breaking news
Srikakulam
-
కార్తీకానికికాశీబుగ్గ సెగ
● భక్తులను భయపెట్టిన తొక్కిసలాట దుర్ఘటన ● భద్రత భయంతో ప్రధాన ఆలయాలకు తగ్గిన భక్తులు ● అరసవల్లి తెప్పోత్సవానికి కూడా గత ఏడాది కంటే తక్కువగానే భక్తుల హాజరు ● ప్రభుత్వంపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు జలుమూరు మండలంలోని ప్రసిద్ధ శ్రీముఖలింగం ఆలయమిది. ఆలయానికి సాధారణ రోజుల్లోనే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తుల తాకిడి ఉంటుంది. కార్తీక మాసంలో మరింత ఎక్కువ ఎక్కువ రద్దీ ఉంటుంది. 10వేలకు పైబడి భక్తులు వస్తుంటారు. కానీ, ఈసారి కార్తీక మాసం రెండో సోమ వారం భక్తుల రద్దీ తగ్గింది. మునుపటిలాగా భక్తులు రాలేదు. 5వేల నుంచి 6వేల మధ్య ఉంటుందని అంచనా. కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట భయంతో రద్దీ ఎక్కువగా ఉంటుందని చాలామంది భక్తులు తగ్గినట్టు తెలుస్తోంది.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కార్తీకానికి కాశీబుగ్గ సెగ తగిలింది. జిల్లాలోని దాదాపు అన్ని ఆలయాలకు రెండో కార్తీక సోమవారం భక్తుల రాక తగ్గిపోయింది. శ్రీకాకుళం నగరంలోని ప్రముఖ ఆలయాల్లో కూడా ఇదే పరి స్థితి చోటు చేసుకుంది. సాధారణంగా కార్తీక మా సం రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చుట్టు పక్కల ప్రాంతాలు, జిల్లాలు, ఒడిశా నుంచి ప్రతి ఆలయానికి వేలల్లో వస్తుంటారు. కార్తీక సో మవారాలైతే ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. కానీ ఈసారి దాదాపు ప్రతి దేవాలయంలో భక్తు ల తాకిడి తక్కువగా ఉంది. సగానికిపైగా భక్తులు ఆ ఆలయాలకు రాలేదు. గ్రామాల్లోని ఆలయాల పూజలకే పరిమితమైపోయారు. దీనికంతటికీ కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన దుర్ఘటనే కారణంగా తెలుస్తోంది. అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటన భక్తులను భయాందోళనకు గురి చేసింది. అంతదూరం వెళ్లి ఇబ్బంది పడటం కంటే స్థానికంగా ఉన్న దేవాలయాల్లోనే పూజలు చేసుకుంటే సరిపోతుందని భక్తులు భావించారు. ప్రముఖ అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం వద్ద ఆదివారం జరిగిన తెప్పోత్సవానికి భక్తుల సంఖ్య తగ్గింది. గతేడాది ఏడాదితో పోల్చితే ఈసారి సంఖ్య తగ్గినట్టు అంచనా. ముఖ్యంగా శ్రీముఖలింగం, రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయం, బెండి నందికేశ్వర ఆలయం, మహేంద్ర గిరి, బెండి నందికేశ్వర ఆలయం.. ఇలా అన్ని ప్రధాన దేవాలయాలకు భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కాశీబుగ్గ దుర్ఘటనతో పోలీసులు అప్రమత్తమై ఆదివారం, సోమవారం అధిక సంఖ్యలో పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసిననప్పటికీ భక్తులకు నమ్మకం కలగలేదు. రద్దీని కంట్రోల్ చేయలేరన్న భయం పట్టుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుసగా ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు భక్తులను కలిచివేయడమే కాకుండా భయాందోళనకు గురి చేస్తున్నా యి. ఈ ప్రభుత్వం భక్తులకు భద్రత కల్పించలేదని, ఎప్పుడు ఏ సంఘటన చోటు చేసుకుంటుందోనన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. దైవదర్శనాలకు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోందని, రద్దీ దృష్ట్యా ప్రధాన ఆలయాలకు వెళ్లాలంటేనే భయమేస్తోందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. టెక్కలి మండలం రావివలస ఎండల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తులు పలుచగా ఉన్న దృశ్యమిది. ఉదయం 10గంటల సమయంలో ఉచిత దర్శనం కూడా వేగంగా జరిగిపోయింది. సాధారణంగా ఈ ఆలయానికి కార్తీక సో మవారాల్లో 15 వేల మంది వరకు వస్తుంటారు. కానీ ఈసారి రెండో సోమవారం 5నుంచి 6వేల వరకు వచ్చారని అంచనా. ఈ ఆలయానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి వస్తారు. ముఖ్యంగా ఒడిశా వాసులు మరింత నమ్మకంగా పూజిస్తారు. కాశీబుగ్గ దుర్ఘటనతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు బాగా తగ్గిపోయింది. వజ్రపుకొత్తూరు మండలం బెండి గ్రామంలోని శ్రీ నందేశ్వరాలయానికి భక్తుల రాక ఒక్కసారి తగ్గిపోవడంతో వెలవెలబోయింది. జీవగడ్డ ఒడ్డున ఉండటం, దేవతలు నిర్మించారని ప్రచారం ఉండటం వల్ల ఏటా కార్తీక మాసంలో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. అయితే, ఈ రెండో సోమవా రం భక్తుల తాకిడి కన్పించలేదు. ఉదయం 11గంట ల సమయానికే క్యూలు ఖాళీ అయిపోయాయి. -
● సర్వేకు ససేమిరా..
మందస: మందస మండలం ఉద్దాన ప్రాంతం బిడిమి, లక్ష్మీపురం, భేతాళపురం రెవెన్యూ గ్రామాల్లోకి భూ సర్వే పేరిట వచ్చిన పలాస రెవెన్యూ డివిజనల్ అధికారులతో కార్గో ఎయిర్పోర్టు బాధి త రైతులు సోమవారం వాగ్వాదానికి దిగారు. ఆర్డీఓ జి.వెంకటేష్ బాధిత రైతులతో మాట్లాడుతూ ఎయిర్పోర్టు కొలతల కోసం రాలేదని, రైతుల భూములు సర్వే చేయడానికి వచ్చామని చెప్పారు. కానీ దానికి కూడా జనం ఒప్పుకోలేదు. బాధిత భూముల్లో రీ సర్వే చేయడానికి ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో కార్గోఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు కొమర వాసు, కమిటీ సభ్యులు గుంటు లోకనాథం, దున్న హరికృష్ణ, దున్న సురేష్, నల్ల పరుశురాం, దాసరి మోహన్, బత్తిన ఉమాపతి, బత్తిన దేశయ్య, మడియా రుషి, జుత్తు హేమరాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లిలో.. వజ్రపుకొత్తూరు రూరల్: అనకాపల్లి గ్రామంలో సోమవారం సర్వేకు వచ్చిన తహసీల్దార్ సీతారామయ్యను కార్గో ఎయిర్పోర్టు బాధితులు నిలదీశారు. తమ భూముల పేరిట ఉన్న సర్వే నంబర్లతో అడంగల్,1బిల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగితే కనీసం పట్టించుకోలేదని, ఇప్పుడు గ్రామాల్లోకి వచ్చి సర్వేలు ఎందుకని ప్రశ్నించారు. జనమంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తుంటే భూమి లెక్కలు వేయడం సబబు కాదన్నారు. -
అంతర్జాతీయ పోటీలకు సిక్కోలువాసులు
● రికార్డుస్థాయిలో ఏడుగురు ప్రాతినిధ్యం శ్రీకాకుళం న్యూకాలనీ: ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లా నుంచి రికార్డుస్థాయిలో ఏడుగురు ఎంపికయ్యారు. ఈ మెగా స్పోర్ట్స్మీట్ ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు తమిళనాడులోని చైన్నె నగరం వేదికగా జరగనుంది. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనవారిలో పాలకొండ అప్పారావు, ఎం.భాగ్యలక్ష్మి, జె.రవి, వి.చిన్నబాబు, ఓ.శ్రీనివాసరావు, ఎం.కామయ్య, ఎల్.ప్రసాదరావు ఉన్నారు. వీరంతా ఇటీవలి జరిగిన జాతీయ పోటీల్లో పతకాలు సాధించడంతో ఏషియన్ మీట్కు ఎంపికయ్యారు. వివిధ వయో విభాగాల్లో రన్స్, జంప్స్, త్రోస్లో ప్రాతినిధ్యం వహించనున్నారు. జిల్లా నుంచి ఎంపికై న మాస్టర్స్ అథ్లెట్స్ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజాప్రతినిధులతోపాటు జిల్లా మాస్టర్స్ అథ్లెటిక్స్ అసో సియేషన్ అధ్యక్షుడు బొడ్డేపల్లి నారాయణరావు, ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి చల్లా జగదీష్, చౌదరి పురుషోత్తమనాయుడు, వెటరన్ అథ్లెట్స్, కుటుంబ సభ్యులు అభినందించారు. -
● ఎవరు చేసిన పాపం..?
నవ మాసాలు అమ్మ గర్భంలో భద్రంగా ఉన్న బిడ్డ.. బయటకు వచ్చిన వెంటనే ఇలా కాలువలో తేలియాడింది. ఉమ్మనీటి ఊయలలో నిశ్చింతగా ఉన్న పసికందు ప్రసవానంతరం ఇలా కాలువ నీటిలో ఊపిరి లేకుండా తేలింది. ఎవరి కన్నబిడ్డో.. ఎవరికి ఏ కష్టం వచ్చిందో గానీ అరసవల్లి సమీపంలోని శ్మశానానికి వెళ్లే దారిలోని పెద్ద గెడ్డలో ఓ పసికందు నిర్జీవంగా స్థానికులకు సోమవారం కనిపించింది. సమాచారం తెలుసుకున్న వన్టౌన్ ఎస్ఐ హరికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకెళ్లారు. – అరసవల్లి -
ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి
● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ టెక్కలి: కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకోవాలని, బాధ్యులను పక్కన పెట్టి ఆలయ ధర్మకర్తపై ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ ధ్వజమెత్తారు. ఆయన సోమవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సంఘటన జరిగిన తర్వాత అధి కార పార్టీ నాయకులు, మంత్రులు హడావుడి చేశారని, కానీ ఏకాదశి నాడు ఆలయంలో రద్దీ ఉంటుందని తెలిసినా పోలీసు బందోబస్తు కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమని తెలి పారు. కాశీబుగ్గలో జరిగిన సంఘటన నేప థ్యంలో తాత్కాలికంగా హడావుడి చర్యలు కా కుండా ఆలయాల్లో ప్రత్యేకమైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 2 లక్షల రూపాయల చొప్పు న పరిహారం ఇచ్చేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంగతిని ఆయన గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం విషయంలో పక్షపాతం చూపించారని వెల్లడించారు. గతంలో ఆలయాల్లో జరిగిన సంఘటనల్లో మృత్యవాత పడిన వారికి ఎంత మేరకు సాయం అందజేశారో అంతకు రెట్టింపు పరిహారం ఇవ్వాలని తిలక్ డిమాండ్ చేశారు. 11 నుంచి రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్ పాతపట్నం: రాష్ట్ర స్థాయి సాఫ్ట్ టెన్నిస్ టోర్నమెంట్ పాతపట్నంలోని గిరిజన సామాజిక మైదానంలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ రమ ణారావు తెలిపారు. సోమవారం పాతపట్నం గిరిజన సామాజిక మైదానంలో రాష్ట్ర వ్యాయా మ సంఘం అధ్యక్షుడు ఎన్ని శేఖర్ బాబు ఆధ్వర్యంలో సాఫ్ట్ టెన్నిస్ కోర్టులను పీడీలు, పీఈటీలు తయారు చేస్తున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గురాడి అప్పన్న, సెక్రటరీ జె.షణ్ముఖరావు, ఎన్ని దీలిప్, లోకేశ్వరరావు, శ్రీనువాసరావు, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘హాస్టళ్లు పరిశుభ్రంగా ఉంచాలి’ పాతపట్నం: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సీతంపేట ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సూచించారు. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న ఎస్టీ పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహాన్ని పీఓ సోమవారం పరిశీలించా రు. వసతి గృహంలోని స్టోర్ రూం, వంట గది, విద్యార్థులు గదులను పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని సూచించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలన్నారు. విద్యార్థులు వసతి గృహంలో మరుగుదొడ్లు సక్రమంగా లేవని, కిటీకిలకు మెస్లు లేవని, వర్షం వస్తే గదుల్లోకి నీరు చెమ్మ వస్తుందని, పలు సమస్యలను పీఓ తెలియజేశారు. కార్యక్రమంలో డీఈఈ రాజు, వసతిగృహం సిబ్బంది పాల్గొన్నారు. భక్తులపై తేనెటీగల దాడి నరసన్నపేట: మండలం ఉర్లాంలోని బాలత్రిపుర సుందరీశ్వరాలయం వద్ద సోమవారం పూజల కోసం క్యూలో ఉన్న భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. ఆలయం వద్ద ఉన్న చెట్టుపై తేనె పట్లు ఉన్నాయి. పక్షులు ఎరగడంతో పట్టు కదిలింది. వెంటనే తేనెటీగలు గుంపు లు గుంపులుగా వచ్చి క్యూలో ఉన్న భక్తులపై దాడి చేశాయి. దీంతో అంతా పరుగులు తీశారు. కొందరు చెరువులో దూకారు. మొత్తం 15 మంది గాయపడ్డారు. ఉర్లాంతో పాటు చింతవానిపేట, బడ్డవానిపేట, జగ్గునాయుడుపేట, కుమ్మరిపేటలకు చెందిన భక్తులు తేనెటీగల దాడికి గురయ్యారు. బాగా గాయపడిన వారికి స్థానిక పీహెచ్సీలో చికిత్స అందించారు. -
ఇది ఒంటూరు కథ
● దాహం కేకలు పెడుతున్న ఒంటూరు ● రెండేళ్లుగా పంట లేక ఎండిపోయిన 50 ఎకరాల భూములు ● గత నెల నుంచి జల్జీవన్మిషన్ తాగునీరు కూడా బంద్ కవిటి: రెండేళ్లయ్యింది ఆ యాభై ఎకరాల పొలాల గొంతు తడిచి. నెల రోజులైపోయింది ఆ వంద గడపలకు స్వచ్ఛమైన నీరు అంది. ఒంటూరు దాహం కేకలు పెడుతోంది. ఉప్పునీరు తాగలేక, కన్నీళ్లతో దాహం తీరక, స్వచ్ఛమైన నీటికి నోచుకోక నరకం చూస్తోంది. ఈ గ్రామంలో అందరూ సన్నకారు, చిన్నకారు రైతులే. వారు గత రెండేళ్లుగా ఖరీఫ్ పంట కూడా పండించుకోలేకపోతున్నారు. గ్రామానికి ఒక వైపు సముద్రం మరో వైపు చిన్న బీలబట్టి ఉంటుంది. దీంతో భూగర్భ జలాలు ఉప్పుగా మారిపోయాయి. పంటకు ఈ నీరు పనికి రాదు. తాగేందు కు కూడా వీలుండదు. గత నెల మూడోవారం వర కు జల్జీవన్మిషన్ పథకం నీటితో గొంతు తడుపుకునేవారు. ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. కంచిలి మండలం పెద్దశ్రీరాంపురం వద్ద ఇటీ వల జరిగిన పల్లెపండుగ రోడ్డు పనుల పుణ్యమా అని భూ గర్భ పైప్లైన్ దారుణంగా దెబ్బతినడంతో ఊరికి నీరు ఆగిపోయింది. ఈ పైప్లైన్ బాగు చేసేందుకు వెళ్లిన సిబ్బందిని ఆ పల్లె పండుగ రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ బెదిరించారు. రోడ్డుకు క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ కాలేదని, ఏదైనా దెబ్బ తింటే తాను నష్టపోతానని ఆయన చెబుతున్నాడు. దీంతో ఆఖరుకు గ్రామస్తులకు తాగునీరు రాకుండా పోయింది. ఇటీవల పంచాయతీ సిబ్బంది నాలుగు ట్యాంకుల నీరు అందించడంతో దాన్నే వారు తాగుతున్నారు. వంటకు నీరు కొన్నాం.. ఇటీవల మా పాప పెళ్లి జరిగింది. పెళ్లి విందు కోసం తాగునీరు, వంటకోసం దాదాపు రూ.10,000 ఖర్చు చేసి నీరు కొనుగోలు చేశాను. ఆధునికత పెరిగిన నేటి రోజుల్లో నీటి కోసం ఇంతఖర్చు చేసిన నాలాంటి దురదృష్టవంతుడు ఇంకా ఎవ్వరూ ఉండరేమో. – జి.దానయ్య,ఒంటూరు స్నానాలకూ ఇబ్బందే మా ఊరు ఎదురుగా సముద్రం, పడమర బీలబట్టిలో ఉప్పునీరు. స్నానం చేయడానికి కూ డా వీల్లేని దయనీయ స్థితిలో గడుపుతున్నాం. ఇటీవల సర్పంచ్ మూడు ట్యాంకుల నీరు తెప్పిస్తే వాటినే వాడుకుంటున్నాం. – పి.గౌరమ్మ, మహిళ, ఒంటూరు రెండేళ్లుగా పంటలేదు నాది ఒంటూరు గ్రామం. ఇక్క డ పంట లేకపోవడంతో హైదరాబాద్ వలస వెళ్లిపోయా డు. అక్కడ ప్రమాదవశాత్తు మరణించాడు. ప్రస్తు తం నాకు ఒక మనవరాలు, కోడలు ఉన్నారు. ఎకరం పొలం ఉంది. కానీ వర్షాధారం కావడంతో రెండేళ్లుగా పంటలేదు. ఇప్పుడు తాగునీరూ దొర కడం లేదు. దేవుడికి కూడా మా మీద దయ లేదు. – కదిరి కామయ్య,ఒంటూరుకలెక్టర్ చర్యలు తీసుకోవాలి కలెక్టర్ చర్యలు తీసుకుంటే గానీ మాకు వేరే దిక్కులేదు. మా ఊరికి ఉన్న ట్యాంక్ కూడా లీకులు అవుతోంది. తేళ్లు, జెర్రిలు ఉండే ఈ ట్యాంక్ నీరే మాకు ఆధారం. దాన్నైనా బాగు చేయాలి. – పి.చందరరావు, ఒంటూరు -
ఎస్పీ గ్రీవెన్స్కు 52 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరణకు 52 అర్జీలు అందాయి. ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి స్వీకరించారు. వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యలు తెలుసుకొని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా తక్షణమే తెలియపరచి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులు పునరావృతం కాకూడదని, వాటిపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక అందజేయాలన్నారు. -
స్టేట్మీట్ క్రికెట్ పోటీలు ప్రారంభం
● రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్–19 పోటీలకు తరలివచ్చిన క్రీడాకారులు ● పునర్విభజనకు పూర్వపు 13 జిల్లాల నుంచి జట్లు రాక ● బోణీ కొట్టిన ఆతిథ్య శ్రీకాకుళం శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా స్కూల్గేమ్స్ రాష్ట్రస్థాయి అండర్–19 బాలుర క్రికెట్ పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. విద్యాశాఖ/ఇంటర్మీడియెట్ విద్య పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా మొదటి మూడు రోజులు బాలురుకు, తర్వాత మూడు రోజులు బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నారు. పునర్విభజనకు పూర్వపు 13 జిల్లాల నుంచి బాలురు జట్లు సిక్కోలు చేరుకున్నాయి. శ్రీకాకుళంలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో కోడిరామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల మైదానాలు చిత్తడిగా మారడంతో ప్రత్యామ్నాయంగా చిలకపాలెంలోని శ్రీ శివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానం, ఎచ్చెర్లలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల మైదానం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ మైదానాల్లో తొలిరోజు పోటీలు నిర్వహించారు. మొదటిరోజు నాలుగు మ్యాచ్లు జరిగాయి. శ్రీకాకుళం బాలురు జట్టు తన మొదటి మ్యాచ్లో ఘన విజయం సాధించి బోణీ చేసింది. పోటీలను ప్రారంభించిన గొండు, గాదె.. కోడి రామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఆతిథ్యంలో రాష్ట్రస్థాయి పోటీలు జరగడం సంతోషదాయకమన్నారు. అనంతరం మార్చ్ఫాస్ట్ నిర్వహించారు.త తన్మయ నృత్య అకాడమీ బృందం ప్రదర్శించిన నృత్యప్రదకర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో టోర్నీ పరిశీలకులు రాజేష్ గోల (కర్నూలు), ఇంటర్మీడియెట్ విద్య డీవీఈఓ రేగ సురేష్కుమార్, స్థానిక జీజేసీ బాలురు కళాశాల ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు, డీఈఓ ఎ.రవిబాబు, ఉపవిద్యాశాఖాధికారి ఆర్.విజయకుమారి, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, మహిళా కార్యదర్శి ఆర్.స్వాతి, పీఈటీ సంఘ జిల్లా అధ్యక్షుడు పి.తవిటయ్య, ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకరటమణ, ఒలింపిక్ అసోసియేషన్ సలహాదారు పి.సుందరరావు, కార్యదర్శి ఎం.సాంబమూర్తి, కె.మాధవరావు, గ్రిగ్స్ సెక్రటరీ శ్రీనివాసరావు, ఎం.ఆనంద్కిరణ్, మెట్ట తిరుపతిరావు, పాతిన రమేష్కుమార్, ఢిల్లేశ్వరరావు, రాజశేఖర్, రాజగోపాల్, పీడీలు, రిఫరీలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు. శివాని ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖపట్నం–పశ్చిమగోదావరి జిల్లాలు తలపడ్డాయి. విశాఖపట్నం 123 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ ప్రకాశం – చిత్తూరు జిల్లాల మధ్య జరగగా.. ప్రకాశం జట్టు గెలుపొందింది. రెండో మ్యాచ్లో ఆతిథ్య శ్రీకాకుళం– వైఎస్సార్ కడప జిల్లాలు తలపడ్డాయి. శ్రీకాకుళం 83 పరుగులు చేయగా, కడప 32 పరుగులకే కుప్పలికూలింది. దీంతో సిక్కోలు బోణీ కొట్టినట్లయ్యింది. బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ గ్రౌండ్లో గుంటూరు–కర్నూలు జిల్లా జట్లు తలపడగా, గుంటూరు 19 పరుగులతో విజయం సాధించింది. -
బస్సులు ఆపడం లేదని విద్యార్థుల ఆందోళన
బూర్జ: లక్కుపురం కూడలిలో ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయడం లేదంటూ విద్యార్థులు సోమవారం ఆందోళనకు దిగారు. పాలకొండ– శ్రీకాకుళం రెండు వైపులా వెళ్లే బస్సులు ఆపి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బస్సులు ఆపకపోవడంతో శ్రీకాకుళం, ఆమదాలవలస, పాలకొండ వంటి సుదూర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సకాలంలో చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. లక్కుపురం కూడలికి సుమారు 10 గ్రామాల వారు వస్తారని, బస్సులు ఆపక అవస్థలు పడుతున్నామని వాపోయారు. విషయం తెలుసుకున్న బూర్జ ఎంపీపీ కర్నేన దీప విద్యార్థులతో మాట్లాడారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. స్థానిక ఎస్సై ఎం.ప్రవళ్లిక సిబ్బందితో చేరుకుని సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని చెప్పడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. రిమ్స్ ప్రిన్సిపాల్కే సూపరింటెండెంట్ బాధ్యతలు ● అమలు కాని మంత్రి అచ్చెన్న ఆదేశాలు శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ ఎస్.అప్పలనాయుడుకే సర్వజన ఆస్పపత్రి సూపరింటెండెంట్ బాధ్యతలను అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ సూపరింటెండెంట్గా నియమించింది. వాస్తవానికి కళాశాలను, ఆస్పత్రిని ఒకే వ్యక్తి పర్యవేక్షించడం కాస్త కష్టమైన పని. ఈ కారణంగానే వేరు వేరు పోస్టులు ఉన్నప్పటికీ ఒకరికే రెండు బాధ్యతలను అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదిలా ఉంటే, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు ఈ విషయంలో కూడా అమలు కాలేదు. ఇటీవల రిమ్స్ను తనిఖీ చేసిన మంత్రి.. ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ లుకలాపు ప్రసన్న కుమార్ను సూపరింటెండెంట్ పోస్ట్కు సిఫార్సు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఆ పోస్టు చేపట్టేందుకు ప్రసన్న కుమార్ సుముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఒప్పించారు. ఏ కారణంగానో ఈ ఆదేశాలు అమలు కాలేదు. రిమ్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ రద్దు చేయాలని చేసిన ఆదేశాల సైతం అమలు కాకపోవడం గమనార్హం. అయ్యప్ప భక్తులకు కేరళలో అన్నదానం సోంపేట: అయ్యప్పస్వామి మాలధారణ చేస్తున్న తెలుగు భక్తులకు కేరళలో అన్నదానం, ఇతర సౌకర్యాలు కల్పించడమే అఖిలభారత అయ్యప్ప చిన్ముద్రా సేవా ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు రుద్ర కోటేశ్వరరావు తెలిపారు. సోంపేట మండలం లక్కవరంలో అఖిలభారత అయ్యప్ప చిన్ముద్ర ట్రస్ట్, హరిహరపుత్ర చిన్ముద్రా సేవా ట్రస్ట్ లక్కవరం ఆధ్వర్యంలో అయ్యప్పస్వాముల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు అయ్యప్ప భక్తుల కోసం కేరళలో ఈ నెల 16 నుంచి ఉచిత అన్నదానం, అంబులెన్స్ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. హరిహరపుత్ర ట్రస్ట్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ సోంపేట, ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, మందస మండలాల పరిధిలోని అయ్యప్ప స్వాములు అన్నదానం కోసం 200 బస్తాల బియ్యం, రెండు క్వింటాళ్ల కందిపప్పు, క్వింటా పెసరపప్పు, క్వింటా చింతపండు, నగదు అందజేశారని వివరించారు. సమావేశంలో సుమారు 1200 మంది అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు. బీచ్లో నిబంధనలు పాటించాలి గార : కార్తీక మాస వన భోజనాలు (పిక్నిక్)లో భాగంగా సముద్ర తీర ప్రాంతాలకు వచ్చే సందర్శకులు విధిగా నిబంధనలు పాటించాలని, భద్రతా సిబ్బందికి సహకరించాలని కళింగపట్నం మైరెన్ స్టేషన్ సీఐ బి.ప్రసాదరావు అన్నారు. సోమవారం మొగదాలపాడు, శ్రీకూర్మం–మత్స్యలేశం, బలరాంపురం, పెద్ద గణగళ్లవానిపేట బీచ్ల్లో పర్యాటకులకు మైరెన్ విశాఖపట్నం రేంజ్ ఇన్చార్జి డీఐజీ గోపినాథ్ జెట్టి ఆదేశాల మేరకు అవగాహన కల్పించారు. మైపాడు బీచ్లో ఆదివారం స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతిచెందారని, అలాంటి ప్రమాదాలు జరగకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మద్యం తాగి సముద్రంలో స్నానాలు చేస్తే మూడురెట్లు నష్టం పెరుగుతుందన్నారు. జీవితం విలువలను తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత కేరింతలు పేరిట సమద్రపు నీటిలో దిగి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవుపలికారు. పౌర్ణమి, అమావాస్య రోజుల్లో సముద్రపు నీటి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, తీర ప్రాంత భద్రతా సిబ్బందికి సహకరించాలని కోరారు. -
ఆకాశవీధిలో అద్భుత అవకాశాలు
శ్రీకాకుళం న్యూకాలనీ: విమానయాన రంగంలో యువతకు ఉద్యోగ, ఉపాధికి కల్పించేందుకు గాను ప్రత్యేక శిక్షణ అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్)కళాశాల ప్రాంగణంలో ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులు చకచకా సాగుతున్నాయి. నైపుణ్యాలను మెరుగుపర్చేలా.. జిల్లా వాసులు ఏపనైనా ఇష్టంతో కష్టపడిపనిచేసే నైపుణ్యం, నేర్పరితనాన్ని కలిగి ఉన్నారనేది వాస్తవం. ముఖ్యంగా మహిళలు మరింత బాధ్యతాయుతంగా పనులు చేయడంలో దిట్టగా పేరందుకున్నారు. దీంతో జిల్లాలో మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకొని కలెక్టర్ ప్రత్యేక చొరవతో సివిల్ ఏవియేషన్ సహకారంతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు. శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో జిల్లా నలుమూలల నుంచి చదువుకునే విద్యార్థినులను దృష్టిలో ఉంచుకుని కాలేజీ కేంద్రంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. ఇది కేవలం మహిళలకు మాత్రమే ఉద్దేశించిన ప్రత్యేక శిక్షణ కేంద్రం. ఏడాదికి 240 మందికి శిక్షణ.. ఇక్కడ రెండు నెలల పాటు ఎయిర్లైన్స్ టికెటింగ్ అండ్ రిజర్వేషన్, ఎయిర్పోర్ట్ గ్రౌండ్ ఆపరేషన్స్(ప్యాసింజర్ అండ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్) వంటి కీలక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్క బ్యాచ్కు 30 మంది చొప్పున, ఒకే విడతలో 60 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధంగా సంవత్సర కాలంలో 240 మందికి నైపుణ్య శిక్షణ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కేంద్రానికి అవసరమైన సాంకేతికపరమైన పరికరాలు, ప్రయోగశాల సామగ్రిని సీఎస్ఆర్ నిధుల నుంచి సంబంధిత సంస్థ వారే సమకూర్చనున్నట్టు అధికారులు చెబుతున్నారు. పనులు పరిశీలించిన కలెక్టర్.. కళాశాల ప్రాంగణంలో ఏర్పాటుచేస్తున్న ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా మహిళలు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలు పొందేందుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. కలెక్టర్ వెంట ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సూర్యచంద్రరావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. సిక్కోలులో ఏవియేషన్ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా కేంద్రం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు ఏటా 240 మంది మహిళలకు శిక్షణ అందించేలా చర్యలు పనులు పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ -
మకాం మార్చేస్తాడు!
శ్రీకాకుళం క్రైమ్ : అతడి ఆయుధాలు రెండే రెండు.. ఒకటి వాహనాల పంచర్కు ఉపయోగించే లీవర్, రెండు ఐరన్ రాడ్డు. ఈ రెంటింటితోనే వందలాది ఇళ్లను దోచుకున్నాడు. తెలిసిన భాషలు బోలెడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, బెంగాళీ, ఒడియా, తమిళ్ వంటివన్నీ తెలుసు. కుటుంబమంతా ఎక్కడో కోల్కతాలో ఉంటుంది. ఏ మాత్రం ఖాకీల అలికిడి కనిపించినా అతడికి తెలిసిపోతుంది. మకాం మార్చేస్తాడు. అతడిపై 200 కేసులు ఉన్నాయి. మన జిల్లాలోనే వంద వరకు ఉన్నాయి. అతనే జిల్లాలోని మెళియాపుట్టి మండలం చాపరకు చెందిన దున్న కృష్ణ అలియాస్ రాజు అలియాస్ ప్రీతమ్ కిషన్ సింగ్. గత ఆరు నెలలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఆఖరుకు కృష్ణను పట్టుకుంటే తగిన పారితోషికం అంటూ ప్రజల్లోకి తాజాగా పోస్టర్ విడుదల చేశారు. సాధారణంగా దొంగలంతా ద్విచక్రవాహనాలు, కార్లు, ప్రైవేటు వాహనాలే ఉపయోగిస్తారు. ఇతగాడు మాత్రం బస్సులు, ఆటోలు, ట్రైన్లలో సాధారణ మనిషిలాగానే వస్తాడు. మాస్కులు పెట్టుకోడు. ముసుగు ధరించడు. దర్జాగా ఒకే ఏరియాలో వరుసగా ఐదారు ఇళ్లు ఎంచుకుని దోచేస్తాడు. అది కూడా పోలీసులు వేరే ప్రాంతాలకు బందోబస్తులకు వెళ్లేటప్పుడే. కృష్ణ మీద విజయవాడ, నెల్లూరు, అనకాపల్లి, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి వంటి అనేక ప్రాంతాల్లో కేసులున్నాయి. విజయవాడలో ఓ హెడ్కానిస్టేబుల్ కృష్ణను పట్టుకున్నందుకు ఇండియన్ పోలీస్ మెడల్ అతడిని వరించింది. కాళ్లు విరిగి నడవలేడులే అనుకుంటే.. శ్రీకాకుళం రూరల్ పరిధి విశాఖ–బి కాలనీలో చోరీ కేసులో కృష్ణ దొరికాడు. అదే కేసులో 2024 జనవరిలో బెయిల్ పొందిన కృష్ణ అంపోలు జైలు నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే అనకాపల్లి పోలీసులు అక్కడి చోరీ కేసు విషయమై అరెస్టు చేసేందుకు కాచుకుని ఉండటం గమనించిన కృష్ణ ఎదురుగా ఉన్న పెద్దగోడను దూకి కాళ్లు విరగ్గొట్టుకున్నాడు. పోలీసులు కూడా కాళ్లు విరిగాయి కదా చోరీలు చేయడులే అని అంతా భావించారు. మళ్లీ 2024 సెప్టెంబరు–అక్టోబరు పీరియడ్లో వరస నేరాలు మొదలుపెట్టాడు. జిల్లాకేంద్రంలోని పీఎన్కాలనీ పదోలైన్లో రిటైర్డ్ డీఎస్పీ భార్గవనాయుడుకు సంబంధించిన బంధువుల గెస్ట్హౌస్లో రూ. 6 లక్షలు కాజేశాడు. అదే కాలనీలో ఓ ఉపాధ్యాయ దంపతుల ఇంటిలో 13 తులాల వరకు చోరీ చేశాడు. అక్కడి నుంచి సుమారు 10 చోరీల్లో దాదాపు 80 తులాల నుంచి వంద తులాల బంగారం వరకు దోచేసినట్లు పోలీసువర్గాలు అంటున్నాయి. చివరిసారిగా ఈ నెల 16 రాత్రి కోర్టు పక్కనే ఓ నివాస గృహంలో 10 తులాల బంగారాన్ని చోరీ చేసినట్లు పోలీసుల సమాచారం. విశాఖలో ఫ్లైట్కు వెళ్లే సమయంలో ఎయిర్పోర్ట్ సీసీ ఫుటేజీలో చిక్కాడు. -
కలెక్టర్ గ్రీవెన్స్కు 92 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికకు సోమవారం 92 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారులు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తంలో వినతుల్లో రెవెన్యూ 40, మున్సిపల్ కార్పొరేషన్ 11, పంచాయతీరాజ్ 9, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రోవర్టీ 4, ఏపీఈపీడీసీఎల్ 4, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ 6, హౌసింగ్ 2, పౌర సరఫరాల శాఖ 2, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ 2, నైపుణ్యాభివృద్ధి 2, మైన్స్ అండ్ జియాలజి, వక్ఫ్ బోర్డు, ఆర్టీసీ తదితర శాఖల ఒక్కొక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. ● కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించి భరోసా కల్పించాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెలమల రమణ, పోలాకి ప్రసాదరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.చంద్రరావు, కె.మోహన్రావు వినతిపత్రం అందించారు. ● ఎచ్చెర్ల మండలం ముద్దాడ కొత్తపేట గ్రామాలకు, అనుబంధ గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని స్థానికులు కోరారు. ఇటీవల కురిసిన వర్షాలతో ముద్డాడ, కొత్తపేట, రుప్పపేట, సెగిడిపేట తదితర గ్రామాల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
తైక్వాండో పోటీల్లో ముగ్గురికి స్వర్ణ పతకాలు
ఇచ్ఛాపురం : ఇటీవల ఏలూరు, కడపలో జరిగిన రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడాపోటీలు (ఎస్జీఎఫ్) తైక్వాండో విభాగంలో ఇచ్ఛాపురం ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్ం సూర్యారావు సోమవారం తెలిపారు. అండర్–17 విభాగంలో ఆశి రెవంత్రెడ్డి, తిప్పన జీవన్రెడ్డి, అండర్–19 విభాగంలో చాట్ల గిరి స్వర్ణ పతకాలు సాధించారని చెప్పారు. వీరు ఈ నెల 7 నుంచి 10 వరకు జమ్మూకశ్మీర్లో జరగనున్న అండర్–19 జాతీయస్థాయి పోటీలకు, ఈ నెల 20 నుంచి 25 వరకు అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రం ఇటానగర్లో అండర్–17 జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, శారద, రంగారావు, ఉపాధ్యాయులు కామరాజు, సూర్యం, జయలక్ష్మి, ఎస్ఎంసీ ప్రతినిధులు ఆశా లతారెడ్డి, శ్రీధర్, గౌరీశంకర్, తైక్వాండో కోచ్ సీహెచ్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. జాతీయ సమైక్యత శిబిరానికి వర్సిటీ విద్యార్థులు ఎచ్చెర్ల : హర్యానాలో జరగనున్న జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొనేందుకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ విద్యార్థులు సోమ వారం పయనమయ్యారు. వివిధ రాష్ట్రాల్లోని సాంస్కృతిక, కళలు, క్రీడలు, అభిరుచులు వంటివి పరస్పరం పంచుకొని దేశ ఐక్యతలో యువతను భాగస్వామ్యం చేయడంలో భాగంగా జాతీయ స్థాయిలో ఈ నెల 4 నుంచి వారం రోజుల పాటు శిబిరం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు వర్సిటీ క్యాంపస్కు చెందిన ఎన్.త్రివేణి, కె.పవన్, జి.రవి, జి.శ్రావణి, ఎస్.సాయిప్రదీప్, ఎస్.భార్గవి, జి.చంద్రశేఖర్, పి.అభిషేక్, ఎస్.అంకిత, ఎం.పవిత్రలు ఎంపికయ్యారు. ఈ బృందానికి ఎన్ఎస్ఎస్ పీవో డాక్టర్ కె.కరుణానిధి నేతృత్వం వహి స్తున్నారు. వీరిని వీసీ రజనీ, రిజిస్ట్రార్ బి.అడ్డయ్య, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ డి.వనజ అభినందించారు. -
తుఫాన్ బాధిత రైతులను ఆదుకోవాలి
● పీజీఆర్ఎస్లో వైఎస్సార్ సీపీ నాయకుల వినతి శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్ వర్షాల వల్ల జిల్లా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని.. శ్రీకాకుళం, గార మండలాలు తీర ప్రాంతంలో ఉన్నందున వరి, అరటి వంటి పంటలు నేలమట్టమయ్యాయని, తక్షణమే బాధిత రైతులను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్నాయుడు, శ్రీకాకుళం రూరల్ మండల పరిషత్ అధ్యక్షులు అంబటి నిర్మల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రుప్ప దివ్య శ్రీధర్, గార మండల పరిషత్ అధ్యక్షులు గొండు రఘురాం, జెడ్పీటీసీ మార్పు సుజాత తదితరులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఖరీఫ్ పంట చేతికి అందిన సమయంలో మోంథా తుఫాన్ వచ్చి వరి, అరటి వంటి పంటలను పూర్తిగా నాశనం చేసిందన్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి దాపురించిందన్నారు. ఇప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదని, వాస్తవిక నష్టాలను అంచనా వేయలేదని చెప్పారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాజకీయాలకు అతీతంగా నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇప్పించాలని కోరారు. కార్యక్రమంలో మార్పు పృథ్వీరాజ్, రౌతు శంకరరావు, పీసీ గోపి, శ్రీహరి, ముంజేటి కృష్ణ, రుప్ప అప్పలసూరి, నరేంద్ర, సుగునా రెడ్డి, యు.కృష్ణారావు, శీర సత్యనారాయణ, సర్పంచ్లు, ఎం.పి.టి.సిలు, రైతులు పాల్గొన్నారు. -
శ్రీముఖలింగంలో పటిష్ట బందోబస్తు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయి భద్రతకు సుమారు 50 మంది పోలీసులను వినియోగించామని జలుమూరు ఎస్ఐ బి.అశోక్బాబు తెలిపారు. ‘శ్రీముఖలింగంలో భక్తులకు భద్రత ఏదీ..? అన్న శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. నరసన్నపేట సీఐ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం సజావుగా జరిపించామని పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణ ద్వారం వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు. -
భూముల రీసర్వేపై సమీక్ష
శ్రీకాకుళం పాతబస్టాండ్: భూముల రీ సర్వేలో భాగంగా జరుగుతున్న జాయింట్ ఎల్పీఎం(ఉమ్మడి సరిహద్దు) సమస్యలను నవంబర్ 25 నాటికల్లా పరిష్కరించాలని సర్వే, ల్యాండ్ రికార్డులు ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు సి.హెచ్.వి.ఎస్.ఎన్.కుమార్ ఆదేశించారు. రెండు రోజులుగా జిల్లాలో విస్తృతంగా పర్యటించిన ఆయన రీసర్వే పనుల నాణ్యత, పురోగతిపై శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలోడిప్యూటీ తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దశల్లోనూ రికార్డులను తనిఖీ చేసి నూరు శాతం కచ్చితత్వం సాధించాలన్నారు. భూ యజమానులకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా క్షేత్రస్థాయిలో సర్వే పనులు నిర్వహించాలన్నారు. మొదటి, రెండవ విడతల్లో మిగిలిన పనులను నిర్ణీత గడువు ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెవెన్యూ భూముల సరిహద్దులు నిర్ణయించే పనిని కూడా ఈ నెల 15కల్లా పూర్తి చేయాలన్నారు. -
జవాన్ సేవలకు ప్రశంసలు
ఇచ్ఛాపురం: ఇండియన్ ఆర్మీలో చేరి దేశరక్షణతో పాటు ప్రజాసేవచేయడం వల్ల డిప్యూటీ చీఫ్ ఆర్మీ అధికారి నుంచి ప్రశంసా పత్రాన్ని పట్టణానికి చెందిన ఆర్మీజవాన్ ధర్మాల నూకరాజు అందుకున్నాడు. పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్ ధర్మాల నూకరాజు అతని యూనిట్తో పాటు 2023లో ఈశాన్య రాష్ట్రం సిక్కింలో విధులు నిర్వహించాడు. ఆ ఏడాది అక్టోబర్లో హిమనదీయ సరస్సుకి వచ్చిన వరదల కారణంగా సరస్సు పై నిర్మించిన చుంగ్తాంగ్ డ్యామ్ కొట్టుకు పోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు నిరాశ్రయులయ్యారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్మీయూనిట్ రిస్కీ ఆపరేష్ నిర్వహించి సహాయ సహకారాలు అందించారు. జవాన్లు చేసిన సేవలను గుర్తించిన డిప్యూటీ చీఫ్ ఆప్ ఆర్మీ ఆదివారం ప్రశంసాపత్రాన్ని సీఓ రాహుల్సింగ్ ద్వారా బెంగాల్ ఆర్మీ యూనిట్ వద్ద అందజేసినట్లు జవాన్ తెలిపారు. -
పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలి
టెక్కలి రూరల్ : పెన్షన్లు లేక ఇటీవల రిటైరైన ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం స్పందించి పాత పింఛన్ విధానం పునరుద్ధరించాలని ఏపీ సీపీఎస్ ఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు చల్ల సింహాచలం డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోరుతూ ఆదివారం టెక్కలిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నాలుగు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్ అంధకారంలో ఉందన్నారు. కొన్ని సంఘాలు జీపీఎస్, యూపీఎస్ ప్రపంచంలోనే అత్యున్నతమైనవంటూ ప్రశంసించడం దారుణమన్నారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారుడు బి.బాలకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అంపోలు షణ్ముఖరావు, కృష్ణ, రోహిణేశ్వరరావు, చక్రవర్తి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
కవిటి: మండలంలోని జగతి హనుమాన్ జంక్షన్ సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గొడివాటి శివాజీ(25) అనే యువకుడు దుర్మరణం చెందాడు. కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపిన వివరాల ప్రకారం.. శివాజీ భారత్ గ్యాస్ ఏజెన్సీలో మెకానికల్ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కవిటి నుంచి సోంపేట రోడ్డులో వెళుతుండగా జగతి గ్రామం మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడిపోవడంతో పడి చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వెల్లడయ్యాక పూర్తివివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. శివాజీ స్వగ్రామం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెద్దమానాపురం. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ రవివర్మ తెలిపారు. -
రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కులనిర్ములనా పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెలన 16న ‘భారత రాజ్యాంగం – రాజ్యాంగ వ్యవస్థల కాషాయకరణ’ అనే అంశంపై రాష్ట్రస్థాయి సదస్సు శ్రీకాకుళం అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్క కృష్ణయ్య తెలిపారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలోని ఆదివారంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో హాజరై సదస్సును విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సమితి జిల్లా సహాయ కార్యదర్శి రాకోటి రాంబాబు, డి.గణేష్, నేతల అప్పారావు, యడ్ల జానకిరావు, బోనెల చిరంజీవి, చంద్రమౌళి, అనిల్, రామారావు, కై లాష్, అప్పన్న, శ్రీను పాల్గొన్నారు. -
పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
శ్రీకాకుళం అర్బన్: కార్తీకమాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం ఒకటో డిపో మేనేజర్ హనుమంతు అమరసింహుడు కోరారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సును శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీకమాసంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. సోమవారం పంచారామాలను దర్శించుకుని మరలా మంగళవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుతుందని వివరించారు. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలోని శివాలయాలను దర్శించుకోవచ్చన్నారు. ఈ నెల 9, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతామన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్ తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు 99592 25608, 99592 25609 నంబర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, అధికారులు రాజు, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు. -
భక్తులకు భద్రత ఏదీ..?
శ్రీముఖలింగంలో ..జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగంలో కార్తిక మాసంతోపాటు శివరాత్రి ఉత్సవాలకు వేల సంఖ్యలో స్వామిని దర్శించుకుంటారు. కానీ ఇక్కడ కూడా భక్తుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. స్వామిని దర్శించుకున్న భక్తులు బయటకు రావాలంటే దక్షిణ మార్గం ఒక్కటే ఉంది. ఇంత వరకూ బాగున్నా ఇదే మార్గం ద్వారా దేవదాయ శాఖ, పోలీసు, రాజకీయ ప్రముఖలు, ఉన్నతాధికారులు, అర్చక కుటుంబాలు, మీడియా ప్రతినిధులు అలాగే ఇతర చోటామోటా నాయకులను కూడా ఆలయం లోపలకు పంపిస్తారు. స్వామి దర్శనం చేసుకున్నాక ఇదే మార్గం ద్వారా భక్తులు బయటకు రావాలి. దీంతో ఇక్కడ తోపులాటలకు అవకాశం ఉంటుంది. కాశీబుగ్గ ఘటనతో భక్తుల్లో ఆందోళన కాశీబుగ్గ వేంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో సుమారు తొమ్మిది మంది భక్తులు మృతి చెందడం, పలువురికి తీవ్రగాయాలు కావడంతో శ్రీముఖలింగం ఒక్కసారి ఉలిక్కిపడింది. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంలో ఎలాంటి అభివృద్ధి పనులు, మరమ్మతులు జరగాలన్నా ఆ శాఖ ఉన్నతాధికారులు కేంద్ర కార్యాలయం నుంచి అనుమతులు తెచ్చుకోవాలి. అయితే ప్రస్తుతం స్వామివారి దర్శనం అనంతరం భక్తులు బయటకు వెళ్లేందుకు మరో మార్గం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయ పడుతున్నారు. లేదా దక్షిణ ద్వారం నుంచి ఎవరినీ పంపించకుండా చూడాలని కోరుతున్నారు. -
రేపు సిరిమాను చెట్టుకు బొట్టు
అరసవల్లి: అరసవల్లి, కాజీపేట గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి సిరిమానోత్సవ సంబరాల్లో భాగంగా సిరిమాను చెట్టుకు బొట్టు పెట్టే కార్యక్రమం ఈ నెల 4న ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. గ్రామపెద్దల సమక్షంలో ఆలయ కమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు ముర్రాటలతో ఉదయం 7 గంటల నుంచి బయలుదేరి వెలమ వీధిలో వెలిసిన దుర్గమ్మ మట్టి (ఆలయం) వద్ద నుంచి నీలమ్మ గుడి, కాపువీఽధి శ్యామలాంబ గుడి, సింహద్వారం వద్ద ఎర్రిమ్మ గుడి స్థానం వద్ద నుంచి అసిరితల్లి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అక్కడ నుంచి సంబరంగా ముర్రాటలతోనే సిరిమాను చెట్టు ఉన్న పెద్ద తోటకు చేరుకుంటారు. సంప్రదాయం ప్రకారం తొలిముర్రాటను సోను రాములు కుటుంబీకులు సమర్పించనున్నారు. ఉత్సాహంగా కబడ్జీ జట్ల ఎంపిక శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సబ్ జూనియర్స్ బాలబాలికల కబడ్డీ ఎంపికలు ముగిశాయి. జిల్లా కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఉన్న డీఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ పోటీలకు 74 మంది బాలికలు, 129 మంది బాలురు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా తుది జట్లను ఎంపికచేస్తామని జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షుడు నక్క కృష్ణారావు, ప్రధాన కార్యదర్శి సాదు ముసలినాయుడు తెలిపారు. ఎంపికచేసిన జిల్లా జట్లను ఈ నెల 7 నుంచి 9 వరకు కర్నూలు జిల్లాలో జరగనున్న 35వ ఏపీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ చాంపియన్షిప్ – 2025–26లకు పంపించనున్నట్టు జిల్లా కార్యనిర్వాహాక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో కబడ్డీ శిక్షకులు సింహాచలం, ఝాన్సీ, సంఘ కోశాధికారి నాగాల రమేష్, సంఘ ప్రతినిధులు రవికుమార్, తవిటమ్మ, సాగర్, అప్పనమ్మ, వెంకట రమణ, శ్యాం, లక్ష్మీనారాయణ, యోగి, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్యుని దేవేరులకు బంగారు పుస్తెలు వితరణ అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవేరులైన ఉషా పద్మిని ఛాయాదేవేరులకు బంగారు పుస్తెలను నగరానికి చెందిన పొడుగు వెంకట సూర్యప్రభాకరరావు, వెంకట రాజేష్ఖన్నా, కరుణాకరరావు కుటుంబసభ్యులు విరాళంగా సమర్పించారు. 29 గ్రాముల 820 మిల్లీగ్రాముల బంగారు శతమానాలతో కూడి న మూడు పుస్తెల తాళ్లను ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మలకు దాతలు అందజేశారు. కల్యాణ సేవల్లో పుస్తెలను వినియోగించాలని దాతలు కోరారు. అనంతరం ఈవో మాట్లాడుతూ దాతల సహకారం గొప్పదని, రథసప్తమి వంటి విశేష పర్వదినాల్లో పాసులు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో విశ్రాంత తహశీల్దార్ పొడుగు వెంకట శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు. సముద్రంలో బోటు మునక సోంపేట: ఉప్పలాం పంచాయతీ ఎకువూరు సముద్రతీరంలో ఆదివారం మధ్యాహ్నం బోటు మునిగిపోయింది. గ్రామానికి చెందిన రెండు బోట్లు సముద్రంలో వేటకు వెళ్లాయి. మత్స్యకారులు వేట ముగించుకుని తిరిగి వస్తుండగా కె.గోపాల్కు చెందిన బోటు తీరానికి వంద మీటర్ల దూరంలో మునిగిపోయింది. మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం జరిగిందని మత్స్యకారులు తెలుపుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు ‘మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్’లో నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవాలంటే 1100కు నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. చెరువులో పడి వ్యక్తి మృతి పాతపట్నం: గొల్లపేట గ్రామానికి చెందిన మెట్టు చిన్నారావు (59) చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగువాడ పంచాయతీ గొల్లపేటకు చెందిన మెట్టు చిన్నారావు బడ్డుమర్రి గోపాలపురంలో బంధువులు మృతి చెందడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కృష్ణసాగరం చెరువులో స్నానానికి దిగతుండగా కాలుజారి పడిపోయాడు. ఊపిరాడక మృతి చెందాడు. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పాతపట్నం సీహెచ్సీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారావుకు భార్య చిన్నమ్మడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా సతీష్ టెక్కలి: ౖవెఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం కోటపాడుకు చెందిన కోత సతీష్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో యువజన విభాగంలో కీలకంగా సేవలు అందజేసిన సతీష్కు మరళా అదే విభాగానికి రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. తనపై ఎంతో నమ్మకంతో నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు నేతృత్వంలో బాధ్యతలు అప్పగించారని, పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని సతీష్ పేర్కొన్నారు. పాఠ్య పుస్తక రచనకు ఎంపిక జి.సిగడాం : బూటుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు డాక్టర్ కూర్మాన అరుణకుమారి పాఠ్యపుస్తక రచనకు ఎంపికైనట్లు ఎంఈఓలు అరసాడ రవి, ముళ్లు శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. విజయవాడలో ఈ నెల 3 నుంచి నిర్వహిస్తున్న రచనా ప్రక్రియకు ఈమె హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అరుణకుమారిని ఉపాధ్యాయులు అభినందించారు. -
భక్తిశ్రద్ధలతో పొలికోత ఉత్సవం
గార: క్షీరాబ్ది ద్వాదశి పురస్కరించుకొని శ్రీకూర్మనాథాలయంలో పొలికోత ఉత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయం నుంచి శయనబేరం, అమ్మవార్లు పల్లకిపై గ్రామ శివారులోని ప్రత్యేక మంటపం వద్దకు చేరుకున్నాయి. ప్రత్యేక పూజలనంతరం అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు, స్థానాచార్యులు శ్రీభాష్యం పద్మనాభాచార్యులు సంప్రదాయ పద్ధతిలో వరి కోతలు ప్రారంభించారు. అయితే, మంటపం వద్దకు వెళ్లేందుకు అర్చకులు, భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. సరైన దారి లేక బురదలోనే నడిచి వెళ్లాల్సి వచ్చింది. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు కై బాడి కుసుమకుమారిరాజు, మంటప నిర్మాణదారు శంభుమహంతి వెంకట అసిరిరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, ద్వాదశి పర్వదినం పురస్కరించుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీకూర్మనాథాలయం భక్తులతో కిటకిటలాడింది. వైఎస్సార్ సీపీ నాయకుడు యాళ్ల నారాయణమూర్తి రెండు వేల మందికి దద్దోజనం ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మణి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్గేమ్స్ స్టేట్మీట్పై నీలిమబ్బులు
శ్రీకాకుళం న్యూకాలనీ: సిక్కోలు వేదికగా జరిగే స్కూల్గేమ్స్ స్టేట్మీట్ క్రికెట్ టోర్నీపై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం మైదానం, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాల వేదికగా ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్గేమ్స్ అండర్–19 బాలబాలికల క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల 3 నుంచి 8 వరకు జరగనున్న సంగతి తెలిసిందే. మొదటి మూడు రోజులు బాలురుకు, తర్వాత మూడు రోజులు బాలికలకు పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరగనుంది. అయితే మోంథా తుఫాను అనంతరం చిత్తడిగా మారిన మైదానాలను నిర్వహకులు వాయువేగంతో సిద్ధంచేసినా ఆదివారం మరోసారి వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. సాయంత్రం వర్షం కురవడంతో మైదానాలు చిత్తడిగా మారడంతో నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మైదానాలుగా ఎచ్చెర్లలోని వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ క్రీడా మైదానం, శ్రీశివానీ ఇంజనీరింగ్ కళాశాల మైదానాలను పరిశీలిస్తున్నారు. జిల్లాకు చేరుకుంటున్న క్రీడా జట్లు.. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు జట్లు జిల్లాకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, గుంటూరు, కృష్ణ తదితర జట్లు జిల్లాకు చేరుకున్నాయి. మిగిలిన జట్లు రాత్రికి, సమీపంలోని జట్లు సోమవారం ఉదయానికి చేరుకుంటాయి. క్రీడాకారులకు బలగ మున్సిపల్ హైస్కూల్, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో బస కల్పిస్తున్నారు. రిఫరీలు, టెక్నికల్ అఫీషియల్స్ సైతం జిల్లాకు చేరుకున్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు నేతృత్వంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య, ఎం.తిరుపతిరావు, ఎం.ఆనంద్కిరణ్, ఢిల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, నిర్మల్కృష్ణ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. కర్నూలుకు చెందిన రాజేష్ గోల పరిశీలకులగా హాజరయ్యారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు కేఆర్ స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి. -
ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే
శ్రీకాకుళం అర్బన్: కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు చొప్పున ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద కాశీబుగ్గ ఘటనలో చనిపోయినవారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు. ఇందులో రాజకీయాలు చూడకూడదని, మానవతా దృక్పథంతో ఆలోచించాలని, మీరిచ్చే డబ్బులు లేదా మేమిచ్చే డబ్బులు వల్ల బాధిత కుటుంబాలను ఆదుకోలేమని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నిధుల నుంచి చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రధాని కూడా రూ.2లక్షలు ప్రకటించారని, చంద్రబాబు కూడా ప్రకటించిన రూ.15లక్షలకు మరో రూ.10లక్షలు ప్రకటించాలని పార్టీ తరఫున విన్నవిస్తున్నామ ని అన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ తదితరులు మాట్లాడుతూ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. కూటమి ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా పాలన సాగిస్తోందన్నారు. చంద్రబాబు పాలనలో హిందూ దేవాలయాలకు, భక్తులకు భద్రత లేకుండా పోయిందన్నా రు. ఈ కొవ్వొత్తుల ర్యాలీకి ముందుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ బ్యానర్ ఉందని, దీన్ని తీసివేయాలని చెబుతూ శ్రీకాకుళం 2వ పట్టణ సీఐ ఈశ్వరరావు ఆ బ్యానర్ను తీసుకున్నారు. అయితే ధర్మాన కృష్ణదాస్ వచ్చి సీఐతో మాట్లాడినప్పటికీ ఆ బ్యానర్ సీఐ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆ బ్యానర్లో ఏం తప్పు ఉందో చూపాలని సీఐను కృష్ణదాస్ నిలదీయగా అటు తర్వాత బ్యానర్ను సీఐ ఇచ్చారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్సీపీ నాయకులు కిల్లి వెంకట సత్యన్నారాయణ, మామిడి శ్రీకాంత్, ఎంవీ పద్మావతి, అంధవరపు సూరిబాబు, గొండు రఘురాం, ఎన్ని ధనుంజయరా వు, ముంజేటి కృష్ణ, బొడ్డేపల్లి పద్మజ తదితరులు పాల్గొన్నారు. -
16 నెలల్లో వరుస దారుణాలు
చంద్రబాబు పాలనలో వరుస దారుణాలు జరుగుతున్నాయని బొత్స గుర్తు చేశారు. చంద్రబాబు దేవుడు పేరు ఎత్తిన ప్రతి సారి ఏదో ఒకటి జరుగుతోందన్నారు. ఆయనకు దేవుడిపై విశ్వాసం లేదన్నారు. లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీ వంటివాటిపై లేనిపోని మాటలు ఆడి ఎదుటి వారిపై బురద జల్లితే అనర్థాలు జరుగుతాయన్నారు. పలాస–కాశీబుగ్గలో సంఘటన జరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ప్రజల వద్ద ఉండకుండా భజన పరుల్లా తబలాలు వాయిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్ను సైతం తరిమేశామంటూ చంద్రబాబును క్రియేట్ చేయడం సిగ్గుచేటన్నారు. పరిపాలన చేతకాకపోతే అఖిలపక్షం నాయకులను కూర్చోబెట్టి మాట్లాడించాలని సూచించారు. ఆలయానికి తాళం పడింది. ఆవరణ అంతా నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రాంతమంతా పోలీసుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. బాధిత కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. కన్నీళ్లు ప్రవహిస్తున్న ఆ ఇళ్ల వాకిళ్లకు పరామర్శలు, పరిహారాలు, ఓదార్పులు కాసింత ఊరటనిచ్చాయి. వైఎస్సార్ సీపీతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులు క్షతగాత్రులతో పాటు బాధిత కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆస్పత్రులకు కూడా వెళ్లి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఈ ఘటన వెనుక నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం రూరల్: పలాస–కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘటన అత్యంత బాధాకరమని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమన్నారు. దీనిపై వెంటనే జ్యుడీషియల్ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న వారి కి నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ఇచ్చిన ఎక్స్గ్రేషియా రూ.25 లక్షలు వరకూ పెంచాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియా అందిస్తున్నట్లు ప్రకటించారు. సంఘటన జరిగిన రోజు సీఎం చంద్ర బాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం సబబు కాదని ఆయన అన్నారు. తాను నిమిత్తమాత్రుడినని, ప్రైవేట్ ప్రాపర్టీ ఆలయాలకు తమకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో రామాలయాలు, అమ్మవారి ఆలయాల్లో ఏవైనా ఘటనలు జరిగితే ఇలాగే మాట్లాడతారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా అని ప్రశ్నించారు. ఓ పత్రికలో ప్రభుత్వ వైఫల్యం అని ప్రస్తావించారని, పెద్ద ఎత్తున భక్తులు వస్తార ని సమాచారం ఉన్నా, ఎందుకు బందోబస్తు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. కలెక్టర్ సైతం బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పార్లమెంటరీ పరిశీలకులు కుంభా రవిబాబు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు పిరియా విజయ, మజ్జి శ్రీనివాస రావు, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవి, విజయనగరం పార్లమెంటరీ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, పార్టీ సామాజిక వర్గాల రాష్ట్ర అధ్యక్షులు అంధవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, దుంపల లక్ష్మణరావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పాలిల శ్రీనివాస్, గొండు కృష్ణ, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, జెడ్పీటీసీ టొంపల సీతారాం, పిన్నింటి సాయికుమార్, రాష్ట్ర మేధావుల ఫోరం ప్రతినిధి పిల్లల రామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయ, జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు బొడ్డేపల్లి పద్మజ, మండలాధ్యక్షుడు చిట్టి జనార్దన్రావు, సర్పంచ్ గేదెల శంగల్వరావు, పార్టీ నాయకులు యజ్జల గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
కమిటీ వేశాం
దేవాలయం వద్ద సమాచారం ఇవ్వడానికి ఎవరూ లేరు. ఘటనపై విచారణకు కమిటీ వేశాం. ఆలయ సంప్రోక్షణ జరిగాక మళ్లీ తెరవాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా ప్రతి దేవాలయం వద్ద కూడా భక్తుల సౌకర్యార్థం తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడి ఆలయ నిర్మాణంలో సరైన ఇంజినీర్లు, వేదపండితులు సలహాలు సూచనలు కనిపించలేదు. – ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఎప్పుడూ రెడ్బుక్ ధ్యాసేనా..? రాష్ట్రంలో రెడ్బుక్ రా జ్యాంగం అమలుపై మాత్రమే ధ్యాస ఉన్నట్టుంది. సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే మర్యాదగా తప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఆర్టీజీఎస్, చంద్రబాబు తుఫాన్ కట్టడి చర్యలు ఈ సంఘటనలో ఏమయ్యాయి. ఆలయ ధర్మకర్తపై కేసులు కట్టేందుకు ప్రయ త్నించడం కేవలం చేతకానితనం. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ ప్రభుత్వ వైఫల్యమే కాశీబుగ్గ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణం. చంద్రబాబు నాయుడికి ప్రజల ప్రాణాలు అంటే లెక్క లేకుండా పోయింది. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై, నాయకుల పైన కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రక్షణ కల్పించడంలో లేదు. కూట మి అధికారంలోకి వచ్చాక ఇప్పటికే తిరుపతి, సింహాచలం వంటి వాటితో పాటు కాశీబుగ్గలో జరిగిన సంఘటన మూడోది. కమిటీలతో కాలయాపన చేయడం కంటే భక్తులకు రక్షణ కల్పించడంలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తంచేయాలి. – కుంభా రవిబాబు, పార్టీ పార్లమెంటరీ పరిశీలకుడు ఎందరిపై చర్యలు తీసుకున్నారు తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇప్పటికే ఏడాదిన్నర పాలనలో అన్ని రకాలుగా వైఫల్యం చెందారు. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. – ధర్మాన కృష్ణదాసు, మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నిర్లక్ష్యమే.. గతంలో చంద్రబాబు ఓవరాక్షన్ వలన పుష్కరాల్లో ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. – తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త ఊరుకునేది లేదు సమగ్ర విచారణ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుంది. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఇలాంటి సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దినాలలో ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. – పీవీఎన్ మాధవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వివరాలు సేకరిస్తున్నాం తొక్కిసలాటకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దీనిపై అసత్య స మాచారం వ్యాప్తి చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి పోస్టులు, వీడియోలు, వ్యాఖ్యలు చేస్తున్న వారి వివరాలు సేకరిస్తున్నాం. – గోపినాథ్ జెట్టి, విశాఖ రేంజి డీఐజీ టెక్కలి: కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో భక్తులు తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటి వరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు. పరి శీలనకు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులను కూడా అడ్డుకుని తర్వాత వదిలారు. ‘దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చే యాలని కోరుకున్నాను. ఇలా జరిగితే నేనేంచేస్తాను. ఇలా జరిగిందని కేసులు కడితే నా మీ ద ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి’ అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా అన్నారు. -
ఆలయం మళ్లీ తెరుస్తా.. పది కేసులు పెట్టుకోండి: పండా
టెక్కలి: తొక్కిసలాట నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయంతో పాటు ధర్మకర్త హరిముకుంద పండా ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఆలయ ప్రధాన గేటు నుంచి తోటలో ధర్మకర్త ఇంటివరకు పోలీసులు మోహరించి పండాను బయటకు వెళ్లనీయకుండా ఆంక్షలు విధించారు.ఆలయ సంప్రదాయం ప్రకారం పండా ప్రతిరోజూ ఆలయంలో దీపం పెట్టే ఆనవాయితీ ఉంది. పోలీసులు అడ్డుకోవడంతో ఆలయంలో ఆదివారం దీపం పెట్టే అవకాశం దక్కలేదు. పోలీసులు అతడి ఇంటిని అష్ట దిగ్బంధం చేయగా.. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఘటనలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనబడుతుంటే.. ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదంటూ ఇప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.10 కేసులు పెట్టుకోండి: పండా‘దేవుడికి గుడి కట్టాను. అందరూ రావాలి. పూజలు చేయాలని కోరుకున్నాను. ఇలా జరిగితే నేనేం చేస్తాను. కేసులు కడితే నా మీద ఒకటి కాదు 10 కేసులు పెట్టుకోండి’ అని ఆలయ ధర్మకర్త హరిముకుంద పండా సమాధానమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయాలు పాలవడంపై పండా కన్నీళ్లు పెట్టుకున్నారు. చెడ్డపని చేస్తే అనుమతి కావాలి తప్ప.. మంచి పనికి కాదన్నారు. ‘అమ్మ కోరికతో తాహతుకు మించి డబ్బులు పెట్టి గుడి కట్టాను. అంతా శ్రీనివాసుడే చూసుకుంటాడు. ఇక్కడ పోలీసులు ఎవరూ ఉండొద్దు. వారికి ఇక్కడ ఏం పని అందరూ వెళ్లిపోండి. నేను గుడి తలుపులు తీస్తాను’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. -
రోదన ఆగేనా..?
మార్చురీ వద్ద నిఖిల్ తండ్రి రోదన (ఫైల్)కాశీబుగ్గ చినతిరుపతి దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతి చెందాడు. నిఖిల్ తల్లి అను ఆది వారానికి ఇంకా స్పృహలోకి రాలేదు. నిఖిల్కు చిన్నతనం నుంచే భక్తి ఎక్కు వ. ఆరేళ్లుగా బాలుడు కార్తీక సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. శనివారం వేకువ జామున కూడా గ్రామంలోని భక్తులందరితో కలిసి నమఃశివాయ సంకీర్తన చేశాడు. అనంతరం జింకిభద్ర గ్రామంలో ప్రైవేటుకు వెళ్లి టీచర్ను అడిగి వేగంగా వచ్చాడు. కానీ గుడిలో జరిగిన దుర్ఘటనలో చిక్కుకుని చనిపోయాడు. ఆలయంలోనూ ఘటనకు ముందు స్టీలు గ్రిల్ మీద బాలుడు కూర్చుని ఉండగా దిగురా అని తల్లి చెబుతూనే ఉంది. అంతలోనే తొక్కిసలాట జరగడం, బాబు పడిపోవడం అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. బాబుతో పాటు తల్లి కూడా స్పృహ తప్పి పడి పోయింది. పది నిమిషాల్లో మేలుకొని చూ సేసరికి కొద్దిగా దూరంలో బా బు పడి ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్దామని కనిపించిన వారి కాళ్లు పట్టి బతిమలాడింది. కా నీ అక్కడ ఎవరి బాధలో వారు ఉన్నారు. అక్కడే బాలుడు ఊ పిరి వదిలేశాడు. ఊరు ఇంకా బాలుడినే తలచుకుంటోంది. –సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళంపొద్దు పొడిచింది.. వాకిలి వరకు వచ్చిన వెలుగు ఆ ఇంటి చీకటిని దాటలేకపోయింది.. కంటి నిండా కన్నీరు.. ఇంటి నిండా నిశ్శబ్దం ఏకాదశి విషాదం మిగిల్చిన ఆనవాళ్లు ఇవి.. చిన్నప్పటి నుంచి బిడ్డను మోసిన ఆ తండ్రి భుజం నేడు వాలిపోయింది.. కన్నపేగు చేతిని తడిమి తడిమి చూసిన తల్లి కడకొంగు కన్నీటితో బరువెక్కింది.. వాడు ఇక అమ్మా అని పిలవడు.. నాన్నా అని అరవడు.. దేవుడి దర్శనానికి వెళ్తే మిగిలిన చేదుకు నిదర్శనాలివి.. దేవుడిని చూసి తరిద్దామనుకున్నారు.. శ్రీవారి సేవలో మురిసిపోదామని తలిచారు.. కంటికి ఎదురుగా కన్నపేగు శవాన్ని చూడలేక తల్లడిల్లిపోయారు.. పుణ్యం కోసం వెళ్తే కలిగిన శోకమిది.. ఎందుకీ పుణ్యం ఇంత భారమైంది? ఎందుకీ దర్శనం ఇంత దూరమైంది? దైవం ఎదురుగా నిలబడితే.. మృత్యువు కౌగిలించుకుంది కారణం ఏమై ఉంటుందో కాలమే చెప్పాల్సి ఉంది. -
ఐక్యతతోనే హక్కుల సాధన
శ్రీకాకుళం: బీసీ ఉద్యోగుల ఐక్యత.. రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న రాష్ట్ర బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు గుత్తుల వీరబ్రహ్మం, పక్కి భూషణరావు చెప్పారు. ఆదివారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో జిల్లా బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. రాష్ట్ర కమిటీ ప్రతినిధి పి.రామచంద్రరా వుఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈ సందర్భం వీరబ్రహ్మం మాట్లాడుతూ డిసెంబర్లో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి బీసీ, ఓబీసీ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో భారీసదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు ఐదు లక్షల మంది బీసీ, ఓబీసీ ఉద్యోగు లు ఉన్నారని.. వీరి సంక్షేమానికి పెద్దపీట వేయా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డాక్టర్ చింతాడ రాజశేఖరరావు, అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ వై.పోలినాయుడు, ప్రధాన కార్యదర్శిగా బల గ మల్లేశ్వరరావులను ఎన్నుకున్నారు. మిగిలిన వారి ని వారం రోజుల్లో ఎంపిక చేసి రాష్ట్ర కమిటీకి పంపిస్తామని జిల్లా బీసీ ఉద్యోగ సంఘాల నేత డాక్టర్ దువ్వు చక్రపాణి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘాల నేతలు వై.శంకరరావు, పి. బాలభాస్కరరావు, వి.కామేశ్వరరావు, జె.రామకృష్ణరావు, ఇ.ఎ.ప్రదీప్కుమార్ పాల్గొన్నారు.నూతన కమిటీ ప్రతినిధులను రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షుడు శాసపు జోగినాయుడు అభినందించారు. -
ఉత్తమ ప్రతిభ కనబరచాలి
ఎచ్చెర్ల : క్రీడల్లో మరింతగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆర్టీయూకేటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేవీజీడీ బాలాజీ ఆకాంక్షించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎస్.జి.ఎఫ్ సెలక్షన్లో పాల్గొని ఎంపికై ఈ నెల 3 నుంచి 6 వరకూ జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎస్.జి.ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్లో అండర్–19 శ్రీకాకుళం జిల్లా జట్టు తరఫున ట్రిపుల్ ఐటీ విద్యార్థి సాయిగణేష్ ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని డైరెక్టర్ ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో ఏవో ముని రామకృష్ణ, డీన్ డాక్టర్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి డాక్టర్ వాసు, వెల్ఫేర్ డీన్ డాక్టర్ గేదెల రవి, ఇన్చార్జి సాగర్, టి.దిలీప్కుమార్, కృష్ణంరాజు పాల్గొన్నారు. -
ముగిసిన స్కూల్గేమ్స్ జూడో ఎంపికలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ జూడో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా జూడో అసోసియేషన్ సౌజన్యంతో జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో జరిగిన ఈ ఎంపికలకు 100 మంది బాలబాలికలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు మాట్లాడుతే పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణ, కఠోర సాధన అలవర్చుకోవాలని సూచించారు. రాష్ట్రపోటీల్లో రాణించి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. జిల్లా పీఈటీ సంఘ నాయకుడు, జూడో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొజ్జాడ వెంకటరమణ మాట్లాడుతూ గత ఏడాది స్కూల్గేమ్స్ జూడో పోటీల్లో పతకాలు పంట పండించారని.. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో రాణించి పతకాలు సాధించాలని పిలుపునిచ్చారు. కాకినాడ వేదికగా అండర్–17 రాష్ట్రపోటీలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో జూడో కోచ్ పీఎస్ మణికుమార్, సంఘ ప్రతినిధులు మెట్ట తిరుపతిరావు, పాతిన రమేష్కుమార్, బి.నిర్మల్కృష్ణ, పురుషోత్తం, అనితశ్రీ, పీడీలు, డీఎస్ఏ కోచ్లు పాల్గొన్నారు. -
అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే!
టెక్కలి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర ఆలయంలో ప్రభుత్వ వైఫల్యంతోనే భక్తుల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించారని.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని శాసనమండలి లో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో–ఆర్డినేటర్ కన్నబాబు, పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాసు, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో సనాతన ధర్మ పరిరక్షణ చేస్తున్నామంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రచారాలకు.. రాష్ట్రంలో దేవాలయాల్లో వరుసగా జరుగుతున్న దుర్ఘటనలకు ఎలాంటి పొంతన కనిపించడంలేదని వారు ఆరోపించారు. భక్తుల తొక్కిసలాట సంఘటనపై ఆదివారం మాజీమంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో వైఎస్సార్సీపీ నాయకులంతా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వీరితో పాటు జెడ్పీ చైర్మన్లు మజ్జి శ్రీనివాస్, పిరియా విజయ, ఎమ్మెల్సీలు నర్తు రామారావు, పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్, కొర్ల భారతి, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు కిల్లి సత్యనారాయణ, ఇతర అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన సంఘటనపై ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టంచేయాలి. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన చేస్తున్నారు. అందుకే దేవుడికి కోపం వస్తోంది. ప్రభుత్వ వైఫల్యంతో ఈ ఘోరం జరిగింది. ఘటనను పక్కదారి పట్టించేందుకు ప్రైవేట్ ఆలయం అంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పునైనా పరిహారం అందజేయాలి. కాశీబుగ్గ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఓ ప్రధాన పత్రికలో పోలీసుల వైఫల్యం అంటూ రాశారు. పెద్ద ఎత్తున భక్తులు వస్తారని ముందస్తుగా సమాచారం ఉన్నా ఎందుకు బందోబస్తును ఏర్పాటు చేయలేదు – బొత్స సత్యనారాయణ, శాసనమండలి ప్రతిపక్ష నేత రూల్బుక్పై శ్రద్ధ లేదా?దేవాలయాల పరిరక్షణ గాలికొదిలేశారు. రెడ్బుక్ రాజ్యాంగం తప్ప రూల్బుక్పై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టిసారించడంలేదు. నిర్లక్ష్యం, వైఫల్యాలతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన సంఘటనలో ఆలయ ధర్మకర్తపై కేసులు పెట్టేందుకు ప్రయత్నించడం ప్రభుత్వ చేతకానితనం. చంద్రబాబు తుపాను కట్టడి చర్యలు ఏమయ్యాయి? సనాతన ధర్మ పరిరక్షణ చేతకాకపోతే తప్పుకోవాలి. కల్తీ మద్యం వ్యవహారంలో జయచంద్రారెడ్డి, జనార్ధన్ను ఎందుకు అరెస్టుచేయడంలేదు. వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్పై ఎలాగోలా కేసు కట్టాలనే తాపత్రయం కనిపిస్తోంది. కేవలం ఆలయం సంఘటనను డైవర్ట్ చేయడానికే అరెస్టులు చేస్తున్నారు. – కురసాల కన్నబాబు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్ భక్తులకు భద్రత కల్పించలేకపోతున్నారు..కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంతో పాటు జంట పట్టణాల్లో పోలీసుల మోహరింపు, కట్టడి చర్యలు చూస్తుంటే ఇదే శ్రద్ధ ముందే తీసుకుని ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదనిపిస్తోంది. గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలి. ఇలాంటి విఫల ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. – ధర్మాన కృష్ణదాసు, వైఎస్సార్సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పాలన గాలికొదిలేశారు..రాష్ట్రంలో ప్రజల ప్రాణాలు, పాలన గాలికొదిలేశారనడానికి కాశీబుగ్గ తొక్కిసలాటే ఉదాహరణ. తిరుపతి సంఘటనలో కూటమి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదు. కనీసం సింహాచలం సంఘటనతో కూడా చలనం కలగలేదు. గతంలో చంద్రబాబు ఓవరాక్షన్తో పుష్కరాల్లో ఎంతోమంది చనిపోయారు. ఇప్పుడు కాశీబుగ్గలో ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం యంత్రాంగం నిర్లక్ష్యం కనిపిస్తోంది. – తమ్మినేని సీతారాం, వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్తఎందరిపై కేసు కట్టారు?కాశీబుగ్గలో జరిగిన సంఘటనలో ప్రభుత్వం తప్పించుకునే ధోరణి కనిపిస్తోంది. ఆలయ ధర్మకర్త పండాను అరెస్టుచేయాలని చూస్తున్నారు. అయితే, గతంలో తిరుపతి, సింహాచలంలో జరిగిన సంఘటనల్లో అక్కడ ధర్మకర్తల్లో ఎంతమందిని అరెస్టుచేశారో చెప్పాలి. – సీదిరి అప్పలరాజు, మాజీమంత్రి -
కాశీబుగ్గ ఆలయ ఘటనపై... న్యాయ విచారణ జరిపించాలి
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరసామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది భక్తులు చనిపోవడం దురదృష్టకరం. మృతిచెందిన వారికి వైఎస్సార్సీపీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ ఘటనలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. అదే సమయంలో ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి. అప్పుడే వాస్తవాలు బయటకొస్తాయి’ అని వైఎస్సార్సీపీ పేర్కొంది. కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో మరణించినవారికి సంతాపం తెలియజేస్తూ ఆదివారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీలు నిర్వహించింది. ‘ఏదైనా దుర్ఘటన జరిగిన తర్వాత సానుభూతి తెలియజేయడం, లేదంటే ఖండించడం చంద్రబాబు ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఇది మూడో దుర్ఘటన. తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గతో కలిసి మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలి.’ అని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది? ‘తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచలం ఘటనలో ఏడుగురు భక్తులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అదే విషయాన్ని మేం ప్రశ్నిస్తే.. రాజకీయం చేస్తున్నామంటూ మా మీద బురదజల్లేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాశీబుగ్గ దేవాలయం ఏప్రిల్లో ప్రారంభమైంది. అప్పటి నుంచి భక్తులు దర్శనానికి వస్తున్నారు. ప్రతి శనివారం 1,500 నుంచి 2,000 మంది భక్తులు వస్తున్నారు. కార్తీక ఏకాదశి కాబట్టి నిన్న(శనివారం) భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం అంచనా వేయాల్సిన అవసరం ఉంది. కానీ, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆలయ నిర్వాహకులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. ఆలయ నిర్వాహకుడు మాత్రం ముందురోజే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా స్పందించలేదు. ఈ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం నడుస్తుందా? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో స్పష్టం చేయాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. కాశీబుగ్గ ఘటనకు ముఖ్యమంతి, మంత్రులు, అధికారులు... ఎవరు బాధ్యత వహిస్తారు’ అని వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ప్రైవేటు పేరుతో పలాయనం
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోతే కూటమి ప్రభుత్వం ‘అది ప్రైవేట్ గుడి’ అంటూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. అలాంటి ప్రైవేట్ ఆలయాల్లో సైతం గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం భక్తుల భద్రతకు పట్టిష్ట చర్యలు చేపట్టిందని దేవదాయ శాఖ వర్గాల్లో చర్చ సాగుతోంది. కేవలం పది నెలల వ్యవధిలో తిరుపతి.. సింహాచలం.. వరుస దుర్ఘటనల అనంతరం తాజాగా కాశీబుగ్గ విషాదం. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ, భద్రతా చర్యల విషయంలో తన వైఫల్యాన్ని పూర్తిగా కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుండడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యంతోనే తిరుపతి తొక్కిసలాటప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరున్న తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది జనవరి 8న వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల జారీ సందర్భంగా తిరుపతిలో క్యూలైన్లో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యమే దీనికి కారణం. ముక్కోటి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని తెలిసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో సర్కారు లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. సింహాచలం దుర్ఘటనపై ‘సమగ్ర నివేదిక’ ఊసేలేదుసింహాచలం శ్రీవరహ లక్ష్మీనరసింహ ఆలయంలో చందనోత్సవం సందర్భంగా 2025 ఏప్రిల్ 30న మెట్ల మార్గంలో క్యూలైన్లో వెళుతున్న భక్తులపై గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనకు సంబంధించి బాధ్యులపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. తిరుపతి ఘటన తర్వాత కేవలం నాలుగు నెలల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు ప్రభుత్వం ఏ మాత్రం బాధ్యత తీసుకోలేదు. దుర్ఘటన జరిగిన రోజున ప్రభుత్వం ముగ్గురు అధికారులతో ఒక కమిటీని నియమించి, 72 గంటల్లో ప్రాథమిక నివేదిక, 30 రోజుల్లో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 72 గంటల్లో కమిటీ అందజేసిన ప్రాథమిక నివేదిక మేరకు ప్రభుత్వం ‘తూ తూ మంత్రం చర్యలతో’ సరిపెట్టిందని విమర్శలు అప్పుడే వెల్లువెత్తాయి. ఇక ఇప్పటికి ఆరు నెలలు గడిచినప్పటికీ, దుర్ఘటనపై 30 రోజుల్లో సమర్పించాల్సిన సమగ్ర నివేదిక అంశం ఊసే లేకుండా పోయిందని దేవదాయ శాఖలో చర్చ జరుగుతోంది. ముందు ఎక్కడాలేని హడావుడి.. ఆపై గప్చుప్!సింహాచలం చందనోత్సవం కార్యక్రమాల పర్యవేక్షణ విషయంలో ప్రభుత్వం ముందస్తుగా చేసిన హడావుడి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నలుగురు మంత్రుల కమిటీ రెండు నెలల పాటు వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహించి.. గతంలో ఎప్పుడూలేని తీరుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తామే ప్రతి పనిని క్షుణంగా పరిశీలించామని ప్రకటించింది. దుర్ఘటనకు 15 రోజుల ముందు ఏప్రిల్ 16వ తేదీన దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంమంత్రి అనిత, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, విశాఖ ఇన్చార్జి డోలా బాల వీరాంజనేయలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చందనోత్సవ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు. ఏప్రిల్ 30న దుర్ఘటన జరిగిన తర్వాత మంత్రుల కమిటీ సభ్యులెవరూ బాధ్యత తీసుకోకపోవడం ఒక ఎత్తయితే, ప్రభుత్వ పెద్దలు సైతం తమ మంత్రివర్గ సహచరులను ఈ ఘటనలో బాధ్యులు చేయకపోవడంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ సాగింది. విచారణ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా కమిటీ 72 గంటల్లో నివేదిక ఇవ్వడం, దాని ఆధారంగా చిరు ఉద్యోగుల మీద చర్యలు తీసుకోవడం.. అంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగిపోయాయన్న విమర్శలు వచ్చాయి.ప్రైవేటు దేవాలయాలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధఅప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేవదాయ శాఖ అధికారులతో 2021 సెప్టెంబరు 27వ తేదీన నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవదాయ శాఖ వద్ద నమోదు కాకుండా కొంత మంది (ప్రైవేట్) ట్రస్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయాల్లో భద్రతకు పలు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తుతం అధికార వర్గాలు చర్చించుకుంటున్నాయి. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటే ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే గుళ్లలో భద్రతకు సంబంధించి ఆయా యాజమాన్యాలకు అప్పటి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంబంధిత ఆలయాల్లో కూడా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల మాదిరే సీసీ కెమెరాలు ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయా ప్రైవేట్ ట్రస్టీలకు దేవదాయశాఖ నోటీసులు జారీ చేయాలని అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి స్వయంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించి అప్పటి సీఎం అధ్యక్షతన జరిగిన దేవదాయ శాఖ సమీక్ష వివరాలను 2021 అక్టోబరు 8 మినిట్ రూపంలో అప్పటి దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ రాష్ట్ర స్థాయిలో హోం శాఖతో పాటు రెవెన్యూ, ఇతర శాఖాధిపతులకు సైతం మెమో ద్వారా తెలియజేశారు. అప్పటి సీఎం జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ శాఖ పరిధిలో ఉన్న పలు ఆలయాలతోపాటు పలు ప్రైవేట్ ట్రస్టీల ఆధ్వర్యంలో నడిచే దాదాపు 9,500 ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు హోం, రెవెన్యూ శాఖలు చర్యలు ప్రారంభించినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. జగన్ ప్రభుత్వం పట్టిష్ట భద్రత చర్యలను కూటమి సర్కార్ నిర్లక్ష్యం చేసిందని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. -
ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: బొత్స
సాక్షి, శ్రీకాకుళం: కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరమని.. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని.. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి.. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’’ అని బొత్స నిలదీశారు.‘‘చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు?.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు?. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా?’’ అంటూ బొత్స ప్రశ్నించారు.సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాత్రులం అంటే కుదరదు.. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు ఇవ్వాలి’’ అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీదిరిసీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కాశీబుగ్గ తొక్కిసలాట జరిగింది. మహిళలే అధికంగా చనిపోయారు. వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాధితులకు ప్రాథమిక వైద్య సహాయం అందించాం.. ఈరోజు వైఎస్సార్సీపీ నేతలు అందరం కలిసి బాధితులను పరామర్శించాం. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాం.. రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?: కన్నబాబుకురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కాశీబుగ్గ ఘటన కలిచివేసింది.. క్షతగాత్రులంతా నిరుపేదలు. నిమితమాత్రులమంటూ బాబు వైరాగ్యం ప్రదర్శిస్తున్నాడు. ప్రైవేట్ ఆలయం అని మాట్లాడుతున్నారు. ఆసుపత్రులను ప్రైవేటుకు ఇచ్చినట్టు.. ఆలయాలను కూడా ప్రైవేటుకు ఇస్తున్నామని చెప్పండి. సినిమా హీరోయిన్ వస్తే రోప్ పార్టీ వేసి భద్రత ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు భద్రత ఇవ్వలేదు. ఆలయాల్లో భద్రత కోసం ప్రభుత్వం దగ్గర ప్రణాళిక ఉందా.? రెడ్ బుక్ తప్ప... రూల్ బుక్ ఉందా..?. ఇది ప్రైవేట్ ఆలయం అంటున్నారు.. తిరుపతి, సింహాచలంలో జరిగిన ఘటన మాటెంటి..? కాశీబుగ్గలో జరిగింది ప్రైవేట్ ఘటన కాదు.. ప్రభుత్వం బాధ్యత వహించాలి. కష్టం అంటే జగన్ ముందుంటారు. -
కాశీబుగ్గ ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తాడేపల్లి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో YSRCP బృందం పర్యటించింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో సంఘటన స్థలాన్ని పార్టీ బృందం పరిశీలించింది.ముందుగా.. తొక్కిసలాట బాధితులను పార్టీ నేతలు పరామర్శించారు. బాధితులకు అందిస్తున్న వైద్యంపై వైఎస్సార్సీపీ నేతలు ఆరా తీశారు. వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యన్నారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త కురసాల కన్నబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు సహా పలు నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, నాయకులు ఉన్నారు.కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం: బొత్స సత్యనారాయణ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టం. మా పార్టీ తరఫున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం వచ్చాక 17 నెలల్లో తొక్కిసలాట జరగడం ఇది మూడోసారి. ప్రతీ శనివారం కాశీబుగ్గ ఆలయానికి వేలాదిగా భక్తులు వస్తారు. అంచనా వెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఘటనకు ముందురోజే సమాచారం ఇచ్చానని ఆలయ ధర్మకర్త చెప్పారు. కాశీబుగ్గలో స్థానిక పోలీసులు ఏం చేస్తున్నారు.కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగి.. ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడాలి. తిరుపతి, సింహాచలం ఘటనల్లో ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. పోలీసులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా..?. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..? లేదా..?. సనాతన ధర్మం అని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. బయటకు చెప్పే మాటలు వేరు.. చేష్టలు వేరు.. దేవుడికి కూడా కోపం ఉంది అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సమగ్ర విచారణ జరపాలి. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలి. సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జితో విచారణ జరపాలి. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయి. నిమిత్తమాతృలం అంటే కుదరదు. ప్రజలకు సమాధానం చెప్పాలి. నష్ట పరిహారం రూ. 25 లక్షలు డిమాండ్ చేస్తున్నాం’’ అని బొత్స పేర్కొన్నారు. -
అసంతృప్తితో బీజం.. ఉత్తరాంధ్ర చిన్నతిరుపతిగా ఖ్యాతి
పలాస: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయానికి అసంతృప్తితో బీజం పడింది. ఈ గ్రామానికి చెందిన హరిముకుందాపండా చాలా ఏళ్ల కిందట తిరుమల దర్శనానికి వెళ్లారు. దర్శనం సరిగా కాకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. తనకు మిగిలిన అసంతృప్తి ఇంకెవరికీ కలగకూడదని భావించాడు. వీరిది ఒడిశా రాజకుటుంబం. హరిముకుందా తపనను గుర్తించిన ఆయన తల్లి హరివిష్ణుప్రియపండా సొంతంగా మనమే ఆలయం కట్టుకుంటే సరిపోతుందని ప్రోత్సహించింది. తల్లి మాటతో హరిముకుందా ఆలయ నిర్మాణానికి ఉపక్రమించారు.తిరుమల వేంకటేశ్వరస్వామిని పోలిన ఏకశిలా విగ్రహాన్ని తిరుమలలోనే తయారు చేయించి తీసుకొచ్చి ప్రతిష్టించారు. ఆలయాన్ని సుందరంగా నిర్మించారు. ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రారంభించారు. ప్రతి శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. భక్తులు భారీగా తరలివస్తుండడంతో అనతికాలంలోనే ఈ ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. సోషల్ మీడియాలోనూ ఆలయ వీడియోలు వైరల్ అయి ట్రెండింగ్ అయ్యాయి. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా ఖ్యాతికెక్కింది. ప్రతీ శనివారం వేలల్లో భక్తులు వస్తుంటారని పర్వ దినాల్లో 10 వేల నుంచి 15వేల మంది వరకు వస్తుంటారని అంచనా. ఈ శనివారం ఏకాదశి కావడంతో 25వేల మందివరకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. ఈ విషయాలన్నీ తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. మంత్రి ఆనం, మంత్రుల వితండ వాదన ఇంతటి ప్రాచుర్యం పొందిన ఆలయం గురించి తమకు తెలియదని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించడం అందరినీ విస్తుగొలుపుతోంది. ఇతర మంత్రులు, టీడీపీ నేతలూ ఇది ప్రైవేటు ఆలయం అని, అక్కడ తొక్కిసలాట జరిగితే ప్రభుత్వానికి ఏం సంబంధమని వితండ వాదన చేయడంపై అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు. ఈ ఆలయం తమ దృష్టిలో లేదని, ప్రభుత్వం వద్ద ఎక్కడా సమాచారం లేదని అబద్ధాలు వల్లె వేస్తున్నారు. బందోబస్తు కావాలని నిర్వాహకుడు అడగలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యమే మా వాళ్ల ప్రాణాలు బలిగొంది
ప్రభుత్వమే మా వాళ్ల ప్రాణాలు బలిగొందని కాశీబుగ్గ తొక్కిసలాట బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ధ్వజమెత్తారు. ఘటన జరిగిన తర్వాత పోలీసులు తీరిగ్గా వచ్చారని, భద్రతా చర్యలు అసలే లేవని విమర్శించారు. కూటమి సర్కారు తీరుపై ఆక్రోశించారు.నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణంస్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. నా భార్య మరణానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ఆలయం వద్ద ఒక్క పోలీసూ లేరు. సరైన బందోబస్తు నిర్వహించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. ఇది ముమ్మాటికీ అధికార యంత్రాంగం లోపమే. ఇంత నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారు. అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా సరైన ఏర్పాట్లు చేయలేదు. మా కుటుంబానికి తీరని దుఖం మిగిలింది. నేను ఒంటరినయ్యాను. – మృతురాలు అమ్ములు భర్త రాజారావు, సూర్యకుండ కాలనీ, పలాససర్కారు నిర్లక్ష్యం వల్లే అమ్మ బలైందిదైవ దర్శనానికి వెళ్లిన మా అమ్మ ప్రాణం పోయింది. ఆరోగ్యంగా వెళ్లిన అమ్మ విగత జీవిగా బయటకొచ్చింది. ప్రమాదానికి ప్రభుత్వానిదే బాధ్యత. వేలాది మంది భక్తులు వస్తున్నారని తెలిసి కనీస భద్రతా చర్యలు చేపట్టలేదు. సర్కారు నిర్లక్ష్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎంత నష్ట పరిహారం ఇస్తే ఏం ప్రయోజనం. మా అమ్మ తిరిగి వస్తుందా.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.– రాజేశ్వరి కుమారుడు వైకుంఠరావు, బెల్లుపటియా, మందస మండలంరక్షణ ఏర్పాట్లు లేవుగుడి దగ్గర ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవు. అంతమంది జనాలు వచ్చే గుడికి పోలీసులు కాపలా ఉండాలి. కానీ అక్కడ పోలీసులు లేరు. అన్నీ అయిపోయాక పోలీసులు కాశీబుగ్గంతా నిండిపోయారు. – రాపాక గవరయ్య, పిట్టల సరియా, మృతురాలు రాపాక విజయ బావసర్కారు పర్యవేక్షణేదీ? కార్తీక ఏకాదశి మంచిరోజని దేవుడి దర్శనం కోసం కాశీబుగ్గలోని చిన్న తిరుపతి వెళ్లాం. ఒక్కసారిగా తోపులాట జరగడంతో పడిపోయాం. మా వదిన మురిపింటి నీలమ్మపై జనాలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆమె కింద పడిపోయి నా కళ్ల ముందే చనిపోయింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు. – దుక్క తవిటమ్మ, దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం ఘోరానికి కారణం ప్రభుత్వమే నిఖిల్ను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని ఒంటరి చేసి వదిలివెళ్లిపోయాడు. మా కంటిదీపం ఆరిపోయినట్లయ్యింది. ప్రభుత్వం నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడం వల్లే ఈ దారుణం జరిగింది. – లొట్ల పార్వతి, నిఖిల్ పెద్దమ్మ సరైన చర్యల్లేవుతిరుపతి వెళ్లలేక దగ్గరలో ఉన్న కాశీబుగ్గలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లాను. ప్రభుత్వం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. పోలీసులు కూడా లేకపోవడం వల్ల మహాఘోరం జరిగింది. తొక్కిసలాట ఘటనలో మా పిన్ని మృతి చెందింది. – కొర్రాయి అప్పయ్య, మృతురాలు యశోద అక్క కుమారుడు, శివరాంపురంఇంత నిర్లక్ష్యమా? కళ్లముందే ముగ్గురు మృతిదర్శనం చేసుకొని బయటకు వచ్చే తలుపులు తీయడంతో ఒక్కసారిగా లోపలకి వెళ్లేవారు, బయటకు వచ్చేవారు తోసుకోవడంతో కింద పడిపోయాం. మా మీద మరి కొంత మంది పడిపోయారు. నా కిందనే పడిన ముగ్గురు ఆడవాళ్లు చనిపోయారు. కొద్ది సేపు అయి ఉంటే నేను కూడా చనిపోయే దాన్ని. – కూర్మాపు హిమ, ప్రత్యక్ష సాక్షి, నందిగాంఇలాంటి కష్టం పగవాళ్లకూ రాకూడదు నేను నా భార్య దర్శనానికి వెళ్లాం. తోపులాటలో నా భార్య కిందపడిపోయింది. మరో ఐదుగురు ఒకరిపై ఒకరు పడ్డారు. ఆ క్షణం ఏం చేయాలో పాలుపోలేదు. ఎలాగో నా భార్యను కాపాడుకోగలిగాను. ఇలాంటి కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు. – దుంప రుషికేశ్వరరావు, సీతారాంపురం, వజ్రపుకొత్తూరు మండలం ఒక్క పోలీసూ లేరు మాది వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం గ్రామం. మా బంధువులతోపాటు మరో 10 మంది దర్శనం కోసం వచ్చాం. దర్శనానికి వెళ్తుండగా మెట్ల వద్ద తోపులాట జరిగింది. 30 నిమిషాలకుపైగా ఆలయంలో ఇరుక్కుపోయాం. అనేక మంది మహిళలు కింద పడిపోయారు. తొక్కిసలాట సమయంలో ఒక్క పోలీసూ లేరు. – దుబ్బ బోడెయ్య, షణ్ముఖరావు అంబులెన్సులూ సమయానికి రాలేదు మాది నందిగాం మండలం శివరాంపురం గ్రామం. ఏకాదశి రోజు టెక్కలిలోని విష్ణుమూర్తి గుడికి వెళ్లాల్సి ఉంది. ఆధార్ కార్డు ఉంటే ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చునంటూ పలాస–కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి మా ఊరి వారితో కలిసి నా భార్య వెళ్లింది. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడింది. జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. అంబులెన్సులూ సమయానికి రాలేదు. – బోరసింగు కామేష్, నందిగాం ముప్పావు గంట ఊపిరాడలేదు.. సర్కారుదే పాపంతొక్కిసలాటలో రెయిలింగ్ నుంచి మెట్ల పక్కన జారిపోయి కిందపడిపోయాను. నా మీద పది నుంచి పదిహేను మంది పడిపోయారు. ముప్పావు గంట వరకు పడిపోయిన నన్ను ఎవరూ బయటకు తీయలేదు. ఊపిరాడక పోవడంతో ప్రాణాలపై ఆశలు వదులుకున్నాను. తొక్కిసలాటలో నా కాళ్లు బెణికిపోయి, నడవలేని పరిస్థితి నెలకొంది. సరైన భద్రత చర్యలు తీసుకోని సర్కారుదే ఈ పాపం. – రోణంకి రమాదేవి, క్షతగాత్రురాలు, తేలినీలాపురం, టెక్కలి మండలం సహాయ చర్యల గురించి పట్టించుకోలేదుఉదయం 10 గంటలకు ఆలయానికి వెళ్లిన మేము 11.30 గంటలకు దర్శనం పూర్తిచేసుకుని తిరిగి వస్తుండగా ఒక్కసారిగా తలుపులు తెరవడంతో, బయట నుంచి వచి్చన భక్తులు లోపలికి వెల్లువలా పరుగులు తీశారు. దీంతో ఒకవైపు స్టీలు రెయిలింగ్ ఊడిపోయింది. దీంతో జనం మధ్య తొక్కిసలాట జరిగింది. నాకు తీవ్ర గాయాలయ్యాయి. సహాయక చర్యల గురించి సర్కారు పట్టించుకోలేదు. – గున్న చిట్టెమ్మ, గణేష్ కాలనీ, నందిగాం గ్రామం తలుపు తీయడంతో తోపులాట దేవుడిని దర్శించుకుని బయటకు వచ్చే తోవలో ఉన్న గేటు వేసేశారు. తలుపు తీయకపోవడం వల్ల జనాలు పెరిగిపోయారు. తర్వాత ఒక్కసారిగా తలుపు తీయడంతో తోపులాట జరిగింది. కింద పడిపోయిన వారు చనిపోయారు. – కొర్రాయి శీలమ్మ, శివరాంపురం, సంఘటన ప్రత్యక్ష సాక్షి ఆస్పత్రికి తీసుకెళ్లే నాథుడే లేడుమా దర్శనం అయిపోయింది. బయటకు వస్తుండగా క్యూ ఆగిపోయింది. 10 నిమిషాలు అయ్యాక తోపులాట జరిగింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు మహిళలు కింద పడిపోయారు. వారిని ఆస్పత్రికి తీసుకెళ్లేవారెవరూ కానరాలేదు. – చెలియ మోహిణి సరియాపల్లి, మందస మండలం ఘటన జరిగిన తర్వాతైనా స్పందించలేదుమేము దర్శనానికి వెళ్లేటప్పుడు అంతా సజావుగా ఉంది. 10 గంటల సమయంలో రద్దీ బాగా పెరిగింది. ఆలయం లోపల ఉన్నాం. దర్శనం చేసుకొని బయటకు వస్తుండగా తొక్కిసలాట జరిగింది. నాతో పాటు వచ్చిన పైల సీతమ్మ, నర్సమ్మలకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన తర్వాతైనా సర్కారు స్పందించలేదు. – పైల జయమ్మ, ధర్మవరం, ఇచ్ఛాపురం మండలంభద్రత సర్కారు బాధ్యత కాదా?మేము దర్శనం చేసుకొని వస్తున్నాం. గేటు వేసి ఉంది. ముందుకు వెళ్లేందుకు అవకాశం లేక మెట్లపై నిలబడ్డాం. వెనుక నుంచి అరుపులు వినిపించాయి. దీంతో ముందున్న తలుపులు తెరిచారు. ఒక్క సారి అందరం ముందుకు వెళ్లాం. అప్పుడే తొక్కిసలాట జరిగింది. ఎలాగో తప్పించుకొని బయటపడ్డాం. ఇది సర్కారు పాపమే. భద్రత సర్కారు బాధ్యత కాదా?– పిట్ట జగన్నాయకులు, ధర్మవరం ప్రభుత్వం వల్ల రెండుకాళ్లూ పోయాయ్ కార్తీక ఏకాదశి నాడు భక్తిభావంతో వేంకటేశ్వరస్వామి గుడికి వచ్చాను. ఇక్కడ సరైన బందోబస్తు లేకపోవడంతో తొక్కిసలాటలో రెండు కాళ్లూ పోగొట్టుకొన్నాను. మా కుటుంబానికి తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. – చెలియా కాంతమ్మ, సరియాపల్లి, మందస మండలం -
దేవుడా!.. చంద్రబాబు పొలిటికల్ పాలన
2015లో చంద్రబాబు ప్రచార కండూతితో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట.. 29 మంది మృతివిచారణ నివేదికను తొక్కిపెట్టిన నాటి టీడీపీ ప్రభుత్వంఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుమల ఆలయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల క్యూలైన్లో తొక్కిసలాట. ఆరుగురు సామాన్య భక్తులు మృతి.ఏప్రిల్ 30న సింహాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చందనోత్సవం సమయంలో క్యూలైన్ పక్కన ఉన్న గోడ కూలి గాల్లో కలిసిన ఏడుగురు భక్తుల ప్రాణాలు.నవంబరు 1న కార్తీక ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర ఆలయలో తొక్కిసలాట.. 9 మంది భక్తుల దుర్మరణం.సాక్షి, అమరావతి: రెడ్బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పొలిటికల్ పాలన తేవడంతో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతున్నాయి... దేవాలయాలకు వెళ్లే భక్తుల ప్రాణాలకు భరోసా కరువైంది! కేవలం పది నెలల కాలంలో మూడు ఆలయాలలో మూడు ఘోర దుర్ఘటనలు. ఒక ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం మేల్కొని ఉంటే, అన్ని గుడుల వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టి ఉంటే దారుణాలు జరిగేవి కాదన్న చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. వరుస దుర్ఘటనల్లో భక్తులు దుర్మరణం చెందుతున్నా, పోయేది సామాన్యుల ప్రాణాలే కదా అన్నట్లు చంద్రబాబు సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందనే వాదన వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వ పాపాలు సామాన్యుల పాలిట శాపాలుగా మారుతున్నాయని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇన్ని విషాదాలు జరుగుతున్నా అమెరికా కంటే గొప్ప టెక్నాలజీ తెచ్చానంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తుపానునే కంట్రోల్ చేశానని, సంక్షోభాలను నివారించడంలో చాలా అనుభవజ్ఞుడినని చెప్పుకొంటూ సీఎం ప్రచార ఆర్భాటంతో కాలం వెలిబుచ్చుతున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరిగి భక్తులు చనిపోతున్నా నిరోధించేందుకు చేపడుతున్న చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని, కనీసం మంచినీళ్లు కూడా సమకూర్చలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.29 మందిని బలిగొన్న బాబు ప్రచార కండూతి» చంద్రబాబు ప్రచార కండూతి 2015 గోదావరి పుష్కరాల్లో ఏకంగా 29మంది భక్తుల దుర్మరణానికి కారణమైంది. రాజమహేంద్రవరం ఘాట్ వద్ద వేలాది భక్తుల సమక్షంలో సీఎంగా బాబు కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం చేసేలా వీడియో తీయాలని భావించారు. ముందు రోజే ఘాట్ గేట్లు మూసి వేలాదిగా తరలివచ్చిన భక్తులు పడిగాపులు కాసేలా చేశారు. చంద్రబాబు రాగానే గేట్లు తెరిచారు. భక్తులు ఒక్కసారిగా స్నానాలకు రావడంతో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయిన విషయం ఇప్పుడు మళ్లీ చర్చనీయంగా మారింది. దీనిపై బాబు కనీసం నైతిక బాధ్యత తీసుకోలేదు. పైగా పుష్కరాల దుర్ఘటనపై విచారణ కమిషన్ నివేదికను తీవ్ర జాప్యం చేశారు. చివరికి ఎవరి బాధ్యత లేదని తేల్చారు.» ఇక 2017లో కార్తీక మాసం సందర్భంగా నవంబరు 12న విజయవాడ ఇబ్రహీంపట్నం పవ్రిత సంగమం వద్ద కృష్ణా నదిలో పర్యాటకుల బోటు బోల్తాపడి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. » 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా విజయవాడ కృష్ణానది ఒడ్డున ఉండే 30పైగా ఆలయాలను కూల్చివేశారు.» తిరుమలలో 1472లో నిర్మితమైన వేయి కాళ్ల మండపాన్ని 2003లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూల్చివేశారు. » చంద్రబాబు హయాంలోనే... విజయవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు జరిగాయంటూ పెద్ద దుమారం చెలరేగింది. ఇంకోవైపు, చంద్రబాబు గతంలో సీఎంగా కొనసాగిన సమయంలో భక్తులు అయ్యప్ప మాలధారణ కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయంటూ ఎగతాళిగా మాట్లాడారు.కూటమి పాలనలో అపచారాలు ఎన్నో...» తిరుమల–తిరుపతి చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో ఈ ఏడాది జనవరి 8న తొక్కిసలాట చోటుచేసుకుని ఆరుగురు దుర్మరణం చెందారు. 40 మంది తీవ్రంగా గాయపడడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేకపోయింది. » తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో జనవరి 13న షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. » ఈఏడాది ఫిబ్రవరి 18న శ్రీవారి ఆలయ మహాద్వారం ఎదుట టీటీడీ ఉద్యోగి, పాలకమండలి సభ్యుడికి మధ్య వివాదం చోటుచేసుకుంది. మార్చిలో నల్లమల అటవీ ప్రాంతంలోని పవిత్ర కాశినాయన క్షేత్రంలో అన్నదాన భవనం, సత్రాలు, గోశాలను కూల్చివేశారు. » ఏప్రిల్లో శ్రీ మహావిష్ణువు తాబేలు అవతారంలో వెలిశారని భక్తులు విశ్వసించే శ్రీ కూర్మంలో పెద్దసంఖ్యలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి.»300 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం పెద్ద పల్లిపేట బాల శశిశేఖర ఆలయంలో ఈ ఏడాది మే 18న కొందరు వ్యక్తులు ఏడు విగ్రహాలను ధ్వంసం చేశారు. -
దేవుడా.. మరో ఘోరం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి నెట్వర్క్: మొన్న తిరుపతిలో తొక్కిసలాట జరిగి ఆరుగురు.. నిన్న సింహాచలంలో గోడ కూలి ఏడుగురు.. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కార్తీక ఏకాదశి సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఘటనకు ప్రధాన కారణం అని స్పష్టమవుతోంది. ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఈ ఆలయానికి కార్తీక ఏకాదశి రోజున వేలాదిగా భక్తులు వస్తారని తెలిసి కూడా బందోబస్తు ఇవ్వలేదు. ఆలయంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లెక్కి పై అంతస్తుకు వెళ్తే అక్కడ వేంకటేశ్వరస్వామి దర్శనమిస్తారు. ఈ క్రమంలో దర్శనానికి వెళ్లే వారు.. దర్శనం చేసుకుని బయటకు వచ్చే వాళ్లతో ప్రవేశ మార్గం (రాకపోకలకు ఒకే మెట్ల మార్గం) కిక్కిరిసింది. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు లేకపోవడంతో ఉదయం 11.45 గంటల సమయంలో అక్కడ తోపులాట చోటుచేసుకుంది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోయారు. తీవ్ర గందరగోళం ఏర్పడింది. కేకలు.. ఆర్తనాదాలు.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.. ప్రాణ భయంతో మిగితా వారు కింద పడిన వారిని తొక్కుకుంటూ బయటకు వెళ్లడానికి దూసుకొచ్చారు. ఈ క్రమంలో భక్తుల ఒత్తిడి కారణంగా కుడి వైపు రెయిలింగ్ ఒరిగిపోయింది. దీంతో క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. దీంతో కింద పడిపోయిన వారిలో ఊపిరి ఆడక తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ 20 మందిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరికొంత మంది మెట్లపై నుంచి కిందకు దూకి గాయపడ్డారు. కింద పడిపోయిన తర్వాత వృద్ధులు, పిల్లలు లేచేందుకు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదని.. ‘అమ్మా.. అయ్యా.. ఊపిరి అందడం లేదు.. మీకు దండం పెడతా.. చచ్చిపోతున్నా.. ఎవరైనా కాపాడాలంటూ..’ ప్రాధేయపడి అడుగుతున్నా ఎవరూ వినిపించుకునే పరిస్థితే లేకపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశం క్షమార్హం కాని ప్రభుత్వ నిర్లక్ష్యంఈ ఆలయానికి కొంత కాలంగా ప్రతి శనివారం వేలాది మంది భక్తులు వస్తారనే విషయం అందరికీ తెలుసు. పైగా శనివారం కార్తీక ఏకాదశి. ఈ దృష్ట్యా భక్తులు మరింతగా తరలి వస్తారని ఎవరూ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మామూలుగా పర్వదినాల్లో, కార్తీక మాసంలో ఆలయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకునేలా దిశా నిర్దేశం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ విషయంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించిందని చెప్పడానికి ఈ ఘోర ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చినా పోలీసుల పర్యవేక్షణ కొరవడింది. పైన ఉన్న ఆలయంలో మామూలుగా 2000 మంది భక్తులు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ఘటన జరిగే సమయానికి అంతకు రెండు మూడు రెట్లలో భక్తులు ఉన్నారు. వారంతా ఒక్కసారిగా కిందకు రావడానికి ప్రయత్నించడంతో మెట్లపై తోపులాట చోటు చేసుకుంది. వారు కిందకు రాకుండా నియంత్రించి ఉంటే ఇంతగా ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని, ఇలా జరగడానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని భక్తులు మండిపడుతున్నారు. మార్చురీ వద్ద పోలీసులతో వాగ్వాదం చేస్తున్న మృతుల బంధువులు తొలుత స్పందించిన వైఎస్సార్సీపీ నేతలువిషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి సీదిరి పలువురికి సీపీఆర్ చేశారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించడానికి చర్యలు తీసుకున్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష సంఘటనా స్థలానికి చేరుకోగా, కొంత సమయం తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు వచ్చారు. అనంతరం మృతదేహాలను తరలించే చర్యలు చేపట్టారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి తదితరులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డి పోలీస్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పోలీసులు ఆలయం, ఆస్పత్రితో పాటు పరిసర ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకున్నారు. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యుల రోదనలు, క్షతగాత్రుల కేకలతో ఆస్పత్రి దద్దరిల్లింది. డీఐజీ గోపినాథ్ జెట్టి ఆస్పత్రి వద్దకు చేరుకుని పోలీసులకు దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ తదితరులు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. శనివారం రాత్రి మంత్రి లోకేశ్ వచ్చారు. బాధిత కుటుంబాలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. అంతకు ముందు మృతులు, క్షతగాత్రుల బంధువులు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీషను నిలదీశారు. ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదట!ఏకాదశి కావడంతో 20 వేల నుంచి 25 వేల మంది ఒక్కసారిగా వచ్చారని అంచనా. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తోంది. రహదారిపై 10–20 మంది నిరసన తెలపడానికి వస్తే.. వెంటనే ఆంక్షల పేరిట పెద్ద సంఖ్యలో పోలీసులు వాలి పోవడం చూస్తుంటాం. అలాంటిది ఏకాదశి రోజున వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేలాది మంది భక్తులు తరలి వచ్చారని తెలిసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోక పోవడం దారుణం అని భక్తులు మండిపడుతున్నారు. ఘటన జరిగిన తర్వాత వందల సంఖ్యలో పోలీసులను పెట్టి లాభమేమిటని ప్రజలు నిలదీస్తున్నారు. 20 మెట్లు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. క్షతగాత్రులను తరలించేందుకైనా.. మృతదేహాలను పక్కకు తీసేందుకైనా ప్రభుత్వ యంత్రాంగమెవరూ చాలా సేపటి వరకు అక్కడ అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఘటన తర్వాత భక్తుల సంఖ్యపై వేర్వేరు ప్రకటనలు చేశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దాదాపు 20 వేల మందికిపైగా భక్తులు వచ్చారని చెబుతున్నారు. అసలు ఆలయ సమాచారమే ప్రభుత్వం వద్ద లేదని చెప్పుకొచ్చారు. ఇలా గందరగోళ ప్రకటనలు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. కాగా, మృతుల బంధువులు, క్షతగాత్రులకు ఏదైనా సాయం కావాలంటే 08942–240557 నంబర్కు సంప్రదించాలని అధికారులు తెలిపారు. పోలీసు దిగ్బంధంలో సీహెచ్సీ ఈ దుర్ఘటనలో మరణించినవారి మృతదేహాలను ఉంచిన కాశీబుగ్గ కమ్యూనిటీ హాస్పిటల్(సీహెచ్సీ) వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మృతుల బంధువులు అక్కడ ఆందోళన చేయకుండా చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆందోళన చేస్తుండగా పోలీసులు బలవంతంగా తరలించారు.మృతుల వివరాలు1. ఏదూరి చిన్నమ్మి (50), రామేశ్వరం, టెక్కలి మండలం2. రాపాక విజయ (48), పిట్టలసరియా, టెక్కలి మండలం3. మురుపింటి నీలమ్మ (60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరు మండలం4. దువ్వు రాజేశ్వరి (60), బెల్లుపటియా, మందస మండలం5. లొట్ల నిఖిల్ (13), బెంకిలి, సోంపేట మండలం6. డొక్కర అమ్ములమ్మ (54) పలాస–కాశీబుగ్గ7. చిన్ని యశోదమ్మ (56), శివరాంపురం, నందిగాం మండలం8. బోర బృంద (62), మందస9. రూప (52) గుడ్డిభద్ర, మందస మండలంతల్లికి కడుపుశోకంసోంపేట: కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనలో బెంకిలి గ్రామానికి చెందిన లొట్ల నిఖిల్(12) మృతిచెందడంతో అతని తల్లి అనుకు తీరని కడుపుశోకం మిగిలింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. నిఖిల్కు చిన్నతనం నుంచే వేంకటేశ్వరస్వామి అంటే అమితమైన భక్తి. జింకిబద్ర ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. దీపావళి నుంచి బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గోవిందుని నగర సంకీర్తనల్లో పాల్గొంటున్నాడు. ఆరేళ్లుగా కార్తీక సంకీర్తనల్లో పాలుపంచుకుంటున్నాడు. శనివారం వేకువజామున గ్రామంలోని శివాలయానికి వెళ్లి స్వామి దర్శనం అనంతరం భక్తులతో కలిసి సంకీర్తన చేశాడు. ఉదయం 9 గంటలకు అమ్మ అనుతోపాటు, అక్క, మరికొందరితో కలిసి కాశీబుగ్గ వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లాడు. 11 గంటల ప్రాంతంలో జరిగిన తొక్కిసలాటలో అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు కళ్లెదుటే మరణించడంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. పలాస ప్రభుత్వాస్పత్రి వద్ద అపస్మారకస్థితికి వెళ్లింది. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నిఖిల్ తండ్రి పాపారావు సోంపేట లోకనాథేశ్వర కలాసీ సంఘంలో కలాసీగా పనిచేస్తున్నారు.మృతులంతా సామాన్యులే⇒ సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన బాలుడు నిఖిల్ తండ్రి పాపారావు కలాసీగా పని చేస్తున్నాడు. ⇒ టెక్కలి మండలం పిట్టలసరియా గ్రామానికి చెందిన రాపాక విజయ వ్యవసాయ కూలీ. ఈమె భర్త చిన్నారావు వ్యవసాయ కూలీగా పని చేస్తున్నారు.⇒ టెక్కలి మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన యేదూరి చిన్నమ్మి భర్త గణపతిరావు మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.⇒ వజ్రపుకొత్తూరు మండలం దుక్కవానిపేట గ్రామానికి చెందిన మురిపింటి నీలమ్మ గృహిణి. భర్త కన్నయ్య మృతి చెందడంతో కుటుంబానికి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం బెల్లుపటియా గ్రామానికి చెందిన దువ్వు రాజేశ్వరి వ్యవసాయ కూలీ. ⇒ నందిగాం మండలం శివరాంపురం గ్రామానికి చెందిన చిన్ని యశోదమ్మ వృద్ధురాలు. కుటుంబం వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తోంది. ఈమె ఇంటి పెద్దగా వ్యవహరిస్తోంది. ⇒ మందస మండలం గుడ్డిభద్ర గ్రామానికి చెందిన రూపది నిరుపేద కుటుంబ. ⇒ మందస గ్రామానికి చెందిన బోర బృందావతి భవన నిర్మాణ కార్మికురాలు.⇒ పలాస గ్రామానికి చెందిన డొక్కరి అమ్ములమ్మ సామాన్య గృహిణి. ఇప్పుడు ఏం చే ద్దామని వచ్చారు?మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే శిరీషపై బాధితుల మండిపాటు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ఇప్పుడు మీరు ఎందుకొచ్చారు? ఏం చేద్దామని వచ్చారు? చీమ చిటుక్కుమంటే తెలుసుకునే మీరు ఇక్కడికి ఇంత మంది భక్తులు వచ్చారని ముందుగా ఎందుకు తెలుసుకోలేకపోయారు? ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా.. ఇక్కడ కనీసం ఒక్క పోలీసు అయినా లేరు. పట్టించుకునే వారే లేరు. వేలాది మంది భక్తులు వస్తే ఇలా చేస్తారా? ప్రమాదం జరిగిన తర్వాత కూడా చాలా సేపటి వరకు ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదు.. కనీసం వైద్యులు, అంబులెన్స్ అయినా పంపలేదు. అచ్చెన్నాయుడు, శిరీషలను ప్రశ్నిస్తున్న మృతుల కుటుంబ సభ్యులు మీ తీరు ఏం బాగోలేదు’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబీకులు, గాయపడ్డ వారు, ఇతర భక్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అనంతరం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే శిరీష ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడే మృతదేహాల వద్ద రోదిస్తున్న వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లగా మంత్రిని చూసి బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘోరం జరిగిందని గట్టిగా నిలదీశారు. బాధితులు వేసే ప్రశ్నలకు మంత్రి, ఎమ్మెల్యే సమాధానం చెప్పలేని పరిస్థితిలో మౌనంగా ఉండిపోయారు.ఆపద్బాంధవుడు సీదిరి అప్పలరాజుపలువురి ప్రాణాలు కాపాడిన మాజీ మంత్రివజ్రపుకొత్తూరు రూరల్: ఆలయంలో జరిగిన తోపులాట ఘటనలో గాయపడిన వారికి వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అత్యవసర సేవలు అందించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన స్వతహాగా వైద్యుడు కావడంతో తొక్కిసలాటలో ఊపిరి తీసుకోలేకపోతున్న వారిని, స్పృహ తప్పిన వారిని గుర్తించి సీపీఆర్ చేశారు. వృత్తి ధర్మం పాటిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తోపులాట ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళలకు సీపీఆర్ చేసి ప్రాణాలను నిలపడంతో పాటు, అంబులెన్స్ను రప్పించి.. ఆస్పత్రికి తరలించారు. అప్పలరాజు స్ఫూర్తితో పక్కనున్న వారు సైతం గాయపడ్డ వారికి సేవలందించారు. -
కాశీబుగ్గ తొక్కిసలాటపై మంత్రి లోకేష్ పొంతన లేని మాటలు
శ్రీకాకుళం : జిల్లాలోని కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈరోజు(శనివారం) ఏకాదశి పురస్కరించుకుని అత్యధిక సంఖ్యలో భర్తులు రావడంతో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అయితే శనివారం సాయంత్రం మంత్రి లోకేష్.. తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ దేవాలయాన్ని సందర్శించారు.దీనిలో భాగంగా మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట అంశానికి సంబంధించి పొంతనలేని మాటలు మాట్లాడారు. ప్రతీ శనివారం వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా, పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా లేదన్నారు. భక్తుల రద్దీకి ఉచిత బస్సు కూడా కారణమని లోకేష్ చెప్పిన సమాధానం వింతగా ఉంది. ఉదయం ఆరు గంటలకే భక్తులు అక్కడికి చేరుకున్నా సమాచారం లేదని దాటవేత సమాధానం చెప్పారు లోకేష్. ఒక ఊరి నుంచి వంద మంది వస్తే తెలుస్తుంది కానీ.. ఒక ఊరి నుంచి పది మంది చొప్పున వస్తే ఎలా తెలుస్తుందని ఎదురు ప్రశ్నించారు. ఇలా లోకేష్ మాటల్లో తడబాటు కనబడింది. ధర్మకర్త వీడియో వెలుగులోకి.. సర్కారు వైఫల్యమే కారణంపోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదనేది కూటమి పెద్దలు చెప్పే వాదన తప్పు అని ధర్మకర్త పాండా మాటల్లోనే తేలిపోయింది. పోలీసులకు నిన్ననే సమాచారం ఇచ్చామని ధర్మకర్త పాండా చెప్పిన వీడియో ఒకటి బయటకొచ్చింది. ధర్మకర్త స్థానంలో ఉన్న పాండా సమాచారం ఇచ్చినా సర్కారు తగిన భద్రత కల్పించకపోవడం గమనార్హం. ముందస్తు సమాచారం లేదంటూ మంత్రులు, అధికారుల ప్రకటించగా, సమాచారం ఇవ్వలేదా అని పాండాను మీడియా ప్రశ్నించింది. ‘ఈరోజు కాదు.. నిన్నే పోలీసులకు చెప్పా’ అని పాండా చెప్పారు. దీనికి సంబంధించిన ఆ వీడియో బయటకి రావడంతో సర్కారు వైఫల్యం బట్టబయలైంది. దాంతో తర్వాత ధర్మకర్త పాండాతో సమాచారం ఇవ్వలేదని, ఇంతమంది భక్తులు వస్తారని అనుకోలేదంటూ అధికారులు చెప్పించడంతో సర్కారు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందనడానికి ఉదాహరణ. -
కాశీబుగ్గ తొక్కిసలాట.. పలాస ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: పలాస ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి పలాస ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి, ధర్మాన ప్రసాదరావును ఆసుపత్రి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బాధితులను పరామర్శించేందుకు పోలీసులు నిరాకరించారు.ఆసుపత్రి ప్రాంగణం ఖాళీ చేయాలని ఆదేశించిన పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులను బయటకు పంపించివేశారు. పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పలాస ఆసుపత్రి వద్ద వైఎస్సార్సీపీ శ్రేణులు, సీదిరి అప్పలరాజు బైఠాయించారు.కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాటలో ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోందని ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ‘‘25 వేల మందికి పైగా భక్తులు వస్తే ఇద్దరు కానిస్టేబుళ్లు వెళ్లారు. దేవాలయం ప్రైవేటా? ప్రభుత్వానిదా అన్నది ప్రశ్నకాదు. ప్రజల ప్రాణాలు కాపాడటమే ప్రధానం’’ అని ధర్మాన పేర్కొన్నారు. -
కాశీబుగ్గ తొక్కిసలాట: మృతులు వీరే..
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాపాక విజయ(48)-టెక్కిలి, రామేశ్వరానికి చెందిన ఏదూరి చిన్మమ్మి(50)-రామేశ్వరం, మురిపించి నీలమ్మ(60)-దుక్కవానిపేట, దువ్వు రాజేశ్వరి(60)-చెలుపటియా, యశోదమ్మ(56) శివరాంపురం, రూప(గుడిభద్ర), డోక్కర అమ్ము(పలాస), నిఖిల్(13)-బెంకిలి, బృందావతి(62)-మందసగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. -
కాశీబుగ్గ ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు లేకపోయినా కానీ అధికారులు పట్టించుకోలేదు. కొన్ని వారాలుగా భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఒక్కసారి కూడా ఆలయ వర్గాలతో పోలీసులు సమీక్ష చేయలేదు. విఐపీలు దర్శనానికి వస్తున్నా కానీ భద్రతా లోపాలను అధికారులు గుర్తించలేదు.దేవాలయం నిర్మాణంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భక్తుల క్యూ లైన్లు, వేచి వుండే షెడ్లో ఫ్యాన్లు, వెంటిలేటర్ ఫ్యాన్లు కనిపింయలేదు. ఉక్కపోతతో ఊపిరి ఆడక అవస్థలు పడి భక్తులు స్పృహ కోల్పోయారు. -
తొక్కిసలాట: మంత్రి అచ్చెన్నాయుడిని నిలదీసిన భక్తులు
సాక్షి, శ్రీకాకుళం: మంత్రి అచ్చెన్నాయుడిని మహిళా భక్తులు నిలదీశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు భారీగా రావడంతో తోపులాట జరిగింది. రెయింలింగ్ ఉండిపోవడంతో భక్తులు కింద పడ్డారు. 10 మంది మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారని.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతి ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాలనుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’’ ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రచారమే ప్రాణం తీసింది.. కాశీబుగ్గ ఆలయ వివరాలు..
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానిక వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాట కారణంగా పది మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత ఆలయం గుర్తించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 12 ఎకరాల్లో ఆలయం..కాశీబుగ్గ పదనాపురం నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణాన్ని ధర్మకర్త హరిముకుంద్ పండా ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయం ఐదు ఎకరాల్లో ఉంది. సుమారు రూ.20 కోట్లతో దీనిని నిర్మించారు. కాగా, తనకు తిరుమల వెళ్లిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడ ఆలయం నిర్మించినట్టు తెలిసింది. ఇక, కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. చిన్న తిరుపతిగా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం ప్రసిద్దిలోకి వచ్చింది. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కూడా చేశారు.గుడి నిర్మించిన హరి ముకుంద పాండా25వేల మంది భక్తులు.. దీంతో, ఆలయానికి ప్రతీరోజు దాదాపు 1000 మంది వరకు భక్తులు వస్తున్నారు. ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తారు. ఆలయ సామర్థ్యం దాదాపు రెండు వేల నుంచి మూడు వేలుగా ఉందని పలువురు చెబుతున్నారు. అయితే, ఈరోజు ఏకాదశి నేపథ్యంలో ఆలయానికి దాదాపు 25వేల మంది భక్తులు వచ్చినట్టు సమాచారం. కాగా, భక్తుల రద్దీని పోలీస్ ఇంటలిజెన్స్ విభాగం, ఆలయ కమిటీ అంచనా వేయలేదు. ఆలయ కమిటీ సొంతగా భద్రతను సైతం ఏర్పాటు చేయలేదు. వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీసు సిబ్బంది రాలేదు. గంట సమయం దాటినా ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ చేరుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కాశీబుగ్గ క్షతగాత్రులకు సీదిరి వైద్యం
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వైఎస్సార్సీపీ బృందం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.ఈ సందర్బంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో..‘కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భక్తుల ప్రాణనష్టానికి కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట’ అని తెలిపారు. మరోవైపు, ఈ ఘటనపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ..‘కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతీ ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’ అని విమర్శలు చేశారు. -
కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. 9 మంది మృతి
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలో(Srikakulam Stampade) విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో(Kashibugga Temple) తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో పది మందికి గాయపడినట్టు సమాచారం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివరాల ప్రకారం.. కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 9 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు.అయితే, ఓ భక్తుడు.. తనకు తిరుమలలో దర్శనం కాలేదని సొంతంగా ఆలయాన్ని నిర్మించాడు. 12 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంది. దీంతో, ఉత్తరాంధ్ర చిన్న తిరుపతిలా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రసిద్ధి చెందింది. చిన్న తిరుపతిగా పేరు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి సందర్బంగా ఆలయ అధికారులు, ఆలయ సిబ్బంది.. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో, అధికారుల నిర్లక్క్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సిబ్బంది ఉదాసీనతే ప్రమాదానికి ముఖ్య కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు. మృతులు వీరే..ఇదురి చిన్నమ్మి(50),రామేశ్వరం, టెక్కలిరాపాక విజయ(48), టెక్కలిమురిపింటి నీలమ్మ(60), దుక్కవానిపేట, వజ్రపుకొత్తూరుదువ్వు రాజేశ్వరి(60), బెలుపటియ, మందసచిన్ని యశోదమ్మ(56), శివరాంపురం, రూప, గుడిభద్రలొట్ల నిఖిల్(13), బెంకిలి, సోంపేటడొక్కర అమ్ముడమ్మ, పలాసబృందావతి(62), మందస కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతికాశీబుగ్గ తొక్కిసలా ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతులకు రెండు లక్షలు, గాయాల పాలై వారికి 50 వేలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. -
‘మెస్ చార్జీలు పెంచాలి’
పలాస: రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలను పెంచాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి ఎం.వినోద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పలాసలోని పీడీఎస్యూ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచలేదని, నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం పెరుగుతున్నాయన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ చార్జీ లు కూడా ప్రభుత్వం పెంచాలని కోరారు. హైస్కూల్ విద్యార్థులకు రూ.1400లు, కళాశాల విద్యార్థులకు రూ.1600లు మెస్ చార్జీలు పెంచాలని కోరారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేక హాస్టళ్లలో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని, అస్వస్థతకు గురువుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి సరైన వైద్యం అందివ్వాలని కోరారు. -
హామీలన్నీ డాబేనా..?
●బాబూ..● కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు జిల్లాకొచ్చి ఏడాది పూర్తి ● ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభం ● అదే రోజున జిల్లా కేంద్రంలో సమీక్ష ● తొలి పర్యటనలోఅనేక హామీలు ● ఏడాదైనా అమలుకు నోచుకోని పరిస్థితులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదని మరోసారి తేటతెల్లమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు తొలిసారి జిల్లాకు వచ్చి ఏడాదైంది. గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన ఇచ్ఛాపురం మండ లం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించారు. సినీ ఫక్కీలో యాక్షన్, ట్రిక్లతో హడావుడి చేశారు. వచ్చిన ప్రజలను ఉద్దేశించి ఎన్నో హామీలు ఇచ్చారు. అంతటితో ఆగలేదు. జిల్లా కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మరికొన్ని హామీలు ఇచ్చారు. ఏడాదైనా అవి అమలు కాలేదు. ఏడాది మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామ ని చెబుతూ పథకాన్ని ఈదుపురంలో ప్రారంభించారు. గ్యాస్ భారం తగ్గుతుందని, మహిళలకు కట్టెల కష్టాలు తీరుతాయని తెగ చెప్పారు. ఏటా తెలుపురేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు తప్పనిసరిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఉచిత సిలిండర్లకు ముందుగా డబ్బులు చెల్లిస్తే, 48 గంటల్లో లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు నగదు చెల్లించడం జరుగుతుందన్నారు. త్వరలో లబ్ధిదారుడు గ్యాస్ బుక్ చేసిన వెంటనే ప్రభుత్వమే గ్యాస్ కంపెనీకి ఆ డబ్బును జమచేస్తుందని, అప్పుడు డబ్బు చెల్లించకుండా నేరుగా సిలిండర్ను తీసుకోవచ్చన్నారు. కానీ ఆ హామీ చంద్రబాబు మాటలకే పరిమితమైంది. పథకం అమలు సమయంలో ఒక సిలిండర్ ఇచ్చారు. ఆ తర్వాత ఇవ్వాల్సిన మిగతా రెండు సిలిండర్లు ఇంతవరకు ఇవ్వలేదు. వినియోగదారులు డబ్బులు చెల్లించుకోవడం తప్ప ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు జమ కావడం లేదు. బెల్టుషాపులు పెడితే సహించేది లేదని బెల్టు తీస్తానని హెచ్చరించారు. అధిక ధరలకు అమ్మినా, బెల్టు షాపులు పెట్టినా సంబంధిత షాపునకు మొదటిసారి భారీ జరిమానా వేస్తామని, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మా హయాంలో నాసిరకం మద్యం ఉండదని స్పష్టం చేశారు. ఉచిత ఇసుక ఇస్తున్న ఏకై క ప్రభుత్వమని చెప్పుకున్నారు. చంద్రబాబు చెప్పినాక జిల్లాలో బెల్ట్షాపులు మరింత పెరిగిపోయాయి. సిండికేట్గా ఏర్పడిన టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే బెల్ట్షాపులు నడుస్తున్నాయి. బెల్ట్షాపులే కాదు లీజు షాపులకు పర్మిట్ రూమ్లు కూడా ఇచ్చి మద్యం విక్రయాలకు మరింత ప్రోత్సాహం అందించారు. ఇక, ఉచిత ఇసుక కోసం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జిల్లాలో ఉచిత ఇసుక మాటే లేదు. టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక ర్యాంపులు నిర్వహించి, ఏ స్థాయిలో దోచుకుంటున్నారో జిల్లా ప్రజలంతా చూస్తున్నారు. వర్షాకాలంలో నదుల్లో వరదలొస్తున్నా కూడా ఇసుక అక్రమ తవ్వకాలు ఆపడం లేదంటే ఉచిత ఇసుక పాలసీ ఏ రకంగా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్య హామీల సంగతులివి.. బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులు కోసం, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంతవరకు మంజూరు చేయలేదు. బెంతొరియాల పేరుతో స్థానికత ధ్రువపత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వడం లేదు. కానీ,ఈ హామీ పేరుతో ఎమ్మెల్యే రెండు సార్లు సన్మానాలు మాత్రం చేయించుకున్నారు. ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రెండింటిలో ఏదీ జరగడం లేదు. అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తానన్నారు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. చేసిందేమీ లేదు. ముఖ్య హామీల సంగతులివి.. బాహుదాలో గ్రోయిన్స్ తదితర మరమ్మతు పనులు కోసం, అరకబద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు కోసం రూ.30 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఇంతవరకు మంజూరు చేయలేదు. బెంతొరియాల పేరుతో స్థానికత ఽధ్రువపత్రాలు మంజూరు చేస్తామన్నారు. ఇప్పటికీ ఇవ్వడం లేదు. కానీ,ఈ హామీ పేరుతో ఎమ్మెల్యే రెండు సార్లు సన్మానాలు మాత్రం చేయించుకున్నారు. ఉద్దానంలో కొబ్బరి పార్కు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పేదలకు పల్లెల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాలు ఇస్తామన్నారు. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. రెండింటిలో ఏదీ జరగడం లేదు. అరసవల్లి సూర్య దేవాలయం అభివృద్ధికి రూ.100కోట్ల ప్రాజెక్టు మంజూరు చేస్తాను. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. పలాస కిడ్నీ కేంద్రానికి రూ.60కోట్లు ఇస్తున్నామని ప్రకటించారు. చేసిందేమీ లేదు. -
అర్ధరాత్రి అంగన్వాడీ భవనం కూల్చివేత
● కొంచాడలో ఘటన ● పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు పొందూరు: మండలంలోని కొంచాడ గ్రామంలోని అంగన్వాడీ భవనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి కూల్చేశారు. అంతేకాకుండా భవనం ఉన్న ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. గురువారం సాయంత్రం వరకు కనిపించిన అంగన్వాడీ కేంద్రం శుక్రవారం ఉదయానికి అక్కడ లేకపోవడంతో అంతా అవాక్కయ్యారు. బిల్డింగ్ కూ ల్చేసిన తర్వాత శిథిలాలు కూడా కనిపించకుండా తరలించుకుపోయారు. ఎవరు చేశారో..? ఎందుకు చేశారో..? తెలియని పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులంతా ఆందోళన చెందారు. గ్రామంలోని సర్వే నంబర్ 45లో 22, ఎల్పీఎం నంబర్ 953లో అంగన్వాడీ కేంద్రం ఉంది. దశాబ్దాలుగా వినియోగంలో ఉంది. ఈ కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో 2023లో గ్రామంలోని ప్రైవేటు ఇంటిలోకి కేంద్రాన్ని మార్చారు. శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించాలని ఐసీడీఎస్ అధికారులు ఉన్నతాధికారులకు అర్జీ పెట్టుకున్నారు. సంబంధించిన నివేదికలను అందించా రు. అక్కడే నూతన భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతలో రాత్రికి రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, వీఆర్ఓ ప్రకాశరావులు కూల్చివేసిన అంగన్వాడీ కేంద్రం ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
నేడు కల్యాణం.. రేపు తెప్పోత్సవం
● ఆదిత్యాలయంలో రెండు రోజుల పాటు స్వర్ణాలంకరణలో స్వామి దర్శనం ● ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా ప్రకటించిన ఈఓ ప్రసాద్ అరసవల్లి: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినోత్సవాల సందర్భంగా నేటి నుంచి రెండు రోజుల పాటు ఆదిత్యాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆలయ ఈఓ కేఎన్వీడీవీ ప్రసాద్ శుక్రవారం ప్రకటించారు. ఈ మేరకు కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం ఉదయం అనివెట్టి మండపంలో శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీసూర్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవాన్ని జరుపనున్నామని, అలాగే ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ఇంద్రపుష్కరిణిలో ఆదిత్యుని ఉత్సవమూర్తులను హంసవాహనంలో ఉంచి విహరించే ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా భక్తుల దర్శనాలకు వీలుగా ప్రత్యే క ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. అలాగే శని ఆదివారాల్లో రెండు రోజుల పాటు మూలవిరాట్టుకు పూర్తిగా స్వర్ణాలంకరణ చేస్తున్నామని, ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పా టు చేస్తున్నామన్నారు. ప్రతి భక్తుడూ స్వర్ణాదిత్యుడిని దగ్గర నుంచే దర్శించుకునేలా చర్యలు చేపడుతున్నట్లుగా ఈఓ ప్రకటించారు. ఈ రెండు రోజుల ఉత్సవాల నిర్వహణకు సంబంధిత శాఖాధికారుల సహకారాన్ని కోరినట్లుగా వివరించారు. -
శ్వేతపుష్కరిణిలో రసాయనాలు
● కూర్మనాథాలయంలో అపవిత్రమైన సంఘటన గార: పవిత్ర శ్రీకూర్మనాథాలయంలోని శ్వేతపుష్కరిణిలో చేపల కోసం రసాయనాలు కలుపుతుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ శ్వేత పుష్కరిణిలో లక్ష్మీదేవి విగ్రహం లభ్యమైందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పుష్కరిణిలో దక్షిణం వైపు పిండప్రదానాలు జరుగుతుంటాయి. గతంలో పనిచేసిన ఈఓ, 2024 లో మూడేళ్లు చేపల పెంపకానికి స్థానిక కండ్రపేట మత్స్యకార సొసైటీకి ఏడాదికి రూ.75 వేలు ఆలయానికి చెల్లించాలని, పుష్కరిణిలోని నాచు తొలగించడం వంటి నిబంధనలతో లీజుకిచ్చారు. వీటిలో చేపల పెరుగుదల సహజంగా జరగాల్సి ఉన్నా, వీటిని కాపాడుకునేందుకు రసాయనాలు కలుపుతుండటం చర్చనీయాంశమైంది. కొద్ది రోజులుగా రాత్రి వేళల్లో థర్మాకోల్ షీట్ల ద్వారా ఇద్దరు వ్యక్తులు పుష్కరిణి నీటిలో రసాయనాలు కలుపుతున్న ఫొటోలు వైరలవుతున్నాయి. కేవలం పసుపు, సున్నం మాత్రమే వేస్తున్నామని లీజుదారులు చెబుతున్నా, రాత్రి వేళలో కలుపుతుండటంతో అనుమానాలు కలుగజేస్తోంది. అదేవిధంగా చేపలు పెరుగుదల కోసం బ్రాయిలర్ కోడి చెత్తను కూడా వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎంతో పవిత్రంగా ఉండాల్సిన పుష్కరిణి నీటిని రసాయనాలు, వ్యర్థాలతో పాడు చేస్తున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ కె.నరసింహనాయుడు వద్ద ప్రస్తావించగా ఈ విషయం తన దృష్టికి శుక్రవారం వచ్చిందని, వెంటనే లీజుదారులు, అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులతో సమావేశం జరిపామన్నారు. ఇకపై ఇలాంటి ఘటన లు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. -
పొంగిన గుమ్మా గెడ్డ
● 300 ఎకరాల్లో నీటిలోనే వరి పంట పాతపట్నం: వరి పంట ఆశాజనకంగా ఉన్న తరుణంలో వచ్చిన మోంథా తుఫాన్ రైతుల ఆశలు అడియాసలు చేసింది. శుక్రవారం నాటికి గుమ్మా గెడ్డ, పోగడవెల్లి గెడ్డ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాల్లోకి చేరిన వరద నీటిని మళ్లించడానికి రైతు లు ఆపసోపాలు పడుతున్నారు. వ్యవసాయశాఖ ఏఓ కె.సింహాచలం నేతృత్వంలో వ్యవసాయశాఖ సిబ్బంది పంట పొలాలను పరిశీలించి, రైతులకు సలహాలు, సూచనలు అందజేయడమే కాకుండా పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పాతపట్నం మండలంలో గుమ్మా గెడ్డ ప్రాంతంలో సుమారు 300 ఎకరాల్లో వరి పంట నీటిలోనే ఉందని, వరి పంట నష్టానికి గురైనట్లు వ్యవసాయాశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలి నేను మూడు ఎకరాల వరి పంట వేశాను. ఇటీవల తుఫాన్ కారణంగా వరి పంట రెండు రోజులుగా నీటిలోనే ఉండిపోయింది. నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – తూలుగు ప్రవీణ్, రైతు, తిడ్డిమి గ్రామం, పాతపట్నం మండలం -
ఇప్పుడు జప్తు నోటీసులా..?
రోడ్డున పడేసి..● అరసవల్లి ఆలయం ముందు దుకాణదారుల ఆవేదన ● కరెంట్ మీటర్లు తొలగించి ఇప్పుడు బకాయి నోటీసులు ఇవ్వడంపై విస్మయం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నా యి. కూటమి ప్రభుత్వం వచ్చాక తాత్కాలిక ఉద్యోగులు, దుకాణదారులు వంటి వారు నిత్యం నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే ఆలయానికి రూ.వంద కోట్ల ప్రాజెక్టు వచ్చేస్తోందంటూ హడావుడి చేసి ఈ ఏడాది జనవరిలోనే ఆలయం ముందున్న 11 దుకాణాలను నేలమట్టం చేసేశారు. సంక్రాంతి వరకు ఆగమన్నా ఆగలేదు. రథసప్తమి రాష్ట్ర పండుగ సంబరాలంటూ దుకాణదారుల కడుపు కొట్టారు. సరే దేవుడే ఉన్నాడంటూ వాళ్లంతా తోపుడు బళ్లపై ఆలయం ముందే ప్రసాదాలను, కొబ్బరికాయలను విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతలో విద్యుత్ శాఖ నుంచి బకాయి నోటీసులంటూ తాజాగా శుక్రవారం వారికి నోటీసులు రావడంతో వారిలో ఆందోళన పెల్లుబికింది. కూల్చేసిన దుకాణాలకు బకాయిల బిల్లులేంటని విస్తుపోయారు. ఆస్తులను జప్తు చేస్తారట..! అరసవల్లి ఆలయానికి ఎదురుగా ఆలయానికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం 11 షాపులు ఉండేవి. ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా చేపట్టిన కూల్చివేతల పుణ్య మా అని జనవరి నుంచే వ్యాపారాలు లేక కుదేలయ్యారు. దుకాణాలు కూల్చేసిన సమయంలోనే విద్యుత్ మీటర్లను కూడా ఆయా శాఖ సిబ్బంది తొలగించేశారు. దీంతో అప్పటివరకు విద్యుత్ వినియోగానికి చెందిన విద్యుత్ బిల్లులను చెల్లించేశా రు. అయితే తాజాగా జనవరి నుంచి నేటి వరకు విద్యుత్ బిల్లులను చెల్లించాలంటూ 11 మందికి వేలాది రూపాయల బకాయిలున్నాయంటూ నోటీసులు జారీ అయ్యాయి. రానున్న ఏడు రోజుల్లో బకాయిలను చెల్లించకపోతే ఆస్తులను జప్తు చేస్తామని, అవసరమైతే వారి పేర్ల మీద ఉన్న మిగిలిన విద్యుత్ కనెక్షన్లను కూడా నిలుపుదల చేస్తా మంటూ హెచ్చరికల నోటీసులను విద్యుత్ శాఖ జారీ చేసింది. వాస్తవానికి జనవరి నుంచి ఆ తొలగించిన విద్యుత్ మీటర్లు వినియోగంలో లేవు. కానీ ఇప్పటివరకు బిల్లులను చెల్లించాలని నోటీసులు జారీ చేయడంపై దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
శ్రీకాకుళం
పెట్టింది తిను..టెక్కలి జిల్లా ఆస్పత్రిలో మెనూ అమలు కావడం లేదు. అధికారులు పర్యవేక్షించడం లేదు. –8లో● వేడుకగా ఏక్తా దివస్ పోలీసు అమరవీరుల స్మారకోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం రాత్రి ‘రాష్ట్రీ య ఏక్తాదివస్’ వేడుకగా జరిగింది. ఏటా అక్టోబరు 21 నుంచి 31 వరకు జరిగే ఈ స్మారకోత్సవాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి నాడు ముగిస్తారు. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ముందుగా విద్యార్థినీ విద్యార్థులకు, జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్ల నుంచి వ్యాసరచన, డిబేట్లలో పాల్గొన్న పోలీసులకు బహు మతులు, ప్రశంసాపత్రా లు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి, ప్రేరణగా నిలవాలని, గతంలో పోలీసులు ఫోర్స్ చూపించేవారని, ఇప్పుడు సర్వీస్ చూపిస్తున్నారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ త్యాగాలు దేశభక్తి వైపు అందరినీ నడిపిస్తున్నాయని, చనిపోయిన పోలీ సుల కుటుంబాలకు అండగా నిలవడం, పోలీసు సేవల గురించి ప్రజలకు తెలియజెప్పడమే ఈ స్మారకోత్సవాల ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి డే అండ్నైట్ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి అమరవీరులకు సంఘీభావం తెలిపారు. – శ్రీకాకుళం క్రైమ్ శనివారం శ్రీ 1 శ్రీ నవంబర్ శ్రీ 2025ఉక్కు మనిషికి నివాళులర్పిస్తూ ఊరూవాడా ఏక్తా దివస్ జరుపుకున్నాయి. వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కొత్తూరు నాలుగు రోడ్ల కూడలిలో విద్యార్థులు ఇలా నివాళులర్పించారు. – కొత్తూరు -
ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్థలం అప్పగింత
పొందూరు: ఉద్యోగ రీత్యా అమెరికాలో ఉంటూ విశాఖపట్నంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తమ్మినైన అప్పలనాయుడు తన స్వస్థలం పొందూరు మండలంలోని తాడివలస గ్రామంలోని తన సొంత స్థలాన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు దానం చేశారు. గ్రామంలో 1.5 సెంట్లలో ఉన్న తన పెంకుటింటిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి దానపట్టా కింద రిజిస్ట్రేషన్ చేసి పంచాయతీ కార్యదర్శి రామరాజీవ్కు పత్రాలను అందజేశారు. మరో చోట 5 సెంట్ల స్థలాన్ని బీసీ వసతి గృహ నిర్మాణం చేసుకునేందుకు రిజిస్ట్రేషన్ చేసి పత్రాలను ఆ శాఖ అధికారి బి.అనురాధకు అందించారు. ఈయన గతంలో తాడివలస జి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ.10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు రూ. 4 లక్షలతో భోజనశాలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ఉన్న రామమందిరం చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఆయన దాతృత్వానికి సర్పంచ్ మణెమ్మ కృతజ్ఞతలు తెలిపారు. నందిగాం: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు నష్టపోయిన వరి పంట వివరాలను సేకరించి నష్టాలను అంచనా వేస్తున్నా మని జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె.త్రినాథస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని దిమిలాడ, రాంపురం గ్రామాల్లో ఆయన ఆచా ర్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ పీవీ సత్యనారాయణతో కలిసి పర్యటించి నీట మునిగిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటిలో పంట ఉండిపోవడం, మొలకలు వచ్చిన పంటను రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలను అంచనా వేస్తున్నామని, నష్టం వివరాలు ప్రభుత్వానికి తెలియజేస్తామని తెలిపారు. అలాగే నీటిలో మునిగిన పంటను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలను రైతులకు వివరించారు. ఆయన వెంట అనకాపల్లి రీసెర్చ్ డైరెక్టర్ సీహెచ్ ముకుందరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఉన్నారు. ‘మీ మూలధనం.. మీ హక్కు’ పోస్టర్ ఆవిష్కరణ శ్రీకాకుళం పాతబస్టాండ్: భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభా గం ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికానికి ‘మీ మూలధనం.. మీ హక్కు’ ప్రత్యేక ప్రచార కార్యక్రమం పోస్టర్ను జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, పీడీ డీఆర్డీఏ కిరణ్ కుమార్, బీసీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డ్వామా పీడీ సుధాకర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పైడి రాజా పాల్గొన్నారు. జిల్లాలో డెఫ్ రూపంలో ఉన్న రూ.87.13 కోట్ల ప్రజాధనం వారికే చెందడం, తద్వారా జిల్లాలో మొత్తం 4,21,944 ఈ తరహా ఖాతాలు కలిగిన లబ్ధిదారులకు మేలు చేకూరేలా చేయడం, అలానే బీమా సంస్థల్లో ఉన్న ఇలాంటి నిద్ర ఖాతాలను వారికి అందేలా చేయడం దీని ఉద్దేశమని లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. -
‘చంద్రబాబే పెద్ద మోసకారి’
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సరుబుజ్జిలి: గడిచిన ఎన్నికల్లో ఎలాగైనా పదవి ద క్కించుకోవాలని చంద్రబాబు ఇష్టానుసారం హామీ లు ఇచ్చారని, పదవిలోకి వచ్చాక అన్నీ మర్చిపోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ధ్వజమెత్తారు. మండలంలోని సరుబుజ్జిలి గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటిసంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఽకృష్ణదాస్ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూము లను కార్పొరేట్ శక్తులకు ధారబోసి కోట్లాది రూపాయలు దోపిడీ చేసేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వం పరిపాలన పక్కన పెట్టి దాచుకోవడం, దోచుకోవడానికే ఎక్కువ సమ యం కేటాయిస్తోందని విమర్శించారు. పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చేస్తున్న దగాకోరు పాలనకు ప్రజలు చరమగీతం పాడాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కనపెట్టి థర్మల్ పేరుతో బూడిద, శాండ్, ల్యాండ్, లిక్కర్ వ్యాపారాల కోసం అధిక సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సురవరపు నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గం పరిశీలకులు కరిమి రాజేశ్వరరావు, రాష్ట్ర రైతు విభాగం నేత కె.శేఖర్, సరుబుజ్జిలి, బూర్జ మండలాల పార్టీ కన్వీనర్లు బెవర మల్లేశ్వరరావు, ఖండాపు గోవిందరావు, సరుబుజ్జిలి సర్పంచ్ బొడ్డేపల్లి చాందిని వెంకటసూర్య, పార్టీ ఉపాధ్యక్షుడు కింజరాపు సురేష్, పున్నపురెడ్డి తవిటినాయుడు, బొడ్డేపల్లి హరి, అత్తులూరి రవికాంత్, కొవిలాపు చంద్రశేఖర్, రావాడ రవికుమార్, ఇల్లాకుల సూర్యప్రకాశరావు, యడ్ల ఈశ్వరరావు, పుచ్చరాజారావు పాల్గొన్నారు. -
మూడు పూరిళ్లు దగ్ధం
రణస్థలం: లావేరు మండలం బుడుమూరులో శుక్రవారం ఉదయం 10 గంటలకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మూడు పూరిళ్లు అగ్నికి ఆహుతైనట్లు రణస్థలం అగ్నిమాపక అధికారి డి.హేమసుందరరావు తెలిపారు. సమాచారం అందగానే సిబ్బందితో వెళ్లి మంటలు అదుపుచేశారు. ముంత శ్రీరాము, ముంత గోపి, ముంత పైడిరాజులకు చెందిన మూడు పూరిళ్లు కాలిపోయాయి. సుమారు రూ.18 లక్షలు వరకు నష్టం వాటిల్లింది. 8తులాల బంగారం, ఇంటి సామగ్రి, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్, రేషన్ కార్డులు కాలిబూడిదయ్యాయి. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యులు వంట సామగ్రి, టార్పాలిన్లు, దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్కాస్ ప్రతినిధులు కె.సత్యనారాయణ, పి.చైతన్యకుమార్, పి.సుజాత, పి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం పెద్దబమ్మిడి పంచాయతీ నర్శింగపల్లి సమీప తోటలో ఓ వ్యక్తి ఉరివేసుకుని మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు పెద్దబమ్మిడి పంచాయతీ నిమ్మాడ జంక్షన్ వద్ద కాలనీకి చెందిన బలివాడ మోహన్(45)గా గుర్తించారు. ఈయన కొద్ది సంవత్సరాలుగా భార్యాపిల్లలతో కలిసి శ్రీకాకుళంలో కొత్త రోడ్డులో కిరాణా షాపు నడుపుతున్నాడు. గురువారం నిమ్మాడలోని తన అన్నయ్య తిరుపతి ఇంటికి వచ్చాడు. వదినకు డబ్బులు, తాడు అడగ్గా.. లేదని సమాధానం చెప్పడంతో జలుమూరు మండలం కొండకామేశ్వరిపేటలోని చెల్లి జ్యోతి ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం నర్శింగపల్లి గ్రామ సమీప తోట వద్ద గ్రానైట్ ఫ్యాక్టరీ కూలీలు మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య హేమలత, కుమార్తె ఉన్నారు. మోహన్ మృతికి గల కారణాలు తెలియాలేదు. కోటబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెట్టింది తిను..అదే మెనూ!
● టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ఇష్టారాజ్యంగా డైట్ ● అధికారుల పర్యవేక్షణ లోపం.. రోగులకు శాపంటెక్కలి రూరల్ : ఆంధ్రప్రదేశ్ వైద్యవిధాన్ పరిషత్ టెక్కలి జిల్లా ఆస్పత్రిలో రోగులకు నిత్యం పెట్టే భోజనాలకు సంబంధించి మెనూ సక్రమంగా పాటించడం లేదని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే అంతా తమ ఇష్టమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ప్రతి రోజు ఉప్మా పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఎవరైనా అడిగితే నచ్చితే తినండి లేదంటే బయటకు వెళ్లి తెచ్చుకోండి అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. మార్కెట్లో ఏది తక్కువ రేటుకు దొరికితే అదే కూరగాయలు తీసుకొచ్చి మెనూకు విరుద్ధంగా వండి పెడుతున్నారని చెబుతున్నారు. వాస్తవానికి ప్రతిరోజు రెండు పూటలా గుడ్లు పెట్టాలని చార్టులో పేర్కొన్నా.. ఒక్కపూటే గుడ్డు అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందొచ్చిన వారికే భోజనం.. ఆస్పత్రిలో ప్రతిరోజూ సుమారు 30 మంది రోగులకు భోజనాలు పెట్టాల్సి ఉంది. అయితే 20 మందికి మాత్రమే వండుతున్నారని, ఎవరు ముందు ఉంటే వారికే భోజనాలు పెట్టి మిగిలిన వారికి లేవనే సమాధానం చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ప్రసూతి విభాగంలో ఉండే బాలింతలకు పూర్తిస్థాయిలో భోజనాలు పెట్టకపోవడంతో వారి బంధువులు ప్రశ్నించారు. ముందు వచ్చిన వారికే భోజనాలు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. గట్టిగా ప్రశ్నించడంతో చివరకు మళ్లీ వండి పెట్టారు. పర్యవేక్షణ కరువు.. నిత్యం రోగులకు పెట్టే భోజనాలపై ఆస్పత్రి సూపరింటెండెంట్, హెడ్ సిస్టర్స్ల పర్యవేక్షణ లేకుండాపోతోంది. అందుకే డైట్ నిర్వాహకులు వారికి నచ్చినట్లు వండుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెనూలో రోజుకో రకం వండి పెట్టాలని ఉన్న అవి రాతలుగానే మిగిలిపోతున్నాయి. వండిన వంటలు కూడా రుచిగా ఉండటం లేదని రోగులు, వారి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మెనూ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు వాపోతున్నారు. ఆస్పత్రిలో ప్రతి రోజు ఉదయం టిఫిన్గా ఉప్మా పెడుతున్నారు. రోజుకొక రకం అందించాలని చార్టులో ఉన్నా నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. అరకొరగా భోజనం అందించడంతో అర్ధాకలితోనే ఉండాల్సిన పరిస్థితి. – టి.మాణిక్యం, రోగి సహాయకులు, తర్లిపేట ఆస్పత్రి మెనూ ప్రకారం వంటకాలు చేయాల్సి ఉన్నా డైట్ సిబ్బంది అనుసరించడం లేదు. నిత్యం వండి పెట్టే భోజనాలు ఎలా ఉన్నాయనే దానిపై సంబంధిత సిబ్బంది పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. – కన్నా బెహరా, ఇన్పేషెంట్, ఆకాశలక్కవరం ఆసుపత్రిలో రోగులకు డైట్ సక్రమంగా అమలు కావడం లేదనే విషయం మా దృష్టికి రాలేదు. ఇకపై ఆ తప్పు జరుగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రతి రోజు పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు పెట్టేవిలా చర్యలు తీసుకుంటాం. – బొడ్డేపల్లి సూర్యారావు, టెక్కలి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ -
బాబోయ్ దొంగలు!
● వరుస చోరీలతో రెచ్చిపోతున్న దుండగులు ● ముఖ్య కూడళ్లలో పనిచేయని సీసీ కెమెరాలు శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. క్లూస్, సాంకేతిక ఆధారాలతో ఎప్పటికప్పుడు ప్రాపర్టీ నేరాలను అరికడుతున్నామన్న ఎస్పీ చెబుతున్నా జిల్లా పోలీసులకు వరుస చోరీలతో గజదొంగలు సవాల్ విసురుతున్నారు. ఫింగర్ ప్రింట్, సీసీఎస్, టాస్క్ఫోర్సు, జిల్లాలో కొన్ని స్టేషన్ల అధికారులు మాత్రమే సాంకేతికంగాను, ఇతర ఆధారాలతోనూ కేసులు ఛేదిస్తున్నారు. అయినప్పటికీ చాలావరకు కేసులు పెండింగ్లో ఉండిపోవడాన్ని ఎస్పీ ప్రస్తావిస్తున్నారు. సమీక్ష సమావేశాల్లో ట్రాక్రికార్డు బాగాలేని అధికారులను గట్టిగానే హెచ్చరిస్తున్నా ఫలితం ఉండటం లేదు. ఏవీ సీసీ కెమెరాలు..? దొంగలని పట్టడంలో అత్యంత కీలకమైన సీసీ ఫుటేజీ కెమెరాలు జిల్లావ్యాప్తంగా ముఖ్య కూడళ్లలో చాలా తక్కువగా ఉన్నాయి. ఉన్నవి కూడా పూర్తిగా మరమ్మతులైనవే. దాదాపు 1500 సీసీ కెమెరాలు కావాల్సివున్నా.. 900 మాత్రమే ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని కోర్టు వెనుక చినబొందిళీపురం, పీఎన్కాలనీ, బ్యాంకర్స్ కాలనీ, ఇందిరానగర్, న్యూకాలనీల్లో ఎటువంటి క్రైమ్ జరిగినా ఆ కేసు సంవత్సరాలు పట్టే రీతిలో ఉన్నాయి. పీఎన్కాలనీ పదోలైన్లో ఉపాధ్యాయుల ఇంట్లో గతేడాది అక్టోబరులో చోరికి గురైన 13 తులాలు ఈ కోవకే వస్తాయి. అక్కడికి కొద్ది దూరంలోనే మరో ఇంట్లో రూ. 6 లక్షలు చోరీకి గురయ్యాయి. అక్టోబరులో చోరీ జరిగితే జనవరిలో సీసీఫుటేజీలో చోరీ చేసిన వ్యక్తి కనపడ్డాడు. కాశీబుగ్గ, నరసన్నపేట, టెక్కలి, కంచిలి, సోంపేట వంటి ప్రాంతాలదీ ఇదే పరిస్థితి. సీఎస్ఆర్, పోలీసింగ్ ఫండ్సే కాక ప్రజలే దాతలై ఇస్తే సీసీ కెమెరాలు మొత్తానికి పెట్టొచ్చులే అన్నచందంగా అటు కూటమి ప్రభుత్వం, ఇటు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎస్పీ ఏమన్నారంటే.. ఇటీవల జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ప్రాపర్టీ నేరాలపై గట్టిగానే హెచ్చరించారు. పెండింగ్ కేసులపై ఆ పరిధి పోలీస్స్టేషన్లే కాక అందరినీ భాగస్వామ్యులుగా చేస్తూ ప్రత్యేక బృందాలుగా విడిపోయి కేసులను ఛేదించాలని ఆదేశించారు. నేరస్థుల కదలికలపై పూర్తి నిఘా పెట్టాలని, రాత్రి పూట బీట్ వ్యవస్థ మెరుగవ్వాలని, చెక్పోస్టుల్లో ప్రతీ వాహనాన్ని తనిఖీ చేయాలన్నారు. ఈ ఏడాది జులైలో కంచిలిలో రిటైర్డ్ లెక్చరర్ ఇంట్లో 25 తులాలు, కిలో వెండి ఆభరణాలు కొట్టేసిన వారిలో ఓ హిజ్రాతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లకు చెందిన మరో నలుగురున్నారు. 12.3 తులాలే రికవరీ కాగా హిజ్రా పట్టుబడింది. వీరందరిపై లెక్కకు మించి కేసులున్నాయి. గార మండలం మత్స్యలేశం–కళింగపట్నం పోర్టు వరస ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు కాకినాడ వాసులు ఇటీవలే 186 గ్రాముల బంగారం, 283 గ్రాముల వెండితో పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరిపై 25కి పైగా కేసులు, ఒకరిపై హత్యాయత్నం కేసుంది. ఇదే నెల 10న వివిధ జిల్లాలకు చెందిన ట్రాన్స్జెండర్లు నరసన్నపేటలో పలు ఛైన్స్నాచింగ్లకు పాల్పడ్డారు. సాలూరు, విశాఖలకు చెందిన నేరగాళ్లు రూ. లక్షల విలువైన బుల్లెట్ల చోరీకి పాల్పడ్డారు. తాజాగా కాశీబుగ్గలోని నాలుగు మెడికల్ షాపుల్లో దాదాపు రూ. 6 లక్షల వరకు నగదు చోరీ చేశారు. సారవకోట మండలం బుడితిలో ఓ వృద్ధురాలిపై దాడి చేసి బంగారాన్ని కాజేశారు. ఏపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దున్న కృష్ణ. దాదాపు 200కు పైగా చోరీలు చేశాడు. కాళ్లు విరిగి నడవలేడనుకున్నవాడే గత ఆరుమాసాలుగా పోలీసులకు ముప్పు తిప్పలు పెడుతూ కొరకరాని కొయ్యగా మారాడు. -
చోరీ కేసు నిందితులు అరెస్టు
సారవకోట: మండలంలోని బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ(78) అనే వృద్ధురాలిపై అక్టోబర్ 27న రాత్రి జరిగిన దాడి, దొంగతనం కేసును సారవకోట పోలీసులు ఛేదించారు. శుక్రవారం సారవకోట పోలీసుస్టేషన్లో నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు విలేకరులకు వివరాలు వెల్లడించారు. చీడిపూడి గ్రామానికి చెందిన రావాడ దేవీప్రసాద్(19), జలుమూరు మండలం నామాలపేటకు చెందిన తియ్యాల గోపి(19) చెడు వ్యసనాలకు బానిసయ్యారు. ఈ క్రమంలో దేవీప్రసాద్ అక్టోబర్ 27న రాత్రి ఒంటరిగా ఉన్న నక్క చెల్లెమ్మ ఇంట్లో చొరబడి ఆమె ముక్కు, చెవిలో ఉన్న అరతులం బంగారం దొంగిలించాడు. ఆమె ప్రతిఘటించడంతో ఇనుప చువ్వతో మెడపై గాయపర్చాడు. బయట నుంచి ఎవ్వరూ రాకుండా గోపి కాపాలా కాశాడు. చోరీ చేసిన బంగారంతో ఇద్దరు పరారయ్యారు. గాయపడిన చెల్లెమ్మను మరుసటిరోజు స్థానికులు గమనించి బుడితి సీహెచ్సీలో చేర్పించి చికిత్స చేయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ అనిల్కుమార్ దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం బొంతు జంక్షన్లో వీరిద్దరూ ఉన్నారని సమాచారం రావడంతో వెళ్లి పట్టుకున్నారు. ఇద్దరిపైనా చోరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించారు. కేసును త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ, సిబ్బందిని సీఐ అభినందించారు. -
నేడు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని శనివారం విజయవంతం చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం ఫలితంగా ఏర్పడినదే ఆంధ్ర రాష్ట్రమని, అమరజీవిని స్మరించుకుంటూ పాతబస్టాండ్ కూడలిలో ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమానికి పార్టీ శ్రేణులంతా హాజరుకావాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం తదితరు హాజరవ్వనున్నట్లు తెలిపారు. ప్రొవిజినల్ మెరిట్లిస్ట్ సిద్ధం శ్రీకాకుళం: శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాల సర్వజన ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులకు భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టును సిద్ధం చేసినట్లు ప్రిన్సిపాల్ శుక్రవారం తెలిపారు. వెబ్సైట్లో నవంబర్ 4 వరకు జాబితా అందుబాటులో ఉంటుందని, అభ్యంతరాలు ఉంటే అదే తేదీ సాయంత్రం నాలుగు గంటల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. అనంతరం తుది మెరిట్ జాబితా వెల్లడిస్తామని పేర్కొన్నారు. స్కిల్హబ్ సెంటర్లో ఉచిత శిక్షణ ఎచ్చెర్ల: ఎచ్చెర్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఐటీఐ స్కిల్హబ్ సెంటర్లో ఉచిత ఉపాధి శిక్షణ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్.సుధాకరరావు శుక్రవారం తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, అసిస్టెంట్ మాన్యూవల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. టెన్త్, ఆపై విద్యార్హత కలిగిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువకులు అర్హులని తెలిపారు. శిక్షణ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్తో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటా ధ్రువపత్రాలతో నవంబర్ 10లోపు స్కిల్హబ్ సెంటర్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 7989177887 నంబర్కు సంప్రదించాలని కోరారు. రూ.33 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపిక టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ విభాగం విద్యార్థి ఎం.వి.వి.కె.రాఘవన్ ప్రఖ్యాత సర్వీస్ నౌ ఐటీ కంపెనీలో రూ.33.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగానికి ఎంపికై నట్లు కాలేజీ డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రాఘవన్ను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.సంతోష్కుమార్, సీఎస్డీ డీన్ టి.నరేష్, ప్లేస్మెంట్ డీన్ ఎం.సంతోష్కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెచ్ఓడీ శ్రీకాంత్ పాల్గొన్నారు. రేపు బీసీ ఉద్యోగుల సమావేశం శ్రీకాకుళం (పీఎన్కాలనీ): బీసీ/ఓబీసీ ఎంప్లాయిస్ అసోషియేషన్ సమావేశం ఈ నెల 2న శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ వద్ద నిర్వహించనున్నట్లు సంఘ నాయకులు శుక్రవారం తెలిపారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గుత్తుల వీరబ్రహ్మం, పి.భూషణరావు, స్టేట్ జనరల్ సెక్రటరీ వై.శంకరరావు, స్టేట్ ట్రజరర్ కొణతాల గణేష్, జిల్లా అధ్యక్షుడు అనకాపల్లి, బి.వి.వరప్రసాద్, ఎన్నికల అధికారి పి.రామచంద్రరావు హాజరవుతారని పేర్కొన్నారు. బీసీ /ఓబీసీ ఉద్యోగులంతా హాజరుకావాలని కోరారు. -
హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్: డ్రైవింగ్లో నైపుణ్యాన్ని సాధించాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో హెవీ డ్రైవింగ్ శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా హెవీ లైసెన్సు పొందేందుకు లైట్ మోటారు వెహికిల్ లైసెన్స్ కలిగిన ఎస్సీ అభ్యర్థులు నుంచి ఇటీవల దరఖాస్తులు కోరగా 32 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో పది మందిని శిక్షణకు ఎంపిక చేసినట్లు వివరించారు. 32 రోజుల శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెవీ లైసెన్సుతో డ్రైవింగ్లో ఉపాధి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆర్.గడ్డెమ్మ, డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, ఆర్టీసీ డిపో– 1 డీఎం అమరసింహుడు, పీఆర్ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
పోలీసుల రక్తదానం
శ్రీకాకుళం క్రైమ్ : పోలీసు విధులు అత్యంత బాధ్యతాయుతమైనవని, ఒత్తిడితో కూడుకున్నవని, ఆరోగ్యంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి సూచించారు. పోలీసు అమరవీరుల స్మారకోత్సవంలో భాగంగా గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు, సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ మెగా ఉచిత వైద్యం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముందుగా ఎస్పీ వివిధ వైద్య పరీక్షలు చేయించుకుని స్వయంగా రక్తదానం చేసి సిబ్బందిలో స్ఫూర్తి నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం ఒక మానవతా సేవ అని, మన రక్తం వేరొకరిని రక్షిస్తుందని, ఏడాదికి ఒకసారైనా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బందికి మెడికవర్ ఆస్పత్రి సౌజన్యంతో వైద్యబృందం ద్వారా రక్తపోటు, షుగర్, కంటి పరీక్షలు, సాధారణ ఆరో గ్య పరీక్షలు నిర్వహించారు. రెడ్క్రాస్, జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమం జరిగింది. అనంతరం వారికి ప్రశంసాపత్రాలు అందించారు. అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు. కూలిన ఇళ్లుకవిటి: మండలంలోని ఆర్.భైరిపురంలో మోంఽథా తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలకు బాగా తడిసిముద్దయిన ఇంటి గోడ కూలింది. గ్రామానికి చెందిన బొర్ర సుందరరావు ఇంటికి తూర్పు భాగంలో ఉన్న గోడ గురువారం ఉదయం కూలింది. నరసన్నపేట: మండలం ఉర్లాం పశువైద్య కేంద్ర భవనానికి చెందిన గోడ వర్షాలకు కూలింది. ఇప్పటికే శిథిలావస్థలో ఉన్న ఈ పశువైద్య కేంద్ర భవనం గోడ కూలడంతో సిబ్బంది భయాందోళన చెందుతున్నారు. గురువారం ఉదయం గోడ కూలిందని సిబ్బంది తెలిపారు. హిరమండలం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎల్ఎన్పేట రోటరీనగర్లో ఇల్లు కూలిపోయింది. కలగ అచ్చయ్య అనే వృద్ధుడి ఇంటి గోడ వర్షాలకు నానిపోయింది. బుధవారం రాత్రి పెద్ద శబ్దాలతో గోడ కూలడంతో అచ్చయ్య భయంతో ఇంటి నుంచి పరుగులు తీశారు. త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. -
‘కార్గో ఎయిర్పోర్టు’ వద్దంటే వద్దు
పలాస: మందస మండలంలో ప్రభుత్వం తలపెట్టిన కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ ప్రతిపాదనలను రద్దు చేయాలి, బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్ష ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు కాశీబుగ్గలోని ఒక కల్యాణ మండపంలో గురువారం కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. పోరాట కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సహాయ కార్యదర్శి లండ వెంకటరావు, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, పోరా ట కమిటీ కార్యదర్శి జోగి అప్పారావు మాట్లాడుతూ కార్గో ఎయిర్ పోర్టు ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని కోరారు. అలాగే నవంబరు 18న పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓ వైపు తుఫాన్లో జనం బిక్కుబిక్కు మంటూ ఉంటే భూ సర్వే కోసం ఎలా వస్తారని ప్రశ్నించారు. ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇది కట్టాలనుకుంటున్నారో ప్రజలు తెలుసుకుంటున్నారని, మీ ఆటలు ఇక్కడ సాగ వని హెచ్చరించారు. జీడి కొబ్బరి రైతులకు గి ట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.మోహనరావు, తెప్పల ఆజయ్కుమార్, మద్దిల రామారావు, ఎన్.గణపతి, కె.శ్రీనివాసరావు, పుచ్చ దు ర్యోధనరావు, బత్తిన లక్ష్మణరావు, గుంటు లోకనాథం, గుంటు రామస్వామి పాల్గొన్నారు. -
అపరాలకు దెబ్బ
కొత్తూరు: మోంథా తుఫాన్ వల్ల మినుము, పెసర వంటి పంటలకు అపార నష్టం వాటిల్లింది. జిల్లాలోని కొత్తూరు, హిరమండలం, లావేరు, ఎచ్చెర్ల, బూర్జ, సరుబుజ్జిలి మండలాలతో పాటు పలు మండలాల్లో ఉన్న మెట్టు ప్రాంతాల్లో సుమారు 230 హెక్టార్లలో మినుము, పెసర, కంది వంటి అపరాలను రైతులు సాగు చేస్తున్నారు. మరో 10 నుంచి 15 రోజుల్లో చేతికి అందుతుంది అనుకున్న పంట తుఫాన్కు నాశనమైంది. పరిశీలిస్తాం తుఫాన్ వల్ల నష్టపోయిన అపరాల పంటలను పరిశీలన చేస్తాం. మండల వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో గ్రామ వ్యవసాయ సహయకులు పంటలు పరిశీలించి నమోదు చేస్తారు. – కె.త్రినాథ స్వామి, జేడీ, జిల్లా వ్యవసాయ శాఖ, శ్రీకాకుళం -
చేజారింది పంటంతా..!
● అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చిన తుఫాన్ ● పడిపోయిన పంటను చూసిన లబోదిబోమంటున్న రైతులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలుమూడు రోజులుగా కురిసిన వర్షాలకు నీటిలో మునిగిన పంట పొలాలివి. ఇచ్ఛాపురం మండలం తులసిగాం గ్రామానికి చెందినవి. దాదాపు 800 ఎకరాలు నీట మునిగాయి. పొలా లు కాస్త చెరువులా తయారయ్యాయి. చేతికొ చ్చిన పంట పూర్తిగా నీట మునగడంతో గింజలు ఉండే పరిస్థితి లేదు. వరి దుబ్బులే మిగులుతాయి. ఇదీ ఇక్కడి రైతుల దయనీయ పరిస్థితి. చేతికందిన పంట ధ్వంసం మాకు 80 సెంట్లు భూమి ఉంది. ఈ పొలంలో పండిన పంటే మాకు ఏడాది పొడవునా జీవనాధారం. పండిన ధాన్యాన్ని కొంత మేరకు నిల్వ చేసుకుని మిగిలిన ధాన్యం ఖర్చుల నిమిత్తం విక్రయిస్తుంటాను. మూడు నెలలు నుంచి అన్ని రకాలుగా పంటను కాపాడుకుంటూ వచ్చాను. ఎన్ను బాగా వేసింది. దిగుబడి బాగుంటుంది అనుకుంటున్న సమయంలో తుఫాన్ వచ్చి ముంచేసింది. 30 బస్తాలు పండుతాయనుకుంటే 10 బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. పంటను చూడటానికి అధికారులు ఎవరూ రాలేదు. నష్టం గుర్తించాలి. – మజ్జి గంటడు, సారవకోట పెట్టుబడి నీటిపాలు పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయి, మాకు కన్నీరే మిగిలింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి అందుతున్న సమయంలో నేల కొరిగి నీటి పాలైంది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆర్ధికంగా నష్టపోతాం. మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం. – నేలకొరిగిన పంటను చూపిస్తున్న పొందల రామారావు, దిమిలాడ, నందిగాం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మోంథా రైతు కంట కన్నీరు తెప్పించింది. చేతికి అందిన పంట నీటి పాలైతే.. కష్టమంతా కళ్ల ముందే మునిగిపోతుంటే.. నాలుగు నెలల కష్టం ఒక్క వర్షానికే నాశనమైపోయిన దృశ్యాలు చూస్తుంటే ఆ రైతుల గుండె తరుక్కుపోతోంది. వేల రూపాయలు పెట్టుబడి, ఆరు గాలం కష్టపడి పండించిన పంట ఒక్క రోజులో నేలమట్టమైతే అన్నదాతలకు గుండె ఆగిపోయినంత పనవుతోంది. ఇప్పుడు జిల్లాలో రైతుల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. పండిన పంట నీట మునగడంతో కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగిల్చాయి. వారి ఆశలపై నీళ్లు జల్లాయి. భారీ వర్షాలు అన్నదాతలకు పిడుగుపాటుగా మారాయి. చేతికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. కళ్ల ముందు పంట నాశనం కావడంతో గుండెలు బాదుకుంటున్నారు. ఆపదలో ఉన్న తమను ఆదుకోవాలని, కనీసం పెట్టిన పెట్టుబడైనా సాయం చేయాలని, మానవత్వంతో కూడిన ఆపన్నహస్తం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఒక్క వరి పంటే కాదు.. మొక్కజొన్న, పత్తి, ఉద్యానవన పంటలు కూడా వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 9వేల ఎకరాల వరి, 87.5ఎకరాలు పత్తి, 62.5ఎకరాలు మొక్కజొన్నకు నష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ లెక్క ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చాలా గ్రామాల్లో, చాలా రైతుల పొలాల వద్దకు అధికారులు ఇంకా రాలేదని, తమ నష్టాన్ని గుర్తించలేదని చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే జిల్లాలో 20వేల ఎకరాల వరకు పంటకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. వందలాది ఎకరాల్లో పంట నీట మునగగా, చాలా చోట్ల కంకులు నేలకొరిగాయి. ఉద్యానవన పంటలైతే చెప్పనక్కర్లేదు. పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నిబంధనల పేరుతో లెక్కలోకి తీసుకోకపోవడంతో చాలా మంది రైతులు గగ్గోలు పెడుతున్నారు. -
ఏదీ ఉచిత రేషన్..
● తుఫాన్ బాధితులకు అందని రేషన్ ● ప్రభుత్వ హామీ ప్రకటనకే పరిమితం ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బాధిత మత్స్యకార కుటుంబాలకు 50 కిలోల బియ్యం, సాధారణ కుటుంబాలకు 25 కిలోల బి య్యం, ఒక కిలో కంది పప్పు, లీటర్ మంచి నూనె, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు, కిలో చక్కెరను తక్షణం తుఫాన్ ప్రాంతంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఆదే శాలు జారీ చేశారు. అయితే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసి నేటికి మూడు రోజులవుతున్నా తమకు ఎలాంటి సరుకులు అందలేదని బాధిత కుటుంబా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్ఛాపురం మండలంలో తుఫాన్ ప్రభావిత పంచాయతీ బూర్జపాడులో మత్స్యకారులకు చెందిన 541 రేషన్ కార్డులు, 1048 ఇతరుల రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని బాధితులకు నిత్యావసర సరకులు ఇస్తున్నట్లు గురువారం ప్రకటించడంతో కార్డుదారులు రేషన్ దుకాణాలకు ఆశగా వెళ్లారు. కానీ ప్రస్తుతానికి నవంబర్కు సంబంధించి బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నామని, ఉచిత సరుకులపై తమకు ఎలాంటి ఆదేశాలు, సరుకులు రెండూ రాలేదని డీలర్లు తెలిపారు. దీంతో బాధితులకు నిరాశ తప్పలేదు. గురువారం సాయంత్రం నవంబర్ నెలకు సంబంధించి నిత్యావసర సరుకులు ఇస్తుండగా, ఈ–పాస్ మిషన్లో ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి 50 కేజీల బియ్యం, పప్పు, నూనె, ఉల్లి, బంగాళాదుంపలు ఇస్తున్నట్లు మెసేజ్ రావడంతో రేషన్ డీలర్లు అవాక్కయ్యారు. ఇంకా తమకు రాని ఉచిత సరుకులను ఎలా ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. దీంతో 70 శాతం మంది కార్డుదారులకు నవంబర్ నెలకు సంబంధించి సరుకులు అందజేయకుండా రేషన్ దుకాణాలకు తాళాలు వేసేశారు. జీఓ వచ్చింది గానీ... సరుకులు రాలేదు తుఫాన్ ప్రభావిత గ్రామాల్లో ఉన్న మత్స్యకారులకు 50 కిలోల బియ్యం, ఇతరులకు పాతిక కిలోల బియ్యంతో పాటు కిలో చొప్పున పప్పు, నూనె, పంచదార, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇవ్వాలని సివిల్ సప్లై కమిషనర్ నుంచి జీఓ వచ్చింది. అయితే మాకు సరుకులు మాత్రం రాకపోవడంతో ఇవ్వలేకపోయాం. ఇచ్ఛాపురం మండలం బూర్జపా డు పంచాయతీలో 1,589 కార్డుదారులు ఉండగా, కవిటి మండలానికి సంబంధించి తుఫాన్ ప్రభావిత మత్స్యకార కార్డుదారుల జాబితను మత్స్యశాఖాధికారులు ఇంతవరకు అందివ్వలేదు. సరుకులు వచ్చి న వెంటనే బాధితులకు ఉచితంగా అందిస్తాం. – కె.సంతోష్, సివిల్ సప్లై డీటీ, ఇచ్ఛాపురం మండలం మత్స్యకారులకు ఫ్రీ అన్నారు తుఫాన్ కారణంగా మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తున్నట్లు మాకు తెలిసి డీలర్ వద్దకు వెళ్తే... మా కార్డుకు పాతిక కిలో బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే ఇచ్చారు. గత వారం రోజులుగా చేపల వేట లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి. అవసరం ఉన్నప్పుడు ఉచిత సరుకులు ఇచ్చి ఉంటే బాగుండేది. – చింతకాయల పున్నమ్మ, కార్డుదారురాలు, డొంకూరు -
ప్రచారంలో పీక్
● తుఫాన్ సహాయక చర్యల్లో వీక్..సాక్షి, అమరావతి/నరసన్నపేట: మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కానీ ప్రచార ఆర్భాటంలో మాత్రం హంగా మా చేసిందని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రీజనల్ కో– ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేతలంతా తమ ప్రాంతాల పరిస్థితిని వివరించారు. రైతులను పట్టించుకునే దిక్కే లేదు.. మోంథా తుఫాన్పై సాయం కంటే ప్రచారమే అధికంగా ఉంది. తుఫాన్ వల్ల వరి మాత్రం బాగా దెబ్బతింది. మా దగ్గర 80 శాతం పంట నష్టం జరిగింది. ప్రభావిత ప్రాంతాల్లో నాయకులందరం అందుబాటులో ఉండి తిరిగాం. రైతుల తర్వాత తీవ్రంగా నష్టపోయింది మత్స్యకారులు. తెప్పలు, బోట్లు దెబ్బతిన్నాయి. కాకినాడ రూరల్లో ఒక మత్స్యకార యువకుడు చనిపోయాడు. వారికి జరిగిన నష్టం ప్రజలకు కనిపించదు. ప్రచారం పీక్. సహాయ కార్యక్రమాలు వీక్గా ఉంది. ఉచిత పంటల బీమాలో ప్రీమియం ఒక్కో జిల్లాలో ఒక విధంగా ఉంది. దీని వల్ల రైతులపై చాలా భారం పడుతోంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో, రైతులపై ఇన్స్యూరెన్స్ ప్రీమియం భారం ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడానికి, నష్టం చాలా తక్కువ చూపుతున్నారు. ఇంకా మార్కెటింగ్ శాఖ పనితీరు మరీ భయానక స్థితిలో ఉంది. ఏ సీజన్కి ఆ సీజన్లో మనం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకుంటే, ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అమలు కావడం లేదు. నిన్న ప్రాథమిక అంచనాలు చూస్తే ఆర్ అండ్ బీ రోడ్లు 297 రోడ్లు మీద నుంచి వరద నీరు ప్రవహించి రూ.1424 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కానీ పంటలు మాత్రం రూ. 300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పుకుంటున్నారు. ఇంత భారీ వర్షాలకు రోడ్లే కొట్టుకుపోతే పంటలు ఆగుతాయా? – కురసాల కన్నబాబు, పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ రైతులంతా మనల్నే తలచుకుంటున్నారు జిల్లాలో 10 మండలాల్లో పంట నష్టం జరిగింది. 53 గ్రామాల్లో తుఫాన్ ప్రభావం చూపింది. 30 శిబిరాలు పెట్టామని 800 మందిని తరలించామని చెబుతున్నారు. ఇప్పుడు రైతులంతా మనల్ని తల్చుకుంటున్నారు. మన హయాంలో జరిగిన మేలు గుర్తు చేసుకుంటున్నారు. ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు వైఎస్ జగన్ లాంటి నాయకుడు మనకు అవసరమని చర్చించుకుంటున్నా రు. కష్టాలు వచ్చినప్పుడే సరైన నాయకత్వం గుర్తుకు వస్తుంది. ఈ ప్రభుత్వంలో రైతులు ఏమీ ఆశించడం లేదు. – ధర్మాన కృష్ణదాస్, పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేతల ధ్వజం తుఫాన్ సహాయక పనుల్లో కనిపించని మంత్రులు వీడియో కాన్ఫరెన్స్లో వైఎస్సార్సీపీ నేతల వెల్లడి -
వర్షార్పణం
టన్నుల ఎండు చేపలు ● లక్షల్లో నష్టం వాటిల్లిందని మత్స్యకారుల ఆవేదన 30 ప్రభుత్వం ఆదుకోవాలి సముద్రం వేటనే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. తుఫా న్లు, గాలి వానలు వచ్చిన స మయంలో వారం, పది రోజు లపాటు ఎలాంటి భృతిలేకుండా కుటుంబా లతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాది. ఎన్నో ఆశలతో ఎండలో ఆరబెట్టిన ఎండు చేపలు పూర్తిగా తడిసిపోయాయి. అవి అమ్మకానికి పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – కోడ కృపారావు, బాధిత మత్స్యకారుడు, డొంకూరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం తుఫాన్కు కురిసిన వర్షాలకు ఎండు చేపలు తడిసిపోయినట్లు గుర్తించాం. ఇప్పటికే బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశాం. – సలాడి ముసలనాయుడు, ఎఫ్డీఓ, ఇచ్ఛాపురం మండలంఇచ్ఛాపురం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాన్ ప్రభావం తీర ప్రాంత మత్స్యకారులపై పడింది. ఈ తుఫాన్తో కురిసిన వర్షాలకు, గాలివానలతో డొంకూరు సాగర తీర ప్రాంతంలో ఎండబెట్టిన కవ్వళ్లు, నెత్తళ్లు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. గ్రామంలో 60 మంది మత్స్యకారులకు చెందిన 30 టన్నుల ఎండు చేపలు పాడవడంతో మత్స్యకారులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. వారం రోజుల కష్టంతో ఎండబెట్టిన చేపలు కేవలం గంటల వర్షంతో పాడైపోవడంతో బాధితులు నిరాశకు గురయ్యారు. తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పటికీ చేపలను సురక్షిత ప్రదేశాలకు తరలించే సమయం దొరకలేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండు చేపలకు గిరాకీ ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు సముద్రంలో లభించే కవ్వళ్లు, నెత్తళ్ల చేపలను మత్స్యకారులు కొందరు ఎండబెట్టి అమ్మకాలు చేస్తే, మరికొంత మంది ఉప్పు జాడీలో ఉంచి వాటిని మళ్లీ ఎండలో ఆరబెట్టి అమ్మకాలు చేస్తుంటారు. వీటి ధర కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పలుకుతుంది. వీటిని కోల్కతా, ముంబై, మద్రాస్, భువనేశ్వర్, కటక్, హైదరాబాద్, విజయవాడ, గోదావరి, బెంగళూరు వంటి ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఈ ఎండు చేపల్ని దా ణాగా మార్చి కోళ్లు, చేపలకు మేతగా మార్చేందుకు వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది మోంథా తుఫాన్ తమ బతులకును ముంచేసిందని బాధిత మత్స్యకారులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
వాడీవేడిగా నేర సమీక్ష
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. ఇటీవల జరుగుతున్న వరుస ఉదంతాలు, ప్రాపర్టీ నేరాలు, స్టేషన్లలో అధికారుల వ్యవహార శైలిపై ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి తీవ్రస్థాయిలో అధికారులను హెచ్చరించినట్లు తెలిసింది. కాశీబుగ్గ డివిజన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీలు, స్టేషన్పరంగా జరుగుతున్న కొన్ని వ్యవహారాలపై సీఐ, ఎస్ఐలను గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. సోంపేటలో టపాకుల వ్యవహారంపైనా సీఐ, ఇద్దరు ఎస్ఐలు, మరికొందరి పాత్రపై నివేదిక కోరినట్లు తెలుస్తోంది. మహిళలు తగాదా ల్లో ఉండేటప్పుడు తప్పనిసరిగా మహిళా పోలీసుల నే వినియోగించాలని వజ్రపుకొత్తూరు ఎస్ఐకు సూచించారు. మోస్ట్వాంటెడ్ క్రిమినల్ దున్న కృష్ణ ను పట్టుకోవాలని, ఈనెల 16న జిల్లా కోర్టు సమీ పంలోనే చోరీ చేసినా పట్టుకోకపోవడాన్ని గుర్తు చేశారు. చెక్పోస్టుల్లో గంజాయి, ఇసుక, ఇతర అక్ర మ రవాణాలను వదిలే పోలీసులపై ఇప్పటికే నిఘా ఉందన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘాపెట్టి అల్లర్లు చెలరేగకుండా చూడాలన్నారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాలపై గ్రామాల్లో, విద్యాసంస్థల్లో అవగాహన పర్చాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ లు పాల్గొన్నారు. -
క్రైమ్కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి కొత్తూరు: గొట్లభద్ర గ్రామం వద్ద కిమిడి–వారణాసి రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కురిగాం పీహెచ్సీ పరిధిలో ని వెల్నెస్ సెంటర్లో ఆర్సీహెచ్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న ఆర్.మాలతిబాయి (52) మృతి చెందారు. ఈమె ఒడిశా రాష్ట్రం కాశీనగర్ నుంచి కడుము వెల్నెస్ సెంటర్కు విధులు నిర్వహించేందుకు స్కూటీపై వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి భర్త శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్సీ కె.కోటేశ్వరరావు కేసు నమోదు చేశా రు. మాలతిబాయికి భర్త, కుమారుడు ఉన్నారు. కురిగాం పీహెచ్సీ వైద్యాధికారి పెద్దిన ప్రసన్నకు మార్, ఏవో బుజ్జిబాబు ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారుడు మృతి సంతబొమ్మాళి: నౌపడ పంచాయతీ సీతానగ రం గ్రామానికి చెందిన బచ్చల భీమారావు (55) అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్లి గురువారం మృతి చెందాడు. గ్రామంలో ముస ళ్లఖానా సమీపంలో చేపల వేట కోసం నీటి ప్రవాహానికి అడ్డంగా వల ఏర్పాటు చేశారు. కొంత సమయం తర్వాత వలను తీసే ప్రయ త్నం చేశారు. ఈ క్రమంలో భీమారావు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతి చెందా డు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నౌపడ ఎస్సై నారాయణస్వామి తెలిపారు. భీమారావుకు భార్య, పిల్లలు ఉన్నారు. గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం పలాస : కంబిరిగాం వరహాల గెడ్డలో ఇటీవల గల్లంతైన దానగొర గ్రామానికి సవర లావన్న (35) మృతదేహం గురువారం బ్రాహ్మణతర్లా వంతెన వద్ద లభ్యమయింది. ఇనుప పైపులైనుకు అడ్డుకొని మృతదేహం ఉన్నట్టు స్థానికులు గుర్తించి విషయాన్ని కాశీబుగ్గ పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వచ్చిన బంధువులు వరద నీటిలో దిగి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లావన్న స్వగ్రామం మెళియాపుట్టి మండలం దాసుపురం. దానగొర గ్రామానికి చెందిన అన్నమ్మతో వివాహం జరగడంతో ఇక్కడే ఉంటున్నాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. కాశీబుగ్గ ఎస్ఐ నర్సింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీ కార్యకర్తకు అస్వస్థత
టెక్కలి: కోటబొమ్మాళి మండలం కొత్తపేట–2 అంగన్వాడీ కార్యకర్త దాట్ల నీలవేణి గురువారం అస్వస్థతకు గురై కోటబొమ్మాళి సామాజిక ఆసుపత్రిలో చేరారు. పీఓ హైమావతి వేధింపులు తట్టుకోలేక అస్వస్థతకు గురైనట్లు ఆమె వాపోయారు. మేలో తనను విధుల నుంచి తొలగించారని, హైకోర్టును ఆశ్రయించడంతో అక్టోబర్లో విధుల్లోకి తీసుకున్నా రని చెప్పారు. గతంలో హైకోర్టులో వేసిన కేసుకు సంబంధిం విత్డ్రా అవుతున్నట్లు గురువారం జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో లెటర్ అందజేయాలంటూ పీఓ ఫోన్ చేసి గట్టిగా మాట్లాడారని నీలవేణి పేర్కొన్నారు. ఇదే విషయమై కొద్ది రోజులుగా వేధిస్తున్నారని.. నీవు ఎలా విధులు నిర్వర్తిస్తావో చూస్తానంటూ బెదిరించారంటూ బాధితురాలు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న సంఘ నాయకులు హనుమంతు ఈశ్వరరావు, దుంపల సుధ, తోటి కార్యకర్తలంతా ఆస్పత్రికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. ఈ విషయమై కోటబొమ్మాళి ఐసీడీఎస్ పీఓ హైమావతి వద్ద ప్రస్తావించగా.. లెటర్ అందజేయాలని చెప్పాం తప్ప ఎటువంటి వేధింపులు చేయలేదని పేర్కొన్నారు. -
హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.కోటి మంజూరు
శ్రీకాకుళం క్రైమ్ : ఈ ఏడాది జూన్లో టెక్కలి వద్ద రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ పి. జగదీశ్వరరావు మృతి చెందడంతో ఆయన కుటుంబానికి కోటి రూపాయల ప్రమాద బీమా మంజూరైంది. స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండి యా ఆధ్వర్యంలో పోలీస్ శాలరీ ప్యాకేజీ కింద కల్పించిన వ్యక్తిగత బీమా పాలసీ జగదీశ్వరరా వు చేసినందునే ఇంత పెద్ద మొత్తంలో బీమా మంజూరైంది. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి హెడ్కానిస్టేబుల్ కుటుంబాన్ని గురువారం పిలిపించి రూ.కోటి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీసు తమ ఖాతాలను పోలీస్ శాలరీ ప్యాకేజీకి అనుసంధానం చేసుకోవాలన్నారు. విధుల్లో ఉంటూ ప్రమాదవశాత్తు మరణించే పోలీసులు తమ కుటుంబాలకు అందించే అత్యంత ఆర్థిక చేయూత ఈ బీమా అని ఎస్పీ పేర్కొన్నారు. సంతబొమ్మాళి : చిన్నతుంగాం పంచాయతీ కృష్ణచంద్రాపురంలో ఓ బాలిక గర్భం దాల్చింది. టెక్కలి జిల్లాప్రభుత్వ ఆసుపత్రికి బాలిక చికిత్స నిమిత్తం రాగా విషయం గురువారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో బాలిక, యువకుడు పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. యువకుడు కొన్ని నెలలుగా ప్రేమపేరుతో దగ్గరవ్వడంతో బాలిక గర్భాన్ని దాల్చింది. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో గ్రామపెద్దల సమక్షంలో అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. బాలిక గర్భం తొలగించేందుకు టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రావడంతో విషయం బహిర్గతమైంది. పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం చేరవేశారు. మెళియాపుట్టి: మెళియాపుట్టి పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా బాధ్యతలు నిర్వహిస్తున్న బగాది అప్పన్న(57) గురువా రం విధి నిర్వహణలో ఉంటూనే మృతి చెందారు. తోటిపోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురువారం మధ్యా హ్నం ఒడిశాకు చెందిన ఓ మంత్రి పర్యటనకు రావడంతో బోర్డర్లో విధులు నిర్వహించారు. డ్యూటీ ముగిసిన అనంతరం చాపరలో ఆయన నివాసం ఉంటున్న ఇంటికి చేరుకున్నా రు. అప్పటికే కుటుంబసభ్యులు శ్రీకాకుళం షాపింగ్కు వెళ్లిపోవడంతో. అప్పన్న ఒక్కరే ఇంట్లో ఉన్నారు. ఆ సమయంలో అస్వస్థతకు గురయ్యారు. ఇంతలో తోటి ఏఎస్సై రమణ.. అప్పన్నకు ఫోన్చేసి కుటుంబసభ్యులు ఎవరూలేరు కదా భోజనానికి వచ్చేస్తావా? అని అడిగారు. డాక్టర్ తీసుకురా అని బదులివ్వడంతో ఆర్ఎంపీని తీసుకెళ్లి చూసేసరికి ఆయాస పడుతుండటంతో చాపర పీహెచ్సీకి తరలించారు. అక్కడి నుంచి 108 ద్వారా టెక్కలి ఆస్పత్రికి తీసుకె ళ్తుండగా మర్రిపాడు–సి గ్రామ సమీపంలోనే మృతిచెందారు. అప్పన్న స్వగ్రామం ఎచ్చెర్ల, భార్య వరలక్ష్మికుమారి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామం ఎచ్చెర్లకు తరలించారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: బయో మెడికల్ వ్యర్థా ల నిర్వహణ శాసీ్త్రయంగా జరగాలని, ఆస్పత్రు ల యాజమాన్యాలు నిబంధనలు విధిగా పాటించాలని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆస్పత్రుల వ్యర్థాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్లు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ సెంటర్లు కాలుష్యనియంత్రణ మండలి జారీ చేసిన నిబంధనల ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఈఈ బి.కరుణశ్రీ, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.అనిత, ఈఈఏ కళ్యాణ్ బాబు పాల్గొన్నారు. ఉత్సాహంగా టెన్నీకాయిట్ ఎంపికలు పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం అండర్–18 జిల్లా టెన్నీకాయిట్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. బాలుర జట్టులో బి.సిద్దార్ధ, బి.ఉదయ్కిరణ్, కె.ప్రవీణ్కు మార్, టి.వెంకటేష్, స్టాండ్ బైగా కె.జస్వంత్.. బాలికల విభాగంలో పి.శ్రావణి పాత్రో, ఎన్.దివ్య, వై.వరలక్ష్మి, బి.నందిని ఎంపికై నట్లు రాష్ట్ర టెన్నీకాయిట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య తెలిపా రు. కార్యక్రమంలో జిల్లా టెన్నీకాయిట్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లా సంతోష్కుమార్, కార్యదర్శి పి.కృష్ణారావు, ఉపాధ్యాయులు చక్రపాణి ప్రధానో, ఎ.ఆనందరావు, బి.శంకరరావు, ఆర్.శ్రీనివాసరా వు, న్యాయనిర్ణేతలు బి.తిరుమల, ఎం.దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆర్మీ జవానుకు కన్నీటి వీడ్కోలు
ఇండియన్ ఆర్మీ 18–ఇంజినీర్ రెజిమెంట్కు చెందిన నాయక్ వెంపటాపు రాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన అంత్యక్రియలు గురువారం స్వగ్రామం భైరిలో సైనిక లాంఛనాల నడుమ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, మాజీ సైనికు లు పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ సాయిప్రత్యూష, జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఎ.శైలజ, సువ్వారి ఈశ్వరరావు, జిల్లా ఎక్స్సర్వీస్మెన్ ఫెడరేషన్ అధ్యక్షుడు కటకం పూర్ణచంద్రరరావు,జనరల్ సెక్రటరీ పి. మురళీధరరావు, ఎస్.రామకృష్ణ, ఎం.సింహాచలం, డి.వాసుదేవరావు, బోర రాంబాబు, జి. రామారావు తదితరులు నివాళులర్పించారు. –శ్రీకాకుళం రూరల్ -
పకడ్బందీగా లింగ నిర్ధారణ నిరోధక చట్టం అమలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: గర్భస్థ పిండ లింగ నిర్ధార ణ నిరోధక చట్టం అమలులో నిర్లక్ష్యం సహించేది లేదని ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ అధికారులు, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత సమావేశంలో అడిగిన కీలక గణాంకాలు సమర్పించకపోవడంపై డీఎంహెచ్ఓ కార్యాలయ సిబ్బంది పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్.ఎన్.పేట పీహెచ్ సీలో గర్భస్రావాల శాతం 11, సారవకోట, బొంతు పీహెచ్సీల్లో 10 శాతంగా నమోదైందని, జాతీయ సగటు కంటే ఇక్కడ అధికంగా ఉన్నందున ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేయాలని, స్కానింగ్ కేంద్రాల తనిఖీలు కఠినతరం చేయాలని ఆదేశించా రు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్కుమార్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ అనిత, కమిటీ కన్వీనర్ శ్రీకాంత్, డీఐఓ రామదాస్, డీసీహెచ్ఎస్ కళ్యాణ్ బాబు, రిటైర్డ్ జడ్జి పప్పల జగన్నాథరావు, సామాజిక కార్యకర్త, ఎం.వెంకటస్వామి, డాక్టర్ దానేటి శ్రీధర్, బెజ్జిపురం యూత్ క్లబ్ ప్రతినిధి ప్రసాదరావు పాల్గొన్నారు. -
టీచర్లకు టెట్ టెన్షన్
నరసన్నపేట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) టెన్షన్ నెలకొంది. సర్వీసులో కొనసాగుతున్నా, పదోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత కావాల్సిందే నని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యూకేషన్ కూడా టెట్ తప్పనిసరి అని పేర్కొంది. ఈ దశలో ప్రభుత్వం ఈ నెల 23న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ వర్గాలు గరంగరంగా ఉన్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారంతా ఈ వయసులో ఇదేం బాధ బాబూ.. అంటూ తలలు పట్టుకుంటున్నారు. 2010 నుంచి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని, అంతకుముందు నుంచి ఉన్న టీచర్లకు టెట్ను తప్పనిసరి చేయడమేంటని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లు లోపు పదవీ విరమణ పొందనున్న వారికి టెట్ నుంచి మినహాయింపు నిచ్చారు. అయి తే ఈ ఐదేళ్లలో పదోన్నతి కావాలంటే మాత్రం టెట్ రాయకతప్పదని అదికారులు అంటున్నారు. దీంతో ఉపాద్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 14300 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో 2011 తరువాత నియమితులైన వారు సుమారు 3 వేల మంది ఉన్నారు. వీరందరూ టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారే. ఐదేళ్ల లోపు పదవీ విరమణ పొందనున్న వారు వెయ్యి మంది వరకూ ఉన్నట్లు సమాచారం. వీరు మినహా మిగిలి న ఉపాధ్యాయులంతా విధిగా టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని జిల్లా విద్యాశాఖ అదికారులు చెబుతున్నారు. ఎస్జీటీలు ముందుగా టెట్ పేపర్–1 రాయాల్సి ఉంది. పదోన్నతి కావాల నుకునే వారు పేపర్–2 రాయాలి. స్కూల్ అసిస్టెంట్లు పేపరు –2 తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయవర్గాల అభ్యంతరం.. టెట్కు సంబంధించి నవంబర్ 23 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం నోటిఫికేషన్లో సూచించింది. కాగా టెట్ను తప్పనిసరి చేయడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. టీటీసీ, బీఈడీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఉద్యోగాలకు ఎంపికయ్యామని, ఏళ్ల తరబడి విధుల్లో ఉన్నామని, ఇప్పుడు తమకు పరీక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే పరీక్ష నిర్వహిస్తున్నామని ప్రభుత్వం అంటోందని, అలాగైతే విద్యా హక్కు చట్టం అమలుపై సుప్రీం కోర్టు అనేక ఉత్తర్వులు ఇచ్చిందని, అవన్నీ ఎందుకు అమలు చేయడం లేద ని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 2010 ముందు ఉద్యోగంలో చేరిన వారికి టెట్ నుంచి మినహయింపు ఇవ్వాలి. నేను 1995లో విధుల్లో చేరాను. 30 సంవత్సరా ల సర్వీసు పూర్తయింది. ఇప్పుడు పరీక్షలు పాస్ కావాలంటే ఎలా? ఇది మమ్మల్ని అవమానించడం కిందకే వస్తుంది. అప్పట్లో నేను టీటీ సీ పూర్తి చేసి డీఎస్సీ ద్వారా ఎంపికై సెకండరీ గ్రేడ్ టీచర్గా జాయినయ్యాను. ప్రభుత్వం సు ప్రీంకోర్టులో పిటిషన్ వేసి మాలాంటి ఉపాధ్యాయులకు పరీక్ష నుంచి మినహాయింపు తేవాలి. – నడిమింటి అప్పలనాయుడు, సత్యవరం స్కూల్ హెచ్ఎం టెట్ వ్యవహరంపై ప్రభు త్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. అపీలు పిటిషన్ వేయాలి. పొరుగు రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. టెట్ రాయడం బోధనా సమయం తగ్గించడమే తప్ప మరే ప్రయోజనం లేదు. సంఘ పరంగా కోర్టుకు వెళ్లాం. ప్రభుత్వం పునరాలోచించాలి. శుక్రవారం అన్ని జిల్లాల్లో ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రాలు ఇస్తున్నాం. – బమ్మిడి శ్రీరామమూర్తి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి 30 ఏళ్లకు పైగా సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు సై తం ఇప్పుడు టెట్ పరీక్షలు పెట్టడం దారుణం. కోర్టు ఆదేశాలుల పేరుతో 2010 ముందు జాయిన్ అయిన ఉపాధ్యాయు లు అందరికీ టెట్ పరీక్ష తప్పనిసరి చేయడం శోచనీయం. నాకు 28 ఏళ్లు సర్వీసు పూర్తి అయింది. ఇప్పుడు పరీక్షలంటే ఎలా..? – బి.కేశవరావు, ఏపీటీఎఫ్ (1938) మండల అధ్యక్షుడు -
పెచ్చులూడుతున్నా పట్టించుకోరా?
● అధ్వానంగా రిమ్స్ భవనాలు ● బిక్కుబిక్కుమంటున్న సిబ్బంది, రోగులు ● స్పందించని అధికారులు శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాల కు అనుబంధంగా ఉన్న సర్వజన ఆస్పత్రిలో భవనాల పెచ్చులు ఊడిపడిపోతున్నాయి. రెండు రోజు ల క్రితం సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పెచ్చులు పడి పన్నా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటిని తొలగించే వారే కరువయ్యారు. సూపరింటెండెంట్ కార్యాలయంతో పాటు నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయం కూడా ఇదే మార్గంలో ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాత భవనాలకు కొత్త భవనాలను ఇక్కడ అనుసంధానం చేసి ఉండటంతో అవి సరిగ్గా కలవకపోవడంతో ఇటువంటి పరిస్థితి తలెత్తుతున్నట్లు రిమ్స్ వర్గాలు చెబు తున్నాయి. ఇదే ప్రాంతంలో మరొక చోట కూడా పెచ్చులూడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని, దీన్ని కూడా తొలగించుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. ఈ దారిలో వైద్య సిబ్బందితో పాటు రోగులు, సహాయకులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. పెచ్చులూడిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ గాయాలు కాలేదని, ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. తరచూ సెలవులో ఈఈ.. రిమ్స్లోని ఇంజినీరింగ్ పనులను పర్యవేక్షిస్తున్న ఏపీహెచ్ఎంహెచ్ఐడీడీ ఈఈగా వ్యవహరిస్తున్న ప్రమోద్కుమార్ తరచూ సెలవులో ఉంటున్నారు.గత నెల 30న సత్య ప్రభాకర్ పదవీ విరమణ చేయడంతో విశాఖపట్నం క్వాలిటీ కంట్రోల్లో డీఈఈగా పనిచేస్తున్న ప్రమోద్కుమార్కు పూర్తి అదనపు బాధ్యతలతో శ్రీకాకుళంలో ఈఈగా నియమించా రు. విధుల్లో చేరిన వారం తర్వాత సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఈ బాధ్యతపై అయిష్టత వ్యక్తం చేస్తూ ప్రధాన కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు తెలిసింది. ఈ వ్యవహారం పెండింగ్లో ఉండగా, ప్రమోద్కుమార్ తరచూ సెలవులో వెళ్లిపోతున్నారు. ఈనెల 15 నుంచి 26 వరకు అనారోగ్య సమస్యలు అంటూ సెలవు పెట్టిన ఆయన తిరిగి వీధిలో చేరకుండానే నవంబర్ 5 వరకు సెలవు పొడిగించారు. రిమ్స్ కళాశాలకు గానీ, ఆస్పత్రిలో గానీ ఏవైనా మరమ్మతులు చేయించాలన్నా పనులు పూర్తి చేయాలన్నా, మందులు కావాలన్నా ఈఈ సంతకం చేయాల్సి ఉంటుంది. ఈయన అందుబాటులో లేకపోవడం వల్ల ప్రస్తుతం డీఈగా వ్యవహరిస్తున్న సిమ్మన్న సంతకాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
అక్రమ బోర్లు
అనుమతుల కోసం యత్నాలు.. విషయం బయటకు పొక్కడంతో కంపెనీ ప్రతినిధులు హడావుడిగా అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. జిల్లాలో కాకుండా ఏకంగా భూగర్భ జల శాఖ డైరెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పది బోర్లలో రెండు మాత్రమే వర్కింగ్లో ఉండటంతో తెలివిగా రెండు బోర్లకు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేశారు. ఆ మేరకు డైరెక్టర్.. జిల్లా అధికారులు పరిశీలించి, అనుమతుల కోసం నివేదిక ఇవ్వాలని కోరారు. ముగ్గురు అధికారులు రెండు రోజులుగా యూబీ బీర్ల కంపెనీలో పరిశీలించారు. అప్పటికే అక్కడ 10 వరకు బోర్లు ఉండటంతో సంబంధిత అధికారులు అవాకై ్కనట్టు తెలిసింది. అయినప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలు కారణంగా అక్కడ గుర్తించిన అంశాలను ఫైండింగ్స్ కింద పంపించేందుకు సిద్ధమైనట్టు సమాచారం. బీర్ల కోసం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీలో యునైటెడ్ బ్రూవరీస్(యూబీ) బీర్ల కంపెనీ మరోసారి వివాదాస్పదంగా మారింది. కూటమి నేతల ఒత్తిళ్లు, బెదిరింపులతో ఇప్పటికే ఏకపక్షంగా వ్యవహరించి ఓ వర్గం ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేసింది. రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయి అకారణంగా ఉద్యోగుల పొట్ట కొట్టింది. తాజాగా అనుమతులు లేకుండా ఏకంగా 10 మంచినీటి బోర్లను తవ్వించి, అడ్డగోలుగా నీటి వినియోగం చేస్తుందన్న విషయం వెలుగులోకి రావడంతో మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఉత్పత్తుల వ్యర్థ జలాలు కాలువలో కలిసిపోతుండటంతో భూగర్భ జలాలు కలుషితమై తమ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందంటూ చుట్టు పక్కల గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. అనుమతి లేకుండానే.. వ్యక్తిగతంగా కానీ కంపెనీ అయినా మంచినీటి బోర్లు వేసుకోవాలంటే తప్పనిసరిగా భూగర్భ జల శాఖ అనుమతి ఉండాలి. జలాల లభ్యత మేరకు అనుమతులివ్వడం, ఇవ్వకపోవడం అనేది జరుగుతోంది. కానీ యూబీ బీర్ల కంపెనీ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా 10 బోర్లను అక్రమంగా వేసుకుంది. వాటికి పైపులు బిగించి, కంపెనీలో ఏర్పాటు చేసుకున్న సంపులోకి తరలిస్తోంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఆ మధ్య బంటుపల్లి పంచాయతీకి చెందిన ఓ వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా తమకున్న రికార్డుల మేరకు యూబీ బీర్ల కంపెనీకి అధికారిక అనుమతులు జారీ చేయలేదని లిఖిత పూర్వకంగా భూగర్భ జల శాఖాధికారులు రాసిచ్చారు. దీంతో ఆ కంపెనీలో ఉన్న బోర్లు అన్నీ అక్రమమే అని తేలిపోయింది. యూబీ బీర్ల కంపెనీ వెనక నుంచి వదిలేస్తున్న వ్యర్థ జలాలుయూబీ బీర్ల కంపెనీలో అనుమతుల్లేకుండా వేసిన బోర్లు వివాదాస్పదంగా మారిన యూబీ బీర్ల కంపెనీ భూగర్భజల శాఖ అనుమతి లేకుండా 10 మంచినీటి బోర్ల తవ్వకం సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి.. బయటికి పొక్కడంతో ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు వ్యర్థ జలాలతో భూగర్భ జలాలు కలుషితమయ్యే అవకాశం ఆందోళనలో పరిసర గ్రామాల ప్రజలు బయటకు వ్యర్థ జలాలు.. బీర్ల కంపెనీలో ఉత్పత్తుల వ్యర్థజలాలను వెనక నుంచి బయటకు వదిలేస్తున్నారు. అవి సమీపంలోని కాలువలో కలుస్తూ మరింత ప్రమాదకరంగా మారాయి. భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. వ్యర్థ జలాలు ఆయా గ్రామాల తాగునీటి వనరులపై ప్రభావం చూపితే ముప్పు తప్పదు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అసలు అక్కడేం జరుగుతుందో.. వ్యర్థ జలాల వల్ల హాని లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారో లేదో తెలియడం లేదు. -
● 10 మండలాలపై ఎక్కువ ప్రభావం
● నేలకొరిగిన వేలాది ఎకరాల వరి పంట ● పలుచోట్ల పడిపోయిన విద్యుత్ స్తంభాలు, చెట్లు ● కూలిన ఇళ్లు, దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మోంథా తుఫాన్ తీరం దాటింది. జిల్లా రైతాంగానికి తీరని నష్టం మిగిల్చింది. తీరం దాటిన సమయంలో జిల్లాపై పెద్దగా ప్రభావం చూపనప్పటికీ మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి చేలు ఎక్కడికక్కడ ముంపునకు గురయ్యాయి. పంట కోత దశలో ఉన్న సమయంలో వరి పంట నేలమట్టం కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. మరోవైపు ఎడతెరిపి లేని వానల ధాటికి పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. అన్నదాతపై ప్రభావం.. ఇటీవల వాయుగుండం ప్రభావంతో కొంత నష్టం జరగ్గా, తాజా తుఫాన్తో రైతుకు మరింత నష్టం సంభవించింది. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 2 గంటల వరకు గుర్తించిన మేరకు సుమారు 7500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. 10 ఎకరాల 50 సెంట్లలో మొక్కజొన్న, సుమారు 100 ఎకరాల్లో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 278 కొబ్బరి చెట్లు పూర్తిగా పడిపోయాయి. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. జిల్లా వ్యాప్తంగా 44 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో పూర్తిగా ఏడు ఇళ్లు కూలిపోగా, 34 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి 16.38 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. ● ఉగ్రరూపం దాల్చిన బాహుదా! ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో ఇచ్ఛాపురం అతలాకుతలమైంది. ఒడిశా భగలట్టీ డ్యామ్ మూడు గేట్లు ఎత్తివేయడంతో బుధవారం ఉదయం బాహుదానదిలో 55 వేల క్యూసెక్కుల నీరు చేరింది. సాయంత్రానికి 41,025 క్యూసెక్కులకు తగ్గింది. ● గొట్టాకు వరదనీటి తాకిడి హిరమండలం: వంశధార నదిలో వరద ప్రవాహం పెరిగింది. తుఫాన్ నేపథ్యంలో ఒడిశాతో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నీటి ప్రవాహం పెరిగి గొట్టా బ్యారేజీకి ఇన్ఫ్లో పెరుగుతోంది. బుధవారం మధ్యాహ్నానికి 38138 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. 22 గేట్లు ఎత్తివేసి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. శ్రీకాకుళం నగరంలో జోరువానవజ్రపుకొత్తూరు మండలం పెదబాడాంలో కోతకు గురైన రోడ్డుకళింగపట్నం– మత్స్యలేశం పంచాయతీలోని బీచ్పై ‘మోంథా’ తుఫాన్ ప్రభావం చూపించింది. సముద్రపు అలల తాకిడికి వంశధార నది నీరు తోడవ్వడంతో ఒడ్డునున్న హరిత రిసార్టు ప్రాంతం కోతకు గురైంది. రెండు నీటి ట్యాంకుల్లో ఒకటి పూర్తిగా విరిగిపోయింది. మరొకటి పాక్షికంగా దెబ్బతింది. గత ప్రభుత్వంలో బీచ్ కోత నివారణకు మంజూరైన రూ.7.58 కోట్లలో రూ.2 కోట్లు నిధుల మేర పనులు పూర్తయ్యాయి. ఎన్నికల తర్వాత కొత్త పభుత్వం వచ్చాక దీనిపై దృష్టి సారించకపోవడంతో పనులు నత్తనడకన సాగాయి. 18 నెలలు వచ్చినా పనులు ఊపందుకోకపోలేదు. నిర్లక్ష్యపు ధోరణి వల్లే పర్యాటక శాఖ ట్యాంకు కూలిపోయిందని, ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. –గారమూడు రోజులుగా ఈదురుగాలులతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసినప్పటికీ 10మండలాల్లోని 53గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపాయి. మందస, పలాస, ఇచ్ఛాపురంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ నెల 27వ తేదీ ఉదయం 8.30 నుంచి 28వ తేదీ ఉదయం 8.30గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 189 సెంటీమీటర్ల వర్షం పడగా, సరాసరి 6.3సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 28నుంచి 29వ తేదీ వరకు 159.3 సెంటీమీటర్ల వర్షం పడగా, సరాసరి వర్షపాతం 5.3 సెంటీమీటర్లుగా నమోదైంది. రెండు రోజుల్లో అత్యధికంగా మందసలో 19 సెంటీమీటర్లు, గారలో 16.4సెంట్లీమీటర్లు, వజ్రపుకొత్తూరు, పలాసలో 16.3సెంటీమీటర్ల చొప్పున, ఇచ్ఛాపురంలో 15సెంటీమీటర్ల వర్షం కురిసింది. -
ఆ గ్రామాలకు రాకపోకలు కట్
● మోంథా తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరద నీటితో టెక్కలి మండలం పెద్దరోకళ్లపల్లి సమీపంలో గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దరోకళ్లపల్లి, సీతారాంపల్లి, రామనగరం తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ● పొందూరు మండలంలో రెల్లిగెడ్డకు వరద నీరు పోటెత్తెంది. లైదాం కల్వర్టు బ్రిడ్జి పైనుంచి వరద నీరు పారుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ● పొందూరు మండలం పెనుబర్తి–గోరింట రైల్వే అండర్ పాసేజ్ పూర్తిగా నీటితో నిండి పోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. –టెక్కలి/పొందూరు -
దరఖాస్తుల గడువు పెంపు
శ్రీకాకుళం రూరల్: బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరంలో కన్వీనర్ కోటాలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును నవంబర్ 2 వరకు ఎన్టీఆర్ వైద్య, ఆరోగ్య విశ్వ విద్యాలయం పెంచిందని బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని బైపీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. మరిన్ని వివరాలకు 76809 45357, 91219 99654 నంబర్లను సంప్రదించాలన్నారు. ఆర్మీ జవాన్ మృతి శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ వెంపటాపు రాజు (33) కాశ్మీర్లో విధులు నిర్వహిస్తూ మృతి చెందాడు. అక్కడ చలి తీవ్రత కారణంగా గుండెపోటు రావడంతో వెంటనే డిల్లీలో ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. జవాన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పాముకాటుతో తీవ్ర అస్వస్థత టెక్కలి రూరల్: మండలంలోని అంజనేయపురం గ్రామ సమీపంలో ఉన్న ఒక క్వారీలో పనిచేస్తున్న వ్యక్తికి పాము కాటువేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్థాన్కు చెందిన నిఖిల్ అనే వ్యక్తి క్వారీలో పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. అది గుర్తించిన తోటి కార్మికులు ఆ వ్యక్తిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. పేకాటరాయుళ్లు అరెస్టు శ్రీకాకుళం రూరల్: మండల పరిధి కుందువానిపేట గ్రామంలోని రచ్చబండ వద్ద బుధవారం పేకాడుతున్న 11 మందిని శ్రీకాకుళం రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుంచి రూ.7,250 నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నాగుపాము హల్చల్ నరసన్నపేట: స్థానిక కలివరపుపేటలోని సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం నాగుపాము హల్చల్ చేసింది. ఆలయం లోపలి గోడల వద్ద చాలా సమయం ఉంది. ఆలయ గర్భగుడి వైపునకు వెళ్లేందుకు పాము ప్రయత్నించగా.. భక్తులు గమనించి బయటకు తరలించారు. ముంపు పంటల పరిశీలన ఇచ్ఛాపురం రూరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు బాహుదా నది పరివాహక ప్రాంతంలో సుమారు 1,118 హెక్టార్ల వరిపంట నీట మునిగినట్లు అధికారులు గుర్తించారు. బుధవారం రాగోలు వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్త డాక్టర్ కె.ఉదయ్బాబు, ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్తవేత్తలు డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ శ్రీనివాస్లు తులసిగాం, ఇన్నేశుపేట, డొంకూరు, ఈదుపురం, జగన్నాథపురం, రత్తకన్న, బెల్లుపడ గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు. పంట పొలాల్లో వరద నీరు పూర్తిగా తగ్గిన తర్వాత యూరియా, ఎంవోపీ ద్రావణాన్ని పిచికారీ చేయాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. పంట నష్టం, తీవ్రతను జిల్లా ఉన్నతాధికారులకు నివేదించడం జరుగుతుందన్నారు. వారితో పాటు సోంపేట వ్యవసాయ శాఖ ఉప సంచాలకుడు భవానీశంకర్, మండల సీనియర్ వ్యవసాయాధికారి పీపీవీవీ అజయ్కుమార్ తదితరులు ఉన్నారు. -
పుస్తకావిష్కరణ
పాతపట్నం: ఆంగ్లభాషపై ఆసక్తిని పెంచే పుస్తకాలను కవులు రచించారని జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అన్నారు. స్థానిక శాఖా గ్రంథాలయంలో రొంపివలస హైస్కూల్ ఆంగ్ల ఉపాధ్యాయుడు బీవీ రమణ రచించిన మై లిటిల్ వరల్డ్ ఆఫ్ క్యూసెన్ ఆంగ్ల పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ విద్యార్థుల్లో వివిధ రకాల ప్రశ్నలు ఎలా వేయాలనే అంశాలతో కూడిన పుస్తకమని తెలియజేశారు. కార్యక్రమంలో జిత్తు సింహాచలం, ఎంఈవోలు ఎ.గోవిందరావు, సీహెచ్ తిరుమలరావు, కె.రాంబాబు, ఎం.వెంకటరమణ, హెచ్ఎంలు ఎన్.కుమారస్వామి, బి.సింహాచలం, కె.లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలు అదృశ్యం
నందిగాం: మండలంలోని మర్లపాడుకు చెందిన కొత్తపల్లి ఆదెమ్మ(61) అనే వృద్ధురాలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ షేక్ మహ్మద్ ఆలీ బుధవారం తెలియజేశారు. ఆదెమ్మ ఈనెల 24వ తేదీన ఇంటికి కావాల్సిన సామగ్రి కొనుగోలు చేయడానికి పూండి వెళ్లింది. అనంతరం ఇంటికి రాకపోవడంతో అనేక చోట్ల వెదికారు. కానీ ఆచూకీ లభించకపోవడంతో కుమారుడు జనార్ధనరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ మృతదేహం లభ్యం శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెద గనగళ్లవానిపేట తీరంలో ఒక మహిళ మృతదేహం బుధవారం లభ్యమైంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం నగర పరిధిలోని హయాతీనగర్కు చెందిన దువ్వు రాజ్యలక్ష్మి (42) ఆర్థిక ఇబ్బందులు కారణంగా కొత్త బిడ్జి మీద నుంచి దూకేసింది. ఈమె భర్త మోహన్రావు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఆమె నగరంలోని ఒక డెంటల్ క్లినిక్లో పనిచేసేది. వచ్చిన సంపాదన సరిపోకపోవడంతో మనస్తాపం చెంది దూకేసినట్లు పోలీసులు వెల్లడించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు జిల్లా టెన్నికాయిట్ పోటీలు పలాస: పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో గురువారం ఉదయం 10 గంటలకు జిల్లా టెన్నికాయిట్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మల్లా సంతోష్కుమార్, సుడియా జోగారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.తవిటయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉత్తరప్రదేశ్ యువకుడు ఆత్మహత్య
నాలుగు షాపుల్లో చోరీ శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ఉత్తరప్రదేశ్ యువకుడు బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ కె.జగన్నాథరావు తెలియజేశారు. కళింగ రోడ్డులోని మైలపల్లి కృష్ణారావు ఇంటి మేడపై గదిలో అద్దెకు ఉంటున్న ఇబ్రహీం(21) యూపీలోని బాస్పూర్ సమీప ఉద్ధమ్సింగ్ నగర్కు చెందినవాడు. గత కొంతకాలంగా సూర్యమహల్ కూడలి సమీపంలోని ఒక సెలూన్ షాపులో పని చేస్తున్నాడు. మూడు నెలల క్రితం యూపీ వెళ్లిన ఇబ్రహీం మళ్లీ నగరానికి తిరిగొచ్చాడు. అక్కడ పెళ్లిచూపులు నచ్చకపోవడంతో బుధవారం ఫ్యాన్కు ఉరేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా స్థానికులు ఇబ్రహీం ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. -
రైతులతో ఆడియో కాన్ఫరెన్స్
ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ డాక్టర్ భాగ్యలక్ష్మి, శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్లు బుధవారం మల్టీ లొకేషన్ ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఆమదాలవలస, గార, శ్రీకాకుళం, రణస్థలం, పలాస, టెక్కలి తదితర మండలాల్లోని 70 మందికి పైగా రైతులకు సలహాలు అందజేశారు. మోంథా తుఫాన్ ప్రభావంతో వరిలో పొట్ట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులతో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి జి.తిరుమలరావు, శ్రీకాకుళం సపోర్టర్ బి.లక్ష్మణరావు పాల్గొన్నారు. -
పత్తి రైతు చిత్తు..!
● తుఫాన్తో నేలరాలిన కాయలు ● నష్టాలు తప్పవని ఆందోళన కొత్తూరు: ప్రకృతి వైపరీత్యాలు, కూటమి ప్రభుత్వ తీరుతో పత్తి రైతులు చిత్తయ్యారు. జిల్లాలో సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంట్లో పత్తిపంట ఒకటి. కొత్తూరు, లావేరు, హిరమండలం, సరుబుజ్జిలి, బూర్జ తదితర మండలాల్లో సుమారు 2,500 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు పత్తిపంట కాపు అంతంతమాత్రంగానే వచ్చింది. అయితే వచ్చిన పత్తికాయలు కూడా మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కుళ్లిపోతున్నాయి. పిందెలు, పువ్వులు పూర్తిగా నేల రాలిపోయాయి. దీంతో పత్తి పంటకు తీవ్రనష్టం వాటిళ్లింది. పెరిగిన పెట్టుబడులు మరోవైపు ఈ ఏడాది పత్తిపంట సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రధానంగా యూరియాతో పాటు ఇతర ఎరువులు అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం సకాలంలో పంపిణీ చేయలేకపోయింది. దీంతో ఒడిశా నుంచి బ్లాక్ మార్కెట్లో అధిక రేట్లకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నికల సమయంలో కొత్తూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం మంజూరు కాలేదు. నవంబర్ నెల వస్తున్నా ఇంతవరకు పత్తి పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రావడం లేదు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
శ్రీకాకుళం : పీపీపీ విధానం పేరిట ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం తగదని జన విజ్ఞాన వేదిక వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ప్రచురించిన ‘పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు’ బుక్లెట్ను శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో ప్రజా సంఘాల నేతలు బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గిరిధర్ మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజానీకానికి వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, జీడీపీలో ఐదు శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ రంగాల బాధ్యత ప్రభుత్వాలదేనని అన్నారు. కార్పొరేట్ల దయదాక్షిణ్యాలపై ప్రజా వైద్యం ఆధారపడటం సరికాదన్నారు. కేరళ తరహా ప్రజా వైద్య విధానాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చింతాడ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా జిల్లా నాయకులు కె.నాగమణి, జేవీవీ జిల్లా ఉపాధ్యక్షుడు పి.కూర్మారావు, కోశాధికారి వీఎస్కుమార్, శివకుమార్, గరిమెళ్ల అధ్యయన వేదిక అధ్యక్షుడు పి.సుధాకర్, రచయిత కంచరాన భుజంగరావు, ఏపీ మోడల్ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు బాడాన శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారుల సంరక్షణకు ముందడుగు
జలుమూరు: మండలంలోని చల్లవానిపేట పరిసర ప్రాంతాల్లో మతి స్థిమితం లేని తల్లి లక్ష్మితో పాటు చిన్నారులు పద్మ, బోడెమ్మ, కరువమ్మల సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వ సంస్థలకు అప్పగిస్తామని సారవకోట సీడీపీవో సీహెచ్ వంశీ ప్రియ తెలియజేశారు. ఈనెల 26వ తేదీన ‘ఎట్టి బతుకులు.. మట్టి మెతుకులు’ శీర్షికతో సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించారు. బుధవారం చల్లవానిపేటలో అనాథ చిన్నారులతో మాట్లాడారు. అలాగే సారవకోట మండలం బద్రి గ్రామానికి వెళ్లి బంధువులు, సోదరి కుటుంబ సభ్యులతో చర్చించారు. న్యాయస్థానం అనుమతితో లక్ష్మిని మానసిక వైద్యశాలకు తరలించి మంచి వైద్యం అందించడంతో పాటు చిన్నారులకు చైల్డ్ వెల్ఫేర్ బోర్డు కమిటీ ద్వారా విద్య, వసతి ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో పర్యవేక్షరాలు మనోరమ, సిబ్బంది ఉన్నారు. -
అంగన్వాడీ... సమస్యల ఒడి..!
● కేంద్రాల్లో సిబ్బంది కొరత ● సక్రమంగా అందని పౌష్టికాహారం ● పనిభారంతో సిబ్బంది అవస్థలు ● పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం అర్బన్: జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్టు పరిధిలో దమ్మలవీధి–2 అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్ తన జాబ్కు రాజీనామా చేసింది. జబ్బావీధి–1 అంగన్వాడీ కేంద్రం, అలాగే కత్తెరవీధి–1 అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న టీచర్లు కూడా రిజైన్ చేశారు. దీంతో ఈ కేంద్రాల్లో ఆయాలే ఉండడంతో.. పక్కనున్న సెంటర్ల టీచర్లు ఇన్చార్జిలుగా వ్యవహరిస్తూ నెట్టుకొస్తున్నారు. అయితే ఆయా టీచర్లు రెండేసి కేంద్రాలను ఎలా సమర్ధవంతంగా నిర్వహించగలరన్నది ప్రశ్నార్థకం. జిల్లాలో మరిన్ని కేంద్రాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. అదనపు భారం వాస్తవానికి ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక ఆయా ఉండాలి. టీచర్ ప్రతిరోజూ చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యనందించాలి. అలాగే ఆయా అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలకు టేక్ హోం రేషన్(టీహెచ్ఆర్) రెండు విడతల్లో అందజేస్తారు. అయితే కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఈ కార్యక్రమాలేవీ సక్రమంగా జరగడం లేదు. జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 28 టీచర్ పోస్టులు, 62 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 14 అంగన్వాడీ కార్యకర్త పోస్టులు క్లియర్ వేకెన్సీ ఉండగా.. ఆయా పోస్టులు 38 క్లియర్ వేకెన్సీ ఉన్నాయి. అయినా టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతలను పక్క కేంద్రాల వారికి అప్పగించంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పరిస్థితి... జిల్లాలో 16 ప్రాజెక్టులు ఉండగా.. వాటి పరిధిలో 130 సెక్టారులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,385 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల పరిధిలో 9,270 మంది గర్భిణులు, 8,935 మంది బాలింతలు, ఆరు నెలల లోపు చిన్నారులు 7,252 మంది, 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 49,589 మంది, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 45,265 మంది ఉన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడం వలన సమర్ధవంతంగా చిన్నారులకు విద్యను అందించలేకపోతున్నారు. పౌష్టికాహారం సకాలంలో అందించడం కష్టసాధ్యంగా మారుతోంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఆటంకంగా మారుతోంది. కార్యకర్తలపై పనిభారం పెరుగుతోంది. ప్రీ స్కూల్ కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. సెలవులు పెట్టుకునే అవకాశం ఉన్నా ఆ హక్కును సిబ్బంది కోల్పోతున్నారు. -
● విద్యుత్ శాఖకు రూ.11.93 లక్షల నష్టం
మోంథా తుఫాన్ కారణంగా మూడు రోజుల్లో సర్కిల్ పరిధిలోని శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్లలో విద్యుత్ శాఖకు రూ.11,93,935 మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ 61 ఎల్టీ విద్యుత్ స్తంభాలు, 11 కె.వి.విద్యుత్ స్తంభాలు 36 నేలకూలిపోగా, 27 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని వివరించారు. 33 కె.వి.ఫీడర్లు 03, 11 కె.వి.ఫీడర్లు 12 వరకు దెబ్బతిన్నాయని వివరించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టి విద్యుత్ సరఫరాకు ఎక్కడా అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. పునరుద్ధరణ పనులకు రూ.11,93,935 మేరకు నిధులు ఖర్చుచేసినట్లు వెల్లడించారు. –అరసవల్లి -
2న సబ్ జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నవంబర్ 2న జరగనున్నాయని జిల్లా కబడ్డీ సంఘం చైర్మన్, ఎమ్మెల్యే గొండు శంకర్, అధ్యక్షుడు నక్క కృష్ణారావు, కార్యదర్శి సాధు ముసలినాయుడు బుధవారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్కాలనీలో ఇండోర్ స్టేడియం (స్విమ్మింగ్ ఫూల్) వద్ద కబడ్డీ శిక్షణా కేంద్రంలో ఉదయం 9 నుంచి ఎంపికల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. 2009 డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించి ఉండాలని తెలిపారు. బాలురు 60 కేజీలు, బాలికలు 55 కేజీల్లోపు బరువు కలిగి ఉండాలని స్పష్టంచేశారు. మ్యాట్పై జరిగే ఈ ఎంపికలకు క్రీడాకారులు విధిగా మ్యాట్ షూ ధరించి హాజరుకావాలన్నారు. కాగా, ఏపీ రాష్ట్రస్థాయి సబ్–జూనియర్స్ బాలబాలికల కబడ్డీ చాంపియన్షిప్–2025 పోటీలు నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి. కర్నూల్ జిల్లా మంత్రాలయం వేదికగా జరిగే ఈ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లను ఇక్కడ ఎంపిక చేయనున్నారు. పూర్తి వివరాలకు జిల్లా కబడ్డీ సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి సాదు శ్రీనివాసరావు(సెల్: 94419 14214)ను సంప్రదించవచ్చు. -
పూడిలంకకు దారి
వజ్రపుకొత్తూరు: తుఫాన్, వరదలు వస్తే చాలు ఉప్పుటేరు పొంగడం.. ఆపై వరద ముప్పు అంటూ నిత్యం వార్తల్లో నిలిచే పూడిలంకకు దారి దొరికింది. ఇటీవల రహదారి నిర్మాణంపై సాక్షి పత్రికలో ‘నత్తే నయం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. గ్రావెల్ను శరవేగంగా వేసి తాత్కాలిక రహదారి నిర్మించారు. దీంతో కొంతమేర కష్టాలు తీరాయి. బుధవారం అధికారులు, సర్పంచ్ తిమ్మల కృష్ణారావు తదితరులు రహదారిని పరిశీలించారు. అయితే ఇంకా రహదారిపై వంతెన, బీటీ నిర్మాణం పూర్తిస్థాయిలో చేపట్టాల్సి ఉంది. -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
నరసన్నపేట: మండలంలో ఇసుకాసురుల అక్రమ తవ్వకాలకు అడ్డే లేకుండా పోతోంది. పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ వంశధార నదిలో ఇసుకను ఎటువంటి అనుమతులు లేకపోయినా తవ్వి, రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం గోపాలపెంట కేంద్రంగా ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నారు. పగలంతా అక్రమంగా మాకివలసకు వెళ్లే రోడ్డులో డంపింగ్ చేయడం, రాత్రి సమయాల్లో లారీల్లో లోడు చేసి పంపిస్తున్నారు. ఇదంతా ఓపెన్గా జరుగుతున్నా.. అటు మైన్స్ అధికారులు గానీ.. రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. కాగా అక్రమ తవ్వకాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను గ్రామంలోని ప్రధాన వీధి మీదుగా తరలిస్తుండడంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు.అలాగే మడపాం, బుచ్చిపేట, ఉప్పరిపేట, లుకలాం, వెంకటాపురంల్లో కూడా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఉచిత ఇసుక పేరుతో అటు ట్రాక్టర్లు, ఇటు ట్రిప్పర్లు, లారీల యజమానులు అప్పనంగా ఇసుకను తరలించి జేబులు నింపుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అందువలన ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
65 బస్సులు రద్దు
శ్రీకాకుళం అర్బన్ : మోంథా తుఫాను తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బోసిపోయింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు లేకపోవడంతో నాన్ స్టాప్ కౌంటర్ ఖాళీగా దర్శనమిచ్చింది. వర్షాల ప్రభావం ఆర్టీసీ పై కూడా పడింది. జిల్లాలో శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో 19 బస్సులను, శ్రీకాకుళం 2వ డిపో పరిధిలో 18 బస్సులను, టెక్కలి డిపో పరిధిలో 10 బస్సులను, పలాస డిపో పరిధిలో 18 బస్సులను కలిపి మొత్తం 65 ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. వర్షాలు ఉంటే బుధవారం కూడా పలు సర్వీసులు రద్దే చేసే అవకాశం ఉంది. -
జాగ్రత్తలే శ్రీరామరక్ష
ఆమదాలవలస/శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : మోంథా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు ముంపునకు గురవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో పంటల సంరక్షణకు ఆమదాలవలసలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ చిట్టిబాబు, డాక్టర్ భాగ్యలక్ష్మి, డాక్టర్ రాయ్లు రైతులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం వరి పంట 1.45 లక్షల హెక్టార్లలో సాగులో ఉందని, వరి పంట పూత దశ, పాలు పోసుకునే దశ, గింజ గట్టిపడే, దశ కోత దశలలో ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి పంట ఎం.టి.యు–1061, ఎం.టి.యు–1318, స్వర్ణ, సంపద స్వర్ణ, బీపీటీ 5204 వంటి రకాలు పూత దశలో ఉన్నాయి. వర్షాల వల్ల పూత దెబ్బతినడంతో పాటు గింజలు ఏర్పడకపోవడం, రంగు మారడం, మాగుడు తెగులు రావడం, నిద్రావస్థ తొలగి మొలకలు వచ్చే ప్రమాదముంది. దీని నివారణకు పొలాల్లో నీరు నిల్వ కాకుండా వెంటనే కాలువల ద్వారా తొలగించాలి. ఎండాకు, మాగుడు తెగులు నివారణకు తగిన ఫంగిసైడ్ పిచికారీ చేయాలి. పాలు పోసుకునే దశలో పంటలు పడిపోతే నీరు నిల్వ కాకుండా మోటారు ద్వారా నీటిని బయటకు పంపించాలి. గింజల రంగు మారడం మాగుడు తెగులు నివారణకు ఎకరాకు 200 మి.లీ. ప్రోపికోనాజోల్ పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో ఉంటూ కంకిలో మొలకలు కనపడితే 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయాలి. కోత దశలో ఉండి పంట నేలపై పడిపోతే నీరు పూర్తిగా బయటకు పోవటానికి కాలువలు ఏర్పాటు చేయాలి. గింజ మొలకలు రాకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం పనలపై పిచికారీ చేయాలి. సాంబ మసూరి వంటి నిద్రావస్థ లేని రకాలలో వారం రోజుల పాటు నీరు నిలిచితే గింజలు మొలకెత్తే ప్రమాదం ఉంది. వర్షాల అనంతరం పొలాల్లో నీటిని తొలగించి ఫంగిసైడ్/ఉప్పు ద్రావణం వినియోగిస్తే నష్టం తగ్గించుకోవచ్చు. పత్తిపంట పత్తి కాయపగిలే దశలో ఉన్నందున, వర్షాలు తగ్గిన వెంటనే మురుగు నీరు తొలగించి నేల ఆరేలా చూడాలి. 2శాతం యూరియా లేదా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయడం వల్ల పోషక లోపాలను సవరించవచ్చు. కాయకుళ్లు నివారణకు ముందు జాగ్రత్తగా మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ (3 గ్రా/లీటరు నీటికి) పిచికారీ చేయాలి. మొక్కజొన్న మొక్కజొన్న కోత దశలో ఉంటే వెంటనే కోత చేపట్టాలి. తడిసిన కండెలను పలుచగా పేర్చి ఆరబెట్టి నూర్పిడి చేయాలి. కోతకు చేరువలో ఉన్న పంట పడిపోతే నీటిని బయటకు పంపించాలి. తర్వాత ప్రొపికోనాజోల్ (1 మి.లీ/లీ) గానీ, హెక్సాకొనజోల్ (2 మి.లీ/లీ) గానీ పిచికారీ చేయాలి. నూర్పిడి కోసం ఆరబెట్టిన తడి కండెలపై మొలక రాకుండా 5శాతం ఉప్పును పలుచగా చల్లి కలపాలి. ఉద్యానపంటలు అరటి, బొప్పాయి వంటి ఉద్యాన పంటల తోటలలో నిల్వ ఉన్న నీటిని త్వరగా బయటకు తీసివేయాలి. అరటిలో సిగటోక ఆకు మచ్చ తెగులు అరికట్టేందుకు ప్రొపికోనాజోల్ గానీ, మాంకోజెబ్ గానీ పిచికారీ చేయాలి. బొప్పాయి, కూరగాయ నారుమడుల్లో వేరు కుళ్లు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ (3 గ్రా/లీ) మొక్కల మొదళ్ల వద్ద పోయాలి. ఆక్వా చేపలు, రొయ్యల పెంపకందారులు వర్షాల సమయంలో మేతను 50 శాతం వరకు తగ్గించి, చెరువు గట్లను గట్టిపరచుకోవాలి. వర్షాలు అనంతరం నీటిలో పీహెచ్ తగ్గితే సున్నం వాడకం, ఆక్సిజన్ తగ్గితే ఎయిర్షన్ పెంచుకోవాలి. చేపలు, రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా విటమిన్ సి, ప్రోబయోటిక్స్ వాడాలి. నీటమునిగిన పొలాలు జలమయమైన తోటలు అప్రమత్తంగా ఉండాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు -
గంజాయితో ఒడిశా మహిళా అరెస్టు
పలాస: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గుల్బా గ్రామానికి చెందిన మహిళ మిక్కికుమారి మాలిక్ను మంగళవారం సుమారు రూ.55వేలు విలువైన 11 కిలోల గంజాయితో అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ కోటేశ్వరరావు చెప్పారు. ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మాల్యాద్రి సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ మహిళ కనిపించింది. ట్రాలీ బ్యాగ్ తనిఖీ చేయగా గంజాయి బయటపడింది. వెంటనే రైల్వే పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కళాశాలలో తనిఖీలు ఇచ్ఛాపురం: పట్టణంలోని స్వర్ణభారతి జూనియర్ కళాశాలను ఆర్ఐఓ తవిటినాయుడు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, ల్యాబ్లను పరిశీలించారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో ఎటువంటి తరగతులు నిర్వహించకూడదని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ చాట్ల తులసీదాస్, రాము, ప్రిన్సిపాల్ జె.జయప్రకాష్, సందీప్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఉద్యోగ సర్వీసులో ఎలాంటి పొరపాట్లు చేయరాదని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, ఎలాంటి లంచాలకు తావు ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.వి.రమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు అక్టోబరు 27 నుంచి నవంబరు 2 వరకు ఏసీబీ విజిలెన్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనాధికారి జి.ఎ.సూర్యనారాయణ, ఏసీబీ ఇన్స్పెక్టర్ కె.భాస్కరరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం తనిఖీ శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈవీఎం) గోదామును ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మంగళవారం పరిశీలించారు. నెలవారీ తనిఖీలో భాగంగా కలెక్టరేట్లో ఉన్న గోదామును ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్తో కలిసి తనిఖీ చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, సి–సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రెడ్క్రాస్ ఔదార్యం శ్రీకాకుళం కల్చరల్: మోంథా తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున ఇండియన్ రెడ్క్రాస్ ప్రతినిధులు సేవా కార్యక్రమాలు ముమ్మరం చేశారు. రెడ్క్రాస్ జిల్లా అధ్యక్షుడు పి.జగన్మోహనరావు ఆదేశాల మేరకు సంతబొమ్మాళి మండలం ఆర్.సన్నపల్లి, ఎం.సన్నపల్లి, పాత మేఘవరం, ఎం.మేఘవరం, మరువాడ, మూలపేట, గులిగిపేట, లక్కీవలస, గిద్దలపాడు తదితర గ్రామాల్లో వలంటీర్లు మత్స్యకారులను అప్రమత్తం చేశారు. పలుచోట్ల టార్పాలిన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ ప్రోగ్రాం మేనేజర్ జి.రమణ, పి.సుజాత, ఎన్.హర్షవర్ధన్, పి.వెంకటరమణ, పి.చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి
పోలాకి: జిల్లాలో వేర్వేరు చోట్ల విద్యుత్ షాక్కు గురై ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోలాకి మండలంలో తీరప్రాంత గ్రామమైన గుల్లవానిపేటలో కారి రామచంద్రరావు(37) దీపావళి సందర్భంగా ఇటీవల ఇంటికి సీరియల్సెట్ అలంకరించాడు. తుఫాన్ నేపథ్యంలో ఎక్కువగా గాలులు వీస్తున్నందున మంగళవారం సీరియల్ సెట్ తొలగించే క్రమంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రామచంద్రరావుకు భార్య మమత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఇంటికి ఆసుకుని ఉన్న విద్యుత్లైన్ తగలడంతోనే ప్రమాదం జరిగిందని, హైటెన్షన్ వైర్లు తొలగించాలని కోరినా ట్రాన్స్కో అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్కో సిబ్బంది మాత్రం ఇంటి వద్దే విద్యుత్షాక్కు గురైనట్లు చెబుతున్నారు. పోలాకి ఎస్ఐ రంజిత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. బొంతలకోడూరులో వీఆర్ఏ.. ఎచ్చెర్ల : బొంతలకోడూరు పంచాయతీ వీఆర్ఏ బి.నర్సింహులు (45) మంగళవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. భవానీ మాల వేసిన ఈయన సన్నిధానానికి విద్యుత్ సరఫరా రాకపోవడంతో జాయింట్ కలిపేందుకు వెళ్లి షాక్కు గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నర్సింహులకు ముగ్గురు కుమార్తెలు, భార్య ఉన్నారు. రామచంద్రరావు(ఫైల్)నర్సింహులు (ఫైల్) -
వృద్ధురాలిపై దాడి..బంగారం చోరీ
● వేటకు దూరమై.. తీరానికే పరిమితమై..సారవకోట: బుడితి గ్రామంలో నక్క చెల్లెమ్మ (80) అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి బంగారం చోరీ చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుడితిలో నక్క చెల్లెమ్మ తన ఒంటరి వృద్ధురాలు సోమవారం రాత్రి తన ఇంట్లో నిద్రపోయింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తికి ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి చెవి, ముక్కుకు ఉన్న అరతులం బంగారు వస్తువులు తెంచేశాడు. ఆమె ప్రతిఘటించడంతో దుండగుడు ఇనుప చువ్వతో దాడికి పాల్పడటంతో మెడపై తీవ్ర గాయమైంది. వృద్ధురాలి కేకలు విని స్థానికులు చేరుకునే లోపే దుండగుడు పరారయ్యాడు. అవంతరం బాధితురాలిని బుడితి సీహెచ్సీకి తరలించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు బుడితి ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. -
వైద్య, రేషన్ సేవలు నిరంతరాయంగా అందించాలి
పలాస: పలాసలో జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య శాఖ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు మంగళవారం పలాసలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లపై అధికారులతో చర్చించి తగిన సలహాలు,సూచనలు చేశారు. వైద్యం, రేషన్ సేవలను నిరంతరాయంగా అందించాలని కోరారు. ఈ సందర్భంగా పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను పరిశీలించారు. సుమారు 3 గంటల పాటు ఆయా విభాగాలను నిశితంగా పరిశీలించారు. తుఫాన్ సమయంలో రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంఎల్ఎస్ పాయింటును తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలాస తహసీల్దార్ టి.కళ్యాణచక్రవర్తి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో సిబ్బందితో చక్రధర్బాబు -
అడుగుకో గుంత.. గజానికో గొయ్యి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలోని రహదారులు గోతులమయంగా మారాయి. అడుగుకో గుంత...గజానికో గొయ్యిలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ఎక్కడ గుంత ఉందో...ఏ పక్కన గొయ్యి ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. అంతర్గత రోడ్ల పరిస్థితి మారింత దారుణంగా ఉంది. దుష్ప్రచారంతో నాడు తప్పుదోవ వైఎస్ జగన్ ప్రభుత్వంలో జిల్లాలో రూ.526.69 కోట్లతో ఆర్అండ్బీ పరిధిలో 432 రోడ్లు నిర్మించింది. పంచాయతీరాజ్ పరిధిలో ఏఐఐబీ కింద రూ.352.78కోట్లతో 312 రోడ్లు వేసింది. ఆర్సీపీఎల్డబ్ల్యూ కింద రూ.70.96కోట్లతో 23 రోడ్ల నిర్మాణం చేపట్టింది. గిరిజన ప్రాంతాల్లో రూ.56.35 కోట్లతో 42సీసీ, బీటీ రోడ్లు నిర్మాణం చేపట్టింది. కానీ ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా రోడ్లపై దుష్ప్రచారానికి దిగాయి. నేడు గుంతలు పూడ్చలేని పరిస్థితి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పల్లె పండగ పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేసింది. వేసిన రోడ్లు కంటే ప్రచారమే ఎక్కువ జరిగింది. 2025 జనవరి నాటికి రోడ్లను అద్దంలా మార్చేస్తామంటూ చంద్రబాబుతో సహా అందరూ డాంబికాలు పలికారు. కానీ ప్రచారం చేసినంత వేగంగా పనులు చేయలేదు. రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లింపులు చేయకపోవడంతో చాలా పనులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఆర్అండ్బి పరిధిలోని రోడ్లు పరిస్థితి కూడా అంతే. నరకయాతన.. ప్రస్తుతం రోడ్ల నిర్వహణ గాలికి వదిలేయడంతో ఉన్న రోడ్లు కూడా పాడైపోతున్నాయి. శ్రీకాకుళం నగరంలోని సెవెన్ రోడ్డు జంక్షన్ నుంచి డే అంట్ నైట్ జంక్షన్ ఉన్న రోడ్డు చూస్తే కూటమి ప్రభుత్వం, పాలకుల చిత్తశుద్ధి ఎలా ఉందో అవగతమవుతుంది. రోడ్డు పొడవునా గుంతలే. రోజూ అధికారులు రాకపోకలు సాగించే జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి గుంతలనే పూడ్చకపోతే జిల్లాలో మిగతా రహదారుల పరిస్థితిని ఊహించుకోవచ్చు. క్వారీలు, ఇసుక ర్యాంపుల నుంచి వచ్చే వాహనాలతో పల్లె దారులు ఛిద్రమవుతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో రోడ్లపైన ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. వాహనచోదకులైతే మరింత వణుకుపోతున్నారు. ఇచ్ఛాపురం రూరల్:బాలకృష్ణాపురం–డెప్పూరు రోడ్డుమెళియాపుట్టి: కొత్తూరు గ్రామానికి వెళ్లే దారి జిల్లాలో అధ్వానంగా రహదారులు పట్టించుకోని కూటమి ప్రభుత్వం చినుకు పడితే చాలు మరింత వణుకు -
గూడు.. గోడు..
● కవిటి: జగతిలో పులకల మల్లేశ్వరరావు ఇంటి రేకు పైకి ఎగిరిపోయింది. ఎర్రగోవిందపుట్టుగలో సైతం మరో పేదవారి ఇంటి గోడకూలింది. ● ఆమదాలవలస రూరల్: పొన్నంపేటలో ఐదు ఇళ్లు, రామచంద్రాపురం గ్రామంలో రెండిళ్ల గోడలు కూలాయి.● గార: రామచంద్రాపురం పంచాయతీ పాత జొన్నలపాడు గ్రామంలో దూబ సూరమ్మ మంచంపై పడుకొని ఉండగా ఒక్కసారిగా ఇల్లు కూలింది. తోణంగిలో సుగ్గు లక్ష్మీకి చెందిన పురింటి గోడలు కూలిపోయాయి. ● మెళియాపుట్టి: భరణికోట పంచాయతీ పరిధి కాటంవీధిలో సవర సురేష్ అనే గిరిజనుడికి చెందిన మట్టి ఇల్లు కూలిపోయింది. కూలిన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న బియ్యం ఇతర నిత్యావసర సరుకులు మొత్తం పాడైపోయినట్లు బాధితులు చెబుతున్నారు. ● రణస్థలం: అల్లివలస గ్రామంలో గింతు లక్ష్మి, తిరుపతిపాలెం గ్రామంలో దువ్వాన పైడమ్మ, దుప్పాడ రాజమ్మలకు చెందిన పూరిళ్లు, పెంకుటిళ్లు కూలిపోయాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ● పొందూరు: తుఫాన్ ప్రభావంతో లోలుగులో సెగళ్ల పైడిరాజుకు చెందిన పూరిల్లు కూలింది. కొంచాడలో సిడగ సూర్యనారాయణకు చెందిన పూరిల్లు కూడా కూలింది. వీఆర్ గూడెంలో మూడు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. -
ఖబడ్దార్...!
కామాంధులారా..పోక్సో యాక్ట్● చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే జైలుకే ● నేర తీవ్రత ఆధారంగా జీవిత ఖైదు లేదంటే మరణ శిక్షే ● బాధితులకు అండగా పోక్సో చట్టం భయపడకూడదు పరువు పోతుందేమోనని, ఎవరో ఏదో చేస్తారని జరిగేదానిపై ఫిర్యాదు ఇవ్వడానికి భయపడకూడదు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. మీడియా రంగాలు కూడా ఎట్టిపరిస్థితుల్లో బాలిక,బాలిక కుటుంబం, గ్రామం పేర్లు రాయవద్దు. పోక్సో కేసుల్లో ఉపేక్షించేదే లేదు. రాజకీయ పైరవీలు అస్సలుండవు. గుడ్టచ్ – బ్యాడ్టచ్పై నిత్యం బాలికలను అవగాహన కల్పించాలి. – కేవీ మహేశ్వరరెడ్డి, ఎస్పీ, శ్రీకాకుళం తల్లిదండ్రుల పాత్ర కీలకం పిల్లల ఎదుగుదలలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. తల్లి అతిగా మద్యం సేవించే వీక్నెస్ వలనే ఇటీవల ఓ బాలికపై అఘాయిత్యం జరిగింది. ఇంటర్నెట్ వాడకం, పోర్నుసైట్లు ఎక్కువగా చూడటం, తల్లిదండ్రులు విడిపోవడం, వారి వివాహేతర సంబంధాలు, భార్యాభర్తలు ఉద్యోగాల్లో ఉంటూ పిల్లలను పట్టించుకోకపోవడం కూడా కొన్ని అనర్థాలకు కారణమవుతున్నాయి. ఆటోల్లో, బస్సుల్లో విద్యార్థినుల రోజువారీ పరిస్థితి తెలుసుకోవాలి. – సీహెచ్ వివేకానంద, డీఎస్పీ, శ్రీకాకుళం శ్రీకాకుళం క్రైమ్: జిల్లాలో బాలికలపై రోజురోజుకీ ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. కీచక కామాంధులు రెచ్చిపోతున్నారు. పోలీసు అధికారులు దారుణాలు జరగకుండా అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ చిన్నారులపై కామాంధుల ఆగడాలకు ఫుల్స్టాప్ పడడం లేదు. అనేక చోట్ల చిన్నారులను చిదిమేసే మృగాళ్లు తారసపడుతూనే ఉన్నారు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ భయం లేకుండా బరితెగిస్తున్నారు. కారణాల్లో కొన్ని పరిశీలిస్తే... బాల కార్మిక వ్యవస్థ ఇప్పటికీ ఉండడంతో కొన్నిచోట్ల యజమానులు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అలాగే విద్యాసంస్థలు, వసతి గృహాల్లో సిబ్బంది మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. మద్యం మత్తు, అశ్లీల వెబ్సైట్లు యువత నుంచి వృద్ధులు వరకు వక్రబుద్ధికి ప్రేరేపిస్తున్నాయి. దీనికితోడు పల్లె ప్రజల్లో అమాయకత్వం, పెద్దల్లో రాజీతత్వం, అన్నింటికీ మించి తల్లిదండ్రుల్లో, కుటుంబీకుల్లో అవగాహనా రాహిత్యం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు. ఏంటీ పోక్సో చట్టం..? 1992లో ప్రపంచంలో పెరుగుతున్న జనాభాలో యువతపై అధిక శాతం లైంగిక దాడులు పెరుగుతాయనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి కొన్ని సభ్యత్వ దేశాలతో చట్టాలను చేయాలని తీర్మానాలు చేసింది. దీనిలో భాగంగా బాలికలు, మహిళలపై జరుగు ఆకృత్యాలకు కొన్ని శిక్షలు అమలయ్యేవి. అయితే ఆధునిక సమాజంలో బాలికలపై మరిన్ని విశృంఖల దాడులు పెరగడంతో 2012లో చట్టాన్ని సవరించి పోక్సో యాక్ట్(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం మైనర్ బాలికపై ఒక గీత పడినా.. తాకరాని చోట తాకినా.. ఆమె ఇష్టంతో చేయి వేసినా, అంగీకారంతో తీసుకుపోయినా, అక్రమ రవాణా చేసినా, అశ్లీల, వాణిజ్య ప్రయోజనాలకై అసాంఘిక కలాపాల్లో ప్రేరేపించినట్లు చేసినా జైలు ఊచలు లేదంటే మరణ శిక్ష అమలు చేస్తారు. అమాయక బాధిత బాలికలను సంరక్షించాలి, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన నేరస్తులకు కఠినంగా శిక్షించాలన్నదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. ప్రత్యేక కోర్టులు బాలిక నేరుగా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో తనపై అసభ్యంగా ప్రవర్తించారని ఒక్క మాట చెబితే చాలు అదే ఫైనల్ అని.. వెంటనే పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని సుప్రీంకోర్టే చెప్పింది. ఆ తర్వాత దర్యాప్తులో తనేం తప్పు చేయలేదని నిందితుడు నిరూపించుకుంటే తప్ప శిక్ష తప్పదు. బాలికపై అఘాయిత్యానికి సంబంధించి తల్లిదండ్రుల వద్ద స్టేట్మెంట్, బాలిక స్టేట్మెంట్, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్, దర్యాప్తు, విచారణ, మెడికల్ అవిడెన్స్, సపోర్ట్లు అన్నీ వీడియో రికార్డు చేయాల్సి ఉంటుంది. ఆకరికి పోక్సో కేసులకంటూ ఉండే ప్రత్యేక కోర్టులో సైతం నాలుగు గోడల మధ్య బాలిక వాంగ్మూలం మేజిస్ట్రేట్ తీసుకోవడం కూడా రికార్డు అవుతుంది. కోర్టులో ట్రయల్ రన్స్ నుంచి కన్విక్షన్ (నేరారోపణ రుజువయ్యేవరకు) వరకు వీడియో రికార్డు అవిడెన్స్లు భద్రపరుస్తారు. ఇదంతా చేసేది దర్యాప్తు, విచారణలో అనుమానాలుండకూదని, బాలికల వయసు నిర్ధారణ, సాక్ష్యాల తారుమారు కాకూడదని, మళ్లీ ఫిర్యాదులు రాకూడదనే ఉద్దేశంతోనే. ఫిర్యాదు చేసేందుకు 100, 112, 1098, సమీప పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో నుంచి జిల్లా ఎస్పీ వరకు నేరుగా ఎవరినైనా సంప్రదించవచ్చు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
రణస్థలం: లావేరు మండలంలోని తాళ్లవలస జాతీయ రహదారి–16పై కిల్లారి జగదీష్ (28) రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. లావేరు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తాళ్లవలస గ్రామానికి చెందిన జగదీష్ తన కోళ్లఫారానికి వెళ్లేందుకు సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా.. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తండ్రి నారాయణరావు తాళ్లవలస గ్రామానికి రోడ్డు అవతల ఉన్న కోళ్లఫారం నడుపుతున్నాడు. తల్లి శశిరేఖ జేఆర్పురం పోలీస్స్టేషన్ సమీపంలోని గణేష్ కాంప్లెక్స్లో పేపర్ ప్లేట్ల వ్యాపారం చేస్తుంటారు. మృతుడికి ఇద్దరు అన్నదమ్ములు హరీష్, యశ్వంత్ ఉన్నారు. జగదీష్ మృతితో తాళ్లవలస గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లావేరు ఎస్ఐ జి.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
తుఫాన్ పునరావాస కేంద్రం పరిశీలన
పోలాకి: తుఫాన్ నేపథ్యంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులతో కో ఆర్డినేట్ చేసుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి కేవీఎస్ చక్రధరబాబు సూచించారు. సోమవారం పోలాకి మండలంలోని డీఎల్పురం తుఫాన్ షెల్టర్ను పరిశీలించారు. ముఖ్యంగా తీరప్రాంత గ్రామాలు, లోతట్టు గ్రామాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో సేవలందించేలా అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నా రు. మండలంలో నాలుగుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ శ్రీనివాసరావు వివరించారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్తోపాటు వివిధ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఉన్నారు. -
ముమ్మరంగా గాలింపు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డేఅండ్నైట్ కొత్త వంతెన పైనుంచి నాగావళి నదిలో ఆదివారం అర్ధరాత్రి దూకేసిన మహిళ కోసం ఫైర్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సోమవారం ముమ్మర గాలింపు చేపట్టాయి. రోప్లతో కొందరు నదిలోకి దిగగా, బోట్లలో ఎన్డీఆర్ఎఫ్ బృందం తిరిగింది. నదిలో ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండడం వలన ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారిందని ఏడీఎఫ్వో శ్రీనుబాబు అన్నారు. కాగా రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు మాట్లాడుతూ.. మహిళ దువ్వు రాజ్యలక్ష్మి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశామన్నారు. రైలు నుంచి జారిపడిన మహిళకు గాయాలు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైలు నిలయంలో రైలు నుంచి దిగుతూ జారిపడిన మహిళకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు.. మండలంలోని బొడ్డకాళి గ్రామానికి చెందిన దారపు లోలాక్షి కుటుంబ సభ్యులతో కలిసి ఒడిశాలోని పారాదీప్లో నివాసముంటుంది. ఆమె బంధువుల ఇంట్లో జరిగే ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు భువనేశ్వర్ – సికింద్రాబాద్ విశాఖ ఎక్సప్రెస్లో సోమవారం ఇచ్ఛాపురం వచ్చింది. ఈ క్రమంలో ట్రైన్ స్టేషన్లోని మొదటి ప్లాట్ఫారంపై ఆగింది. తుఫాన్ కారణంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్లాట్ఫారంపై వర్షపు నీరు చేరింది. ఆమె రైలు నుంచి లగేజీతో పాటు దిగుతుండగా కాలుజారి కింద పడిపోవడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు 108కి సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రురాలిని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య రణస్థలం: మండలంలోని కొండములగాం పంచాయతీ ముక్తుంపురం గ్రామానికి చెందిన మంత్రి పెద్ద అప్పలనాయుడు (37) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, జేఆర్పురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 18వ తేదీన అప్పలనాయుడికి భార్య రోజాతో ఇంట్లో గొడవ జరిగింది. దీంతో భార్య రోజా ఇద్దరు పిల్లలను పట్టుకుని తమ కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి కరెంట్ వైర్లతో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. భార్య రోజా ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. అంతా నా ఇష్టం..? సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తానేమి చెబితే అదే జరగాలని.. తాను చెప్పే వారికే బిల్లులివ్వాలని.. తనకు చెప్పకుండా టెండర్లు పిలవడానికి కుదరదంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధికారులకు హకుం జారీ చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనకు చెప్పకుండా ఏ పనులు చేయడానికి లేదని, ఏవైనా పనులు చేసినా.. ఎవరికై నా పనులు అప్పగించినా తనకు తెలియజేయాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం ఇటు అధికారులు.. అటు కాంట్రాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ పీవీవీడీ ప్రసాదరావు, మున్సిపల్ ఇంజినీర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలి
శ్రీకాకుళం: రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయుల నియామకాలు ఆపాలని దళిత ప్రజా సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు నగరంలోని ఆదివారంపేటలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల జిల్లా కో–ఆర్డినేటర్ కార్యాలయం వద్దకు దళిత ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మైనర్ బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. అమ్మాయిల గురుకులాల్లో మగ ఉపాధ్యాయులను నియమించవద్దని జునైల్ కోర్టు తీర్పులు ఉన్నప్పటికీ.. గురుకులాల సొసైటీ కార్యదర్శి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కో–ఆర్డినేటర్ యశోదలక్ష్మి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేడ్కర్ యువజన సంఘం చంద్రమౌళి, మామిడి అప్పలరాం, యడ్ల జానకిరావు, బోనేల చిరంజీవి, తారక, అక్కెన రాజారావు, అనిల్, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు పాల్గొన్నారు. -
బాలికా విద్యపై శీతకన్ను..?
శ్రీకాకుళం: ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ను తొలగించాలని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే ఇంటి వద్దకే రేషన్ బియ్యం, వలంటీర్ వ్యవస్థ రద్దు, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి చర్యలకు పాల్పడింది. కాగా ఇప్పుడు ప్లస్ టూ హైస్కూళ్లపై కూడా శీతకన్ను వేస్తున్నట్లు తెలుస్తోంది. 2009 విద్యాహక్కు చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయస్సు కలిగిన బాలికలకు ఉచిత నిర్బంధ విద్యనందించాలి. అయితే బాలికలకు గ్రామస్థాయిలో ఇంటర్మీడియట్ విద్య అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాలకు పంపించేందుకు ఇష్టంలేని తల్లి దండ్రులు పదో తరగతి తర్వాత చదువు మాన్పించేస్తున్నారు. దీనిని గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్లస్ టూ హైస్కూళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కూళ్లలో బాలికలకు ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ఈ విద్యను ప్రారంభించారు. జిల్లాలో 6 ప్లస్ టూ పాఠశాలలు శ్రీకాకుళం జిల్లాలో 6 ప్లస్ టూ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వజ్రపుకొత్తూరు, టెక్కలి, నరసన్నపేట మండలంలోని ఉర్లాం, పలాస మండలంలోని బ్రాహ్మణతర్ల, సరుబుజ్జిలి మండలంలోని రొట్టవలసల్లో బాలికల కోసం ప్రత్యేకించి ప్లస్ టూ హై స్కూళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోగ్రూపులో 40 నుంచి 50 మంది వరకు చేరే అవకాశం కల్పించారు. అయితే ప్రస్తుతం ఈ 6 పాఠశాలల్లో మొత్తం 12 సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సందర్భంలో ఇప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ యువగళం పేరిట నిర్వహించిన పాదయాత్రలో ప్లస్ టూ ఉన్నత పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని, ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల్లో టీజీటీ, పీజీటీలుగా పదోన్నతులు కల్పిస్తామని హామీని ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఉన్న సమస్యలను పరిష్కరించకపోగా, మరిన్ని సమస్యలు పెరిగాయని పలువురు వాపోతున్నారు. ప్రారంభమవ్వని సిలబస్ ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు పోస్టులను ఖాళీగా ఉంచితే వచ్చే ఏడాది ఇంటర్మీడియట్లో కొత్తగా విద్యార్థులు చేరే అవకాశాలు ఉండవు. ఇదే జరిగితే వీటిని ఎత్తివేయొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు ఉపాధ్యాయ వర్గాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం వీటిలోని సమస్యలను పరిష్కరించకపోవడంతో ఈ విమర్శలకు బలం చేకూరుస్తోంది. అందువలన ఇప్పటికై నా సబ్జెక్ట్ ఉపాధ్యాయులను నియమించకుంటే మరో ఐదు నెలల్లో జరగనున్న పరీక్షలకు విద్యార్థినులు సన్నద్ధమయ్యే అవకాశాలు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్య క్యాలెండర్ ప్రకారం నవంబర్ నాటికి సిలబస్ పూర్తిచేసి అటు తర్వాత రివిజన్ చేయించాల్సి ఉంటుంది. అయితే కొన్ని ప్లస్ టూ పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వలన ఇప్పటికీ పలు సబ్జెక్టుల్లో పాఠాలు ప్రారంభమవ్వకపోవడం విచారించదగ్గ విషయం. అందువలన ఇప్పటికై నా జిల్లా అధికారులు దృష్టి సారించి ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లాలోని ప్లస్ టూ హైస్కూళ్లలో 12 పోస్టులు ఖాళీ మరో ఐదు నెలల్లో పరీక్షలు సిలబస్ పూర్తవ్వకపోవడంతో ఆందోళన బాల్య వివాహాల నిర్మూలన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా పాలసీ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ప్లస్ టూ విద్య వలన బాల్య వివాహాల నిర్మూలన సాధ్యపడుతుందని స్పష్టంగా పేర్కొంది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ప్లస్ టూ పాఠశాలలను నిర్వీర్యం చేస్తోంది. ఇది 2009 విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడమే. తక్షణమే ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. – పేడాడ ప్రభాకరరావు, ఎస్టీయూ జిల్లా నాయకుడు -
నేడు భారీ వర్షాలకు అవకాశం
శ్రీకాకుళం పాతబస్టాండ్: మోంథా మోత మొదలైంది. తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుఫాన్ మంగళవారం సా యంత్రం, లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా వర్షా లు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులు వంశధార, నాగావళి ప్రస్తుతం నిలకడగా ఉన్నాయి. వర్షాలు అధికమైతే వరద వచ్చే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో జిల్లా ప్రత్యేకాధికారి కేవీఎన్ చక్రధరబాబు సోమవారం పోలాకి తదితర మండలాల్లో పర్యటించారు. ఈ విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు 11 మంది సభ్యులు గల ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ జిల్లాలోనే సామగ్రితో సిద్ధంగా ఉంది. కొనసాగుతున్న కంట్రోల్ రూమ్లు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయాన్ని పొందేందుకు అందుబాటులో కంట్రోల్ రూమ్లు ఉంచారు. రెండు రోజుల నుంచి కలెక్టర్, డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు కొనసాగుతున్నాయి. ప్రజలు బయటకు రాకూడదు తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. కాలువలు, చెరువులు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు తుఫాన్ ప్రభావం ఎక్కువగా తీర ప్రాంతాల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. మన తీరంలో 11 మండలాలు, 236 గ్రామాలు, సుమారుగా 1.90 లక్షల జనాభా ఉన్నారు. తీర ప్రాంతంలో 41 తు ఫాన్ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో అవసరం మేరకు అన్నీ సిద్ధం చేశారు. ఇతర ప్రాంతాల్లో మరో 80 తాత్కాలిక పునరావాస కేంద్రాలు గుర్తించి సిద్ధం చేశారు. 41 తాగునీటి ట్యాంకర్లు ఉంచారు. 185.4 మిల్లీమీటర్ల వర్షం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 185.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సా యంత్రం వరకు 592.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఇంకా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం ఈ వానలు మరింత ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వర్షం (మిల్లీమీటర్లలో) ఎక్కడెక్కడ.. ఎంతెంత.. -
అటు నిర్బంధం.. ఇటు నినాదం
సరుబుజ్జిలి: థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు వ్యతిరేకంగా థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వ ర్యంలో సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో సోమవారం తలపెట్టిన మహాధర్నా కార్యక్రమాన్ని పోలీసు బృందాలు అడ్డుకున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు పోరాట కమిటీ నాయకులు సిద్ధమయ్యారు. ఎక్కడికక్కడ అరెస్టులు మహాధర్నా చేసేందుకు ఎలాంటి అనుమతులు లేవంటూ శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్ఐలు వివి ధ రకాల పోలీసు సిబ్బందితో పవర్ ప్లాంట్ ప్రతిపాదిత ప్రదేశాలు, రహదారుల వద్ద మోహరించారు. మహాధర్నా కార్యక్రమానికి వస్తున్న థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగిని అదుపులోకి తీసుకొని పోలాకి, నరసన్నపేట పోలీసులు స్టేషన్లకు తరలించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావుని శ్రీకాకుళంలో టూ టౌన్స్టేషన్కు తరలించారు. సరుబుజ్జిలి జంక్షన్లో ఫ్లెక్సీతో నిరసనలు తెలిపి తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తేజేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రకాష్, మండల కన్వీనర్ అదపాక రాజేష్, సింగూరు గోపాలరావు, రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు కోనాడ మోహనరావులను అదుపులోకి తీసుకొని స్థానిక పోలీస్స్టేషన్కు తరలించారు. స్థానిక గిరిజన నాయకులను బూర్జ పోలీసుస్టేషన్కు తరలించారు. ప్రధాన రహదారిపై నిరసనలు మహాధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసిన పోలీసులపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు మండలాలకు చెందిన గిరిజనులు భారీగా తరలిరాగా.. పోలీసులు చిగురువలస జంక్షన్ వద్ద వారి ని అడ్డుకున్నారు. దీంతో పాలకొండ రహదారిపై నిరసనలు తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చాలాసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. అదుపులో ఉన్న ఉద్యమకారులను విచిపెట్టే వరకు కదిలేది లేదని గిరిజనులు భీష్మించారు. ఒక దశలో నిరసనలు తెలుపుతున్న గిరిజనులను పోలీస్స్టేషన్లకు తరలించేందుకు పోలీసులు వాహనాలు సిద్ధం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గిరిజనులు ధర్నా విరమించారు. నిర్బంధాలతో ఉద్యమం ఆగదు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తున్న ఉద్యమకారులను నిర్బంధిస్తే థర్మల్ ప్లాంట్ ఉద్యమం ఆగదని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి తెలిపారు. ధర్నాకు వస్తున్న సమయంలో సోమవారం పోలీసులు అదపులోకి తీసుకొని విడి చిపెట్టిన తర్వాత సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని వెన్నెలవలస, అడ్డూరిపేట, తిమడాం గ్రామాల్లో పర్యటించి అధైర్యపడవద్దని గిరిజనులకు భరోసా కల్పించారు. థర్మల్కు వ్యతిరేకంగా నినదించిన గిరిజన లోకం అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు పోరాట కమిటీ నేతలను అదుపులోకి తీసుకున్న వైనం -
నవంబర్ 12న యాదవ మహాసభ
కంచిలి: అఖిల భారత యాదవ మహాసభ సమావేశాన్ని నవంబర్ 12వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సంఘ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ నర్తు రామారావు తెలియజేశారు. ఆరోజున సోంపేట పట్టణంలోని వీబీఆర్ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. ఈ విషయమై కంచిలిలో రాధాకృష్ణ మందిరం ప్రాంగణంలోని సంఘ నేతలతో కలిసి సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ మహాసభకు జిల్లావ్యాప్తంగా ఉన్న యాదవ సోదరులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. యాదవుల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. సమావేశంలో రాపాక చిన్నారావు, నర్తు ప్రేమ్కుమార్, సాలిన లక్ష్మణమూర్తి, ఈశ్వరరావు, జోగారావు, వెంకటరావు, దాలయ్య, రామదాసు, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
బతుకుల్లో అలజడి
● సముద్రంలో ఎగసి పడుతున్న అలలు ● 250 మీటర్లు ముందుకు వచ్చిన సముద్రం ● మంచినీళ్లపేటలో కిలో మీటరు మేర కోతకు గురైన తీరం ● నెల రోజులుగా మత్స్యకారులకు సాగని వేట వజ్రపుకొత్తూరు: సముద్రం కల్లోలంగా మారింది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న అలల ఉద్ధృతి తీరాన్ని కుదిపేస్తోంది. మంచినీళ్లపేట, దేవునల్తాడ, డోకులపాడు, అక్కుపల్లి, గుణుపల్లి తీరాల్లో అలజడి ఎక్కువైంది. సముద్రం దాదాపు 250 మీటర్లు ముందుకు రావడంతో మంచినీళ్లపేటలో తీరం కిలోమీటరు మేర కోతకు గురైంది. మత్స్యకారులు తమ 30 బోట్లను నువ్వలరేవు, పూడిలంక ఉప్పుటేరులో లంగరు వేయగా, మరో 40వరకు తెప్పలను తీరంలోని ఇసుక దిబ్బలపై ఉంచారు. వల లు, ఇతర సామగ్రిని తాత్కాలిక షెడ్డుల్లో భద్ర పరిచారు. కోనేం సీజన్ కొల్లేరే.. వరుస తుఫాన్ల నేపథ్యంలో మత్స్యకారులకు నెల రోజులుగా వేట సాగడం లేదు. ట్యూనా ఫిష్, కోనేం, రొయ్యిలు సీజన్ అయినా తుఫాన్ వల్ల మత్స్యకారులు సముద్రంలోపలకు వెళ్లలేకపోతున్నారు. గత ఏడాది ఈ సీజన్లో భావనపాడు, మంచినీళ్లపేట, గుణుపల్లి, అక్కుపల్లి, డోకులపా డు, నువ్వలరేవు, దేవునల్తాడ, కేఆర్ పేట తదితర తీరాల్లో దాదాపు 150 టన్నుల వరకు కోనేం, మరో 50 టన్నుల వరకు ట్యూనా (సూరలు), మరో 6 టన్నుల వరకు రొయ్యిలు మత్స్యకారుల వలకు చిక్కాయి. కానీ ఈ ఏడాది కోనేం ధర రూ.1000 వరకు ఉన్నప్పటికీ వలకు చిక్కడం లేదని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 15 రోజుల వరకే సీజన్ అనుకూలిస్తుందని, ఆ తర్వాత ఈ చేపలకు వేట చేసే అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి రింగ్ వలలు, అలి వలలు ఇతర ఖరీదైన బోట్లు కొనుగోలు చేశామని, ఆ అప్పులు ఇంకా తీరలేదని చెబుతున్నారు. ఇంటి వద్దే ఉండిపోవాల్సి వస్తోందని, తుఫాన్ సమయంలో వేట సాగ ని పరిస్థితి ఉన్నందున ప్రభుత్వం కనీసం బస్తా బియ్యం కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇచ్ఛాపురం రూరల్: వలలు అల్లుకుంటున్న మత్స్యకారులు బియ్యం అందించాలి నెల రోజులుగా వేట సాగక ఇంటి వద్దే ఉంటున్నాం. పైసా ఆదాయం లేదు. వలలు షెడ్డుల్లోనే ఉన్నాయి. అప్పులు చేసి ఎన్నాళ్లు తినగలం. ప్రభుత్వం కనికరించి కనీసం ఒక బస్తా బియ్యం అయినా ఇస్తే బాగుటుంది. – ఎస్. మోహనరావు, మత్స్యకారుడు, మంచినీళ్లపేట పస్తులుంటున్నాం నెల రోజులుగా వేట సాగక పస్తులు ఉంటున్నాం. మూడు పూటలు తినాల్సిన పరిస్థితి నుంచి ఒక పూట తినే పరిస్థితి ఎదురైంది. సంద్రంలో మర బోట్ల విహారం తగ్గించాలి. దాని వల్ల మత్స్య సంపద దొరకడం లేదు. – సీహెచ్ నీలయ్య, మత్స్యకారుడు, మంచినీళ్లపేట -
దెబ్బకు ఠా.. దొంగల ముఠా
● కాకినాడ ముఠాను పట్టుకున్న పోలీసులు ● ఒక్కొక్కరిపై లెక్కకు మించి కేసులు ● నిందితుల నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండి స్వాధీనం శ్రీకాకుళం క్రైమ్: రాత్రిపూట ఇళ్లకు కన్నాలు వేసి ఆభరణాలు దోచుకుపోయే కాకినాడ దొంగల ముఠాను శ్రీకాకుళం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులైన రేకడి వెంకటేశ్వర్లు, ధర్మాది ప్రసాద్, మాడెం మోహన్కుమార్ల వద్ద నుంచి 186 గ్రాముల బంగారం, 263 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ(క్రైమ్) పి.శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పదేళ్ల నుంచి నేరాలు కాకినాడ జగన్నాయకపురానికి చెందిన వెంకటేశ్వర్లు, ప్రసాద్లు గత పదేళ్లు నుంచి చోరీలు చేస్తున్నారు. ఒకరు రాత్రిపూట తాళాలు వేసిన ఇళ్ల తలుపులను విరగ్గొట్టే రకమైతే, మరొకడు బీరువా తాళాలు అలవోకగా తెరిచేవాడు. వెంకటేశ్వర్లుపై 23 కేసులుండగా, ప్రసాద్పై 36 ఉన్నాయి. ఇద్దరిపై కాకినాడ–4 టౌన్, 1 టౌన్లో సస్పెక్ట్ షీట్లు కూడా ఉన్నాయి. కాకినాడలో చోరీలకు సంబంధించి అక్కడి సెంట్రల్ జైల్కు ఈ ఏడాది ఏప్రిల్లో వెళ్లిన వీరికి, అక్కడ హత్యానేరంతో వచ్చిన కాకినాడ రాసిల్లిపేటకు చెందిన మాడెం మోహన్కుమార్ పరిచయమయ్యాడు. ఆగస్టు వరకు అదే జైలులో వీరి సావాసం బలపడింది. మోహన్కుమార్ చోరీ సొత్తు అమ్మడంలో, జైలుకు వెళ్లిన నేరస్తులను బెయిల్పై తీసుకొచ్చి కొత్త నేరాలు చేయించడంలో దిట్ట. ఈ క్రమంలో గత నెల 28వ తేదీన రాత్రి గార మండలంలోని కె.మత్స్యలేశం – కళింగపట్నం పోర్టులో వరుసగా మూడిళ్లపై చోరీకి ఎగబడ్డారు. అలాగే నందగిరిపేట, రూరల్ మండలం రాగోలులో కూడా చోరీలు చేశారు. ఫింగర్ ప్రింట్ సాయంతో గారలో మూడిళ్లవారు ఒకరు 45 తులాలని, మరొకరు 25 తులాలని, ఇంకొకరు 10 తులాలు పోయాయని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు అతిపెద్ద కేసు అని డీఎస్పీ వివేకానంద పర్యవేక్షక్షణలో సీఐ పైడపునాయుడు, గార, రూరల్ ఎస్ఐలు టీమ్లుగా ఏర్పడ్డారు. ఫింగర్ ప్రింట్ సీఐ భరత్కుమార్ తన క్లూస్టీమ్తో ఆధారాలు సేకరించి వెరిఫై చేయడం, అవి కాకినాడ జిల్లాకు చెందిన ముద్దాయిలుగా ట్రేస్ కావడంతో విచారణ చేపట్టారు. వీరు ఈనెల 26న తండేవలస వైపు వెళ్లే తారురోడ్డుకు కుడివైపున ఉన్న జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్నారన్న సమాచారం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రాము రెవెన్యూ అధికారుల సమక్షంలో తమ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. తప్పుడు ఫిర్యాదులు గారలో ఒకరు ఇచ్చిన ఫిర్యాదులో 45 తులాలు పోయిందని చెప్పారని, కానీ 15 తులాలే పోయాయని, మిగతా ఇద్దరిళ్లల్లో ఏమీ పోలేదని, దూసిలో ఒక ఫిర్యాదుదారు 17 తులాలు పోయిందని అన్నారని, కానీ వారింట్లో పోయింది కేవలం రూ.800 లేనని అదనపు ఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గలో కూడా తొమ్మిది బంగారు వస్తువులు 43 తులాలున్నాయని ఫిర్యాదిచ్చారని, వాస్తవంగా 30 తులాలు పోయిందన్నారు. ఇకపై ఇటువంటి తప్పుడు ఫిర్యాదులు ఇస్తే న్యాయపరంగా సలహాలు తీసుకుని కేసులు కడతామన్నారు. పట్టుకోవడంలో కృషి చేసిన ఫింగర్ ప్రింట్ సీఐ భరత్కుమార్, సీఐ పైడపునాయుడు, ఎస్ఐ రాము, కానిస్టేబుల్ జగదీష్లను అభినందించారు. -
మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు
శ్రీకాకుళం: తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో గల అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలలకు 27, 28, 29 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఈ ఆదేశాలను అన్ని యాజమాన్యాల పాఠశాలలు పాటించాలని, మండల విద్యాశాఖాధికారులు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి జిల్లా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్రమంత్రి అచ్చెన్నాయుడు తుఫాన్ సన్నద్ధతపై ఆరా తీశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు చేశారు. 94924 23420, 97018 61629, 63059 58501 నంబర్లకు కాల్ చేయాలని డీఈఓ రవిబాబు సూచించారు. -
ప్రైవేటీకరణతో నష్టం
సంతబొమ్మాళి: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో ప్రజలకు నష్టం అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, వైఎస్సార్ సీపీ టెక్క లి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలోని తాళ్లవలస, కాళీపురం గ్రామాల్లో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. వైద్యశాలలో ఆరోగ్యశ్రీ సేవలో పూర్తిగా నిలిపివేశారని అన్నారు. విద్య, వైద్యాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు బి.మోహనరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు కోత సతీష్, నక్క భీమారావు, మార్పు నాగభూషణరావు, మార్పు ఆశోక్ చక్రవర్తి, కె. ఇందిర. కె.కృష్ణారావు, తదితరులు ఉన్నారు. -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
శ్రీకాకుళం అర్బన్: కార్తిక మాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్ఎస్ శర్మ పిలుపునిచ్చారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను శ్రీకాకుళం బస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం 1, 2 డిపోల మేనేజర్లు అమరసింహుడు, శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తిక మాసంలో నాలుగు వారాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. ఈ బస్సులు సోమవారం పంచారామాలను దర్శించుకుని మళ్లీ మంగళవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్కు చేరుతాయని పేర్కొన్నారు. ఈ సర్వీసుల్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో గల శివాలయాల దర్శనానికి వెళ్తారని చెప్పారు. అక్టోబరు 2, 9, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతామన్నారు. ‘ఒక్క ఫోన్ కాల్తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి న్ని వివరాలకు 99592 25608, 99592 25609, 99592 25610, 99592 25611 నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు రాజు, సెక్యూరిటీ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు. -
అప్రమత్తంగా ఉన్నాం
● విద్యుత్శాఖ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి అరసవల్లి: తుఫాన్ ప్రభావం జిల్లాలో తీవ్ర ప్రభావం చూపుతుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్శాఖ పరంగా అన్ని చర్యలతో అప్రమత్తంగా ఉన్నామని ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి ప్రకటించారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ జిల్లాలో తుఫాన్ తీవ్రంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో జిల్లా లోని తీర ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా విద్యుత్శాఖ తరఫున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ మేరకు జిల్లాలో 36 సెక్షన్లలో 500 ట్రాన్స్ఫార్మర్లు, 1500 విద్యుత్ స్తంభాలు సిద్ధం చేశామని, అలాగే 347 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం, పలాస, టెక్కలి డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశామని, రెగ్యులర్ ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేసి కచ్చితంగా విధుల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. తాజా సమాచారం మేరకు భారీ వర్షాలు మాత్రమే జిల్లాలో ప్రభావం చూపుతాయన్న సమాచారంతో అందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే కోనసీమ ప్రాంతమైన అమలాపురంలో ఈ తుఫాన్ ప్రభావ విధులకు జిల్లా నుంచి 80 మంది సిబ్బందిని పంపించినట్లు తెలిపారు. -
నిషా వల..
జలుమూరు మండలం కొమనాపల్లి మద్యం షాప్ను ఆనుకొని ఉన్న పర్మిట్ రూమ్ వద్ద పరిస్థితి ఇది. కొమనాపల్లి మద్యం షాప్ జిల్లా మంత్రి సమీప బంధువుది కావడంతో అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడకు సమీపంలోనే అమ్మవారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ ప ర్మిట్ రూమ్ ఒకటి ఉండగా మరో రెండు పర్మిట్ రూమ్లు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. – జలుమూరురణస్థలం కొత్త పెట్రోల్ బంక్ సమీపంలో ఉండే దాబాల్లో మద్యం సేవిస్తున్న దృశ్యమిది. ఇదే మండలంలోని పైడిభీమవరం, వరిసాం, కొత్తపెట్రో ల్ బంకు, తాళ్లవలస గ్రామాల్లోని జాతీయ రహదారి–16కు ఆనుకుని ఉండే దాబాల్లో విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. రణస్థలం ఎకై ్సజ్ సీఐ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే బెల్టుషాపులు నడుస్తున్నాయి. – రణస్థలం -
వైఎస్సార్సీపీ ర్యాలీ నవంబర్ 4కి వాయిదా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): మోంథా తుఫాన్ నేపథ్యంలో తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 28వ తేదీన వైఎస్సార్సీపీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీని నవంబర్ 4వ తేదీకి వాయిదా వేసినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. మోంథా తుఫాన్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అవసరమైన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు, సహాయ, పునరావాస చర్యల్లో ప్రజలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళ అవయవ దానం సోంపేట: మండలంలోని మాకన్నపురం గ్రామానికి చెందిన మహిళ ఉలాల హేమావతి(33) అవయవాలను దానం చేసి కుటుంబ సభ్యులు ఆదర్శంగా నిలిచారు. మండలంలోని మాకన్నపురం గ్రామానికి చెందిన ఉలాల హేమావతి ఈ నెల 22న బుధవారం కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్తూ ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడి గాయపడ్డారు. సోంపేటలోని సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం జెమ్స్కు తరలించారు. రెండు రోజులుగా చికి త్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో కుటుంబ సభ్యుల అంగీకారంతో కళ్లు, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులు, హృదయం, కాలేయం దానం చేశారు. ఆరుగురికి ఇవి ప్రాణదానం చేయనున్నాయి. హేమావతిది నిరుపేద కుటుంబం. భర్త వెంకటరావు బెంగళూరులో వలస కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. హేమావతి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన పలువురు ఉలాల హేమావతికి నివాళులు అర్పించారు. ఇంత విషాదంలోనూ అవయవదానానికి అంగీకరించిన కుటుంబ సభ్యులను అభినందిస్తున్నారు. చదరంగంతో మెదడుకు పదును టెక్కలి: చదరంగంతో మెదడుకు ఎంతో పదును పెట్టవచ్చునని టెక్కలి డీఎస్పీ డి.లక్ష్మణరావు అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం టెక్కలి ఆల్ఫాజెన్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి స్కూల్స్ చాంపియన్స్ ట్రోఫీ పోటీలను డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చదరంగంపై మక్కువ పెంచుకోవాలన్నారు. ప్రస్తుతం చిన్నారులతో సహా విద్యార్థులంతా సెల్ఫోన్లకు బందీలుగా మారుతున్నారని, దీని వల్ల మెదడు పనితీరు దెబ్బ తింటోందని అన్నారు. వయసుతో సంబంధం లేకుండా చదరంగం ఆడవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఆలిండియా చెస్ ఇన్ స్కూల్స్ కమిటీ సభ్యుడు సనపల భీమారావు, జిల్లా ప్రతినిధి ఐ.అభినాష్ తో పాటు ఆల్ఫాజెన్ పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. సందడిగా కార్తిక వన భోజనాలు కవిటి: మండలంలోని వివిధ గ్రామాల్లో ఆదివారం కార్తీక వన భోజనాలు, లక్ష్మీనారాయణుల పూజల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద లక్ష్మీనారాయణులకు ప్రత్యేక పూజలు చేసి సామూహిక వనభోజనాలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక వికాసంతో పాటు ఐక్యతాభావం పెరుగుతాయన్నది ఈ ప్రాంత ప్రజల విశ్వాసం. ఏటా ఈ విధంగా ఒక రోజు అంతమంది కలిసి ఒక చోట చేరి పూజలు చేస్తామని కృష్ణారావు మాస్టారు తెలిపారు. -
‘ఽథర్మల్ ప్లాంట్ ప్రతిపాదన విరమించాలి’
సరుబుజ్జిలి: థర్మల్ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనలు ప్రభుత్వం వెంటనే విరమించుకోకపోతే పోరాటా లు మరింత ఉద్ధృతం చేస్తామని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ వాబ యోగి స్పష్టం చేశారు. సరుబుజ్జిలి, బూర్జ మండలాల పరిధిలోని వెన్నెలవలస, అడ్డూరిపేట, బొమ్మిక, చీదిరివలస, తిమడాం గ్రామాల్లో థర్మల్ ప్లాంట్ వల్ల కలిగే అనర్థాల గురించి ఆదివారం ప్రచారం నిర్వహించారు. అనంతరం సరుబుజ్జిలి జంక్షన్లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ దమన కాండకు వ్యతిరేకంగా సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ధర్నాలు, నిరసనలు తెలిపి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రాలు అందిస్తామని వెల్లడించారు. రైతుల అనుమతులు లేకుండా పంటపొలాల్లో రాత్రివేళ రహస్య డ్రోన్ల తో సర్వేలు చేసి వారి మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. సమావేశంలో పోరాట కమిటీ కార్యదర్శి సింహాచలం, రైతుకూలీసంఘం జిల్లా కా ర్యదర్శి వంకలమాధవరావు, మిన్నారావు, బాబూ రావు, రమేష్,సవరఽ ధర్మారావు పాల్గొన్నారు. -
ప్రాణనష్టం లేకుండా చూడాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: తుఫాన్ వల్ల ప్రాణ నష్టం లేకుండా, జిల్లా ప్రజలంతా సురక్షితంగా ఉండే విధంగా పనిచేయాలని, అత్యవసర పరిస్థితుల్లో ‘గోల్డెన్ అవర్’ను ఏ అధికారి వృథా చేయకుండా, మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి కేవీఎన్ చక్రధర బాబు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోంథా’ తీవ్ర తుఫాన్ ఈ నెల 28వ తేదీన తీరం దాటనున్న నేపథ్యంలో ఆయన ఆదివారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డిలతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కోస్టల్ జిల్లాలు హై అలర్ట్లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, తిత్లీ తుఫాను అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సన్నద్ధమవ్వాలని చక్రధర బాబు స్పష్టం చేశారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి తక్షణమే తరలింపు తుఫాన్ను ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం పనికిరాదని, ప్రమాదకర ప్రాంతాలు గుర్తించి, సురక్షితం కాని ఇళ్లలోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రత్యేక అధికారి సూచించారు. గర్భిణులు, తీవ్రమైన వ్యాధులతో ఇబ్బంది పడు తున్న వారికి పోషకాహార మద్దతు ఇచ్చి, వారి భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్ సిబ్బంది కూలిన చెట్ల ను తొలగించడానికి ట్రీ కట్టర్లు డీజిల్ నిల్వలు సిద్ధం చేసుకుని, తక్షణ స్పందనకు సిద్ధంగా ఉండాలని ఆయన ఆదేశించారు. పారిశుద్ధ్యంపై దృష్టి సహాయక చర్యల కోసం రేషన్ దుకాణాలకు పీడీఎస్ బియ్యాన్ని వీలైనంత త్వరగా పంపాలని చక్ర ధర బాబు ఆదేశించారు. ప్రత్యేక శిబిరాల్లో వంట, పాలు ఇతర అవసరాలు సిద్ధం చేయాలని సూచించారు. రైతులు పొలాల్లో నీరు నిలవకుండా చూసుకుని, పంట నష్టం తగ్గించాలని అన్నారు. వర్షాల తర్వాత పారిశుద్ధ్యం సవాలుగా మారుతుందని, వ్యాధులు ప్రబలకుండా చూడటానికి సిబ్బందిని సంసిద్ధం చేయాలని ఆయన కోరారు. 24/7 కంట్రోల్ రూమ్ పని చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎస్పీలు ఆయనకు వివరణ ఇచ్చారు. రాబో యే మూడు రోజులు ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా, సెల్ ఫోన్ ఆపరేటర్లు విద్యుత్ సరఫరా వ్యవస్థ సహా అన్ని కీలక వ్యవస్థలు అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారుల సూచనలను తప్పక పాటించాలని చక్రధరబాబు కోరారు. -
ప్రభుత్వరంగంలోనే వైద్య కళాశాలలు కొనసాగాలి
● జనవిజ్ఞాన వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ శ్రీకాకుళం: ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, ప్రజారోగ్య వ్యవస్థను కొనసాగించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలు అనే అంశంపై ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు గొంటి గిరిధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రజాసంఘాల నాయకులు, మేధావులు మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్–21లో జీవించే హక్కు కల్పించారని, అందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడు ప్రభుత్వం ద్వారా వైద్యం పొందవచ్చన్నారు. ప్రభుత్వం నిర్మించి నిర్వహించాల్సిన 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను జీవో 590తో పీపీపీ విధానంలోకి మార్చడం ప్రజల హక్కులను కాలరాయడమేనని చెప్పారు. వైద్య కళాశాలల్లో వైద్య విద్యను పొందడమే కాకుండా ప్రతి కళాశాలకు అనుబంధంగా 420 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఉచిత వైద్యం పొందవచ్చని తెలిపారు. వైద్య కళాశాలల ఆస్పత్రుల ప్రైవేటీకరణ వల్ల ఈ అవకాశాన్ని పేద ప్రజలు కోల్పోతారన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను పేద ప్రజల వైద్యానికి హామీ ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనే సాధ్యమవుతుందన్నారు. గతంలో మంజూరైన 17 వైద్య కళాశాలల్లో 10 కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ఆరోగ్యాన్ని అంగడి సరుకుగా మార్చే ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలన్నారు. రాష్ట్ర జీడీపీలో ఐదు శాతం వైద్య రంగానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల రక్షణకు జేవీవీ చేస్తున్న కృషిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. త్వరలో ప్రముఖులతో సంతకాల సేకరణ నిర్వహించాలని, కరపత్రాలతో ప్రజానీకాన్ని చైతన్యపరచాలని, వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ ఆగేంత వరకు ఉద్యమించాలని సమావేశం తీర్మానించింది. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు మేధావులు, జిల్లా ప్రముఖులు నల్లి ధర్మారావు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, డాక్టర్ కె.శ్రీనివాస్ (ప్రజారోగ్య వేదిక ), కుప్పిలి కామేశ్వరరావు (జేవీవీ), పేకల తేజేశ్వరరావు(సీఐటీయూ), బమ్మిడి శ్రీరామ్మూర్తి(యూటీఎఫ్), కె.శ్రీనివాస్(సాహితీ స్రవంతి), బలివాడ ధనుంజయరావు(ఎల్ఎఫ్ఎల్హెచ్ఎంఎస్), బోనెల రమేష్(ఏపీ ఎస్సీఎస్టీయూఎస్), బొడ్డేపల్లి మోహనరావు(ఐలు), మిస్కా కృష్ణయ్య(కేఎన్పీఎస్), సీహెచ్ శ్రీనివాస్, రామ్మోహన్(ఏపీటీఎఫ్ 257), బి.వెంకటేశ్వర్లు(ఏపీటీఎఫ్ 1938), కింజరాపు నూకరాజు(ఎస్సీఎస్టీటీఎఫ్), రమేష్బాబు(బీటీఏ), పి.మోహనరావు(జన సాహితీ), ఎం.రామ్మోహనరావు(ప్రైవేటు విద్యాసంస్థలు), ఆర్.చిన్నారావు(రిమ్స్), భాస్కరరావు(సీపీఎస్యూఎస్), డాక్టర్ కె.ఉదయ్కిరణ్(బి.ఆర్.ఎ.యు), గణపతి (పోస్టల్), గణేష్ (దళిత ఐక్యవేదిక), బి.ధనలక్ష్మి(యూటీఎఫ్), తంగి ఎర్రమ్మ(రచయిత), కె.గణపతి, ఎం.గోవర్ధనరావు(పట్టణ పౌర సంక్షేమ సంఘం), రౌతు శంకరరావు(వైఎస్సార్ సీపీ), పి.సుధాకర్బాబు, బి.జగన్నాథరావు(జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు), కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహనరావు, ఎం.పద్మనాభరావు, పాలవలస ధర్మారావు, పాలకొండ కూర్మారావు, బొడ్డేపల్లి జనార్ధన రావు, పేడాడ వేదవతి, హెచ్ మన్మధరావు, బి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి భగవద్గీత పోటీలకు విద్యార్థుల ఎంపిక
నరసన్నపేట: భగవద్గీతలోని 15వ అధ్యాయంలో శ్లోకాల పఠనంపై జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఆరుగురిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తున్నట్లు చిన్మయిమిషన్–చిన్మయి సుగుణం స్థానిక ఆశ్రమం స్వామీజీ పరమాత్మానంద ఆదివారం తెలిపారు. నరసన్నపేట శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో పోటీలు నిర్వహించగా 44 పాఠశాలల నుంచి 4500 మంది పాల్గొనగా జిల్లా స్థాయికి 120 మంది ఎంపికయ్యారని చెప్పారు. వీరికి ఆదివారం నరసన్నపేటలో పోటీలు నిర్వహించి వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన 16 మందిని ఎంపిక చేశామన్నారు. వీరిలో ఆరుగురు దేవశ్యగౌతమి, పి.సుసాధ్య, ఏ.నైషిత, ఏ.జాహ్నవి, వి.గీత, ఎం.శివాణి నవంబర్ 9న కడపలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. -
కలియుగ కై లాసం.. ఎండల మల్లన్న క్షేత్రం
టెక్కలి : కలియుగ కై లాసంగా పేరుగాంచిన టెక్కలి మండలం రావివలసలోని ఎండల మల్లికార్జునస్వామి దేవాలయం కార్తీకమాస తొలి సోమవారం పూజలకు సన్నద్ధమైంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 27న తొలి సోమవారం, నవంబర్ 3న రెండవ సోమవారం, 11న మూడవ సోమవారం, 17న నాల్గవ సోమవారాల ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శీర్షాభిషేకం టికెట్ ధర రూ.40, ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.20, కేశఖండన రూ.40, రుద్రాభిషేకం రూ.58 రూపాయల చొప్పున ధరలు నిర్ణయించారు. ఇదీ స్థల చరిత్ర.. ఎండల మల్లికార్జున స్వామి ఆలయం చరిత్రను ఎంతో మంది వేదపండితులు ఎన్నో రకాలుగా అభివర్ణించారు. వారి మాటల్లో చెప్పాలంటే... ‘త్రేతా యుగంలో రావణ సంహారం అనంతరం రాముడు తన పరివారంతో అయోధ్యకు వెళ్తూ మార్గ మధ్యలో సుమంచ పర్వతంగా పిలువబడే ప్రస్తుతం రావివలస ప్రాంతంలో తపస్సు చేయాలని వానర వైద్యుడు సుశేణుడికి ఆజ్ఞ చేశారు. కొన్ని సంవత్సరాలు తరువాత సుశేణుడి యోగ క్షేమాలు తెలుసుకునేందుకు ఆంజనేయుడు ఈ ప్రాంతాన్ని సందర్శించగా, సుశేణుడు ధ్యాన సమాధి కావడం గమనిస్తాడు. దీంతో సుశేనుడు పార్థివ దేహాన్ని పూడ్చి వేసి, ఆ సమాధిపై జింక చర్మాన్ని ఆనవాలుగా వేసి విషయాన్ని రామునికి తెలియజేస్తాడు. రాముడు తన పరివారంతో సుశేణుడి సమాధి వద్దకు చేరుకోగా, ఆ సమాధిపై స్వయంభూలింగం వెలియడంతో పాటు దానిపై మల్లెపూల దండ ఉండటం గమనిస్తారు. జింక చర్మం, మల్లెపూల దండతో ఉన్న ఆ లింగానికి ‘మల్లికాజినుడు’ అని నామకరణం చేసి, సమీపంలో ఉన్న కోనేరులో సీతమ్మ స్నానం చేసి కొండపై విశ్రమించి ఆ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అప్పటి నుంచి మల్లికాజినుడు నామకరణం కొనసాగగా, తర్వాత ద్వాపరయుగంలో అర్జునుడు ఈ ప్రాంతంలో శివుని కటాక్షం కోసం తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడుగగా.. నీ నామం తర్వాత నా పేరు ఉండాలని అని కోరగా, దీంతో శివుడు ఆ వరాన్ని ప్రసాదించగా, ఆ కాలంలో ‘మల్లికార్జునుడు’ అనే నామం కొనసాగింది. కాలానుగుణంగా ఈ లింగం ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తుండడంతో, ఈ యుగం నాటికి ‘ఎండల మల్లికార్జునుడు’గా నామం స్థిరపడింది. అప్పటి నుంచి రావివలస ఎండల మల్లికార్జునుడు వెలసిన ప్రాంతం కలియుగ కై లాసంగా కొనసాగుతోంది. ఎండల మల్లికార్జునుడుఆలయానికి చేరుకోండిలా.. ఎండల మల్లికార్జునుడు ఆలయానికి చేరుకునేందుకు రోడ్డు, రైల్వే మార్గాలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నుంచి టెక్కలి చేరుకుని అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావివలసలోని ఆలయానికి చేరుకునేందుకు అనేక బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. రైల్వే మార్గం విషయానికి వస్తే టెక్కలితో పాటు సమీపంలో సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నౌపడ రైల్వే స్టేషన్, 20 కిలోమీటర్ల దూరంలో పలాస రైల్వే స్టేషన్కు చేరుకుని అక్కడి నుంచి బస్సులు, చిన్నపాటి వాహనాల్లో ఆలయానికి చేరుకోవచ్చు. -
బ్రహ్మ మురారి సురార్చిత లింగం..!
● ‘బ్రహ్మసూత్ర శివలింగాలు’ కొలువైన క్షేత్రంగా శ్రీముఖలింగం ● అరుదైన దేవాలయంగా గుర్తింపు జలుమూరు: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ శైవక్షేత్రం శ్రీముఖలింగం మరో ప్రత్యేకతనూ కలిగి ఉంది. ఎంతో అరుదైన ‘బ్రహ్మసూత్రాల శివలింగాలు’ కలిగిన క్షేత్రంగా ప్రాశస్త్యం పొందింది. భీమేశ్వరుడు, సోమేశ్వరుడు, వరుణేశ్వరుడు, ఈశాన్య ఈశ్వరుడు, ఎండల మల్లికార్జునులను బ్రహ్మసూత్రాల శివలింగాలుగా పిలుస్తారు. ఇవి కొలువైన క్షేత్రాలు దేశంలో వేలిపై లెక్కపెట్టవచ్చు. అంతటి ప్రాముఖ్యత కలిగిన శివాలయం మన జిల్లాలో ఉండటం సిక్కోలు ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు. బ్రహ్మసూత్రాల శివలింగాలను దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వురుడిని దర్శనం చేసుకోవడంగా, పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు. ముఖ్యంగా కార్తీక మాసంలో శ్రీముఖలింగం క్షేత్రానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ జరిగే కార్తీక మాస ఉత్సవాలలో పాల్గొనేందుకు భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తుంటారు. కృతయగంలో గోవిందేశ్వరుడు అనే నామంతో కనాకాకృతిలో, త్రేతాయగంలో మధుకేశ్వరుడనే నామంతో రజతాకృతిలో, ద్వాపరయుగంలో జయంతేశ్వరుడనే నామంతో కాంస్యాకృతిలో, కలియగంలో ముఖలింగేశ్వరుడనే పేరుతో ముఖం దాల్చి శిలాకృతిలో శివుడు శ్రీముఖలింగం క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. -
మాదినకు రైతునేస్తం పురస్కారం ప్రదానం
కంచిలి : పశు సంవర్థక శాఖలో 31 సంవత్సరాలుగా అందించిన సేవలకు గుర్తింపుగా పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన విశాఖపట్నం పశుసంవర్థకశాక ఉపసంచాలకుడు డాక్టర్ మాదిన ప్రసాదరావు రైతునేస్తం పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్లోని స్వర్ణభారతి ట్రస్ట్లో రైతునేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో వినూత్న సేవలు అందించే శాస్త్రవేత్తలు, విస్తరణ అధికారులు, ఆదర్శ రైతులకు ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రసాదరావు పురస్కారం అందుకున్నారు. -
ఏపీసీపీఎస్ఈఏ నూతన కార్యవర్గం ఎన్నిక
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఆదివారం శ్రీకాకుళంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరిమి రాజేశ్వరరావు, ఎన్నికల అధికారి బి.బాలకృష్ణ, ఎన్నికల పరిశీలకులు చల్లా దుర్గాప్రసాద్, గురుగుబెల్లి భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా గురుగుబెల్లి భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడిగా చల్ల సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా అంపోలు షణ్ముఖరావు, సహాధ్యక్షుడిగా బొడ్డు శేఖర్, ఆర్థిక కార్యదర్శిగా యాళ్ల శ్యాంసుందర్, అదనపు ప్రధాన కార్యదర్శిగా శ్రీధర్, మహిళా అధ్యక్షురాలుగా పి.జయమ్మ, రాష్ట్ర కౌన్సిలర్లగా కరిమి రాజేశ్వరరావు, వడమ శరత్బాబు, సూర్య, బుసకల ఈశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులుగా బోణిగి శ్యాం కుమార్, పైడి నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శులుగా బొడ్డేపల్లి శ్రీనివాస్, సుంకర్ విజయ్, పి.సిమ్మన్న, బి.ప్రదీప్చంద్ర వర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
బాలియాత్ర విజయవంతం చేయండి
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో కార్తీక పౌర్ణమి అనంతరం నవంబరు 9న జరగనున్న బాలియాత్రను విజయవంతం చేయాలని నిర్వాహక కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు ఆదివారం శ్రీముఖలింగంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధి డాక్టర్ దువ్వాడ జీవితేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు యాత్రలో పాల్గొనాలని కోరారు. కుల మతాలకు అతీతంగా జరిగే ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలన్నారు. కటక్ నుంచి రాజమండ్రి వరకూ మహానది, గోదావరి నదుల మధ్య విరాజిల్లిన కళింగ రాజ్యం పూర్వ వైభవం భావితరాలకు తెలియజేసేందుకు అందరూ కలిసిరావాలని కోరారు. యాత్ర నిర్వహణకు ఎటువంటి విరాళాలు స్వ్కీరించబడవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ టి.సతీష్కుమార్, ఎంపీటీసీ కె.హరిప్రసాద్, గ్రామపెద్దలు బి.వి.రమణ, అర్చకులు పాల్గొన్నారు. -
క్వాంటమ్తో సమూల మార్పులు
ఎచ్చెర్ల : రాజీవ్ గాంధీ వైజ్ఞానికి సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణంలో జరుగుతున్న క్విస్కిట్ ఫాల్ –2025 ఉత్సవంలో ఆరో రోజు ఆదివారం విద్యార్థుల్లో నూతనోత్సాహాన్నినింపింది. ఈ సందర్భంగా ఐబీఎం శాస్త్రవేత్త డాక్టర్ రతజిత్ మజుందార్ మాట్లాడుతూ క్వాంటం ద్వారా ప్రపంచంలో అనేక మార్పులను తీసుకురాగలమని చెప్పారు. అనంతరం క్వాంటమ్ ఆల్గారిథమ్స్పై పేరణాత్మక సెషన్ నిర్వహించారు. క్వాంటమ్ సూత్రాలు, ప్రయోగాత్మక అన్వయాలు, భవిష్యత్తు సాంకేతికతలలో పాత్రను వివరిస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆసక్తిని పెంచారు. డాక్టర్ జాన్ యల్లా మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో క్వాంటమ్ సమస్యల పరిష్కారాలను ప్రదర్శించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ డైరెక్టర్ కొక్కిరాల వెంకట బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృస్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ అధికారి వాసు, గేదెల రవి, రమేష్, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అబుదాబిలో వలస కూలీ మృతి కంచిలి: పురుషోత్తపురం పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన వలస కూలీ నక్క నరసింహారావు(49) అబుదాబిలో శుక్రవారం మృతిచెందాడు. నెల రోజుల క్రితం అబుదాబిలో ఎన్.ఎస్.హెచ్. కంపెనీలో వెల్డర్గా పనిచేసేందుకు వెళ్లాడని, అక్కడ కడుపునొప్పితో మృతిచెందినట్లు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. నరసింహారావుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్లను కోరారు. బావిలో పడి యువకుడు మృతి టెక్కలి రూరల్: కోటబొమ్మాళి పంచాయతీ ఉప్పరపేటకు చెందిన దండుపాటి గౌరినాయుడు(32) ఆదివారం బావిలో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరినాయుడుకు మద్యం అలవాటు ఉంది. మద్యం అతిగా సేవించి స్నానానికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియడం లేదు. గమనించిన స్థానికులు వెంటనే బావి నుంచి వ్యక్తిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం 108 అంబులెన్సుకు సమాచారం ఇవ్వగా సిబ్బంది చేరుకుని వ్యక్తి మృతిచెందినట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామ నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గౌరినాయుడుకు భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు చిన్న, కల్పన ఉన్నారు. తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని కోటబొమ్మాళి ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
1 నుంచి చెకుముకి సంబరాలు
శ్రీకాకుళం: జిల్లాలో నవంబర్ 1న మండల స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గొంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో జనవిజ్ఞాన వేదిక కార్యదర్శి వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 మండలాల్లో ఎంఈఓలు, హెచ్ఎంలు, చెకుముకి మండల కన్వీనర్లు, ఉపాధ్యాయులు, సైన్స్ ఉద్యమాభిమానులు, విద్యార్థులు హాజరై సంబరాలు విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా నవంబర్ 11 నుంచి 20 వరకు శ్రీకాకుళంలో జరిగే సిక్కోలు పుస్తక మహోత్సవం విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా వ్యవస్థాపక కార్యదర్శి కొత్తకోట అప్పారావు, జిల్లా గౌరవాధ్యక్షులు బొడ్డేపల్లి మోహనరావు, బొడ్డేపల్లి జనార్దనరావు, జిల్లా ఉపాధ్యక్షులు పాలకొండ కూర్మారావు, సైన్స్ అండ్ కమ్యూనికేషన్ జిల్లా కన్వీనర్ హనుమంతు మన్మధరావు, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ జిల్లా కన్వీనర్ పాలవలస ధర్మారావు, సమత జిల్లా కన్వీనర్ పేడాడ వేదవతి, ఆడిట్ జిల్లా కన్వీనర్ బి.ఉమామహేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి పాల్గొన్నారు. -
దళిత కుటుంబాలపై అక్రమ కేసులు అన్యాయం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని, దళిత కుటుంబాలపై అక్కసుతో అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎనిమిది మంది నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్రంలోని దళితులంతా వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయడాన్ని జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోనూ, జిల్లాలలోనూ దళితులపై అక్రమ కేసులు బనాయించి గ్రామాల్లో వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఫీజు రీయింబర్స్మెంటు పథకం తీసుకొచ్చారని, ఎంతోమంది దళిత బిడ్డలకు ఉన్నత స్థానాలు రావడానికి కారణమైందని గుర్తు చేశారు. తర్వాత తండ్రి ఆశయాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనతో కొనసాగించారని చెప్పారు. కూటమి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందని, దీనివల్ల దళితులు వైద్య విద్యకు దూరమవుతారన్నారు. నియోజకవర్గాల్లోని ఉన్న దళిత విభాగాన్ని చైతన్యంచేస్తూ అంబేడ్కర్ విగ్రహాల నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందన్నారు. కల్తీ మద్యం వల్ల ఎక్కువగా ఆర్థికంగా వెనకబడిన దళిత కుటుంబాలే బలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సతివాడ రామినాయుడు. నియోజకవర్గాల అధ్యక్షులు యజ్జల గురుమూర్తి, కల్లేపల్లి లక్ష్మణరావు, గుజ్జల యోగేశ్వరరావు, నేతల కృష్ణ, జె.జయరాం, వావిలపల్లి శ్రీనివాసరావు, లండ కిరణ్, రేగిడి లక్ష్మణరావు, మజ్జి రమణ పాల్గొన్నారు. -
ప్రసాద్ కథ కంచికే..!
అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి నగర నలువైపులా విలువైన భూములున్నాయి. సెంటు భూమి రూ.50 లక్షల ధరకు అమ్ముడుపోయే మార్కెట్ ఉంది. ఆలయ పరిసరాలను విస్తరించే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో కూడా పలుచోట్ల ప్రైవేటు స్థలాలను గుర్తించి కొనుగోలు చేసేందుకు అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ప్రైవేటు జిరాయితీ స్థలాలను కొనుగోలు చేయకుండా ప్రత్యామ్నయంగా ఆలయానికి చెందిన విలువైన భూములు ఇచ్చేసేందుకు తాజాగా మంత్రి అచ్చెన్న ఆదేశాలిచ్చేశారు. ఇందులో భాగంగా ఆలయం ముందున్న కొందరి ఇళ్లను ఖాళీ చేయించి వారికి ప్రధాన రోడ్డుపై ఉన్న కమర్షియల్ స్థలాలను అదే విస్తీర్ణం అప్పగించేలా మంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం దేవదాయ శాఖాధికారులకు విస్మయానికి గురిచేసింది. 2013 భూసేకరణ చట్టం ద్వారా అవసరమైన స్థలాలను తీసుకుని పరిహారాలను ఇచ్చే మార్గాన్ని ఆలోచిస్తున్న అధికారులకు...తాజాగా మంత్రి ఆదేశాలు మేరకు ఖరీదైన స్థలాలను ఇచ్చేయమనడం చూస్తుంటే..తెరవెనుక ఏం జరుగుతుందో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవసరమైన స్థలాలను ఆలయ అభివృద్ధికి తీసుకోవాలంటే అందుకు తగిన మార్కెట్ ధర ప్రకారం నగదు రూపంలో పరిహారాన్ని చెల్లించే అవకాశముంది. అది కాదని విలువైన స్థలాలన్నీ ఇలా పంచేస్తే..భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆలయానికి మిగిలే భూమి దాదాపుగా తగ్గిపోయే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి ఆదిత్యాలయాన్ని రూ..100 కోట్లతో కనీవినీ ఎరుగని అభివృద్ధి అన్నారు. అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ గత రథసప్తమికి ముందు కేంద్ర రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడులు ప్రగల్భాలు పలికారు. ఎమ్మెల్యే గొండు శంకర్ను మధ్యలో పెట్టి స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్ల చేతనే ఆలయానికి చెందిన భారీ భవనాలు, దుకాణ సముదాయాలు, వసతి గదులను.. ఇలా ఆదిత్యాలయానికి ఎదురుగా ఉన్న ఏ ఒక్క భవనాన్ని వదలకుండా కూల్చివేయించారు. దీంతో సర్వం కోల్పోయి పదుల సంఖ్యలో వ్యాపారులు రోడ్డునపడ్డారు. కూల్చివేతలకు ఏడాది కావస్తోంది. అయినా.. ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. ఆలయం ముందు మాత్రం విశాలంగా ప్లాట్ఫాం వేసేసి ఇంద్రపుష్కరిణి కనిపించేలా ఖాళీగా ఉంచారు. ఈఏడాది జనవరిలో మంత్రి అచ్చెన్న ప్రకటనలకు, తాజాగా గురువారం అరసవల్లిలో చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే..మరి కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం కథ కంచికే..అన్నట్లుగా స్పష్టమవుతోంది. ఆ పథకం ఎలాగూ రాదు.. ఆ నెపంతో చేపట్టిన కూల్చివేతల ఘట్టాన్ని మరిపించడానికి అభివృద్ధి పేరిట ఆలయానికి చెందిన (భక్తులచే సమకూరిన ఆదాయం) నిధులు రూ.12 కోట్లను వినియోగించి ఆలయ పరిసరాల్లో కొత్త భవనాలను నిర్మించేలా ప్రతిపాదించారు. దీన్ని వెంటనే ఆమోదించాలంటూ దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్కు మంత్రి గురువారం ఫోన్లో ఆదేశించారు. దీంతో ప్రసాద్ స్కీం అటకెక్కినట్లే అన్న స్పష్టత చర్చ జిల్లాలో జోరందుకుంది. మండిపడుతున్న దాతలు.. అరసవల్లి ఆలయానికి పెద్ద ఆస్తి దాతలే...అలాంటి ఎందరో దాతలు తమ పూర్వీకుల జ్ఞాపకార్ధం..తమ సంస్థల పేరిట రూ.లక్షలతో భక్తుల సౌకర్యార్ధం జింకు రేకు షెడ్లుతో పాటు వసతి గదులను నిర్మించిన సంగతి తెలిసిందే. దశాబ్దాల పూర్వం టీటీడీకి చెందిన వసతి గదుల సముదాయంతో పాటు ఆలయ నిధులతో నిర్మించిన 12 దుకాణాల సముదాయం, ప్రసాదాల కౌంటర్లు, వంటగదులు కూడా కూల్చివేశారు. ఓ దాత ఏకంగా రూ.30 లక్షలతో నిర్మించిన అన్నదాన మండపాన్ని సైతం నేలమట్టం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కూల్చివేతలు చేయడంపై దాతలు తీవ్రంగా మండిపడ్డారు. సుమారు రూ.7 కోట్ల విలువైన నిర్మాణాలను కూల్చివేసిన కూటమి పెద్దలు..ఇప్పుడు మళ్లీ ఆలయ నిధులు రూ.12 కోట్లతో అభివృద్ధి అంటూ ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని స్థానికులు, భక్తులు అంటున్నారు. భక్తులకు ఎండ, వానల నుంచి రక్షణగా భక్తుల విరాళాలతో ఆలయం ముందు భాగంలో నిర్మించిన జింకు షెడ్లును పూర్తిగా కూల్చివేసి.. ఆ స్థానంలో చలవపందిళ్లు వేయాలని మంత్రి చేస్తున్న ప్రకటనపై భక్తులు మండిపడుతున్నారు. ‘‘రాష్ట్రంలో ప్రసిద్ధ సూర్యదేవాలయంగా వెలుగొందుతున్న అరసవల్లి క్షేత్రం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి పిలిగ్రమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగుమెంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం మంజూరు చేయిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆలయ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. అందుకే కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అంతా దగ్గరుండి కేంద్రం నుంచి ఈ పథకం ద్వారా సుమారు రూ.100 కోట్లు తెప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. మరికొద్ది రోజుల్లోనే ఈ పరిసరాలన్నీ అత్యంత సుందరంగా తయారుచేయనున్నాం...’’ – ఈ ఏడాది జనవరిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు‘‘అరసవల్లికి ‘ప్రసాద్’ స్కీం చాలా ఆలస్యమయ్యేలా ఉంది. దేశంలో చాలా మంది ‘ప్రసాద్’ స్కీం అడుగుతున్నారు. ఈ పథకం కోసం తర్వాత చూద్దాం. మన కేంద్రమంత్రి రామ్మోహన్ ఆ పనులు చూసుకుంటున్నారు.. వచ్చే ఏడాది జనవరి 25న రథసప్తమిని ఏడు రోజుల పాటు శ్రీకాకుళం ఉత్సవ్ పేరిట ఘనంగా నిర్వహిద్దాం. ఆలయానికి చెందిన నిధులు రూ.12 కోట్లతో ఇంద్రపుష్కరిణి, అన్నదాన, ప్రసాదాల తయారీ మండపాలు, కేశఖండన శాల, గోశాల తదితర అభివృద్ధి పనులు చేసుకుందాం. ఈమేరకు ప్రతిపాదనలను వెంటనే ఆమోదించేలా చర్యలు చేపడతాం.. – ఈనెల 23న అరసవల్లిలో మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు ఆదిత్యాలయానికి ప్రసాద్ స్కీం వర్తింపు అనుమానమే.. మంత్రి అచ్చెన్న వ్యాఖ్యలతో భక్తుల నిరాశ గత రథసప్తమి సందర్భంగా ఇదే స్కీం పేరిట భవనాల కూల్చివేత ఆలయానికి చెందిన నిర్మాణాలను కూల్చివేస్తున్న దృశ్యాలు (ఫైల్) -
నాలుగు పూరిళ్లు దగ్ధం
మందస: బుడారుసింగ్ పంచాయతీ పద్మపురంకాలనీ గిరిజన గ్రామంలో శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రత వల్ల చెలరేగిన కార్చిచ్చు వల్ల నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో గిరిజనులకు పనులకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. కొందరు స్థానికులు గుర్తించి మందస అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వగా.. అక్కడ సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో పలాస అగ్నిమాపక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే సవర లాలు, సవర ఉదయ్, సవర ఢిల్లీ, సవర నోబిల్కు చెందిన ఇళ్లు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.15 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. -
పంచారామాలకు ప్రత్యేక బస్సులు
● అక్టోబర్ 26 నుంచి వచ్చే నెల 16 వరకు క్షేత్రాల దర్శనం ● భక్తులు సద్వినియోగం చేసుకోవాలి: డీపీటీవో పంచారామాలను దర్శించుకునే భక్తులు ఒక్కొక్కరికి టికెట్ ఖరీదు సూపర్లగ్జరీ బస్సుకు రూ.2400, అల్ట్రాడీలక్స్ బస్సుకు రూ.2,350 ప్రయాణచార్జీగా నిర్ణయించారు. ముందస్తు టికెట్ కోసం ఆన్లైన్/అడ్వాన్స్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. గ్రూప్గా అయ్యప్పభక్తులు వస్తే శబరిమలకు కూడా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ టికెట్ల కోసం www.apsrtconline.in సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు 9959225608 నంబర్లను సంప్రదించవచ్చు. శ్రీకాకుళం అర్బన్: హిందువులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెల రోజులు వ్రతాలు, నోములు ఆచరించడం, దేవాలయాల సందర్శన ఎక్కువగా చేస్తుంటారు. ఎక్కువగా జిల్లాలోని శైవక్షేత్రాలతో పాటు పంచారామాలకు భక్తులు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ఒకటి, రెండో డిపోల నుంచి పంచారామాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. సోమవారం ఒకే రోజు రాష్ట్రంలోని ఐదు శైవ క్షేత్రాలు అనగా అమరావతిలో అమరేశ్వరస్వామి, భీమవరంలోని సోమేశ్వరస్వామి, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరస్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వరస్వామి, సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయాలకు తీసుకెళ్తారు. కార్తీకమాసంలో ప్రతి ఆదివారం అనగా ఈ నెల 26, నవంబర్ 2, 9, 16వ తేదీలలో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఆదివారం సాయంత్రం 4గంటలకు బస్సు బయలుదేరుతుంది. సోమవారం ఒకేరోజున ఐదు పుణ్యక్షేత్రాలైన పంచారామాలను దర్శింపజేసి మరలా మంగళవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం కాంప్లెక్స్కు చేరుకుంటుంది. కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం పంచారామాల దర్శనం కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 26, అక్టోబరు 2, 9, 16వ తేదీలలో ప్రత్యేక బస్సులు నడపనున్నాం. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – సీహెచ్, అప్పలనారాయణ, డీపీటీఓ -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
శ్రీకాకుళం క్రైమ్ : మోంథా తుఫాన్ నేపథ్యంలో పోలీసు అధికారులు అందుబాటులో ఉంటూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని విశాఖ రేంజి డీఐజీ గోపీనాథ్ ఆదేశించారు. రేంజి పరిధిలోని ఎస్పీలతో శనివారం రాత్రి వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. తీర ప్రాంత గ్రామాలను సందర్శించి మత్స్యకారులకు, గ్రామస్థులకు హెచ్చరికలు ఇవ్వాలన్నారు. 24/7 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి తగినంత సిబ్బందిని నియమించాలని, ముంపు, లోతట్టు ప్రాంతాల రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. దొంగతనాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, సమావేశాలు నిర్వహించరాదని, సోషల్మీడియా దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, డిజిటల్ అరెస్టు, ఆర్థిక నేరాలను అరికట్టాలని, సైబర్ నేరాల్లో ఫ్రీజ్ అయిన బాధితుని సొమ్ము తిరిగి అందేలా చూడాలన్నారు. -
డైట్లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: వమరవల్లి డైట్ శిక్షణ సంస్థలో ఖాళీగా ఉన్న మూడు సీనియర్ లెక్చరర్, 8 లెక్చరర్ పోస్టులు డిప్యుటేషన్పై భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధి కారి ఎ.రవిబాబు తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ, జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఇప్పటివరకు దరఖాస్తులను గూగుల్ ఫారంలో స్వీకరించారని, ఇకమీదట లీప్ యాప్ ద్వారా స్వీకరిస్తారని అన్నారు. గతంలో గూగుల్ యాప్లో దరఖాస్తు చేసుకున్న వారు సైతం మళ్లీ లీప్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫారాన్ని డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తును పూర్తి చేసి అన్ని సర్టిఫికెట్ల నకళ్లను జతచేసి డీడీఓ ద్వారా జిల్లా డైట్ కార్యాలయంలో అందించాలన్నారు. ఈనెల 31వ తేదీ నాటికి 58 ఏళ్లు నిండని వారు, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం, ఎంఈడీలో 55 శాతం మార్కులు పొందిన వారు అర్హులని పేర్కొన్నా రు. రెండు సబ్జెక్టులలో అర్హత కలిగి ఉంటే రెండింటికి ఒక దరఖాస్తులో మాత్రమే పొందుపరచాలని సూచించారు. గతంలో ఎఫ్ఎస్టీసీ, డైట్లలో పనిచేసిన వారు అనర్హులని, ఎంపికై న ఉపాధ్యాయులు ఒక ఏడాది కచ్చితంగా డైట్ లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నవంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆరు విడతల్లో పరీక్షలు జరుగుతాయని, నవంబర్ 14, 15 తేదీల్లో త్రిసభ్య కమిటీ ఇంటర్వ్యూ చేస్తుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం అనే అంశంపై ఆదివా రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నాయకులు గుంటి గిరిధర్, కుప్పిలి కామేశ్వరరావు తెలిపారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం నగరంలోని యూటీఎఫ్ భవనంలో ఈ సమావేశం ఉదయం పది గంటలకు ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాల ని కోరారు. శ్రీకాకుళం రూరల్ : జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆర్టీఏ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులు, జిల్లాకు చెందిన 22 బస్సులను స్థానిక విజయాదిత్య పార్క్ వద్ద ఆపి తనిఖీలు జరిపారు. సంబంధిత పత్రాలు సరిగ్గానే ఉన్న ట్లు గుర్తించారు. జిల్లాకు సంబంధించి ప్రైవేటు ట్రావెల్స్ గల 18 బస్సులకు స్టేట్ పర్మిట్లు, ఒక బస్సుకు ఆలిండియా పర్మిట్ ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం డీటీసీ విజయసారధి తెలిపారు. తనిఖీలు చేసిన బస్సులకు ఫైన్లు గాని, సీజ్ చేయడం గాని జరగలేదన్నారు. -
8 నెలల నరకం
శ్రీకాకుళం క్రైమ్ : మరో అకృత్య కాండ వెలుగులోకి వచ్చింది. మన ఇంటి బిడ్డల భద్రతను ప్రశ్నిస్తూ ఇంకో కీచక పర్వం బయటపడింది. ఎనిమిది నెలల హింసను భరించిన ఓ బాలికకు ఎట్టకేలకు విడుదల లభించింది. కనిపెంచిన తల్లే కామాంధుని చెరలో చిక్కడం, నమ్మకం ఉంచిన ఆటో డ్రైవర్ కీచకుడిలా మారి వేధించడంతో ఆ బాలిక నరకం చూసింది. బంధువుల సాయంతో పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు ఈ శోకానికి తెర పడింది. జేఆర్ పురం పోలీస్స్టేషన్ పరిధిలో ఓ ఆటో డ్రైవర్ 14 ఏళ్ల అమ్మాయిని 8 నెలలుగా లైంగికంగా వేధిస్తున్నా డు. బాలిక తల్లితోనూ అక్రమ సంబంధం నడిపాడు. బాలిక బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడైన డ్రైవర్ను, సహకరించిన బాలిక తల్లిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించా రు. శనివారం శ్రీకాకుళం సబ్డివిజనల్ కార్యాలయంలో డీఎస్పీ వివేకానంద విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. బాలిక తండ్రి ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. ఉదయం వెళ్లి రాత్రయితే గానీ ఇంటికి రారు. ఇంటి విషయాలేవైనా భార్యే చూసుకునేవారు. వారి కుమార్తెను అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు వేరే గ్రామంలో ఉన్న హైస్కూల్కు తీసుకెళ్లేవాడు. బాలికతో పాటు మరో తొమ్మిది మంది కూడా అదే వాహనంలో స్కూల్కు వెళ్లేవారు. ఒకే ఊరు కావడంతో డ్రైవర్ బాలిక ఇంటికి వెళ్లి తల్లితో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతటితో ఆగక బాలికపైనా కన్నేశాడు. మద్యానికి బానిస చేసి.. బాలిక తల్లిని మద్యానికి బానిస చేసి.. ఆమె మత్తు లో ఉండగా బాలికతో అసభ్యంగా ప్రవర్తించేవా డు. ఆటోలో కూడా అదే రీతిలో బాలికను ఏడిపించేవాడు. తట్టుకోలేని బాలిక మొదట్లో తల్లితో చెప్పినా ఆమె పట్టించుకోలేదు. ఈ విషయం తండ్రితో చెప్పకూడదని బెదిరించేది. బాలిక తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తండ్రికి తెలిస్తే ఏం జరుగుతుందోనని భయపడి ఎనిమిది నెలలు ఆ నరకం భరించింది. తల్లి కొట్టడంతో.. ఈ క్రమంలో నాలుగు రోజుల ముందు బాలికను స్కూలుకు దిగబెట్టే క్రమంలో డ్రైవర్ రామారావు దారిలో ఆటో ఆపేసి లైంగికదాడికి యత్నించాడు. ఎంత వద్దన్నా వినిపించుకోలేదు. ఇంటికొచ్చి తల్లితో చెబితే బాలికనే తిరిగి కొట్టడంతో.. రాత్రి విధుల నుంచి వచ్చిన తండ్రితోను, ఎదురింటిలో ఉన్న చిన్నాన్న, పిన్ని, మామయ్యలతో ఆమె విషయమంతా చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయగా డీ ఎస్పీ వివేకానంద దర్యాప్తు ప్రారంభించారు. డీఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోక్సో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, తాను వచ్చాక 15 కేసులు నమోదయ్యాయన్నారు. పోక్సో కేసులో డ్రైవర్కు వర్తించిన జైలు శిక్ష ఆమెకు కూడా పడవచ్చన్నారు. -
వైద్య కళాశాలలను ప్రజలే రక్షించుకోవాలి
పలాస: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేయించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రజలే రక్షించుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని మూడో వార్డు పద్మనాభపురం గ్రామంలో శనివారం సాయంత్రం రచ్చబండ, కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి పేదవాడికి వైద్య విద్య చేరువ చేయాలని వైఎస్ జగన్ ఆలోచిస్తే.. కూటమి ప్రభు త్వం పేదలకు వైద్య విద్య దూరం చేస్తోందన్నారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు శిష్టు గోపి ఆధ్వర్యంలో మూడో వార్డు కౌన్సిలర్ సవర సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీ పీ నాయకులు డొక్కరి దిలీప్కుమార్, బదకల బాల మ్మ, రంది రాజారావు, డిక్కల రాంబాబు, కుమ్మరి బోగేషు, కిక్కర ఆధినారాయణ, కొండే రాజారావు, బడగల బల్లయ్య, బోరబుజ్జి, గుజ్జు జోగారావు, నర్తు వెంకటరమణ, తూముల శ్రీనివాసరావు, కంచరాన చినబాబు, బమ్మిడి సంతోష్కుమార్, సనప ల సింహాచలం తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర అనుబంధ విభాగాల్లో పలాస నాయకులకు చోటు
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పలాస నియోజవర్గానికి చెందిన నాయకులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శిగా డొక్కరి దానయ్య, రాష్ట్ర బూత్ కమిటీ సంయుక్త కార్యదర్శి చింతాడ మాధవరావు, రాష్ట్ర పంచాయతీ విభాగం కార్యదర్శిగా పాలిన శ్రీనివాసరావు, రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా ఉంగ సాయికృష్ణ, రాష్ట్ర గ్రీవెన్స్సెల్ సంయుక్త కార్యదర్శిగా సొర్ర ఢిల్లీరావు, రాష్ట్ర ఇంటెలెక్చువల్ ఫోరం కార్యదర్శిగా మొదవలస మన్మధరావు, రాష్ట్ర పబ్లిసిటీ విభాగం సంయుక్త కార్యదర్శిగా సురేంద్ర త్యాడిలను నియమించారు. రాష్ట్రస్థాయి మృదంగ పోటీల విజేతగా గౌతమ్ కంచిలి: జాడుపూడి గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి బోరిశెట్టి గౌతం రాష్ట్రస్థాయి మృదంగం పోటీల్లో విజేతగా నిలిచాడు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కళా ఉత్సవాల్లో భాగంగా మృదంగ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. గౌతమ్ గురువు చలపరాయి వినోద్కుమార్ శిష్యరికంలో మహతి సాంస్కృతిక కళాసేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన పోటీల్లో కూడా ప్రథమస్థానం దక్కించుకున్నాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ సంగీతం పట్ల మక్కువ పెంచుకోవడంతో తండ్రి మోహనరావు ప్రోత్సహించారు. గౌతమ్ను మాజీ సర్పంచ్ పిలక చిన్నబాబు, వైఎస్సార్ సీపీ నేత పలికల జయరాం, గ్రామస్తులు శనివారం అభినందించారు. -
వారి నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : జిల్లా కేంద్రంలోని పేర్లవీధికి చెందిన కోరాడ రమణమ్మ(96), ప్రశాంతినగర్కు చెందిన పొట్నూరు వెంకటనారాయణ(83), రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో కలిగి ఆదినారాయణ (67) మృతి చెందడంతో వారి నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది వచ్చి కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. నేత్రదాతల కుటుంబ సభ్యులను రెడ్క్రాస్ చైర్మన్తో పాటు సెక్రటరీ మల్లేశ్వరరావు, ట్రెజరర్ దుర్గా శ్రీనివాస్, సభ్యులు శనివారం అభినందించారు. నేత్రదానం చేయాలనుకునే వారు 78426 99321 నంబరును సంప్రదించాలని కోరారు. రమణమ్మ ఆదినారాయణ వెంకటనారాయణ -
రొయ్యిల కోసం వెళ్లి.. విగతజీవిగా మారి..
● బందరువానిపేటలో 8వ తరగతి విద్యార్థి మృతి గార: సరదాగా రొయ్యిల కోసం వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గార మండలం బందరువానిపేట గ్రామానికి చెందిన గంగాడ లక్ష్మణరావు (బేతాళుడు), లక్ష్మమ్మల రెండో కుమారుడు అప్పలరాజు (12) స్థానిక హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి పుస్తకాలు ఇంటిదగ్గర పెట్టి సమీపంలోని గెడ్డలో తోటి స్నేహితులతో కలిసి రొయ్యిలు పట్టుకునేందుకు వెళ్లాడు. స్నేహితులు ఇంటికి వచ్చినా కుమారుడు ఇంటికి చేరలేదు. చాలా రోజులుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న అప్పలరాజు ఆచూకీ కోసం గ్రామంలోని బందువుల ఇళ్ల వద్ద, పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. శనివారం నాగులచవితి నాడు గెడ్డ–సముద్రం కలిసే ప్రాంతంలో అప్పలరాజు విగతజీవిగా కనిపించడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. మృతుడికి అన్న, తమ్ముడు ఉన్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చోడిపల్లి గంగరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇన్ఫోసిస్కు 117 మంది ఎంపిక
టెక్కలి: టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 117 మంది విద్యార్థులు సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికై నట్లు కళాశాల డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శనివారం విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్ఓడీలు, అధ్యాపకుల కృషి, విద్యార్థుల శ్రమ కారణంగా మంచి ఉద్యోగాలు సాధిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ.ఎస్.శ్రీనివాసరావు, ప్లేస్మెంట్ హెచ్ఓడీ ఎం.సంతోష్కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ హెచ్ఓడీ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తల్లికి అంత్యక్రియలు చేసిన తనయ సోంపేట: తల్లికి కుమార్తె అంత్యక్రియలు నిర్వహించిన ఘటన సోంపేట మండలం తోటవూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కోనేటి పార్వతి (46) అనారోగ్యంతో మృతి చెందింది. ఈమె భర్త భాస్కరరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నాడు. కుమారుడు మానసిక రోగి. దీంతో కుమార్తె గౌరి పుట్టెడు దుఃఖంతోనే తల్లికి అంత్యక్రియలు పూర్తి చేసింది. -
ఆదిత్యున్ని దర్శించుకున్న హైకోర్టు జడ్జిలు
అరసవల్లి/గార: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి సత్తి, జస్టిస్ గేదెల తుహీన్కుమార్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తదితరులంతా పూర్ణకుంభ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. న్యాయమూర్తులకు జ్ఞాపికలు అందజేశారు. అనంతరం శ్రీకూర్మంలో కూర్మనాథున్ని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పిలి రంజిత్ శర్మ, ఇప్పిలి సాందీప్శర్మ, ఇప్పిలి షణ్ముఖశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకూర్మంలో జరిగిన కార్యక్రమంలో ఈఓ కోట నరసింహనాయుడు, అర్చకులు లక్ష్మణాచార్యులు, కిషోర్బాబు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల తనిఖీ పాతపట్నం: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో శాతశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా సమన్వయాధికారి వై.యశోదలక్ష్మి అన్నారు. పాతపట్నం మండలం ప్రహరాజపాలెంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఎయిమ్స్ వైద్యుడు మహమ్మద్ షాజాద్ మాట్లాడుతూ కౌమార దశలో వచ్చే శారీరక, మానసిక మార్పులు, వాటి ప్రభావం వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పి.పద్మావతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బాత్రూమ్లో నాగుపాము మెళియాపుట్టి : మండల కేంద్రం మెళియాపుట్టిలోని ఎగువవీధిలో ఈశ్వరరావు ఇంటి బాత్రూంలో శనివారం నాగుపాము కలకలం సృష్టించింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ముందు భయపడినప్పటికీ నాగుల చవితి నాడు దర్శనమివ్వడంతో పాలు పెట్టి పూజలు చేశారు. -
బాలికల గురుకులాల్లో పురుషుల నియామకం వద్దు
శ్రీకాకుళం పాతబస్టాండ్: బాలికలు చదువుతున్న గురుకులాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా పురుష ఉపాధ్యాయులను ప్రభుత్వం నియమించిందని, వారిని వెంటనే గురుకులాల నుంచి రిలీవ్ చేయాలని దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బాలికలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు నేపథ్యంలో ఇలాంటి నియామకాలు చేపట్టడం తగదన్నారు. జువైనల్ కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా గురుకులాల్లో డీఎస్సీ ద్వారా పురుష ఉపాధ్యాయుల నియామకాలు చేపడుతున్న గురుకులాల సొసైటీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో దళిత ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ జిల్లా కన్వీనర్ దుర్గాసి గణేష్, కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మిస్కా కృష్ణయ్య, అంబేద్కర్ ఇండియా మిషన్ జిల్లా నాయకులు నేతల అప్పారావు, అంబేద్కర్ యూనివర్సిటీ చైర్ సాధన సమితి జిల్లా కన్వీనర్ టి.రమణ, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు బైరి ధనరాజ్, మాలమహానాడు జిల్లా నాయకులు ముచ్చ శ్యాంసుందర్, బి నర్సింహం పాల్గొన్నారు. -
బీల భూముల్లో.. మొగలి పరిమళాలు
కవిటి: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం బీలప్రాంతంలో పంట భూములకు రక్షణగా ఏర్పాటు చేసుకున్న మొగలిచెట్లు రైతులకు పెట్టుబడి లేని ఆదాయవనరుగా మారాయి. ఏడాదిలో ఆరు నెలలకు పైగా మంచి ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. పండగలు, ఇతర సీజన్లో ఒక్కో పువ్వు రూ.40 నుంచి రూ.42 వరకు అమ్ముడుపోతుంటాయి. ఇక్కడి రైతులు వేకువజామునే చేతిలో దొనికత్తి పట్టుకుని వెళ్లి మొగలిపూల సేకరణలో నిమగ్నమవుతుంటారు. అదృష్టం కలిసివస్తే ఒక్కోవ్యక్తి రోజుకు 20 పువ్వుల వరకు దొరుకుతాయి. ప్రభుత్వపోరంబోకు భూమిలోనివైతే ఎవరైనా కోసుకోవచ్చు. అదే రైతు తన తోటలో మొగలిచెట్లు నాట్లు వేస్తే వాటిని సదరు రైతు మాత్రమే కోయాల్సి ఉంటుంది. ప్రత్నామ్నాయ పంటగా.. ఇటీవల కాలంలో రైతులు తమ భూముల్లో వరి, చోడి తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా మొగలిపంట సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాధారంగా కవిటి ఉద్దానం బీలలోని చిత్తడి నేలల్లో నీటి ఊ టలే పదునుగా మొగలి పంట వస్తోంది. ఇప్పటికే కొంతమంది రైతులు తమ భూముల్లో మొగలి డొంకల్ని పెంచుతున్నారు. వారి వద్ద నుంచి పంట కోసుకునేందుకు ఏడాదికి కొంత మొత్తం చెల్లించి కాంట్రాక్ట్ పొందుతారు. అలా రైతుల భూములు లీజుకు తీసుకున్న కొందరు ఇదే పంటపై మంచి ఆదాయం పొందుతున్నారు. స్వల్పవ్యవధిలో ఏపుగా పెరిగే మొక్కల కోసం పొరుగు రాష్ట్రం ఒడిశాకు వెళ్లి నాణ్యమైన మొగలి అంట్లను కూడా ఇక్క డికి తీసుకొస్తున్నారు. మన వద్ద లభించే మొగలి మొక్కల కన్నా ఒడిశా మొక్కల నుంచి వచ్చే పూల కు గిరాకీ ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. వీరంతా ఇక్కడి నుంచి ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ఒడిశా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. భలే ఆదాయం.. కపాసుకుద్థి రెవెన్యూలో రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇందులో రెండు ఎకరాలలో వరిసాగు చేస్తున్నాం. మిగిలిన 30 సెంట్ల భూమిలో గట్టు చుట్టూ మొగలి మొక్కలు నాటాం. ఏడాది కి రూ.40,000 లీజుకు కుదుర్చుకోవడం ద్వారా మొగలిపంట నుంచి ఆదాయం వస్తోంది. – ఆరంగి శివాజీ, చిక్కాఫ్ సంస్థ ఎండీ, ముత్యాలపేట ఒడిశా నుంచి మొక్కలు.. కొబ్బరి, వరికి ప్రత్యామ్నాయంగా ఒడిశా వెళ్లి మొగలి అంట్లు తెచ్చినాటాను. బాగా ఎదిగేందుకు ఆవుపేడ మొదళ్లలో వేశాను. మొక్కలు చక్కగా పెరిగాయి. బాగా కలిసి వస్తుందనే నమ్మకంతో మొగలిసాగు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాను. – బంజు పాపారావు, మొగలిసాగుదారు, కె.కపాసుకుద్ధి


