు. గుభాళిస్తున్న సువాసనలతో రూపొందించిన బొకేలతో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. పూలతో కాకుండా పండ్లను ఒక బుట్టలో పెట్టి అందంగా ప్యాక్ చేసి వాటిని కూడా అమ్ముతున్నారు. డైరీలు, క్యాలెండర్లు కూడా మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. పేర్లు, ఫొటోలతో సహా డైరీలను తయారు చేయిస్తుండడం గమనార్హం. -
గ్రీటింగ్..చీటింగ్
సైబర్ అలర్ట్● కొత్త సంవత్సర శుభాకాంక్షలు లింకులతో జర జాగ్రత్త ● ఒక్క క్లిక్తో మొత్తం ఊడ్చేస్తారు వినూత్న కేక్లుశ్రీకాకుళం క్రైమ్ : ఏడాది మారుతోంది. డిసెంబర్ 31 మొదలుకుని జనవరి 1 వరకు లెక్కలేనన్ని మెసేజీలు సెల్ను తాకుతాయి. న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరిట ఎస్ఎంఎస్లు, వాట్సాప్ల ద్వారా సందేశాలు వస్తా యి. వీటితోనే ప్రమాదం పొంచి ఉంది. తెలీని సైట్లపై ఏమరపాటుగా క్లిక్ చేసినా మన అకౌంట్లలో నగదు క్షణాల్లో మాయమవుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చీటింగ్ ఇలా.. న్యూ ఇయర్ సందర్భంగా మొబైల్లో వచ్చే రకరకాల చిత్రాలు, సందేశాల పేర్లతో సహా తయారుచేసుకుని మెజేస్ పంపుతారు. మీకు నచ్చేవిధంగా మీ పేరుతో గ్రీటింగ్స్, సందేశాలను పంపుకోవచ్చని, ఫలానా లింక్పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేస్తే చాలని అంటారు. మన మొబైల్లో టెలిగ్రామ్, వాట్సాప్లను ఏపీకే (ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్) ఫైల్స్ రూపంలో మె సేజ్లను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన ఫోన్లో సమాచారమంతా వారికి పోతుంది. కాంటాక్ట్ నంబర్లు, ఫొటో లు, వీడియోలు, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలే కాక డాక్యుమెంట్ ఫైళ్లు సైతం వీరికి చేరిపోతాయి. వెరిఫై చేసుకోవాలి.. రకరకాల గిఫ్ట్ ఓచర్లు, గ్రీటింగ్స్, ట్రావెల్, గాడ్జెట్స్, ఫ్యాషన్లపై ఇచ్చే డిస్కౌంట్లను ఒకటికి రెండుసార్లు నమ్మదగినవా కాదా అన్నది వెరిఫై చేసుకోవాలి. వాటి రివ్యూస్ చూస్తూ వెరిఫైడ్, అథెంటిక్ వెబ్సైట్లోకి వెళ్లి ఆఫర్లను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. కొత్త బృందాలు ఏర్పాటుజాగ్రత్తలు తప్పనిసరి.. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయరాదు. ఫోన్లోని సెట్టింగ్లో ఇన్స్టాల్ ఫ్రం అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను డిజేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ కావు. మొబైల్ సెట్టింగ్లో ఫోన్ నంబర్లను యాక్సిస్ చేసే అనుమతి ఇవ్వరాదు. తెలియని ఏపీకే ఫైల్స్, మాల్వేర్స్ ఇన్స్టాల్ అయితే ఫోన్లో రీసెట్ ఆప్షన్ కొట్టాలి. ఈ–మెయిల్స్, టెక్ట్స్, ఇతర సోషల్ మీడియా యాప్ల ద్వారా నకిలీ లింక్స్ను గుర్తించాలి. వాటిని క్లిక్ చేయకుండా జాగ్రత్త పడాలి. గివ్ అవేస్ పోటీల ద్వారా వినియోగదారులను ట్రాప్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచేస్తారు. మన వివరాలను సేకరించి డార్క్వెబ్కు అమ్మేస్తారు. మన మొబైల్, ల్యాప్టాప్ (కంప్యూటర్)లలో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీ వైరస్ ప్రొగ్రామ్, అధికారిక యాప్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.జిల్లాలో 2025లో వైట్ కాలర్ నేరాలు 171 నమోదయ్యాయి. సైబర్ నేరాల్లో బాధితులకు అందించే రికవరీ సొమ్ము రాబట్టుకునేలా ఇక కృషి చేస్తాం. ఆన్లైన్ నేరాలను ఛేదించేందుకు ఇప్పటికే కొత్త బృందాలను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, సైబర్ క్రైమ్ సెల్తో సమన్వయం చేసుకుని 1930హెల్ప్లైన్ ఆన్లైన్ పోర్టల్ నిర్వహిస్తాం. విద్యాసంస్థల్లో, గ్రామాల్లో అవగాహన పరుస్తాం. – మంగళవారం నిర్వహించిన వార్షిక సమావేశంలో ఎస్పీ మహేశ్వరరెడ్డి -
కేసులు తగ్గాయి.. హత్యలు పెరిగాయి
● జిల్లాలో క్రైమ్రేటు తగ్గిందని ఎస్పీ వెల్లడి ● మహిళలపై విపరీతంగా వేధింపులు, నేరాలు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో క్రైమ్ రేటు తగ్గిందని, కానీ గతంలో కంటే హత్యలు, హత్యాయత్నాలు పెరిగాయని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. ఆయన మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో నేర వార్షిక గణాంకాలు వెల్లడించారు. సైబర్క్రైమ్ డిటెన్షన్, జాబ్ఫ్రాడ్స్ వంటి అంశాల్లో మెరుగుపడాలని, కొత్తగా బృందాలు వేసి ఫలితాలు సాధించాల్సి ఉందని చెప్పారు. 2024లో 9555 కేసులు నమోదైతే ఈ ఏడాది 6314 నమోదయ్యాయని పేర్కొన్నారు. అయితే మహిళలపై వేధింపులు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హత్యల్లో టాప్.. గత ఏడాది జిల్లాలో 17 హత్యలు జరగ్గా.. ఈ ఏడాది 26 హత్యలు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నా రు. మరికొన్ని దర్యాప్తు దశలో ఉన్నాయన్నారు. వీటితో పాటు హత్యాయత్నం కేసులు కూడా 22 నమోదైనట్లు చెప్పారు. వీటిలో చాలా వరకు కుటుంబ తగాదాల వల్లనే జరిగాయని వివరించారు. పోక్సో కేసులు కూడా 54 నమోదయ్యాయన్నారు. మహిళలకు వేధింపులు మహిళలకు సంబంధించి ఈ ఏడాది 482 కేసులు నమోదు కాగా.. అందులో 333 వేధింపుల కేసులే ఉన్నాయన్నారు. అటెంప్ట్ రేప్ ఒకటి ఉండగా, ఎలోప్మెంట్ రేప్లు 9 ఉన్నాయని, వరకట్న హత్యలు 2, ప్రేరేపిత ఆత్మహత్యలు 4 ఉన్నాయని పేర్కొన్నారు. అవమానించినవి 130 ఉండగా ఈ ఏడాది 51 మంది బాలికలు, 214 మంది మహిళలు అదృశ్యమైనట్లు తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై ఇద్దరు హత్యాయత్నంకు పాల్పడగా, 8 మంది దళిత మహిళలపై లైంగిక దాడి జరిగినట్లు కేసులు నమోదుయ్యాయన్నారు. ఎస్సీ మహిళలను అవమానించినవి 6, అదర్ ఐపీసీ 22 కేసులు నమోదయ్యాయన్నారు. ప్రాపర్టీ నేరాల్లో ఈ ఏడాది మొత్తం 396 కేసుల్లో 281 ఛేదించి 260 మంది నేరస్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.2,69,09,869లు స్వాధీనం చేసుకున్నారు. 2025 కంటే ముందు చేసిన నేరాలను ఈ ఏడాదిలో ఛేదించామన్నారు. కొత్త ఏడాది లక్ష్యాలివే.. అల్లర్లు సృష్టించే రౌడీ, సస్పెక్ట్, హిస్టరీ షీటర్లకు జియోట్యాగింగ్ చేస్తామని, ఆపదలో ఆదుకునేలా 112 కాల్స్ వస్తే 5 నిమిషాల్లో చేరేలా టార్గెట్ పెట్టుకున్నామని, ప్రజలు, పోలీసులు, ఆర్గనైజ్ సంస్థలు సౌజన్యంతో 3700 సీసీ కెమెరాలు పెట్టామని, మరో 1100 కెమెరాలు క్రైమ్స్పాట్లకు అవసరం ఉన్నాయని తెలిపారు. రహదారి భద్రతా విషయంలో హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ చేస్తామని, వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా కార్యక్రమాలు ప్రత్యేకంగా చేస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, ఎన్డీపీఎస్(గంజా), గ్యాంబ్లింగ్పై మరింత కఠినతరంగా వ్యవహరించి జైలు శిక్ష పడేలా చేస్తామని ఎస్పీ చెప్పారు. -
శ్రీకాకుళం
ఎన్నాళ్లీ ఎదురుచూపులు..?రెండేళ్లు దాటుతున్నా చంద్రబాబు హామీలు అమలు కాలేదు. వంశధార నిర్వాసితులకు ఇబ్బంది తప్పడం లేదు. –8లోబుధవారం శ్రీ 31 శ్రీ డిసెంబర్ శ్రీ 2025శ్రీకూర్మ నాథునికి హారతిఅరసవల్లిలో తిరువీధిశ్రీకాకుళం మొండేటివీధిలో..న్యూ ఇయర్ వేడుకలకు ఆంక్షలు శ్రీకాకుళం క్రైమ్ : కొత్త ఏడాది సందర్భంగా ఎక్కడ ఈవెంట్ చేసుకున్నా పోలీసుల అనుమ తి పక్కాగా ఉండాలని, జనసంఖ్య, సాంస్కృతిక కార్యక్రమ వివరాలను తెలపాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో మద్యం సరఫరాకు సంబంఽధించి బార్ అనుమతులు తప్పనిసరని, ఎకై ్సజ్ శాఖతో పాటు సంబంధిత ఇతర శాఖల అనుమతులు ఉండాలన్నారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అనుసరించి డెసిబుల్స్ అధికం కాకుండా సౌండ్సిస్టమ్ పెట్టుకోవాలన్నారు. ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం వరకు ఉన్న హైవేతో పాటు పట్టణాలు, మండలాలు, ముఖ్య కేంద్రాలు, కూడళ్లలో కచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు డిసెంబర్ 31న నిర్వహిస్తామన్నారు. ఇంట్లో తాగినా, ఈవెంట్లో తాగినా, ఎక్కడ తాగినా.. రోడ్డుమీద తాగి డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రిమాండ్కు (జైలు) పంపడం ఖాయమని, లైసెన్సులు రద్దు చేసి వాహనాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సెలబ్రేషన్ ముఖ్యమే కాని ఎదుటివారిని ఇబ్బంది పడితే సహించేది లేదని, రాత్రి ఒంటి గంట తర్వాత అన్నీ బంద్ చేయాలని ఎస్పీ అన్నారు. షీటర్లపై మరింత నిఘా.. 144 రౌడీషీట్లు, 204 సస్పెక్ట్ షీట్లు 2025లో తెరిచామని, 1870 హిస్టరీ షీటర్లపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని న్యూ ఇయర్ వేడుకల్లో గానీ, పండగ సమయాల్లో గానీ వీరి ఆగడాలు మీరితే సహించేది లేదన్నారు. న్యూసెన్స్ కేసులో నలుగురికి జైలు శిక్ష శ్రీకాకుళం క్రైమ్ : నగరంలోని మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన దువ్వు సాయిపవన్, గంగారావు, రాజశేఖర్, అంబటి తరుణ్లు బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించి న్యూసెన్సు చేసినందుకు కోర్టు 7 రోజుల జైలు శిక్ష విధించిందని ఒకటో పట్టణ ఎస్ఐ హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. టెక్కలి డివిజన్లోకి నందిగాం మండలం శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని నందిగాం మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలి రెవెన్యూ డివిజన్లోకి మారుస్తూ ప్రభుత్వం మంగళవారం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. పరి పాలనా సౌలభ్యం, అభివృద్ధి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో ప్రతిపాదించిన మార్పులపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం గవర్నర్ పేరిట ఈ గెజిట్ వెలువడింది. ఈ మార్పు డిసెంబరు 31, 2025 నుంచి అమలులోకి రానుంది. దీనితో టెక్కలి డివిజన్లోని మండలాల సంఖ్య 10కి చేరగా, పలాస డివిజన్లో 7 మండలాలు ఉండనున్నట్లు పేర్కొన్నారు. -
అలుగును చంపిన కేసులో మూడేళ్ల జైలుశిక్ష
వజ్రపుకొత్తూరు రూరల్ : వజ్రపుకొత్తూరు మండలం కొమరల్తాడలో 2015లో అరుదైన అలుగు జంతువును చంపి మాంసం తిన్నట్లు రుజువు కావడంతో అదే గ్రామానికి చెందిన రత్నాల జయరాంకు పలాస జూనియర్ సివిల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు టెక్కలి అటవీశాఖ రేంజర్ జి.జగదీశ్వరరావు తెలిపారు. 2015లో అలుగును చంపిన జయరాంపై వైల్డ్ లైఫ్ యాక్ట్–1972 కింద అప్పటి రేంజ్ అధికారి సంజయ్ కేసు నమోదు చేయగా.. మంగళవారం కోర్టు తుది తీర్పు వెలువరించినట్లు పేర్కొన్నారు. అటవీ జంతువులను హతమార్చితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కె.మత్స్యలేశం తీరానికి భారీ సొరచేప ఎచ్చెర్ల: డి.మత్స్యలేశం పంచాయతీ కె.మత్స్యలేశం సముద్రం ఒడ్డుకు మంగళవారం భారీ సొరచేప కొట్టుకొచ్చింది. కొన ఉపిరితో ఉన్న చేపను రక్షించేందుకు స్థానికులు సముద్రంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడటంతో ముందుకు కదల్లేని పరిస్థితిలో ఉంది. కాసేపటికే చేప చనిపోయినట్లు మత్స్యకారులు గుర్తించారు. సుమారు 3 వందల కిలోలపైగా ఉన్న ఈ చేప తినేందుకు ఉపయోగపడదని మత్స్యకారులు తెలిపారు. వజ్రపుకొత్తూరు రూరల్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలలో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి జక్కల తోష్నిరాయ్ ప్రతిభ కనబర్చి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. రోలర్ స్కేటింగ్ స్పోర్ట్స్ వీక్ నేషనల్ చాంపియన్షిప్–2025 పోటీలలో 300 మీటర్ల రోలర్ స్కేటింగ్ విభాగంలో ఈమె సత్తాచాటింది. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జక్కల గోపాలకృష్ణ, చంద్రవతి దంపతుల కుమార్తె తోష్నిరాయ్ ప్రతిభ కనబరచడం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. -
ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షుడిగా హనుమంతు సాయిరాం
శ్రీకాకుళం అర్బన్: ఏపీ ఎన్జీఓ సంఘ జిల్లా అధ్యక్షునిగా హనుమంతు సాయిరాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం శ్రీకాకుళంలోని ఎన్జీఓ కార్యాలయంలో జరిగిన ఎన్జీఓ సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నికల్లో హనుమంతు సాయిరాం ఆరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డీవీ రమణ నేతృత్వంలో కొత్త కార్యవర్గం ఏర్పాటు జరిగింది. ఈ కొత్త కార్యవర్గం రెండేళ్ల పాటూ విధులు నిర్వర్తించనుంది. సంఘం జిల్లా అధ్యక్షునిగా హనుమంతు సాయిరాం, సహాధ్యక్షులుగా కె.జయరావు, ఉపాధ్యక్షులుగా టి.సోమేశ్వరరావు, రాయి వేణుగోపాల్, పి.జానకిరామ్, డి.శ్రీరామ్ కుమార్, ఎల్.జగన్మోహనరావు, పి.శ్రావణి, కార్యదర్శిగా చల్లా శ్రీనివాసరావు, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఆర్.గోవింద్ పట్నాయక్, సంయుక్త కార్యదర్శులుగా ఏజేఎం రాధాకృష్ణ, కె.మోహనరావు, బి.వెంకటేశ్వరరావు, కె.మన్మథరావు, కేవీవీ సత్యనారాయణ, జి.లలిత, కోశాధికారిగా బడగల పూర్ణ చంద్రరావు తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు హనుమంతు సాయిరాం మాట్లాడుతూ ఉద్యోగ సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ రాజీపడని ధోరణిలోనే ఏపీఎన్జీజీఓ సంఘం వ్యవహరిస్తుందని అన్నారు. అంతకుముందు ఎన్జీవో సంఘ సభ్యులంతా వైఎస్సార్ కూడలి వద్ద నుంచి పొట్టిశ్రీరాములు కూడలి మీదుగా ఎన్జీఓ సంఘ కార్యాలయానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. -
ట్రేడ్టెస్ట్కు దరఖాస్తులు ఆహ్వానం
ఎచ్చెర్ల : ఉపాది, శిక్షణా శాఖ(విజయవాడ) ఆదేశాల మేరకు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (ప్రైవేటు) 2026 సంవత్సరానికి గాను ఐటీఐ ప్రైవేటు అభ్యర్థులుగా ఎన్టీసీ సర్టిఫికెట్ పొందే పరీక్ష రాసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 28లోగా సమీప ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఎచ్చెర్ల ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ ఎల్.సుధాకరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెన్త్ విద్యార్హత కలిగి ఉండి, 21 ఏళ్లు నిండి, సంబంధిత ట్రేడ్లో మూడేళ్ల అనుభవం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలన్నారు. భర్తకు తలకొరివి పెట్టిన భార్య మెళియాపుట్టి: హీరాపురం గ్రామానికి చెందిన కిల్లి శ్యామసుందరరావు(65) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. ఈయన ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చినప్పటికీ.. భార్య లలిత అన్నీ తానై వ్యవహరించి భర్త చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
కిడ్నీ బాధిత విద్యార్థినికి సాయం
కవిటి: కిడ్నీ బాధిత బాలిక దీనస్థితిపై మానవతా దృక్పథంతో స్పందించి దాతలు ఉదారంగా సాయమందించాలని మాణిక్యపురం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం మజ్జి వైకుంఠరావు కోరారు. మంగళవారం సిబ్బందితో కలిసి కంచిలి మండలం ప్రధానపుట్టుగలో నివసిస్తున్న తమ పాఠశాల పదో తరగతి విద్యార్థిని భూదేవి బిసాయి ఇంటికి వెళ్లారు. పాఠశాల సిబ్బంది వితరణగా చేసిన రూ.16200 మొత్తాన్ని అందించారు. తండ్రి చిన్నతనంలో మరణించడంతో తల్లి కుమార్తెలిద్దర్నీ పోషిస్తోంది. ప్రస్తుతం తన చెల్లి దయనీయ స్థితిలో ఇంటర్మీడియట్ చదువును కూడా పక్కనపెట్టి ఆమెను కంటికి రెప్పలా చూస్తూ వైద్యం అందిస్తోంది. కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది పిరియా వేణుగోపాల్, ఢిల్లీరావు, సంతోష్కుమార్, మురళీకృష్ణ, రామహరి పాఢి, మిన్నారావులు పాల్గొన్నారు. సాయం చేయాల్సిన దాతలు 9490284017 నంబరును సంప్రదించాలని హెచ్ఎం కోరారు. -
యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన
రణస్థలం: లావేరు మండలం తాళ్లవలస రైతు సేవా కేంద్రం, రణస్థలం మండలం వెల్పురాయి గ్రామంలో మంగళవారం ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో భాగంగా రబీ 2025–26 సీజన్లో పంటల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు పూర్వ అభ్యాస గుర్తింపు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ సహాయ సంచాలకుడు సీహెచ్ వెంకటరావు మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పంటలలో ఎరువుల యాజమాన్యం, పురుగు తెగుల యాజమాన్య పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో రాగోలు వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ పి.ఉదయ్ బాబు, రణస్థలం డివిజన్ ఏడీఏ వి.శ్రీనివాసరావు, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయాధికారి వై.సురేష్, రణస్థలం, లావేరు మండలాల వ్యవసాయాధికారులు డి.విజయభాస్కర్, డి.మహేష్నాయుడు, మాజీ సర్పంచ్ ముప్పిడి మురళీమోహన్, ఏఈవోలు, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు?
● రెండేళ్లు దాటుతున్నా అమలుకు నోచుకోని చంద్రబాబు హామీలు ● వంశధార నిర్వాసితులకు తప్పని ఇబ్బందులు ● పట్టించుకోని కూటమి పాలకులు హిరమండలం : ‘వంశధార నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం. అదనపు పరిహారం అందిస్తాం. పునరావాస గ్రామాలు, కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తాం. మిగుల భూముల సమస్యలను పరిష్కరిస్తాం. అధికారంలోకి వచ్చిన మరుక్షణం చేసి చూపిస్తాం’.. ఇవీ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు 2023 ఆగస్టు 10న ప్రాజెక్టులపై యుద్ధభేరిలో భాగంగా హిరమండలం, కొత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో చేసిన ప్రకటనలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోంది. అయినా ఇంతవరకు వంశధార నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవు. అసలు వారి సమస్యలపై దృష్టిపెట్టిన వారే కరువయ్యారు. దీంతో నిర్వాసితుల సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారింది. బలవంతంగా ఇళ్లు ఖాళీ.. 2005లో వంశధార ఫేజ్–2 రిజర్వాయర్ నిర్మాణానికి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రామాల్లో రెవెన్యూ, భూసేకరణ అధికారులు నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక ముందే నిర్వాసితులకు మెరుగైన వసతులు కల్పిస్తామని ఉపాధి, ఉద్యోగం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. కానీ 2017లో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఇప్పటికీ నిర్వాసితులు మరిచిపోలేకపోతున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 17 నుంచి డిసెంబరు 30 వరకూ ఇళ్లు పడగొట్టారు. కనీసం పండుగ చేసుకున్న వరకూ విడిచిపెట్టాలని కోరినా చంద్రబాబు సర్కారు పట్టించుకోలేదు. దీంతో సుమారు 10 వేల కుటుంబాలు తలోదిక్కుకు వెళ్లిపోయాయి. కొందరు తెలిసిన వారు, బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారు. మరికొందరు పునరావాస కాలనీల్లో రేకుల షెడ్లను ఏర్పాటుచేసుకున్నారు. కానీ అదే ఏడాది వచ్చిన తితలీ తుఫాను వారి తాత్కాలిక నివాసాలను నేలమట్టం చేసింది. అయితే నిదానంగా కోలుకున్నారు. కానీ నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. భారీగా అవకతవకలు..! టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వాసితుల పరిహారం పంపిణీలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సొంత పార్టీ నేతలకు అప్పట్లో పెద్దపీట వేసినట్టు విమర్శలు వ్యక్తమయ్యాయి. అర్హులకు మొండిచేయి చూపించి అనర్హులకు అందలం ఎక్కించారనే ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రూ.216 కోట్ల అదనపు పరిహారం మంజూరు చేసింది. నిర్వాసితులందరికీ రూ.లక్ష వంతున అదనంగా పరిహారం అందించింది. అయితే ప్రతిపక్ష నేతగా ప్రాజెక్టుల సందర్శనకు వచ్చిన క్రమంలో ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటుచేసి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే.. ఎల్ఎన్పేట మండలం శ్యామలాపురం, మోదుగులపేట, తాయిమాంబాపురం, జగన్నాథపురం.. ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస..కొత్తూరు మండలం గూనభద్ర, మెట్టూరు, మహాసింగి.. సీతంపేట మండలం పులిపట్టి.. హిరమండలంలోని సుభలాయి ఆర్అండ్ఆర్ కాలనీల్లో 80 శాతం నిర్వాసితులు ఉంటున్నారు. ఆయా చోట్ల రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలు లేవు. నిధులు మంజూరైనా కొన్నిచోట్ల ఆలయాలు నిర్మించలేదు. ఇక మిగుల భూములకు సాగునీటి సౌకర్యం కల్పించలేదు. దీంతో సాగుకు వీలుపడడం లేదు. రానున్న మూడున్నరేళ్లలో అయినా నిర్వాసితుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి.. నిర్వాసితులకు సంబంధించి అపరిష్కృత సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సీఎం చంద్రబాబు రెండేళ్ల కిందట ఇచ్చిన హామీలు ఇంతవరకూ అమలుకాలేదు. పునరావాస గ్రామాల్లో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. – బి.వి.వి.సత్యనారాయణ, నిర్వాసితుడు, తులగాంపరిస్థితి దారుణం.. మా పరిస్థితి దారుణంగా మారింది. రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేశాం. అయినా మా త్యాగాలకు విలువ లేకుండా పోయింది. పరిహారంతో పాటు మంచి పునరావాసం కల్పిస్తామని చెప్పారు. అనేక హామీలు ఇచ్చారు. అవేవీ కార్యరూపం దాల్చలేదు. – జి.పద్మావతి, నిర్వాసితురాలు, పాడలి -
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
గార: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. మంగళవారం గొంటి పంచాయతీ సచివాలయం వద్ద పర్యావరణ పరిరక్షణపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ప్రకృతిని పెంపోందించే కార్యక్రమంలో భాగంగా దీపావళి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద మొక్క నాటాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్ చల్ల శ్రీనివాసరావు, ఎన్జీవో ఎం.సింహాచలం, వీఆర్వో కిరణ్, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అంబేడ్కర్ వర్సిటీ క్యాలెండర్ ఆవిష్కరణ
ఎచ్చెర్ల : నూతన సంవత్సరంలో వర్సిటీ, అనుబంధ కళాశాలలు మరింత ప్రగతిబాటలో పయనించాలని ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కె.ఆర్.రజనీ ఆకాంక్షించారు. మంగళవారం తన చాంబర్లో వర్సిటీ–2026 క్యాలెండర్, డైరెలను ఆవిష్కరించారు. సిక్కోలు చారిత్రక అంశాలతో క్యాలెండర్ రూపొందించిన జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఎస్ఓ డాక్టర్ కె.సామ్రాజ్యలక్ష్మీ, ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్ రాజశేఖర్రావు, ఎగ్జామ్, సీడీసీ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వెలుగు వీఓఏ మృతి మెళియాపుట్టి: పరశు రాం పంచాయతీలో వెలుగు వీఓఏగా విధు లు నిర్వహిస్తున్న సవర నాగేశ్వరరావు(32) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగేశ్వరరావు పలాస మండలం టెక్కలిపట్నం నుంచి పరశురాంపురం వైపు ద్విచక్రవాహనంపై వస్తుండగా గేదె అడ్డంగా రావడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించి 108 ద్వారా పలాస ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. నాగేశ్వరరావుకు భార్య బోదెమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చెట్టును ఢీకొన్న బైక్ ● యువకుడు దుర్మరణం హిరమండలం: ఎల్ఎన్పేట మండలం శ్యామలాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శృంగవరపు యుగంధర్ (25) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. శ్యామలాపురం గ్రామానికి చెందిన యుగంధర్ సోమవారం అర్థరాత్రి బైక్పై వస్తుండగా గ్రామ సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. అందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యం’ శ్రీకాకుళం క్రైమ్ : విశాఖపట్నం రేంజి పరిధిలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలన, డ్రగ్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టడంతో 2025లో గణనీయమైన ఫలితాలను రాబట్టామని డీఐజీ గోపినాఽథ్ జెట్టి అన్నారు. మంగళవారం ఈ మేరకు పత్రికా ప్రకటన జారీ చేశారు. 4 డ్రోన్లతో 327 గ్రామాల్లో14,870 ఎకరాలను గంజాయి సాగు జరిగిన ప్రాంతాల గుర్తింపునకు సర్వే చేశామని, 138 గ్రామాలు ధ్రువీకరించామన్నారు. 24 సీసీ కెమెరాలతో కూడిన చెక్పోస్టులు, 362 డైనమిక్ తనిఖీల కేంద్రాల ద్వారా భారీగా గంజాయి, హషీష్ ఆయిల్ స్వాధీనం చేసి నిందితులను అరెస్టు చేశామన్నారు. 9 రహస్య గంజాయి నిల్వలను గుర్తించామన్నారు. 25 అంతర్రాష్ట్ర, 44 అంతర్జిల్లా ముఠాలను ఛేదించి ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 315 మంది నేరస్తులను అరెస్టు చేశామన్నారు. 34 ప్రత్యేక బృందాలు 444 మంది పరారీలో ఉన్న నేరస్తులను పట్టుకున్నాయన్నారు. 39 కేసుల్లో 61 మందికి శిక్ష పడగా, 16 కేసుల్లో రూ. 9.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశామని తెలపారు. 99 పీఐటీ ఎన్డీపీఎస్ ప్రతిపాదనలను ప్రారంభించగా 645 ఎన్డీపీఎస్ సస్పెక్ట్ షీట్లు తెరిచామన్నారు. 22,050 అవగాహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్లైన్ తనిఖీ నిర్వహణలో కార్మికులకు కనీస వేతనాల చట్టం అమలుకానందున 22 మందికి ఆ తేడాను రూ.1,07,161 డి.డి రూపంలో అందించామని ఉపకార్మిక కమిషనర్ దినేష్కుమార్ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో ఉపకార్మికశాఖ కార్యాలయంలో మంగళవారం పలువురు కార్మికులకు డీడీలు అందజేశారు. కార్మికులకు అపాయింట్మెంట్ లెటర్లను ఈ–శ్రమ్లో నమోదు చేసినట్లు తెలిపారు. -
వైభవంగా ఆదిత్యుని కల్యాణ సేవ
అరసవల్లి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా అనివెట్టి మండపంలో ఏకాదశి కల్యాణ సేవ వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ సతీసమేతంగా హాజరై పూజలు చేశారు. అంతకుముందు ఉత్సవమూర్తులను పుష్పాలంకరణ చేసి శ్వేత అశ్వ వాహనంలో కొలువుదీర్చి మాడవీధుల్లో తిరువీధి నిర్వహించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో మంగళధ్వనుల మధ్య ఉత్తర (వైకుంఠ) ద్వారం లోంచి ఆలయంలోకి ఉత్సవమూర్తులను తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి నగేష్ కాశ్యప, రంజిత్ శర్మ, సాందీప్శర్మ, క్షేమేంద్ర శర్మ, హరిప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో టోమోథెరపీ సేవలు
ఎంవీపీ కాలనీ : క్యాన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నం జిల్లా ఎంవీపీ కాలనీలోని మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం ఆస్పత్రిలో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు ఉపశమనం కలిగించేలా మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతిక అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడం సాధ్యమవుతుందన్నారు. ఎండీ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ క్యాన్సర్ హాస్పిటల్ దేశంలో లెవల్–3 కేటగిరి హాస్పిటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా క్యాన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రిలో టోమోథెరపీ యూనిట్ను ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్ -
జీఓ ప్రకారం జీతాలు చెల్లించాలి
శ్రీకాకుళం: రిమ్స్ సెక్యూరిటీ గార్డులకు, పారిశుద్ధ్య కార్మికులకు జీవో ప్రకారం కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నశెట్టి రాజశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం శ్రీకాకుళం రిమ్స్ ముఖద్వారం వద్ద కార్మికుల నిర్వహిస్తున్న రెండో రోజు రిలే దీక్షలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులను వేధిస్తున్న క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ కాంట్రాక్టర్పై ప్రభుత్వం ఎందుకు చర్యలను తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జీవో –138 ప్రకారం రూ.18,600 చొప్పున జీతం, బకాయిలు చెల్లించాలన్నారు. కార్యక్రమంలో ఏకెఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాష్, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు మామిడి క్రాంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
555 ఫోన్ల రికవరీ
శ్రీకాకుళం క్రైమ్ : బాధితులు వివిధ సందర్భాల్లో పోగొట్టుకున్న 555 మొబైల్ ఫోన్లను జిల్లా సైబర్ పోలీసులు ట్రేస్ చేయడమే కాక దొంగలించిన వారి నుంచి రికవరీ చేశారు. సుమారు రూ. 86 లక్షలు విలువైన ఈ ఫోన్లను జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఉదయం ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తన చేతుల మీదుగా బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లుగా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులు పోగొట్టుకున్న మొబైళ్లను తమ సైబర్ సెల్, ఐటీకోర్ సిబ్బంది ట్రేస్ చేస్తున్నారని తెలిపారు. అప్పటినుంచి ఇప్పటివరకు బాధితులు 7212 మంది మొబైళ్లు పోగొట్టుకున్నామంటూ ఫిర్యాదు చేయగా 2660 రికవరీ చేసి అందించడం జరిగిందన్నారు. వీటిలో ఈ ఒక్క ఏడాదిలోనే 2442 ఫిర్యాదులు రాగా 1060 రికవరీ చేశామని, మరో 330 ఫోన్లను గుర్తించామన్నారు. తక్షణ ఫిర్యాదు మేలు.. ఎవరైనా బాధితులు తమ మొబైల్ పోగొట్టుకున్నా.. లేదంటే ఎవరైనా దొంగిలించినా తక్షణమే సీఈఐఆర్ వెబ్ పోర్టల్లో ఫిర్యాదు రిజిస్టర్ చేయాలన్నా రు. అందుబాటులో ఉన్న పోలీస్స్టేషన్ను గానీ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఉన్న సైబర్సెల్ బృందాన్ని కలసి ఫిర్యాదు చేయొచ్చన్నారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లో కొత్త వ్యక్తి సిమ్ కార్డు వినియోగించిన వెంటనే ఆ మొబైల్ను ట్రేస్ చేయడం వీలవుతుందన్నారు. సైబర్ సిబ్బందికి ప్రశంసలు.. ఫోన్లలో 60 శాతం ట్రేసిబిలిటీ ఉండగా 80 శాతం రికవరీ ఉండటంలో కృషి చేసిన సైబర్ సెల్ సీఐ టి.శ్రీనివాసరావు బృందం పైలా శరత్చక్రవర్తి, జి.శేషగిరిరావు, టి.సుధీర్, పి.సత్యనారాయణ, పద్మజ్యోతి, కుసుమలను ప్రశంసించారు. బాధితులకు ఎస్పీ చేతుల మీదుగా అందజేత 7212 ఫిర్యాదులకు గాను ఇప్పటివరకు 2660 ఫోన్లు అందించామన్న ఎస్పీ -
ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు
అరసవల్లి: అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినం మంగళవారం ఘనంగా నిర్వహించేలా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మంగళవారం వేకువజామున శ్రీ ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులను తిరువీధిగా ఊరేగించి వైకుంఠ (ఉత్తర) ద్వారం నుంచి ఆలయం లోపలకు తీసుకువెళ్లనున్నారు. అనంతరం ఇదే ఉత్తర ద్వారం నుంచి భక్తులకు సర్వదర్శనాలు ఉంటాయని ఈఓ ప్రకటించారు. అనంతరం అనివెట్టి మండపంలో ఉత్సవమూర్తులకు కల్యాణాన్ని జరిపించనున్నట్టుగా ప్రధానార్చకులు శంకరశర్మ తెలియజేశారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలివజ్రపుకొత్తూరు రూరల్: పచ్చని ఉద్దాన ప్రాంతంలో ప్రభుత్వాలు తలపెట్టిన కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను వెంటనే రద్దు చేయాలని కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం కమిటీ అధ్యక్షు డు కొమర వాసు అధ్యక్షతన సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, న్యూ డెమొ క్రసీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, లిబరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రామారావు, పోరాట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంతంలో కార్గో ఎయిర్ పోర్టు పేరుతో చేస్తున్న భూ సేకరణ ఆపాలని కోరారు. ఉద్దాన ప్రజలకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తిప్పికొట్టడానికి జనవరి 7 నుంచి 13 వరకు గ్రామాల్లో ‘మా ఊరు మా భూములు’ పేరిట భూములను కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదిత పత్రాలను భోగి మంటల్లో వేసి దహనం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్దానంలో ఏళ్ల తరబడి పీడిస్తున్న కిడ్నీ వ్యాధి నియంత్రణకు శాశ్వత పరిష్కారం చేయాలని, ఉద్దాన ప్రాంతంలో జీడి ఆధారిత పరిశ్రమను ఏర్పాటు చేయాలని, ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ అన్నా రు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు రెసిడెన్సీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని అన్నారు. ఉద్యమాలను అణచివేసేందుకే ఇప్పుడు కొత్తగా 50 ఏళ్ల నుంచి పుట్టిన ఉద్యమాల గురించి ఆరా తీస్తున్నారని తెలిపారు. ఆనాడు పార్లమెంట్లో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం ఉండడంతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని, నేడు మోదీ ప్రభుత్వం ఆ పథకానికి మహాత్మా గాంధీ పేరుని తొలగించడమే కాకుండా నిధు ల కోత విధించిందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్న చంద్రబాబు మోదీని మించిపోయారని విమర్శించారు. బల్క్ డ్రగ్ కేంద్రాన్ని ఆ ప్రాంత ప్రజలు వ్యతిరేకిస్తుంటే వారికి అండగా నిలిచిన అనకాపల్లి సీపీఎం నాయకులు అప్పలరాజును అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెడతామని బెదిరింపులకు పాల్పడడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. సెంట్రల్ హెల్త్ డిపార్ట్మెంట్లలో కీలక పదవిని చేపట్టిన కె.సుజాతరావు కూడా ప్రభు త్వ వైద్యశాలలు ప్రైవేటుపరం చేస్తే పేదలకు వైద్య విద్యుత్తో పాటు, వైద్యం కూడా భారం అవుతుందని చెప్పారని గుర్తు చేశారు. అమరా వతి కోసం 54 వేల ఎకరాలు భూములు తీసుకుని 12 ఏళ్లు అవుతున్నా భూములు ఇచ్చిన రైతులకు ఒక పట్టానైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు 1500 ఎకరాలు అవసరమని చంద్రబాబు చెబుతున్న తీరు దారుణమని అన్నారు. -
పగలూ రాత్రి లేకుండా చోరులు ఈ ఏడాది రెచ్చిపోయారు. చైన్ స్నాచర్ల నుంచి దోపిడీ దొంగల వరకు అంతా తమ పనితనం చూపించారు. ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి కావడం విశేషం. ఎంబీఏ చదువుకున్న వారి నుంచి లారీ డ్రైవర్ల వరకు అంతా ఈ దొంగల లిస్టులో ఉండడం గమనార్హం. 2025 అంతా హడావుడి
ఎంబీఏ చదివిన చిన్నబాబు దొంగగా మారాడు. వృద్ధులను ఏమార్చి ఏటీఎం కార్డులు మార్చి డబ్బు కొట్టేయడంలో ఘనుడు. ఇతడిది నరసన్నపేట. సాంకేతికంగాను, చదువులోనూ తెలివైనవాడైన చిన్నబాబు జల్సాలకు అలవాటు పడి గత పదేళ్లుగా చోరీలు చేస్తూ కటకటాల్లోకి వెళ్లాడు. ఆమదాలవలస పోలీసులు అరెస్టు చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎంబీఏ చదివి దొంగతనాలు ఏటీఎం దొంగపై 30 కేసులు అరెస్టు : 15 సెప్టెంబరు 2025 ఎగుమతులు, దిగుమతుల కోసం లారీల్లో వస్తాడు. స్వకార్యంతో పాటు చోరీ కార్యం కూడా కానిచ్చి వెళ్లిపోతాడు. అతడే ఉత్తరాఖండ్ డెహ్రడూన్కు చెందిన నూర్హసన్. 140 ఇళ్లకు కన్నాలేసి 32 చోరీకేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 18 కేసులున్నాయి. ఛత్తీస్గఢ్ రాయపూర్కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్, అబ్ధుల్ గఫూర్లతో కాశీబుగ్గలో చోరీలు చేశాడు. కందిపప్పు లోడు రాయపూర్ నుంచి కాశీబుగ్గ తెచ్చి ఇక్కడి నుంచి జీడిపప్పుతో పాటు మార్గమధ్యంలో దొంగతనాలు చేసేవాడు. చోరీ సొత్తు ఉత్తర ప్రదేశ్లో అమ్ముతాడు. 140 దొంగతనాలు.. 32 సార్లు అరెస్టు అరెస్టు : 15 ఏప్రిల్ 2025 బ్లేడు చూపిస్తాడు.. 49 తులాల బంగారం, 6.8 కిలోల వెండి స్వాధీనం.. అరెస్టు : 21 సెప్టెంబరు 2025 పట్టుకోబోతే మెడపై బ్లేడు పెట్టుకుంటాడు. పట్టుకోకుంటే వరుస పెట్టి దొంగతనాలు చేస్తాడు. అతడే కుప్పిలి రాజు. విజయనగరం జిల్లా సంతకవిటికి చెందిన ఇతడు కుప్పిలి నర్సింగరావుతో కలిసి 68 దొంగతనాలకుపైగా చేశాడు. సీసీఎస్ పోలీసులు పట్టుకోగా ఆమదాలవలస పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేశారు. -
ఆధార్ వాడడు.. ఆధారాలు వదలడు
● 33 ఏళ్లుగా చోరీలు.. అరెస్టు: 23 నవంబరు 2025 రెండు తెలుగు రాష్ట్రాలకు కొరకరాని కొయ్య, మోస్ట్ వాంటెడ్ దున్న కృష్ణను జిల్లా సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. సెల్ఫోన్, ఆధార్, ఇతర ఐడెంటిటీ కార్డులు ఏవీ వాడకపోవడం ఇతని స్టైల్. బాల్యం నుంచే చోరీలు మొదలుపెట్టిన మెళియాపుట్టి చాపరకు చెందిన కృష్ణ కుటుంబంతో కోల్కతాలో వుంటూ సీజనల్గా వచ్చి దొంగతనాలు చేసేవాడు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కృష్ణను రిమాండ్కు తరలించి రికవరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. -
రాజకీయ కక్ష.. పేదలకు శిక్ష
కక్ష పూరితం ఇందిరమ్మ హయాంలో పేద రైతులకు పట్టాలు ఇచ్చారు. స్థానిక టీడీపీ సర్పంచ్ కక్ష పూరిత రాజకీయాలకు పాల్పడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. – రుప్ప అప్పలసూరి, ఎంపీటీసీ కేసు కోర్టులో ఉన్నా.. ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో మాకు పట్టాలు ఇచ్చారు. దశాబ్దాలుగా వరి, చెరుకు, పెసలు, మినుములు పండిస్తున్నాం. ఇప్పుడు ఈ భూమిని రెవెన్యూ అధికారుల స్వాధీనం చేసుకోవడం అన్యాయం. కోర్టులో కేసు నడుస్తున్నా చెట్లు ధ్వంసం చేశారు. – రుప్ప సింహాచలం, సానివాడ గ్రామం శ్రీకాకుళం రూరల్/గార: శ్రీకాకుళం మండల పరిధిలోని సానివాడ పంచాయతీ, గార మండలం అంపోలు రెవెన్యూ పరిధిలో బరాటం చెరువు వద్ద సర్వే నంబర్ 199లో 19 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో పేద రైతులకు 5 ఎకరాల 50 సెంట్లు భూమిని 1975లో అందజేశారు. వారు 50 ఏళ్లుగా ఇక్కడ సాగు చేసుకుంటున్నారు. ఈ భూమిపై కూటమి నేతల కన్ను పడింది. స్థలం గార రెవెన్యూ పరిధిలో ఉండడంతో అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం పోలీసు బందోబస్తుతో ఆరు పొక్లెయినర్లు పెట్టి చెరువు గర్భంలో గల ప్రభు త్వ భూమిని స్వాధీనం చేసుకోవడానికి పూనుకున్నారు. అడ్డువచ్చిన రైతులను ఎక్కడికక్కడ ఆపేశారు. వైఎస్సార్సీపీకి చెందిన వాళ్లం కాబట్టే ఇలా కక్ష సాధిస్తున్నారని రైతులు చెబుతున్నారు. సానివాడ పంచాయతీ అంపోలు రెవెన్యూ పరిధిలో 19 ఎకరాలు స్వాధీనం దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూమిపై రాజకీయ కుట్ర ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో రైతులకు పట్టాలు -
డిజైన్లలో లేటెస్ట్
చక్కటి టేస్ట్.. ● న్యూ ఇయర్ వేడుకలకు ఆకర్షణీయమైన కేకులు సిద్ధం ● అందుబాటులో సృజనాత్మక డిజైన్లు ఇచ్ఛాపురం రూరల్: కొత్త క్యాలెండర్ గోడకు తగిలించినా లేకపోయినా, అయిన వారికి విషెష్ చెప్పినా చెప్పకపోయినా, వాట్సాప్ స్టేటస్లు పెట్టినా పెట్టకపోయినా.. కేకు మాత్రం కోయాల్సిందే. కేకు లేకుండా న్యూఇయర్ సెలబ్రేషన్ అనేదే ఉండదు కదా. అందుకే బేకరీలు టేస్ట్తో పాటు లేటెస్ట్ డిజైన్లతో కొత్త కొత్త కేక్లను తయారు చేస్తున్నాయి. బెంగళూరు, మహారాష్ట్ర, బరంపురం, భువనేశ్వర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన మాస్టర్స్ జిల్లాలో బేకరీలు నిర్వహిస్తూ కేకుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. అందరినీ ఆకట్టుకునేలా చక్కటి డిజైన్లతో కేకులు సిద్ధం చేస్తున్నారు. పెరిగిన డిమాండ్ ప్రస్తుతం న్యూ ఇయర్ వేడుకలతో కేకులకు డిమాండ్ పెరిగింది. దీంతో ట్రెండ్కు తగ్గట్టు జిల్లాలో కేక్లు తయారు చేస్తున్నారు. సాధారణ కేకులు కిలోకు రూ.250–రూ.500 వరకు, కూల్ కేక్స్ కిలోకు రూ. 500 మొదలుకుని రూ.3,500 వరకు ఉన్నాయి. అన్ని వైరెటీల్లో... కేక్స్ అన్ని వైరెటీల్లో అందిస్తున్నాం. కస్టమర్ల అభిరుచుల మేరకు అన్ని ఫ్లేవర్స్లో కేక్స్ సిద్ధం చేస్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉంది. సాధారణ కస్టమర్కు అనుగుణంగా ధరలు నిర్ణయించడం జరిగింది. – కె.అనిల్, హాయ్ కేఫ్, ఇచ్ఛాపురం గంటలోనే తయారు చేసేస్తాం కస్టమర్లు కోరిన డిజైన్లలో కేక్స్ కేవలం గంటలోపే తయారు చేస్తున్నాం. కేక్లపై క్రీమ్తో డిజై న్లు వేయడం సొంతంగా నేర్చు కున్నా. డిసెంబర్ 31 కోసం కేక్లు సిద్ధం చేస్తున్నాం. అన్ని వైరెటీల కేక్స్, ఆన్లైన్లో కనిపించే వైరెటీ కేక్స్ను ఆర్డర్లను బట్టీ తయారు చేసి ఇస్తున్నాం. – జి.గణేష్, కేక్ మేకర్, ఇచ్ఛాపురం -
కిటికీ పక్కన తాళాలు పెట్టారో..
112 తులాలు కొట్టేసిన ఘనులు అరెస్టు : 18 జనవరి 2025 షూ ర్యాక్లు, ఎలక్ట్రికల్ మీటర్ రీడింగ్బోర్డులు, పూలకుండీలు, కిటికీ లోపల తాళాలు పెడితే.. వారికి ఇట్టే తెలిసిపోతుంది. వారే విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ వున్నాన రాంబాబు, మన జిల్లా జి.సిగడాంకు చెందిన గిడిజాల కోటేశ్వరరావు. దాచిన తాళాలు కనిపెట్టి దొంగతనాలు చేస్తారు. ఇంటిలో ఎక్కడా ఏ వస్తువు టచ్ చేయకుండా.. ఫింగర్ ప్రింట్స్ దొరక్కుండా జాగ్రత్తపడతారు. ఏడాది వ్యవధిలో 32 చోరీలకు పాల్పడి మొత్తం 112 తులాల బంగారాన్ని కాజేశారు. మన పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బెయిల్పై విడుదలైన రాంబాబు 15 చోరీలు చేయడంతో కృష్ణాజిల్లా కంకిపాడు పోలీసులు ఈనెల 21న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
పుస్తక రచనకు గౌరీశంకర్ ఎంపిక
శ్రీకాకుళ రూరల్: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు పోస్టు గ్రాడ్యూయేషన్ కోర్సు పుస్తక రచన కోసం తనను ఎంపిక చేసినట్లు భమిడిపాటి గౌరీశంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పుస్తకాన్ని హైదరాబాద్కు చెందిన స్పెక్ట్రమ్ అంతర్జాతీయ ప్రచురణల సంస్థ ముద్రించనున్నట్లు తెలిపారు. గౌరీ శంకర్ మునసబుపేటలోని గాయత్రి కాలేజీ అఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్లో తెలుగు విభాగాధిపతిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో డిగ్రీ మూడు సెమిస్టర్స్కు తెలుగు వాచక రచన చేశారు. కథకుడు, విమర్శకుడు, కవిగా ఎన్నో రచనలు చేసి, బహుమతులు అందుకున్నారు. వందకుపైగా అంతర్జాతీయ, జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణలు చేశారు. దీంతో ఆయనకు గురజాడ విద్యాసంస్థల అధినేత జి.వి.స్వామి నాయుడు, ప్రిన్సిపాల్ కేవీవీ సత్యనారాయణ తదితరులు అభినందనలు తెలిపారు. -
ఆన్లైన్ సేవలు విస్తృతం..!
● అరసవల్లిలో మనమిత్ర క్యూఆర్ కోడ్ సదుపాయం ● ఆన్లైన్ సేవల రిజర్వేషన్కు మార్గం సుగమం అరసవల్లి: ప్రసిద్ధ సూర్యదేవాలయం అరసవల్లిలో ఆన్లైన్ సేవలు మరింత విస్తృతమయ్యాయి. 2020 నుంచే సూర్యనారాయణ స్వామివారి ఆలయ సేవలు ఆన్లైన్లో లభిస్తుండగా.. తాజాగా ఆలయంలో క్యూఆర్ కోడ్ ద్వారా ఆన్లైన్ చెల్లింపులకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ‘మనమిత్ర’ పేరిట సిద్ధ చేసిన ఈ క్యూఆర్ కోడ్తో రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధ ఆలయాల సమాచారంతో పాటు అక్కడి ఆలయాల్లో దర్శనాల టిక్కెట్లు, సేవల టిక్కెట్లను కూడా ఆన్లైన్లో చెల్లింపులు చేసి పొందే అవకాశముంది. దీనికోసం ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో ఆన్లైన్ టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదాల విక్రయాలతో పాటు వివిధ రకాల ఆర్జిత సేవా టిక్కెట్లు, సూర్య నమస్కార పూజలు, కల్యాణం, అభిషేక సేవల టిక్కెట్లను కూడా మనమిత్ర పేరిట క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటి నుంచే బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఇప్పటికే ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ సేవలు పొందేందుకు, అలాగే ఆయా ఆలయాల్లో పర్వదినాలు, వివరాల కోసం అధికారికంగా ప్రత్యేక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్ పనిచేస్తోంది. అయితే ఈ ప్రముఖ ఆలయాల జాబితాలోకి అరసవల్లి చేరడంతో ఆన్లైన్ సేవలను దేశం నలుమూలల నుంచి పొందే అవకాశం ఉంది. ఆదిత్యాలయంలో సేవలను, దర్శన టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని సేవలు అరసవల్లి ఆలయంలో ఆన్లైన్ సేవలను పొందేందుకు వెబ్సైట్లో పొందుపరిచాం. దేశం నలుమూలల నుంచి ఇక్కడి ఆలయంలో ఆర్జిత సేవలను, టిక్కెట్లను కూడా ఆన్లైన్లో పొందవచ్చు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఆన్లైన్ పేమెంట్ల కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ను అందుబాటులోకి తెచ్చాం. రానున్న రోజుల్లో ఈ ఆన్లైన్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. – కేఎన్వీడీవీ ప్రసాద్, ఈవో, ఆరసవల్లి ఆలయం -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● 163 అర్జీలు స్వీకరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: బాధితులు ఇచ్చిన అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల నుంచి 163 అర్జీలు స్వీకరించారు. సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ–61, రెవెన్యూ–37, పంచాయతీ రాజ్–13, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ – 13, ఏపీ ఈపీడీసీఎల్–6, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్–5, ఏపీ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్–3, సమగ్ర శిక్ష–3, వ్యవసాయ శాఖ–3, గ్రామీణాభివృద్ధి–2, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్–2, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్–2, కుటుంబ సంక్షేమం–2, వాటర్ రిసోర్సెస్ ఏజెన్సీ–2, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, మత్స్యశాఖ, దేవదాయ శాఖ, నైపుణ్యాభివృద్ధి, విద్య, మైన్స్ అండ్ జియాలజీ, పోలీసు, ఆర్టీసీకి సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, విశ్రాంత జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వినతులు పరిశీలిస్తే... ● తమ గ్రామంలో పొజిషన్ ధ్రువపత్రాన్ని టాంపరింగ్ చేసిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కవిటి మండలంలోని ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన పి.పద్మనాభం ఫిర్యాదు చేశారు. ● నందిగాం మండలంలోని హరిదాసుపురం గ్రామానికి చెందిన అక్కూరు మీన తనకు రావాల్సిన అంగన్వాడీ ఆశా కార్యకర్త పోస్టులో కనీసం ఇంటర్వ్యూకి హాజరవ్వని టి.రమాదేవిని అధికారులు నియమించారని, తనకు న్యాయం చేయాలని కోరారు. తను ఈ విషయమై రెండోసారి పీజీఆర్ఎస్కి రావడం జరిగిందని, తనకు న్యాయం జరగలేదని వాపోయారు. ● పురపాలక సంఘం పరిధిలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న పార్టు టైం వర్కర్లకు ఇతర పార్ట్ టైం వర్కర్లు మాదిరిగా వేతనం ఇవ్వాలని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పార్ట్ టైం వర్కర్లు టి.పార్వతి, ఎస్.భాను, ఎం.తవిటమ్మ, వి.కృష్ణవేణిలు కోరారు. ● పోలాకి మండలంలోని రెహమాన్పురం గ్రామానికి చెందిన పూడి అప్పలనాయుడుకి రెహమాన్పురం రెవెన్యూలో సర్వే నంబర్ 165–5లో సుమారుగా 0.53 సెంట్లు భూమి ఉందని, ఆ భూమికి తనకు అనువంశకరంగా సంక్రమించిదని, ఆ భూమికి తనకు పాస్ పుస్తకం, అడంగల్, 1–బీలను ఇప్పించాలని కోరారు. ● ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీఐలో మూడో సంవత్సరం ఇంజినీరింగ్ చదువుతూ సీనియర్లు వేధింపులు, అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన ప్రత్తిపాటి సృజన్ కుటుంబానికి న్యాయం చేయాలని దళిత సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, డా.కంఠ వేణు, తదితరులు పీజీఆర్ఎస్లో కోరారు. ● పొందూరు మండలంలోని కృష్ణాపురం, రాపాకలో వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎం.శంకరరావు అవితినీతికి పాల్పడి, అడ్డగోలుగా అడంగల్ మంజూరు చేస్తున్నారని గ్రీవెన్స్లో రైతులు కలెక్టరుకి వినతిపత్రం అందించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని జి.నాగేశ్వరరావు, సత్యప్రభ, విజయలక్ష్మి, మధుసూదనరావు తదితరులు కోరారు. -
రిమ్స్ కాంట్రాక్టర్స్ లైసెన్సులు రద్దు చేయాలి
● అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ప్రకాశ్ డిమాండ్ ● రిమ్స్ గేటు వద్ద ఇఫ్టూ ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభం శ్రీకాకుళం: రిమ్స్ ఆస్పత్రిలో గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా సెక్యూరిటీ గార్డ్స్పై నిరంకుశంగా వ్యవహరిస్తున్న శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం లేబర్ లైసెన్సు తక్షణమే రద్దు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి తాండ్ర ప్రకాశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రిమ్స్ గేటు వద్ద కాంట్రాక్టు అండ్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఇఫ్టూ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రిలో వివిధ రకాల కాంట్రాక్టర్లు రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులన్నా.. ప్రజాప్రతినిధులన్నా ఏమాత్రం గౌరవం లేదని, కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా అధికారులదేనని పేర్కొన్నారు. ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్ మాట్లాడుతూ.. జీవో 138 ప్రకారం రూ.18,600ల కనీస వేతనం ఇవ్వాలన్నారు. కాంట్రాక్టర్లు నియంతల్లా వ్యవహరించి కార్మికుల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సెక్యూరిటీ గార్డ్స్కి గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమస్య పరిష్కారం కోసం చొరవ చూపాలని, లేనిపక్షంలో పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. పోరాటానికి సంఘీభావం కార్మికుల రిలే దీక్షా శిబిరాన్ని ఐఏఫ్టీయూ ఏపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు పి.ప్రసాద్ సందర్శించి తన సంఘీభావాన్ని ప్రకటించారు. నిరవధికంగా పోరాటం సాగించాలని, దశల వారీ పోరాటానికి సిద్ధపడా లని పిలుపునిచ్చారు. యాజమాన్యం తక్షణమే కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో జోగి వెంకటరమణ, గురుగుబెల్లి లక్ష్మణరావు, మామిడి సూర్యనారాయణ, మిర్తిపాటి హైమారావు, సంధ్య, కాపురెడ్డి రాజేశ్వరి, శాంతి కుమారి, దుర్గాప్రసాద్, మోహనరావు, నరసింగరావు, కొప్పుల రాజశేఖర్, హేమలత, ఎస్.సుమతి, యూనియన్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజులు, ప్రధాన కార్యదర్శి బగాది శ్రీనివాసరావు, మద్ది శ్రీను సిరిపల్లి ప్రసాద్, తనుకు సంతోషి, బండారి శశికళ, గోవిందమ్మ, సాదు శ్రీనివాస్, దామోదర రవి కుమార్, తాళ్లవలస రామారావు, సతివాడ రాజేంద్రప్రసాద్, బన్నా అప్పన్న, అన్నేపు సూర్యనారాయణ, తిరుమలరావు, చిన్నారావు జయప్ర ద, భాస్కరరావు బీబీ మాధవరావు పాల్గొన్నారు. -
ఛలో విశాఖపట్నం జయప్రదం చేయండి
ఎచ్చెర్ల: జనవరి 4వ తేదీన నిర్వహించనున్న ఛలో విశాఖపట్నం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఎచ్చెర్లలో అఖిల భారత మహాసభల ప్రచారం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం నుంచి ప్రదర్శన, అనంతరం ఆర్కే బీచ్ వద్ద భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. కార్పొరేట్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గ హక్కులను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటాయన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్వహించడానికి సీఐటీయూ అగ్రభాగాన నిలిచిందన్నారు. కార్మక వర్గం సాధించుకున్న కార్మిక హక్కులను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు శారద, పుష్ప, లలిత, అమృత, కనకం తదితరులు పాల్గొన్నారు. -
ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా పడాల
శ్రీకాకుళం: లావేరు మండలం బుడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న పడాల తమ్మినాయుడును ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల కడపలో జరిగిన 79వ రాష్ట్ర కౌన్సిల్ ఎన్నికల్లో పడాలను ఎన్నుకున్నారు. దీంతో ఆయనను జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేడాడ ప్రభాకరరావు, గురువు శ్రీనివాసరావులు, సంఘం నాయకులు ఎస్వీ రమణమూర్తి, శ్రీనివాస పట్నాయక్, చింతల రామారావు తదితరులు అభినందించారు. ఆర్బిటర్గా నార్మ్ సాధించిన భీమారావు టెక్కలి: ఇప్పటివరకు ఫిడే ఆర్బిటార్గా వ్యవహరించిన జిల్లాకు చెందిన సనపల భీమారావు విశాఖపట్నంలో ఈనెల 24వ తేదీ నుంచి 28 వరకు 5 దేశాలకు చెందిన 582 మంది క్రీడాకారులు పాల్గొన్న చదరంగం అంతర్జాతీయ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లో ఆర్బిటార్గా వ్యవహరించారు. దీంతో ఆయన ఇంటర్నేషనల్ ఆర్బిటార్ రెండో నార్మ్ సాధించారు. ఈ నార్మ్ను అంతర్జాతీయ ఆర్బిటార్ జీవీ కుమార్ చేతులమీదుగా అందుకున్నారు. ఆయన ఇంకో నార్మ్ సాధిస్తే ఇంటర్నేషనల్ ఆర్బిటార్గా అవతరించనున్నారు. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చెస్కు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నార్మ్ అందుకోవడం జరిగిందన్నారు. మరో గ్రాండ్ మాస్టర్ ఈవెంట్లో రిఫరీగా వ్యవహరిస్తే ఫైనల్ నార్మ్ పూర్తి చేయవచ్చని తెలిపారు. ఆయనకు పలువురు అభినందనలు తెలియజేశారు. ఎస్పీ గ్రీవెన్సుకు 57 వినతులు శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్సుకు 57 వినతులు ప్రజల నుంచి అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తన చాంబర్లో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా జైలు తనిఖీ గార: జిల్లా జైలును శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జునైద్ అహ్మద్ మౌలానా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బోర్డ్ ఆఫ్ విజిటర్స్ సభ్యులతో సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైలులో ఖైదీలపై వివక్ష ఉండకూడదని, అందరినీ సమానంగా చూడాలన్నారు. విచారణకు హాజరు పరచని ఖైదీల వివరాలను, గరిష్ట శిక్ష కాలంలో సగం లేదా మూడింతల్లో ఒక వంతు పూర్తి చేసుకున్న అండర్ ట్రయిల్ ఖైదీల సమాచారాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. తగినంత న్యాయ ప్రాతినిధ్యం లేని ఖైదీలకు తక్షణమే చట్టపరమైన బెయిల్ దరఖాస్తులు, ఇతర ఉపశమనాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు పాల్గొన్నారు. వీఆర్వోలకు పనిభారం తగ్గించాలి శ్రీకాకుళం పాతబస్టాండ్: తమకు పనిభారం తగ్గించాలని వీఆర్వోలు కోరారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన చేపట్టారు. రాత్రీ పగలు పనిచేసినా తరగడం లేదని, వీటితో పాటు అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు. వీఆర్వోలపై రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్లు అజమాయిసీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీసర్వేలో కీలకంగా ఉన్న తాము పొలాల్లో ఉంటే సచివాలయాల్లో ఎలా హాజరు వేయగలమని ప్రశ్నించారు. తమకు హాజరు సడలింపు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. -
సమాజహితమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యమివ్వాలి
● హైదరాబాద్ ఐఐటీ డీన్ మల్లారెడ్డి ● టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ముగిసిన ఆవిష్కార్ టెక్కలి: సమాజానికి హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసేవిధంగా నైపుణ్యతకు ప్రాధాన్యమివ్వాలని హైదరాబాద్కు చెందిన ఐఐటీ డీన్ సి.మల్లారెడ్డి అన్నారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో గత మూడు రోజులుగా జరుగుతున్న ఆవిష్కార్ హ్యాక్థాన్ సీజన్–3 సాంకేతిక కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి విద్యార్థులనుద్దేశించి సూచనలు అందజేశారు. యువ ఇంజినీరింగ్ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని, సృజనాత్మక ఆలోచనలను వెలికితీయాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ సాంకేతిక ఆవిష్కరణల శిబిరం విశేష విజయాన్ని సాధించిందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న సాంకేతిక ప్రాజెక్టులు పరిశ్రమలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో మొదటి బహుమతి విశాఖపట్నంకు చెందిన జన్నోగజెనిక్స్ ఎన్ఎస్ఆర్ ఐటీకు రూ.1.25 లక్షలు, గుజరాత్కు చెందిన మైండ్ మోషన్ పారుల్ యూనివర్సిటీకి రెండో బహుమతి రూ.1 లక్ష, తమిళనాడుకు చెందిన కాస్మోస్ అమృత యూనివర్సిటీ విద్యార్థులు మూడవ బహుమతి రూ.75 వేలు గెలిపొందారు. కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ వీవీ నాగేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, మనోజ్ కుమార్, సతీష్ కుమార్, బీవీ రమణతదితరులు పాల్గొన్నారు. -
వేడుకగా కళింగ ఆత్మీయ సమ్మేళనం
ఎచ్చెర్ల/శ్రీకాకుళం న్యూకాలనీ: ఎచ్చెర్ల మండల కేంద్రంలోని చౌదరి సత్యనారాయణ తోటలో ఆదివారం రాష్ట్రస్థాయి కళింగ సామాజిక వర్గ ఆత్మీయ కలయిక సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలలతోపాటు విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, రాయలసీమ, బరంపురం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. కళింగ సామాజికవర్గ పెద్దల సూచనలతో కళింగ సంక్షేమ సంఘ ప్రతినిధులు చింతాడ రామ్మోహనరావు, దుప్పల వెంకటరావు, దుంపల రామారావు, దానేటి శ్రీధర్, పూజారి చెల్లయ్య, పూడి తిరుపతిరావు, మొదలవలస లీలామోహన్, బీవీఎస్ఎన్రాజు తదితరులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో సుమారు 50వేల మంది హాజరయ్యారు. కళింగ సామాజిక వర్గం సంక్షేమం, అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని వక్తలు పిలుపునిచ్చారు. ప్రముఖ సినీ గాయకుడు ధనుంజయ్ తన పాటలతో ఉత్సాహపరిచారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజు, వైఎస్సార్ సీపీ కాళింగ సామాజిక వర్గం వైఎస్సార్ సీపీ మాజీ అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, తదితరులు హాజరై ఆమె చేత కేక్ కటింగ్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఏపీ పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ గురుగుబెల్లి యతిరాజులు, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ కూన రామ్జీ, ఎమ్మెల్యే కూన రవికుమార్, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర ౖచైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, మాజీ చైర్మన్లు పేరాడ తిలక్, దుంపల రామారావు, పేడాడ రమణకుమారి, వైఎస్సార్ సీపీ నేతలు కిల్లి సత్యనారాయణ, చింతాడ రవికుమార్, తమ్మినేని చిరంజీవినాగ్, సింగుపురం మోహనరావు, ఎన్ని ధనుంజయరావు, తదితరులు పాల్గొన్నారు. -
సంచలన హత్యలివే..
● మార్చి 3న నరసన్నపేట బొంతలవీధికి చెందిన కేవిటి గున్నమ్మ (85) అనే వృద్ధురాలిని వివస్త్రగా చేసి చెవి, ముక్కు కోసేసి దారుణంగా ఓ బాలుడు హత్య చేశాడు. అనంతరం బంగారం దోచుకుని పారిపోయాడు. ● జూన్ 9న కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురానికి చెందిన వృద్ధురాలు దుంపల దాలమ్మను ఇంట్లో మోటారు రిపేర్ చేసేందుకు అదే గ్రామానికి చెందిన బల్లి రాము వచ్చి ఇనుపరాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో చనిపోయింది. బంగారు గొలుసుతో పరారయ్యాడు. ● డిసెంబరు 1న లావేరు మండలం మురపాకకు చెందిన వృద్ధురాలు వడ్డీ పార్వతి (64) 1న అదృశ్యమై 3న ఓ పాడుబడిన బావిలో శవంగా తేలింది. చెవి, ముక్కు కొరికి, కాల్చి హత్య చేసి బంగారం దోచుకెళ్లిన దుండగులు బావిలో పడేశారు. ● జూలై 11న ఎచ్చెర్ల మండలం ఫరీద్పేటకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సత్తారు గోపిని అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు ఎన్హెచ్–16 సమీప కొయిరాలమెట్ట వద్ద దారుణంగా హత్యచేశారు. ● ఆగస్టు 26న నరసన్నపేటకు చెందిన బంగారం వ్యాపారి పొట్నూరు వెంకటపార్వతీశం గుప్తాను బంగారం కోసం డ్రైవర్ సంతోష్తో పాటు పెద్దపాడు వద్ద ఆదిత్య కార్వరల్డ్ బిల్డింగ్ యజమాని ఎం.అప్పలరాజు మెడకు తాడు బిగించి హత్య చేసి రామిగెడ్డలో మృతదేహాన్ని పడేశారు. ● సెప్టెంబరు 24న కంచిలి మండలం జలంత్రకోట సమీపంలో ఓ దాబాలో భోజనం చేసి బిల్లు చెల్లించకుండా వెళ్లిపోతున్న లారీ డ్రైవర్ను ఓనర్ డబ్బులు అడగడంతో లారీతో తొక్కించి చంపేశాడు. అడ్డుకున్న మరో వ్యక్తిపైనా లారీ ఎక్కించేసి మరణానికి కారణమయ్యాడు. ● జనవరి 18న పొందూరు మండలం మొదలవలసకు చెందిన పూజారి కళావతి (53) శ్రీకాకుళం నగరం న్యూకాలనీలో హత్యకు గురైంది. శ్రీకాకుళం క్రైమ్ : ఏడాది కాలంగా జిల్లా వరుసగా హత్యలు చూస్తూనే ఉంది. గడిచిన ఏడాదిలో 16 హత్యలు జరిగాయని అధికారులు గణాంకాల్లో పేర్కొనగా ఈ ఏడాది చివరికొచ్చేసరికి దాదాపు 30 హత్యలు జరిగాయి. వీటిలో పోలీసులు ధ్రువీకరించినవి కొ న్ని మాత్రమే. కొన్నింటిని అనుమానాస్పద మరణాలుగా చూపారు. కానీ అవి కూడా హత్యలేనని స్థానికులు, కుటుంబీకుల నుంచి గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటిలో 15 హత్యలు మహిళలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఎందుకీ నేర ప్రవృత్తి..? రాజకీయ కారణాలు, మద్యం మత్తు, అనుమానం, దురాశ.. జిల్లాలో జరిగిన హత్యాకాండల వెనుక దాదాపుగా ఉన్న కారణాలివే. ఎక్కడికక్కడ మద్యం దొరుకుతుండడం, గంజాయి విక్రయాలు పెచ్చుమీరుతుండడంతో నేరాలూ పెరుగుతున్నాయి. మరోవైపు రాజకీయ కారణాలతోనూ చంపుకోవడం వంటి కొత్త సంస్కృతులు కూడా జిల్లాకు ఈ ఏడాదే పరిచయమయ్యాయి. ఇదివరకు దాడులు మాత్రమే జరిగాయి.. ఇప్పుడవి హత్యల స్థాయికి చేరుకున్నాయి. భార్యాభర్తల తగాదాలు.. జనవరి 25న ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటకు చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు గురుగుబెల్లి చంద్రశేఖర్ (45), ఫిబ్రవరి 10న సోంపేట మండలం జింకిభద్ర బీసీ కాలనీలో సాహుకారి రత్నాలు (70), ఫిబ్రవరి 24న జిల్లాకేంద్రంలోని టి–ఏజెంట్ కాలనీలో మజ్జి రమేష్నాయు డు (34), మార్చి 18న ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురానికి చెందిన గాలి నాగమ్మ (42), మార్చి 28న కవిటి మండలం ఆర్.కరాపాడులో గర్భిణి కొంతాల మీనాక్షి, ఏప్రిల్ 15న జి.సిగ డాం మండలం సంతవురిటికి చెందిన బాలబొమ్మ భవాని (21), మే 7న కోటబొమ్మాళిలో లేడీస్కార్నర్ షాపు నిర్వహిస్తున్న నర్సిపురం లక్ష్మి (30), నవంబరు 20న నందిగాం మండలం శివరాంపురానికి చెందిన పుష్పలత నౌపడ 3 రోడ్ల కూడలిలో హత్యలకు గురయ్యారు. వీరంతా వారి వారి భార్యలు, భర్తల చేతుల్లోనే మరణించారు. వివాహేతర బంధాలు.. ● ఏప్రిల్ 19న పైడిభీమవరం కాజావారి కోనేరు గట్టు వద్ద ఓ యువతి (23), మే 17న సోంపేట మండలం పాలవలసకు చెందిన వ్యక్తి, జూన్ 1న అదే గ్రామానికి చెందిన మహిళ, ఆగస్టు 30న ఆమదాలవలస చంద్రయ్యపేటలో మహిళ(45) వివాహేతర బంధాలతోనే హత్యలకు గురయ్యారు. డిసెంబరు 2న శ్రీకాకుళం ఏఎస్ఎన్కాలనీకి చెందిన మహిళ(43) ఆస్పత్రికి వెళ్లి 2న అదృశ్యమై ఎచ్చెర్ల కేశవరావుపేట హైవే పక్కన 3న శవమైంది. వివాహేతర బంధమేనన్న చర్చ సాగుతుండగా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. సొంత కుటుంబీకులే.. ● జూన్ 17న ఇచ్చాపురం మండవల్లికి చెందిన బర్రి గంగయ్యను తన అల్లుడు పాతిర్ల జీవన్రెడ్డి (దాసు) నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపేశాడు. ● అదే నెల 22న నందిగాం మండలం కామధేనుపురంకు చెందిన కిల్లి ధర్మారావు తన తమ్ముడు తవిటయ్యను గడ్డపారతో కొట్టి చంపేశాడు. 2025లో సిక్కోలును వణికించిన హత్యాకాండలు ఏడాదిలో దాదాపు 30 హత్యలు శాంతిభద్రతలను అదుపు చేయడంలో యంత్రాంగం విఫలం -
మద్యం మత్తు.. గ్రామ గొడవల్లో..
● మే 7న శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలికి చెందిన కన్నం నర్సింగరావు (58)తో పార్కింగ్ విషయంలో గొడవపడి పూటుగా మద్యం సేవించిన రమణ అర్ధరాత్రి నర్సింగరావు మేడపై నిద్రిస్తున్న సమయం చూసి పదునైన ఆయుధంతో పొడిచి చంపేశాడు. ● నవంబరు 24న టెక్కలి మేజరు పంచాయతీ గోపినాథపురానికి చెందిన కొమనాపల్లి పద్మనా భం గ్రామంలో వ్యక్తులే దాడి చేయడంతో చనిపోయాడు. ● సెప్టెంబరు 2న చిల్లంగి నెపంతో పలాస మండలం కేశుపురానికి చెందిన ఉంగ రాములు (80) అనే వృద్ధున్ని అదే గ్రామానికి చెందిన 8 మంది రాళ్లతో కొట్టి అతికిరాతకంగా చంపేశారు. 040302 02జనవరి ఆగస్టుసెప్టెంబరునవంబరు డిసెంబరు మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి మే జూన్జూలై(ఇప్పటివరకు) -
సిక్కోలు లఘు చిత్రోత్సవాలు లోగో ఆవిష్కరణ
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలో త్వరలో జరగనున్న సిక్కోలు లఘు చిత్రోత్సవం–2025కు సంబంధించిన లోగోను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు ఆదివారం శ్రీకాకుళం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, ఎంసీఏ వ్యవస్థాపక అధ్యక్షుడు మణిపాత్రుని నాగేశ్వరరావు, కార్యదర్శి తిరుమలరావు, ప్రసాద్, కీర్తి, రామకృష్ణ, రాము, మాదారపు వెంకటేశ్వరరావు, ఎస్.వి.రమణ మాదిగ, విశ్వేశ్వరరావు, డిప్యూటీ ఎంపీడీఓ కణితి సూర్యనారాయణ, ఎలయన్స్ క్లబ్ సభ్యులు జామి మన్మధరావు పాల్గొన్నారు. కూర్మనాథుని సన్నిధిలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని రాజస్థాన్ హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శంభాజీ షిండే ఆదివారం సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికి అంతరాలయంలో పూజలు చేయించారు. ఈఓ టి.వాసుదేవరావు, ఆలయ ప్రధానార్చకులు సీహెచ్.సీతారామనృసింహాచార్యులు స్వామి చిత్రపటం, క్షేత్ర ప్రసాదాన్ని అందజేశారు బస్సు నుంచి జారిపడి వృద్ధురాలికి గాయాలు వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని చినబడాం బస్టాండ్ వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు నుంచి జారిపడి అంతరకుడ్డ గ్రామానికి చెందిన వృద్ధురాలు గొనప లక్ష్మీ గాయాలపాలైంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. లక్ష్మీ సోంపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి స్వగ్రామం వచ్చేందుకు కాశీబుగ్గలో బస్ ఎక్కింది. అంతరకుడ్డ వెళ్లేందుకు చినబడాం బస్టాండ్ వద్ద దిగుతుండగా బస్సు ముందుకు కదలడంతో ప్రమాదవశాత్తు జారిపడింది. దీంతో గాయాలపాలైన లక్ష్మీని స్థానికులు పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకట్టుకున్న వైజ్ఞానిక ప్రదర్శనలు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న ఆవిష్కర్ సీజన్–3 హాక్థాన్ సాంకేతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపకల్పన చేసిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. సమాజ హితమైన ప్రాజెక్టులను రూపకల్పన చేసి వాటి ప్రయోజనాలను న్యాయ నిర్ణేతలకు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్, యాప్ అభివృద్ధి, ఐఓటీ, డైటా సైన్స్ తదితర అంశాలతో రూపకల్పన చేసిన ప్రాజెక్టులు ఆలోచింపజేశాయి. ఎంపికై న ప్రాజెక్టుల నిర్వాహకులకు సోమవారం బహుమతులు అందజేయనున్నారు. గోల్ షాట్బాల్ పోటీల్లో ప్రతిభ కంచిలి: తమిళనాడు రాష్ట్రం తిరుచినాపల్లిలో ఈ నెల 25 నుంచి 28 వరకు నిర్వహించిన జాతీయస్థాయి థర్డ్ ఫెడరేషన్ కప్ గోల్ షాట్బాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. కంచిలి మండలం జక్కర గ్రామానికి చెందిన బసవ శ్యామల ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. శ్యామల విజయనగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో పీఈటీ కోర్సు పూర్తి చేశారు. తల్లిదండ్రులు తరిణి–తులసి వ్యవసాయ కూలీలు. పోటీలో ప్రతిభ కనబరిచిన శ్యామలను జెడ్పీటీసీ ఇప్పిలి లోలాక్షి కృష్ణారావు, వైఎస్సార్ సీపీ నేతలు కప్పల యుగంధర్, మెండ ప్రకాశరావు, మురళి అభినందించారు. -
వైఎస్సార్ సీపీ అభిమానిపై దాడి
గార: మండలంలోని వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ అభిమాని కంచు మధుసూదనరావుపై స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో గాయాలపాలయ్యారు. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. కంచు మధు ఓ ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్నారు. సెలవు కావడంతో ఆదివారం మధ్యాహ్నం ఇంటి బయట కూర్చుని ఉండగా స్థానికుడు శిమ్మ నవీన్తో మరో వ్యక్తి కవ్వించారు. అయినా పట్టించుకోలేదు. కాసేపటి తర్వాత చల్ల ప్రభాకర్, శిమ్మ గోవింద, శిమ్మ చంద్రశేఖర్, శిమ్మ ఆనంద్, శిమ్మ సోమేష్ అనే వ్యక్తు లు వచ్చి మధుసూదనరావుపై ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేశా రు. దీంతో ఆయన స్పృహ కోల్పోయారు. ఆయన చిన్నాన్న వచ్చి 108లో మధుసూదనరావును రిమ్స్కు తరలించారు. వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో తన ఫొటో ఉందని, అందుకే కక్ష కట్టి దాడి చేశాడని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సీహెచ్ గంగరాజు తెలిపారు. -
63 ఏళ్లలో ఆసక్తిగా..
ఈయన పేరు కె.ఎస్.ఎన్.మూర్తి. రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. బ్యాంకులో ఉద్యోగం వచ్చాక సంగీతం కలగానే మిగిలిపోయింది. రిటైరయ్యాక సమయం దొరకడంతో ఇలిసిపురంలోని వాణీ సంగీత విద్యాలయంలో దుంపల ఈశ్వరరావు వద్ద సంగీత సాధన ఆరంభించారు. ఇప్పటికే వర్ణాలు, కొన్ని అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు. 63ఏళ్ల వయసులో అవిశ్రాంతంగా సాధన చేస్తున్నారు. కెఎస్ఎన్ మూర్తి, రిటైర్డ్ డిజిఎం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
పనస రైతు ఆశలు చిగురించేనా..?
వజ్రపుకొత్తూరు: ఉద్దానం రైతులు పనసపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. విశాఖపట్నం నుంచి ఇటు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ పనస పంటకు ఆలవాలం. ఉద్దానంలో ఈ పంటను మిశ్రమ పంటగా 7812 ఎకరాల్లో 5 లక్షల చెట్లు వరకు సాగు చేస్తున్నారు. ఈ చెట్ల నుంచి ఏడాదికి 1.50 లక్షల టన్నుల పచ్చి కా యలు దిగుబడికి వస్తాయి. ప్రస్తుతం చెట్లు పూత, పిందె దశలో ఉన్నాయి. పూర్తి స్థాయిలో దిగుబడులు వస్తే గనక జిల్లా నుంచి మఖరాంపురం, హరిపురం, కంచిలి, పలాస, పూండి ప్రాంతాల నుంచి ఒడిశా, కోల్కత్తా, అస్సోం, వారణాశి, చత్తీస్గఢ్, బీహార్ తదితర రాష్ట్రాలకు తరలిస్తారు. రోజుకు 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ఇక పోతే కోల్కతా నుంచి బంగ్లాదేశ్కు సైతం ఉద్దానం పనస వెళ్తుంది. అక్కడ చిన్న తరహా పరిశ్రమల్లో చిప్స్, పకోడి ప్యాకెట్లుగా తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులే కీలకం.. డిసెంబర్– జనవరి నెలల్లో పూత నుంచి పిందె దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఆడ పుష్పాలు కొమ్మ, కాండంపై వస్తా యని ఉద్యానవన శాఖ అధికారి సీహెచ్ శంకర్దాస్ తెలిపారు. ప్రస్తుతం మంచు, చలి తీవ్రత అధికంగా ఉన్న నేప థ్యంలో పిందె, పువ్వు మధ్య నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఈ సీజన్లో ఎస్ఏఏఎఫ్( సాఫ్) పౌడర్లో కార్బండిజమ్, మాంకోజెబ్ కలిపి లేకా డైతేన్ ఎం–45ను లీటరు నీటికి గ్రామున్నర కలిపి కాండం, పూత, పిందెలపై పిచికారీ చేస్తే మంచిదని సూచించారు. కొమ్ము, కాయతొలుచు పురుగు, పిండినల్లి ఆశించి ఎండు తెగులు సైతం సోకుతుంది కాట్టి నిత్యం క్షేత్ర సందర్శన చేయాలన్నారు. మార్కెట్ లేక.. మన ఉద్దానంలో పండే పంటలకు మార్కెట్ కరువనే చెప్పాలి. రైతు కష్టం దళారుల భోజ్యం చేస్తున్నారు. తక్కువ ధర కట్టి ఎక్కువ లాభాలు ఆర్జించి ఈశా న్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కానీ వాటిని మార్కెట్ చేసి, ప్రాసెసింగ్ చేసే వ్యవసాయాధారిత పరిశ్రమలు మన రాష్ట్రంలో లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. చిప్స్, పకో డీ, పనస తాండ్ర లాంటి ఉత్పత్తులకు అవసరమైన కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులు లాభాలు ఆర్జించడమే కాకుండా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలు అనుకూలించడంతో దిగుబడిపై అంచనాలు జిల్లాలో 7812 ఎకరాల్లో మిశ్రమ పంటగా పనస ఏటా రూ.1.50లక్షల టన్నుల దిగుబడి మార్కెట్ లేక నష్ట పోతున్న రైతు ఆధారిత పరిశ్రమలు కరువు -
రేషన్ బియ్యం స్వాధీనం
రణస్థలం: లావేరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని లావేరు ఎస్సై కె.అప్పలసూరి పట్టుకున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగపాలెం గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా లగేజీ వ్యాన్ను అడ్డుకున్నారు. రణస్థలం మండలం సూరంపేట నుంచి వస్తున్న ఈ వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి డ్రైవర్ గొరంటి గణేష్ను అదుపులోనికి తీసుకుని లావేరు పోలీస్ స్టేషన్కు తరలించారు. రణస్థలం సివిల్ సప్లయ్ డీటీ వై.అరుణ పరిశీలించగా 45 బస్తాల్లో 22.50 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. 6ఏ కేసు నమోదు చేశారు. వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై అప్పలసూరి చెప్పారు. ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామానికి చెందిన డ్రైవర్ గణేష్ ఈ బియ్యాన్ని శ్రీకాకుళం తరలిస్తున్నాడని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు వెల్లడించారు. -
దళిత వ్యక్తిపై దాడికి యత్నం
● మద్యం మత్తులో వాగ్వాదం చేసిన టీడీపీ వర్గీయులు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని శ్రీశయన వీధి లో ఓ దళిత వ్యక్తిపై టీడీపీకి చెందిన రెడ్డి సూర్యనారాయణ మరికొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. స్థానికులు, బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. నూతలపాటి శరత్భూషణ్రాజు తన కుటుంబంతో కలసి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. ఆదివారం రాత్రి రెడ్డి సూర్యనారాయణ అనే టీడీపీ నాయకుడు మద్యం మత్తులో శరత్భూషణ్ ఇంటికి వెళ్లి ఇంటిముందున్న క్రిస్మస్ స్టార్ తీసేయాలని కులాన్ని దూషిస్తూ తీవ్ర పదజాలంతో తిట్టాడు. తీయనని చెప్పడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వా దం జరిగింది. ఆపై తోసుకోవడం, శరత్భూషణ్ సూర్యనారాయణను చెంపదెబ్బ కొట్టడంతో గొడవ మరింత ముదిరింది. సూర్యనారాయణ అనుచరులు వచ్చి శరత్భూషణ్ తలపై, పొట్టపై పిడిగుద్దులు గుద్దడంతో కుటుంబ సభ్యు లు అతడిని రిమ్స్కు తరలించారు. ఈలోగా ఓ 20 మంది వరకు ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి చికిత్స చేయించుకుంటున్న శరత్భూషణ్ను మంచంపైనుంచి కిందకు లాగేయడం, చంపుతామని బెదిరించడం వంటివి చేశారు. ఇదంతా అక్కడి సీసీ ఫుటేజీ నిక్షిప్తమైంది. ఎస్పీకి సైతం సమాచారం అందడంతో రెండో పట్టణ పోలీసులు అప్పటికే ఆస్పత్రికి చేరుకున్నారు. ఇదే విషయమై రెండో పట్టణ పోలీసుల వద్ద ప్రస్తావించగా ఇంకా కేసు నమోదు చేయలేదన్నారు. -
పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం
మెళియాపుట్టి: చాపరలోని కృష్ణకామాక్షి ఫిల్లింగ్ స్టేషన్ (ఇండియన్ ఆయిల్) పెట్రోల్ బంక్ యజమానికి రూ.50వేలు అపరాధ రుసుం విధించినట్లు శ్రీకాకుళం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇటీవల జలక లింగుపురం గ్రామానికి చెందిన నడిమింటి ఉమాపతి అనే వ్యక్తి 40 లీటర్ల పెట్రోల్ కొట్టించాడు. అయితే చెల్లించిన సొమ్ము కంటే 4 లీట ర్ల పెట్రోల్ తక్కువగా వచ్చింది. దీంతో ఆయ న రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో తూనికలు కొలతల శాఖ అధికారులు పరిశీలించి జేసీకి నివేదించారు. అందులో భాగంగానే ఈ అపరాధ రుసుం విధించినట్లు అధికారులు తెలిపారు. ఉత్సాహంగా ఓపెన్ చెస్ టోర్నీ శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి ఓపెన్ ఫెస్టివల్ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా సాగింది. శ్రీకాకుళం నగరంలోని ఇలిసిపురం ప్రాంతంలో గల తిలక్నగర్ నర్సెస్ కాలనీలోని స్కూల్ ఆఫ్ చెస్ ఆకాడమీలో క్రిస్మస్ ఫెస్టివల్ ను పురస్కరించుకుని ఆదివారం 209వ చెన్ టోర్నీని నిర్వహించారు. ఐదు రౌండ్ల పాటు జరిగిన చెస్ పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి చెస్ క్రీడాకారులు ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్, సంజీవయ్య మెమోరియల్ ట్రస్టు ప్రెసిడెంట్ డాక్టర్ గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ నిరంతరం చెస్ క్రీడ సాధనతో మెదడు పదునెక్కుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం విజేతలకు మెడల్స్, ట్రోఫీలు, సర్టిఫికెట్లు, బహు మతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ కోచ్ భేరి చిన్నారావు, చెస్ కోచ్ కె.సాయినిరంజన్ సింగ్, చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘కళారంగాన్ని కాపాడుకోవాలి’ కొత్తూరు: సమాజంలో అంతరించిపోతున్న కళారంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజ లు, ప్రభుత్వాలపై ఉందని పద్మశ్రీ అవార్డు గ్రహీత యడ్ల గోపాలరావు అన్నారు. కొత్తూరు మండలం మెట్టూరు బిట్–3 ఆర్ఆర్ కాలనీలో గుర్రం జాషువా 129వ జయంతి సందర్భంగా కొత్తూరు మండలం గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో కళాపీఠం అధ్యక్షుడు గేదెల సుందరనారాయణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముందుగా గుర్రం జాషువా చిత్రపటం వద్ద యడ్ల గోపాలరావు, ప్రముఖ కళాకారురాలు మంగమ్మ, సర్పంచ్ కొయిలాపు శ్రీనివాసరావు తదితరులు నివాళులర్పించారు. హరికథలు, బుర్రకథలు వంటివి రామాయణ భారతాల్లోని ధర్మాన్ని సామాన్యులకు వివరిస్తాయ ని తెలిపారు. సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గుర్రం జాషువా కళారంగానికి చేసిన సేవలను వివరించారు. ఈ సందర్భంగ అఖిల ప్రజా కఽళాకారుల సంక్షేమ సంఘం(ఏపీకేఎస్ఎస్) 2026 క్యాలెండర్ను ఆవిష్కరించారు. -
ఐక్యతతోనే యాదవుల అభివృద్ధి సాధ్యం
గార: జిల్లాలోని యాదవులంతా ఐక్యతగా ఉన్నప్పుడే రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని యాదవ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్ అన్నారు. ఆదివారం అంపోలు జిల్లా జైలు సమీపంలోని వెలమ సంక్షేమ సంఘ కార్యాలయం ఆవరణలో జిల్లా యాదవుల వనభోజన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ బీసీ–డీలో ఉన్న యాదవులను బీసీ–ఏ లేదా బీలో చేర్చేలా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. యాదవ సంక్షేమ సంఘానికి మూడు ఎకరాల స్థలాన్ని మంజూరు చేసేలా ప్రయత్నం చేద్దామన్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తప్పెటగుళ్ల ప్రదర్శన, జిల్లాస్థాయి సంగిడీ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గద్దిబోయిన కృష్ణారావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిన శ్రీనివాసరావు, ఇచ్ఛాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, ఎంపీపీలు డొక్కరి దానయ్య, ఉంగ సాయి, కుజ్జ తాతయ్య, సబ్బి జానకీరామ్, డాక్టర్ నర్తు శేషగిరి, కలగ జగదీష్, జన్నెల రవికుమార్, గొర్లె రమణమూర్తి, ఇప్పిలి జగదీష్, కొరాయి వాసు తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ సెలవులకు వెళ్లి వస్తుండగా..
కంచిలి: మండల కేంద్రం కంచిలిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, కళాశాలలో పదో తరగతి చదువుతున్న మట్టా ప్రణీత్కుమార్(15) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. జలంత్రకోట కూడలి వద్ద జాతీయ రహదారిపై లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందగా.. తండ్రి గాయాలపాలయ్యాడు. క్రిస్మస్ సెలవుల కోసం సోంపేట మండలం మామిడిపల్లిలోని తన ఇంటికి వెళ్లి తండ్రి హేమంత్రావుతో కలిసి ద్విచక్ర వాహనంపై స్కూల్కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, ప్రణీత్కుమార్ తండ్రి ఫాస్ట్ఫుడ్ సెంటర్ నడుపుతున్నారు. పెద్ద కుమారుడు హైదరాబాద్లో పనిచేస్తుండగా, చిన్న కుమారుడు కంచిలి గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి మృతిపై గురుకుల ప్రిన్సిపాల్ పేడాడ శ్రీనివాసరావు, అధ్యాపక, ఉపాధ్యాయ సిబ్బంది ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
వైద్యం..సంగీతం
ఈమె పేరు డాక్టర్ పి.మాలతి. జిల్లాలో ప్రముఖ గైనకాలజిస్టుల్లో ఒకరు. సంగీత దర్శకుడు బండారు చిట్టిబాబు వద్ద ఆరేళ్లుగా లలితగీతాలు పాడటం నేర్చుకుంటున్నాను. ఒకసారి రేడియోలో పాడేందుకు అవకాశం వచ్చినా విఫలం కావడంతో ఎలాగైనా బెస్టు అనిపించుకోవాలని శాసీ్త్రయ సంగీతాన్ని మావుడూరు జగన్నాధశర్మ వద్ద శిక్షణ పొంది విజయం సాధించారు. ఇప్పుడు వేదికలపై కూడా ఆలపిస్తున్నారు. వైద్య వృత్తిలో ఏమాత్రం ఖాళీ దొరికినా సంగీత సాధన చేస్తుంటారు. –డాక్టర్ మాలతి. గైనకాలజిస్టు -
డీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ
శ్రీకాకుళం: డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్–2026 క్యాలెండర్లు, డైరీలను ఫెడరేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కోత ధర్మారావు, జిల్లా అధ్యక్షుడు పూజారి హరిప్రసన్న ఆవిష్కరించారు. శ్రీకాకుళం రైతు బజార్ కూడలిలోని విశ్రాంత ఉద్యోగుల భవనం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హరిప్రసన్న మాట్లాడుతూ వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతతో డీటీఎఫ్ పనిచేస్తుందన్నారు. ఉమ్మడి పోరాటాలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందని తెలిపారు. వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి తక్షణమే మధ్యంతర భృతి ప్రకటన చేయాలని, ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో శ్రీకాకుళం, ఐటీడీఏ సంఘ ఇన్చార్జిలు రమణమూర్తి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఔషధ నిల్వ కేంద్రం తనిఖీ గార: గార పీహెచ్సీలోని ఔషధ నిల్వ కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి అనిత ఆదివారం తనిఖీ చేశారు. ముందుగా రోగుల ఓపీ రిజిస్టర్, మందుల నిల్వలను పరిశీలించారు. వైద్యాధికారులు 24 గంటలూ అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ రమ్య, డాక్టర్ సోనియా, ఫార్మాసిస్టు సత్యభామ పాల్గొన్నారు. -
దివ్యాంగుల హక్కులను పరిరక్షించాలి
వజ్రపుకొత్తూరు రూరల్(పలాస): దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, సమాన అవకాశాల కల్పనకు ఉద్దేశించిన వికలాంగుల హక్కుల(ఆర్పీడబ్లూడీ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని దివ్యాంగుల హక్కుల సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మోహన్రావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలో దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ గ్రామ సచివాలయాల ద్వారా అందించాలన్నారు. రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సుస్థిర అవకాశాలను కల్పిచాలని కోరారు. కార్యక్రమంలో సాధన కమిటీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంపతిరావు లక్ష్మీ, పలు మండలాల అధ్యక్ష కార్యదర్శులు బి.యర్రన్నాయుడు, డి.రమణమూర్తి, కె.చంద్రశేఖరరావు, పి.జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
లీజు ముప్పు!
నౌపడ ఉప్పు.. ● భూముల లీజును పునరుద్ధరించని కేంద్ర ప్రభుత్వం ● సాగుకు దూరమవుతున్న ఉప్పు రైతులు ● వలసబాటలో కార్మికులు సంతబొమ్మాళి : నవరుచులకు తల్లి నౌపడ ఉప్పు గల్లి అనే నానుడి నేడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడంతో సాగు విస్తీర్ణం క్రమేపి తగ్గిపోయి పరిశ్రమ అంతరించే స్థితికి చేరుకుంది. గతంలో ఉప్పు దిగుబడి లక్షల టన్నుల్లో ఉంటే నేడు వేలకు పడిపోయింది. గతంలో మూడు వేలకు పైగా ఎకరాల్లో ఉప్పు విస్తీర్ణం చేయగా నేడు సగానికి పడిపోయింది. సంతబొమ్మాళి మండలంలోని నౌపడ, పాలనాయుడుపేట, కె.లింగూడు, సీతానగరం, మూలపేట, మర్రిపాడు, భావనపాడు, సెలగపేట, ఆర్.సున్నాపల్లి, యామలపేట, కేశునాయుడుపేట గ్రామాలకు చెందిన రెండు వేలు కుటుంబాలు ఆధారపడి జీవనం సాగించేవి. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గి ఉప్పు రైతులు, కార్మికులు వలస బాటపడుతున్నారు. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటంతో వాటిని సన్నకారు, చిన్నకార రైతులు సాగుచేసేవారు. ఈ లీజు 2018తో ముగిసిపోయింది. లీజును పునరుద్ధరించాలని పలుమార్లు ఈ ప్రాంత రైతులు కేంద్ర ప్రభుత్వ అధికారులకు వినతులు అందించారు. ఈ నేపథ్యంలో భూముల లీజుకు సంబంధించి 2020లో కేంద్రం సబ్ కమిటీ వేసింది. ఈ ప్రాంతంలోని ఉప్పు భూములను పరిశీలించి కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అయినా నేటి వరకు లీజును అధికారులు పునరుద్ధరించలేదు. దీంతో ప్రస్తుతం ఉప్పు పంట 1500 ఎకరాల్లో మాత్రమే సాగు అవుతోంది. పనులు లేక ఉప్పురైతులు, కార్మికులు వలసబాట పడుతున్నారు. గతమెంతో ఘనం.. నౌపడ ఉప్పు పరిశ్రమ ఒకప్పుడు ఉత్పత్తిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో, దేశంలో రెండో స్థానంలో ఉండేది. రైతులు ప్రతి ఏటా డిసెంబర్లో ఉప్పు సాగును ప్రారంభించి జూలై మొదటి వారం వరకు కొనసాగించేవారు. ప్రతి 40 రోజులకు ఒక సారి దిగుబడి వచ్చేది. ఆ సమయంలో ఇక్కడ ఎంతో సందడిగా ఉండేది. ఇక్కడి నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా ఒడిశా, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ఉప్పు రవాణా జరుగుతుండేది. రైల్వే రవాణా ఖర్చులు తక్కువగా ఉండటంతో అప్పట్లో రైతులకు ఉప్పుసాగు లాభదాయకంగా ఉండేది. అయితే ఈ ప్రాంతంలో రైల్వే లైన్ తొలగించడంతో నౌపడ ఉప్పు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. రోడ్డు మార్గం ద్వారా ఉప్పును రవాణా చేయడంతో ఖర్చులు పెరిగాయి. అయినా రైతులు సాగుకు వెనుకడుగు వేయలేదు. భూముల లీజును కేంద్రం రెన్యువల్ చేయకపోవడం వల్లే సమస్య మొదలైంది. కొంతమంది రైతులు ఉప్పు సాగుకు దూరమై కుటుంబాలతో వలస బాటపట్టారు. ఫలితంగా ఉప్పు పరిశ్రమ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైను ఉప్పు భూములు మూలపేట పోర్టుకు అప్పగించడంతో ఆయా భూముల్లో పరిశ్రమల స్థాపనకు పలుమార్లు అధికారులు పరిశీలించడంతో ఉప్పు సాగు ప్రశ్నార్థకంగా మారిందని ఉప్పు సంఘ నాయకులు, రైతులు అంటున్నారు. నవరుచులు అందించే నౌపడ ఉప్పు పరిశ్రమ నేడు అంతరించే స్థాయికి చేరుకోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి లీజును పునరుద్ధరించాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. తరతరాలుగా ఉప్పును సాగుచేస్తూ కుటుంబాలతో జీవనం సాగిస్తున్నాం. ఉప్పు పంటకు ధర ఉన్నా లేకపోయినా దీనినే నమ్ముకున్నాం. నేడు ఉప్పు పంట సాగు ప్రశ్నార్థకంగా మారడంతో వలసబాటపట్టాల్సి వస్తోంది. ఉప్పు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – కర్రి భాస్కరరావు, ఉప్పు రైతు, నౌపడ ఉప్పు భూముల లీజును కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరిస్తేనే ఈ ప్రాంతంలో ఉప్పు పరిశ్రమకు పూర్వ వైభవం వస్తుంది. 2018తో లీజు పూర్తయి తర్వాత కేంద్రం సబ్ కమిటి వేసినా ఇంతవరకు చర్యలు లేవు. నౌపడ ఉప్పు పరిశ్రమ పరిరక్షణ కోసం కేద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – పిలక రవికుమార్రెడ్డి, కార్యదర్శి, సన్నకార ఉప్పు ఉత్పత్తిదారుల సంఘం, నౌపడ నౌపడలో అరకొరగా ఉప్పు మడులు -
అ‘విశ్రాంత’ సాధన
సంగీతంలో.. ● సంగీత కళపై పెద్దల ఆసక్తి ● వేదికలపై ప్రదర్శనలు ఇస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు, వైద్యులు శ్రీకాకుళం కల్చరల్ : సంగీత సాధనకు వయసు అడ్డంకి కాదని వారంతా నిరూపిస్తున్నారు. వివిధ వృతుల్లో దశాబ్దాల అనుభవం సాధించి విశ్రాంత జీవనం గడుపుతున్న వారు.. గృహిణులు.. వైద్యులు.. ఇలా ఎంతోమంది సీనియర్లు ఇప్పుడు జూనియర్లుగా మారి సంగీత సాధనలో నిమగ్నమవుతున్నారు. గురువులు వద్ద మెలకువలు సాధించి వేదికలపై ప్రదర్శనలకు సైతం సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో సంగీత కళలో శిక్షణ పొందుతున్న వీరి జీవన ప్రయాణం ఆసక్తికరం. -
రమ్యమైన ప్రతిభ
● మెడిసిన్ చదువుతూ స్కేటింగ్లో రాణిస్తున్న రమ్యశ్రీ ● ఇప్పటివరకు 188 పతకాలు గెలుచుకున్న క్రీడాకారిణి శ్రీకాకుళం: ఆమె చదువుతున్నది వైద్య విద్య. ఎంతో పట్టుదల, దీక్ష ఉంటే తప్ప మెడిసిస్ పూర్తి చేయడం వీలు కాదు. అలాంటిది అటు మెడిసిన్, ఇటు స్పోర్ట్స్ రెండిండిలోనూ ఈ యువ కిరణం దూసుకెళ్తోంది. విశాఖపట్నంకు చెందిన రమ్యశ్రీ స్పోర్ట్స్ కోటాలో ఎంబీబీఎస్ సీటును సాధించి వైద్య విద్య ను అభ్యసిస్తోంది. ఓ వైపు చదువులో చక్కటి ప్రతిభ చూపిస్తోంది. మరో ఏడాదిలో ఎంబీబీఎస్ పూర్తి చేయనుంది. ఈ అమ్మాయి ఎల్కేజీ చదువుతున్నప్పటి నుంచి స్కేటింగ్ చేస్తోంది. అదే అలవాటును కొనసాగిస్తూ ఇప్పుడు ఆ ఆటలోనూ పతకాల పంట పండిస్తోంది. ఆమె తండ్రి వివేకానంద స్వామి ఎల్జీ సర్వీస్ సెంటర్లో పని చేస్తుండగా, తల్లి అనూష గృహిణి. కుమార్తె స్కేటింగ్లో చిన్నతనం నుంచే ప్రతిభ కనబరచడంతో మరింత ప్రోత్సహించారు. రవికుమా ర్, రమణజి అనే ఇద్దరు కోచ్ల నేతృత్వంలో రమ్య స్కేటింగ్లో మెలకువలు నేర్చుకుంది. రమ్యశ్రీ ఇప్పటివరకు 188 పతకాలను సాధించింది. ఇప్పటివరకు 20 జాతీయస్థాయి ఈవెంట్లలో పాల్గొని 7 బంగారు, 7 రజత, ఏడు కాంస్య పథకాలను పొందింది. 2019 జూలై 4 నుంచి జూలై 14 వరకు యూరప్లో జరిగిన ప్రపంచ రోలర్ గేమ్స్లో పాల్గొని డౌన్ హిల్ ఈవెంట్ లో 15వ స్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి ఈ ఈవెంట్లో పాల్గొన్న ఏకైక మహిళగా రికార్డు సాధించింది. ప్రస్తుతం వైద్య విద్య చదువుతుండడంతో ప్రాక్టీస్ చేసేందుకు శ్రీకాకుళంలో అవకాశం లేనప్పటికీ, సెలవు రోజుల్లో ప్రాక్టీస్ చేస్తూ విశాఖపట్నంలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి స్కేటింగ్ ఈవెంట్లో డౌన్ హిల్ విభాగంలో రజిత, ఆల్ ఫైన్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించి పలువురి మన్ననలు పొందింది. ఈ సందర్భంగా రమ్యశ్రీ ‘సాక్షి’తో మాట్లాడుతూ వైద్య వృత్తిని చేపట్టినా స్కేటింగ్ కూడా కొనసాగిస్తానని, భారత దేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో చా టాలన్నదే తన అభిమతమని పేర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం శిక్షకుల నేర్పిన మెలకువలతో స్కేటింగ్లో ప్రతిభ కనబరుస్తున్నానని తెలిపింది. ఇప్పటివరకు సాధించిన పతకాలు -
జనవరి 19 నుంచి రథసప్తమి మహోత్సవాలు
అరసవల్లి: రానున్న రథసప్తమి మహోత్సవాలను రాష్ట్ర పండుగగా తొలిసారిగా ఏడు రోజుల పాటు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు శనివారం సా యంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అభిప్రాయ సేకరణ సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే ఊహించిన మేరకు స్వచ్ఛంద సంస్థలు, అనుభవమున్న స్థానికులు సైతం పెద్దగా హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి రథసప్తమికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశిష్ట అతిథిగా హాజరయ్యేలా ప్రణాళిక వేస్తున్నామని, ఇప్పటికే ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పర్యటన ఖరారైందని ప్రకటించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ జనవరి 19న ఆలయ అనివెట్టి మండపంలో ప్రజాసంకల్ప పూజలు, సాయంత్రం తిరువీధి, 20న ఆదిత్యుని ఉత్సవమూర్తులకు స్నపన కార్యక్రమం, 21న ఉత్సవమూర్తుల స్వర్ణాలంకరణ సేవ, 22న లక్ష పుష్పాలంకరణ, 23న సామూహిక సూర్యనమస్కారాలు, 24న మహా సౌర హోమం, 25న రథసప్తమి నాడు అర్ధరాత్రి 12.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పంచామృతాలతో అభిషేకసేవ, అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల వరకు నిజరూప దర్శనం తర్వాత అలంకార సేవ, ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయని ప్రకటించారు. చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ శోభ, ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ మాట్లాడుతూ..ఈసారి దర్శన టిక్కెట్లతో పాటు వీఐపీ పాసులు, దాతల పాసులకు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. -
బస్సులు పెంచకుంటే సీ్త్ర శక్తి కష్టమే
శ్రీకాకుళం అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీ్త్ర–శక్తి పథకం అమలులో ఉద్యోగులపై కేసులు పెట్టి సస్పెండ్ చేస్తున్న విధానాలను ఆర్టీసీ అధికారులు మానుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాల బాట పట్టక తప్పదని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో శనివారం ఈయూ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీ్త్ర–శక్తి పథకం అమలుతో ఉద్యోగులపై పెరిగిన పని భారం తగ్గించాలంటే ప్రస్తుతం కనీసం 3,000 అదనపు బస్సులు పెంచాలన్నారు. అన్ని కేటగిరీల్లో ఉన్న ఖాళీల్లో కనీసం 10,000 పోస్టుల భర్తీ చేయాలని కోరారు. కొత్త బస్సులు, కొత్త నియామకాలు లేకుండా ఇదే సిబ్బందితో, ఇవే బస్సులతో సీ్త్ర–శక్తి పథకాన్ని విజయవంతం చేయడం ఎన్నాళ్లూ సాధ్యం కాదన్నారు. -
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు..?
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఎప్పుడు కల్పిస్తారని, ఈ ఏడాది జనవరిలోనైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారా అని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ నుంచి సూర్య మహల్ జంక్షన్ వరకు నిరసన, భిక్షాటన కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలని, నిరుద్యోగ యువతకు రూ.3వేలు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. జనవరి ఒకటికై నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించా రు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి సాంబశివరాజు, ఏఐవైఎఫ్ నాయకులు అమోస్, అన్నాజీ, వసంత్, జగదీశ్, సూర్య, వేణు తదితరులు పాల్గొన్నారు. -
సాయంత్రం నాలుగు దాటితే చాలు దారి రుధిరం కోరుతోంది. అసుర సంధ్య వేళల్లో సిక్కోలు బాట రక్తంతో తడుస్తోంది. 2025 అంతా ఇదే తీరు. చిరు చీకట్లు కమ్ముకుంటున్న సమయాల్లో జరుగుతున్న ప్రమాదాలు చాలా కుటుంబాల్లో చీకట్లను మిగిల్చాయి. తప్పతాగి ఒకరు, మితిమీరిన వేగంతో మరొకర
బ్లాక్స్పాట్లు గుర్తించి ప్రమాద నివారణకు చర్యలు చేపడుతున్నాం. గత ఏడాది 889 ప్రమాదాలు నమోదు కాగా ఈ ఏడాది ఇప్పటికి 699 జరిగాయి. ఘోర ప్రమాదాల సంఖ్య తగ్గింది, కానీ ప్రమా దాల్లో గాయపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్లు ధరించకపోవడం వలనే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. – కలెక్టరేట్లో సమీక్షలో ఎస్పీ మహేశ్వరరెడ్డి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలోని రహదారులు రక్తమోడాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 699 ప్రమా దాలు జరిగాయి. లెక్కల్లోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు మూ డొందల మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. వీరిలో ద్విచక్ర వాహనాలపై వెళ్లినవారే అధికంగా మరణించారు. అది కూడా ఎక్కువగా సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్యన మరణించారు. రానున్నది పండగల సీజన్. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదని పోలీసులు సూచిస్తున్నారు. పండగ కోసం ఊళ్లకు వెళ్లే వాళ్లు నిబంధనలు పాటించాలని, మద్యానికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ●చాలాచోట్ల హైవే రోడ్లపై ఇసుక, గ్రావెల్ చెల్లాచెదురై ఉంది. గ్రామీణ రహదారుల్లో మరింత దారుణం. గోతులు, ఇరువైపులా పొదలుండి ఎదురుగా వస్తున్నవారు కనిపించడం లేదు. ●హైవే వెంబడి ఫ్లై ఓవర్లలో కొన్ని చోట్ల లైట్లు వెలగడం లేదు. వాహన వేగాన్ని సూచించే స్పీడోమీటర్లు కొన్ని పనిచేయడం లేదు. పీపీటీ కెమెరాలు కూడా మరమ్మతులో ఉన్నాయి. ●షార్ట్కట్ యూటర్న్ల కోసం ఇచ్ఛాపురం నుంచి పైడి భీమవరం హైవే వరకు చాలాచోట్ల డివైడర్లను తవ్వి మార్గాలను చేసి ఉన్నారు. కొన్ని చోట్ల రోడ్లపైనే కాంక్రీట్ దిమ్మలు వదిలేసి ఉన్నారు. ఇవే ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ●నో పార్కింగ్ జోన్లలో భారీ వాహనాలను నిలుపుదల చేయకుండా, నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ పెట్టుకునేలా చేయడంలో హైవే మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు ఇప్పటికీ విఫలమవుతున్నారు. ●ప్రమాదకర మలుపుల్లో ఇంకా బారికేడ్లను అమర్చలేదు. రణస్థలం హైవేలో ఇటీవల అలానే గుంతలో పడి ఓ వ్యక్తి ప్రాణాలు వదిలాడు. ప్రమాద ప్రోన్ జోన్లలో గ్లోసైన్బోర్డులు, స్పీడ్ లిమిట్బోర్డులు, జీబ్రాక్రాసింగ్ గుర్తులు కొన్ని ప్రాంతాల్లో లేవు. ●ముఖ్య పట్టణాల్లో, కేంద్రాల్లో అడ్డదిడ్డంగా మలుపులు తిప్పేయడం, రోడ్ల మధ్యనే ఆటోవాలాలు అకస్మాత్తుగా ఆపేయడం, నిర్ణీత ప్రదేశాల్లో కాకుండా రద్దీ ప్రదేశాల్లో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు ర్యాష్ డ్రైవ్ చేయడం, సడెన్గా ఆపేయడం ప్రమాదాలకు తావిస్తున్నాయి. ●హెల్మెట్ పెట్టుకోకపోవడం, ర్యాష్ డ్రైవింగ్, సెల్ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్రైడింగ్, మైనర్ రైడింగ్, షార్ట్కట్ రూట్ల ను ఆశ్రయించడం, అవసరం లేకపోయినా రాత్రి ప్రయాణాలు చేయడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రోడ్డు క్రాస్ చేసేటప్పుడు వాహనాలను పరిశీలించకపోవడం వంటి చిన్నపాటి నిర్లక్ష్యాలతోనే ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 3న జిల్లాకేంద్రంలోని డేఅండ్నైట్ కూడలి సమీప నాగావళి వంతెనపై ఆర్టీసీ బస్సు నిండు గర్భిణిని ఢీకొట్టి వెళ్లిపోయింది. చక్రాల కింద గర్భిణి నలిగిపోయింది. మార్చి 15న లావేరు మండలం బుడుమూరు సమీప జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ పంక్చర్ కావడంతో పాతపట్నం పెద్దలోడికి చెందిన నలుగురు చనిపోయారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వ్యాన్ ఢీకొనడంతో మధ్య ప్రదేశ్కు చెందిన ముగ్గురు మృతిచెందగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. -
జనవరి 4న చలో విశాఖ
రణస్థలం: జనవరి 4న చలో విశాఖపట్నం జయప్రదం చేయాలని ఏపీ ఆశ వర్కర్స్ యూ నియన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.నాగమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడు పిలుపు నిచ్చారు. ఆశ వర్కర్స్ యూనియన్ సమావేశం శనివారం కోష్టలో జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ అంబేడ్కర్ విగ్ర హం నుంచి ప్రదర్శన అనంతరం మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభ లో ఆశాలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆశ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులు గా గుర్తించాలని, వేతనాలు పెంచాలని, కనీస వేతనం రూ. 26వేలు అమలు చేయాలని డి మాండ్ చేశారు. సెలవు లేకుండా ఆశ వర్కర్లు పని చేస్తున్నారని, ఆశ వర్కర్ల సమస్యలు పరి ష్కరించేలా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమావేశంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. లీలావతి, నాయకులు పి. రాజా, సుభద్ర, పైడి లక్ష్మీ పాల్గొన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: 69వ ఆలిండియా స్కూల్గేమ్స్ అండర్–19 బాలికల క్రికెట్ చాంపియన్షిప్ పోటీలకు కోచ్, మేనేజర్లుగా శ్రీకాకుళం జిల్లా వాసులకు అవకాశం లభించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి వేదికగా జనవరి 1 నుంచి 6 వరకు ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలికల క్రికెట్ జట్టు కోచ్, మేనేజర్లగా జిల్లాకు చెందిన ముగ్గురు ఫిజికల్ డైరెక్టర్లు నియామకమయ్యారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి నియామక ఉత్తర్వులు అందు కున్నారు. నియామకమైన వారిలో వాన దివ్య (పీడీ– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణాపురం, మందస మండలం), బేరి లోకేశ్వరరావు (పీడీ– ఏపీ మోడల్ స్కూల్ పాతపట్నం), నెయ్యిల అనంత్రాజు (పీడీ– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీలంపేట) ఉన్నారు. డిసెంబర్ 29న ఏపీ రాష్ట్ర జట్టుతో కలిసి మధ్యప్రదేశ్ పయనమై వెళ్తున్నారు. పాతపట్నం: జాతీయ స్థా యి స్కూల్గేమ్స్ అండర్– 19 బాలికల క్రికెట్ పోటీల కు పాతపట్నం ప్రభుత్వ మోడల్ స్కూల్లో పీడీగా పనిచేస్తున్న బేరి లోకేష్కు జాతీయ బాలికల క్రికెట్ హెచ్ఓడీగా ఎంపికయ్యారని ప్రభుత్వ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కేవీ రత్నకుమారి శనివారం తెలిపారు. లోకేష్ను రాష్ట్ర వ్యాయా మ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్బాబు, ఎంఈఓ సీహెచ్ తిరుమలరావు,పీఈటీలు జన్ని కృష్ణ, సిమ్మ కృష్ణారావు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, పీడీలు, పీఈటీలు అభినందించారు. టెక్కలి రూరల్: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శనివారం ఓ వ్యక్తి మద్యం మత్తులో హల్చల్ చేశాడు. బస్సు కోసం ఎదురు చూస్తున్న వారిపై పడి వారిని పట్టుకునేందుకు ప్రయ త్నించాడు. అక్కడే ఉన్న కొంత మంది వ్యక్తులు ప్రశ్నించడంతో వారిని నానా మాట లు అన్నాడు. దీంతో కొందరు అతడిని పట్టు కుని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని టెక్కలి పోలీస్ స్టేషన్కు తరలించారు. -
ఆశ్రమ పాఠశాలలో దాడిపై విచారణ
మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినిపై పీఈటీ భర్త దాడి చేసిన ఘటనపై శనివారం ఆశ్రమ పాఠశాలలో ఎస్టీ కమిషన్ సభ్యుడు కె.మల్లేశ్వరరావు విచారణ చేపట్టారు. పీఈటీ కల్యాణితో పాటు విద్యార్థిని తల్లి, పాఠశాల సిబ్బందిని విచారించారు. దీనిపై ఆయన మా ట్లాడుతూ కమిషన్ చైర్మన్కు నివేదిస్తామని తెలిపా రు. అనంతరం మండల గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు సవర వెంకటేష్ ఆయనకు ఫిర్యాదు చేశా రు. పాఠశాలతో సంబంధం లేనివ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించడమే కాకుండా విద్యార్థినిపై దాడి చేయ డం సమంజసం కాదని, అతనిని తక్షణమే అరెస్ట్ చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయా లని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ ఘటనపై వెంటనే కేసు నమోదు చేసి, కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేయాలని దళిత గిరిజన సంఘాల నాయ కులు బోకర నారాయణరావు, చౌదరి లక్ష్మీనారాయణ కోరారు. పీఈటీ కల్యాణిని సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. -
సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
టెక్కలి: మారుతున్న కాలంతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకునేవిధంగా ఇంజినీరింగ్ విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టాలని బీఆర్ఏయూ వీసీ కేఆర్ రజనీ సూచించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో ఆవిష్కర్ సీజన్–3 హాకథాన్ పేరుతో మూడు రోజుల పాటు జరగనున్న సాంకేతిక వర్క్షాప్ సదస్సును శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలపై దృష్టి సారించాలన్నారు. సాంకేతికంగా నిర్వహిస్తున్న సదస్సుల ద్వారా విద్యార్థులు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించాలని సూచించారు. అనంతరం కళాశాల డైరక్టర్ వి.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం తమ కళాశాలలో సాంకేతిక వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 10 రాష్ట్రాల నుంచి 500 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారని వెల్లడించారు. మొదటి రోజు 50 బృందాలు పాల్గొన్నాయన్నారు. వీరంతా 48 గంటల పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుని వినూత్నమైన ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్.ఎల్.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, ఐఐసీ డీన్ జి.సతీష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
●డ్రగ్స్ వద్దు.. ఆరోగ్యమే ముద్దు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని పోలాకి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను(ఓజేటీ) జిల్లా ఇంటర్మీడియెట్ వృత్తి విద్యాశాఖ అధికారి రేగ సురేష్ కుమార్ పరిశీలించారు. శ్రీకాకుళం జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రాండ్ కన్వెన్షన్లో జరుగుతున్న క్షేత్రస్థాయి శిక్షణను శనివారం జిల్లా కమిటీ సభ్యులు దుగ్గివలస రామ్ప్రసాద్తో కలిసి డీవీఈఓ సురేష్కుమార్ పరిశీలించారు. విద్యార్థులు తయారుచేసిన రికార్డులు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఓజేటీ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులకు సూచించారు. పోలాకి కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతు పద్మలత మాట్లాడుతు లెర్నింగ్ బై డూయింగ్ విధానంలో విద్యార్థులకు ఓజేటీ మేలు చేస్తుందని, భవిష్యత్లో ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నెలరోజుల ఓజేటీలో భాగంగా క్షేత్ర స్థాయి శిక్షణకు విద్యార్థులను తీసుకువచ్చినట్టు అధ్యాపకులు బీఎల్వి నరసింహారావు, కాయ రవీంద్ర తెలిపారు. -
కాంట్రాక్టర్లను తొలగించాలి
శ్రీకాకుళం: నగరంలోని రిమ్స్ ఆస్పత్రిలో కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్న కాంట్రాక్టర్లను తక్షణమే తొలగించాలని ఐఎఫ్టీయూ నాయకులు సవలపురపు కృష్ణవేణి, గొల్లపల్లి రాజులు, బగాది శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రిమ్స్ ప్రధాన ప్రవేశద్వారం వద్ద అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సెక్యూరిటీ గార్డులకు మూడు నెలలుగా ఉత్తర్వుల ప్రకారం వేతనాలు చెల్లించకుండా చట్టబద్ధమైన హక్కులను కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం కాలరాస్తోందని మండిపడ్డారు. పారిశుద్ధ్య కార్మికులను నిత్యం వేధిస్తూ, సెలవులు మంజూరు చేయకుండా 30 మంది పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు కలిగిస్తున్న క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసు లిమిటెడ్ యాజమాన్యంపై కూడా రిమ్స్ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా ఉన్నతాధికారులు, రిమ్స్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన కోర్కెల సాధన కోసం ఈనెల 29, 30, 31 తేదీల్లో రిమ్స్ గేటు వద్ద నిరాహార దీక్షలు చేపడుతామని తెలియజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు డి.గణేష్, మామిడి క్రాంతి, జోగి వెంకటరమణ, దామోదర రవికుమార్, దమ్ము సింహాచలం, సూర్యకాంతం, శశిరేఖ, ససంధ్య, రాజేశ్వరి, జయప్రద, ప్రభ, విజయ, శ్రీనివాస్, రామారావు, రాజేంద్రప్రసాద్, సరస్వతి, తంగి శ్రీను, చిరంజీవి, హైమారావు తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 6లోగా వివరాలు నమోదు చేసుకోవాలి
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయానికి రూ.లక్ష లేదా అంతకుమించి విలువైన పనులు, విరాళాలు సమర్పించిన దాతలు వచ్చే ఏడాది జనవరి 6వ తేదీలోగా ప్రత్యేకంగా తమ వివరాలను ఆధార్కార్డుతో సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆలయ ఈవో కేఎన్వీడీవీ ప్రసాద్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. దాతలు స్వయంగా లేదా వారికి చెందిన వ్యక్తులను ఆలయానికి పంపించి తమ వివరాలను నమో దు చేయించుకోవాలన్నారు. లేదంటే 63026 79236, 89789 14660, 73820 25550 నంబర్లకు వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డులు, విరా ళ రశీదును పంపిస్తే ఆలయ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయిస్తామని పేర్కొన్నారు. ఎచ్చెర్ల: మండలంలోని చిలకపాలేం జంక్షన్కు సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం ఒడిశా నుంచి బెంగుళూరు వెళ్తున్న ఒక కారు బోల్తా పడడంతో కారు డ్రైవర్ మృతి చెందాడు. ఎచ్చెర్ల పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగుళూరు (కర్ణాటక) బాట్రాపురానికి చెందిన ఎన్.నవీన్ తన మిత్రులతో కలిసి ఒడిశాలోని ఆలయాల సందర్శనకు కారులో వెళ్లాడు. అనంతరం తిరిగి బెంగుళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చిలకపాలేం వద్ద కారు వెనుక టైరు పేలడంతో డివైడర్ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ అర్జున్(27) తీవ్రంగా గాయపడడంతో.. శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కారులో డ్రైవర్తో సహా ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. మిగిలిన నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఎచ్చెర్ల ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతపట్నం: పాతపట్నం మేజర్ పంచాయతీ పరిధిలోని శివశంకర్ కాలనీ కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఆటో ఢీకొని అదే గ్రామానికి చెందిన ఆనెం త్రినాథరావు (74) అనే వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. మృతుడు శివశంకర్ కాలనీ కూడలి నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా అదే సమయంలో పాతపట్నం నుంచి కొరసవాడ వెళ్తున్న ఆటో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పాతపట్నం సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. త్రినాథరావుకు భార్య ఆనెం శకుంతల ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్ఛాపురం రూరల్: జాతీయ రహదారిపై వెళ్తున్న గొర్రెలను లారీ ఢీకొనడంతో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని గుడ్డిభద్ర కొజ్జిరియాకు చెందిన దుర్గాశి శేఖరం తన గొర్రెలను శనివారం స్థానిక 16వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఆ సమయంలో సోంపేట నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న లారీ ఆంధ్రా–ఒడిశా సరిహద్దు బలరాంపురం జంక్షన్ వద్ద ఢీకొనడంతో ఎనిమిది గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో నాలుగు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఒడిశా పాత్రపురం బ్లాక్ చైర్మన్ ఏదురు మోహనరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు నర్తు ప్రేమ్కుమార్, నాయకుడు దట్టి అజయ్, మురపాల ధర్మా, కర్రి పొట్టయ్యలు లారీ డ్రైవర్తో మాట్లాడి బాధితుడికి రూ.80 వేల నష్ట పరిహారం ఇప్పించారు. -
ఏమైందో ఏమో..?
● పైళ్లెన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య ● జింకిభద్రలో విషాదచాయలు సోంపేట: పైళ్లెన నాలుగు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకొని తనువు చాలించిన ఘటన మండలంలోని జింకిభద్ర గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తామాడ తేజేశ్వరరావు కుమారుడు షణ్ముఖరావుకు మామిడిపల్లి గ్రామానికి చెందిన గేదెల జ్యోతి కుమార్తె ఊర్మిళ(23)తో ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన వివాహమైంది. షణ్ముఖరావు సోంపేట తహసీల్దార్ కార్యాలయానికి ఎదురుగా సెల్షాపు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. భార్యభర్తలు అన్యోన్యంగా జీవిస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఊర్మిళ మూడు నెలల గర్భిణి. వారం రోజుల క్రితం షణ్ముఖరావు కుటుంబ సభ్యులు, ఊర్మిళ తల్లి జ్యోతి తీర్థయాత్రలకు వెళ్లారు. శుక్రవారం రాత్రి తీర్థయాత్రలు ముగించుకుని జింకిభద్ర గ్రామానికి చేరుకున్నారు. అనంతరం ఊర్మిళ మేడ మీద ఒక్కర్తే పడుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు శనివారం ఉదయం లేచి తలుపుకొట్టినా తీయకపోవడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో డాబా పైకి వెళ్లి వెంటిలేటర్ ద్వారా చూడడంతో ఆత్యహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఊర్మిళ ఆత్మహత్య చేసుకోవడానికి భర్తే కారణమై ఉంటాడని మృతురాలి అక్క సోంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం భార్య మృతిని తట్టుకోలేక షణ్ముఖరావు అనారోగ్యానికి గురవ్వడంతో సోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజాలు తెలిసే అవకాశం ఉంది. కంచిలి ఎస్ఐ పారినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మృతితో జింకిభద్రలో విషాదచాయలు అలుముకున్నాయి. -
కూర్మనాథుని సన్నిధిలో న్యాయమూర్తులు
గార: ఆదికూర్మ క్షేత్రం శ్రీకూర్మం కూర్మనాథున్ని విశాఖపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.సన్యాసినాయుడు శనివారం ఉదయం దర్శించుకున్నారు. అదేవిధంగా జిల్లా నాలుగో అదనపు సెషన్సు న్యాయమూర్తి ఎస్.కవిత కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు. వేర్వేరుగా వచ్చిన న్యాయమూర్తులకు అధికారులు ఎదురేగి స్వాగతం పలికి, అంతరాలయంలో మూలవిరాట్ వద్ద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు జరిపించారు. ఆలయ ప్రధానార్చకులు చామర్తి సీతారామనృసింహాచార్యులు క్షేత్ర మహాత్యాన్ని తెలియజేయగా, కార్యాలయ సూపరింటెండెంట్ నర్సుబాబు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
అంతన్నారు.. ఇంతన్నారు..!
● అరసవల్లి కూల్చివేతలకు ఏడాది ● అభివృద్ధి పేరిట నిర్మాణాలను కూల్చేసిన వైనం ● రూ.100 కోట్లు మంజూరవుతాయని హడావుడి ● ఏడాదిగా ఒక్క ఇటుకై నా వేయని దుస్థితి ఆలయానికి చెందిన నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు (ఫైల్) అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి ఆలయం ఎదుట అభివృద్ధి పేరిట చేపట్టిన విధ్వంసానికి నేటికి సరిగ్గా ఏడాది గడిచింది. ఈ ఏడాది రథ సప్తమిని తొలిసారిగా రాష్ట్ర పండుగగా నిర్వహించిన కూటమి ప్రభుత్వం, రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు చేసింది. దీనిలో భాగంగా ఆదిత్యాలయం ఎదురుగా ఉన్న పక్కా భవనాలు, షెడ్లను నేలమట్టం చేశారు. జిల్లాకు చెందిన కింజరాపు కుటుంబ నేతలే కేంద్రం, రాష్ట్రంలోనూ మంత్రులుగా చక్రం తిప్పుతుండడంతో అరసవల్లి ఆలయ రూపురేఖలు మారిపోతాయని స్థానికులు భావించారు. అయితే అనంతరం జరిగిన పరిణామాలకు భక్తులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ.. అభివృద్ధి పేరిట స్థానిక ఎమ్మెల్యేను ముందు పెట్టి మరీ దాతలిచ్చిన భవనాలను, జింకు షెడ్లను కూల్చివేయించారు. తీరా ఏడాది గడుస్తున్నా ఆయా పరిసరాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణాలను చేపట్టలేకపోయారు. దీనికి తోడు గతంలో ఉన్న శాశ్వత భవనాలకు ప్రత్యామ్నాయం చూపకుండా విధ్వంసం చేయడంతో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాలు, అన్నదాన ప్రసాదాల తయారీ, విక్రయాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రూ.100 కోట్లు ఎక్కడ..? రూ.100 కోట్లతో (ప్రసాద్ స్కీమ్) కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిపోతుందని ఈ ఏడాది జరిగిన రథ సప్తమికి ముందు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ప్రగల్భాలు పలికారు. స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ను మధ్యలో పెట్టి ఆదిత్యాలయానికి ఎదురుగా ఉన్న భవనాలను కూల్చివేయించారు. అలాగే ఉన్నపళంగా దుకాణాలు ఖాళీ చేయించడంతో వ్యాపారాలను కోల్పోయి పదుల సంఖ్యలో వ్యాపారులు రోడ్డునపడ్డారు. కూల్చివేతలకు సరిగ్గా ఏడాది పూర్తవుతున్నా, ఇంతవరకు ఒక్క ఇటుక కూడా పడలేదు. ఆలయం ముందు మాత్రం విశాలంగా ప్లాట్ఫాం వేసి, ఇంద్ర పుష్కరిణి కనిపించేలా ఖాళీగా ఉంచారు. దీంతో కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిర్ుట్యవల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీమ్ కథ కంచికే అన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ పథకం ఎలాగో రాదు.. ఆ నెపంతో చేపట్టిన కూల్చివేతల ఘట్టాన్ని మరిపించడానికి అభివృద్ధి పేరిట ఆలయానికి చెందిన (భక్తులచే సమకూరిన ఆదాయం) నిధులు రూ.12 కోట్లను వినియోగించి ఆలయ పరిసరాల్లో కొత్త భవనాలను నిర్మించేలా తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు. దీంతో ప్రసాద్ స్కీమ్ అటకెక్కినట్లేనన్న చర్చ జోరందుకుంది. అరసవల్లి సూర్య దేవాలయానికి గత రెండున్నర దశాబ్ధాలుగా ఎందరో దాతలు తమ పూర్వీకుల జ్ఞాపకార్థం, తమ సంస్థల పేరిట ఎన్నో రూ.లక్షలతో వసతి గదులు, శాశ్వత నిర్మాణాలతో పాటు ఎండ, వర్షం నుంచి భక్తులకు రక్షణగా జింకు రేకు షెడ్లును కూడా నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ‘రహస్య’ అజెండా ఏముందో గానీ.. అరసవల్లిలో 2004 నుంచి దాతలు సమకూర్చిన భవనాలతో పాటు దశాబ్ధాల పూర్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వసతి గదుల సముదాయం, ఆలయ నిధులతో నిర్మించిన 12 దుకాణాల సముదాయాన్ని, ప్రసాదాల కౌంటర్లు, వంట గదులు కూడా అభివృద్ధి పేరిట కూల్చివేశారు. అలాగే ఓ దాత ఏకంగా రూ.30 లక్షలతో నిర్మించిన అన్నదాన మండపాన్ని కూడా కూల్చేశారు. అయితే దాతలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ కూల్చివేతలు చేయడంపై దాతలు తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో దాతల సహకారం తగ్గుతుందనే సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే ఆలయానికి చెందిన నిధులు, దాతలిచ్చిన విరాళాలు సుమారుగా అప్పటి మార్కెట్ రేట్ల ప్రాప్తికి సుమారు రూ.7 కోట్ల విలువైన నిర్మాణాలను కూల్చివేసిన కూటమి ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు మళ్లీ ఆలయ నిధులు రూ.12 కోట్లతో అభివృద్ధి చేస్తామంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. అలాగే దుకాణాలు కోల్పోయిన వ్యాపారుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయ్యింది. రోడ్లపై బండ్లు పెట్టుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. అభివృద్ధి సంగతి దేవుడెరుగు.. జీవనమార్గంగా ఉన్న దుకాణాలను తొలిగించిన క్రమంలో ఆలయ స్థలాల్లోనే కొత్తగా దుకాణాలను నిర్మించాలంటూ వ్యాపారులు కోరుతున్నారు. -
74 ఎకరాల చెరువుపై కన్ను
హిరమండలం: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 75 ఎకరాల చెరువుపై కన్నేశాడు ఓ వ్యక్తి. తప్పుడు పత్రాలు చూపి కై వసం చేసుకోవాలని చూశాడు. ఏకంగా తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తీరా అధికారుల విచారణతో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేసేసరికి ఆ స్థలం చెరువుగా తేలింది. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతం కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. హిరమండలం మండలం తుంగతంపర గ్రామంలోని ఎల్పీసంఖ్య 3 సర్వే నంబర్ 1లో 52.46 ఎకరాలతో పాటు మరికొన్ని సర్వే నంబర్లలో 22 ఎకరాల్లో చెరువు ఉండేది. ఈ భూమి 22ఏలో నమోదై ఉంది. 2015లో గ్రామ అవసరాలు తీర్చేందుకుగాను విశాఖకు చెందిన జవ్వాది శ్రీరామ్మూర్తికి లీజుకు ఇచ్చారు. గ్రామాభివృద్ధికి కొంత సొమ్ము ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఐదేళ్ల తరువాత కూడా అదే వ్యక్తికి లీజు కొనసాగించారు. సదరు వ్యక్తి తప్పుడు ధ్రువీకరణపత్రాలతో హిరమండలం తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేశారు. చెరువు స్థలం మొత్తం తనదేనని.. తనకు పాస్పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. అంతటితో ఆగకుండా ఏకంగా ఒక బోర్డు ఏర్పాటుచేశారు. (రాజుగారి)పెద్ద చెరవుగా పిలవబడే 74 ఎకరాల భూమి తమదేనని.. కొనుగోలు చేశామని..పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలని తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ చింతం నరసింహమూర్తితో పాటు గ్రామస్తులు తహశీల్దారు కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. ఆయన పరిశీలించి అది ప్రభుత్వ భూమిగా నిర్ధారణచేశారు. అనంతరం తహసీల్ధార్తో పాటు గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ వెంకటేష్ చెరువు భూమి కబ్జాకు ప్రయత్నించిన శ్రీరామ్మూర్తిపై కేసునమోదు చేసి అరెస్టు చేశారు. పాతపట్నం కోర్టులో శుక్రవారం హాజరుపరచగా రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. గ్రామ అవసరాల పేరిట లీజుకు అదే అదునుగా తనదిగా చూపుతూ స్వాధీనానికి యత్నం గ్రామస్తుల ఫిర్యాదుతో వెలుగులోకి.. రిమాండ్కు నిందితుడు -
బ్లాక్స్పాట్స్ వద్ద నిఘా పెంచాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు శాసీ్త్రయ దృక్పథంతో అడుగులు వేయాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరచూ ప్రమాదాలు జరుగుతున్న ‘బ్లాక్ స్పాట్స్’ వద్ద రక్షణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లతో పోలిస్తే 2025లో ప్రమాదాల సంఖ్య, ప్రాణనష్టం కొంత మేర తగ్గుముఖం పట్టడం సానుకూల పరిణామమన్నారు. 2024లో 889 ప్రమాదాలు జరగ్గా.. ఈ ఏడాది డిసెంబర్ 25 నాటికి ఆ సంఖ్య 699కి తగ్గిందన్నారు. మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వల్లే అత్యధిక ప్రాణనష్టం జరుగుతోందని ఎస్పీ అభిప్రాయపడ్డారు. నవభారత జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణకు ప్రణాళిక సిద్ధంగా చేయాలని ఆదేశించారు. భైరవానిపేట జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులు రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ప్రమాదకరంగా ఆపితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. జనవరిని రహదారి భద్రత మాసంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు అనుగుణంగా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయసారథి, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): త్యాగాలు, పోరాటాలు, సిద్ధాంతాల పునాదిపై ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా వందేళ్లు పూర్తి చేసుకుందని పార్టీ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అన్నారు. సీపీఐ 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ దాసరి క్రాంతి భవన్ వద్ద అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొత్స సంతోష్ అధ్యక్షతన సీపీఐ శత వసంతాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆవిర్భవించిన జెండా ఎరజండా అని, నిత్యం ప్రజా సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటాలు చేసినట్లు చెప్పారు. సీపీఐ అంటే పేదలకు నీడనిచ్చే పార్టీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తుందని, కమ్యూనిస్టు నాయకుల ఆశయాల కోసం ప్రతి సభ్యుడు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు చిక్కాల గోవిందరావు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముత్యాలరావు, టి.తిరుపతిరావు, జిల్లా సహాయ కార్యదర్శి దాసరి కిరణ్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి కె.అప్పలరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు లక్ష్మి, పార్వతి, శిరీష, కుమారి, షేక్ బాను, పార్థసారధి, గురుమూర్తి, అర్జి మణి తదితరులు పాల్గొన్నారు. -
జనవరి 28 నుంచి శాలిహుండం యాత్ర
● 29న వంశధార నదిలో చక్రతీర్థ స్నానం ● బ్రోచర్ ఆవిష్కరించిన ప్రతినిధులు గార: ప్రఖ్యాత శాలిహుండం కొండపై భీష్మ ఏకాదశి పర్వదినం జరిగే గిరి జాతర బ్రోచర్ను ఎమ్మెల్యే గొండు శంకర్, దేవాలయ ట్రస్టీ సుగ్గు మధురెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు శుక్రవారం ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు. అర్చకులు మహేంద్రాడ వేణుగోపాలచార్యులు జాతర విశేషాలను వివరించారు. జనవరి 28న సాయంత్రం తిరువీధి ఉత్సవంతో జాతర ప్రారంభవుతుందని, అర్ధరాత్రి తర్వాత స్వామి మూలవిరాట్కు క్షీరాభిషేక సేవ ఉంటుందన్నారు. 29న ఉదయం సమీప వంశధార నదిలో చక్రతీర్థ స్నానం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 1న ఆలయం వద్ద వేణుగోపాలస్వామి కల్యాణ మహోత్సవంతో జాతర ముగుస్తుందన్నారు. కార్యక్రమంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదబాబు, ఎంపీపీ గొండు రఘురామ్, బడగల వెంకటప్పారావు, గుండ భాస్కరరావు, కొంక్యాణ ఆదినారాయణ, బోర లక్ష్మీ, పుక్కళ్ల నీలవేణి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. -
తెల్లదొరల పాలిట.. సింహస్వప్నం పుల్లెల
● సహాయ నిరాకరణోద్యమంలో శ్యామసుందరరావు కీలకపాత్ర ● కళింగ సీమ నుంచి నాయకత్వం ● నేడు 123వ జయంతి ఇచ్ఛాపురం రూరల్: బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదురు నిలిచి, సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని తెల్లదొరల పక్కన బల్లెంలా మారిన పుల్లెల శ్యామసుందరరావు స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. ఆనాటి కుగ్రామమైన ఇచ్ఛాపురం నుంచి దేశభక్తిని గ్రామగ్రామాలకు వ్యాపింపజేసి, స్వతంత్ర భారత ఉద్యమాలకు నాయకత్వం వహించి పలుమార్లు జైలుకు వెళ్లారు. అటువంటి ధీశాలి పుల్లెల శ్యామసుందరరావు 123వ జయంతి నేడు. గాంధీ పిలుపుతో.. 1903 డిసెంబర్ 27న ఇచ్ఛాపురంలో పుల్లెల వెంకటరామయ్య పంతులు, కామేశ్వరమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించిన శ్యామసుందరరావు స్థానిక సురంగి రాజా పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగించారు. సంపన్న కుటుంబం కావడంతో బరంపురం, విజయనగరం కళాశాలల్లో చదివారు. ఉన్నత విద్య కోసం మద్రాస్ చేరుకున్న సమయంలో ఆలోచనలు సాతంత్య్రోద్యమం వైపు మళ్లాయి. వాణిజ్యం పేరితో భారత దేశానికొచ్చి పెత్తనం చెలాయిస్తున్న తెల్లదొరలు తక్షణమే దేశాన్ని వెళ్లిపోవాలన్న మహాత్మాగాంధీ పిలుపు మేరకు 1921లో దేశ వ్యాప్తంగా చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. ‘దున్నే వాడిది భూమి’ నినాదంతో రైతు ఉద్యమానికి కళింగ సీమ నుంచి నాయకత్వం వహించిన పుల్లెల రాకతో అప్పటి వరకూ అంతంత మాత్రంగా ఉన్న కళింగసీమ స్వతంత్రోద్యమ స్ఫూర్తి ఒక్కసారిగా జూలు విదిల్చింది. అతని కృషి మొత్తం దక్షిణాది రాష్ట్రాలు శ్రీకాకుళం వైపు చూసేలా చేసింది. రైతుల అణచివేతకు కారణమైన ‘జమీందారీ విధానం రద్దు’కు పోరాటం చేశారు. 1922 ఫిబ్రవరి 8న ఆయన్ను నిర్బంధించిన బ్రిటీష్ పాలకులు బరంపురం, కడలూరు జైళ్లకు తరలించారు. విడుదలయ్యాక రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1933 నుంచి ఇచ్ఛాపురం సర్పంచ్గా వ్యవహరించిన పుల్లెల 1935 నుంచి జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, అవిభక్త గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, అనంతరం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1937 ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆనాటి మంత్రి సర్.ఎపి.పాత్రోను ఓడించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1940లో కిసాన్ సభకు అధ్యక్షునిగా వ్యవహరించి శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగారు. నిరంతర పోరాటాలతో తెల్లదొరలకు పక్కలో బల్లెంలా మారిన శ్యామసుందరరావును 1940లో గృహ నిర్బంధం చేశారు. ‘రద్దు’ చట్టం రాకముందే 1940 జూన్ 16న అశువులు బాశారు. ఫైర్ బ్రిగ్రేడ్గా పిలిచే శ్యామసుందరరావు ప్రియ శిష్యుడుగా గుర్తింపు తెచ్చుకున్న సర్దార్ గౌతు లచ్చన్న ఈయన శిష్యుడే. పుల్లెల శ్యామసుందరరావు తన కుమారుడి పేరు సైతం తన పేరునే శ్యామసుందరంగా నామకరణ చేయడం విశేషం. పుల్లెల శ్యామసుందరం జీవిత్ర చరిత్రను ప్రముఖ రచయిత ప్రొఫెసర్ డాక్టర్ కె.ముత్యం రాశారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలో పాత హైవేపై, శ్రీకాకుళం క్రొత్త బ్రిడ్జీ ప్రాంతంలో పుల్లెల శ్యామసుందరరావు కాంస్య విగ్రహాలను నెలకొల్పేందుకు ఆయన కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పూనుకున్నారు. వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చడం లేదు. ఏది ఏమైనా ఫైర్బిగ్రేడ్గా పేరు తెచ్చుకున్న పుల్లెల శ్యామసుందరరావు విగ్రహం ఇచ్ఛాపురం నడిబొడ్డులో ఉంటే బావితరాలకు ఆయన చరిత్ర తెలుస్తుందని అభిమానులు అంటున్నారు. -
1104 సంఘం ప్రధాన కార్యదర్శి పదవికి గోపాలరావు రాజీనామా
అరసవల్లి: ఆంఽధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (1104) రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీకాకుళం విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎం.వి. గోపాలరావు (గోపి) తన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానంలో మళ్లీ వీఎస్ఆర్కే.గణపతిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈమేరకు శుక్రవారం జరిగిన రాష్ట్ర సీఈసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సంఘం నిధుల వినియోగంలో భారీగా అవకతవకలు జరిగి, రూ.లక్షల్లో నిధులు మాయమయ్యాయంటూ కొన్ని నెలలుగా గోపాలరావుపై ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎస్.కృష్ణయ్య అధ్యక్షతన కీలక నేతల సమావేశం ఏర్పాటు చేసి విచారణ జరిపించగా నిధుల గోల్మాల్ వ్యవహారాలన్నీ వాస్తవాలని తేలడంతో గోపాలరావును పదవి నుంచి తప్పుకోవాలని, లేదంటే చట్టప్రకారం చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ప్రకటించినట్లు తెలుస్తోంది. దీంతో గత్యంతరం లేక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి గోపాలరావు స్వయంగా రాజీనామా సమర్పించాల్సి వచ్చింది. దీంతో పూర్వ ప్రధాన కార్యదర్శి వీఎస్ఆర్కె గణపతినే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సభ్యులంతా ఎన్నుకున్నారు. ఇదిలావుంటే స్థానిక జిల్లాలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన గోపాలరావు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాల్లో ఎనర్జీ అసిస్టెంట్లు నియామకాల్లో అక్రమాలకు ప్రయత్నించి విధుల నుంచి సస్పెన్షన్ అయిన సంగతి తెలిసిందే. -
ముప్పు!
నిప్పు..● పంటల సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి. ● పంటకోత పూర్తయిన తర్వాత మిగిలిన అవశేషాలను భూమిలో మురగబెట్టి దుక్కిలో కలిపిదున్నాలి. ఇలా చేస్తే వరి గడ్డి భూమిలో మురిగి సేంద్రియ కర్బనం పెరుగుతుంది. ● తర్వాత దశలో సాగుచేసే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, సూపర్పాస్ఫేట్, పొటాష్లను కలిపి పంట సాగు చేసుకొనే ముందు చల్లితే పొలంలో మిగిలిన కొయ్యలు, వరి గడ్డి రెండు వారాల్లోనే మురుగుతాయి. ● వరి కోతలు అనంతరం కొయ్య, గడ్డి దహనం ● భూసారంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్న శాస్త్రవేత్తలుభూసారానికి హిరమండలం: కొనేళ్ల కిందట వరి కోతల అనంతరం గడ్డిని కుప్పలుగా వేసి పశువుల మేతకు ఉపయోగించేవారు. ప్రస్తుతం కూలీల కొరత, సమయాభావం, వాతావరణ పరిస్థితులు తదితర కారణంతో కోతలకు యంత్రాలను ఉపయోగిస్తున్నారు. వరి కోతలు పూర్తయ్యాక మిగిలిన కొయ్యలతో పాటు గడ్డికి కొందరు రైతులు పొలంలోనే నిప్పంటిస్తున్నారు. అవగాహన లోపంతో అన్నదాతలు ఇలా చేయడం వల్ల భూసారానికి ముప్పు పొంచి తప్పదని వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడంతో భవిష్యత్తులో పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాదని చెబుతున్నారు. పంటలకు కీడుచేసే పురుగులను తినే వానపాములు, కీటకాలు నశించే ప్రమాదం ఉందని చెబుతున్నారు. భూమికి సేంద్రియ పీచు పదార్థాలుగా ఉపయోగపడే అవశేషాలు ఖనిజ, లవణాలు నశిస్తాయని అంటున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో ఎక్కువ మొత్తంలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతుందని చెబుతున్నారు. పంట భూముల్లో గడ్డి, వరి కొయ్యలను దహనం చేస్తే భూసారం కోల్పోతుంది. అవసరం లేని గడ్డిని భూమిలోనే కలిపి దున్నితే సేంద్రియ ఎరువుగా మారి భూమికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. గడ్డి, కొయ్యల దహనంతో వాతావరణం కాలుష్యం అవుతుంది. ఈ విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – బి.సంధ్య, మండల వ్యవసాయాధికారి, హిరమండలం -
గంజాయి రహిత జిల్లాగా తీర్దిదిద్దుదాం: ఎస్పీ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో మాదకద్రవ్యాల మహమ్మారిని రూపుమాపి, యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ముందుకు సాగాలని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్’ (ఎన్కార్డ్) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 115 గంజాయి హాట్ స్పాట్లను గుర్తించామని, ఈ ప్రాంతాల్లో వెంటనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. నాగావళి తీర ప్రాంతాల్లో నిఘా కోసం ప్రత్యేకంగా కెమెరాలు అమర్చుతున్నామని, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తూ డ్రోన్లు, స్నిపర్ డాగ్స్ సాయంతో మారుమూల ప్రాంతాలను జల్లెడ పడుతున్నామని వెల్లడించారు. విద్యార్థులకు ‘ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్’ ద్వారా అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. మెడికల్ షాపుల్లో నిద్రమాత్రలు, మత్తు కలిగించే మందులను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో డీ–అడిక్షన్ సెంటర్ను బలోపేతం చేస్తున్నామని, నవంబర్లో జిల్లాలో 175 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. గంజాయి విక్రేతలపైనే కాకుండా, పాత నేరస్తులపై కూడా నిరంతరం నిఘా ఉంచి వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర రెవెన్యూ ఇంటిలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్ పూజారాణి పుండ్కర్ జిల్లాలో గంజాయి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదికలు పరిశీలించారు. అరుదైన జంతువుల చర్మం, గోళ్లు, కొమ్ముల అక్రమ రవాణా జరిగితే సమాచారాన్ని చేరవేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, జిల్లా రవాణా అధికారి విజయ సారథి, వివిధ అధికారులు పాల్గొన్నారు. ‘సిరో’ గుర్తింపు కొనసాగింపు టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో శాసీ్త్రయ, పారిశ్రామిక పరిశోధన సంస్థ(సిరో) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గుర్తింపును 2028 మార్చి వరకు కొనసాగించినట్లు డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు శుక్రవారం తెలిపారు.శాసీ్త్రయ పరిశోధనలు, పరిశ్రమలతో అనుసంధానమైన కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. మార్చిలోగా సమీకృత కలెక్టరేట్ సిద్ధం కావాలి శ్రీకాకుళం : వచ్చే ఏడాది మార్చి 1 కల్లా నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కాంట్రాక్టర్లను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగుతున్న భవన నిర్మాణ పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్తో కలిసి మంత్రి శుక్రవారం పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడరాదన్నారు. విభాగాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. అనుసంధాన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులపై దృష్టి సారించాలన్నారు. పర్యవేక్షణకు రోడ్ల భవనాల శాఖ నుంచి కార్యనిర్వాహక ఇంజినీరు (డీఈ) స్థాయి అధికారిని నియమించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్ తదితరులున్నారు. తండ్రికి తలకొరివి పెట్టిన తనయ బూర్జ: కొరగాం గ్రామంలో బొద్దూరు శివయ్య(63) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు రాజు, ధనలక్ష్మి. మగపిల్లలు లేక పోవడంతో ధనలక్ష్మి ముందుకొచ్చి తండ్రికి తలకొరివి పెట్టింది. -
విద్యార్థినిపై దాడి అమానుషం
● దాడికి పాల్పడిన స్కూల్ పీడీ భర్తను అరెస్టు చేయాలి ● రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబయోగి డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబయోగి, గిరిజన సంఘాల నేతలు మెళియాపుట్టి: బందపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ భర్త రామచంద్రరావు దాడి చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఘటనపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబ యోగి ఘటనపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. దాడిపై వెంటనే గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు. ఒక్కరోజు వ్యవధిలో అరెస్ట్ చేయకపోతే ఆదివాసీలతో భారీ ధర్నా, ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. పాపను కొట్టిన వారిని అరెస్టు చేయాలి పీడీ మేడమ్ భర్త డబ్బులు పోయాయని తనను కొట్టారని, తాను ఇక స్కూల్కు వెళ్లనని మా పాప చెబుతోంది. నేను వెళ్లి పాఠశాలలో అడిగితే హెచ్ఎం లేరు. అక్కడ వార్డెన్ వచ్చి నాపైనే కోప్పడ్డారు. ఇక్కడ గొడవపడితే మంచిది కాదని నన్ను బెదిరించారు. – గూడపు గాయిత్రి, విద్యార్థిని తల్లి -
అధిక సంఖ్యలో వినతులు.. అయిన వారికే పరిష్కారాలు
● 22ఎ సమస్య వినతుల స్వీకరణ అంతా గందరగోళం ● మూడంచెల పోలీస్ చెకింగ్లతో రైతులు ఇబ్బందులు శ్రీకాకుళం పాతబస్టాండ్: భూ సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘22ఏ భూస్వేచ్ఛ మీ చేతికి మీ భూమి’ ప్రత్యేక డ్రైవ్ గందరగోళంగా మారింది. రైతులు ఎవరికి సమస్యలు విన్నవించా లో తెలీని పరిస్థితి నెలకొంది. అధికారులు ఊహించని దాని కంటే అధికంగా రైతులు రావడంతో జెడ్పీ ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయింది. కొందరికై తే కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా దక్కలేదు. ● రెవెన్యూ డివిజన్ల వారీగా వినతులు తీసుకునేందుకు ప్రత్యేక టెంట్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడకు చేరాలంటేనే ఇబ్బంది పడాల్సిన పరి స్థితి నెలకొంది. ప్రధాన గేటు నుంచి పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటూనే ఉన్నారు. వారికి సమాధానం చెప్పుకుంటూ రావడం రైతులకు సమస్యగా మారింది. ● అక్కడి నుంచి డివిజన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్దకు వెళ్తే సిబ్బంది దరఖాస్తు పరిశీలించి సమావేశ మందిరంలోకి పంపించాలి. అక్కడా పోలీసులతో ఇబ్బందులు తప్పలేదు. అంతా దాటుకుని వెళితే 22ఎ సమస్యలను ఉదయం అధికారులు, మంత్రి పరిశీలించలేదు. వాటిని మధ్యాహ్నానికి వాయిదా వేశారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అవస్థలు పడ్డారు. ● ముందుగా సాధారణ భూ సమస్యలను పరిశీలించేందుకు అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా అయిన వారి సమస్యలు పరిష్కరించాలనే తాపత్రయమే కనిపించింది. ఎక్కువగా నరసన్నపేట, టెక్కలి, శ్రీకాకుళం నియోజకవర్గవాల వారి దరఖాస్తులే పరిశీలించారు. దీంతో ఈ పరిష్కార వేదిక టీడీపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులు బంధువుల భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినట్టు మారింది. ● 22ఎ సమస్యలకు సంబంధించి జేసీ, ఆర్డీఓ కోర్టులో సుమారుగా 121 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. వీటిని పరిష్కరించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. పాతవాటిని పరిష్కరించి ఈ గ్రీవెన్స్ విజయవంతమైందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ● ఫిర్యాదుల స్వీకరణపై రైతులకు సంతృప్తి లేదు. నరసన్నపేటకు సంబంధించి భూముల పరిష్కరించాలని ప్రత్యేకంగా కలెక్టర్కు మంత్రి చెప్ప డం అందులో కొంతభాగం ఎమ్మెల్యే తాలూకా భూములు ఉన్నాయని, వాటిని ఇక్కడికిక్కడే పరిష్కరించాలని మంత్రి ఆదేశించడం విశేషం. ● కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, 30 మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల సెక్షన్ అధికారులు, 22 ఏ బాధిత దరఖాస్తు దారులు ఉన్నారు. ‘22ఎ నుంచి స్వేచ్ఛ కల్పిస్తున్నాం’ అరసవల్లి: జిల్లాలో గత కొన్నేళ్లుగా వివిధ కార ణాలతో పలువురి భూములు నిషేధిత భూముల జాబితా (22–ఎ రిజిస్టర్)లో చేరిపోయాయని, అలాంటి బాధితుల భూములను స్వేచ్ఛగా వారికే అందించేలా రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కె.అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈమేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మీ చేతికి మీ భూమి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. -
● మత్తు వదలరా..
పూండి వాణిజ్య కేంద్రంలో కాశీబుగ్గ రూరల్ సీఐ ఎం.తిరుపతి ఆధ్వర్యంలో, ఎస్ఐ బి.నీహార్ అధ్యక్షతన డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో అభ్యుదయం సైకిల్ యాత్ర శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూండి సాయివినీత్ విద్యా సంస్థల ఆవరణలో సుమారు 1000 మంది విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు ఆరోగ్యకరమైన సమాజం ముద్దు వంటి స్లోగన్లతో ప్లకార్డులు ప్రదర్శించి మానవహారం చేపట్టారు. – వజ్రపుకొత్తూరు పూండికి చేరుకున్న అభ్యుదయం సైకిల్యాత్రలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ చేపట్టిన మానవ హారండ్రగ్స్కి నో చెప్పాలంటూ విద్యార్థుల ప్రదర్శన -
చలి.. రోగాల కౌగిలి
● శీతల గాలుల ప్రభావంతో అనారోగ్య సమస్యలు ● గొంతు నొప్పి, ఒంటి నొప్పులతో బాధ పడుతున్న వైనం ● పెయిన్ కిల్లర్స్, హై యాంటీబయోటిక్స్ జోలికి వెళ్లొద్దంటున్న వైద్యులు టెక్కలి: చల్లటి గాలులు అనారోగ్యాలను తెచ్చి పెడుతున్నాయి. కొద్ది రోజుల నుంచి విపరీతమైన మంచు కురవడంతో పాటు పట్ట పగలు సైతం సూర్యుడి ప్రభావం కనిపించని పరిస్థితులు ఉన్నా యి. శీతల గాలుల ప్రభావంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు మంచు ప్రభావం, మరో వైపు వాతావరణ కాలుష్యం ప్రభావం అనారోగ్య సమస్యలకు దారి తీస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గొంతు గర గర సమస్యతో పాటు శరీర నొప్పులతో బాధ పడుతున్నా రు. అయితే శాసీ్త్రయ పద్ధతులు పాటిస్తూ స్వీయ జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మూడు రోజులు దాటి ఆయా సమస్యలు వేధిస్తుంటే కచ్చితంగా సంబంధిత వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మందులను వినియోగించడం మేలని చెబుతున్నారు. సొంత వైద్యంతో మందుల వినియోగం, హై డోస్ యాంటీ బయోటిక్స్, పెయిన్ కిల్లర్ వంటి మందులు వాడితే ఎంతో ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. సొంత వైద్యం వద్దు.. శీతాకాలంలో గొంతు గర గర, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వస్తాయి. వీటికి యాంటీ బయాటిక్స్తో చికిత్స చేయ రు. యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు మాత్రమే పనిచేస్తాయి. వైరల్ సమస్యలకు వాడితే మితి మీరినప్పుడు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ పెరిగి భవిష్యత్ లో సైడ్ ఎఫెక్ట్స్ కారణంతో ఇబ్బందులు తప్పవు. శీతల గాలుల ప్రభావం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తప్పనిసరిగా శీతాకాలం దుస్తులను ధరించాలి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు శరీరాన్ని పూర్తి స్థాయిలో కప్పి ఉండే దుస్తులు ధరించాలి. చిట్కాలు పాటించండి.. గొంతు గర గర, ఒంటి నొప్పులు తదితర సమస్యలను ఇంటి చిట్కాలు, జాగ్రత్తలతో నివారించవ చ్చు. వేడి నీరు, లెమన్ టీ, ఉప్పునీరు పుక్కిలించండి వంటి చిట్కాలు కొంత మేరకు ఉపశమనం కలిగిస్తాయి. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని పానీయాలు తీసుకోవడం ఎంతో మంచిది. లవంగం, మిరియాలు, శొంఠి పొడి చేసి తీసుకోవడం వల్ల ఆయా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వైరల్ గొంతు నొప్పికి యాంటీబయోటిక్స్ వాడకూడదు, డాక్టర్ సూచిస్తే మాత్రమే వాడాలి. ఆందోళన వద్దు.. ప్రస్తుతం శీతల గాలుల ప్రభావంతో అధిక మంది గొంతు నొప్పి, శరీర నొప్పులతో బాధ పడుతున్నారు. అయితే ఎలాంటి ఆందోళన లేకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలి. ఆరుబయట ఆహారం కాకుండా ఇంటి వద్ద వేడి వేడిగా ఆహారం తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ వేడి నీటిని వినియోగించడం ఉత్తమం. – కె.లక్ష్మణరావు, ఎండీ, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి, టెక్కలి ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావంతో జలుబు, దగ్గు, ఇతర సమస్యలు ఎదురైతే తక్షణమే గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి. సొంతంగా వైద్యం మానుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో పగలంతా పనిచేసే వారికి ఒంటి నొప్పులు ఎదురైతే పెయిన్ కిల్లర్స్ను ఆశ్రయించకుండా వైద్యుల సలహాలను పాటించాలి. – ఎస్.గాయత్రి, వైద్యురాలు, కె.కొత్తూరు పీహెచ్సీ, టెక్కలి మండలం -
ఆస్పత్రిలో ఏం జరుగుతోంది: డీసీహెచ్
నరసన్నపేట: ‘ఏరియా ఆస్పత్రిలో ఏం జరుగుతోంది. ఎవరిష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలీడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తప్పవు.’ అంటూ జిల్లా ఆస్పత్రుల సమన్వయ అఽధికారి కళ్యాణ్ బాబు నరసన్నపేట ఏరియా ఆస్పత్రి సిబ్బందిని హెచ్చరించారు. సదరం సర్టిఫికెట్ల మంజూరు విషయంలో ఆస్పత్రి కాంట్రాక్టు సిబ్బంది చేతివాటంపై ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా రోగు లు, ఆస్పత్రి సిబ్బంది ఒకేలా కనిపించడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ఎవరెవరు ఏ సిబ్బందో తెలియడం లేదని, శానిటేషన్ సిబ్బంది వారి డ్రెస్లు వేసుకోవాలని, కాంట్రాక్టు సిబ్బంది కూడా వారికి నచ్చిన డ్రెస్లు వేసుకొని వస్తామంటే కుదరదని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రెస్ కోడ్ పాటించాలని సూచించారు. ఓపీ, సదరం, ఫార్మశిస్టు, నర్సులు, ఆఫీస్ రూం, వైద్యుల గదులు పరిశీలించారు. సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఆర్థో వైద్యు లు రమణారావుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనుబాబుకు పలు సూచనలు చేశారు. ఆస్పత్రిలో జరుగుతున్న సివిల్ వర్క్స్ను పరిశీలించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రహరీ, లిఫ్ట్, 108 షెడ్, పాత కొత్త భవనాలకు కలుపుతూ నిర్మాణం చేస్తున్న వంతెన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పాలశింగిలో పర్యటించిన వైద్యబృందం టెక్కలి: టెక్కలి మండలం పాలశింగి గ్రామంలో శుక్రవారం వైద్య బృందాలు పర్యటించా యి. గ్రామంలో కిడ్నీ వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో గ్రామస్తుల నుంచి వివరాలను తెలుసుకునేందుకు ఈ బృందాలు పర్యటించాయి. డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందిన ప్రొగ్రాం అధికారి శివరంజని, పీహెచ్సీ వైద్యులు పవన్తేజ, భాగ్యశ్రీతో పాటు దళిత మహాసభ జిల్లా అధ్యక్షుడు బోకర నారాయణరావు తదితరులు గ్రామంలో పర్యటించి కిడ్నీ వ్యాధి వ్యాప్తికి గల కారణాలను తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలో కిడ్నీ వ్యాధి తీవ్రతపై ఇటీవల ‘సాక్షి’లో ‘పచ్చటి పల్లెలకు ముచ్చెమటలు’ అనే కథనం వెలువడిన సంగతి విదితమే. మా ప్రాంతంలో ఇసుక పరిశ్రమ వద్దు గార: తమ తీర ప్రాంతంలో ఇసుక పరిశ్రమ వద్దు అని శ్రీకూర్మం–మత్స్యలేశం పరిధిలోని ఆరు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. శుక్రవారం మేజర్ పంచాయతీ శ్రీకూ ర్మం పరిధిలోని శ్రీకూర్మ–మత్స్యలేశం సచివాలయం పక్కన తీర ప్రాంతంలోని ఆరు గ్రామా ల ప్రజలతో ఇసుక పరిశ్రమ ఏర్పాటు, శాంపిల్స్ సేకరణపై ప్రజాభిప్రాయాలను డిప్యూటీ తహసీల్దార్ ధనలక్ష్మీ అధ్యక్షతన తెలుసుకున్నారు. ఎస్.మత్స్యలేశంతో పాటు నీలాపుపేట, పడపానపేట, చుక్కపేట, నగిరెడ్లిపేట, పడపవానిపేట ఆరు గ్రామాలకు చెందిన ప్రజ లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీఎంఐడీసీ వైస్ ప్రెసిడెంట్ రామనారాయణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేర కు ఈ ప్రాంతంలో ఇసుక మైనింగ్ చేసేందుకు అనుమతి ఉందన్నారు. దీని వల్ల ఎలాంటి నష్టం జరగదని, ఈ ప్రాంతమంతా రోడ్లు వంటి మౌలిక సదుపాయాలతో పాటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందన్నారు. దీనిపై స్థాని క ఆరు గ్రామాల నుంచి ఎంపిక చేసుకున్న వ్యక్తులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భూగర్భ జలం కలుషితమవుతుందని, తద్వారా అనారోగ్యం పాలవుతామని, ఇప్పటికే తాగునీరు సమస్య ఉందన్నారు. మత్స్య సంపద దెబ్బతినడంతో పాటు తీర ప్రాంతంలోని బలమైన ఇసుక వ్యవస్థ దెబ్బతింటుందని మత్స్యకార ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సురవజ్జల శ్రీనివాసులు, అటవీ రేంజ్ అధికారి కె.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎదురు కట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంటే..
ఇచ్చాపురం రూరల్: పెళ్లి పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఓ యువతి వ్యవహారం బయటప డింది. ఇప్పటికే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకు న్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ఈ నిజాలను దాచి మరోసారి వివాహం చేసుకుని వరుడి కుటుంబాన్ని బురిడీ కొట్టించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న యువతి వాణిని వివాహం చేసుకోవడానికి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్రెడ్డి మధ్యవర్తుల ద్వారా లక్ష రూపాయల ఎదురు కట్నం ఇచ్చాడు.ఈనెల 17న సోంపేట కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. 19వ తేదీన తన స్వగ్రామం కోలార్ వెళ్లేందుకు సురేష్రెడ్డి భార్య వాణితో కలిసి పలాసలో ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వేస్టేషన్కు వచ్చే సరికి భర్త కళ్లు గప్పి ఆమె నేరుగా ఇచ్చాపురంలోని తన ఇంటికి చేరుకుంది. భార్య కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన భర్త సురేష్ రెడ్డి అంతటా వెతికి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తిరిగి ఇచ్చాపురం (Ichchapuram) వచ్చి చూడగా వాణి ఇంట్లోనే ఉంది. ఎందుకిలా చేశావంటూ ప్రశ్నించగా తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో మోసపోయినట్లు గ్రహించిన సురేష్రెడ్డి తన వారితో కలిసి గురువారం రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాడు.ఎదురు కట్నం ఇచ్చినా.. ఇంతకు ముందే ఆమెకు పలువురితో వివాహాలు జరిగినట్లు ఫొటోలు తమకు కనిపించాయని, ఎదురు కట్నంతో పాటు వెండి పట్టీలు, మెట్టెలు, బట్టలు ఇచ్చామంటూ వరుడు సురేష్రెడ్డి, వారి బంధువులు విలేకరుల ఎదుట వాపోయారు. అయితే పెళ్లి కుమార్తెకు తాము ఇచ్చిన కట్నం, వెండి వస్తువులు తిరిగి ఇచ్చేస్తే కేసు పెట్టమని వారు డిమాండ్ చేశారు. ఆమెకు ఇప్పటికే ఇద్దరితో నిశ్చితార్థం జరిగిందని, ఇప్పుడు తమ అబ్బాయితో పెళ్లి జరిగిందని తెలిపారు. అయితే వరుడు ఇచ్చిన వస్తువులు ఇచ్చేందుకు యువతి తరఫు వారు సమ్మతించడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.చదవండి: పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి -
బొమ్మిక.. సాగునీరు లేక!
బూర్జ : మండల పరిధిలోని బొమ్మిక రిజర్వాయర్ ద్వారా ఈ ఏడాది రబీ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. 1980లో అప్పటి ప్రభుత్వం మెట్ట ప్రాంత రైతుల కోసం బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ బొమ్మిక గిరిజన గ్రామం ఎగువన బొమ్మిక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. బొమ్మిక చుట్టుపక్కల కొండల్లోని నీటిని నిల్వ చేసి దిగువ భాగాన ఉన్న పెద్దపేట, మదనాపురం, జగన్నాథపురం, బొమ్మిక, కొండపేట, నీలాపురం, ఏ.పి.పేట తదితర గ్రామాల పరిధిలోని 770 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించేందుకు ఈ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. 2015–16లో రిజర్వాయర్తోపాటు కాలువల ఆధునీకరణ పనులకు రూ.9 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టారు. మళ్లీ ఈ ఏడాది తూతూమంత్రంగా రిజర్వాయర్లో పిచ్చిమొక్కలు, పూడికలు తొలగించారు. కాలువల్లో పనులు చేపట్టినా ప్రస్తుతం రిజర్వాయర్లో పూర్తిస్థాయిలో నీరు లేకపోవడంతో రబీ పంటల సాగుకు శివారు గ్రామాలకు నీరు అందడం ప్రశ్నార్థకమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లో పూర్తి స్థాయిలో ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. బొమ్మిక రిజర్వాయర్లో సగానికి తగ్గిన నీరు రబీ పంటలకు సాగునీరు ప్రశ్నార్థకం తూతూమంత్రంగా పూడిక తీతలు -
ప్రొసీడింగ్ పత్రాలు అందజేత
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్, న్యాయవాది చౌదరి లక్ష్మణరావు కుటుంబానికి ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ద్వారా మంజూరైన వెల్ఫేర్ ఫండ్ రిలీజ్ ప్రొసీడింగ్ పత్రాలను అతని భార్య స్వాతికి గురువారం అందజేశారు. న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.9 లక్షలు విడుదలైనట్లు వారు తెలిపారు. వెల్ఫేర్ ఫండ్ను రూ.4లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచిన తర్వాత ఇదే మొదటి క్లెయిమని, నామిని బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుందని, ప్రభుత్వం నుంచి కూడా కొంత నగదు రానుందని చెప్పారు. కార్యక్రమంలో స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు గేదెల వాసుదేవరావు, జిల్లా న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తంగి శివప్రసాద్, పెట్ట దామోదర్రావు, మాజీ అధ్యక్షుడు ఎన్.సూర్యారావు, బాలకృష్ణ చాంద్, మామిడి క్రాంతి, బీసీ న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగురు ఉమామహేశ్వరరావు, కొమ్ము రమణమూర్తి బి.ఎస్.చలం, చిన్నాల జయకుమార్ పాల్గొన్నారు. -
మనువాదానికి వ్యతిరేకంగా పోరాటం
శ్రీకాకుళం/శ్రీకాకుళం పీఎన్కాలనీ : మనువాద సంస్కృతికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మనుస్మృతి దహనం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో గురువారం దళిత, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కె.ధర్మారావు, డి.గణేష్ అధ్యక్షతన ‘సనాతన సంస్కృతి –ప్రజాస్వామ్యం‘ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన సీనియర్ న్యాయవాది జహా ఆరా మాట్లాడుతూ దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీల వ్యతిరేక పాలకుల వ్యవస్థలో బతుకుతున్నామని.. మను సంస్కృతి రాజ్యమేలుతున్న పాలనలో ఉన్నామని చెప్పారు. చరిత్రను మతకోణంలో చూడడం సరికాదన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరగకపోతే రాజకీయ న్యాయం, అధికారం రాదని అంబేడ్కర్ పేర్కొన్నారని, దళిత, మైనారిటీ, పీడిత ప్రజలు మనువాదానికి వ్యతిరేకంగా పోరాడినప్పుడు న్యాయం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయ, ప్రజాసంఘాల ప్రతినిధులు మిస్క కృష్ణయ్య, సన్నశెట్టి రాజశేఖర్, పేడాడ కృష్ణారావు, గొంటి గిరిధర్, కల్లేపల్లి రామ్గోపాల్, బోనెల రమేష్, పి.మోహన్ తదితరులు మాట్లాడుతూ ప్రభుత్వాలు సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు బి.అప్పారావు, బి.వి.రమణ, నేతల అప్పారావు, దమయంతి, చిన్నికృష్ణ, యడ్ల జానకిరావు, గరికివాడు, బెలమర ప్రభాకర్, రాయి సూర్యనారాయణ, కుర్మారావు, శ్రీనివాస్, యడ్ల గోపి, రాజేశ్వరి, గోవింద్, తేజ, కళావతమ్మ, బడే కామరాజు, అనంతరావు, గణపతి, రాముడు, మహేంద్ర, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎంఐఎస్ కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గం ఎన్నిక
టెక్కలి: మండల విద్యా శాఖా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఎంఐఎస్ (మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్) కోఆర్డినేటర్ల జిల్లా కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు గురువారం టెక్కలిలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడిగా పి.మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా కె.ఉపేంద్ర, ఆర్థిక కార్యదర్శిగా బి.రామ్ప్రసాద్, ఉపాధ్యక్షులుగా బి.శశిరేఖదేవి, సహాయ కార్యదర్శిగా ఆర్.సంతోష్కుమార్, గౌరవ సలహాదారుడిగా ఎస్.గౌరీశంకర్, డి.సిహెచ్.రాంబాబు, సభ్యులుగా జి.చంద్రశేఖర్, వై.లింగరాజు, ఎస్.కళ్యాణి, పి.విజయ్ తదితరులను ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కృషి చేయాలని నినాదాలు చేశారు. శ్రీముఖలింగంలో మరుగుదొడ్లకు మరమ్మతులు జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భక్తులకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు వినియోగంలోకి తెచ్చేందుకు రూ.15 లక్షలతో మరమ్మతులు చేయిస్తున్నామని కేంద్ర పురావస్తు శాఖ సీఏ మూర్తి గురువారం తెలిపారు. ‘శివ..శివా’ అనే శీర్షికన ఈనెల 1న సాక్షి లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. ఢిల్లీలోని శాఖ ఉన్నతాధికారుల అనుమతితో పనులు చేయిస్తున్నామని చెప్పారు. మరుగుదొడ్లు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివాహం.. వివాదం.. రాజీ ఇచ్ఛాపురం రూరల్: ఎక్కడో కర్నాటక నుంచి ఇచ్ఛాపురం వచ్చి ఎదురు కట్నం ఇచ్చి ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, పెళ్లయ్యాక వధువు ట్రైన్ దిగి ఇంటికి వచ్చేయడం, వరుడు వధువు ఇంటికి వచ్చి తన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని కోరడం వంటి వరుస ఘటనలతో ఇచ్ఛాపురం ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. ఇచ్చాపురం మండలం భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ యువతిని కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లాకు చెందిన నాగిరెడ్డి సురేష్ రెడ్డి ఈ నెల 17న సోంపేటలోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. 19వ తేదీన పలాసలో వధూవరులు కర్నాటక వెళ్లేందుకు ట్రైన్ ఎక్కారు. విజయనగరం రైల్వేస్టేషన్కు వచ్చే సరికి వధువు కనిపించలేదు. దీంతో ఆయన అంతా వెతికి ఇచ్ఛాపురం రాగా యువతి ఆమె ఇంటిలోనే కనిపించడంతో నిశ్చేష్టుడయ్యాడు. పెళ్లి తనకు ఇష్టం లేదని వధువు చెప్పడంతో తాను మోసపోయానని గ్రహించి గురువారం రూరల్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే ఇరు వర్గాల వారు రాజీకి వచ్చేయడంతో కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. -
గంజాయి డాన్ అరెస్ట్
విజయనగరం క్రైమ్: గంజాయి రవాణాలో డాన్గా వ్యవహరిస్తున్న పఠాన్ బాషా అలీని విజయనగరం టూటౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ రావు, ఎస్సై కృష్ణమూర్తి పఠాన్ బాషా ఆలీనీ అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, కొత్తవీధికి చెందిన పఠాన్ బాషా అలీ (31) విజయనగరంలోని ఫూల్బాగ్లో నివాసం ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాను మార్గంగా ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆలీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. విజయనగరం టూ టౌన్ పీఎస్ పరిధి బాబామెట్ట ప్రాంతంలో గత ఏడాది 10 కిలోల గంజాయిని విక్రయిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పాటు మరో కేసులో 3.10 కిలోల గంజాయితో పట్టుబడగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో 2021లో గంట్యాడ పీఎస్ లో 1596.36 కిలోలు, 2023లో బాపట్ల జిల్లా నిజాంపట్నం పీఎస్ పరిధిలో 1.5 కిలోలల గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడిగా తేలింది. దీంతో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించినట్లు టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. -
వేర్వేరు బావుల్లో పడి ఇద్దరు మృతి
మెళియాపుట్టి : మెళియాపుట్టిలోని ఓ బావిలో వృద్ధురాలి మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. మృతురాలు అదే గ్రామానికి కొల్లి మాణిక్యం (67)గా గుర్తించారు. మాణిక్యం భర్త కొన్నేళ్ల క్రితమే విడిచిపెట్టి వెళ్లిపోవడంతో కుమార్తెను పెంచి పెళ్లి చేసింది. అనంతరం మతిస్థిమితం సరిగ్గా లేక పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండేది. ఈ క్రమంలో మెళియాపుట్టి మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా ఉన్న బావిలో మాణిక్యం మృతదేహాన్ని అక్క కొడుకు నక్కల కిరణ్ గురువారం గుర్తించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీసి పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. బావికి స్నానానికి వెళ్లి పొరపాటున పడిపోయి మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పొందూరులో.. పొందూరు: స్థానిక నాగవంశం వీధికి చెందిన నల్లి సురేష్(40) పొందూరులోని బండార్లమ్మ చెట్టు సమీపంలోని బావిలో శవమై తేలాడు. వివరాల్లోకి వెళ్తే.. సురేష్ ఈ నెల 22న తెల్లవారుజామున నిద్ర లేచి బయటకు వెళ్లి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఏం జరిగిందో గాని గురువారం స్థానిక బావిలో సురేష్ మృతదేహం తేలింది. కొద్ది రోజులుగా మతి స్థిమితం లేకుండా ఉన్నాడని, పచ్చకామెర్లతో బాధపడుతున్నాడని, మద్యం ఎక్కువగా తాగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా? ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.చెప్పారు. -
పార్టీలో పక్షపాత ధోరణి భరించలేక..
● టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజీనామా నరసన్నపేట: తెలుగు దేశం పార్టీ అను బంధ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నాయకులు, నరసన్నపేట మండలం ఉర్లాం మాజీ సర్పంచ్ జల్లు చంద్రమౌళి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయనే స్వయంగా ఫోన్ చేసి ప్రకటించా రు. స్థానిక నాయకత్వం పక్షపాత ధోరణి, తనపై చూపుతున్న వివక్షకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఎప్పటి నుంచో టీడీపీలో ఉంటూ ఆ పార్టీనే నమ్ముకొని ఉన్న తనలాంటి సీనియర్లను పక్కన పెట్టడం అవమానంగా భావిస్తున్నానని తెలిపారు. చంద్రమౌళి టీడీపీలో నరసన్నపేట మండలంలో ప్రధాన నాయకులుగా చెలామణీ అయ్యారు. ఉర్లాం సర్పంచ్గా, ఎంపీటీసీగా, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. జల్లు చంద్రమౌళి -
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో నాగుపాము
టెక్కలి రూరల్: ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గురువారం ఉదయం ఒక నాగుపాము హల్చల్ చేసింది. ఆస్పత్రి లోపల నాగుపాము కనిపించడంతో ఆస్పత్రిలోని రోగులతో పాటు సిబ్బంది సైతం భయాందోళనకు గురయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఆస్పత్రిలోని మొదటి అంతస్తు 44వ నంబర్ రూమ్లో ఉన్న జనరల్ ల్యాబ్ తలుపులను గురువారం ఉదయం తెరిచే సరికి అక్కడ సిబ్బందికి పాము బుసలు కొడుతూ కనిపించింది. చాలాసేపటి వరకు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయలేకపోయారు. చివరకు ఆ పాము ల్యాబ్ రూము సమీపంలో ఒక రేకు మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో దూరే ప్రయత్నం చెయ్యడంతో సిబ్బంది దాన్ని పట్టుకుని ఆస్పత్రికి కొంత దూరంలో విడిచి పెట్టేశారు. పాము మొదటి అంతస్తు వరకు ఎలా వచ్చిందన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. పాము సమీప వార్డుల్లోకి వెళ్లి ఉంటే పరిస్థితి ఏమిటని రోగులు ఆందోళనకు గురయ్యారు. -
క్రీడా స్థలంతో ఆటలు
● మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్థలం ధారాదత్తానికి యత్నాలు ● గత ప్రభుత్వ హయాంలో ఖేలో ఇండియా క్రీడా గ్రామం నిర్మాణానికి 33.38 ఎకరాలు సేకరణ ● ఇందులో పది ఎకరాలు క్రికెట్ అసోసియేషన్కు ఇచ్చేందుకు యోచన ● గతంలో ఆమదాలవలసలో తీసుకున్న స్టేడియం స్థలాన్ని గాలికి వదిలేసిన క్రికెట్ అసోసియేషన్ శ్రీకాకుళం: జిల్లా కేంద్రం వద్ద పాత్రుని వలస సమీపంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో కొంత భాగాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పాత్రుని వలస సమీపంలో 33.38 ఎకరాల భూమిని సేకరించి ఖేలో ఇండియా నిధులతో క్రీడా గ్రామాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. ఈ స్థలాన్ని క్రీడా ప్రాధికార సంస్థకు అప్పగించారు. ఈ స్థలంలో హాకీ సింథటిక్ కోర్టుతో పాటు అథ్లెటిక్ సింథటిక్ ట్రాక్లను నిర్మించాలని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్విమ్మింగ్ పూల్ మ ల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అన్ని క్రీడలకు పనికి వచ్చేలా సింథటిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయించి ఇందుకు సంబంధించిన అంచనాలను సైతం సిద్ధం చేశారు. ఇక్కడ ఖేలో ఇండియా క్రీడా గ్రామం మంజూరైతే ఇక్కడే బాల బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు శిక్షకులకు వసతి గృహాలు ఫిజియోథెరపీ సెంటర్లు మల్టీ జిమ్ కేంద్రాలు ఫుట్బాల్, బాస్కెట్బాల్, హ్యాండ్ బాల్ కోర్టులు నిర్మించేలా అంచనాలు పొందుపరిచి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఇంతలో ఎన్నికలు రావడం వల్ల ఇది పెండింగ్లో ఉండిపోయింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం దీనిపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈలోగా ఈ స్థలంపై ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కన్ను పడింది. ఇందులో తమకు 10 ఎకరాలు కేటాయించాలని, స్టేడియం నిర్మాణాన్ని చేపడతామని అధికారులకు ప్రతిపాదించారు. అసోసియేషన్లోని కొందరు సభ్యులు తమ కు ఉన్న సాన్నిహిత్యంతో అధికారులపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. దీనికి ఓ ప్రజా ప్రతినిధి కూడా వత్తాసు పలకడంతో స్థలం కేటాయించేందుకు అధికారులు నిర్ణయించారు. కొందరు క్రీడాకారులు విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నా యుడు దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన ఇటీవలే క్రీడా గ్రామ స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం సేకరించి క్రీడా ప్రాధికార సంస్థకు కేటాయించిన స్థలాన్ని క్రికెట్ అసోసియేషన్కు ఎందుకు ఇవ్వడం అని, పక్కనే ఉన్న రైతులు 14 ఎకరాలు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండడంతో వారి నుంచి క్రికెట్ అసోసియేషన్ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఖేలో ఇండియా నిధులు మంజూరయ్యేలా కేంద్రం స్థాయిలో కృషి చేస్తానని, ఆ నిధులు మంజూరైతే ఇక్కడ క్రీడా గ్రామాన్ని నిర్మించుకోవచ్చని కూడా కేంద్రమంత్రి అధికారులకు ఈ స్థల ఆవరణలోనే చెప్పారు. కానీ దీన్ని కూడా కొందరు అధికారులు బేఖాతరు చేస్తూ పది ఎకరాల స్థలాన్ని క్రికెట్ అ సోసియేషన్కు లీజు పద్ధతిపై కేటాయించేందుకు పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆమదాలవలసలోని నందమూరి తారక రామారావు గ్రీన్ ఫీల్డ్ క్రీడా ప్రాంగణాన్ని లీజుకి తీసుకొని గాలికి వదిలేసింది. ఈ ప్రాంగణంలో రెండు కోట్ల నిధులతో నిర్మించిన భవనాన్ని సైతం కూల్చివేసిన అనంతరం స్థలాన్ని వదిలివేశారని, దీన్ని పరిగణనలోకి తీసుకొని అయినా స్థలాన్ని కేటాయించవద్దని పలువురు క్రీడాకారులు కోరుతున్నారు. ప్రతిపాదనలు వాస్తవమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు 10 ఎకరాలు స్థలం ఇవ్వాలని ప్రతిపాదనలు ఉన్న విషయం నిజమే. క్రికెట్ అసోసియేషన్తో భూమిని కొనుగోలు చేయించాలని కేంద్రమంత్రి చెప్పిన విషయం కూడా వాస్తవమే. అధికారుల ఆదేశాల మేరకు కొందరు క్రికెట్ అసోసియేషన్ సభ్యుల ఒత్తిడికి తలొగ్గుతారో వేచి చూడాల్సిందే. – మహేష్, డీఎస్డీఓ -
104 ఉద్యోగులను వేధిస్తున్న సమస్యలు
● సిబ్బంది కొరతతో అదనపు భారం ● జీతాల్లో కోతలతో అవస్థలు పడుతున్న ఉద్యోగులు అరసవల్లి: పేదల పాలిట సంజీవని 104 అంబులెన్స్ సిబ్బంది సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు. అరకొర సిబ్బంది, రోజుకు పది గంటలకు పైగా విధులు, అదనపు పని ఒత్తిడి, కనీసం సెలవులు ఇవ్వకుండా వేధింపులు, మహిళా ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉండడంతో ఉద్యోగులు యాతన పడుతున్నారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో భవ్య హెల్త్ కేర్ సర్వీసెస్ యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ సిబ్బంది రోడ్డెక్కారు. యాజమాన్యం వేధింపులను ఆపాలని కోరుతూ 104 ఉద్యోగులు ఆందోళనలకు దిగుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇది జిల్లాలో 30 మండలాలకు మొత్తం 104 మొబైల్ వాహనాలు 51 (బఫర్ 1) వరకు ఉన్నాయి. 102 మంది ఉద్యోగులకు నిబంధనల ప్రకారం సెలవులు ఇవ్వకపోవడంతో పాటు బఫర్లు కూడా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిపై అదనపు భారం తప్పడం లేదు. బఫర్ కింద ప్రతి డివిజన్కు ఒకరు చొప్పున జిల్లాలో మొత్తం నలుగురు డ్రైవర్లు, నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు (డీఈఓ) ఉండాల్సి ఉండగా ప్రభుత్వ ఒప్పందాలను కూడా పక్కన పెట్టి మరీ పూల్ సిస్ట మ్ ద్వారా ఏ రోజు వేతనం ఆ రోజే ఇచ్చేలా వ్యవహారాన్ని భవ్య యాజమాన్యం నడిపిస్తున్నారని ఉద్యోగుల సంఘం ఆరోపిస్తుంది. సెలవులివ్వకుండా హక్కులను హరిస్తూ.. ఉద్యోగులకు విధి నిర్వహణలో సెలవులను పొందడం కూడా హక్కులో భాగమే అయినప్పటికీ భవ్య యాజమాన్య వైఖరి మాత్రం ఈ హక్కులను హరి స్తూ ఉద్యోగులకు వేధిస్తోంది. మహిళలకు ఆయితే ప్రత్యేక ఆరోగ్య పరిస్థితుల్లోనూ సెలవులివ్వకపోవడం దారుణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెలకు ఇవ్వాల్సిన క్యాజువల్ లీవ్తో పాటు 20 రోజులకు ఇవ్వాల్సిన ఒక ఎర్న్డ్ లీవ్ను కూడా ఇవ్వకుండా యాజమాన్యం కఠినంగా వ్యవహరిస్తోందని ఉద్యోగులు వేదన చెందుతున్నారు. సెలవు రోజున తగిన జీతాన్ని కూడా కట్ చేసేలా చర్యలు చేపడుతున్న యాజమాన్యం వైఖరిపై ఉద్యోగులు మండిపడుతున్నారు. గత ఏడు నెలలుగా ఉద్యోగులకు నియామక పత్రాలతో పాటు పేస్లిప్లను కూడా యాజమాన్యం ఇవ్వకుండా తాత్సారం చేస్తోంది. ఇదే నెపంతో స్థానిక అఽఽధికార పార్టీకి చెందిన నేతల సిఫారసులతో కొత్తవారిని నియమించుకునేలా వెసులు బాటు కల్పిస్తున్నారు. గత ప్రభుత్వంలో సర్వీస్ ప్రొవైడర్లుగా వ్యవహరించిన అరబిందో సంస్థ ఇచ్చి న జీతాల కంటే ఈ భవ్య సంస్థ ఇచ్చిన జీతాలు తగ్గిపోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు. సీనియారిటీని కూడా ప్రాధాన్యతగా తీసుకోకుండా యా జమాన్యం ఉద్యోగులకు మానసికంగా అవస్థలకు గురిచేయడంతో ఉద్యోగులంతా ఆందోళనకు దిగా రు. తాజాగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. తమ అవస్థలపై భవ్య సర్వీసెస్పై మండిపడుతూ ఆందోళనలకు కార్యాచరణ చేపడుతున్నారు. జీతాల్లో కోతలు పెడుతున్నారు 104 వాహనాల్లో ఉద్యోగుల నియామకాలను 2008లో చేపట్టారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన జీతం కంటే ఇప్పుడు రూ.700 తక్కువగా వస్తోంది. సెలవు పెడితే రోజు జీతం రూ.860 కట్ చేస్తున్నారు. అదే రోజు పనిచేసిన పూల్ సిబ్బందికి దినసరి వేతనంగా రూ.500 ఇచ్చేస్తున్నారు. నెలకో సిఎల్, 20 రోజుల కొక ఈఎల్ ఉండాల్సిన నియమాలున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. – చల్లా నారాయణరావు, జిల్లా 104 వాహన డ్రైవర్లు సంఘ అధ్యక్షుడు వేధింపులు ఆపాలి భవ్య యాజమాన్యం 104 ఉద్యోగులకు అన్ని విధాలుగా దగా చేస్తోంది. పూర్తి వేతనాలను చెల్లించకపోగా నిందలతో వేధిస్తున్నారు. మహిళా ఉద్యోగుల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నారు. ఎలాంటి సెలవులు ఇవ్వకుండా వేధింపులకు గురిచేస్తు న్నారు. గట్టిగా అడిగిన వారికి వేటు వేసేలా అడుగులు వేస్తున్నారు. – ధర్మాన కిరణ్కుమార్, కార్యదర్శి, 104 ఉద్యోగుల సంఘం -
విద్యార్థినిపై స్కూల్ పీడీ భర్త దాడి..?
మెళియాపుట్టి: మండలంలోని బందపల్లి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో మరో వీడియో వైరల్ అవుతోంది. పాఠశాలకు చెందిన విద్యార్థినిపై అక్కడ పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ భర్త దాడి చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 26న ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఇదే పాఠశాలలో ఓ టీచర్ విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వీడియో రావడం కలకలం రేపుతోంది. ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంతికుమారికి ఎలాంటి సమాచారం లేదు. రాష్ట్ర గిరిజన సంక్షేమ పరిషత్ అధ్యక్షులు వాబ యోగి కూడా స్పందిస్తూ ఈ వీడియో నిజమైతే ఐటీడీఏ పీఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. మండల సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు గణేష్, కార్యదర్శి సవర వెంకటేష్, గిరిజన సంఘం నేతలు గురువారం ఆశ్రమ పాఠశాల వద్దకు చేరుకుని ప్రైవేటు వ్యక్తులు పాఠశాలలోకి ఎలా వస్తున్నారో విచారణ జరపాల్గొన్నారు. కమ్మేస్తున్న పొగ మంచు హిరమండలం: మేజర్ పంచాయతీ హిరమండలాన్ని పొగ మంచు కమ్మేస్తోంది. ఉదయం 8 గంటల వరకూ పొగమంచు కమ్ముకోవడంతో వాహదారులు ఇబ్బందులు పడ్డారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. హిరమండలం కొత్తూరు మధ్య అలికాం–బత్తిలి ప్రధాన రహదారి పొగమంచు కమ్ముకుంది. -
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
ఎచ్చెర్ల : ఎచ్చెర్లలోని శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్లో గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఉచితంగా ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు కళాశాల ప్రతినిధులు గురువారం తెలిపారు. డ్రోన్ సర్వే టెక్నీషియన్ కోర్సులో 105 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మూడు నుంచి నాలుగు నెలల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి టెన్త్, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, విద్యార్హత పత్రం, ఆధార్కార్డు, రేషన్కార్డు, బ్యాంక్ పాస్బుక్, కుల ఆదాయ నివాస తదితర ధ్రువీకరణ పత్రాలతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులే అర్హులని, వివరాలకు 8247656581, 9533170822 నంబర్లను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అర్హత గల ఉద్యో గార్థులు వినియోగించుకోవాలని వారు కోరారు. -
పైడిగాంపై నిర్లక్ష్యమేలా..?
కంచిలి: ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలో మూడు మండలాల రైతుల సాగునీటి కష్టాలు తీర్చడానికి ఉద్దేశించి నిర్మించిన చారిత్రాత్మక సాగునీటి ప్రాజెక్టు నిర్లక్ష్యపు నీడన కొట్టుమిట్టాడుతోంది. వంశధార జలాలను జిల్లా శివారులో ఉన్న ఇచ్ఛాపురం నియోజకవర్గానికి తెస్తామని చెప్పే ప్రజాప్రతినిధులకు, ఇక్కడ ఉన్న పురాతనమైన శాశ్వత ప్రాజెక్టు మాట గుర్తులేకపోవడం శోచనీయమని చెప్పాలి. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించుకున్న పైడిగాం ప్రాజెక్టు నేడు నిర్లక్ష్యానికి గురవుతోంది. ఈ ప్రాజెక్టు సాధన కోసం సోంపేట సమితి మాజీ అధ్యక్షుడు దివంగత గన్ని పద్మనాభరావు ఎన్నో పోరాటాలు చేశారు. చివరికి 1957లో సోంపేట మండలం బేసి రామచంద్రాపురం గ్రామంలో మహాసభను నిర్వహించడంతో, ఆ సభకు నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి హాజరై.. రైతుల స్పందన చూసి అప్పటికప్పుడు మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. దీని నిర్మాణం కోసం గన్ని పద్మనాభరావు ఎంతగానో కృషిచేసి, పూర్తి చేయించిన విషయం స్థానిక రైతులకు చరిత్రగా గుర్తుంది. ఎండుతున్న ఆయకట్టు భూములు ఇంతటి చరిత్ర కలిగిన ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు భూములకు ప్రస్తుతం నీరందని దుస్థితి ఏర్పడింది. ఈ ప్రాజెక్టు పరిధిలో 4,894 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. ఇందులో కంచిలి మండల పరిధిలో ఆరు గ్రామాలు, సోంపేట మండలంలో 18 గ్రామాలు, మందస మండలంలో ఒక గ్రామంలో ఆయకట్టు భూములన్నాయి. ఈ ప్రాజెక్టు పరిధిలో పంట పొలాలకు నీరు వెళ్లేందుకు 16.8 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ను, 14 బ్రాంచ్ కెనాల్స్ ద్వారా 23.75 కిలోమీటర్లు వరకు నిర్మించారు. కానీ మెయిన్ చానల్ను పూర్తిస్థాయిలో సిమెంటు నిర్మాణంగా చేపట్టలేదు. కేవలం రామకృష్ణాపురం గ్రామం వరకు సిమెంట్ లైనింగ్ వేసి, తర్వాత విడిచిపెట్టేశారు. దీనివలన ప్రాజెక్టు నుంచి విడిచిపెట్టినా నీరు చివరి ఆయకట్టు వరకు సక్రమంగా రాని దుస్థితి ఏర్పడింది. కెనాల్ కూడా చాలా కాలంగా పూడిక తీయకపోవడంతో మెయిన్ కెనాల్కు ఆనుకొని ఉన్న పొలాలకు కూడా సక్రమంగా నీరందడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక బ్రాంచ్ కెనాల్స్ పరిధిలో ఉన్న భూముల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నీరు సోంపేట మండలం పలాసపురం వరకు వెళ్తుంది. ఈ శివారు భూములకు ఎప్పుడు కూడా నీరు సరిగా వెళ్లకపోవడంతో ఆయకట్టు పొలాలు సాగునీటి కోసం ఇబ్బందులు పడటం ప్రతి ఏడాది కన్పిస్తోంది. కానీ ఈ పొలాల రైతుల నుంచి మాత్రం ఖచ్చితంగా శిస్తు వసూలు చేస్తున్నారని వారు వాపోతున్నారు. తితిలీ తుఫాను ధాటికి దెబ్బతిన్న ఈ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రూ.20 లక్షలతో తాత్కాలిక మరమ్మతుల పనులు చేపట్టారు. అయితే ఆ తర్వాత శాశ్వత మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దిశగా ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవడంతో ఆయకట్టు రైతులు తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబుకు లేఖ పైడిగాం ప్రాజెక్టు పూర్తిగా శిథిలావస్థలకు చేరినా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ఈ ప్రాజెక్టు పోరాటయోధుడు, మాజీ సమితి అధ్యక్షుడు గన్ని పద్మనాభరావు కుమారుడు గన్ని అశోక్కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. మూడు మండలాల పరిధిలో వేలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సిన అతి ప్రధానమైన పైడిగాం ప్రాజెక్టు ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన చతికిలబడిందన్నారు. ఇప్పటికై నా దీన్ని అభివృద్ధి చేసి వేలాది మంది రైతుల సంక్షేమానికి తోడ్పడాలని కోరారు. ఎనిమిదేళ్ల క్రితం తితిలీ తుఫాను ధాటికి ఈ ప్రాజెక్టు గోడలు పూర్తిగా దెబ్బతినడం, తదితర సమస్యలతో కునారిల్లుతోందని లేఖలో వివరించారు. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాల్సిందిగా విన్నవించారు.పైడిగాం ప్రాజెక్టు పరిధిలో సోంపేట మండలంలోని పలాసపురం గ్రామమే శివారు గ్రామం. ఇక్కడ వరకు నీరు రావడం గగనమే. ఈ గ్రామంలో పొలాలను టైల్యాండ్గా ప్రాజెక్టులో గుర్తించారు. నీరు సక్రమంగా అందకపోయినా రెవెన్యూ వారు మాత్రం భూమి శిస్తులను పక్కాగా వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికై నా పైడిగాం ప్రాజెక్టు పరిధిలో శివారు ప్రాంతం వరకు నీరందేలా చర్యలు చేపట్టాలి. – తడక జోగారావు, పలాసపురం, సోంపేట మండలం మూడు మండలాల రైతులకు సాగునీరందించేందుకు ఉద్ధేశించి దివంగత గన్ని పద్మనాభరావు పోరాటంతో నిర్మాణానికి నోచుకొన్న పైడిగాం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్టు పూర్తిగా కునారిల్లిన పరిస్థితికి చేరుకోవడంతో, ఆయకట్టు రైతులకు సక్రమంగా నీరందక ఆందోళన చెందుతున్నారు. పంటలకు గ్యారెంటీ లేని వైనం. దీనిపై అధ్యయనం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలి. – గన్ని అశోక్కుమార్, దివంగత పద్మనాభరావు కుమారుడు, సోంపేట పైడిగాం ప్రాజెక్టు మెయిన్ కెనాల్కు ఆనుకొని ఉన్న పంట పొలాలకు సాగునీటి సమస్య తప్పడం లేదు. ప్రతిఏటా ఈ చానల్ కింద ఉన్న పంట పొలాలకు సాగునీరు అందడంలో ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. కాలువలో చివరి వరకు సిమెంటు లైనింగ్ నిర్మించకపోవడంతో ప్రవహిస్తున్న నీరు ఎక్కడికక్కడే ఇంకిపోవడం, దారి పొడవునా గుర్రపుడెక్క ఏర్పడటంతో నీరందని పరిస్థితి. ఇప్పటికై నా అధికార యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టాలి. – మడ్డు వెంకటరావు, బూరగాం, కంచిలి మండలం -
● డ్రగ్స్ వద్దంటూ..
టెక్కలి: మత్తు పదార్థాల బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి సూచించారు. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోలీస్ శాఖ చేపట్టిన అభ్యుదయం సైకిల్యాత్ర బుధవారం టెక్కలి చేరుకుంది. ఈ సందర్భంగా డీఎస్పీ లక్ష్మణరావు నేతృత్వంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు పట్టణంలో పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బి.శేషగిరి, సీఐ ఎ.విజయ్కుమార్, ఎంవీఐ సంజీవరావు, ఎస్ఐలు రాము, రఘునాథరావ పాల్గొన్నారు. -
రీవర్రీఫికేషన్..!
● కొనసాగుతున్న సదరం పునః పరిశీలన ● ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు ● ఆందోళన చెందుతున్న దివ్యాంగులు నరసన్నపేట: సదరం సర్టిఫికెట్స్ పునః పరిశీలన నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో ప్రహాసనంగా కొనసాగుతోంది. దివ్యాంగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఆపసోపాలు పడుతున్నారు. ఏళ్ల తరబడి పింఛన్లు పొందుతున్నా.. ఇలా ఎన్నిసార్లు వెరిఫికేషన్ పేరిట ఆస్పత్రుల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. దివ్వాంగ పింఛన్లు అనర్హులు పొందుతున్నారని అపోహలు పెట్టుకున్న కూటమి ప్రభుత్వం, దివ్వాంగుల సర్టిఫికెట్స్ను ఈ ఏడాది ప్రారంభం నుంచి మే నెల వరకు తనిఖీలు నిర్వహించింది. అప్పుడు అర్హులైన పింఛనుదారులు నానా అవస్థలు పడి తనిఖీలకు వచ్చారు. అనర్హుల ఏరివేత పేరిట అర్హులను కూడా తొలగించడంతో వీరందరూ తమకు పింఛన్ పునరుద్ధరించాలని ఎంపీడీవో కార్యాలయాలకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం మరలా రీ వెరిఫికేషన్ చేయిస్తోంది. దీనిలో భాగంగా నరసన్నపేట ఏరియా ఆస్పత్రిలో మంగళ, బుధ, గురువారాల్లో దివ్వాంగుల అంగ వైకల్యాన్ని వైద్యులు పరిశీలించి సదరం సర్టిఫికెట్స్ మంజూరు చేస్తున్నారు. దీంతో దివ్వాంగులు వివిధ ప్రాంతాల నుంచి నరసన్నపేటకు వస్తున్నారు. బుధవారం ఈ ఆస్పత్రికి హిరమండలం, పోలాకి, ఎల్ఎన్పేట మండలాల నుంచి 50 మంది వచ్చారు. వీరందరినీ ఆర్థో వైద్యుడు రమణరావు పరిశీలించారు. -
క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి
ఎచ్చెర్ల: విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకొని ముందుకు సాగాలని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. మండలంలో కుశాలపురంలోని శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గడిచిన మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రాంతీయ స్థాయి అంతర్ పాలిటెక్నికల్ క్రీడల ఆటల పోటీల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. విజేతలు వీరే.. ఓవరాల్ చాంపియన్ షిప్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం (బాలికలు), ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం (బాలురు)కు వచ్చింది. వ్యక్తిగత చాంపియన్ షిప్ శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కె.శివరామకృష్ణ, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన బి.సోనియాకు లభించాయి. వాలీబాల్ పోటీల్లో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళం ప్రథమ, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఎచ్చెర్లకు ద్వితీయ స్థానం లభించింది. వాలీబాల్ బాలుర విభాగంలో శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ఎచ్చెర్ల ప్రథమ స్థానం, టెక్కలి ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించాయి. ఖో–ఖో పోటీల్లో బాలికల విభాగంలో ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల శ్రీకాకుళంకు ప్రథమ స్థానం, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాలకు ద్వితీయ స్థానం లభించాయి. కబడ్డీ బాలుర విభాగంలో ఆదిత్య పాలిటెక్నిక్ టెక్కలి ప్రథమ స్థానంలో, శ్రీవేంకటేశ్వర పాలిటెక్నిక్ కళాశాల ద్వితీయ స్థానంలో నిలిచింది. కార్యక్రమంలో సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి.పద్మారావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాస్స్ పాల్గొన్నారు. -
పేద విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
శ్రీకాకుళం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న తల్లిదండ్రులు లేని పేద విద్యార్థినులకు వసుదైక కుటుంబ యూనివర్సల్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు సైకిళ్లు పంపిణీ చేశారు. నగరంలో ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సెమినార్ హాల్లో బుధవారం 25 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సమన్వయకర్త హరిప్రసన్న మాట్లాడుతూ జిల్లాలో ఐదు విడతలుగా 150 సైకిళ్లు అందజేశామన్నారు. కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ జి.రాజేంద్రప్రసాద్, పాతపట్నం సబ్ రిజిస్ట్రార్ జి.రాజు, పి.గోవిందరావు, ఎల్.గుణశేఖర్, సాయికుమార్, ఆర్.పాపారావు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం: లావేరు మండలంలోని సుభద్రపురం జాతీయ రహదారి–16పై విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి వచ్చిన మరో లారీ బుధవారం ఉదయం 3 గంటల సమయంలో ఢీకొన్నట్లు లావేరు పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో వెనుక నుంచి బలంగా ఢీకొనడం జరిగింది. దీంతో వెనుక ఉన్న వెస్ట్ బెంగాల్కు చెందిన లారీ డ్రైవర్ ఎం.కృష్ణ(54)కు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్లో గవర్నమెంట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీనిపై లావేరు ఎస్ఐ కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. చికిత్స పొందుతూ యువకుడు మృతి రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఇజ్జాడ గణేష్(20) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు లావేరు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం మధ్యాహ్నం సుభద్రపురం గ్రామానికి చెందిన ఇజ్జాడ గణేష్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఇజ్జాడ గణేష్కి తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడుకి తండ్రి రమణ, తల్లి సత్యవతి, అన్నయ్య ఉన్నాడు. లావేరు ఎస్ఐ అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థికి అరుదైన అవకాశం మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న సహిత విద్యార్థి బి.జ్ఞాన సాయి సత్తాచాటాడు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో లోకోమోటోలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో ఎవరెస్ట్ బేస్క్యాంప్ అధిరోహణకు మార్గం సుగమమైందని ఎంఈవోలు దేవేంద్రరావు, పద్మనాభరావు పేర్కొన్నారు. దీంతో విద్యార్థిని బుధవారం అభినందించారు. -
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని మండల వీధిలో ఒక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకటో పట్టణ ఎస్ఐ – 2 బొడ్డేపల్లి రామారావు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు జడే కృష్ణ(39) భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి మండల వీధిలో నివసిస్తూ పాల వ్యాపారం చేసేవాడు. మూడేళ్ల క్రితం ఒక ప్రమాదంలో అతడి తలకు గాయమవ్వడంతో మతిస్థిమితం సరిగా ఉండేది కాదు. వణుకు ఎక్కువగా రావడంతో పాటు మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఒక్కోసారి 2, 3 రోజులైనా ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో ఈనెల 20వ తేదీన మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య లక్ష్మి మందలించిందని, బయటకు వెళ్లిన కృష్ణ 3 రోజులైనా ఇంటికి మరలా రాలేదు. పొదల్లో మృతదేహం గుర్తింపు జడే కృష్ణ తన ఆవులను ఒక పాకలో కట్టేవాడు. రోజూ మాదిరిగానే బుధవారం ఉదయం కృష్ణ భార్య పాలు తీద్దామని పాక వద్దకు వెళ్లింది. దీనిలో భాగంగా ఆవు దూడకు కట్టిన తాడు విప్పిన వెంటనే గుబురుగా ఉన్న నిర్మానుష్య పొదల వైపు దూడ వెళ్లింది. దూడను వెతుక్కుంటూ వెళ్లిన లక్ష్మికి చెట్టుకు వేలాడుతూ పోల్చలేని విధంగా ఉన్న తన భర్త కృష్ణ మృతదేహం కనిపించడంతో లబోదిబోమంది. వెంటనే పోలీసులకు సమాచారమందడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. -
కుష్టు వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం
శ్రీకాకుళం కల్చరల్: కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు అన్నివేళలా అండగా ఉంటామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. స్థానిక కరుణ సమాజంలో రెడ్క్రాస్ సంస్థ, ఆర్ట్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. క్రీస్తు బోధనలు అనుసరణీయమన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులతో మాట్లాడుతూ వారి సమస్యను తెలుసుకున్నారు. వ్యాధిగ్రస్తుల పెన్షన్, మరుగుదొడ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్, రేషన్ తదితర విషయాలపై చర్చించారు. అనంతరం 35 మంది కుష్టు వ్యాధిగ్రస్తుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ పి.జగన్మోహన్రావు, సెక్రటరీ మల్లేశ్వరరావు, అప్ హోల్డ్ ప్రాజెక్ట్ మేనేజర్ తిమోతి, రెడ్క్రాస్ జిల్లా ఎంసీ మెంబర్లు డాక్టర్ నిక్కు అప్పన్న, నూక సన్యాసిరావు, హరి సత్యనారాయణ, చిన్మయిరావ్, జి.రమణ, సత్యనారాయణ, చైతన్యకుమార్, ఉమా శంకర్, వెంకటరమణ, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. -
రెండు షాపుల్లో దొంగతనాలు
నరసన్నపేట: మేజర్ పంచాయతీ పరిధి పోలాకి కూడలిలో ఉన్న రెండు షాపుల్లో మంగళవారం రాత్రి దొంగతనాలు జరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు తీసి లోపలికి వెళ్లి నగదును అపహరించుకుపోయారు. రెండు చోరీల్లో రూ.15 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు బరాటం శ్రీరామమూర్తి, వి.రాజులు తెలిపారు. ఉదయం ఎప్పటిలాగే కిరాణా షాపు తెరుద్దామని వచ్చేసరికి షట్టర్ తాళాలు తీసి ఉన్నాయని, లోపలికి వెళ్లి చూస్తే రూ.10లు, రూ.5ల కాయిన్స్ మూట కనిపించలేదని పేర్కొన్నారు. దీంట్లో సుమారుగా రూ.14 వేలు ఉన్నాయని తెలిపారు. అలాగే వి.రాజు పాన్షాపు తాళం తొలగించి బాక్స్లో ఉన్న రూ.1,100లు తీసుకుపోయారని తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని పోలీసులు వచ్చి పరిశీలించారని వివరించారు. కాగా ఇటువంటి దొంగతనాలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని పోలీసులు పహరా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నారు. -
అప్పనంగా అప్పగిస్తారా..?
● ఓ ప్రైవేటు బడికి ప్రభుత్వ భూమిని అప్పగించే ప్రయత్నం ● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జేఆర్పురం వాసులు ప్రైవేటు స్కూల్ వద్ద నిరసన తెలుపుతున్న జేఆర్ పురం ప్రజా ప్రతినిధులు, స్థానికులు కాజేసే కుట్ర 1987లో డీ–పట్టా రూపంలో ఈ భూమి సంక్రమించింది. స్కూల్ యాజమాన్యానికి 2004లో అద్దెకు ఇచ్చాం. కొన్నేళ్లు అద్దె ఇచ్చి ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. అద్దె పత్రాలు, ఆస్తి పత్రాలు మా వద్దనే ఉన్నాయి. ఇందులో కొంత ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కాజేసే కుట్ర జరుగుతోంది. – చిన సూర్యప్రకాశరావు, ప్రైవేటు స్కూల్ అసలు యజమాని, విజయనగరం రణస్థలం: ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా ఓ ప్రైవేటు బడికి అప్పగించిన వైనంపై జేఆర్పురం వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బడి యాజమాన్య ప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారి ఒత్తిళ్లకు రెవెన్యూ అధికారులు తలొగ్గి విలువైన 27 సెంట్లు భూమిని ధారాదత్తం చేయడానికి పూనుకున్నారు. స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలకు కూడా తెలియకుండా రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఈ తంతు నడిపిన విషయం ఆలస్యంగా వెలుగు చూడడంతో బుధవారం జేఆర్పురం వాసులు, ప్రజా ప్రతినిధులు బుధవారం స్కూల్వద్దకు వచ్చి నిరసన తెలిపారు. జేఆర్ పురం గ్రామంలో సర్వే నంబర్ 66లో 27,31,32లలో 27 సెంట్లు ప్రభుత్వ భూమి (గయాలు) ఉంది. ఆ భూమిని ఓ ప్రైవేటు స్కూల్కు రాకపో కలు సాగించేందుకు వీలుగా కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు శరవేగంగా స్పందించి ఏ–1 నోటీసు పరంగా దండోరా మూలంగా ప్రకటించి, గ్రామ సచివాలయంలో, సంబంధిత భూముల మీద ప్రచురించినట్లు ధ్రువీకరించారు. ఈ నోటీసులపై కొందరు కూటమి నాయకులు కూడా ఆ భూములు బదలాయింపునకు అనుకూలంగా సంతకాలు పెట్టడం గమనార్హం. మండల కేంద్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వాటర్ ట్యాంక్ నిర్మించేందుకు కూడా స్థలం కరువైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా చేయడం కలవరపరుస్తోంది. -
ఇదేం పంచాయితీ !
పోలాకి: పంచాయతీలను అశాసీ్త్రయంగా విభజించేందుకు, దాని ద్వారా రానున్న స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అధికార పక్ష నాయకులు కుట్ర లు పన్నుతున్నారని కొందరు సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. పోలాకి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తున్నట్లు ఎంపీపీ ముద్దాడ దమయంతి భైరాగినాయుడు అధికారుల సమక్షంలోనే ప్రకటించారు. మిగిలిన మూడు మండలాల్లో సైతం మెజార్టీ గ్రామ పంచాయతీల తీర్మానాలు ఈ అశాసీ్త్రయ విభజనలను వ్యతిరేకిస్తూ జరిగాయి. మండలాల వారీగా ప్రతిపాదనలు.. ● పోలాకి మండలం బొద్దాం పంచాయతీలోని వనవిష్ణుపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా, పిన్నింటిపేట వ్యాపార కేంద్రాన్ని పూర్వ పు కోడూరు పంచాయతీలో విలీనం చేసేలా, బెలమర పంచాయతీలోని జొన్నయ్యపేటను, మగతపాడు పంచాయతీలోని ప్రకాశరావుపేట ను బొద్దాం పంచాయతీలోనూ, బెలమర పంచాయతీలోని కిల్లిబుచ్చెన్నపేటను మగతపాడు పంచాయతీలోనూ విలీనం చేసేందుకు ప్రతిపాదనలు చేసినప్పటికీ ప్రస్తుతానికి వనవిష్ణుపు రం ప్రత్యేక పంచాయతీగానూ, పిన్నింటిపేటను కోడూరులోనూ విలీనం చేసేందుకు మాత్రమే గ్రామసభలు నిర్వహించినట్లు ఈఓ పీఆర్డీ పద్మావతి తెలిపారు. ● నరసన్నపేట మండలంలోని జమ్ము పంచాయతీలోని జమ్ము ప్రత్యేక పంచాయతీగాను, అదే పంచాయతీ అనుబంధ గ్రామమైన రావాడపేటను శివరాంపురం, పొన్నాడపేట, గడ్డెయ్యపేటలను కలుపుకుని ప్రత్యేక పంచాయతీగా నూ, మడపాం, బుచ్చిపేటలను వేర్వేరుగా ప్ర త్యేక పంచాయతీలుగా చేసి బుచ్చిపేటలో వీఎన్పురం పంచాయతీ చేనులవలసను విలీనం చేసేందుకుగాను ప్రతిపాదనలు చేశారు. ● జలుమూరు మండలంలోని అంధవరం పంచాయతీ నుండి, జోగులపేట, గంగన్నపేటలను విడదీసి అల్లాడ పంచాయతీ రామదాసుపేటతో కలపి రామదాసుపేటను ప్రత్యేక పంచాయతీగా ప్రతిపాదనలు చేసినప్పటికీ, జోగు లపేట, గంగన్నపేటల ప్రజలు మాత్రం మాకివలస పంచాయతీలో తమను విలీనం చేయా లని లేకపోతే అంధవరంలోనే కొనసాగించా లని కోరుతున్నారు. లింగాలవలస పంచాయ తీ నుంచి హరిక్రిష్ణంపేటను దరివాడ పంచాయతీలో విలీనంకు ప్రతిపాదించారు. తలతరియా పంచాయతీ నుంచి యర్రన్నపేట, సంతలబైలు గ్రామాలను విడదీసి యర్రన్నపేట ప్రత్యేక పంచాయతీగాను, జలుమూరు మండలకేంద్రం విడదీసిన నామాలపేట, కిల్లివాని పేట, కోనసింహోద్రిపేటను కలిపి నామాలపేటను ప్రత్యేక పంచాయతీగా చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ● సారవకోట మండలం అలుదు గ్రామ పంచాయతీ నుంచి వడ్డినవలస, మాకివలసలను వేరుచేసి వడ్డినవలసను ప్రత్యేక పంచాయతీగాను, కుమ్మరిగుంట పంచాయతీ నుంచి వేరుచేసిన సింగంవలస, సోమయ్యపేట, బొంగడిపేటలతో కలపి చోడసముద్రంను ప్రత్యేక పంచాయతీగాను, వాండ్రాయి పంచాయతీనుంచి విడదీసిన బెజ్జి, సవరబెజ్జిలు కలపి కొత్త పంచాయతీగాను, గొర్రిబంద పంచాయతీలోని జగ్గయ్యపేట, కోనవానిపేట, ఆగుతుపురంకలపి గొర్రిబంద పంచాయతీ కొనసాగించేందుకు అదే పంచాయతీలోని బురుజువాడ కేంద్రంగా రైవాడ, జగన్నాథపురం, సవరపేటలతో కూడిన కొత్తపంచాయతీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. అశాసీ్త్రయంగా పంచాయతీ విభజన ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సర్పంచ్లు, ప్రజలు రాజకీయ ఒత్తిడితో గ్రామసభలు నిర్వహించిన అధికారులు వ్యతిరేకంగా తీర్మానాలు చేసిన పంచాయతీలు -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటన లు విడుదల చేశారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. దేవుని కృప అందరిపై ఉండాలని, ఈ శుభదినం కుటుంబాల్లో ఐక్యతను, ఆనందాన్ని నింపాలని ఎస్పీ ఆకాంక్షించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ‘వినియోగదారులు హక్కులు తెలుసుకోవాలి’ శ్రీకాకుళం పాతబస్టాండ్: వినియోగదారులు హక్కులు తెలుసుకుంటేనే నాణ్యమైన సేవలు అందుతాయని జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ చైర్మన్ ఆర్.చిరంజీవి అన్నా రు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ ఆడిటోరియంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చదువుకునే సమయంలోనే ప్రాథమిక చట్టాలు తెలుసుకోవాలని చిరంజీవి సూచించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా డిజిటల్ న్యాయ పాలన ద్వారా సమర్థ, సత్వర పరిష్కారం జరుగుతుందని జిల్లా సివిల్ సప్లై అధికారి జి.సూర్య ప్రకాష్ తెలిపారు. తూనిక లు కొలతలకు సంబంధించి మోసాలను గమనించి వినియోగదారులు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ పి.చిన్నమ్మ తెలిపారు. చిరుతిళ్లకు దూరంగా ఉండాలని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ లక్ష్మీనారాయణ తెలిపారు. అనంతరం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మెమొంటో, నగదు బహుమతులను అందజేశారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో మెరిసిన సిక్కోలు విద్యార్థులు శ్రీకాకుళం : విజయవాడలో జరుగుతున్న రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు విశేషంగా ఆకట్టుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో సోంపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కృష్ణవర్ధన్ ప్రదర్శించిన స్మార్ట్ స్కానర్, పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.కౌశిక్ ఆచారి ప్రదర్శించిన రియల్ టైం సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్ ఎంపికయ్యాయి. విద్యార్థులు వారి ఉపాధ్యాయులు చిన్నాజీవర్మ, ఎ.వెంకటరెడ్డి ఆధ్వర్యంలో వీటిని రూ పొందించారు. ఉపాధ్యాయ విభాగంలో అదపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ కె.కిరణ్కుమార్కు సంబంధించిన ప్రాజెక్టు కూడా ఎంపికై ంది. వీరు వచ్చే ఏడాది జనవరి 19 నుంచి హైదరాబాద్లో జరగబోవు సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్కు హాజరవుతారు. జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు, ఉప విద్యాశాఖాధికారు లు విజయకుమారి, విలియమ్లు ఎంపికై నవారిని అభినందించారు. ఘనంగా దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు శ్రీకాకుళం న్యూకాలనీ: దివ్యాంగ (విభిన్న ప్రతిభావంతులు) విద్యార్థుల క్రీడా పోటీలు ముగిశాయి. పాఠశాల విద్య, సమగ్రశిక్ష ఆధ్వర్యంలో బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా జోనల్స్థాయి అడ్వైంచర్ స్పోర్ట్స్ మీట్ జరిగింది. శ్రీకాకుళంతోపాటు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు పలు క్రీడా పోటీలను నిర్వహించారు. 100, 400, 800 మీటర్ల పరుగు పందాలు, షాట్పుట్, లాంగ్జంప్ ఈవెంట్స్లో పోటీలను జరిపారు. జోనల్స్థాయి అడ్వెంచర్ క్రీడా పోటీలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ జోనల్మీట్ స్టేట్ పరిశీలకులు వై.నరసింహం మా ట్లాడుతూ ఇక్కడ జరిగే జోనల్ స్థాయిలో ఎంపికైన పదిమంది విద్యార్థులకు గండికోటలో నెలరోజుల పాటు శిక్షణను అందించిన తర్వాత పర్వతారోహణకు సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. అదపాక జెడ్పీ హెచ్స్కూల్ టీచర్ కె.కిరణ్కుమార్ సోంపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కృష్ణవర్ధన్ పోలవరం జడ్పీ హెచ్ఎస్ విద్యార్థి కౌశిక్ ఆచారి


