breaking news
Srikakulam
-
చీటింగ్ కేసులో ఇద్దరు అరెస్టు
పాతపట్నం: చీటింగ్ కేసులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఎస్ఐ కె.మధుసూదనరావు బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. పాతపట్నం మండలం చిన్నపద్మాపురం గ్రామానికి చెందిన బి.వెంకట్రావు, సారవకోట మండలం గోవర్ధనపురం గ్రామానికి చెందిన జి.రమేష్లు పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో శేషారావు పేరిట భూమికి సంబంధించి ఫోర్జరీ సంతకాలతో తప్పుడు పత్రాలను సృష్టించారు. ఆ భూమిని పాతపట్నం శాంతినగర్కు చెందిన సీహెచ్ శ్రీనివాసరావుకు అమ్మచూపి, రూ.13.50 లక్షలు తీసుకుని మోసం చేశారు. తిరిగి డబ్బులు అడిగితే టెక్కలి మండలం లింగాలవలసకు చెందిన వై.గోపితో పాటు మరికొందరితో బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు సీహెచ్ శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంకట్రావు, రమేష్లపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించామని ఎస్ఐ తెలిపారు. -
రెవెన్యూ సిబ్బంది తీరుపై కలెక్టర్ ఆగ్రహం
కవిటి: బల్లిపుట్టుగ రైతుల జాయింట్ ఎల్పీఎం, వన్బీ, అడంగల్ తదితర భూముల సమస్యలపై రెవెన్యూ సిబ్బంది వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్ర స్థాయిలోఆగ్రహం వ్యక్తం చేశారు. పలాస ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన నెలవారీ సమీక్షలో రైతుల సమస్యలపై తహసీల్దార్ మురళీమోహనరావును కలెక్టర్ ప్రశ్నించగా స్పందన లేకపోవడంతో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించేశారు. నేరుగా బల్లిపుట్టుగ విచ్చేసి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడారు. వీఆర్ఓ నుంచి మండల స్థాయి అధికారి వరకు ఎవరూ తమ గ్రామానికి సమస్య పరిష్కారం కోసం రాలేదని చెప్పడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 220 ఖాతాలకు సంబంధించి జాయింట్ ఎల్పీఎంలో నమోదైన రైతులందరి నోటీసులు జారీ చేసి నోషనల్ ఖాతాలుగా మార్చి డీఆర్ఓ ఎం.వెంకటేశ్వరరావు, పలాస ఆర్డీఓ వెంకటేష్ పర్యవేక్షణలో రైతులకు భూమి హక్కు కల్పించేందుకు చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రతి రెండుగంటలకోసారి ఫోన్లో రివ్యూచేస్తానని తెలియజేసి వెనుదిరిగారు. -
కాసుల వరద
ఇసుకాసురులకు.. నరసన్నపేట : ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. పేరుకు ఉచితమైనా ట్రాక్టర్ ద్వారా తీసుకొచ్చేందుకు అమాంతం ధరలు పెంచేశారు. వంశధార నదిలో నీటి ఉద్ధతి పెరిగి నదీతీర గ్రామాల్లో వరద రావడం, ప్రస్తుతం నదిలో నీరు అధికంగా ప్రవహిస్తుండటంతో ఇసుకాసురులు ఇదే అదునుగా ధరలు పెంచేశారు. నదిలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయంటూ ఉచిత ఇసుక ధరలను అమాంతం పెంచేసి సామాన్యులను దోపిడీకి గురిచేస్తున్నారు. పేరుకే ఉచితం.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తొమ్మిది నెలలు తర్వాత ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చారు. ఇసుకను ఎవరైనా ఉచితంగా నది నుంచి తీసుకువెళ్లవచ్చని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. వేసవిలో ట్రాక్టర్ ఇసుక ధర రూ.900 నుంచి రూ.3 వేలు వరకూ జిల్లాలో విక్రయాలు సాగాయి. అదే ఆగస్టులో ఈ ధరలు కొంత పెంచారు. వర్షాకాలం వచ్చింది.. నదిలోనికి ట్రాక్టర్లు వెల్లడం లేదు.. ఇసుక తవ్వకాలకు ఇబ్బంది అవుతుందని ట్రాక్టర్లు యజమానులు, ఇసుకాసురులు ధరలు నాలుగైదు వందలు పెంచారు. తాజాగా వారం రోజులుగా వంశధార నదిలో నీటి ఉద్ధృతి పెరిగింది. సమీపం గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దీనిని అలుసుగా తీసుకొని ఇసుకాసురులు ఉచిత ఇసుక ధరలను అమాంతంగా పెంచేశారు. ముందే నిల్వలు.. వరద పరిస్థితి ఏర్పడుతుందని ముందుగా ఊహించిన ఇసుకాసురులు ఇప్పటికే జీడి తోటలు, తమ సొంత స్థలాలు, ఇళ్ల వద్ద భారీగా ఇసుక నిల్వ చేశారు. ఇదే ఇసుకను ఇప్పుడు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుక నరసన్నపేట ప్రాంతంలో రూ.2300 పలుకుతోంది. దూరం బట్టి ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి. ఉచిత ఇసుక ధరలు ప్రస్తుతం జిల్లాలో రూ.5 వేలు వరకూ ఉన్నట్లు సమాచారం. లారీల్లో విశాఖకు తరలించే ఇసుక ధరలు కూడా బాగా పెరిగాయి. లారీ ఇసుక ప్రస్తుతం రూ.25వేల వరకూ విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఉచిత ఇసుకకు ఇంత ధరా అని గృహ నిర్మాణదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా అధికారులు దృష్టి సారించి ఇసుక ధరలను అదుపు చేయాలని పలువురు కోరుతున్నారు. ట్రాక్టర్లో అమ్మకానికి తీసుకువెళ్తున్న ఇసుక రూ.2400 చెల్లిస్తేనే.. ఇంటి పని చేస్తున్నాం. ఇసుక అవసరమని ప్రయత్నిస్తే ట్రాక్టర్ ఇసుక రూ.2400 అంటున్నారు. ఎందుకు ఇంత ధర అని ప్రశ్నిస్తే.. నదిలో నీరు వస్తుందమ్మా.. ఏదో మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ధరకు ఇస్తున్నాం.. లేకపోతే ఇంకా ఎక్కువ ధరే ఉంటుంది.. అని ట్రాక్టర్ డ్రైవర్ అంటున్నారు. అత్యవసరమై కొన్నాం. – బోగి పద్మజ, అనుపోజు అరుణకుమారి, జగనన్న కాలనీ, గడ్డెయ్యపేట -
13 నుంచి ఐద్వా రాష్ట్ర మహాసభలు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): అనంతపురంలో ఈ నెల 13, 14, 15 తేదీల్లో జరగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు బి.పద్మ పిలుపునిచ్చారు. బుధవారం ఎన్జీవో హోమ్లో ఐద్వా జిల్లా కన్వీనర్ అల్లాడ లక్ష్మి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విపరీతంగా పెరగడంతో యువత జీవితాలు సర్వనాశనం అవుతున్నాయన్నారు. మహిళా ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు మహిళా సాధికారత గాలికొదిలేశారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేసి, మహిళా హక్కుల సాధన దిశగా ఈ మహాసభలు మార్గదర్శకత్వం కానున్నాయన్నారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, సీఐటీయూ ఉపాధ్యక్షులు మహాలక్ష్మి, అంగన్వాడీ జిల్లా నాయకులు లతాదేవి, టి.ప్రవీణ, జి.అనురాధ, ఎం.లక్ష్మి, పి.శ్రీదేవి, జానకి, ఎం.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి
గార: సతివాడ పంచాయతీ మాజీ సర్పంచ్ గంగు ప్రభాకరరావు (రమణ)() బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శుభకార్యం నిమిత్తం గార వైపు వెళ్తుండగా నిజామాబాద్ –తూలుగు జంక్షన్ మధ్య బైక్ అదుపు తప్పడంతో కింద పడిపోయారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభాకరరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మాజీ సర్పంచ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 13 నుంచి ఎఫ్ఏ –2 పరీక్షలు నరసన్నపేట: పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకొనేందుకు ఎఫ్ఏ–2 పరీక్షలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 13 నుంచి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్లో విద్యార్థులు ఈ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రశ్న పత్రాలు ఆయా మండలాల ఎంఆర్సీలకు వచ్చాయి. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థులు 13న ఉదయం తెలుగు(మొదటి లాంగ్వేజ్), సాయంత్రం గణితం, 14న ఉదయం ఇంగ్లీషు, సాయంత్రం ఎన్విరాల్మెంటల్ సైన్స్, 15న ఓఎస్ఎస్సీ పరీక్షలు రాయనున్నారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 13న ఉదయం తెలుగు, సాయంత్రం గణితం, 14న ఉదయం హిందీ, సాయంత్రం జనరల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ రాయాల్సి ఉంటుంది. 15న ఉదయం ఇంగ్లీషు, సాయంత్రం సోషల్, 16న బయోలాజికల్ సైన్స్, సాయంత్రం ఓఎస్ఎస్సీ పరీక్షలు రాయనున్నారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నరసన్నపేట ఎంఈఓ శాంతారావు తెలిపారు. -
నేత్రం.. జరభద్రం!
● చిన్నప్పటి నుంచే పెరుగుతున్న కంటి సమస్యలు ● తీవ్రంగా ప్రభావం చూపుతున్న ఫోన్ వినియోగం ● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం శ్రీకాకుళం కల్చరల్: సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంతటి ప్రాముఖ్యత కలిగిన నేత్రాలపై కొందరు అశ్రద్ధ వహిస్తున్నారు. ఫలితంగా చిన్నప్పటి నుంచే దృష్టి సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కళ్ల సంరక్షణపై అవగాహన పెంచేందుకు ఏటా అక్టోబర్లో వచ్చే రెండో గురువారాన్ని ‘ప్రపంచ దృష్టి దినోత్సవం’గా జరుపుకుంటున్నారు. అంధత్వం, దృష్టిలోపం కలగకుండా ప్రజలను చైతన్యపరిచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలా వద్దు.. ● నిద్రలేవగానే సెల్ చూడడం వల్ల ఒత్తిడి పెరిగి శరీరంలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్రపోయే ముందు మొబైల్ వాడటం వల్ల నిద్రలేమి కలుగుతుంది. ● స్మార్ట్ ఫోన్ ఎక్కువ సమయం వాడితే కళ్లు పొడిబారి, మసకబారి తలనొప్పి మొదలవుతుంది. ‘డ్రై ఐ సిండ్రోమ్’ అనే కంటి వ్యాధికి గురవుతారు. ● విద్యార్థులు స్మార్ట్ ఫోన్లో ఎక్కువ సమయం అనుచితమైన విషయాలు, వీడియోలు చూడటం వల్ల నేర ప్రవృత్తికి మరలే ప్రమాదం ఉంది. ● కళ్లకు సరైన విశ్రాంతి లేకపోవతే చూపు మందగిస్తుంది. కళ్లు సరిగా కనపడక చిన్నతనంలోనే కళ్లద్దాలు వస్తాయి. ఇలా ముద్దు.. ● స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ స్క్రీన్కు కంటికి మధ్య కనీసం 25 అంగుళాల దూరం ఉండాలి. ● ప్రతి 20 నిమిషాలకు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. నేత్రాలను క్రమపద్ధతి ప్రకారం మూసి తెరవడం వల్ల కళ్లు తేమగా మారి ప్రకాశవంతంగా ఉంటాయి. ● దృష్టిలోపం ఉన్నట్లు భావిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి కళ్లద్దాలు ధరించాలి. ● బ్లూరే కట్, యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఉపయోగించడం మంచిది. ● ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అవగాహన కల్పిస్తున్నాం.. జాతీయ అంధత్వ, దృష్టిలోప నివారణ కార్యక్రమంలో భాగంగా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎన్జీవో కంటి ఆసుపత్రుల్లో కంటి వైద్య సేవలు ఉచితంగా అందజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ ఎస్.పుష్పలత, ప్రోగ్రాం మేనేజర్, జిల్లా అంధత్వ నివారణ సంస్థ, శ్రీకాకుళం నేత్రాలపై శ్రద్ధ అవసరం.. కళ్లపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా చిన్నారుల కంటి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. స్కూల్లో చేర్చే ముందే కంటిపరీక్షలు చేయించాలి. మధుమేహం, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 40 ఏళ్లు పైబడిన వారి ప్రతి ఏడాది తప్పని సరిగా నేత్రవైద్య నిపుణులను సంప్రదించడం వల్ల శాశ్వత అంధత్వం నుంచి తప్పించుకోవచ్చు. – ఎం.ఆర్.కె.దాస్, ఆప్తాలమిక్ అధికారి -
కూర్మాలు, గోవులను చంపే సంస్కృతి మంచిది కాదు
గార: జిల్లాలోని పవిత్ర శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మాలు, సింహాచలంలో గోవులను చంపే సంస్కృతి మంచిది కాదని గోవా గవర్నర్, శ్రీకూర్మనాథాలయం ధర్మకర్త పూసపాటి ఆశోకగజపతిరాజు అన్నారు. బుధవారం శ్రీకూర్మనాథాలయ ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణస్వీకారం కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త హోదాలో ఆయన పాల్గొన్నారు. గవర్నర్ మాట్లాడుతూ సభ్యులు దైవ సేవ చేసేందుకే వచ్చామని భావించాలని, దేవునికి బాధ్యతతో పనిచేయాలన్నారు. చట్టరీత్యా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేశారన్నారు. దేవస్థానంలోని ఆకుపసర చిత్రాలు (మ్యూరల్స్) వేసిన పూర్వీకుల నైపుణ్యాలను భావితరాలకు అందించాల్సి ఉందన్నారు. ట్రస్టు బోర్డు సభ్యులకు గైడ్లైన్స్ ఉన్న పత్రాలను ఇవ్వకపోవడంతో ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించుకొని ఆలయంలో రాతి స్తంభాలు, ఆకుపసర చిత్రాలు, కాశీద్వారం పరిశీలించారు. శాలిహుండం బౌద్ధారామాలను సందర్శించి, కొండపై ఉన్న ఆరామాలను పరిశీలించారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, దేవదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్పట్నాయిక్, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు, ఎక్స్ అఫీషియో మెంబర్గా ఆలయ ప్రధానార్చకులు చామర్ల సీతారామనృసింహాచార్యులు, సభ్యులుగా కై బాడి కుసుమకుమారి, పల్ల పెంటయ్య, గొండు శ్రీనివాసరావు, అంధవరపు మౌనిక, ఆరవెల్లి శ్వేతబిందు, తాన్ని సూరిబాబు, మళ్లా కల్యాణచక్రవర్తి, జమ్ము లక్ష్మీతో ఆలయ ఈవో కోట నరసింహానాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. -
● క్షతగాత్రులకు పరామర్శ
టెక్కలి: మెళియాపుట్టి మండలం గంగరాజపురం సమీపంలో రాజయోగి గ్రానైట్ క్వా రీలో జరిగిన సంఘటనలో తీవ్రంగా గాయపడి టెక్కలి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. సంఘటన వివరాలను క్షతగాత్రులను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి ఆరోగ్య పరిస్థితులపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సూర్యారావును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందజేస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ భరోసా ఇచ్చారు. -
ఆకాశ దీపం వెలిగింది
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం ఆలయంపైన బుధవారం ఆకాశ దీపం వెలిగించారు. ఒడిశా సంప్రదాయం ప్రకారం ఆశ్వ యుజ మాసం పౌర్ణమి అనంతరం బహుళ పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఇలా ప్రతి రోజూ అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాన్ని వెలిగిస్తారు. పాఢ్యమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ ఒడిశా నుంచి భక్తుల తాకిడి ఉంటుందని అర్చకులు తెలిపారు. అలాగే ఒడిశా వాసులు గౌరీపౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకూ కార్తీక మాసంగా పాటిస్తారు. నాడు కాదని.. నేడు అదే పని! శ్రీకాకుళం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రకటనలకు చేపడుతున్న పనులకు పొంతన లేకుండా పోతోంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో కొందరు టీచర్లకు రాష్ట్రస్థాయిలో బదిలీలను చేశారు. అయితే విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారడంతో వీరిని రిలీవ్ చేయలేదు. అప్పట్లో నారా లోకేష్ రాష్ట్రస్థాయి బదిలీలపై విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాగానే ఆ బదిలీలను రద్దు చేశారు. ఇప్పు డు తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో బదిలీలు చేయడం గమనార్హం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు ఓ ఉపాధ్యాయురాలికి ఇలా బదిలీ జరిగింది. ఈమె భర్త ఓ ప్రజా ప్రతినిధి వద్ద పీఏగా పనిచేస్తున్నట్లు సమాచా రం. పైగా దీన్ని రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది. బదిలీల ఉత్తర్వులు సహజంగా మెయిల్స్ ద్వారా విద్యా శాఖకు వస్తుంటాయి. ఈసారి మాత్రం బదిలీల ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖ అధికారుల వాట్సాప్కు పంపడాన్ని ఉపా ధ్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి. సువర్ణభూషిత కూర్మనాథుడు ● దశాబ్దాల తర్వాత కూర్మనాథునికి ఆభరణాల అలంకరింపు ● 80 ఏళ్లుగా సింహాచలం దేవస్థానంలో భద్రపరిచిన వైనం గార: ఎనభై ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కూర్మనాథుని సువర్ణ ఆభరణాలు మళ్లీ స్వామి విగ్రహాన్ని అలంకరించాయి. ఎనిమిది దశాబ్దాల పాటు సింహాచలంలోనే ఉండిపోయిన ఆభరణాలు మళ్లీ ఇన్నాళ్లకు అవి శ్రీకూర్మం చేరాయి. శ్రీకూర్మనాథుని ఉత్సవమూర్తులు శ్రీదేవి, భూదేవి, గోవిందరాజస్వామి, శ్రీరామ, లక్ష్మణస్వామి, సీతమ్మ వార్లకు బంగారు ఆభరణాలను బుధవారం అలంకరించారు. సుమారు 3 కిలోల బంగారం కలిగిన ఆభరణాల్లో గోవిందరాజస్వామి, శ్రీరామ, లక్ష్మణ విగ్రహాలకు వక్ష స్థలం, కవచాలు, కంటెలు, భుజ కీర్తులు వంటివి ఉండగా, అమ్మవార్ల విగ్రహాలకు కిరీటాలతో పాటు మెడలో వేసుకున్న శేరులు వంటివి ఉన్నాయి. 80 ఏళ్ల కిందట ఆభరణాలకు ఆలయంలో రక్షణం కల్పించలేమని అప్పటి అధికారుల అభ్యర్థనతో సింహాచలం దేవస్థానంలో భద్రపరిచారు. అప్పటి నుంచి శ్రీకూర్మనాథాలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలైన డోలోత్సవం, కల్యాణోత్సవం, శ్రీకూర్మనాథుని జయంత్యుత్సవాలకు సైతం వీటిని తీసుకురాలేదు. ఆలయంలో పనిచేస్తున్న వైదిక సిబ్బంది, అధికారులు చాలా మంది వీటిని ఇప్పటివరకు చూడలేదు. దేవస్థానం ధర్మకర్త పూసపాటి అశోకగజపతిరాజు గోవా గవర్నర్గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఆలయానికి వచ్చి దీనిపై లేఖ రాస్తానని చెప్పారు. గురువారం ఉదయం భద్రత నడుమ తీసుకువచ్చి గర్భగుడి సమీపంలోని అద్దాల మంటపంలోని స్వామి ఉత్సవ మూర్తులకు అలకరింపజేసి భక్తుల దర్శనార్థం ఉంచారు. -
శ్రీకాకుళం
సారవకోట మండలం అవలింగి సమీపంలోని దుర్గా వైన్ షాపులో, సమీపంలోని ఇంట్లో సెప్టెంబర్ 2వ తేదీన నకిలీ మద్యం దొరికింది. మందుబాబుల ప్రాణాలు తీసే మద్యంగా అనుమానాలు ఉన్నాయి. ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చిన ఆల్కహాల్కు కలర్ కలిపి నకిలీ మద్యం తయారు చేసి, బాటిలింగ్ చేసి విక్రయిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. దానికోసమే ఏకంగా ఇళ్లు అద్దెకు తీసుకుని, ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంట్లో వేలల్లో ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్ నంబర్ స్టాంపింగ్ మిషన్ వంటివి దొరికాయి. అంతకుముందు టెక్కలి ఆర్టీసీ డిపో సమీపంలో ఓ మద్యం దుకాణంలో కొన్న సీసా సీల్లో తేడా ఉండటాన్ని గుర్తించారు. మూతతీసి చూసి మద్యం కల్తీ అయిందని గుర్తించారు. రెగ్యులర్గా అదే బ్రాండ్ తాగే వ్యక్తికి తేడా తెలియడంతో కల్తీ అయిందని గోల పెట్టారు. గురువారం శ్రీ 9 శ్రీ అక్టోబర్ శ్రీ 2025 -
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక గుర్తింపు
ఎచ్చెర్ల: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అగ్రశేణి విశ్వవిద్యాలయాల్లో నిర్వహించే ఐబీఎం క్వాంటమ్ క్యూస్కిట్ పాల్ ఫెస్ట్–2025లో భాగంగా ఆర్జీయూకేటీ (ఐఐఐటీ) శ్రీకాకుళంను ఐబీఎం క్వాంటమ్ ప్రత్యేకంగా ఎంపిక చేసింది. మన దేశం నుంచి కేవలం పది వర్సిటీలకు మాత్రమే ఈ అవకాశం రాగా మన రాష్ట్రం నుంచి ఆర్జీయూకేటీ మాత్రమే ఉండడం విశేషం. ఆర్జీయూకేటీ విద్యార్థులు కాటం నిఖిల్, తేజ, కాశీం వాలీ, దూదేకుల ప్రవీణ్కుమార్, చెరుకూరి జాన్బాబు, చదువులు గురుశ్రీకిమ్మిడి ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా ఈ ఘనత సాధ్యమైంది. ఈ ఫెస్ట్ అక్టోబర్ 21 నుంచి 27 వరకూ ఆర్జీయూకేటీ నాలుగు క్యాంపస్లు శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఆర్.కె వ్యాలీలలో జరగనుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, పరిశోధకులు, సాంకేతిక నిపుణులు ఆన్లైన్లో పాల్గొంటారు. ఈ ఫెస్ట్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి, ఈ రంగంలో ఉన్న అవకాశాలపై అవగాహన పెంపొందించేందుకు వర్క్షాప్లు, నిపుణుల ఉపన్యాసాలు, హ్యాక్థాన్ నిర్వహిస్తారు. వర్సిటీకి ఇది గర్వకారణమని శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు. ఈ టెక్నికల్ ఫెస్ట్కు డీన్ ఎకడమిక్స్ డాక్టర్ ఎం. శివరామకృష్ణ కన్వీనర్గా, విద్యార్థుల కో ఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. -
బెల్టుషాపులకే కల్తీ మద్యం..
జిల్లాలో తయారవుతున్న కల్తీ మద్యం బాటిల్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్షాపులకే వెళ్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సిండికేట్ నడుస్తోంది. ఒకవైపు కౌంటర్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేపడుతుండగా, మరోవైపు పర్మిట్, బెల్ట్షాపులను ప్రోత్సహిస్తోంది. సిండికేట్ అంతా టీడీపీ నాయకుల చేతుల్లోనే ఉంది. వారు ఏం చెబితే అదే జరుగుతోంది. ఫలితంగా బెల్ట్షాపుల్లో తనిఖీలు, పట్టుకోవడాలు జరగడం లేదు. ముడుపులు నడుస్తుండటంతో అంతా గుట్టుగా సాగిపోతోంది. రాజకీయ విభేదాలు తలెత్తితేనే గుట్టు బయటపడుతోంది. -
న్యాయ పోరాటం చేద్దాం
● రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు పలాస: పచ్చటి ఉద్దానంలో నిర్మించతలపెట్టిన కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా న్యాయ పోరా టం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘం నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపునిచ్చారు. మందస మండలం ఎం.గంగువాడ గ్రామంలో బుధవారం కార్గో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగ సభ నిర్వహించా రు. కార్గో ఎయిర్ పోర్టు నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కొమర వాసు అధ్యక్షతన జరిగిన ఈ సభలో శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ జిల్లాకు పోరాటాల్లో ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఆంధ్ర ఉద్యమాల ఐక్య వేదిక కన్వీనర్ మహదేవ్ మాట్లాడుతూ పోలీసు నిర్బంధం పైన హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామన్నారు. అడుగడుగునా ఆంక్షలేమందస: మందస మండలం ఎం.గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా రైతులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఎక్కడికక్కడ పోలీసు వాహనాలు పెట్టి బహిరంగ సభ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. చివరకు తోటలో నిర్వహించుకోవడానికి షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. వ్యతిరేకంగా పోరాటం చేస్తాం.. కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా 15 నెలల నుంచి పోరాటం చేశాం. దానిపై ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పుడు బహిరంగ సభ ఏర్పాటు చేస్తే పోలీసులతో నిలిపివేయించారు. ఇలాంటి కుతంత్రపు రాజకీయాలు ఎందుకు..? – బత్తిన లక్ష్మణరావు, భేతాళపురం ఉద్దానాన్ని వదులుకోబోము.. ఎన్ని అవాంతరాలు ఎదురైనా కార్గో ఎయిర్పోర్టును నిలిపి తీరుతాం. మా పచ్చటి ఉద్దానాన్ని వదులుకోవడానికి మేం సిద్ధంగా లేము. – కె.మోహన్రావు, సీపీఎం కార్యదర్శి -
జిల్లాకూ నకిలీ మకిలి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నకిలీ మద్యం ఆనవాళ్లు జిల్లాలోనూ కనిపించాయి. నిజానికి రాష్ట్రంలోని మిగతా చోట కంటే ముందే శ్రీకాకుళం జిల్లాలో ఈ బాగోతం బయటపడింది. ఇందులో టీడీపీ నాయకుడు మీసాల నీలకంఠం పాత్ర ఉన్నట్టు తేలింది. ఇప్పుడాయన ముందస్తు బెయిల్ కోసం యత్నిస్తున్నారు. ఒడిశాకు ఆనుకుని ఉన్న టెక్కలి, ఉద్దానం వంటి ప్రాంతాల్లో చీప్ లిక్కర్కు ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్(స్పిరిట్), కెరామల్ వంటి రసాయనాలు కలిపి ఏకంగా బాటిల్స్ తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆంధ్రాలోని ఖరీదైన వైన్లో కూడా చీప్ లిక్కర్, వాటర్ మిక్సింగ్ చేసి బాటిల్స్ తయారు చేస్తున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కల్తీ మద్యం దందా నడుస్తోంది. ముఖ్యంగా తీర ప్రాంతాలకు పడవలపై ఒడిశా నుంచి చీప్ లిక్కర్, సారా వస్తోంది. అక్కడి నుంచి వచ్చిన లిక్కర్ను జిల్లాలోని రహస్య ప్రాంతాలకు తరలించి బ్రాండ్ మిక్సింగ్ చేస్తున్నట్టుగా సమాచారం. దానికోసం ప్రత్యేకంగా ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్ నంబర్ స్టాంపింగ్ మిషన్లను అక్రమార్కులు సమకూర్చుకున్నారు. సారవకోట మండలం అవలింగిలో ఇప్పటికే ఇవన్నీ దొరికాయి. రాజకీయ విభేదాల కారణంగా అక్కడ గుట్టు రట్టయ్యింది. లేదంటే గుట్టు చప్పుడుగా సాగిపోయేదే. మిగతా ప్రాంతాల్లోనూ ఈ రకమైన డెన్లు నడుస్తున్నట్టు తెలుస్తోంది. గుర్తించలేనంతగా.. జిల్లాలో నిపుణుల చేత కల్తీ చేయిస్తూ అసలేదో, కల్తీ ఏదో గుర్తించలేనంతగా మందుబాబులను మోసం చేస్తున్నారు. ఈ కల్తీ చాలా చోట్ల అనుభవం ఉన్న నౌకర్ నామాలే చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. అందుకనే దాదాపు వైన్ షాపుల నిర్వాహకులు అనుభవం ఉన్న నౌకర్ నామాలను పెట్టుకుంటారు. దీనికి తోడు పర్మిట్ రూమ్లకు కూడా అనుమతి ఇవ్వడంతో కల్తీ మరింత సులభం అవుతోంది. లూజు అమ్మకాలు జరుగుతుండటంతో అక్కడికక్కడే బ్రాండ్ మిక్సింగ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కల్తీ మద్యంతోనే ప్రమాదం ఒడిశాకు అనుకుని సరిహద్దు ప్రాంతాలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి తదితర నియోజకవర్గాలు ఒడిశాకు దగ్గరలో ఉన్నాయి. ఒడిశాలో ప్రస్తుతం చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ధర రూ.70నుంచి రూ.150వరకు ఉంది. అదే ఆంధ్ర ప్రదేశ్లోనైతే రూ. 99నుంచి రూ.220వరకు ఉంది. ఇక్కడ కంటే ఒడిశా చీప్ లిక్కర్ క్వాలిటీ బాగుం ఒడిశా సరిహద్దు నియోజకవర్గాల్లో నకిలీ మద్యం తయారీ సారవకోట మండలం అవలింగిలో బయటపడిన నకిలీ మద్యం బాగోతం నకిలీ మద్యం కేసులో పరారీలో టీడీపీ నాయకుడు నీలకంఠం టెక్కలిలో బయటపడ్డ రెండు మూడు పరిణామాలు టీడీపీ నాయకుల చేతుల్లోనే సిండికేట్ నకిలీ, కల్తీ మద్యమంతా బెల్ట్షాపులకే వెళ్తున్న వైనం -
గిరిజనులకు శాపం
ప్రకృతి ప్రకోపం.. నాణ్యతా లోపం.. ● ఇటీవల వర్షాలకు ఛిద్రమైన ఏజెన్సీ రోడ్లు ● రాకపోకలకు తప్పని పాట్లు మెళియాపుట్టి: ప్రకృతి ప్రకోపానికి తోడు పనుల్లో నాణ్యత లేకపోవడంతో గిరిజన రహదారులు అధ్వానంగా మారాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పలుచోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఉత్తరాంధ్రలోనే ఎత్తయిన గిరిజన గ్రామాలైన మెళియాపుట్టి మండలం కేరాసింగి, గూడ గ్రామాలకు వెళ్లే రహదారులు కనీసం నడవటానికి కూడా అవకాశం లేని స్థితికి చేరుకున్నాయి. కేరాసింగి రహదారిలో కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొత్తూరు వెళ్లే రహదారితో పాటు పలురోడ్లు కోతకు గురికావడంతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అధికారులు పరిశీలనకు వచ్చి చూసి వెళ్లిపోతున్నారు తప్ప రహదారుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేయించాలని గిరిజనులు కోరుతున్నారు. -
పిల్లలకు ప్రత్యక్ష నరకం
● ఆరుబయట భోజనాలతో అవస్థలు ● వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ● పట్టించుకోని అధికారులు కొత్తూరు: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన వసతులు కల్పిస్తున్నామని కూటమి నాయకులు చెబుతున్న మాటలు నీటి మూటలుగా మిగులుతున్నాయి. కనీసం మధ్యాహ్న భోజనాలకు సంబంధించి భోజన శాలలు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో సక్రమంగా తినలేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. జిల్లాలోని 30 మండలాల్లో 2,955 ప్రభుత్వ పాఠశాలలు, 38 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1,62,000 మంది, కాలేజీల్లో 12,500 మంది విద్యార్థులు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనాలు చేస్తున్నారు. అయితే చాలా పాఠశాలల్లో భోజనశాలలు లేకపోవడంతో ఆరుబయట మైదానాల్లో, తరగతి గదుల్లో, పాఠశాల వరండాల్లో భోజనాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఈవిధంగా భోజనాలు చేయడం వలన కుక్కలతో ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు పడితే భోజనం చేసేందుకు అగచాట్లు పడుతున్నారు. కొత్తూరుతో పాటు మండలంలోని మినీ గురుకుల పాఠశాలలో వడ్డించేందుకు గదులు లేకపోవడంతో ఆరుబయటే అన్నం వడ్డిస్తున్నారు. కొత్తూరులో చెట్టు నీడలో వడ్డన చేయడంతో పక్షుల రెట్టలు పడుతున్నాయి. కారిగూడ మినీ గురుకులంలో రెండు తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. దీంతో విద్యార్థులు తరగతి గదుల్లో భోజనాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్న పాఠశాలలు, కాలేజీల్లో స్థలం లేకపోవడంతో నిలబడి ప్లేట్లు పట్టుకొని భోజనం చేస్తున్నారు. దీంతో విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి వసతులు కల్పించాలని కోరుతున్నారు. పాఠశాలల్లో భోజనశాలలు లేకపోవడంతో విద్యార్ధులు పడుతున్న సమస్య మా దృష్టికి వచ్చింది. భోజన శాలల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాము. వీలైనంత వేగం సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. – రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం జిల్లా భోజన శాలలు లేకపోవ డంతో భోజనాలు చేసేందుకు ఇక్కట్లు పడుతున్నా ము. చెట్టు నీడలో భోజనా లు వడ్డిస్తుండడం వలన పక్షులు రెట్టలు వేస్తున్నాయి. దీంతో భోజనాలు చేసేందుకు నరకం అనుభవిస్తున్నాము. – చిగురుపిల్లి సంధ్య, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, కొత్తూరు వంట శాలలు లేకపోవడంతో మైదానంలో భోజనా లు చేస్తున్నాము. వర్షాలు వచ్చినప్పుడు భోజనాలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్నాము. భోజన సమయంలో కుక్కలు వస్తున్నాయి. చెట్టుకిందనే వడ్డన చేయడం వల న పక్షులు రెట్టలు వేస్తున్నాయి. వీటితో ఆందోళ న చెందుతున్నాం. త్వరితగతిన భోజన శాల నిర్మించాలి. – ఎల్.సాయికుమార్, తొమ్మిదో తరగతి, కొత్తూరు ఉన్నత పాఠశాల -
సీజేఐ గవాయ్పై దాడికి యత్నం దురదృష్టకరం
శ్రీకాకుళం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ గవాయ్పై దాడికి యత్నించడం దురదృష్టకరమని దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీకాకుళంలోని అంబేడ్కర్ జంక్షన్ వద్ద మానవహారం మంగళవారం నిర్వహించారు. ఆయా సంఘాల జేఏసీ నేతలు తైక్వాండో శ్రీను, కంఠ వేణుల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో శ్రీకాకుళం బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా పాల్గొని సంఘీభావం తెలిపారు. సీజేఐపై దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు బడే కామరాజు, ముంజేటి కృష్ణ, బాడాన దేవభూషణరావు, రౌతు శంకరరావు, ఎంఏ రఫీ, మహిబుల్లా ఖాన్లతో పాటు జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి పిట్ట దామోదరరావు, ఉపాధ్యక్షుడు సీతరాజు, ప్రతినిధులు బి.మురళీకృష్ణ, జె.శ్రీనివాసరావు, చలపతిరావు, డి.రాజ్ కుమార్లు మాట్లాడుతూ సీజేఐ గవాయ్పై దాడి యత్నాన్ని ఖండించారు. ఈ ఘటన న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇటువంటి చర్యలు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, నాగరిక సమాజంలో దాడులకి స్థానం లేదన్నారు. కార్యక్రమంలో దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ నాయకులు వైశ్యరాజు మోహన్, నటుకుల మోహన్, యజ్జల గురుమూర్తి, అర్జి కోటి, పురుషో త్తం రాంబాబు, సంతు, అర్జి ఈశ్వరరావు, కొయిలా పు విజయ్, కొత్తూరు సత్యనారాయణ, పెయ్యల చంటి, అబ్బాస్, విజయ్, అఖిల్, రాము, మజ్జి గౌతమ్, రాహుల్, హేమంత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
గంగరాజపురంలో క్వారీలో పిడుగుపాటుకు ముగ్గురు దుర్మరణం
హిరమండలం/మెళియాపుట్టి: పొట్టకూటి కోసం వందలాది కిలోమీటర్లు దాటి వలస వచ్చిన కార్మికులను పిడుగురూపంలో మృత్యువు బలగొంది. మెళియాపుట్టి మండలం గంగరాజపురం గ్రామ సమీపంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ముగ్గురు క్వారీ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా టెక్కలి ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. పోలీసులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగరాజపురం సమీపంలో కొండపై రాజయోగి క్వారీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులు పనుల్లో ఉండగా మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు ప్రారంభమయ్యాయి. ఒక్కసారిగా పిడుగుపడడంతో కార్మికులు కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో మేఘవాల్ హేమరాజ్(25), పింటు (25), శ్రావణ్కుమార్ (45) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కాళ్ల జనార్దనరావు, జాన్ బొలియర్ సింగ్, కరణం బాలరాజు, బైపోతు హరిప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మెళియాపుట్టి తహసీల్దార్ బడే పాపారావు, సీఐ ఎన్.సన్యాసినాయుడు, మెళియాపుట్టి ఇన్చార్జిగా ఉన్న పాతపట్నం ఎస్ఐ కె.మధుసూదనరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, టెక్కలి ఆర్టీవో ఎం.కృష్ణమూర్తి ఆస్పత్రికి వెళ్లి కార్మికులను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.వలస కూలీలు..గంగరాజపురం కొండపై కొద్దిరోజులుగా రాజయోగి పేరుతో క్వారీ నిర్వహిస్తున్నారు. దసరా పూజలు అనంతరం తిరిగి క్వారీ పనులు ప్రారంభించారు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులు మేఘావల్ హేమరాజ్(రాజస్థాన్), పింటూ(మధ్యప్రదేశ్), శ్రావణ్కుమార్(బీహార్) వలస కూలీలు. గాయాలపాలైన జనార్ధనరావుది టెక్కలిలోని ఆది ఆంధ్రావీధి, జాన్ బొలియర్ సింగ్ది ఒడిశాలోని టింఖియసాయి గ్రామం. కరణం బాలరాజుది మెళియాపుట్టి మండలం బందపల్లి కాగా, బైపోతు హరిప్రసాద్ది పెదలక్ష్మీపురం. వీరంతా డ్రిల్లింగ్, క్వారీ కటింగ్లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో ఇదే మండలం దీనబంధుపురం క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఆ ఘటన మరువక ముందే పిడుగు రూపంలో బడుగులను మృత్యువు కబళించింది. తాజా ప్రమాదంతో క్వారీల్లో భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. నిబంధనలకు విరుద్ధంగా, సమయపాలన పాటించకుండా పనులు చేపడుతున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఇన్చార్జి ఎస్ఐ మధుసూదనరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన పేలుడు వల్లే సంభవించి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం రిపో ర్టు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. -
క్రైమ్ కార్నర్
కవిటి: మండలంలోని సహలాలపుట్టుగలో ఈనెల 1వ తేదీన జరిగిన అనుమానాస్పద మృతి కేసు వివరాలను కవిటి పోలీసులు మంగళవారం ఆలస్యంగా మీడియాకు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గొనియా సురేష్ ప్రధాన్(25) ఈనెల 1వ తేదీన తన జీడితోటలో జీడిచెట్టుకు టవల్తో ఉరివేసుకుని వేలాడుతుండడంతో అతని అక్క కె.పద్మ చూసింది. వెంటనే గ్రామస్తులు కవిటి పోలీసులకు తెలిపారు. దీంతో 2వ తేదీ ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే అనుమానాస్పద మృతిగా నమోదు చేసి, విచారణ చేపడుతున్నట్టు కవిటి ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. ఈ విషయం ఎందుకు ఇన్ని రోజులు మీడియాకు వెల్లడించలేదని ప్రశ్నించగా.. తాను బందోబస్తు డ్యూటీకి వెళ్లిపోయినందువల్ల ఆలస్యం జరిగిందన్నారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మందస: లగేజీ ఆటో ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మందస మండలంలో చోటుచేసుకుంది. తంగరపుట్టి గ్రామానికి చెందిన సవర విజయ్(25) సోమవారం మందస వచ్చి తిరిగి తమ గ్రామానికి వెళ్తుండగా రాయికోల గ్రామం వద్ద లగేజీ ఆటో ఢీకొంది. దీంతో తీవ్రగాయాలుపాలైన యువకుడిని వైద్యం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మరణించారు. ఘటనపై మందస పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంతబొమ్మాళి: మండలంలోని వడ్డితాండ్ర రైల్వే గేటు సమీపంలో ట్రాక్పై పడి ఒక గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి మృతి చెందారు. వ్యక్తిపై నుంచి ట్రైన్ వెళ్లడంతో శరీరభాగాలు ముక్కలుగా పడి ఉన్నాయి. దీనిని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని రైల్వే ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని స్థానికులు అంటున్నారు. రణస్థలం: మండలంలోని జీరుపాలెం పంచాయతీ జగన్నాథపురం గ్రామానికి చెందిన అంబటి యర్రయ్య (47) పడవ బోల్తాపడి మృతి చెందారు. జేఆర్పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. అంబటి యర్రయ్యతో పాటు మరో ముగ్గురు వాసుపల్లి పోతయ్య, దుమ్ము అప్పన్న, సూరాడ లక్ష్మణలు సముద్రంలో మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఒడ్డుకు వస్తున్న సమయంలో భారీ కెరటాలకు పడవ బోల్తా పడి నలుగురూ సముద్రంలో పడిపోయారు. వారిలో దురదృష్టవశాత్తు అంబటి యర్రయ్య సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. మిగతా ముగ్గురు ఒడ్డుకు క్షేమంగా చేరుకున్నారు. మృతుడికి భార్య యర్రమ్మ, ఇద్దరు కుమారుడు, కూతురు ఉన్నారు. జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పార్టీ కోసం పనిచేసేవారికి ప్రాధాన్యం
కవిటి: వైఎస్సార్సీపీలో పార్టీ కోసం పనిచేసేవారికి సరైన ప్రాధాన్యం లభిస్తుందని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలంలోని కొత్తపుట్టుగలో ఉన్న ఆయన నివాసంలో కవిటి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కడియాల ప్రకాష్ ఆధ్వర్యంలో మండల పార్టీ శ్రేణులు ఆయనను మంగళవారం సన్మానించారు. ఎమ్మెల్సీగా శ్రీకాకు ళం జిల్లాతో పాటు ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించిన తీరును నాయకులంతా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామారావు మాట్లాడుతూ.. శాసన మండలి సమావేశాల్లో సమస్యలను ప్రస్తావించే అవకాశం వైఎస్ జగన్మోహన్రెడ్డి వలనే దక్కిందని తెలియజేశారు. ఆయన ఆశయాల మేరకు ఇచ్ఛాపు రం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసి కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. కుసుంపురం గ్రామానికి చెందిన బెంతు సామాజిక నాయకుడు శివ బిసాయి మాట్లాడుతూ.. వర్షాకాల సమావేశాల్లో తమ బెంతు ఒరియా ల సమస్యలను ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిసారీ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు. కడియాల ప్రకాష్ మాట్లాడుతూ.. పరిపూర్ణమైన అవగాహనతోనే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలను ప్రస్తావించారని కొనియాడారు. పాండవ శేఖర్, పీఎం తిలక్, పూడి నేతాజీ, బెందాళం జయప్రకాశ్, గోపయ్య, మురళి, బర్ల నాగభూషణం, కృష్ణారావు, బాబురావు, వై.అశోక్, రవి, నారాయణ స్వామి, బర్ల నాగు, కాయ భీమసేన్, దువ్వు కృష్ణారెడ్డి, పాండవ శేఖర్, పిరియా కృష్ణారావు, చందాన పూర్ణచంద్రుడు, దుద్ది ధర్మారావు, పాతిన వెంకటరావు పాల్గొన్నారు. -
బుడ్డేపుపేటలో కార్డన్ సెర్చ్
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని బుడ్డేపుపేటలో రూరల్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తు లు, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తనిఖీల్లో ధ్రువీకరణ పత్రాలు లేని 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు.గ్రామంలో నాటుసారా, గుట్కా, గంజాయి వినియోగం వలన కలిగే అనర్థాలను వివరించారు. ఇచ్ఛాపురం రూరల్: గ్రామాల్లో అధిక ధరలకు మద్యం అమ్ముతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నవారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తామని రూరల్ ఎస్ఐ ఈ.శ్రీనివాస్ మంగళ వారం హెచ్చరించారు. మండలంలోని పాయి తారి గ్రామానికి చెందిన ఇండుగు భీమారావు తన ఇంట్లో బెల్టు షాపు నిర్వహిస్తున్నట్లు వచ్చి న సమాచారం మేరకు సోమవారం రాత్రి తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. దీనిలో భాగంగా మద్యం బాటిళ్లతో పాటు భీమారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కంచిలి: మండలంలోని సిర్తలి గ్రామంలో కొత్త చెరువు గట్టుపై సోమవారం రాత్రి 11.30 గంట ల సమయంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. దీనిలో భాగంగా ఏడుగురిపై కేసులు నమోదు చేసి, వారి నుంచి రూ.41 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ పి.పారినాయుడు మంగళవారం తెలియజేశారు. నరసన్నపేట: మండలంలోని మాకివలసలో పేకాట శిబిరంపై నరసన్నపేట పోలీసులు మంగళవారం దాడి చేశారు. గ్రామంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో నిఘా వేసి దాడి చేశామని, 16 మందిని అరెస్టు చేసి.. రూ.4,800లు సీజ్ చేసినట్లు ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. గ్రామాల్లో పేకాట ఆడితే ప్రజలు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చినవారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మద్యం మత్తులో ఒక యువకుడు రోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఫలితంగా జిల్లా న్యాయస్థానం మంగళవారం 45 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ట్రాఫిక్ సీఐ నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. సోమవారం సాయంత్రం నగరంలోని దమ్మలవీధికి చెందిన తమిరి సాయి మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తూ, పొట్టి శ్రీరాములు కూడలి వద్ద ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అక్కడే ఉన్న ఎస్ఐ సోమశేఖర్ నిలువరించినా వినకుండా రోడ్డుపైనే వీరంగం చేశాడు. అప్పటికే సమాచారం అందుకున్న సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపర్చగా.. శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ 45 రోజుల జైలు శిక్ష విధించారు. వెంటనే సాయిని అంపోలు జైలుకు ట్రాఫిక్ పోలీసులు తరలించారు. -
సీజనల్ వ్యాధుల కట్టడికి చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఇటీవ కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులతో వివిధ శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడా వృథా నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. కాలువల శుభ్రపరిచే పనులను నిరంతరం కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. భారీ వర్షాల కారణంగా జిల్లాలో 16 మండలాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. సంతబొమ్మాళిలో 400 హెక్టార్లు, పాతపట్నంలో 250 హెక్టార్లు, కొత్తూరు, హిరమండలంలో 100 హెక్టార్ల చొప్పున నష్టం సంభవించినట్లు పేర్కొన్నారు. ధాన్యం మొలకెత్తడం, ధాన్యం పొట్టు దశలో నీరు చేరడం, పూత రాలిపోవడం వంటి నష్టం జరిగినట్లు తెలిపారు. దీనిపై తక్షణమే ప్రభుత్వానికి సమగ్ర నివేది క పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇంజినీరింగ్ పనుల్లో పూర్తయిన వాటికి బిల్లులు పెండింగ్లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం ఇంటింటికీ జీఎస్టీ ఫలాల ప్రచారంపై సమీక్షించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్లు బి.పద్మావతి, జయదేవి, ఇతర శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. -
పోడు పంట.. ఆరోగ్యకరమంట..!
మెళియాపుట్టి: ప్రస్తుతం మనం తీసుకునే ఆహార పదార్థాల్లో అత్యధిక శాతం రసాయనిక ఎరువులు వినియోగించి పండించినవే. మార్కెట్లో రసాయనిక ఎరువు లు లేకుండా పండిన కూరగాయలు, పండ్లు దొరక డం ఈరోజుల్లో గగనమైపోయింది. అయితే ఇటువంటి తరుణంలో మండలంలోని సవర జాడుపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు పోడు భూముల్లో సేంద్రియ పద్ధతిలో పంటలు, పండ్లను పండిస్తూ ఆరోగ్యానికి భరోసానిస్తున్నారు. వారికి ఉన్నటువంటి పోడు భూముల్లో నిత్యం పనులు చేసుకుంటూ ఆరోగ్యకరమైన పంటలకు ప్రాధాన్యమిస్తూ జీవన భృతిని కొనసాగిస్తున్నారు. సీతాఫలం, జామ, అర టి, పనస, అనాస, బొప్పాయి, మామిడి, జీడి వంటి పంటలను పండిస్తూ గ్రామ సమీపంలోని రహ దారి వద్ద విక్రయిస్తుంటారు. సహజ సిద్ధంగా పండి స్తున్న పంటలు కావడంతో రాహదారిలో రాకపోక లు సాగించేవారు అధికంగా కొనుగోలు చేస్తుంటా రు. అయితే ప్రభుత్వ సహకారం అందిస్తే మరిన్ని రకాలైన కమలా, బత్తాయి, దానిమ్మ, నిమ్మ లాంటి తోటలు పెంపకానికి అవకాశం ఉంటుందని అక్కడి గిరిజనులు చెబుతున్నారు. -
ఎరువుల కోసం టీడీపీ నేత ఇంటి వద్ద క్యూ
రైతులు క్యూ కట్టడం చూసి ఇదేదో ఎరువుల దుకాణం అనుకునేరు... కాదు.. సాక్షాత్తూ టీడీపీ నేత ఇల్లు. విషయమేమంటే... శ్రీకాకుళం జిల్లా కల్లేపల్లి గ్రామంలోని రైతు సేవా కేంద్రాల్లో పంపిణీ చేయాల్సిన ఎరువులను తన వారికి ఇచ్చేందుకు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నాయకుడు ఎం. శ్రీనివాసరావు ఇంట్లో పెట్టుకుని, తనకు అనుకూలంగా ఉన్న రైతులకు టోకెన్లు ఇచ్చి మరీ పంపిణీ చేశారు.వాటిపై ఆ శ్రీనివాసరావు సంతకం కూడా ఉంది. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది. పార్టీ పరంగా ఇంటికి పిలిపించుకుని అనుకూలమైన వారికి టోకెన్లు ఇవ్వడమేంటని కొందరు టీడీపీ నేతలను నిలదీశారు. ఈ విషయమై వ్యవసాయాధికారి నవీన్ను సంప్రదించగా కల్లేపల్లికి 333 బస్తాల ఎరువులు పంపామని, తమ సిబ్బంది సమక్షంలోనే అందించామంటూ బుకాయించారు. – శ్రీకాకుళం రూరల్ -
రక్త చిత్తరువు
రెండురోజుల ముందు చెప్పాలి ప్రస్తుత కాలంలో రక్తంతో తమ ఆత్మీయుల చిత్రాలు గీయించడానికి ఎందరో వస్తున్నారు. పెళ్లిళ్లకు, పుట్టిన రోజులకు ప్రత్యేక రోజుల్లో కేవలం తమ కుటుంబ సభ్యుల చిత్రాలను గీయిస్తున్నారు. అయితే రెండు రోజుల ముందుగానే చెప్పాలి. – డి.లాల్ప్రసాద్, చార్కోల్ ఆర్ట్ కళాకారుడు 1500 కుపైగా చిత్రాలు కొత్తగా చార్కోల్ ఆర్ట్ ద్వారా గీస్తున్న చిత్రాలకు మంచి గిరాకీ పెరిగింది. దీంతో తమ కుటుంబ సభ్యుల చిత్రాలను, ఆత్మీయుల చిత్రాలను గీయించుకునేందుకు ఔత్సాహికులు ఉత్సాహపడుతున్నారు. అలాగే తమ రక్తాన్ని ఇచ్చి తమ తల్లిదండ్రులు, భార్యాభర్తలు, పుట్టి న రోజు, పెళ్లిరోజు ఇలాంటి ప్రత్యేక రో జుల్లో చిత్రాలను గీయిస్తున్నారు. ఒక చిత్రం గీయడానికి రెండుగంటలు పడుతుంది. -
● స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం
ప్రజా జీవితంలో పరిశుభ్రతను భాగం చేసుకోవాలని, చెత్తను సంపదగా మార్చాలని కలెక్ట ర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం అంబేడ్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర అవార్డులు–2025 ప్రదానోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 95 శాతం ఇంటింటికీ చెత్త సేకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. అలాగే బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా 623 గ్రామాలను ప్రకటించామని, జిల్లాలో మొత్తం తొమ్మిది మానవ ఘన వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా రాష్ట్ర స్థాయిలో రెండు, జిల్లా స్థాయిలో 46 స్వచ్ఛ అవార్డులు లభించాయని కలెక్టర్ ప్రకటించారు. ప్రతి సచివాలయంలోనూ ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, పౌరుల నుంచి సేకరించిన కిలో చెత్తకు రూ.10 చెల్లిస్తామని తెలియజేసారు. అనంతరం రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన నేలబొంతు ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ బాలికల పాఠశాల, శ్రీ గౌరిశంకర మహిళా సమాఖ్యను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జిల్లా స్థాయిలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు స్వచ్ఛతకు ప్రాధాన్యతనిచ్చిన వారిని గుర్తించి మొత్తం 46 మందికి అవార్డులను ప్రదానం చేశారు. – అరసవల్లి -
సామాన్యుడి చేతికందించలేరా..?
● రేషన్లో అందని కందిపప్పు ● బియ్యం, చక్కెర మాత్రమే పంపిణీ ● ఉద్దానంలో కిడ్నీ రోగులకు అందని గోధుమలు, రాగులు వజ్రపుకొత్తూరు: రేషన్ సరుకుల జాబితా నుంచి కందిపప్పు కనుమరుగైపోయింది. ఇదివరకు రేషన్లో బియ్యం, చక్కెరతో పాటు కందిపప్పును కూడా చౌకధరకే అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కందిపప్పును పంపిణీ చేయడం ఆపేసింది. లబ్ధిదారులు అడిగిన ప్రతిసారి వచ్చే నెల వస్తుందని డీలర్లు చెప్పడం తప్ప ఇచ్చిన దాఖలా లేదు. పైగా అక్కడక్కడా రేషన్ షాపుల్లోనే ఏర్పాటు చేసిన దుకాణాల్లో కందిపప్పును విక్రయిస్తున్నారు. అదే కందిపప్పును రేషన్లో భాగంగా ఇస్తే ఇంకా తక్కువ రేటుకే అందించవచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం విక్రయానికే మొగ్గు చూపుతోంది. పౌష్టికాహారం ఎలా..? జిల్లాలో 6,60,730 తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో రేషన్ ద్వారా అందే సరుకులతోనే పేదవాడి కుటుంబం పౌష్టికాహారం పొందగలదు. ఆ ఉద్దేశంతోనే ఇదివరకు రేషన్లో కందిపప్పుతో పాటు గోధుమలు, రాగులు, వంట నూనె వంటివి కూడా కొన్నాళ్లు అందించారు. కూటమి వచ్చాక రేషన్ బియ్యం, చక్కెరకు మాత్రమే పరిమితమైంది. దీంతో సామాన్యులు అధిక ధరలకు మిగిలిన వాటిని కొనక తప్పడం లేదు. మరీ ముఖ్యంగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం రేషన్లో గోధుమ లు, రాగుల పిండి, వంటనూనె ఇవ్వాలని చాలాకాలంగా కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉన్నవి తీసేస్తోంది. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం, అధికారులు పేద, మధ్య తరగతులకు చెందిన కిడ్నీ బాధిత ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని ఉద్దానం వాసులు కోరుతున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులను దృష్టిలో ఉంచాలి ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులను దృష్టిలో ఉంచుకుని గోధుమలు, కందిపప్పు, వంట నూనెలను రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి. మా గ్రామంలో ఎక్కువ మంది కిడ్నీ రోగులు ఉన్నారు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో అత్యధిక మంది కిడ్నీ రోగులు ఉన్నందున తగిన నిర్ణయం తీసుకోవాలి. గత ప్రభుత్వం ప్రతి నెల కంది పప్పు అందించేది. కూటమి ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. – దున్న నాగేశ్వరరావు, యూఆర్కేపురం అధికారుల దృష్టికి తీసుకెళ్లాం ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు పంపిణీ చేయడం లేదు. కిడ్నీ రోగులకు గోధుమలు, రాగులు, వంట నూనెలు అవసరమే. వారి డిమాండ్ను అధికారుల దృష్టికి తీసుకెళతాం. – కె.రామారావు, సీఎస్డీటీ, వజ్రపుకొత్తూరు -
పాత జీతమే గతి
●పదోన్నతి.. ● పండిట్లకు జీతాలు లేని పదోన్నతులు ● మార్చిలో పదోన్నతులు పొందిన వారికి నేటికీ ఎస్జీటీ స్థాయి జీతాలే ● పోస్టులు అప్డేట్ చేయకుండా ఖజానా శాఖ అనుమతి లేకుండా పదోన్నతులు ● పండిట్లను మభ్యపెడుతున్న ప్రభుత్వం శ్రీకాకుళం: హిందీ పండిట్లకు పదోన్నతులు దక్కినా ఆ స్థాయి జీతం మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది మార్చి నెలలో 76 మంది హిందీ పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినా నేటికీ ఎస్జీటీ స్థాయి జీతాలే చెల్లిస్తున్నారు. ఐదు రోజుల కిందట మరో 87 మంది పండిట్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించినా వీరికి కూడా పెరిగిన జీతాలు అందే పరిస్థితి లేదు. వీరంతా డీఈఓ పూల్లో ఉంటూ ఎస్జీటీ పోస్టులో కొనసాగుతున్నారు. ఎక్కడ పని చేస్తున్న వారికి అక్కడే పదోన్నతులు కల్పించేలా ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ మేరకే జిల్లా స్థాయిలో ఉత్తర్వులు వెలువరించారు. ఖజానా శాఖ వద్ద ప్రస్తుతం వారు పనిచేస్తున్న ఎస్జీటీ స్థాయి సమాచారమే ఉండడంతో ఆ మేరకే జీతాలు చెల్లిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే.. వాస్తవానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పోస్టులను అప్డేట్ చేయాలి. కానీ అలా చేయకుండా పండిట్లను మభ్యపెడుతూ పదోన్నతులు కల్పించినట్లు ప్రచారం చేస్తున్నారు. 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పండిట్ పోస్టులను రద్దు చేసి, వారందరినీ స్కూల్ అసిస్టెంట్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు వెలువరించారు. ఆనాడే వీరందరి కేడర్ స్కూల్ అసిస్టెంట్ స్థాయిగా మారిపోయింది. అయితే జిల్లాలో అప్పటికి ఉన్న ఖాళీల మేరకు భర్తీలు జరిపి, మిగిలిన వారిని డీఈఓ పూల్లో ఉంచారు. పదవీ విరమణ ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో వీరిని భర్తీ చేయడం ద్వారా సమస్య పరిష్కరించే అవకాశం ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా మార్చి నెలలో కోర్టు ఆదేశాల మేరకు ఓ 76 మందికి పదోన్నతులు కల్పించగా, వారంతా ఎస్జీటీ పోస్టుల్లోనే ఉండడం వల్ల స్కూల్ అసిస్టెంట్ జీతాలు అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించకుండానే, తాజాగా మరో 87 మందికి పదోన్నతి చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. ఇది కేవలం పండిట్ల కంటి తుడుపు చర్య మాత్రమే తప్ప ఏ మాత్రం లబ్ధి చేకూరదు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రేషనలైజేషన్ చేసి పలు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను రద్దు చేసిన విషయం తెలిసిందే. అలా కాకుండా ఆయా పోస్టుల్లోనే పండిట్లకు పదోన్నతులు కల్పించి ఉంటే జీతాల సమస్య తలెత్తేది కాదు. మార్చిలో పదోన్నతులు పొందిన పలువురు పండిట్లు, స్కూల్ అసిస్టెంట్ జీతాల కోసం బిల్లులను ఖజానా శాఖకు దఖలు చేయగా దాన్ని తిరస్కరించినట్లు పలువురు పండిట్లే బహిరంగంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే మార్చి నెలలో పదోన్నతులు పొందిన పండిట్లకు ఇచ్చిన ఉత్తర్వుల్లో 2019 నుంచి వీరికి పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొంటూ, ఆ కాలాన్ని నేషనల్ సీనియారిటీగా పేర్కొని ఆ కాలానికి ఇంక్రిమెంట్లు కూడా మంజూరు చేసినట్లు పొందుపరిచారు. దీని ఆధారంగా కొందరు పండిట్లు స్కూల్ అసిస్టెంట్ జీతంతో పాటు ఎరియర్స్ మంజూరునకు సంబంధించిన బిల్లులను కూడా ఖజానా శాఖకు దాఖలు చేయగా వాటన్నింటినీ అన్ని మండలాల్లోనూ తిరస్కరించినట్లు సమాచారం. నా దృష్టికి రాలేదు మార్చిలో 76 మందికి తాజాగా 87 మందికి పండిట్ల నుంచి స్కూల్ అసిస్టెంట్కు పదోన్నతులు కల్పించాం. గతంలో పదోన్నతి పొందిన వారికి స్కూల్ అసిస్టెంట్ జీతాలు అందడం లేదనే విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పరిశీలన చేసి రాష్ట్రస్థాయికి నివేదిస్తాం. ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలోనే పరిష్కారమవ్వాల్సి ఉంటుంది. – రవిబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి -
అనకాపల్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
నరసన్నపేట: అనకాపల్లి జిల్లా మర్కాపురం మండలం భీమబోయినపాలెంలో ఈ నెల 9వ తేదీన జరిగే మెడికల్ కళాశాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుండగా.. ప్రజా వైద్య సేవలను కాపాడాలనే నినాదంతో ఈ నెల 9న మార్కాపురం మండలం భీమబోయిన పాలెంకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందర్శన కార్యక్రమం ఉంటుందన్నారు. వైద్య రంగాన్ని ప్రజా సేవా దృక్పథంతో కొనసాగించాలన్న డిమాండ్తో జరగబోయే ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై పర్యటనను విజయవంతం చేయాలని కృష్ణదాస్ కోరారు. శిశు గృహ, బాల సదన్ ఆకస్మిక తనిఖీ శ్రీకాకుళం పాతబస్టాండ్: అరసవల్లిలోగల శిశు గృహం, బాల సదనాన్ని సోమవారం జిల్లా న్యా య సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ గృహాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలించి, పిల్లల వసతి, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై సవివరంగా ఆరా తీశారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి ఆరోగ్య పరిస్థితులు, విద్యా అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆడ పిల్లలపై మరింత శ్రద్ధ చూపాలని, సమయానుసారంగా పౌష్టికాహారం అందించాలన్నారు. రూ.89 లక్షలతో వంతెనకు ప్రతిపాదనలు హిరమండలం: ఎల్ఎన్పేట దబ్బపాడు గ్రామం నుంచి సరుబుజ్జిలి మండలం పాతపాడు, తెలికపెంట మీదుగా జలుమూరు మండలం కొమనాపల్లి వెళ్లే రహదారిలో దబ్బపాడు వద్ద కనపలవానిగెడ్డపై రూ.89 లక్షలతో వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపినట్టు ఆర్అండ్బీ డీఈ సాగర్ తెలిపారు. ఎల్ఎన్పేట, సరుబుజ్జిలి, జలుమూరు మండలాలను కలుపుతూ ఉన్న రహదారి ఇది. ఇటీవల వర్షాలకు రహదారి కల్వర్టు పూర్తిగా దెబ్బతింది. దీంతో డీఈ సోమవారం పరిశీలించారు. వా హన రాకపోకలకు ఇబ్బంది కలగకుండా తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటుచేయాలని సిబ్బందికి సూచించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా బహిరంగ సభ రేపు పలాస: మందస మండలం గంగువాడ గ్రా మంలో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావులు సోమవారం తెలిపారు. అలాగే 9న బూర్జ మండలం మసానపుట్టిలో బలవంతపు భూ సేకరణకు వ్యతిరేకంగా బహిరంగ సభ ఉందని థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సురేష్దొర, ఎస్.సింహాచలం తెలిపారు. ఆంధ్ర ఉద్యమాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా నుంచి నంద్యాల జిల్లా వరకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని పేర్కొ న్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం అరసవల్లి: విజయవాడలో ఏపీ పీహెచ్సీ వైద్యుల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన మూడో రోజు నిరసనలో జిల్లాకు చెందిన పీహెచ్సీ వైద్యులు సోమవారం పాల్గొన్నారు. కోవిడ్ కష్టకాలంలో ప్రాణాలకు తెగించిన వైద్యుల సమస్యలపై సర్కార్ ప్రత్యేకంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలపై స్పందించి హక్కుల పత్రాలపై ఆమోదం లభించేవరకు నిరసనలు కొనసాగుతాయని స్పష్టం చేశా రు. కార్యక్రమంలో జిల్లా ప్రతినిధులు డాక్టర్ సుధీర్, ప్రతిష్టాశర్మ, సుమప్రియ, పావని, నవీన్, సాహితి, నాగేంద్ర, శ్రీనాథ్, మౌనిక, రమ్య, తేజ, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల అప్రమత్తతతో నష్ట నివారణ
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● పీజీఆర్ఎస్కు 104 వినతులు శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు అధికారులంతా అప్రమత్తంగా ఉండడంతో ఎటువంటి నష్టంజరగలేదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అభినందించారు. ప్లాస్టిక్ను నిషేధించేందుకు.. అధికారులంతా స్టీల్ వాటర్ బాటిల్ తీసుకొని రావాలన్నారు. తుఫాన్ల గూర్చి ముందుగానే సమాచారం ఉంటుందని, మూడు రోజులు ముందుగానే సమాచారం తెలియజేస్తే అందరూ జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారిని ఆదేశించారు. వ్యాపారులు హాజరవ్వాలి జీఎస్టీ 2.0పై ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న జీఎస్టీ ఎగ్జిబిషన్కు అధికారులతో పాటు వ్యాపారులు హాజరవ్వాలని కోరారు. వ్యవసాయ పనిముట్లు, మెడికల్ ఇన్సూరెన్సు, నోట్బుక్స్ తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయా శాఖల అధికారులు షెడ్యూల్ ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. వినతుల స్వీకరణ పీజీఆర్ఎస్లో భాగంగా మొత్తం 104 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ – 28, మున్సిపల్ కార్పొరేషన్ – 16, పంచాయతీ రాజ్ – 15, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ – 8, ఏపీఈపీడీసీఎల్ – 7, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ – 4, హౌసింగ్ – 3, వాటర్ రిసోర్సెస్ – 3, పౌర సరఫరాల శాఖ – 2, సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ – 2, వ్యవసాయ శాఖ – 2, ప్రజా రవాణా శాఖ – 2, విభిన్న ప్రతిభావంతులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు, సాంఘిక సంక్షేమ శాఖ, రూరల్ డవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి, ఎస్సీ కార్పొరేషన్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పోలీసు, మెడికల్ ఎడ్యుకేషన్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. కొన్ని వినతులు పరిశీలిస్తే... ● జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) ఆవరణలో జనరల్ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరిందని, దీని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని శ్రీకాకుళం స్టూడెంట్ యూనియన్ ప్రతినిధులు బోర గోపి, ముకుందరావులు కోరారు. ● గుజరాతీపేటలోని లక్ష్మీ టాకీస్ వెనుకనున్న ప్రాంతంలో ఎక్కువగా మురుగు నీరు రోడ్లుపైనే ఉంటోందని, కాలువలు ఏర్పాటు చేయాలని వి.కాళీప్రసాద్, జి.కృష్ణారావు తదితరులు కోరారు. ● పాలకొండ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు బుడితి అప్పలనాయుడు తదితరులు విన్నవించారు. ● ఎచ్చెర్ల సీడీపీవో పాపినాయుడు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాసరావుపై జేసీ విచారణ చేసి 15 రోజులు కావస్తున్నా ఐసీడీఎస్ పీవో ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని బాలామృతం ట్రాన్సుపోర్టు కాంటాక్టర్ పైడి వెంకటరమణ రెండోసారి ఫిర్యాదు చేశారు. ● రణస్థలం మండలంలోని తెప్పలవలస గ్రామానికి చెందిన మేడూరి సత్యనారాయణమూర్తి తనకు వారసత్వంగా సక్రమించిన గ్రామకంఠం భూమిని 15 సంవత్సరాల క్రితం తన కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేశాడు. అయితే ఆ భూమిని కొంతమంది వ్యక్తులు వీఆర్వో ధ్రువపత్రంతో అక్రమంగా వేరేవారికి అమ్మివేశారని, అందువలన తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. గ్రామం కంఠం భూమి క్రయవిక్రయాలకు వీఆర్వో ధ్రువపత్రం చెల్లదని, అయినా రిజిస్ట్రేషన్ చేశారని జేసీ వద్ద వాపోయారు. -
మాకు అదే పనేంటి..?
రణస్థలం: భజరంగ్ దళ్ జిల్లా కార్యదర్శి కె.కిరణ్కుమార్ శ్రీకాకుళం వైపు నుంచి ఎచ్చెర్ల జాతీయ రహదారి మీదుగా వ్యాన్లో ఆవుల ఆక్రమ రవాణా జరుగుతోందని జేఆర్పురం సీఐ అవతారంనకు కాల్ చేయగా ‘మాకు ఇప్పుడు అదే పనేంటి’ అని సీఐ మాట్లాడిన కాల్ రికార్డింగ్ను భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు సోషల్ మీడియాలో సోమవారం వైరల్ చేశారు. కాల్ రికార్డులో ఉన్న సారాంశం ప్రకారం ఫోన్ చేసిన వ్యక్తికి స్పందించిన సీఐ అవతారం మాట్లాడుతూ హలో ఎవరూ చెప్పండి అన్నారు. అవతల వ్యక్తి.. సార్ ఆవుల వ్యాన్ ఒకటి వస్తుందని అనగానే మాకు అదే పనేంటి ఇప్పుడు అని ఫోన్ కట్ చేశారు. దీనిపై సీఐ ఎం.అవతారం వివరణ కోరగా.. సాధారణంగా కంట్రోల్ రూమ్కు కాల్ చేయాలన్నారు. ఎచ్చెర్ల మండలంలోని ఫరీద్పేటలో రాత్రి 2 గంటల వరకు డ్యూటీ చేసి వచ్చి పడుకుంటే.. తెల్లవారుజామున 4 గంటలకు ఫోన్ చేసి ఆవులు వ్యాన్ వస్తుందని అన్నారు. అప్పటికే నిద్రమత్తులో ఉన్నా ఫోన్ లిప్ట్ చేశాను. జేఆర్పురం పోలీసులు పట్టుకుని చెక్ చేశారు. ఆ పశువులు అలమండ సంతకు రైతులు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. -
పీపీపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దళిత, ఆదివాసీ, బహుజన, మైనార్టీ సంఘాల జేఏసీ నాయకులు కోరారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ యువ నాయకుడు ధర్మాన రామ్మనోహరనాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను వైద్య విద్యకి దూరం చేసే విధానాలు ప్రభుత్వం విడనాడాలని కోరారు. ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించాలని విన్నవించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమని మండిపడ్డారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం, మెడికల్ కాలేజీల కోసం అవసరమైన నిధులు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తైక్వాండో శ్రీను, డా.కంఠ వేణు, ఎస్.వి.రమణ మాదిగ, మహిబుల్లా ఖాన్, అమిరుల్లా బేగ్, రౌతు శంకరరావు, బాడాప దేవభూషణరావు, గుండబాల మోహన్, ఎంఏ బేగ్, పొన్నాడ రుషి, ముంజేటి కృష్ణమూర్తి, యజ్జల గురుమూర్తి, వైశ్యరాజు మోహన్, గద్దెబోయిన కృష్ణారావు, నీలాపు ముకుందరావు, నల్లబారిక శ్రీను, పెయ్యల చంటి, అబ్బాస్, సింకు రమణ, అరిబారిక రాజు, నేతల అప్పారావు, కొత్తూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైతన్నా.. జాగ్రత్తన్నా..!
● పురుగు మందుల పిచికారీలో జాగ్రత్తలు అవసరం ● నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం అపూర్వ సహకారం పోలాకి: మండలంలోని కోడూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2002–03 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు శభాష్ అనిపించుకున్నారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి సాయం అందజేసి గొప్ప మనస్సు చాటుకున్నారు. దసరా సెలవులు పురస్కరించుకొని నాటి విద్యార్థులంతా సోమవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. దీనిలో భాగంగా అప్పటి గురువులను సత్కరించి తాము చదువుకున్న పాఠశాలలో భోజన శాల నిర్మించేందుకు రూ.2 లక్షల విరాళాన్ని హెచ్ఎం జి.శాంతికి అందజేశారు. దీంతో పూర్వ విద్యార్థులకు పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. జలుమూరు: ప్రసుత్త ఖరీఫ్ సీజన్లో వరి పైరుకి ఆశించే తెగుళ్లు, చీడపీడల నివారణలో రైతన్నల బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో పంటకు ఆశించే తెగుళ్ల నివారణే లక్ష్యంగా రైతులు పంట పొలాలకు యథేచ్ఛగా క్రిమి సంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. కానీ పిచికారీ చేసే సమయంలో భద్రతా చర్యలు తీసుకోవాలని.. లేకుంటే ప్రమాదంతో పాటు ప్రాణహాని సంభవించే అవకాశాలు కూడా ఉంటాయని మండల వ్యవసాయాధికారి కింజరాపు రవికుమార్ హెచ్చరించారు. ఈ మేరకు జాగ్రత్త చర్యలను తెలియజేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● మందు పిచికారీకి పరిశుభ్రమైన నీరు వినియోగించాలి. ● పిచికారీ చేసే ముందు నోరు, ముక్కు, కళ్లకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకోవాలి. ● తలకు టోపీ ధరించి, ముఖానికి ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. ● పురుగు మందులతో వచ్చిన సీసాలు, సంచులు ఇతర అవసరాలకు ఎట్టిపరిపరిస్థితిల్లోనూ వాడకూడదు. ● డబ్బాపై ఉన్న లేబుళ్లలో చూపినవిధంగా మందులు కలుపుకోవాలి. ● పురుగు మందులు కలిపినా, పిచికారీ చేసినా కళ్లజోడు ధరించాలి లేదంటే వాటి తుంపర్లు కళ్లలోకి వెళ్లే ప్రమాదముంది. ● ద్రావణాన్ని స్ప్రేయర్లలో పోసే ముందు, పొలాల్లో పిచికారి చేసే ముందు బీడి, చుట్ట, సిగిరెట్, ఖైనీ, గుట్కా, పాన్ మసాల వంటివి వినియోగించకూడదు. ● పురుగు మందుల డబ్బాను వాసన చూడకూడదు. ● భోజనానికి ముందు సబ్బుతో కాళ్లు, చేతులు కడుక్కోవాలి. ● పంటపై పిచికారీ చేసే సమయంలో స్ప్రేయర్ నాజల్ సక్రమంగా ఉందో లేదో చూసుకోవాలి. ● గాలి, ఎండ ఎక్కువగా ఉన్నప్పడు మందు ద్రావణాన్ని పిచికారీ చేయకూడదు. ● గాలికి వ్యతిరేక దిశలో కాకుండా వాలుగా ఉన్నప్పడు ద్రావణాన్ని పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటపై అక్క డక్కడ చీడపీడలు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పురుగు మందులను పిచికారీ చేసేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతు భరోసా కేంద్రాలు ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. అలాగే గోడ పత్రికలు కూడా రైతు సేవా కేంద్రాలకు అతికించాము. – కె.రవికుమార్, వ్యవసాయ అధికారి, జలుమూరు -
ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ గ్రీవెన్సుకు 36 వినతులు అందాయి. ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సకాలంలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. లేడీ రౌడీ షీటర్పై ఎస్పీకి ఫిర్యాదు శ్రీకాకుళం క్రైమ్: సరుబుజ్జిలి మండలంలోని మూలసవలాపురానికి చెందిన లేడీ రౌడీషీటర్, ఆమె అనుచరులపై అదే గ్రామానికి చెందిన కొంతమంది ఎస్పీ మహేశ్వరరెడ్డికి సోమవారం ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్సుకు వచ్చి తమ గోడు వెల్లబోసుకున్నారు. దందాలు, రౌడీయిజం, సారా, మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలు, భూ, ఇళ్ల స్థలాల కబ్జాలు జిల్లా నలుమూలలు చేస్తూ గ్రామ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని బ్యాంకర్స్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న జామి రమేష్ తరపున మధ్యవర్తి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నది ఈమె అనుచరులేనన్నారు. అర్ధరాత్రి ఇంటి యజమాని తంగుడు ఉపేంద్ర ఇంట్లో చొరబడి దౌర్జన్యానికి పాల్పడేందుకు యత్నించగా.. స్థానికులు దేహశుద్ధి చేయడంతో వెనుదిరిగారని తెలిపారు. అనేక పోలీస్స్టేషన్లలో వీరిపై కేసులున్నాయని పేర్కొన్నారు. ఫిర్యాదు ఇచ్చినవారిలో కె.ధనుంజయ, జి.మోహనరావు, ఎస్.వసంత్కుమార్, జి.శ్రీధర్ మరో 30 మందికి పైగా ఉన్నారు. కాగా వీరు ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే అవతలి వర్గం వాళ్లూ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అక్కడికి కొద్ది క్షణాల్లోనే టౌన్ డీఎస్పీ వివేకానంద, ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడు, జె.ఆర్.పురం సీఐ అవతారం ఎస్పీని కలిసేందుకు రావడం చర్చనీయాంశంగా మారింది. -
విద్యార్థుల ఆరోగ్యమే భవిష్యత్కు పునాది
కంచిలి: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్రెడ్డి కంచిలి/సోంపేట/మందస/టెక్కలి: విద్యార్థుల ఆరోగ్యం, ఆహార భద్రతే దేశ భవిష్యత్కు పునాది అని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సీహెచ్ విజయ ప్రతాప్రెడ్డి అన్నారు. సోమవారం పలు హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీలు, చౌక ధరల దుకాణాలను ఆకస్మికంగా ఆయన పరిశీలించారు. విద్యార్థులకు సక్రమంగా నాణ్యమైన భోజనం అందుతుందో లేదోనని తెలుసుకున్నారు. సోంపేట మండలంలోని వాడపాలేం వసతి గృహంలో విద్యార్థులకు వారానికి రెండు గుడ్లు అందజేస్తున్నారని విద్యార్థులు తెలపడంతో.. ఇన్చార్జి వార్డెన్ విజయలక్ష్మికి షోకాజ్ నోటీసులు అందజేయమని వెనుకబడిన తరగతుల జిల్లా సంక్షేమాధికారి బి.అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. వనతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనల మేరకు విద్యార్థులకు ఇచ్చే గుడ్ల సైజ్ ఉండాలని స్పష్టం చేశారు. స్టాక్ నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సుమోటోగా కేసులు నమోదు చేస్తామని వివరించారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయనతో పాటు డీఎస్వో సూర్యప్రకాశ్, ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీరాములు, తూనికలు కొలతల శాఖాధికారి పి.చిన్నమ్మి తదితరులు ఉన్నారు. -
వృథాగా వంశధార!
హిరమండలం: అప్పట్లో ప్రధాని పదవికి అవకాశం వచ్చినా తృణప్రాయంగా వదులుకున్నా.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ ప్రగల్భాలు పలుకుతుంటారు. నాడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న పరపతిని ఉపయోగించుకొని రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టూ తీసుకురాలేదు. కనీసం ఒడిశాతో జల వివాదాలను సైతం పరిష్కరించలేదు. నాటి ఒడిశా పాలకపక్షం బీజేడీ భాగస్వామ్య పార్టీ అయినా చొరవచూపలేదు. ఇప్పుడు కూడా అక్కడ తమ మిత్రులైన బీజేపీ ప్రభుత్వం ఉన్నా సీఎం చంద్రబాబు చొరవ చూపించడం లేదు. జిల్లా కూటమి నేతలు దృష్టిపెట్టిన దాఖలాలు లేవు. ఫలితంగా ఇప్పటికీ వంశధారకు సంబంధించి జల వివాదం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి శాపంగా మారుతోంది. ప్రత్యేక దృష్టి.. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారు. ఒడిశాతో జల వివాదాలు పరిష్కరించుకోవడానికి సిద్ధమయ్యారు. వంశధార నదీ జలాల వినియోగ వివాదాన్ని ఇరు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించుకోవాలని వంశధార ట్రైబ్యునల్ ఆదేశించిన నేపథ్యంలో 2022లో అప్పటి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు లేఖ రాశారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సామరస్యపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకుందామని లేఖలో పేర్కొన్నారు. నేరుగా నవీన్తో చర్చలు జరిపారు. నేరడి విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో రెండు చోట్లా ప్రభుత్వాలు మారిపోయాయి. ఇరు రాష్ట్రాల్లో రెండు అనుకూల ప్రభుత్వాలు వచ్చినా నేరడి విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. ప్రతిపాదనలతో సిద్ధం.. నేరడి జలాశయం నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.650 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించింది. కానీ ఒడిశా అభ్యంతరాలు, నిర్మాణ ప్రాంతం రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాంతం కావడంతో అడుగు ముందుకు పడడం లేదు.న ఇక్కడ బ్యారేజీ నిర్మించాలంటే ఒడిశా భూభాగం పరిధిలోని 106 ఎకరాలను ఏపీకి అప్పగించాలి. ఈ విషయంలో వంశధార ట్రైబ్యునల్ ఆదేశాలను సైతం ఒడిశా తుంగలో తొక్కింది. కేంద్ర జల సంఘం అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేయాలన్న సూచనలను బేఖాతరు చేసింది. సహాయ నిరాకరణతో బ్యారేజీ నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ వచ్చింది. అందుకే అప్పటి సీఎంగా ఉన్న జగన్మోహన్రెడ్డి లేఖ రాయడమే కాకుండా.. నేరుగా అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ను కలిసి సమస్యలపై చర్చించారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అటువంటి ప్రయత్నం చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. నాడే ఒప్పందం జరిగినా.. వాస్తవానికి నేరడి బ్యారేజీ నిర్మాణానికి 1961లో ఒప్పందం కుదిరింది. సాధారణంగా వంశధారలో 115 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. ఏపీ, ఒడిశాలు సమానంగా నీటిని పంచుకోవాలన్నది ఒప్పందం. కానీ వంశధారపై నీటి ప్రాజెక్టులు నిర్మిస్తే నీటి వినియోగం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం తెరపైకి వచ్చింది. కానీ ఒడిశా అడుగడుగునా అడ్డంకులు సష్టించడంతో ఏపీ ప్రత్యామ్నాయ ప్రాజెక్టులపై దృష్టిపెట్టింది. అందులో భాగంగానే హిరమండలం వద్ద గొట్టా బ్యారేజీ నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు జిల్లాలో సగం మండలాలను సస్యశ్యామలం చేస్తోంది. కానీ వంశధారలో వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ఈ నేపథ్యంలో 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి వంశధార మిగులు జలాలపై దృష్టిసారించారు. అదే సమయంలో ఒడిశాతో జల వివాదం నడుస్తుండడంతో ప్రత్యామ్నాయంగా వంశధార ఫేజ్–1 నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కేవలం వరద నీటి మళ్లింపుతో చేపట్టిన ఈ పథకం నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. కానీ నేరడి ప్రాజెక్టుకు మాత్రం ముందుకు అడుగుపడలేదు. ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్రెడ్డి ఒకవైపు ఒడిశాతో జల వివాదం పరిష్కరించుకుంటూనే.. గొట్టా బ్యారేజీలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి నీటిని వంశధార రిజర్వాయర్లోకి మళ్లించే చర్యలు చేపట్టారు. వంశధార ఫేజ్–2 పథకం నిర్మాణం పూర్తయితే 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు అదనంగా నీరందే అవకాశముంది. నేరడి ఊసెత్తని చంద్రబాబు సర్కారు ఒడిశాలో అనుకూల ప్రభుత్వం ఉన్నా పట్టించుకోని వైనం సరిహద్దు జలాల సమస్యకు కలగని మోక్షం అప్పట్లో ఎంతో చొరవచూపిన జగన్మోహన్రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. ఏపీలో కూటమి, ఒడిశాలో బీజేపీ ఒకేసారి అధికారంలోకి వచ్చాయి. కేంద్రంలోని ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామి. ఏపీలోనూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అయినప్పటికీ పొరుగున ఉన్న ఒడిశాతో జల వివాదానికి మాత్రం పరిష్కారం చూపలేకపోతోంది. 8 ఏళ్ల కిందట గ్రీన్సిగ్నల్ వాస్తవానికి నేరడి బ్యారేజీ నిర్మాణానికి వంశధార ట్రైబ్యునల్ ఎనిమిది ఏళ్ల కిందట అంగీకరించింది. 2017 సెప్టెంబరు 13న తీర్పును వెలువరించింది. నాటి ప్రభుత్వం తగిన రీతిలో స్పందించకపోవడం, ఒడిశాకు దీటుగా పోరాడకపోవడంతో ఎలాంటి అడుగుపడలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదలిక వచ్చింది. ఒకవైపు ఒడిశాను అభ్యర్థిస్తునే మరోవైపు న్యాయపోరాటానికి సన్నద్ధమైంది. నేరడి బ్యారేజీ నిర్మాణానికి అవసరమైన ఒడిశా పరిధిలోని 106 ఎకరాల భూమిని అప్పగించాలని కోరారు. ఏకంగా భువనేశ్వర్ వెళ్లి సీఎం నవీన్ పట్నాయక్ను కలిశారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటుతున్నా కనీస ప్రయత్నాలు చేయడం లేదు. అలాగని గొట్టా బ్యారేజీలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయడం లేదు. -
ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు
మెళియాపుట్టి: మండలంలోని గంగరాజపురం గ్రామానికి చెందిన యువకుడు గూడపు చంటి(29) విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామంలోని మున్నాజెన్నా అనే వ్యక్తి ఇంటిపై చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలకు తగిలి ఉండడంతో ఒడిశాలోని జంగాలపాడు గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు మృతుడు చంటిని ఆ కొమ్మలు తొలగించడానికి సాయంగా రమ్మన్నాడు. దీంతో విద్యుత్ సరఫరా ఉండగానే చెట్టు కొమ్మలను చంటి తొలగిస్తుండగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అక్క దమయంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. తల్లిదండ్రులు కొద్దికాలం క్రితమే మృతి చెందారు. అతడు విజయవాడలోని ఒక ప్రైవేట్ కంపెనీలో వెల్డింగ్ కార్మికునిగా పనిచేసేవాడు. ఇటీవల వినాయక చవితికి గ్రామానికి వచ్చాడు. మంగళవారం విజయవాడ బయల్దేరి వెళ్లడానికి సిద్ధమవ్వగా.. ఇంతలో ప్రమాదం చోటుచేసుకోవడంతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతి కంచిలి: మండలంలోని గొల్ల కంచిలి నుంచి కంచిలి వెళ్లేమార్గంలో మఠం చెరువు సమీపంలో రైల్వేట్రాక్పై సుమారు 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయాన్ని పలాస జీఆర్పీ పోలీసులు సోమవారం గుర్తించారు. ప్రమాదంలో మృతుని ముఖం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. మృతుడి శరీరంపై ఆరెంజ్, తెలుపు రంగు కలిగిన గడుల తువ్వాలు మాత్రమే ఉందని తెలిపారు. మరిన్ని వివరాలకు 94406 27567, 99891 36143 నంబర్లను సంప్రదించాలని కోరారు. తప్పిన పెను ప్రమాదం జి.సిగడాం: మండలంలోని మర్రివలస పంచాయతీ మానంపేట గ్రామంలో ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో విద్యుత్ తీగ తెగిపడిన సమయంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన బాడిత కనకలక్ష్మికి చెందిన ఆవుకు విద్యుత్ తీగ తగలడంతో మృత్యువాత పడింది. ఇదే సమయంలో కనక లక్ష్మికి సైతం విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురయింది. వెంటనే గ్రామస్తులు అప్రమత్తమై కర్రలతో విద్యుత్ తీగను తొలగించారు. అనంతరం ఆమెను హుటాహూటిన రాజాం అస్పత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది. వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ మానంపేట మీదుగా ఉండడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి వ్యవసాయ కోసం ఏర్పాటు చేసిన లైన్లు మార్చాలని కోరుతున్నారు. ద్విచక్ర వాహనం దొంగకు జైలు శిక్ష నరసన్నపేట: ద్విచక్ర వాహనం దొంగతనం కేసులో సారవకోట మండలం బుడితికి చెందిన కొర్ల శివకు ఆరు నెలల జైలుశిక్ష, రూ.500ల జరిమానాను నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వాణి విధించారు. వివరాల్లోకి వెళ్తే.. ఎచ్చెర్ల మండలం యాతపేటకు చెందిన సోడి పైడిరాజు ద్విచక్ర వాహనం నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పార్క్ చేయగా చోరీకి గురైంది. ఈ మేరకు ఈ ఏడాది మే 30న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం కొర్ల శివను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చార్జిషీట్ పోలీసులు వేయగా, నరసన్నపేట జూనియర్ సివిల్ జడ్జి విచారణ చేపట్టారు. సోమవారం కొర్ల శివను దొంగగా నిర్ధారించి జైలుశిక్ష ఖరారు చేశారు. కేసులో ఏపీపీగా శాంతి సంతోషి వ్యవహరించారు. ఈ మేరకు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. మహిళ ఆత్మహత్య పలాస: మందస మండలం మఖరజోల గ్రామ పంచాయతీ పరిధి అల్లిమెరక కాలనీలో నివాసముంటున్న కొండ కురమ్మ (22) సోమవారం పలాస మండలం రంగోయి గేటు సమీపంలోని ఒక జీడి తోటలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కురమ్మ తల్లి గాది పద్మ, కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కురమ్మ భర్త చంద్రశేఖర్ కత్తర్కు వలస కూలీగా గతేడాది వెళ్లాడు. కురమ్మకు కడుపులో నొప్పి ఉంది. ఇటీవల సోంపేట మండలం జురాబంద గ్రామంలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లింది. కడుపులో నొప్పి ఉందని చెప్పడంతో సోంపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. కన్నవారి ఇంటి నుంచి వచ్చిన కురమ్మ ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి పద్మ ఫిర్యాదు మేరకు కాశీబుగ్గ ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి భర్తతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆపద అంటే ఆ..పద అంటూ
టెక్కలి: యువతలో సామాజిక దృక్పథం పెరుగుతోంది. సెల్ఫోన్ వదలడం లేదని, ఉత్తి పుణ్యానికే సహనం కోల్పోతున్నారని, వయసుకు తగ్గ పరిపక్వత ఉండడం లేదని యువకులపై వస్తున్న విమర్శలను తాజా వరద కడిగి పారేసింది. జిల్లాను ముంచెత్తిన వరదలకు యువత అడ్డుగా నిలబడ్డారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ స్ఫూర్తి రగిలించారు. అత్యవసర సమయాల్లో అధికార యంత్రాంగం కోసం ఎదురు చూడకుండా వారే సేవకులుగా మారుతున్నారు. ఇటీవల తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలో వంశధార, మహేంద్రతనయ, నాగావళి, బాహుదా వంటి నదులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో చెరువులు, గెడ్డలు, వాగులు పొంగి పొర్లి గ్రామాల్లోకి వరద నీరు చేరి భయానక పరిస్థితులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో వివిధ చోట్ల వరదల్లో చిక్కుకున్న వారికి తమకు తోచిన విధంగా స్థానిక యువత సేవా కార్యక్రమాలను చేపట్టారు. నందిగాం మండలం ఉయ్యాలపేట గ్రామం వద్ద ఓ వృద్ధుడికి అత్యవసరంగా వైద్య సేవలు అవసరం కావడంతో స్థానిక యువత వరద నీటి నుంచి ఆ వృద్ధుడిని రక్షించింది. అలాగే జలుమూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో కూలిపోయిన ఇంటి నుంచి వృద్ధులను స్థానిక యువకులే కాపాడారు. జి.సిగడాం మండలం ధవళపేట వద్ద రోడ్డుకు అడ్డంగా పడిపోయిన చెట్టును అక్కడి వారే తొలగించారు. వజ్రపుకొత్తూరు మండలం శివరాంపురం గ్రామంలో వరద నీటి నుంచి తాడు సాయంతో గ్రామస్తులను తరలించారు. విపత్తుల సమయాల్లో అధికారుల కోసం ఎదురు చూడకుండా ప్రాణాలు ఫణంగా పెట్టి సాయం అందజేస్తూ పలువురు ప్రశంసలు పొందుతున్నారు. ఆపద అంటే ఆ..పద అంటూ యువత నిండు గుండెతో స్పందిస్తున్నారు. ఆపత్కాలంలో ఆపద్బాంధవుల్లా వ్యవహరిస్తున్నారు. నీరు, కన్నీరు కలిసి ప్రవహించిన వరదకు ఎదురొడ్డి నిలబడుతున్నారు. కష్టంలో తడిచిన బతుకులకు భుజాన్ని సాయంగా అందిస్తున్నారు. అధికారుల కోసమో, నాయకుల కోసమో ఎదురు చూడకుండా తాము స్వయంగా రంగంలోకి దిగి సేవ అనే పవిత్ర యాగాన్ని కొనసాగిస్తున్నారు. ఆదుకునే మనసు ఉండాలి విపత్తులు, ప్రమాదాలు సంభవించే సమయాల్లో ప్రతి గ్రామంలో యువత సాయం చేయడానికి ముందుకు రావాలి. అధికారులు వస్తారని ఎదురుచూడకుండా తక్షణ సాయం చేయాలి. మా గ్రామంలో యువకులంతా అదే పని చేశాం. గ్రామానికి రాకపోకలు నిలిచిపోయే విధంగా వరద నీరు పోటెత్తిన సమయంలో ఓ వృద్ధుడికి అత్యవసరంగా వైద్య సేవలు అవసరమయ్యాయి. అంతా కలిసి అతడిని ఆస్పత్రికి తరలించాం. – రెళ్ల అప్పారావు, ఉయ్యాలపేట, నందిగాం మండలం. యువతలో పెరుగుతున్న సేవాభావం విపత్తుల వేళ స్వచ్ఛందంగా చేయూత వరద సమయాల్లో అత్యవసర సాయం అధికారుల కోసం ఎదురుచూడకుండా రంగంలోకి దిగుతున్న వైనం -
సొంత నిధులు వెచ్చించి..
జి.సిగడాం: తుఫాన్ వర్షాలకు శ్రీకాకుళం–రాజాం ప్రధాన రహదారిలో సంతవురిటి గ్రామ సమీపంలో భారీ వృక్షం రోడ్డుపై పడిపోవడంతో సుమారుగా 2 గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులు గమనించిన వైఎస్సార్సీపీ నాయకుడు, ధవళపేట సర్పంచ్ వడిశ మహేశ్వరరావు సొంత నిధులతో యంత్రాలను ఏర్పాటు చేసి చెట్టును తొలగించా రు. విషయం తెలుసుకున్న ఎస్ఐ వై.మధుసూదనరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరు కుని ట్రాఫిక్ క్లియర్ చేశారు. మహేశ్వరరావును ఎస్ఐతోపాటు సంతవురిటి సర్పంచ్ బుడారి లక్ష్మణరావు, మాజీ ఎంపీపీ బాలబొమ్మ వెంకటేశ్వరరావు, బీసీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వాండ్రంగి వెంకటేష్ అభినందించారు. ప్రయాణికుల కష్టాలు చూశాను.. వానలో ప్రయాణికుల కష్టాలు కళ్లారా చూశాను. చిన్నపిల్లలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని నా సొంత నిధులతో యంత్రాలను తెప్పించి చెట్టును తొలగించాం. నాకు ఇలాంటి సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. – వడిశ మహేశ్వరరావు, సర్పంచ్, దవళపేట, జి.సిగడాం -
క్రీడాకారులకు ఉపకారం
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిభ కలిగిన నిరుపేద క్రీడాకారులకు బాసటగా నిలవాలని ఓఎన్జీసీ సంస్థ మరోసారి నిర్ణయించింది. ఓఎన్జీసీ క్రీడా స్కాలర్షిప్ పథకం కింద 2025–26 సంవత్సరానికి గాను వెనుకబడిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు స్కా లర్షిప్లను అందజేయాలని నిర్ణయించించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను తాజాగా విడుదల చేశారు. ఓఎన్జీసీ స్కాలర్షిప్ను 21 క్రీ డాంశాల్లో సట్–జూనియర్స్, జూనియర్స్ బాలబాలికలకు, సీనియర్స్ పురుషులు, మహిళా క్రీడాకారులకు వర్తింపజేయనున్నారు. ఎంపికై నవారికి నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు క్రీడాస్కాలర్షిప్లను అందజేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రావీణ్యత, అర్హత కలిగిన 250 మంది ప్లేయ ర్స్ను ఈ స్కాలర్షిప్లను అందించనున్నారన్నారు. ఎవరు అర్హులంటే.. ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసేందుకు 15 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలబాలికలు అర్హులు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. నిర్దేశించిన 21 క్రీడాంశాల్లో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెంది, ప్రతిభావంతులైన క్రీడాకారులు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ఓఎన్జీసీ వెబ్సైట్ స్పోర్ట్స్స్కాలర్షిప్.ఓఎన్జీసీ.కో.ఇన్లో అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఓఎన్జీసీ స్కాలర్షిప్లు అక్టోబర్ 21లోగా దరఖాస్తులకు అవకాశం ఎంపికై తే నెలకు రూ.15వేలు నుంచి రూ.30వేల వరకు ఉపకార వేతనం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తుల స్వీకరణ గొప్ప అవకాశం ప్రతిభ కలిగిన నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువ క్రీడాకారులకు ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. జిల్లాలో ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్నారు. ఓఎన్జీసీ వెబ్పోర్టల్లో స్కాలర్షిప్ పథకం వివరాలతో పాటు నియమ నిబంధనలు, షరతులను గ్రహించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ కె.శ్రీధర్రావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి -
విస్తృత స్థాయి సన్నద్ధత
కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు కుంభా రవిబాబు, పిరియా విజయ, చింతాడ రవికుమార్, పేరాడ తిలక్, పిరియా సాయిరాజ్, కేవీజీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ నర్తు రామారావు, గొర్లె కిరణ్కుమార్వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం విశాఖ జిల్లా ఆనందపురంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగింది. పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా నుంచి నాయకులంతా హాజరయ్యారు. – విశాఖపట్నం -
జిల్లా అండర్–18 సెపక్తక్ర జట్ల ఎంపికలు రేపు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి అండర్–18 బాలబాలికల సెపక్తక్ర జట్ల ఎంపికలు ఈనెల 7వ తేదీన జరగనున్నాయని శ్రీకాకుళం జిల్లా సెపక్తక్ర అసోసియేషన్ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ ఎంపికలు మంగళవారం ఉదయం 9 గంటలకు శ్రీకాకు ళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో సెలక్షన్ ట్రయల్స్ జరుగుతాయని చెప్పారు. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలబాలిక లు 18 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని పేర్కొ న్నారు. ఇక్కడ ఎంపికై న జిల్లా జట్లను ఈనెల 11, 12 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాల వేదికగా జరగనున్న ఏపీ రాష్ట్రస్థాయి సెపక్తక్ర చాంపియన్షిప్–2025 పోటీలకు పంపించనున్నట్టు ఎమ్మెస్సార్ వెల్లడించారు. ఎంపికలకు హాజర య్యే క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్కార్డు, నాలుగు పాస్ఫొటోలను తమ వెంట తీసుకురావాలని కోరారు. మరిన్ని వివరాలకు కోచ్ జి.అర్జున్రావురెడ్డి (సెల్: 9949291288)ని సంప్రదించాలని సూచించారు. వంశధార మెయిన్ కాలువ గట్టుకు గండి నందిగాం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బెజ్జిపల్లి పంచాయతీ సింగుపురం సమీపంలో వంశధార ఎడమ ప్రధాన కాలువ 73వ కిలోమీటరు వద్ద భారీ గండి పడింది. దీంతో కాలువలోని నీరు కిందనున్న పంటపొలాలను ముంచేసింది. ఆదివారం వంశధార డీఈఈ శేఖర్రావు ఆధ్వర్యంలో గండిని పూడ్చే కార్యక్రమం చేపట్టారు. అయితే మదనగోపాలసాగరం నుంచి నీరు అధికంగా వస్తుండటంతో కాలువలోని నీటిని డైవర్ట్ చేయడానికి వీలు కావడం లేదు. వంశధార కాలువలు 51, 52, 53, 54లను తెరిచి నీటిని విడిచిపెట్టినప్పటికీ ఉద్ధృతి ఆగలేదు. సోమవారం సాయంత్రానికి గండిని పూడ్చేలా చర్యలు తీసుకుంటామని డీఈఈ శేఖర రావు తెలిపారు. ‘కార్మిక సమస్యలు పరిష్కరించాలి’ సోంపేట: కార్మిక వర్గ సమస్యల పరిష్కారానికి పోరాడే సంస్థ సీఐటీయూ అని ఆ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. సోంపేటలో సీఐటీయూ జిల్లా మహాసభల ముగింపు వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుంచి గాంధీ మండపం వరకు ర్యాలీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు అధ్యక్షతన బహిరంగ సభ జరిగింది. సభలో నర్సింగరావు మాట్లాడుతూ అంగన్వా డీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. మందసలో జీడి పరిశ్రమ యాజమాన్యాలు కార్మికులకు పని కల్పించకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మిక చట్టాలు అమలు చేయకుంటే ధర్నా చేస్తామన్నారు. సీఐటీయూ రాష్ట్రకార్యదర్శి ఆర్కేఎస్ఏ కుమా ర్, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు మాట్లాడుతూ పనిగంటలు పెంచుతూ ఆమోదించిన చట్టాన్ని రద్దు చేయాలన్నారు. నూతన జిల్లా కమిటీ.. సభలో భాగంగా నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సీహెచ్ అమ్మన్నాయుడు, ప్రధాన కార్యదర్శిగా పి.తేజేశ్వరరావు, కోశాధికారిగా అల్లు సత్యనారాయణను ఎన్నుకున్నారు. -
ఐదు గంటల శ్రమ
ఎవరూ ఆదుకోలేదు మా గ్రామానిది దుర్భర పరిస్థితి. ఎప్పుడు వరద వచ్చినా బెండి గెడ్డ ఉప్పుటేరు వల్ల గ్రామం మునుగుతుంది. గ్రామం చుట్టూ రొయ్యిల చెరువులు నిర్మించడంతో వరద గ్రామంపై పడింది. దీంతో దీంతో 20 మంది యువకులం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తాడుతో వరదలో చిక్కుకున్న జనాలను తరలించాం. వరద నీటిలో వృద్ధులు నడవలేక అవస్థలు పడ్డారు. ఒకరైతే కొట్టుకుపోయేవారే. చిన్నారులు, గర్భిణులు చాలా బాధపడ్డారు. – ఇప్పిలి తిరుపతి, యువకుడు, శివరాంపురం, వజ్రపుకొత్తూరువజ్రపుకొత్తూరు: చినుకులు సూదుల్లా గుచ్చుతున్నా, వాన దంచి కొడుతున్నా శివరాంపురం యువత చలించలేదు. విజయదశమి రోజు కురిసిన కుండపోత వర్షానికి ఊరికి బయట ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. దీంతో గ్రామానికి చెందిన ఇప్పిలి తిరుపతి, రమేష్, ఎరకారావు, లక్ష్మణరావు, దట్టి వాసుదేవరావుతో పాటు సుమారు 20 మంది వరకు యువకులు ఆ వరద నీటిలో ఐదు గంటల పాటు తాడు పట్టుకుని నిత్యావసరాలు తెచ్చుకునేలా, అవసరమైన వారు రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు. తమ గ్రామానికి పూండి గళ్లీ రహదారి నుంచి పక్కా రహదారి నిర్మించాలని ఎంతమందిని విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు తెలిపారు. -
7న పోరుబాట
శ్రీకాకుళం: ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 7న నిర్వహించనున్న పోరుబాట ధర్నా విజయవంతం చేయాలని పలు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని ఎన్జీవో హోంలో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోధన, బోధనేతర, ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ఫ్యాప్టో భాగస్వామ్య సంఘాలు ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి విజయవాడలో జరిగే ధర్నాకు తరలివచ్చేలా చొరవ తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వ ఏర్పడి 14 నెలలు కావస్తున్నా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని చెప్పారు. సమావేశంలో ఫ్యాప్టో కార్యదర్శి ప్రతాప్, ఏపీటీఎఫ్ నాయకుడు వెంకటేశ్వర్లు, నాయకులు గరుగుబిల్లి రమణ, శీర రమేష్బాబు, రామ్మోహన్ పాల్గొన్నారు.జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం -
ఇలా కట్టారు..అలా కూలింది..
● కాలువ పనుల్లో బయటపడిన డొల్లతనం ● కానరాని అధికారుల పర్యవేక్షణ టెక్కలి: కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులపై అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి పది కాలాల పాటు ఉండాల్సిన నిర్మాణాలు రోజుల వ్యవధిలోనే కూలిపోతున్నాయి. టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో మండపొలం కాలనీ వద్ద పాత జాతీయ రహదారికి ఆనుకుని చేపడుతున్న మురుగు నీటి కాలువ నిర్మాణంలో నాణ్యత లేని పనుల డొల్లతనం బయటపడింది. సుమారు రూ.1.98 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఈ కాలువ నిర్మాణం చేపడుతున్నారు. ఓవైపు పనులు చేస్తుండగానే మరో వైపు కాలువ గోడలు కూలిపోతున్నాయి. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో కాలువ నిర్మాణాలు చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కొంత మంది కార్యకర్తలు ఈ పనులు చేస్తుండడంతో అధికారులు తమకేమీ పట్టనట్లుగా కనీసం పర్యవేక్షణ చేయడం మానేశారు. దీంతో కాలువ పనులు మున్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్గా మోహన్సాయినాథ్
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2025 పోటీలకు టెక్నికల్ అఫీషియల్ (లైన్ జడ్జి)గా ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం గ్రామానికి చెందిన సంపతిరావు మోహన్సాయినాథ్ నియామకమయ్యారు. ఈ పోటీలు అసోంలోని గౌహతి వేదికగా ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. ఈయన అంతర్జాతీయ క్వాలిఫైడ్ రిఫరీ, శ్రీకాకుళం జిల్లా బాడ్మింటన్ సీఈఓ సంపతిరావు సూరిబాబు కుమారుడు. తండ్రీకొడుకు లు ఇద్దరూ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు అంపైర్లగా నియామకం కావడం విశేషం. నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీ దారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. -
చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతం చేయాలి
శ్రీకాకుళం: చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు, ఎడ్యుకేషన్ సబ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సమావేశం శ్రీకాకుళంలోని యూటీఎఫ్ భవన్లో గొంటి గిరిధర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులలో శాసీ్త్రయ దృక్పథం, తార్కిక హేతుబద్ధ ఆలోచనలు, సృజనలను ప్రోత్సహించే జనవిజ్ఞాన వేదిక చెకుముకి సైన్సు సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా హెడ్మాస్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎర్నాగుల వాసుదేవరావు, ఫిజికల్ సైన్న్స్ టీచర్స్ ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎస్.సాయి శ్రీనివాస శర్మ, ఏపీ జీవశాస్త్ర ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి గోవిందరావు, ఏపీ మ్యాథ్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు కందుల అశోక్, ఫిజికల్ సైన్స్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి పైల రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి సంఘ నాయకులు కె.ఎ.రాములు, డాక్టర్ వైష్ణవిలను సన్మానించారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొడ్డేపల్లి మోహనరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పి.కూర్మారావు, జిల్లా నాయకులు హనుమంతు మన్మధరావు, ఆర్.సురేష్బాబు, పి.వేదవతి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి, రాష్ట్ర కౌన్సిలర్ పొందూరు అప్పారావు, జిల్లా సహాధ్యక్షులు బి.ధనలక్ష్మి, జిల్లా కార్యదర్శి ఎస్.స్వర్ణకుమారి, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పి.జగదీశ్వరరావు, సీహెచ్ రాజు, ఆర్.స్వప్న, ఎస్.సులోచన రాణి, కె.తుషార కన్య, సీహెచ్ సుబ్బలక్ష్మి, జి.కృష్ణవేణి, యూ.గిరిబాబు, పి.సూర్యప్రభ తదితరులు పాల్గొన్నారు. -
గుండెల్లో గుబులు!
మాస్టర్ ప్లాన్తో.. 2017లో తయారుచేసిన శ్రీకాకుళం మాస్టర్ ప్లాన్కు తాజాగా ఆమోదం 150 అడుగుల రింగ్ రోడ్డుతో పలు ఆస్తులకు ముప్పు 2047 వరకు నిర్మాణాలు, అమ్మకాలు జరపలేని పరిస్థితి! శ్రీకాకుళం: జిల్లా కేంద్రంలో మాస్టర్ ప్లాన్ కలకలం రేగింది. పెదపాడు నుంచి అరసవల్లి, కాజీపేట, 80 అడుగుల రోడ్డు, పొన్నాడ వంతెన మీదుగా నవభారత్ జంక్షన్ వరకు 150 అడుగుల రోడ్డుకు 2017లో మాస్టర్ ప్లాన్ రూపొందించారు. కొన్ని కొన్ని సవరణలు చేస్తూ 2020లో ప్రభుత్వానికి నివేదించారు. అటు తర్వాత ఈ మాస్టర్ ప్లాన్ పెండింగ్లో ఉండిపోయింది. తాజాగా కూటమి ప్రభుత్వం ఈ ప్లాన్కు ఆమోదిస్తూ 2020 నుంచి 2047 వరకు ఈ ప్లాన్ లో పొందుపరిచిన రోడ్డు పరిధిలో ఉన్న స్థలాల్లో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఉండవని, ఆ పరిధిలో ఉన్న స్థలాలను రోడ్డు కోసం సేకరిస్తామని చెబుతూ ఉత్తర్వులు వెలువడించడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే విషయమై చర్చ జరుగుతోంది. వాస్తవానికి ఇటువంటి మాస్టర్ ప్లాన్ ఆమోదించే ముందు సాధ్యసాధ్యాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే కూటమి ప్రభుత్వం ఆమోదించేసింది. ఇప్పుడు ఈ ప్లాన్ అమలు చేయాలంటే 2023లో నిర్మాణానికి అనుమతించిన 80 అడుగుల రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి పాక్షికంగా, ఆ పక్కనే నిర్మితమైన అపార్ట్మెంట్లో సగానికి పైభాగం కూల్చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రాంతంలోని ఓ లేఔట్లో మూడు అపార్ట్మెంట్లు సైతం కూల్చాల్సిన పరిస్థితి. ఇక్కడే ఉన్న పెద్దమ్మతల్లి, రామ మందిరం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. పెదపాడు నుంచి పొన్నాడ వంతెన వద్ద వచ్చే వరకు పలు భవనాలను కూడా ప్రభుత్వం సేకరించి రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన పరిధిలో ఉన్న స్థలాల్లో 2047 వరకు నిర్మాణాలు చేసే పరిస్థితి ఉండదు. అటువంటి అప్పుడు నగరపాలక సంస్థ అధికారులు లేఅవుట్లకు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి ఎలా అనుమతులు ఇచ్చారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ రోడ్డు పరిధిలో ఉన్న స్థలాల యజమానులు, ఇళ్లు ఉన్న యజమానులు, ఇంటి నిర్మాణం చేపట్టాలని అనుకుంటున్నారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇదే విషయమై వారం రోజులుగా కలెక్టర్, కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. వారంతా రాష్ట్రస్థాయికి నివేదిస్తామంటున్నారు తప్ప కచ్చితమైన హామీలు ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. దీనిపై న్యాయపోరాటం చేసినా న్యాయం జరుగుతుందో లేదోనన్న అపనమ్మకంతో వారంతా ఉంటున్నారు. విశాఖపట్నం వంటి మహానగరంలోనే 150 అడుగుల రోడ్లు లేవని, శ్రీకాకుళం వంటి నగరానికి అవసరమా అని వారందరూ ప్రశ్నిస్తున్నారు. 2047 వరకు అనుమతుల్లేవ్.. మాస్టర్ ప్లాన్ ఎప్పుడు రూపొందించినా ప్రజాభిప్రాయ సేకరణ తరువాతే ఆమోదించారు. ఇది వెంటనే అమలైపోయే అంశం కాదు. అయితే మాస్టర్ ప్లాన్లోని రోడ్ల పరిధిలో ఉంటే ఆయా స్థలాల్లో నిర్మాణాలకు 2047 వరకు అనుమతులు ఇవ్వరు. – ప్రసాదరావు, కమిషనర్, నగరపాలక సంస్థ -
ఎయిర్పోర్టు సదస్సు బహిష్కరణ
● హాజరు కాని ఉద్దానం రైతులు ● సహకరించాలని ఎమ్మెల్యే వేడుకోలు పలాస: పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు, మందస మండలాల ఉద్దానం ప్రాంతంలో తలపెట్టిన కార్గో ఎయిర్పోర్టును ఉద్దానం ప్రజలు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, సంబంధిత రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో పలాస రైల్వే ఇన్స్టిట్యూట్లో ఆదివారం ఎయిర్పోర్టు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వరరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అవగాహన అంటూ ఏర్పాటు చేసిన ఈ సదస్సును ఉద్దాన ప్రాంత రైతులు బహిష్కరించారు. ముందురోజే గ్రామ సచివాలయాలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రప్పించి ఎయిర్పోర్టుకు అనుకూలంగా మాట్లాడించుకున్నారు. ఎయిర్ పోర్టు చాలా అవసరం అంటూ, ఉద్దానం అభివృద్ధి చెందాలంటే తాము భూములు ఇవ్వడానికి సిద్ధమేనని, అయితే ప్రజల్లో, రైతుల్లో నష్ట పరిహారం విషయమై సందేహాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఎకరా భూమికి రూ.కోటి నష్టపరిహారం ఇవ్వాలని, ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషా మాట్లాడుతూ ప్రజా సంఘాల నాయకులు రకరకాల రంగుల జెండాలతో ఎక్కడి నుంచో వచ్చి రెచ్చగొడుతున్నారని, పర్యావరణ కాలుష్యం అంటున్నారని, అసలు ఎయిర్పోర్టు వద్దంటున్నారని, వారికి అభివృద్ధి అంటే అక్కర్లేదని, వారి ఇళ్ల ముందు మురుగు కాలువలను శుభ్రం చేయరని పరుష పదజాలంతో మాట్లాడారు. ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నానని, ఎయిర్పోర్టుకు సహకరించాలని కోరారు. ఎయిర్ పోర్టుతో మేలే.. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ కార్గో ఎయిర్పోర్టు వల్ల ఉద్దానం ప్రజలకు మేరు జరుగుతుందన్నారు. ఉద్దానం రూపురేఖలు మారుతాయన్నారు. చాలా మందికి అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయడానికే ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులు అభిప్రాయాలు తెలుసుకోకుండా ఒక్క అడుగూ ముందుకు పడదని, రేపటి నుంచి గ్రామాల్లోకి అధికారులు వస్తారని వారికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎ.పి.స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబూరావు, జేసీ ఫర్మాన్ అహ్మద్ఖాన్, ఆర్డీఓ జి.వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు, పలాస, మందస, వజ్రపుకొత్తూరు తహశీల్దార్లు పాల్గొన్నారు. -
అమ్మో.. మెమో!
● జిల్లా వైద్యారోగ్య శాఖలో గ్రూపుల గోల ● వరుస మెమోలు జారీ చేస్తున్న ఓ అధికారి ● ఇప్పటికే ఏడుగురు ఉద్యోగులకు 20కి పైగా మెమోలు జారీ అరసవల్లి : వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఇప్పుడు కొత్తగా వర్గపోరు ఎక్కువైంది. మాట్లాడితే మెమో అన్న చందంగా ‘పరిపాలన’ సాగుతోంది. స్థానిక డీఎంహెచ్వో కార్యాలయంలో కీలక స్థానాల్లో ఉన్న రెండు సీట్ల మధ్య అంతర్గత పోరు.. పలు రకాల వివాదాలకు కేంద్రమవుతోంది. ఇక అవినీతి విషయంలో ఏకంగా డీఎంహెచ్వో బాలమురళీకృష్ణ ఏసీబీకి చిక్కగా.. అక్రమాల్లో కార్యాలయ సూపరింటెండెంట్ భాస్కర్కుమార్ విధుల నుంచి సస్పెండయ్యారు. ఇలా ఈ కార్యాలయంలోని కీలక స్థానాలకు పెద్ద ఎత్తున అవినీతి మరకలంటాయి. రెండు మూడు నెలలుగా సూపరింటెండెంట్ భాస్కర్కుమార్కు, కార్యాలయ పరిపాలనాధికారి బాబూరావు మధ్య అభిప్రాయ భేదాలు ఎక్కువయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు ఇరు కీలక ఉద్యోగులకు సన్నిహితుల మధ్య వర్గ పోరు నడుస్తోంది. సూపరింటెండెంట్ సస్పెన్షన్ తర్వాత ఆయన వర్గానికి చెందిన పలువురు ఉద్యోగులకు మెమోల రూపంలో చర్యలు వెంటాడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగానే క్రమశిక్షణ చర్యలకు దిగుతున్నారని ఆరోపణలు జోరందుకున్నాయి. రెండు నెలల్లో 20 మెమోలు...! జిల్లా వైద్యారోగ్య శాఖలో మెమోల జారీ ఎక్కువయ్యింది. ఇటీవల ఏఎన్ఎంల (సచివాలయం) బదిలీల్లో బాగా జేబులు నింపుకొన్న ఓ అధికారి అంతా తానై వ్యవహరించడంతో పాటు అడ్డొచ్చినా.. అడ్డు చెప్పినా క్రమశిక్షణ చర్యలే అంటూ వ్యవహారం నడుపుతున్నారనే చర్చ జోరందుకుంది. రెండు మూడు నెలల్లోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సబార్డినేట్, టైపిస్టు నుంచి సీనియర్ అసిస్టెంట్ హోదా వరకు సుమారు 45 మంది వరకు విధుల్లో ఉన్నారు. వీరంతా పరిపాలనా విభాగ సూచనల మేరకు మాత్రమే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కొంత కాలంగా సాగుతున్న వర్గ పోరులో భాగంగా సుమారు ఏడుగురు ఉద్యోగులకు చర్యల్లో భాగంగా 20 వరకు మెమోలు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ భవాని ప్రసాద్కు మూడు, సీనియర్ అసిస్టెంట్ ప్రశాంత్కుమార్కు మూడు, సీనియర్ అసిస్టెంట్ చంద్రమౌళీశ్వరరావుకు రెండు, టైపిస్టు ఎస్.రామచంద్రరావుకు రెండు, టైపిస్టు ఎం.జగదీష్కు నాలుగు, సీనియర్ అసిస్టెంట్ విజయ సుందరీమణి (గీతాంజలి)కి మూడు, జూనియర్ అసిస్టెంట్ బి.రామచంద్రరావుకు రెండు చొప్పున మెమోలు వరుసగా జారీ చేశారు. వరుసగా మూడు మెమోలు జారీ చేస్తే చార్జి మెమో ఫ్రేమ్ చేసే అవకాశాలున్నాయి. సీసీఏ నిబంధనల ప్రకారం సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు ఇంక్రిమెంట్లు కూడా కోల్పోయే ప్రమాదముందని బాధిత ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వరుస వ్యవహారాలతో డీఎంహెచ్వో కార్యాలయంలో మెమోల గోలపై చర్చ జిల్లా వ్యాప్తమైంది. అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని మెమోలను ఇచ్చారో.. లేక వర్గపోరులో బలిపశువులను చేస్తున్నారో అన్న చర్చ కూడా సాగుతోంది. ఉన్నతాధికారులు జిల్లా కార్యాలయంలో ‘పరిపాలన’పై ప్రత్యేక దృష్టి సారిస్తే మరిన్ని వాస్తవాలు బహిర్గతమవుతాయని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. -
ఉత్సాహంగా స్కూల్గేమ్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: మలివిడత స్కూల్గేమ్స్ ఎంపిక పోటీల ప్రక్రియ మొదలైంది. జిల్లా విద్యాశాఖ పరిధిలోని జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిధ క్రీడాంశాల్లో ఎంపికలు చేపట్టారు. ఐదురోజులపాటు జరగనున్న ఈ పోటీల్లో తొలిరోజు 12 క్రీడాంశాల్లో ఎంపికలు జరిగాయి. హాకీ ఎంపికలు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో, వెయిట్లిఫ్టింగ్– పెద్దపాడులో, రెజ్లింగ్– పెద్దపాడులో, ఆర్చరీ– రాజ్కుమార్ అకాడమీ శ్రీకాకుళంలో, రగ్బీ, నెట్బాల్, రోప్స్కిప్పింగ్, షూటింగ్బాల్ ఎంపికలు– టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో, టేబుల్టెన్నిస్– శాంతినగర్కాలనీలో డీఎస్ఏ ఇండోర్ స్టేడియం, యోగా– జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యవరం, నరసన్నపేట మండలం, లాన్టెన్నీస్– శ్రీకాకుళం ఆర్ట్స్కాలేజ్ టెన్నిస్ అకాడమీలో, కరాటే ఎంపికలు శ్రీకాకుళం మహాలక్ష్మినగర్కాలనీలోని శ్రీచైతన్య స్కూల్ వేదికగా ఎంపికలను పూర్తిచేశారు. త్వరలో తుది జట్ల జాబితాను ప్రకటిస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ బీవీ రమణ, కె.మాధవరావు పర్యవేక్షించారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సలహాదారు పి.సుందరరావు, ఆయా క్రీడాంశాల సెలక్టర్లు, పీడీ, పీఈటీలు ఎంపికలను నిర్వహించారు. యోగా క్రీడాకారుల ఎంపికలు నరసన్నపేట: స్కూల్ గేమ్స్లో సత్యవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల్లో యోగా పోటీలు నిర్వహించారు. స్కూల్ గేమ్స్ సలహాదారు కె.రాజారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో సత్యవరం స్కూల్ నుంచి బి.జస్వంత్, బి.రాజ్వణి, ఆర్. రమేష్లు ఎంపికయ్యారని ఎంఈఓ శాంతారావు తెలిపారు. పీఈటీలు జ్యోతీ రాణి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. టెక్కలి: రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు జిల్లా జట్లు ఎంపికలను ఆదివారం టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. అండర్ –14, 17, 19 విభాగాల్లో బాల బాలికలకు నెట్బాల్, రగ్బీ, రోప్ స్కిప్పింగ్, షూటింగ్ బాల్ తదితర విభాగాల్లో జిల్లా జట్లు ఎంపికలు నిర్వహించారు. 95 పాఠశాలల నుంచి 650 మంది విద్యార్థులు హాజరయ్యారు. టెక్కలి డివిజన్ ఇన్చార్జి బి.నారాయణరావు, పీడీలు కె.కె.రామిరెడ్డి, ఎస్.లక్ష్మణరావు, ఎస్.కృష్ణారావు, ఎన్.నాగరాజు, పి.వెంకటరమణ, డి.లక్ష్మినారాయణ, అలివేణి, నర్మద పర్యవేక్షించారు. -
రూ.లక్ష పలికిన లడ్డూ
వజ్రపుకొత్తూరు: కొండవూరులో వేద సరస్వతీ దేవి 28వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి ఉత్సవాల్లో అమ్మవారి లడ్డూ పాట రూ.100500 పలికింది. శనివారం రాత్రి నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన కోనారి రాజశేఖర్ లడ్డూను కై వసం చేసుకున్నారు. దేవీ వస్త్రాన్ని రూ.17001లకు లండ నరేష్ దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. టీ–10 భారత్ జట్టుకు ఈశ్వర్రెడ్డి ఎంపిక టెక్కలి రూరల్: అంతర్జాతీయ స్థాయి సెకండ్ ఏషియన్ టీ–10 ఇండియా క్రికెట్ జట్టుకు కోటబొమ్మాళి గ్రామానికి చెందిన మూగి ఈశ్వర్రెడ్డి ఎంపికై నట్లు అసోషియేషన్ ప్రతినిధులు సుకుమార్, రాంబాబు ఆదివారం తెలిపారు. థాయిలాండ్లో పోటీలు జరుగుతాయని, సుమారు రూ.లక్షా 50వేలు ఖర్చు అవు తుందని ఈశ్వరరెడ్డి చెప్పారు. తనది పేద కుటుంబమని, దాతలు సహకరించాలని, వివరా లకు 9493740222 సంప్రదించాలని కోరారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి ఇచ్ఛాపురం రూరల్: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. పొట్ట కూటి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. తేలుకుంచి గ్రామానికి చెందిన మేరుగు త్రినాథ్(55) ఇతర ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య వరలక్ష్మీ, పెళ్లీడుకొచ్చిన కుమార్తె శారద ఉంది. ఆదివారం విశాఖపట్నంలో కూలి పనుల కోసం బయల్దేరిన త్రినాథ్ ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్లో బెర్హంపూర్–విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లాట్ ఫాం మధ్య పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో సీహెచ్సీకి తరలించగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి శ్రీకాకుళం : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎస్.వి.రమణమూర్తి డిమాండ్ చేశారు. నగరంలోని క్రాంతి భవన్లో ఆదివారం సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల కార్యాచరణలో భాగస్వామ్యం వహించే ఉద్యోగులను పాలకులు చిన్నచూపు చూడటం తగదన్నారు. డీఏలు సకాలంలో విడుదల చేయాలని, పెండింగ్ బకాయిలను చెల్లించాలని, పీఆర్సీ అమలయ్యే వరకు ఐఆర్ ప్రకటించాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి జి.రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యోగులకు ఇటీవలే డీఏ ప్రకటించిందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండేళ్లుగా డీఏలు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రూ.30 వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం రోడ్డు మ్యాప్ ప్రకటించాలని కోరారు. ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని, మెమో 57 అమలు చేయాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లతో కలిసి ఐక్య ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘ నాయకులు పి.ప్రభాకరరావు, ఎం.సన్యాసిరావు, పి.రామకృష్ణ, రాజేశ్వర రావు, జి.శ్రీనివాసరావు, జి.తిరుమలరావు, సీహెచ్ జగన్, రామచంద్రరావు పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడి కంచిలి: సూదిపుట్టుగ గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు శనివారం రాత్రి దాడిచేశారు. గ్రామానికి చెందిన ప్రేమ్ దొళాయి అనే వ్యక్తికి చెందిన ఇంటి టెర్రస్పై రేకుల గదిలో కోతముక్కల పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు సిబ్బందితో వెళ్లారు. ప్రేమ్ దొళాయితోపాటు మరో 12 మందిని అదుపులోకి తీసుకున్మనారు. వీరి వద్ద నుంచి రూ.92,960 నగదు, 13 మొబైల్ ఫోన్లు, 3 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
అద్దె ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బ్యాంకర్స్ కాలనీ శివబాలాజీ ఆలయం పరిసర ప్రాంతంలో ఓ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఐదుగురు వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి హంగామా సృష్టించారు. రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తంగుడు ఉపేంద్రకు చెందిన ఇంట్లో జామి విష్ణుమూర్తి కుటుంబంతో సహా అద్దెకు ఉండేవాడు. అద్దె విషయమై ఇద్దరి మధ్య కొన్నాళ్లు వివాదం నడిచింది. ప్రస్తుతం విష్ణుమూర్తి కుమారుడు జామి రమేష్ వద్దే అద్దె ఇంటి తాళాలు ఉన్నాయి. ఈ క్రమంలో రమేష్ తమ ఇంట్లో పని ఉందని, కొంతమంది మనుషులు కావాలంటూ సరుబుజ్జిలికి చెందిన చంటి అనే వ్యక్తిని సంప్రదించాడు. ఆయన కొంత నగదు తీసుకొని ఆమదాలవలసకు చెందిన బుజ్జి, దివ్య, యశోద నవీన్, ధనలక్ష్మీలను పురమాయించి శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో రమేష్ చెప్పిన ఇంటికి పంపించాడు. వీరు రావడాన్ని సీసీ కెమెరాలో గమనించిన యజమాని ఉపేంద్ర.. ఎవరు మీరు.. ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. అయినా వారు వినకుండా గదిలోకి వెళ్లి తలుపు వేసేశారు. దీంతో శ్రీకాకుళం డీఎస్పీకి సమాచారం అందించారు. అదే రోజు రాత్రి రూరల్ ఎస్ఐ సిబ్బందితో వెళ్లి తలుపులు కొట్టినా తీయలేదు. మరుసటి రోజు శనివారం పోలీసులు, కాలనీవాసులు వెళ్లగా ఎట్టకేలకు తలుపులు తీశారు. అప్పటికే ఆగ్రహంగా స్థానికులు ఇంట్లో బసచేసిన ఐదుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. వీరు ఎందుకు వచ్చారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గమ్మా..చల్లగా చూడమ్మా..
అమలపాడులో ఘటాల ఉత్సవం అమలపాడు గ్రామం భక్త జనసంద్రమైంది. దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన దుర్గమ్మతల్లి ఘటాల ఉత్సవానికి అశేష జనవాహిన తరలి రావడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పాహిమాం దేవీ.. పాహిమాం.. అంటూ భక్తుల శరణు ఘోషతో సాగిన ఘటాల ఊరేగింపులో మేళతాళాలు, పగటి వేషాలు, కాళీమాత వేషధారణలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శ్రీ దుర్గాదేవీ లేబర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలోల 108 మంది మహిళలు ఎరుపు వస్త్రధారణలో ఊరేగింపుగా దుర్గామాత పూజా మందిరానికి చేరుకున్నారు. అక్కడ నుంచి అసిరిపోలమ్మ తల్లి అమ్మవారి ముర్రాటలు, వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. వైఎస్సార్ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ దున్న రత్నం బాలరాజు, కారాడ గిరిబాబు, ఎంపీటీసీ సభ్యుడు దున్న లోకనాధం, దుర్గా దేవి లేబర్ కమిటీ నాయకులు ఇరోతు అప్పన్న, దున్న రాజులు, వి.కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. – వజ్రపుకొత్తూరు -
ఊరికి ఉపకారిగా..
సరుబుజ్జిలి : పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని, పురుషోత్తపురం పంచాయతీ, పీహెచ్సీ అభివృధ్ధికి తనవంతు కృషి చేస్తానని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, విజయనగరం జిల్లా పార్లమెంటరీ పరిశీలకుడు కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. తన సోదరుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కిల్లి విశ్వేశ్వరరావు జ్ఞాపకార్థం నిర్మించిన ‘కిల్లి వెంకట అప్పలనాయుడు పీహెచ్సీ’కి కుటుంబ సభ్యులు సమకూర్చిన రూ.2లక్షల విలువైన వైద్యారోగ్య మెటీరియల్ను శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కిల్లి రమాదేవి, సర్పంచ్ కిల్లి రాజ్యలక్ష్మి, ఉపసర్పంచ్ పైడి నర్శింహ అప్పారావు, పార్టీ నేతలు కిల్లి రామ్మోహనరావు, కిల్లి వెంకటేష్, కిల్లి వెంకటరమణ, ఆస్పత్రి వైద్య సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సేవలకు కేరాఫ్ అడ్రస్... గత వైఎస్సార్ సీపీ పాలనలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో తన తండ్రి కిల్లి వెంకటఅప్పలనాయుడు పేరిట మంజూరైన పీహెచ్సీని రూ.2కోట్ల 30 లక్షలతో నిర్మించారు. దీనికోసం రూ.కోటీ 50 లక్షల విలువైన 2 ఎకరాల సొంత స్థలాన్ని దానం చేశారు. ఆస్పత్రి ఆవరణలో రూ.5లక్షల సొంత నిధులతో వాటర్ప్లాంట్ నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేశారు. తాజాగా వైద్య పరికరాలు, ఇతర సామగ్రి అందజేశారు. పురుషోత్తపురం గ్రామానికి అడిగిన వెంటనే పీహెచ్సీ మంజూరు చేసిన గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇక్కడి ప్రజలకు ప్రాణదాతగా నిలిచారు. ప్రజా సంక్షేమం కోసం పార్టీ తరఫున అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. – కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పురుషోత్తపురం స్వగ్రామం పురుషోత్తపురం అభివృద్ధికి కృషి చేస్తున్న కేవీజీ ఇప్పటికే పీహెచ్సీకి భూదానం తాజాగా రూ.2లక్షలతో వైద్యారోగ్య పరికరాల వితరణ -
ఆటోడ్రైవర్ల సంక్షేమానికి కృషి
శ్రీకాకుళం రూరల్: ప్రతి ఆటోడ్రైవర్ను ఆదుకుంటామని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. శనివారం శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోడ్రైవర్లు సేవలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 13887 మంది ఆటో సోదరులకు రూ.20 కోట్ల 83 లక్షల నగదును అందించామన్నారు. కలెక్టర్ స్పప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఆటో, మ్యాక్సీ, క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలు అందిస్తామన్నారు. అనంతరం ఎంపీ ఆటో నడిపి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్డీఓ సాయి ప్రత్యూష, డీటీసీ ఎ.విజయసారధి, మున్సిపల్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు, ఆర్టీవో ఇన్స్పెక్టర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
అమరావతి పేరుతో ఉత్తరాంధ్రకు అన్యాయం
● వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు ధ్వజం ● నేడు పెద్దిపాలెంలో ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు. స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్, కేకే రాజు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు. -
స్కూల్గేమ్స్.. మలివిడత పోరుకు రెఢీ
శ్రీకాకుళం న్యూకాలనీ: మలివిడత స్కూల్గేమ్స్ ఎంపిక పోటీలకు రంగం సిద్ధమైంది. జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ అండర్–14, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు వివిద క్రీడాంశాల్లో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు జరగనున్నాయి. ఇప్పటికే సాఫ్ట్బాల్, ఫుట్బాల్, ఉషూ, బాక్సింగ్ నాలుగు క్రీడాంశాల్లో ఎంపికలు ముగియగా.. మిగిలిన క్రీడాంశాలకు ఎంపిక పోటీలను పాఠశాలలకు ముందస్తు దసరా సెలవును ప్రకటించడంతో వాయిదాపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన జిల్లాస్థాయి క్రీడా ఎంపిక పోటీల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటిలో కొన్ని మినహా మెజారిటీ సెలక్షన్స్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోనే జరగనున్నాయి. ఐదు రోజులపాటు నిర్దేశిత షెడ్యూల్ను జిల్లా స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు, డీఈఓ ఎ.రవిబాబు, కార్యదర్శి బీవీ రమణ సంయుక్తంగా వెల్లడించారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పీడీ–పీఈటీ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.తవిటయ్య, మొజ్జాడ వెంకటరమణ పిలుపునిచ్చారు, ఐదు రోజుల షెడ్యూల్ ఇది.. తొలిరోజు 5న: హాకీ (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్), వెయిట్లిఫ్టింగ్ (పెద్దపాడు), రెజ్లింగ్ (పెద్దపాడు), ఆర్చరీ (రాజ్కుమార్ అకాడమీ శ్రీకాకుళం), రగ్బీ, నెట్బాల్, రోప్ స్కిప్పింగ్, షూటింగ్బాల్ (టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం), టేబుల్టెన్నిస్ (శాంతినగర్కాలనీలో డీఎస్ఏ ఇండోర్ స్టేడియం), యోగా (జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సత్యవరం, నరసన్నపేట మండలం), లాన్టెన్నిస్ (శ్రీకాకుళం ఆర్ట్స్కాలేజ్ టెన్నీస్ అకాడమీ). కరాటే (శ్రీకాకుళం మహాలక్ష్మినగర్కాలనీలోని శ్రీచైతన్య స్కూల్). 6న: అథ్లెటిక్స్ (కోడిరామ్మూర్తి స్టేడియం శ్రీకాకుళం), త్రోబాల్ (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్), అండర్–14, 17 చెస్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎచ్చెర్ల). 7న: కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బాడ్మింటన్ బాలురుకు మాత్రమే (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానం), క్రికెట్ (ఆర్ట్స్కాలేజ్), బాల్బాడ్మింటన్ (ఆర్ట్స్కాలేజ్), అండర్–19 చెస్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎచ్చెర్ల). 8న: కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్ బాలికలకు మాత్రమే (శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్ మైదానం), స్విమ్మింగ్ (శాంతినగర్కాలనీలో డీఎస్ఏ స్విమ్మింగ్ ఫూల్), తైక్వాండో, ఫెన్సింగ్ (శ్రీకాకుళం టౌన్ హాల్), బాస్కెట్బాల్, సెపక్తక్ర (ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానం శ్రీకాకుళం), బేస్బాల్ (కేఆర్ స్టేడియం శ్రీకాకుళం) 9న: హ్యాండ్బాల్ (జెడ్పీహెచ్ స్కూల్ తొగరాం, ఆమదాలవలస మండలం). జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ ఎంపిక పోటీలకు సంబంధించి మలివిడత షెడ్యూల్ను ప్రకటించాం. అండర్–14,17,19 విభాగాల్లో బాలబాలికలకు నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం నిర్దేశించిన మైదానంలో ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలు తీసుకురావాలి. – బడి వెంకటరమణ, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ స్కూల్గేమ్స్ అనేవి విద్యార్థులకు వరమనే చెప్పాలి. క్రీడాకారులు గుర్తింపు పొందేది, తయార్యేది స్కూల్గేమ్స్ నుంచే. ఎంపికల్లో ప్రతిభ కనబర్చి జిల్లా జట్లకు ఎంపికయితే రాష్ట్రపోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. బాలబాలికలంతా సద్వినియోగం చేసుకోవాలి. – మొజ్జాడ వెంకటరమణ, జిల్లా పీడీ–పీఈటీ సంఘ ప్రధాన కార్యదర్శి నేటి నుంచి జిల్లాస్థాయి ఎంపిక పోటీలు ఐదు రోజుల పాటు వివిధ విభాగాల్లో నిర్వహణ ఏర్పాట్లు పూర్తిచేసిన స్కూల్గేమ్స్ ఫెడరేషన్ అధికారులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఎచ్చెర్ల : పొన్నాడ బ్రిడ్జి రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ముద్దాడ నవీన్ (19) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం కలివరం పంచాయతీ ముద్దాడపేటకు చెందిన నవీన్ గతేడాది పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నాడు. పార్ట్టైం జాబ్ చేసుకుంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. దసరా సెలవుల కోసం ఇంటికి వచ్చి స్నేహితుడి బైక్ తీసుకుని ఎచ్చెర్ల మండలం పొన్నాడ వైపు వచ్చాడు. రాత్రి 12 గంటల సమయంలో పొన్నాడ నుంచి శ్రీకాకుళంవైపు వస్తుండగా అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్కుమార్ తెలిపారు. చెరువులో మునిగి యువకుడు మృతి నరసన్నపేట: కామేశ్వరిపేటలో శనివారం విషాదం అలుముకుంది. ఉదయం స్నానానికి దిగిన కనుగుల దామోదరరావు(37) అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందాడు. వర్షాలకు గుమ్మన చెరువులో నీరు బాగా చేరింది. ఎప్పట్లాగే స్నానానికి దిగిన దామోదరరావు లోపలికి వెళ్లిపోయాడు. ఒక్కసారి మునిగిపోవడం, ఈత రాకపోవడంతో చేతులు పైకెత్తి కేకలు వేశాడు. దూరంగా ఉన్న వారు గమనించి చెరువులో దిగి ఆయన్ను బయటకు తీశారు. అప్పటికే చనిపోయినట్లు గ్రామస్తులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లి రామమ్మ నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దామోదరరావుకు వివాహం కాలేదు. తల్లి వద్దనే ఉంటున్నాడు. తండ్రి గతంలోనే మృతి చెందారు. ఒక్కగానొక్క మృతి చెందడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. దామోదరరావు మృతి పట్ల వైఎస్సార్ సీపీ నాయకులు వాకముళ్లు చక్రధర్, కోట జోగినాయుడు సంతాపం వ్యక్తం చేశారు. వాహనం ఢీకొని వృద్ధుడి మృతి రణస్థలం: మండల కేంద్రంలోని జె.ఆర్.పురం పాత పోలీస్స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం పట్టణంలో కంపోస్టు కాలనీకి చెందిన బరాటం ప్రసాదరావు (68) రణస్థలం మండలంలోని కోష్టలో పాన్షాప్ నడుపుతూ అక్కడే నివాసముంటున్న కుమారుడు శ్రీనివాసరావు వద్దకు బయలుదేరాడు. శనివారం ఉదయం రణస్థలంలో దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. స్థానికులు స్పందించి 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సోషల్ మీడియాలో ఫొటో చూసి కుమారుడు, బంధువులు గుర్తుపట్టి రిమ్స్కు చేరుకున్నారు. కుమారుడు శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య శ్రీకాకుళం రూరల్: ఇప్పిలి గ్రామానికి చెందిన ఇప్పిలి ఈశ్వరరావు (48) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల సత్యనారాయణ ప్రవర్తనలో తేడా రావడంతో కుమార్తె, కుమారుడు నిలదీశారు. కోపోద్రుక్తుడైనా ఈశ్వరరావు పంట పొలాలకు కొట్టే పురుగుల మందును శుక్రవారం తాగాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు ఫోన్లో సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే శ్రీకాకుళం నగరంలోని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతదేహన్ని రిమ్స్కు తరలించారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయితో వ్యక్తి అరెస్టు టెక్కలి రూరల్: టెక్కలి రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టెక్కలి ఎస్ఐ రాము తెలిపారు. బీహార్కు చెందిన ఎండీ స్వామన్ 640 గ్రాము ల గంజాయి తీసుకుని ట్రైన్లో టెక్కలి వచ్చి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా టాస్క్ఫోర్స్ సిబ్బంది అదుపులో తీసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. హిజ్రాల దారిదోపిడీ నరసన్నపేట: ఉర్లాం–నడగాం మధ్య ఆర్అండ్బీ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం కొందరు హిజ్రాలు కారులో వచ్చి దారిదోపిడీకి పాల్పడ్డారు. నడగాంకు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ దొంపాక ఆనంద రమణ మెడలో బంగారు చైన్ను లాక్కొని ఉడాయించారు. ఉర్లాం గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నడగాం రైల్వేగేటు దాటిన తర్వాత రోడ్డుపై కాచి ఉన్న ఐదుగురు హిజ్రాలు వాహనాన్ని ఆపి డబ్బులు అడిగారని ఆనంద రమణ తెలిపారు. ఇవ్వకపోవడంతో మెడలో తులంన్నర బంగారు చైన్ లాక్కెళ్లిపోయారని, ఈ మేరకు నరసన్నపేట పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసినట్లు వివరించారు. -
మెడికల్ మాఫియాను అడ్డుకోవాలి
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): జిల్లా కేంద్రం మెడికల్ మాఫియాకు నిలయంగా మారిందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాస్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని క్రాంతి భవన్లో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో చాలా ఆస్పత్రుల్లో టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు నోటీసు బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. పలుచోట్ల అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, వాటిని సీజ్ చేయని పక్షంలో పోరాటం తప్పదన్నారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు రవి, ఎ.వసంతరావు, ముచ్చ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
దుకాణాల్లో చోరీ
కంచిలి: మకరాంపురం గ్రామ సచివాలయం సమీపంలో మూడు దుకాణాల్లో శుక్రవారం రాత్రి దొంగతనం జరిగింది. మీనాక్షి జిరాక్స్, బుక్ స్టోర్లో రూ.3వేలు నగదు, శ్రీ భూలోకమాత ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ షాప్లో సుమారు రూ.10వేలు నగదు, టార్చిలైట్లను పట్టుకుపోయారు. కూరగాయలు షాపు తాళాలు పగులగొట్టినా ఎటువంటి చోరీ జరగలేదు. బాధితులు కంచిలి పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో హెచ్సీ జె.రూప్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డివైడర్ను ఢీకొట్టిన బైక్ హిరమండలం: గొట్టా బ్యారేజి వద్ద కొరసవాడ గ్రామానికి చెందిన ఏడురి లక్ష్మణరావు ద్విచక్ర వాహనంతో వెళ్తూ అదుపుతప్పి డివైడర్ ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. శనివారం సుభలయ నుంచి స్వగ్రామం కొరసవాడకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు స్పందించి బాధితుడిని ఆటోలో హిరమండలం పీహెచ్సీ తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్కు రిఫర్ చేశారు. 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో రిమ్స్కు తరలించారు. -
అర్ధరాత్రి ఆక్రందన
● దేవాది వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న మరో లారీ ● నుజ్జయిపోయిన క్యాబిన్లో చిక్కుకుపోయిన డ్రైవర్ ● గంట పాటు శ్రమించి బయటకు తీసిన స్థానికులు నరసన్నపేట: జాతీయ రహదారిపై దేవాది వద్ద లారీ డ్రైవర్ బబుల్ సింగ్ శుక్రవారం అర్ధరాత్రి చేసిన ఆక్రందనలు స్థానికులకు కలిచి వేశాయి. జాతీయ రహదారిపై నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వెళ్తున్న మార్గంలో దేవాది ముందు ఒక టీ స్టాల్ వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో వెనుక ఉన్న లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జుయిపోయింది. డ్రైవర్ బబుల్ సింగ్ ఆ క్యాబిన్లో ఇరుక్కుపోయారు. అర్ధరాత్రి పూట ఆయన పడిన బాధ వర్ణణాతీతం. అటుగా వెళ్తున్న వారు వాహనాలు ఆపి ఎంతగా ప్రయత్నించినా ఆయనను బయటకు తీయలేకపోయారు. చివరికి హైడ్రా వాహనం సహాయంతో స్థానికులు కేబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీశారు. అప్పటికే డ్రైవర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఎన్హెచ్ఏఐ అంబులెన్స్లో సిబ్బంది ప్రథమ చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. ఆ గంట కాలం డ్రైవర్ పడిన నరక యాతన చూడలేకపోయామని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది. కాగా దేవాది –కోమర్తిల మధ్య జాతీయ రహదారిపై ప్రమాదా లు అధికంగా జరుగుతున్నాయి. -
●దహన కాండ
పది తలలు.. 55 అడుగుల పొడవు.. 47 అడుగుల వెడల్పు.. అంతటి దశకంఠుడి విగ్రహం శ్రీరామ నామస్మరణ సాక్షిగా కాలి బూడిదైంది. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి రావణ దహనం నిర్వహించారు. దాదాపు అరగంట పాటు బాణసంచా వెలుగుల్లో మైదానం దేదీప్యమానంగా వెలిగింది. కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, ఆర్డీఓ, తదితర అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. – శ్రీకాకుళం కల్చరల్ -
●ముంపు ప్రాంతాల పరిశీలన
ఇచ్ఛాపురం రూరల్: వరద ముంపు ప్రాంతాలను జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ శనివారం పరిశీలించారు. శనివారం ఆమె మండలం తులసిగాం, ఇన్నేశుపేట గ్రామాల్లో పర్యటించి ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజుల పాటు కురిసిన వర్షాలకు బాహుదా నదిలో వరద నీరు చేరడంతో పద్మపురం గెడ్డ ఉప్పొంగి సుమారు 300 ఎకరాలకు పైగా పంట పొలాలు వరద నీటి ముంపునకు గురయ్యాయని అన్నారు. ప్రభుత్వం ఎరువుల పంపిణీలో విఫలం కావడంతో రైతులు ఒడిశాలో అధిక మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేశారని, ఇప్పుడు మళ్లీ ఎరువులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అధికారులు క్షేత్రస్థాయి లో ముంపు ప్రాంతంలో పర్యటించి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి ఎరువులు అందజేయాలని కోరారు. ఎంపీపీ బోర పుష్ప, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, మాజీ ఎంపీపీ కారంగి మోహనరావు, సర్పంచ్ ఇసురు తులసీరామ్, ఇసురు యాదవరెడ్డి, వలసయ్య, ఇసురు పరుశురాం తదితరులు ఉన్నారు. -
కూటమి వైఫల్యాలు ప్రజలకు చెబుదాం
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లాలని, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటిస్తూ పార్టీ నియమనిబంధనలకు కట్టుబడి మనమంతా కలసికట్టుగా అడుగులు ముందుకేయాలని పార్టీ జిల్లా అధ్యక్షు డు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం పార్టీ సమన్వయకర్తలు, పార్లమెంటరీ పరిశీలకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో దాదాపుగా అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం పూర్తయ్యిందని, మిగిలిన టీమ్లను నియమించేందుకు యాక్టివ్గా పనిచేసే వారికి అవకాశం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉందని, దాన్ని ఇంకా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 5 పూర్తి చేసి తరగతులు ప్రారంభించి సేవలందిస్తే.. వాటిని సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సొమ్ము పోగు చేసుకోవాలని చూస్తున్నారన్నారు. పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టేందుకు చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ గ్రామం నుంచి మండల, నియోజకవర్గ స్థాయి వరకు అన్ని రకాల అనుబంధ విభాగాలు పూర్తిచేయాలని, ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. 5 పంచాయతీలకు ఒక్క అబ్జర్వర్ ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదిలోపు గ్రామస్థాయి కమిటీలు పూర్తయిపోయేలా చూడాలన్నారు. అన్ని విభాగాల్లో 10 శాతం మహిళలు ఉండేందుకు ప్రయత్నం చేయాలన్నారు. మాజీ మంత్రి, పార్టీ డాక్టర్స్సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఏ ఒక్కరినీ విస్మరించే పరిస్థితి ఉండదని, సైనికుల్లా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు గొర్లె కిరణ్కుమార్, పిరియా సాయిరాజ్, పార్టీ ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, పార్లమెంటరీ రాష్ట్ర కార్యద ర్శులు దుంపల రామారావు, కరిమి రాజేశ్వరరావు, సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ గొండు కృష్ణమూర్తి, చల్ల శ్రీనివాసరావు, వలంటీర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు గంట్యాడ రమేష్, జిల్లా ప్రధానకార్యదర్శి గేదెల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లావాసులకు చోటు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో జిల్లాకు చెందిన నలుగురికి అవకాశం కల్పిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కేంద్రపార్టీ కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంప్లాయీస్, పెన్షనర్స్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా టెక్కలి నియోజకవర్గానికి చెందిన దివ్వాల పొలయ్య, ఆర్టీఐ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా ఆమదాలవలస ని యోజకవర్గం నుంచి బద్రి రామారావు, ఆర్టీఐ వింగ్ రాష్ట్ర సంయుక్తకార్యదర్శులుగా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి మీసాల వెంకటరమణ, టెక్కలి నియోజకవర్గం నుంచి అక్కురాడ లోకనాథంలను నియమించారు. సోంపేట: కూటమి ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తోందని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. సోంపేట పట్టణంలో సీఐటీయూ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభించారు. సీనియర్ నాయకులు కె.సూరయ్య సీఐటీయూ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరులైన ఉద్యమ నాయ కులు సీతారాం ఏచూరి, వీజీకే మూర్తి, కొల్లి సత్యనారాయణ, ఎంవీ సత్యనారాయణ దొరల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 8 గంటల పనివేళలను 13 గంటలు చేస్తూ తీసుకువచ్చిన నూతన చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే నిరసనలు తప్పవన్నారు. ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వాలు ఎకరా 99 పైసలు చొప్పున ధారాదత్తం చేయ డం దారుణమన్నారు. శని, ఆదివారాలు రెండు రోజులు మహాసభలు నిర్వహిస్తామని తెలిపారు. మహాసభల్లో జిల్లా ప్రధాన కార్యద ర్శి పి.తేజేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి కేఎస్వీ కుమార్, పూర్వ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవిందరావు, జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షుడు నాగమణి, కార్యదర్శులు సంగారు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. హిరమండలం: మండలంలో వంశధార వరదకు నీట మునిగిన పొలాలను కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు శనివారం పరిశీలించారు. మండలంలోని జిల్లోడిపేటలో నీట మునిగిన పంటపొలాలు, తుంగతంపర గ్రామ సమీపంలో కోతకు గురైన కరకట్టను ఆయన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డితో కలసి పరిశీలించారు. నష్టంపై నివేదికలు వచ్చాక పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రతిష్టాత్మక ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్–2025 పోటీలకు అంపైర్గా జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సంపతిరావు సూరిబాబు నియామకమయ్యా రు. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నారు. 97 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్న ఈ మెగా టోర్నమెంట్ పోటీలకు భారతదేశమే ఆతిథ్యం ఇవ్వనుంది. అస్సోం రాష్ట్రంలోని గౌహతి వేదికగా ఈనెల 6 నుంచి 19వ తేదీ వరకు జరిగే ఈ జూనియర్ వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీలకు అంపైర్గా సూరిబాబు వ్యవహరించనున్నారు. ఈయన చిలకపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీగా పనిచేస్తూ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీఈఓ గా, పీఈటీ సంఘంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన నియామకంపై బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ ఆర్.రాజేంద్రన్, అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.సాగర్, ఎం.అశోక్కుమార్, చిలకపాలెం స్కూల్ హెచ్ ఎం చౌదరి లీలావతికుమారి, డాక్టర్ గూడేన సోమేశ్వరరావు, ప్రసాద్, అనిల్, పీఈటీ సంఘ నాయకులు ఎంవీ రమణ, పి.తవిటయ్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
ఆటో బోల్తా–పలువురికి గాయాలు
టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రి సమీపంలో శనివారం సాయంత్రం పంది అడ్డురావడంతో దానిని తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన యవ్వారు దుర్యోధనరావు తన భార్య గంగాభవానీ, ఇద్దరు పిల్లలు, అత్తయ్య పినకాన రాములమ్మతో కలిసి ఆటోలో శనివారం టెక్కలి మండలం వీఆర్కేపురంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వలేసాగరం వద్ద నందిగాం మండలం సవర రామకృష్ణపురం గ్రామానికి చెందిన నందిగాం శోభావతిని అదే ఆటోలో ఎక్కించుకుని టెక్కలి వైపు వస్తుండగా జిల్లా ఆస్పత్రి సమీపంలో పంది అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో ఒక్కసారిగా ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ఆరుగురికి గాయాలు కావడంతో వెంటనే సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. శోభావతి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిఫర్ చేశారు. మిగిలిన వారికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు. టోకెన్లు సరే..ఎరువులేవీ? ఆమదాలవలస రూరల్: ఎరువుల కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. ఆమదాలవలస మండల కేంద్రం నుంచి ఒక్కోరైతుకు రెండు, మూడు బస్తాల యూరియా అందించేందుకు ఇటీవల వ్యవసాయ, రెవెన్యూ, రైతు సేవా కేంద్రాల అధికారులు సంతకం చేసి టోకెన్లు అందించారు. వీటిని పట్టుకొని ఎరువుల సరఫరా కేంద్రం వద్ద క్యూ కట్టినా అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆమదాలవలస మండలం ఇసుకలపేట గ్రామానికి చెందిన అన్నెపు నీలారావుకు టోకెన్ అందించినా ఇంతవరకు ఎరువు అందలేదు. ఇలాంటి రైతులు ఎంతోమంది ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
నరసన్నపేట : జాతీయ రహదారిపై కోమర్తి పెట్రోల్ బంకు వద్ద గురువారం ఆగి ఉన్న ఆటోను వెనుక వస్తు న్న మరో ఆటో అదుపు తప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక ఆటోలో ఉన్న అంపోలు గ్రామానికి చెందిన ధర్మాన సంధ్య, దంత జయశ్రీ, దంత కనకమహలక్ష్మి, జమ్ము రాజేశ్వరమ్మలకు గాయాలయ్యాయి. వీరంతా పోలాకి మండలం గొల్లవలస వెళ్లేందుకు మునసబుపేటలోని గాయత్రీ కళాశాల వద్ద ఆటో ఎక్కారు. దేవాది దాటిన తర్వాత పెట్రోల్ బంకు వద్దకు వచ్చే సరికి ముందున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేశారు. -
స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇద్దరికి చోటు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జిల్లా నుంచి ఇద్దరికి చోటు లభించింది. పార్టీకి అందించిన సేవలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా గొండు కృష్ణమూర్తి, చల్లా శ్రీనివాసరావులను నియమిస్తూ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్న వారే. వారి కుటుంబీకులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా పనిచేశారు. తమ నియామకం పట్ల అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్లకు కృతజ్ఞతలు తెలిపారు. అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామని చెప్పారు. సీనియర్గా గొండుకు గుర్తింపు.. గొండు కృష్ణమూర్తి వైఎస్సార్సీపీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. పార్టీ పట్ల విధేయతతో ఉంటూ తన వంతు సేవలు అందిస్తున్నారు. మూడు సార్లు డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో కూడా డీసీఎంఎస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. అంతకుముందు అంపోలు పీఏసీఎస్ అధ్యక్షుడిగా మూడు సార్లు సేవలందించారు. భార్య సౌధామణి అంపోలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు. కృష్ణమూర్తి తండ్రి గొండు నర్సింగరావు ఎమ్మెల్సీగా, సమితి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంగా నియోజకవర్గంలో పేరుంది. చల్లాకు స్టేట్ పదవి.. జిల్లాలో మరో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన చల్లా శ్రీనివాసరావుకు ఏపీ గ్రామీణ బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉంది. ఈయన తాత, తండ్రులిద్దరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు. తాత చల్లా నర్సింహనాయుడు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సేవలందించారు. శ్రీనివాసరావు తండ్రి చల్లా లక్ష్మీణారాయణ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీనివాసరావు భార్య ఆలివేలు మంగా జెడ్పీ ప్లానింగ్ కమిషన్ మెంబర్గా, మూడు సార్లు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. -
కోతల ప్రభుత్వం..
సీ్త్ర, శక్తి పథకంతో ఆటో, ట్యాక్సీ వాలాలు చాలాచోట్ల రోడ్డున పడ్డారు. ప్రయాణికులు దూరం కావడంతో పోషణ, ఫైనాన్స్, ఇతరత్రా ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రత్యామ్నాయం సాయం చేయలేదు. సంవత్సరానికి రూ. 15వేలు చొప్పున ఇస్తామన్న ఆటో డ్రైవర్ల సేవలో పథకం లబ్ధిదారుల్లో కూడా కోత పెట్టింది. సాధారణంగా ప్రతి ఏటా ఏ పథకమైనా లబ్ధిదారులు పెరుగుతారు. ఉద్యోగ, ఉపాఽధి అవకాశాలు దొరకక ఆటోవాలాలైతే మరింత పెరు గుతున్నారు. ఈ లెక్కన గత ప్రభుత్వంలో వాహన మిత్ర కింద ఇచ్చిన లబ్ధిదారుల కన్న సంఖ్య ఎక్కువగా ఉండాలి. కూటమి ప్రభుత్వంలో మాత్రం ఆటో వాలాల లబ్ధిదారులను తగ్గించేశారు. గత ప్రభుత్వంలో 14,320మందికి వాహన మిత్రం పథకం కింద సాయం అందజేయగా, ఈ ప్రభుత్వం 13,886 మందిని మాత్రమే లబ్ధిదారులగా ఎంపిక చేసింది. వీరిలో ఎంతమందిక జమవుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే ఒక సంవత్సరం ఎగ్గొట్టడంతో ప్రతీ ఒక్కరూ రూ.15వేలు కోల్పోయారు. ఇప్పుడు ఆంక్షల పేరుతో సుమారు 500 మందిని తీసేశారు. ఇక, కొత్తగా ఆటో, ట్యాక్సీలు తీసుకున్న వారు వేలల్లో ఉన్నారు. ఈ లెక్కన సంఖ్య మరింత పెరగాలి. కానీ, ఏదో రకంగా తప్పించుకోవాలని చూస్తున్న కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో కూడా దగా చేసింది. -
మహనీయుల త్యాగాలు వెలకట్టలేనివి
శ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా గాంధీతో పాటు ఎంతో మంది మహానుభావులు చేసిన త్యాగాల వల్లే నేడు స్వాతంత్య్ర ఫలాలను అనుభవిస్తున్నారని, వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై నా ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నా రు. మహాత్మాగాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలనాధి కారి జి.ఎ.సూర్యనారాయణ, పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, సెక్షన్ పర్యవేక్షకులు డి.రామమూర్తి, సురేష్, మీడియా ప్రతినిధి శాసపు జోగి నాయుడు పాల్గొన్నారు. -
పగలు వ్యాపారం.. రాత్రి దొంగతనం
వజ్రపుకొత్తూరు రూరల్ : పగటి పూట ద్విచక్రవాహనంపై గ్రామాల్లో తిరుగుతూ వంట సామగ్రి వ్యాపారం చేస్తూ.. రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడు ఎట్టకేలకు గ్రామస్తుల చేతికి చిక్కాడు. గురువారం రాత్రి వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి వద్ద కొండమహంకాళీ అమ్మవారి గుడి వద్ద చోరీకి ప్రయత్నిస్తూ ఓ యువకుడు స్థానికులకు పట్టుబడ్డాడు. గ్రామస్తులు ప్రశ్నించగా దొంగతనానికి వచ్చిన ట్లు అంగీకరించాడు. మందస మండలంలోనూ పలు ఆలయాల్లో దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. యువకుడి వద్ద ఉన్న ద్విచక్రవాహనం, దొంగతనాన్ని వినియోగించే పనిముట్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని శుక్రవారం పోలీసులకు అప్పగించారు. ఆధార్కార్డు ప్రకారం నరసన్నపేటకు చెందిన కల్లూరి ప్రభదాసుగా స్థానికులు చెబుతున్నారు. -
6న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర అవార్డులు ప్రదానం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఈ నెల 6న స్వర్ణాంధ్ర – స్వర్ణాంధ్ర అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు అందజేసేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిర్ణయించిందని, పారిశుధ్య కార్మికులు, ఉద్యోగులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజలు.. ఇలా ఎవరు బాగా పనిచేసినా అవార్డు అందుతుందన్నారు. అన్ని శాఖలను పరిగణనలోకి తీసుకొని 51 అవార్డులు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గ్రీన్ స్పాట్ ట్రాన్స్ఫార్మేషన్ 83 పాయింట్ల లక్ష్యాన్ని రెండు వారాల్లో చేరుకున్నట్లు తెలిపారు. డై అండ్ నైట్ వంతెన కింది భాగంలో ఇకపై మెడికల్ వ్యర్థాలు పారబోస్తే చర్యలు తప్పవని మెడికల్ ల్యాబ్స్, మెడికల్ షాపులు, ఆస్పత్రులను హెచ్చరించినట్లు చెప్పారు. సఫాయి మిత్ర సురక్ష శిబిర్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించి మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం మున్సిపాలిటీల్లో, శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రకటిస్తామన్నారు. జీఎస్టీ తగ్గింపుపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 19న షాపింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పాత ధరలు, తగ్గింపు ధరలపై అవగాహన కల్పిస్తామన్నారు. పాఠశాలలు, ఉన్నత పాఠశాలలో జిఎస్టీ తగ్గింపు వలన ఉపయోగం గూర్చి తెలియజేస్తారన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.వి.వి.డి.ప్రసాదరావు పాల్గొన్నారు. -
87 మంది పండిట్లకు పదోన్నతులు
శ్రీకాకుళం: జిల్లాలో పనిచేస్తున్న 87 మంది పండిట్లకు పదోన్నతులు కల్పిస్తూ డీఈవో రవిబా బు బుధవారం ఉత్తర్వులు అందజేశారు. వారు పనిచేస్తున్న పాఠశాలల్లోనే ఇకపై వీరంతా స్కూల్ అసిస్టెంట్లుగా కొనసాగుతారు. ‘పదోన్నతులకు నోచుకోని పండిట్లు’ పేరి ట ఐదు రోజుల క్రితం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో పండిత సంఘాల నాయకులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్పందించారు. రాష్ట్రస్థాయిలో అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసువెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పండితుల పదోన్నతుల సమస్యను తక్షణం పరిష్కరించాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 65 మంది తెలుగు, 18 మంది ఒరియా, నలుగురు హిందీ పండిట్లకు పదోన్నతు లు లభించాయి. బుధవారం డీఈవో కార్యాలయంలో పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారు. పదో న్నతులు కల్పించడం పట్ల భాషా ఉపాధ్యాయ సంస్థ నాయకులు పిసిని వసంతరావ, రంగనాయకు లు, ఉపాధ్యాయ పండిత పరిషత్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
ఉత్తరాంధ్ర అతలాకుతలం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర వణికింది...! ఎడతెరిపి లేని భారీ వర్షంతో తడిసి ముద్దయింది...! మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అతలాకుతలమైంది...! విజయనగరం విలవిల్లాడింది...! విశాఖపట్నంలోనూ తీవ్రత కనిపించింది..! ఏకధాటిగా కురిసిన వానకు నదులు, వాగులు పొంగి ప్రవహించాయి...! గంటకు 60–70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో అనేకచోట్ల చెట్లు రోడ్లపై కూలిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట పొలాలు మునగడంతో రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కాగా, వేర్వేరు ఘటనల్లో గోడకూలి వృద్ధ దంపతులు సహా ముగ్గరు మృతిచెందారు. నది ప్రవాహంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. రికార్డు స్థాయిలో 18.03 సెంటీమీటర్ల వర్షం కురవడంతో శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గ పట్టణాలు చెరువుల్లా మారాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనూ పలుచోట్ల అతి భారీ వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాలు జలమయమయ్యాయి. – సాక్షి, అమరావతిశ్రీకాకుళం జిల్లా అంతటా కుండపోత వర్షాలతో అనేక ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. మెలియపుట్టి మండలం చుట్టూ నీరు చేరింది. మందసలో 13.9, హరిపురం (13.7), నందిగం (13.4), కంచిలి మండలం ఎంఎస్ పల్లె (13.1), టెక్కలి మండలం రావివలస (10.1), సోంపేట మండలం కొర్లాం (9.6), మెలియపుట్టి (9.3), కోట»ొమ్మాళి (9), సంత»ొమ్మాళి (8.9), పార్వతీపురం మన్యం సీతంపేటలో (8), సిరిగం (7.9), రాస్తకుంటబాయి (7.4), నిమ్మాడ (6.8), గార (6.7) వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా పాఠశాలలకు స్థానికంగా ఎక్కడికక్కడ సెలవు ప్రకటించారు. అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. పలు మండలాల్లో 5 సెం.మీ పైగా వర్షం శ్రీకాకుళం జిల్లా రణస్థలం, కవిటి, పొలాకి, బుర్జ, ఆమదాలవలస, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, లావేరు, నరసన్నపేట, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, విజయనగరం జిల్లా మెరకముడిదం, గరివిడి, పైడి భీమవరం, రాజాపురం, పార్వతీపురం మన్యం జిల్లా పచి్చపెంట ప్రాంతాల్లో 5 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. విజయనగరం విలవిల విజయనగరం జిల్లాలో నదులు, వాగులు ఉప్పొంగాయి. పొలాలను వరద ముంచెత్తింది. ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరగడంతో గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగింది. ఒడిశాలో భారీ వర్షాలతో నాగావళికి వరద పోటెత్తింది. పలు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుని, బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అరటి, చెరకు, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం ఏసూరిగెడ్డ ఉధృతికి రావుపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వంద ఎకరాల వరి ముంపునకు గురైంది.గొట్టా, భగీరథపురం, నీలాదేవిపురం, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస, అక్కరాపల్లి, కిట్టాలపాడు, పాతహిరమండలం, జిల్లోడిపేట, కల్లట, గులుమూరు గ్రామాల్లో వందల ఎకరాలు ముంపులో చిక్కుకున్నాయి. పొట్ట, వెన్ను దశలో ఉన్న సమయంలో వరదతో పంటంతా పోయింది. వీరఘట్టం మండలంలో 850 ఎకరాల్లో అరటి, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది.వట్టిగెడ్డ ఉధృతంగా ప్రవహించడంతో కురుపాం–రావాడ గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పుముఠాలో ఉన్న సుమారు 30 గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.తీరం దాటిన వాయుగుండం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గురువారం ఒడిశాలోని గోపాల్పూర్–పారదీప్ మధ్య తీరం దాటింది. శుక్రవారానికి అతి బలహీనపడడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి.ఈపీడీసీఎల్కు రూ.1.78 కోట్ల నష్టంవాయుగుండం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల తీవ్రతతో ఈపీడీసీఎల్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో రూ.1.78 కోట్ల నష్టం వాటిల్లిందని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి వెల్లడించారు. గాలుల కారణంగా ఆరు సర్కిళ్లలోని విద్యుత్ లైన్లపై భారీ వృక్షాలు, ఫ్లెక్సీ బ్యానర్లు, చెట్లకొమ్మలు విరిగిపడ్డాయని తెలిపారు. 33 మండలాలకు గాను 25 మండలాల్లో విద్యుత్ పునరుద్ధరించామని చెప్పారు.వంశధార ఉధృతిభీతిల్లిన పరివాహక గ్రామాల ప్రజలు గొట్టాకు మూడో ప్రమాద హెచ్చరిక జారీవర్షాల దెబ్బకు నాగావళి, వంశధార నదులు ప్రమాద స్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వంశధార ఐదారేళ్లుగా చూడని స్థాయిలో ఉగ్రరూపం దాల్చింది. 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో నదీ తీర గ్రామాల ప్రజలు భీతిల్లారు. శుక్రవారం సాయంత్రం నుంచి వంశధార శాంతించింది. తోటపల్లి, మడ్డువలస, జంఝావతి, పెదంకలాం, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది.ఒడిశాలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గొట్టా బ్యారేజీలోకి నీటి మట్టం పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ధాటికి నదీ తీర ప్రాంత ప్రజలు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. బాహుదా నది కూడా పొంగి ప్రవహించడంతో తీర గ్రామాలు, పొలాలు నీట మునిగాయి. మహేంద్రతనయకూ వరద ఉధృతి కొనసాగుతోంది.నేలకొరిగిన చెట్లు ఈదురుగాలులు విశాఖను వణికించాయి. దసరా రోజున భారీ గాలులతో కూడిన వర్షంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. 80 ప్రాంతాల్లో 170 పైగా చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు కూడా పడిపోయాయి. అల్లూరి జిల్లాలో కూలిన బడులు భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ వనభరంగిపాడులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం గురువారం తెల్లవారుజామున కుప్పకూలింది. ముంచంగిపుట్టు మండలం జర్జుల పంచాయతీ సింధుపుట్టులో పాఠశాల నిర్వహించే రేకుల షెడ్డు గురువారం సాయంత్రం పడిపోయింది.మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, వరద ప్రవాహాలపై ఉన్నతాధికారులు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భారీ వర్షాలు, ప్రమాదాల కారణంగా ముూడు జిల్లాల్లో నలుగురు మృతిచెందినట్లు అధికారులు చెప్పారు. విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో ఇద్దరు, పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాంలో ఒకరు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.వృద్ధ దంపతులను బలిగొన్న గోడమరో రెండు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం క్యాబేజీ పంటంతా పోవడంతో రైతు ఆత్యహత్యాయత్నంశ్రీకాకుళం జిల్లా మందస మండలం హంసరాలి పంచాయతీ చిన్నటూరులో గురువారం రాత్రి మట్టి గోడ కూలి పెళ్లలు మీద పడడంతో వృద్ధ దంపతులు సవర బుద్దయ్య (65), రూపమ్మ(60) ప్రాణాలు కోల్పోయారు. హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరి ఇద్దరు పిల్లలు ఉద్యోగ రీత్యా బయట ఉంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు వీరి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు.పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం ఉదయపురంలో వర్షాలకు నానిన గోడ కూలడంతో అరవింద్ మృతి చెందాడు. ఇతడి సోదరుడు వినయ్ను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు.శ్రీకాకుళం జిల్లా పలాస మొగిలిపాడు గ్రామానికి చెందిన సైని గోపాలరావు (47) వరదలో కొట్టుకుపోయి మృతి చెందాడు. గురువారం జాతీయ రహదారి వెంట పెద్దఎత్తున వరద ప్రవహిస్తుండగా... అవతల ఉన్న పొలాన్ని చూసేందుకు వెళ్లిన గోపాలరావు తిరిగి రాలేదు. పొలం దగ్గర ఉన్న ఖానాలో పడిపోయి చనిపోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం జె.రంగరాయపురంలో వేగావతి నదిలో యోగేశ్వరరావు (22) గల్లంతయ్యాడు.పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కళ్లికోటకు చెందిన కౌలు రైతు బి.రాంబాబు క్యాబేజీ పంట మొత్తం నీట మునగడంతో పురుగుమందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
నదులకు వరద ముప్పు
● వంశధారకు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ● తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ (08942–240557) ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఒడిశా–ఉత్తరాంధ్రలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాల వేస్తున్న నేపథ్యంలో జిల్లాలో వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు బుధవారం ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 3న నది ప్రవాహం ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు. మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే శ్రీకాకుళం, గార, కొత్తూరు, పోలాకి, జలుమూరు, నరసన్నపేట మండలాల్లోని సుమారు 48 గ్రామాలు ప్రభావితమవుతాయని చెప్పారు. రెండో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే 39 గ్రామాలు ప్రభావితమవుతాయన్నారు. నాగావళి పరివాహక ప్రాంతంలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తోటపల్లి, నారాయణపురం జల వనరుల వద్ద ప్రమాద హెచ్చరిక స్థాయి దాటితే ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల మండలాల్లోని 11 గ్రామాలకు వరద ముప్పు ఉంటుందన్నారు. లోతట్టు, నదీ తీర ప్రాంతాల్లో ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. -
స్వర్ణకిరణాలు
సకలాభరణాలు.. ● అరసవల్లిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం ● ఆదిత్యుని తాకిన లేలేత కిరణాలు ● నేడు కూడా కిరణ స్పర్శకు అవకాశం అరసవల్లి : ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి కొలువుదీరిన అరసవల్లిలో బుధవారం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యోదయ సమయాన సుమారు ఎనిమిది నిమిషాల పాటు గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టుకు కిరణాభిషేకం జరిగింది. లేలేత తొలి సూర్యకిరణాలు వస్తూనే.. రాజమార్గమంతా ఎర్రని తివాచీలా మారింది. అలా రాజగోపురం నుంచి ఉదయం 5.55 గంటల నుంచి 6.03 గంటల వరకు కిరణాలు స్వామి సన్నిధిలోనే ఉండిపోయాయి. అంతరాలయం మీదుగా గర్భాలయంలోనికి చేరుకున్న కిరణ కాంతులు ముందుగా శ్రీవారి మూలవిరాట్టు పాదాల చెంత ఉన్న రథసారథి అనూరుడిని తాకాయి. దీంతో గర్భాలయమంతా దివ్యకాంతితో మెరిసిపోయింది. తర్వాత క్షణంలో స్వామి వారి ఉదర భాగం, వక్ష భాగాలను తాకుతూ సుమారు 3 నిమిషాలకుపైగా దివ్యముఖ రూపంపైనే కిరణ కాంతి కేంద్రీకృతమయ్యింది. దీంతో భక్తులు పరవశించిపోయారు. మరోవైపు, ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా బారికేడ్లను ఏర్పాటు చేయడంతో దర్శనాలు సజావుగా జరిగాయి. గురువారం కూడా వాతావరణం అనుకూలిస్తే కిరణ దర్శనం ఉంటుందని ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ తెలిపారు. కాగా తొలిసారిగా దర్శించుకున్న వారికి మాటలకు అందని అనుభూతి కలగగా...ఇప్పటికే పలుమార్లు వీక్షించిన వారికి ఆనంద పరవశులయ్యారు. -
కూటమిది సవతిప్రేమ
కవిటి: ఉద్దానంలోని ఏడు మండలాల పరిధిలో కిడ్నీ బాధితులపై కూటమి ప్రభుత్వం సవతిప్రేమ కనబరుస్తూ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని శ్రీకాకుళం జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ధ్వజమెత్తారు. బుధవారం కవిటి సీహెచ్సీ, అక్కడే ఉన్న డయాలసిస్ కేంద్రాలను సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల శాసనసభలో స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలోనే కిడ్నీబాధితులకు పెన్షన్లు అందించి డయాలసిస్ చేయించామని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు డయాలసిస్ పెన్షన్లు, బెడ్లు ఎన్ని ఉండేవో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. 2019లో బాధ్యతలు స్వీకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి డయాలసిస్ పేషెంట్లకు నెలకు రూ.10,000 పెన్షన్, కాశీబుగ్గలో కిడ్నీవ్యాధుల చికిత్స పరిశోధన కేంద్రం ఏర్పాటు, వంశధార నుంచి ఉపరితల జలాలతో కూడిన రూ.700 కోట్ల తాగునీటి పథకం, సీరం క్రియేటినైన్ ఐదు దాటిన వారికి రూ.5000 పెన్షన్ చెల్లించడం వంటి పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ఇవన్నీ వదిలేసి ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడం ఉద్దానం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఏడాదిన్నర కూటమి పాలనలో ఉద్దానం కిడ్నీ బాధితులకు చేసిందేంటో చెప్పాలన్నారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి కాశీబుగ్గ కిడ్నీ పరిశోధన కేంద్రం, తాగునీటి పథకాలను నిర్వీర్యం చేయకుండా మెరుగైనా సేవలు అందించాలన్నారు. కవిటి సీహెచ్సీలో సిబ్బంది కొరత తీర్చి అదనంగా డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రత్యేక జోన్గా ప్రకటించాలి.. MìSyîl² {糿ê-Ñ™èl {´ë…™èl-OÐðl$¯]l MýSÑsìæ Ð]l$…yýl-Ìê°² òܵçÙÌŒæ gZ¯ŒSV> {ç³MýS-sìæ…_ CMýSPyìl OÐðl§ýl$ÅÌSMýS$ i™èl¿ýæ-™éÅ-ÌS¯]l$ ò³…^èl-MýS-´ù-Ð]lyýl… Ñ^é-Æý‡-MýS-Æý‡Ð]l$° gñæyîlµ O^ðlÆŠ‡-ç³-Æý‡Þ¯ŒS A¯é²Æý‡$. Æ>çÙ‰…ÌZ WÇ-f¯]l {´ë…™éÌS Ð]l*¨-ÇV> MýSÑsìæ Ð]l$…yýl-ÌS…ÌZ° yéMýSt-Æý‡ÏMýS$ MýS*yé 50 Ô>™èl… AÌS-Ððl¯ŒSÞ Ð]l$…þÆý‡$ ^ólĶæ*ÌS° yìlÐ]l*…yŠæ ^ólÔ>Æý‡$. Ð]l*Æý‡$-Ð]lÊÌS {´ë…™èl… M>Ð]l-yýl…™ø §ýl*Æý‡-{´ë…™èl… ¯]l$…_ GÐ]lÆý‡* Æ>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. ️MýSyýlç³, MýSÆý‡*²Ë$ ™èl¨™èlÆý‡ {´ë…™éÌS ¯]l$…_ Ð]l_a MýSÑ-sìæÌZ OÐðl§ýlÅ õÜÐ]lË$ A…¨-çÜ$¢¯]l² yéMýStÆý‡$Ï C糚yýl$ Ò$Ð]l*…çÜÌZ ç³yézÆý‡-°, Mö¯ól²-â¶æ$ÏV> MýSÑsìæ Ð]l$…yýl-ÌS…ÌZ ^ólçÜ$¢¯]l² õÜÐ]l-ÌSMýS$ {糿¶æ$™èlÓ… C^óla VýS$Ç¢…ç³# C§ól¯é A° Ð]l$§ýl-¯]l-ç³yýl$-™èl$-¯é²Æý‡° ^ðl´ëµÆý‡$. ç³NÇ¢Ýë¦-Ƈ$$ÌZ ¯ðl{¸ë-ÌS-hçÜ$t ÌôæMýS-´ù-Ð]lyýl… ò³§ýlª çÜÐ]l$çÜÅV> Ð]l*Ç…-§ýl¯é²Æý‡$. MýSÑsìæ° {ç³™ólÅMýS gZ¯ŒSV> ç³Ç-VýS-×ìæõÜ¢ òܵçÙ-Í‹Üt yéMýSt-Æý‡Ï™ø A°² íÜÑÌŒæ AíÜ-òÜt…sŒæ çÜÆý‡j¯]l$Ï A…§ýl$-»êr$-ÌZMìS Ð]l^óla AÐ]lM>Ôèæ… E…r$…-§ýl-°, Ìôæ°-ç³-„ýS…ÌZ Ð]l$…yýlÌS…ÌZ OÐðl§ýl$ÅÌS MöÆý‡™èl HÆý‡µyól {ç³Ð]l*§ýl… E…§ýl-¯é²Æý‡$. {糿¶æ$™èlÓ… E§é-ïܯ]l…V> Ð]lÅÐ]l-çßæ-ÇõÜ¢ E§éª¯]l… MìSyîl²-»ê-«¨-™èl$ÌS ™èlÆý‡-ç³#¯]l {ç³™èlÅ„ýS B…§øâýæ-¯]lMýS$ íܧýl®Ð]l$° í³ÇĶæ* ÑfĶæ$ òßæ^èlaÇ…-^éÆý‡$. D M>Æý‡Å-{MýS-Ð]l$…ÌZ Ð]l*i GÐðl$ÃÌôæÅ í³ÇĶæ* ÝëÆ‡$$-Æ>gŒæ, OÐðlG-ÝëÞ-ÆŠ‡-ïÜï³ ¯ól™èlË$ ç³Nyìl ¯ól™é-i, MýS{Ç Vøç³Ä¶æ$Å, í³.ÌS-„ýSÃ׿-Æ>Ð]l#, í³.±Ìê^èlÌS…, í³.Ôóæ-QÆŠæ, gñæ.Ķæ¬-VýS…«§ýlÆŠæ, ¯éÆ>-Ķæ$-׿-ÝëÓÑ$, í³.MýS–-Úë~-Æ>Ð]l#, §ýl$¨ª «§ýlÆý‡Ã, G….¯éVóS-ÔèæÓÆý‡-Æ>Ð]l#, G….MýS–-Úë~-Æ>Ð]l#, ºÆý‡Ï ¯éVýS$, í³.f-Ķæ$-Æ>Ð]l#, «§ýl¯]l…-fĶæ$… ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. శాసనసభలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్ వ్యాఖ్యలు హాస్యాస్పదం ఎమ్మెల్యే అబద్ధాలను ఉద్దానం ప్రజలు గమనిస్తున్నారు కవిటి సీహెచ్సీ సందర్శనలో జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ధ్వజం ఉదాసీన వైఖరి మార్చుకోకుంటే బాధితుల తరఫున పోరాటానికి సిద్ధం అంటూ హెచ్చరిక -
డిమాండ్లు నెరవేర్చాల్సిందే
● ప్రభుత్వానికి స్పష్టం చేసిన పీహెచ్సీ వైద్యులు ● జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ అరసవల్లి: గ్రామీణ వైద్యుల సమస్యలు, డిమాండ్లను తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు గొంతెత్తారు. ఈ మేరకు బుధవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద జిల్లాలోని 71 పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు సామూహిక ధర్నా నిర్వహించారు. అనంతరం వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీగా వెళ్లి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. గ్రామీణ పీహెచ్సీ వైద్యులకు టైం బౌండ్ ప్రమెషన్లు కల్పించాలని, జీవో 99 రద్దు చేయాలని.. ఇన్సర్వీస్ జీపీ కోటాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నోషనల్ ఇంక్రిమెంట్లు వెంటనే మంజూరు చేయాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు 50 శాతం గిరిజన భత్యాన్ని అందించాలని, చంద్రన్న సంచార చికిత్సకు రూ.5 వేలు భత్యంగా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పీహెచ్సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ ప్రతిష్టా శర్మ, సుధీర్, పావని, సుమప్రియ తదితరులు పాల్గొన్నారు. పీహెచ్సీల్లో 73 మంది వైద్యుల నియామకం పీహెచ్సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో ప్రజారోగ్య సేవలకు అంతరాయం లేకుండా ఇతర విభాగాల నుంచి వైద్యులను డిప్యుటేషన్ ప్రాతిపదికను నియమించేలా అధికారులు చర్యలు చేపట్టారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ అనిత ఆధ్వర్యంలో 73 మంది వైద్యులను పీహెచ్సీల్లో ప్రత్యామ్నయ ప్రాతిపదికన నియామకాలు పూర్తి చేశారు. బుధవారం నుంచే వీరంతా విధుల్లోకి వెళ్లాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ (జనరల్ ఆసుపత్రి)లో పనిచేస్తున్న 33 మంది వైద్యులతో పాటు డీసీహెచ్ఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా ఆసుపత్రి (టెక్కలి), ఏరియా ఆసుపత్రి (నరసన్నపేట), కమ్యూనిటి ఆసుపత్రులకు చెందిన 40 మంది వైద్యులకు పీహెచ్సీల బాధ్యతలు అప్పగించారు. కాగా, సుదూర ప్రాంతాల్లో ఉన్న పీహెచ్సీలకు తమను పంపించడంపై పలువురు వైద్యులు మండిపడుతున్నారు. చర్యలు తప్పవు.. ఈ విషయమై డీఎంహెచ్వో డాక్టర్ అనిత మాట్లాడుతూ పీహెచ్సీ వైద్యులంతా సమ్మెలో ఉన్నందున ప్రత్యామ్నయంగా 73 మందిని నియమించి డ్యూటి చార్ట్ కేటాయించామని చెప్పారు. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వివిధ ప్రోగ్రా ంలకు ఇన్చార్జి ఆఫీసర్లుగా ఉన్న మెడికల్ ఆఫీసర్లు ఎవరైనా సమ్మెకు దిగితే కఠిన చర్యలు తప్పవన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సీమేన్ మృతి
నరసన్నపేట: మండలంలోని జమ్ము కూడలి సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కంబాల రవి (35) మృతి చెందారు. విశాఖ నుంచి తాతయ్య ఊరు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా డివైడర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోనే రవి మృతి చెందాడు. స్టీల్ప్లాంట్లో పనిచేస్తున్న రవి దసరా పండగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. రవికి భార్య భారతి, తలిదండ్రులు నరసయ్య, కామాక్షమ్మ ఉన్నారు. నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకటే గమనం.. ఒకటే గమ్యం!
● నర్సీపట్నంలో రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ సాఫ్ట్బాల్ పోటీలు ● కఠోర సాధన చేస్తున్న క్రీడాకారులు ● ఇప్పిలి, కేశవరావుపేట వేదికగా రెసిడెన్షియల్ శిక్షణా శిబిరాలు శ్రీకాకుళం న్యూకాలనీ: సాఫ్ట్బాల్ గేమ్లో పతకమే లక్ష్యంగా బాలబాలికలు కఠోర సాధన పూర్తి చేశారు. ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వేదికగా జరిగే ఏపీ రాష్ట్రస్థాయి సబ్జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్బాల్ చాంపియన్షిప్–2025 పోటీల్లో సత్తాచాటేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, యూత్, సీనియర్స్ ఇలా అన్ని విభాగాల్లోను హాట్ ఫేవరేట్గా బరిలో దిగుతున్నారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారుల అభ్యర్ధనను, దసరా సెలవులను పరిగణనలోకి తీసుకున్న జిల్లా సాఫ్ట్బాల్ సంఘ పెద్దలు శ్రీకాకుళం రూరల్ మండలం, ఇప్పిలి జెడ్పీహెచ్స్కూల్ వేదికగా బాలికలకు, ఎచ్చెర్ల మండలం, కేశవరావుపేట జెడ్పీహెచ్స్కూల్ వేదికగా బాలురుకు శిక్షణా శిబిరాలను నిర్వహించారు. టైటిల్ సాధనే లక్ష్యంగా క్రీడాకారులకు గేమ్లో మెలకువులు అందిస్తు తీర్చిదిద్దారు. గేమ్తోపాటు ఫిట్నెస్పై కూడా దృష్టిసారిస్తున్నారు. సంఘ పెద్దలు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. -
శాసనసభలో అవగాహనతో మాట్లాడాలి
సారవకోట: శాసనసభలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అవగాహన లేకుండా మాట్లాడారని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి అన్నారు. బుధవారం సారవకోటలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నకిలీ బెంతు ఒరియాలని చెప్పుకుంటున్న వారు బీసీ–ఏకి చెందిన వడ్డి కులస్తులని, వారి కోసం గతంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిశోధన సంస్థ అధ్యయనం చేసి అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందజేసిందని తెలిపారు. అది తెలుసుకోకుండా శాసనసభలో అవగాహన రాహిత్యంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేసి ఓట్లు కోసం నకిలీ బెంతు ఒరియాల కోసం శాసనసభలో మాట్లాడటం విచారకరమన్నారు. జిల్లాలో ఆదివాసీలకు అవసరమైన ఐటీడీఏ లేదని, నకిలీ గిరిజన ధ్రువపత్రాలతో సుమారు వెయ్యి మంది శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు చేస్తున్నారని, వారిపై శాసనసభలో మాట్లాడం లేదన్నారు. ఆయనతో పాటు ఆదివాసీ సంక్షేమ పరిషత్ సభ్యులు జన్ని దాలయ్య, బొమ్మాళి కృష్ణ, బాలరాజు, నాగయ్య, రంగారావు తదితరులున్నారు. -
బైక్ నుంచి జారిపడి వ్యక్తి దుర్మరణం
పాతపట్నం: పెద్దలక్ష్మిపురం పంచాయతీ రామచంద్రపురం కూడలి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పాతపట్నం ఎస్ఐ కె.మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండల కేంద్రం రెల్లివీధికి చెందిన అడప ఈశ్వరరావు (36) ద్విచక్ర వాహనంపై తెంబూరు నుంచి సారవకోట వెళుతుండగా రామచంద్రపురం కూడలి వద్ద వచ్చేసరికి అదుపుతప్పి బైక్పై నుంచి జారిపడ్డాడు. తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ మధుసూదనరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈశ్వరరావుకు భార్య సుజాత, కుమారుడు యెషన్ ఉన్నారు. సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
చోరీ సొత్తు స్వాధీనం
● హిజ్రా అరెస్టు కంచిలి/పలాస: మండల కేంద్రం కంచిలిలో ఈ ఏడాది జూలై 5న రిటైర్డు లెక్చరర్ పురెళ్ల సింహాద్రి ప్రధాన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి కొంత సొత్తును రికవరీ చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ డి.లక్ష్మణరావు తెలిపారు. 25 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు చోరీకి గురికాగా 12 తులాల ముప్పావు బంగారు ఆభరణాలు, 55.88 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. చోరీ కేసులో ఐదుగురు నిందితుల్లో ఒకరైన కంచిలిలో రైల్వేస్టేషన్ వెనుకవైపు నివాసం ఉంటున్న కవిటి మండలం కవిటి పట్టణం కండ్రవీధికి చెందిన నాగుల సోనియా అనే హిజ్రా బుధవారం ఉదయం 11 గంటలకు సోంపేట వైపు నుంచి కంచిలి రైల్వేస్టేషన్ వైపు చేతిలో కవర్ పట్టుకొని వస్తోంది. పోలీసులను చూసి పారిపోతుండగా సోంపేట సీఐ బి.మంగరాజు సిబ్బంది సాయంతో పట్టుకున్నారు. ఈ క్రమంలో జూలై 5న రాత్రి బూరలు అమ్ముకొనే బాబు(భోపాల్, మధ్యప్రదేశ్), కబాడియా(ఔరంగాబాద్, మహారాష్ట్ర), సనాటా(కోట, రాజస్థాన్), టున్ని అనే నలుగురు వ్యక్తులతో కలిసి కంచిలిలోని సింహాద్రి ప్రధాన్ ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించింది. ఆమె వద్ద 105.53 గ్రాములు బంగారు, డైమండ్ లాంగ్ నెక్లెస్(హారం), 41.57 గ్రాముల మామిడి పిందెల బంగారు చైన్, 3.88 గ్రాముల చెవి రింగులు, 55.88గ్రాముల వెండి గిన్నెలు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో సోంపేట సీఐతో పాటు కంచిలి ఎస్ఐ పి.పారినాయుడు, సిబ్బంది ఉన్నారు. -
కార్మికులపై కక్ష సాధింపు తగదు
రణస్థలం: యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో 22 ఎళ్లుగా పని చేస్తున్న కార్మికులను వైఎస్సార్ సీపీ సానుభూతిపరులనే నెపంతో తొలగించడం అన్యాయమని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ అన్నారు. రణస్థలంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సుమారు 50మంది కార్మికులను తొలగించడం దారుణమన్నారు. ఈ విషయమై యూబీ పరిశ్రమ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే కొద్ది రోజుల్లోనే తిరిగి వేస్తామని చెప్పి నేటికి ఏడాదిన్నర అయినా స్పందించకపోవడం శోచనీయమన్నారు. బీజేపీ సానుభూతిపరులైన కార్మికులు మద్యం తాగినా, పరిశ్రమలో గొడవలు సృష్టించినా ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. భూగర్భ జలవరుల శాఖ అధికారుల అనుమతులు లేకుండా 500 అడుగుల లోతున 3 అడుగుల వెడల్పున బోర్లు వేసి జలాలు ఎలా తోడేస్తున్నారని, పరిసర గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని చెప్పారు. కలుషిత వ్యర్థ జలాలు రణస్థలం పంచాయతీలోని సీతంపేట చెరువులోనికి, బంటుపల్లి జగనన్న కాలనీ వైపు వదిలేస్తుండటంతో పంటలకు నష్టం కలుగుతోందన్నారు. పరిశ్రమ నుంచి వెలువడే బూడిద వల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె శ్రీనివాసరావు, రాష్ట్ర అనుబంధ విభాగం జాయింట్ సెక్రటరీ కెల్ల రామకృష్ణ, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దన్నాన హరి, బంటుపల్లి మాజీ సర్పంచ్ పాశపు ముకుందరావు, కార్మికులు పాల్గొన్నారు. -
నేటి నుంచే కిరణ దర్శనం
● ఆదిత్యాలయంలో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు ● రేపు కూడా దర్శనానికి చర్యలు అరసవల్లి: ఆదిత్య క్షేత్రంలోని సూర్యభగవానుడిపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుతానికి సమయం ఆసన్నమైంది. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఏటా ఉత్తరాయణ దక్షిణాయణ కాలమార్పుల్లో సంభవించే ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు వందలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తుంటారు. ఈ మేరకు బుధవా రం వేకువజాము సూర్యోదయ కాలాన తొలి సూర్యకిరణాలు ఆలయ రాజగోపుర ప్రాకారం నుంచి అనివెట్టి మండపం గుండా నేరుగా గ ర్భాలయంలోని స్వామి మూలవిరాట్టును తాకనున్నాయి. ఈ అద్భుతాన్ని చూసేందుకు మంగళవారం సాయంత్రానికే ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు అరసవల్లి క్షేత్రానికి చేరుకున్నారు. ఈ మేరకు భక్తులకు కిరణదర్శనానికి ప్రత్యేకంగా ధ్వజస్తంభం నుంచి బారికేడ్లను ఏర్పాట్లు చేశారు. సూర్యోదయ సమయా న వాతావరణం అనుకూలిస్తే కచ్చితంగా బుధ, గురువారాల్లో సూర్యకిరణాల కాంతులు స్వామి మూలవిరాట్టుపై దర్శనమిస్తాయని ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ వివరించారు. విద్యార్థి విజ్ఞాన్ మంతన్ రిజిస్ట్రేషన్స్ గడువు పొడిగింపు శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం సంస్థలు ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ సైన్స్ మ్యూజియం, భారతీయ విజ్ఞాన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా లార్జెస్ట్ ఆన్లైన్ సైన్స్ టా లెంట్ టెస్ట్ విద్యార్థి విజ్ఞాన్ మంతన్ 25–26, ఆన్లైన్లో నమోదు చేసుకునే కార్యక్రమం అక్టోబర్ 10 వరకు పొడిగించినట్లు వీవీఎం జిల్లా కోఆర్డినేటర్ ఎ.పున్నయ్య ఒక ప్రకటనలో తెలియజేశారు. వివిధ రాష్ట్రాల పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకు ప్రకృతి వైపరీత్యాలు, అర్ధ సంవత్సర పరీక్షలు, పండగలు దృష్ట్యా పొడిగించామని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మాక్ టెస్ట్ అక్టోబర్ 15 వరకు ఉంటుందని తెలియజేశారు. దుర్గా దేవిగా నీలమణిదుర్గమ్మ పాతపట్నం: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం పాతపట్నం నీలమణిదుర్గ అమ్మవారు దుర్గా దేవిగా పూజలు అందుకున్నారు. అమ్మవారి ఆవరణలోని యోగశాలలో దేవతా హోమాలు, అమ్మవారి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. -
సర్కార్ స్పందించకపోతే
● డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన పీహెచ్సీ వైద్యులు ● పూర్తి స్థాయి విధులకు దూరంగా ప్రభుత్వ గ్రామీణ వైద్యులు అరసవల్లి: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు సర్కారుపై ధ్వజమెత్తారు. మంగళవారం జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం ఎదుట వైద్యులంతా కలిసి ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలతో జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ప్రభు త్వ వైద్యం రోగులకు దూరమైంది. తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించాలంటూ జిల్లా పీహెచ్సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ సు ధీర్, ప్రతిష్టాశర్మ, సుమప్రియ, పావని తదితరుల ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 72 పీహెచ్సీల పరిధిలో పనిచేస్తున్న సుమారు 125 మంది వైద్యులు మంగళవారం ఉదయం నుంచి జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు. సోమవారం వరకు అవుట్ పేషెంట్ (ఓపి) రోగులకు వైద్య సేవలను నిలిపివేసి, కేవలం ఎమర్జెన్సీ వైద్య సేవలను మాత్రమే అందించిన వైద్యులు.. మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలను బంద్ చేశా రు. ముందస్తుగా ఇచ్చిన సమ్మె నోటీసు ప్రాప్తికి తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తామని సర్కార్కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పట్టించుకోవడం లేదు.. వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్గౌర్ విదేశీ పర్యటనను సాకుగా చూపుతూ తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామీణ వైద్యులు ఆరోపిస్తున్నారు. మరో ఐఏఎస్ అఽధికారి కృష్ణబాబుకు తాత్కాలిక బాధ్యతలను అప్పగించినా ఇలాంటి ప రిపాలన అంశాలపై కీలక నిర్ణయాలపై ఆదేశాలు ఇవ్వలేరని చెబుతున్నారు. -
కాంట్రాక్టర్ల గుండె గు‘బిల్లు’
● కాంట్రాక్టర్ల ఈఎండీలు ఇచ్చేదెప్పుడో..? ● రూ.4 కోట్ల మేర పెండింగ్ ● గగ్గోలు పెడుతున్న 40 మంది కాంట్రాక్టర్లు ● అధికార పార్టీ అండదండలు ఉంటేనే బిల్లుల చెల్లింపు శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కార్పొరేషన్ పరిధిలో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏళ్ల తరబడి ఎర్న్డ్ మనీ డిపాజిట్లు(ఈఎండీ) చెల్లించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్లను కలిశామని, వారు హామీ ఇచ్చినా నేటికీ పని జరగలేదని అంటున్నారు. ఈ ఏడాది జూన్లో మూడుసార్లు, జూలైలో ఒక్కసారి ఎమ్మెల్యే, కలెక్టర్లతో కాంట్రాక్టర్లకు మీటింగ్లు జరిగాయి. అయినా ఫలితం మా త్రం లేదు. ఈఎండీలు అంటే కాంట్రాక్టర్లు ఏదైనా పనులకు టెండర్లు వేసి పనులు దక్కించుకున్నప్పుడు ముందస్తుగా డిపాజిట్ కింద 2.5 శాతం డబ్బుల్ని చెక్ రూపంలో చెల్లించాలి. పనులు పూర్తయిన తర్వాత నాణ్యతప్రమాణాలు లోపించడం గానీ, పనులు పాడవ్వడం వంటివి జరిగితే డిపాజిట్గా కట్టిన డబ్బుల్లో దానికి ఖర్చు చేస్తారు. అ లాంటి పరిస్థితులు కార్పొరేషన్ పరిధిలో ఒక్కటి కూడా లేవు. కానీ డబ్బులు మాత్రం చెల్లించడం లేదు. నిర్లక్ష్యమే కొంప ముంచింది ఇంజినీరింగ్ సెక్షన్లో పదేళ్ల పాటు ఈ–1గా విధు లు నిర్వహించిన ఓ వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందని కాంట్రాక్టర్లు చెబుతున్నా రు. డిపాజిట్ కింద ఇచ్చిన చెక్కులు, పనుల వివరాలు రికార్డు చేసిన ఎం–బుక్లు కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఏళ్ల తరబడి తాత్సారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాత వ్యక్తి వెళ్లి కొత్త ఈ–1 వచ్చినా సమస్యను పరిష్కరించకపోవడంతో కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎండీల కోసం తిరిగి తిరిగి రాకపోవడంతో ఇమ్మంది మల్లేసు, కంచరాన బాబురావు అనే కాంట్రాక్టర్లు టెన్షన్ తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. చేసిన పనుల సంగతేంటి..? ఈఎండీ బిల్లుల సంగతి అటుంచితే కూటమి వచ్చాక చేసిన పనులకై నా బిల్లులు ఇవ్వడం లేదు. నిధి పోర్టల్ని అప్డేట్ చేస్తున్నామని కూటమి అధికారంలోకి వచ్చాక నెలల తరబడి తాత్సారం చేశారు. ఇప్పుడు ఈ పోర్టల్ పనిచేస్తున్నా ఒక్క రూపాయి ఇవ్వడం లేదు. పక్కన విజయనగరంలో పనిచేస్తున్న నిధి పోర్టల్ శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎందుకు పనిచేయడం లేదో తెలియని పరి స్థితి ఉంది. కార్పొరేషన్ పరిధిలో ప్రస్తుతం దాదాపు 25 మంది కాంట్రాక్టర్లకు సంబంధించి 25 ఫైళ్ల కు గాను రూ.8 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఆ నలుగురికే బిల్లులు.. కార్పొరేషన్ పరిధిలో పనులు ఎంతమంది పనులు చేసినా బిల్లులు మాత్రం ఆ నలుగురికే వస్తున్నా యి. సీ–బిల్లు పేరుతో కమిషనర్ కూటమి నాయకుల సిఫార్సులు ఉన్నవారికి బిల్లులు ఇస్తు న్నారు. యోగాంధ్ర వంటి కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలకు కోట్లాది రూపాయలు ఖర్చుచేసి వెంటవెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. అలాంటిది శాశ్వత ప్రాతిపదికన ప్రజలకు ఉపయోగకరమైన రోడ్లు, కాలువలు, భవణ నిర్మాణాలకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు అంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘మరో థర్మల్ కేంద్రం మాకొద్దు’
శ్రీకాకుళం: జిల్లాలో గత కొన్నేళ్లుగా కాలుష్యకారకమైన థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రతిపాదించడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ చౌదరి లక్ష్మణ రావు అన్నారు. సరుబుజ్జిలి మండలంలోని గిరిజన గ్రామం వెన్నెలవలస వద్ద 3200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం, ఆమదాలవలసల్లో మంగళవారం కరపత్రాలు పంపిణీ చేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రంతో ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనను తక్షణం నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశా రు. కరపత్రాల ద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రం వల్ల ప్రకృతికి, మానవాళికి జరిగే అనర్థాలను వివరించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో థర్మల్ విద్యుత్ కేంద్రాల ఊసే లేదన్నారు. పర్యావరణ అనుకూలమైన ప్ర త్యామ్నాయ మార్గాలను అన్వేషించాలన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
జి.సిగడాం: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. జి.సిగడాం మండలం ఆనందపురం –వాండ్రంగి గ్రామాల మధ్య వంతెన సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు మండలం ఇల్లయ్యగారిపేట గ్రామానికి చెందిన కొంచాడ యశ్వంత్కుమార్(15), గారపేటకు చెందిన కెల్ల వెంకటేష్ బైక్పై దవళపేటలోని స్నేహితుడి ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో వెనుక నుంచి లగేజ్ వ్యాన్ ఢీకొనడంతో యశ్వంత్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్కు తీవ్రగాయాలు కావడంతో శ్రీకాకుళం తరలించారు. మృతుడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వై.మధుసూదనరావు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.ప్రైవేటు బస్సు ఢీకొని..మెళియాపుట్టి : బస్సు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మెళియాపుట్టి పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్బాబు తెలిపిన వివరాల ప్రకారం.. చాపర గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ నాగవంశపు లక్ష్మణరావు(39) నడిచి వెళ్తుండగా ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతిచెందాడు. లక్ష్మణరావుకు భార్య కల్పన, ముగ్గు రు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం పాతపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ద్విచక్ర వాహనం ఢీకొని..శ్రీకాకుళం రూరల్: పెదపాడు ప్రధాన రహదారిలో పద్మావతి కల్యాణ మండపం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతిచెందాడు. బొట్ట సూర్యనారాయణ (75) స్థానిక పద్మావతి కల్యాణ మండపంలో నైట్ వాచ్మేన్గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి విధుల్లో చేరేందుకు రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుంచి పెదపాడు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సూర్యనారాయణ భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెరుగుతున్న చైతన్యం
స్వచ్ఛంద రక్తదానం.. ● స్వచ్ఛందంగా ముందుకొస్తున్న దాతలు ● ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలుస్తున్న వైనం ● నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవంశ్రీకాకుళం కల్చరల్ : రక్తదానంపై చైతన్యం పెరుగుతోంది. అపోహలు, వివిధ కారణాల వల్ల ఒకప్పుడు శిబిరాలు ఏర్పాటు చేసి బతిమాలితే గానీ రక్తదానానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారింది. స్వచ్ఛందంగా బ్లడ్బ్యాంకులు, శిబిరాలకు వెళ్లి రక్తదానం చేసేవారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతోమందికి పునర్జన్మ లభిస్తోంది. భారత ప్రభుత్వం ఏటా అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవం (నేషనల్ వలంటరీ బ్లడ్ డోనర్స్ డే) నిర్వహిస్తోంది. రక్త నిల్వ కేంద్రాలు.. రక్తాన్ని సేకరించేందుకు జిల్లాలో ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకు(రక్త నిల్వ కేంద్రాలు)లు అందుబాటులో ఉన్నాయి. ఏర్పాటు చేశారు. సేకరించిన ఇక్కడ నిల్వచేసి అవసరమైన వారికి అందిస్తుంటారు. జిల్లాలో అతి పెద్ద రక్తనిల్వ కేంద్రంగా శ్రీకాకుళం రెడ్క్రాస్ నిలుస్తోంది. ఇక్కడి నుంచి జిల్లా కేంద్రంలో రిమ్స్కు, పాతపట్నం, టెక్కలి, పాలకొండల ప్రభుత్వ ఆసుపత్రులకు రక్తాన్ని అందిస్తున్నారు. తలసేమియా, సికిల్సేమియా, హెచ్ఐవీ బాధితులకు ఉచితంగా అందిస్తున్నారు. దీంతో పాటు ప్లేట్లెట్స్, ఎఫ్ఎఫ్పీ కూడా సేకరించి అందిస్తున్నారు. ఎస్డీపీ ద్వారా కూడా రక్తసేకరణ చేస్తున్నారు. అపోహలు వీడాలి.. చాలా మందికి రక్తదానం అంటే భయం, అపోహలు ఉన్నాయి. రక్తదాన ప్రక్రియలో కేవలం 300 మి.లీ. రక్తం మాత్రమే స్వీకరిస్తారు. సాధారణంగా మనిషిలో సరాసరి 5 లీటర్ల నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. అందులో 300 మి.లీ.రక్తం దానం చేయడం వల్ల ఎటువంటి ప్రమాదం జరగదు. 18 నుంచి 60 ఏళ్లు కలిగిన ఆరోగ్యవంతులు రక్తదానం చేయవచ్చు. బీపీ, షుగర్ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రక్తదానానికి దూరంగా ఉండటం మంచిది. జిల్లా జనాభాతో పోల్చితే రక్తదాతలు కేవలం ఒక్క శాతం మాత్రమే. అవసరం మాత్రం అంతకుమించి ఉంది. జిల్లా అవసరాలకు సరిపడా రక్తం సేకరణ జరగడంలేదనే చెప్పాలి. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తగదు
● తక్షణమే ప్రభుత్వం నిర్ణయం ఉపసంహరించుకోవాలి ● అన్ని పార్టీలు, సంఘాలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు పిలుపు శ్రీకాకుళం : వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని దళిత ఆదివాసీ బహుజన మైనార్టీ సంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి సర్కారు తన నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు ఐక్యంగా పోరాటం సాగించి అణగారిన, బహుజన వర్గాలకు వైద్య విద్యను దూరం చేసే కుట్రలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం నుంచే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ దళిత ఆదివాసీ బహుజన మైనార్టీ సంఘాల జేఏసీ ఆద్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. జేఏసీ నేత తైక్వాండో శ్రీను పర్యవేక్షణలో డాక్టర్ కంఠ వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా అంబేడ్కర్ చిత్రపటాని నివాళులర్పించారు. పాటల తూట ఆతవ ఉదయభాస్కర్ తొలుత ఏమై పోదుమో అంబేద్కర్ లేకుంటే అన్న పాటను పాడి సమావేశాన్ని ప్రారంభించారు. – రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ అణగారిన, బహుజన, మైనార్టీవర్గాలను వైద్య విద్యకు దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో అందరూ పాల్గొనాలని కోరారు. పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మెడికల్ కాలేజీలను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడటం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా సంస్కరణల పేరుతో ప్రైవేటీకరణ విధానాలను అమలు చేస్తారని ధ్వజమెత్తారు. కార్పొరేట్లకు, సొంత సామాజికవర్గం వారికి మేలు చేయడంపైనే ఆయన దృష్టి పెడతారని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వాలు మెడికల్ కాలేజీల నిర్మాణాల కోసం అవసరమైన నిధులు ఖర్చు చేయలేరా? అని ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నించే వారు కరువవుతుండడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమన్నారు. గతంలో పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయా పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆందోళనలు చేపట్టేవారని గత కొంత కాలంగా ఆ పరిస్థితి లేకుండాపోయిందన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చణీయాంశమై మరో పోరుకు నాందికావాలని ఆకాంక్షించారు. రౌండ్ సమావేశంలో తీర్మానించిన అంశాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామని నేతలు స్పష్టం చేశారు. ●తైక్వాండో శ్రీను, కంఠ వేణులు మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జేఏసీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దసరా పండుగ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ● రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్ సీపీ యువ నాయకులు ధర్మాన రామ్మనోహర్నాయుడు, కళింగ కోమటి సామాజికవర్గ నాయకులు అంధవరపు సూరిబాబు, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లేపల్లి రామ్గోపాల్, దళిత ఆదివాసీ నాయకులు వాబ యోగి, గ్లోబల్ స్కూల్స్ అధినేత ప్రసాదరావు, హ్యూమన్ రైట్ కమిషన్ నాయకులు ఇంజనీర్ మునిశ్రీనివాస్, ముస్లిం మైనార్టీ సెల్ నాయకులు ముజీమ్, ఎస్సీ ఎస్టీ టీచర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల రమేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బాడాన దేవభూషణరావు, రెల్లి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్, లయన్ కరణం హారికా ప్రసాద్, లయన్ పొన్నాడ రవికుమార్, ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహిబుల్లా ఖాన్, టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు సవలాపురపు వెంకటరమణ మాదిగ, రచయిత దుప్పల రవికుమార్, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎంఏ.రఫీ, ఎస్సీ సెల్ నాయకుడు పొన్నాడ రుషి, కాళింగ సామాజికవర్గ ప్రతినిధి బగాది వెంకటరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు శాసపు జోగినాయుడు, స్వచ్ఛంధ సేవకులు నటుకులు మోహన్, ఇంజినీర్ దుంగ సుధాకర్, నాయకులు తంగుడు నాగేశ్వరరావు, కళింగ కోమటి సామాజికవర్గ ప్రతినిధి కోణార్క్ శ్రీను, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు టి.కామేశ్వరి, నాయకులు మండవిల్లి రవి తదితరులు ప్రసంగించారు. చంద్రబాబు చేపట్టే విధానాలన్నీ పేదల వ్యతిరేక విధానాలే. కార్పొరేట్లకు, తన వారికి లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. – ధర్మాన రామ్మనోహర్నాయుడు, వైఎస్సార్ సీపీ యువనేత కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలని తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం. దేశంలో ఎక్కడా ఇటువంటి విధానం లేదు. – అంధవరపు సూరిబాబు, వైఎస్సార్ సీపీ నాయకుడు రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు. ఆయన సొంతంగా రాసుకున్న రాజ్యాంగం దాని ప్రకారమే పాలన సాగిస్తుంటారు. – కల్లేపల్లి రామ్గోపాల్, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం తీసుకున్న వైద్య కళాశాలల ప్రైవేటీకరణ అంశంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి. మా అధినాయకత్వానికి పునరాలోచన చేయమని కోరుతాం. – సవలాపురపు వెంకటరమణ మాదిగ, టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు అభివృద్ధి ముసుగులో విధ్వంసం చేయడం కూటమి నాయకులకు పరిపాటి అయింది. ఇటువంటి ప్రజావ్యతిరేక పేదల వ్యతిరేక నిర్ణయాలపై సమష్టిగా పోరాడాలి. – దుప్పల రవికుమార్, రచయిత వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చంద్రబాబు తనవారికి లబ్ధి చేకూర్చాలన్నదే కానీ పేదల కోసం ఏ అంశంలోనూ ఆలోచన చేయరు. – ఎంఏ రఫీ , వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ నాయకుడు వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడం అంటే పేద విద్యార్థి కలను కాలరాయడమే. ఇటువంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయో తెలియడం లేదు. – పట్నాల శ్రీనివాస్, వస్త్ర వ్యాపారుల సంఘ నేత వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేయాలని చూస్తే ఉద్యమమే. దీనిపై పునరాలోచన చేసి ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా పోరాడుతాం. – పొన్నాడ రుషి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ నాయకుడు వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వైద్య విద్యను ప్రైవేటీకరించాలని యోచించడం తగదు. ఈ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలి. – జోగినాయుడు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు -
తీరంలో మృతదేహం
సంతబొమ్మాళి: పిట్టవానిపేట సముద్రతీరానికి గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం మంగళవారం సాయంత్రం కొట్టుకొచ్చింది. స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. ఒకటి రెండు రోజుల కిందట సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతై ఉంటారని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు. పేకాటరాయుళ్ల అరెస్టు ఎచ్చెర్ల : తోటపాలెం పంచాయతీ అఖింఖాన్పేట శివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినోద్కుమార్ తెలిపారు. ఘనంగా కొత్తమ్మ తల్లి మారువారం టెక్కలి: కోటబొమ్మాళి కొత్తమ్మ తల్లి ఆలయంలో మంగళవారం మారువారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భక్తులంతా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ముర్రాటలతో చల్లదనం చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా రూ.51 కోట్లు భారం టెక్కలి: ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకం దిగ్విజయంగా కొనసాగుతోందని, ఈ పథకం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం జిల్లాల్లో నెలకు సుమారుగా రూ.51 కోట్లు భారం పడుతోందని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ 6 జిల్లాల్లో 1610 బస్సులు ఉన్నాయని వాటిలో సీ్త్ర శక్తి పథకానికి 1352 బస్సులను కేటాయించినట్లు పేర్కొన్నారు. కొత్తగా బస్సులు పెంచే ఆలోచన ప్రభుత్వ విధానం పై ఆధారపడి ఉంటుందని ఈడీ వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఒక సారి రద్దయిన బస్సులను మళ్లీ పునరుద్ధరణ చేయడం కష్టతరమన్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లను బీఓటీ పద్ధతి ద్వారా ఆధునీ కరణ చేయడానికి చర్యలు చేపడుతున్నామని ఈడీ పేర్కొన్నారు. ఐటీఐలో డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ ఫిట్టర్ తదితర కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులకు అప్రెంటిస్ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఈడీ పేర్కొన్నారు. ప్రస్తుతానికి 154 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రమాదంలో మరణిస్తే రూ.1.10 కోట్ల పరిహారం అందజేస్తామ ని, సాధారణంగా మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని వెల్లడించారు. ఆయనతో పాటు డీపీటీఓ సీహెచ్ అప్పలనారాయణ, డీఈ రవికుమార్, డీఎం ఎం.శ్రీనివాస్ ఉన్నారు. 7న విజయవాడలో ఫ్యాప్టో ధర్నా శ్రీకాకుళం: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ మొండివైఖరికి నిరసనగా ఈ నెల 7న విజయవాడ ధర్నా చౌక్ వద్ద వేలాది మంది ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న ధర్నాను విజయవంతం చేయాలని ఫ్యాప్టో రాష్ట్ర పరిశీలకుడు కె.భానుమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం ఎన్జీఓ భవన్లో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామమూర్తి అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులను బోధనేతర కార్యక్రమాల నుంచి తప్పించడం, మెరుగైన పీఆర్సీ, మధ్యంతర భృతి మంజూరు, మెరుగైన పెన్షన్ విధానం, ఆర్థిక బకాయిల చెల్లింపు, పెన్షనర్లకు కార్పొరేషన్ వంటి హామీలు కాలేదన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లు ఏటా రూ.180 కోట్లు హెల్త్కార్డుల కోసం చెల్లిస్తున్నా ఆస్పత్రులు అంగీకరించడం లేదన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎంటీఎస్ టీచర్ల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా, అంతర్ జిల్లా బదిలీల్లో స్పౌజ్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ బదిలీ అవకాశం కల్పించాలన్నారు. సమావేశంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ పడాల ప్రతాప్కుమార్, కార్యవర్గ సభ్యులు జి.రమణ బి.వెంకటేశ్వర్లు వి.సత్యనారాయణ, కుప్పిలి జగన్మోహన్, చావలి శ్రీనివాస్, వి.నవీన్కుమార్, వి.రామారావు, పి.హరిప్రసన్న, టి.శ్రీనివాసరావు, డి.రామ్మోహన్ డి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇద్దరు గొలుసు దొంగల అరెస్టు
సోంపేట : కొర్లాం జాతీయ రహదారి వద్ద సెప్టెంబరు 14న చైన్స్నాచింగ్కు పాల్పడిన ఇద్దరిని బారువ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సోంపేట సర్కిల్ పోలీస్స్టేషన్లో సీఐ బి.మంగరాజు, బారువ ఎస్ఐ హరిబాబునాయుడు విలేకరులకు వివరాలు వెల్లడించారు. కవిటి మండలం దూగానపుట్టుగకు చెందిన దంపతులు ఎంపలి కృష్ణ, జానకి మందస మండలంలో తన అల్లుడి వద్దకు దసరా పిలుపుకు బయలుదేరారు. కొర్లాం జాతీయ రహదారి వద్ద ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు వీరిని కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు దారి చూపించమని అడిగారు. దీంతో కృష్ణ బైక్ను నెమ్మది చేశారు. ఈ సమయంలో కృష్ణ భార్య ధరించిన 42 గ్రాముల బంగారు చైన్ తెంచుకుని పలాస వైపు పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ఒడిశా రాష్ట్రానికి చెందిన వ్యక్తులుగా అనుమానించారు. కేసు దర్యాప్తు చేస్తుండగా మంగళవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ ధరించి బైక్పై వస్తూ పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులు వెంబడించి ఒడిస్సా రాష్ట్రానికి చెందిన మురళి శెట్టి, రంజన్ సాహులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా కొర్లాంలో జరిగిన చైన్స్నాచింగ్ను ఒప్పుకున్నారు. వీరి వద్ద నుంచి 43 గ్రాముల బంగారు గొలుసు, ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకున్న సోంపేట సీఐ, బారువ ఎస్ఐలకు ఎస్పీ అభినందించారు. -
అరసవిల్లి ఆలయంలో అద్భుత దృశ్యం
సాక్షి, శ్రీకాకుళం: అరసవిల్లి అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో(Arasavalli Temple) బుధవారం ఉదయం అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు(Sun Rays Arasavalli) స్వామివారి మూలవిరాట్ను తాకాయి. నాలుగు నిమిషాలపాటు కనువిందు చేసిన ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు పోటెత్తారు. రేపు కూడా ఇలాంటి దృశ్యం కనిపించే అవకాశం ఉందని పూజారులు చెబుతున్నారు.శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్ను తాకడం ఒక అద్భుతమైన, శాస్త్రీయమైన, ఆధ్యాత్మికంగానూ విశేషమైందిగా భావించబడుతోంది. ప్రతి సంవత్సరం మార్చి 9, 10.. అక్టోబర్ 1, 2 తేదీల్లో ఉదయం 6:05 గంటలకు సూర్య కిరణాలు ఆలయ ద్వారాల ద్వారా నేరుగా సూర్య భగవానుడి పాదాలను తాకుతాయి.ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే ఆరోగ్య, శాంతి, శుభఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భానుకిరణాల స్పర్శతో స్వామివారి విగ్రహం దేదీప్యమానంగా కనిపించడం భక్తులలో పులకింత కలిగిస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడతాయి. ‘ఓం సూర్యనారాయణాయ నమః..’ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతుంది.ఆలయ నిర్మాణం అస్త్రోనామికల్ ప్రిసిషన్తో ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుని విగ్రహాన్ని శిల్పకళా నిపుణులు ఖగోళ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని నిర్మించారు. పంచద్వారాలు, గాలిగోపురం ద్వారా కిరణాలు నేరుగా విగ్రహాన్ని తాకేలా నిర్మాణం చేయబడింది. అందుకే సూర్యుని కక్ష్య మార్పుల వల్ల కేవలం సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే జరుగుతుందని చెబుతుంటారు. ఇదీ చదవండి: కళారాల కళకళ -
● దుర్గంధం..భరించలేం..
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని కొత్తరోడ్డు నుంచి జాతీయ రహదారి మీదుగా వెళ్లే మార్గం దుర్గంధభరితంగా మారింది. ఇక్కడి ఫుట్పాత్పై చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో వాహనచోదకులు, పాదచారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడ శుభకార్యాలు, ఫంక్షన్లు జరిగినా మిగిలిపోయిన భోజనాలు, ఇతర వ్యర్థాలను తీసుకొచ్చి ఇక్కడే పారబోస్తున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు అవి కుళ్లిపోయి భరించలేని దుర్వాసన వెదజల్లుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
గంజాయి స్మగ్లింగ్పై ఉక్కుపాదం
శ్రీకాకుళం పాతస్టాండ్: జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులు, వర్కర్లు, డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని గంజాయి సరఫరా జరుగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా అవసరమని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డితో కలిసి నార్కోటిక్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని కళాశాలల్లో తక్షణమే ఈగల్ కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్పై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. డ్రగ్స్ రహిత సమాజంపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగాలని సూచించారు. ఎస్పీ కె.వి.మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి అరికట్టడంలో కేసులు పెట్టడం మాత్రమే లక్ష్యం కాదని, ఒకే వ్యక్తి పదేపదే వాడుతున్నాడంటే నిఘా లోపం ఉన్నట్టేనని పేర్కొన్నారు. చిన్న సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు గానీ, 112 లేదా 1930 నంబర్లకు గానీ తెలియజేయాలని కోరారు. 2025 జులై–ఆగస్టు నెలల్లో 350.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 77 మందిని అరెస్ట్ చేసి, 8 వాహనాలను సీజ్ చేసినట్టు వివరించారు. మహిళా భద్రతకు అమలు చేస్తున్న ‘నారీ శక్తి’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందన్నారు. అనంతరం రహదారుల భద్రతపై సమీక్షించారు. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు 524 రహదారి ప్రమాదాలు నమోదయ్యాయని ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్విరాజ్ కుమార్, పోలీస్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, విద్యా, వైద్య ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్, రవాణా శాఖల అధికారులు హాజరయ్యారు. -
అర్జీల పరిష్కారంలో అలసత్వం తగదు
● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ● 93 ఫిర్యాదుల స్వీకరణశ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్తో కలిసి 93 అర్జీలు స్వీకరించారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ తీసుకొని డీఎస్సీకి ఎంపికై న 12 మందిని అభినందించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ బ్యానర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండి.. మెళియాపుట్టి: సుర్జిని గ్రామ పరిధిలో గ్రానైట్ క్వారీ వల్ల సమస్యలు మొదలవుతాయని, తమను ప్రశాంతంగా బతకనివ్వాలని మెళియాపుట్టి మండలం బాణాపురం సర్పంచ్ పెద్దింటి చంద్రరావు, విశ్రాంత ఉపాధ్యాయులు కొర్ల కృష్ణమూర్తి తదితరులు కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్సెల్లో వినతిపత్రం అందజేశారు. క్వారీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా బయట గ్రామాల ప్రజలను తీసుకొచ్చి అభిప్రాయ సేకరణ ముగించారని, సుర్జిని గ్రామంలో ఎవరికీ సమాచారం ఇవ్వలేదన్నారు. -
హార్డ్వేర్ షాపు దగ్ధం
కొత్తూరు : కొత్తూరులోని బత్తిలి రోడ్డులో ఇరాజీ కిమారామ్కు చెందిన కమల హార్డ్వేర్ షాపులో ఆదివారం వేకువజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీపంలోని కొత్తూరు అగ్ని ప్రమాక కేంద్రానికి సమాచారం అందించారు. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ శంకరరావు సిబ్బందితో వచ్చి మంటలు అర్పే ప్రయత్నం చేశారు. అయితే ఇంజిన్ మోటార్ పనిచేయకపోవడంతో మంటలు అదుపులోకి రాలేదు. విషయాన్ని జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహన్రావుకు తెలియజేయడంతో వెంటనే పాలకొండ, ఆమదాలవలస అగ్నిమాపక కేంద్రాల ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హార్డ్వేర్షాపుతో పాటు పక్కనే ఆనుకుని ఉన్న చంద్రశేఖర్ మందులు షాపులోకి మంటలు చెలరేగడంతో అక్కడ కూడా సుమారు రూ.ఏడు లక్షల విలువైన మందులు పాడయ్యాయి. జిల్లా అగ్నిమాపక అధికారి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీశారు. కొత్తూరులో వేకువజామున ఘటన సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపు చేసిన సిబ్బంది -
మలేషియాలో ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు
పలాస: మలేషియాలో నివసిస్తున్న తెలుగు ప్రజలకు చెక్కభజన, కోలాటం, తదితర జానపద కళారూపాల్లో శిక్షణ ఇచ్చే అవకాశం ఉత్తరాంధ్ర జానపద కళాకారులకు దక్కడం గొప్ప విషయమని పలాస మండలం రంగోయి గిడుగురామ్మూర్తి తెలుగు భాషా జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు బద్రి కూర్మారావు చెప్పారు. కళాపీఠం సభ్యులు తవిటినాయుడు, సాయికుమార్లు మలేషియాలో నెలరోజుల పాటు అక్కడి తెలుగువారికి జానపద కళల్లో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. స్తంభాన్ని ఢీకొట్టి యువకుడు మృతి శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల సమీప వాటర్ట్యాంక్ వద్ద విద్యుత్తు స్తంభాన్ని ద్విచక్రవాహనంపై వస్తున్న ఓ యు వకుడు ఢీకొట్డాడు. ఈ నెల 27న జరిగిన ఈ ప్రమాదంలో విశాఖపట్నం హనుమంతువాకకు చెందిన కొత్తలంక పూర్ణచంద్రరావు తీవ్రంగా గాయపడి ఆదివారం రాత్రి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు సోమవారం వెల్లడించారు. వివాహమై మూడు నెలలే.. శ్రీకాకుళం రిమ్స్ ప్రభుత్వాసుపత్రిలో పరిపాలనావిభాగంలో కార్యాలయ అసిస్టెంట్గా ఉన్న పూర్ణచంద్రరావుకు విశాఖ యువతి పావనితో మూడు నెలల కిందట వివాహమైంది. పూర్ణచంద్రరావు కారుణ్య నియామకంలో రిమ్స్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. శనివారం రిమ్స్ లో గాయాలతో పూర్ణచంద్రరావు చేరినా అక్క డి సిబ్బంది ఎందుకో గోప్యంగా ఉంచారని భార్య పావని చెప్పినట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్ వెల్లడించారు. పిడుగుపాటుకు వ్యక్తి మృతి కొత్తూరు: సిరుసువాడ గ్రామానికి చెందిన కోటిలింగాల హరిచంద్ర (55) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. సోమవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో గంట పాటు భారీ వర్షం కురిసింది. ఇంటి పెరటిలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. అదే సమయములో ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్న హరిచంద్ర పిడగు ధాటికి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే కొత్తూరు సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందాడు. హరిచంద్రకు భార్య అనసూయ, ముగ్గురు పిల్లలు ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాతపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని యువజన నాయకులు పెద్దిన అమర్నాథ్, గ్రామస్తులు కోరారు. తాటి వనాలతో సంరక్షణ సోంపేట: తీర ప్రాంతం వెంబడి తాటి వనాలను పెంచడం ద్వారా ప్రకృతి విపత్తులు, తుఫానులు, సునామీల నుంచి రక్షణ లభిస్తుందని అటవీశాఖ చీఫ్ వైల్డ్ ఆఫ్ వార్డెన్ , అడిషనల్ పీసీసీఎఫ్ శాంతి ప్రియ పాండే అన్నారు. బట్టిగళ్లూరు గ్రామంలోని తీర ప్రాంతాన్ని అటవీ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. అటవీ శాఖ ద్వారా తాటి విత్తనాలు సేకరించి తీరప్రాంతం వెంబడి నాటే కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. సముద్ర తాబేళ్ల సంరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం డీఎఫ్ఓ ప్రసన్న, కాశీబుగ్గ రేంజర్ మురళీ కృష్ణం నాయుడు, సెక్షన్ ఆఫీసర్ బిందుమతి, బీట్ ఆఫీసర్ సంతోష్కుమార్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ సోమేశ్వరరావు, మత్స్యకార ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
25 కేజీల గంజాయితో ఇద్దరు అరెస్టు
పలాస : పలాస రైల్వేస్టేషన్ మార్గంలో 25 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ సోమవారం విలేకరులకు వెల్లడించారు. ఒడిశాలో కొనుగోలు చేసిన 10 కిలోల గంజాయిని పలాస రైల్వేస్టేషన్ మీదుగా కోల్కతాకు రవాణా చేసేందుకు వెళ్తుండగా పర్లాకిమిడికి చెందిన సర్వశుద్ది కుమార్ స్వామిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయి, సెల్ఫోను స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో.. గజపతి జిల్లా జలంతర్సింగ్ గ్రామానికి చెందిన రాజేష్బెరా ఒడిశాలో కొనుగోలు చేసిన 15 కిలోల గంజాయిని తెలంగాణాకు రైలు ద్వారా అక్రమ రవాణా చేసేందుకు పలాస రైల్వే స్టేషన్కు వెళ్తుండగా అరెస్టు చేశారు. గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
పదోన్నతులు కలేనా?
శ్రీకాకుళం: డీఈఓ పూల్లోని పండితులు పదోన్నతులకు నోచుకోవడం లేదు. అనేక ఏళ్లుగా అప్గ్రేడేషన్ కోసం పోరాటం చేస్తున్న వీరికి 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్దతుగా నిలిచారు. వీరి గోడును తెలుసుకొని అప్గ్రేడేషన్ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా పండితులుగా పనిచేస్తున్న 1200 మంది పండితులు స్కూల్ అసిస్టెంట్ భాషోపాధ్యాయులుగా పదోన్నతి పొందారు. అయితే రాష్ట్రంలో 1134 మంది పండితులు పోస్టులు ఖాళీగా లేకపోవడంతో డీఈవో పూల్లోనే నేటికీ కొనసాగుతూ వస్తున్నారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 87 మంది పండితులు ఇప్పటికీ పదోన్నతులకు నోచుకోకుండా డీఈవో పూల్లోనే ఉండిపోయారు. వీరిలో 65 తెలుగు పండిట్లు, 18 ఒరియా పండిట్లు, 4 హిందీ పండిట్లు ఉన్నారు. ఈ కారణంగా ఏటా ఉపాధ్యాయులకు బదిలీలు చేసినప్పుడు వీరి ప్రమేయం లేకుండానే మారుమూల ప్రాంతాలకు బదిలీ అవుతున్నారు. దీంతో వారంతా మానసిక ఆందోళనకు గురవుతున్నారు. డీఈవో పూల్లో ఉన్న వారికి స్కూల్ అసిస్టెంట్ స్థాయి జీతాలు చెల్లించడం లేదు. పండిట్లకు ఇచ్చే జీతాన్నే ఇస్తున్నారు. కోర్టు చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తోంది. పండితులకు పదోన్నతులు కల్పించకపోగా, ఏటా వారి ప్రమేయం లేకుండానే బదిలీల చేస్తుండటంపై విసిగి వేశారిన పండితులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై క్షుణ్ణంగా పరిశీలించిన ధర్మాసనం తక్షణం పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమాన పనికి తగిన వేతనం ఇవ్వాలని 2024 డిసెంబర్లో తీర్పును వెలువరించింది. ఇది జరిగి తొమ్మిది నెలలు కావస్తున్నా ప్రభుత్వంలో స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఎస్జీటీలు సైతం కోర్టును ఆశ్రయించగా యథాస్థితి కొనసాగించాలని ఆదేశించింది. మరలా దీనిపై పండితులు కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తాజాగా స్టేటస్ కోను ఎత్తివేసింది. అయినా ప్రభుత్వం పదోన్నతులకు చర్యలు తీసుకోకపోవడం పట్ల పండితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ ఉద్యమానికి సిద్ధపడుతున్నారు. ఇతర ఉపాధ్యాయ సంఘాలు సైతం వీరికి అండగా నిలవాలని యోచిస్తున్నారు. కోర్టు తీర్పు అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి పండితులకు పదోన్నతులు కల్పించాలి. నెలలు గడుస్తున్నా తాత్సారం చేయడం సరికాదు. ప్రత్యేక బదిలీలతో వీరిని వేధిస్తున్నారు. – పిసిని వసంతరావు, అధ్యక్షుడు, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ వేదనకు గురవుతున్నాం పండితులకు పదోన్నతులు ఇవ్వకపోగా ఏటా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు. దీని వల్ల మానసిక ఆందోళనకు గురవుతున్నాం. హైకోర్టు ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయకపోవడం సరైన పద్ధతి కాదు. – లోలుగు ప్రసాద్, డీఈఓ పూల్ పండితుడు ప్రమోషన్లకు నోచుకోని డీఈవో పూల్ పండితులు పదేళ్లుగా తప్పని నిరీక్షణ ఏటా మారుమూల ప్రాంతాలకు బదిలీ అమలు కాని కోర్టు ఉత్తర్వులు -
అంతేనా బాసూ!
శ్రీకాకుళం69 తులాల బంగారం చోరీకె.మత్స్యలేశంలో భారీ చోరీ జరిగింది. 69 తులాల బంగారం చోరీ చేశారు. –8లోనేటికీ దొరకని కీలక సూత్రధారి మంగళవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025మద్యం కేసు.. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నకిలీ మద్యం కేసు మిగతా కేసుల్లాగానే నీరుగారిపోతున్నట్లు కనిపిస్తోంది. కీలక సూత్రధారి మీసాల నీలకంఠం తప్పించుకుని తిరుగుతున్నారు. మరోవైపు ఆయన వేసిన క్వాష్ పిటీషన్ కోర్టు కొట్టేసింది. ప్రత్యేక బృందాన్ని వేశామని చెబుతున్న ఎకై ్సజ్ అధికారులు ఆయనను పట్టుకోలేకపోతున్నారు. ఈ నెల 2వ తేదీన సారవకోట మండం అవలింగి సమీపంలోని దుర్గా వైన్ షాపులో, సమీపంలోని ఇంటిలో నకిలీ మద్యం దొరికింది. షాపులో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన నకిలీ మద్యం బాటిళ్లు దొరకగా, సమీపంలోని ఇంట్లో నకిలీ మద్యం బాటిళ్లతో పాటు ఖాళీ సీసాలు, నకిలీ మూతలు, బ్యాచ్ నెంబర్ స్టాంపింగ్ మిషన్ వంటివి దొరికాయి. ఆ ఇంటిని జిల్లా టీడీపీ కీలక నేత సోదరుడు సన్నిహితుడు మీసాల నీలకంఠం అద్దెకు తీసుకుని, నకిలీ మద్యం బాగోతాన్ని నడిపిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఎక్కడెక్కడికి సరఫరా చేశారో గానీ బుడితిలోని దుర్గా వైన్ షాపులో మాత్రం దొరికాయి. అద్దెకు తీసుకున్న ఇంటితో పాటు దుర్గా వైన్ షాపులో ఈ నకిలీ మద్యం వ్యవహారం చిన్నదేమీ కాదని సమాచారం. మందుబాబుల ప్రాణాలు తీసే మద్యంగా అనుమానాలు ఉన్నాయి. ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చిన అల్కహాల్కు కలర్ కలిపి నకిలీ మ ద్యం తయారు చేసి, బాటిలింగ్ చేసి విక్రయిస్తున్నట్టుగా సందేహాలు ఉన్నాయి. దానికోసమే ఏకంగా ఇళ్లు అద్దెకు తీసుకున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. రిపోర్టు ఊహించిందే.. అవలింగిలో దొరికిన నకిలీ మద్యంలో ప్రమాదకర ఆల్కహాల్ కేరామెల్ కలిపి ఉండొచ్చని, ఒడిశా, చత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి ఉండొచ్చని అధికార వర్గాలు సైతం భావించాయి. కానీ, నకిలీ మద్యం శాంపిల్ను విశాఖలోని ల్యాబ్కు పంపించగా డై ల్యూట్లో ఫ్రైస్ లిక్కర్ విత్ వాటర్ అని రిపోర్టు వచ్చిందని ఎన్ఫోర్స్మెంట్ ఇన్చార్జి అసిస్టెంట్ క మిషనర్ రామచంద్రరావు తెలిపారు. అంటే తక్కు వ ధర వైన్లో నీటిని కలిపి ఎక్కువ ధర వైన్లో మిక్స్ చేసినట్టుగా రిపోర్టులో పేర్కొన్నారు. అంటే రూ.160 ధర గల వైన్లో రూ.99 వైన్తో పాటు నీటిని కలిపినట్టు అధికారులు అంచనాకు వచ్చా రు. సాధారణంగా ఎకై ్సజ్ శాఖలో ఎక్కడే కల్తీ మ ద్యం దొరికినా, నకిలీ మద్యం పట్టుబడినా ఈ రకమైన రిపోర్టే వస్తుంది. ఇక్కడ కూడా అదే వచ్చింది. దీంట్లో నిజమెంతో వారికే తెలియాలి. ప్రమాదకరమైన ఆల్కహాల్ కలిసినట్టుగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదని ఎకై ్సజ్ వర్గాలు తేల్చిపారేశాయి. తప్పించుకుంటున్నారా? తప్పిస్తున్నారా? కీలక సూత్రధారి మీసాల నీలకంఠం దొరకకుండా వ్యూహాత్మకంగా తప్పించుకుంటున్నారా? తెరవెనక శక్తులు తప్పిస్తున్నాయా? అన్న అనుమానాలు ఉన్నాయి. వాస్తవంగా నీలకంఠం బాగోతం అంత సులువుగా బయటపడేది కాదు. కానీ, నరసన్నపేట టీడీపీలో రెండు గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపునకు జిల్లా కీలక నేత సోదరుడు నాయకత్వం వహించగా, మరో గ్రూపునకు స్థానిక నేత నాయకత్వం వహిస్తున్నారు. కీలక నేత సోదరుడు అండ చూసుకుని నీలకంఠం స్థానిక నేతకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. స్థానిక నేతకు నీలకంఠం నుంచి ఆర్థిక ప్రయోజనాలు అందడం లేదు సరికదా తన సిండికేట్ వ్యాపారానికి కలిసి రావడం లేదు. ఆ క్రమంలోనే స్థానిక నేత వ్యూహాత్మకంగా నీలకంఠం బాగోతాన్ని బయటపెట్టించేలా పథకం రచించారన్న వాదనలు ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో అధికారులు పట్టుకోక తప్పలేదని తెలుస్తోంది. టీడీపీలోని సిండికేట్ గ్రూపు రాజకీయాలతో నకిలీ మద్యం గుట్టు, నీలకంఠం బాగోతం బయటపడింది. ఇప్పుడా కీలక నేత సోదరుడు తెలివిగా నీలకంఠం తప్పించుకునేలా సహకరిస్తున్నారు. అధికారులకు దొరకకుండా.. అధికార వర్గాలు కూడా సీరియస్గా తీసుకోకుండా ఒత్తిడికి గురి చేసి నకిలీ మద్యం కేసును, మీసాల నీలకంఠంను కాపాడుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. నీలకంఠంకు కూడా ఎకై ్సజ్ శాఖలో మంచి పట్టు, ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడాయనకు కలిసొస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సాధారణ కేసుగానే.. జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం మద్యంలో అడల్ట్రేషన్ జరుగుతోంది. కాస్ట్లీ లిక్కర్లో చీప్ లిక్కర్ కలపడం, చీప్ లిక్కర్లో నీరు కలపడం వంటి సాధారణంగా జరుగుతున్నాయి. ఆ మధ్య టెక్కలిలో ఒక కేసు వెలుగు చూసింది. తర్వాత మసిపూసి మారేడు కాయ చేసేశారు. కల్తీ మద్యం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని లైసెన్సు దుకాణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న బెల్ట్ దుకాణాల్లో విక్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా తేడా కొడితే భారీగా మూల్యం చెల్లించుకోకతప్పదు. నకిలీ మద్యం కేసు నీరు గారినట్టేనా..? తప్పించుకుని తిరుగుతున్న కీలక సూత్రధారి మీసాల నీలకంఠం స్పెషల్ బృందాలు తిరుగుతున్నా దొరకడం లేదంటున్న ఎకై ్సజ్ వర్గాలు టీడీపీ గ్రూపు రాజకీయాలతో దొరికిన నకిలీ మద్యం సూత్రధారిని జిల్లా కీలక నేత సోదరుడు తప్పిస్తున్నట్టుగా అనుమానాలు ఈ నకిలీ మద్యం కేసులో కీలక సూత్రధారి మీసాల నీలకంఠంగా అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఎప్పుడైతే నకిలీ మద్యం పట్టుబడిందో నీలకంఠం పరారైపోయారు. మద్యం బాటిళ్లు దొరికిన దుర్గా వైన్ షాపులో పనిచేస్తున్న ఇద్దరు నౌకర్ నామాలను, లైసెన్సు షాపు యజమానిని అరెస్టు చేశారు. ఆ తర్వాత షాపు సీజ్ చేశారు. ఇక, నీలకంఠం తీసుకున్న అద్దె ఇంట్లో ఉంటున్న పైడిరాజు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కీలక సూత్రధారి మీసాల నీలకంఠం మాత్రం దొరకడం లేదు. ఈయన కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నీలకంఠం కోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దాన్ని కోర్టు కొట్టేసింది. ఇప్పుడాయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. -
ఓపిక నశించి
● నిరసనకు దిగిన పీహెచ్సీ వైద్యులు ● ఓపీ సేవలకు దూరం ● నేటి నుంచి పూర్తిస్థాయి వైద్యసేవలు బంద్ అరసవల్లి: ప్రభుత్వ వైఖరితో సర్కారు వైద్యుల్లో ఓపిక నశించిపోయింది. దీంతో వైద్యులంతా నిరసన బాట పట్టారు. ముందస్తు నోటీసు ప్రకారం సోమవారం నుంచి ఓపీ సేవలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. గత రెండు రోజుల నుంచి అధికారిక వాట్సాప్ గ్రూప్ల నుంచి నిష్క్రమించిన వైద్యులు ఆన్లైన్ నివేదికలను పంపించడాన్ని కూడా నిలిపివేశారు. తాజాగా ఓపీ సేవలను అన్ని పీహెచ్సీలలో నిలిపివేయడంతో రోగులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. అయితే ఎమర్జెన్సీ సేవలను మాత్రం అనుమతిస్తూ తమ వృత్తిధర్మాన్ని పాటించారు. ఓపీ సేవలకు దూరంగా జిల్లాలో 72 గ్రామీణ పీహెచ్సీల్లో సుమారు 125 మంది వైద్యులు సమ్మెబాట పట్టారు. ఇందులో భాగంగా ఔట్పేషెంట్(ఓపీ) సేవలకు అనుమతి నిరాకరించడంతో ఎక్కడికక్కడ రోగులు ప్రభుత్వ వైద్యం కోసం పడిగాపులు కాశారు. ఒక్కో పీహెచ్సీకి 30 నుంచి 35 మంది రోగులు చొప్పున మొత్తం 2, 500 మంది సోమవారం ప్రభుత్వ వైద్యానికి దూరమయ్యారు. వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరాలు, ఇతరత్రా సీజనల్ వ్యాధులతో రోగులు అవస్థలు పడ్డారు. అలాగే చిన్నారులకు, బాలింతలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిలిచింది. నేటి నుంచి పూర్తిస్థాయి బంద్ రాష్ట్ర, గ్రామీణ పీహెచ్సీ వైద్య సంఘ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృత చర్చలకు అవకాశం ఇవ్వకపోవడంతో వైద్యు లు సమ్మె నోటీసును జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం ఎమర్జెన్సీ సర్వీసులు మాత్రమే అందిస్తున్న పీహెచ్సీ వైద్యులు మంగళవారం నుంచి పూర్తిస్థాయి వైద్య సేవలను నిలిపివేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో జిల్లా కేంద్రంలో పీహెచ్సీ వైద్యులంతా ధర్నా నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా పీహెచ్సీ వైద్యుల సంఘ ప్రతినిధులు డాక్టర్ సుధీర్(గుప్పెడుపేట), ప్రతిష్టాశర్మ(బాతువ), సుమప్రియ(పోలాకి), పావని(చాపర) బృందం ఆధ్వర్యంలో కార్యాచరణ అమలు చేస్తున్నారు. మెళియాపుట్టి మండలం చాపర పీహెచ్సీలో వైద్యురాలు పావని అత్యవసర వైద్యం కింద ఓ గర్భిణికి డెలివరీ చేసి తమ వైద్య వృత్తి ధర్మాన్ని చాటుకోవడం గమనార్హం. చాపర పీహెచ్సీలో వైద్యం కోసం వేచి ఉన్న ఓపీ రోగులు -
కక్ష సాధింపు
● ప్లానింగ్ ప్రకారం జీతాలు పెట్టకపోవడం దారుణం దసరా వంటి పండుగ పూట జీతం ఇవ్వకుండా ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయమా. ఒకే సమయంలో చాలా పనులు చెబుతున్నారు. మాకు కూడా కుటుంబాలు ఉంటాయి కదా. సంబంధం లేని పనులన్నీ చెబుతున్నారు. – రెల్ల యమున, వార్డు ప్లానింగ్ సెక్రటరీశ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సచివాలయ ఉద్యోగులపై ఓ ‘ప్లానింగ్’ ప్రకారమే కక్ష సాధింపులు జరుగుతున్నట్టు ఉన్నాయి. ఇతర ఏ శాఖలోని ఉద్యోగులకూ ఇవ్వనన్ని బాధ్యతలు వీరికే అప్పగిస్తున్నారు. పనులు చేయకపోతే తిట్ల దండకం ఎత్తుకుంటున్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ సచివాలయ ఉద్యోగుల్ని పురుగుని చూసినట్లు చూస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘సిగ్గు, లజ్జ లేదా.. పది వేళ్లు నోటికి ఎలా వెళ్తున్నాయి..’ అని రాయలేని భాషలో తిడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏసీపీ–2 జానకి ప్లానింగ్ సెక్రటరీలను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారు. సమయంతో సంబంధం లేకుండా పనులు అప్పగిస్తున్నారని, ప్రశ్నిస్తే కక్షసాధింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. దసరా పూట పస్తులే.. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న ప్లానింగ్ సెక్రటరీలకు జీతాలు పెట్టవద్దంటూ ఏసీపీ లేఖ రాయడం అందరినీ విస్మయపరుస్తోంది. దసరా వంటి పండుగ వేళ జీతాలు రాకుండా అడ్డుకోవడం ఎంతవరకు న్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 నుంచి 3గంటల వరకు వారు ఆందోళనకు దిగడంతో ఉద్రి క్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు రెండు గంటల పాటు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు, ఏసీపీ, ఉన్నతాధికారులు చర్చించి చివరకు జీతాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను తాత్కాలికంగా విరమించారు. వేధింపులు ఇలా.. సచివాలయ ఉద్యోగుల చేత కనీసం 14 నుంచి 15 గంటల పాటు పనిచేయిస్తున్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో సైతం పనులు అప్పగిస్తున్నారు. అదనపు అలవెన్సుల ఊసే లేదు. ఇన్చార్జిల పేరుతో ఒక్కొక్కరికి 4 నుంచి 5 సచివాలయాలు అప్పగిస్తున్నారు. ప్లానింగ్ సెక్రటరీలపై ఏసీపీ కక్ష సాధింపు ప్రశ్నించే వారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్న వైనం ఎఫ్ఏసీ అలవెన్సులు ఇవ్వకుండా ఇష్టానుసారం విధుల అప్పగింత ఆందోళనకు దిగిన ఉద్యోగులు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 10 నుంచి 3గంటల వరకు ఉద్రిక్తత -
బయటపడుతున్న.. బంగారం బండారం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బంగారం వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే నరసన్నపేటలో ఇటీవల కాలంలో పలు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఒక్క పేటకే పరిమితం కాకుండా.. జిల్లా అంతటా పలు షాపుల్లో అక్రమాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో ఆ మధ్య నకిలీ హాల్మార్క్ బంగారం పెద్ద ఎత్తున దొరికింది. ఇప్పుడేమో జీఎస్టీ అధికారుల దాడులతో జీరో వ్యాపారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి వినియోగదారులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడిది నరసన్నపేటకే పరిమితం కాకుండా జిల్లా అంతటా నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాటల గారడీ.. ధర పెరిగినా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. తులం బంగారం రూ.లక్షా 25 వేలు దాటినా వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నా రు. ప్రజల్ని అమాయకులను చేసి బురిడీ కొట్టిస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పి బుట్టలోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటికొచ్చినవి కొన్నే. వెలుగులోకి రానివెన్నో. అలాగని అందరూ అలాంటి వారు కాదు. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి, వినియోగదారుల మన్ననలు, నమ్మకం పొందుతున్నారు. దొంగ బంగారం ఆరోపణలు.. ఇప్పటికే దొంగతనం బంగారం, నాణ్యత తక్కువ ఉన్న ఆభరణాలు, ట్యాక్స్ చెల్లించని బంగారం విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది. గతంలో దొంగ బంగారాన్ని పోలీసులు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ రికవరీ చేశారు. 24 క్యారెట్ అని 22 క్యారెట్, 22 క్యారెట్ పేరిట 18 క్యారెట్ బంగారం ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. బిల్లులపై స్పష్టంగా రాయడం లేదని ఆ మధ్య ఒక అధికారి హెచ్చరించినట్టు తెలిసింది. మొత్తానికి మోసమనేది కొన్నిచోట్ల జరుగుతోంది. జీరో వ్యాపారం.. మోసాలతో పాటు జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్టుగా తాజాగా జరిగిన జీఎస్టీ అధికారుల సోదాలతో తెలుస్తోంది. కోయంబత్తూరు, చెన్నై, ముంబై తదితర నగరాల నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని ఇక్కడ వినియోగదారులకు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఒక్క వినియోగదారులకే కాకుండా పలు షాపులకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ఆ జీఎస్టీ లెక్కలు ఎవరికీ అర్ధం కాకుండా వేస్తున్నారు. కొందరికైతే జీఎస్టీ లేకుండా బంగారం విక్రయిస్తున్నారు. జీఎస్టీ లేకుండా బంగారం కావాలంటే బిల్లులు ఉండవని చెప్పేస్తున్నారు. ఈ తరహా కొనుగోళ్లలోనే మోసాలు జరుగుతున్నాయి. బిల్లుల్లేని బంగారంలో మోసాలకు పాల్పడుతున్నారు. తిరిగి అమ్మేటప్పుడు నిలదీయాలంటే బిల్లులు ఉండాలి. అవి లేనప్పుడు వినియోగదారుడు ఏం అడగగలడని వ్యాపారులు దగా చేస్తున్నారు. నకిలీ హాల్మార్క్ మోసాలు.. ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్ మిషనరీతో నకిలీ హాల్మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నారు. ఆ నకిలీ హాల్మార్క్ బయటపడకుండా ఉండేందుకు నెట్లో ఉన్న వేరే వారి హెచ్యూఐడీ నంబర్లు వేస్తున్నారు. సాధారణంగా హెచ్ఐయూడీ నెంబర్ను గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి హెచ్ఐయూడీ నంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్తో హాల్మార్క్ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. ఆ మధ్య నరసన్నపేటలో ఇదే మోసం వెలుగుచూసింది. వాస్తవంగా ఈ రకమైన మోసం జిల్లాలో చాలాచోట్ల జరుగుతోందని సమాచారం. ఆకస్మిక తనిఖీల్లో అక్కడ బండారం బయటపడింది. దీంతో మనం కొనుగోలు చేస్తున్న బంగారంలో నాణ్యతెంతో ? అన్న అనుమానం వినియోగదారుల్లో నెలకొంది. -
వ్యయ ప్రయాసల రేషన్
● ఉచిత రేషన్ తీసుకొచ్చేందుకు రూ.200 ఖర్చు ● ఏడు గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని వ్యధ ● కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం.. గిరిజనులకు శాపం హిరమండలం : కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా మారింది ఆ ఏడు గిరిజన గ్రామాల పరిస్థితి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇంటింటా రేషన్ సరఫరా చేయడంతో అప్పట్లో ప్రతి ఇంటికి తెచ్చి ఇచ్చేవారు. ఇప్పుడు రేషన్ తెచ్చుకోవాలంటే రూ.200 ఖర్చవుతోందని హిరమండలం మండలంలోని లోకొండ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఈ పంచాయతీలో లోకొండ, మామిడిజోల, మొగడపేట, గోడిపాడు, పూలకొండ, తాళ్లపాడు, లింగుపురం తదితర గ్రామాలున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. గిరిజనులు కూడా నిశ్చింతగా తీసుకునేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంటింటా రేషన్ సరఫరా చేసే వాహనాలను తొలగించింది. పాత రేషన్ విధానాన్ని పునరుద్ధరించింది. దీంతో వీరికి కష్టాలు మొదలయ్యాయి. సుదూరంగా డిపో.. లోకొండ పంచాయతీ పరిధిలో ఏడు గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో రేషన్ డిపో కేటాయించకుండా భగీరథపురంలో డిపో ఏర్పాటుచేశారు. అక్కడికి వెళ్లాలంటే ఆరు కిలోమీటర్లు వ్యయప్రయాసాలకు గురికావాల్సి వస్తోంది. ఉచిత రేషన్ కోసం కుటుంబానికి 30 నుంచి 50 కిలోల బియ్యం అందిస్తున్నారు. ఆ బియ్యాన్ని తెచ్చుకునేందుకు ఆటోలో వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో కుటుంబం రూ.100 నుంచి రూ.200 వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి లోకొండ పంచాయతీ పరిధిలో రేషన్ డిపోను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో ఎంతో బాగుండేది. ఇప్పుడు పేరుకే ఉచిత రేషన్. తెచ్చుకోవాలంటే కనీసం రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉంటుందా? ప్రభుత్వం ఇప్పటికై నా తప్పిదాన్ని సరిచేయాలి. లోకొండ పంచాయతీ పరిధిలో డిపో ఏర్పాటుచేయాలి. – ఎన్.బుడ్డమ్మ, లోకొండ స్థానికంగా రేషన్ డిపో ఏర్పాటుచేయాలి. గతంలో ప్రతి ఇంటికి సులువుగా రేషన్ అందేది. ఇప్పుడు రేషన్ కావాలంటే 6 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది. గిరిజనుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ఇంటింటికీ రేషన్ అందించాలి. – కుద్దిగాం రాము, లోకొండ -
కాంప్లెక్స్ కిటకిట
● సరిపడా బస్సులు లేక ప్రయాణికుల పాట్లు ● గంటల తరబడి తప్పని నిరీక్షణ శ్రీకాకుళం అర్బన్: దసరా సెలవుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిన ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తున్నాయి. సెలవులకు తోడు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ప్రతి బస్సు రద్దీగా కనిపిస్తోంది. సీట్లు సంగతి పక్కన పెడితే నిల్చునేందుకు కూడా జాగా లేని పరిస్థితి నెలకొంటోంది. తాజాగా ఇంటర్మీడియెట్, ఇతర ఉన్నత విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడంతో దూరప్రాంతాల నుంచి విద్యార్థులు ఆదివారం జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం చేరుకోవడంతో కాంప్లెక్స్ కిటకిటలాడింది. ఎక్కువగా విశాఖ నుంచి నాన్స్టాప్ బస్సులతో పాటు సిటీ బస్సులు సైతం నాన్స్టాప్ బస్సులుగా నడిపారు. మరోవైపు, సకాలంలో బస్సులు రాక ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించారు. -
తవ్వేస్తాం.. దోచేస్తాం
● జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుకాసురులు ● యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు వసప గ్రామంలోని ఇసుక స్టాక్ పాయింట్ వద్ద లారీలకు ఇసుక లోడ్ చేస్తున్న దృశ్యం కొత్తూరు: మండలంలోని వసప గ్రామ సమీపంలో బల ద గ్రామం పేరుతో ఇసుక ర్యాంపును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇసుక ర్యాంపులో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారు లు పట్టించుకోవడం లేదు. నదికి వరదలు వచ్చినట్లయితే ఇసుక తవ్వకాలకు ఆటంకం లేకుండా ఉండేందుకు నది మధ్యలో భారీగట్టును నిర్మించారు. దీంతో నదికి వచ్చిన వరద ప్రవాహం మారిపోయే ప్రమాదం ఉంది. నిబంధనల మేరకు నదిలో ఇసుకను కూలీలతో తవ్వకాలు జరిపి ట్రాక్టర్కు లోడు చేయించాలి. అయితే అందుకు విరుద్ధంగా ఇక్కడ ప్రొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. ప్రొక్లెయినర్లతో రెండు నుంచి మూడు మీటర్ల లోతులో తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ విధంగా తవ్వకాలు చేయడం వలన భూగర్భ జాలలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. పేరుకే ఉచితం ప్రభుత్వం ఉచితంగా ఇసుక అని చెబుతున్నా ఇక్కడ అమలు జరగడం లేదని తెలుస్తోంది. ఉచిత ఇసుక పేరుతో సుమారు 20 టన్నుల ఇసుకను రూ. 15 వేల వరకు అమ్ముకుంటున్నట్లు సమాచారం. అక్రమంగా ఇక్కడ నుంచి విజయనగరం, విశాఖపట్నంతో పాటు పలు పట్టణాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణాలపై మైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదు. అధిక లోడుతో ఇసుక లారీలు వెళ్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా నదిలో ఇంతవరకు ఎన్ని క్యూబిక్ మీట ర్ల ఇసుక తరలించారన్న లెక్కలు కూడా తెలియడం లేదు. మరోవైపు రోడ్లు మీద అధికంగా ఇసుక లారీ లు వెళ్తుండడంతో రోడ్లు గోతులమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాకాలంలో ఇసుక తవ్వకాలకు ఇబ్బందులు లేకుండా నదిలో అడ్డంగా నిర్మించిన గట్టు నదికి పైభాగాన ఉన్నందున్న వరదలు వచ్చినట్లయితే కుంటిభద్ర, సిరుసువాడ, వసప కాల నీ గ్రామాలకు ప్రమాదకరంగా మారుతుంది. నదిలో వరద ఉద్ధృతంగా వచ్చినప్పుడు గట్టు అడ్డంగా ఉన్నందున గ్రామాల్లో వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. అక్రమంగా జరుగుతు న్న ఇసుక తవ్వకాలను అధికారులు నిలుపుదల చేయాలి. – అగతమూడి నాగేశ్వరరావు, కుంటిభద్ర, కొత్తూరు మండలం -
ఎవరొస్తారో..ఎప్పుడొస్తారో!
● రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో కొరవడుతున్న పర్యవేక్షణ ● సక్రమంగా అమలు కాని ఫేస్ అటెండెన్స్ శ్రీకాకుళం : శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రిలో పర్యవేక్షణ కొరవడుతోంది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సక్రమంగా అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటర్ల సెలవులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ రెండేళ్లుగా అమలు చేస్తోంది. ప్రత్యేక యాప్ ద్వారా హాజరు వేయకుంటే ఆ రోజును సెలవుగా పరిగణిస్తారు. ఈ హాజరును పరిశీలించి జీతాన్ని మంజూరు చేయాల్సి ఉంటుంది. రిమ్స్ ఆసుపత్రిలో మాత్రం ఇది అస్సలు అమలు కావడం లేదు. దీనిని ఎవరు పరిశీలిస్తున్నారన్నది కూడా అంతుచిక్కడం లేదు. రాష్ట్రస్థాయిలో సైతం ఈ హాజరును పరిశీలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఓ అధికారి తరచూ అనధికారికంగా గైర్హాజరవుతున్నా ఫేస్ అటెండెన్స్ వేయకుండా నెల మొత్తానికి జీతాలు చెల్లించేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో సైతం దీనిపై దృష్టి సారించకపోవడం గమనార్హం. రిమ్స్ లోని చాలామంది వైద్యులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తుండడంతో నిర్ణీత సమయానికంటే చాలా ముందుగానే వెళ్లిపోతున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారి సైతం నిర్ణీత సమయం కంటే ముందుగా వెళ్లిపోవడం, సెలవులో ఉండటం జరుగుతుండడం వల్ల ప్రశ్నించే వారే లేకుండాపోతున్నారు. ఈ కారణంగానే గైర్హాజరవుతున్న అధికారిని సైతం అడగలేని పరిస్థితి నెలకొంది.నవంబరు 11 నుంచి సిక్కోలు పుస్తక మహోత్సవం శ్రీకాకుళం కల్చరల్: జిల్లా కేంద్రంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో నవంబరు 11 నుంచి 20 వరకు సిక్కోలు పుస్తక మహోత్సవం–2025, సాహిత్య, సాంస్కృతిక వైజ్ఞానిక సంబరాలు నిర్వహించాలని సన్నాహక కమిటీ ప్రతినిధులు నిర్ణయించారు. ఈ మేరకు శ్రీకాకుళం యూటీఎఫ్ భవనంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కమిటీ ఆదివారం సమావేశమైంది. ముందుగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 100 ప్రచురణ సంస్థలు బుక్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. 10 రోజుల పాటు సాహిత్య సభలు, పుస్తక పరిచయాలు, కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. సాంస్కృతిక వేదికపై జిల్లా సంస్కృతిని ప్రతిబింబించే తప్పెటగుళ్లు, జముకుల పాట, కోలాటం, పగటి వేషాలు, నాటిక, డ్యాన్సులు, సంగీత ప్రదర్శనలు, ఏకపాత్రాభినయ ప్రదర్శనలు, సైన్స్ఫెయిర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, కవితలు, కథలు వంటి అంశాలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. సమావేశంలో సిక్కోలు పుస్తక మహోత్సవ కన్వీనర్ కేతవరపుశ్రీనివాస్, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజయ్ శర్మ, అట్టాడ అప్పలనాయుడు, ఎల్.రామలింగస్వామి, యు.నాగేశ్వరరావు, ఆర్.వి.రమణమూర్తి, కంచరాన భుజంగరావు, చింతాడ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం అరసవల్లి/గార: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. దసరా సెలవులు సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కుటుంబ సమేతంగా ఆదిత్యుని దర్శించుకున్నారు. ఈయన వెంట జిల్లా ఎస్పీ కె.మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ప్రత్యేక దర్శనాల ద్వారా రూ.2,78, 800, విరాళాల రూపంలో రూ.66,718, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.2.05లక్షలు వరకు ఆదాయం లభించినట్లు ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ తెలిపారు. ప్రముఖ విష్ణుక్షేత్రం శ్రీకూర్మంలోని కూర్మనాథున్ని కూడా విజయనగరం ఎస్పీ దామోదర్ దర్శించుకున్నారు. ఈవో కె.నరసింహానాయుడు స్వామి చిత్రపటాన్ని, క్షేత్ర ప్రసాదాన్ని అందించారు. . -
డబుల్ కిక్
ఎక్సైజ్కుసాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: మద్యం షాపుల నుంచి ఎకై ్సజ్ తదితర వర్గాలు నెలవారీ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా దసరా మామూళ్లు సైతం ఫిక్స్ చేశారని తెలిసింది. బెల్ట్ షాపునకు రూ.5వేలు, దాబాకు రూ.10వేలు, వైన్ షాపునకు రూ.25వేలు చొప్పున నిర్వాహకుల నుంచి వసూలు చేస్తున్నట్లు సమాచారం. బెల్ట్షాపులు, దాబాల నుంచి వసూలు చేసే బాధ్యతను కొంతమంది సిబ్బందికి అప్పగించగా, వైన్షాపుల బాధ్యత ఓ క్షేత్రస్థాయి అధికారికి అప్పగించినట్టు వ్యాపార వర్గాల ద్వారా తెలుస్తోంది. వసూలు చేసిన దాంట్లో వాటాలు కూడా నిర్ణయించినట్టు సమాచారం. బెల్టుషాపుల హవా.. జిల్లాలో సిండికేట్ హవా నడుస్తోంది. బెల్ట్షాపుల దందా కొనసాగుతోంది. ఎంఆర్పీకి మించి విక్రయా లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎకై ్సజ్ వర్గాలకు ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.జిల్లాలో వైన్షాపులు, పర్మిట్ రూమ్ లు ఇప్పటికే ఉండగా, అనుబంధంగా బెల్ట్షాపులు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో కాదు.. ఒక్కొక్క వీధిలో నాలుగైదు బెల్ట్షాపులు నడుస్తున్నాయి. కోడ్ ప్రకారమే.. కొన్నిచోట్ల ఏకంగా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఉంచి ఏ దుకాణానికి, ఏ కోడ్తో ఏ మద్యం సరఫరా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుని బెల్ట్షాపులకు సరఫరా చేస్తున్నారు. మద్యం విక్రయించే సమయంలో కూడా ఎంచుకున్న కోడ్తో ఏ, బీ, సీ, డీ అనే అక్షరాలు బాటిల్పై రాస్తున్నట్టు తెలుస్తోంది. వాటి ఆధారంగా బెల్ట్షాపులకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అధికారులు దాడులు చేసి మద్యం సీసాలను పట్టుకుంటే ఆ కోడ్ను చూసి వదిలేసేలా ఏర్పాట్లు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి బెల్ట్ వ్యవహారం పక్కా పథకం ప్రకారం జరుగుతోంది. వైన్ షాపుల నుంచి బెల్ట్షాపులకు ఒక్కొక్క క్వార్టర్ బాటిల్పై రూ.10 నుంచి రూ.30 వరకు అదనంగా వేసి ఇస్తున్నట్టు తెలుస్తోంది. వాటి పై మరో రూ.20, రూ.30, రూ.40, రూ.50 వేసి మందుబాబులకు విక్రయిస్తున్నారు. ఇదంతా జరగాలంటే ఎకై ్సజ్ వర్గాల ప్రోత్సాహం ఉండాల్సిందే. కొనసాగుతున్న ముడుపుల పర్వం.. íÜ…yìl-MóS-sŒæ™ø Jç³µ…-§éË$, ¯ðlÌSÐéÈ Ð]l¬yýl$-ç³#ÌS ç³Æý‡Ó… Mö¯]l-ÝëVýS$-™ø…¨. »ñæÌŒæt-Úë-ç³#Ë$ ò³Ç-W¯]l ™èlÆ>Ó™èl ÐéÅ´ëÆý‡… MýS*yé ò³Æý‡-VýS-yýl…™ø Ððl¬§ýlsZÏ Ð]l¬yýl$-ç³#Ë$ CÐ]lÓ-yé-°MìS ÐéÅ´ë-Æý‡$Ë$ Mö…™èl Cº¾…-¨-ç³-yéz..C-糚yýl$ Ìê¿êË$ Ð]lçÜ$¢…yýlr…™ø Ð]l¬yýl$-ç³#ÌS ÑçÙ-Ķæ*°² ò³§ýlª ¿êÆý‡…V> ¡çÜ$-Mø-Ð]lyýl… Ìôæ§ýl$. C§ýl…™é ¯ðlÌS ÐéÈ »êVø-™èl…. C糚yýl$ §ýlçÜÆ> Ð]l_a…-¨. V>Å‹Ü, ´ëË$, ´ëÇÔ¶æ$§ýl®Å M>Ç-Ã-MýS$yýl$, Ððl$M>-°MŠSÌS §ýlVýSYÇ ¯]l$…_ {糡 JMýSP-ÇMîS CçÙt…-V>¯ø, MýSçÙt…-V>¯ø G…™ø Mö…™èl CÐ]lÓyýl… B¯]l-Ðé-Ƈ$$-¡. CMýSPyýl MýS*yé A§ól ™èlÆý‡-àÌZ CÐéÓ-ÌS-°.. ç³…yýlVýS ^ólçÜ$-Mø-ÐéÌS° OÐðl¯ŒSÚëç³#, »ñæÌŒætÚëç³#, §é»êÌSMýS$ «§ýlÆý‡Ë$ °Æý‡~-Ƈ$$…_¯]lr$t ™ðlÍíÜ…¨. D ¯ólç³£ýlÅ…ÌZ ÐéÅ´ëÆý‡$-ÌSMýS$ BçœÆŠ‡ MýS*yé C_a¯]lr$t çÜÐ]l*-^é-Æý‡…. §ýlçÜÆ> ç³…yýlVýS ïÜf¯ŒSÌZ G…BÆŠ‡-ï³MìS Ñ$…_ «§ýlÆý‡Ë$ ò³…^èl$-MýS$¯ól ÐðlçÜ$-Ë$-»êr$ MýS͵…-_-¯]lr$t BÆø-ç³×æË$ Ѱ-í³-çÜ$¢-¯é²Æ‡$$. »ñæÌŒætÚë-ç³#-ÌZÏO¯ðl™ól JMöPMýSP »êsìæÌŒæ Oò³ Æý‡*.50MìS-Oò³V> ò³…^éÌS° Cç³µsìæMóS »ñæÌŒæt °Æ>Ó-çßæ-MýS$Ë$ °Æý‡~-Ķæ*-°-Mö^éaÆý‡$. hÌêÏ A…™èl-sê C§ól ™èl…™èl$ ¯]lyýl$-Ýù¢…-¨.◘నెలవారీ వసూళ్లు.. తోడుగా దసరా మామూళ్లు! బెల్ట్షాపుల నుంచి వైన్షాపుల వరకు సొమ్ము ఇచ్చుకోవాల్సిందే రూ.5వేల నుంచి రూ.25 వేల వరకు రేట్ ఫిక్స్ నెలవారీ మామూళ్లకు ఇవి అదనం మద్యం ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు! -
నైపుణ్యాలతోనే ఉపాధి అవకాశాలు
శ్రీకాకుళం రూరల్: పోటీ ప్రపంచంలో విద్యార్హతలు కంటే నైపుణ్యత ఉంటేనే రాణించగలమని జెమ్స్ సీఓఓ శ్రీధర్రెడ్డి అన్నారు. రాగోలు జెమ్స్ ఆస్పత్రిలో బొల్లినేని బీఎస్సీ ఎలైడ్ అండ్ హెల్త్కేర్ కళాశాల ఫ్రెషర్స్డే వేడుకలు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా వైద్యరంగంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయని, ప్రత్యేక నైపుణ్యం కలిగిన వారు మాత్రమే ఈ రంగంలో రాణించగలరని చెప్పారు. బీఎస్సీ ఎలైడ్ హెల్త్కేర్ కోర్సులకు మంచి డిమాండ్ ఉందన్నారు. జెమ్స్ మెడికల్ డైరెక్టర్ హేమంత్ మాట్లాడుతూ రోగికి వైద్య చికిత్సలో ఎలైడ్ హెల్త్ కోర్సు విద్యార్థుల పాత్ర కీలకమని చెప్పారు. వైద్యుని తరువాత స్థానం వీరిదేనన్నారు. బొల్లినేని మెడిస్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పట్టుదలతో చదివితే విజయం సొంతమవుతుందన్నారు. అకడమిక్ డైరెక్టర్ సీహెచ్ లక్ష్మీ పద్మజ మాట్లాడుతూ కళాశాల దశమ వార్షిక ప్రణాళిక, సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
30న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన
గార: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 30న జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతామని వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంజేటి కృష్ణమూర్తి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సూచనలతో జిల్లాలోని అన్ని దళిత సంఘాలను సమన్వయం చేస్తూ, పార్టీ అనుబంధ విభాగాలతో నిరసన ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. పేద ప్రజల ఆరోగ్యానికి నష్టం చేకూర్చేలా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు హేయమన్నారు. నిరసన కార్యక్రమంలో జిల్లా అన్ని విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): విశ్వమానవ సమానత్వం కోసం తన కలంతో గర్జించిన నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని బడుగు, బలహీనవర్గాల నాయకులు పేర్కొన్నారు. శ్రీకాకుళంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పార్కులో ఆదివారం జాషువా 130వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో ఉన్న కుల వివక్షత, అణచివేత, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన కలాన్ని ఆయుధంగా మలిచి గబ్బిలం, ఫిరదౌసి, కాందిశీకుడు వంటి అనేక రచనలు ద్వారా సమాజాన్ని చైతన్యపరచినా గొప్ప కవి గుర్రం జాషువా అని కొనియాడారు. బడుగు, బలహీనవర్గాలతో పాటు మహిళల సమానత్వం కోసం అనేక రచనలు చేశారన్నారు. యువత ఆయన అడుగుజాడల్లో నడుచుకోవడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం, దళిత సంఘాలు, బహుజన నాయకులు కళ్ళేపల్లి రాంగోపాల్, కంఠ వేణు, అమీరుల్లా బేగ్, గద్దిబోయిన కృష్ణ, కాగిత వెంకటరావు, యజ్జల గురుమూర్తి, కిల్లాన శ్రీనివాస్, ఆలాపన త్రినాథ్రెడ్డి, బోనెల రమేష్, సీర రమేష్బాబు, పడాల ప్రతాప్కుమార్, పురుషోత్తం రాంబాబు, యడ్ల జానకీరావు, సాంబారిక సూరిబాబు, గోల్లపల్లి నందేశ్ పాల్గొన్నారు. -
బయటపడుతున్న.. బంగారం బండారం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: బంగారం వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే నరసన్నపేటలో ఇటీవల కాలంలో పలు అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఇది ఒక్క పేటకే పరిమితం కాకుండా.. జిల్లా అంతటా పలు షాపుల్లో అక్రమాలు కొనసాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నరసన్నపేటలో ఆ మధ్య నకిలీ హాల్మార్క్ బంగారం పెద్ద ఎత్తున దొరికింది. ఇప్పుడేమో జీఎస్టీ అధికారుల దాడులతో జీరో వ్యాపారం జరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టి వినియోగదారులను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడిది నరసన్నపేటకే పరిమితం కాకుండా జిల్లా అంతటా నడుస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాటల గారడీ.. ధర పెరిగినా ప్రజలకు బంగారంపై మోజు తగ్గడం లేదు. తులం బంగారం రూ.లక్షా 25 వేలు దాటినా వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. బంగారానికి ఉన్న డిమాండ్ను కొందరు వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నా రు. ప్రజల్ని అమాయకులను చేసి బురిడీ కొట్టిస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పి బుట్టలోకి లాగేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న మోసాల్లో బయటికొచ్చినవి కొన్నే. వెలుగులోకి రానివెన్నో. అలాగని అందరూ అలాంటి వారు కాదు. కొందరు నిజాయితీగా వ్యాపారం చేసి, వినియోగదారుల మన్ననలు, నమ్మకం పొందుతున్నారు. దొంగ బంగారం ఆరోపణలు.. ఇప్పటికే దొంగతనం బంగారం, నాణ్యత తక్కువ ఉన్న ఆభరణాలు, ట్యాక్స్ చెల్లించని బంగారం విక్రయిస్తుంటారన్న ప్రచారం ఉంది. గతంలో దొంగ బంగారాన్ని పోలీసులు రికవరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ రికవరీ చేశారు. 24 క్యారెట్ అని 22 క్యారెట్, 22 క్యారెట్ పేరిట 18 క్యారెట్ బంగారం ఇస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. బిల్లులపై స్పష్టంగా రాయడం లేదని ఆ మధ్య ఒక అధికారి హెచ్చరించినట్టు తెలిసింది. మొత్తానికి మోసమనేది కొన్నిచోట్ల జరుగుతోంది. జీరో వ్యాపారం.. మోసాలతో పాటు జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నట్టుగా తాజాగా జరిగిన జీఎస్టీ అధికారుల సోదాలతో తెలుస్తోంది. కోయంబత్తూరు, చైన్నె, ముంబై తదితర నగరాల నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని ఇక్కడ వినియోగదారులకు కట్టబెడుతున్నట్టు సమాచారం. ఒక్క వినియోగదారులకే కాకుండా పలు షాపులకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానికంగా మాత్రం ఆ జీఎస్టీ లెక్కలు ఎవరికీ అర్ధం కాకుండా వేస్తున్నారు. కొందరికై తే జీఎస్టీ లేకుండా బంగారం విక్రయిస్తున్నారు. జీఎస్టీ లేకుండా బంగారం కావాలంటే బిల్లులు ఉండవని చెప్పేస్తున్నారు. ఈ తరహా కొనుగోళ్లలోనే మోసాలు జరుగుతున్నాయి. బిల్లుల్లేని బంగారంలో మోసాలకు పాల్పడుతున్నారు. తిరిగి అమ్మేటప్పుడు నిలదీయాలంటే బిల్లులు ఉండాలి. అవి లేనప్పుడు వినియోగదారుడు ఏం అడగగలడని కొందరు వ్యాపారులు దగా చేస్తున్నారు. బయటపడుతున్న ఘటనలన్నీ నరసన్నపేటలో అయినప్పటికీ దాని లింకు జిల్లా వ్యాప్తంగా ఉందనే వాదనలు ఉన్నాయి. మొత్తానికి బంగారం విషయంలో జిల్లాకు చెడ్డ పేరు వస్తోంది. బంగారంలో నాణ్యత, లావాదేవీలు ఎంతవరకు కచ్చితమనేది చెప్పలేని పరిస్థితి నెలకొంది. బట్టబయలవుతున్న బంగారం మోసాలు నరసన్నపేటకే పరిమితమా? జిల్లా వ్యాప్తంగా ఇదే బాగోతమా? మొన్న నకిలీ హాల్మార్క్ మోసం తాజాగా జీఎస్టీ అధికారుల సోదాలతో వెలుగులోకి జీరో వ్యాపారం చివరికీ మోసపోతున్నది వినియోగదారులే నకిలీ హాల్మార్క్ మోసాలు.. ప్రత్యేకంగా తయారు చేసిన లేజర్ మిషనరీతో నకిలీ హాల్మార్క్ వేసి బంగారం విక్రయిస్తున్నారు. ఆ నకిలీ హాల్మార్క్ బయటపడకుండా ఉండేందుకు నెట్లో ఉన్న వేరే వారి హెచ్యూఐడీ నంబర్లు వేస్తున్నారు. సాధారణంగా హెచ్ఐయూడీ నెంబర్ను గూగుల్ సెర్చ్ చేస్తే మొత్తం వివరాలన్నీ వచ్చేస్తాయి. ఆ రకంగా వెలుగు చూడకూడదని వేరే వారి హెచ్ఐయూడీ నంబర్ను ఉపయోగించి సొంతంగా ఏర్పాటు చేసుకున్న మిషన్తో హాల్మార్క్ వేసి వ్యాపారం సాగించేస్తున్నారు. ఆ మధ్య నరసన్నపేటలో ఇదే మోసం వెలుగుచూసింది. వాస్తవంగా ఈ రకమైన మోసం జిల్లాలో చాలాచోట్ల జరుగుతోందని సమాచారం. ఆకస్మిక తనిఖీల్లో అక్కడ బండారం బయటపడింది. దీంతో మనం కొనుగోలు చేస్తున్న బంగారంలో నాణ్యతెంతో ? అన్న అనుమానం వినియోగదారుల్లో నెలకొంది. -
బ్యాంగిల్ షాపు దగ్ధం
టెక్కలి రూరల్: టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 10వ లైన్లో కోటిపల్లి కృష్ణారావు, దమయంతికి చెందిన బ్యాంగిల్ షాపు దగ్ధమైంది. శనివారం రాత్రి 12 గంటల సమయంలో షాపు నుంచి పొగ రావడంతో చుట్టుపక్కలవారు గమనించి షాపు యజమానికి ఫోన్లో సమాచారం అందించారు. యజమాని హుటాహుటిన షాపు వద్దకు చేరుకోగా అప్పటికే మంటలు ఎగసిపడ్డాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే షాపులో చీరలు, ఫ్యాన్సీ సామగ్రి, గాజులు ఇతర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.2లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతి నరసన్నపేట: జమ్ము కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పోలాకి మండలం గాతలవలసకు చెందిన బమ్మిడి దామోదరరావు ఆదివారం ఉదయం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో (54) మృతి చెందాడు. స్థానిక హాటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దామోదరరావు డ్యూటీ ముగించుకొని జమ్ము కూడలి వద్ద రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపు వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే 108 అంబులెన్సులో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం శ్రీకాకుళం రిమ్స్లో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నరసన్నపేట ఎస్ఐ సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. దామోదరరావు భార్య వీరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. గంజాయితో పట్టుబడిన రౌడీషీటర్ శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని డచ్బంగ్లా వద్ద రెండు కిలోల గంజాయితో నగరానికి చెందిన ఓ రౌడీషీటర్ పట్టుబడ్డాడు. ఒకటో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక మంగువారితోట కండ్రవీధికి చెందిన బొమ్మలా ట హరికృష్ణ ఒడిశాకు చెందిన గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తెచ్చి డచ్బంగ్లా సమీపంలో విక్రయం చేసేందుకు వేచి ఉండగా ఎస్ఐ ఎం.హరికృష్ణ సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ మహిళపై అఘాయిత్యానికి సంబంధించి కేసులో హరికృష్ణపై షీట్ ఓపెన్ అవ్వడం, కొట్లాట కేసు కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్టు చేసినట్లు, కేసును సీఐ పైడపునాయుడు దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీసులు పేర్కొన్నారు. జనసేనలో వర్గ విభేదాలు కంచిలి: జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ నాయకత్వంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్కు స్థానిక పార్టీ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో కష్టపడే నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు గుర్తింపు ఉండటం లేదని, ఇదేంటని ప్రశ్నిస్తే తాము వేరే పార్టీ వాళ్లమంటూ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దుర్భాషలాడుతూ గొడవలు సృష్టిస్తున్నారని వాపోయారు. -
స్నేక్హితుడు..!
శ్రీకాకుళం జిల్లా: ఆయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు. ఓ వైపు సాగు చేస్తూనే.. మరోవైపు ఎల్రక్టీషియన్, మెకానిక్గా కూడా రాణిస్తున్నాడు. అన్నింటికీ మించి అలవోకగా పాముల ను పట్టే నేర్పరి. అలాగని ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఎవరి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు సాధించాడు హిరమండలం మండలం ఎం.అవలంగికి చెందిన లోలుగు వేణుగోపాలరావు. ఇప్పటివరకు 10 వేలకుపైగా పాములను పట్టి సురక్షిత ప్రాంతాల్లో విడిచిపెట్టిన ఘనత ఆయనది. ఆయనను ‘సాక్షి’ పలకరించగా ఆసక్తికర విషయా లను వెల్లడించారు. 20 ఏళ్ల వయస్సులోనే ఆసక్తి వేణుగోపాలరావుకు ప్రస్తుతం 55 ఏళ్ల వయస్సు. 20 ఏళ్లలోనే పాములు పట్టాలన్న ఆసక్తి పెరిగింది. చిన్నప్పుడు వ్యవసాయ పనుల్లో భాగంగా ఎంతోమంది పాముకాటుకు గురై అవస్థలు పడిన ఘటనలు చూసిన వేణుగోపాలరావుకు మనస్సు కలచివేసిందట. అదే సమయంలో పాములను చంపేస్తున్న ఘటనలు చూసి బాధపడేవాడు. దీంతో అప్పుడే పాములు పట్టాలన్న ప్రయత్నం మొదలుపెట్టారు. ఎక్కడైనా పాములు కనిపిస్తే పెద్ద సంచులు, గొట్టాలతో పట్టడం, వాటికి ఉరి వేసి బంధించడం క్రమేపీ అలవాటు చేసుకున్నాడు. అలా ఆయన ప్రస్థానం 35 ఏళ్ల కిందట ప్రారంభమైంది. అలాగే యూట్యూబ్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక పాములు పట్టడంలో మరిన్ని మెలకువలు నేర్చుకున్నారు. క్రమేపీ చాకచక్యంగా పాములు పట్టడంలో సిద్ధహస్తుడిగా మారిపోయాడు. 2018 తితిలీ తుపాను సమయంలో ఏకంగా 1,500 పాములు పట్టి రికార్డు సృష్టించాడు. సాధారణంగా ఏడాదికి 500 వరకూ పాములు పడుతుంటాడు. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు ఒడిశాలోని పర్లాకిమిడి, కాశీనగర్, గుణుపూర్కు సైతం వెళ్లి పాములు పడుతుంటారు. అందుకే తన నంబర్తో పాటు ప్రత్యేక యూట్యూబ్ చానల్ సైతం ఏర్పాటు చేశాడు. సోషల్ మీడియాలో తనను సంప్రదిస్తే వీలైనంత వేగంగా అక్కడకు వెళ్తుంటారు. అయితే పాములు పట్టడం అనేది తనకు ఉపాధి కాదని.. కేవలం మనుషుల ప్రా ణాలు పోకూడదని.. అలాగే జీవహింస లేకుండా చేయాలన్నదే తన ఉద్దేశమని వేణుగోపాలరావు చెబుతున్నాడు. పాములు ప డితే డబ్బులు డిమాండ్ ఉండదని.. వారి సంతోషంగా ఇచ్చిందే తీసుకుంటామని చెబుతున్నాడు. ఎక్కడైనా పాములు పట్టాలంటే 93951 42681 నంబర్ను సంప్రదించాలని సూచిస్తున్నాడు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
● వైఎస్సార్ సీపీ లీగల్సెల్ ఆధ్వర్యంలో నిరసన శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలో వైద్య కళాశాలలను పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరణకు సిద్ధం కావడం దుర్మార్గమని, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆరంగి లక్ష్మీపతి డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని నిరసిస్తూ లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. దీనిలో భాగంగా పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీపతి, యువ నాయకుడు ధర్మాన రామ్మనోహర్నాయుడు ఆధ్వర్యంలో లీగల్ సెల్ సభ్యులు, న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమావేశమై అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్కు తరలివచ్చారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేసి నిర్మాణాలు చేపట్టారని గుర్తు చేశారు. అందులో ఐదు కళాశాలల నిర్మాణాలు పూర్తిచేసి ప్రారంభోత్సవం చేపట్టగా, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు సిద్ధం కావడం దారుణమన్నారు. పీపీపీ విధానంతో మెడికల్ సీట్లు అమ్ముకునే పరిస్థితి వస్తుందని, దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలకు వైద్య విద్య అందని అందని ద్రాక్షలా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో లీగల్సెల్ ప్రధాన కార్యదర్శి పిట్టా దామోదరరావు, సీనియర్ న్యాయవాది తంగి శివప్రసాదరావు, న్యాయవాదులు పొన్నాడ రుషి, కూన అన్నంనాయుడు, గణపతినాయుడు, విజయ్కుమార్, నీలాద్రి, సుధాబాల, అప్పారావు పట్నాయుకుని, ఉషా తదితరులు పాల్గొన్నారు. -
సైకో ఎవరనేది ప్రజలకు తెలుసు
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): నిండు శాసనసభలో పద్ధతి లేకుండా జేబులో చెయ్యిపెట్టుకుని, కళ్లద్దాలు నెత్తిన పెట్టుకుని సభా సంప్రదాయాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన బాలకృష్ణ సైకోనా.. పద్ధతిగా ఉండే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైకోనా అనేది ప్రజలందరికి తెలుసునని మాజీ శాసన సభాపతి, శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకుడు తమ్మినేని సీతారాం అన్నారు. ఆమదాలవలసలో శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ గతంలో బెల్లంకొండ సురేష్పై కాల్పులు జరిపిన బాలకృష్ణను కాపాడింది ఆనాటి సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనే హక్కు వారికి లేదన్నారు. సినీ పరిశ్రమ, సినిమా హీరోలకు జగన్మోహన్రెడ్డి అంటే చాలా అభిమానం ఉందన్నారు. కరోనా సమయంలో చిరంజీవి, సినిమా హీరోలంతా కలుస్తామని అడిగితే అన్ని రకాల మర్యాదలతో కలిసి సినీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించింది జగన్ అని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి సైకో అని వ్యాఖ్యానించిన బాలకృష్ణ పూర్తిగా మెంటలైపోయాడేమేనని అనిపిస్తుందన్నారు. కరోనా నిబంధనల మేరకే ఐదుగురికి అవకాశం ఇస్తే చాలదు అంటే 10 మందికి అవకాశం కల్పించి విందు ఇచ్చి మరి మర్యాద చేశారని చెప్పారు. బాలకృష్ణ ఏ రకమైన సైకోనో నాకు బాగా తెలుసునని, టీడీపీలో చాలాకాలం ప్రయాణం చేశానన్నారు. బాలకృష్ణకు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవడ్రా.. అని నోటికొచ్చినట్లు పిచ్చోడిలా మాట్లాడతాడని అన్నారు. వైఎస్సార్ దయాదాక్షణ్యాలతో బతుకుతున్నావన్న విష యం మరిచిపోకూడదన్నారు. పవన్, చిరంజీవి ఫ్యామిలీలతో బాలకృష్ణకు ఏమైనా పొరపొచ్చాలుంటే మీరు మీరు తేల్చుకోవాలి తప్ప జగన్పై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదన్నారు. బాలకృష్ణ తీరు మార్చుకోకుంటే వైఎస్సార్సీపీ శ్రేణుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. -
సచివాలయ ఉద్యోగుల చలో కలెక్టరేట్
శ్రీకాకుళం పాతబస్టాండ్: ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయం ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం సచివాలయం ఉద్యోగులు చలో కలెక్టరేట్ నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్అండ్బీ వసతి గృహం రోడ్డుపై రాత్రి వరకు నిరసన కొనసాగించారు. ఈ సందర్భంగా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. రెండు నోషనల్ ఇంక్రిమెంట్ల బకాయిలు చెల్లించాలని, తొమ్మిది నెలల ఎరియర్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వలంటీర్ల పనులు కూడా ఉద్యోగులతో చేయించడం ఆపాలని, గ్రామ స్థాయిలో నాయకుల నుంచి వేధింపులు అరికట్టాలన్నారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు బి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి బి.జగదీష్బాబు, పి.నారాయణ రావు, ఎం.రవికుమార్, వెంకటేశ్వర్లు, సంగయ్య, ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు. -
రవాణా సదుపాయాలతో అభివృద్ధి
ఆమదాలవలస: ఏదైనా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రవాణా సదుపాయాలు అత్యంత ముఖ్యమ ని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించిన బెర్హంపూర్ – సూరత్ (ఉద్నా) అమృత్ భారత్ రైలును శనివారం శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమృత్ భారత్ రైలు దేశ రైల్వే రూపురేఖలు మార్చిందన్నారు. శ్రీకాకుళం, పలాసలో రెండు హాల్ట్లు ఇచ్చినట్లు తెలిపారు. విమానాల్లో ఉండే సదుపాయాలు అమృత్ భారత్ రైళ్లలో ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం లలి త్ బొహ్రా, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఆర్డీవో సాయి ప్రత్యూష, డీసీసీబీ అధ్యక్షుడు శివ్వల సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉద్దానం ప్రజలకు వరం పలాస: బరంపురం నుంచి సూరత్ వెళ్లే అమృత్ భారత్ రైలు ఉద్దానం ప్రాంత ప్రజలకు వరం లాంటిదని ఖుర్ధా ఏఆర్డీఎం ప్రమోదకుమార్ బెహరా అన్నారు. పలాస రైల్వేస్టేషన్లో రైలు స్వాగత కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది సూరత్, కాండ్ల, గుజరాత్, రాయపూర్, బిలాయ్ తదితర ప్రాంతాలకు వలస వెళ్తుంటారని, వారికి ఈ రైలు చాలా ఉపయోగమన్నారు. కార్యక్రమంలో డీసీఎం సుక్రాంబరో, పలాస రైల్వే మేనేజర్ ఎస్కే దాసు, పలాస – కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సోషల్ మీడియా పోస్టులపై నిఘా
● 134 కేసుల్లో 106 మంది అరెస్టు ● డీఐజీ గోపినాథ్ జెట్టి శ్రీకాకుళం క్రైమ్: సోషల్ మీడియాలో అసత్య ప్రచా రాలు చేస్తూ, మహిళలను అగౌరవపరిచేలా అభ్యంతరకర పోస్టులు పెడుతున్నవారిపై గట్టి నిఘా పెట్టామని విశాఖపట్నం రేంజి డీఐజీ గోపినాథ్ జెట్టి హెచ్చరించారు. రేంజి పరిధిలోని శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల ఎస్పీలతో పాటు డీఎస్పీలతో వర్చువల్గా సమీక్షా సమావేశం శనివారం నిర్వహించారు. పోస్టులు మితిమీరుతుండడంతో ప్రతీ జిల్లాలో పర్యవేక్షణకు నోడల్ అధికారిని నియమించి, ప్రత్యేక బృందాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో అభ్యంతరకర పోస్టులు పెట్టేవారిని గుర్తించాలన్నారు. వారు పెట్టిన పోస్టు ఏ కేటగిరీకి వస్తుంది.. వారిపై ఎటువంటి చర్యలు చేపట్టార న్న అంశాలపై రోజువారి నివేదిక తనకు పంపాల ని అధికారులను ఆదేశించారు. గుర్తించిన వ్యక్తుల వివరాలు సేకరించి, వారికి సహకరిస్తున్న వ్యక్తుల ను వ్యవస్థీకృత నేరమునకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలన్నారు. 106 మంది అరెస్టు రేంజి పరిధిలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన 134 మందిపై కేసులు నమోదు చేసి, 106 మందిని అరె స్టు చేశామని, 57 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసి 25 కేసుల్లో విచారణ ప్రారంభమైందన్నారు. డీఎస్పీ లు వారి పరిధి స్టేషన్లలో ఈ కేసులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కేసుల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. అభ్యంతరకర పోస్టు లు పెడుతున్న వ్యక్తులు చట్టం నుంచి తప్పించుకోలేరన్నది స్పష్టం చేయాలన్నారు. -
డిజిటల్ బుక్తో.. వైఎస్సార్సీపీ శ్రేణులకు భరోసా
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): వైఎస్సార్సీపీ కార్యకర్తల కు ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా వెంటనే డిజిటల్ బుక్లో లాగిన్ అయి వివరాలు నమోదు చేస్తే పార్టీ అండగా ఉంటుందని శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భరోసా ఇచ్చారు. వేధింపులు, ఇబ్బందు లు ఎదురైతే డిజిటల్ బుక్లో ఫోన్ నెంబర్, ఇతర వివరాలు పొందుపరచాలని కోరారు. శ్రీకాకుళంలో ని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను పార్టీ ముఖ్య నాయకులతో కలిసి సీతారాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విజ యవాడలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ను ప్రవేశపెట్టారని చెప్పారు. దీనిని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో రిలీజ్ చేసి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. ఇప్పటికే చాలామంది పార్టీ సానుభూతిపరులకు, కార్యకర్తల కు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిపై న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినవెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. డిజిటల్ బుక్ను టీడీపీ నేతల రెడ్బుక్ మాదిరి పెట్టుకున్నా మని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ప్రజలకు, వైఎస్సార్సీపీ కార్యకర్తలకు ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం తెలుసుకునేందు కు డిజిటల్ బుక్ పెట్టామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు, పార్టీ రాష్ట్ర కాళింగ కుల అధ్యక్షుడు దుంపల రామారావు, వెలమ కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాసరావు, కళింగ వైశ్య కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంధవరపు సూరిబాబు, పార్టీ యువనేత ధర్మాన రామ్మనోహర్నాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మార్పు పృథ్వీ, పార్టీ సంయుక్త కార్యదర్శి ఎన్ని ధనుంజయరావు, నగర అధ్యక్షుడు సాధు వైకుంఠరావు, చిట్టి జనార్దనరావు, గ్రీవెన్స్సెల్ జిల్లా అధ్యక్షుడు రౌతు శంకరరావు, ఎంఏ బేగ్, సనపల నారాయణరావు, వై.వి.శ్రీధర్, యజ్జల గురుమూర్తి, బొడ్డేపల్లి పద్మజ, తంగుడు నాగేశ్వరరావు, గుండ హరీష్, సిహెచ్ భాస్కర్, రుప్ప అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెంత కాలం రైతులు రోడ్డెక్కాలి..?
ఇచ్ఛాపురం రూరల్: ముఖ్యమంత్రిగా చంద్రబాబు పాలించిన ప్రతిసారీ రైతులు ఏదో సమస్యతో రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించిందని, ఇంకెంత కాలం ఇలా రైతులు రోడ్డెక్కాలని జెడ్పీ చైర్పర్సన్, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా విజయ ప్రశ్నించారు. రైతు పోరులో భాగంగా శనివారం ఆమె రైతులు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి యూరియా కష్టాలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాది మండలంలో సుమారు 8 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తుంటే, కేవలం 320 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. దీంతో రైతులు అధిక మొత్తాన్ని చెల్లించి ఒడిశాలో యూరియాను కొనుక్కునే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఇస్తున్న యూరియాను కూటమి నాయకులు తమకు అనుకూలమైన రైతులకు మాత్రమే ఇస్తున్నారన్నారు. దీంతో ఎక్కువ మంది రైతులు యూరియా కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయిలో యూరియాను అన్నదాతలకు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్ ఎన్.వెంకటరావుకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బోర పుష్ప, జెడ్పీటీసీ ఉప్పాడ నారాయణమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సాడి శ్యామ్ప్రసాద్రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు నర్తు ప్రేమ్కుమార్, మండల కన్వీనర్ పి.రాజశేఖరరెడ్డి, వైస్ ఎంపీపీ దువ్వు వివేకానందరెడ్డి, నాయకులు సల్ల దేవరాజు, కారంగి మోహనరావు, తడక జోగారావు, దక్కత నూకయ్యరెడ్డి, ఎన్.బాబూరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్ పంపిణీ సంస్థల యాజమాన్యాలపై ఆ శాఖ ఉద్యోగులు, కార్మికులు నిరసనలకు దిగనున్నారు. ఇదివరకే పలు రకాలుగా శాంతియుత నిరసనలు, ధర్నాలు చేపట్టిన విద్యుత్శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు సంయుక్తంగా జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో యాజమాన్యంతో జరిగిన చర్చలు సఫలం కాకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో అక్టోబర్ 6 నుంచి నిరసన కార్యక్రమాలకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 14 నుంచి అన్ని విద్యుత్ సర్కిల్ కేంద్రాల వద్ద ఉద్యోగ, కార్మి కులంతా విధులను నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. వినియోగదారులకు కలగనున్న ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం, డిస్కం యాజమాన్యాలే బాధ్యత వహిస్తాయని జేఏసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. ●అక్టోబరు 6న విశాఖపట్టణం ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నా ●8న ఎస్పీడీసీఎల్ తిరుపతి కార్పొరేట్ కార్యాల యం వద్ద ధర్నా ●13న ఛలో విజయవాడ కార్యక్రమం ●14 నుంచి నిరవధిక సమ్మె ●అనంతరం ప్రభుత్వ నిర్ణయాలపై జేఏసీ ప్రతినిధులు స్పందన మేరకు చర్యలు -
గంగమ్మ తల్లి గుడిలో చోరీ
నరసన్నపేట: మండలంలోని చెన్నాపురంలో ఉన్న గంగమ్మ తల్లి గుడిలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.50 వేలు విలువ కలిగిన వస్తువులు చోరీకి గురైనట్లు ఆలయ ధర్మకర్త ముత్తా సింహాచలం తెలిపారు. గంగమ్మ తల్లి విగ్రహం మెడలో ఉన్న రెండు గ్రాముల బంగారు శతుమానం, మూడు గ్రాముల వెండితో ఉన్న మట్టెలను దోచుకెళ్లారని తెలిపారు. అలాగే హుండీని ఎత్తుకుపోయారన్నారు. హుండీలో రూ.20 వేల వరకూ నగదు, కొన్ని వెండి వస్తువులు ఉంటాయని వివరించారు. ప్రతిఏటా నవంబర్ నెలలో హుండీ లెక్కించి వచ్చిన డబ్బుతో అన్నదానం చేస్తామని, ఇంతలో దొంగలు చోరీకి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కానిస్టేబుల్ అరెస్టు
టెక్కలి రూరల్: దమ్ము గోపాలం అనే పోలీస్ కానిస్టేబుల్ అరెస్టయిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై టెక్కలి సీఐ ఎ.విజయ్కుమార్ మాట్లాడుతూ గోపాలం గతంలో టెక్కలిలో కానిస్టేబుల్గా పనిచేసి ప్రస్తుతం పలాసలో విధులు నిర్వర్తిస్తున్నాడని, తనను మోసం చేశాడంటూ టెక్కలిలో ఉంటున్న ఓ మహిళ ఈ నెల 16న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనంతరం విచారణ జరిపి కానిస్టేబుల్ను జిల్లా జైలుకు తరలించినట్లు చెప్పారు. ఇచ్ఛాపురం రూరల్: వేలాది కిలోమీటర్ల దూరం నుంచి తేలుకుంచి వస్తున్న విదేశీ పక్షులు, సైబీరియన్ కొంగలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఇచ్ఛాపురం తహసీల్దార్ ఎన్.వెంకటరావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం తేలుకుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ పాతిర్ల రాజశేఖరరెడ్డి, ఎంపీడీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.రామారావు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
వ్యాపారస్తులు ముందుకు రావాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: జీఎస్టీ తగ్గిన నేపథ్యంలో ధరలు తగ్గించేందుకు వ్యాపారస్తులు వాలంటీర్గా ముందుకు రావాలని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ నోడల్ అధికారి స్వప్నదేవి కోరారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జీఎస్టీ ధరల తగ్గింపుపై వ్యాపారస్తులతో శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, మెడికల్, ఆటోమొబైల్స్, వ్యవసాయానికి సంబంధించి యంత్రాలు, ఎరువులు, ప్యాకింగ్ మెటీరియల్, హెల్త్ ఇన్సూరెన్స్పై తగ్గింపులు వలన ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల వద్ద డబ్బులు ఉంటే మరింతగా వ్యాపారాలు జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు షాపుల వద్ద పాత ధరలు, కొత్త ధరల బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. వ్యాపారస్తులకు ఉన్న అనుమానాలను జీఎస్టీ నోడల్ అధికారి నివృత్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్ జీఎస్టీ అధికారి చంద్రకళ, కాశీబుగ్గ, నరసన్నపేట, ఆమదాలవలస అసిస్టెంట్ జీఎస్టీ అధికారులు, బంగారం వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్, హోటల్స్, కిరాణా, ఆటోమొబైల్స్, సిమెంటు తదితరులు వ్యాపారస్తులు పాల్గొన్నారు. -
ఇంటి నిర్మాణంపై వివాదం
కొత్తూరు: మండలంలోని కడుము కాలనీలో ఇంటి నిర్మాణం, ఖాళీ స్థలంపై రెండు వర్గాల మధ్య శనివారం వివాదం చెలరేగింది. కాలనీలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఎం.అప్పారావు నిర్మిస్తున్న ఇంటికి స్లాబ్ వేసేందుకు శనివారం ఏర్పాట్లు చేశారు. అయితే అప్పారావు ప్రభుత్వ పాఠశాలకు చెందిన స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నందున పనులు నిలుపుదల చేయాలని కాలనీకి చెందిన వి.గోవిందరావు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలియడంతో స్థానిక సీఐ చింతాడ ప్రసాద్, ఎస్ఐ ఎండీ అమీర్ అలీ తమ సిబ్బందితో చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ కె.బాలకృష్ణకు ఫిర్యాదు చేయడంతో ఆయన ఇంటి పనుల వద్దకు చేరుకున్నారు. రికార్డులు పరిశీలించిన తర్వాత అప్పారావు నిర్మిస్తున్న ఇల్లు జిరాయితీ స్థలంలో ఉందని స్పష్టం చేశారు. అనంతరం పనులు చేపట్టేందుకు అప్పారావు సమాయత్తమయ్యారు. పాఠశాల స్థలంలో పనులు చేపడితే అడ్డుకోవడం తప్పదని గ్రామస్తులు కొంతమంది అధికారులకు తెలిపారు. ఇల్లు నిర్మిస్తున్న స్థలంతో పాటు పాఠశాల స్థలాన్ని కడుము కాలనీకి చెందిన ఒకరు గతంలో దానం చేశారని, అందుకు సంబంధించిన అధారాలు అక్టోబర్ 5వ తేదీన సమర్పిస్తామన్నారు. దీంతో అప్పటి వరకు పనులు నిలుపుదల చేయాలని తహసీల్దార్ ఆదేశించడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. -
1, 2 తేదీల్లో కిరణ దర్శనం
అరసవల్లి: అరుదైన అద్భుత దృశ్యానికి వేళ య్యింది. అక్టోబర్ 1, 2 తేదీల్లో అరసవల్లిలో ఆదిత్యుని మూలవిరాట్టుపై తొలి సూర్యకిరణాలు స్పృశించే అరుదైన అద్భుత దర్శనం కన్పించనుంది. సూర్యోదయ సమయాన సాక్షాత్కరించనున్న ఈ కిరణ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అరసవల్లి క్షేత్రానికి రానున్నారు. ఉత్తరాయణ, దక్షిణాయ న కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ స్వామి పాదాలను నేరుగా తొలి సూర్యకిరణాలు తాకనున్నాయి. రానున్న బుధ, గురువారాల్లో కన్పించనున్న ఈ అద్భుత దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు ఇప్పటికే చర్చించారు. దసరా సెలవుల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఇబ్బంది లేకుండా, సూర్యకిరణాలకు అడ్డం రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా శంకరశర్మ ‘సాక్షి’తో మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే కిరణ దర్శనం ఉంటుందన్నారు. -
కూటమి ప్రభుత్వంపై తిరగబడిన ప్రభుత్వ ఉద్యోగులు
శ్రీకాకుళం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరుతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వేల పేరుతో తమను వేధిస్తున్నారని శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు దిగారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటలకు పని చేయాల్సి వస్తుందని, వాలంటీర్లు చేయాల్సిన పనులు కూడా తమతో చేయిస్తున్నారని నిరసన చేపట్టారు.పనిభారం పెరగడంతో మానసిక ఒత్తిడి అధికమవుతుందని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. మహిళా ఉద్యోగులు అని కూడా చూడకుండా రాత్రి పూట కూడా పని చేయిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
రెండోసారి.. నోటిఫికేషన్ జారీ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో 100 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 16 ప్రభుత్వ, 84 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో 28 వేల సీట్లు ఉన్నాయి. ఇందులో 8వేల సీట్లు కూడా భర్తీకావడం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కొన్నేళ్ల కిందట జిల్లా నుంచి 20 వేల వరకు సీట్లు నిండేవి. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. డిగ్రీ ప్రవేశాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో ప్రవేశాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఐటీఐవైపు విద్యార్థులు చూస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని విద్యాసంస్థల మేనేజ్మెంట్ల ప్రతినిధులు చెబుతున్నారు. డిగ్రీ ఫస్టియర్లో ప్రవేశాల కోసం వివిధ కారణాలతో అడ్మిషన్లు పొందలేని విద్యా ర్థుల కోసం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. – డాక్టర్ కణితి శ్రీరాములు, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఐడీ కళాశాల) ప్రిన్సిపాల్ శ్రీకాకుళం న్యూకాలనీ: రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మొద్దునిద్ర వీడింది. డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల కోసం సకాలంలో దర ఖాస్తులు చేసుకోలేని విద్యార్థుల కోసం రెండో విడ త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే మొద టి ఫేజ్లో అడ్మిషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ పూర్తిస్థాయిలో క్లాసులు మొదలుకాలేదు. ఇంటర్మీడియె ట్ ఫలితాలు వెలువడి నాలుగైదు నెలలు గడిచినా నోటిఫికేషన్ విడుదల చేయకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేసిన విషయం తెలిసిందే. ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ.. ●2025–26 విద్యా సంవత్సరానికిగాను డిగ్రీ అడ్మిషన్ల కోసం రెండో విడత ప్రవేశాలకు కాలేజియేట్ ఎడ్యుకేషన్ వెల్లడించిన మార్గదర్శకాల ప్రకారం విద్యార్ధులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీలు రూ.200 నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ●ఈ నెల 26 నుంచి 29 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ●27 నుండి 29 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ●ఈనెల 29 నుంచి అక్టోబర్ ఒకటి వరకు వెబ్ ఆప్షన్లు ●అక్టోబర్ 6న కాలేజీల్లో సీట్ల కేటాయింపు ●7 నుంచి క్లాసులు ప్రారంభం కాలేజీలు మూసివేతతో ఆందోళన.. కోట్లాది రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు విషయంలో రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ ప్రైవేటు డిగ్రీ కాలేజీలు సమ్మెబాటపట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి ప్రైవేటు కాలేజీల్లో క్లాసులు రద్దు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేటు కాలేజీలను మూసివేశారు. జిల్లాలో ఒక్క డిగ్రీ విద్యకు సంబంధించే జిల్లాలో 80 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్టు ఏపీ ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. డిగ్రీ ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు సైతం తమకు సెమిస్టర్ పరీక్షలు సమీపిస్తుండటంతో దిగులు చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని డిగ్రీ విద్యార్థులు మొరపెట్టుకుంటున్నారు. -
పీహెచ్సీ వైద్యుల సమ్మె సైరన్
అరసవల్లి: ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. ముందస్తు నోటీసులను ఇప్పటికే రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులకు అందజేసి ప్రభుత్వ విధులను నిలిపివేసేలా సన్నద్ధమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో పీహెచ్సీ వైద్యుల రాష్ట్ర సంఘం పిలుపు మేరకు శుక్రవారం నుంచి నల్లబ్యాడ్జీలతోనే విధులు నిర్వర్తిస్తూనే అధికారిక ఆన్లైన్ విధులు, రోజువారీగా పంపించాల్సిన ఆన్లైన్ నివేదికలను కూడా నిలిపివేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలో నిరసనల షెడ్యూల్ ప్రకారం నిర్వర్తించేలా చర్యలకు దిగారు. ఈ క్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారికి, కలెక్టరేట్కు కూడా సమ్మె నోటీసులను శుక్రవారం అందజేశారు. ఈ నెల 29 నుంచి ఓపీ సేవలను కూడా నిలిపివేసేలా నిర్ణయాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పేద, సామాన్య వర్గాలకు ప్రభుత్వ వైద్యం దూరం కానుంది. నిరసనల షెడ్యూల్ ఇలా.... ●నేడు సంచార చికిత్సలు వంటి క్యాంపు విధుల బహిష్కరణ ●28న ప్రభుత్వ అధికారిక వాట్సాప్ల నుంచి నిష్క్రమణ ●29 నుంచి ఓపీ(అవుట్ పేషంట్) సేవలు నిలుపుదల. ఎమర్జెన్సీ సర్వీసులైన డెలివరీలు, పాముకాటు, విషం తీసుకునే తదితర కేసులకు మాత్రమే అనుమతి. ●30న జిల్లా కేంద్రంలో నిరసన ●అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, వినూత్న నిరసన ●3న విజయవాడలో నిరాహార దీక్షలు ప్రారంభం -
అధికారుల తనిఖీలు..
నరసన్నపేట : జిల్లాలో వ్యాపార కేంద్రమైన నరసన్నపేటలో కేంద్ర జీఎస్టీ అధికారులు శుక్రవారం రెండు బృందాలుగా ఏర్పడి హోల్సేల్ బంగారం షాపుల్లో మమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. డీసీ వర్మ ఆధ్వర్యంలో విశాఖ నుంచి వచ్చిన అధికారులు తమ్మయ్యపేటలో ఉప్పు గిరి నివాసం, ఆదివరపుపేట కూడలిలో మన్మధరావు హోల్సేల్ షాపులో తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తనిఖీలు కొనసాగాయి. మూడేళ్లుగా జరిగిన వ్యాపారం, కట్టిన టాక్స్లపై ఆరా తీసినట్లు సమాచారం. కొన్ని రికార్డులు తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అధికారులు వివరాలు మాత్రం వెల్లడించలేదు. పన్ను ఎగవేత బంగారం పెద్ద మొత్తంలో గుర్తించినట్లు తెలుస్తోంది. కోయంబత్తూరులో హోల్సేల్ వ్యాపారి ఒకరు సెంట్రల్ జీఎస్టీ అధికారులకు పట్టుబడ్డారని, ఈయన ఇచ్చిన సమాచారం మేరకు నరసన్నపేటలో రెండు హోల్సేల్ షాపుల్లో తనిఖీలు చేసినట్లు తెలుస్తోంది. షాపులు మూసేసిన వ్యాపారులు.. జీరో బంగారం వ్యాపారం చేస్తూ అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి మోసం చేస్తున్న నరసన్నపేటలోని పలువురు బంగారం వ్యాపారులు తమ గుట్టురట్టు అవుతుందనే భయంతో వెంటనే షాపులను మూసేశారు. షట్టర్లు దించి ఇళ్లకు వెళ్లిపోయారు. బంగారం వ్యాపారుల చర్యల పట్ల స్థానికులు విస్తుపోతున్నారు. జీఎస్టీ అధికారులు వస్తే షాపులు మూసేసి వెళ్తున్నారంటే వీరు చేస్తున్న వ్యాపారం అంతా మోసమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జూలై 17న బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బంగారు ఆభరణాలపై వేసిన నకిలీ హాల్మార్క్ వ్యవహరం వెలుగుచూసిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి గ్రామం వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందినట్లు కోటబొమ్మాళి పోలీసులు శుక్రవారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి గ్రామానికి చెందిన వాన వైకుంఠరావు(65) గురువారం సాయంత్రం సరియాపల్లి గ్రామ సమీపంలో ఉన్న తన పొలం పనికి వెళ్లి తిరిగి నడిచి వస్తుండగా, అదే మార్గంలో కప్పల రమణ అనేవ్యక్తి వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో వెంకుటరావు తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కోటబొమ్మాళి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం శుక్రవారం మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వేట సాగక.. పూట గడవక..!
సముద్రంలో వేట సాగించేందుకు వాతావరణం అనుకూలంగా ఉండడం లేదు. తప్పనిసరి పరిస్థితు ల్లో వేటకు విరామం తప్ప డం లేదు. వేట నిషేధ భృతి మాదిరిగానే వేట విరామ సమయంలో మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేలా ప్రత్యేక భృతిని ప్రకటించాలి. జీవనోపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. మత్స్యకార భరోసా రెండేళ్లకు ఒక ఏడాది మాత్రమే అందించారు. మరో ఏడాది భరోసా అందించి ఆదుకోవాలి. – కోనాడ నర్సింగరావు, జిల్లా మత్స్యకార సంఘం మాజీ అధ్యక్షుడు గార: కడలి తల్లి కరుణిస్తే గానీ కడుపు నిండని పరిస్థితి మత్స్యకారులది. వేట సాగితేనే కుటుంబాల పూట గడుస్తుంది. అయితే ఇటీవల వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు మత్స్యకారుల్లో ఆందోళన సృష్టిస్తున్నాయి. సంద్రం అల్లకల్లోలంగా మారుతుండడంతో వేట సాగడం లేదు. వేట నిషేధం అనంతరం వరుసగా నాలుగు నెలల్లో ఏకంగా 27 రోజుల పాటు తుఫాన్లు, వాయుగుండాల ప్రభావం వలన వేటకు వెళ్లలేకపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఎక్కడ తుఫాన్ సంభవిస్తున్నా వాతావరణ హెచ్చరికలు ఆధారంగా అప్రమత్తత పేరుతో వేట నిలిపేయాలని అధికారులు దండోరా వేయిస్తున్నారు. కానీ ఒక్కోసారి వాతావరణ హెచ్చరికలకు విరుద్ధంగా సముద్రంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకపోయినా వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండిపోతున్నామని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు. అందువలన ప్రతీ ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధ సమయంలో భృతి ఇస్తున్నట్టే.. తుఫాన్, వాయుగుండాల సమయంలో వేటకు వెళ్లకుండా అర్థిక ఇబ్బందులు పడుతున్న మత్స్యకారులకు భృతి ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లాలో 193 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి తీర ప్రాంతంలోని 11 మండలాల్లో మత్స్యకారులు జీవనోపాధి సాగిస్తున్నారు. మొత్తం 1,526 మెకనైజ్డ్ బోట్లు, 2,606 నాన్ మెకనైజ్డ్ బోట్లుపై వేట సాగిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేట నిషేధ భృతి అర్హులైన మత్స్యకారులందరికీ అందిస్తే.. కూటమి ప్రభుత్వం అనేక ఆంక్షలు పెట్టి మత్స్యకారులను తగ్గించిందన్న విమర్శలున్నాయి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకార భృతి ఒక సంవత్సరం ఇవ్వకపోవడం గమనార్హం. కొన్ని రోజులుగా సముద్రంలో వేట సక్రమంగా సాగ డం లేదు. తరుచూ తుఫాన్ లు ఏర్పడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఏ రోజుకారోజు వేట సాగించి జీవిస్తుంటాం. ఈ సమయంలో రోజుల తరబ డి వేట సాగకపోతుండడంతో జీవనం కష్టతరంగా ఉంటోంది. పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఎక్కువగా వాయుగుండాలు, తుఫాన్లు వస్తుండడంతో బోట్లు, వలలు భద్రపర్చుకోవడం కష్టతరంగా మారుతోంది. – పుక్కళ్ల తవిటయ్య, మత్స్యకారుడు, బందరువానిపేట -
కింజరాపు కుటుంబం దోచుకుంటోంది
● అక్రమాలపై అధికారులు దృష్టి సారించడం లేదు ● వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త తిలక్ టెక్కలి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కింజరాపు కుటుంబం జిల్లాలో మైనింగ్ ఆదాయంతో పాటు ఇతర ప్రభుత్వ ఆదాయ వనరులన్నీ దోచుకుంటోందని వైఎస్సార్సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం టెక్కలిలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. విజిలెన్స్ ఎస్పీ నిరంకుశ వైఖరితో కింజరాపు కుటుంబం చేస్తున్న అక్రమాలపై దృష్టి సారించకుండా, వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన క్వారీలు, క్రషర్లపై కక్షపూరితమైన చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. దోపిడీపై ఆధారాలతో సహా చెబుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అక్టోబర్ 6న ముట్టడి కింజరాపు కుటుంబం చేస్తున్న మైనింగ్ అక్రమాల తో పాటు మైన్స్ అధికారుల కక్ష సాధింపు చర్యలపై తిరుగుబాటు చేస్తున్నట్లు తిలక్ తెలియజేశారు. ఈ మేరకు అక్టోబర్ 6వ తేదీన టెక్కలిలో మైన్స్ కార్యాలయాన్ని ముట్టడికి పిలుపునిచ్చారు. కూట మి కక్ష సాధింపుతో నష్టానికి గురైన మైనింగ్ నిర్వాహకులతో పాటు రాజకీయ పార్టీలు, కార్మికులు తరలి రావాలని కోరారు. సొంత నియోజకవర్గంలో రైతులకు యూరియా ఇవ్వలేని అసమర్ధత మంత్రి అచ్చెన్నాయుడు అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన కొత్తమ్మ తల్లి ఉత్సవాలు ఏర్పాట్లలో పూర్తిగా వైఫల్యం కనిపించిందన్నారు. అధికారులు భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించకుండా మంత్రి అచ్చెన్నాయుడు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మెప్పు కోసం ఆరాటపడ్డారని మండిపడ్డారు. కలెక్టర్, ఎస్పీ సైతం టీడీపీ నాయకుల సేవలో నిమగ్నం కావడం సిగ్గుచేటన్నారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన ఖర్చులపై దేవదాయ శాఖ అధికారులు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హెలీకాఫ్టర్ రైడ్ పేరుతో భక్తుల నుంచి దోపిడీ చేసి కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సొంత ప్రచారాలు చేసుకున్నారని దుయ్యబట్టారు. ఇటీవల నందిగాం మండలంలో ఒక ఫైనాన్స్ సంస్థ దళిత కుటుంబాన్ని వేధిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సినీ నటుడు బాలకృష్ణ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్ముర్తి, టెక్కలి వైస్ ఎంపీపీ పి.రమేష్, నాయకులు కె.అజయ్, ఎ.రాహుల్, చిన్ని జోగారావు, బి.రాజేష్, దానయ్య, కర్నిక జీవన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు అవగాహన కల్పించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి అధికారులు సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారిన ధరల విషయంపై ప్రజలకు తెలియజేయాలన్నారు. ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన సేవింగ్స్ గురించి వివరించాలని పేర్కొన్నారు. పోస్టర్లు తయారు చేసి సచివాలయాలు, గ్రామ, మండలాల వారీగా ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్, శ్రీకాకుళం జిల్లా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ నోడల్ ఆఫీసర్ స్వప్న దేవి మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఈనెల 22వ తేదీన ప్రారంభమైందన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన పేద, మధ్య తరగతి కుటుంబాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సుధాకర్, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ లక్ష్మణమూర్తి, డీపీవో భారతి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
మనస్థాపంతో ఆత్మహత్య
బూర్జ: మండలంలోని ఉప్పినివలస గ్రామానికి చెందిన బొమ్మాళి శిరీష (22) గురువారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శిరీషకు తల్లిదండ్రులు వివాహ సంబంధాలు చూస్తుండగా ఆమె తిరస్కరిస్తూ ఉండేది. వివాహం చేసుకోనని.. తన చిన్నాన్న దగ్గర చదువుకుంటానని చెప్పేది. ఈ క్రమంలో బుధవారం భోజనాల తర్వాత పక్క ఇంటికి వెళ్లి మాట్లాడుతుండగా, ఆమె తల్లి తనకు సాయం చేయకుండా పక్క ఇంటికి ఎందుకు వెళ్లావని మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్నటువంటి గడ్డిమందు తాగేసింది. తల్లి గన్నెమ్మ చూసి వెంటనే 108 సాయంతో శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలికి తండ్రి రాజు, తల్లి గన్నెమ్మ, అక్క దివ్య, డిగ్రీ చదువుతున్న తమ్ముడు మని ఉన్నారు. తల్లి గన్నెమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.ప్రవళ్లిక తెలియజేశారు. -
హోటల్లో అగ్ని ప్రమాదం
పాతపట్నం: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న అబీబీ డ్రైవ్ ఇన్ హోటల్లో శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోట ల్ మొదటి ఫ్లోర్ మొత్తం పూర్తిగా మంటల్లో కాలి బూడిదయింది. ప్రమాదం సంభవించిన సమయంలో హో టల్లో పలువురు భోజనం చేయడంతో పాటు సిబ్బంది పనిచేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన ప్రమాదం జరిగిందని హోటల్ యాజమాని రెడ్డి తెలి పారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం రూ.2 లక్షల వరకు ఉంటుందంటున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చేరుకుని, ప్రమాదం వివరాలు నమోదుచేసుకున్నారు. -
స్పష్టత ఏదీ..?
శ్రీకాకుళం: రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారులు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు, ఇతర అధికారుల విధులు ఏమిటనే దానిపై స్పష్టత ఇవ్వాలని రిమ్స్లో పనిచేస్తున్న పలువురు వైద్యులు డీఎంఈకి నివేదించారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రుల్లో ఆరు నెలల క్రితం వరకు ఎటువంటి సమస్య ఉండేది కాదు. కళాశాల, ఆస్పత్రుల్లో సమస్యలన్నింటినీ కళాశాల ప్రిన్సిపాల్, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంవోలు పర్యవేక్షించేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు నెలల క్రితం అడ్మినిస్ట్రేటర్ అంటూ ఒక పోస్టును క్రి యేట్ చేసి డీడీ స్థాయి అధికారిని నియమించింది. దీంతో అప్పటినుంచి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే కేజీహెచ్ నుంచి రాష్ట్రస్థాయికి ఇటువంటి వ్యవహారం ఇప్పటికే విశాఖపట్నంలోని కేజీహెచ్ నుంచి రాష్ట్రస్థాయికి చేరగా, తాజాగా శ్రీకాకుళం వ్యవహారం కూడా చేరింది. శ్రీకాకుళంలో అడ్మినిస్ట్రేటర్, వైద్యుల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ జరుగుతోంది. దీనిపై సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో లోలోనే మదన పడుతూ వచ్చారు. తాజాగా ఐదు రోజుల క్రితం కలెక్టర్ రిమ్స్లో జరిగిన మొక్కల నాటే కార్యక్రమానికి వచ్చి, హాస్టల్, వార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటర్ వ్యవస్థను నెలకొల్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారి విధి విధానాలను ప్రకటించింది. పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, ఆస్పత్రికి వచ్చే రోగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఆవరణను పరిశుభ్రంగా ఉండేటట్లు చూడడం వంటి బాధ్యతలను అప్పగించింది. అయితే శ్రీకాకుళం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తన విధులను వదిలి వైద్యుల విధుల్లో అడ్మినిస్ట్రేటర్ తల దూర్చడం వలన వైద్యులు, అడ్మినిస్ట్రేటర్ మధ్య వివాదం రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఓ వైద్యురాలి సేవలను ఓ గదికి పరిమితం చేసి, కంప్యూటర్ ఆపరేటర్ తరహాలో పనిచేయిస్తుండడాన్ని ప్రశ్నించిన వైద్యులను, దీనిపై ప్రచురితమైన వార్త కథనాలను ఉద్దేశించి ఏనుగులు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అడ్మినిస్ట్రేటర్ అనడాన్ని వైద్యులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎవరి విధులు ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు, ఆస్పత్రుల్లో వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంటుందన్నారు. తక్షణమే విధులను తెలియజేస్తూ ఉత్తర్వులు వెలువరించాలని వైద్యులు రెండు రోజుల క్రితం డీఎంఈకి నివేదించి అక్కడి నుంచి వచ్చే సమాధానం కోసం వేచి చూస్తున్నారు. రిమ్స్లో పనిచేస్తున్న ఏపీహెచ్ఎంహెచ్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. గత నెల 30వ తేదీన ఈఈగా పనిచేసిన సత్య ప్రభాకర్ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో విశాఖపట్నంలో క్వాలిటీ కంట్రోల్ డీఈ గా పనిచేస్తున్న ప్రమోద్ కుమార్ను ఇన్చార్జి ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. అయితే ఆయన వారంలో మూడు నాలుగు రోజులు మాత్రమే శ్రీకాకుళం వస్తూ ఉండడం, తరచూ సెలవులు పెడుతూ ఉండడంతో ఇంజినీరింగ్ అధికారుల మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఇటీవల కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసినప్పుడు, నీటిని తరచూ పరీక్ష చేయించడం లేదని వృథాగా వదిలేస్తున్నారని.. మరలా ఇదే గమనిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డీఈని హెచ్చరించడంతో వివాదం ముదిరిపోయింది. ఆరోజు ఈఈ ఉన్నప్పటికీ కలెక్టర్కు ఎదురుపడకుండా ఉండటం వల్ల డీఈపై కలెక్టర్ ఆగ్రహం వెలిబుచ్చారు. ఇలా బాధ్యత కలిగిన అధికారులు తప్పించుకుంటూ బాధ్యత లేని అధికారులు ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న ఆవేదన అటు వైద్యులు, ఇంజినీరింగ్ అధికారులతో పాటు మరికొందరు ఉద్యోగుల్లో ఉంది. ఇప్పటికై నా రాష్ట్ర అధికారులు స్పష్టత ఇవ్వకుంటే కేజీహెచ్ స్థాయిలోనే వివాదం ముదిరే ప్రమాదం ఉంది. -
వ్యవసాయ రుణాల కోసం ఆందోళన
హిరమండలం : వ్యవసాయ రుణాలు అందించాలని హిరమండలం మండలంలోని 50 గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ మేర కు శుక్రవారం సవర చొర్లంగిలో గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో డీపట్టా భూములకు బ్యాంకులు ద్వారా రుణాలు అందేవని, భూముల రీ సర్వే తర్వాత 1బీ అడంగల్ రాకపోవడంతో రుణాల పంపిణీ ప్రక్రియ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1బీ ఉంటేనే రుణాలు ఇస్తాం.. రెన్యూవల్ చేస్తామ ని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికై నా పాలకులు స్పందించి వ్యవసాయ రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశా రు. నిరసన కార్యక్రమంలో గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గార: ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శుక్రవారం అంపోలు జిల్లా జైలును సందర్శించారు. ముద్దాయిలకు అందించే ఆహార పదార్థాలను రుచి చూశారు. గ్రంథాలయం, మహిళా బ్యారెక్లు పరిశీలించి సౌకర్యాలపై ఆరా తీశారు. పలువురి నుంచి బెయిల్ పిటీషన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో జైలర్ దివాకర్నాయు డు, సిబ్బంది పాల్గొన్నారు. పలాస: తమిళనాడు రాష్ట్రానికి చెందిన మోరీస్ అనే వ్యక్తిని గంజాయితో శుక్రవారం అరెస్టు చేసినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ ఎ.కోటేశ్వరరావు తెలియజేశారు. పలాస రైల్వేస్టేషన్లోని రెండో ప్లాట్ఫామ్లో తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతూ కనిపించాడన్నారు. అతని బ్యాగ్లో తనిఖీలు చేయగా గంజాయి పట్టుబడినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో రాయగడలో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అతని వద్ద నుంచి గంజాయి, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. గంజాయిని తూకం వేయగా 14 కిలోలు ఉన్నట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శ్రీకాకళం కల్చరల్: స్థానిక రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్సపై ఒక్కరోజు శిక్షణ శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు మాట్లాడు తూ ప్రథమ చికిత్స శిక్షణతో ఎంతో ప్రయో జ నం ఉందన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ కె.అని త మాట్లాడుతూ ప్రథమ చికిత్స శిక్షణ ప్రతి ఒక్కరికీ ఈ రోజుల్లో అవసరమని, ప్రాణనష్టం తగ్గించడంలో ప్రధాన భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. అనంతరం అభ్యర్థులకు ధృవపత్రాలు అందించారు. కార్యక్రమంలో రెడ్క్రా స్ సిబ్బంది పాల్గొన్నారు. -
పుస్తెల తాళ్లు చోరీ
పాతపట్నం: మండలంలోని పాశీగంగుపేట, చంద్రయ్యపేట గ్రామాల్లో ఇంట్లోని నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు మెడల్లో నాలుగు తులాల బంగారం పుస్తెల తాళ్లు చోరీకి గురయ్యాయని ఎస్ఐ కె.మధుసూధనరావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాశీగంగుపేట గ్రామానికి చెందిన గంగు రాము, అతని భార్య గంగు లక్ష్మి అలియాస్ మీరమ్మలు గురువారం రాత్రి ఇంట్లో నిద్రించారు. అయితే అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి దొంగ చొరబడి లక్ష్మి మెడలోని రెండు తులాల బంగారం పుస్తెల తాడును చోరీ చేశాడు. అలాగే చంద్రపే ట గ్రామానికి చెందిన మొర్రి వెంకటరమణ, అతని భార్య మొర్రి పద్మవతిలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలోనూ మెడలోని రెండు తులాల బంగారం పుస్తలతాడు చోరి జరిగినట్లు తెలిపారు. రెండు చోరీలపై కేసు నమోదు చేశారు. బంగారం దుకాణంలో చోరి రణస్థలం: లావేరు మండలంలోని బుడుమూరు గ్రామ రహదారికి ఆనుకుని ఉన్న శ్రీవిజయదుర్గా బంగారు నగల దుకాణంలో శుక్రవారం మధ్యా హ్నం చోరీ జరిగింది. బంగారు వస్తువులతో పాటు గా వెండి వస్తువులను అపహరించారు. బాధిత దుకాణదారుడు, లావేరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి కృష్ణ బుడుమూరులో బంగారం దుకాణం నడుపుతున్నాడు. షాపునకు శుక్రవారం మధ్యా హ్నం గుర్తు తెలియని ముగ్గురు మహిళలు నగలు కొనుగోలుకు చేసేందుకు వచ్చారు. యజమానిని మాటల్లో పెట్టి బేరమాడారు. అనంతరం కొనుగో లు చేయకుండానే వెనుదిరిగారు. వారు షాపు విడి చి వెళ్లగా సీసీ పుటేజీ పరిశీలించిన యాజమాని కృష్ణ చోరీ జరిగిందని గుర్తించారు. సుమారు 3 గ్రాముల బంగారం ముక్కు పుడకలు నాలుగు, 480 గ్రాముల 6 జతల వెండి పట్టీలు చోరికి గురైనట్లు గుర్తించారు. వీటి విలువ రూ.60 వేలు ఉంటుందని తెలిపారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జి.లక్ష్మణరావు తెలిపారు. -
పోక్సో కేసు నమోదు
కవిటి: మండలంలోని ఆర్.బెలగాం ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఒక బాలికను ప్రేమ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న అభియోగంపై శావసానపుట్టుగకు చెందిన విశ్వనాథంపై పోక్సో కేసు గురువారం నమోదు చేసినట్లు కవిటి ఎస్ఐ వి.రవివర్మ శుక్రవారం తెలిపారు. ఆమదాలవలస రూరల్: మండలంలోని తొగరాం గ్రామం వద్ద ఇసుక లారీ వలన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పాతూరు ఇసుక ర్యాంపు నుంచి అధిక బరువుతో వచ్చిన లారీ రహదారికి అడ్డంగా ఆగిపోయింది. దీంతో ఇరువైపుల నుంచి వచ్చిన వాహనాలు రాకపోకలు సాగించేందుకు అవకాశం లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. పలు వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సుమారు ఆరు గంటలపాటు బస్సులు, ఆటోలతో పాటు అనేక భారీ వాహనాలు నిలిచిపోవడంతో అవస్థలు తప్పలేదు. శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ప్రాంతీయ పర్యావరణాధికారి(ఆర్ఐఓ)గా రేగ సురేష్కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డ్ డైరెక్టర్ /సెక్రెటరీ నారాయణ భరత్ గుప్తా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సురేష్కుమార్ జిల్లా ఇంటర్మీడియట్ విద్య డీవీఈవోగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్ఐఓగా పనిచేసిన ప్రగడ దుర్గారావు ఈ నెలతో ఉద్యోగ విరమణ చేయనుండటంతో డీవీఈవో సురేష్కుమార్కు బాధ్యతలు అప్పగించారు. -
భోజనం బిల్లు కట్టమంటే..ఇద్దరిపై లారీ ఎక్కించేశాడు!
శ్రీకాకుంళం జిల్లా, కంచిలిలో భోజనం బిల్లు చెల్లించాలని కోరిన హోటల్ యజమాని పట్ల ఓ లారీ డ్రైవర్ సైకోలా ప్రవర్తించాడు. లారీ ఎక్కించేసి దారుణంగా హతమార్చాడు. ఇదేంటని అడ్డుకున్న మరో వ్యక్తిని సైతం లారీతో తొక్కించి చంపేశాడు. ఈ ఘోరమైన ఘటన కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలి సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాతీయ రహదారిపై సరుకులు రవాణా చేసే క్రమంలో జార్ఖండ్ నుంచి విశాఖపట్నంకు బయలుదేరిన కంటైనర్ లారీ బుధవారం రాత్రి కంచిలి మండలం జలంత్రకోట గ్రామ కూడలిలో జాతీయ రహదారి పక్కన దాబా హోటల్ వద్ద ఆగింది. డ్రైవర్ ఎబ్రార్ ఖాన్ భోజనం చేసి అక్కడే మద్యం తాగాడు. భోజనం బిల్లు రూ.200 చెల్లించాలని హోటల్ యజమాని ఎం.డి.అయూబ్(56) కోరగా అందుకు నిరాకరించాడు. గొడవపడి లారీ తీసుకొని వెళ్లిపోతుండగా యజమాని అడ్డుకున్నాడు. దీంతో అతన్ని ఢీకొట్టి పైనుంచి లారీ తీసుకెళ్లిపోయాడు. ఆ హోటల్కు రోజువారీ పాలు ఇచ్చి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న మధుపురం గ్రామానికి చెందిన పాల వ్యాపారి డొక్కర దండాసి(71) తాను నడుపుతున్న టీవీఎస్ ఎక్సెల్ వాహనంతో అడ్డుకున్నాడు. ఆయన్ను కూడా లారీతో తొక్కేసి పారి పోయాడు. ఈ ఘటనలో యజమాని, పాల వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందారు. హోటల్ సిబ్బంది, స్థానికులు వెంబడించి బూరగాం వద్ద లారీని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు సోంపేట ప్రభుత్వాసుపత్రిలో గురువారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. వలస కుటుంబంలో విషాదం.. హోటల్ యజమాని ఎం.డి. అయూబ్ పదిహేనేళ్ల జార్ఖండ్ రాష్ట్రం చత్గల్ జిల్లా సత్గాం నుంచి 15 ఏళ్ల కిందట వలసవచ్చాడు. భార్య నసీమా బేగం, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కొత్తమ్మకు చల్లదనం.... మురిసిన భక్తజనం!
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 23 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరి రోజున కమ్మకట్టు కుటుంబం ఇంటి వద్ద నుంచి అమ్మవారి జంగిడితో పాటు అధిక సంఖ్యలో మహిళలు ముర్రాటలు, ఘటాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా కొత్తమ్మతల్లి నినాదాలతో కోట»ొమ్మాళి, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాతి్మకత వెల్లివిరిసింది. ఊరేగింపులో పలువురు యువకులు కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. –టెక్కలి -
ఇచ్చిన మాట నిలబెట్టుకోరూ.. !
● డిప్యూటీ సీఎం సారూ.. ● విద్యార్థి కుటుంబసభ్యుల విజ్ఞప్తి వజ్రపుకొత్తూరు రూరల్: అధికారం కోసం కూటమి నాయకులు ఎన్నికల సమయంలో విద్యార్థుల చావులతోనూ రాజకీయం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని వేదికల మీద ఊదరగొట్టే ప్రసంగాలు చేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖం చాటేశారు. శ్రీకాకుళం జిల్లాలో అతి పెద్ద మత్స్యకార గ్రామమైన నువ్వలరేవుకు చెందిన మువ్వల నగేష్ ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద ఉన్న శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతూ 2021 జనవరి 26న అనూమానాస్పదంగా మృతి చెందాడు. తమ కుమారుడిని కాలేజీలోనే ఎవరో చంపి మృతదేహాన్ని కాల్చే ప్రయత్నం చేశారని, పోస్టుమార్టం చేసినా రిపోర్టు ఇవ్వలేదని, కేసును సైతం తారుమారు చేశారని కుటుంబ సభ్యులు అప్పట్లో ఆందోళనకు దిగారు. ఈ విషయమై ఎన్నికల సమయంలో రణస్థలం వద్ద నిర్వహించిన యువశక్తి కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పలాసలో జరిగిన యువగళం కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్ కూడా మనం అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే దోషులను శిక్షిస్తామని, బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక విస్మరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు గురువారం విలేకర్ల ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను మూడుసార్లు కలిశామని, తాను ఈ విషయంలో ఏమీ చేయలేనంటూ ఎంపీ రామ్మోహన్నాయుడిని గానీ మంత్రి అచ్చెన్నాయుడిని గానీ కలవండి అంటూ తప్పించుకున్నారని వాపోయారు. ఇప్పటికైనా నిందితులను శిక్షించి న్యాయం చేయాలని కోరారు. -
మాజీ సీఎంను దూషించడం సరికాదు
నరసన్నపేట : ప్రజా సేవకుడిగా..ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్ మోహనరెడ్డిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా సంస్కార హీనంగా మాట్లాడటాన్ని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ గురువారం తీవ్రంగా ఖండించారు. సినీ నటుడిగా తాను నటించిన సినిమాల్లో హిత బోధలు చేస్తూ గొప్పలు చెప్పుకొనే వ్యక్తి నిజ జీవితంలో అసెంబ్లీ వేదికగా వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఉద్దేశించి సైకో అని మాట్లాడాన్ని తప్పుపట్టారు. సినీ నటులను తాడేపల్లికి పిలిచి వైఎస్ జగన్ అవమానించారనడం అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ సినీ పరిశ్రమకు అండగానే ఉన్నారని గుర్తు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలకు జాబ్మేళా రేపు శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా కేంద్రంలో బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న పారిశ్రామిక శిక్షణా సంస్థ/డీఎల్టీసీ వద్ద ఈ నెల 27న మహిళలకు జాబ్మేళా జరగనుందని అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు గురువారం తెలిపారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్లో టీఏఎస్ఎల్ ఏరోస్ట్రక్చర్స్, ఏరో ఇంజినీర్స్ సంస్థ పేరిట ఫీమేల్ ట్రెయినీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ధ్రువపత్రాలతో శనివారం ఉదయం 9 గంటలకు డీఎల్టీసీ ప్రాంగణం వద్దకు చేరుకోవాలని సూచించారు. మండపల్లి సర్పంచ్ చెక్ పవర్ పునరుద్ధరణ ఇచ్ఛాపురం రూరల్ : గత వైఎస్సార్సీపీ హయాంలో పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకురాలు పిట్ట శేషమ్మపై కూటమి ప్రభుత్వం కక్షగట్టి ఈ ఏడాది ఫిబ్రవరి 13న చెక్ పవర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కోర్టు ద్వారా పోరాటం చేసిన నేపథ్యంలో గురువారం చెక్ పవర్ను పునరుద్ధరిస్తూ జిల్లా పంచాయతీ అధికారి కె.భారతి సౌజన్య ఉత్తర్వుల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.రామారావు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ న్యాయం గెలిచిందని, పంచాయతీ అభివృద్ధికి కృషి చేసిన తనను మానసికంగా వేధించారని, అయినప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం పోరాటం చేసి విజయం సాధించానని చెప్పారు. -
తగ్గేదేలే!
మడపాం దగ్గర నదిలో తవ్వకాలు వానొచ్చినా.. వరదొచ్చినా సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఇసుకాసురాలు వెనక్కి తగ్గడం లేదు. వానలు పడుతున్నా, వరద వచ్చినా లెక్క చేయడం లేదు. కోట్ల రూపాయలు రుచిమరి గిన అక్రమార్కులు ఇసుక దోపిడీ చేస్తునే ఉన్నారు. ప్రభుత్వమే తమకు లైసెన్సు ఇచ్చినట్టుగా ఇసుక దందా సాగిస్తున్నారు. అధికార పార్టీ కనుసన్నల్లో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. వర్షాలు పడుతున్నా, నాగావళి, వంశధార, బహుదా, మహేంద్రతనయా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నా కూడా అక్రమ తవ్వకాలు, రవాణా ఆగడం లేదు. ప్రధానంగా శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ఇసుక అక్రమ బాగోతం నడుస్తోంది. అక్కడి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో, అనుచరులు దగ్గరుండి ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. అనుచరులతో పాటు బాబాయ్ అబ్బాయ్ అనుచరులు అక్రమ ఇసుక దందాతో లబ్ధి పొందుతున్నారు. పట్టపగలు, బహిరంగంగా ఇసుక పేరుతో లూఠీ చేసేస్తున్నారు. అనధికార రీచ్ల్లోనే కాదు అధికారిక రీచ్ల్లో కూడా చొరబడి ఇసుక మింగేస్తున్నారు. వంశధార, నాగావళి నదులు అక్రమ సంపాదనకు ఆనవాళ్లుగా మారుతుండడం విశేషం. అక్రమాల జాడలివిగో.. ● శ్రీకాకుళం రూరల్ పరిధిలోని భైరి, కరజాడ, కళ్లేపల్లి, కిల్లిపాలెం, లొద్దలపేట, సింగూరు, నైరాతో పాటు పొన్నాం నుంచి రాత్రిపూట పెద్ద ఎత్తున ఇసుక అక్రమంగా తరలిపోతోంది. తెల్లవారయ్యేసరికి తమ పని కానిచ్చేస్తున్నారు. ప్రజలు నిద్రలేచే లోపు దందా ముగించేస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.35వేలకు పైగా వసూలు చేసి అప్పనంగా సంపాదిస్తున్నారు. ● ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో రెండు నదుల్లోనూ ఇసుక దందా కొనసాగుతోంది. ముద్దాడపేట, పురుషోత్తపురం, కొత్తవలస, నిమ్మతొర్లాడ, దూసి, తోటాడ, అక్కివరం, తొగరాం, బెలమం, పొందూరు మండలం సింగూరు, బొడ్డేపల్లి, నెల్లిమెట్టలో సైతం ఇదే రకంగా ఇసుక దోపిడీ జరుగుతోంది. బూర్జ మండలం కాఖండ్యాం, నారాయణపురం, సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం, పాతపాడులో అక్రమంగా తవ్వి తరలించేస్తున్నారు. ● నరసన్నపేటనియోజకవర్గ పరిధిలోని మడపాం, లుకలాం, బుచ్చిపేట, చెవ్వాకులపేట, పర్లాంలో భారీగా ఇసుక తరలిపోతోంది. అధికార పార్టీ నాయకులు దర్జాగా ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఒక్కొక్క లారీకి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకూ వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని పొన్నాడ, తోటపాలెంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతోంది. ● పాతపట్నం నియోజకవర్గంలో వసప, బలద, ఆకులతంపర, హిరమండలంలో కోరాడ, భగీరథిపురం, రెల్లివలస, అక్కరాపల్లి, పిండ్రువాడలో ఇసుక దందా కొనసాగుతోంది. నదుల్లో వరదనీరు ప్రవహిస్తున్నా తగ్గని ఇసుకాసురులు ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట, పాతపట్నంలో యథేచ్ఛగా దందా లారీలు పట్టుకుంటే వదిలేయాలని ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు చూసీచూడనట్టుగా అధికార యంత్రాంగం -
మురిసిన భక్తజనం
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తజనం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తజనం ముగిసిన కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు ● ముర్రాటలతో మొక్కులు తీర్చుకున్న భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి శతాబ్ది ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 23 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, హెలికాప్టర్ రైడ్ వంటి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చివరి రోజున కమ్మకట్టు కుటుంబం ఇంటి వద్ద నుంచి అమ్మవారి జంగిడితో పాటు అధిక సంఖ్యలో మహిళలు ముర్రాటలు, ఘటాలతో ఆలయానికి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. దారి పొడవునా కొత్తమ్మతల్లి నినాదాలతో కోటబొమ్మాళి, పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఊరేగింపులో పలువురు యువకులు కొట్లాటకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. అనంతరం పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. –టెక్కలి