Sakshi Special
-
ఇంజన్ వైఫల్యమే!
దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ (వీటీ–ఏఎన్బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు పైలట్ చేసిన మేడే కాల్లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్ మోటార్స్ కంపెనీ తాలూకు జీఈఎన్ఎక్స్ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్గా మారింది. బ్లాక్బాక్స్ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్ కాగానే లాండింగ్ గేర్ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్ గేర్, ఫ్లాప్లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్ తెరుచుకునే ఉండగా ఫ్లాప్లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్ లభించకుండానే పైలట్ టేకాఫ్కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్ఎయిర్ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్ బోయింగ్ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్కు నిర్దిష్ట థ్రస్ట్ సెటింగ్లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్కు మామూలు కంటే అధిక థ్రస్ట్ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్ రొటేషన్ స్పీడ్ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్ గేర్ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్ గేర్ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్ అయ్యాక క్షణాల్లోనే గేర్ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్ గేర్ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్కు వీలుగా పైలట్ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐ లవ్ యు డాడీ...
నాటి రోజుల్లో నాన్న అంటే సం పాదించేవాడుగా, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేవాడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. నేటి సమాజంలో తండ్రి పాత్ర ఒక కొత్త మలుపు తీసుకుంది. కేవలం సంపాదనకే పరిమితం కాకుండా, పిల్లలతో కలిసి ఆడుతూ.. పాడుతూ.. అల్లరి చేస్తూ... వారి ఆలనా పాలనా చూసే మంచి తండ్రి. అభివృద్ధిలో, భావోద్వేగ బంధాలలో, నైతిక విలువల్లో భాగస్వామి అయ్యే లవ్లీ డాడీ!ప్రస్తుత తల్లిదండ్రుల తరం ‘సమాన భాగస్వామ్యం‘ అనే సిద్ధాంతాన్ని అంగీకరిస్తోంది. తండ్రులు ఇప్పుడు పిల్లల ఆరోగ్యం, విద్య, ఆటలు, వారితో గడిపే సమయం – అన్నిట్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పాలు పట్టడం నుంచి బడికి తీసుకెళ్లడం వరకు ప్రతి దైనందిన పనిలోనూ తండ్రి పాత్ర కనిపిస్తుంది.భావోద్వేగాలకు ప్రాధాన్యంఈ తరానికి చెందిన తండ్రులు పిల్లలను ఆదేశించేవాళ్లుగా కాదు అన్ని విషయాలు వారితో చర్చించేవాళ్లుగా మారారు. వారి భయాలు, ఆశలు, ప్రశ్నలు, ఆనందాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బంధం పిల్లల మనోభావాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కుటుంబానికి సమయం కేటాయించడం కోసం నేటి తండ్రులు పని సమయంలో సర్దుబాటు చేసుకుంటున్నారు. ‘క్వాలిటీ టైమ్‘ అనే మాట ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది. రోజూ కొంత సమయం పిల్లలతో గడపడం, స్కూల్ ఈవెంట్స్కు హాజరవడం, వారికి కథలు చెప్పడం వంటి పనులు ఈ తరం తండ్రుల ప్రత్యేకతగా చెప్పవచ్చు.టెక్నాలజీతో అనుబంధంఈ డిజిటల్ యుగంలో తండ్రులు.. పిల్లల విద్య, ఆరోగ్యం, అభివృద్ధి, ఆన్ లైన్ యాప్స్, వీడియో కాల్స్, ఈ– లర్నింగ్ టూల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. టెక్నాలజీ సహకారంతో పిల్లల ప్రపంచానికి దగ్గరగా ఉంటున్నారు.ఆధునిక తండ్రిమోడర్న్ ఫాదర్హుడ్ అనేది ప్రేమతో, సహనంతో, బాధ్యతతో కూడినదిగా మారింది. ఒక తండ్రి మోడర్న్గా, ప్రేమగా మారినప్పుడు కుటుంబం మారుతుంది. కుటుంబం మారినప్పుడు సమాజం మారుతుంది. ఈ మార్పు ఒక మంచి భవిష్యత్తుకు వేదికగా మారుతుందని చెప్పడంలో సందేహం లేదు.ఉదాహరణగా తండ్రిఓ ఆధునిక తండ్రిగా, సింగిల్ ఫాదర్గా ఉండటం అనే అసాధ్యమైన పనిని కూడా నేటి తండ్రులు సుసాధ్యం చేస్తున్నారు. పిల్లల చదువు, భావోద్వేగాలు, వారి భవిష్యత్తునూ చూసుకోవడంపై దృష్టి పెడుతున్నారు. సెలబ్రిటీలు కూడా ఇందుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా తండ్రి తనంలో వారు చూపే నిబద్ధతా, ప్రేమా ప్రతి తండ్రికీ ఆదర్శ్ర పాయమే.కరణ్ జోహర్ సరోగసీ ద్వారా జుహీ, యష్ అనే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. సింగిల్ డ్యాడ్గా ఆయన తన పిల్లలకు ఆదర్శంగా ఉండటమే కాక, తన అనుభవా లను పుస్తక రూపంలోనూ, ఇంటర్వ్యూలలోనూ పంచుకున్నారు. -
బోయింగ్ డ్రీమ్లైనర్ రహస్యాల్ని బయటపెట్టి..
అహ్మదాబాద్ విమాన ప్రమాద నేపథ్యంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాలను ఇక మీదట భారత విమానయాన సంస్థలకు ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు.. ప్రమాదంపై విచారణ ముగిశాక అమెరికా వైడ్బాడీ ఎయిర్లైనర్తో సమీక్ష జరిపిన తర్వాతే ఏ నిర్ణయం అనేది ప్రకటించనుందని ఆంగ్ల మీడియా కథనాల సారాంశం. అయితే.. బోయింగ్ విమానం.. అందునా డ్రీమ్లైనర్(Dreamliner) ఎంత మాత్రం సురక్షితం కాదన్న ఆ సంస్థ వేగు, మాజీ ఉద్యోగి జాన్ బార్నెట్ స్టేట్మెంట్ ఇప్పుడు తాజా ప్రమాద నేపథ్యంలో తెర మీకు వచ్చింది. బోయింగ్లో మూడు దశాబ్దాల పాటు పనిచేసిన బార్నెట్.. ఆయన 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతా లోపాలను బయటపెట్టి సంచలన చర్చకు దారి తీశారు. అయితే ఆయన సజీవంగా లేరు. 👉జాన్ బార్నెట్(John Barnett) 2024 మార్చిలో బలవన్మరణానికి పాల్పడ్డారు. సౌత్ కరోలీనా చార్లెస్టన్లో తన ట్రక్కులో ఆయన తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. అయితే ఆయనది ఆత్మహత్య కాదని.. ఆయన్ని హత్య చేశారని ఆయన సన్నిహితులు ఇప్పటికీ వాదిస్తుంటారు. అందుకు.. ‘‘ఈ పోరాటం ఇంకా ఎంతో కాలం చేయలేను’’ అంటూ ఆయన చేతిరాతతో దొరికిన నోట్ను ప్రస్తావిస్తుంటారు.👉ఆ నోట్ ఆధారంగా.. ఆయన కుటుంబ సభ్యులు బోయింగ్పై దావా వేశారు. ఆపై కొన్నాళ్లకు కంపెనీతో సెటిల్మెంట్ చేసుకుని ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. 👉787 డ్రీమ్ లైనర్ విమానం సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణానికి ఉపయోగించే అత్యాధునిక విమానం. అయితే ఆ విమానం అందుకు పనికి రాదన్నది బార్నెట్ వాదన. 👉బోయింగ్ సంస్థలో బార్నెట్ మూడు దశాబ్దాలకు పైగా పని చేశారు. 2010 నుండి 787 డ్రీమ్లైనర్ను తయారు చేస్తున్న నార్త్ చార్లెస్టన్ ప్లాంట్లో క్వాలిటీ మేనేజర్గా విధులు నిర్వర్తించారు. అనారోగ్యంతో 2017లో పదవీ విరమణ చేశారు. సంస్థ నుంచి పదవీ విరమణ తర్వాత నుంచి మరణించేదాకా.. బోయింగ్పై ఆయన విమర్శలు గుప్పించారు.ఏం చెప్పాడంటే.. 2019లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోయింగ్ సంస్థ లోపాల గురించి బార్నెట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘బోయింగ్ ఫ్యాక్టరీలో సరిగా లేని లోపభూయిస్ట భాగాలను ఉద్దేశపూర్వకంగా విమానంలో అమర్చారు. ఆక్సిజన్ వ్యవస్థలోని కొన్ని తీవ్రమైన సమస్యలను కనుగొన్నాం. అత్యవసర సమయాల్లో ప్రతీ నాలుగు ఆక్సిజన్ మాస్కుల్లో ఒకటి పనిచేయదు. వాస్తవానికి.. కొత్త విమానాన్ని నిర్మించే ప్రయత్నంలో సౌత్ కరోలినాలో అసెంబ్లింగ్ ప్రక్రియ హడావిడిగా జరిగింది. ఇది భద్రతపై కంపెనీని రాజీ పడేలా చేసింది’’ అంటూ చెప్పారాయన. అలాగే.. Photo Credits: Netflix👉ఇదే కాకుండా కార్మాగారంలోని వివిధ బాగాలను ట్రాక్ చేయడంలో కార్మికులు విఫలమయ్యారని, దీని వల్ల ఫాల్ట్ ఉన్న భాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు. ఈ విషయాన్ని నిర్వాహకులకు తెలిపినా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2017లో యూఎస్ రెగ్యులేటర్, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) సమీక్ష, బార్నెట్ వ్యక్తం చేసిన కొన్ని ఆందోళనల్ని సమర్థించింది. 👉2022లో నెట్ఫిక్స్ ‘డౌన్ఫాల్: ది కేస్ అగెనెస్ట్ బోయింగ్’ డాక్యుమెంటరీలో జాన్ బార్నెట్ కనిపించారు. ప్రత్యేకించి 737 మ్యాక్స్ ప్రమాదాల గురించి ఆయన చర్చించారు.👉2024 మొదట్లో.. అలస్కా ఎయిర్లైన్స్ తలుపులు ఊడిపడిన ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో బోయింగ్ వైఫల్యాలను ఆయన ఎత్తి చూపించారు. చివరకు.. తన మరణానికి ముందు కూడా ఆయన కంపెనీకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చాడు. 👉అయితే, బోయింగ్ సంస్థ మాత్రం బార్నెట్ ఆరోపణల్ని ఖండించింది. తమ విమానాలు అత్యున్నత స్థాయి భద్రత, నాణ్యత ప్రమాణాలతో నిర్మితమవుతున్నాయని చెప్పింది. భద్రత, నాణ్యత, సమగ్రత బోయింగ్ విలువల్లో ప్రధానమైనవని కంపెనీ నొక్కి చెప్పింది. తాజాగా.. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంతో.. బోయింగ్ డ్రీమ్లైనర్పై బార్నెట్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. -
విమానంలో విద్యుత్
నడవడమే రాని మానవుడు నేడు పక్షిలా గాలిలో ఎగిరిపోయే సాధనాలను కనుగొని ఎక్కడికి అంటే అక్కడికి నిమిషాలు, గంటల్లోనే ప్రయాణిస్తున్నాడు. దేశ విదేశాల్లో విమానంలో చక్కర్లు కొడుతున్నాడు. ఆ విమానం నడవాలంటే మాత్రం ఇంధనంతో పాటు విద్యుత్ కూడా చాలా అవసరం. కానీ, అవే ఒక్కోసారి వందల ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదం కూడా అలాంటిదే.ఈ దుర్ఘటనకు విమానంలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమవడం కారణం కావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు విమానంలో విద్యుత్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది..? ఎందుకు విఫలం అవుతుంది..? దానివల్ల జరిగిన ప్రమాదాలేంటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.సాక్షి, అమరావతి: విమానంలో ప్రధానంగా నాలుగు రకాల విద్యుత్ వ్యవస్థలు పనిచేస్తుంటాయి. వాటినే ప్రధాన, అత్యవసర, ద్వితీయ, సహాయక విద్యుత్ వ్యవస్థలుగా పిలుస్తుంటారు. వీటితో పాటు ఓవర్లోడ్, షార్ట్ సర్క్యూట్ వంటి ఆకస్మిక ప్రమాదాల నుంచి రక్షించేందుకు సర్క్యూట్ బ్రేకర్లను అమర్చుతారు. అత్యవసర సమయంలో వాడుకునేందుకు వీలుగా విద్యుత్ను బ్యాటరీల్లో నిల్వ చేస్తారు. నావిగేషన్, కమ్యూనికేషన్, నియంత్రణ, క్యాబిన్, కాక్పిట్ లైటింగ్, ఎయిర్ కండిషనింగ్, టీవీ, ఫ్యాన్లు వంటి కీలక పనులకు ఈ విద్యుత్ వ్యవస్థ ఉపయోగపడుతుంది.ఇది ఏమాత్రం విఫలమైనా విమానం కుప్పకూలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. విమానంలో జనరేటర్లు లేదా ఆల్టర్నేటర్లు అనేవి ఉంటాయి. ఇవి ఇంజిన్తో నడుస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ప్రధాన ఇంజన్లు పని చేయనప్పుడు సహాయక విద్యుత్ యూనిట్ ఆదుకుంటుంది. రామ్ ఎయిర్ టర్బైన్ అనేది కొన్ని సందర్భాల్లో విద్యుత్ వనరుగా పనికొస్తుంది. ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫయర్ యూనిట్లు కొన్ని వ్యవస్థల కోసం విద్యుత్ను అందిస్తుంటాయి. బ్యాటరీలు బ్యాకప్ పవర్ సోర్స్లుగా పనిచేస్తాయి. కాకపోతే ఈ వ్యవస్థ అన్ని విమానాల్లోనూ ఒకేలా ఉండదు. సింగిల్ ఇంజిన్ జనరల్ ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్, ఆధునిక, బహుళ ఇంజిన్ కమర్షియల్ జెట్ ఎయిర్క్రాఫ్ట్ మధ్య విద్యుత్ వ్యవస్థ సామర్థ్యం, నిర్మాణంలో చాలా తేడా ఉంటుంది. ముందే శిక్షణ ఇస్తారు.. విద్యుత్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా తగిన సూచనలను, శిక్షణను ముందే పైలట్లకు తెలియజేస్తారు. విద్యుత్ వ్యవస్థ వైఫల్యాన్ని సూచించడానికి ఒక అమ్మీటర్, లోడ్ మీటర్ లేదా హెచ్చరిక లైట్ ఉంటాయి. బలమైన రక్షణ వ్యవస్థ, పర్యవేక్షణ, వైఫల్య హెచ్చరిక నిబంధనలు విద్యుత్ వ్యవస్థలో ఉంటాయి. ఇవి ఎప్పటికప్పుడు తగిన సూచనలను పైలట్లకు అందజేస్తుంటాయి. స్టాండ్బై ఫ్లైట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎయిర్క్రాఫ్ట్ ఎమర్జెన్సీ ఫ్లోర్ పాత్ ఇల్యూమినేషన్ వంటి భాగాలు వాటికి సొంత బ్యాకప్ విద్యుత్ ఉంటుంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా విఫలమైనా కూడా ఇవి పనిచేస్తాయి. విమానంలో సర్క్యూట్ బ్రేకర్ విఫలమైనప్పుడు ఒకసారి మాత్రమే రీసెట్ చేయాలి. రెండోసారి చేయకూడదు. విద్యుత్ జనరేటర్లు, వైర్ల నుంచి పొగలు, మంటలు వస్తే విద్యుత్ ఐసోలేషన్ విధానాన్ని అనుసరించాలి. విమానాన్ని త్వరగా ల్యాండ్ చేయాలి. ఏమాత్రం ఆలస్యమైనా భారీ నష్టం సంభవిస్తుంది.విద్యుత్ వ్యవస్థ విఫలంతో విమాన ప్రమాదాలు, దుర్ఘటనల్లో కొన్ని⇒ ఎండీ11 అనే స్విస్ ఎయిర్ విమానంలో విద్యుత్ అగ్నిప్రమాదం వల్ల కెనడా సమీపంలో 1998 సెపె్టంబర్ 2న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయింది. ⇒ 2010 ఆగస్టు 24న ఉత్తర సూడాన్లో ఖార్టూమ్ నుంచి బీరుట్ బయల్దేరిన ఏ321 ఎయిర్బస్లో జనరేటర్లు దెబ్బతిని విద్యుత్ వ్యవస్థ పనిచేయడం మానేసింది. 49 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ⇒ 2009 మార్చి 15న లండన్ హీత్రూ నుంచి ఎడిన్బర్గ్కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన ఏ319 విమానంలో విద్యుత్ వైఫల్యం ఏర్పడి పైలట్లకు డిస్ప్లే కనిపించలేదు. పొగలు కూడా వచ్చాయి. దీంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ⇒ 2008 సెపె్టంబరు 22న అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన బి752 సియాటిల్ నుంచి న్యూయార్క్ వెళ్తుండగా విద్యుత్ సమస్య ఎదుర్కొంది. చికాగోలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నది. 192 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. -
ప్రయాణికులపాలిట పీడకల... డ్రీమ్లైనర్
విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గమధ్యంలో కూలిపోయి తమ కలలను కల్లలుచేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమానతయారీరంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు, విశేషాలతోపాటు వివాదాలపర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారుచేసి మరోచోట విడిభాగాలను పటిష్టమైన ప్రామాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మోడల్ పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి గమనిద్దాం. విలాసానికి మారుపేరు.. ఎప్పుడొచ్చింది? 2011లో విశ్వవిపణిలోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787–8 డ్రీమ్లైనర్ విమానంలోని సదుపాయాలు, సామర్థ్యాన్ని చూసిన వాళ్లంతా ఔరా అనేశారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతోపాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలుచేసిన, నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. సామర్థ్యం ఎంత? ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. అత్యంత పటిష్టమైన, అత్యంత తేలికైన మూలకాలతో విమాన నిర్మాణ విడిభాగాలను తయారుచేశారు. దీంతో మిగతా పోటీ సంస్థల మోడళ్లతో పోలిస్తే దీని బరువు తక్కువగా ఉంటుంది. మైలేజీపరంగా తక్కువ ఇంధనంతో పనిచేస్తుంది. టెక్నాలజీ ఎలాంటిది? కొత్తతరం డిజైన్, అధునాతన ఫ్లై–బై–వైర్ కంట్రోలర్లతో పనిచేస్తుంది. ప్రతి ఆదేశాన్ని పైలట్ ఇవ్వాల్సిన పనిలేకుండా గాల్లో కదిలే దిశ, ఒంపుకు అనుగుణంగా ఆటోమేటిక్గా కంప్యూటరే ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఇందులో ఉంది. అత్యాధునిక ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు దీనిలో ఉన్నాయి. సింథటిక్ విజన్ సిస్టమ్(ఎస్వీఎస్) సాయంతో కింద ఉన్న భూభాగాన్ని త్రిమితీయ(3డీ) ఫొటోలు తీసి ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో రన్వేపై పక్షులు, ఎయిర్పోర్ట్ వస్తువులు ఏమైనా ఉన్నాయోలేదో వెంటనే అలర్ట్చేస్తుంది. మంచుదుప్పటి కప్పుకున్నా, భీకర వర్షం పడుతున్నా రన్వే పరిసరాలను స్పష్టంగా చూపిస్తుంది. ఇంకెన్ని ఫీచర్లు ఉన్నాయి? ప్రయాణికుల సీటింగ్ క్యాబిన్, కాక్పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైనా సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్(ఐఎంఏ) విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్బాల్లో వెనువెంటనే ఆటోమేషన్లో తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. మరి లోపాలేంటి? తొలిరోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787–8 డ్రీమ్లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్(ఎఫ్ఏఏ) వీటి రాకపోకలను స్తంభింపజేసింది. విమానం మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేరని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగా పూడ్చట్లేరని, ఇందుకు కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్ట్లు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్లైన్స్లకు కొత్త విమానాలను డెలివరీ చేయాలని ఎఫ్ఏఏ ఆదేశించడంత 2021 జనవరి నుంచి 2022 ఆగస్ట్దాకా 787 సిరీస్ల డెలివరీ ఆగిపోయింది.లోపాలను ఎత్తిచూపిన సీనియర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి బోయింగ్ సంస్థలో పనిచేసిన సీనియర్ ఇంజినీర్లు ఈ మోడల్ విమానాల్లో లోపాలు ఉన్నట్లు పలుమార్లు బహిరంగంగా చెప్పారు. బోయింగ్ సంస్థలో ఇంజనీర్గా 17 ఏళ్లపాటు పనిచేసిన మాజీ ఉద్యోగి సామ్ సలేహ్పౌర్ 2024లో ఎఫ్ఏఏకు ఫిర్యాదు కూడా చేశారు. ‘‘విడిభాగాల ఉత్పత్తి దశలో బోయింగ్ అడ్డదారులు తొక్కుతోంది. విడిభాగాల బిగింపు సమయంలో అత్యున్నత స్థాయి ప్రమాణాలను పాటించట్లేదు. హడావిడిగా తుది ఆమోద ముద్ర వేసేలా ఇంజనీరింగ్ సిబ్బందిపై ఒత్తిడి చేస్తోంది. సరైన బిగింపు లేకపోవడం వల్ల విమానం పాతబడేకొద్దీ లోపం అనేది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అసెంబ్లీ యూనిట్లలో సిబ్బంది అడవిలో టార్జాన్ మాదిరిగా ఒక చోట నుంచి మరోచోటుకు వేగంగా మారుతూ పనిని సవ్యంగా చేయట్లేరని సంస్థకు ఎన్నోసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. 2020 ఏడాది నుంచి మూడుసార్లు సంస్థ ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేస్తే నన్ను ‘నోరు మూస్కో’అన్నారు. ఇన్ని లోపాలతో తయారైన ఈ లోహ విహంగాలు టిక్ టిక్ శబ్దం చేసే టైంబాంబులే. రక్షణ, భద్రతా సంస్కృతికి బోయింగ్ తిలోదకాలిస్తోంది’’అని సలేహ్పౌర్ ఆరోపించారు.సమస్యలు ఎత్తిచూపి శాశ్వత నిద్రలోకి.. క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్గా 32 ఏళ్లు బోయింగ్లో పనిచేసిన జాన్ బార్నెట్ సైతం పలు లోపాలను ఎత్తిచూపారు. ‘‘అత్యధిక పని ఒత్తిడి కారణంగా సిబ్బంది.. తయారీ లోపాలున్నాసరే ఆయా భాగాలను బిగించేస్తున్నారు. ఆక్సీజన్ వ్యవస్థల్లో ఇలాంటి లోపాలను గుర్తించా. ప్రతి నాలుగింట ఒక ఎమర్జెన్సీ బ్రీతింగ్ మాస్్కలో లోపం ఉంది. వాడేటప్పుడు ఇవి విఫలమవడం ఖాయం’’అని అన్నాడు. ఈ లోపాలను బయటపెట్టినందుకు ఈయనపై కేసు నమోదైంది. తర్వాత ఈయన ఆత్మహత్యచేసుకున్నారు. విమానాల్లో లోపాల ను క్వాలిటీ ఆడిటర్ జాషువా డీన్ సైతం బయటపెట్టారు. తర్వాత ఆయన సైతం అనారోగ్య సమస్యలతో చనిపోయారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏసీ @ 24.. ఆదా సూపర్
సాక్షి, స్పెషల్ డెస్క్ : ‘ఏసీ లేనిదే నాకు నిద్రపట్టదు’.. తరచూ మన చుట్టూ ఉండే వాళ్లు చెప్పే డైలాగ్. ఇంట్లో, ఆఫీసులో.. చివరకు కారులో కూర్చున్నా చాలామందికి చల్లని గాలి వీయాల్సిందే. ఎక్కువమందికి ఏసీ 16–20 డిగ్రీల మధ్యే ఉండాలి. అంతలా జనం ఏసీ చల్లదనానికి అలవాటుపడ్డారు. ఏటా భారత్లో 1.5 కోట్ల ఏసీలు అమ్ముడవుతున్నాయంటే కారణం ఇదే. ఇదంతా నాణేనికి ఒకవైపు. కానీ, అతి చల్లదనం.. మనకుగానీ, పర్యావరణానికి గానీ మంచిది కాదని వైద్యులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నమాట. అందుకే కనిష్టంగా 20.. గరిష్టంగా 28 డిగ్రీల సెల్సియస్కు ఏసీల సెట్టింగ్స్ను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరి, ఇలా చేస్తే మనకు, పర్యావరణానికి ఏంటి ప్రయోజనం? సీలు మనకు ఎంత చల్లదనాన్నిఇస్తాయో.. విద్యుత్ వ్యవస్థకు, పర్యావరణానికి అంత ‘వేడి’కూడా చేస్తాయి. అంటే... విద్యుత్ వాడకం పెరుగుతుంది! మనం వాడే విద్యుత్.. బొగ్గు వంటి వాటితో ఉత్పత్తి అయితే ఆ మేరకు పర్యావరణంపైనా ప్రభావం పడుతుంది. పర్యావరణంపై ప్రభావాన్ని కొందరు తేలిగ్గా తీసుకోవచ్చు.. ఎందుకంటే, అది ఎప్పటికోగానీ ఫలితం చూపించదు అనుకుంటారు కాబట్టి! కానీ, విద్యుత్ వాడకం పెరగడం వల్ల మాత్రం ఫలితాలను మనం తక్షణమే చూడాల్సి వస్తుంది.. చూస్తున్నాం కూడా.. కరెంటు కోతల రూపంలో!! విద్యుత్ అంతరాయాలు దేశంలో విద్యుత్ డిమాండ్.. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మించిపోయింది. దీని ఫలితంగా ముఖ్యంగా వేసవిలో ఏప్రిల్ నుండి జూన్వరకు కొన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 2024లో గరిష్ట డిమాండ్ 250 గిగావాట్లకు చేరుకుంది. ఈ డిమాండ్ 2025లో 8 శాతం పెరుగుతుందని అంచనా. వేసవిలోనూ దేశంలో వర్షాలు పడడంతో విద్యుత్ డిమాండ్ అదుపులో ఉంది. అయితే జూన్లో వేడి గాలులు తిరిగి వీయడంతో విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ డిమాండ్ ఈ ఏడాది జూన్9న 241 గిగావాట్లకు చేరింది. 2025లో ఇదే గరిష్టం. పెరుగుతున్న విద్యుత్ వాడకాన్ని కట్టడి చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. అందుకే ఇళ్లు, హోటళ్లు, కార్లలో వినియోగించే ఏసీలకు సరికొత్తగా ‘ఉష్ణోగ్రత నిబంధన’ను వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది. ఏటా రూ. 7.5 లక్షల కోట్లు ఆదా!ఏసీ ఉష్ణోగ్రత ఒక్కో డిగ్రీ పెరిగితే (ఉదాహరణకు 16 నుంచి 17 డిగ్రీల సెల్సియస్కు చేరితే ).. విద్యుత్ వినియోగం 6 శాతం తగ్గుతుందని కేంద్ర విద్యుత్ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ వెల్లడించారు. ఈ స్థాయి తగ్గింపు వల్ల దేశం మొత్తంగా చూస్తే.. గరిష్ఠంగా 3 గిగావాట్ల వరకు ఆదా చేయవచ్చునట. ‘దేశంలో దాదాపు 10 కోట్ల ఎయిర్ కండీషనింగ్ ఉపకరణాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం సుమారు 1.5 కోట్ల ఏసీలు కొత్తగా తోడవుతున్నాయి. ఏసీలతో 50 గిగావాట్ల విద్యుత్ ఖర్చు అవుతోంది. మొత్తం దేశీయ డిమాండ్లో ఇది సుమారు 20 శాతం. ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ప్రతిపాదిత చర్యలతో 2035 నాటికి భారత గరిష్ట విద్యుత్ డిమాండ్లో 60 గిగావాట్లను ఆదా చేసే అవకాశం ఉంది’అని ఆయన తెలిపారు. ఇదే జరిగితే నూతన విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్ మౌలిక సదుపాయాల ఖర్చుల విషయంలో భారత్ ఏటా రూ.7.5 లక్షల కోట్లను ఆదా చేస్తుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది. 2వేల కోట్ల యూనిట్ల ఆదా! ఏసీని 24 డిగ్రీల వద్ద వాడటం వల్ల.. వచ్చే కరెంటు బిల్లు మొత్తం తగ్గడమే కాదు, విద్యుత్తును కూడా భారీగా ఆదా చేయవచ్చని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ (బీఈఈ) చెబుతోంది. ఖర్చు ఆదా, పర్యావరణ ప్రయోజనాల కోసం బాధ్యతాయుతంగా ఏసీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి బీఈఈ పలు నగరాల్లో ఇంధన పరిరక్షణపై ప్రచారం చేస్తోంది. ఏసీలను 24ని డిగ్రీల వద్ద సెట్ చేస్తే.. సంవత్సరానికి 2,000 కోట్ల యూనిట్ల వరకు విద్యుత్ ఆదా అవుతుంది. తద్వారా రూ.10,000 కోట్లు పొదుపు చేయవచ్చు. సగం మంది వినియోగదారులు తమ సూచలను పాటించినా 1,000 కోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా చేయవచ్చని, రూ.5,000 కోట్లు పొదుపు చేసినట్టేనని తెలిపింది. అంతేకాదు, కర్బన ఉద్గారాలు సంవత్సరానికి 82 లక్షల టన్నులు తగ్గుతాయని బీఈఈ వెల్లడించింది. కొత్తవి వచ్చేది 2027లోనే? ప్రస్తుతం ఏసీలు 16–30 డిగ్రీల సెట్టింగ్స్తో వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత నిబంధన ఈ ఏడాదే అమలులోకి వస్తే.. కొత్త ఏసీలు కనీసం 20, గరిష్టం 28 డిగ్రీల ఉష్ణోగ్రతతో మాత్రమే పనిచేసేలా కంపెనీ సెట్టింగ్స్తో వస్తా యి. కానీ ఈ కొత్త ఏసీలు ఇప్పుడే వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఏసీ తయారీ కంపెనీలకు 2025 సమ్మర్ సీజన్నిరాశను మిగిల్చింది. చాలా ప్రాంతాల్లో 2024 స్థాయిలో ఎండలు లేకపోవడం, అకాల వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో అమ్మకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. డీలర్లు, తయారీ కంపెనీల వద్ద ఏసీ యూనిట్ల నిల్వలు పేరుకుపోయాయి. వీటి అమ్మకాలు జరిగేది 2026 సీజన్లోనే. వచ్చే ఏడాది భానుడు ప్రతాపం చూపిస్తే కొత్త ఏసీలు రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. » దేశంలోఏసీలతో ఖర్చయ్యే మొత్తం విద్యుత్ 50 గిగావాట్లు » మొత్తం దేశీయ డిమాండ్లో ఇది సుమారు 20% » ఏసీలను 24 డిగ్రీల వద్ద సెట్ చేస్తే.. ఏడాదికి 2 వేలకోట్ల యూనిట్ల విద్యుత్ ఆదా » రూ.10,000 కోట్లు పొదుపు » ఏటా 82 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలుతగ్గుదల -
పిల్లల పెంపకం.. చాలా కాస్ట్లీ
‘ఒకరికి ఏడాదికి రు.13 లక్షలు’ముంబైకి చెందిన అంకుర్ ఝవేరీ అనే ఒక ప్రొఫెషనల్ తాజాగా లింక్డ్ఇన్లో పెట్టిన ఈ పోస్టు.. పట్టణ ప్రాంత మధ్యతరగతి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని ఎత్తి చూపుతూనే, పిల్లల పెంపకానికి, చదువుకు అయ్యే ఖర్చు విపరీతంగా పెరుగుతుండటంపై ఆందోళన రేకెత్తించింది. మెట్రోపాలిటన్ నగరంలో ఒకరికి ఏడాదికి రూ.13 లక్షలు ఖర్చవుతుండగా, అందులో చదువుకు అయ్యే ఖర్చే రు.7 నుంచి 8 లక్షల వరకు ఉంటోందని ఝవేరీ తన పోస్టులో అంచనా వేశారు. ‘గత వారం నేను నా కజిన్ను కలిసే వరకు, భారతదేశంలోనిఇ నగరాల్లో పిల్లలను పెంచడం తలకు మించిన భారమని నాకు తెలియదు’ అని ఝవేరీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.నెలకు రూ.లక్షకు పైగానే ఏదైనా ఒక ఇంటర్నేషన్ స్కూల్లో ట్యూషన్ ఫీజు ఏడాదికి ఒకరికి రూ.7 నుండి 8 లక్షల మధ్య ఉందని, ఇక యూనిఫారాలు, పుస్తకాలు, ప్రైవేట్ ట్యూషన్లు, చదువుకు సంబంధించిన ఇతర ఖర్చులన్నీ కలిపితే – సంవత్సరానికి మరో రూ. 2 నుండి 4 లక్షల వరకు అవుతుందని అంకుర్ ఝవేరీ పేర్కొన్నారు. ఒక విద్యా సంవత్సరానికి మొత్తం ఖర్చు దాదాపుగా రూ.12 లక్షలు అవుతోందని చెప్పారు. ఝవేరీ మరికొన్ని ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ రూ.12 లక్షలకు అదనంగా కోచింగ్ / పాఠ్యేతర కార్యకలాపాలు, దుస్తులు, పుట్టినరోజు పార్టీలు, హాలిడే ఖర్చులు మొదలైనవి కూడా నెలకు రూ.8000–10,000 (ఏడాదికి రూ.1 లక్ష) చొప్పున కలిపితే, మొత్తం వార్షిక వ్యయం రూ.13 లక్షలు అవుతుందని తన పోస్టులో అంచనా కట్టారు.ఆర్థిక భారానికి సిద్ధంఈ లెక్కలన్నీ కూడా తన పైపై అంచనాలు మాత్రమే అని అంగీకరిస్తూ, ‘నేనింకా ఏమైనా మిస్ అయ్యానేమో తల్లిదండ్రులు చెప్పాలి’ అని ఝవేరీ నెటిజనుల అభిప్రాయాన్ని కోరారు. తన పోస్టుపై వ్యతిరేకత వ్యక్తం అవుతుందేమోనని భావించిన ఝవేరీ, ‘‘కొంతమంది ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలలు తక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయి, పిల్లల్ని అక్కడ చేర్చవచ్చు కదా?’ అని అనొచ్చు. ఇక్కడ నేను రెండు విషయాలను తీసుకుని ఈ లెక్కలు వేశాను. అవి, ఒకటి : ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువును అందించాలని కోరుకుంటారు. రెండు : ఐ.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో ప్రవేశం దొరకటం చాలా కష్టం’ అని ఝవేరీ వివరించారు.సామాజిక ఒత్తిడీ కారణం! ఝవేరీ పెట్టిన పోస్టుపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆయనతో ఏకీభవించారు. మరికొంత మంది విభేదించారు. ఖరీదైన పాఠశాలలు కావాలనుకున్నప్పుడే ఇంత ఖర్చు అవుతుంది అని కొందరు వాదించారు. ఒక నెట్ యూజర్ ‘బ్రాండెడ్ స్కూళ్లలో అంతేగా’ అని కామెంట్ చేశారు. మరొకరు.. పిల్లల చదువు విషయమై తల్లిదండ్రుల మీద ఉండే సామాజిక ఒత్తిడి గురించి మాట్లాడారు. తమ పిల్లలు ఎక్కడ వెనుకబడి పోతారోనన్న భయంతో తల్లిదండ్రులు కష్టమో, నష్టమో తలకు మించిన ఆర్థిక భారానికి సిద్ధమౌతారు, ప్రైవేటు స్కూళ్లు చెప్పే ఫీజులు కడతారు అని చెప్పారు. ఒక నెటిజెన్ ఝవేరీ పోస్టుతో పూర్తిగా విభేదించారు. ‘సెలబ్రిటీల పిల్లలు చదివే స్కూళ్లలో మీ పిల్లల్ని ఎవరు చదివించమన్నారు?’ అని విమర్శించారు. ఐ.సి.ఎస్.ఇ., సి.బి.ఎస్.ఇ., ఐ.జి.సి.ఎస్.ఇ. పాఠశాలల్లో సీటు తెచ్చుకోగలిగితే తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను పిల్లలకు అందివ్వవచ్చు అని కొందరు అన్నారు. -
భారత దేశ చరిత్రలో అతిపెద్ద విమానం ప్రమాదం!
భారత్లో ఇవాళ(జూన్ 12, 2020) ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ నిమిషాల వ్యవధిలో కుప్పకూలి పేలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మృతిచెందారు. 230 ప్రయాణికుల్లో ఒకరు మినహా అంతా దుర్మరణం చెందారు. ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది మృత్యువాత పడ్డారు. అయితే ఒక ప్రయాణికుడు మృత్యుంజయుడై వచ్చాడు. ప్రమాదం జరిగిన ఐదారు గంటల తర్వాత ప్రమాదగురైన వ్యక్తి ,నడుచుకుంటూ బయటకొచ్చాడు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ సీపీ ప్రకటించారు. ఇదిలా ఉంచితే. భారత దేశ చరిత్రలో ఇంతకు ముందు విమాన ప్రమాదాలు చాలానే జరిగాయి. అందులో అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా?ఆగష్టు 7, 2020 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344 (కోజికోడ్, కేరళ)వివరాలు: దుబాయ్ నుండి కోజికోడ్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-1344, ఒక బోయింగ్ 737-800, భారీ వర్షంలో ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, రెండు భాగాలుగా చీలి, ఒక లోయలో పడింది. టేబుల్టాప్ రన్వే తో పాటు ప్రతికూల వర్షాకాల పరిస్థితులు.ప్రాణనష్టం: 21 మంది మరణించారు, ఇద్దరు పైలట్లతో సహా, విమానంలోని 190 మందిలో (184 ప్రయాణీకులు ఉన్నారుమే 22, 2010ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 812 (మంగళూరు, కర్ణాటక) వివరాలు: దుబాయ్ నుండి మంగళూరుకు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ IX-812, ఒక బోయింగ్ 737-800, ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి, ఒక లోయలో పడి మంటల్లో చిక్కుకుంది. ప్రాణనష్టం: విమానంలోని 166 మందిలో 158 మంది (160 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, 8 మంది బతికారు.• కారణం: పైలట్ తప్పిదం, ప్రధానంగా కెప్టెన్ హెచ్చరికలు ఉన్నప్పటికీ ల్యాండింగ్ను రద్దు చేయడంలో విఫలమవడం, జులై 17, 2000జూలై 17, 2000: అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 (పాట్నా, బిహార్)• వివరాలు: కోల్కతా నుండి ఢిల్లీకి పాట్నా మీదుగా వెళ్తున్న అలయన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412 పాట్నా విమానాశ్రయం సమీపంలో ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ల్యాండింగ్ ప్రయత్నంలో కుప్పకూలింది. పైలట్ తప్పిదం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానం నియంత్రణ కోల్పోయింది.• ప్రాణనష్టం: విమానంలోని 58 మందిలో 55 మంది (52 ప్రయాణీకులు, 6 సిబ్బంది) మరణించారు, అలాగే భూమిపై 5 మంది మరణించారు.• కారణం: పరిశోధనల్లో పైలట్ తప్పిదం, పేలవమైన దృశ్యమానతలో గో-అరౌండ్ ప్రయత్నంలో తప్పు నిర్వహణను సూచించాయి.నవంబర్ 12, 1996సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, కజకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానాలు గాల్లో ఉండగానే హర్యానా ఛాక్రి దాద్రి వద్ద ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో రెండు విమానాల్లోని 349 మంది దుర్మరణం పాలయ్యారు. భారత దేశంలో ఇప్పటిదాకా జరిగిన అతిపెద్ద విమానం ప్రమాదం ఇదే. ఏప్రిల్ 26, 1993ఔరంగబాద్లో ఎయిరిండియా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదానికి గురైంది. ఘటనలో 55 మంది మరణించగా.. 66 మంది గాయపడ్డారు.ఆగష్టు 16, 1991ఇంఫాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో 69 మంది మృతి చెందారుఫిబ్రవరి 14, 1990ఇండియన్ ఎయిన్స్ విమానం బెంగళూరు ఎయిర్పోర్టులో దిగుతుండగా.. క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 92 మంది మరణించారు. అక్టోబర్ 19, 1988ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో క్రాష్ ల్యాండ్ అయ్యింది. ప్రమాదంలో 133 మంది మరణించారు.జూన్ 21, 1982ఎయిర్ ఇండియా విమానం బాంబేలో ప్రతికూల వాతావరణంతో కుప్పకూలింది. 17 మంది మరణించగా.. 94 మంది ప్రాణాలతో బయటపడ్డారు.జనవరి 1, 1978ఎయిర్ ఇండియా విమానం ముంబై బాంద్రా తీరంలో కూలి 213 మంది మరణించారు. అక్టోబర్ 12, 1976ముంబైలో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోరంలో 95 మంది దుర్మరణం పాలయ్యారు.మే 31, 1973ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 48 మంది మరణించగా.. 17 మందికి గాయాలయ్యాయిజూన్ 14, 1972లో.. జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రమాదానికి గురైంది. 82 మంది మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు జులై 28, 1963లో.. యునైటెడ్ అరబ్ ఎయిర్లైన్స్ విమానం ముంబై ఎయిర్టుపోర్టులో ప్రమాదానికి గురై 63 మంది మరణించారుజులై 7, 1962లో అలియాలియా విమానం ముంబై నార్త్ఈస్ట్లో ప్రమాదానికి గురైంది. 94 మంది మరణించారు.మే 25, 1958లో.. అన్ అవ్రో యార్క్ విమానంలో మంటలు చెలరేగి గురుగావ్లో కుప్పకూలింది. విమానంలోని ఐదుగురు మరణించారు.ఇదీ చదవండి: అహ్మదాబాద్ ఘోర ప్రమాదం.. కుప్పకూలిన విమానం వీడియో -
యూఎస్లో లాటిన్ రగడ
వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్ ఏంజెలెస్లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్ ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్ ఏంజెలెస్లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతటా మెక్సికన్ జెండాలే! లాస్ ఏంజెలెస్ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్ అమెరికన్లే. వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
న్యూయార్క్ మేయర్ రేసులో మీరా నాయర్ కుమారుడు
ప్రఖ్యాత సినీ దర్శకురాలు మీరా నాయర్ కుమారుడు, ఇండియన్–అమెరికన్ రాజకీయ నాయకుడు జోహ్రాన్ క్వామి మమ్దానీ అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ మేయర్ పదవికి పోటీ పడుతున్నాడు. ఒడిశాలో జన్మించిన మీరా నాయర్ ‘మీరాబాయి ఫిలిమ్స్’బ్యానర్ కింద పలు చిత్రాలు నిర్మిండడంతోపాట దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. కామసూత్ర, మాన్సూన్ వెడ్డింగ్, సలామ్ బాంబే వంటి చిత్రాలతో ఆమె సంచలనం సృష్టించారు. డెమొక్రటిక్ పార్టీ సభ్యుడైనా ఆమె కుమారుడు మమ్దానీ ప్రస్తుతం న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయి. ఈ పదవికి మాజీ గవర్నర్ ఆండ్రూ కౌమో పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయనకు మమ్దానీ గట్టి పోటీనిస్తున్నాడు. నిధుల సేకరణ, నూతన ఆలోచనలు, ఆశయాలతోపాటు టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ జనాదరణ పొందే ప్రయత్నం చేస్తున్నాడు. ఆండ్రూ కౌమోను ఓడించడం ఖాయమని ధీమాగా చెబుతున్నాడు. ఒకవేళ మమ్దానీ అనుకున్న లక్ష్యం సాధిస్తే.. న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్గా, తొలి ఇండియన్–అమెరికన్ మేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఎవరీ మమ్దానీ? జోహ్రాన్ మమ్దానీ 1991 అక్టోబర్ 18న ఉగాండాలోని కంపాలాలో జన్మించాడు. ఆయన తండ్రి మహమూద్ మమ్దానీ, తల్లి మీరా నాయర్. మహమూద్ మమ్దానీ ఉగాండాతో ప్రముఖ మార్క్సిస్ట్ పండితుడు. జోహ్రాన్కు ఐదేళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం దక్షిణాఫ్రియాలోని కేప్టౌన్కు చేరుకుంది. రెండేళ్ల తర్వాత అమెరికాలోని న్యూయార్క్లో స్థిరపడింది. జోహ్రాన్ మమ్దానీకి 2018లో అమెరికా పౌరసత్వం లభించింది. బ్రాంక్స్ హైసూ్కల్ ఆఫ్ సైన్స్తోపాటు బౌడిన్ కాలేజీలో విద్యాభ్యాసం చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు రాజకీయాలపై ఆసక్తి చూపించేవాడు. స్థానికంగా రాజకీయ, సేవ కార్యక్రమాల్లో వాలంటరీగా సేవలందించేవాడు. 2017లో డెమొక్రటిక్ సోషలిస్టు ఆఫ్ అమెరికా అనే సంస్థలో చేరాడు. తర్వాత డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా 2020, 2021, 2022, 2024లో న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. క్వీన్స్ 36వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చట్టసభల్లో చురుగ్గా పని చేస్తున్నాడు. 20 బిల్లును ప్రతిపాదించగా, అందులో మూడు బిల్లులు చట్టాలుగా మారాయి. న్యూయార్క్ మేయర్ రేసులో 2024 అక్టోబర్ 23న అడుగుపెట్టాడు. జోహ్రాన్ మమ్దానీలో మంచి కళాకారుడు కూడా ఉన్నాడు. 2019లో ‘నానీ’పేరిట ఒక మ్యూజిక్ వీడియో విడుదల చేశాడు. షియా ముస్లిం మతస్థుడైన మమ్దానీ ఇటీవలే రమా దువాజీని వివాహం చేసుకున్నాడు. ఆమె సిరియాలో జన్మించారు. పలు పత్రికల్లో చిత్రకారిణిగా పనిచేశారు. మమ్దానీ దంపతులు క్వీన్స్లోని అస్టోరియాలో నివాసం ఉంటున్నారు. పాలస్తీనాకు మద్దతు మమ్దానీ ఎన్నికల అజెండా ప్రజలను ఆకట్టుకుంటోంది. నగరంలో అద్దెలపై ఫ్రీజింగ్ విధిస్తానని, రవాణా, శిశు సంరక్షణ సేవలు ఉచితంగా అందిస్తానని, కనీస వేతనాన్ని 30 డాలర్లకు పెంచుతానని మమ్దామీ హామీ ఇస్తున్నారు. ఇక ఇజ్రాయెల్–పాలస్తీనా వివాదంలో మమ్దానీ పాలస్తీనాకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నాడు. గాజాలో వెంటనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్ను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రకాల వివక్షకు ఆయన బద్ధవ్యతిరేకి. అలాగే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను మమ్దానీ నిశితంగా విమర్శిస్తున్నాడు. ఎన్నికల ప్రచారంలో తన దక్షిణాసియా మూలాలను పదేపదే గుర్తుచేస్తున్నాడు. హిందీ భాషలో ఒక వీడియో విడుదల చేశాడు. ఇందులో బాలీవుడ్ సినిమాలు, డైలాగ్ల ప్రస్తావన ఉంది. బిలియనీర్స్ కే పాస్ ఆల్రెడీ సబ్ కుచ్ హై, అబ్ ఆప్కా టైమ్ ఆయేగా(ధనవంతులకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీ వంతు వస్తుంది) అని ఓటర్లకు చెబుతున్నాడు. ఈ నెల 24న మేయర్ ఎన్నిక జరుగనుంది. ర్యాంక్డ్–చాయిస్ వోటింగ్ సిస్టమ్ ద్వారా మేయర్ను ఎన్నుకుంటున్నారు. అంటే ఓటర్లు తమ ప్రాధాన్యత ప్రకారం ఐదుగురు అభ్యర్థులకు ర్యాంకులు ఇస్తారు. ఈ ర్యాంకుల్లో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థికి మేయర్ పదవి లభిస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జననాల తగ్గుదల వరమా.. శాపమా?
ప్రపంచంలో మరే దేశానికి లేనంతటి యువశక్తి భారత్ సొంతం. మొత్తం జనాభాలోనూ చైనాను అధిగమించి ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచాం. అయితే ప్రపంచవ్యాప్త ట్రెండుకు అనుగుణంగా భారత్లో కూడా జననాల రేటు భారీగా తగ్గుముఖం పడుతూ వస్తోంది. జనాభా పెరుగుదల స్థిరంగా కొనసాగాలంటే జననాల (టీఎఫ్ఆర్–టోటల్ ఫెర్టిలిటీ) రేటు కనీసం 2.1 ఉండాలి. అంటే ప్రతి మహిళ కనీసం ఇద్దరిని కనాలన్నమాట. దీన్ని భర్తీ రేటుగా పిలుస్తారు. కానీ భారత్లో టీఎఫ్ఆర్ ఏకంగా 1.9కి పడిపోయిందని ‘సంతాన సంక్షోభం’ పేరిట ఐక్యరాజ్యసమితి జనాభా కార్యకలాపాల నిధి (యూఎన్ఎఫ్పీఏ) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. దాంతో జననాల రేటు తగ్గుదల ప్రభావం మన దేశంపై అంతిమంగా ఎలా ఉండనుందన్న చర్చ జోరందుకుంది.ఇదీ పరిస్థితి!1.9 టీఎఫ్ఆర్ కారణంగా భారత్లో జనాభా పెరుగుదల నానాటికీ తగ్గి 40 ఏళ్లకు ఆగిపోతుందని యూఎన్ఎఫ్పీఏ అంచనా వేసింది. అప్పటికి దేశ జనాభా 170 కోట్లకు చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుందని పేర్కొంది. కానీ భారత్లో టీఎఫ్ఆర్ శరవేగంగా 1.29కు పడిపోతుందని గతేడాది లాన్సెట్ జరిగిన అధ్యయనం శాస్త్రీయంగా అంచనా వేసింది. అదే జరిగితే దేశ జనాభాలో తగ్గుదల 40 ఏళ్లకంటే చాలా ముందే మొదలయ్యే వీలుంది. 1950ల్లో ఒక్కో భారత మహిళ సగటున ఏకంగా ఆరుగురిని కనేది! 1980ల నాటికి అది 4.6కు తగ్గింది. అక్కడినుంచి ఇద్దరు పిల్లలు చాలనే పరిస్థితికి రావడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో శ్రమించాల్సి వచ్చింది. చిన్న కుటుంబాలు పరిపాటిగా మారిపోయాయి. మహిళల ఆర్థిక స్వాతంత్య్రం పెరిగిన కొద్దీ వారు కనే పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతూ వస్తోంది. ఎక్కువమందిని కని కెరీర్ను పణంగా పెట్టేందుకు వారు ఇష్టపడటం లేదు. పిల్లల పెంపకంలో వారికి భర్త మద్దతు లేకపోవడమూ దీనికి కారణమే.ఆందోళన అక్కర్లేదు!జననాల రేటు (టీఎఫ్ఆర్) తగ్గితే జనాభాపరంగా చాలా మార్పులు చోటుచేసుకుంటా యి. ముఖ్యంగా యువ శ్రామిక శక్తి క్రమంగా తగ్గిపోతుంది. వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. ‘‘2050 నాటికి భారత జనాభాలో వృద్ధుల సంఖ్య ఐదో వంతుకు చేరుతుంది. చైనాది ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఒకే సంతానం నిబంధనను దశాబ్దాలుగా కఠినంగా అమలు చేయడమే అందుకు కారణం’’ అని జనాభా నిపుణులు చెబుతున్నారు. ‘‘జనాభా పెరుగుదలను బాగా తగ్గించిన దక్షిణాది రాష్ట్రాలన్నీ దాని పర్యవసానాలను ఇప్పటికే అనుభవిస్తున్నాయి. మొత్తం 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీఎఫ్ఆర్ ఇప్పటికే 2.1 కంటే చాలా తక్కువకు పడిపోయింది. బిహార్ (3), మేఘాలయ (2.9), ఉత్తరప్రదేశ్ (2.7) వంటివి మాత్రమే ఇందుకు మినహాయింపు’’ అని ఇంటర్నేషనల్ ఇన్స్టి ట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ డెమోగ్రఫీ ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి వివరించారు. ‘‘అంతమాత్రాన టీఎఫ్ఆర్ తగ్గుదలను చూసి ఇప్పటికిప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. దీనివల్ల కార్మిక శక్తి భారీగా తగ్గుతుందన్నది అపోహ మాత్రమే. నైపుణ్యాలను పెంపొందించుకోవడం, ప్రాంతాల మధ్య వలసలను మరింతగా ప్రోత్సహించడం ద్వారా సమస్యను సులువుగా అధిగమించవచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. అయితే వృద్ధుల సంఖ్య పెరుగుదల ఒక్కటే మున్ముందు భారత్కు సమస్యగా మారే ఆస్కారముందని ఆయన అంచనా వేశారు. ‘‘వయోపరమైన అంతరం నానాటికీ పెరిగిపోయి చివరికి పెద్దవాళ్ల ఆలనాపాలనా చూసే వారసుల సంఖ్య తగ్గిపోతుంది. ఆ పరిస్థితుల్లో వృద్ధుల సంరక్షణకు అవసరమైన వసతులు, ప్రభుత్వపరమైన సౌకర్యాలు మన దగ్గర బాగా తక్కువే’’ అని గుర్తు చేశారు. 60–75 ఏళ్ల వయసు వారికి ఇప్పటిమాదిరిగా తగిన ఉపాధి అవకాశాలు కూడా మున్ముందు సవాలుగానే మారవచ్చని అహ్మదాబాద్లోని ఎల్జే వర్సిటీ ప్రొఫెసర్ అమితాబ్ కుందు అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆకలి తీర్చే అక్షయపాత్ర
భక్తుల కోరిక తీర్చడమే కాదు.. తన దర్శనానికి వచ్చినప్పుడు ఆకలి కూడా తీరుస్తున్నాడు జగత్కల్యాణ చక్రవర్తి..తిరుమల వేంకటేశ్వరుడు.. ఆ దేవదేవుడే ఆదేశించినట్లుగా ప్రతిరోజు తిరుమలలో అన్నప్రసాదవితరణ మహాయజ్ఞంలా సాగుతోంది....తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు టీటీడీ నిరంతర యజ్ఞంగా అన్నప్రసాద వితరణ ఉచితంగా చేస్తోంది. 1985, ఏప్రిల్ 6న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారకరామారావు చేతులమీదుగా టీటీడీ ప్రారంభించింది. తదుపరి 1994, ఏప్రిల్ 1న శ్రీవేంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా, తర్వాత దీనిని శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా నామకరణం చేశారు. మొదటగా తిరుమలలో కల్యాణకట్ట ఎదురుగా గల పాత అన్నదానం కాంప్లెక్స్లో అన్నదానం జరిగేది. ఇప్పటి వరకు శ్రీ వైంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కు దాతలు దాదాపు రూ. 2,190 కోట్ల విరాళాలను అందించారు. ఎందరో దాతలు ఇచ్చిన నిధులతో నిర్విరామంగా అన్నప్రసాద వితరణ సాగుతోంది. వ్యక్తిగతంగా దాతల పుట్టిన రోజు, దాతల కుటుంబ సభ్యుల పేర్లతో, దాతల ట్రస్ట్ లు, కంపెనీల పేరుతో రూ.44 లక్షలు అందించవచ్చు. శ్రీవారి పుట్టిన రోజు అయిన శ్రవణా నక్షత్రం, శ్రీ పద్మావతీ అమ్మవారి పుట్టిన రోజు అయిన ఉత్తరషాడ నక్షత్రం, పంచమితీర్థం, వైకుంఠ ఏకాదశి, శ్రీవారి, శ్రీపద్మావతీ అమ్మవారి ప్రత్యేక రోజుల్లో కూడా దాతలు విరాళంగా అందించవచ్చు.భక్తుల నుంచి విశేష ఆదరణదాతలు రూ.44 లక్షలు అన్నప్రసాద వితరణకు విరాళం అందిస్తే, ఆ రోజంతా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లోని 20, వైకుంఠం క్యూ కాంప్లెక్స్– 2లోని 31 కంపార్ట్మెంట్లు, నారాయణగిరిలోని 9 కంపార్ట్ మెంట్లు, ఏటీసీ, ఎంబీసీ, టిబీసీ, పీఏసీ– 2, పీఏసీ – 4 కేంద్రాలు, శిలాతోరణం, కృష్ణతేజ వరకు బయటి క్యూలైన్లు, తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, శ్రీగోవిందరాజ స్వామి ఆలయ అన్నప్రసాదరణ వితరణ కేంద్రం, రుయా ఆస్పత్రి, స్విమ్స్, మెటర్నిటి ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనం, ఒంటిమిట్టలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేస్తారు. ప్రతి రోజూ టీటీడీలో అన్నప్రసాదాల తయారీ, పంపిణీకి సుమారు పలువురు ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అన్నప్రసాదాలు విభాగంలో పలువురు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తున్నారు. తద్వారా భక్తులు నుంచి టీటీడీ అన్నప్రసాదం విభాగం విశేష ఆదరణ పొందుతోంది.దాతలు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించే అవకాశంరూ. 44 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులు ప్రత్యేకంగా అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. విరాళం అందించే దాతల పేరును తిరుమల వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని డిస్ ప్లే బోర్డులో ప్రదర్శిస్తారు. అదేవిధంగా ఒకరోజు అన్నప్రసాదాలను వడ్డిస్తారు. ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తారు. తిరుమల, తిరుపతి, ఒంటిమిట్టలోని టీటీడీ అన్నప్రసాదాలు వితరణ కేంద్రాల నుండి రోజుకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి సుమారు 2.5 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరిస్తున్నారు. -
కార్పొరేట్స్కూళ్లలో ఫైనాన్షియర్లు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వం గత ఏడాది ప్రకటించింది. దీనిపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించింది. మరోవైపు రాష్ట్ర విద్యా కమిషన్ కూడా భారీ ఫీజులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది స్కూళ్లు మొదలయ్యేలోగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తల్లిదండ్రులు భావించారు. కానీ దీనిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలూ వెలువడలేదు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రైవేటు పాఠశాలలు ఈ ఏడాది కూడా ఫీజులు భారీగా పెంచాయి.అంతేకాదు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు ఈసారి కొత్త దందా ప్రారంభించాయి. నిర్ధారిత ఫీజులు సకాలంలో వసూలు చేసుకునే క్రమంలో ఫైనాన్షియర్లను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో తల్లిదండ్రుల తరఫున తొలుత యాజమాన్యాల బినామీలైన ఈ ఫైనాన్షియర్లే ఫీజులు చెల్లించేస్తారు. ఆ తర్వాత వీరు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తారు. గడువు లోపు చెల్లించకపోతే వడ్డీ కూడా వసూలు చేసేలా ఈ కొత్త తరహా దందాకు కొన్ని కార్పొరేట్ స్కూళ్లు తెరలేపాయి.పుస్తకాలు, యూనిఫాం, యాప్ల పేరిట బాదుడు రాష్ట్రవ్యాప్తంగా 35 లక్షలకు పైగా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నారు. స్కూల్లో విద్యార్థి చేరేటప్పుడు ఉన్న ఫీజు ఆ మరుసటి సంవత్సరం ఉండటం లేదు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. తల్లిదండ్రుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 25 శాతం మేర ఫీజులు పెరిగాయి. సాధారణ స్కూళ్ళలో కూడా రూ.50 వేల వార్షిక ఫీజు ఉంది. ఇక కార్పొరేట్ స్కూళ్ళు ఏకంగా రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయి. దీంతో పాటు పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాం, ఇతర వస్తువులన్నీ తమ వద్దే కొనాలంటున్నాయి.ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థికి ఒక్క పాఠ్య పుస్తకాల వ్యయమే రూ.12 వేల వరకు ఉండటం గమనార్హం. మరోవైపు పాఠశాల సొంత ‘యాప్’ల పేరిట మరో దోపిడీకి కూడా కొన్ని యాజమాన్యాలు తెరలేపాయి. ఇందుకోసం ప్రతి విద్యార్థి నుంచి క్లాసు ఆధారంగా రూ.2,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు (Fees) నియంత్రిస్తామని, అడ్డగోలు దోపిడీకి కళ్లెం వేస్తామని చెప్పిన ప్రభుత్వం..ఈ దిశగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడంతో కార్పొరేట్ స్కూళ్లు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైనాన్షియర్ల ఏర్పాటులో చట్టబద్ధతను వారు ప్రశ్నిస్తున్నారు. చట్టం లేదు.. నియంత్రణ లేదు ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కూడా ఇదే తరహాలో పటిష్టమైన చట్టాన్ని తేవాలని కొన్నేళ్ళుగా ఆలోచిస్తోంది. దాదాపు 11 వేల ప్రైవేటు స్కూళ్ళను దీని పరిధిలోకి తేవాలని భావించింది. ఇష్టానుసారం కాకుండా, స్కూళ్ళలోని మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు పెంచే నిబంధన విధించే యోచనలో ఉంది.ఈ దిశగా గతంలో ఆచార్య తిరుపతిరావు కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత కూడా ఈ దిశగా కార్యాచరణకు పూనుకుంది. మంత్రులతో కమిటీ వేసింది. విద్యా కమిషన్ నుంచి నివేదిక కోరింది. మంత్రుల కమిటీ ఫీజుల నియంత్రణ దిశగా అధికారులతో సంప్రదింపులు చేపట్టింది. కానీ వీటిపై ఇంతవరకూ ఎలాంటి స్పష్టత రాలేదు. తిరుపతిరావు కమిటీ సిఫారసులు కనుమరుగుతిరుపతిరావు కమిటీ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ జరిపింది. ఈ మేరకు కొన్ని సిఫారసులు చేసింది. ‘ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. పది శాతం దాటితే..యాజమాన్యం ఖర్చు చేసే ప్రతి పైసా బ్యాంక్ లావాదేవీగా మాత్రమే ఉండాలి. వేతనాలు, స్కూల్లో మౌలిక వసతుల కోసం జరిపే కొనుగోళ్లు, ఇతరత్రా ఖర్చులకు సంబంధించిన లావాదేవీలన్నీ బ్యాంకు ద్వారానే జరగాలి. 10 శాతానికి పైగా ఫీజు పెంచే స్కూళ్ళన్నీ విధిగా లెక్కలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలించాలి.ఎక్కడ తప్పు జరిగినా భారీ జరిమానా విధించాలి. అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దు చేయాలి..’అని సూచించింది. ఈ మేరకు 2018లో కమిటీ ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేసింది. ఈ నేపథ్యంలో 10 శాతం లోపు ఫీజులు పెంచిన దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. అయితే ఆ తర్వాత ఈ విధానం కనుమరుగైంది. కమిటీ సిఫారసులు కఠినంగా అమలు చేస్తే చాలా వరకు స్కూళ్లు 10 శాతం లోపే ఫీజులు పెంచేందుకు అవకాశం ఉంటుందని అంచనా.చట్టం తేవాలిప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారం ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఈ సంవత్సరం ఏకంగా 25 శాతం పెంచారు. కరోనా తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద, మధ్యతరగతి వారికి ఈ ఫీజులు గుదిబండలా మారుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజులు నియంత్రించాలి. చిత్తశుద్ధితో చట్టాన్ని తెచ్చి అమలు చేయాలి. – పొలుసు సంజీవరావు, హైదరాబాద్ (విద్యార్థి తండ్రి)ప్రభుత్వ నియంత్రణ ఉండాలిప్రైవేటు స్కూళ్లలో ఫీజులు ఇష్టానుసారం పెంచుతున్నారు. మరోవైపు నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. కొన్ని స్కూళ్లలో టీచర్లకు జీతాలు ఇవ్వడం లేదు. వీటన్నింటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. – నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి)వడ్డీ వసూలు చేస్తున్నారుఫీజులు, సకాలంలో చెల్లించకపోతే వడ్డీలు, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్కుల పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశి్నస్తే..అన్ని పాఠశాలలు ఇలానే చేస్తున్నాయంటున్నారు. మీకు ఇష్టం లేకపోతే టీసీ ఇచ్చేస్తాం తీసుకెళ్లండంటున్నారు. ఇలా వసూలు చేయడం చట్ట విరుద్ధం అని చెబుతున్న అధికారులు..ఈ పాఠశాలల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. – ఆశ (విద్యార్థి తల్లి) -
అమ్ములపొదిలోకి తేజస్ 2.0
పాకిస్తాన్తో ఉద్రిక్తలు తారస్థాయికి చేరిన వేళ మన వైమానిక పాటవం మరింత బలోపేతం కానుంది. తేలికరకం యుద్ధ విమానం తేజస్ తాలూకు అత్యాధునిక ఎంకే1–ఏ వేరియంట్ ఈ నెలాఖరుకల్లా ఎయిర్ఫోర్స్ అమ్ములపొదిలోకి చేరనుంది. దశలవారీగా మొత్తం 83 విమానాలు సమకూరనున్నాయి. ఇజ్రాయెల్కు చెందిన అత్యాధునిక ఏఈఎస్ఏ (యాక్టివ్ ఎల్రక్టానికలీ స్కాన్డ్ అరే) రాడార్లతో వాటిని అత్యంత బలోపేతంగా తీర్చిదిద్దారు. ఇది ప్రపంచంలోనే అత్యంత మెరుగైన రాడార్ వ్యవస్థ.ఫలితంగా పాశ్చాత్య దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలకు తీసిపోని సామర్థ్యం తేజస్ ఎంకే1–ఏ సొంతమైనట్టు జెరూసలేం పోస్ట్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇవి గతేడాదే అందుబాటులోకి రావాల్సి ఉండగా కీలక విడిభాగాల సరఫరా తదితరాల్లో ఆలస్యం వల్ల జాప్యమైంది. కాలం చెల్లుతున్న మిగ్–21, జాగ్వార్ యుద్ధ విమానాలను పూర్తిగా తేజస్లతో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించడం తెలిసిందే. ప్రస్తుతం తొలి తరానికి చెందిన 40 తేజస్ యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. వాయుసేన వద్ద ప్రస్తుతం 31 ఫైటర్ స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కనీసం 42కు పెంచుకోవాలన్నది లక్ష్యం. ఒక్కో స్క్వాడ్రన్లో 16 నుంచి 20 దాకా యుద్ధ విమానాలుంటాయి. ఇవీ ప్రత్యేకతలు ⇒ తేజస్ ఎంకే1–ఏలో అమర్చిన అత్యాధునిక ఏఈఎస్ఏ రాడార్ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్కు చెందిన ఎల్టా సిస్టమ్స్ సంస్థ అభివృద్ధి చేసింది. ⇒ తేజస్లో అమర్చిన అధునాతన ఎల్రక్టానికల్ యుద్ధతంత్ర వ్యవస్థను కూడా ఎల్టాయే సరఫరా చేసింది. ⇒ ఇజ్రాయెల్కే చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ రూపొందించిన అత్యాధునిక హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే ఘర్షణల వేళ పైలట్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ⇒ ఏఈఎస్ఏ వ్యవస్థ తదితరాలన్నింటినీ మేకిన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇజ్రాయెల్ భాగస్వామ్యంతో భారత్లోనే తయారు చేశారు. ⇒ తేజస్ ఎంకే1–ఏకు ఇజ్రాయెల్ సమకూర్చిన పలు సాంకేతిక హంగులు ఆ దేశానికే చెందిన పలు యుద్ధవిమానాల్లో కూడా లేకపోవడం విశేషం. ⇒ రఫేల్ యుద్ధ విమానాల్లోని రాడార్ గైడెడ్ డెర్బీ క్షిపణులను తేజస్ఎంకే1–ఏకు అమర్చనున్నారు. ఫలితంగా దాని యుద్ధపాటవం ఎన్నో రెట్లు పెరగనుంది. ⇒ తేజస్ తాలూకు భావి వెర్షన్లు మరింత అధునాతనమైన కానార్డ్ వింగ్స్, ఎల్రక్టానిక్ తదితర వ్యవస్థలు, మరింత మెరుగైన రేంజ్ వంటివాటిని సంతరించుకోనున్నట్టు జెరూసలేం పోస్ట్ తెలిపింది. ⇒ తేజస్ మూడో వెర్షన్లను మరింత ఆధునీకరించేందుకు ప్రభుత్వ రంగ హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిత్యం శ్రమిస్తోంది. ⇒ ఈ నేపథ్యంలో వాటికి అవసరమైన అధునాతన సాంకేతిక వ్యవస్థల సరఫరా కాంట్రాక్టుల కోసం ఇజ్రాయెల్తో పాటు ఫ్రాన్స్, అమెరికా ఆయుధ కంపెనీలు పోటీపడుతున్నాయి. -
పిల్లలా... వద్దులే!
ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ఇకపై వద్దంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేశాయి. జనాభా అడ్డూఅదుపూ లేకుండా పెరిగిన రోజులవి. జనాభా వృద్ధి నానాటికీ నేలచూపులు చూస్తుండటం నేటికాలపు చేదు నిజం. భారత్ అనే కాదు, జనాభా వృద్ధిలో ప్రపంచమంతటా కనీవినీ ఎరగని రీతిలో భారీ తగ్గుదల నమోదవుతోంది! దాంతో వీలైనంత మందిని కనండని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. కానీ ఫలితం మాత్రం పెద్దగా కన్పించడం లేదు. నానాటికీ చుక్కలనంటున్న జీవనవ్యయమే దీనికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యూఎన్ఎఫ్పీఏ) సర్వే తేల్చింది.పునరు త్పాదనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దంపతుల మనోగతం తెలుసుకునేందుకు ఈ ఐరాస సంస్థ ప్రయత్నం చేసింది. ఇందుకోసం 14 దేశాల్లో 14 వేల జంటలపై అధ్యయనం జరిపింది. ‘‘అత్యధికులకు ఎక్కువమందిని కనాలని ఉన్నా ఆకాశాన్నంటున్న ఖర్చులకు భయపడుతున్నారు. పోషణ భారమవుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు’’ అని తేల్చింది. తమ శాంపిల్ సంఖ్య చూసేందుకు చిన్నదిగా కనిపిస్తున్నా సర్వే ఫలితాలు మాత్రం కోట్లాది మంది మనోగతానికి అద్దం పడుతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికల్లా మరో 50 దేశాల్లో సర్వే జరపాలని యూఎన్ఎఫ్పీఏ నిర్ణయించింది.ఇలా చేశారు⇒ సర్వేలో సమాజంలోని అన్ని వర్గాల అభి ప్రాయాలూ సముచితంగా ప్రతిఫలించేలా యూఎన్ఎఫ్పీఏ జాగ్రత్తలు తీసుకుంది.⇒ భారత్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇటలీ, హంగరీ, జర్మనీ, స్వీడన్, దక్షిణకొరియా, మొరాకో, నైజీరియా, దక్షిణాఫ్రికా, థాయ్లాండ్, ఇండోనేసియా దేశాలను ఎంచుకుంది. తద్వారా అన్ని ఖండాలకూ సరైన ప్రాతినిధ్యం ఉండేలా చూసింది. ప్రపంచ జనాభాలో మూడో వంతు ఈ దేశాల్లోనే ఉండటం విశేషం!⇒ పేద, వర్ధమాన, సంపన్న దేశాలను ఎంచుకుంది. జననాల రేటు అత్యల్పంగా, అత్యధికంగా ఉన్న దేశాలు తగినంతగా కవరయ్యేలా జాగ్రత్త పడింది.⇒ అల్పాదాయ, మధ్యతరగతి, సంపన్న జంటలు; యువ, మధ్యవయసు, 50 ఏళ్ల పైచిలుకు వారిని తగిన నిష్పత్తిలో ఎంపిక చేసుకున్నారు.ఇదీ తేలింది⇒ సర్వేలో పాల్గొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు అంగీకరించారు.⇒ సంతాన లేమికి వంధ్యత్వాన్ని కారణంగా పేర్కొన్నది 12 శాతం మంది మాత్రమే!⇒ ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పిల్లల్ని కనలేదని, లేదా రెండో సంతానానికి వెళ్లలే దని 39% మంది వాపోయారు. ఇలాంటివా రి సంఖ్య దక్షిణ కొరియాలో అత్యధికంగా (58 %), స్వీడన్లో అత్యల్పంగా (19%) ఉంది.⇒ ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు 50 ఏళ్ల పై చిలుకు వారిలో సగం మందికి పైగా అంగీకరించారు.⇒ థాయ్లాండ్లో 19 శాతం మంది వంధ్యత్వాన్ని ప్రధాన కారణంగా చూపారు. తర్వాతి స్థానాల్లో అమెరికా (16 శాతం), దక్షిణాఫ్రికా (15 శాతం), నైజీరియా (14 శాతం), భారత్ (13 శాతం) ఉన్నాయి.⇒ ఆఫీసుకు వెళ్లి రావడానికే రోజుకు సగటున మూడు గంటలు పోతోందంటూ చాలా జంటలు ఆవేదన వెలిబుచ్చాయి. దాంతో పిల్లల బాగోగులు చూసుకునేంత సమయం లేదని వాపోయాయి.40 ఏళ్ల కింద చాలా దేశాలు అధిక జనాభాతో సతమతమయ్యాయి. కానీ 2015 నుంచి జనాభా తగ్గుదలే పెను సమస్యగా మారుతూ వస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సంక్షోభమిది. దీనికి తోడు చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతుండటంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి జారుతోంది – డాక్టర్ నటాలియా కనెం, యూఎన్ఎఫ్పీఏ సారథిభారత్లో కూడా..!భారత్లో జనాభా 146.4 కోట్లకు చేరినట్టు యూఎన్ఎఫ్పీఏ నివేదిక వెల్లడించింది. అయితే అన్ని దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ జనాభా వృద్ధి నానాటికీ తగ్గిపోతోందని పేర్కొంది. జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలంటే సంతానోత్పత్తి రేటు సగటున ఒక్కో మహిళకు కనీసం 2.1 ఉండాలి. కానీ భారత్లో అది 1.9కి తగ్గినట్టు నివేదిక తెలిపింది.నివేదిక విశేషాలు...⇒ ప్రపంచ దేశాలన్నింట్లోనూ అత్యధిక యువతతో భారత్ కళకళలాడుతోంది. జనాభాలో 24 శాతం 0–14 ఏళ్ల వయసు వారున్నారు. 10–19 ఏళ్లు 17 శాతం కాగా 24 శాతం మంది 10–24 ఏళ్ల వయసువారు. ⇒ జనాభాలో ఏకంగా 68 శాతం పనిచేసే వయసులో (15–64) ఉన్నారు. ⇒ 65 ఏళ్లు, ఆపైబడ్డ వృద్ధులు 7 శాతం. ⇒ మహిళల్లో సగటు ఆయుప్రమాణం 74 ఏళ్లు కాగా పురుషుల్లో 71 ఏళ్లు. ⇒ భారత్లో జనాభా మరో 40 ఏళ్ల పాటు పెరిగి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడినుంచి తగ్గుముఖం పడుతుంది. -
నా దారి నేను చూసుకుంటా..!
తరాలుగా సంక్రమించిన కుటుంబ వ్యాపారాన్ని సహజంగా వారసులు కొనసాగిస్తుంటారు. వారసులు నడుపుతున్న వాటిలో మనకు తెలిసిన దుకాణాలే చాలా ఉంటాయి. అంతెందుకు మన పొరుగునే ఉంటారు. కుటుంబ వ్యాపార విధానం ఒక్క భారత్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. వారసత్వాన్ని కొనసాగించడం ఒక బాధ్యతగా భావించిన రోజులు గతం. యువ‘తరం’ మారింది. ఆలోచనల్లో అంతరం కనిపిస్తోంది. పాత తరం వ్యాపారం భారంగా భావించడమో.. తమ కొత్త ఆలోచనలకు పదును పెట్టాలనుకోవడమో.. కారణం ఏదైనా భారత్లో కేవలం 7% మంది వారసులు మాత్రమే తమ కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారట. – సాక్షి, స్పెషల్ డెస్క్హెచ్ఎస్బీసీ గ్లోబల్ ఇటీవల నిర్వహించిన సర్వే ఆసక్తి రేకెత్తిస్తోంది. మనదేశంలో వారసత్వం చుట్టూ ఉన్న సంప్రదాయ అంచనాలను.. ఈ నివేదికలోని అంశాలు తలకిందులు చేస్తున్నాయి. 79% వ్యాపార యజమానులు ఇప్పటికీ తమ వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని ఆసక్తి చూపుతున్నప్పటికీ.. కుటుంబ వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించేందుకు అతి తక్కువగా 7% మంది వారసులు మాత్రమే సిద్ధంగా ఉన్నామని చెప్పారట. 88% మంది భారతీయ వ్యవస్థాపకులు తమ కుటుంబ సంపదను నిర్వహించడంలో తదుపరి తరం సామర్థ్యంపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కొసమెరుపు ఏమంటే తమ పిల్లలు కుటుంబ వ్యాపారాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం లేదని 45% మంది నిర్మొహమాటంగా తేల్చి చెప్పారు. సర్వేలో 1,798 మంది..హెచ్ఎస్బీసీ గ్లోబల్ ప్రైవేట్ బ్యాంకింగ్ ‘ఆసియాలో కుటుంబ వ్యాపారాలు: సామరస్యంగా వారసత్వ బదిలీ 2025’ పేరుతో నివేదిక రూపొందించింది. కనీసం రూ.17 కోట్లు పెట్టుబడి పెట్టగలిగే అధిక నికర విలువ (హెచ్ఎన్ఐ) కలిగిన 1,798 మంది వ్యాపారవేత్తలు ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. ఈ పరిశోధనను చైనా, ఫ్రాన్స్, హాంకాంగ్, భారత్, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్, యూఏఈ, యూకే, యూఎస్లో ఆన్ లైన్ లో నిర్వహించారు. వందేళ్లకుపైగా విజయవంతంగా..దేశంలో కుటుంబ యాజమాన్యంలోని వ్యాపారాలు సంపద బదిలీ, వారసత్వ ప్రణాళికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. పటిష్టమైన ఆర్థిక సలహాలు, నష్ట నివారణ చర్యలు, సంపద నిర్వహణకు తదుపరి తరానికి పాతతరం.. వారి అనుభవాన్ని రంగరించి సలహాలూ సూచనలూ ఇస్తోంది. తమ కుటుంబ వ్యాపారం భవిష్యత్తులో మరింత విస్తరించాలనే దూరదృష్టితో.. కుటుంబ పెద్దలు అత్యంత పారదర్శకంగా బదిలీ ప్రక్రియను చేపట్టడంతోపాటు యువతరానికి మార్గదర్శకత్వమూ వహిస్తున్నారు. కొన్ని కుటుంబ వ్యాపారాలు 100 ఏళ్లకుపైగా విజయవంతంగా కొనసాగుతున్నాయంటే ఇలాంటి చర్యలే కారణం. మన దగ్గరే అత్యధికం..ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల వ్యవస్థాపకులకు వేర్వేరు వారసత్వ ప్రణాళికలు ఉన్నాయి. కొందరు తమ వ్యాపారాలను విక్రయించడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది మాత్రం తాము నిర్వహిస్తున్న వ్యాపారాన్ని కుటుంబ సభ్యునికి బదిలీ చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య అత్యధికంగా భారత్లో 79% ఉంటే.. యూకేలో 77%, స్విట్జర్లాండ్ 76%, తైవాన్ 61, చైనా 56, హాంగ్కాంగ్లో 44% ఉంది. ఇక మహా నగరాల్లో పెరిగి, విదేశాల్లో చదువుకున్న రెండో, మూడో తరం వ్యవస్థాపకులు వారి వారసత్వ వ్యాపారాలను నూతనంగా మలుచుకుంటున్నారు. మా మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించారని, కాబట్టే వ్యాపారాన్ని మరింత బాధ్యతగా తీసుకున్నామని దాదాపు 95% మంది చెప్పారు. ఇలా చెప్పిన వాళ్లు మనదేశంలోనే ఎక్కువ. ఈ విషయంలో ప్రపంచ సగటు 81%. కుటుంబ వ్యాపారాన్ని చేపట్టినప్పటికీ.. కొత్త ఆలోచనలతో ఇతర వ్యాపారాల్లోకి కూడా అడుగుపెట్టగలం అనే ధీమాను 83% మంది తదుపరితరం భారతీయులు వ్యక్తం చేశారు.జీడీపీలో 79% వాటా.. భారత జీడీపీలో కుటుంబ వ్యాపారాల వాటా దాదాపు 79% ఉంది. 1990ల నాటి ఆర్థిక సరళీకరణ తర్వాత చాలా వరకు ఈ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇప్పుడీ సంస్థల్లో తరాల మార్పు జరుగుతోంది. 2023–2030 మధ్య ఆసియా పసిఫిక్ ప్రాంతంలో రూ.4,95,90,000 కోట్ల సంపద ఒక తరం నుంచి తదుపరి తరానికి బదిలీ జరుగుతుందని మెకిన్సే అంచనా వేసింది. వీరిలో అల్ట్రా–హై నెట్వర్త్ వ్యక్తులు 60% మంది ఉన్నారు. -
తీవ్రమైతే.. వర్కవుట్ కావు
తీవ్రమైన వర్కవుట్లు, వ్యాయామాలు కుర్ర గుండెలకు కూడా మంచివి కావట. ప్రత్యేకించి బాడీబిల్డింగ్పై మోజున్న వారు, సిక్స్ ప్యాక్ల వంటివాటిపై శ్రద్ధ పెట్టేవారు.. తమ చిన్ని గుండెల గురించి మరిచిపోతున్నారు. ఫలితంగా తీవ్రమైన వ్యాయామాల ఒత్తిడి.. గుండె లయ తప్పేలా చేస్తోంది. ఇది ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ చెబుతున్న మాట. ఫిట్నెస్, బాడీబిల్డింగ్ కోసం కఠోర శ్రమ చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఈ అధ్యయనం హెచ్చరించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్అమెరికాకు చెందిన ప్రముఖ మహిళా బాడీ బిల్డర్ జోడీ వాన్స్.. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఈ ఏడాది మార్చిలో గుండెపోటుతో కన్నుమూసింది. బాడీబిల్డింగ్లో భాగంగా శరీరాన్ని తీవ్రమైన డీహైడ్రేషన్కు గురిచేయడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తేల్చారు. కార్డియాక్ అరెస్ట్తో కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ హఠాన్మరణం!మిస్టర్ తమిళనాడు టైటిల్ విన్నర్, ప్రముఖ బాడీ బిల్డర్ యోగేష్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు.ఈ జాబితా చాలా పెద్దదే. అందరి మరణాలకూ సాధారణ కారణం.. గుండెపోటు.వీళ్లందరి హృదయాలకూ ఉమ్మడి శత్రువు.. అతి వ్యాయామం, తీవ్రమైన వర్కవుట్లు.బాడీ బిల్డింగ్ మోజుబాడీ బిల్డింగ్ అంటే కుర్రాళ్లకు భలే మోజు. కండలు పెంచడం.. సిక్స్ ప్యాక్.. చాలామందికి ఒక ప్యాషన్. వర్కవుట్లు, జిమ్, వ్యాయామం.. జెన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవాళ్లు) తరంలో చాలామందికి, జెన్ వై (1981–1996 మధ్య పుట్టినవాళ్లు) తరంలో కొందరికి దినచర్యలో భాగం. సాధారణ వ్యాయామం చేసేవాళ్లకు ఫర్వాలేదుగానీ.. తీవ్రమైన వర్కవుట్లు చేసేవాళ్లకు, బాడీబిల్డర్లకు మాత్రం.. అది వారి శారీరక సౌందర్యాన్ని పెంచాల్సింది పోయి.. ప్రాణాలు తీస్తోంది.మరికొందరు బరువు తగ్గే క్రమంలో డీహైడ్రేషన్కు గురవడం, కఠినమైన ఆహార నిబంధనలు పాటిస్తూ హృదయ సంబంధ సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. గుండెపోటు వల్ల హఠాన్మరణం అన్నది యువకులలో, ఆరోగ్యంగా ఉండేవారిలో అరుదే అయినప్పటికీ బాడీబిల్డింగ్ ప్రొఫెషన్లో ఉండేవారికి ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లు ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ ప్రచురించిన అధ్యయన పత్రం పేర్కొంది. బాడీ బిల్డర్లకూ ముప్పేస్టేజీ ఎక్కి కండరాల ప్రదర్శన చేయటమే బాడీబిల్డర్ల పని అనుకుంటాం కానీ... అంత తీరుగా, అంత దృఢంగా, అందరిలోనూ ఒకే ఒక్కడిలా, అంతిమ విజేతగా నిలిచేందుకు వారు పడే శ్రమ, చేసే సాధన ఎంత కఠినమైనవో.. వారి గుండెకు మాత్రమే తెలుస్తుంది. మరి అంత ఒత్తిడిని ఆ గుండె తట్టుకోగలుగుతోందా అని గమనించకపోతే ఏమవుతుంది? సంకేతం ఇవ్వకుండానే సెలవు తీసుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా పురుష బాడీబిల్డర్లలో ఆకస్మిక మరణాలకు గుండె పోట్లే ప్రధాన కారణం అవుతున్నాయని ‘యూరోపియన్ హార్ట్ జర్నల్’ వెల్లడించింది. ఈ అధ్యయనానికి ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మార్కో వెచియాటో నేతృత్వం వహించారు.సుదీర్ఘ అధ్యయనంఅధ్యయనం కోసం డాక్టర్ వెచియాటో, ఆయన బృందం అధికారిక బాడీబిల్డింగ్ పోటీల రికార్డులు, అనధికారిక ఆన్ లైన్ డేటాబేస్ నుండి 20,286 మంది పురుష బాడీబిల్డర్ల పేర్లను సేకరించారు. వారంతా 2005 – 2020 మధ్య కనీసం ఒక అంతర్జాతీయ ఫిట్నెస్ ఈవెంట్లో పాల్గొన్నవారే. ఆ తర్వాత మీడియా నివేదికలు, సోషల్ మీడియా, బాడీబిల్డింగ్ ఫోరమ్లు, బ్లాగుల వంటి వివిధ వెబ్ సైట్లలో ఐదు వేర్వేరు భాషలలో తమ జాబితాలో ఉన్న పోటీదారులలో మరణించిన వారెవరైనా ఉన్నారా అని శోధించారు. తమ దృష్టికి వచ్చిన వారి మరణాలను వివిధ వనరులను ఉపయోగించి జాగ్రత్తగా పోల్చి చూసుకున్నారు. ఆ డేటాను ఇద్దరు క్లినికల్ వైద్యులకు సమర్పించి ఆ మరణాలకు కారణాలను నిర్ధారించుకున్నారు. ప్రొఫెషనల్ బాడీబిల్డర్లలో ఎక్కువ..: డాక్టర్ వెచియాటో బృందం పురుష బాడీబిల్డర్లలో సంభవించిన 121 మరణాలను కనుగొన్నారు. వారి సగటు మరణ వయస్సు 45 సంవత్సరాలు. వారిలో 38 శాతం మంది గుండె సంబంధ కారణాలతో మరణించినవారే. ముఖ్యంగా ఆకస్మిక గుండెపోట్ల ప్రమాదం ప్రొఫెషనల్ బాడీబిల్డర్లలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నాన్–ప్రొఫెషనల్స్తో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. బాడీబిల్డింగ్లో ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు అనేకం ఉంటాయి. కఠినమైన కండర శిక్షణ, తీవ్రమైన ఆహార నియమాలు, డీహైడ్రేషన్, వేగంగా బరువును తగ్గించే వ్యాయామాలు, కండర సామర్థ్యాన్ని పెంచే మందులను అతిగా వాడకం.. వాటిలో ప్రధానమైనవి.బాడీబిల్డర్లూ.. పారాహుషార్..: బాడీబిల్డింగ్ ప్రక్రియలో శరీరం తీవ్రమైన మార్పులకు లోనవుతుంది. ఆ ప్రభావం గుండెపై పడుతుంది. అందువల్ల సుశిక్షుతులైన వారి మార్గదర్శకత్వంలో.. సురక్షితమైన శిక్షణా విధానాలు పాటించాలి. మెరుగైన వైద్య పర్యవేక్షణలో ఉండాలి. కండర సామర్థ్యాన్ని పెంచే ఔషధాలకు అలవాటు పడకూడదు.బాడీబిల్డర్ల విషయంలో పైకి ఆరోగ్యంగా కనిపించేదంతా నిజమైన ఆరోగ్యం కాకపోవచ్చని, తీరైన ఆ శరీరాకృతి వెనుక కూడా ప్రమాదం దాగి ఉండొచ్చని ఈ పరిశోధన సూచిస్తోంది. ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్లో ఎక్కువ మంది పురుషులే కాబట్టి పరిశోధకులు వారిపైనే దృష్టి సారించారు. మహిళా బాడీబిల్డర్లపైనా ఇలాంటి అధ్యయనం చేయబోతున్నారు.బాడీబిల్డింగ్ మంచిదే కానీ...!క్రీడలు, వ్యాయామ వైద్యుడిగా నేను బాడీబిల్డర్లను చాలా దగ్గరగా చూశాను. బాడీబిల్డింగ్ అనేది ఫిట్నెస్ను, స్వీయ–క్రమశిక్షణను ప్రోత్సహించడం వంటి అనేక సానుకూల అంశాలను కలిగి ఉండటం మాత్రమే కాకుండా, అంతర్లీనంగా కొన్ని ఆరోగ్య సవాళ్లను, ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టడాన్ని నేను గుర్తించాను. బాడీబిల్డింగ్, ఫిట్నెస్ సాధనలో ఉన్నవారిలో అకాల మరణాలు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఆరోగ్యంగా ఉన్న అథ్లెట్లలో కూడా ఇలా జరిగిన సంఘటనలు ఉన్నాయి. – డాక్టర్ మార్కో వెచియాటో -
ఇడ్లీ పిండి కూడా షాపు నుంచే!
ఇడ్లీలు, దోసెల వంటి అల్పాహారం కోసం కావాల్సిన పిండిని ఇంట్లోనే రుబ్బి తయారు చేసుకుంటాం. ఇప్పుడు అలా కాకుండా దుకాణం నుంచి కొని తెచ్చుకునేవారి సంఖ్య పెరిగింది. రెడీమేడ్ పిండి కొనుక్కోవడం ఎప్పటి నుంచో ఉంది. ఇదేం కొత్త విషయం కాదంటారా? నిజమే.. రుబ్బిన పిండి వంటి రెడీ టు కుక్ మిశ్రమాలను గడిచిన రెండేళ్లలో కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలు కొనుగోలు చేయడమే ఇక్కడ సరికొత్త విషయం. అంతర్జాతీయ పరిశోధన సంస్థ కాంటార్ ‘ఎఫ్ఎంసీజీ పల్స్’ నివేదికలో ఇలాంటి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.ఇంటికి కావాల్సిన సరుకుల కోసం భారతీయులు ఒక ఏడాదిలో దుకాణాలకు 156 సార్లు వెళ్లారట. అంటే 56 గంటలకు ఒకసారి లేదా ప్రతి రెండు రోజులకోసారి సరుకులు కొనుగోలు చేశారని కాంటార్ తన ‘ఎఫ్ఎంసీజీ పల్స్’ నివేదికలో వెల్లడించింది. 2023–24లో సైతం భారతీయులు ఇదే స్థాయిలో షాపింగ్ చేశారని తెలిపింది. అంతేకాదు, వినియోగదారులు ఖర్చు చేసిన మొత్తం, కొనుగోలు చేసిన ఉత్పత్తుల సంఖ్య పెరిగిందని వివరించింది. 2025 జనవరి–మార్చి కాలంలో ఫాస్ట్ మూవింగ్ కంజ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాల్లో 3.5% వృద్ధి నమోదైంది.అన్ బ్రాండెడ్ హవా..స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 22 కంపెనీల పరిమాణ వృద్ధి రేటు కేవలం 3.6% మాత్రమే. కానీ, ప్రముఖ కంపెనీలవి కాని అన్ బ్రాండెడ్ ఉత్పత్తులు ఏడాదిలో 6.1% వృద్ధి సాధించాయి. 2023–24తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుడు కొనుగోలు చేసిన సగటు ప్యాక్ పరిమాణం 16% పెరిగింది. అంటే పావుకిలో బదులు అరకిలో.. అరకిలో బదులు కిలో ఇంటికి తెచ్చుకున్నారన్న మాట. అలాగే ప్యాక్ల సంఖ్య 13% పెరిగింది. 2023–24లో వినియోగదార్లు సగటున 200 ప్యాక్లు కొనుగోలు చేస్తే.. 2024–25కు వచ్చే సరికి ఇది 226కి చేరింది.⇒ సరుకుల కోసం ఒక ఏడాదిలో 156 సార్లు వెళ్లారు. అంటే 56 గంటలకోసారి అన్నమాట.⇒ ప్యాక్ సైజు 16 శాతం, ప్యాక్ల సంఖ్య 13 శాతం పెరిగింది.⇒ జాతీయ సగటుతో పోలిస్తే దక్షిణ ఢిల్లీ వాసుల ఎఫ్ఎంసీజీ వినియోగం రెండింతలు అధికం.⇒ పశ్చిమ ఢిల్లీవాసులు గరిష్టంగా ఏటా రూ.39,325 ఖర్చు చేశారు.⇒ వ్యయాల పరంగా నైరుతి బెంగళూరు ప్రీమియం ఎఫ్ఎంసీజీ మార్కెట్గా నిలిచింది.వాషింగ్ లిక్విడ్స్..దుస్తులు ఉతికేందుకు వాడే సబ్బుల అమ్మకాలు క్రమంగా తగ్గుతున్నాయి. సబ్బులకు బదులు కస్టమర్లు లిక్విడ్స్ను ఎంచుకుంటున్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలో వాషింగ్ లిక్విడ్స్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగంగా అవతరించాయి. రెండు ఆర్థిక సంవత్సరాల్లో వీటి పరిమాణం 2.7 రెట్లు దూసుకెళ్లింది. వాషింగ్ లిక్విడ్స్ కొనుగోలు చేస్తున్న గృహాల సంఖ్య 2022–23 నుంచి కొత్తగా 2.4 కోట్లు పెరిగింది. 20 శాతం కుటుంబాలే దేశంలో వీటిని వినియోగిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. గత 5 ఏళ్లలో దేశంలో వాషింగ్ మెషీన్ల అమ్మకాలు పెరగడమే.అంతా రెడీమేడ్..రెడీ–టు–కుక్ మిశ్రమాల అమ్మకాలు రెండింతలై కొత్తగా 1.8 కోట్ల కుటుంబాలకు ఇవి చేరాయి. ప్రధానంగా దోసె, ఇడ్లీల తయారీకి వాడే రుబ్బిన పిండ్లు ఎక్కువగా కొంటున్నారు. రెడీ–టు–కుక్ కూరలను నూతనంగా 6 లక్షల గృహాలు ఆస్వాదించాయి. మ్యూస్లీ, పొరిజ్, ఓట్స్తో తయారైన అల్పాహార ఉత్పత్తులు రెండు సంవత్సరాలలో 1.5 రెట్లు వృద్ధి చెందాయి. కార్బోనేటేడ్ శీతల పానీయాలు, పండ్ల రసాలు, పాల ఆధారిత పానీయాలు, చాక్లెట్స్, బిస్కెట్స్, సాల్టీ స్నాక్స్, ఐస్ క్రీమ్స్ వంటి ఉత్పత్తుల విక్రయాలు 2.4% పెరిగాయి. బిస్కెట్స్ వినియోగం ఇంటి వెలుపల తగ్గితే, ఇళ్లలో పెరిగింది.చిన్న ప్యాక్లవైపు..దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో 10–40 లక్షల మధ్య జనాభా ఉన్న మినీ మెట్రో పట్టణాల్లో.. వినియోగ వస్తువులు, ఇతర విభాగాల ధరల పెరుగుదల, వేతన వృద్ధి స్తబ్ధుగా కొనసాగుతుండడం కొనుగోళ్లను తగ్గిస్తోంది. దుకాణాలకు వెళ్తున్న సంఖ్యలో మార్పు లేనప్పటికీ చిన్న, మరింత చవకైన ప్యాక్ పరిమాణాల వైపు కస్టమర్లు మళ్లుతున్నారు. అంటే ధరను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటున్నారన్నమాట. ఇక 2024–25లో సూపర్ మార్కెట్స్లో అమ్మకాల పరిమాణం 43% ఎగిసింది. కిరాణా దుకాణాల వ్యాపారం మాత్రం స్థిరంగా ఉంది. పట్టణ మార్కెట్లు మెరుగ్గా..పట్టణ మార్కెట్లు 2025 జనవరి–మార్చి త్రైమాసికంలో 4.4% వృద్ధిని సాధించగా, గ్రామీణ మార్కెట్లు 2.7% పెరిగాయి. పట్టణ మార్కెట్.. గ్రామీణ ప్రాంతాల కంటే వేగంగా వృద్ధి చెందడం ఇది వరుసగా మూడో త్రైమాసికం. చాలా లిస్టెడ్ కంపెనీల అమ్మకాల్లో పట్టణ మార్కెట్ల నుంచి 50–70% సమకూరుతోంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, వేతనాల్లో పెరుగుదల తక్కువగా ఉండటం, ఇంటి అద్దెలు పెరగడం గత సంవత్సరంలో పట్టణాల్లో రోజువారీ కిరాణా, ప్రధాన వస్తువుల డిమాండ్పై ప్రభావం చూపాయి.హిందూస్తాన్ యూనిలీవర్, గోద్రెజ్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్, టాటా కంజ్యూమర్ ప్రొడక్ట్స్, మారికో వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీలు మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. వాటి అమ్మకాల్లో పెరుగుదల గరిష్ఠంగా 7 శాతాన్ని మించలేదు. ఖరీదైన వస్తువులు, పెద్ద ప్యాక్ల వైపు కస్టమర్లు ఆకర్షితులవుతున్నందున రాబోయే రోజుల్లో పట్టణ ఎఫ్ఎంసీజీ రంగంలో బలమైన వృద్ధి కనిపించే అవకాశం ఉందని కాంటార్ నివేదిక పేర్కొంది. -
పటిష్ఠ క్వారంటైన్తోనే చెక్!
చైనా తమపై ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిందని ఇటీవల అమెరికా ప్రకటించింది. ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని చైనా నుంచి అక్రమంగా అమెరికాలోకి తీసుకువచ్చిన నేరానికి చైనా పౌరురాలు, మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకురాలు యుంకింగ్ జియాన్(33), ఆమె చైనా ప్రియుడు జున్యాంగ్ లియు(33)లను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఖచ్చితంగా చైనా పనిగట్టుకొని చేయిస్తున్న ‘ఆగ్రో టెర్రరిస్టు’ చర్యేనని అమెరికా ఆరోపించింది. శత్రు దేశంలో జీవ భద్రతను, వ్యవసాయ– ఆహార భద్రతను విచ్ఛిన్నం చేసే ఉగ్రవాద చర్యలను ‘ఆగ్రో టెర్రరిజం’ అని వ్యవహరిస్తారు. ఈ వార్తతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో.. అసలు ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రం పంటలకు ఎంతవరకు ప్రమాదకరం? ఒక దేశం నుంచి మరో దేశానికి ఏదైనా శిలీంధ్రాలు, వైరస్లు, సూక్ష్మజీవులు, విత్తనాలను పరిశోధనల కోసం అధికారిక అనుమతులతో తీసుకెళ్లే వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది? దాని అవసరం ఏమిటి? వంటి విషయాలను పరిశీలిద్దాం.కొత్త వాతావరణమే సమస్యఒక దేశం మరో దేశంపై ఆయుధాలతో విరుచుకుపడితే ఆ దాడి నష్టం ఏపాటిదో అప్పటికప్పుడే తెలిసిపోతుంది. అదే గనక.. ఒక విధ్వంసక శిలీంధ్రాన్నో, సూక్ష్మజీవినో, వైరస్నో జీవాయుధంగా ప్రయోగిస్తే ఈ ఆగ్రో టెర్రరిస్టు చర్య వల్ల కలిగే నష్టం వెంటనే తెలియదు. కొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే, ఒక దేశంలో ఉండే శిలీంధ్రం లేదా వైరస్ వేరు దేశపు కొత్త వాతావరణ పరిస్థితుల్లోకి ప్రవేశించినప్పుడు ఆ వాతావరణం నప్పితే చెలరేగిపోవచ్చు. అక్కడి పంట పొలాల్లో విధ్వంసం సృష్టించి ఆ దేశపు ఆహారోత్పత్తి పునాదుల్నే కదిలించి, కోలుకోలేని దెబ్బ తీయవచ్చు. లేదంటే, ఆ కొత్త వాతావరణం సరిపడకపోతే తేలిపోనూవచ్చు. ఆ కొత్త వాతావరణంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలో తేమపై ఈ శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాల ప్రవర్తన తీరు ఎంత విధ్వంసకరంగా ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశోధనల కోసం విదేశాలకు ఇలాంటివి తీసుకెళ్లాలంటే పటిష్టమైన పరీక్షలు, నియమనిబంధనలతో కూడిన క్వారంటైన్ వ్యవస్థ ఏర్పాటైంది. అదేమీ లేకుండా ఫంగస్ను పంపటం ద్వారా చైనా ‘ఆగ్రో టెర్రరిస్టు (వ్యవసాయ ఉగ్రవాద)’ చర్యకు ఒడిగట్టిందని అమెరికా మండిపడింది. ‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. ఇది పంటలకే కాదు మనుషులు, పశువుల ఆరోగ్యానికి కూడా గొడ్డలిపెట్టు. యావత్ జాతి భద్రతకే ప్రత్యక్ష ముప్పు’ వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) డైరెక్టర్ కష్ పటేల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.అన్ని దేశాల్లోనూ ఉన్నదే! ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రంను ‘కిల్లర్ ఫంగస్’ అని కూడా అభివర్ణిస్తున్నారు. ‘గ్రామినే’ కుటుంబానికి చెందిన వరి, మొక్కజొన్న, గోధుమ, బార్లీ వంటి ప్రధాన ఆహార ధాన్యపు పంటలకు కంకి దశలో సోకటం ద్వారా దిగుబడిని దెబ్బతీసి తీవ్ర ఆర్థిక నష్టం కలిగిస్తుంది అయితే, ఇది ఇప్పటికే దాదాపు అన్ని దేశాల్లోనూ ఉన్న శిలీంధ్రమేనని నిపుణులు చెబుతున్నారు. ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు, కేంద్ర ప్రభుత్వ జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం మాజీ సంచాలకులు డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు ‘సాక్షి సాగుబడి’తో మాట్లాడుతూ.. ‘ఇది కొత్త శిలీంధ్రం కాదు. అమెరికా, భారత్, పాకిస్తాన్, చైనా సహా చాలా దేశాల్లో ఇప్పటికే ఉనికిలో ఉంది. అనేక పంటల కంకులను ఆశించి, దిగుబడికి పెను నష్టం చేస్తుంటుంది. ఇది సోకిన ధాన్యం తింటే వికారం, వాతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే, పంటలకు విధ్వంసకమైనదైనప్పటికీ ఇది ప్రాణహాని కలిగించినట్లు ఆధారాలు లేవు. నిజానికి పప్పులు, మిరపకాయలు, వేరుశనగలను ఆశించే అఫ్లోటాక్సిన్లు దీనికన్నా ప్రమాదకరం. ఒక్కోసారి కేన్సర్ కారకం కూడా కావచ్చు’ అన్నారు.దిగుమతి, ఎగుమతికి క్వారంటైన్ తప్పనిసరి!శిలీంధ్రం, సూక్ష్మజీవి, వైరస్, విత్తనాలు, మొక్కలు వంటి జీవ పదార్థాలను ఒక దేశం పరిశోధనల కోసం, వ్యాపార రీత్యా అధికారికంగా ఎగుమతి చేయాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా అంత సులువేమీ కాదు. అంతర్జాతీయ మొక్కల సంరక్షణ ఒడంబడిక (ఐపిపిసి)లో పేర్కొన్న విధంగా కఠినమైన క్వారంటైన్ నియమ నిబంధనలను రెండు దేశాలూ త్రికరణశుద్ధితో పాటించాల్సిందే.ఎగుమతి చేసే దేశం ప్రమాదం లేదని ఫైటో శానిటరీ సర్టిఫెకెట్ ఇవ్వాలి. దిగుమతి చేసుకునే దేశ ప్రభుత్వం దిగుమతి చేసుకునే సంస్థ/వ్యక్తికి ఇంపోర్ట్ పర్మిట్ ఇవ్వాల్సి ఉంటుంది. దిగుమతి చేసుకున్న తర్వాత ఒక సీజన్లో క్వారంటైన్ చట్టాల ప్రకారం ప్రయోగాలు చేసి, అందులో హానికారక చీడపీడలు ఏవీ రవాణా కావటం లేదని నిర్థారించుకున్న తర్వాతే ఆ దేశపు సహజ వాతావరణంలోకి ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు. ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. చదవండి: జాబ్స్ టియర్స్.. కొత్త మిల్లెట్ పంట!ప్రపంచ వాణిజ్య సంస్థ సభ్యదేశాలన్నీ సాధారణ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి, దిగుమతులకు కూడా శానిటరీ, ఫైటో శానిటరీ నియమాలు పాటించాల్సిందే. ఈ నియమాలను అమలుచేసే పటిష్ట క్వారంటైన్ వ్యవస్థ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉంటుంది. ఎయిర్పోర్టులు, సీపోర్టుల్లో తనిఖీలు అతి కఠినంగా ఉంటాయి. అమెరికా ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న హవాయి రాష్ట్రం నుంచి దాదాపు అన్ని రకాల పండ్లు కూరగాయలు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లడానికి నిర్దిష్టమైన ఆంక్షలు అమల్లో ఉన్నాయన్నారు డాక్టర్ శరత్బాబు.మన క్వారంటైన్ వ్యవస్థ బలహీనం చైనా నుంచి ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’ శిలీంధ్రాన్ని అమెరికాకు తీసుకెళ్లింది పరిశోధనల కోసమైనప్పటికీ క్వారంటైన్ నిబంధనలు పాటించలేదు. అనుమతులు లేవు కాబట్టే ఈ పనిని ‘వ్యవసాయ ఉగ్రవాద’ చర్యగా అమెరికా సీరియస్గా పరిగణించింది. జియోపొలిటికల్ ఉద్రిక్తతలు కూడా దీనికి కారణమై ఉండొచ్చు. ఈ శిలీంధ్రం అన్ని దేశాల్లోనూ ఉన్న జాతే. అయినా, వేర్వేరు దేశాల్లో అనేక ఉపజాతులు ఉంటాయి. ఒక ఉపజాతి ఒక దేశంలో పెద్ద సమస్య కాకపోయినా, వేరే దేశంలోని విభిన్న వాతావరణంలోకి వెళ్లిన తర్వాత పెను విపత్తు సృష్టించవచ్చు లేదా నిద్రాణంగా ఉండిపోవచ్చు. అందుకే జీవపదార్థాలేవైనా దేశ సరిహద్దులు దాటించేటప్పుడు కఠినమైన క్వారంటైన్ పరీక్షలు చెయ్యటం తప్పనిసరి. మన దేశంలో ఈ క్వారంటైన్ వ్యవస్థ బలహీనంగా ఉంది. ఇకనైనా పటిష్టం చెయ్యాలి.– డాక్టర్ బలిజేపల్లి శరత్బాబు, అధ్యక్షులు, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, మాజీ సంచాలకులు, జాతీయ మొక్కల జన్యు వనరుల సంస్థ (ఐసిఎఆర్–ఎన్బిపిజిఆర్) హైదరాబాద్ కేంద్రం. -
భర్తలకు స్పాట్.. రాజాలా బలవుతున్న భర్తలెందరో!
‘‘అరె మామా.. పెళ్లంటేనే భయమైతుంది రా’’ అంటూ తన స్నేహితుడు రవికి ఫోన్ చేసి ఆందోళనగా చెబుతున్నాడు విష్ణు. ‘‘సడన్ ఎందుకు మామా అలా అనిపిస్తోంది?’’ అంటూ అవతలి నుంచి రవి వాయిస్ వినిపించింది. ‘‘అరేయ్.. మేఘాలయా హనీమూన్ కోసం వెళ్లిన జంట మిస్ అయ్యిందని మొన్న ఓ వార్త లింకు పంపాను కదరా’’ అంటూ గుర్తు చేశాడు విష్ణు. ‘‘ఆ.. అవును.. పాపం ఆ భార్యకి కూడా ఏమైందో తెల్వదంట కదా!. అయితే ఏమైంది ఇప్పుడు’’ అన్నాడు రవి. ‘‘ఏం లేదురా.. ఆ మొగుడ్ని చంపింది ఆ భార్యేనంట!!’’ అంటూ విష్ణు చెప్పడంతో షాక్ తినడం ఇవతల రవి వంతైంది. మేఘాలయా హనీమూన్ జంట మిస్టరీ మిస్సింగ్ ఎపిసోడ్లో బయటపడ్డ ట్విస్ట్ గురించి రవి-విష్ణులాంటి వాళ్లెందరో చర్చించుకుంటున్నారు. అదీ సోషల్ మీడియా వేదికగా..!. మరో వ్యక్తితో బంధంలో ఉండి కూడా రాజా రఘువంశీని వివాహం చేసుకోవడం, ఆపై అతన్ని అడ్డుతొలగించుకునేందుకు ప్రియుడితో స్కెచ్ వేయడం.. హనీమూన్లోనే భర్తకు స్పాట్ పెట్టడం.. ‘‘అసలు ఈ పెళ్లిళ్లు ఎందుకయ్యా?’’ అని చర్చను సోషల్ మీడియాలో తెర మీదకు తెచ్చింది. అయితే ఇందుకు ఈ ఒక్క కేసే కాదు.. ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న వరుస ఘటనలే కారణం. సిమెంట్ డ్రమ్ము అంటేనే.. ప్రాణంగా ప్రేమించి మరీ పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు సౌరభ్ తివారీ. అలాంటిది తన గంజాయి ‘ఛప్రీ’ ప్రియుడు షాహిల్ శుక్లా కోసం భర్తనే కడతేర్చింది ముస్కాన్ రస్తోతి. భర్తకు మత్తు మందు ఇచ్చి, ఆపై చంపి ముక్కలు చేసి.. ఆ బాడీని పెద్ద డ్రమ్ములో కుక్కి సిమెంట్తో ముంచేశారు. ఆపై.. సౌరభ్ కుటుంబాన్ని నమ్మించేందుకు అతని ఫోన్ నుంచి సందేశాలు పంపుతూ ఏకంగా 12 రోజులపాటు ఈ గంజాయి జంట సరదాగా గడిపింది. అయితే తిరిగి వచ్చాక శవాన్ని మాయం చేసే క్రమంలో సీల్డ్ డ్రమ్ము పగిలిపోవడంతో.. భయపడిన ముస్కాన్ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బంగారం లాంటి భర్తను చంపిన ముస్కాన్ను ఆమె తల్లిదండ్రులే దగ్గరుండి పోలీసులకు అప్పగించడం ఈ కేసులో కొసమెరుపు. ప్రస్తుతం ముస్కాన్, షాహిల్ శుక్లా జైల్లో శిక్ష అనుభవిస్తుండగా.. ఇండోర్ కేసుగా ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భర్తకు అడ్డంగా దొరికిన యూట్యూబర్ ఆపై.. రవీనా ఓ యూట్యూబర్. అయితే ఆమె చేసే వీడియోలు భర్తకు నచ్చేవి కాదు. దీంతో తనను మందలించడమే తన భర్త పనిగా పెట్టుకున్నాడనుకుని ఆమె రగలిపోయింది. ఈ క్రమంలో ఓరోజు సోషల్ మీడియాలో సురేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తన కంటెంట్ను పొగడ్తలతో ముంచెత్తడంతో సురేష్ ప్రేమలో పీకల లోతుల ప్రేమలో పడిపోయింది. ఈ క్రమంలో ఓరోజు.. మార్చి 25వ తేదీన ఇంట్లోనే ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ భర్తకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. దీనిపై నిలదీసిన భర్తను ఇద్దరూ కలిసి ఊపిరిరాడకుండా చేసి కడతేర్చారు. ఆ కరాళ రాత్రిలో భర్త మృతదేహాన్ని ప్రియుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి నగర శివారులోని పడేశారు. విచారణలో హర్యానా భివానిలో జరిగిన ఈ ఘోరం బయటపడింది. భర్తను కడతేర్చి ఆపై పక్కలో.. నిద్రలోనే ఓ వ్యక్తిని పాము పదిసార్లు కాటేసిందని, రాత్రంతా అతని మంచంలోనే ఉంటూ కాటు వేస్తూనే ఉందని, ఆ విష ప్రభావంతో అతను కన్నుమూశాడని ఆ మధ్య ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అయితే ఇది భార్య చేసిన కుట్ర అని తెలుసుకోవడానికి పోలీసులకు ఎంతో టైం పట్టలేదు. మీరట్ అక్బర్పూర్ సదాత్ గ్రామానికి చెందిన అమిత్(25) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వృత్తిరిత్యా బయటి ప్రాంతాలకు వెళ్తుండడంతో.. అమర్జీత్ అనే యువకుడితో ఏడాదిగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టాల ద్వారా ఈ విషయం తెలుసుకున్న అమిత్.. భార్యను మందలించాడు. దీంతో ప్రియుడితో కలిసి స్కెచ్ గీసింది. ఏప్రిల్ 14వ తేదీ రాత్రి మంచంలో నిద్రిస్తున్న అతన్ని ఊపిరాడకుండా చంపేసింది. ఆపై అద్దెకు పామును తెచ్చి భర్త మృతదేహం మీద కాట్లు వేయించి మంచంలో పడేసింది. అప్పటికే ప్రాణం పోవడం విషం శరీరానికి ఎక్కలేదు. బదులుగా.. పోస్టుమార్టం నివేదికలో అతను విషం వల్ల కాకుండా ఊపిరి ఆడకపోవడం వల్లే మరణించాడని తేలింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. భార్య రవిత అసలు విషయం బయటపెట్టింది.పెళ్లై పదిరోజులు తిరగకుండానే.. మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన రాజా రఘువంశీకి మే 11వ తేదీన సోనమ్తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మే 20వ తేదీన హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లింది ఈ జంట. అయితే ఈ జంట ఆచూకీ లేకపోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని.. ప్రతికూల వాతావరణంలోనూ దట్టమైన అడవుల్లో గాలింపు చేపట్టారు పోలీసులు. ఈ లోపు.. రాజా రఘువంశీ మృతదేహం దొరకడంతో సోనమ్ ఆచూకీ కోసం అతని కుటుంబం కంగారుపడింది. ఈలోపు విచారణ జరిపిన ప్రత్యేక దర్యాప్తు బృందం షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సోనమే రాజాను హత్య చేయించిందని!. తన తండ్రి కంపెనీలో పని చేసే రాజ్ కుష్వాహ్తో ఆమె ప్రేమలో ఉందని, ఆ విషయం తెలిసి తండ్రి మందలించాడని, ఆపై బలవంతంగా రాజా రఘువంశీకి ఇచ్చి వివాహం చేయడంతో ఆమె భర్తను వదలించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడి సాయంతో ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ను సంప్రదించి తన భర్తను చంపేందుకు సుపారీ ఇచ్చిందామె. అలా.. మూడు రోజుల తర్వాత రాజా రఘువంశీని వాళ్లు మట్టుపెట్టారు. విచారణలో ఈ షాకింగ్ విషయం బయటపడడంతో అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హనీమూన్ వెళ్లే ముందు రఘువంశీని ఒత్తిడి చేసి మరీ రూ.10 లక్షల విలువైన బంగారు నగలు అతని ఒంటిపై వేయించిందని, వాటి కోసమే హత్య జరిగిందన్న కోణంలో నమ్మించాలని ప్రయత్నించింది. అయితే ఆమె రిటర్న్ టికెట్స్ బుక్ చేయకపోవడంతో మొదలైన అనుమానం.. చివరకు మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టింది. ముంబై, థానే, నవీ ముంబైలో గత నాలుగు నెలల్లో.. ఇలా భర్తలను వివాహేతర సంబంధం కోసం బలిగొన్న భార్యల కేసులు ఆరు దాకా నమోదు అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. కొసమెరుపు ఏంటంటే.. తమ ప్రాణాలను రక్షించుకునేందుకు ఒకరిద్దరు భర్తలు తమ భార్యలను ప్రియుడికి ఇచ్చి వివాహం చేసిన సందర్భాలూ ఈ మధ్యకాలంలోనే చోటు చేసుకోవడం. అయితే ఇందులో ఒక కేసులో ప్రియుడు తాను తప్పు చేశానని గ్రహించి దగ్గరుండి ఆమెను మళ్లీ భర్త దగ్గర దిగబెట్టగా.. మరో కేసులో మాత్రం ఆ భర్త చేసిన త్యాగం అలాగే మిగిలిపోయింది. -
అంతరిక్షంలో అంతుబట్టని వస్తువు
అంతరిక్షం అనంత రహస్యాల పుట్ట. మానవుడు ఇప్పటికీ గుర్తించని వింతలు, విడ్డూరాలకు అంతరిక్షంలో కొదవేలేదు. ఖగోళ శాస్త్రవేత్తలకు తాజాగా ఓ వింత అనుభవం ఎదురైంది. డీప్ స్పేస్లో ఓ గుర్తు తెలియని వస్తువును కనిపెట్టారు. అదేమిటన్నది వారికే అంతుబట్టడం లేదు. ఆ వస్తువు నుంచి రేడియో, ఎక్స్ తరంగాలు వెలువడుతున్నట్లు గుర్తించారు. అందులో తరచుగా పేలుళ్లు సంభవిస్తూ తరంగాలను ఉత్పత్తి చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వివరాలను జర్నల్ నేచర్లో ప్రచురించారు. ఈ అంతుబట్టని వస్తువు నుంచి ప్రతి 44 నిమిషాలకోసారి రెండు నిమిషాలపాటు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఇది చాలా అసాధారణమని సైంటిస్టులు అంటున్నారు. ఇలాంటి పరిణామం మునుపెన్నడూ చూడలేదని స్పష్టంచేస్తున్నారు. ఇప్పటిదాకా అంతరిక్షంలో గుర్తించిన వస్తువుల్లో ఇలా తక్కువ సమయంలో తరచుగా సంకేతాలు వెలువడినట్లు తేలలేదు. ఈ కొత్త వస్తువును లాంగ్ పిరియడ్ ట్రాన్సియంట్(ఎల్పీటీ) కేటగిరీలో చేర్చారు. ఇది మ్యాగ్నేటర్ కావొచ్చని అంచనా వేస్తున్నారు. మృత నక్షత్రానికి చెందిన అత్యధిక ఆయస్కాంత శక్తి కలిగిన అవశేషాన్ని మ్యాగ్నేటర్ అంటారు. రాబోయే రోజుల్లో రేడియో, ఎక్స్–రే టెలిస్కోప్ల ద్వారా ఇలాంటి వస్తువులను మరిన్ని గుర్తించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విశ్వం ఆవిర్భావం గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇవి దోహదపడతాయని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలుష్య కణాలగుట్టువిప్పిన గణితవేత్త
పరిశ్రమల నుంచి, వాహనాల నుంచి వెలువడుతూ భూతాపోన్నతికి కారణమవుతున్న పొగ, కాలుష్యకారక కణాల గురించి శాస్త్రవేత్తలకు ఇప్పటికే ఒక అవగాహన ఉంది. వీటి కారణంగా ఏ స్థాయిలో కాలుష్యం సంభవిస్తోందో, వాతావరణ మార్పులో వీటి ప్రభావ స్థాయిలను పర్యావరణ వేత్తలు ఇప్పటికే అంచనావేయగల్గుతున్నారు. అయినాసరే ఆకస్మిక వర్షాలు, వరదలు వంటి వాటిని ఇప్పటికీ సరిగా అంచనావేయలేని పరిస్థితి. వీటికి కారణంగా గోళాకృతిలో లేని ఇతర రకాల కణాలు కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారుగానీ వీటి పరిమాణాన్ని, ప్రభావాన్ని గణించే విధానాన్ని అభివృద్దిచేయలేకపోయారు. గత 15 సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యకు ఆస్ట్రేలియాలోని మాక్వరైటన్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్రవేత్త, అసోసియేట్ ప్రొఫెసర్ స్టార్ట్ హాకిన్స్ పరిష్కారం కనుగొన్నారు. దీంతో మరింత ఖచి్చతత్వంతో వాతావరణ అంచనా సుసాధ్యంకానుంది. 2008లో వాతావరణ భౌతికశాస్త్రవేత్త మైఖేల్ బాక్స్ చేసిన ఒక ప్రసంగాన్ని హాకిన్స్ విన్నారు. వాతావరణమార్పులకు కారణమవుతున్న అన్ని ఆకృతుల కాలుష్యకణాలను లెక్కించకుండా మనం చేసే వాతావరణ అంచనాలు భవిష్యత్తులో అంత నిరుపయోగంగా మారే ప్రమాదంఉంది’’అని మైఖేల్ బాక్స్ చేసిన ప్రసంగం హాకిన్స్ను ఆలోచనల్లో పడేసింది. ఈ గజిబిజి ఆకృతుల కణాలను లెక్కగట్టే విధానాన్ని అభివృద్ధిచేసి ఈ పొల్యూషన్ పొడుపు ప్రశ్నకు సమాధానం వెతకాలని నిశ్చయించుకుని ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత ఆ పనిలో సఫలీకృతులయ్యారు. ఏమిటీ కణాలు? వాహనాలు, ఫ్యాక్టరీల నుంచి వెలువడే ధూళి కణాలు గోళాకృతిలో ఉంటాయి. కానీ రాజస్థాన్లోని థార్ఎడారిసహా పలు గనుల తవ్వవం వంటి చోట్ల శిలలు క్రమంగా ఒరుసుకుపోయి, కోతకు గురై అత్యంత సూక్ష్మ శిలా కణాలు ఉద్భవించి గాల్లో కలుస్తున్నాయి. జీవఇంథనాలు మండించినపుపడు వెలువడే కొన్ని రకాల నుసి సైతం భిన్నాకృతిలో ఉంటోంది. ఢిల్లీలో చలికాలంలో నిర్మాణ పనుల వేళ గాల్లో కలిసే పరిశ్రమల వ్యర్థ్యాల నుంచి సైతం వేర్వేరు ఆకృతుల్లో ధూళి కణాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రస్తుతమున్న వాతావరణ సిద్ధాంతాలతో గణించడం కష్టం. ఈ కణాలు గాల్లో అధికమై సూర్యరశ్మి భూమిపై పడకుండా అడ్డుకుని భూమిని చల్లబరచవచ్చు లేదంటే భూమి నుంచి వేడి బయటకు పోకుండా అడ్డుకుని భూతాపోన్నతికి కారణం కావచ్చు. ఈ రెండు దృగి్వషియాలను సైతం గోళాకృతియేతర కణాల కోణంలో లెక్కించాల్సి ఉంది. ప్రసరణ దిశలో ఏదైనా వస్తువు అడ్డుగా ఉంటే కాంతి దిశను మార్చుకుంటుంది. ఈ సిద్ధాంతాన్ని ఈ అసాధారణ ఆకృతి కణాలకు అన్వయిస్తూ కంప్యూటేషన్ మెథడ్ను హాకిన్స్ రూపొందించారు. ఇప్పుడీ గణిత సూత్రాలు భవిష్యత్తులో వైద్య ఇమేజింగ్ సాంకేతికతల ఆధునీకరణకూ ఉపయోగపడనున్నాయి. అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ వంటి సాంకేతికతలు తరంగాలు మన శరీరంలో ఎలా ప్రయాణిస్తాయనే సూత్రాలపైనే ఆధారపడి పనిచేస్తాయి. కొత్త గణిత సూత్రాలతో అత్యాధునిక అ్రల్టాసౌండ్ , ఎంఆర్ఐ తీయొచ్చు. పలు రకాల కోటింగ్లలోనూ విరివిగా వాడొచ్చు. ఈ సూత్రాలను కాంతి విక్షేపణకు సంబంధించిన ప్రతి రంగంలోనూ ఉపయోగించవచ్చు. వడగాల్పులు, రుతుపవన అంచనాలు, కాలుష్య ప్రభావాలు వంటిలోనూ ఈ సూత్రాలను వాడొచ్చు. దీంతో వాతావరణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయొచ్చు. ఈ పరిశోధనా వివరాలు ‘క్వాంటేటివ్ స్పెక్ట్రోస్కోపీ, రేడియేటివ్ ట్రాన్స్ఫర్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ నగరాలు...సముద్రం పాలు!
నదీజలాలు. నాగరికతకు పుట్టినిళ్లు. అత్యంత భారీ వర్షాలు వచ్చినప్పుడు ఉగ్రరూపంలో ఉప్పొంగినా తర్వాత సాధారణ స్థితికి వచ్చి మానవులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. కానీ సముద్రజలాలు అలాకాదు. ప్రపంచవ్యాప్తంగా సముద్రతీరమున్న ఎన్నో పట్టణాలను ఇప్పుడు సముద్రజలాల పెరిగే నీటిమట్టాలు అక్కడి ప్రజల్లో ఆందోళన మట్టాలను అమాంతం పెంచేస్తున్నాయి. తరతరాలుగా తీరప్రాంతాల్లోనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్న స్థానికులను సాగరజలాలు ఇప్పుడు బద్ధశత్రువుగా మారాయి. తీవ్రమైన వ్యాధి శరీరాన్ని కబళించినట్లు ఈ సముద్రజలాలు నెమ్మదిగా ఆయా తీరప్రాంతాల సమతల భూభాగాలను శాశ్వతంగా తనలో కలిపేసుకుంటున్నాయి. శరవేగంగా పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలు ఇప్పుడు కోట్లాది మంది ప్రజలకు కంటిమీద కనుకులేకుండా చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా తీరప్రాంతాల్లో సముద్ర నీటిమట్టాలు ఇటీవలికాలంలో చాలా అత్యధిక వేగంతో పెరుగుతున్నాయని సింగపూర్లోని నాంయాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ) శాస్త్రవేత్తలు కుండబద్దలు కొట్టారు. 2014 నుంచి చూస్తే గత ఆరేళ్లలోనే ఏటా ఒక సెంటీమీటర్ ఎత్తు సముద్రజలాల నీటిమట్టం పెరుగుతూ తీరప్రాంతాలను శాశ్వతంగా ముంచేసినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఉత్తర అమెరికా, ద.అమెరికా ఖండాల్లో 48 తీరనగరాలకు తీరనిశోకంగా సాగరజలాలు మారాయని అధ్యయనం పేర్కొంది. వాతావరణ మార్పులకుతోడు కుంగిపోతున్న భూమి కారణంగా ఈ సమస్య తీవ్రమవుతోందని తేలింది. రెండేళ్ల క్రితం ఈశాన్యచైనాలోని తియాంజిన్ నగరంలో తీరప్రాంత వీధులన్నీ కుంగడంతో వేలాది మందిని అపార్ట్మెంట్ల నుంచి హుటాహుటిన ఖాళీ చేయించారు. 2014 నుంచి 2020 ఏడాది వరకు చూస్తే తియాంజిన్ నగర భూభాగం ఏటా 18.7 సెంటీమీటర్లమేర కుంగింది. సముద్రజలాలు పెరిగి భూగర్భజలాలు పెరగడంతో నేల కుంగింది. ముంపు బారిన ముంబై దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరాన్నీ ముంపు సమస్య పట్టిపీడిస్తోంది. 2014 నుంచి చూస్తే సంవత్సరానికి 0.01 సెం.మీ.ల నుంచి 5.9 సెంటీమీటర్ల స్థాయిలో ముంబైలోని చాలా ప్రాంతాలను సముద్రనీరు ముంచేసింది. ఏటా 1 సెం.మీ.చొప్పున నేల సముద్రజలాల్లో కలిసిపోతున్న చోట్ల 62 లక్షల మంది జీవిస్తున్నట్లు ఎన్టీయూ అధ్యయనకారులు ప్రకటించారు. మాతుంగా ఈస్ట్లోని కింగ్ సర్కిల్ స్టేషన్ ప్రాంతం వేగంగా ముంపునకు గురవుతోంది. ఇక్కడ ఏటా 2.8 సె.మీ.ల మేర సముద్రజలాలు పెరుగుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సాగరజలాలు గత ఏడాది 0.59 సెంటీమీటర్లమేర ఎగిశాయని నాసా అధ్యయనంలో స్పష్టమైంది. భూగర్భజలాలను విచ్ఛలవిడిగా తోడేయడం, ఊహించనంత బరువుతో ఆకాశహర్మ్యాలను నిర్మించడం, నిరాటంకంగా కొనసాగుతున్న మెట్రో ప్రాజెక్ట్ పనులు, చిత్తడినేలలను ప్రభుత్వాలు పునరుద్ధరించడం తదితర కారణాలు సైతం మహానగరంలోకి సాగరజలాలు చొచ్చుకొచ్చేలా చేస్తున్నాయి. కనీసం 50 లక్షల జనాభా ఉన్న సముద్రతీర నగరాల వెంట సముద్రనీటిమట్టాలు పెరుగుతున్న అంశాన్ని ఉపగ్రహాల సాయంతో విశ్లేషించి ఈ అధ్యయనం చేశారు. అగ్రరాజ్యంలోనూ.. అమెరికాలోని మయామీ సిటీని సాగరజలాలు ముంచెత్తుతున్నాయి. 2014 నుంచి 2020 వరకు చూస్తే మయామీ సిటీలో కోకోనట్ గ్రోవ్సహా చాలా ప్రాంతాలు గరిష్టంగా 2.2 సెంటీమీటర్లమేర సముద్రజలాల మట్టాలు పెరిగాయి. ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న ప్రాంతాలు 43,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ పరిధిలోని బ్రీజీ పాయింట్ వద్ద నీరు ఏటా 3 సె.మీ.ల మేర పెరుగుతోంది. ఇక్కడ ఏటా 1 సెం.మీ. సముద్రనీరు పెరుగుతున్న చోట 1,03,000 మందికిపైగా అమెరికన్లు నివసిస్తున్నారు. లాస్ ఏంజెలిస్ సిటీలోని శాన్ పెడ్రో సహా పలు తీర ప్రాంతాల్లో నీరు ఏటా 2.5 సె.మీ.ల మేర పెరుగుతోంది. హ్యూస్టన్ సిటీ పరిధిలో గరిష్టంగా ఏకంగా 11 సెం.మీ. మేర సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. హ్యూస్టన్లోని సెంట్రల్ సౌత్వెస్ట్ ప్రాంతంలో ఏటా 8 సెం.మీ.ల మేర సముద్రనీరు పైకొస్తోంది.కొత్త పరిష్కారం చూపుతున్న జపాన్ భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు చేస్తున్న జపాన్ ఇప్పుడు సముద్రమట్టాల పెరుగుదల ముప్పుకూ మరో పరిష్కారం వెతికింది. విచ్ఛలవిడిగా భూగర్భజలాలను వాడడంతో నేల కుంగి పరోక్షంగా సముద్రనీరు చొచ్చుకొస్తున్న నేపథ్యంలో గ్రౌండ్వాటర్ అతి తోడివేతకు చెక్ పెట్టింది. ఈ విషయంలో కఠిన నిబంధనలను అమలుచేస్తోంది. పటిష్టవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఏర్పాటుచేసింది. 2014 ఏడాది నుంచి చూస్తే 0.01–2.3 సె.మీ.ల స్థాయిలో నేల కుంగినా ఇప్పుడు మాత్రం ఆ దురవస్థ నుంచి కాస్తంత బయటపడింది. ఎగువ ప్రాంతాలు, అడువులు, నదుల నుంచి సిటీ వైపుగా వచ్చే నీటిని నగరానికి దూరంగా ఉన్న రెండు రిజర్వాయర్లలో నింపుతోంది. అక్కడి నుంచి అవసరమైన మేరకే నీటి నగరంలో జనావాసాలకు, పరిశ్రమలకు సరఫరాచేస్తోంది. అయితే జపాన్ మోడల్ అన్ని దేశాలకు పనికొస్తుందో లేదో తెలీదు. పైగా ఇది అత్యంత ఖర్చుతో కూడిన వ్యవహారమని జపాన్లోని వసేడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ మిగూయెల్ ఎస్తిబాన్ అభిప్రాయపడ్డారు. భూగర్భజలాల అతి తోడివేతను తగ్గించుకుని తైపే నగరం ఈ సమస్య నుంచి కాస్తంత బయటపడింది. దీనికితోడు బ్యాంకాక్, అమెరికాలోని హ్యూస్టన్, బ్రిటన్లోని లండన్ నగరాలు సైతం భూగర్భజాలాల అతివాడకానికి చరమగీతం పాడాయి.భూగర్భజలాలు పైకి రావడానికి కారణాలెన్నో.. తీర ప్రాంతాల వెంట భవనాల నిర్మాణం, గనుల తవ్వకం, భూఫలకాల కదలికలు, భూకంపాలు, సహజంగా భూమిపొరలు ఒత్తకునిపోవడం తదితర కారణాలతో భూమి కాస్తంత కుంగుతుంది. వీటికితోడు కింది పొరలో భూగర్భజలాలు ఉన్న చోటు నుంచి మనం నీటిని తోడేసి ఖాళీచేస్తున్నాం. దీంతో అప్పటిదాకా భూగర్భజలాలపై ఉన్న శిలలు, నేల పొరలు కిందకు పడిపోతున్నాయి. ఇలా భూమి కుంగుతోంది. ‘‘ అత్యధికంగా భూమి కుంగుతున్న 48 తీరప్రాంతాల్లో సగం ప్రాంతాలు ఈ సమస్యకు అతిగా భూగర్భజలాలను తోడేయడమే కారణం’’ అని ఎన్టీయూ పరిశోధనలో కీలక పరిశోధకురాలు చెరిక్ టే చెప్పారు. జకార్తా వంటి నగరాల్లో భూగర్భజలాలను వెలికితీయడం మరీ ఎక్కువైందని ఆయన వెల్లడించారు. ‘‘ అత్యధిక అభివృద్ధి ప్రాజెక్టులు, జనాభా ఉన్న దేశాల్లో అధిక భూగర్భజలాల వినియోగం కనిపిస్తోంది. ముఖ్యంగా, ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రమవుతోంది. తక్కువ ఎత్తున్న డెల్టా ప్రాంతాల్లో వెలిసిన నగరాలకు ఈ సమస్య మరీ ఎక్కువ. సముద్రంలో కలవడానికి ముందే ఎక్కువ పాయలుగా విడిపోయి ప్రవహించే నదుల వెంట ఉన్న ప్రాంతాల్లోనూ ఇదే సమస్య కనిపిస్తోంది. జకార్తా, బ్యాంకాక్, హో చి మిన్ సిటీ, షాంఘైలకు ఈ ముంపు ముప్పు ఎక్కువ. జకార్తా సిటీలో సగం ప్రాంతాలు సముద్ర నీటిమట్టం కంటే తక్కువ ఎత్తులో ఉండటం గమనార్హం. 1970 ఏడాదితో పోలిస్తే జకార్తాలో ప్రస్తుతం పలు ప్రాంతాలు 4 సెం.మీ. కుంగిపోయాయి. ఈ కారణంగానే తీరానికి కాస్తంత దూరంగా నుసంతారా పేరిట కొత్త రాజధానిని ప్రభుత్వం నిర్మిస్తోంది. ‘‘ తీరం వెంట మా ఇల్లు ఉంది. ఇంటి కిటికీలు నా చిన్నప్పుడు మెడ ఎత్తులో ఉండేవి. ఇప్పుడు మోకాలు ఎత్తుకు వచ్చేశాయి. నేలపై సముద్రనీరు చొచ్చుకొచ్చి నప్పుడల్లా మా ఇంటి అడుగును పూడుస్తూ వచ్చాం. దీంతో గ్రౌండ్ఫ్లోర్లో ఇంటి ఎత్తు తగ్గుతూ వస్తోంది. చివరకు గ్రౌండ్ఫ్లోర్ మొత్తం మునిగిపోతుందో, ఇల్లే కూలిపోతుందో మాకే అర్థంకావట్లేదు’’ అని నార్త్ జకార్తాలోని ఎర్నా, ఆమె తల్లి సోనీ వాపోయారు. తాత్కాలిక ప్రత్యామ్నాయాలు జకార్తా, ఈజిప్్టలోని అలెగ్జాండ్రియా, వియత్నాంలోని హో చీ మిన్ సిటీల్లోకి పెరిగిన సముద్రమట్టాలు చొచ్చుకురాకుండా గోడలు, అవరోధాలు నిర్మించారు. వచ్చిన నీరు అక్కడే తిష్టవేయకుండా కందకాల వంటి తవ్వి నీటిని మరో చోటుకు మళ్లించారు. అయితే ‘‘గోడలు ఒకరకంగా మంచిచేస్తే మరోరకంగా చేటుచేస్తున్నాయి. ఎగువ నుంచి వరద వస్తే మళ్లీ ముంపు సమస్య అలాగే ఉండిపోతుంది’’ అని ఇటలీలోని పడోవా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పెట్రో తియాటినీ చెప్పారు. షాంఘై వినూత్న పంథా షాంఘై నగరం వాటర్ ఇంజెక్షన్ అనే కొత్త విధానాన్ని అవలంబిస్తోంది. యాంగ్జే నది నుంచి సేకరించిన నీటిని శుద్ధిచేసి ఆ నీటిని బావులు, ఇతర మార్గాల ద్వారా నేలలోకి పంపిస్తోంది. నీటిని తోడేందుకు వేసిన బోరుబావుల రంధ్రాల నుంచి నీటిని నేలలోకి పంపుతోంది. అలా భూగర్భజలాల మట్టాలను పెంచుతోంది. తద్వారా భూగర్భజలాల సమతుల్యతను కాపాడుతోంది. చైనాలోని చోంగ్క్విన్, ఎల్సాల్విడార్లోని శాన్ సాల్విడార్ సిటీలో ‘స్పాంజ్ సిటీ’ పంథాలో వెళ్తున్నాయి. అత్యధిక నీటిని పీల్చుకునే మట్టిరకం, చెట్లు, గడ్డిని పెంచుతున్నాయి. అదనంగా వచ్చిన నీరు పార్కుల్లోకి, చిత్తడినేలల్లోకి వెళ్లేలే ఏర్పాట్లుచేశారు. ‘‘అదనపు నీటిని నిల్వచేసేందుకు పేద్ద రిజర్వాయర్ కట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. దీనితో పలిస్తే పదో వంతు వ్యయంతోనే సమస్యకు పరిష్కారం వెతకొచ్చు’’ అని వర్జీనియా టెక్ వర్సిటీలో ప్రొఫెసర్ మనోòÙహర్ షెర్జాయీ చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టూరు.. ఒక్కో తీరు
పర్యాటకుల ఆసక్తులు మారాయి. పర్యటనల ధోరణి మారింది. యువత సోలో జర్నీ సో బెటరూ అంటున్నారు. కొందరు సోషల్ మీడియా వీడియోలూ, వెబ్ సిరీస్లూ, సినిమాలూ చూసి అందులోని ప్రాంతాలకు ట్రిప్పులకు చెక్కేస్తున్నారు. మరికొందరు సపరివార సమేతంగా విహార యాత్రలు చేస్తున్నారు. ఇంకొందరు క్రికెట్ మ్యాచ్లను బట్టి తమ టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు.. యుద్ధభూముల్లో స్ఫూర్తి పొందుతున్నారు.. నిశీధిలో నింగిలోని చుక్కలను లెక్కపెట్టేస్తున్నారు.. ఇది నయా పర్యాటక ముఖచిత్రం.‘‘పాతాళ్లోక్ సీజన్ 2’.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన వెబ్ సిరీస్. ఈశాన్య భారతంలోని నాగాలాండ్లో ఎక్కువ భాగం షూట్ చేశారు. ఒక సినిమా లేదా వెబ్ సిరీస్ ఇంత స్థాయిలో అక్కడ షూట్ జరగడం ఇదే మొదటిసారి. అక్కడి పచ్చని కొండ ప్రాంతాలు, ఇళ్లు, దట్టమైన వెదురు అడవులు.. అన్నీ చూపరులను కట్టిపడేస్తాయి. అది చూశాక నాకు నాగాలాండ్ వెళ్లాలనిపించింది.స్నేహితులతో వెళ్లి వచ్చేశా’’ అంటాడు హైదరాబాద్కి చెందిన కె.ఉమావెంకట్. ప్రముఖ ప్రైవేటు సంస్థలో పనిచేసే అతడు వారాంతాల్లో కూడా స్నేహితులతో వరంగల్ వంటి చుట్టుపక్కల ప్రాంతాలకు సరదాగా వెళ్లి వచ్చేస్తుంటాడు. ‘ఉద్యోగంలో చేరిన తరవాత కొత్త స్నేహితులు వచ్చారు. వీళ్లే నాకు సహచరులు, స్నేహితులు’ అంటాడు. ఇలాంటి వాళ్లనే ఇప్పుడు ఫ్రొలీగ్స్ అని పిలుస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ అయిన కొలీగ్స్ అన్నమాట. ఇలా సహచర ఉద్యోగ స్నేహితులతో షికార్లకు వెళ్లడం ఇటీవలికాలంలో పెరిగింది.దేశభక్తి.. ప్రకృతి సౌందర్యం..యుద్ధభూమి అంటే వీరత్వానికి ప్రతీక. సైనికుల ధైర్యసాహసాలకు వేదిక. అలాంటి రణభూమికి కూడా పర్యటనలకు వెళ్లేందుకు ఇప్పుడు ఇష్టపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ‘భారత రణభూమి దర్శన్’ పేరిట ప ర్యాటకాన్ని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టింది. జమ్మూ కశ్మీర్, లఢాక్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, అరు ణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో 77 ప్రదేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. భారత సాయుధ దళాల త్యా గాలను ఇవి గుర్తుచేసి, సందర్శకులను రోమాంఛితం చేస్తాయి. ఇవి దేశభక్తి, ప్రకృతి సౌందర్యాల కలబోతలు.తారాలోకం చూస్తూ..రాత్రిపూట ఖగోళ రహస్యాలను, చందమామ, నక్షత్రాల సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తోందని వారు చెబుతున్నారు. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ‘ స్కైస్కానర్’ నిర్వహించిన సర్వేలో.. రాత్రిపూట ఆకాశాన్ని ఫొటోలు తీసేందుకు ఇష్టపడి పర్యటనలకు వెళ్లినవారు 56% మంది. రాత్రిపూట నక్షత్రాలు, చంద్రుడు ఉండగా కొండప్రాంతాల్లో నిద్రించేందుకు వెళ్లినవారు 53% మంది.సినిమాలు, వెబ్సిరీస్లు చూసి..సోషల్ మీడియాలో వచ్చే రీల్స్, వీడియోలు సామాన్యులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనేక ప్రదేశాల గురించి చెబుతున్నారు. అలాగే నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, సోనీ లివ్ వంటి వేదికల్లో వస్తున్న వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా పర్యటనలు చేయాలను కునేవారిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు థామస్ కుక్, ఎస్ఓటీసీ వి డుదల చేసిన ‘ఇండియా హాలిడే రిపోర్ట్ 2025’ సర్వేలో.. ఇలాంటి ప్రాంతాలకు పర్యటనలకు వెళ్తున్నామని 60 శాతం మంది చెప్పడం విశేషం. ఇలా వెళ్లేవారిలో యువతే∙అధికం.సపరివార సమేతంగా..యువతరం తమ తల్లిదండ్రులు, తాతయ్య, అమ్మమ్మ / నాన్నమ్మలతో కలిసి విహార యాత్రలకు వెళ్లాలని అనుకుంటున్నారు. మంచి ఉద్యోగం, 5–6 అంకెల జీతం.. వీరిని ఇందుకు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలోని పెద్దలు గతంలో ఎక్కువ పర్యటనలు చేయకపోవడం కూడా యువతను ఈ నిర్ణ యానికి ప్రేరేపిస్తోంది. దీంతో సపరివార సమే తంగా విహారయాత్రలు చేస్తున్నారు. ‘ఇండి యా హాలిడే రిపోర్ట్ 2025’ ప్రకారం దాదాపు 65% ఇలా పర్యటనలకు వెళ్తున్నారు.క్రికెట్ ప్రేమికులూ..క్రికెట్ను ఇష్టపడేవారు క్రికెట్ మ్యాచ్ల షెడ్యూల్ ప్రకా రం టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు. టీ20, వన్డే వంటి మ్యాచ్లు జరిగే చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రకరకాల స్థానిక రుచులను ఆస్వాదిస్తు న్నారు. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో మ్యాచ్లను ఇలా చాలామంది చూశారట. ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ స్కై స్కానర్ ‘పిచ్ పర్ఫెక్ట్ జర్నీస్’ ప్రకారం.. 48% మంది మ్యాచ్కి కనీసం 2 నెలల ముందే ఇలా ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నారు. వీరిలో స్నేహితులతో వెళ్లినవారు 74% కాగా, కుటుంబంతో వెళ్లినవారు 59%. భార్య లేదా ప్రియురాలు / సహజీ వనం చేస్తున్నవారితో వెళ్లినవారు 46 శాతం.మిమూనింగ్.. సోలో పర్యటనహనీమూన్ వినే ఉంటారు. అంటే జీవిత భాగస్వామితో వివాహానంతరం చేసే విహార యాత్ర. మి మూనింగ్ అంటే.. ఒక్కరే వెళ్లడం. ప్రభాస్ నటించిన ‘చక్రం’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పినట్టు ‘తనలో తామే రమించడం’. ఒక్కరే ఆ అనుభూతిని ఆస్వాదించడం. ట్రెకింగ్, వాటర్ రాఫ్టింగ్ వంటి సాహస యాత్రలు చేయడం. ఎలాంటి బాదరబందీ లేకుండా ఒక్కరే.. ‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది’ అనుకుంటూ ఎక్కడికైనా వెళ్లిపోవడం, ఎంజాయ్ చేయడం. ఇలా వెళ్లి స్థానికతను ఆస్వాదిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లో స్థానిక పండుగలూ, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. స్థానిక రుచులను టేస్ట్ చేస్తున్నారు. భారత్ సహా 7 దేశాల్లో నిర్వహించిన ‘అమెరికన్ ఎక్స్ప్రెస్ 2024 గ్లోబల్ ట్రావెల్ ట్రెండ్స్’ రిపోర్ట్ ప్రకారం.. 84 శాతం మంది మిమూనింగ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచ సగటు 66 శాతం కంటే ఇది చాలా ఎక్కువ కావడం గమనార్హం. భారత్ సహా 13 దేశాల్లోని 13 వేల మందిని 2024 జూన్లో సర్వే చేసిన రిపోర్టు ‘హిల్టన్ 2025 ట్రెండ్స్’. దీని ప్రకారం సోలో పర్యటనలు చేస్తున్నవారు 47 శాతం మంది. వీరిలో మిలీనియల్స్ (1981–96 మధ్య పుట్టినవారు) 51 శాతం కాగా, జనరేషన్ జెడ్ (1997–2012 మధ్య పుట్టినవారు) 55 శాతం కావడం విశేషం. -
ఈ వారం కథ: దృశ్యమాలిక
గలగలా మాట్లాడుతూ చైతన్యానికి ప్రతీకలా ఉండే అమ్మని ఇలా చూస్తుంటే దుఃఖం ఆగడం లేదు. కష్టసుఖాల్లో నా వెన్నంటే ఉన్న ఆవిడ నాకు అమ్మ మాత్రమే కాదు; స్నేహితురాలూ, గురువూ, దైవం అన్నీనూ! భర్తతోనూ, పిల్లలతోనూ, స్నేహితురాళ్ళతోనూ, మరెవ్వరితోనూ చెప్పుకోలేని విషయాలని అమ్మతో పంచుకుంటుండే నాకు ఏ ఒక్కరోజైనా అమ్మతో మాట్లాడలేకపోతే ఆ రోజంతా ఎంతో వెలితిగా వుండేది. నిన్న రాత్రి కూడా అమ్మతో దాదాపు గంటసేపు ఏదో పిచ్చాపాటి మాట్లాడాను. అలాంటిది తెల్లవారు జాముకల్లా అమ్మ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిందన్న దుర్వార్తని వినవలసి వస్తుందని నేను కలలోనైనా ఊహించలేదు. ‘జాతస్య మరణం ధ్రువం’ అని తెలిసినా, నాకు అత్యంత ఆత్మీయురాలైన అమ్మ విషయంలో మాత్రం నేను దాన్ని అన్వయించుకోలేకపోతున్నాను. ‘చదువుకో తల్లీ నీకు సౌఖ్యమబ్బేను, ఆడుకోవమ్మా నీకు హాయి కలిగేను’ అంటూ అమ్మ చల్లని గొంతుతో పాడే జోల నా చెవుల్లో ఇంకా వినిపిస్తూనే వుంది.‘చిన్నా, చిన్నా’ అంటూ అమ్మ నన్ను పిలుస్తున్నట్టే అనిపిస్తోంది. ఒకటా, రెండా– ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు. నా మదిలో అలలు అలలుగా కదులుతూ నన్ను ఒక రకమైన సుషుప్తిలోకి నెట్టేస్తున్నాయి. ‘అమ్మా, చూడు అన్నయ్య నన్ను కొడుతున్నాడు’ అని చెప్పగానే, ‘ఎవరమ్మా నా చిట్టితల్లిని కొట్టిందీ, హన్నా’ అంటూ నా తరఫున వకాల్తా పుచ్చుకొని, అన్నయ్యకి రెండు అంటించి మురిపెంగా నన్ను ఎత్తుకుని ముద్దాడిన అమ్మ! ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరంలో చివరి పరీక్షకి ముందురోజున ‘నేను ఈ సబ్జెక్టు సరిగ్గా చదవలేదు, ఫెయిలయిపోతాను’ అంటూ అమ్మ ఒళ్లో తల పెట్టుకుని భోరుమని ఏడుస్తుంటే, ‘ఊరుకో చిన్నా, ముందు కాసేపు ప్రశాంతంగా నిద్రపో’ అంటూ తన ఒళ్లో నన్ను నిద్రబుచ్చి, రెండుగంటల తర్వాత ‘చిన్నా, ఇంక మేలుకోమ్మా’ అంటూ నా చేతిలో కాఫీ పెట్టి నేను చదువుకుంటున్నంతసేపూ నాతో పాటే తనూ ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోవడమే కాకుండా, ఆ మరుసటి రోజు నన్ను వెంటబెట్టుకుని కాలేజీ వద్ద దిగబెట్టి, నేను పరీక్ష రాసి బైటకి వచ్చేదాకా కాలేజీ గేటు పక్కనే నా కోసం ఓపిగ్గా ఎదురుచూస్తూ నిలుచున్న అమ్మ!సివిల్ సర్వీసెస్ ఎంట్రన్స్లో నెగ్గాక ఇంటర్వ్యూ ముందు రోజున ‘అమ్మా బోర్డులో ఎలాంటి ప్రశ్నలు వేస్తారో ఏమో’ అని నేను భయపడుతుంటే, ‘ఏడాది పాటు ఒకే లక్ష్యంగా, అకుంఠిత దీక్షలా, అహర్నిశలూ చదివిన నీకు ఈ ఇంటర్వ్యూ ఒక లెక్కా? అంతా సవ్యంగానే జరుగుతుంది, ధైర్యంగా వుండమ్మా’ అంటూ నాపై నాకు నమ్మకాన్ని పెంచిన అమ్మ! ఐఏఎస్కి సెలక్టయి ట్రైనింగ్కి వెళ్ళాక ‘అమ్మా, ఇక్కడ అంతా నార్త్ ఇండియన్సే వున్నారు. వాళ్ళతో నేను కలవలేక పోతున్నాను. హాస్టల్లో భోజనం కూడా అస్సలు బావుండడం లేదు. పుల్కాలు, మసాలా కూరలూ తినలేక పోతున్నాను’ అంటూ ఫోన్లో నా కష్టాలని ఏకరువు పెట్టిన పదిహేను రోజుల్లోనే ఆవకాయ, మాగాయ జాడీలు పట్టుకుని నా దగ్గరకు వచ్చేసి, నా ట్రైనింగ్ పూర్తయ్యేదాకా నాకు వండి పెడుతూ, నా దగ్గరే ఉండిపోయి, వచ్చీరాని హిందీలో అక్కడ అందరితో మాట్లాడుతూ వాళ్లకి మన వంటలనీ, ఆప్యాయతనీ రుచి చూపిస్తూ మెల్లిమెల్లిగా వాళ్లందరినీ నాకు ఫ్రెండ్స్ని చేసేసిన అమ్మ! ‘అమ్మా, ఎప్పుడూ నా తోడూనీడగా ఉండేదానివి. ఇలా ఉన్నట్టుండి నన్ను ఒంటరిని చేసి ఎందుకు వెళ్ళిపోయావమ్మా? లేమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా. నన్ను ఒక్కసారి చిన్నా అని పిలువమ్మా’ అంటూ పెద్దగా ఏడ్చేస్తున్నాను.∙∙ ‘‘అమ్మా, అమ్మా’’ అంటూ పిల్లలు గట్టిగా కుదుపుతుంటే ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను.ఎదురుగా చేతిలో పుష్పగుచ్ఛం పట్టుకుని మా పిల్లలు మన్వి, తన్వి.‘ఏమిటి సిరీ, అత్తయ్యగారుగాని మళ్ళా కలలోకి వచ్చారా?’ అన్న మావారి మాటలకు అవునన్నట్టుగా తలుపాను.పిల్లలిద్దరూ కలిసి నా చేతిలో పుష్పగుచ్ఛం పెట్టి ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అంటుంటే వాళ్లవైపు నిరాసక్తంగా చూశాను. దాంతో పిల్లల్లోని ఉత్సాహం అంతా నీరు కారిపోవడం గమనించిన మా వారు వెంటనే ‘మీరు వెళ్లి హాల్లో ఏర్పాట్లు చేస్తుండండి. నేను అమ్మని తీసుకొస్తాను’ అని చెప్పి వాళ్ళని పంపించారు.‘అలాగే డాడీ’ అంటూ పిల్లలు హాల్లోకి వెళ్ళాక ‘ఇప్పుడు ఈ వేడుకలు ఎందుకండీ’ అంటున్న నన్ను మధ్యలోనే ఆపేసి, ‘అత్తయ్యగారు పోయి ఇంతకాలమైనా నువ్వింకా ఇలాగే ఉంటే ఎలా సిరీ? రోజుల తరబడి నువ్విలా నిస్తేజంగా ఉంటుంటే నిన్ను చూసి పిల్లలు ఎంత బెంగ పడుతున్నారో నీకేమైనా తెలుస్తోందా అసలు?’ అన్న ఆయన మాటలకి నాలో కోపం ఉవ్వెత్తున పొంగుకొచ్చింది.‘అదేమిటండీ, అలా మాట్లాడతారు? పోయింది ఎవరో దూరపు బంధువు కాదు, మా అమ్మ. ఆవిడతో నాకున్న అనుబంధం తెలిసీ మీరిలా...’ అంటుంటేనే నా గొంతు గద్గదమైంది.అది చూసి మా వారు తగ్గిపోయారు.‘నిన్ను బాధపెట్టాలని కాదు సిరీ. నిజమే, తల్లి లేని లోటు ఎవరూ తీర్చేది కాదు. అలాగని నీ విధుల్ని నువ్వు మర్చిపోకూడదు కదా! నీపై ఆధారపడ్డ ఒక కుటుంబం ఉంది. నువ్వు ఇద్దరు పిల్లలకి అమ్మవి, నాకు భార్యవి’ అన్నారు.‘మీకు చేయవలసిన వాటిలో నేను ఏ విధమైన లోటు చేశానండీ? మనసులో బాధ పొంగి పొర్లుతున్నా వేళకి అందరికీ అన్నీ అందిస్తూనే ఉన్నానుగా’ ఉక్రోషంగా అన్నాను.‘నిజమే, అన్నీ చేస్తూనే ఉన్నావు. కాని, ఇలా మొహంలో కళాకాంతులు లేకుండా, జీవితంలో సర్వం కోల్పోయినదానికి మల్లే తిరుగుతున్న నిన్ను చూసి పిల్లలు కూడా దిగాలుగా, మొహాలు వేళ్ళాడేసుకుని వుంటున్నారు. వాళ్ళల్లో హుషారు రోజురోజుకీ తగ్గిపోతుందన్న విషయం నువ్వు గమనించావా? అయినా పుట్టినరోజు పూట మన మధ్య ఇటువంటి వాదనలు వద్దుగాని, నీకోసం పిల్లలిద్దరూ కలిసి నీ పుట్టినరోజుని ప్రత్యేకంగా చేసి నిన్ను సంతోషపెట్టాలని చూస్తున్నారు సిరీ. నీకోసం ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉంచారు. నువ్వు కాదంటే వాళ్ళు బాధపడతారు, పద’ అంటూ హాల్లోకి తీసుకెళ్లారాయన.అక్కడ టేబుల్పైన అందంగా అలంకరించిన కేకు, క్యాండిల్స్, ఇంకా రకరకాల గిఫ్టులు.వాటిని చూసిన నా మొహం విప్పారలేదు. ఎందుకంటే, పుట్టినరోజు అనగానే నాకు ముందుగా గుర్తుకొచ్చేది అమ్మే! నెలరోజుల ముందునుండే పిల్లలకి ఫోన్ చేసి, ‘పిల్లలూ, ఈసారి అమ్మ పుట్టినరోజు ఎలా చేస్తున్నారూ, అమ్మకి ఏం బహుమతులిస్తున్నారూ’ అంటూ హడావిడి చేస్తూండేది అమ్మ! ఇంక ఆరోజునైతే అందరికంటే ముందే ఫోన్ చేసి, ‘చిన్నా, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. నా ఆయుష్షు కూడా పోసుకుని పదికాలాల పాటు చల్లగా ఉండు చిట్టితల్లీ’ అంటూ ఆశీర్వదించేది. అలాంటి అమ్మ లేని పుట్టినరోజు పండుగా, ఒక పండుగేనా ! అమ్మ ఆశీస్సులతో మొదలయ్యే వేడుకని అమ్మ లేకుండా జరుపుకోవడం నాకేమాత్రం ఇష్టం లేకున్నా, ఆయన చెప్పినట్టుగా పిల్లల మనసుల్ని కష్టపెట్టకూడదన్న ఉద్దేశంతో కేకు కట్ చేసి పిల్లలకీ, ఆయనకీ నా చేత్తో తినిపించాక, నిర్లిప్తంగా వంటింట్లోకి నడవబోతుంటే, ‘ఉండమ్మా, అసలైన సర్ప్రైజ్ పైనుంది, రా’ అంటూ పిల్లలిద్దరూ నా చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లారు. మాది రెండంతస్తుల మేడ. పై అంతస్తులో మేమంతా క్రికెట్ మ్యాచ్లూ, సినిమాలూ చూసే హోమ్ థియేటర్ ఉంది.అక్కడ స్విచ్ ఆన్ చేయగానే చిరునవ్వుతో కనిపించిన అమ్మని అబ్బురంగా చూస్తుండిపోయాను.‘చిన్నా, ఎలా ఉన్నావురా? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నిండునూరేళ్లు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడపాలన్నదే నా ఆకాంక్ష’ అన్న అమ్మ మాటలకి నాలో ఆనందం పరవళ్ళు తొక్కింది.శివసాన్నిధ్యాన్ని చేరుకున్న అమ్మ ఇలా నా ఎదురుగా నిలుచుని ఎలా మాట్లాడగలుగుతోందో అర్థంకాక నేను తెల్ల మొహం వేస్తే, పిల్లలిద్దరూ ముసిముసిగా నవ్వుతూ, ‘ఇంకా ఉంది చూడమ్మా’ అన్నారు.దాదాపు గంట నిడివి ఉన్న ఆ త్రీడీ వీడియోలో అమ్మతో నా మధురస్మృతులని పొందుపరచిన ఎన్నో ఫొటోలు, మేమిద్దరం కలిసి వెళ్లిన టూర్లలో, ఫంక్షన్లలోని చిన్న చిన్న వీడియో క్లిప్పింగులు, అక్కడక్కడ అమ్మ స్వయంగా తన గళంతో చెబుతున్న కబుర్లూ!అదంతా చూశాక చెప్పలేనంత ఆనందంతో నా మనసు నిండిపోయింది. ఇన్నాళ్ళుగా నా హృదయాన్ని కలచివేస్తున్న బాధంతా ఒక్కచేత్తో తీసేసినట్టుగా బుగ్గలపై నుండి జాలువారుతున్న అశ్రువులను తుడుచుకుంటూ ‘ఎప్పుడు చేశారమ్మా ఇవన్నీ?’ అని నేను అడుగుతుంటే మా వారు నా వెనక నుండి ముందుకొచ్చి, ‘దాదాపు నెలరోజుల పైనుండి పిల్లలు ఎంతో కష్టపడి ఈ వీడియోని తయారు చేశారు. ఇప్పుడొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకా త్రీ డీ టెక్నాలజీ సాయంతో అత్తయ్యగారు నీ ఎదురుగా నిలబడి, నీతో మాట్లాడుతున్నట్టుగా వీడియో క్లిప్పింగులు, స్పెషల్ ఎఫెక్ట్లు జత చేసి తయారుచేశారు. ఇదంతా కూడా నిన్ను ఆనందపెట్టాలన్న తపనతో చేశారు వాళ్ళు. అలాంటిది, నువ్విలా ఏడుస్తుంటే ఎలా చెప్పు?’ అంటూ తన చేత్తో నా కన్నీళ్ళని తుడిచారు.‘ఇవి కన్నీళ్ళు కావండీ, ఆనందభాష్పాలు. నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళేగా వచ్చేది’ అంటూ పిల్లలిద్దరినీ దగ్గరికి రమ్మన్నట్టుగా చేత్తో పిలవడం ఆలస్యం, మొహాలు చాటంత చేసుకుని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారిద్దరూ.వాళ్ళ నుదుటిన ముద్దాడుతూ, ‘థాంక్యూ సో మచ్ బుజ్జి కన్నలూ. మీ అమ్మమ్మకి తిరిగి ప్రాణం పోసి నా కళ్ళ ముందు నిలిపారు’ అన్నాను.నా మాటలకి వాళ్ళ మొహాలు మతాబుల్లా వెలిగిపోగా ‘అక్కా, ఎన్ని రోజులయింది కదా అమ్మ మనల్ని ఇలా ‘బుజ్జికన్నలూ’ అని పిలిచి’ అన్న మన్వి మాటలకి ‘అవును తన్వీ, ఇంకా కొన్నాళ్ళయితే మనం ఆ పిలుపే మర్చిపోయేవాళ్ళమేమో’ అంది తన్వి.ఆ మాటలు వింటుంటే ‘అయ్యో, నా నిరుత్సాహంతో పిల్లలని నేను ఇంత బాధపెట్టానా’ అనిపించింది. అదే మాట మా వారితో అనగానే, ఆయన వెంటనే ‘తల్లి పోతే బాధ ఉండడం సహజమే సిరీ. అందులోనూ నువ్వు ఆవిడ గారాల కూతురివి కాబట్టి ఆ బాధ నుండి బయటపడేందుకు నీకు మరింత సమయం కావాల్సి వచ్చింది, అది నేను అర్థం చేసుకోగలను. నిజానికి, మనుషులు చనిపోవడం అంటే భౌతికంగా వాళ్ళు ఇక్కడ మనతో లేకపోవడం. అంతే! వాళ్లతో మనకున్న అనుబంధమూ, వారి జ్ఞాపకాలూ ఎప్పుడూ సజీవంగానే ఉంటాయి, వాటికి మరణం లేదు. కాబట్టి మనం ఇక్కడ ఉన్నంతకాలం వారు వదిలి వెళ్ళిన ఆ మధురస్మృతులని నెమరేసుకుంటూ మనసులో మరింత ఆనందాన్ని పోగేసుకుంటూ, వాటిని తరగని ఆస్తిగా మలచుకుని రాబోయే తరాలకి అందివ్వాలే తప్ప, వాళ్ళు మన మధ్యన లేరన్న విషయాన్ని అదేపనిగా తలుచుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు’ అన్నారు.ఆయన చెబుతున్నదాన్ని శ్రద్ధగా వింటున్న నాకు, ఆ మాటల్లో ఆ క్షణాన ఏదో అంతర్లీనమైన సందేశం వున్నట్టనిపించింది.∙∙ ఆ మరుసటి రోజున మన్వి స్కూల్కీ, ఇంకా తన్వి దాని స్నేహితురాలి ఇంటికీ వెళ్ళాక అమ్మతో కలిసి దిగిన ఫొటోలున్న ఆల్బమ్స్ అన్నింటినీ మంచంపై పరచుకుని తీరిగ్గా ఒక్కో ఫొటో తిరగేయసాగాను. ప్రతి ఫొటో వెనకా మరచిపోలేని అందమైన జ్ఞాపకాలు నా ఎదుట నిలిచి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ‘ఈ స్మృతులన్నింటినీ దృశ్యమాలికలుగా నిక్షిప్తం చేస్తే కలకాలం సజీవంగా వుంటాయి కదా’ అన్న ఆలోచన తళుక్కుమనగానే వెంటనే లేచి అల్మారాలో వున్న డిజిటల్ కెమెరాని బయటకి తీశాను.ఒక్కో ఫొటోపై కెమెరాని ఫోకస్ చేస్తూ ఆ ఫొటోకు సంబంధించిన సందర్భాన్ని చక్కటి మాటల్లో నాకు తోచినట్టుగా అర్థవంతంగా వివరించడం మొదలెట్టాను. అలా చేస్తూ ఎంతసేపున్నానో తెలియదు.కాలింగ్ బెల్ మోగడంతో లేచొచ్చి తలుపు తీస్తే ఎదురుగా మన్వి !‘అప్పుడే స్కూల్ అయిపోయిందా’ అంటూ గోడగడియారం వైపు చూసి, ‘అమ్మో, సాయంత్రం నాలుగు గంటలు దాటింది. పనిలో పడి టైం చూసుకోలేదు. మీకోసం నేనింకా టిఫిన్ కూడా తయారు చేయలేదు’ అని నేను కంగారుపడుతుంటే తన్వి కూడా లిఫ్ట్ తలుపు తెరుచుకుని రావడం కనిపించింది.దాంతో ‘కాళ్ళూ చేతులూ కడుక్కురండి. ఈలోగా నేను మీకోసం స్నాక్స్ చేస్తాను’ అంటూ గబగబా వంటింట్లోకి నడిచాను.ఫ్రిజ్లో నుంచి దోసెపిండిని బయటకి తీసి, ఉల్లిపాయలూ, పచ్చి మిరపకాయలూ సన్నగా తరిగి కలిపి వాటితో వేడి వేడిగా పొంగనాలు వేసి ప్లేట్లలో సర్ది హాల్లోకి తీసుకోచ్చేటప్పటికి అక్కడ నేను పరిచిన ఫొటోలని తదేకంగా చూస్తూ కనిపించారు పిల్లలు.నా చేతుల్లో నుండి టిఫిన్ ప్లేట్లు అందుకుంటూ ‘అమ్మా, ఈ ఫొటోల్లో అమ్మమ్మ ఎంత చిన్నగా, సన్నగా వుందో! అన్నట్టు, కెమెరాతో ఏం చేస్తున్నావు నువ్వు? ఈ ఫొటోలని డిజిటలైజ్ చేస్తున్నావా?’ అని అడిగిన పిల్లలకి నేనేం చేస్తున్నదీ వివరించాను.‘నువ్వు బ్యాక్ గ్రౌండ్లో ఉంటూ నీ గొంతు మాత్రమే వినిపించేకంటే, నువ్వు కూడా ఫొటో పక్కనే కనిపిస్తుంటే బాగుంటుంది కదమ్మా! ఫొటోని చూపిస్తూ నువ్వు మాట్లాడుతుంటే నేను వీడియో తీస్తాను’ అంది ఫొటోగ్రఫీ మీద మక్కువున్న నా చిన్నకూతురు మన్వి.‘మన్వి చెప్పింది బావుందమ్మా. ఎప్పటికప్పుడు ఒక వీడియో అయిపోగానే అది నాకు ఇచ్చేశావంటే నేను దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెరుగులు దిద్దుతాను’ అంది ఇంజినీరింగ్ చదువుతున్న నా పెద్ద కూతురు తన్వి. ఆ వెంటనే ‘నేను ఎలాగో నెలరోజుల తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి కదా. అక్కడ ఈ వీడియోలని చూసుకుంటే నువ్వు నా దగ్గరే ఉన్నట్లుగా ఉంటుంది’ అని కూడా అంది.దాని మాటలకి ఆలోచనలో పడ్డాను.‘పిచ్చిపిల్ల, ఇప్పుడైతే హాస్టల్లో దూరంగా ఉంది కాబట్టి అమ్మని తన దగ్గరే చూసుకోవాలని అనుకుంటోంది, అదే ఆ తర్వాత, మా అమ్మలాగే నేనూ ఈ లోకాన్ని వీడిపోయాక? ఎప్పుడోకప్పుడు నేను కూడా వెళ్ళిపోవలసిన దాన్నేగా! ఎవరి ఆయుష్షు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు?’నా మనసు పరిపరివిధాలు పోసాగింది.‘తన్వి మనసు చాలా సున్నితం. చిన్న చిన్న వాటికే బెంగ పెట్టేసుకుంటుంది. నేను ఎప్పుడైనా ఆఫీసు పనిపై ఊరు వెళ్ళవలసి వస్తే నాలుగురోజుల ముందునుండే దిగులు పడుతుండేది. ఇంజనీరింగులో చేరి సంవత్సరంన్నర దాటినా ఇంకా దానికి హోం సిక్నెస్ పోలేదు. సెలవులకి ఇక్కడి వచ్చీ తిరిగి వెళ్ళిపోయే రోజున చాలా అయిష్టంగా హాస్టల్కి వెళ్తుంది. ఇంక మన్వికైతే ఇంకా చిన్నతనం పోలేదు. పసిపిల్లకి మల్లే మారాం చేస్తుంటుంది నా దగ్గరా, వాళ్ళ అక్క దగ్గరా! నేను కాస్త దిగులుగా ఉంటేనే తట్టుకోలేని ఈ పిల్లలు నేను ఏకంగా ఈ లోకాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతే, ఆ బాధని తట్టుకోగలరా? మా అమ్మని తలచుకుంటూ నేను ఇంతలా బాధపడుతున్నాను కదా, మరి నేను వెళ్లిపోయాక నా పిల్లలూ నాలాగే నా గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో! అమ్మో, అలా అస్సలు కాకూడదు’అలా అనుకోగానే నా మదిలో చటుక్కున ఒక ఆలోచన అంకురించింది .‘నేను పోయాక, ఆ బాధ నుంచి పిల్లలు త్వరగా కోలుకునేందుకుగానూ వాళ్ళతో వర్తమానంలో నాకున్న అనుబంధం గురించే కాకుండా, భవిష్యత్తులో వాళ్లకి ఎదురయ్యే వివిధ సమస్యలకి నా అనుభవంతో నేను ఇచ్చే సలహాలనీ, సూచనలనీ నా మాటలతో వివరించే వీడియోలను చేస్తే, అవి పిల్లలకి సాంత్వనని కలిగించడమే కాకుండా ముందుముందు వాళ్లకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి.’అలా అనుకున్నాక నా మనసు కాస్త ఊరటపడింది. ∙∙ ఆ రాత్రి నా ఆలోచనని ఆయన ముందుంచుతూ ‘యాభైఏళ్లకే నేనిలా ఆలోచించడం అశుభం అంటారా? నా ఆలోచనా విధానంలో లోపం ఉందంటారా, నేను నెగటివ్గా ఆలోచిస్తున్నానంటారా?’ అని అడిగాను.‘అదేం లేదు సిరీ. జీవితం క్షణభంగురం. ఎవరికైనా సరే నుదుటిన రాసిపెట్టి ఉన్నంత కాలమే ఈ పృథ్విపై స్థానం ఉంటుంది. పోయిన వాళ్లతో కలిసి మనమూ పోలేము కాబట్టి వాళ్ళతో పంచుకున్న అనుభూతులని పదిలపరుచుకోవడమూ, అలాగే మనమూ ఎల్లకాలమూ ఇక్కడ ఉండబోమన్న అవగాహనతో మన పిల్లలతో ముడిపడి వున్న బాంధవ్యాన్ని పదిలంగా భద్రపరుచుకోవడమూ చక్కటి ఆలోచనే. కాబట్టి మనసులో ఏ శంకలూ పెట్టుకోకుండా గో ఎహెడ్. అలాగే నువ్వు కూడా ఇంక ఆఫీసుకి వెళ్ళడం మొదలెడితే కాస్త త్వరగా మనుషులలో పడతావు. నీ చదువు, ఉద్యోగం వెనకాల అత్తయ్యగారి ప్రోత్సాహం అంతా ఇంతా కాదనీ, ఆవిడే లేకపోతే జీవితంలో నువ్వేమీ సాధించలేకపోయే దానివనీ నాతో నువ్వే చాలాసార్లు చెప్పావు. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఈ లోకంలో లేదన్న బాధతో నువ్వు నీ శక్తిసామర్థ్యాలని కుదించేసుకుని ఇలా ఇంట్లోనే ఉండిపోతే ఆవిడ ఆత్మ ఎంత క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించు. ఇకనైనా నీ సెలవుని రద్దు చేసుకుని ఆఫీసులో చేరిపోయి మనుషుల్లో పడేందుకు ప్రయత్నం చేయి సిరీ’ ఆయన మాటలతో నా ఆలోచనకి బలం కలగడమే కాకుండా నా కర్తవ్యం కూడా నాకు బోధపడింది..∙∙ ఆ మరుసటి సోమవారమే ఆఫీసులో చేరిపోయాను. ఇంక అప్పటి నుంచి తీరిక సమయాల్లో అమ్మతో, పిల్లలతో ఇంకా మావారితోనూ నా అనుబంధాన్ని దృశ్యమాలికలుగా మలుస్తూ , మా అమ్మ జ్ఞాపకాలకి ప్రాణం పోస్తూ ఆవిడ ఈలోకంలో లేదన్న బాధనుంచి మెల్లిమెల్లిగా తేరుకోవడం మొదలెట్టాను. దాంతో, మావారూ హ్యాపీ, పిల్లలూ హ్యాపీ, వెరసి కుటుంబమంతా హ్యాపీ. కాలం అన్ని గాయాలనీ మాన్పుతుంది. నిజమే కాని, దానికి మనవంతు కృషి మనమూ జోడిస్తే గాయం కాస్త త్వరగా నయమవుతుంది కదూ! -
డ్రోన్.. స్టార్టప్లు పెరిగెన్
డ్రోన్స్ .. ఇటీవలి కాలంలో ఈ మానవ రహిత విమానాలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆపరేషన్ సిందూర్, రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో వీటిపట్ల జనంలో ఆసక్తి పెరిగింది. రక్షణ రంగం, ఈ–కామర్స్, వ్యవసాయం, ఆరోగ్యం వంటి విభిన్న రంగాల్లో కొత్త అవకాశాలను డ్రోన్స్ స్టార్టప్స్ అందిపుచ్చుకుంటున్నాయి. మరోపక్క ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఈ స్టార్టప్ల ఏర్పాటులో ముందుంటున్నారు. ఈ కంపెనీలకు ఉన్న అపార అవకాశాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇబ్బడిముబ్బడిగా పెట్టుబడుల వరద పారిస్తున్నారు. డ్రోన్ కంపెనీలు గత ఏడాది స్వీకరించిన నిధులు రెండింతలు అయ్యాయంటే భవిష్యత్ అవకాశాలను అంచనా వేయొచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో డ్రోన్ టెక్నాలజీ స్టార్టప్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నాయి. మార్కెట్లో విస్తరించడంతోపాటు సాంకేతిక సామర్థ్యాలూ పెంచుకుంటున్నాయి. ప్రస్తుతం భారత డ్రోన్ తయారీ రంగంలో 506 కంపెనీలు నిమగ్నమయ్యాయి. ఈ రంగంలోని టాప్–100 స్టార్టప్స్లో సంఖ్య పరంగా బెంగళూరు ముందంజలో ఉంటే.. ఈ కంపెనీలను స్థాపించిన వ్యవస్థాపకుల్లో అత్యధికులు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో (ఐఐటీ) చదివిన విద్యార్థులు కావడం విశేషం. ప్రపంచంలో అత్యధిక డ్రోన్ స్టార్టప్లు అమెరికాలో ఉంటే తరవాత మనదేశంలోనే ఉన్నాయి. అలాగే ఈ పదేళ్లలో ఈ రంగంలో అత్యధిక ఫండింగ్ అందుకున్న దేశాల్లో మనది నాలుగో స్థానం.బెంగళూరు టాప్..డ్రోన్ ్స రంగంలో దేశంలో 2018లో అత్యధికంగా 61 కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. ఆ తర్వాతి సంవత్సరం ఈ సంఖ్య 54గా నమోదైంది. 2020లో 59 కంపెనీలు రంగ ప్రవేశం చేశాయి. టాప్–100 కంపెనీల్లో బెంగళూరు నుంచి 24, హైదరాబాద్ 11, ముంబై 11, ఢిల్లీ 10, చెన్నై 8, నోయిడా నుంచి 8 కొలువుదీరాయి. ఇక డ్రోన్ కంపెనీల స్థాపకుల్లో ఐఐటీ బాంబే 18 మంది, ఐఐటీ కాన్పూర్ నుంచి 14 మంది, బిట్స్ పిలానీ విద్యార్థులు 12 మంది ఉన్నారు. ప్రపంచంలో డ్రోన్ స్టార్టప్స్ను అందించిన టాప్ – 10 విద్యాసంస్థల్లో మనదేశానివి 3 ఉండటం విశేషం.వెన్నుతడుతున్న ప్రభుత్వం..ప్రభుత్వ అనుకూల విధానాలు, వివిధ రంగాలలో డ్రోన్స్ డిమాండ్ పెరగడం, ఆవిష్కరణలు.. ఈ రంగానికి కలిసి వచ్చే అంశాలు. వ్యవసాయం, మౌలిక సదుపాయాల రంగం మొదలు దేశ రక్షణ అవసరాలు, విపత్తుల సమయంలో వాడకం వరకు డ్రోన్ వినియోగ పరిధి విస్తరిస్తుండడం జోష్నిస్తోంది. 2021లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్ నియమాలు ముఖ్యంగా.. అనుమతుల సంఖ్య, పత్రాలు, రుసుముల తగ్గింపు మొదలు ఆన్ లైన్ సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు వంటివి ఈ రంగం పురోభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నాయి.నిధులు వెల్లువెత్తాయి..దశాబ్ద కాలంలో భారతీయ డ్రోన్ కంపెనీల్లోకి రూ.4,882 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. 2016లో రూ.38.6 కోట్ల నుంచి 2024 నాటికి రూ.2,119 కోట్లకు ఎగిశాయి. అంటే ఏకంగా 5,389% వృద్ధి నమోదైందన్న మాట. 2020 నుంచి ఫండింగ్ ఊపు మీద ఉంది. 2023తో పోలిస్తే గతేడాది ఈ పెట్టుబడుల రాక రెండింతలకుపైగా పెరిగింది. 2025లో జూన్ 4 నాటికి సుమారు రూ.335 కోట్ల నిధులను డ్రోన్ కంపెనీలు అందుకున్నాయి. ఐఐటీ ఢిల్లీ విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టార్టప్స్లో అత్యధికంగా దశాబ్ద కాలంలో రూ.927 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి. ఆ తర్వాతి స్థానాల్లో ఐఐటీ బాంబే, ఐఐఎం కలకత్తా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఐఐటీ కాన్పూర్ విద్యార్థుల స్టార్టప్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు బాగా రాణిస్తుండటం, మరికొన్ని సాంకేతికత పరంగా మెరుగ్గా ఉండటం తదితర కారణాలతో.. ఈ రంగంలోని 12 కంపెనీలు చేతులు మారాయి. నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించాయి. -
చాట్ జీపీటీ వాడకంలో.. భారత్ నంబర్ 1
వాడకం అంటే మనవాళ్లదే. రెండేళ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన ‘చాట్జీపీటీ’ భారతీయులకు అత్యంత ఇష్టమైన యాప్గా అవతరించింది. చాట్జీపీటీ వినియోగంలో ప్రపంచంలో 13.5% మంది యూజర్లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాను కూడా వెనక్కి నెట్టి ఔరా అనిపించింది. చాట్జీపీటీ వినియోగదారుల సంఖ్య భారత్లో 10.8 కోట్లకు చేరుకుంది. దీన్ని బట్టి భారతీయుల జీవితాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎలా మమేకం అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, స్పెషల్ డెస్క్టెక్నాలజీ వాడకంలో మనవాళ్లను కొట్టేవారే లేరని మరోసారి నిరూపితమైంది. చాట్జీపీటీ యూజర్లలో భారతీయులు నంబర్వన్గా నిలిచారు. అమెరికా కూడా మన తరవాతే ఉంది. యూఎస్ వాటా 8.9% మాత్రమే. ఇండోనేసియా 5.7, బ్రెజిల్ 5.4, ఈజిప్ట్ 3.9, మెక్సికో 3.5, పాకిస్తాన్ 3, జర్మనీ 3, ఫ్రాన్స్ 2.9, వియత్నాం 2.6% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఏఐ ఆధారిత ఈ చాట్బాట్ సాంకేతిక నిపుణులకు మాత్రమే పరిమితం కాలేదు. విద్యార్థులు, కంటెంట్ క్రియేటర్స్కు తోడు సామాన్యులూ మన దేశంలో తెగ వాడేస్తున్నారు. హోంవర్క్లో సహాయం, మనసుకి నచ్చిన వారికి సందేశం, కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, కంటెంట్ క్రియేషన్ .. అవసరం ఏదైనా అమెరికన్ కంపెనీ రూపొందించిన ఈ చాట్బాట్ వేగంగా భారత్లో విస్తరిస్తోందని క్వీన్ ఆఫ్ ది ఇంటర్నెట్గా ప్రసిద్ధి చెందిన విశ్లేషకురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్ మేరీ మీకర్ తన ‘2025 ఏఐ ట్రెండ్స్’ నివేదికలో తెలిపారు. అంతేగాక చైనా తయారీ ఏఐ చాట్బాట్ ‘డీప్సీక్’ వినియోగంలోనూ భారతీయులు మూడో స్థానంలో నిలిచారు. ప్రపంచ వినియోగదారుల్లో 6.9 శాతం మంది మనదేశం నుంచే ఉన్నారు. 33.9% వాటాతో చైనా, 9.2%తో రష్యా టాప్–2లో ఉన్నాయి. డీప్సీక్ మొత్తం వినియోగదార్ల సంఖ్య 5.4 కోట్లు.తెలుగులోనూ వినియోగం..ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరగడం, బలమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిశ్రమ, డిజిటల్ పరివర్తనకు ప్రభుత్వ మద్దతు, ప్రాంతీయ భాషలపై దృష్టి పెట్టడం వంటి వివిధ అంశాలు ఏఐ వినియోగంలో ఈ పెరుగుదలకు కారణమని నివేదిక వెల్లడించింది. చాట్జీపీటీ తెలుగు, హిందీ, మలయాళం, తమిళం వంటి అనేక భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. అంటే మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుగులోనూ అందిస్తుందన్నమాట. స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరల్లో లభించడం, ఇంటర్నెట్ వేగం దూసుకెళ్లడం కూడా చాట్జీపీటీ వాడకం అధికం కావడానికి ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. రోజుకు 100 కోట్లకుపైగా..చాట్జీపీటీ వేదికగా రోజుకు 100 కోట్లకుపైగా సర్చెస్ నమోదవుతున్నాయంటే నోరెళ్లబెట్టాల్సిందే. వార్షిక సర్చెస్ 36,500 కోట్లకు చేరుకోవడానికి గూగుల్కు 11 ఏళ్ల సమయం పడితే.. చాట్జీపీటీ ఈ మైలురాయిని 5.5 రెట్లు వేగంగా రెండేళ్లలోనే అందుకుంది. 2022 నవంబర్ 30న రంగ ప్రవేశం చేసిన చాట్జీపీటీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వినోదం, ఆటల కోసం కాకుండా నేర్చుకోవడానికి, రాయడానికి, కోడింగ్ కోసం, కంటెంట్ క్రియేట్ చేయడానికి దీనిని ఉపయోగిస్తున్నందున ప్రజాదరణ విపరీతంగా పెరిగింది. చాట్జీపీటీకి అంతర్జాతీయంగా 80 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లున్నారు. 21 నెలల క్రితంతో పోలిస్తే చాట్జీపీటీ యాప్లో మూడు రెట్లు ఎక్కువ సమయాన్ని యూజర్లు వెచ్చిస్తున్నారు. చెల్లించేందుకూ సిద్ధం..ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చాట్జీపీటీ పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగి 2 కోట్లు దాటింది. ఈ సంఖ్య సంవత్సరానికి 153 శాతం చొప్పున దూసుకెళుతోంది. ఈ ప్లాట్ఫామ్ మాతృ సంస్థ అయిన ఓపెన్ ఏఐకి పెద్ద మొత్తంలో ఆదాయ వనరుగా అవతరించింది. ఏడాదిలోనే ఈ మొత్తం పది రెట్లు పెరిగింది. చాట్బాట్ ఒక్కటే కంపెనీకి ఏటా రూ.31,709 కోట్ల ఆదాయాన్ని అందిస్తోంది. ఎక్కువ మంది యూజర్లు మెరుగైన ఫీచర్ల కోసం చెల్లించేందుకు వెనుకాడడం లేదు. డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం..ఏఐ జోరులో భారత్ అగ్రగామిగా కొనసాగుతుందనడంలో సందేహం లేదు. ఈ ధోరణి కారణంగా దేశం నుంచి మరిన్ని ఏఐ స్టార్టప్లు ఉద్భవించడానికి దారితీసే అవకాశం ఉంది. డెస్క్టైమ్ అధ్యయనం ప్రకారం 92.2% భారతీయ కార్యాలయాలు తమ రోజువారీ కార్యకలాపాలలో చాట్జీపీటీ వినియోగాన్ని అనుమతించాయి. చాట్జీపీటీని స్వీకరించడంలో అమెరికా కంటే భారత్ చాలా ముందుంది. యూఎస్ కార్యాలయాలలో 72.2% మాత్రమే చాట్జీపీటీని ఉపయోగిస్తున్నాయి. -
కోరేది కొండంత.. దాచేది పిసరంత!
సంపాదించుకోవాలి.. త్వరగా పదవీ విరమణ చేయాలి.. ఇదీ భారతీయ యువత ఆలోచన. ముఖ్యంగా 25 ఏళ్లలోపు వయసున్న ఉద్యోగుల్లో.. 43 శాతం మంది 45–55 సంవత్సరాలకే రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నారు. ముందస్తు పదవీ విరమణ కోరుకుంటున్నప్పటికీ 75% మంది తమ ఆదాయంలో కేవలం 1–15% మాత్రమే పెన్షన్ పథకాలకు కేటాయిస్తున్నారు. దేశంలో ప్రైవేటు రంగంలో పనిచేసేవారు, వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారిపై ప్రముఖ ప్రొఫెషనల్ సేవల సంస్థ ‘గ్రాంట్ థోర్న్టన్ భారత్’చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారిలో.. తమ పదవీ విరమణ తరువాత ఆశిస్తున్న ఆదాయానికి, వారి ఆర్థిక ప్రణాళికలకు మధ్య చాలా అంతరం ఉంది. అంటే రిటైర్ అయ్యాక ఆశిస్తున్న ఆదాయం ఎక్కువ.. కానీ అందుకు తగ్గట్టుగా చేయాల్సిన పొదుపు మాత్రం తక్కువ అన్నమాట. ‘ఇండియాస్ పెన్షన్ ల్యాండ్స్కేప్: ఏ స్టడీ ఆన్ రిటైర్మెంట్ రియాలిటీ అండ్ రెడీనెస్’పేరుతో ‘గ్రాంట్ థోర్న్టన్ భారత్’సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది.2024 ఆగస్టు–సెప్టెంబర్ మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా దీన్ని రూపొందించారు. ఇందులో పాల్గొన్నవారిలో 79 శాతం మంది వయసు 25–54 ఏళ్లలోపే. 88 శాతం మంది ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నవారు కాగా, 5 శాతానికిపైగా వ్యక్తిగతంగా ఉపాధి పొందుతున్నవారు. వీరిలో వార్షికాదాయం రూ.5–10 లక్షలు ఉన్నవారు 12.6 శాతం కాగా, రూ.10–20 లక్షల మధ్య ఉన్నవారు 25.25 శాతం. రూ.20–30 లక్షల మధ్య ఆదాయార్జనపరులు 27.25 శాతం. రూ.40 లక్షలకుపైన ఆదాయం ఉన్నవారు 30.23 శాతం.సంపాదన ఉన్నప్పటికీ..56% మంది సంవత్సరానికి రూ.20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పటికీ.. చాలా తక్కువ మందే పెన్షన్పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అధిక ఆదాయం సంపాదించేవారిలో 30% మంది నెలకు రూ.2 లక్షల కంటే ఎక్కువ పెన్షన్లు ఆశిస్తున్నారు. సంవత్సరానికి రూ.40 లక్షల కంటే ఎక్కువ సంపాదించేవారిలో 58% మంది పదవీ విరమణ కోసం వారి జీతంలో 1–15% మాత్రమే కేటాయిస్తున్నారు. రూ.20–30 లక్షల ఆదాయం ఆర్జించేవారిలో 75% మంది పెన్షన్కోసం తమ వేతనంలో 6–20% సమకూరుస్తున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో సగం మందికి అటల్ పెన్షన్ యోజన గురించి అవగాహన లేదు. పెన్షన్ మొత్తాలను ఎలా లెక్కిస్తారో 30% మందికి తెలియదు. ఆర్థిక అక్షరాస్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు చెబుతున్నాయి.రూ.లక్ష పెన్షన్ కావాలి55% మంది నెలకు రూ.లక్ష కంటే ఎక్కువ పెన్షన్ ఆశిస్తున్నారు. అయితే 11% మంది మాత్రమే తమ ప్రస్తుత పెట్టుబడులు ఈ అంచనాలను అందుకోవడానికి సరిపోతాయని నమ్ముతున్నారు. ప్రభుత్వ మద్దతు ఉన్న పెన్షన్ప్రణాళికల పట్ల సుమారు 39% మంది మొగ్గుచూపుతున్నారు. అధిక ముప్పు, అధిక రాబడి ఉన్న ప్రణాళికలు ముఖ్యంగా యువతను ఆకర్షిస్తున్నాయి. 25 ఏళ్లలోపు వారిలో 31% మంది ఈ పథకాలపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి నెలకు రూ.లక్ష పెన్షన్ పొందడానికి 30 ఏళ్ల వ్యక్తి 12% వార్షిక రాబడి, 6.75% యాన్యుటీ రేటును ఊహిస్తూ 60 సంవత్సరాల వయస్సు వరకు నెలకు రూ.6,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.సంప్రదాయ పెన్షన్..: 56% మంది 55–65 సంవత్సరాల మధ్య పదవీ విరమణ పొందాలని ఆలోచిస్తున్నారు. 45–50 ఏళ్ల మధ్య రిటైరైపోవాలని సుమారు 11 శాతం మంది చెప్పారు. 75% మంది తమ జీతంలో 15% లోపే పదవీ విరమణ పథకాలకు కేటాయిస్తున్నారు. అత్యధికులు ఇప్పటికీ సంప్రదాయ పెన్షన్ సాధనాలవైపే మొగ్గు చూపుతున్నారు. 35% మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఎంచుకుంటున్నారు.తరువాత గ్రాట్యుటీ, జాతీయ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) మీద ఆధారపడుతున్నారు. అయితే, గ్రాట్యుటీ మాత్రమే సరిపోదని 99% మంది భావిస్తున్నారు. 32% మంది మాత్రమే ఎన్పీఎస్ పనితీరుతో సంతృప్తి చెందారు. ఈపీఎఫ్కు ప్రజాదరణ ఉన్నప్పటికీ దాని పనితీరుపై కేవలం 46% మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) విషయంలో కూడా చాలా తక్కువ మందే ఆసక్తి చూపారు. పదవీ విరమణ తర్వాత స్థిర ఆదాయాన్ని అందించడంలో మంచివే అయినప్పటికీ 76% మంది యాన్యుటీ పథకాలలో పెట్టుబడి పెట్టడం లేదని నివేదిక వివరించింది.పొంచి ఉన్న సంక్షోభం..: శ్రామిక జనాభా పెరుగుతున్న కొద్దీ ఆశిస్తున్న పదవీ విరమణ అవసరాలు, వాస్తవ పొదుపుల మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని తగ్గించడానికి వ్యక్తుల జీవిత అవసరాలకు అనుగుణంగా ఉండే బలమైన పెన్షన్ వ్యవస్థ అవసరం. అత్యధికులు తమ గ్రాట్యుటీ మొత్తాలు సరిపోవని భావిస్తున్నారు. తక్కువ వార్షిక పెట్టుబడుల రేటు కారణంగా పదవీ విరమణ తర్వాత వచ్చే హామీ ఆదాయం విషయంలో అనిశ్చితి ఉంది. బలమైన ఆర్థిక విద్య, మరింత ఆకర్షణీయమైన పెన్షన్ ఉత్పత్తులు, అధిక పొదుపులను ప్రోత్సహించడానికి విధాన పరమైన సంస్కరణలు రాకపోతే రాబోయే దశాబ్దాలలో పదవీ విరమణ పొందిన వ్యక్తుల కుటుంబాల్లో సంక్షోభం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పచ్చని కాపురాల్లో... వివాహేతర చిచ్చు
వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. తమ బంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో ఏకంగా హత్యలదాకా వ్యవహారం వెళ్తోంది. ఇలాంటి ఘటనల్లో ఎక్కువగా బాధితుల బిడ్డలు అనాథలుగా మారుతుండటం అందరినీ కలవరపెడుతోంది. ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. » సత్యసాయి జిల్లా దర్మవరం మండలం పోతుకుంట గ్రామానికి చెందిన ఓ వివాహితకు రొద్దం మండలానికి చెందిన పురుషుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనుమానం వచ్చిన భర్త మంజునాథ్ నిత్యం వేధించసాగాడు. మధ్యలో అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి భార్య పన్నాగం పన్నింది. మద్యం మత్తులో ఉన్న భర్తను కిరాయి ఇచ్చి హత్య చేయించింది. గతేడాది జరిగిన ఈ ఘటనకు కారణాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఏడాది తర్వాత మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేయడంతో వాస్తవాలు వెలుగు చూశాయి. » సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో గతేడాది ఎన్నికల సమయంలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించడమే దీనికి కారణంగా తేలింది. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో అమర్నాథ్రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఒకరికి తెలియకుండా మరొకరు వివాహేతర సంబంధం కొనసాగించారు. అయితే ఆర్థిక లావాదేవీల్లో తేడా రావడంతో శ్రీనివాసరెడ్డి మరికొందరితో కలిసి అమర్నాథ్రెడ్డిని హతమార్చాడు. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. సాక్షి, పుట్టపర్తి : రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడు అడుగులతో ముడిపడిందే భార్యాభర్తల బంధం. జీవితాంతం ప్రేమ, ఆప్యాయతలతో పాటు కష్టసుఖాలు, కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ ముందుకు సాగేదే సంసారం. ఈ పవిత్ర బంధం.. మనస్పర్థలు, అనుమానాలు, కుటుంబ కలహాలతో విచ్ఛిన్నం అవుతోంది. చిన్నపాటి మనస్పర్థల కారణంగా పరాయి వ్యక్తులతో చనువుగా పెరిగి.. సాన్నిహిత్యం ఏర్పడుతోంది. అదే వివాహేతర సంబంధాలకు దారి తీస్తోంది. అలాంటి సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఈ క్రమంలో కొంతమంది అడ్డు తొలగించుకునే క్రమంలో భర్తలను, ప్రియులను చంపేస్తున్నారు. ఫలితంగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. హత్య చేసి పరారీ అవుతుండటంతో చిన్నారులు ఎవరి దగ్గర ఉండాలో అర్థం కాక బాల్యంలోనే కార్మికులుగా మారి అష్టకష్టాలు పడుతున్నారు. అఘాయిత్యాలకు దారి తీస్తూ.. వివాహేతర సంబంధాలతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు పెరిగి అఘాయిత్యాలకు దారి తీస్తున్నాయి. ఇద్దరి మధ్యలోకి మరొకరు రావడంతో పరిస్థితులు నిమిషాల్లో మారిపోతున్నాయి. క్షణికావేశంతో హత్యలు, ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జైలుకు వెళ్లినా.. కనీసం బెయిల్ ఇప్పించేందుకు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో అలాంటి దంపతుల పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అంతేకాదు వివాహేతర సంబంధాలతో ఎలాంటి పరిణామాలు జరిగినా.. వారి కుటుంబ సభ్యులు సమాజంలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి నెలకొంది.కారణాలు ఎన్నెన్నో.. » పని ఒత్తిడితో జీవిత భాగస్వామికి సరైన సమయం కేటాయించకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. » చిన్న సమస్యలను పెద్దవిగా చూస్తూ.. పదే పదే చర్చించి.. తల్లిదండ్రుల వరకూ వెళ్లడం.. ఆ తర్వాత పోలీస్స్టేషన్ల మెట్లు ఎక్కుతున్నారు. » జీవిత భాగస్వాములు తాము చెప్పినట్లు వినలేదంటూ ఇద్దరిలో ఎవరో ఒకరు దారి తప్పి సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారు. » స్మార్ట్ఫోన్లను అతిగా వినియోగించి సోషల్ మీడియా పరిచయాలతో ప్రాణాల మీదికి తెచ్చుకోవడం. » మద్యానికి బానిసై ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని .. కుటుంబ పోషణ గురించి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం కూడా కారణమవుతోంది. సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య మనస్పర్థలు రావడం సహజమే. అయితే క్షణికావేశాలకు వెళ్లకుండా.. సామరస్యంగా ఇద్దరూ పరిష్కార మార్గం ఎంచుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివాహం జరిగిన కొత్తలో మనస్ఫర్థలు వచ్చినా.. వెంటనే సరిదిద్దుకోవాలి. అయితే ఇరవై ఏళ్ల దాంపత్య జీవితంలో కూడా ఇంకా సమస్యలు వెలుగు చూస్తుండటం అవగాహన లోపమే. దంపతులిద్దరూ పిల్లలు, కుటుంబ బాధ్యతల గురించి తెలుసుకుంటే ఎలాంటి మనస్పర్థలు రావు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలతో కుటుంబం రోడ్డున పడుతుంది. అంతేకాకుండా చిన్నారులు అనాథలుగా మారాల్సి వస్తోంది. – వి.రత్న, సత్యసాయి జిల్లా ఎస్పీ -
180 మీటర్ల రైడ్కు ఓలా!
రద్దీ ట్రాఫిక్లో త్రిచక్ర వాహనాలు, కార్లు రయ్మని దూసుకుపోవడం కష్టం. ఈ ట్రాఫిక్ కష్టాలను ద్విచక్ర వాహనాలు అంటే బైక్లు సులువుగా తగ్గిస్తాయి. ఇదే బాధతో ఒక కస్టమర్ సైతం తన బైక్ను బుక్ చేసుకుని ఉంటారని భావించిన ఒక ఓలా రైడర్కు ఊహించని ఘటన ఎదురైంది. నవ్వు తెప్పించే ఆ ఘటన వివరాలను ఆ రైడర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ‘రోహిత్ వ్లోగ్స్టర్’లో పొందుపరిచారు. ఒక టీనేజీ అమ్మాయి బుక్ చేసిన ఆ రైడ్ తాలూకు పూర్తి వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్చేయగా కొన్ని గంటల్లోనే 20 లక్షల మంది చూశారు. ఈ వీడియో చూశాక నెటిజన్లు ఆపకుండా కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముంది?పట్టపగలు నిర్మానుష్యంగా ఉన్న వీధిలో ఒక టీనేజర్ నుంచి ఓలా బైక్ రైడ్ బుక్ అవడంతో సంబంధిత అబ్బాయి వెంటనే లొకేషన్కు చేరుకున్నాడు. ట్రాఫిక్ ఏమీ లేకున్నా అమ్మాయి బైక్ ఎందుకు బుక్చేసుకుందా అని ఒకింత అనుమానంగా చూశాడు. అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకోవడానికి ముందుగా గమ్యస్థానాన్ని యాప్లో సరిచూశాడు. ఇక్కడి నుంచి గమ్యస్థానం కేవలం 180 మీటర్లదూరంలో ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంత తక్కువ దూరానికి బైక్ అవసరమా? అని నేరుగా అడిగేశాడు. ‘‘ దూరం తక్కువే. కానీ కుక్కలే ఎక్కువ’’ అని అమ్మాయి చెప్పిన సమాధానంతో పక్కున నవ్వేశాడు. వీధి శునకాల సమస్యకు అమ్మాయి కనుక్కున్న పరిష్కారం చూసి మెచ్చుకున్నాడు. వెంటనే అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని గమ్యస్థానంలో దింపాడు. అంత తక్కువ దూరానికి కేవలం రూ.19 బిల్లు అయ్యింది. ఆ బిల్లు చెల్లించేసి అమ్మాయి చకచకా వెళ్లిపోవడం చూసి అవాక్కవడం అబ్బాయి వంతయింది. ‘ View this post on Instagram A post shared by ROHIT VLOGSTER (@rohitvlogster) 180 మీటర్లకు కూడా బైక్ బుక్ చేయొచ్చని నాకూ ఇప్పుడే అర్థమైంది. రైడ్ స్టార్ట్ చేసి అమ్మాయిని కారణం అడిగి, ఆమె నుంచి సమాధానం పూర్తిగా వినేలోపే స్టాప్ వచ్చేసింది’’ అని రైడర్ ఒక పోస్ట్లో పేర్కొన్నాడు. సంబంధిత వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు స్ట్రీట్ డాగ్కు డాగేశ్ అనే పేరు పెట్టి.. ‘డాగేశ్ ఉన్నాడంటే ఎవరైనా ఆ మాత్రం భయపడాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. డాగేశ్ అంటే మజాకానా!! అని మరొకరు స్పందించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేన్సర్ను అరికట్టే ఔషధాహారం!
సాక్షి, సాగుబడి: భవిష్యత్తులో కేన్సర్ చికిత్సలో భాగంగా వైద్యులు కొన్ని రకాల బియ్యం లేదా బియ్యం తవుడుతో చేసే ఆహారాన్ని సూచించవచ్చు. అవి తింటే కేన్సర్ రాకపోవచ్చు, వచ్చినా తగ్గిపోవచ్చు. అంటే చాలా తక్కువ ఖర్చుతోనే కేన్సర్ను అరికట్టేయవచ్చు. ఆశ్చర్యంగా అనిపిస్తున్న దీన్ని సుసాధ్యం చేస్తోంది ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి). 3 రకాల ఊదా, ఎరుపు రంగు వరి బియ్యంపై పొర(తవుడు)లో కేన్సర్లను అరికట్టే ఔషధ పదార్థాన్ని వెలికితీసి, ఔషధాహారాన్ని విజయవంతంగా రూపొందించారు అక్కడి శాస్త్రవేత్తలు. కొలొరెక్టల్ కేన్సర్ (పెద్దపేగు+గుదద్వారం కేన్సర్), రొమ్ము కేన్సర్లను అరికట్టడానికి ఈ ఫుడ్ సప్లిమెంట్ దోహదపడుతుంది.కేన్సర్ కణాలపై దీని పనితీరును ‘ఇరి’ ప్రయోగశాలలో పరీక్షించి అద్భుత ఫలితాలు సాధించారు. ఈ ప్రతిష్టాత్మక పరిశోధనకు సారథ్యం వహిస్తున్న ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, తెలుగువారైన డాక్టర్ నెసె శ్రీనివాసులు ఈ విశేషాలను టెలిఫోన్ ఇంటర్వ్యూలో ‘సాక్షి’కి వెల్లడించారు.ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెనుముప్పుగా పరిణమించిన కేన్సర్ మహమ్మారికి ముకుతాడు వేసే అద్భుత ‘ఔషధాహారం’ అందుబాటులోకి రానుంది. పురాతన వరి వంగడాల్లో కేన్సర్లను అరికట్టే అద్భుత ఔషధ గుణాలున్నట్లు ఫిలిప్పీన్స్లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనల్లో కనుగొన్నారు. ఈ పరిశోధనలో కీలకపాత్ర పోషించింది ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నెసె శ్రీనివాసులు. ప్రస్తుతం ఈయన ఇరిలో కంజ్యూమర్ డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ – న్యూట్రిషన్ సెంటర్ అధిపతిగా ఉన్నారు. ఈయన తల్లిది అనంతపురం. ఈయన పెరిగింది కర్ణాటకలో.3 రకాల పురాతన వరి రకాలతో..ప్రపంచవ్యాప్తంగా 1,32,000 పురాతన వరి వంగడాలున్నాయి. వీటిలో చాలా వరకు తెల్లబియ్యం రకాలే. రకరకాల రంగుల బియ్యం రకాలు 800. వీటిలో పోషకాలపై జరిపిన పరిశోధనల్లో 6 రకాల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ కేన్సర్ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నట్లు ‘ఇరి’ గుర్తించింది. ప్రస్తుత పరిశోధనలో 3 రకాలను శాస్త్రవేత్తలు వాడారు. ఫిలిప్పీన్స్ కు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగు గల ‘బాలాటినో’ రకం బియ్యం, ‘కింటుమాన్’ అనే ఎర్ర బియ్యంతో పాటు ఇండోనేíసియాకు చెందిన ఎరుపు, ఊదా కలసిన రంగుండే కేతన్ హితం’ అనే పురాతన రకాలను వాడారు. ఈ బియ్యపు తవుడులోని ఔషధ విలువలున్న పదార్థాన్ని ఉపయోగించి కేన్సర్ను అరికట్టే ఫుడ్ సప్లిమెంట్ను తయారు చేశారు. ఇది పొడి లేదా ద్రవ రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.ఒక్క గ్రాము చాలు!300 గ్రాముల బియ్యం నుంచి తీసిన తవుడుతో 1 కిలో ఫుడ్ సప్లిమెంట్ను ఉత్పత్తి చేయవచ్చు. కేన్సర్ నిరోధక లక్షణాన్ని మనిషి దేహంలో కలిగించడానికి కనీసం 1 గ్రాము సరిపోతుందని డా.శ్రీనివాసులు తెలిపారు. కేన్సర్ రోగుల కణాలపై ప్రయోగశాలలో ఈ ఔషధాహారంతో నిర్వహించిన పరీక్షల్లో అద్భుత ఫలితాలు వచ్చాయి. ఈ రెండు రకాల కేన్సర్ రోగులకు ఇస్తున్న కీమోథెరపీ ఔషధం ‘డోక్సోరుబిసిన్’తో సరిసమానమైన ఫలితాలను.. ఈ ఫుడ్ సప్లిమెంట్ ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో దీన్ని ఎలుకలపైన, ఆ తర్వాత కేన్సర్ రోగులపైన ప్రయోగించబోతున్నామని వెల్లడించారు.సాంబమసూరిలోకి ఈ జన్యువులుఈ 3 రకాల పురాతన వరి వంగడాల్లోని కేన్సర్ నిరోధక ఔషధ గుణాలకు కారణమైన జన్యువులు ఏవో గుర్తించేందుకు ‘ఇరి’లో పరిశోధన కొనసాగుతోంది. ‘ఈ పరిశోధన పూర్తయ్యాక అధిక దిగుబడినిచ్చే మన సాంబమసూరి వరి వంగడంలోకి ఈ ఔషధ గుణాలున్న జన్యువులను జన్యు సవరణ ప్రక్రియ ద్వారా జోడిస్తాం. ఆ సరికొత్త సాంబమసూరి ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని తినొచ్చు.ఫుడ్ సప్లిమెంట్ తింటే వంద శాతం ఫలితం ఉంటుంది. వండిన అన్నం తింటే.. అందులోని కేన్సర్ నిరోధక ఔషధ గుణం 70% వరకు వంటపడుతుంది. కేన్సర్ కణాలు క్రమంగా కోలుకొని సాధారణ స్థితికి వస్తాయి. ఆరోగ్యంగా ఉన్న కణాలకు ఎలాంటి హానీ జరగదని కూడా మా ప్రయోగశాలలో రూఢీ అయ్యింది. ఇది స్వల్ప ఖర్చుతో కేన్సర్ను అరికట్టే మార్గంగా ప్రపంచం ముందుకు వస్తోంది’ అని డా. శ్రీనివాసులు వివరించారు. -
ఈశాన్యాన భగభగలు
ఈశాన్య భారతంలో పచ్చదనానికి మారుపేరైన అరుణాచల్ప్రదేశ్, మణిపూర్లో అటవీ విస్తీర్ణం శరవేగంగా తగ్గిపోతోంది. కార్చిచ్చులను సకాలంలో గుర్తించి అదుపు చేయకపోవడం, విచ్చలవిడి పోడు వ్యవసాయం, గంజాయి వంటివాటి అక్రమ సాగు, రోడ్లు, రైల్వే తదితర మౌలిక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారీగా భూ సేకరణ తదితరాలు ఇందుకు కారణమని ప్రముఖ భూ పరిశీలన, విశ్లేషణ సంస్థ సుహోరా టెక్నాలజీస్ అధ్యయనం వెల్లడించింది. రెండు రాష్ట్రాలకు సంబంధించి గత నాలుగేళ్ల ఉపగ్రహ డేటాను లోతుగా విశ్లేíÙంచిన మీదట ప్రమాదకర అంశాలు వెలుగులోకి వచి్చనట్టు తెలిపింది. ముఖ్యంగా దట్టమైన అడవుల లోపలి, మారుమూల ప్రాంతాల్లో రేగే కార్చిచ్చులు పెను నష్టానికి కారణమవుతున్నాయి. అరుణాచల్లోని నందిపార్ ప్రాంతంలో గత ఏప్రిల్ 24న రేగిన భారీ కార్చిచ్చు భారీ నష్టం మిగిల్చింది. ఒక్క రోజులోనే ఏకంగా 10 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం బుగ్గిగా మారింది. ప్లానెట్స్కోప్ ఉపగ్రహ చిత్రాల సాయంతో జరిపిన విశ్లేషణ ద్వారా సుహోరా ఈ మేరకు వెల్లడించింది. ఇలాంటి కార్చిచ్చులను ఉపగ్రహ డేటా సాయంతో ఆదిలోనే గుర్తించి అదుపు చేయవచ్చని పేర్కొంది. ఇక జీవవైవిధ్యానికి మారుపేరైన మణిపూర్లో 2001 నుంచే అటవీ విస్తీర్ణంలో భారీ తగ్గుదల నమోదవుతూ వస్తోంది! రాష్ట్రంలో గత నాలుగేళ్లలో 21,100 హెక్టార్ల అటవీ భూమి మాయమైనట్టు గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ పేర్కొంది. ఇందులో ఏకంగా 17,800 హెక్టార్ల అటవీ భూమిని ఒక్క 2024లోనే కోల్పోయిందని వెల్లడించింది. ఫలితంగా 91 కోట్ల మెట్రిక్ టన్నుల అదనపు కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలైనట్టు పేర్కొంది. కార్చిచ్చుకు తోడు పోడు, గంజాయి వంటివాటి అక్రమ సాగు, జనం వంట చెరుకుపై ఆధారపడుతుండటం, రోడ్లు, రైల్వే వంటి మౌలిక ప్రాజెక్టులు ఇందుకు కారణమని అధ్యయనం తేల్చింది. పచ్చదనపు తొడుగు లేకపోవడంలో కొన్నేళ్లుగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పెరగడమే గాక వర్షపాత ధోరణులు కూడా బాగా మారిపోయినట్టు వివరించింది. తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోని పక్షంలో ఈశాన్య భారతంలో పెను పర్యావరణ సంక్షోభం తప్పదని హెచ్చరించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రాలకు ఎండదెబ్బ
‘ఎండ దెబ్బ’కు మహాసముద్రాలు అతలాకుతలమై పోతున్నాయి. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియాలతో కూడిన వాయవ్య పసిఫిక్ ప్రాంత సముద్ర జలాల్లో 2024లో రికార్డు స్థాయిలో ఏకంగా అర డిగ్రీ సెంటీగ్రేడ్ మేరకు అధిక ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పసిఫక్ మహాసముద్ర జలాలు ఏకంగా 4 కోట్ల చదరపు కి.మీ. మేరకు కనీవిని ఎరుగని రీతిలో వేడెక్కిపోయాయి. ఆ పరిధిలోని జీవజాలాన్ని కూడా ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేసింది. అరుదైన కోరల్ రీఫ్స్ వంటివాటి ఉనికే ప్రమాదంలో పడింది. అంతేగాక ఇండొనేసియాలోని న్యూ గినియా దీవుల్లో ఉన్న ఆ ప్రాంతపు ఏకైక గ్లేసియర్ ఏడాదిలోనే సగం మేరకు కరిగిపోయింది. ఎండలు ఇలాగే పెరిగిపోతే మరో ఏడాదికల్లా అది పూర్తిగా మాయం కావడం ఖాయమని ఐరాస వాతావరణ విభాగమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) జోస్యం చెప్పింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్ల్లో గతేడాది ఎండలు సరికొత్త రికార్డులు సృష్టించాయని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. ‘‘ప్రపంచమైన ఎండల నడుమ వాయవ్య పసిఫిక్ ప్రాంత దేశమైన ఫిలిప్పీన్స్పై గత అక్టోబర్, నవంబర్ నెలల్లో లెక్కలేనన్ని తుపాన్లు విరుచుకుపడ్డాయి! ఈ విపరిణామాలన్నింటికీ వాతావరణ మార్పులే ప్రధాన కారణం’’ అంటూ వాపోయింది. మొత్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కూడా 2024లో రికార్డు స్థాయిలో పెరిగిపోయిందని అధ్యయనకర్తల్లో ఒకరైన బ్లెయిర్ ట్రెవిన్ వివరించారు. ‘‘మొత్తం పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతను చూసుకున్నా 2022 తర్వాత రెండో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది! అక్కడి సముద్రమట్టాలు ప్రపంచ సగటుతో పోలిస్తే శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చాలా ప్రమాదకర పరిణామాలే. ఎందుకంటే వాయవ్య పసిఫిక్ ప్రాంత జనాభాలో ఏకంగా సగానికి పైగా తీరానికి కేవలం అర కిలోమీటర్ దూరంలోనే నివసిస్తున్నారు’’ అని హెచ్చరించారు. సముద్రమట్టాల పెరుగుదల వేగం ఇలాగే కొనసాగితే వారంతా అతి త్వరలో నిర్వాసితులుగా మారి పొట్ట చేత పట్టుకుని వలస పోవడం తప్ప మరో మార్గం ఉండదని అధ్యయన బృంద సభ్యుడు థియా తుర్కింగ్టన్ అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ రేయి వేడైనది..!
ఈ రేయి చల్లనిది అని పాడుకునే రోజులు పోయాయి. పగటి ఉష్ణోగ్రతలు మాదిరే రాత్రి కూడా వేడి వాతావరణం వేధించే రోజులు వచ్చేశాయి. అదీ చాలా ప్రమాదకర స్థాయిలో ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేడి వాతావరణం ఉండే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ టాప్–2లో ఉందని కేంద్ర ఇంధన, పర్యావరణ, నీటి మండలి (సీఈఈఈడబ్ల్యూ) చేసిన ‘హౌ ఎక్స్ట్రీమ్ హీట్ ఇంపాక్టింగ్ ఇండియా’ అనే తాజా అధ్యయనంలో వెల్లడైంది. తాజాగా విడుదలైన ఈ అధ్యయనం దేశంలో నాలుగు దశాబ్దాల వాతావరణ ఆధారిత ఉష్ణోగ్రతలను అంచనా వేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రిపూట వేడి పెరుగుతోందని హెచ్చరించింది. –సాక్షి, అమరావతిఐదు రెట్లు పెరిగిన రాత్రి వేడిదేశ వ్యాప్తంగా 734 జిల్లాల్లో వేడి ప్రమాదకర స్థాయిని అంచనా వేయడానికి 35 సూచికలను సీఈఈఈడబ్ల్యూ ఉపయోగించింది. తద్వారా 417 జిల్లాల్లో అత్యధిక ప్రమాదకరంగా వేడి పెరుగుతున్నట్లు గుర్తించింది. వేడి ఉష్ణోగ్రతల ప్రమాదం స్థాయి 201 జిల్లాల్లో మధ్యస్థంగానూ, 116 జిల్లాల్లో తక్కువగానూ ఉన్నట్లు తేల్చింది. కాగా ఇందులో ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లు టాప్ 10లో ఉన్నాయి. 1982–2011 బేస్ లైన్తో పోలిస్తే గత దశాబ్దం(2012–2022) 70 శాతం జిల్లాల్లో వేసవిలో ఐదు రెట్లు వేడి పెరిగింది. 10 శాతం తేమ పెరిగిందని కూడా ఈ అధ్యయనం తెలిపింది. ఒక మెరుగైన ఇల్లు అంటే చలికాలంలో వెచ్చగా, వేసవిలో చల్లగా ఉండాలని ప్రముఖ గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అనేవారట. ఆధునిక నాగరికతకు ముందే భవనాలను చలికాలంలో సూర్యరశ్మిని గ్రహించేలా, వేసవిలో నీడ ఎక్కువగా ఉండేలా ఇళ్లను నిర్మించేవారు. మళ్లీ అలాంటి సాంకేతికతతో భవన నిర్మాణాలు చేయాల్సిన ఆవశ్యకత నెలకొంది.పగలూ రాత్రీ ఏకమైపోతాయిగత ఐదు దశాబ్దాల్లో 700కు పైగా వేడి తరంగాల కారణంగా 17 వేల మంది మరణించారని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఇటీవల వెల్లడించింది. ఎక్కువకాలం ఉండే వేడి రాత్రుల యుగంలోకి ప్రవేశిస్తున్నామని సీఈఈఈడబ్ల్యూ అధ్యయనం ఇప్పుడు హెచ్చరించింది. ఈ పరిస్థితులను వెంటనే అర్థం చేసుకుని వాతావరణాన్ని చల్లబరిచేందుకు అత్యవసర చర్యలు చేపట్టకపోతే కొన్నేళ్లకు సూర్యుడు అస్తమించే సమయం తగ్గిపోతుందని, అంటే రాత్రి కూడా పగలుగానే మారిపోతుందని అధ్యయనం స్పష్టం చేసింది. హీట్ యాక్షన్ ప్లాన్స్(హెచ్ఎపీ) జాతీయ స్థాయిలో చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతోంది. -
రూ.1 తయారీకి.. రూ.1.11 వ్యయం
ఒక రూపాయి బిళ్ల తయారవడానికి ఒక రూపాయి 11 పైసలు కావాలి. అదే 10 రూపాయల బిళ్లకైతే రూ.5.54. రూ.10 నోటు మన చేతిలోకి రావడానికి సుమారు ఒక రూపాయి ఖర్చవుతోంది. కరెన్సీ తయారవ్వాలన్నా కరెన్సీ కావాల్సిందే. ఈ ఖర్చు ఏటా భారీగా పెరిగిపోతోంది. 2024–25లో కరెన్సీ ముద్రణకు ఏకంగా రూ.6,373 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 25 శాతం ఎక్కువ. నాలుగేళ్లలో ఖర్చు 58.8 శాతం పెరిగిపోయింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కరెన్సీ నోట్లను కొంత మంది పర్సులోనో, జేబులోనో కుక్కిపెడతారు. పాడవుతాయన్న పట్టింపు ఉండదు. చినిగిపోయినా ఏముందిలే ఏ షాపులోనైనా తీసుకుంటారు అన్న ధీమా. లేదంటే బ్యాంకులో మార్చుకోవచ్చని తేలిగ్గా తీసుకుంటారు. మా డబ్బులు మా ఇష్టం అని కొట్టిపారేయకండి. కరెన్సీ నోటు కూడా ఖర్చు పెట్టి తయారుచేయాల్సిందే. ఎందుకంటే తయారీ, పంపిణీ వ్యయాన్ని జోడిస్తే ఆ కరెన్సీ విలువ మీకు కనిపించే అంకెను మించి ఉంటుంది.కరెన్సీ తయారీలో వాడే సిరా, కాగితం వంటి ముడి సరుకు వ్యయాలకుతోడు సిబ్బంది వేతనాలూ పెరిగాయి. దీని ఫలితంగా ముద్రణ ఖర్చు పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతేగాక నకిలీ నోట్లను చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు నూతన సెక్యూరిటీ ఫీచర్లను జోడించడం కూడా ఖర్చును పెంచిందని ఆర్బీఐ చెబుతోంది. పెరిగిన నోట్ల సరఫరాఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2020–21లో నోట్ల ముద్రణకు రూ.4,012 కోట్ల ఖర్చు అయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యయం కాస్తా రూ.6,373 కోట్లకు చేరింది. అంటే నాలుగేళ్లలో 58.8 శాతం ఎగసిందన్నమాట. 2023–24లో కరెన్సీ ముద్రణ ఖర్చులు రూ.5,101 కోట్లు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. నాలుగేళ్లలో దేశంలో నోట్ల సరఫరా దాదాపు 2,233 కోట్ల నుంచి 35.7 శాతం పెరిగి 3,030 కోట్లకు చేరింది. ఆర్బీఐకి కరెన్సీ నోట్లు నాలుగు ప్రింటింగ్ ప్రెస్ల నుంచి వస్తాయి. ఇందులో నాసిక్ (మహారాష్ట్ర), దేవాస్ (మధ్యప్రదేశ్) ప్రెస్లు భారత ప్రభుత్వానికి చెందినవి. మైసూర్ (కర్ణాటక), సల్బోని (పశ్చిమ బెంగాల్) ప్రెస్లు రిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్నాయి. మూడు రకాల కరెన్సీచెలామణిలో ఉన్న కరెన్సీలో భారత్లో ప్రస్తుతం బ్యాంకు నోట్లతోపాటు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ), నాణేలు ఉన్నాయి. 2024–25లో దేశంలో చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ 6 శాతం, పరిమాణం (నోట్ల సంఖ్య) 5.6 శాతం పెరిగింది. 2023 మేలో రూ.2000 నోట్ల ఉపసంహరణ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. నాటి నుంచి రూ.3.56 లక్షల కోట్లలో 98.2% విలువైన నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. రూ.500 నోట్ల హవాగత ఆర్థిక సంవత్సరంలో విలువ పరంగా రూ.500 నోట్ల వాటా ఏకంగా 86 శాతంగా ఉంది. ఏడాదిలో వీటి విలువ స్వల్పంగా తగ్గింది. పరిమాణం పరంగా రూ.500 నోట్ల వాటా 40.9 శాతం ఉంది. చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో రూ.500 నోట్ల వాటాయే అత్యధికం. పరిమాణం పరంగా తరువాతి స్థానాన్ని రూ.10 నోట్లు కైవసం చేసుకున్నాయి. వీటి వాటా మొత్తం పరిమాణంలో 16.4 శాతం. చెలామణిలో ఉన్న నోట్లలో రూ.10, రూ.20, రూ.50 నోట్ల మొత్తం వాటా 31.7 శాతం. గత ఆర్థిక సంవత్సరం చెలామణిలో ఉన్న నాణేల విలువ 9.6 శాతం, సంఖ్య 3.6 శాతం దూసుకెళ్లింది. 2025 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నాణేల పరిమాణంలో రూ.1, రూ.2, రూ.5 నాణేల వాటా 81.6 శాతం. విలువ పరంగా ఈ నాణేల వాటా 64.2 శాతానికి చేరింది. ఈ–రుపీ కొత్త రికార్డు2024–25లో చెలామణిలో ఉన్న ఈ–రుపీ విలువ 334 శాతం పెరిగింది. 2025 మార్చి 31 నాటికి ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విలువ రిటైల్ రూపంలో (చెలామణిలో) నాలుగు రెట్లు పెరిగి రూ.1,016.46 కోట్లకు చేరుకుంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది కేవలం రూ.234 కోట్లు. ఈ–రుపీ డిజిటల్ రూపంలో పనిచేసే నగదు. వినియోగదారులు దీన్ని నిల్వ చేయడంతోపాటు బదిలీ కూడా చేయొచ్చు. 2025 మార్చి నాటికి 17 బ్యాంకులు డిజిటల్ వాలెట్స్ ద్వారా ఈ–రుపీని అందిస్తున్నాయి. దీన్ని 60 లక్షల మంది వినియోగిస్తున్నారు. పెరిగిన నకిలీ రూ.500 నోట్లు 2024–25లో బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ రూ.500 నోట్ల సంఖ్య 37.3 శాతం పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది. రూ.5.88 కోట్ల విలువైన 1.18 లక్షల నకిలీ రూ.500 నోట్లు (కొత్త డిజైన్) కనుక్కొన్నారు. 2023–24లో రూ.4.28 కోట్ల విలువైన 85,711 నకిలీ నోట్లు గుర్తించారు. నకిలీ రూ.200 నోట్లు 13.9% పెరిగాయి. రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ. 2000 నోట్లలో నకిలీవి.. గతేడాదితో పోలిస్తే వరుసగా 32.3, 14, 21.8, 23 శాతం పెరిగాయి. నకిలీ రూ.2000 నోట్ల సంఖ్య ఏడాదిలో 26,035 నుంచి 3,508 నోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2.17 లక్షలు. అంత క్రితం ఏడాది ఈ సంఖ్య 2.22 లక్షల నోట్లు. -
పర్యావరణ విలాపం
యుద్ధం కొనసాగినన్ని రోజులూ రణ క్షేత్రాల్లో ఎక్కడ చూసినా రక్తతర్పణమే. సైనికుల రుధిరంతో తడిసి ముద్దయిన భూములు మాత్రమే కాదు పరోక్షంగా కోట్లాది ఎకరాల్లో సాగుభూమి, జనావాస ప్రాంతాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయని ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (యూఎన్ఈపీ), 2024 నివేదిక స్పష్టంచేసింది. హౌతీల తిరుగుబాటు, హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలు, ఘర్షణలు చివరకు పర్యావరణ సంక్షోభాగ్నుల్ని మరింత ఎగసిపడేలా చేస్తున్నాయని యూఎన్ఈపీ నివేదిక వెల్లడించింది. సరిహద్దు వివాదాలు మొదలు అంతర్జాతీయ విధానాలదాకా పొరుగు దేశాలు, శత్రుదేశాల మధ్య వైరం తుదకు పర్యావరణాన్ని మరింతగా నాశనంచేస్తోందని నివేదిక హెచ్చరిస్తోంది. దశాబ్దాల క్రితమే జీవాయుధాలు ప్రయోగించి కిలోమీటర్ల కొద్దీ జనావాసాలను విషవాయువులతో గరళమయం చేసిన దేశాల దుష్టాంతాలనూ నివేదిక గుర్తుచేసింది. యుద్దాల వేళ శత్రు దేశాల జలాశయాలను, ఆనకట్టలపై బాంబులేసి నేలమట్టంచేయడంతో వందల కోట్ల లీటర్ల తాగు,సాగునీరు దిగువ ప్రాంతాలను ముంచేసి లక్షల ఎకరాల సాగుభూములు నీటమునుగుతున్నాయి. ఆనకట్టల నీరు సమీప ప్రాంతాల్లో గనుల తవ్వకాన్ని స్తంభింపజేస్తోంది. ఆయా నదీ ప్రవాహాల వెంట జీవవైవిధ్యం సైతం ధ్వంసమవుతోంది. మైదాన ప్రాంతాలు, పీఠభూములు సైతం నామరూపాల్లేకుండా నాశనమవుతున్నాయి. ఇలా ఆయా దేశాల్లో పర్యావరణం పతనమవుతోంది. జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టు1990 దశకం నుంచి చూస్తే ఇప్పటిదాకా ఎన్నో యుద్ధాలు మరెన్నో రకాలుగా పర్యావరణ విధ్వంసానికి ప్రధాన కారణమయ్యాయి. 1990 దశకంలో యుద్ధంలో భాగంగా కువైట్లోని 700కుపైగా చమురు బావులకు ఇరాక్ సేనలు నిప్పు పెట్టాయి. దీంతో రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు అగ్నికి ఆహుతై నల్లటి మేఘాలు యావత్ ప్రాంతంలో కమ్మేశాయి. దీంతో అంతులేని పర్యావరణ విధ్వంసం జరిగింది. చమురుబావులు ఏకధాటిగా ఏడు నెలలపాటు తగలబడి చరిత్రలో ఎన్నడూ లేనంతటి పొగను సహజావరణలోకి వెదజల్లాయి. సమీప సముద్ర ఉపరితలజలాలు సైతం విస్తృతంగా పరుచుకున్న చమురు తెట్టతో పాడైపోయాయి. దీంతో పర్యావరణ సమతుల్యత బాగా దెబ్బతింది. కువైట్ లోని 99 శాతం మంచినీటి సరస్సులు కాలుష్యకాసారాలుగా మిగిలిపోయాయి. వాయుకాలుష్యానికితోడు ఆ రీజియన్లో మెజారిటీ ప్రజలకు శ్వాససంబంధ వ్యాధులు ప్రబలాయి. ఈ ఘటనతో ప్రపంచం ఆర్థికగాయాలను చవిచూడాల్సి వచ్చింది. ఆతర్వాతి నుంచే ముడి చమురు ధరలు వడివడిగా పెరగడం మొదలైంది.ఆనకట్టల పేల్చివేతతో అంతులేని విధ్వంసంఉక్రెయిన్పైకి దురాక్రమణ జెండాతో దూసుకొస్తున్న రష్యా వైమానిక దళాలు 2023లో కఖోవ్కా ఆనకట్టను రాత్రికిరాత్రే పేల్చేశారు. దీంతో డ్యామ్లోని అపార జలరాశి దిగువ ప్రాంతాల్లోకి వృథాగా పోయింది. దిగువ ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 5 లక్షల ఎకరాల్లో పంటభూములు పూర్తిగా నాశనమయ్యాయి. గనులు, చమురు బావులు, పారిశ్రామిక వ్యర్థాలు మొత్తం డినిప్రో నది, నల్లసముద్ర పరీవాహక ప్రాంతాల్లోకి కొట్టుకొచ్చి పర్యావరణ విధ్వంసాన్ని మరింత పెంచాయి. ఇలా ఒక్క కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో దాదాపు వేయికిపైగా ప్రాంతాల్లో పర్యావరణం కోలుకోనంతగా పాడైపోయిందని నివేదిక పేర్కొంది. జీవవైవిధ్యం ధ్వంసమవడంతోపాటు వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డునపడ్డాయి.తాజాగా గాజాలో..గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. భవ నాలు, రోడ్లను పేల్చేయడంతో గాజా అంతటా ఎక్కడ చూసినా కాంక్రీట్ శిథిలాల కుప్పలే కనిపిస్తున్నాయి. 2023–24 కాలంలో గాజాలో దాదాపు 4 కోట్ల టన్నుల చెత్త పెరిగింది. అంటే ప్రతి చదరపు మీటర్కు 107 కేజీల చెత్త అదనంగా వచ్చి చేరింది. గాజాలో పచ్చదనం దాదాపు పూర్తిగా కనుమరుగైంది. గాజా సమీప ప్రాంతాల్లో 80% చెట్లు కూలిపోయాయి. మూడింట రెండొంతుల సాగుభూమి బాంబులు, ఫిరంగి గుళ్లు, క్షిపణి శకలాలతో నిండిపోయి సాగుకు పనికిరాకుండా పోయాయి. తూర్పు మధ్య« దరా ప్రాంతంలో భూమాత ఊపిరితిత్తులుగా ఖ్యాతిగాంచిన ‘వాడీ గాజా’ చిత్తడి నేలలు చాలా వరకు ధ్వంసమయ్యాయి. ఇక్కడి 150 రకాల సకశేరుక జీవులు, 70 రకాల ప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.దళాలు.. పర్యావరణ దోషులురోజూ ప్రపంచవ్యాప్తంగా వందల పౌరవిమానాలు కోట్ల లీటర్ల ఇంథనాన్ని మార్గమధ్యంలో ఆకాశంలో మండిస్తూ పొగను వెదజల్లుతూ పర్యావరణానికి చేటుచేస్తున్నాయి. సముద్రమార్గాల్లో ప్రయాణిస్తూ సరుకు రవాణా నౌకలు సైతం ఇదే పనిచేస్తున్నాయి. వీటిని మించి యుద్ధా్దల ద్వారా దేశాల సాయుధబలగాలు అత్యధికస్థాయిలో కర్బన ఉద్గారాలను వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయని నివేదిక కుండబద్దలు కొట్టింది. గ్రీన్హౌస్ గ్యాస్ల విడుదలలో యుద్ధాల్లో పాల్గొన్న దేశాల మిలటరీల వాటా 5.5 శాతానికి పెరిగింది. ఇందులో ఒక్క అమెరికా వాటానే ఒక శాతం ఉండటం గమనార్హం. యుద్ధ ట్యాంక్లు, శతఘ్నులు, జెట్ విమానాలు, సైనిక రవాణా వాహనాలు కోట్ల లీటర్ల ఇంధనాన్ని తాగేస్తూ పొగ, అత్యధిక స్థాయిలో కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. గాజాలో పేలుళ్లతో పేరుకుపోయిన 1.5 కోట్ల టన్నుల కాంక్రీట్ శిథిలాలు సైతం పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించనున్నాయి. సహజ వనరులు నాశనం కావడానికి కొత్తగా పొడచూపుతున్న యుద్ధాలు 40 శాతం కారణమని నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇకనైనా పర్యావరణ విధ్వంసాలకు ఆయా దేశాలను బాధ్యులను చేస్తూ నష్టపరిహార, సహాయక చర్యలు తీసుకోవాలని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ కొన్ని సూచనలు చేసింది. అవేంటంటే..→ విస్తృతస్థాయిలో, ఎక్కువ మంది పౌరులను ప్రభావితంచేసే ఘర్షణలను ఇకపై అంతర్జాతీయ నేరంగా పరిగణించాలి→ ఐరాస వాతావరణ మార్పుల ముసా యిదా సమావేశం(యూఎన్ఎఫ్సీసీసీ) నిబంధనలను అనుసరిస్తూ ఇకపై ప్రతిదేశం తమ సైన్యం ఏ స్థాయిలో కర్బన ఉద్గారాలను వెదజల్లిందో ఆ డేటాను నిష్పాక్షికంగా బహిర్గతం చేయాలి→ అంతర్జాతీయ రెడ్క్రాస్ సంస్థ ప్రతిపాదించినట్లుగా ఘర్షణలు సద్దుమణిగాక యుద్ధంతో దెబ్బతిన్న పర్యావరణానికి పునరుజ్జీవం కల్పించేందుకు 20 శాతం నిధులను కేటాయించాలి→ ఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత్ చేసిన ‘‘ ఒకే భూమి, ఒకే కుటుంబం’ ప్రేరణగా సమీకృత వాతావరణ దౌత్య వేదికనూ నెలకొల్పాలి. సరిహద్దుల వెంట నిరాయుధీకరణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి→ 2024లో అన్ని దేశాల సైనిక బడ్జెట్లు 2.4 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లే.. జీవవైవిధ్య పరిరక్షణా నిధులనూ దేశాలు పెంచాలి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
స్వచ్ఛంగా భారత ఇం‘ధనం’!
పర్యావరణ కాలుష్యం రోజురోజుకీ పెరుగుతున్న వేళ స్వచ్ఛ ఇంధనం ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే మనదేశం కూడా గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టింది. అంతేకాదు, ప్రపంచానికి మార్గదర్శకంగానూ నిలుస్తోంది. మన పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 232 గిగావాట్లకు చేరుకుంది. తద్వారా ఈ రంగంలో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశంగా నిలిచింది. 2014లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 75.52 గిగావాట్లు మాత్రమే. అంటే పదేళ్లలో సామర్థ్యం మూడింతలు పెరిగిందన్న మాట. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ ఇంధన రంగంలో మనదేశం సాధించిన పురోగతిపై ప్రత్యేక కథనం. 2030 నాటికి 500 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఏటా 50 గిగావాట్లకుపైగా గ్రీన్ ఎనర్జీ సామర్థ్యాన్ని జోడించాల్సి ఉంటుంది. భారత పునరుత్పాదక ఇంధన రంగం 2020 ఏప్రిల్ నుంచి 2024 సెపె్టంబర్ మధ్య సుమారు 20 బిలియన్డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంది. 2047 నాటికి మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 1,800 గిగావాట్ల మైలురాయికి చేరాలన్నది భారత ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. అందుకు నిదర్శనం.. ఈ రంగంలో ప్రభుత్వం చేస్తున్న వ్యయం పెరగడమే. 2019–20 నుంచి 2023–24 నాటికి... పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన పథకాలు, కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.3,193 కోట్ల నుంచి రూ.6,119 కోట్లకు పెరిగింది.టాప్లో సోలార్ పవర్.. సౌర విద్యుత్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడవ, పవన విద్యుత్ రంగంలో నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించడం విశేషం. 2023లో మొత్తం పునరుత్పాదక విద్యుత్ 18.5 గిగావాట్లు, 2024లో 25 గిగావాట్లు అదనంగా వచ్చి చేరింది. 2014లో దేశంలో సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 2.63 కోట్లే. కానీ, ప్రభుత్వ చర్యల ఫలితంగా 2025 నాటికి ఏకంగా 108 గిగావాట్లకు ఎగసింది. అంటే 41 రెట్ల పెరుగుదల అన్నమాట. దీంతో పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 51 గిగావాట్లకు పెరిగింది. 2014లో ఇది 21 గిగావాట్లు. మాడ్యూల్స్ తయారీలో.. సౌర విద్యుదుత్పత్తి విషయానికి వస్తే సోలార్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యం దేశంలో 2014లో 2.3 గిగావాట్లు మాత్రమే. 2024 నాటికి ఇది 90 గిగావాట్లను తాకింది. 2030 నాటికి 150 గిగావాట్లకు చేరుకోవాలని భారత్ ఆకాంక్షిస్తోంది. దశాబ్దం క్రితం దేశీయంగా సోలార్ సెల్స్, వేఫర్ల ఉత్పత్తి పరిమితంగా ఉండేది. నేడు సోలార్ సెల్స్ ఉత్పత్తిలో 25 గిగావాట్లు, వేఫర్ ఉత్పత్తిలో 2 గిగావాట్లతో భారత్ తన స్థానాన్ని పదిలపర్చుకుంది.దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి స్వయం సమృద్ధి గల దేశంగా మారే ప్రయత్నంలో మన దేశం 2030 నాటికి సోలార్ సెల్స్ ఉత్పత్తిలో 100 గిగావాట్స్, వేఫర్ ఉత్పత్తిలో 40 గిగావాట్ల సామర్థ్యాన్ని అందుకోవాలని కృత నిశ్చయంతో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.24,000 కోట్లతో చేపట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం సౌర విద్యుత్ రంగానికి ఊపునిచ్చింది. దూకుడుగా ప్రభుత్వం.. 2025 ఫిబ్రవరి నాటికి దాదాపు 176 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 70.21 గిగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులకు టెండర్లు దాఖలయ్యాయి. సముద్రం లేదా సరస్సులో ఏర్పాటు చేసే ఆఫ్షోర్ పవన విద్యుత్ ప్రాజెక్టుల విభాగంలో 2030 నాటికి 37 గిగావాట్ల మేర టెండర్లను ఆహ్వానించాలని భారత్ నిర్ణయించింది. గుజరాత్, తమిళనాడులో పైలట్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆర్ఈ–ఇన్వెస్ట్ 2024 వేదికగా భారత స్వచ్ఛ ఇంధన రంగంలో 2030 నాటికి రూ.32.45 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇక దేశంలోని మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో శిలాజేతర విద్యుత్ సామర్థ్యం వాటా 2014తో పోలిస్తే 32.5% నుండి గత ఏడాది 47.37%కి పెరిగింది. ప్రధానమంత్రి సూర్య ఘర్ ప్రాజెక్టును 2024 ఫిబ్రవరిలో కేబినెట్ ఆమోదించింది. 2026–27 నాటికి దేశంలో ఒక కోటి గృహాలకు రూఫ్టాప్ సోలార్ను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.75,021 కోట్ల వ్యయం చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా అదనంగా 30 గిగావాట్ల సౌర సామర్థ్యం లభిస్తుందని అంచనా. రూ.19,744 కోట్లతో జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ను మంత్రివర్గం ఆమోదించింది. 2030 నాటికి ఈ మిషన్ కింద 125 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం అదనంగా చేరనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
శ్రేయస్ అయ్యర్... సారథిగా సూపర్
ధోనీ మాదిరిగా వ్యూహరచనలో మేటి... కోహ్లి తరహాలో దూకుడులో ఘనాపాటి... రోహిత్ను అనుకరిస్తున్నట్లు అనిపించినా... అతడికి అతడే సాటి! ‘అతడి చేయి పడితే రాయి కూడా రత్నంలా మెరుస్తుంది’... అన్న రీతిలో దశాబ్ద కాలానికి పైగా ‘ప్లే ఆఫ్స్’ మొఖం చూడని జట్టును తుదిపోరుకు చేర్చిన ఘనుడతడు! ఐపీఎల్ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని విధంగా మూడు వేర్వేరు జట్లను తుదిపోరుకు తీసుకెళ్లిన మొనగాడతడు! అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపించడంలో నేర్పరి అతడు! మనం ఇంతసేపు చెప్పుకున్నది... ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలవకపోయినా తన నాయకత్వ చతురతతో అందరి మనసులు గెలిచిన పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ గురించే!! ధోనీ, రోహిత్ కూడా కెప్టెన్లుగా మూడు కంటే ఎక్కువ ఐపీఎల్ ఫైనల్స్ ఆడినా... ఆ ఇద్దరూ ఒకే జట్టును నడిపించారు. కానీ గత ఐదేళ్లలో అయ్యర్ మూడు వేర్వేరు ఫ్రాంఛైజీలకు తుదిపోరు మజా చూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన ఏకైక ఫైనల్ శ్రేయస్ సారథ్యంలోనే కాగా... పదేళ్ల విరామం అనంతరం గతేడాది కోల్కతా నైట్రైడర్స్కు ముచ్చటగా మూడో కప్పు అందించింది కూడా అయ్యరే. పంజాబ్కు ట్రోఫీ కట్టబెట్టలేకపోయినా... సారథిగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. ‘బాధ్యత సగం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది తప్పక కప్పు గెలుస్తాం’ అని ఫైనల్ అనంతరం ధీమా వ్యక్తం చేసిన అయ్యర్... భారత జట్టు భవిష్యత్తు నాయకత్వంపై భరోసా పెంచుతున్నాడు!!సాక్షి, క్రీడావిభాగం : 2024 ఐపీఎల్ ఫైనల్లో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసి... కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) జట్టు మూడోసారి కప్పు కైవసం చేసుకుంది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకున్నా... ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కేకేఆర్ జట్టు మెంటార్గా ఉండటంతో క్రెడిట్ అంతా అతడికే దక్కింది. తదనంతర పరిణామాల్లో గంభీర్ టీమిండియా హెడ్కోచ్గా ఎదగగా... సమర్థ నాయకుడిని కేకేఆర్ వేలానికి వదిలేసింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన కోల్కతా జట్టు... ఈసారి లీగ్ దశ దాటలేకపోవడమే గాక... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంటే... వేలంలో భారీ ధర పెట్టి శ్రేయస్ను దక్కించుకున్న పంజాబ్ రెండోసారి రన్నరప్గా నిలిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు శ్రేయస్ సారథ్య సామర్థ్యాన్ని వివరించేందుకు.దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా నిర్లక్ష్యం వహించినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం... అపార ప్రతిభ ఉన్నా ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక కాకపోవడం ఇవన్నీ పక్కన పెడితే... అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడని తాజా ఐపీఎల్ నిరూపించిందింది. ఆటగాడిగా అదుర్స్... ఈ సీజన్లో 17 మ్యాచ్లాడిన శ్రేయస్ 50.33 సగటుతో 604 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు దిగి 175.07 స్ట్రయిక్రేట్తో పరుగులు రాబట్టాడు. అతడి గణాంకాలను అంకెల్లో కొలవడం కష్టమే! సీజన్ ఆరంభంలో గుజరాత్తో జరిగిన పోరులో సెంచరీకి సమీపించినా... జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే అయ్యర్ తీరు అందరినీ ఆకట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది. అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి సమీపించాడు. చివరి ఓవర్లో స్ట్రయికింగ్లో ఉన్న శశాంక్ సింగ్ దగ్గరకు వెళ్లి ‘నా శతకం గురించి ఆలోచించకు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయి’ అని దిశానిర్దేశం చేశాడు. ఆ ఓవర్ మొత్తం ఆడిన శశాంక్ 23 పరుగులు రాబట్టగా... అయ్యర్ అజేయంగా నిలిచాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడతాడనే గుర్తింపును మరింత పెంచుకుంటూ... ఈసారి మిడిల్ ఓవర్స్లో భారీ షాట్లతో విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. అందుకే సీజన్ మొత్తంలో 43 ఫోర్లే కొట్టిన అయ్యర్... 39 సిక్స్లతో అత్యధిక సిక్స్లు కొట్టిన వారి జాబితాలో నికోలస్ పూరన్ (40) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. ముంబైపై అసమాన పోరాటం ఇక క్వాలిఫయర్–2లో ముంబై ఇండియన్స్పై శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా యార్కర్లను ఎదుర్కొనేందుకు మహామహులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు దాన్ని షార్ట్థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన తీరు చూసి తీరాల్సిందే. ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటం కనబర్చిన ఈ ముంబైకర్... జట్టును ఒంటిచేత్తో ఫైనల్కు చేర్చాడు.‘అయ్యర్ అవుట్ అయినప్పుడే... పంజాబ్ పరాజయం ఖాయమైంది’ బెంగళూరుతో ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట ఇదే. అంతలా అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్న శ్రేయస్... చేతి వరకు వచ్చిన కప్పు చేజారుతున్నా కాస్త కూడా చలించలేదు. చిరకాల కల నెరవేరడంతో ప్రపంచ మేటి ఆటగాడు విరాట్ కోహ్లి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే... సుదీర్ఘ కాలం ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించినా.. జట్టును విజేతగా నిలపలేకపోయిన ఏబీ డివిలియన్స్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ప్లేయర్లు సంబరాల్లో భాగమైపోయారు. ఇక ఆర్సీబీ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు! తన చుట్టూ ఇంత జరుగుతున్నా కనీసం ముఖ కవలికల్లో సైతం మార్పు కనబడని అయ్యర్ నింపాదిగా వచ్చే ఏడాది చూసుకుందాం అన్నట్లు ముందుకు సాగిపోయాడు. భవిష్యత్తు వన్డే కెప్టెన్! మైదానం బయట నుంచి పాంటింగ్ జట్టును తీర్చిదిద్దితే... ఆ వ్యూహాలను గ్రౌండ్లో ఆచరణలో పెట్టడంలో అయ్యర్ విజయవంతమయ్యాడు. బౌన్సీ పిచ్పై కైల్ జెమీసన్తో బ్యాక్ ఆఫ్ ది లెంత్ బంతులు వేయించడం... ముంబైతో మ్యాచ్లో వైడ్ యార్కర్లు వేసే విధంగా విజయ్ కుమార్ వైశాఖ్కు దిశానిర్దేశం చేయడం... అవసరమైనప్పుడు ‘నకల్ బాల్స్’ వేసే విధంగా ప్రోత్సహించడం ఇలా... ఒకటా రెండా సీజన్ ఆసాంతం శ్రేయస్ కెప్టెన్సీలో తనదైన పదును చూపాడు. క్వాలిఫయర్–2లో శశాంక్ సింగ్ నిర్లక్ష్యంతో రనౌట్ అయన సందర్భంలో సారథిగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యర్... ప్రియాన్‡్ష, ప్రభ్సిమ్రన్ వంటి యువ ఆటగాళ్లను పెద్దన్నలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేయగా... అందులో అయ్యర్ పేరు లేకపోవడం చూసి పంజాబ్ కోచ్ పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అయినా దాన్ని పెద్దగా పట్టించుకోని శ్రేయస్... గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు... ఫలితం గురించి ఆలోచించకు’ అన్న రీతిలో ఐపీఎల్పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం టెస్టు, టి20 జట్లలో రెగ్యులర్ ఆటగాడు కాని 30 ఏళ్ల అయ్యర్... వన్డేల్లో మాత్రం రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత నాయకత్వ రేసులో ముందు నిలవడం ఖాయమే! -
అమెరికాపై చైనా.. ‘ఆగ్రో టెర్రరిజం’
ఆగ్రో టెర్రరిజానికి పాల్పడిన ఇద్దరు చైనీయులను అమెరికా పోలీసులు అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం అరెస్ట్ చేయటంతో ప్రపంచ దేశాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. పంటలకు తీవ్రనష్టం కలిగించటం ద్వారా వ్యవసాయ, ఆహార భద్రతకు విఘాతం కలిగించే ఉగ్రవాద చర్యలను ఆగ్రో టెర్రరిజంగా చెబుతారు. అదే దురుద్దేశంతో ‘ఫ్యూసేరియం గ్రామినిరమ్’అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని అక్రమంగా, కుట్రపూరితంగా అమెరికాలోకి తెచ్చారన్న ఆరోపణపై చైనా పౌరులైన యుంకింగ్ జియాన్, ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరుపుతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా కూడా చైనా నుంచే వ్యాప్తిలోకి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా.. చైనా నుంచి వస్తువుల దిగుమతిపై సుంకాలు అతి భారీగా పెంచిన నేపథ్యంలో తాజా ఆగ్రో టెర్రరిజం చర్య చర్చనీయాంశమైంది. చైనా కమ్యూనిస్టు పార్టీ కుతంత్రమే యుంకింగ్ జియాన్ చైనా కమ్యూనిస్టు పార్టీ విధేయురాలని, ఈ ప్రమాదకర శిలీంధ్రంపై చైనాలో పరిశోధన చేసిన ఆమెకు చైనా ప్రభుత్వం నిధులు ఇచ్చినట్లు కూడా ఆధారాలున్నాయని కాష్ పటేల్ తెలిపారు. ‘సహ నిందితుడైన ఆమె సన్నిహితుడు జున్యాంగ్ లియు కూడా చైనా యూనివర్సిటీలో ఇదే శిలీంధ్రంపైనే పరిశోధనలు చేస్తుండేవాడు. ఈ శిలీంధ్రంపై మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసమే డెట్రాయిట్ మెట్రోపాలిటన్ ఎయిర్పోర్ట్ ద్వారా గత ఏడాది అక్రమంగా రవాణా చేసినట్లు లియు తొలుత బుకాయించినా, తర్వాత తప్పు అంగీకరించారని తెలిపారు. వీరిద్దరిపైనా కుట్ర, అమెరికాలోకి వస్తువుల స్మగ్లింగ్, తప్పుడు స్టేట్మెంట్లు,వీసా అక్రమాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశా’మని కాష్ పటేల్తెలిపారు. అమెరికా ఆహార వ్యవస్థను దెబ్బతీయటం ద్వారా తీవ్ర పరిణామాలు కల్పించి అమెరికా ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను పెనుప్రమాదంలోకి నెట్టాలన్న కుతంత్రంతో చైనా కమ్యూనిస్టు పార్టీ అనుక్షణం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. ఈ దుర్భిద్ధితోనే పరిశోధకులను, ఇతరులను అమెరికా సంస్థల్లోకి పనిగట్టుకొని చొప్పిస్తోందని చెప్పటానికి ఇదొక ప్రబల నిదర్శనం అని కాష్ పటేల్ అన్నారు. ఈ కుతంత్రాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు ఎఫ్బిఐ అవిశ్రాంతంగా కృషి చేస్తూనే ఉంటుందన్నారు. నష్టం జరగకముందే ఈ ముప్పును పసిగట్టడంలో డెట్రాయిట్ ఎఫ్బిఐ బృందం, కస్టమ్స్–సరిహద్దు భద్రతా దళాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని ప్రశంసించారు. ఆగ్రో టెర్రరిజం మూలాలు.. మధ్య ప్రాచ్యానికి చెందిన అస్సిరియన్ అనే జాతి వారు క్రీ.పూ. 660లోనే వ్యవసాయసంబంధమైన ఉగ్రవాదచర్యకు తొలిసారి పాల్పడ్డారని చరిత్ర చెబుతోంది. ధాన్యపు పంటలను నాశనం చేసే ఎర్గోట్ అనే శిలీంధ్రాన్ని ప్రయోగించి శత్రువుల నీటి వనరులను అస్సిరియన్లు కలుషితం చేశారు. ఆధునిక కాలంలో తొలి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గ్లాండర్స్, ఆంథ్రాక్స్ క్రిములను శత్రువుల గుర్రాలపై ప్రయోగించింది. యూరప్లో శత్రు సేనలకు సరఫరా అయ్యే ధాన్యాగారాలపై ఈ ఫంగస్లను ప్రయోగించినట్టు చెబుతారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో.. బ్రిటన్లోని బంగాళా దుంపల పొలాలను ‘కొలరాడో పొటాటో బీటిల్స్’సాయంతో నాశనం బ్రిటన్ చేయాలని ప్రయత్నించింది. విమానం సాయంతో వీటిని పొలాల్లోకి విడిచిపెట్టింది. ప్రమాదకరమైన ఫంగస్‘ప్రమాదకరమైన జీవాయుధాన్ని అక్రమంగా దేశంలోకి తీసుకురావటం వ్యవసాయ సంబంధమైన ఉగ్రవాద చర్య. యావత్ జాతి భద్రతకే ఇది ప్రత్యక్ష ముప్పు’వంటిదని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘యుంకింగ్ జియాన్ అనే యువతి మిచిగాన్ యూనివర్సిటీలో పరిశోధనల కోసం ఫ్యూసేరియం గ్రామినిరమ్ అనే ప్రమాదకరమైన శిలీంధ్రాన్ని దేశంలోకి అక్రమంగా తీసుకువచ్చినట్లు భావిస్తున్నాం.గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ తదితర పంటల్లో ‘కంకి ఎండు తెగులు’ను కలిగించటం ద్వారా దిగుబడిని తీవ్రంగా నష్టపరిచే అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ఇది. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల మేర ఆర్థిక నష్టానికి కారణమవుతున్న ఈ శిలీంధ్రం.. పంటలను దెబ్బతీయటంతో పాటు మనుషులు, పశువుల తీవ్రమైన అనారోగ్య సమస్యలను సృష్టించగలదు’అని ఆయన పేర్కొన్నారు. పాక్ ద్వారా మన దేశంలోకీ.. చైనా, పాకిస్థాన్ సరిహద్దుల ద్వారా భారత్కు కూడా ఆగ్రో టెర్రరిజం ముప్పు పొంచి ఉందన్న చర్చ జరుగుతోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) పత్రాల ప్రకారం.. బంగ్లాదేశ్లో కనిపించిన ఒక ప్రమాదకర ఫంగస్ 2016లో పశ్చిమ బెంగాల్లోని 2 జిల్లాల్లోకి ప్రవేశించింది. గోధుమ పంటను నాశనం చేసే ఆ ఫంగస్ను ప్రభుత్వం సమర్థంగా నాశనం చేసింది. మూడేళ్ల పాటు గోధుమ పంట వేయకుండా ఆదేశాలు జారీచేసి, ఆ ఫంగస్ విస్తరించకుండా చేయగలిగింది. అంతకుముందు 2015లో పత్తి పంటను నాశనం చేసే ప్రమాదకర వైరస్ పాకిస్థాన్ నుంచి దక్షిణ పంజాబ్ ప్రాంతంలోకి ప్రవేశించింది. దాదాపు మూడింట రెండొంతుల పత్తి పంట నాశనమైపోయింది. సుమారు 670 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని భరించలేక సుమారు 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.- సాక్షి, స్పెషల్ డెస్క్ -
క్యాంపస్ కొలువులకు కేరాఫ్ వరంగల్ ఎన్ఐటీ
సాక్షి ప్రతినిధి, వరంగల్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) వరంగల్ ప్లేస్మెంట్లకు కేరాఫ్గా మారింది. నిట్లోని సెంటర్ ఫర్ కెరీర్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ (సీసీపీడీ) ఆధ్వర్యంలో నిర్వహించే క్యాంపస్ సెలెక్షన్లకు ప్రపంచ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడి విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి క్యూ కడుతున్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 296 కంపెనీలు నిట్ క్యాంపస్ సెలక్షన్స్లో పోటీపడ్డాయి. క్యాంపస్ సెలక్షన్స్కు 1,508 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1,201 మంది ఎంపికయ్యారు.ఓ విద్యార్థికి అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 64.3 లక్షలు రాగా.. అత్యల్ప వార్షిక ప్యాకేజీ రూ.14.3 లక్షలుగా నమోదైంది. యూజీ, పీజీ విద్యార్థులతోపాటు తొలిసారి ఆరుగురు పీహెచ్డీ అభ్యర్థులు రూ. 9 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపిక కావడం విశేషం. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డేటా అనాలసిస్, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ప్రోడక్ట్ అనాలసిస్, ప్రోడక్ట్ ఇంజనీర్, కన్సల్టెంట్, మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రెయినీ లాంటి పోస్టులకు విద్యార్థులు ఎంపికయ్యారు.ఒడిదొడుకులున్నా ‘టాప్’లోనే..ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కొలువుల మార్కెట్ ఈసారి అంతంతమాత్రంగానే ఉన్నా నిట్ క్యాంపస్ సెలెక్షన్స్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కొలువులకు ఎంపికైన 1,201 మందిలో 679 మంది యూజీ విద్యార్థులు, 516 మంది పీజీ, ఆరుగురు పీహెచ్డీ విద్యార్థులు ఉన్నారు. వారిలో బీటెక్ ఈసీఈ చేసిన సోమిల్ మాల్ధానీ ఏకంగా 64.3 లక్షల అత్యధిక వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యాడు. గతేడాది మొత్తం 1,483 మంది విద్యార్థులు ప్లేస్మెంట్కు అర్హత పొందగా 1,128 మంది ఎంపికయ్యారు. బీటెక్లో 82 శాతం మంది, ఎంటెక్, ఇతర పీజీ కోర్సుల్లో 76 శాతం మంది విద్యార్థులకు కొలువులు లభించాయి. గతేడాది ఒక విద్యార్థి అత్యధికంగా రూ. 88 లక్షల వార్షిక వేతనానికి ఎంపికవగా 12 మంది రూ. 68 లక్షల చొప్పున వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. సగటు వార్షిక వేతనం రూ. 15.6 లక్షలుగా నమోదైంది.సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తా..మాది జైపూర్లోని మధ్యతరగతి కుటుంబం. నిట్లో అత్యుత్తమ విద్యాబోధనతోపాటు సీసీపీడీ గైడెన్స్లో బెంగళూరుకు చెందిన స్టార్టప్ సాఫ్ట్వేర్ కంపెనీకి రూ. 64.3 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యా. సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి మిత్రులకు ఉద్యోగాలు కల్పించడమే నా లక్ష్యం.– సోమిల్ మాల్ధానీ, రూ.64.3 లక్షల వార్షిక ప్యాకేజీ పొందిన విద్యార్థివిద్యార్థుల్లో ప్రేరణ నింపుతున్నాం..మా క్యాంపస్ నుంచి గతేడాది 1,128 మంది విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికవగా ఈసారి 1,201 మంది ఎంపికవడం అభినందనీయం. అత్యుత్తమ బోధనతోపాటు లక్ష్య సాధన దిశగా విద్యార్థులకు మేం ప్రేరణ కల్పిస్తున్నాం.– బిద్యాధర్ సుబుదీ, నిట్ డైరెక్టర్వర్క్షాప్లు, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లే..విద్యార్థులను ఇంటర్వ్యూలకు ప్రిపేర్ చేయడం, వర్క్షాప్లు, వారి కమ్యూనికేషన్ స్కిల్స్కు పదునుపెట్టడం క్యాంపస్ సెలక్షన్స్లో విజయానికి కీలక భూమిక పోషించాయి.– హరికృష్ణ, సీసీపీడీహెడ్, ఎన్ఐటీ, వరంగల్ -
మారుపేరు.. మమకారాల ఊరు
మేడిపల్లి(వేములవాడ): ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రకమైన వింతలు ఉంటాయి. జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామంలో కూడా మారుపేర్ల (నిక్ నేమ్) వింత ఉంది. గోదావరి జిల్లాల్లో వెటకారం ఉన్నట్లు, కమ్మరిపేటలో కూడా వెటకారంతో కూడిన ప్రేమలు ఉంటాయి. మచ్చుకు కొన్ని మారుపేర్లుకమ్మరిపేటలో కొందరిని తల్లిదండ్రులు పెట్టిన పేర్లతో కాకుండా మారుపేర్లతోనే గుర్తిస్తా రు. ఉదాహరణకు.. నల్లోడు, కోడిజుట్టుగాడు, బర్లోడు, గుడుగుడు మల్లయ్య, బూటుగాడు, సెంబుగాడు, కటకట రాయడు, బారెపు మల్లయ్య, బొట్టుగాడు, దస్తగిరిగాడు, జేంకొరుకుడు, ఆపకా యేగాడు, సెట్టెపిసోడు, పొట్టన్న, బీపిగాడు, ఎద్దుగాడు, పిసోడు, పొట్టోడు, బుడ్డిగాడు, యాస్టీంగ్గాడు, నరుకుడుగాడు, పిర్రలెంకడు, మల్కుమల్లోజీ, ఒక్కపొద్దు, బొమ్మగాడు, సాంబర్గాడు, పత్తగాడు, బొంబాయిగాడు, బ్రహ్మంగారు, తత్తర్గాడు, గొట్టాలు, గుండంగాడు.. ఇలా దాదాపు ఊరందరికీ మారుపేర్లు ఉన్నాయి. అవసరమైనప్పుడు అండగా..కమ్మరిపేటలో గ్రామస్తులందరూ వరుసలతో పాటు వెటకారం జోడించి మారుపేర్లతో పిలుచుకుంటారు. ఇలా పిలవడం ఎదుటివారిని తక్కువ చేసినట్లు అస్సలు కాదు. ప్రేమగా ఇలా పిలుచుకోవడంలో గ్రామస్తులంతా ఆదర్శంగా నిలుస్తారు. గ్రామంలో ఎవరికైనా, ఏ సమయంలోనైనా సమస్య వచ్చినా.. అందరూ తలో చేయి వేసి ఆదుకుంటారు. ఎవరైనా చనిపోతే కులమతాలకు అతీతంగా దగ్గరుండి కార్యాలు జరుపుతారు. ఈ విషయంలో చాలా మంది పెద్దలు కమ్మరిపేట గ్రామాన్ని ప్రశంసిస్తారు. భీమారం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించేందుకు కమ్మరిపేట గ్రామస్తులు తమదైన పాత్ర పోషించారు. ఇలా చాలా విషయాల్లో కమ్మరిపేట మండలంలో ఆదర్శంగా నిలుస్తోంది.మారుపేరుతోనే పిలుస్తారు నాపేరు బినవేని రెడ్డి. కానీ మా గ్రామంలో ఇంటివారు పెట్టిన పేరుతో పిలవరు. మారుపేర్లతోనే ఎక్కువగా పిలుస్తారు. మా పూర్వీకులు బర్లు కాసేవారని నన్ను బర్ల రెడ్డి అంటారు. మా ఊర్లో దాదాపు అందరినీ ఇలాగే పిలుస్తారు. – బినవేని రెడ్డి, కమ్మరిపేటఅలా పిలిస్తేనే ప్రేమ..సరదాగా మారుపేర్లతో పిలవడం మా ఊరి వెటకార భాషలో భాగం. అలా పిలిచినా ఎవరూ ఇబ్బంది పడరు. అలా పిలిస్తేనే గుండెకు దగ్గరగా.. ప్రేమతో పిలిచినట్లు భావిస్తారు. గ్రామంలో అందరం కలిసిమెలిసి ఉంటాం. ఏదైన విషయంలో భేదాభిప్రాయాలున్నా ఇతర గ్రామాల మధ్యవర్తిత్వానికి ఇష్టపడం.– ఆకునూరి శ్రీనివాస్, కమ్మరిపేటఊరంతా ఒక్కటవుతంచాలా గ్రామాల్లో వరుసలు పెట్టి పిలుస్తారు. మా గ్రామంలో వరుసలతో పాటు వెటకారం జోడించి పిలుస్తాం. ఇది ఎప్పటినుంచో వస్తున్న పరంపర. ఏ వర్గంవారైనా వరుసపెట్టి పిలవడం మాకు అలవాటు. మా గ్రామంలో గొడవలు పడ్డా.. ఇతర గ్రామాలు ఒత్తిడి ప్రయోగిస్తే ఊరంతా ఒక్కటవుతం. ఇది మా ఊరు గొప్పతనం.– గొల్ల ముఖేశ్, కమ్మరిపేట -
ఓస్! ఇంతేనా?!
ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుంది? ఏమిటీ పిచ్చి ప్రశ్న?! పిచ్చి ప్రశ్న కాదు. కొందరు శాస్త్రవేత్తలకు వచ్చిన ఆలోచన! వారి ఆలోచనకు తాజాగా ఒక గణిత శాస్త్రవేత్త అంచనా వేసి పెట్టారు. ఆయన లెక్క ప్రకారం – ప్రస్తుత ప్రపంచ జనాభాను మొత్తం ఒక ముద్దలా చేస్తే ఆ ముద్ద ఎంత పరిమాణంలో ఉంటుందో తెలుసా? మీరు అనుకున్న దాని కంటే చాలా చిన్నదిగా! ఇదేం జవాబు? లెక్కా పక్కా ఉండక్కర్లేదా? ఉంది.. లెక్క ఉంది.. పక్కాగా కూడా ఉంది.‘రెడిట్’ ఇంటర్నెట్ ఫోరమ్లో ‘కివి2703’ అనే అకౌంట్లో ఒక అజ్ఞాత గణితశాస్త్ర నిపుణుడు ప్రపంచ జనాభా మొత్తాన్ని ఒక ముద్దగా (మీట్బాల్) గా చేస్తే 0.6 మైళ్లు.. అంటే కిలోమీటరు వెడల్పు లోపలే ఉంటుందని అంచనా వేశారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, న్యూయార్క్లో 1250 అడుగుల ఎత్తయిన ‘ఎంపైర్ స్టేట్ బిల్డింగ్’కు రెండున్నర రెట్లు, లేదా పారిస్లో 1063 అడుగుల ఐఫిల్ టవర్కు మూడింతలకు పైగా ఎత్తులో ఆ మీట్బాల్ ఉంటుందని ఆయన లెక్క తేల్చారు. – సాక్షి, స్పెషల్ డెస్క్శాస్త్రవేత్త గారూ.. మీరు ఓకేనా ?గణిత శాస్త్రవేత్త సమాధానం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. 788 కోట్ల జనాభాను ముద్దగా చేస్తే ‘ఇంతేనా ఉండేది.. ఇంత చిన్నాగానా’ అని ఒక నెట్ యూజర్ ఆశ్చర్యపోతే, ‘ఇంతకన్నా పెద్దదిగా ఉంటుంది అనుకున్నానే..’ అని ఇంకొక యూజర్ కామెంట్ చేశారు. మరొకరైతే, ‘మీరు బాగానే ఉన్నారా సైంటిస్టు గారూ?’ అని గణిత శాస్త్రవేత్తపై జోక్ వేశారు. గతంలో – మానవజాతి ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ జనాభా అంతటిని కలిపి అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ లోయలోకి చేరిస్తే ఎంత పరిమాణంలో ఉంటుందో ఒక సైన్స్ యూట్యూబ్ చానల్ వేసిన గ్రాఫిక్స్ నుంచి స్ఫూర్తి పొంది ఈ గణిత శాస్త్రవేత్త తాజాగా తన లెక్కలు వేశారట. మానవులందరూ ఒక చోట శంఖం ఆకారంలో కుప్పగా ఆ వీడియోలో ఉండగా, అజ్ఞాత శాస్త్రవేత్త అదే ప్రయోగాన్ని ఒక గుండ్రటి మాంసపు ముద్దగా చేసి చూపించారు. సెంట్రల్ పార్క్లో ‘మీట్బాల్’మానవ ‘మీట్బాల్’ పరిమాణాన్ని లెక్కంచటానికి అజ్ఞాత గణితవేత్త కొన్ని ప్రాథమిక అంచనాలను తీసుకున్నారు. ప్రస్తుత ప్రపంచ జనాభాను 788 కోట్లుగా వేసుకున్నారు. ఒక్కో మనిషి సగటు బరువును 62 కిలోలుగా అనుకున్నారు. మానవ శరీరాల సాంద్రతను క్యూబిక్ మీటరుకు 985 కిలోగ్రాములుగా లెక్కించారు. క్యూబిక్ మీటరు అంటే ఒక మీటరు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు ఎత్తు ఉన్న ప్రదేశం. ఈ అంచనాల నుంచి ‘హ్యూమన్ మీట్బాల్’ ఎంత పరిమాణంలో ఉంటుందో లెక్కించారు. ఆ లెక్క ప్రకారం భూమి పైన ఉన్న 788 కోట్ల మందిని ఒక చక్కటి బంకతో కలిపి ముద్ద చేస్తే ఇంచుమించు ఒక కిలోమీటరు వెడల్పులో గోళాకారం తయారైంది. ఆ ఎర్రటి మాంసపు బంతిని న్యూయార్క్ సెంట్రల్ పార్క్ మధ్యలో ఉంచితే ఎలా ఉంటుందో కూడా ఆయన ఒక విజువల్ సృష్టించారు. గ్రాండ్ కాన్యన్లో ‘మీట్ కోన్’అమెరికాలోని సుప్రసిద్ధ యూట్యూబ్ చానళ్లలో ‘వీసాస్’ ఒకటి. విద్య, సైన్స్, గణితం వంటి అంశాలపై 40 ఏళ్ల మైకేల్ స్టీవెన్స్ వీడియోలు చేస్తుంటాడు. ఈ యూట్యూబ్ చానల్లో గతంలో పోస్ట్ చేసిన ఒక వీడియోను చూసి మానవ మీట్బాల్ను అంచనా వెయ్యటానికి స్ఫూర్తి పొందారు రెడిట్ అజ్ఞాత గణిత శాస్త్రవేత్త. ఆరిజోనా రాష్ట్రంలో కొలరాడో నది ఒడ్డున ఉన్న గ్రాండ్ కాన్యన్ లోయలో... సృష్టి ఆరంభం నుంచి ఉన్న మానవ జనాభానంతా (సుమారు 10,600 కోట్లు) పోస్తే, ఆ లోయలో 15 కుప్పలు తయారైనట్లు ‘వీసాస్’ ప్రెజెంటర్ మైకేల్ స్టీవెన్స్ గ్రాఫిక్స్తో చేసిన వీడియో అది. అంతమంది జనాభాను ఒక చోట చేర్చినా కూడా ఆ లోయ ఇంకా ఖాళీగానే ఉండటం విశేషం అని స్టీవెన్స్ అంటారు. 446 కి.మీ. పొడవు, కొన్నిచోట్ల 1.6 కి.మీ. వరకు లోతు ఉన్న ఆ లోయలో.. కెనడాకు చెందిన గ్రాఫిక్ డేటా విజువలైజేషన్ బ్లాగర్ ఇస్మాయిల్ శాంటోస్ బ్రాల్ట్ జనాభాను నింపారు. మనిషి సగటు బరువును 70 కిలోలుగా వేసుకుని, 49 కోట్ల టన్నుల బరువుతో 700 కోట్ల మంది జనాభాను ఒక కుప్పగా చేరిస్తే అదే పరిమాణంలో 15 కుప్పలు తయారయ్యాయి. ఈ వీడియో ప్రేరణతోనే ఇప్పుడీ రెడిట్ శాస్త్రవేత్త ప్రస్తుత జనాభాతో మీట్బాల్ను సృష్టించారు. -
సుశిక్షిత మూగ గూఢచారులు
వాసన పసిగట్టి ప్రమాదాన్ని కనిపెట్టే జాగిలాలను మాత్రమే ఇప్పటి వరకు మనం చూశాం. అయితే పైకి కనిపించని ‘నిగూఢ దళాలు’ కూడా వివిధ దేశాల సైన్యాలలో నిశ్శబ్దంగా పని చేసుకుంటూ పోతున్నాయి. అవి మందుపాతరలను కనిపెడతాయి. సముద్ర జలాల్లోని పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. సరిహద్దుల్లో చొరబాటు దారులను అడ్డుకుని, వారిపై దాడి కూడా చేస్తాయి. శిక్షణ పొందిన ఈ మూగజీవులు.. ప్రపంచ దేశాల ఆర్మీలకు గొప్ప ‘మార్మిక’ శక్తిగా తోడ్పడుతున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్మహా తెలివైన ‘హీరో ర్యాట్స్’దశాబ్దాల అంతర్యుద్ధంతో మందుపాతరల భూమిగా మారిన కాంబోడియా ఆనాటి మందుపాతరలను కనిపెట్టి, వాటిని శక్తిహీనం చేసేందుకు ఎలుకల సహాయం తీసుకుంటోంది. శిక్షణ పొందిన ‘ఆఫ్రికన్ జెయింట్ పౌచ్డ్ ర్యాట్స్’ లేదా ‘హీరో ర్యాట్స్’ అనే ఆ ఎలుకలు మందుపాతరలు కచ్చితంగా గుర్తిస్తున్నాయి. ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇంకా అనేక యూరోపియన్ దేశాల సైన్యాలు కూడా హీరో ర్యాట్స్ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ హీరో ర్యాట్స్ సబ్ సహారా ఆఫ్రికాకు చెందినవి. టెక్నాలజీ సైతం పసికట్టలేని టి.ఎన్.టి. (ట్రైనైట్రోటోల్యున్) వంటి పేలుడు పదార్థాల సూక్ష్మ జాడలను కూడా ఇవి తమ ఆఘ్రాణ శక్తితో గుర్తించగలవు. 45 సెంటీమీటర్ల పొడవైన శరీరంతో, దాదాపు అర మీటరు పొడవున్న తోకలు కలిగి ఉండే హీరో ర్యాట్స్.. ఇంటి ఎలుకల కంటే కాస్త పెద్దవిగా, చిన్న పిల్లిని పోలి ఉంటాయి. భూమి లోపల ఉన్న మందుపాతరలపై అవి పేలకుండా నడిచేంత తేలికగానూ ఉంటాƇు. మొజాంబిక్, అంగోలా దేశాల సైన్యంలో కూడా ఈ ‘హీరో ర్యాట్స్’ దళాలు ఉన్నాయి. డిటెక్టర్ల కంటే మెరుగైనవి!ఒక హీరో ర్యాట్ టెన్నిస్ కోర్టు విస్తీర్ణంలో ఉండే భూమి లోపలి ప్రాంతాన్ని కేవలం 30 నిమిషాల్లో స్పష్టంగా గాలించగలదు. ఇదే పని చేయడానికి మనుషులకు కొన్ని రోజులు పడుతుంది. పైగా ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లవచ్చు. హీరో ర్యాట్స్కి ఒక ఏడాది కంటే తక్కువ సమయంలో పూర్తి శిక్షణ ఇవ్వవచ్చు. ఇవి 6 నుంచి 8 సంవత్సరాలు జీవిస్తాయి. వాటి జీవితకాలంలో ఎక్కువ కాలాన్ని సైన్యంలో ఉపయోగించుకోవచ్చు. బెల్జియంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఎ.పి.ఒ.పి.ఒ. (యాంటీ పర్సనల్ లాండ్మైన్స్ డిటెక్షన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్) ఈ ఎలుకలకు శిక్షణ ఇస్తోంది. ‘హీరో ర్యాట్స్‘ అని బ్రాండ్ చేసి, వివిధ దేశాల సైన్యాల అవసరాలకు సరఫరా చేస్తోంది. మెటల్ డిటెక్టర్లు గుర్తించలేని ప్లాస్టిక్ మందుపాతరలను కూడా గుర్తించే నైపుణ్యం వీటికి ఉంది. మానవ కఫం నమూనాలలో క్షయవ్యాధిని కూడా గుర్తించే విధంగా వీటికి శిక్షణ ఇస్తున్నారు.సరిగ్గా బాంబు ఉన్న చోటుకు..కంబోడియా, ఉక్రెయిన్లు ఈ హీరో ర్యాట్స్ని మందుపాతరల ఏరివేతకు ప్రయోగిస్తుండగా.. ఇజ్రాయెల్ భద్రతా దళాలు విమానాశ్రయాల్లో లగేజీలలోని పేలుడు పదార్థాలను పసిగట్టేందుకు ఉపయోగిస్తున్నాయి. బాంబు వాసన పసిగట్టే జాగిలాలకు ఇవి దీటైనవి. కుదురుగా, వేగవంతంగా, ఎవరి గమనింపులోకీ వెళ్లకుండా ఈ ఎలుకలు ఉగ్రవాద ముప్పును ముందస్తుగా గుర్తించి, ముప్పును తప్పించటానికి సహాయపడతాయి. ఇప్పుడు రష్యా కూడా వీటిని ఉపయోగించుకుంటోంది. భారత్కు తేనెటీగల దళంప్రపంచంలోని వివిధ దేశాల సైన్యం ఎలుకల సహాయం తీసుకుంటున్నట్లే.. మనదేశం సరిహద్దుల భద్రత, రక్షణల కోసం తేనెటీగల్ని పెంచుతోంది. నిరంతరం అస్థిరంగా ఉండే బంగ్లాదేశ్ సరిహద్దులో సరిహద్దు భద్రతా దళం (బి.ఎస్.ఎఫ్.) తేనెటీగలను మోహరించింది. చొరబాట్లతోపాటు, స్మగ్లింగ్ను కూడా అరికట్టేందుకు పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో, బి.ఎస్.ఎఫ్. 32వ బెటాలియన్ ముళ్లతీగల కంచెల వెంట పెట్టెల్ని వేలాడదీసి వాటిల్లో తేనెటీగల్ని పెంచుతోంది. తేనెకు తేనె... భద్రతకు భద్రత! ఈ పెట్టెల లోపల ఉండే తేనెటీగల గుంపు... స్మగ్లర్లు, చొరబాటు దారులను అడ్డుకుంటుంది. కంచెలను దాటేందుకు ప్రయత్నించే వారిపైన ఆ గుంపు తక్షణం మూకుమ్మడి దాడి చేస్తుంది. తేనెటీగల కోసం ఆ సమీపంలో తేనెనిచ్చే పూల మొక్కలను పెంచుతున్నారు. బి.ఎస్.ఎఫ్. సిబ్బందికి తేనెటీగల పెంపకంలో సైన్యం శిక్షణనిస్తోంది.నీళ్ల అడుగున.. నిగూఢాల ఛేదనప్రపంచ దేశాల్లోని వివిధ నావికా దళాలు సముద్రంలోని అత్యంత తెలివైన జీవుల్ని తమ కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా నావికాదళం ఇందుకోసం సముద్ర క్షీరదాల కార్యక్రమం (మెరైన్ మమ్మల్ ప్రోగ్రామ్) చేపట్టింది. నీటి అడుగున పొంచి ఉండే మైన్ల ప్రమాదాలను గుర్తించడానికి, నావికా దళం ఆస్తులను రక్షించడానికి డాల్ఫిన్లు, ‘కాలిఫోర్నియా సీ లయన్స్’కు యూఎస్ శిక్షణ ఇస్తోంది. డాల్ఫిన్లు, వాటి సహజసిద్ధమైన ధ్వని గ్రాహ్యతా నైపుణ్యంతో యంత్రాల కంటే కూడా కచ్చితంగా.. మునిగిపోయిన పేలుడు పదార్థాలను గుర్తించగలవు. అవి వేగంగా ఉంటాయి. తెలివిగా ఉంటాయి. సముద్ర గర్భంలోని వస్తువుల్ని, డైవర్లను గాలించేవిధంగా వాటికి శిక్షణ ఉంటుంది. రష్యా కూడా నీటి అడుగున నిఘా, గూఢచర్యం వంటివాటి కోసం డాల్ఫిన్ లకు శిక్షణ ఇవ్వటం మొదలు పెట్టింది. -
డీల్ కాదు.. జేబు ఖాళీ!
ఒక వస్తువు కావాల్సి వచ్చి ఆన్స్ లైన్స్ లో వెతికేటప్పుడు.. ఆ ఉత్పాదన తాలూకు పేజీలో ‘ఒకటి మాత్రమే ఉంది’, ‘10 నిమిషాల్లో కొంటే భారీ డిస్కౌంట్’, ‘ఫ్లాష్ డీల్ ఈ రోజు వరకే’ వంటి సందేశాలు దర్శనమిస్తాయి. అవి నిజమనుకుని నమ్మి కస్టమర్లు వెంటనే కొనేస్తారు. అమ్మకాలను పెంచుకోవడమే లక్ష్యంగా చేసే ఈ మాయాజాలాన్ని ‘డార్క్ ప్యాటర్న్స్’ అని పిలుస్తారు. ఈ–కామర్స్ కంపెనీలు పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఆర్భాటంగా నిర్వహించే ‘ఆన్స్ లైన్స్ సేల్స్’ సమయంలో ఈ మాయాజాలం విభిన్న రూపాల్లో ‘స్క్రీన్స్ ’పైన దర్శనమిస్తుంది.ఓ సర్వే ప్రకారం కొనాలన్న ఆలోచన లేనప్పటికీ డార్క్ ప్యాటర్న్స్ కారణంగా ఆకర్షితులై 40% కంటే ఎక్కువ మంది వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తున్నారట. షాపింగ్ వెబ్సైట్ల తప్పుదారి పట్టించే, మోసపూరిత, చట్టవిరుద్ధ వ్యూహాలే ఇందుకు ప్రధాన కారణం. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ కంపెనీలు వివిధ రకాల డార్క్ ప్యాటర్న్స్తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. తీరా చూస్తే తాము ఎక్కువ ఖర్చు చేశామనో.. లేదా అంతగా ఉపయోగకరం కాని ఉత్పత్తులను కొన్నామనో వినియోగదారులు తరువాత తెలుసుకుంటున్నారు. ఆన్స్ లైన్ కస్టమర్లు తమకు కావాల్సిన వస్తు, సేవలను వేగంగా, సౌకర్యంగా పొందడం కోసం తరచూ డబ్బు, సమాచారం, గోప్యతతో రాజీ పడుతున్నారనేది నగ్న సత్యం.ఒకటికి రెండుసార్లు..ఏ వెబ్సైట్ ఉపయోగిస్తున్నా, సర్వీస్ ప్రొవైడర్ను ఎంతగా విశ్వసించినా మీ నుండి ఏ సమాచారం అడుగుతున్నారు, ఎటువంటి అనుమతులు కోరుతున్నారు అనే అంశాలపై వినియోగదార్లు అప్రమత్తంగా ఉండాలి. స్క్రీన్స్ పై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ‘బై’ బటన్స్ క్లిక్ చేసే ముందు మీకు కావాల్సింది మాత్రమే అక్కడ ఉందో లేదో ఒకటికి రెండుసార్లు గమనించాలి. ఆన్స్ లైన్ సేవల కోసం సైన్ అప్ చేసే ముందు అన్ని సమయాల్లో రద్దు చేసుకునేందుకు స్పష్టమైన, కచ్చిత అవకాశం ఉందా లేదా నిర్ధారించుకోవాలి. కనీసం ఒకటి..అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా–2024 నివేదిక ప్రకారం.. అత్యధికంగా డౌన్స్ లోడ్ అయిన టాప్–53 భారతీయ యాప్స్లో ఒకటి మినహా మిగిలినవన్నీ కనీసం ఒక డార్క్ ప్యాటర్న్ ఉపయోగించాయట. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం దాదాపు 50% భారతీయ వినియోగదారులు ఆన్స్ లైన్ చెల్లింపుల సమయంలో కనీసం ఒక డార్క్ ప్యాటర్న్ సమస్యను ఎదుర్కొన్నారట.రంగంలోకి కేంద్ర ప్రభుత్వంఈ–కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న ఈ మోసపూరిత విధానాల పట్ల వినియోగదారులు, ఆఫ్లైన్స్ ట్రేడర్ల నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఉత్పత్తులు పరిమితంగా ఉన్నాయని బుకాయించడం, పేమెంట్ చేసే సమయానికి అదనపు చార్జీ, నకిలీ కౌంట్డౌన్స్ టైమర్స్, ఒక వస్తువు చూపించి మరొకటి అంటగట్టడం, లావాదేవీ రద్దు చేసే అవకాశం లేకపోవడం, యూజర్ కోరకున్నా ప్రకటనల వీడియో ప్లే కావడం, తప్పుడు రివ్యూలు, పోల్చుకునే అవకాశం లేకపోవడం వంటి 13 రకాల డార్క్ ప్యాటర్న్స్ను గుర్తించింది.నిబంధనలను పాటించకపోతే చట్ట పరంగా చర్యలు ఉంటాయని ఈ–కామర్స్ కంపెనీలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. వినియోగదారుల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే, అనాలోచిత కొనుగోళ్లు, చర్యలకు దారితీసే తప్పుదారి పట్టించే డార్క్ ప్యాటర్న్స్ను తొలగించడానికి చేసిన మార్పులను వివరిస్తూ అంతర్గత వార్షిక తనిఖీ నివేదికలను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని కంపెనీలకు స్పష్టం చేసింది. విదేశాల్లో చట్టాలుభారత్లో ఇప్పటివరకు ఈ పద్ధతిని నిషేధించే నిర్దిష్ట చట్టాలు లేవు. వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రకారం అన్యాయమైన వాణిజ్య పద్ధతులుగా గుర్తిస్తూ డార్క్ ప్యాటర్న్స్ను అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) 2023 నవంబర్లో మార్గదర్శకాలను జారీ చేసింది. అమెరికా, ఈయూ తదితర దేశాల్లో దీనికి సంబంధించి చట్టాలు అమలులోనూ ఉన్నాయి. వినియోగదారులు కుకీజ్ను అంగీకరించడం కంటే తిరస్కరించడం కష్టతరం చేసినందుకు గూగుల్, ఫేస్బుక్ రెండింటికీ ఈయూ, ఫ్రెంచ్ డేటా రక్షణ చట్టాల ప్రకారం 2022లో జరిమానా విధించారు. -
భూకంప ప్రభావం అంతరిక్షంలో!!
పట్టాలపై రైలు పరుగులు తీస్తుంటే.. హఠాత్తుగా ముందున్న ఇంజిన్ కాస్తంత నెమ్మదించినా వెనకాలే క్యూ కట్టిన బోగీలన్నీ టపటపా ఢీకొన్నంత పనిచేస్తాయి. ఎందుకంటే ప్రతి బోగీ పక్క బోగీతో అనుసంధానమై ఉంటుంది. కానీ ఎలాంటి అనుసంధానంలేని సుదూర శాటిలైట్లు సైతం భూకంపం వేళ ప్రభావితం అవుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. భూకంపం ధాటికి భూకంపకేంద్ర సమీప భవనాలు, భవంతులు పేకమేడల్లా కదలిపోవడం చూస్తుంటాం. కానీ ఆకాశంలో ఉండే కృత్రిమ ఉపగ్రహాల పనితీరు సైతం భూకంపాల తీవ్రతకు లోనవుతోందని తాజా పరిశోధనలో తేలింది. భౌతికంగా భూమితో అనుసంధానంకాని ఉపగ్రహాలకు భూకంప పర్యవసానాలకు మధ్య గల సంబంధాన్ని తొలిసారిగా ఈ పరిశోధన ఆవిష్కరించింది. జపాన్లోని నగోయా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తల బృందం చేసిన ఈ పరిశోధనా తాలూకు వివరాలు ‘ఎర్త్, ప్లానెట్స్, స్పేస్’జర్నల్లో ప్రచురితమయ్యాయి. భూతలం సహా గగనతలం.. రెండు భూఫలకాల కొనల వద్ద రాపిడి, ఢీకొనే సందర్భాల్లో భూకంపం సంభవిస్తుంది. ఇవి భూతల వనరులనే కాదు గగనతల కృత్రిమ వనరులైన శాటిలైట్లనూ ప్రభావితం చేస్తాయని అధ్యయనకారుల్లో అనుమానం మొదలైంది. ఈ అనుమానాన్ని నివృత్తిచేసుకునేందుకు గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(జీఎన్ఎస్ఎస్)లోని 4,500కుపైగా రిసీవర్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుని ఆ డేటాతో త్రిమితీయ(3డీ) ‘‘వాతావరణ ఇబ్బందుల’’ముఖచిత్రాన్ని రూపొందించారు. 2024 జనవరి ఒకటో తేదీన జపాన్లోని ఇషికావా ప్రిఫెక్ఛర్లోని నోటో ద్వీపకల్పంలో రిక్టార్ స్కేల్పై 7.5 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. అప్పుడు ఆకాశంలోకి సంక్లిష్టమైన ధ్వని తరంగాలు దూసుకెళ్లాయి. ఇవి భూమి నుంచి ఆకాశంలో 60 నుంచి 1,000 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అయనో ఆవరణం(ఐనోస్ఫియర్)లోకి వెళ్లాయి. అక్కడి స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లతో నిండిన వాయువులను ఈ ధ్వనితరంగాలు విపరీతంగా ప్రేరేపించాయి. దాంతో ఈ వాయువులు కింద పొర అయిన థర్మోస్ఫియర్ వాతావరణంలోకి కొంత శక్తిని విడుదలచేశాయి. అప్పటికే థర్మోస్పియర్ ఆవరణలో స్థిరంగా ఉన్న శాటిలైట్లపై ఈ అదనపు శక్తి ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో శాటిలైట్ల నుంచి భూమి మీదకు జరగాల్సిన కమ్యూనికేషన్ సిగ్నళ్ల ప్రసరణ వేగంలో మార్పులు కనిపించాయి. సిగ్నళ్లు ఆలస్యంగా రావడంతోపాటు సిగ్నళ్లలో సాంద్రత సైతం తగ్గిపోయినట్లు గుర్తించారు. టోమోగ్రఫీ సాయంతో వైద్యరంగంలో వాడే సీటీ స్కాన్ తరహాలో వేర్వేరు కోణాల్లో శాటిలైట్ల డేటాను క్రోడీకరించి 3డీ చిత్రాలను రూపొందించారు. భూకంపం సంభవించినప్పుడు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ధ్వని తరంగాలు ఐనోఆవరణను చేరిపోతున్నాయి. ప్రశాంత కొలనులో రాయి విసిరితే ఏర్పడే వలయాకార అలల్లా ధ్వని తరంగాలు ఐనోస్ఫియర్లోకి వెళ్తున్నాయి. భూకంపం సంభవించినప్పుడు భూఫలకాలు ఢీకొన్న ఒక్క ప్రాంతంలోనే ధ్వని తరంగాలు ఉధ్భవిస్తాయని గతంలో భావించారు. అలాకాకుండా నోటో ద్వీపకల్ప ఘటనలో 150 కిలోమీటర్ల పొడవునా రెండు భూఫలకాలు ఢీకొన్న చోట్ల నుంచి ధ్వనితరంగాలు పుట్టుకొచ్చాయని, ఇలాంటి సందర్భాల్లోనే అధిక తరంగాలు ఉద్భవిస్తున్నాయని ఈ పరిశోధనలో ముఖ్య రచయిత డాక్టర్ వెజియాంగ్ ఫూ చెప్పారు. పలు సమస్యలు.. ధర్మోస్ఫియర్పై అదనపు ఒత్తిడితో శాటిలైట్ల నుంచి ప్రసారాల నాణ్యత తగ్గిపోవడంతో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్), శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భూకంపాలతో ఉపగ్రహాల పనితీరూ దెబ్బతింటుందని స్పష్టంగా అర్థమైందని మరో రచయిత, ప్రొఫెసర్ యుచీ ఒట్సుకీ చెప్పారు. భూకంపాల ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత పటిష్టచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని యుచీ అభిప్రాయపడ్డారు. భూకంపాలతోపాటు సునామీ, అగి్నపర్వతాల విస్ఫోటం వంటి అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితులకూ తమ అధ్యయన మోడళ్లను అన్వయించి మరింత విస్తృతస్థాయి అవగాహనకు ప్రయతి్నస్తున్నామని పరిశోధకులు వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎండలు ముందే ముగిశాయెందుకు?
మే నెల భానుడి ప్రచండ వేడికి పెట్టింది పేరు. రోహిణి కార్తెలో రోకళ్లు పగులుతాయని పెద్దల మాట. సూర్యప్రకోపానికి జనం విలవిల్లాడిపోయే కాలంగా ఎండాకాలం దశాబ్దాలుగా పేరు తెచ్చుకుంది. కానీ ఈసారి మే నెలలో దాదాపు వేడి మాయమై చల్లదనమే రాజ్యమేలింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. పైగా ముందస్తుగానే ఎండాకాలం జనాలకు బైబై చెప్పి వెళ్లిపోయింది. 2024లో మే, జూన్ నెలల్లో ఎండలు విపరీతంగా ఉండటంతో 2025లో ఆదిత్యుడు ఇంకెంత రెచ్చిపోతాడోనన్న భయాలను పటాపంచలు చేస్తూ ఈసారి మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలోనే నమోదవడం విశేషం. తక్కువ ఎండలకు తోడు తక్కువ రోజులే ఎండాకాలం కొనసాగడం గమనార్హం. వేడిమి, ఉక్కబోతతో విసుగుతెప్పించే వేసవికాలం వేగంగా గడిచిపోయింది. 2024 సంవత్సరం భూమి మీద అత్యంత ఉష్ణమయ ఏడాదిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక భారత్లో గత ఏడాది మేలో దేశవ్యాప్తంగా వడగాలులు చండ ప్రచండంగా వ్యాపించి జనాన్ని బెంబేలెత్తించాయి. ఇందుకు పూర్తి భిన్నంగా 2025 మేనెల సాగిపోవడం సాధారణ ప్రజానీకాన్ని ఆశ్చర్యంలో, ఒకింత ఆలోచనలో పడేసింది. ఈసారి దేశ వాతావరణ ముఖచిత్రంలో మార్పులొచ్చాయని కొందరు విశ్లేషణలు మొదలెట్టారు. 2024 మే, జూన్లో..గత ఏడాది మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడంతోపాటు వడగాల్పుల ఘటనలు చాలా చోట్ల సంభవించాయి. దీంతో చాలా ప్రాంతాల్లో కరువు తాండవించింది. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. నీటి లభ్యత బాగా తగ్గిపోయింది. భూగర్భజలాలు మరింత కిందకు వెళ్లిపోయాయి. విద్యుత్ కొరత సమస్య సైతం అధికమైంది. వాతావరణ మార్పులతో ముడిపడిన ఈ అధిక ఉష్ణోగ్రతల విపరిణామాలు వెనువెంటనే వ్యవసాయం, ఆరోగ్యంతోపాటు కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల జీవనంపైనా దుష్ప్రభావాలు చూపాయి. వడదెబ్బకు జనం పిట్టల్లా రాలిపోయారు. 2025 మేలో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాకుండా అకాలవర్షాలు అడ్డుకున్నాయి. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి. పలు చోట్ల కుండపోత వర్షాలు కురిశాయి. వాతావరణ చక్రంలో మార్పుల కారణంగానే మేలో వేడిమి మటుమాయమై చల్లదనం వచ్చి చేరిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చల్లదనం అత్యధిక రోజులు కొనసాగడంతో అది అంతిమంగా ఎండకాలం ముగింపునకు ముందస్తు నాంది పలికిందని నిపుణులు విశ్లేషించారు. మరెన్నో కారణాలు..వర్షాకాలం ఈసారి ముందస్తుగా ముంచుకురావడం సైతం ఎండకాలం తీవ్రతను తగ్గించేసింది. వాతావరణంలో ముందస్తుగా తేమ శాతం పెరగడం, చల్లని గాలుల క్రమానుగతిలో మార్పులు సైతం ఉష్ణోగ్రత అధికం కాకుండా అడ్డుకున్నాయి. దీంతో వేసవికాలంలో వేడి తగ్గిపోయింది. గతంతో పోలిస్తే ఈసారి ఎండాకాలంలో వాతావరణం చాలావరకు మేఘావృతమైంది. దాంతోపాటు దేశంలో మేనెలలో ప్రతిరోజూ ఏదోఒక చోట వర్షాలు పడుతూ సగటు ఉష్ణోగ్రత పెరగకుండా నిలువరించాయి. ఈ చల్లదన పరిస్థితులు పరోక్షంగా ప్రభుత్వాల మీదా పెనుభారాన్ని ఒక్కసారిగా దించేశాయి. విద్యుత్ డిమాండ్ పెరగకుండా అడ్డుకున్నాయి.ముందుకొచ్చిన కొత్త ధోరణిఉడికించే ఉష్ణోగ్రతలు ఉన్నపళంగా తగ్గిపోవడం కొన్ని రకాల పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చక్కటి వేడి పరిస్థితుల్లోనే కొన్నిరకాల పంటలు ఏపుగా పెరిగే పరిస్థితులు ఉంటాయని, ఈసారి ఎండలు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఆయా పంటల సాగుఫలంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. ఈసారి మారిన ఈ పరిస్థితులకు తగ్గట్లు కర్షకులు తమ పంటల విత్తునాటడం మొదలు ఎరువులు, పురుగుమందులు చల్లడం దాకా ప్రతిదాంట్లో కాస్తంత సమయపాలన పాటించడం తప్పనిసరి అయిందని వాళ్లు చెబుతున్నారు. హఠాత్తుగా ఎండాకాలం వ్యవధి తగ్గి వర్షాలు మొదలవడంపై వాతావరణ విభాగం సైతం వాతావరణ ముందస్తు అంచనాల వ్యూహాలకు పదునుపెట్టింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆపరేషన్ స్పైడర్స్వెబ్...నయా పెరల్ హార్బర్!
నాటో దేశాలు నిరంతరం ఆయుధాలతో సహా సర్వ సామగ్రీ సమకూరుస్తుంటే తప్ప యుద్ధరంగంలో పూట గడవని పరిస్థితి ఉక్రెయిన్ది. అవతలున్నదేమో అపార సైనిక పాటవానికి మారుపేరైన రష్యా. అలాంటి అగ్రరాజ్యానికి చెందిన ఏకంగా 41 బాంబర్ విమానాలను ఏదో వీడియోగేమ్ ఆడుతున్నంత అలవోకగా దాని సొంతగడ్డ మీదే ధ్వంసం చేసిన తీరు ప్రపంచవ్యాప్తంగా పెను కలకలం సృష్టించింది. అది కూడా ఏ ఒక్కచోటో కాదు. రష్యావ్యాప్తంగా ఏకంగా మూడు టైమ్ జోన్లలో, ఏకంగా 6,000 కి.మీ. పరిధిలో ఉన్న ఐదు వైమానిక స్థావరాలపై ఏకకాలంలో విజయవంతంగా దాడులు జరగడం విశేషం. ఆ దెబ్బకు రష్యా బాంబర్ శ్రేణి విమానాల్లో మూడో వంతు తుడిచిపెట్టుకుపోయాయి! అత్యంత సంక్లిష్టమైన ఇంతటి ఆపరేషన్ను పూర్తి కచ్చితత్వంతో, కేవలం డ్రోన్ల సాయంతో కారుచౌకగా, తనవైపు ఎలాంటి ప్రాణనష్టమూ లేకుండా పూర్తి చేసిన వైనం రక్షణ నిపుణులనే విస్మయపరిచింది. ఆధునిక ప్రపంచ యుద్ధ చరిత్రలోనే అతి పెద్ద, అత్యంత సంక్లిష్టమైన సర్జికల్ స్ట్రైక్ ఇదేనని చెబుతున్నారు. అంతేగాక ఏ కోణం నుంచి చూసినా అత్యంత విజయవంతమైన దాడిగా కూడా ఇది నిలిచింది. రష్యా చరిత్రలో అతి పెద్ద నిఘా వైఫల్యంగా కూడా ఇదేనని చెబుతున్నారు. ఈ దాడులను తమ పాలిట ‘పెరల్ హార్బర్’ ఉదంతంగా రష్యా మీడియానే అభివర్ణిస్తోంది. రెండో ప్రపంచయుద్ధం చివర్లో హవాయిలోని పెరల్ హార్బర్పై జపాన్ మెరుపు దాడులకు దిగి అమెరికా యుద్ధనౌకలను సముద్రంలో ముంచేసింది. ఈ ఉదంతం అమెరికాను యుద్ధంలోకి లాగడమే గాక జర్మనీ, జపాన్ తదితర అక్షదేశాల ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. ‘ఆపరేషన్ స్పైడర్స్వెబ్’ పేరిట ఉక్రెయిన్ జరిపిన డ్రోన్ దాడులు రష్యాను ఆ స్థాయిలో దెబ్బకొట్టాయని అక్కడి మీడియా వాపోతోంది. అది అక్షరాలా నిజమేనని రక్షణ నిపుణులు ముక్త కంఠంతో చెబుతున్నారు. ప్రపంచ దేశాలన్నీ ఆధునిక యుద్ధ వ్యూహాలను తక్షణం సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని ఇది మరోసారి గుర్తు చేసిందని వారంటున్నారు.ఇంత భారీ ఆపరేషన్కు రష్యా గడ్డ మీద కూడా అవసరమైన మద్దతు తప్పనిసరి. ఇందుకోసం ఉక్రెయిన్ రష్యాలో ఏకంగా ఆఫీసే తెరిచింది! అది కూడా రష్యా అంతర్గత భద్రతా విభాగం ఎఫ్ఎస్బీ కార్యాలయం పక్కనేనని జెలెన్స్కీ వెల్లడించడం విశేషం. ఏ ప్రాంతంలో అన్నది మాత్రం చెప్పలేదు. → మొత్తం ఆపరేషన్ను ఉక్రెయిన్ సీక్రెట్ సరీ్వస్ (ఎస్బీయూ) పక్కాగా నిర్వహించింది.→ దీన్ని జెలెన్స్కీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. దాడి వెనక ఏడాదిన్నర ప్రణాళిక ఉన్నట్టు వెల్లడించారు. ‘‘రష్యా గడ్డ నుంచే ఎంతోమంది ఇందుకు తోడ్పడ్డారు. వారందరినీ దాడులకు ముందే సురక్షితంగా తరలించాం. మావైపు ప్రాణనష్టం లేకుండా రష్యాను చావుదెబ్బ తీశాం’’ అన్నారు. రష్యాపై మరిన్ని దాడులు తప్పవన్నారు.→ డ్రోన్ దాడుల అనంతరం రష్యా ప్రతీకార దాడుల్లో 12 మంది ఉక్రెయిన్ సైనికుల మృతికి బాధ్యత వహిస్తూ ఉక్రెయిన్ పదాతి దళాధిపతి మేజర్ జనరల్ మైకేలియో ద్రాపత్యు రాజీనామా చేశారు.ఎక్కడెక్కడ దాడులు... → ఒలెన్యా (ముర్మాన్స్క్ ), బెలయా (ఇర్కుట్స్క్ –సైబీరియా), ద్యాగిలెవొ (సెంట్రల్ ర్యాజాన్), ఇవనొవొ → ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి బెలయా ఏకంగా 4,000 కి.మీ. దూరంలో ఉంటుంది! → వీటిలో ఒలెన్యా, బెలయా స్థావ రాల మధ్య దూరం ఏకంగా 6,000 కి.మీ.! ఇవి పరస్పరం మూడు టైమ్ జోన్ల దూరంలో ఉండటం విశేషం. → అమూర్, ఇవనోవో, ర్యాజన్ తదితర ప్రాంతాల్లోనూ డ్రోన్ దాడుల యత్నాలు జరిగాయని రష్యా ధ్రువీకరించింది.గతంలోనూ... మూడేళ్ల పై చిలుకు యద్ధంలో అనూహ్య, ఆకస్మిక దాడులతో రష్యాకు ఉక్రెయిన్ తీవ్ర నష్టం కలిగించడం ఇది తొలిసారేమీ కాదు. → 2022 ఏప్రిల్లో రష్యా యుద్ధనౌక మోస్క్ వాను నెప్ట్యూన్ యాంటీ షిప్ మిసైళ్లతో ఉక్రెయిన్ నల్లసముద్రంలో ముంచేసింది. ళీ 2022 అక్టోబర్లో ఆక్రమిత క్రిమియాను రష్యా భూభాగానికి కలిపే కీలక కెర్చ్ బ్రిడ్జిని బాంబులతో పేల్చేసింది. ళీ 2024 ఆగస్టులో ఉక్రెయిన్ సైన్యం తొలిసారిగా సరిహద్దులు దాటి రష్యా భూభాగంపై మెరుపు దాడులకు దిగి కుర్క్స్ ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకుంది. తీరని అవమానం మిగిల్చిుంది!ట్రక్కుల్లో తరలించి...సింపుల్ ప్లానింగ్. పూర్తి గోప్యత. పక్కా రిహార్సల్స్. ఆకస్మిక దాడి. అమలులో మెరుపువేగం. 100 శాతం లక్ష్యసాధన. సర్జికల్ స్ట్రైక్స్ వంటి స్పెషల్ ఆపరేషన్స్ ఏ మేరకు సఫలమైందీ తేల్చేందుకు ప్రఖ్యాత సైనిక నిపుణుడు అడ్మిరల్ విలియనం మెక్రావెన్ సిద్ధాంతీకరించిన గీటురాళ్లు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో మేళవించిన ఆపరేషన్గా స్పైడర్స్ వెబ్ నిలిచింది. → మొత్తం ఆపరేషన్లో ఉక్రెయిన్ చాలావరకు పౌర మౌలిక సదుపాయాలనే వాడుకుంది. → ఇంతటి భారీ స్థాయి దాడులకు ప్రణాళిక రచించిన ఉక్రెయిన్, అందుకు సిద్ధం చేసిన డ్రోన్లను రష్యాలోకి తేలిగ్గా దొంగచాటుగా తరలించడం విశేషం. → అనంతరం వాటిని ట్రక్కుల్లో చెక్క కంటైనర్లలో పెట్టి ఎయిర్బేస్లకేసి తరలించారు. → ఒక్కో కంటైనర్లో 36 డ్రోన్లను ఉంచారు. వాటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. → దాడుల్లో ఎక్కడా ప్రత్యక్షంగా సిబ్బందిని నియోగించే అవసరమే లేకుండా పకడ్బందీగా ముందస్తు ఏర్పాట్లు చేశారు. → ట్రక్కులను వైమానిక స్థావరాలకు అతి సమీపంలోకి తీసుకెళ్లారు. → అక్కడినుంచి నిర్ధారిత సమయంలో కంటైనర్ల పైకప్పును రిమోట్ ద్వారా తెరిచారు. → ఆ వెంటనే వాటిలోంచి డ్రోన్లు పైకెగిరి లక్ష్యాలపైకి దూసుకెళ్లాయి. సరిగ్గా విమానాలపై పడి పేలిపోయాయి. కంటైనర్ల నుంచి డ్రోన్లు పైకి ఎగురుతున్న దృశ్యాలతో కూడిన వీడియోలను రష్యా మీడియా విడుదల చేసింది. వాటిని అడ్డుకునేందుకు కొందరు సాయుధులు ట్రక్కులపైకి ఎక్కుతున్న దృశ్యాలు కూడా కొన్నింట్లో కనిపిస్తున్నాయి.కారుచౌకే.. కానీ ఖతర్నాక్ రష్యా ఎయిర్బేస్లపై దాడుల్లో ఉక్రెయిన్ వాడింది ఎఫ్పీవీ (ఫస్ట్ పర్సన్ వ్యూ) రకం డ్రోన్లు. → ఇవి కారుచౌకగా దొరుకుతాయి. పేలుడు పదార్థాలను బిగించి పంపగల ఒక్కో ఎఫ్పీవీ డ్రోన్ ఖరీదు కేవలం రూ.42 వేలు మాత్రమేనని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. → అయితే గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదించడంలో వీటికివే సాటి. → డ్రోన్కు అమర్చిన కెమెరా సాయంతో అక్కడి పరిసరాలను దాని ఆపరేటర్ ప్రత్యేక కళ్లద్దాల సాయంతో లైవ్లో చూడటమే గాక వీడియో తీయగలడు. రిమోట్గా ఆపరేట్ చేయగలడు. → పరిసరాల చిత్రీకరణ వంటి సైనికేతర పనుల్లో ఈ డ్రోన్లను విరివిగా వాడుతుంటారు. వీటి రేంజ్ కొన్ని కిలోమీటర్లకే పరిమితం.రష్యా అణుదాడి చేస్తుందా...? ఉక్రెయిన్ డ్రోన్ దాడులపై రష్యా తీవ్ర అవమాన భారంతో ఉడికిపోతోంది. కారుచౌకైన డ్రోన్లతో కోలుకోలేని దెబ్బతీయడాన్ని జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారం తప్పదని రష్యా రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. కనుక ఉక్రెయిన్పై భారీ స్థాయిలో విరుచుకుపడటం ఖాయమే. → ఉక్రెయిన్ ప్రధానంగా నాటో సభ్యదేశాలు సమకూర్చిన ఆయుధాలనే తనపై వాడుతోంది. కనుక యూరప్లోని నాటో దేశాల్లోని సైనిక స్థావరాలు, ఆయుధాగారాలను రష్యా లక్ష్యంగా చేసుకోవచ్చు. వాటిపై దాడులు చేస్తామని గతంలోనే ఎన్నోసార్లు హెచ్చరించింది కూడా. → ఉక్రెయిన్ బహుశా ఈ ప్రమాదాన్ని ముందే ఊహించింది. డ్రోన్ దాడులు పూర్తిగా తన పనేనని, నాటో మిత్రులకు ఏ సంబంధమూ లేదని జెలెన్స్కీ ప్రకటించారు. వాణిజ్యపరంగా సులువుగా అందుబాటులో ఉన్న డ్రోన్లనే దాడుల్లో వాడినట్టు వివరించారు. అందుకు రుజువుగా దాడుల ఫొటోలను విడుదల చేశారు. → నష్ట, అవమాన తీవ్రత దృష్ట్యా ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి దిగినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు.రష్యాకు నష్టం ఇలా... → 41 టీయూ–95, టీయూ–22ఎం3 దీర్ఘ శ్రేణి బాంబర్లు, దాడుల్లో వాటికి ఆద్యంతం దన్నుగా నిలిచే ఏ–50 నిఘా విమానాలపై డ్రోన్ దాడులు జరిగాయి. → వాటిలో 14 పూర్తిగా, మిగతా 27 చాలావరకు ధ్వంసమైనట్టు చెబుతున్నారు. → మూడున్నరేళ్లుగా ఉక్రెయిన్పై క్షిపణి, బాంబు దాడులకు రష్యా ప్రధానంగా ఉపయోగిస్తున్నది ఈ విమానాలనే! → ఈ నష్టం విలువ కనీసం రూ.60 వేల కోట్ల (700 కోట్ల డాలర్ల)పై చిలుకేనని రష్యా రక్షణ శాఖే అంచనా వేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రిటర్నుల దాఖలుకు రెడీనా..?
ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో 6.47 కోట్ల నుంచి 8.39 కోట్లకు రిటర్నులు పెరిగాయి. పెరుగుతున్న అవగాహన, ఆదాయపన్ను శాఖ విస్తృత ప్రచారం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (అసెస్మెంట్ సంవత్సరం 2025–26) ఆదాయపన్ను రిటర్నుల పత్రాలను ఆదాయపన్ను శాఖ నోటిఫై చేసింది. వీటిల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి ఫలితంగా అదనపు వివరాలు నమోదు చేయాల్సి వచ్చింది. వీటితోపాటు.. ఆదాయన్ను రిటర్నుల పత్రాల ఎంపిక విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఐటీఆర్ 1, 4లో మార్పులు ఐటీఆర్ 1, 4 పత్రాల దాఖలుకు మరింత మందికి అర్హత లభించింది. ఈక్విటీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై దీర్ఘకాల మూలధన లాభం కలిగిన వారు సైతం వీటిని దాఖలు చేయవచ్చు. కాకపోతే మూలధన లాభం ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షలు మించకూడదు. ‘‘ముందు సంవత్సరాల్లో సెక్షన్ 112ఏ కింద దీర్ఘకాల మూలధన లాభం (ఎల్టీసీజీ) పన్ను మినహాయింపు పరిధిలోనే ఉన్నప్పటికీ ఐటీఆర్–1 ఫారమ్కు అర్హత ఉండేది కాదు. దీనికి బదులు ఐటీఆర్–2 లేదా 3 దాఖలు చేయాల్సి వచ్చేది. ఇవి మరింత సంక్లిష్టంగా ఉండడంతో అధిక సమయం పట్టేది. చిన్న పన్ను చెల్లింపుదారులకు శ్రమ తగ్గించే ఉద్దేశ్యంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఐటీఆర్–1, 4 పరంగా అర్హత ప్రమాణాలను సవరించింది. మొత్తం ఎల్టీసీజీ రూ.1.25 లక్షలు మించనప్పుడు, మూలధన నష్టాలను క్యారీఫార్వార్డ్ (తదుపరి సంవత్సరాలకు బదిలీ) చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ 1, 4 దాఖలు చేసుకునేందుకు అనుమతించింది’’అని ట్యాక్స్మన్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాద్వా తెలిపారు. ఒకవేళ దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించినా లేదా మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న వారు ఇంతకుముందు మాదిరే ఐటీఆర్ 2 లేదా 3లో నిబంధనల ప్రకారం తమకు అనుకూలమైన దానిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రూ.1.25 లక్షల వరకు మూలధన లాభంపై ఎలాంటి పన్ను లేకపోవడంతో ఈ వెసులుబాటు లభించింది. ఆధార్ నంబర్ ఉండాల్సిందే.. ఐటీఆర్ 1, 2, 3, 5 పత్రాల్లో ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీ కాలమ్ను తొలగించారు. ఇంతకుముందు వరకు ఆధార్ లేకపోయినా ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్రోల్మెంట్ నంబర్తో ఐటీఆర్ దాఖలు చేసుకునే అవకాశం ఉండేది. అసెస్మెంట్ సంవత్సరం (ఏవై) 2025–26 ఐటీఆర్లు దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. లేదంటే ఐటీఆర్ దాఖలు చేయలేరని వాద్వా తెలిపారు. వ్యాపారులైతే అదనపు వివరాలు వ్యాపార ఆదాయం, వృత్తిపరమైన ఆదాయం ఉన్న వారు ఒక విధానం నుంచి మరో విధానానికి ఏటా మళ్లేందుకు అవకాశం లేదు. వీరు ఒక్కసారి కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే, జీవిత కాలంలో తిరిగి ఒక్కసారే పాత విధానానికి మళ్లేందుకు అనుమతిస్తారు. ‘‘గతేడాది ఐటీఆర్ 4 పత్రం కొత్త పన్ను విధానం నుంచి తప్పుకున్నారా? అని మాత్రమే అడిగేది. అవును అని బదులిస్తే ఫారమ్ 10–ఐఈఏ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ ఇవ్వాల్సి వచ్చేది. ఏవై 2025–26 ఐటీఆర్–4లో మాత్రం మరిన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫారమ్ 10–ఐఈఏ గత ఫైలింగ్ల ధ్రువీకరణలను సైతం సమరి్పంచాల్సి ఉంటుంది. ప్రస్తుత సంవత్సరంలోనూ కొత్త పన్ను విధానం నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా రా? అనే ధ్రువీకరణ సైతం ఇవ్వాలి’’అని వాద్వా తెలిపారు. టీడీఎస్ వివరాలు ఈ ఏడాది ఐటీఆర్ 1, 2, 3, 5లో టీడీఎస్ కాలమ్లో.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏ ఆదాయం నుంచి టీడీఎస్ మినహాయించారన్న వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వేతనం కాకుండా ఇతర ఆదాయంపై టీడీఎస్ మినహాయించినట్టయితే ఆ వివరాలు నమోదు చేయడం తప్పనిసరి అని వాద్వా తెలిపారు. మూలధన నిబంధనల్లో మార్పులు 2024 బడ్జెట్లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాల నిబంధనల్లో మార్పులు చేశారు. ఇవి 2024 జూలై 23 నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో లిస్టెడ్ షేర్లు లేదా అన్లిస్టెడ్ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇల్లు, భూమి లేదా ఇతర క్యాపిటల్ అసెట్లను విక్రయించినట్టయితే.. అవి ఏ తేదీన విక్రయించారన్న దాని ఆధారంగా పన్ను బాధ్యతలను వేర్వేరుగా మదింపు వేసుకోవాలి. 2024 జూలై 23కు ముందు విక్రయించినట్టయితే ఒక రేటు, ఆ తర్వాత విక్రయించిన వారికి మరొక రేటు వర్తిస్తుంది. ఐటీఆర్ పత్రాల్లో 2024 జూలై 23కు ముందు, ఆ తర్వాత లావాదేవీల వివరాలను సమగ్రంగా నమోదు చేయాలి. ఈక్విటీ, డెట్ సెక్యూరిటీలపై వేర్వేరు రేట్ల ప్రకారం పన్ను చెల్లించాలి. మూలధన లాభం ఉంటే ఐటీఆర్ 2, 3 లేదా 5లో నిబంధనల ప్రకారం తమకు సరిపోయే పత్రాన్ని దాఖలు చేయాలి. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై లాభం అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లపై మూలధన లాభాలను ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో ప్రత్యేకంగా వెల్లడించాల్సి ఉంటుంది. 2024 జూలై 23 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ‘‘వీటి ప్రకారం.. అన్లిస్టెడ్ డిబెంచర్లు లేదా బాండ్లు 2024 జూలై 22 లేదా అంతకుముందు ఇష్యూ చేసి ఉంటే, వాటి గడువు ముగింపు లేదా విక్రయం లేదా బదిలీ 2024 జూలై 23 లేదా ఆ తర్వాత జరిగితే.. ఆ మొత్తాన్ని స్వల్పకాల మూలధన లాభం కిందే పరిగణిస్తారు. ఎంతకాలం పాటు కొనసాగించారన్న దానితో సంబంధం లేదు. ఈ ఆదాయాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి నిబంధనల మేరకు పన్ను చెల్లించాలి. 2024 జూలై 23కు ముందు ఇన్వెస్ట్ చేసి, ఆ లోపే విక్రయించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభం కింద 20 శాతం పన్ను చెల్లించాలి’’అని వాద్వా వివరించారు. అన్లిస్టెడ్ బాండ్లు, డిబెంచర్లలో పెట్టుబడులు కలిగిన వారు ఐటీఆర్ 2, 3 లేదా 5 ద్వారా వెల్లడించాల్సి ఉంటుంది. బైబ్యాక్ సైతం డివిడెండే2024 అక్టోబర్ 1 నుంచి లిస్టెడ్ కంపెనీలు చేపట్టే షేర్ల బైబ్యాక్లో పాల్గొని, ఆదాయం అందుకుంటే ఆ మొత్తాన్ని డివిడెండ్ కిందే పరిగణిస్తారు. ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’ (ఇతర వనరుల రూపంలో వచ్చిన ఆదాయం) కింద బైబ్యాక్ మొత్తాన్ని డివిడెండ్ ఆదాయంగా చూపించాలని వాద్వా సూచించారు. ‘‘క్యాపిటల్ గెయిన్స్ షెడ్యూల్లో మాత్రం బైబ్యాక్లో షేర్లను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని సున్నా కింద చూపించాలి. అప్పుడు షేర్ల కొనుగోలుకు చేసిన పెట్టుబడి మొత్తం మూలధన నష్టం అవుతుంది. దీన్ని తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలి. తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో దీర్ఘకాల మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు’’అని వాద్వా వివరించారు. 80డీడీ, 80యూ కోసం డిజేబిలిటీ సర్టీఫికెట్ వైకల్యంతో ఉన్న వారి కోసం చేసిన వ్యయాలను పాత పన్ను విధానంలో సెక్షన్ 80డీడీ లేదా సెక్షన్ 80యూ కింద మినహాయింపు కోరుకునే అవకాశం ఉంది. ఇందుకు గతంలో ఫారమ్ 10–ఐఏ వివరాలు ఇస్తే సరిపోయేది. అయితే ఈ ఏడాది నుంచి ఈ సెక్షన్ల కింద మినహాయింపు కోరేవారు ఫారమ్ 10–ఐఏతోపాటు (మెడికల్ సర్టీ ఫికెట్) డిజేబిలిటీ సర్టిఫికెట్ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ (వైకల్య సర్టిఫికెట్ ధ్రువీకరణ) ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీఆర్ 2 లేదా 3ని ఎంపిక చేసుకోవాలని వాద్వా సూచించారు. వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్యూఎఫ్) దివ్యాంగుల కోసం చేసే వైద్య వ్యయాలు లేదా ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80డీడీ కింద పన్ను మినహాయింపు కోరొచ్చు. 80యూ సెక్షన్ అన్నది స్వయంగా వైకల్యం ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారుల కోసం ఉద్దేశించినది. 40 శాతం వైకల్యం ఉన్న వారు రూ.75,000, 80 శాతం వరకు వైకల్యం ఎదుర్కొనే వారు రూ.1.25 లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపును ఈ రెండు విభాగాల్లోని వారు క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.కోటిదాటితేనే అప్పుల వివరాలు.. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో మొ త్తం ఆదాయం రూ.50లక్షలు మించినట్టయితే ఆస్తులు, అప్పుల వివరాలను ఐటీఆర్లో వెల్లడించాల్చి వచ్చేది. 2025–26 అసెస్మెంట్ సంవత్సరం నుంచి మొత్తం ఆదాయం రూ.కోటి మించినప్పుడే ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించాలంటూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఎవరికి ఏ ఫారమ్? ఐటీఆర్–1: వేతనం లేదా పింఛను రూపంలో రూ.50లక్షలకు మించకుండా ఆదాయం, ఒక ఇంటిపై ఆదాయం కలిగిన వారు, ఇతర ఆదాయం ఉన్న వారు (లాటరీ లేదా పందేల్లో గెలుపు రూపంలో కాకుండా) ఐటీఆర్–1 దాఖలు చేసుకోవచ్చు. ఈ ఏడాది నుంచి వచ్చిన మార్పుల ప్రకారం దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలు మించని వారు సైతం ఇదే పత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. భారత్కు వెలుపల ఆస్తులు కలిగిన వారు లేదా విదేశీ ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–1 దాఖలుకు అర్హులు కారు. అలాగే రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగిన వారు, వ్యవసాయ ఆదాయం రూ.5,000 మించిన వారికీ ఐటీఆర్–1 వర్తించదు. ఐటీఆర్–2: వ్యక్తులు లేదా హెచ్యూఎఫ్లు రూ.50 లక్షలకు మించి ఆదాయం కలిగి.. అదే సమయంలో వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేనట్టయితే ఐటీఆర్–2ను ఎంపిక చేసుకోవాలి. ఇతర ఆదాయం (లాటరీలు, పందేల రూపంలో గెలుచుకున్న ఆదాయం సైతం) కలిగి ఉంటే.. స్వల్పకాల మూలధన లాభం, రూ.1.25 లక్షలకు మించి దీర్ఘకాల మూలధన లాభం, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకటికి మించి ఇళ్లపై ఆదాయం.. విదేశీ ఆస్తులు/ ఆదాయం.. క్రిప్టో ఆదాయం కలిగినవారు (మూలధన లాభంగా చూపించేట్టయితే), వ్యవసాయం ఆదాయం రూ.5,000 మించి ఉంటే, ఒక కంపెనీలో డైరెక్టర్ హోదాలో ఉంటే, అన్లిస్టెడ్ షేర్లు కలిగిన వారు సైతం ఫారమ్ 2ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: ఐటీఆర్–2లో పేర్కొన్న అన్ని ఆదాయాలకు అదనంగా ఒక సంస్థలో భాగస్వామిగా ఉంటే, క్రిప్టో ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా చూపిస్తుంటే ఐటీఆర్–3ని ఎంపిక చేసుకోవాలి. వ్యాపారం, వృత్తి నుంచి ఆదాయం (ఆడిట్, ఆడిట్ అవసరం లేని కేసులు), వేతనం, అద్దె ఆదాయం, స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభాలు, వడ్డీ, డివిడెండ్లు, లాటరీ ఆదాయం లేదా ఇతర ఏదైనా ఆదాయం.. ఒక సంస్థలో భాగస్వామిగా ఆదాయం అందుకున్న వారికి ఇది వర్తిస్తుంది. వ్యాపారం లేదా వృత్తి నిర్వహిస్తూ ప్రిజంప్టివ్ ఇన్కమ్ను ఎంపిక చేసుకోని వారు, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగి రికార్డులు నిర్వహిస్తూ, వాటిని ఆడిటింగ్ చేయాల్సి ఉన్న వారికి కూడా ఇదే వర్తిస్తుంది. ఐటీఆర్–4: రూ.50లక్షల వరకు ఆదాయం కలిగిన వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, పార్ట్నర్íÙప్ ఫర్మ్లు (ఎల్ఎల్పీలు కాకుండా).. ఐటీఆర్–1 కిందకు వచ్చే ప్రతీ ఆదాయానికి అదనంగా.. ప్రిజంప్టివ్ ఇన్కమ్ (టర్నోవర్పై నిరీ్ణత శాతాన్ని ఆదాయంగా చూపించే) స్కీమ్ కింద వ్యాపారం/వృత్తి ఆదాయం కలిగిన వారు ఐటీఆర్–4ను ఎంపిక చేసుకోవాలి. వ్యవసాయం ఆదాయం రూ.5,000 కు మించకుండా ఉంటేనే దీనికి అర్హత ఉంటుంది. లాటరీ, పందేల రూపంలో కాకుండా ఇతర ఆదాయం కలిగిన వారు.. వీటికి అదనంగా దీర్ఘకాల మూలధన లాభం రూ.1.25 లక్షలకు మించకుండా ఉండి, మూలధన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాల్సిన అవసరం లేని వారు ఐటీఆర్ –4 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5: ఎల్ఎల్పీలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్లు (ఏవోపీలు), బాడీ ఆఫ్ ఇండివిడ్యువల్స్ (బీవోఐలు), ఆర్టీఫీషియల్ జ్యురిడికల్ పర్సన్ (ఏజేపీలు)లకు ఇది వర్తిస్తుంది. ఐటీఆర్–6: సెక్షన్ 11 కింద మినహాయింపులు క్లెయిమ్ చేయని కంపెనీలు ఐటీఆర్–6 దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–7: సెక్షన్ 139(4ఏ), లేదా సెక్షన్ 139(4బి) లేదా సెక్షన్ 139(4సి), లేదా సెక్షన్ 139(4డి), లేదా సెక్షన్ 139(4ఈ), లేదా సెక్షన్ 139(4ఎఫ్)ల కింద ఆదాయం కలిగిన వ్యక్తులు, కంపెనీలకు ఐటీఆర్–7 వర్తిస్తుంది. డిజిటల్ ఫారమ్ 16 ఆదాయపన్ను శాఖ కొత్తగా డిజిటల్ ఫారమ్ 16ను ప్రకటించింది. ఉద్యోగుల వేతనం నుంచి మినహాయించిన పన్ను వివరాలు (టీడీఎస్) ఫారమ్ 16లో ఉంటాయి. సాధారణంగా ఏటా మే చివరి నాటికి ఈ పత్రాన్ని యాజమాన్యాలు ఉద్యోగులకు జారీ చేస్తుంటాయి. దీని ఆధారంగా ఉద్యోగులు రిటర్నులు దాఖలు చేస్తుంటారు. ఇకపై ట్రేసెస్ పోర్టల్ నుంచి నేరుగా ఫారమ్ 16 డిజిటల్ పత్రాన్ని జారీ చేయనున్నారు. దీంతో ఈ డిజిటల్ ఫారమ్ 16ను పన్ను రిటర్నుల దాఖలు పోర్టళ్లపై డిజిటల్గా అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతో ఫారమ్ 16లో ఉన్న వివరాలన్నీ ఐటీఆర్లో ఆటోమేటిగ్గా భర్తీ అవుతాయి. ఇవి గమనించాలి.. → వ్యక్తులు, హెచ్యూఎఫ్లు, ఆడిటింగ్ అవసరం లేని సంస్థలు జూలై 31 లేదా ఆలోపు ఐటీఆర్లు ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఈ ఏడాది ఐటీఆర్ పత్రాల్లో మార్పులు తీసుకొచ్చినందున ఈ గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు. → ఆడిటింగ్ అవసరమైన వ్యాపార సంస్థలకు ఈ గడువు అక్టోబర్ 31. → సవరణ రిటర్నులు దాఖలుకు డిసెంబర్ 31 వరకు గడువు ఉంటుంది. → రూ.5లక్షలకు మించని ఆదాయం కలిగిన వారు రూ.5వేల ఆలస్యపు రుసుం, రూ.5 లక్షలు మించిన ఆదాయం కలిగిన వారు రూ.1,000 ఆలస్యపు రుసుంతో డిసెంబర్ 31 వరకు బిలేటెడ్/లేట్ రిటర్నులు దాఖలు చేసుకోవడానికి అనుమతి ఉంది. → అప్డేటెడ్ రిటర్నులను అసెస్మెంట్ సంవత్సరం ముగిసిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు దాఖలు చేసుకోవచ్చు. ఇందుకు మార్చి 31 తుది గడువు. సాక్షి, బిజినెస్ డెస్క్ -
కృత్రిమ రక్తం
రక్తం ప్రాణాధారం. ఏదైనా ప్రమాదం జరిగి లేదా శస్త్రచికిత్స వల్ల చాలా రక్తం పోయిన మనిషిని బతికించాలంటే ఆసుపత్రిలో ఆ వ్యక్తి బ్లడ్ గ్రూప్నకు సరిపోయే రక్తం ఉండాలి. ఒకవేళ లేకపోతే సరిపోయే బ్లడ్ గ్రూప్ ఉన్న ఆరోగ్యవంతుడైన మనిషి నుంచి రక్తాన్ని సేకరించి ఎక్కించాలి. ఆ రక్తం దొరక్క కొన్నిసార్లు ప్రాణాలే పోతుంటాయి. కానీ భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించవచ్చు! ఎవరికైనా నిమిషాల్లో.. మనుషులే ఇవ్వాల్సిన అవసరం లేకుండా 24 గంటలూ రక్తం అందుబాటులో ఉండొచ్చు!! దీన్ని కృత్రిమ రక్తం అందామా లేక కృత్రిమ ప్రాణాధారం అందామా? ఏ పేరు పెట్టి పిలిచినా ఇదీ రక్తమే. ఈ దిశగా జపాన్లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అవి విజయవంతమైతే కోట్లాది మంది ప్రాణాలు కాపాడొచ్చు.ప్రపంచంలోనే తొలిసారి 2018లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎస్టిమేషన్ ఆఫ్ బ్లడ్ రిక్వైర్మెంట్ ఇన్ ఇండియా అనే నివేదిక విడుదల చేసింది. దేశంలో పెరుగుతున్న జనాభా, వారి ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా దేశంలో రక్తమార్పిడుల వంటి వాటికి ఎంత రక్తం అవసరం అవుతుందో కనిపెట్టడం దీని ప్రధాన ఉద్దేశం. 2008 నాటి ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2007లో మన దేశంలో కోటి యూనిట్ల రక్తం కావాలని అంచనా వేసింది. కానీ, అప్పటికి మనదేశంలో అందుబాటులో ఉన్నది 40 లక్షల యూనిట్లే. 2018 లెక్కల ప్రకారం అవసరమైనది 2.65 కోట్ల యూనిట్లు. ఈ లెక్కన ప్రస్తుతం ఇది ఎంతకు చేరి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్క మనకే కాదు.. యావత్ ప్రపంచానికి కృత్రిమ రక్తం.. నిజంగా ప్రాణదాత.రక్తమార్పిడి చరిత్ర మొట్టమొదటి రక్తమార్పిడి 1665లో ఇంగ్లండ్లో జరిగింది. కొన్ని కుక్కల నుంచి రక్తాన్ని తీసి గాయపడిన కుక్కకు ఎక్కించి దాని ప్రాణాలు కాపాడారు. ఆ తరువాత 1818లో బ్రిటిష్ వైద్యుడు జేమ్స్ బ్లండెల్ మనుషుల్లో రక్తమార్పిడి విజయవంతంగా నిర్వహించారు. 19వ శతాబ్దంలో న్యూయార్క్లో థియోడర్ గెయిలార్డ్ థామస్ అనే స్త్రీల వైద్య నిపుణుడు (గైనకాలజిస్ట్) రక్తానికి బదులు ఆవు పాలను వాడాడు. 1875లో.. తన దగ్గరకు తీవ్ర రక్తస్రావంతో వచ్చిన మహిళకు 175 మిల్లీలీటర్ల ఆవుపాలు ఎక్కించాడు.వారంపాటు ఆమె జ్వరం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడినా తరువాత అన్నీ సర్దుకున్నాయట. అలా థామస్ ఏడుసార్లు పాలు ఎక్కించాడట. ఆ ఫలితాలు ఎన్నో మెడికల్ జర్నళ్లలోనూ ప్రచురితమయ్యాయి. 1880 వరకు ఇలా రక్తానికి బదులు ఆవు, మేకపాలు ఎక్కించడం అమెరికా అంతటా జరిగిందని సైన్స్ మ్యాగజైన్ రాసింది. అప్పటి నుంచీ ఇప్పటివరకూ జపాన్తోపాటు అమెరికా, యూకే, చైనా వంటి దేశాలు కృత్రిమ రక్తంపై ఇప్పటికే చాలా పరిశోధనలు, ప్రయోగాలు చేశాయి.. చేస్తున్నాయి. పాడైపోయిన మానవ రక్తంతో.. మానవ రక్తానికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ రక్తాన్ని జపాన్ పరిశోధకులు ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరోమీ సకాయి ఇందులో కీలకపాత్ర పోషించారు. ఆమె, ఆమె వైద్య బృందం సాధించిన ఈ ఘనతను వైద్య చరిత్రను మలుపుతిప్పే ఘటనగా నిపుణులు వరి్ణస్తున్నారు. ఈ ప్రక్రియకు వీళ్లు వాడింది.. పాడైపోయిన మానవ రక్తాన్నే. ఈ రక్తంలోని హిమోగ్లోబిన్ను వీళ్లు వేరుచేశారు. దాన్ని ఎలాంటి వైరస్లూ సోకేందుకు అవకాశం లేని ప్రత్యేక షెల్లో ఉంచి, అత్యంత జాగ్రత్తగా, కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా ఈ కృత్రిమ రక్తం తయారుచేశారు.ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. వాలంటీర్లకు 100 నుంచి 400 మిల్లీలీటర్ల కృత్రిమ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు. ఈ ఆవిష్కరణకు మద్దతుగా జరుగుతున్న మరో ఆవిష్కరణలో భాగంగా ప్రాణవాయువును తీసుకెళ్లేందుకు వాహకాలను తయారుచేస్తున్నారు. చువో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తెరియుకి కొమట్సు బృందం. ప్లాస్మాలోని అల్బుమిన్తో వీటిని రూపొందించారు. ఇవి రక్తపోటును నియంత్రించేందుకు, గుండెపోటు వంటివి రాకుండా చేసేందుకు సహాయపడతాయి. క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే 2030 నాటికి ఈ రక్తం అందుబాటులోకి వస్తుంది. రక్తం ఎప్పుడు కావాలంటే.. ఎముకల లోపల ఉండే మూలుగ నుంచి రక్తం తయారవుతుంది. సగటున మనిషి శరీరంలో దాదాపు 5 లీటర్ల వరకు రక్తం ఉంటుంది. మన రక్తం ఎర్రగా ఉండటానికి కారణం మన రక్తంలో ఆక్సిజన్ను మోసుకెళ్లే హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్. కొన్ని రకాల శస్త్రచికి త్సలు, ప్రమాదాలు, ప్రసవాలు, పోషకాహార లోపం వల్ల వచ్చే రక్తహీనత, బోన్ మేరో మార్పిడి, బోన్ మేరో ఫెయిల్యూర్, లుకేమియా, హీమోఫీలియా, డెంగ్యూ జ్వరం, తీవ్రమైన మలేరియా జ్వరం వంటి సందర్భాల్లో రక్తమార్పిడి అవసరమవుతుంది.2 ఏళ్లు.. ఊదా రంగు.. సాధారణంగా మన రక్తం 42 రోజుల వరకే నిల్వ ఉంటుంది. ఆలోపు వాడకపోతే వృథా అయిపోతుంది. కానీ ఈ కృత్రిమ రక్తం 2 ఏళ్లపాటు నిల్వ ఉంటుంది. అంటే.. వృథా అయ్యే అవకాశమే లేదన్నమాట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మనరక్తం ఎరుపు రంగులో ఉంటే ఇది ఊదా రంగులో ఉంటుంది. అలవాటు కావడానికి మనకు కాస్త సమయం పడుతుందేమో! అంతేకాదు, బ్లడ్ గ్రూప్తో సంబంధం లేకుండా అందరికీ ఈ రక్తాన్ని ఎక్కించే అవకాశం కూడా ఉందట. -
తెలంగాణ ‘పానకాల స్వామి’!
చింతకాని: చుట్టూ కొండలు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చని పొలాలు.. ఎత్తయిన గుట్టపై రాతి కొండలో స్వయంభువుగా వెలిసిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి కొలిచిన వారికి కొంగు బంగారంలా వర్థిల్లుతున్నాడు. భక్తులు పోసిన బెల్లం పానకాన్ని సగం స్వీకరించి.. మిగతాది ప్రసాదంగా మిగులుస్తూ పానకాల స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. త్రేతాయుగంలో హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించే క్రమంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం సీతంపేట సమీపాన ఉన్న కొండపై ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై నర్సింహస్వామి స్వయంభువుగా వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. పానకాల స్వామి ఆలయం.. దేశంలో ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి తర్వాత తెలంగాణలోని సీతంపేటలో మాత్రమే ఉంది. ఘనమైన ఆలయ చరిత్ర త్రేతాయుగంలో నర్సింహస్వామి.. హిరణ్యకశిపుడి బారి నుంచి ప్రహ్లాదుడిని రక్షించి తిరిగి వైకుంఠానికి శ్రీదేవి, భూదేవి సమేతంగా వెళ్తున్నాడట. మార్గమధ్యలో సీతంపేట వద్ద ప్రకృతి రమణీయతతో అలరారుతుండటంతో దేవేరుల కోరిక మేరకు స్వామి ఇక్కడ కొండపై స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మిక. 500 ఏళ్ల క్రితం.. సుమారు 500 ఏళ్ల క్రితం ఈ ప్రాంత జమీందారు, నాగులవంచ పరగణా«దీశుడు గడ్డం సీతారామిరెడ్డి తాత భూపతిరెడ్డికి సంతానం లేకపోవటంతో.. ఆ దంపతులు ఇష్ట దైవం నర్సింహస్వామిని నిత్యం పూజించేవారు. ఒకరోజు భూపతిరెడ్డి కలలో కనిపించి దేవుడు ‘నీకు సంతానం కలగాలంటే నాకు గుడి కట్టించాలి. జ్యోతి రూపంలో ఆకాశమార్గంలో వెళ్తుంటాను. ఆ జ్యోతి ఎక్కడయితే అదృశ్యమవుతుందో అక్కడే ఆలయం నిర్మించాలి’.. అని చెప్పి అదృశ్యమయ్యాడట. దీంతో జమీందార్ సూచనల మేరకు పండితులు అన్వేషిస్తుండగా సీతంపేట వద్ద అడవిలోని కొండల మధ్యలో.. రాతి కొండపై స్వామి వారు దేదీప్యమానంగా దర్శమిచ్చారట. భూపతిరెడ్డి రాతి కొండపై స్వామి గుడి కట్టించాడు. తదనంతరం జమీందారుకు సంతానం కలిగింది. కాగా, స్వామి ఇక్కడ ఏనుగు పడుకున్న ఆకారాన్ని పోలి ఉండడంతో.. శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిగా కొలుస్తున్నారు. పానకాల స్వామిగా.. నర్సింహస్వామికి పాంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆరాధన, పూజలు నిర్వహించేవారు. కొంతకాలానికి ఒక భక్తుడిని స్వామి వారు ఆవహించి.. ‘నాకు దప్పికగా ఉంది. బెల్లం పానకం పోయండి’.. అని సూచించారట. దీంతో అర్చకులు బిందెలతో పానకం పోయగా.. సగం మాత్రమే స్వీకరించారని ప్రతీతి. ఇదేమిటని ప్రార్థించడంతో ‘సగం పానకాన్నే స్వీకరిస్తా.. మిగతాది భక్తుల కోసం’.. అని చెప్పినట్లు ప్రతీతి. దీంతో అప్పటి నుంచి శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహ స్వామిని పానకాల స్వామిగా కొలుస్తున్నారు. ఏటా ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. కొండపై కోనేరు.. కొండపై ఆలయం, కోనేరు ఉంటాయి. ఈ కోనేరు స్వామి వారి పాదముద్రల ఆకారంలో ఉండడంతో పాటు ఎండాకాలంలో ఎక్కడా నీరు లేకున్నా కోనేరు మాత్రం ఎండిపోయిన దాఖలాలు లేవు. దీన్ని స్వామి మహిమగా భక్తులు చెప్పుకుంటారు. కాగా, త్రిదండి చినజీయర్ స్వామి 2004లో ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు ఆయన హాజరయ్యారు. ధూపదీప నైవేద్యానికి 150 ఎకరాలు నైజాం నవాబు భూమి శిస్తు వసూళ్ల కోసం ఈ ప్రాంతానికి రాగా జమీందారు భూపతిరెడ్డి ఆయనను ఆలయానికి తీసుకెళ్లాడట. అక్కడ పానకం మహిమను వివరిస్తే నవాబు స్వామి విగ్రహం నోట్లో చేయి పెట్టి అబద్ధమని పరిహాసమాడాడట. దీంతో ఆగ్రహించిన స్వామి.. తన దంతాలతో నవాబు చేయి బయటకు రాకుండా పట్టుకోవడంతో.. ఆయన క్షమించమని కోరడమే కాక ధూపదీప నైవేద్యాల నిమిత్తం కనుచూపు మేర ఉన్న భూమిని ఆలయానికి రాసిచ్చాడని చెబుతారు. కాగా, భూపతిరెడ్డి వంశీయులైన నాగులవంచ గ్రామానికి చెందిన గడ్డం ఉపేందర్రెడ్డి కుటుంబీకులు గత మూడేళ్ల వరకు ఆలయ ధర్మకర్త మండలి సభ్యులుగా కొనసాగారు. ప్రస్తుతం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటవుతోంది. అయితే, ఆలయం పేరిట ఉన్న 150 ఎకరాల భూమిని అమ్మి నగదు బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఈ నగదు ఎటూ సరిపోనందున.. ప్రభుత్వం స్పందించి ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారుఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించాలి తెలంగాణలో స్వామి పానకం తాగే ఏకైక ఆలయం సీతంపేటలోనే ఉంది. పచ్చని పంట పొలాల మధ్య ఎత్తయిన కొండపై స్వామి స్వయంభువుగా వెలిశారు. ఘనచరిత్ర కలిగిన శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. – చుండూరు రామకోటేశ్వరరావు, ఆలయ ఈవో నిర్వహణ కష్టంగా ఉంది శ్రీ గజగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలి. దేశంలో ఉన్న రెండు ఆలయాల్లో సీతంంపేటలో ఒకటి ఉంది. ఆలయానికి ఉన్న డిపాజిట్లపై వచ్చే వడ్డీతో ఆలయ నిర్వహణ కష్టంగా ఉంది. ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించాలి. – పీవీ రమణాచార్యులు, ఆలయ అర్చకుడు -
స్టేటస్పెట్టుకుంటే డబ్బులిస్తాం!
సైబర్ నేరగాళ్లు రూటు మార్చారు. ‘తక్కువ మొత్తం.. ఎక్కువ మంది నుంచి వసూలు’అనే సరికొత్త మోసతంత్రాన్ని తెరపైకి తెచ్చారు. నగరాల్లో సైబర్ మోసాలపై క్రమంగా అవగాహన పెరుగుతుండటంతో సైబర్ నేరగాళ్లు క్రమంగా ద్వితీయశ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వాట్సాప్ వాడటం అన్ని ప్రాంతాల్లో పరిపాటిగా మారడంతో దాన్నే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తాము పంపిన ఫొటోలను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటే మీ బ్యాంకు ఖాతాల్లో కాసులు వచ్చిపడతాయని బురిడీ కొట్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్గా పెట్టిన ఫొటోలను వ్యూ, లైక్, కామెంట్.. ఇలా ఒక్కో టాస్క్కు రూ. 2 చొప్పున మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా జరగాలంటే ముందుగా రిజి్రస్టేషన్ ఫీజు కింద రూ. 300 తాము చెప్పిన ఫోన్ నంబర్కు పంపాలని సూచిస్తున్నారు. వాటిని నమ్మి వాట్సాప్ స్టేటస్ టాస్క్ ముందుకొచ్చే వారి నుంచి ముందుగా రూ. 300 వసూలు చేయడమే కాకుండా మరో ఆరుగురిని చేరిస్తే కట్టిన రూ. 300 తిరిగి ఇస్తామని ఊదరగొడుతున్నారు. క్రమంగా మల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో చైన్ను ఏర్పాటు చేస్తూ అమాయకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. తాండూరు ప్రాంతంలో ఈ తరహా సైబర్ మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. మారింది. వేలాది మంది ఈ తరహాలో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. - సాక్షి, హైదరాబాద్బాధితులు ఫిర్యాదు చేయకపోవడంతో..సైబర్ మోసగాళ్లు చెప్పే మాటలు నమ్మి బాధితులంతా రూ.300 చొప్పున వారు చెప్పే గూగుల్ పే, ఫోన్ పే నంబర్లకు చెల్లిస్తున్నారు. ఇందులో ఒకరిద్దరికి రూ. 300 తిరిగి ఇస్తున్న నేరగాళ్లు... ఎక్కువ మంది నుంచి డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. వాట్సాప్ స్టేటస్ను నెలపాటు పెట్టుకోవడంతోపాటు ప్రతిరోజూ స్కీన్ర్ షాట్ పంపాలని నిబంధన విధించడం.. చివరకు నిబంధనలు పాటించనందున మళ్లీ మొదటి నుంచి చేయాలంటూ అమాయకులను మోసగిస్తున్నారు. ఈ తరహా మోసాలు ప్రధానంగా తాండూరు, వికారాబాద్ ప్రాంతంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అయితే బాధితులంతా ఇంత చిన్నమొత్తానికి పోలీసులకు ఏం ఫిర్యాదు చేస్తాంలేనని వదిలేస్తుండటం సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. బాధితుల సంఖ్య పెరిగేకొద్దీ సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్న సొమ్ము రూ. లక్షల్లోకి చేరుతోంది.తెలిసిన వాళ్లు చెబితే డబ్బు కట్టాం మాకు తెలిసిన వ్యక్తి ద్వారా వాట్సాప్ స్టేటస్ పెడితే డబ్బులు వస్తాయని తెలిసి మేం కూడా రూ. 300 ఫీజు ఆన్లైన్లో కట్టి రుద్ర టెక్నాలజీ పేరిట వాట్సాప్ గ్రూప్లో చేరాం. ఆ తర్వాత 30 ఫొటోలు వచ్చాయి. రోజుకు ఒకటి చొప్పున వాట్సాప్ స్టేటస్గా పెట్టుకున్నాం. కానీ ఆ తర్వాత డబ్బులు తిరిగి రాలేదు. – సుదర్శన్రెడ్డి, తాండూరుఐదుగురిని చేర్పించి మోసపోయావికారాబాద్లో ఓ స్నేహితుడి ద్వారా రూ. 300 ఆన్లైన్లో పంపా. 30 రోజులపాటు ఫొటోలు పెట్టాక డబ్బులు అడిగితే టాస్క్ సరిగా చేయలేదన్నారు. గ్రూప్లో ఐదుగురిని చేరి్పస్తే వెంటనే డబ్బులు వస్తాయని ఆశపెట్టడంతో ఐదుగురిని చేరి్పంచా. అయినా నాతోపాటు ఆ ఐదుగురి డబ్బులు కూడా పోయాయి. – నీరటి నరేశ్కుమార్, కొత్తూరు -
చెట్టు రంగు మారిందో... అగ్నిపర్వతం పేలిందే!
అగ్నిపర్వతాలు ఎప్పుడు బద్ధలవుతాయో కచ్చితంగా గుర్తించగల పరిజ్ఞానం ఇప్పటిదాకా లేదు. ఇది తరచూ తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తోంది. అగ్నిపర్వతాల విస్ఫోటాన్ని ముందుగానే కనిపెట్టగల విధానాన్ని తాజాగా ఆవిష్కరించారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలక ముందడుగు వేశారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉండే చెట్లూ చేమల ఆధారంగా అదెప్పుడు పేలేదీ ముందుగానే గుర్తించవచ్చని వారంటున్నారు. అగ్నిపర్వతం పేలినప్పుడు శిలాద్రవం (మాగ్మా) వెలువడుతుందన్నది తెలిసిందే. మాగ్మా కంటే ముందే కార్బన్ డయాక్సైడ్ అధిక మోతాదుల్లో వెలువడుతుంది. దాన్ని పీల్చే చెట్ల ఆకుల రంగు మారిపోతుంది. అవి ముదురు ఆకుపచ్చ రంగును సంతరించుకుంటాయి. ఈ మార్పును స్పష్టంగా గమనించవచ్చు. అంతేగాక పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో భూమి ఎత్తు హఠాత్తుగా పెరుగుతుంది. భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. ఇవన్నీ అగ్నిపర్వతం పేలుడుకు సంకేతాలేనని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉపగ్రహాలతో విశ్లేషణ అగ్నిపర్వతాలపై కార్బన్ డయాక్సైడ్ స్థాయిలను గుర్తించాలంటే సైంటిస్టులు ఆ పర్వతాలపైకి చేరుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే తక్కువ స్థాయిలో వెలువడే కార్బన్ డయాక్సైడ్ను ఉపగ్రహ చిత్రాల ద్వారా అంచనా వేయడం సాధ్యం కాదు. కానీ ఇది చాలాసార్లు ప్రమాదకరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలు ఇకపై దూరమైనట్లే. ఎందుకంటే చెట్ల ఆకుల రంగు ద్వారా అగ్నిపర్వతాల పేలుడును కచ్చితంగా గుర్తించగలమని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ రకమైన విశ్లేషణకు ఎన్నో రకాల శాటిటైట్లు అందుబాటులో ఉన్నాయని టెక్సస్లోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్లో వోల్కనాలజీ డాక్టోరల్ విద్యార్థి నికోల్ గిన్ చెప్పారు. ఇటలీలో సిసిలీ తీరంలోని మౌంట్ ఎట్నా అగ్నిపర్వతంతోపాటు సమీపంలోని చెట్టూచేమల చిత్రాలను లాండ్శాట్ 8, టెరా శాటిలైట్, సెంటినెల్–2తోపాటు ఇతర ఎర్త్–అబ్జర్వింగ్ ఉపగ్రహాల ద్వారా సేకరించారు. వాటిని సమగ్రంగా విశ్లేషించారు. అక్కడ అధిక కార్బన్ డయాక్సైడ్తో చెట్ల ఆకుల రంగు మారినట్లు కనిపెట్టారు. ఈ అగ్నిపర్వతం నుంచి మాగ్మా ప్రవాహం మొదలైంది.→ ప్రపంచ జనాభాలో 10 శాతం అగ్నిపర్వతాలకు కొన్ని మైళ్ల దూరంలోనే నివసిస్తోంది.→ అగ్నిపర్వతాల పేలుడు గురించి ముందే తెలియక చాలా సందర్భాల్లో ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి.→ చెట్ల ఆకుల రంగు ద్వారా పేలుడును సామాన్యులు సైతం ముందే కనిపెట్టవచ్చని సైంటిస్టులు అంటున్నారు. తద్వారా ప్రాణాపాయం నుంచి సులువుగా బయటపడొచ్చని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వీసా ఫ్రీ.. విదేశాలు!
విదేశాలు చుట్టి రావాలని ఎవరికి ఉండదు. సమస్యల్లా వీసా పొందడమే. వీసా అక్కర్లేదు.. పాస్పోర్ట్ ఉంటే చాలు, ఆతిథ్యం స్వీకరించేందుకు విచ్చేయండి అని భారతీయులను ఆహ్వానించే దేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ జాబితాలో తాజాగా ఫిలిప్పీన్స్ వచ్చి చేరింది. పలు దేశాలు వీసా రహిత ప్రవేశం, వీసా ఆన్ అరైవల్, ఆన్లైన్ వీసాలు (ఈ–వీసాలు) అందించడం ద్వారా పాస్పోర్ట్ ఉన్న భారతీయులకు ప్రయాణాన్ని సులభతరం చేశాయి. - సాక్షి, స్పెషల్ డెస్క్వీసా అవసరం లేకుండానే..విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ప్రకారం 2025 మార్చి నాటికి 25 దేశాలలో భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు వీసా రహిత ప్రవేశం అందుబాటులో ఉంది. దేశాన్నిబట్టి కాల వ్యవధులు, కొన్ని షరతులు ఉన్నాయి. దీర్ఘకాలిక ద్వైపాక్షిక ఒప్పందాల కారణంగా ఎలాంటి వీసా, రోజుల పరిమితి లేకుండా దక్షిణాసియాలో భూటాన్, నేపాల్ను చుట్టేయవచ్చు. హిందూ మహాసముద్ర ద్వీప దేశాలైన మాల్దీవులు (90 రోజులు అక్కడ ఉండొచ్చు), సీషెల్స్ (ముందస్తు ప్రయాణ అనుమతితో 90 రోజులు) భారతీయులను స్వాగతిస్తున్నాయి. మారిషస్ సైతం ఉచిత ప్రవేశాన్ని మంజూరు చేస్తోంది. ఆగ్నేయాసియాలో థాయ్లాండ్ 60 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అందిస్తోంది. 2026 డిసెంబర్లోగా 30 రోజుల పాటు వీసా లేకుండానే మలేషియా చుట్టొచ్చు. కరేబియన్ దీవులు భారతీయులకు వీసా రహిత ప్రయాణానికి హాట్స్పాట్. బార్బడోస్, గ్రెనడా, హైతీ, జమైకా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెడీన్స్లో 30 నుండి 90 రోజుల వరకు బస చేయవచ్చు. ఇతర వీసా రహిత దేశాలలో పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్, మధ్య ఆసియాలోని కజకిస్తాన్, బెలారస్, ఆగ్నేయాసియాలో ఫిలిప్పీన్స్ ఉన్నాయి.వీసా ఆన్ అరైవల్పాస్పోర్టు కలిగిన భారతీయ పౌరులకు వీసా ఆన్ అరైవల్ 38 దేశాల్లో అందుబాటులో ఉంది. ఈ జాబితాలో ఉన్న దేశానికి చేరుకున్న వెంటనే విమానాశ్రయంలోనే వీసా మంజూరు చేస్తారు. ఆఫ్రికాలోని టాంజానియా, కెన్యా, రువాండా, మడగాస్కర్, గినియా–బి స్సావు, జింబాబ్వే.. ఆసియాలోని లావోస్, కంబోడియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్డాన్, మయన్మార్ వీటిలో ఉన్నాయి. మధ్యప్రాచ్య దేశాలైన ఖతార్, ఒమన్ కూడా వీసా ఆన్ అరైవ ల్ అందిస్తున్నాయి. కరేబియన్ మళ్ళీ ఇక్కడ బలంగా ఉంది. సెయింట్ లూ సియా, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ సైతం ఈ జాబితాలో నిలిచాయి.ఈ–వీసా 62 దేశాల్లో.. భారత పౌరులకు 62 దేశాలు ఈ–వీసా ఆఫర్ చేస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలకు వెళ్లే ఔత్సాహికులు రాయబార కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత పత్రాలతో ఆన్లైన్లో వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే చాలు. అర్హతలనుబట్టి మంజూరు చేస్తారు. సమయం, ఖర్చు ఆదా అవుతుంది. ఆసియాలో జపాన్, సింగపూర్, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, శ్రీలంక, తైవాన్ ఎలక్ట్రానిక్ వీసా అందిస్తున్నాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్, జార్జియా, రష్యా వంటి మధ్య ఆసియా, యురేషియా దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆఫ్రికా నుంచి కెన్యా, టాంజానియా, ఇథియోపియా, మొరాకో, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, నమీబియా దేశాలకు ఈ–వీసాలను పొందవచ్చు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం భారతీయ పౌరులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తాయి. లాటిన్ అమెరికా, కరేబియన్లలోని అర్జెంటీనా, చిలీ, సురినామ్, ఆంటిగ్వా అండ్ బార్బుడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. పశ్చిమాసియాలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, టర్కీ, ఒమన్ కూడా ఈ–వీసాలను ఆఫర్ చేస్తున్నాయి. బుర్కినా ఫాసో, బెనిన్, సావో టొమే అండ్ ప్రిన్సిపే, ఈక్వటోరియల్ గినియా ఈ జాబితాలో ఉన్నాయి.టాప్–10 వీసా–ఫ్రీ దేశాలుపర్యాటక ప్రదేశాలు, బీచ్లు, ప్రకృతి సుందర దృశ్యాలు, నోరూరించే వంటకాలు, జీవ వైవిధ్యం పరంగా ఎక్కువ మంది సందర్శించడానికి ఇష్టపడేవి.. థాయ్లాండ్, నేపాల్, మారిషస్, భూటాన్, మలేషియా, డొమినికా, కెన్యా, శ్రీలంక, ఖతార్, సీషెల్స్.కొన్ని మార్గదర్శకాలువీసా రహిత దేశాలకు ప్రయాణించే భారతీయులు కొన్ని మార్గదర్శకాలను పాటించాలి. ఎన్ని రోజులు ఆ దేశంలో ఉండొచ్చు, నిర్దిష్ట ప్రవేశ అర్హతలు ధ్రువీకరించుకోవాలి. పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల వరకు చెల్లుబాటులో ఉండాలి. తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెళ్లే దేశాన్ని బట్టి ఖర్చులకు సరిపడా డబ్బులు బ్యాంకు ఖాతాలో ఉంచడమేగాకుండా అందుకు ఆధారాలనూ చూపించాల్సి ఉంటుంది. ఎక్కడ బస చేస్తున్నదీ హోటల్ వివరాలు సమర్పించాలి. -
కొంపముంచుతున్న కొత్త స్నేహాలు
సాక్షి, పుట్టపర్తి: ప్రస్తుతం యువత బయట కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా అందుబాటులో ఉంటోంది. పలకరింపులు..పరామర్శలన్నీ వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వేదికగానే సాగుతున్నాయి. ఇదే క్రమంలో సామాజిక మాధ్యమాల ద్వారానే కొత్త కొత్త స్నేహాలు పుట్టుకువస్తున్నాయి. హలో అంటే చాలు పొలోమంటూ ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చి వాలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు తెలిసీ తెలియని వయసులో ఒకరికొకరు ఆకర్షితులై.. తర్వాత లేని పోని సమస్యల్లో ఇరుక్కుంటున్నారు.ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఒకరికొకరు దగ్గరై.. ప్రేమ వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చాలామంది మైనర్లు సోషల్ మీడియా వేదికగా చిన్న వయసులోనే ప్రేమ, పెళ్లి వ్యవహారాల వరకూ వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలోని ఏదో ఒక పోలీస్ స్టేషన్లో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎక్కువ మంది మైనర్లే.. తెలిసీ తెలియని వయసులో నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ కొత్త పరిచయాలతో స్టేషన్ మెట్లు ఎక్కుతున్న మైనర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. బాల్య వివాహాలు, ప్రేమ పెళ్లిళ్లు, ఆన్లైన్ ప్రేమ తగాదాలు.. ఇలా వివిధ రకాల ఫిర్యాదులు నిత్యం పోలీసు స్టేషన్కు వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మైనర్లే ఉండటంతో వారి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సామాజిక బాధ్యతగా తల్లిదండ్రులను పిలిపించి.. సర్దిజెప్పుతుండగా... సమస్య బయటికి రాకుండా సద్దుమణుగుతోంది. ఇక ఆన్లైన్ ద్వారా పరిచయాలతో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా నెలల వ్యవధిలోనే విడాకుల వరకూ వచ్చేస్తున్నాయి. నిబంధనలు బేఖాతరు.. సోషల్ మీడియా పరిచయాలతో దగ్గరవుతున్న వారు...కొన్నిరోజులకే న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్కు వస్తున్నారు. చాలా సందర్భాల్లో అమ్మాయి మైనర్ కావడం... అప్పటికే పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో పెద్దలే గుట్టు చప్పుడు కాకుండా వివాహాలు జరిపిస్తున్నారు. బాల్య విహహం తప్పని తెలిసినా చాలా మంది ఎదురుచెప్పలేకపోతున్నారు. అధికారులకు తెలిసినా అమ్మాయి భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని అవగాహన కల్పించడానికే పరిమితం అవుతున్నారు. నూతన జంటలను విడదీయలేక.. మానవీయ కోణంలో ఆలోచించి వదిలేస్తున్నారు.పుట్టపర్తికి చెందిన 17 ఏళ్ల యువతికి గోరంట్ల మండలానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇన్స్టాగ్రామ్లో పరిచయయ్యాడు. ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ వాట్సాప్ కాల్స్ వరకు వచ్చారు. ఆ తర్వాత వీడియో కాల్స్.. ఫొటోల మారి్పడి తదితర వ్యవహారాలన్నీ సాగాయి. పెళ్లి చేసుకుందామనేలోపు ఇద్దరి మధ్య తగాదాలు వచ్చాయి. పుట్టపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. తనకు ఆ అమ్మాయిపై ఇష్టం పోయిందని యువకుడు అడ్డం తిరిగాడు.. మైనర్లు కావడంతో పోలీసులు ఇద్దరికీ సర్దిజెప్పి పంపించారు. హిందూపురానికి చెందిన 18 ఏళ్ల యువతికి పెనుకొండకు చెందిన 27 ఏళ్ల పురుషుడు ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. తర్వాత ఇద్దరూ ఆర్నెల్ల పాటు చాటింగ్ చేసుకుంటూ ఫోన్ నంబర్లు, అడ్రస్ మార్చుకున్నారు. గంటల తరబడి వాట్సాప్ చాటింగ్ కొనసాగింది. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తికి అప్పటికే వివాహమైందన్న విషయం కనుక్కొన్న యువతి నానా రభస చేసింది. తనను మోసం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి గుట్టుగా వ్యవహారాన్ని చక్కబెట్టి పంపారు. అవగాహన కల్పిస్తున్నాం మొబైల్ ఫోన్ అతిగా వినియోగించే యువత వాట్సాప్, ఇన్స్ట్రాగాం తదితర సోషల్ మీడియా సైట్లులోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఆయా మాధ్యమాల్లో కొత్తవ్యక్తుల పరిచయాలు వారి జీవితాలనే మార్చేస్తున్నాయి. అందువల్ల ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయంపై తల్లిదండ్రులు తప్పనిసరిగా కనిపెడుతూ ఉండాలి. స్మార్ట్ ఫోన్ వినియోగంలో లాభాలతో పాటు అనేక అనర్థాలూ ఉన్నాయి. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నాం. – మహేష్, జిల్లా బాలల సంరక్షణ అధికారి, పుట్టపర్తి -
మార్స్ కొంప ముంచిన సౌర గాలులు
భూమికి సమీపంలో ఉన్న అంగారక గ్రహం(మార్స్)పై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడికి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు సైతం మొదలయ్యాయి. ఈ అరుణ గ్రహంపై కోట్లాది సంవత్సరాల క్రితం నీరు, వాతావరణం ఉండేవి. అవి క్రమేపి అంతరించిపోయాయి. మొత్తం శూన్యం ఆవరించింది. జీవుల మనుగడపై ఆస్కారమే లేకుండాపోయింది. మార్స్పై నీరు, వాతవరణం కనుమరుగైపోవడానికి కారణం ఏమిటన్నది ఎట్టకేలకు గుర్తించగలిగారు. బలమైన సౌర గాలులు, సౌర తుఫాన్ల కారణంగా అంగారక గ్రహం ఆయస్కాంత శక్తిని కోల్పోయినట్లు తేలింది. ఆయస్కాంత శక్తిని కోల్పోయిన తర్వాత అక్కడున్న ద్రవ రూపంలోని నీరు అంతరిక్షంలోకి ఆవిరైపోయింది. వాతావరణం సైతం నెమ్మదిగా అంతరించింది. దాంతో మార్స్ ఉపరితలంపై ఎర్రమట్టి దిబ్బలు, దుమ్ము, రాళ్లు మాత్రమే మిగిలాయి. మార్స్ అటా్మస్పియర్ వోలటైల్ ఎవల్యూషన్(మావెన్) మిషన్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఈ విషయం కనిపెట్టింది. చాలా ఏళ్లుగా పరిశోధకుల మదిని తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికినట్లయ్యింది. సౌర గాలుల్లోని శక్తి కణాలు అంగారకుడి వాతావరణంలోకి చొచ్చుకెళ్లాయని, దాంతో నీరు ఆవిరైందని, తటస్థ కణాలు, అణువులు వాతావరణం నుంచి బయటకు వెళ్లిపోయాయని నిర్ణయానికొచ్చారు. ఈ పరిశోధన కోసం సోలార్ విండ్ అయాన్ అనలైజర్, న్యూట్రల్ గ్యాస్, ఐయాన్ మాస్ స్పెక్ట్రోమీటర్ ఉపయోగించారు. మార్స్పై ఒక భాగం పూర్తిగా వెలుతురు, మరో భాగం పూర్తిగా చీకటి ఉంటుంది. ఈ రెండు భాగాల సమగ్ర డేటా సేకరించారు. సౌర గాలులు, తుఫాన్లు అరుణ గ్రహం స్థితిగతులను పూర్తిగా మార్చేసినట్లు స్పష్టమయ్యింది. ఈ మొత్తం పరిశోధన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ పత్రికలో ప్రచురించారు. అంగారకుడిపై మరింత అవగాహన పెంచుకోడానికి, భవిష్యత్తులో చేపట్టే పరిశోధనలకు ఈ వివరాలు దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. ఒకవేళ మార్స్పై నీరు, వాతావరణం యధాతథంగా ఉంటే అది మరో భూగోళంగా మనుషుల మనుగడకు తోడ్పడేదని మనం భావించవచ్చు. సౌర గాలులు, తుఫాన్లు అంగారకుడి కొంప ముంచడమే కాదు.. మన ఆశలనూ నీరుగార్చేశాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సమ్మర్ క్యాంప్స్లోనూ ఏఐ
చెస్, డ్యాన్స్, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం, డ్రాయింగ్, పెయింటింగ్.. ఇవీ సమ్మర్ క్యాంప్స్ అనగానే మనకు గుర్తొచ్చేవి. అవి కూడా వేసవి సెలవుల్లోనే నేర్చుకునేవారు. కానీ, ఇప్పుడు సమ్మర్ క్యాంప్స్ అర్థమే మారిపోయింది. ఇప్పుడు ఏడాది పొడవునా ఈ క్యాంప్స్ కొనసాగుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్ నేపథ్యంలో పాఠశాలలు, కో–కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థలు.. ఏడాదంతా పిల్లలను వివిధ అంశాల్లో సానబెడుతున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. సమ్మర్ క్యాంప్స్లో ప్రాధాన్యతగా ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిలిచి ఔరా అనిపిస్తోంది. కోవిడ్ సమయంలో.. ముఖ్యంగా లాక్డౌన్లో విద్యార్థులు ఇంటిపట్టునే ఉన్నారు. ఆ సమయంలో పాఠశాలలూ ఆన్లైన్లోనే తరగతులు నిర్వహించాయి. దీంతో పిల్లలు మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్, కంప్యూటర్లకు అలవాటుపడ్డారు. నాటి నుంచి పిల్లలకు చదువుతోపాటు.. కంప్యూటర్ పరిజ్ఞానమూ పెరిగింది. ఆన్లైన్ వేదికగా పిల్లలు పలు బోధనాంశాలను నేర్చుకుంటున్నారు. చాలామంది పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్కు బదులు ఆన్లైన్ గేమ్స్ అలవాటయ్యాయి. అలా పిల్లల కార్యకలాపాలన్నీ ఫిజికల్ టు డిజిటల్ అయిపోయాయి. మరోపక్క తల్లిదండ్రులు కూడా సాంకేతికంగా తమ పిల్లల భవిష్యత్తుకు తగ్గ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ఉబలాటపడుతున్నారు. ఈ పరిణామాల కారణంగానే.. సమ్మర్ క్యాంప్స్ కూడా చాలావరకు మారిపోయాయి. అందుకే పంపుతున్నారుసమ్మర్ క్యాంప్స్కు వస్తున్న పిల్లల్లో.. ఎక్కువమంది చిన్నారుల తల్లిదండ్రులు ఉద్యోగాలు చేసేవారే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ పిల్లలను ఇంట్లో ఉంచలేక, క్యాంప్లకు పంపించి ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉంచుతున్నారు. ఇంట్లో అల్లరి భరించలేక లేదా మొబైల్ ఫోన్లకు అలవాటు పడ్డారన్న కారణంతో మరికొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను సమ్మర్ క్యాంప్లో చేరి్పస్తున్నారు. చాలాకొద్ది మంది మాత్రమే తమ పిల్లలు కెరీర్లో క్రీడలను భాగం చేసుకోవాలని భావించి క్యాంప్లకు పంపుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. కొత్త అంశాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమ్మర్ క్యాంప్స్ ఇప్పుడు టెక్నాలజీ, అడ్వెంచర్, లైఫ్ స్కిల్స్కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏఐ, కోడింగ్, ఆస్ట్రానమీ, స్పేస్ టెక్నాలజీ వంటి సాంకేతిక అంశాలు వచ్చి చేరాయి. అడ్వెంచర్లో హార్స్ రైడింగ్, ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. లైఫ్ స్కిల్స్లో వంటలు, వ్యవసాయం, పశు సంపద గురించి తరగతులు మొదలయ్యాయి. ఆర్చరీ, చెస్లతోపాటు ఫొటోగ్రఫీ, సాల్సా, బెల్లీ వంటి డ్యాన్సులు.. మ్యూజిక్ కూడా సమ్మర్ క్యాంప్స్లో నేర్పిస్తున్నారు. స్విమ్మింగ్, స్కేటింగ్ వంటి వాటిలోనూ కొన్నిచోట్ల శిక్షణ ఇస్తున్నారు. ఏఐ, ఎంఎల్, కోడింగ్.. పాఠ్యాంశాలతోపాటు కో–కరిక్యులర్ యాక్టివిటీస్లో ఇప్పుడు ఏఐ, మెషీన్ లెరి్నంగ్, కోడింగ్ ప్రధాన ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ఈ తరగతులు సమ్మర్ క్యాంప్స్నకే పరిమితం కాకుండా ఏడాదంతా ఒక సబ్జెక్ట్గా జరుగుతున్నాయి. ప్రముఖ కార్పొరేట్ పాఠశాలల్లో చదివే ఎంతోమంది విద్యార్థులు వీటిని ఎంచుకుంటున్నట్టు చెబుతున్నారు. దాంతో పాఠశాలలు కూడా ఈ సబ్జెక్టులను చెప్పిస్తున్నాయి. ఆసక్తికర అంశం ఏంటంటే.. వారంలో ఒక రోజు.. అది కూడా 1–2 గంటలు క్లాస్ చెప్పే ఏఐ నిపుణుడికి పాఠశాలలు నెలకు రూ.70,000 వరకు చెల్లిస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సబ్జెక్టులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే విద్యార్థులు చాట్ జీపీటీ సాయం తీసుకుంటున్నారు. పాఠశాలలకు వెళ్లే పిల్లల్లో కొందరు వెబ్సైట్ డిజైనింగ్ కూడా చేస్తున్నారు. -
అమ్మ బాధ.. చిన్నారి మానసిక వ్యథ
ఇంట్లో భర్త లేదా అత్తమామల వేధింపులు.. మహిళల మీదే కాదు, చిన్నారుల మీదా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా టీనేజర్లలో ఇవి మానసిక సమస్యలకు దారితీస్తున్నాయి. వారిలో ఆందోళన, ఒత్తిడికి కారణమవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ‘జాతీయ మానసిక ఆరోగ్యం, న్యూరో సైన్సెస్ ఇన్స్టిట్యూట్’, సీవేదా కన్సార్షియం, అంతర్జాతీయ సంస్థల పరిశోధనలో తేలిన అంశమిది. ప్రముఖ ‘ప్లోస్ వన్’జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం 2,800 మంది టీనేజీ యువత, తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు. మనదేశంలో గృహహింస సర్వ సాధారణమైపోయింది. చాలామంది మహిళలు మౌనంగా దీన్ని భరిస్తుంటారు. కొద్దిమంది మాత్రమే ఎదిరించి పోరాడతారు. మౌనంగా భరించే తల్లులతోనే ఈ సమస్య ఆగడం లేదు.. వారి పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అమెరికాకు చెందిన పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్స్ ‘ప్లోస్ వన్’జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఇదే తేల్చింది. ఈ అధ్యయనం కోసం వారు.. దేశంలో ఏడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని 12–17 ఏళ్ల మధ్య యువతను ఎంచుకున్నారు. మానసిక రుగ్మతలు; మానసిక, శారీరక, లైంగిక వేధింపులకు గురైన వారి తల్లులను పరిశీలించారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆత్మహత్యలకూ పురికొల్పుతున్నాయిగృహ హింసకు గురైన తల్లుల్లో ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలు స్పష్టంగా కనిపించాయి. ఇందులోనూ ముఖ్యంగా.. భౌతిక, లైంగిక దాడులకు గురైన తల్లుల్లో ఆందోళన వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపించగా.. మానసిక, భౌతిక, లైంగిక దాడులకు గురైన వారిలో తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలు కనిపించాయి. మనదేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు గృహ హింసకు గురవుతున్నారని అంచనా. ఇవి వారిలో బయటకు చెప్పలేని బాధకు కారణమవడమే కాకుండా.. ఆత్మహత్యలకు కూడా పురికొల్పుతున్నాయి. పాశ్చాత్య దేశాల్లో చేసిన అధ్యయనాల్లో ఈ విషయం ఇప్పటికే రుజువైందని అధ్యయనకర్తలు తెలిపారు.గర్భధారణ సమయంలోనూ.. అమ్మతనం ప్రతి స్త్రీకి ఒక కల. ప్రసవమంటే వేదన. కానీ, పుట్టే బిడ్డ కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది. ఆ కష్టానికి గృహహింస కూడా తోడై మహిళలను మరింత కష్టపెడుతోంది. మనదేశంలో గృహ హింస కారణంగా మహిళలు గర్భధారణ సమయంలోనూ అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గర్భం మధ్యలోనే పోవడం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం జరుగుతున్నాయి. ఇవి పుట్టే పిల్లలపైనా ప్రభావం చూపుతున్నాయి. వారిలో భావోద్వేగ, నడవడిక/ప్రవర్తనాపరమైన సమస్యలతోపాటు చదువులోనూ వెనకబడేలా చేస్తున్నాయి. ‘ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మహిళల పాలిట వరమూ కాగలదు, శాపమూ కాగలదు. భర్త చెడ్డవాడై, అత్త మామలు మంచి వాళ్లయితే.. మహిళకు వాళ్లు మానసికంగా బలాన్ని ఇవ్వగలుగుతారు. అదే అత్తమామలు ఆమెను వేధిస్తే ఆమెకు అదో కొత్త సమస్య. భర్త, అత్తమామల వేధింపులకు గురిచేస్తే నరకమే’అని ఈ సర్వే చేసినవాళ్లు అభిప్రాయపడ్డారు. ‘కౌమారం’పై జరిగే దాడిభార్యలను అనుక్షణం తిట్లతో మానసికంగా వేధించడం, బెదిరించడం, వాళ్లకు ఇంట్లో అన్నం, నీళ్లు వంటివి ఇవ్వకుండా పస్తులుండేలా చేయడం.. ఇవన్నీ ఇంట్లో ఉండే చిన్నారులు చూస్తుంటారు. భర్తలు అరిచేటప్పుడు చాలామంది చిన్నారులు బింకచచ్చిపోయి ఉండిపోతారు. మరికొందరు ఏడుస్తారు. ఇలా తమ తల్లులపై జరుగుతున్న దాడిని ప్రత్యక్షంగా చూసిన ఆ చిన్నారుల లేత మెదళ్లు తీవ్రంగా ప్రభావితమై వారిలో మానసిక రుగ్మతలకు కారణమవుతాయి. వారి నడతను ప్రభావితం చేసి.. వారి చదువుపైనా ప్రతికూల ప్రభావం చూపుతాయి. జీవితంలో టీనేజీ /యవ్వనం చాలా ప్రధానమైన దశ. మన ఆలోచనా విధానం మొగ్గతొడిగేది అప్పుడే. ఆశలు, ఆశయాలు ఊపిరిపోసుకునేదీ అప్పుడే. మనం సమాజంలో ఎలా నడుచుకోవాలో, వ్యక్తిత్వం ఎలా ఉండాలో నేర్చుకునేదీ అప్పుడే. కానీ అదే సమయంలో.. తమ తల్లులను ఇంట్లోనివారు పెట్టే హింసలు, తల్లులు అనుభవించే మానసిక వేదన వారి లేత మనసులను గాయపరుస్తున్నాయి. వారి విపరీత మానసిక ధోరణికి కారణమవుతున్నాయి. అయితే, గృహహింసను ఎదుర్కొనే మహిళలకు పుట్టే పిల్లల్లో ఇలాంటి మానసిక సమస్యలు ఎలా వస్తున్నాయో శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది. అంతేకాకుండా ఉమ్మడి కుటుంబాలు, సాంస్కృతికపరమైన అంశాలపైనా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. గృహహింస అంటే..» కట్నం కోసమో మరే ఇతర అవసరాల కోసమో భార్యలను భర్తలు వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయేలా హింసించడం.» వాళ్లపై భౌతికదాడి చేయడం, యాసిడ్ వంటివి పోసి గాయపర్చడం » కత్తుల వంటి వాటితో గాయపర్చడం, వాతలు పెట్టడం » అమ్మాయి పుడితే హింసించడం, అబ్బాయి పుట్టేవరకు వేధించడంటీనేజర్లలో ఈ సమస్య పరిష్కారానికి...» పాఠశాలల్లో ఇలాంటి పిల్లలను గుర్తించాలి.» వారిలో ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పోగొట్టేందుకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలి» మహిళలపై గృహహింస జరగకుండా నిరోధించాలి. -
ముంచుకొస్తున్న ముప్పు
న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాలు భారతదేశానికి పెట్టని కోటలాంటివి. హిమాలయాల్లోని 800 కిలోమీటర్లకుపైగా పొడవైన హిందూకుష్ పర్వత శ్రేణిలో ఎన్నెన్నో హిమానీనదాలు(గ్లేసియర్స్) ఉన్నాయి. ఎన్నో నదులు, సరస్సులకు ఇవే ఆధారం. మధ్య, దక్షిణాసియాలో హిందూకుష్ గ్లేసియర్స్ నుంచి వచ్చే నీటిపై ఆధారపడి 200 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. కర్బన ఉద్గారాలు, వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో హిమానీనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్కుపైగా పెరిగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి హిందూకుష్ హిమానీనదాల మంచులో 75 శాతం అంతమైపోతుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. 200 కోట్ల మంది జీవనం ప్రమాదంలో పడుతుందని తేలింది. ఈ అధ్యయనం వివరాలను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టిపెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. → 10 దేశాలకు చెందిన 21 మంది శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షలకుపైగా గ్లేసియర్లలో మంచు కరుగుతున్న తీరును పరిశీలించడానికి 8 గ్లేసియర్ మోడల్స్ ఉపయోగించారు. → ఉష్ణోగ్రతలు మరింత పెరగకుండా స్థిరంగా ఉన్నప్పటికీ గ్లేసియర్లలో మంచు కరగడం ఇప్పట్లో ఆగదని అధ్యయనకర్తలు స్పష్టంచేశారు. రాబోయే కొన్ని దశాబ్దాలపాటు ఈ పరిమాణం కొనసాగు తూనే ఉంటుందని పేర్కొన్నారు. → ఉష్ణోగ్రత కేవలం అర డిగ్రీ పెరిగినా సరే దాని ప్రభావం హిమానీనదాలపై కచ్చితంగా ఉంటుందని, ఈ మేరకు మంచు కరిగిపోతుందని సైంటిస్టు డాక్టర్ హ్యారీ జెకొల్లారీ చెప్పారు. మనం ఈ రోజు తీసుకొనే నిర్ణయాలు మన భవిష్యత్తు తరా ల బతుకులను నిర్ణయిస్తాయని అన్నారు. రాబోయే తరాలు బాగుండాలంటే గ్లేసియ ర్లను కాపాడుకోవాలని సూచించారు. → పారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం.. భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేస్తే హిమాలయాలు, కాకస్ పర్వతాల్లో 40–45 శాతం మంచును కాపాడుకోవచ్చు. → ఒకవేళ ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీలు పెరిగితే ప్రపంచవ్యాప్తంగా 75 శాతం మంచు కరిగిపోతుంది. ఈ శతాబ్దం ఆఖరు నాటికి కేవలం 25 శాతమే మిగిలి ఉంటుంది. → యూరప్లో ఆల్ఫ్స్, ఉత్తర అమెరికాలో రాకీస్తోపాటు ఐస్ల్యాండ్లోని గ్లేసియర్లు మానవులకు జీవనాధారం కల్పిస్తున్నాయి. ప్రస్తుతం వీటికి ముప్పు పొంచి ఉంది. భూగోళం మరో రెండు డిగ్రీలు వేడెక్కితే.. ఇక్కడ మంచు 10–15 శాతమే మిగులుతుందని అంచనా వేస్తున్నారు. దాదాపు 90 శాతం మంచు కనుమరుగైతే పరిస్థితి తీవ్రత ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక స్కాండినేవియా ప్రాంతంలో మంచు పూర్తిగా కరిగిపోతుందన్న అంచనాలున్నాయి. → హిమానీనదాలపై ఐక్యరాజ్యసమితి తొలి సదస్సు ప్రస్తుతం తజకిస్తాన్లోని దుషాన్బేలో జరుగుతోంది. 50కిపై దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. → గ్లేసియర్లు వేగంగా కరిగిపోతుండడం వల్ల ఆసియాలో 200 కోట్ల మందికి కష్టాలు రాబోతున్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉపాధ్యక్షుడు యింగ్మింగ్ యాంగ్ హెచ్చరించారు. ఆసియా, పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగడం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని చెప్పారు. → మంచు కరిగిపోవడాన్ని ఆపాలంటే శిలాజ ఇంధనాలను పక్కనపెట్టాలని, క్లీన్ ఎనర్జీని ఉపయోగించుకోవాలని యింగ్మింగ్ యాంగ్ స్పష్టంచేశారు. భూమిని అగ్నిగుండంగా మారుస్తున్న కాలుష్య ఉద్గారాలకు కళ్లెం వేయాలన్నారు. -
పేదోడి ప్రొటీన్ నత్త కూర
మలికిపురం: నత్త.. నెమ్మదిగా కదిలే జీవి. వీటిని బద్ధకానికి సూచికగా భావిస్తారు. కానీ.. ఇది వేసే ప్రతి చిన్న అడుగు అర్థవంతమైన విజయాలకు దారి తీస్తుందని భావించే వారూ లేకపోలేదు. జీవితంలో తొందరపడకుండా.. సమయం తీసుకోవడమనే ప్రాముఖ్యతను నత్త నొక్కి చెబుతుంది. ఈ విషయాలు పక్కన పెడితే నత్తల వల్ల మానవాళికి అనేక ఉపయోగాలున్నాయి. నత్తలను వ్యవసాయ క్షేత్రాల్లో రక్షకులుగా రైతులు, వ్యవసాయ అధికారులు భావిస్తారు. క్రిమికీటకాల నుంచి పంటలను కాపాడతాయని విశ్వసిస్తారు. నత్త గుల్లలను సేకరించి ప్రత్యేక బట్టీలలో కాల్చి సున్నంగా వినియోగిస్తారు. కోస్తా జిల్లాల ప్రజలు నత్త మాంసాన్ని పేదోడి ప్రొటీన్గా భావిస్తారు. చికెన్, మటన్ మాదిరిగా నత్త మాంసంతో కూరలు వండుకుని ఆరగిస్తారు. కాలువలు.. పొలాలే వీటి ఆవాసం పొలాలు, బోదెలు, కాలువలు, చెరువుల్లో నత్తలు విరివిగా పెరుగుతాయి. పదేళ్లుగా కోనసీమలో పలుచోట్ల క్రాప్ హాలిడే పాటిస్తుండటం వల్ల ఆ పొలాల్లో నత్తల పెరుగుదల అధికంగా ఉంది. అనేక మంది నత్తల్ని సేకరించి మాంసం తీసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. దశాబ్దాల కాలంగా నత్త మాంసం విక్రయాలు జరుగుతున్నా.. ఇటీవల కాలంలో స్టార్ హోటళ్లలో నత్త మాంసంతో చేసే కూరలకు డిమాండ్ పెరిగింది. నత్త మాంసంతో పలు రుచికరమయిన వంటలు తయారవుతున్నాయి. సాధారణంగా శనగపప్పు కాంబినేషన్లో వండుతారు. ఇప్పుడు మామిడి కాయలు, జీడిపప్పు, చింత చిగురు కాంబినేషన్లో నత్త కూర వండుతున్నారు. విదేశాల్లో నత్తల పెంపకం ఫ్రాన్స్, వియత్నాం, పోర్చుగల్, బల్గేరియాతో పాటు ఆఫ్రికా దేశాల్లో నత్తలను ఆహారంగా వినియోగిస్తున్నారు. సాగు ప్రయోజనాలతో పాటు ఆహారం కోసం నత్తల్ని పెంచటాన్ని ‘హెలిసి కల్చర్’గా పిలుస్తారు. స్పెయిన్లోని లైడా నగరంలో ఏటా వసంత కాలంలో ‘లా అప్లెక్ డెల్ కారాగోల్’ పేరిట ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఇక్కడ కేవలం నత్తలతో చేసిన వంటకాలను మాత్రమే వడ్డిస్తారు. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది ఆహార ప్రియులు ఇక్కడికొచ్చి హాజరై నత్తల వంటకాలను లొట్టలేసుకుని ఆరగిస్తారు. నత్తలను రుచికర ఆహారంగా తినడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా పలు వర్గాలలోని చాలా మందికి ప్రొటీన్ అందించే ఆహారంగా వీటికి పేరుంది. నత్తల్లో ఉండే పోషకాలు నత్తల్లో 82 శాతం వరకూ నీరు ఉంటుంది. కొవ్వు తక్కువ. చేపల్లో మాదిరిగా ఒమేగా–3 ఆమ్లాలు ఉంటాయని, ఇవి గుండెకు మంచిదని వైద్యులు చెబుతారు. ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. నియాసిన్, సెలీనియం వంటి విటమిన్లు కూడా లభిస్తాయి. ప్రొటీన్, ఇతర పోషకాల వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకల్ని బలపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గ్రామీణ, సముద్రతీర ప్రాంతాల్లో నత్తలను కొన్ని రకా ల ఆరోగ్య సమస్యలకు చికిత్సగా ఉపయోగిస్తారు. అయితే.. నత్తలను శుభ్రం చేయకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కోస్తాలో ఆహారంగా తింటారు కోస్తా జిల్లాల్లో అనాదిగా నత్త మాంసం ఆహారంగా వినియోగంలో ఉంది. చేపల మాదిరిగా వీటిని సేకరించి ప్రాసెస్ చేసి విక్రయిస్తారు. మాంసాహారులు కొనుగోలు చేసి ఆహారంగా తింటారు. నత్తల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గ్రామీణ ప్రాంతాల ప్రజలు భావిస్తారు. - సిద్ధార్థ వర్ధన్, ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ -
బలసిరి.. కొత్త వరి
పిఠాపురం: రంగు.. రుచి.. వాసన.. ఇదేదో వాణిజ్య ప్రకటన అనుకుంటే పొరపాటే. వరిలోనూ ఇటువంటి లక్షణాలున్న బియ్యం అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇటువంటి బియ్యం ఉన్నాయని చెబితే.. ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఇటువంటి అనేక రకాల కొత్త వంగడాలను ఇక్కడి రైతులు పండిస్తూ అందుబాటులోకి తెస్తున్నారు. అత్యధిక పోషక విలువలున్న వరి వంగడాలను ఉత్పత్తి చేయడానికి ప్రకృతి వ్యవసాయ రైతులు నడుం బిగించారు. అరుదైన వరి రకాలు గతంలో రాష్ట్రేతర ప్రాంతాల నుంచి తెచ్చే స్థానిక రైతులు.. ఇప్పుడు కాకినాడ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు పలు రకాల వరి వంగడాలను ఆన్లైన్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇక్కడ పండించిన అరుదైన వరి రకాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారి నైవేద్యానికి సైతం ఉపయోగిస్తుండడం విశేషం. ఈ అరుదైన రకాల్లో నవారా, ఇంద్రాణి, కాలపట్టి, డెహ్రాడూన్ రెడ్ రైస్, పరిమళ సన్న, బర్మా బ్లాక్, రత్నచొడి, రక్తసాలి, చింతలూరు సన్నాలు, కూజి, పాటలియా, బాస్బోగ్, కామిని బోగ్, మైసూర్ మల్లిగ, సిద్ధ సన్నాలు, కోమల్ సాల్ వంటి రకాలున్నాయి. జిల్లాలో సుమారు 25 హెక్టార్లలో 30 మంది రైతులు సేంద్రియ పద్ధతిలో అరుదైన వరి రకాలను పండిస్తున్నారు. చాలా డిమాండ్ ఉందిపన్నెండేళ్ల నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాణప్రదంగా చేస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన అరుదైన రకాల ధాన్యం తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామివారికి నైవేద్యంగా ఉపయోగించడానికి ఇస్తున్నాను. సాధారణ రకాల కంటే.. మంచి డిమాండ్ ఉన్న అరుదైన రకాలను సాగు చేస్తున్నాను. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రకాల విత్తనాలు తెచ్చి, విత్తనాభివృద్ధి చేస్తున్నాను. కేవలం విత్తనాలకు మాత్రమే వీటిని పండిస్తున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనుగోలు చేస్తున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా పంపిస్తున్నాం. ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉండడంతో ఆదాయం బాగుంటుంది. నాతో పాటు జిల్లాలో చాలా మంది రైతులు వీటి సాగు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాల రైతులూ నా వద్ద విత్తనాలు తీసుకుంటున్నారు. – అడపా వెంకటరమణ, ప్రకృతి వ్యవసాయ రైతు, భోగాపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా విత్తనం కోసమే పండిస్తున్నా...ప్రకృతి వ్యవసాయంలో పలు రకాల ధాన్యాన్ని పండిస్తున్నాను. కేవలం విత్తనాల కోసం కొన్ని అరుదైన రకాలు పండిస్తున్నాను. ఎవరైనా విత్తనాలకు అడిగితే ఉచితంగా ఇస్తున్నాను. ఇతర రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి.ఎకరం పొలంలో పది రకాల అరుదైన రకాలను పండిస్తున్నాను. ఈ సాగంతా పాతకాల పద్ధతిలోనే చేయాలి. యంత్రాలతో సాధ్యం కాదు. – ఉల్లి సురేష్, ప్రకృతి వ్యవసాయ యువ రైతు, కొత్తపల్లి, కాకినాడ జిల్లాఅరుదైన రకాలివే.. » రక్తసాలి రక్త హీనతతో బాధపడుతున్న వారికి మంచి ఆహారం. ఈ బియ్యం తినడం వల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మూడు వేల ఏళ్ల నుంచి ఇది వాడుకలో ఉంది. » కూచి పట్టాలియా బాగా సన్నగా ఉంటుంది. తినడానికి బాగుంటుంది. పోషకాలు ఎక్కువ. » నవరను కింగ్ ఆఫ్ రైస్ అంటారు. ప్రస్తుతం దేశంలో లభించే బియ్యంలో అత్యంత పోషక విలువలున్న ఆహారం. సుగర్ వ్యాధిగ్రస్తులకు చాలా మంచి ఆహారం. దీనిని రోజూ తింటే సుగర్ నార్మల్కు వస్తుంది. మోకాళ్ల నొప్పులూ తగ్గిస్తుంది. » ధూదేశ్వర్ అనే దేశీయ వరి విత్తనం. గాలులకు పడిపోని సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. ఇది తెలుపు రంగులో ఉంటుంది, బాలింతలకు శక్తినిచ్చి, తల్లులకు, పిల్లలకు అధిక పోషకాలు అందిస్తుంది. పాల వృద్ధి, పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. » ఇంద్రాణి అనేది దేశీయ వరిరకం. సువాసన ఉండే ఈ రకం పంట కాలం సుమారు 130 రోజులు. పాయసం, పులిహోర, పలావు, దద్దోజనానికి అనుకూలమైంది. » రత్నచొడి అనే దేశీయ వరి విత్తనం. తెలుపు రంగులో ఉండే సన్న రకం. పంట కాలం సుమారు 135 రోజులు. అధిక పోషక విలువలు కలిగి, కండపుష్టి, శరీర ధారుడ్యం పెంచి, మంచి పోషకాలు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి కలిగిస్తుంది. పూర్వకాలంలో సైనికులకు ఆహారంగా ఇచ్చేవారు. » కుజీపటాలియా అనేది దేశీయ విత్తనం. సన్న రకం. పంటకాలం సుమారు 120 రోజులు. గాలులకు పడిపోదు. కొవ్వు రహిత, సోడియం లేనివి. తక్కువ కేలరీలు, గ్లూకోజ్ తక్కువగా ఉండి, రోగ నిరోధక శక్తి పెంచుతుంది. » కేత్రీ మహరాజ్ సెంటెడ్ వెరైటీ. గింజ పొడవుగా ఉంటుంది. పంటకాలం సుమారు 130 రోజులు. పాయసం, దద్దోజనం, పులిహోర పలావులకు బాగుంటుంది. » మైసూరు మల్లిగ దేశీయ విత్తనం. తెల్లని రంగు, గాలులకు పడిపోని సన్నని గింజ. పంట కాలం సుమారు 120 రోజులు. ఎదిగే పిల్లలకు అధిక పోషకాలు, ప్రొటీన్లు అందిస్తుంది. » ఘని అనే దేశీయ వరి రకం. చిన్న గింజ. పంటకాలం సుమారు 130 రోజులు. అధిక ఫైబర్, కాల్షియం కలిగి ఉంటుంది. స్పాండిలైటిస్, మోకాళ్ల నొప్పులు తగ్గించే ఆహార ఔషధంగా గుర్తింపు పొందింది. » కుంకుమసాలి.. కుంకుమ పువ్వు, రక్తసాలి మొదలైన విత్తనాలు ఒకే కోవకు చెందిన దివ్యమైన ఔషధాలు. ఇవి రక్తంలోని మలినాలను శుభ్రం చేసి, వాత, పిత్త, కఫాలను సమపాళ్లలో ఉంచే దివ్యమైన ఆహార ఔషధాలు. -
అమ్మా.. నాకు జీతం వచ్చిందోచ్!
తొలి వేతనం.. జీవిత ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ఆర్థిక స్వాతంత్య్రం, ఒక బాధ్యత, కుటుంబ సమష్టి ప్రయాణానికీ సూచిక. అంతటి ప్రత్యేకత ఉన్న తొలి జీతం అందుకున్న రోజు కోట్లాది మందికి భావోద్వేగ ఘట్టం. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ఈ వేడుకను జరుపుకొంటారు. ఇంట్లో వాళ్లకు, బంధువులు, స్నేహితులు, సహచరులకు స్వీట్లు పంచేవారు కొందరైతే.. తొలి సంపాదనతో తమ వాళ్లకు బహుమతులను అందించేవారు మరి కొందరు. తొలి వేతనం రాగానే ‘అమ్మా.. జీతం పడింది’ అంటూ జన్మనిచ్చిన తల్లితో సంతోషం పంచుకునేవారే ఎక్కువని యాడ్ ఏజెన్సీ ‘రీడిఫ్యూజన్ ’, లక్నో యూనివర్సిటీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘భారత్ ల్యాబ్’ తాజా సర్వేలో వెల్లడించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్చిన్న నగరాల నుంచి..‘నా తొలి వేతనం’ పేరుతో నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన 2,125 మంది యువ ఉద్యోగులు పాలుపంచుకున్నారు. 1997–2012 మధ్య జన్మించిన ఈ జెన్ –జీ తరం వాళ్లు.. మొదటి నెల జీతాన్ని ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, ఎలా ఆదా చేస్తున్నారు అన్న అంశాలపై లోతుగా అధ్యయనం చేశారు. సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు ప్రధానంగా కుటుంబ సభ్యులకు గిఫ్టులు అందించి తమ కృతజ్ఞతను చూపారు. కొంత మొత్తాన్ని ఆదా చేయడం ద్వారా.. పెరుగుతున్న ఆర్థిక దూరదృష్టికి నిదర్శనంగా నిలిచారు మరికొందరు. విరాళాలు ఇచ్చి తమలో స్వార్థం లేదని ఇంకొందరు నిరూపించారు. ప్రతి రూపాయి లెక్కించే కుటుంబాలకు ఇవన్నీ భావోద్వేగాలతో ముడిపడిన అంశాలే. ‘మొదటి జీతం.. ఒక స్వాతంత్య్ర ప్రకటన. ముఖ్యంగా మహిళలకు ఒక నిశ్శబ్ద విప్లవం’ అంటారు భారత్ ల్యాబ్ కో–చైర్మన్, రీడిఫ్యూజన్ చైర్మన్ సందీప్ గోయల్.ముందుగా అమ్మకు..తొలి వేతనం అందుకున్న మరుక్షణమే 44.6% మంది ఆ సంతోషాన్ని తొలుత అమ్మతో పంచుకుంటున్నారు. 28.6% మంది తండ్రికి, 16.1% మంది జీవిత భాగస్వామికి, 10.7% మంది తోబుట్టువులకు సమాచారం ఇస్తున్నారు. తరాలు మారుతున్నా.. సామాజిక పరిస్థితులు మారుతున్నా.. కుటుంబ బంధాలకు ఇచ్చే విలువను ఇది సూచిస్తుందని నివేదిక వివరించింది. ఇంటికి తమవంతు ఆర్థిక సహకారంగా గత తరాలు భావిస్తే.. నేటి జెన్ –జీ తరం మహిళల్లో 88.5% మంది తమ మొదటి జీతాన్ని స్వాతంత్య్రంగా అభివర్ణించారు. ఆర్థిక స్వాతంత్య్రం మహిళల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడానికి ఈ ప్రకటనే నిదర్శనం. స్వాతంత్య్రంతో పాటు ఇంటికి అందించాల్సిన బాధ్యత అని 41.2% మంది పురుషులు భావించారు.దానంలోనూ, పొదుపులోనూ మహిళలేమొదటి జీతాన్ని పొదుపు, దానం చేయడంలో.. రెండింటిలోనూ పురుషుల కంటే మహిళలే ముందుండటం విశేషం. మొత్తంగా 24.5% మంది తొలి జీతాన్ని జాగ్రత్తగా పొదుపు చేశారు. అత్యవసర నిధిని ఏర్పాటు చేయడం, తదుపరి విద్యకు సిద్ధం కావడం లేదా కష్ట సమయాల్లో కుటుంబాన్ని పోషించడం వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చారు. విడివిడిగా చూసినప్పుడు.. 50% మంది మహిళలు పొదుపు చేస్తే, పురుషుల్లో ఈ సంఖ్య 32.3% మాత్రమే. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే..20.4% మంది తొలి జీతాన్ని దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించారు. మతపర సంస్థలు, ఎన్ జీఓలు లేదా నేరుగా అవసరంలో ఉన్నవారికి విరాళంగా ఇచ్చారు. భారత్లోని యువ సంపాదకులు సమాజ అభ్యున్నతి, శ్రేయస్సును అర్థం చేసుకుంటారని నిరూపించారు. దానంలో మహిళలు 41.6% కాగా, పురుషుల్లో ఈ సంఖ్య 27.7% ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతుల్లో ఆర్థిక వివేకం, సామాజిక బాధ్యత పెరుగుతోందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. తమవారికి కృతజ్ఞతగా..తొలి వేతనం పొందిన సంబరాన్ని 38.8% మంది బహుమతుల ద్వారా పంచుకుంటున్నారు. గుర్తుండిపోయే రోజున తల్లుల కోసం ఆభరణాల నుండి తోబుట్టువులకు గ్యాడ్జెట్స్ వరకు.. తమ ప్రయాణానికి మద్దతుగా నిలిచిన వారికి గిఫ్టులతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కిరాణా సామాగ్రి, ఫ్యాన్లు, యుటిలిటీ బిల్లుల వంటి వాటికి 12.2% మంది ఖర్చు చేశారు. తల్లిదండ్రుల అవసరాలకు 4.1% మంది తమ తొలి జీతాన్ని వెచ్చించారు. సర్వేలో పాల్గొన్నవారిలో 88.3% మంది తమ మొదటి జీతం అవసర ఖర్చులకు సరిపోతుందని చెబితే.. 11.7% మంది ఇబ్బందులు పడ్డట్టు తెలిపారు.బంగారం కొంటున్నారు..పుత్తడి మన జీవితాల్లో భాగం.. అదొక ఆర్థిక భరోసా. అందుకే, ఆభరణాలకు బదులుగా యువ మహిళా ఉద్యోగులు పసిడి కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో మూడింట ఒక వంతు మహిళలు తమ తొలి జీతంతో బంగారం కొన్నారు.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భారతదేశంలోని 76% యువత నెలవారీ పొదుపు (సిస్టమాటక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ – సిప్) కంటే సౌకర్యవంత పెట్టుబడి విధానాలను ఇష్టపడుతున్నారని నివేదిక వెల్లడించింది. అదనపు ఆదాయం, పండుగ బోనస్లు వచ్చినప్పుడు టూర్స్ లేదా తమ కలల బైక్ కొనుగోలు వంటి వ్యక్తిగత లక్ష్యాలకు ఖర్చు చేస్తున్నారు. సంకెళ్ళు లేకుండా జెన్ –జీ తరం పొదుపు చేయాలనుకుంటున్నారు. -
అంతా చూస్తున్నారు.. అతి వద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సోషల్ మీడియా ఖాతాలను మరింత లోతుగా పరిశీలిస్తాం... సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రణాళిక కొనసాగుతోంది’ఇదీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఇటీవల ప్రకటించిన విషయం. దీన్నిబట్టి చూస్తే సోషల్ మీడియా ప్రొఫైలింగ్కు ఎంతటి ప్రాధాన్యత పెరుగుతుందో అర్థమవుతోంది. కేవలం విదేశాల్లో చదువు, ఉద్యోగాలకు వెళ్లే వారికే కాదు.. స్థానికంగా ఉద్యోగాలు పొందాలనుకునే యువతకు సంబంధించి సైతం ఆయా సంస్థలు ఇటీవల సోషల్ మీడియా ప్రొఫైలింగ్ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. సదరు వ్యక్తి సోషల్ మీడియాలో వెల్లడించే భావాలు.. పెడుతున్న పోస్టులు, కామెంట్లు, వీడియోల ఆధారంగా అతడి వ్యక్తి త్వం ఏంటి? ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు? ఇలా అనేక విషయాల్ని అంచనా వేస్తు న్నాయి. ఇంకాస్త లోతుగా వెళితే పెళ్లి సంబంధాల సమయంలోనూ అబ్బాయి–అమ్మాయిల గురించి, వారి స్నేహాలు, ప్రవర్తన, ఇతరులతో ఉన్న సంబంధాలపై ఒక అంచనాకు వస్తున్నారు. ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్, ఎక్స్లలో వాళ్లు షేర్ చేసే ఫొటోలు, వీడియోల ఆధారంగా కూడా ప్రవర్తన, నడవడికను ఇట్టే అంచనా వేస్తున్న రోజులివి. అందుకే సోషల్ మీడియాలో అంతాచూస్తున్నారని, కాబట్టి అతి ధోరణి వద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.ఫన్ పేరిట కించపర్చేలా వ్యాఖ్యలు సాంకేతికతతో ఎంత ఉపయోగం ఉంటుందో.. అంతేస్థాయిలో అనర్థాలున్నాయి. నేటి యువత ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వాడటం పరిపాటిగా మారింది. గంటల తరబడి చాటింగ్లు, మీటింగ్ల్లో కొందరు హద్దు దాటుతున్నారు. యువత, విద్యార్థులు ఫన్ పేరిట ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.. తోటి విద్యార్థులను సైబర్ బుల్లీయింగ్ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. రాజకీయ వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతుంటారు. ఈ వ్యాఖ్యలే వారిపాలిట ఇబ్బందికరంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వీసాల రద్దు వరకు దారి తీస్తున్నాయి. ఎంబసీల్లోని అధికారులు వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారి సోషల్ మీడియా ఖాతాలు వెరిఫై చేస్తున్నారు. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర ఏ దేశానికి వెళ్లాలన్నా వీసాలు ఆమోదం పొందడం లేదు. ఇందుకు ప్రధాన కారణం సోషల్ మీడియా ప్రొఫైలింగ్. అందుకే మన వ్యక్తిగత ప్రవర్తన కేవలం బయటి సమాజంలోనే కాదు.. సోషల్ మీడియా ప్రపంచంలోనూ ఉన్నతంగా ఉండాలని చెబుతున్నారు. మన చేతుల్లోనే.. మన భవిష్యత్తు» కేవలం విదేశాల్లో విద్యా అవకాశాల విషయంలోనే కాదు.. అన్ని వయస్సుల వారి అవకాశాలకు ప్రతిబంధకంగా ఈ సోషల్ మీడియా ప్రొఫైలింగ్ మారుతోందని మరవొద్దు. » పెళ్లి సంబంధమైనా, కొత్త ఉద్యోగమైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాల వెతుకులాట కొనసాగుతోందని మరవొద్దు. » ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్ మీడియా యాప్లలో, వాట్సాప్ వంటి గ్రూప్ల్లో సంయమనంతో ఉండకపోతే చిక్కులు తప్పవు. » అనసవర వ్యాఖ్యలు చేయడంతో కొన్నిసార్లు ఇతర కంపెనీల్లో గొప్ప ఆఫర్లు వచ్చినా ఉద్యోగాలు పొందలేని పరిస్థితి. అదేవిధంగా ఒక ఉద్యోగి మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టులు పెడితే ఉద్యోగ ఎదుగుదలకు అవి ప్రతిబంధకాలుగా మారే ప్రమాదం ఉంటుంది. » మన వ్యక్తిగత వివరాలు, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, ఫ్రెండ్స్ ఎవరు, తరచూ ఎక్కడికి వెళుతుంటాం.. వీటన్నింటినీ క్రోడీకరించి ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడి అవతలి వ్యక్తి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయొచ్చని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా సమాచారం అనవసరం.. సోషల్ మీడియాలో కొందరు తమ సమస్త వివరాలు చెబుతుంటారు. కానీ, అవసరానికి మించి ఏ వ్యక్తిగత సమాచారమూ సోషల్ మీడియాలో పంచుకోకపోవడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. పుట్టిన రోజులు, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలు, మన స్వస్థలాల వివరాలు వీలైనంత వరకు పెట్టకుండా ఉండాలని సూచిస్తున్నారు. సోషల్ మీడియా వాడకంపై సరైన అవగాహన ఉండాలని పేర్కొంటున్నారు. మన వ్యక్తిగత సమాచారం మనం కాకుండా ఏ వెబ్సైట్లో, సెర్చ్ ఇంజిన్లో చూసినా వెంటనే దాన్ని తొలగించాలని ఆ వెబ్సైట్ను కోరాలని వారు సూచిస్తున్నారు. సోషల్ మీడియా ప్రొఫైలింగ్ అంటే..? ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్లలో ఖాతాలున్న వారు.. వాటిల్లో షేర్ చేసుకుంటున్న ఫొటోలు, వీడియోలు, వివరాలు, పెడుతున్న కామెంట్లు అన్నింటినీ క్రోడీకరించి అవతలి వ్యక్తి గురించి అంచనావేసే పద్ధతినే సోషల్ మీడియా ప్రొఫైలింగ్అంటాం. దీని ఆధారంగా ఒక వ్యక్తి సామాజిక ప్రవర్తనను దాదాపుగా అంచనా వేయొచ్చు. -
అపురూపాలు పదిలం
గత స్మృతులను నెమరు వేసుకోవాలి. వర్తమానంలో మనుగడ సాధిస్తూ.. భవిష్యత్పై కలలు కనాలి. వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నాలు చేయాలి.. అంటారు పెద్దలు. గతం తిరిగిరానిదని కూడా ఉద్బోధిస్తుంటారు. ఏ శాస్త్ర సాంకేతిక విజయాన్ని పరిశీలించినా.. దానికి మూలం పూర్వీకుల నుంచి సంక్రమించిన పరిజ్ఞానమే. ఇలాంటి పరిజ్ఞానాన్ని మరిచిపోకుండా.. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. వాటిని భద్రపరిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామస్తులు. అయిదారు దశాబ్దాల క్రితం వినియోగించిన వస్తువులు, వ్యవసాయ పరికరాలను భావితరాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామంలో సేకరించిన వస్తువులను తెలంగాణ ఆద్యకళా మ్యూజియం పేరిట భద్రపరిచే ప్రయత్నాలు చేస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. – సాక్షి, మహబూబాబాద్యాభై ఏళ్లుగా ప్రయత్నాలు పూర్వీకులు వినియోగించిన వస్తువులు, ఆనాటి కళలు, వారి సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు పూనుకున్నారు శ్రీరామగిరి వాసులు. యాభై ఏళ్ల క్రితం వివేకానంద సాంస్కృతిక సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా ఆనాటి వీధిభాగోతాలు మొదలుకొని.. చిడతల రామాయణం, జడకుప్పి, కోలాటం తదితర కళలను పరిరక్షిస్తూ నేటికీ ప్రదర్శిస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులను కూడా సేకరిస్తున్నారు. భావితరాల కోసం.. మారిన కాలం, వైజ్ఞానిక రంగాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా అనేక నూతన ఆవిష్కరణలు వచ్చాయి. కానీ గతంలో పూర్వీకులు వినియోగించిన వస్తువులను భావితరాలకు చూపించాలనే ఆలోచనతో శ్రీరామగిరి వాసులు తమ ఇళ్లల్లోని వస్తువులను భద్రపరిచారు. వీటిలో మోటబొక్కెన, బకెట్ పంపు డబ్బాలు, కుందెన, పాన్ధాన్ (ఆకులు, సున్నం, వక్కల కత్తెర, వక్కలు భద్రపరిచే పెట్టె), చుట్టకుదురు, రోకళ్లు, ఇసుర్రాయి, ఉట్టి, చల్లకవ్వం, ఉట్టి, అటికలు (మట్టితో తయారు చేసిన పాత్రలు), పిల్లలు ఆడుకునే రింగున్, బొంగరాలు మొదలైనవి ఉన్నాయి. చేపల వేట కోసం వినియోగించే ఊత, మావుతోపాటు విడిచిన బట్టలు వేసుకునే మైల్దాన్, మంగలి పెట్టె, సానరాయి మొదలైవాటితోపాటు, శ్రీరామగిరి గ్రామానికి చెందిన పాతకాలం పండితులు రాసిన తాళపత్ర గ్రంథాలను కూడా సేకరించారు. ఆద్యకళా మ్యూజియం ఏర్పాటు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగానే తెలుగు విశ్వవిద్యాల యం ప్రొఫెసర్లు, పురావస్తు శాఖ వారి ఆధ్వ ర్యంలో వస్తువులు, జానపద కళల ప్రదర్శనల ద్వారా ఆనాటి కళలకు గుర్తింపు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రొఫెసర్ సుజాత, జయదీర్ తిరుమలరావు శ్రీరామగిరి గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని యువకులు, పెద్దలు సేకరించిన పురాతన వస్తువులు, వ్యవసాయ పరికరాలను చూసి ఆశ్చర్యపోయారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వివేకానంద సాంస్కృతిక మండలి సభ్యులను అభినందించారు. గ్రామంలో సేకరించిన వస్తువులను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న ఆద్య కళా మ్యూజియానికి తరలించారు.పురాతన కళ, సంస్కృతి పరిరక్షణ మా గ్రామంలో ఐదు దశాబ్దాల క్రితం సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం వివేకానంద సాంస్కృతిక కళామండలిని ఏర్పాటు చేశాం. నాతోపాటు, మా గ్రామానికి చెందిన బొమ్మిడి వినోద్రెడ్డి, ఇతర మిత్రులం.. ఇప్పటికీ ప్రాచీన కళల పరిరక్షణకు పాటుపడుతున్నాం. వస్తువులు, వ్యవసాయ పరికరాలను సేకరించాం. చిడతల రామాయణం, జడకుప్పి వంటి కళల ప్రదర్శనకు.. రాష్ట్ర స్థాయిలో మా గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఊరిలో సేకరించిన వస్తువులను మ్యూజియంలో భద్రపరుస్తున్నారంటే మా గ్రామానికే గర్వకారణంగా భావిస్తున్నాం. – కళాధర్ రాజు, ప్రధాన కార్యదర్శి, వివేకానంద సాంస్కృతిక మండలి కావలసినవి తయారు చేసుకునేవాళ్లు పూర్వ కాలం పద్ధతులే వేరు. చేతి వృత్తులు, కుల వృత్తుల వాళ్లు ఎక్కువ. ఎవరికి కావలసిన వస్తువులను వారు తయారు చేసుకునే వాళ్లు. అప్పుడు వస్తు మార్పిడి ఉండేది. ఏ వస్తువు కూడా పర్యావరణానికి భంగం కలిగించేది కాదు. అందువల్లే పూర్వీకులు అంత ఆరోగ్యంగా ఉన్నారు. – మురళీధర్ స్వామి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు జ్ఞాపకాలు పదిలం చిన్నతనంలో పల్లెటూరులో పెరిగాను. అందరం వరుసలతో పిలుచుకునే వాళ్లు. కానీ గోళం, ఊత, గాజె, బొట్టుపెట్టలు ఇప్పుడు కనిపించడం లేదు. వండిన అన్నం ఉట్టిమీద పెడితే.. స్టూలు వేసుకొని ఎక్కి అన్నం పెట్టుకున్న గుర్తులు ఇప్పటికి మరుపు రావు. – బండారు వెంకటరమణ, మహబూబాబాద్ -
పండుటీగలు ప్రాణాలు నిలిపేనా?
ప్రతిష్టాత్మకమైన స్పేస్ మిషన్ల ద్వారా అంతరిక్షంలోకి చేరుకున్న ఉదంతాలను గుర్తుచేసుకుంటే నీల్ఆర్మ్స్ట్రాంగ్ కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాకేశ్ శర్మ మనకు స్మరణకు వస్తారు. తాజాగా అయితే శుభాన్షు శుక్లా కూడా గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఈ జాబితాలోకి మరో విశిష్ట అతిథి వచ్చేశారు. అదే ప్రూట్ ఫ్లై. అంటే పండుటీగ! గతంలో ఎన్నోసార్లు ప్రయోగశాలల్లో ఎన్నో పరిశోధనలకు తన వంతు సాయం అందించిన పండుటీగ ఇప్పుడు అంతరిక్షం దాకా ఎగరనుంది! ఆగ్జియం స్పేస్ మిషన్ బృందం పండుటీగలను కూడా అంతరిక్షంలోకి పంపనుంది. అంతరిక్షంలో వ్యోమగాములకు ప్రమాదకరంగా మారిన రేడియోధార్మికత డీఎన్ఏను ధ్వంసం చేస్తోంది. ఈ సమస్యకు పండుటీగలతో పరిష్కారం కనుగొనేందుకు ప్రయతి్నస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లే ఆగ్జియమ్–4 మిషన్లో భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా బృందంతోపాటు పండుటీగలు సైతం ఐఎస్ఎస్కు వెళ్లనున్నాయి. ఏం ప్రయోగం చేయబోతున్నారు? పండుటీగలు అత్యంత వేగంగా పునరుత్పత్తి చేస్తాయి. దీంతో వీటిని అంతరిక్షంలో రేడియోధార్మిక ప్రభావానికి లోను చేస్తే రేడియేషన్ వాటిని ఏ స్థాయిలో నాశనం చేస్తుంది?. దాన్ని తట్టుకుని అవి ఎంతవరకు మనగల్గుతాయి? డీఎన్ఏను పునరుద్ధరించుకోగలవా? అలా డీఎన్ఏ మరమత్తులు సాధ్యమా? ఇలాంటి ప్రశ్నలకు వ్యోమగాములు సమాధానాలు వెతకనున్నారు. ఇందుకోసం పండుటీగలను, వాటి లార్వాలను ఐఎస్ఎస్కు తీసుకెళ్తున్నారు. రేడియేషన్ తర్వాత పండుటీగలు ఎలాంటి ప్రొటీన్లను ఉత్పత్తిచేసి డీఎన్ఏ రిపేర్లు చేసుకునే అవకాశముందనే విషయాలపై స్పష్టత రానుంది. పండుటీగ ప్రయోగం విజయవంతమైతే దాని సాయంతో శాస్త్రవేత్తలు భవిష్యత్లో చందమామ, అంగారకుడు, సుదూర ప్రాంతాలకూ మానవసహిత ప్రాజెక్ట్లను నిరభ్యంతరంగా చేపట్టే వీలుంది. పండుటీగలే ఎందుకు? ఇలాంటి ప్రయోగాలకు పండుటీగలే అత్యంత అనుకూలమని తేలింది. ఎందుకంటే మనిషి డీఎన్ఏలో సహజసిద్ధంగా ఉన్న సూక్ష్మస్థాయి లోపల కారణంగానే తరచూ పలు రోగాలు సోకుతాయి. అలా మనిషిలో రోగాలకు కారణమయ్యే జన్యువులు, పండుటీగల్లోని అలాంటి జన్యువులతో దాదాపు 75 శాతం పోలి ఉండటం విశేషం. అందుకే భవిష్యత్ ప్రయోగాలను చేపట్టనున్నారు. పైగా పండుటీగ లార్వా అత్యంత విపత్కర పరిస్థితులను సైతం తట్టుకోగలదు. అత్యధిక స్థాయి రేడియేషన్ను సైతం తట్టుకొని మనగలదని ఇప్పటికే స్పష్టమైంది. ఇంతటి రేడియేషన్ను చాలా రకాల జీవులు అస్సలు తట్టుకోలేవు. ఇంతటి విశిష్ట లక్షణాలు ఉన్నందుకే పండుటీగను ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. అంతరిక్షం అనేది మనం రాత్రిళ్లు ఆకాశం కేసి చూసినప్పుడు కనిపించినంత ప్రశాంతంగా ఉండదు. అక్కడ రేడియోధార్మికతను అడ్డుకునే ఎలాంటి వాతావరణం ఉండదు. అంతటా శూన్యం వ్యాపించి ఉండటంతో రేడియోధార్మికత అనేది నిరాటంకంగా తీక్షణస్థాయిలో ప్రసరిస్తుంది. రేడియేషన్ అనేది మనిషి డీఎన్ఏలోని నిచ్చెనలాంటి నిర్మాణాలను దెబ్బతీస్తుంది. గురుత్వాకర్షణ లేని కారణంగా వెంటనే మళ్లీ మరమత్తు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. దీంతో భవిష్యత్తులో క్యాన్సర్ సోకే ముప్పు ఉంటుంది. అందుకే రేడియేషన్ నుంచి రక్షణ పొందుతూ వ్యోమగాములు వ్యోమనౌకల్లో మనుగడ సాగించాల్సి ఉంటుంది. అందుకే రేడియేషన్ నుంచి రక్షణ పొందే విధానాలపై ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు అవసరం. పండు టీగలోని ప్రోటీన్లు రేడియేషన్కు లోనైనా వెంటనే రిపేర్లు చేసుకోగలిగితే ఇదే తరహా ప్రోటీన్లతో శాస్త్రవేత్తలు కొత్తతరం ఔషధాలను అభివృద్ధిచేయనున్నారు. భవిష్యత్తులో వ్యోమగాములకు వీటిని అందించనున్నారు. జూన్ 8వ తేదీన భారత్, అమెరికా, పోలండ్, హంగేరీ దేశాల వ్యోమగాములతో ఆగ్జియమ్–4 క్యాప్సూల్ అంతరిక్షంలోకి వెళ్లనుంది. మనం తినే పండు చుట్టూ తిరిగే పండుటీగ చుట్టూ మన శాస్త్రవేత్తలు తిరుగుతారని మనం కలలో కూడా ఊహించి ఉండం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూఎస్ కల.. వీసా ఎలా?
వీసా వస్తుందో లేదో..?నాకు అమెరికా యూనివర్సిటీలో సీటు ఖరారైంది. అప్పులు చేసి అన్ని విధాలుగా సిద్ధమయ్యా. ఆగస్టులో వెళ్లాలి. కానీ ఇంతవరకూ వీసా ఇంటర్వ్యూకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మొదటి సెమిస్టర్కు వెళ్లగలనా? లేదా అనే భయం వెంటాడుతోంది. – శశాంక్ ఇరుకుపాటి (అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మహబూబ్నగర్ విద్యార్థి)సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి. స్టూడెంట్ వీసాలకు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని కాన్సులేట్ అధికారులను అగ్రదేశం ఆదేశించడం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తోంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలున్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు. అమెరికా రావాలనుకునే ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాలని అధికారులకు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ వీసా కోసం సిద్ధమైతే అమెరికా ప్రభుత్వం నుంచి రోజుకో నిర్ణయం వెలువడుతోందని కంగారు పడుతున్నారు. అయితే అమెరికా నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది కల్గించవని ప్రవాస భారతీయులు అంటున్నారు. కానీ అమెరికా ఈ ఏడాది 41 శాతం విద్యార్థి వీసాలను తిరస్కరించింది. ఇందులో భారతీయుల వీసాలు 38 శాతం ఉండటం గమనార్హం. కాగా ఇప్పటికే వీసా ఇంటర్వ్యూకు తేదీ ఖరారైన వారిని అనుమతించాలని అమెరికా సూచించడం ఆయా విద్యార్థులకు ఊరటనిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికి 6 వేల మందికి తిరస్కరణ: భారత్ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికే వెళ్తున్నారు. చదువు కోసం ఆ దేశానికి మన విద్యార్థులు ప్రతి ఏటా రూ.లక్ష కోట్లు చెల్లిస్తున్నారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికన్ యూనివర్సిటీలు ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. మనవారు మొదటి సెమిస్టరే ఎంపిక చేసుకుంటారు. దీంతో ఆరు నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు ఎఫ్1 వీసా ఇస్తారు. దీన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అంటారు. అమెరికాలో ఫుల్ టైం విద్యకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాగా 2023లో 1.03 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్టు బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే 2023–24లో ఎఫ్1 వీసాలను భారీగా తగ్గించారు. ప్రపంచ వ్యాప్తంగా 6.79 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇందులో 2.79 లక్షలు అప్లికేషన్లను అమెరికన్ కాన్సులేట్లు తిరస్కరించాయి. 2024 తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38 శాతం మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ ఏడాది తొలి సెమిస్టర్ కోసం దాదాపు 78 వేల మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 24 వేల మందికి ఇంటర్వ్యూ తేదీలు వచ్చాయి. కొందరి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 6 వేల మంది వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54 వేలమంది ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని అడ్డుకునేందుకే.. అమెరికన్ కాన్సులేట్ వర్గాలు, కన్సల్టెన్సీ సంస్థలు, ప్రవాస భారతీయుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. వీసాల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నదే అమెరికా ఆలోచన. ఉద్రిక్తతతలు, అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్న వారిని తమ దేశంలోకి రాకుండా చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలిస్తోంది. అమెరికా వెళ్ళే ముందు వారు ఎవరిని సంప్రదిస్తున్నారు? వారి నేపథ్యం ఏమిటి? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎవరితో ఉండాలనే ఆలోచనలో ఉన్నారు? ఏ కన్సల్టెన్సీని ఎంపిక చేసుకుంటున్నారు? ఆ కన్సల్టెన్సీ ద్వారా గతంలో ఎంతమందిని పంపారు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఇలాంటి వివరాలు అమెరికా కన్సల్టెన్సీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తమ స్నేహితులు, బంధువులకు..అనుమానించదగ్గ వ్యక్తులు, రెడ్ లిస్ట్లో ఉన్న దేశాల వారితో సంబంధం ఉంటే మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఇబ్బంది లేదు! ప్రస్తుతానికి భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులెదురయ్యే అవకాశం లేదని కన్సల్టెన్సీల ప్రతినిధులు, విదేశీ విద్యకు సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అమెరికా కొన్ని దేశాలపైనే దృష్టి పెట్టిందని అంటున్నారు. తమ దేశానికి వస్తున్న 41 దేశాల విద్యార్థులను కేటగిరీలుగా విభజించింది. రెడ్ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న దేశాలను చేర్చారు. ఇంకా చెప్పాలంటే ఇస్లాం వాదంతో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆప్ఘనిస్తాన్, ఇరాన్, లిబియాతో పాటు భూటాన్, క్యూబా సహా 11 దేశాలున్నాయి. ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న 10 దేశాలను ఆరంజ్ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా పది దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరి పక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నారు. ఇక భారత్ మిత్ర పక్షంలోనే ఉండటం వల్ల.. ఇతరత్రా కారణాలతో తప్ప ఇక్కడి విద్యార్థులకు ఈ తరహా ఇబ్బందులేవీ లేనట్టేనని అంటున్నారు. అమెరికా స్నేహితులతో జాగ్రత్త అమెరికా రావాలనుకునే వాళ్ళు ముందుగా సోషల్ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అక్కౌంట్స్ ఉన్నాయనేది చూసుకోవాలి. అనుమానం ఉన్న వ్యక్తులతో ఎలాంటి సామాజిక సంబంధం ఉన్నా, వీసా విషయంలో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా అమెరికాలో ఉండే స్నేహితులను మనవాళ్ళు నమ్ముతారు. అయితే వాళ్ళ నేపథ్యం, వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటున్నారనేది కూడా ముఖ్యమే. – సిరిమళ్ళ వీరేంద్ర (అమెరికాలో ఎంఎస్ చేస్తున్న భారతీయ విద్యార్థి) తప్పుడు సర్టిఫికెట్లు, పార్ట్టైమ్తోనే ఇబ్బంది వీసాలు పూర్తిగా ఆపేయలేదు. వ్యక్తిగత వివరాలు, వెళ్ళే వర్సిటీ గురించి వాకబు చేయమని మాత్రమే అమెరికా ఆదేశించింది. భారతీయుల పట్ల అమెరికాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కాకపోతే తప్పుడు ధ్రువపత్రాలతో వెళ్ళాలనుకున్నా, అక్కడికెళ్ళి పార్ట్టైం ఉద్యోగం చేస్తామన్నా, ఆ దిశగా లావాదేవీలున్నా వీసాకు ఇబ్బందులెదురవుతాయి. – జయవర్థన్ ఏకాటి (కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు) -
కాటుక రంగులోకి కడలి!
ఆ చల్లని సముద్రగర్భం.. అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమినంతటినీ చుట్టేసిన సాగరజలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ధరణిపై దాదాపు 71 శాతం ఉపరితలాన్ని సముద్రజలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్రనీరే ఉంది. ఇందులో 21 శాతం అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్రజలాలు గతంలో ఎన్నడూలేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాల్లో జరిగిందని గణాంకాలు స్పష్టంచేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్ చేంజ్ బయోలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సముద్రజలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్శి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్ర ఉపరితల జలాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితులే 90 శాతం సముద్రజీవుల మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్శి సముద్ర ఉపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్లోని ప్లైమౌత్ విశ్వవిద్యాలయం, ప్లైమౌత్ మెరైన్ లేబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితోపాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్రజీవుల జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్రజలాలతోపాటు తీరం వెంట జీవుల ఉనికికీ ఈ రెండు కాంతులూ ముఖ్యమే. భారీగా తగ్గిన కాంతి లోతు అలజడులు లేని, ప్రశాంతంగా ఉన్న సముద్రజలాల్లో తేటగా ఉన్న సందర్భాల్లో సూర్యకాంతి చాలాలోతుదాకా వెళ్లగలదు. కానీ గత 20 ఏళ్లలో గమనిస్తే ఆఫ్రికా ఖండం అంత పరిమాణంలో అంటే 9 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి చొచ్చుకెళ్లే ప్రాంతాలు బాగా తగ్గిపోయాయి. ఇక్కడ గతంతో పోలిస్తే సూర్యకాంతి 50 మీటర్లు తక్కువలోతుకే వెళ్లగల్గుతోంది. మరో 2.6 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి వెళ్లగలిగే లోతు ఏకంగా 100 మీటర్లు తగ్గిపోయింది. అయితే ఒక 10 శాతం సముద్రజలాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ లోతులకు సూర్యకాంతి చొరబడగల్గుతోంది. సూర్యకాంతిలోనే మనగలిగే సముద్రజీవులు చాలా ఉంటాయి. ఎన్నో రకాల జలచరాల ఉనికి, పునరుత్పత్తి, ఆహారానికి ప్రత్యక్షంగా సూర్యకాంతి అత్యావశ్యకం. ‘‘కొన్ని చోట్ల సూర్యకాంతి లభ్యత తగ్గిపోవడంతో వేరే చోట్లకు జీవులు వలసపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆయా జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అని ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలోని సముద్ర సంరక్షణ విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ థామస్ డెవిస్ చెప్పారు.నల్లగా ఎందుకు మారుతోంది?పర్యావరణానికి సంబంధించి ఎన్ని దేశాల్లో ఎన్నెన్నో కఠిన చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఆయా సంస్థలు గుట్టుచప్పుడుకాకుండా నేరుగా నదుల్లో పారబోస్తున్నాయి. గరళంగా మారిన నదీజలాలు నేరుగా సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటికి వ్యవసాయ వ్యర్థాలూ తోడవుతున్నాయి. వీటితో పోషణ సంబంధ మూలకాలు సముద్రంలోకి పోటెత్తుతున్నాయి. ఈ పోషకాలను సంగ్రహించిన నాచు వంటి అతిసూక్ష్మ మొక్కలు సముద్ర ఉపరితల జలాలపై ఏపుగా పెరుగుతున్నాయి. గనుల తవ్వకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను వర్షపు నీరు నదుల ద్వారా సముద్రాల్లోకి కొట్టుకొచ్చేలా చేస్తోంది. ఇవికాక సూర్యకిరణాలను అడ్డుకునే జీవజాలం సముద్రఉపరితలంపై మరింతగా పేరుకుపోతోంది. ఇవన్నీ కలగలిసి సాగరాలను కాంతిహీనం చేస్తున్నాయి. అలా అవి నల్లరంగులోకి మారిపోతున్నాయి. శైశవాల పెరుగుదల, భూతాపోన్నతి కారణంగా అధికమవుతున్న సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రత సైతం తమ వంతుగా ఈ దుష్ప్రభావానికి ఆజ్యం పోస్తున్నాయి.మత్స్య పరిశ్రమకూ పెనుముప్పు లోతైన సముద్రాల వద్ద సూర్యకాంతి తగ్గిపోయి ఆహార లభ్యత కృశించిపోవడంతో దిక్కులేక పలు రకాల జలచరాలు తీరాలకు చేరి అక్కడి జీవులతో కలిసి ఆహారం కోసం పోటీపడుతున్నాయి. దీంతో ఆయా జీవుల ఆహార వనరుల కొరత ఏర్పడుతుంది. సముద్రచేపలు, రొయ్యలు, ఇతర జలచరాల లభ్యత తగ్గిపోయే వీలుంది. దీని ప్రభావం భవిష్యత్తులో అన్ని సముద్రతీర దేశాల మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘లోతైన సముద్ర ప్రాంతాల్లో సూర్యకాంతి చొచ్చుకుపోయే సామర్థ్యం మరో 50 మీటర్లు తగ్గిపోతే అక్కడి జీవులు తమ ఆవాసాలను సముద్రతీరాలకు మార్చుకుంటాయి. అప్పుడు యావత్ సాగర జీవావరణ వ్యవస్థలో శాశ్వత మార్పులు సంభవించే ప్రమాదం దాపురిస్తుంది’’అని ప్లైమౌత్ మెరైన్ లే»ొరేటరీలో ప్రొఫెసర్ టిమ్ స్మిత్ విశ్లేíÙంచారు. ‘‘సముద్రాల్లో సూర్యకిరణాలు లోపలికి వెళ్లలేకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదని నింపాదిగా కూర్చునే కాలం కాదిది. ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి. సముద్రాల్లోకి చేరే నదీజలాలు వీలైనంత వరకు పారిశ్రామిక వ్యర్థాలకు ఆవాసంగా మారకుండా చూసుకోవాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుచేయాలి. వ్యర్థాల పారబోతపై పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తేజస్ యుద్ధ విమానంలో హైదరాబాద్ ‘మార్క్’1ఏ
శంషాబాద్: భారతదేశం అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానంలో ప్రధాన భాగాన్ని (సెంట్రల్ ఫ్యూస్లేజ్) పూర్తి దేశీయ పరిజ్ఞానంతో వెమ్ టెక్నాలజీ సంస్థ తయారు చేసింది. దీనికి ‘మార్క్1ఏ’గా నామకరణం చేసింది. రక్షణ రంగంలోని వివిధ పరికరాల తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ హిందుస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)తో తొలుత అభివృద్ధి భాగస్వామిగా సెంట్రల్ ఫ్యూస్లేజ్ (సీఎఫ్)ను తయారుచేసి సక్సెస్ కావడంతో ఉత్పత్తి భాగస్వామిగా మారింది. 3 నెలల్లో తొలి సీఎఫ్ విజయవంతంగా పూర్తి చేసి హెచ్ఏఎల్కు అందించేందుకు సిద్ధమైంది. యుద్ధవిమానంలోని సీఎఫ్ను తయారుచేసిన దేశీయ మొదటి ప్రైవేటు సంస్థగా ఇది నిలిచింది.ఏమిటి సీఎఫ్? డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది. ఏమిటి సీఎఫ్? డెల్టావింగ్ కలిగి ఒకే ఇంజిన్తో పనిచేసే తేజస్ మల్టిరోల్ లైట్ కాంబాట్ యుద్ధవిమానాన్ని హెచ్ఏఎల్ రూపొందించిన సంగతి తెలిసిందే. విమానంలో ఫ్రంట్ ఫ్యూస్లేజ్ అంటే పైలట్ కూర్చునే భాగం, రియర్ ఫ్యూస్లేజ్ అంటే విమానంలోని వెనుక భాగం, కింద ఉండే ల్యాండింగ్ విభాగాలను అనుసంధానించుకునే ప్రధాన భాగాన్నే (విమానం మధ్యలో ఉండే) సెంట్రల్ ఫ్యూస్లేజ్ అంటారు. ఇది మానవ శరీరంలోని మధ్యభాగంలాంటిదన్నమాట. మిగతా అన్ని భాగాలను దీనితో అనుసంధానిస్తారు. ఇందులోనే ప్రధానమైన ఇంజిన్ కూడా ఉంటుంది. నెలకు ఒకటి తయారీ హెచ్ఏఎల్ పర్యవేక్షణలో శిక్షణ పొందిన బృందంతో 3 నెలల్లో తొలి సీఎఫ్ తయారు చేశాం. వివిధ దశల్లో హెచ్ఏఎల్ క్లియరెన్స్తో దీనిని పూర్తి చేశాం. ఇకపై నెలకొకటి చొప్పున అందజేసేందుకు సిద్ధంగా ఉన్నాం. హెచ్ఏఎల్ పర్యవేక్షణతో వారి క్లియరెన్స్తో వీటి తయారీ జరుగుతుంది. ప్రస్తుతం 20 సీఎఫ్ల తయారీకి హెచ్ఏఎల్ అనుమతినిచ్చింది. – సీహెచ్వీ రామారావు, జీఎం, వెమ్ టెక్నాలజీహైదరాబాద్లో... హైదరాబాద్లోని వెమ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన ఈ సీఎఫ్ తయారీలో 25 మంది ఇంజనీర్లు, 35 మంది టెక్నీషియన్ల బృందం పాల్గొంది. దీనికోసం మొత్తం 1,595 కాంపోనెంట్స్ వాడారు. వివిధ భాగాలను అనుసంధానించేందుకు సంస్థలో జిగ్ (పరికరాలను బిగించే ప్రాంతం) ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం సంస్థలో రెండు జిగ్లున్నాయి. వెమ్ టెక్నాలజీ సంస్థ తన తొలి సీఎఫ్ మార్క్1ఏ ను శుక్రవారం హెచ్ఏఎల్కు అప్పగించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి సంజీవ్కుమార్, హెచ్ఏఎల్ సీఎండీ డాక్టర్ డీకే సునీల్, హెచ్ఏఎల్ డైరెక్టర్ కె.రవి హాజరు కానున్నారు. -
అంజన్న కొండ.. భక్తులకు అండ..
మల్యాల: ఆపదలో అభయాంజనేయస్వామిగా భక్తులకు అండగా నిలుస్తూ, కోరిన కోర్కెలు తీర్చుతున్న జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలో వాహనాల పూజలకు ప్రత్యేకంగా నిలుస్తోంది. నూతన వాహనాలు కొనుగోలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేయడం ఆనవాయితీగా మారింది. సామాన్యుల నుంచి మొదలుకొని, ప్రముఖుల వరకు కొండగట్టులోనే తమ వాహనాల పూజ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఏటా వాహన పూజల భక్తుల సంఖ్య పెరుగుతోంది.మల్యాల మండలం ముత్యంపేటలోని శ్రీ కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది తరలి వస్తుండటంతో నిత్యం కొండగట్టు భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రతి మంగళ, శనివారాల్లో వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడంతోపాటు, నూతనంగా వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తూ, వాహన పూజలు చేసుకుంటున్నారు.మంగళ, శనివారాల్లో..కొండగట్టులో నిత్యం వాహన పూజలతోపాటు ప్రతి మంగళవారం, శనివారాల్లో నూతన వాహనాలకు వాహనదారులు పూజలు చేసుకుంటారు. రాష్ట్రవ్యా ప్తంగా హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ప్రాంతాల నుంచి వాహనాల కొనుగోలు అనంతరం స్వామివారిని దర్శించుకొని, వాహన పూజలు చేస్తుంటారు. ప్రతి వాహనానికి ఒక్కసారి అయినా అంజన్న సన్నిధిలో పూజ నిర్వహించాలని ఏటా వేలాదిమంది వాహనదారులు కొండగట్టులో తమ వాహనాలకు పూజలు నిర్వహిస్తున్నారు. కొండగట్టులో ఏటా దసరా పండుగ రోజు వేలాది మంది వాహనదారులు తమ వాహనాలకు పూజలు చేసుకుంటారు.ఆంజనేయస్వామి అభయహస్తం..శ్రీరాముడికి వాహనం హనుమంతుడు.. ఎక్కడికి వెళ్లినా తిరుగులేని కార్యాలు సాధించిన ఘనుడు హనుమంతుడు. ఈ నేపథ్యంలో వాహనాలకు ఎటువంటి ఆటంకాలు, ప్రమాదాలు కలుగవని, శుభాలు కలుగుతాయనే విశ్వాసంతో భక్తులు తమ వాహనాలను కొండగట్టులో పూజలు నిర్వహిస్తుంటారు. చొప్పదండి నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన వాహనానికి కూడా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో పూజలు నిర్వహించారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తన ఎన్నికల ప్రచారం కోసం కొనుగోలు చేసిన వారాహి వాహనానికి కొండగట్టులోనే పూజలు చేయించడం కొండగట్టు ప్రత్యేకతకు అద్దం పడుతోంది.ఏటా రూ.20 లక్షల ఆదాయం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో వాహన పూజలు నిర్వహించుకునేందుకు వాహనదారులు ఆసక్తి చూపుతుండటంతో ఏటా వాహన పూజ ఆదాయం పెరుగుతోంది. వాహన పూజల ద్వారా సుమారు రూ.20 లక్షలకుపైగా ఆదాయం సమకూరుతోంది. వాహనదారుల సౌకర్యం కోసం, స్వామివారి ఉచిత గర్భగుడి ప్రవేశం కల్పించి, స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తే, రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది వాహనదారులు కొండగట్టులో వాహన పూజలతోపాటు, స్వామివారిని దర్శించుకునేందుకు మార్గం సుగమం అవుతుంది.వాహనదారులకు అభయంకొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నూతన వాహనాలతో పాటు ఏటా ప్రతి దసరా పండుగకు ఉపయోగించే వాహనాలకు కూడా పూజలు నిర్వహిస్తుంటారు. కొండగట్టులో వాహనాలకు పూజలు నిర్వహిస్తే, ఆంజనేయస్వామి అభయం ఇస్తారని, ఎటువంటి ప్రమాదాలు జరుగవని భక్తుల విశ్వాసం. వాహన పూజల కోసం రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చి, తమ వాహనాలకు పూజలు చేసుకుంటున్నారు. – రామకృష్ణ, కొండగట్టు ఆలయ ప్రధాన అర్చకుడుస్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలికొండగట్టులో వాహన పూజలకు వచ్చే భక్తుల కుటుంబాలకు స్వామివారి గర్భగుడి ప్రవేశం కల్పించాలి. ఏటా వాహనాలకు స్వామి సన్నిధిలో పూజలు నిర్వహిస్తాం. వాహన పూజకు ముందు స్వామివారి దర్శనం కోసం వెళ్లడంతో క్యూ లైన్లలో నిలబడటంతో జాప్యం జరుగుతోంది. వాహనపూజలు చేసుకునే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని స్వామివారి గర్భగుడి దర్శనం కల్పించాలి. – కొక్కుల రఘు, మల్యాల -
887 అద్భుతమైన పాత పంటలు
ప్రతికూల వాతావరణ మార్పులు వ్యవసాయానికి, ముఖ్యంగా వ్యవసాయాధార దేశమైన మనకు, పెద్ద సవాలుగా మారింది. గడచిన 16 నెలలు గతమెన్నడూ ఎరుగని రీతిలో విపరీత వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా పగలు / రాత్రి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ ఫలితంగా అనేక పంటలు సాగులో సవాళ్లు పెరిగిపోయాయి. ఈ పూర్వరంగంలో విపరీత వాతావరణ పరిస్థితులను తట్టుకొని నిలబడి, మంచి దిగుబడులను ఇచ్చే విత్తనాలు (క్లైమెట్ రిసైలియంట్ సీడ్స్) మన రైతులకు అందించటం వారి జీవనోపాధి/ ఆదాయ భద్రతకు, దేశానికి ఆహార భద్రతకు అత్యంత కీలకంగా నిలిచాయి.అటువంటి అపురూప దేశీ వంగడాలు, 71 రకాల పంటలకు సంబంధించిన, 887 మన దేశంలోని 15 రాష్ట్రాల్లో ఇప్పటికీ రైతుల దగ్గర ఉన్నాయని న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) నిర్వహించిన అధ్యయనం తేల్చింది. భేషైన పాత పంటల వంగడాలు అందుబాటులో ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కరువును, అధిక ఉష్ణోగ్రతలను, చీడపీడలను, నీటి ముంపును, పెనుగాలులను, చౌడును తట్టుకొనే గుణాలు ఈ దేశీ వంగడాలకు పుష్కలంగా ఉన్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది.విత్తన సంరక్షకులు, సామాజిక విత్తన బ్యాంకులు (కమ్యూనిటీ సీడ్ బ్యాంక్లు– సిబిఎస్లు) వీటిని ప్రతి ఏటా సాగు చేస్తూ పరిరక్షిస్తున్నాయని సిఎస్ఎ అధ్యయనంలో తేలింది. క్లైమెట్ ఛేంజ్ని ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వం కమ్యూనిటీ సీడ్ బ్యాంక్లను పూర్తిస్థాయిలో ప్రోత్సహిస్తే ప్రకృతి సేద్యానికి కూడా దోహదమవుతుందని సిఎస్ఎ తెలిపింది. దేశీ వంగడాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎంత ప్రాణవసరమో తెలియజెప్పడానికి ఈ అధ్యయనం వెలుగులోకి తెచ్చిన అపురూప సమాచారంతో కూడిన కథనం..విపరీత వాతావరణ పరిస్థితుల్ని దీటుగా తట్టుకొని మంచి దిగుబడులనిచ్చే వంగడాలు అని అనగానే జున్యుమార్పిడి, జన్యుసవరణ వంటి అత్యాధునిక ప్రజనన (బ్రీడింగ్) పద్ధతుల్లో తయారు చేస్తున్న సరికొత్త వంగడాలే మనల్ని ఆదకోగలవు అన్న అభి్రపాయం కలుగుతుంది. అయితే, వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే అపురూప దేశీ వంగడాలు (పాత పంటలు) చాలానే మన రైతుల దగ్గర అనాదిగా సాగులో ఉన్నాయని భారతీయ సుసంపన్న వ్యవసాయక వారసత్వ పటిమను ఎరిగిన వారు చెబుతున్నారు. దేశీ విత్తనాలు కొల్లలుగా ఉన్నప్పటికీ, వాటిలో ఆధారపడదగిన గణాంకాలతో కూడిన ఆధారాలనున్న పాత పంటలు ఎన్ని అనేది ఖచ్చితంగా తెలీదు.ఈ లోటు తీర్చటం కోసం న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సిఎస్ఇ) తాజాగా ఓ అధ్యయనం చేసి మంచి పని చేసింది. 71 రకాల పంటలకు సంబంధించిన 887 దేశీ వంగడాలు భేషైన పాత పంటల వంగడాలు అందుబాటులో ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. అయితే, నిజానికి వాతావరణ ప్రతికూలతల్లోనూ దిగుబడినిస్తున్న పాత పంటల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని, తాము సేకరించగలిగింది కేవలం 15 రాష్ట్రాల్లో కొన్ని సంస్థలు, కొందరు విత్తన సంరక్షకుల వద్ద గల సమాచారాన్ని మాత్రమేనని సిఎస్ఇ ప్రకటించింది.కమ్యూనిటీ సీడ్ బ్యాంక్ అంటే?వాతావరణ మార్పు నేపథ్యంలో, ఆహార భద్రత మరియు సార్వభౌమత్వాన్ని ఆధారం చేసుకునే జీవవైవిధ్యం వేగంగా నష్టపోవడాన్ని మనం చూస్తున్నాం. తరతరాలుగా సమాజాలను పోషించిన సాంప్రదాయ పంట రకాలు మన పోలాల నుంచి, మన ఆహారం నుంచి క్రమంగా కనుమరుగవుతున్నాయి. వాతావరణ మార్పుల ముప్పు ఉన్న ప్రపంచంలో వ్యవసాయానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడానికి అవసరమైన విత్తనాలను రక్షించడంలో కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు (సిబిఎస్లు) లేదా సామాజిక విత్తన బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.సామాజిక విత్తన బ్యాంకులు అనేవి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఒక రకమైన వికేంద్రీకృత జన్యు బ్యాంకులు. స్థానిక రైతు సంఘాలు, స్వయం సహాయక బృందాలు, లాభాపేక్షలేని సంస్థలు, మహిళలు వీటిని నిర్వహిస్తున్నారు. దేశీయ విత్తనాలను, విపరీత వాతావరణ ప్రభావాలను దీటుగా తట్టుకొని నిలిచే విత్తనాలను అనాదిగా ఏటేటా రైతుల ద్వారా సాగు చేయిస్తూ, అవి కాలగర్భంలో కలసిపోకుండా పరిరక్షించటం సామాజిక విత్తన బ్యాంకుల ప్రాథమిక ఉద్దేశ్యం. ఈ విత్తనాలను పరిరక్షించటంతో పాటు వాటి ఉపయోగాలు, ఔషధ గుణాల గురించిన సంప్రదాయ విజ్ఞానాన్ని కూడా సంరక్షించడం వీటి లక్ష్యం. ఉదాహరణకు, మన దేశంలో కరువు పరిస్థితుల్లో, ఉప్పు నీటిలో పెరిగే వరి రకాలు ఉన్నాయి. మనకు అధిక వేడిని తట్టుకునే కూరగాయల రకాలు ఉన్నాయి. ఈ వంగడాలను సంరక్షించడంలో, వాటిని రైతులకు అందుబాటులో ఉంచడంలో సామాజిక విత్తన బ్యాంకులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. అయితే, వాటికి ఇంత ప్రాముఖ్యత ఉన్నప్పటికీ, వాటిపై అవగాహన లేకపోవడం, ప్రభుత్వ విధానాల మద్దతు పరిమితంగా ఉండటం, ఆర్థిక సవాళ్ల కారణంగా అవి తగినంత గుర్తింపు పోందటం లేదు.దేశంలోని వివిధ రాష్ట్రాలలో సామాజిక విత్తన బ్యాంకుల్లో అందుబాటులో ఉన్న అపారమైన వైవిధ్యాన్ని మ్యాప్ చేయడానికి, డాక్యుమెంట్ చేయడానికి సిఎస్ఇ చేసిన ఒక ప్రయత్నమే ఈ నివేదిక. శుభవార్త ఏమిటంటే, మనకు ఇప్పటికీ వ్యవసాయక సమాజాలు సంరక్షిస్తున్న సాంప్రదాయ పాత పంట రకాలు విస్తృత శ్రేణిలో ఉన్నాయి. వీటిలో ధాన్యాలు, పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలు, కూరగాయలు, నూనె గింజలు, తదితర రకాల పంటల విత్తనాలు ఉన్నాయి. ఈ అపురూప పాత పంట విత్తనాలను, వాటిని సంరక్షించే సంఘాలను మనం కాపాడుకోవాలి. -
మత్స్యరూపం.. శుభ సంకల్పం
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు మత్స్యగిరీంద్రస్వామి ఆలయం తెలంగాణలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచింది. చుట్టూ ఎత్తయిన గుట్టలు, పచ్చని పంట పొలాలు.. మధ్య కొత్తగట్టు. ఆ గుట్టపై మత్స్యగిరీంద్రస్వామి ఆలయం. దీన్ని వందల ఏళ్ల కిందట నిర్మించినదిగా చెబుతారు. స్వామివారి దర్శనంతో భక్తులు పునీతమవుతున్నారు. కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి పక్కన కరీంనగర్కు 30 కి.మీ., వరంగల్కు 40 కి.మీ. దూరంలో ఉంది. విష్ణుమూర్తి మత్స్యగిరీంద్ర స్వామి అవతారానికి ప్రతీకగా గుడిలోని గుహలో వెలసిన చేప భక్తులకు దర్శనమిస్తోంది. గుహలో చేప అవతారం సృష్టికి మూలమైన చతుర్వేదాలను సోమకాసురుడు అనే రాక్షసుడు తస్కరించి సప్త సముద్రాల అవతల దాక్కున్నాడని, చతుర్వేదాలను పరిరక్షించేందుకు విష్ణుమూర్తి మత్స్యవతారంలో సముద్రాలను దాటి చతుర్వేదాలను పరిరక్షించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి మత్సా్యవతారం ధరించాక కొత్తగట్టు గుట్టపై గుహలో చేప ప్రతిరూపంతో వెలిశాడని స్థల పురాణం చెబుతోంది. గుహలో చేప ప్రతి ఇప్పటికీ ఉండగా అద్దం ఏర్పాటు చేసి ప్రతిబింబాన్ని భక్తులు వీక్షిస్తారు.ఆలయ ఉత్సవాలు.. ఆలయంలో మత్స్యగిరీంద్రస్వామి, నర్సింహస్వామి, గుట్టపై ఆంజనేయస్వామి, శివాలయం, కోనేరు ఆకట్టుకునే రీతిలో ఉన్నాయి. ఏటా మాఘమాసంలో మత్స్యగిరీంద్రస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భీషే్మకాదశి సందర్భంగా భూదేవి, నీలాదేవి సహ స్వామివారి కల్యాణం వైభవంగా జరుపుతారు. మాఘపౌర్ణమి సందర్భంగా జాతర, నాకబలి (పుష్పయాగం), కోనేరులో చక్రస్నానం వేదపండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య నిర్వహిస్తారు. అనుబంధ ఆలయాల్లో హనుమాన్ జయంతి, నర్సింహ జయంతి, మహాశివరాత్రి, జాగరణ, శివకల్యాణం, అగ్నిగుండాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.పోలు దండ వేసుకుంటే సంతానం.. సంతానం కలుగని దంపతులు నాకబలి రోజు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుందని భక్తుల విశ్వాసం. ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల కోసం భక్తులు ఎగబడతారు. గరుడ ముద్దల ప్రసాదం దక్కిన భక్తులకు స్వామివారు, అమ్మవారి చల్లని దీవెనలు ఉంటాయన్న నమ్మకంతో పాటు సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది.శేషం వంశస్తుల పూజలు మత్స్యగిరీంద్రస్వామికి శేషం వంశస్తులు 11 వందల ఏళ్లుగా స్వామివారిని పూజిస్తున్నట్లు స్థల పురాణం చెబుతోంది. ధూప, దీప, నైవేద్యం, బ్రహ్మోత్సవాల ప్రధాన అర్చకులు శేషం మురళీధరాచార్యులు సమక్షంలో జరుగుతున్నాయి.పోచమ్మను దర్శించుకుని గుట్టపైకి.. గుట్టకింద పోచమ్మ ఆలయంలో దర్శనం చేసుకుని ఘాట్రోడ్డుపై నుంచి ఆలయం చేరుకోవాలి. కోనేరులో పవిత్రస్నానాలు ఆచరించిన భక్తులు మత్స్యగిరీంద్రస్వామి, చేప ప్రతిమను దర్శించుకుంటారు. పక్కనే ఉన్న నర్సింహస్వామికి పూజలుచేసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఆంజనేయస్వామి, శివాలయంలో శివుడికి పూజలు చేస్తారు.చదవండి: ఆనంద ద్వీపం.. అభివృద్ధికి ఆమడ దూరంసాగని అభివృద్ధి.. తెలంగాణలో ఏకైక మత్స్యగిరీంద్రస్వామిగా ప్రసిద్ధి చెందిన కొత్తగట్టు ఆలయ ప్రాకారం నిర్మాణం 12 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. ఏడాది కిందట గాలిగోపురం నిర్మాణానికి దాతలు కాంట్రిబ్యూషన్ చెల్లించినా.. పనులు ప్రారంభానికి నోచుకోలేదు. కల్యాణ మండపం, ఆంజనేయస్వామి, పోచమ్మ ఆలయాలను దాతలు నిర్మించారు. ప్రత్యేక ఆకర్షణగా భారీ విగ్రహం ఎన్హెచ్ఏ–563 రహదారి టోల్గేట్ కొత్తగట్టు ఆలయం వద్ద నిర్మిస్తున్నారు. భారీ మత్స్యగిరీంద్రస్వామి విగ్రహాన్ని కరీంనగర్–వరంగల్ రహదారి పక్కన గుట్టపై ఓ భక్తుడు నిర్మిస్తున్నారు. దీంతో ఈ విగ్రహం విద్యుత్ దీపాల కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పోలు దండలు వేసుకుంటే సంతానం ధ్వజారోహణం రోజు గరుడ ముద్దల ప్రసాదం స్వీకరించి, నాకబలి రోజు సంతానం కలుగని దంపతులు పోలు దండలు వేసుకుంటే సంతానం కలుగుతుందనేది ప్రగాఢ నమ్మకం. ఇలా చేసిన అనేకమంది దంపతులకు సంతానం కలిగింది. కోనేరులో పవిత్రస్నానాలు చేసి దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. పంటలకు చీడపీడలు సోకితే కోనేరులో నీటిని చల్లుకుంటే వాటి ఉధృతి తగ్గుతుందని రైతులకు నమ్మకం. – శేషం మురళీధరాచార్యులు, ప్రధాన అర్చకుడు, మత్స్యగిరీంద్రస్వామి ఆలయం, కొత్తగట్టు -
ఏడాదిగా దగా.. ఏం సాధించారని సంబరాలు?
తాము అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగించడంతోపాటు అంతకంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తానంటూ ప్రతి ఎన్నికల సభలోనూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏడాదిగా కొత్తవి ఒక్కటి కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.1.37 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. అన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదు. హామీలను ఎగ్గొట్టి.. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెడ్బుక్ కుట్రలతో డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు.ఇసుక,గనులు,మద్యం దాకా ఎల్లో సిండికేట్ సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొడుతోంది. టీడీపీ కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తవుతున్న తరుణంలో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, ఆసరా తదితర పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లను డీబీటీ రూపంలో వైఎస్ జగన్ నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకున్నారనే చర్చ గ్రామ గ్రామాన జరుగుతోంది. - సాక్షి, అమరావతి ఇది రద్దుల ప్రభుత్వం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, పథకాలను టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసింది. ఫీజుల పథకానికి చెదలు పట్టించింది. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది. రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసింది. చదువుకునే పిల్లలు, రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులను మోసగించి వంచించింది. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన జ్యుడీషియల్ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి తమ సన్నిహితులు, బినావీులకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మొబిలైజేషన్ అడ్వాన్సు విధానాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని వైఎస్ జగన్ ప్రగతిపథంలో నిలిపారు.నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. 2023–24లోనే ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేస్తోంది. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు చొప్పున అందిస్తామని నమ్మబలికారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని.. ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికీ అందచేస్తామని చెప్పారు. అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.ఆడబిడ్డ నిధి కింద 19 – 59 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. వారు నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈమేరకు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు ప్రతి ఇంటికీ బాండ్లు పంపిణీ చేసి నమ్మించారు. సూపర్ సిక్స్తోపాటు మొత్తం 143 హామీలను టీడీపీ–జనసేన కూటమి ఇచ్చింది. వాటి అమలు బాధ్యత తనదేనంటూ పవన్ కళ్యాణ్ భరోసానిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సూపర్ సిక్స్ హామీలన్నీ పూర్తి మోసాలుగా మిగిలాయి. జాబ్ క్యాలెండర్ హుష్కాకి..వైఎస్సార్సీపీ హయాంలో ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చారు. 2019–24 మధ్య శాశ్వత, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఎంఎస్ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా జాబ్ కేలండర్ ఊసే లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్ వెలువడలేదు.సంస్కరణల పేరుతో గ్రూప్–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్ పోస్టులను గ్రూప్–1లో కలిపేందుకు నిర్ణయించి గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్ నోటిఫికేషన్గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ దాదాపు 1,000 పోస్టుల భర్తీకి అనుమతించినా కూటమి సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. డీఎస్సీ పేరుతో ఏడాదిగా డ్రామాలాడి విచిత్ర నిబంధనలతో అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్ అభ్యర్థులు 3 లక్షల మందిని పరీక్షకు దూరం చేశారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై విషం.. రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై చంద్రబాబు దారుణమైన అబద్ధాలను ప్రచారం చేశారు. భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని, భూములకు రక్షణ లేదని, రిజిస్ట్రేషన్ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చే క్రమంలో దేశంలోనే మొదటిసారిగా భూముల రీ సర్వే నిర్వహించింది. భూములను జియో ట్యాగింగ్ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్ చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దీన్ని వేదికగా మార్చుకున్నారు.ఎడాపెడా అప్పులు.. రెడ్బుక్ టెర్రర్వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేసిందంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను వండివార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లు అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని చెప్పించారు. గతేడాది నవంబర్ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు.కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ఫ్రచారం చేసూ్తనే వచ్చారు. నిజానికి గ్యారెంటీ, నాన్ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.7,21,918 కోట్లే. ఇందులో విభజన జరిగే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి రాష్ట్ర అప్పు రూ.1,47,717 కోట్లు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లకు చేరుకుంది. అంటే 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా 22.63 శాతం అప్పులు పెరిగాయి (సీఏజీఆర్).వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు. అంటే 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా సగటున 13.57 శాతం మాత్రమే అప్పులు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రూ.1,37,546 కోట్లు అప్పు చేసింది. అంటే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 41 శాతాన్ని చంద్రబాబు కూటమి సర్కార్ ఒక్క ఏడాదిలోనే చేసింది. డైవర్షన్ పాలిటిక్స్..సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల ఎగవేత.. పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. పచ్చమూకల నరమేథాన్ని దేశానికి చాటిచెప్పేందుకు గతేడాది జూలై 24న వైఎస్ జగన్ ఢిల్లీలో ధర్నాకు దిగితే దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లెలో అగ్ని ప్రమాదం పేరుతో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు దిగారు.విజయవాడలో వరదల నియంత్రణలో కూటమి సర్కారు వైఫల్యంతో 50 మందికిపైగా బలయ్యారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్సీపీ నేతలు పడవలతో ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఢీకొట్టారంటూ దారుణమైన అబద్ధాలను చంద్రబాబు ప్రచారం చేశారు. తన వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ సెప్టెంబరు 18న సీఎం డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారు. మాఫియా రాజ్యం..వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది వర్షాకాల అవసరాల కోసం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పచ్చ ముఠాలు మాయం చేశాయి. ఉచితం ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి అధిక ధరలకు అమ్ముకుంటూ భారీ ఎత్తున దోచేస్తోంది.గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ పెద్దలు దుష్ప్రచారం చేస్తూ నాడు అధికారులుగా పని చేసిన వారిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫియా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినావీులకు దోచిపెడుతున్నారు. ఊరూపేరూ లేని ఉర్సాకు 99 పైసలకే ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని విశాఖలో కట్టబెడుతున్నారు. లూలూ మాల్ పేరుతో విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూదోపిడీకి పరాకాష్ట.దుష్ప్రచార కుట్రలు బట్టబయలు..ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్ జగన్ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి 2.60 లక్షల మందిని నియమించారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే ఇంటివద్దే పెన్షన్ల నుంచి అన్ని రకాల పౌర సేవలను వలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందించింది. కరోనా మహమ్మారి సమయంలో వలంటీర్ల సేవల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం చిమ్మారు. వలంటీర్ల ద్వారా 33 వేల మంది మహిళలను మాయం చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నిరాధార ఆరోపణలు చేశారు. అయితే 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్ 16న అసెంబ్లీలో వెల్లడించడం గమనార్హం.చదవండి: దళిత, మైనార్టీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ 'బూటు' దెబ్బప్రశ్నించే గొంతులు నొక్కుతూ..చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక 390 మంది హత్యలకు గురయ్యారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి 500 మంది నాయకులు, కార్యకర్తలను జైళ్లకు పంపారు. సోషల్ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు బనాయించి 79 మందిని జైలుకు పంపారు. 11 మంది జర్నలిస్టులపై దాడులు చేశారు. జర్నలిస్టులపై 63 అక్రమ కేసులు బనాయించి 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి ఇద్దరిని జైలుపాలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాంగత ప్రభుత్వంతో పోల్చితే కూటమి సర్కారు పాలన ఏం బాలేదు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత లాంటి సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. చేయడానికి పనులు దొరకడం లేదు. ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. అది ఆచరణలో ఎక్కడా అమలు జరగడం లేదు. మా కుటుంబానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ వచి్చంది. 200 యూనిట్ల వరకూ విద్యుత్ను ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటి వరకూ ఇవ్వని కూటమి ప్రభుత్వం ఇకపై వచ్చే నాలుగేళ్లలో ఇస్తుందనే నమ్మకం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు వచ్చి ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాం. – బయ్యే నాగవిజయబాబు, శెట్టిపేట, తూర్పు గోదావరి జిల్లాకూటమి సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుతో పాటు శెట్టిపేట, తాళ్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద, కృష్ణాపురం, కొమ్ముగూడెం తదితర చోట్ల వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు ఇలా..⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు జ్యోతి కాలనీలో నివసించే దిద్దే ఆనంద్కుమార్ భవన నిర్మాణ కార్మికుడు. విధి వక్రీకరించి ఆర్నెల్ల క్రితం పక్షవాతం బారిన పడటంతో రెండు కాళ్లూ పనిచేయడం లేదు. వికలాంగ పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. ఏడాదిగా ఇలా ఎంతో మంది పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉంటున్న సీలి విజయకు గత ప్రభుత్వంలో ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా రుణం ఇవ్వడం లేదని, కనీసం డ్వాక్రా రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదనగా చెబుతోంది. వలంటీర్గా పనిచేసే తన కోడలిని తొలగించారని, మనవళ్లకు అమ్మ ఒడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడాదిలో ఏమీ చేయని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో చేస్తుందని నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద గ్రామంలో పొలానికి నీరు పెడుతున్న ఈ రైతు పేరు యాతం రామాంజనేయులు. పంట కోత దశకు వచ్చే సమయంలో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక తడి అందక పంట ఎండిపోయింది. కౌలుకి తీసుకున్న మూడెకరాలకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున కట్టాలి. గతంలో రైతు భరోసా వచ్చేదని, ఎకరాకు రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు పైసా కూడా ఇవ్వలేదని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.⇒ ‘గత ప్రభుత్వంలో నాకు చేయూత ఇచ్చేవారు. నా భర్తకు పింఛన్ వచ్చేది. నా కోడలికి అమ్మ ఒడి అందేది. నా మనవళ్లకు పుస్తకాలు, దుస్తులు ఉచితంగా ఇచ్చి మంచి భోజనం పెట్టేవారు. కరోనా సమయంలో వలంటీర్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలిచ్చింది. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితమన్నారు, ఒకటి ఇచ్చేశామంటున్నారు. కానీ నాకుగానీ, నా కోడలికిగానీ రాలేదు. మేమే కాదు మా ఊరిలో అందరం ఇలాగే బాధపడుతున్నాం. జగన్ ఉన్నప్పుడు రూ.10 వేలు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆటోడ్రైవర్లు అంటున్నారు.’ – మణెమ్మ, తాళ్లపాలెం, తూర్పుగోదావరి జిల్లా. -
ముందస్తు నైరుతి ఎందుకంటే..!
రుతుపవనాల రాక కోసం కర్షకుడు ఆకాశంకేసి కళ్లు కాయలు కాచేలా చూస్తాడు. హలధారితో దోబూచులాడే రుతుపవనాలు ఈసారి రైతన్నలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తూ ఆగమేఘాల మీద దూసుకొచ్చి వర్షాలను దంచికొడుతున్నాయి. అడవుల నరికివేత, యథేచ్ఛగా సాగుతున్న మానవ కార్యకలాపాలు, శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం తదితరాలతో వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ సంభవించిన కారణంగానే రుతుపవనాలు ఇలా ముందుగా వచ్చేశాయని ఎన్నో విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే ఇలా ముందస్తు వర్షాలు గతంలో సర్వసాధారణమని వాదించే వాళ్లూ ఉన్నారు. దీంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ముందస్తు రాకకు కారణాలేంటి అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. గతంలోనూ ముందొచ్చాయి కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఊరకే రాష్ట్రాలను చుట్టేయకుండా భారీ వర్షాలతో పలకరించి ఈసారి అధిక వర్షాలు ఖాయమని కబురును రుతుపవనాలు మోసుకొచ్చాయి. అయితే ఇలా ముందస్తు రాక కొత్తేమీ కాదని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. ఈసారి పలు రాష్ట్రాల్లోకి రెండు వారాల ముందే రుతుపవనాలు ప్రవేశించడంతోపాటు కేరళ నుంచి మహారాష్ట్రదాకా అవి వేగంగా, విస్తారంగా మే 24న ఒక్కరోజులోనే విస్తరించడం విశేషం. ఇది అసాధారణమేమీ కాదని, కేవలం అరుదైన విషయమని గణాంకాలు చాటుతున్నాయి. 1971 ఏడాదిలోనూ రుతుపవనాలు కర్ణాటకలో అధిక భాగం, మహారాష్ట్రలో కొంత మేర ఒకేసారి విస్తరించి అప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. మళ్లీ దాదాపు యాభై ఏళ్ల తర్వాత ఇదే తరహాలో రుతుపవనాలు ఒకేసారి విస్తరించాయి. ఆ తర్వాత కాస్తంత బ్రేక్ జూన్ రెండో తేదీదాకా రుతుపవనాలు ఇదే వేగంతో విస్తరిస్తాయని వాతావరణ శాఖ వర్గాలు అంచనావేస్తున్నాయి. మహారాష్ట్ర, తూర్పు భారతాన్ని త్వరగా చుట్టుముట్టాక వేగం తగ్గే వీలుంది. గతంలో మాది రే వేగం నెమ్మదించి మెల్లిగా రుతుపవనాలు ముందుకు సాగనున్నాయి. మధ్య స్థాయి ఎత్తులో పొడి వాతావరణం ఏర్పడటంతో జూన్ మొదటి వా రం తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తరచూ వర్షాలు పడే అవకాశాలు సన్నగిల్లుతాయి. రుతుపవనాల గమన వేగం సైతం తగ్గనుంది. ముందస్తుపై వాతావరణ మార్పుల ప్రభావం సహజ వాతావరణ వ్యవస్థతోపాటు మానవ ప్రేరేపిత భూతాపోన్నతి, గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు వంటి అంశాలూ రుతుపవనాలపై ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికైతే భారత్లో రుతుపవనాల రాకపై వాతావరణ మార్పుల ప్రభావం పరిమిత స్థాయిలోనే ఉందని వారు అభిప్రాయపడ్డారు. భూతాపోన్నతి దెబ్బకు యురేసియా, హిమాలయ ప్రాంతాల్లో మంచు దుప్పటి కరిగిపోతోంది. 1990–2020 కాల సగటుతో పోలిస్తే ప్రస్తుతం యురేసియా, హిమాలయాల పరిధిలో మంచు 15 శాతం అంతరించిపోయింది. తక్కువ మంచు కారణంగా ఉపరితల ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో రుతుపవనాలు ప్రేరేపితమై త్వరగా వస్తాయి. ఒక్కోసారి మే నెల మధ్యలోనే ఇవి రావొచ్చు. గ్లోబ ల్ వార్మింగ్లో పెరిగే ప్రతి ఒక్క డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు సముద్రాలపై వాతావరణంలో తేమ 6–8 శాతం పెరుగుతుంది. పారిశ్రామిక విప్లవానికి ముందునాటితో పోలిస్తే 2025లో ఉష్ణోగ్రత 1.2 డిగ్రీ సెల్సియస్ పెరిగిందని ఇప్పటికే గణాంకాలు చాటుతున్నాయి.ఈ నేపథ్యంలో అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం ఉపరితల వాతావరణంలో తేమ పెరిగి మే నెలలోనే మేఘాల అధిక ఆవిర్భావానికి దారితీసింది. కర్ణాటక–గోవా తీరం వెంట ద్రోణి కారణంగా తుపాను పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవి ఈసారి రుతుపవనాలను మరింత ముందుకు లాగాయి. మారిషస్, మడగాస్కర్ల మధ్య తక్కువ ఎత్తులో వీచే పవనాల దృగ్విషియాన్ని సోమాలీ జెట్గా పిలుస్తారు. ఇది ఈనెలలోనే విజృంభించింది. ఈ గాలులు అరేబియా సముద్రం మీదుగా భారత పశి్చమ తీరం వైపు వీస్తాయి. ఇవి కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలనూ తాకుతాయి. ఈసారి సోమాలీ జెట్ గాలుల ప్రభావం తోడవడంతో నైరుతి పవనాలు త్వరగా వచ్చేశాయి. మరెన్నో కారణాలు.. భౌగోళిక, సముద్ర, వాతావరణ పరిస్థితుల మధ్య సమన్వయంలో తేడా సైతం ఈసారి రుతుపవనాల ఆగమనాన్ని ముందుకు తోసింది. భూమధ్యరేఖ జోన్లో ప్రతి 30 నుంచి 60 రోజులకు ఒకసారి సముద్రజలాల మీదుగా మేఘాలు, వర్షాలు, పవనాలు ఒక క్రమపద్దతిలో ముందుకు సాగుతాయి. దీనినే మేడిన్ జూలియన్ ఆసిలేషన్(ఎంజేఓ)గా పిలుస్తారు. ఎంజేఓ అనేది రుతుపవనాల్లో తేమ, పొడి దశలను నిర్దేశిస్తుంది. ఈనెలలో ఎంజేఓ మూడో దశలోఉంది. ఇది మేఘావృత స్థితిని అధికం చేసి దక్షిణభారతంలో వర్షాలను కురిపిస్తుంది. మే 25వ తేదీన ఇది నాలుగోదశకు మారడంతో హిందూ సముద్రం నుంచి మరింత తేమ పవనాల రూపంలో భారత్పై కురిసింది. ఈసారి ఎల్నినో సైతం తటస్థ వైఖరిని ప్రదర్శించడంతో రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. అందుకే ఈసారి వర్షాలు ముందే పడ్డాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆనంద ద్వీపం.. అభివృద్ధికి ఆమడ దూరం!
పాల్వంచ రూరల్: ప్రకృతి అందాలకు నెలవైన కిన్నెరసాని పర్యాటక అభివృద్ధికి నోచుకోవడం లేదు. మంత్రులు, కలెక్టర్లు ప్రత్యక్షంగా పరిశీలించినా అడుగు కూడా ముందుకు పడడం లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటకంగా అభివృద్ధి చెందకపోవడంతో ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది. నిత్యం వందల సంఖ్యలో, సెలవు రోజుల్లో వేలాదిగా వచ్చే పర్యాటకులు రిజర్వాయర్ మధ్యలోని ఆనంద ద్వీపాన్ని సందర్శించాలని తపన పడుతుంటారు. కానీ అక్కడ చేయాల్సిన అభిృవృద్ధి పనుల్లో ముందడుగు పడకపోవడంతో అద్భుత అవకాశాన్ని కోల్పోతున్నారు. ముగ్గురు మంత్రులు వీక్షించినా.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) ఏడాది క్రితం కిన్నెరసానిని సందర్శించారు. రిజర్వాయర్ మధ్యలోని ఆనంద ద్వీపం అద్భుతంగా ఉందని, పర్యాటకులకు దర్శనభాగ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అద్దాల మేడ, కాటేజీ పనులు వేగవంతం చేయాలని, పర్యాటకులను ఆకర్షించేలా ఆనంద ద్వీపాన్ని తీర్చిదిద్దాలని అటవీశాఖను ఆదేశించారు. ప్రభుత్వం కూడా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించడంతో కలెక్టర్ కిన్నెరసానిపై ప్రత్యేక దృష్టి సారించినా, పనులు మాత్రం మందకొడిగానే సాగుతున్నాయి. పర్యాటకులకు నిరాశే.. చూడచక్కని ప్రకృతి అందాలు, అద్భుతమైన హైల్యాండ్స్, అందమైన జలాశయం, ఆహ్లాదకరమైన అడవులు ఉన్న కిన్నెరసానిలో సౌకర్యాలు లేక పర్యాటకులకు నిరాశే మిగులుతోంది. అద్దాలమేడ, కాటేజీలు, హారిత హోటల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతారు. పదేళ్ల క్రితమే నిధులు మంజూరు కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు 2015లో నీతి అయోగ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.3.24 కోట్లు, ఎకో టూరిజం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేశాయి. ఆ నిధులతో కొత్తగూడెం క్రాస్ వద్ద హరిత హోటల్, కిన్నెరసానిలో పది కాటేజీలు, అద్దాలమేడ, ఫుడ్కోర్టు పనులు చేపట్టాలని నిర్ణయించారు. కాగా, ఇందులో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో సౌకర్యాల లేమితో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నా.. వసతులు ఉంటే మరింత మంది వచ్చే అవకాశం ఉంది. సింగపూర్ నుంచి ఆర్కిటెక్ట్లు.. రిజర్వాయర్ మధ్యలో ఉన్న ఆనంద ద్వీపాన్ని అభివృద్ధి చేసేందుకు 2018లో అప్పటి కలెక్టర్ రజత్కుమార్ శైనీ సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఆర్కిటెక్ట్లను పిలిపించారు. పర్యాటకుల సౌకర్యార్థం వెదురు బొంగులతో గుడారాలు, ఎత్తయిన ట్రాక్, తాగునీటి వసతి వంటివి కల్పించాలని నిర్ణయించారు. అయితే అవి నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత కలెక్టర్లు ఎంవీ రెడ్డి, అనుదీప్తోపాటు ప్రస్తుత కలెక్టర్ జితేశ్ వి పాటిల్ కూడా పనులను పరిశీలించినా ఫలితం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని లక్నవరంలో ఏర్పాటు చేసినట్టుగా ఆనంద ద్వీపం (Anand Dweepam) వరకు తీగలవంతెన ఏర్పాటు చేసి, హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.చదవండి: కంబాలపల్లి C/o ప్రభుత్వోద్యోగులు -
ఎడారి నేల జలకళ
రాజస్థాన్ అనగానే గుర్తొచ్చేది ఎడారి. అందులోనూ కరౌలీ జిల్లా అంటేనే నీటికోసం తండ్లాట. వరుస కరువులు. పచ్చదనం అంటే తెలియని పల్లెలు. ఈ దృశ్యాన్ని మార్చేశారు మహిళలు. చుక్క చుక్కను ఒడిసిపట్టి పొఖార్(నీటికుంట)లను సృష్టించారు. ఉపాధి లేక బందిపోట్లుగా మారిన పురుషులను వ్యవసాయం వైపు మళ్లించి.. మళ్లీ రైతులను చేశారు. బంజరు నేలల్లో ఇప్పుడు బంగారం పడిస్తున్నారు. దుఃఖనదిలా మారిన షేర్నిని మళ్లీ జీవనదిగా మార్చారు. మే నెల మండుటెండల్లోనూ కరౌలీ చెరువులు, పొఖార్లు నీటితో కళకళలాడుతున్నాయి. నెమ్మదిగా ప్రవహిస్తున్న సేర్ని నది ఒడ్డున పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ పక్కనే పశువులు మేస్తూ ఉన్నాయి. ఒక దశాబ్దం క్రితం, ఎవరూ ఊహించని దీనిని మహిళలు సాధ్యం చేసి చూపించారు. అదెలా సాధ్యమైందంటే... రాజస్థాన్లోని కరౌలీ జిల్లా.. కరువుకు మారుపేరు. వాతావరణ మార్పులతో వర్షపాతం తగ్గింది. భూములు బంజరుగా మారా యి. నీటి వనరులు లేవు. 50 ఏళ్ల కిందట జీవనాధారంగా ఉన్న వ్యవసాయం, పశుపోషణ లే కుండా పోయింది. వేరే మా ర్గం లేక చాలా మంది వలసపోయారు. ఉపాధి లేక కొందరు నగరాలకు వలస వెళ్లగా, మరికొందరు మై నింగ్వైపు మొగ్గుచూపా రు. ఇంకొందరు బందిపోట్లుగా మారారు. ఒక్క సారి ఇంటినుంచి వెళ్లిన వారు తిరిగి ఇంటికొస్తారో లేదో తెలియదని భయం. మైనింగ్ నుంచి వచ్చే సిలికా ధూళితో సిలికోసిస్ అనే ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యింది. ఈ పనిలోకి వెళ్లినవారిలో 74శాతం మంది వ్యాధి బారిన పడ్డారు. చాలామంది 40 ఏళ్లు దాటి జీవించలేదు. నీటికరువు ఆ ప్రాంత సామాజిక పరిస్థితిని కూడా మార్చేసింది. నీళ్లు లేని కారణంగా ఆ జిల్లాలోని గ్రామాలకు పిల్లనివ్వాలంటే భయపడేవారు. మరోవైపు వరుస కరువులు, పేదరికంతో తమ ఆడపిల్లలకు తొందరగా పెళ్లిళ్లు చేసి పంపేవారు కరౌలీ జిల్లాలోని గ్రామస్తులు. అందరి జీవితాల్లో ఒకరకమైన నిరాశ. కరువు నుంచి లక్షాధికారుల వరకు.. 2010లో మార్పునకు బీజం పడింది. నీటి సంరక్షణ స్వచ్ఛంద సంస్థ తరుణ్ భారత్ సంఘ్వారి జీవితాల్లోకి వచ్చింది. ఒకప్పటి చెరువులన్నీ ఎండిపోయాయి. మట్టి, ఇసుకతో నిండిపోయాయి. వాటిని పునరుద్ధరణకు నడుం కట్టారు మహిళలు. ఆలంపూర్ గ్రామ సంపత్తి దేవి అనే మహిళ అప్పటిదాకా తాను కూడబెట్టిన మొత్తాన్ని ఖర్చు చేసి 2015–16లో కొండ కింద పొఖార్ను నిర్మించింది. వర్షాలు పడినప్పుడు కొండపైనుంచి వచ్చిన నీటితో పొఖార్ నిండిపోయింది. ఏడాదికి సరిపడా నీరు. బందిపోటు అయిన భర్తను వ్యవసాయానికి ఒప్పించింది. 58 ఏళ్ల జగదీష్, ఆయన భార్య కలిసి ఇప్పుడు ఆవాలు, గోధుమలు, చిరుధాన్యాలు, కూరగాయలు పండిస్తున్నారు. ప్రతి సీజన్లో లక్షరూపాయలు సంపాదిస్తున్నారు. అదే జిల్లాలోని భూర్ఖేడ గ్రామానికి చెందిన ప్రేమ్.. బిడ్డలకు చిన్నవయసులోనే పెళ్లి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో భర్త బందిపోటుగా మారాడు. ఈ పరిస్థితి మార్చాలనుకుంది. గ్రామ శివార్లలో పొఖార్ నిర్మించేందుకు నాలుగు బిగాల సొంత భూమిని ఇచ్చింది. చెరువు నీటితో గోధుమలు, చిరుధాన్యాలను పండిస్తూ గర్వంగా కుటుంబాన్ని పోషించుకుంటోంది. బందిపోటు నుంచి రైతుగా మారిన మరో వ్యక్తి భూర్ఖేడకు చెందిన 60 ఏళ్ల లజ్జా రామ్. ‘నా తండ్రి రైతు. ఆ కాలంలో తగినంత నీరు ఉండేది. నేను పెరిగేకొద్దీ వర్షపాతం తగ్గింది, బావులు ఎండిపోయాయి. వ్యవసాయం కష్టమైంది. పశువులు చనిపోయాయి, తరువాత మా ప్రాణాలు పోతాయేమో అనిపించింది. అలా దొంగగా మారిపోయాను. నేను లొంగిపోయేందుకు నా సోదరి ఒప్పించింది. ఇప్పుడు మా 10 బిగాల భూమిలో గోధుమలు, ఆవాలు, శనగలు, ముత్యాల మిల్లెట్లను పండిస్తున్నారు. ఎనిమిది గేదెలు, మేకలతో ఆనందంగా ఉన్నాం’అని చెబుతున్నాడు. జీవనదిగా మారిన సేర్ని... ఈ పదిహేనేళ్ల కాలంలో.. జిల్లాలోని చుట్టుపక్కల అడవిలో ఇటువంటి 16 పొఖార్లను నిర్మించారు. ఇవన్నీ వర్షపు నీటిని ఒడిసిపట్టేవే. వీటినుంచి డీజిల్ పంపుల ద్వారా సాగుకు వాడుకుంటారు. పొఖార్లతో భూగర్భజలం మట్టం పెరిగింది. నేలను తవి్వతే ఐదు నుంచి పది అడుగుల లోపే నీరు అందుతుంది. జిల్లాలోని సేర్ని నది.. 40 ఏళ్లకిందట ఏడాది పొడవునా ప్రవహించేది. వాతావరణ మార్పులు.. అది ఎండిపోయేలా చేశాయి. దీపావళి పండుగ అయిపోయిందంటే నదిలో చుక్క నీరు కనిపించకపోయేది. కానీ.. ఇప్పుడది జీవనదిగా మారింది. వేసవిలోనూ నీరు ప్రవహిస్తోంది. నీరు జీవం.. నీటితో స్థిరత్వం వస్తుంది. నీటి గతిని అనుసరించే నాగరికతలు ఏర్పడ్డాయి. ఇప్పుడా నీరే రాజస్థాన్ ఎడారి జీవితాలను మార్చేసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈవీలు.. చార్జింగ్!
దేశవ్యాప్తంగా విద్యుత్ వాహనాల (ఈవీ) అమ్మకాలతోపాటు.. వాటి విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. 2024–25లో రికార్డు స్థాయిలో సుమారు 19.65 లక్షల ఈవీలు వినియోగదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఈవీల కోసం ఏర్పాటుచేస్తున్న పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లు (పీసీఎస్) కూడా గత మూడేళ్లలో భారీగా పెరిగాయి. కేంద్ర విద్యుత్ సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ – సీఈఏ) తాజా నివేదిక ప్రకారం.. ఈ స్టేషన్లలో చార్జింగ్ కోసం 2024–25లో వినియోగించిన విద్యుత్ 847 మిలియన్ యూనిట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 82 శాతం అధికం కావడం గమనార్హం. పీసీఎస్లు వినియోగించిన విద్యుత్ విషయంలో తెలుగు రాష్ట్రాలు టాప్ – 7 జాబితాలో ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా.. ఈవీల కోసం ఏర్పాటుచేసిన పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో (పీసీఎస్) దేశవ్యాప్త విద్యుత్ వినియోగం 2024–25లో 847.8 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరుకుంది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 82 శాతం ఎక్కువ. 2024 ఏప్రిల్ నెలలో వినియోగం 52.88 ఎంయూలు కాగా, 2025 మార్చిలో ఇది 60.7 శాతం పెరిగి 85 ఎంయూలకు చేరింది.తెలంగాణ@ 5.. ఏపీ @7కేంద్ర విద్యుత్ సంస్థ నివేదిక ప్రకారం పీసీఎస్లు వినియోగించే విద్యుత్లో ఢిల్లీ 38.69 శాతం వాటాతో ముందంజలో ఉంది. విస్తీర్ణంలో చిన్నదైనప్పటికీ, పీసీఎస్ల అధిక విద్యుత్ వినియోగానికి కారణం.. రాజధానిలో ఈవీల అమ్మకాలు దూసుకెళ్లడమే. మహారాష్ట్ర 25.57 శాతం, కర్ణాటక 9.39, గుజరాత్ 7.56 శాతాలతో ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 5వ స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలోనూ నిలిచాయి. టాప్ – 4 మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాలన్నీ కలిపి 18.78 శాతం విద్యుత్ను వినియోగించాయి.ఏటా 50,000 స్టేషన్లుభారత్లో 2025 ఏప్రిల్ 1 నాటికి ఉన్న ఈవీల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల సంఖ్య 26,367. 2022 డిసెంబరుతో పోలిస్తే.. 2024 డిసెంబరు నాటికే వీటి సంఖ్య సుమారు ఐదింతలు కావడం విశేషం. కర్ణాటకలో అత్యధిక సంఖ్యలో 5,880 కేంద్రాలు ఉన్నాయి. మహారాష్ట్రలో 3,746, ఉత్తరప్రదేశ్లో 2,137, ఢిల్లీలో 1,951, తమిళనాడులో 1,524 స్టేషన్స్ పనిచేస్తున్నాయి. తెలంగాణలో 976, ఆంధ్రప్రదేశ్లో 616 స్టేషన్స్ ఉన్నాయి. 2030 నాటికి ప్రైవేట్ వాహనాల్లో 30 శాతం, వాణిజ్య వాహనాల్లో 70 శాతం, బస్సుల్లో 40 శాతం, ద్విచక్ర, త్రిచక్ర వాహనాల్లో 80 శాతం ఎలక్ట్రిక్వే ఉండాలని నీతి ఆయోగ్ లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా చార్జింగ్ నెట్వర్క్ను ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఆరేళ్లలో ఏటా దాదాపు 50,000 చార్జింగ్ పాయింట్ల చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అంతర్జాతీయ ఇంధన సంస్థ వెల్లడించింది.త్రీ వీలర్ల అమ్మకాల్లో నం.1ఈవీల అమ్మకాల్లో భారత్లో రికార్డుల పరంపర కొనసాగుతూనే ఉంది. 2024–25లో 17 శాతం వృద్ధితో 19,64,831 యూనిట్ల ఈవీలు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఇందులో టూ వీలర్స్ గతేడాదితో పోలిస్తే 21 శాతం పెరిగి 11,49,307 యూనిట్లు, త్రీ వీలర్స్ 10శాతం అధికమై 6,99,062 యూనిట్లను తాకాయి. 1,07,462 ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జరిగాయి. ఎలక్ట్రిక్ త్రి చక్ర వాహనాల అమ్మకాల్లో రెండేళ్లుగా భారత్ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.చైనా గత ఏడాది 3,00,000 ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ను విక్రయించింది. ఈ–కామర్స్, క్విక్ కామర్స్ సంస్థలు సరుకు డెలివరీ కోసం ఈవీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు అధికంగా అమ్ముడవుతున్నాయి. 2032 నాటికి 12.3 కోట్ల ఈవీలు భారతీయ రోడ్లపై పరుగు తీస్తాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్, కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్స్ సంయుక్త నివేదిక వెల్లడించింది. 2013–14 నుంచి 2025 మార్చి వరకు భారత్లో 59.25 లక్షల యూనిట్ల ఈవీలు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం 44 లక్షలు రోడ్లపై పరుగుతీస్తున్నాయి.2.5 నుంచి 3.5 రెట్లు తెలంగాణలో ఈ ఏడాది ఒక రోజులో నమోదైన గరిష్ఠ విద్యుత్ వినియోగం దాదాపు 339 ఎంయూ. అదే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే సుమారు 240 ఎంయూ. అంటే తెలుగు రాష్ట్రాల ఒక రోజు విద్యుత్ వినియోగంతో పోలిస్తే సుమారు 2.5 నుంచి 3.5 రెట్లు ఎక్కువ విద్యుత్తును.. 2024–25లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు వినియోగించాయన్నమాట.ఈవీలు – చార్జింగ్ స్టేషన్లు⇒ గత ఆర్థిక సంవత్సరంలో అమ్ముడైన ఈవీలు సుమారు 19.65 లక్షలు⇒2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,151⇒ 2022 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా ఉన్న ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్స్ 5,151⇒ ప్రస్తుతం తెలంగాణలో 976, ఏపీలో 616 కేంద్రాల⇒ 2013–14 నుంచి 2024–25 మధ్య అమ్ముడైనవి 59.25 లక్షల యూనిట్లు⇒ ప్రస్తుతం వినియోగంలో ఉన్నవి 44 లక్షలు -
పగడపు దిబ్బలకు ముప్పు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా ఉన్న విశాఖ తీరంలో విధ్వంసకాండకు తెరతీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోంది. సంపద సృష్టి కోసం.. పర్యాటకం పేరుతో.. పర్యావరణంపై వేటు వేస్తున్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్లాటిపస్ ఎన్జీవో సంస్థ సముద్ర గర్భంలో పగడపు దీవుల్ని కాపాడుకుంటూ వస్తోంది. మరో పదేళ్ల పాటు వాటిని సంరక్షిస్తే.. మరింత విస్తరించి.. సాగరతీర స్వచ్ఛతతో పాటు.. కోతకు గురయ్యే ప్రమాదం నుంచి కాపాడవచ్చు. కానీ కూటమి ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లుగా మంగమారిపేట తీరంలో వాటర్స్పోర్ట్స్కు టెండర్లు ఆహ్వానించి విధ్వంస రచనకు సంతకం చేస్తుండటంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పగడపుదిబ్బల రక్షణ కోసం పోరాటం కొనసాగించేందుకు ప్లాటిపస్ సంస్థ ప్రతినిధులు నడుంబిగించారు. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవని గతంలో అనేక సర్వేలు చెప్పినప్పటికీ, ఇటీవల జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలు ఆ వాదనను తప్పని నిరూపించాయి. విశాఖ సాగరతీరంలో విభిన్న రకాల కోరల్స్ (పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా మంగమారిపేట ప్రాంతంలో సాగరగర్భంలో విభిన్న పగడపు దిబ్బలు ఉన్నట్లు అన్వేషణలో తేలింది. దీని వెనుక ప్లాటిపస్ ఫౌండేషన్ కృషి ఎంతో ఉంది. తిమ్మాపురం, రుషికొండ, మంగమారిపేట మొదలైన ప్రాంతాల్లో నిరంతరం సాగరగర్భ స్వచ్ఛత కోసం ఈ సంస్థ ఏళ్ల తరబడి శ్రమిస్తోంది. సముద్రపు లోతుల్లో పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను ఇప్పటివరకు 2 లక్షల 60 వేల కిలోల వరకు తొలగించారు. అక్కడ ఉన్న పగడపు దిబ్బలను సంరక్షిస్తూ వాటి అభివృద్ధి కోసం స్కూబా డైవర్లతో కలిసి నిరంతరం కృషి చేయడంతో మంగమారిపేట, తిమ్మాపురం ప్రాంతాల్లో ఇవి విస్తరించాయి. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనా ఎస్పీ, లిథోఫిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలు విస్తారంగా ఉన్నాయి. జీవవైవిధ్యానికి ప్రతిరూపాలుఈ కోరల్స్ ద్వారా సముద్ర జీవజాలాన్ని సంరక్షించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బలను పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి అనేక పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే సముద్ర జీవరాశులు ఎక్కువగా వృద్ధి చెందడానికి ఉపయోగపడతాయి.సముద్రంలోని చేపలతో పాటు 25 శాతం జీవులకు సముద్ర వర్షారణ్యాలు అని పిలిచే పగడపు దిబ్బలే ఆవాసాలు. రంగురంగుల చేపల నుంచి గంభీరమైన సముద్ర తాబేళ్ల వరకు లెక్కలేనన్ని జాతులకు ఇవి కీలకమైన ఆశ్రయం, సంతానోత్పత్తి ప్రదేశాలుగా మారి ఆహార వనరులను అందిస్తాయి. చేపలు, మొలస్కా, ఇతర జీవజాతులు, క్రస్టేసియన్లు, స్పాంజ్లు మొదలైన సముద్ర జాతుల ఉత్పత్తి పెరిగేందుకు ఇవి అనువైన వాతావరణాన్ని అందిస్తాయి. ‘కూటమి’కాసుల కక్కుర్తికి బలి.! తీరప్రాంత నిర్మాణాలు పెరగడం, ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా ఇప్పటికే 33 శాతం పగడాలు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పులు, విధ్వంసకర మానవ చర్యల వల్ల వీటి మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. తీరప్రాంతాన్ని రక్షించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ప్లాటిపస్ సంస్థ ఈ పగడపు దిబ్బలను సంరక్షిస్తోంది. అయితే ఇలాంటి అరుదైన ప్రాంతంపై ఇప్పుడు కొందరు కూటమి నేతల కన్ను పడింది. సంపద సృష్టి పేరుతో తిమ్మాపురం నుంచి మంగమారిపేట వరకు ఆక్వా స్పోర్ట్స్ను అభివృద్ధి చేసేందుకు టెండర్లు ఆహ్వానించారు. వాస్తవానికి ఈ ప్రాంతం వాటర్స్పోర్ట్స్కు అనువుగా లేకపోయినా కేవలం కొన్ని సంస్థలకు భూములు కట్టబెట్టేందుకే పర్యాటక శాఖ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. టూరిజం మంత్రి అండదండలున్న ఒక సంస్థ కోసం పగడపు దిబ్బలను నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నారని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పగడపు దిబ్బలను సంరక్షించేందుకు ప్లాటిపస్ ఫౌండేషన్ సంస్థ పోరాటానికి సిద్ధమైంది. ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ వద్దని, వాటిని వేరే ప్రాంతానికి తరలించాలని వారు అధికారులను కోరుతున్నారు. పదేళ్లపాటు సంరక్షించుకోవాలి కొన్ని తీర ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి ఆక్వా స్పోర్ట్స్ అభివృద్ధి కోసం ప్రయత్నించడం మంచి పరిణామమే. కానీ అత్యంత అరుదైన, జీవవైవిధ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేసే పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేయడం మాత్రం తగదు. గత కొన్నేళ్లుగా మంగమారిపేట ప్రాంతంలో కోరల్ రీఫ్స్ను పెంచుతూ వస్తున్నాం. వీటిని మరో పదేళ్లపాటు సంరక్షించుకుంటే ఈ ప్రాంత సముద్ర తీరం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతున్నాం. – సుభాష్ చంద్రన్, ప్లాటిపస్ ఫౌండేషన్ ప్రతినిధి -
బుల్లెట్ రైలు వస్తోందీ..
దేశీయ ప్రయాణికుల రవాణా వ్యవస్థలో వందే భారత్ రైలు ఒక పెద్ద ముందడుగు. సౌకర్యవంత ప్రయాణ అనుభూతికి ఈ రైలు ప్రసిద్ధి. గంటకు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించగలదు. దీన్ని మించిన వేగంతో దూసుకుపోయే ‘హై స్పీడ్ రైల్’ కొద్దిరోజుల్లో పట్టాలెక్కనుంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు వేగం పుంజుకుంది. 2026 నాటికి పాక్షిక కార్యకలాపాలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే 2028 నాటికి ప్రాజెక్ట్ పూరై్త బుల్లెట్ రైల్ దూసుకెళ్లనుంది. తద్వారా ప్రపంచంలో హై స్పీడ్ రైల్ వ్యవస్థ కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్ నిలవనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం 300 కి.మీ. వయాడక్ట్లు పూర్తయినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు. ముంబై–అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనుంది. ముంబైలో మొదలై సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్టాప్స్నకు పరిమితమైతే చివరి స్టాప్ అయిన సబర్మతికి 2 గంటల 7 నిమిషాల్లోనే ఈ రైలు చేరనుంది. అన్ని స్టాప్స్లోనూ ఆగితే 2 గంటల 58 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ కారిడార్లో 12 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో గుజరాత్లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు ఉన్నాయి. ముంబై స్టేషన్స్ భూగర్భంలో నిర్మిస్తుండగా మిగిలిన థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి వద్ద ఎలివేటెడ్ స్టేషన్స్ రానున్నాయి.సముద్రగర్భ రైల్ టన్నెల్..బుల్లెట్ రైలు కారిడార్లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్రగర్భ రైల్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణ. ఇది ముంబై–థానే మధ్య ఏర్పాటవుతోంది. ఇందులో భారత్లోనే మొట్టమొదటి 7 కి.మీ. పొడవైన సముద్రగర్భ సొరంగం కూడా ఉంది. 13.1 మీటర్ల వ్యాసం కలిగిన ఒకే ట్యూబ్ సొరంగంలో రెండు ట్రాక్లు ఉంటాయి. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టులో 465 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది. ప్రధానంగా ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ ఉపయోగించి నిర్మిస్తున్నారు. వయాడక్ట్ నిర్మాణంలో ఉపయోగించే సంప్రదాయ సెగ్మెంటల్ నిర్మాణ సాంకేతికత కంటే ఇది 10 రెట్లు వేగంగా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతిని దేశంలో మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించే, నైపుణ్యం సాధించిన ప్రపంచంలోని అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి.ట్రయల్ రన్ గుజరాత్లో..ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న నేషనల్ హై–స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకారం.. 383 కి.మీ. పీయర్ పనులు, 401 కి.మీ. ఫౌండేషన్, 326 కి.మీ. గర్డర్ క్యాస్టింగ్ కూడా పూర్తయ్యాయి. ఇప్పటివరకు రూ.67,486 కోట్లు ఖర్చయ్యాయి. ప్రాజెక్టు పూర్తి అయ్యేసరికి వ్యయం భారీగా పెరిగే అవకాశం ఉంది. 2026లో మొదటి ట్రయల్ రన్ గుజరాత్లో 50 కి.మీ.లో నిర్వహించనున్నారు. ఢిల్లీ–వారణాసి, చెన్నై–మైసూరు వంటి కారిడార్లలో హెచ్ఎస్ఆర్ ప్రాజెక్ట్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. ముంబై–హైదరాబాద్, ఢిల్లీ–అçßæ్మదాబాద్ కారిడార్లు పరిశీలనలో ఉన్నాయి.ఆటంకాలు దాటుకుని..కోవిడ్–19 మహమ్మారి, మహారాష్ట్రలో భూసేకరణ, అనుమతుల జాప్యం.. వంటి కారణాలు బుల్లెట్ రైలు ప్రాజెక్టును రెండున్నరేళ్లు వెనక్కి నెట్టాయి. మౌలిక సదుపాయాలు, రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ వ్యవస్థ ఖరీదు భారం కావడం వంటి సవాళ్లను ఎదుర్కొంది. భారత రైల్వేల సొంత ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, ప్రభుత్వ అధీనంలో ఉన్న బీఈఎంఎల్ను సంయుక్తంగా 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రెండు ప్రోటోటైప్ రైలు సెట్లను (ఒక్కొక్కటి ఎనిమిది కార్లు) రూపొందించి తయారు చేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.ఆర్థిక సహాయంతోపాటు భారత్లో సమాచార సేకరణ, పరీక్షల కోసం రెండు షింకన్సెన్ రైళ్లను (జపాన్ బుల్లెట్ రైళ్లు) 2026 నాటికి జపాన్స్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్స్ ఏజెన్సీ (జికా) ఉచితంగా సరఫరా చేయనుంది. సిగ్నలింగ్ వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను అందించేందుకు ఆల్స్టమ్–ఎల్అండ్టీ, డీఆర్ఏ–సీమెన్స్ ్స జాయింట్ వెంచర్లు టెండర్ల కోసం బిడ్డింగ్ చేస్తున్నాయి.హెచ్ఎస్ఆర్గా పరిగణించాలంటే..హై–స్పీడ్గా పరిగణించాలంటే రైళ్లు వాటి కోసం ప్రత్యేకంగా కేటాయించిన ట్రాక్లపై గంటకు 250 కి.మీ. కంటే ఎక్కువ వేగంతో వెళ్లాలి. సాధారణంగా వీటికి నూతన, ప్రత్యేకంగా రూపొందించిన మార్గాలు అవసరం. కొన్ని హెచ్ఎస్ఆర్ వ్యవస్థలు ప్రస్తుత నెట్వర్క్లోని కొంత ట్రాక్లను ఉపయోగిస్తాయి. అధిక వేగానికి తగ్గట్టుగా ట్రాక్లలో మార్పు, సిగ్నలింగ్ను మెరుగుపరచడం వంటివి చేయాల్సి ఉంటుంది. కఠిన భద్రతా ప్రమాణాలు, తగినంత విద్యుత్ సరఫరా, శిక్షణ పొందిన ఆపరేటింగ్ సిబ్బంది, మెరుగైన నిర్వహణ తప్పనిసరి.వాటి అనుభవాల నుంచి..జపాన్, ఫ్రాన్స్ ్స, జర్మనీతో సహా అభివృద్ధి చెందిన దేశాల్లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హెచ్ఎస్ఆర్ నెట్వర్క్ ఉన్న దేశం చైనా. ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్య ఆదాయ దేశాలు సైతం హెచ్ఎస్ఆర్ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే హెచ్ఎస్ఆర్ నెట్వర్క్లను కలిగి ఉన్న దేశాల్లో పరిస్థితులపై పూర్తిస్థాయిలో మనం అధ్యయనం చేయాలి. అలాగే బుకింగ్స్ సమస్యలు (ఉజ్బెకిస్తాన్స్ ), భారీ నిర్వహణ వ్యయాలు (చైనా), శబ్ద కాలుష్యం (జపాన్స్ ) వంటి విషయాల్లో ఈ నెట్వర్క్లు ఎదుర్కొన్న విమర్శలపైనా దృష్టిపెట్టాలి. అప్పుడే మన బుల్లెట్ రైలు బ్రేకులు లేకుండా యమస్పీడుగా దూసుకెళ్తుంది.రూ.లక్ష కోట్ల ప్రాజెక్టుముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ (ఎంఏహెచ్ఎస్ఆర్) ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,08,000 కోట్లు. ఇందులో 81 శాతం నిధులను జపాన్స్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్స్ ఏజెన్సీ (జికా) ద్వారా జపాన్స్ ప్రభుత్వం సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వ శాఖకు 50 శాతం, మహారాష్ట్ర, గుజరాత్కు చెరి 25 శాతం వాటా ఉంది. మొత్తం 1,389.5 హెక్టార్ల భూమిని సమీకరించారు.బుల్లెట్ రైల్.. ఇతర హైలైట్స్⇒ ముంబై–అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు.⇒ బుల్లెట్ రైలు గరిష్ఠ వేగం గంటకు 320 కి.మీ.⇒ 2028 నాటికి దూసుకెళ్లనున్న బుల్లెట్ రైల్⇒ పరిమిత స్టాప్స్తో 2 గంటల 7 నిమిషాల్లోనే ప్రయాణం⇒ అన్ని స్టాప్స్లో ఆగితే 2 గంటల 58 నిమిషాల సమయం -
నేర్చుకోవాలి.. నేర్పించాలి
ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగప్రవేశంతో సాఫ్ట్వేర్ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా చెప్పింది చేసేవారు కాకుండా, ముందుండి నడిపించే నాయకత్వ లక్షణాలున్న వారినే సంస్థలు కోరుకుంటున్నాయి. కొంతకాలంగా టీం లీడర్ అర్థమే మారిపోయింది. ఉద్యోగికి, యాజమాన్యానికి మధ్య పోస్టుమన్ ఉద్యోగం చేయడమే లీడర్ షిప్ కాదని టెక్ రంగం స్పష్టం చేస్తోంది.ముందు తను నేర్చుకోవాలి.. ఆ తర్వాత టీంలోని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని సంస్థలు అంటున్నాయి. ప్రముఖ ఉద్యోగ ప్లాట్ఫామ్స్ లింక్డ్ ఇన్, నౌకరీ డాట్కామ్ ఐటీ ఉద్యోగంలో వస్తున్న మార్పులను విశ్లేషించాయి. ఇప్పటివరకు ఐటీ సెక్టార్లో సర్వీస్ ప్రాధాన్యంగానే ఉద్యోగాల సృష్టి జరిగింది. దేశంలో ప్రతి లక్ష మంది ఉద్యోగుల్లో 80 వేల మంది ఈ కేటగిరీలోనే ఇంతకాలం పనిచేశారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.కొత్తగా ఆలోచించాల్సిందే.. ప్రధాన టెక్ సంస్థలన్నీ ఏఐతో కూడిన డేటాను సిద్ధం చేసుకున్నాయి. దీంతో నాయకత్వ పని చాలావరకు ఏఐ చేస్తోంది. దీనికోసం ప్రపంచవ్యాప్తంగా టెక్ సంస్థలు 40 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్టు స్కిల్ ఇండియా పేర్కొంది. ప్రపంచంలో మొత్తం 67,200 కృత్రిమ మేధ సంస్థలుండగా, అందులో 25 శాతం అమెరికాలోనే ఉన్నాయి. భారత్లో 1,67,000 స్టార్టప్స్ ఉంటే, వాటిల్లో 6,636 సంస్థలు ఏఐపైనే పనిచేస్తున్నాయి.ఇవి ఈ రంగంపై రూ.లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాయి. దేశీయ వైద్య సాంకేతికతల రంగంలో సుమారు 12 వేల స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఫిన్టెక్ రంగంలో ఉన్న ఏఐ పెట్టుబడుల విలువ 90 వేల కోట్ల డాలర్లు. 2021లో ఇండియాలో 2,100 ఫిన్టెక్ కంపెనీలుంటే ఇప్పుడు 10,200కు చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సాధారణ పని విధానం ఐటీ ఉద్యోగాలకు పనికిరాదని పిన్టెక్ సంస్థలు అంటున్నాయి. ఏఐతో పనిచేసే టీం లీడర్ క్రియేటివ్ ఆలోచనా విధానం... దానికి తగ్గట్టుగా లాంగ్వేజ్ మాడ్యూల్స్ అభివృద్ధి చేసుకోవాలని టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థల రిక్రూట్ విభాగాలు పేర్కొంటున్నాయి. చెప్పింది మాత్రమే చేస్తే.. ఉద్యోగం ఊస్టే ఇప్పుడున్న టెక్నాలజీ సిస్టమ్లో సర్విస్ సెక్టార్ కోడ్ను ఏఐ డీకోడ్ చేసే ఏర్పాటు చేశారు. ఇంతకాలం ఈ పని ఐటీ ఉద్యోగుల ద్వారా జరిగేది. దీంతో గతం మాదిరిగా అనుకరించే పనికే పరిమితమైన ఉద్యోగులను ఐటీ కంపెనీలు తొలగిస్తున్నాయి. ఏఐకి ప్రోగ్రామింగ్ ఇవ్వగల నేర్పు, అది కూడా ఏఐ డేటాలో ఉన్నది కాకుండా కొత్తదిగా ఉండాలని ఐటీ సంస్థలు కోరుకుంటున్నాయి. సరికొత్త కోడింగ్ వ్యవస్థను తీసుకొచ్చే ఉద్యోగుల కోసం వెదుకుతున్నాయి.స్కిల్ ఇండియా నివేదిక ప్రకారం ఇలాంటి నిపుణులు 2026 నాటికి 10 లక్షల మంది అవసరం ఉంది. నౌకరీ డాట్కామ్ అభిప్రాయ సేకరణలో దాదాపు 152 సంస్థలు ఇదే విషయాన్ని చెప్పాయి. 2023 ఆగస్టు లెక్కల ప్రకారం దేశంలో 4.16 లక్షల మంది ఏఐ కోడింగ్ నిపుణులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు కావల్సింది 6.29 లక్షల మంది. ఏఐ డేటా అనాలసిస్ వచ్చిన తర్వాత దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోవటమో, కోల్పోయే పరిస్థితికి చేరడమో జరిగిందని ఐటీ కంపెనీలు అంటున్నాయి.నిత్యం అప్గ్రేడ్ అవ్వాలి ఐటీ సెక్టార్లో టీం లీడర్ రోల్ పూర్తిగా మారిపోయింది. ఉద్యోగి పని విధానం అంచనా వేయడానికి సాఫ్ట్వేర్ను కంపెనీలు అనుసరిస్తున్నాయి. దీంతోపాటే టీం లీడర్ పరిధిలో పనిచేసే వారిని స్కిల్ వైపు ఏ విధంగా తిప్పగలిగామో కంపెనీ అంచనా వేస్తోంది. తప్పులను కిందివాళ్లపై నెట్టడం ఇక కుదరని పని. కింది ఉద్యోగి పని విధానం మెరుగవ్వలేదంటే టీం లీడర్ను కంపెనీలు బాధ్యులను చేస్తున్నాయి. నేర్చుకోవడం, నేర్పించడం వంటి నాయకత్వ లక్షణాలున్న టీం లీడర్ను కంపెనీలు కోరుకుంటున్నాయి. – వికాశ్ వాసన్, ఎంఎన్సీ కంపెనీలో డేటా టీం లీడర్నాయకత్వ సృజనాత్మకత కావాలి ఇంటర్వ్యూ చేసేప్పుడు లీడర్షిప్ క్వాలిటీని కంపెనీలు పరిశీలిస్తున్నాయి. చాలా మంది ఇక్కడే తిరస్కరణకు గురవుతున్నారు. చాలామందిలో ఏఐ మాడ్యూల్స్ను ఇతర ఉద్యోగులతో కలిసి లేదా ఇతర కంపెనీలతో కలిసి నిర్వహించగల సామర్థ్యం కన్పించడం లేదు. వేగంగా మారుతున్న డేటా విధానం వల్ల శరవేగంగా అందరితో సమన్వయం చేసుకునే నాయకత్వ లక్షణం ఇప్పుడు టెక్ రంగంలో ఎంతో అవసరం. – సంజీవ్ పల్లవ్, ఐటీ ఆధారిత కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్ -
అసూర్యంపశ్య
అసూర్యంపశ్య. అంటే ఎండ కన్నెరగని స్త్రీ. చైనాలో ఓ 48 ఏళ్ల మహిళ ఉదంతమిది. సిచువాన్ ప్రావిన్సులో చెంగ్డూ నగరానికి చెందిన ఆమె తన ఒంటిని ఒక్క సూర్యకిరణం కూడా తాకనిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేసింది. ఆరుబయటకు వెళ్లినా ఒళ్లంతా కప్పేలా వ్రస్తాలు ధరించేది. ముఖం, చేతులు బయటకు కనిపించక తప్పని పరిస్థితుల్లో నిండుగా సన్స్క్రీమ్ లోషన్ పట్టించి మరీ వెళ్లేది. ఈమెకు ఉన్న ఈ అలవాటు ఇప్పటిది కాదు. చిన్ననాటి నుంచే ఇదే తంతు. ఎండ తగిలితే కందిపోవడమే గాక నల్లబడతానన్న భయమే ఇందుకు కారణం. అందుకే నిత్యం పొడవాటి టాప్స్ ధరించేది. చలువ కళ్లద్దాలు, సాక్స్, షూ, పొడవాటి చొక్కా.. ఇలా ఏ రకంగానూ సూర్యకాంతి సోకకుండా బహుజాగ్రత్తలు తీసుకుంది. షార్ట్స్, స్లీవ్స్ పొరపాటున కూడా వేసుకునేది కాదు! అయితే ఏమైంది? ఒంటికి ఎండ తాకక అత్యావశ్యకమైన ‘డి’విటమిన్ లోపించింది. ఎంతగా అంటే, ఇటీవల ఆమె పడక మంచంపై కాస్త అటూ ఇటూ కదలగానే ఏకంగా ఓ ఎముక విరిగిపోయింది. డి విటమిన్ లోపంతో ఎముకలు గట్టిదనం తగ్గి పెళుసుబారడమే అందుకు కారణం. ఎముక విరగడంతో నరకయాతన నడుమ ఆస్పత్రిలో చేరింది. మెత్తని బెడ్ మీద ఎముక ఎలా విరిగిందని వైద్యులే విస్తుపోయారు. పరీక్షలన్నీ చేసి, డి విటమిన్ లోపమని తేల్చడమే గాక ఆమెను మందలించారు. బోలు ఎముక వ్యాధిగా పేర్కొనే ఆస్టియోపోరోసిస్ బారినపడ్డట్టు చెప్పారు. లాంగ్ షువాంగ్ అనే సంప్రదాయ వైద్యున్ని ఉటంకిస్తూ సౌత్చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ తాజాగా ఈ వింతగాథను బయటపెట్టింది. ఇదిప్పుడు అంతటా పెద్ద చర్చనీయంగా మారడమే గాక సోషల్ మీడియాలోనూ తెగ వైరలైంది. కీలకమైన విటమిన్ విటమిన్ డి ప్రకృతిలో సహజంగా లభించదు. శరీరమే దాన్ని తయారు చేసుకుంటుంది. అందుకు సూర్యకాంతి అవసరం. ఉదయపు లేత కిరణాల వేడికి చర్మం కింది పొరలోని రసాయనాలు వేడెక్కి డి విటమిన్ను తయారు చేసుకుంటాయి. అది ఉంటేనే మన శరీరం అత్యధికంగా కాల్షియంను సంగ్రహించుకోగలదు. కాల్షియం సమపాళ్లలో ఉన్నప్పుడే ఎముకలకు గట్టిదనం వస్తుంది. అవి గట్టిగా ఉంటేనే అన్ని పనులు చక్కగా చేసుకోగలం. కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లబారతాయి. ఎముక ఆరోగ్యంగా, అస్థిపంజరం పటిష్టంగా ఉండాలంటే ఉదయపు ఎండ తగలాల్సిందే. చైనాలో విపరీత పోకడ చైనాలో ఇలా ఎండకు ముఖం చా టేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరుబయటకు వెళ్లినా పేద్ద గొడుగు, చేతులన్నీ కప్పేసేలా దుస్తులు, పెద్ద కళ్లద్దాలు, గ్లౌజ్లు, ఫేస్ మాస్క్ లు, కాళ్లకు షూ, అతినీలలోహత కిరణాలను ఆపే హూడీలు... ఇవే ఇప్పుడు చైనాలో ట్రెండ్! ఇలా చేస్తే కాల్షియం సంబంధ వ్యాధులతో ఆస్పత్రిపాలవడం ఖాయ మని వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. ఒంట్లో పదేళ్లకోసారి ఎముకలన్నీ కొత్త శక్తితో పునరుజ్జీవం పొందుతాయి. 40 ఏళ్లు దాటాక మాత్రం ఎము కల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. ఆ తర్వాత అవి పెళుసుబారతాయి. చక్కటి వ్యాయామం, ఆహారశైలే దానికి విరుగుడని గ్వాంగ్జూ వైద్య విశ్వవిద్యాలయంలో ఆర్థోపెడిక్ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జియాంగ్ గ్జియోబింగ్ చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఊరంతా వన్నూరప్ప, వన్నూరమ్మలే..
వన్నూరప్ప అని పిలిస్తే ఆ గ్రామంలో వంద మంది పలుకుతారు. వన్నూరప్ప, వన్నూరమ్మ, వన్నూర్రెడ్డి, వన్నూరక్క ఇలా.. హజరత్ వన్నూరు వలి సాహెబ్ను కొలిచేవారందరూ ఆయన పేరే పెట్టుకున్నారు. 30 ఏళ్లు పైబడిన సుమారు 100 మంది దాకా స్వామి పేరునే పెట్టుకున్నారంటే ఆయన మహిమ ఎలాంటిదో అర్థమవుతుంది.తాడిమర్రి: సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలంలోని మరవపల్లిలో వెలసిన హజరత్ వన్నూరు వలి సాహెబ్ (వన్నూరు స్వామి) కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపదలు, జబ్బులు రాకుండా కాపాడుతున్నాడు. దీంతో గ్రామంలో ఎక్కువ మంది స్వామి పేరు కలసి వచ్చేలా పేర్లను పెట్టుకుంటున్నారు. 200 ఏళ్ల క్రితం వెలసిన వన్నూరు స్వామి ఇప్పుడున్న మరవపల్లి గ్రామంలో 200 ఏళ్ల కిత్రం రెండు, మూడు గుడిసెలు ఉండేవట. ఆ కాలంలో ఇప్పుడున్న ఎం.అగ్రహారం గ్రామం చెరువు పనులు జరుగుతుండగా కడప జిల్లా లింగాల మండలం అంకేన్పల్లికి చెందిన కొందరు ఇక్కడ చెరువు పనులు చేస్తూ గుడిసెల్లో ఉండేవారని పెద్దలు చెబుతున్నారు. ఆ సమయంలోనే కణేకల్లు సమీపంలోని వన్నూరు గ్రామానికి చెందిన వన్నూరుస్వామి గుర్రంపై తూర్పు ప్రాంతానికి యుద్ధానికి వెళ్లారట.తిరుగు ప్రయాణంలో గుడిసెల వద్ద ఆగి వేపపుల్లతో పళ్లు తోముకుని పళ్లు తోముకున్న పుల్లను ఓ చోట భూమిపై గుచ్చారని అంటున్నారు. దీంతో అక్కడ వేపమాను మహావృక్షమైందని అంటున్నారు. ఆ మహనీయుడు అక్కడే ఉన్న బావిలో ముఖం కడుక్కొని ఆయన అక్కడే పాదరక్షలు వదిలి వెళ్లిపోయారట. గుడిసెల్లో ఉన్నవారు ఆ వృక్షం వద్ద పూజలు చేస్తూ వచ్చారని, దీంతో గ్రామస్తులకు ఎలాంటి ఆపదలు రాకుండా వన్నూరుస్వామి కాపాడుతూ వచ్చరని భక్తుల నమ్మకం. స్వామి మహిమలు ఇలా.. సుమారు 60 ఏళ్ల క్రితం గ్రామానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎం.అగ్రహారంలో కలరా వచ్చిందని గ్రామ పెద్దలు చెబుతున్నారు. కలరాతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మృతి చెందారట. అలాంటి విపత్కర సమయంలో కూడా మరవపల్లిలో ఒక్కరికీ కూడా కలరా సోకలేదని అంటున్నారు. ఆలయం పక్కన ఉన్న బావిలో వన్నూరుస్వామి ముఖం కడుక్కోవడంతో ఆ బావిలో మహిమలు ఉన్నాయని గ్రామస్తులు నమ్ముతారు. పదేళ్ల క్రితం గ్రామానికి చెందిన అంధురాలు లింగమ్మ జీవితంపై విరక్తితో చనిపోవాలని బావిలోకి దూకిందట. దేవుని మహిమతో ఆమె ఎలాంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా బయటపడిందని చెబుతున్నారు. అలాగే బావి ఒడ్డున ఉన్న అరుగుపై పలువురు పిల్లలు ఆడుకుంటూ బావిలో పడిని చిన్నపాటి గాయం కూడా కాలేదంటున్నారు. దీంతో బావి రోడ్డు పక్కన ఉన్నప్పటికీ పూడ్చకుండా అలాగే ఉంచారు. నార్పలకు చెందిన శంకరయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్ల క్రితం తన భార్యకు ఆరోగ్యం బాగాలేక లక్షలు ఖర్చుచేసి ఎన్నో ఆస్పత్రుల్లో చూపించారు. అయినా జబ్బు నయం కాలేదు. చివరకు గ్రామస్తుల ద్వారా స్వామి మహిమ గురించి తెలుసుకుని భార్యాభర్తలు కొన్నాళ్లపాటు ఆలయానికి వచ్చి పూజలు చేసి, అక్కడే నిద్రించారు. దీంతో ఆమె ఆరోగ్యం కుదుట పడింది. దీంతో ఆయన అప్పటి నుంచి ప్రతి గురువారం గ్రామానికి వచ్చి 10, 20 కిలోలు చక్కెర తీసుకొచ్చి స్వామికి చదివించి వెళుతున్నారు. ప్రతి గురువారం ప్రత్యేక పూజలు వన్నూరుస్వామి ఆలయంలో గ్రామస్తులు ప్రతి గురువారం ప్రత్యేక పూజలు చేస్తారు. గతంలో గ్రామస్తులే పూజలు చేసేవారు. కొంత కాలంగా మరవపల్లికి చెందిన ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని పూజారిగా నియమించారు. ఆయన ప్రతి గురువారం స్వామికి దీపాలను వెలిగించి చక్కెర చదివించి భక్తులకు పంచి పెడతారు. అలాగే కోర్కెలు నెరవేరిన భక్తులు స్వామికి పొట్టేళ్లను కొట్టి గ్రామస్తులకు పంచుతారు. కందూరి చేసినప్పుడు స్వామి ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ఉత్సవ పల్లకీలో ఉంచి గ్రామంలో ఊరేగిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం, శుభకార్యాలు జరినప్పుడు గ్రామస్తులు ముందుగా ఆలయంలో చక్కెర చదివించి ప్రారంభిస్తారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా పనులు, శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని గ్రామస్తుల విశ్వాసం. కోరిన కోర్కెలు తీర్చే దేవుడు గ్రామంలో వెలసిన వన్నూరుస్వామి కోరిన కోర్కెలు తీర్చే దేవుడు. గ్రామంలో ఎవరు, ఎలాంటి శుభకార్యక్రమాలు చేపట్టిన ముందుగా ఆలయంలో దీపాలు వెలిగించి, చక్కెర చదివింపులు చేస్తాం. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా పనులన్నీ సాఫీగా జరిగిపోతాయి. – సాకే వన్నూరప్ప, మరవపల్లి, తాడిమర్రరోగాలైనా నయం అవుతాయి వన్నూరుస్వామి ఆలయంలో నిద్రచేస్తే ఎలాంటి రోగాలు అయినా నయం అవుతాయి. ప్రపంచాన్ని గడగడ లాండించిన కరోనా కాలంలో ప్రజలు ఎంతో భయబ్రాంతులకు గురయ్యారు. చుట్టుపక్కల గ్రామాలు కరోనాతో విలవిల లాడాయి. అలాంటి విపత్కర పరిస్థితిలో కూడా మా గ్రామంలో ఎక్కరికి కూడా కరోనా సోకుండా స్వామి కాపాడారు. – గాండ్లపర్తి కుళ్లాయరెడ్డి, మరవపల్లి, తాడిమర్రి -
గూగుల్ ఇలాకాలో.. ‘జెమినీ’ తోడుగా!
ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అయినా ఒకప్పుడు మనం టెక్ట్స్ / క్లిక్ ద్వారా కమాండ్ ఇవ్వకుంటే ఉలుకూ, పలుకూ లేకుండా పడి ఉండేవి. కానీ, గ్యాడ్జెట్లు మన చుట్టూనే చేరి గుట్టుగా పని చేసుకుపోతున్నాయి. మనం సైగ చేస్తే చాలు.. కమాండ్ని స్వీకరిస్తున్నాయి. చూస్తే చాలు.. అలర్ట్ అవుతున్నాయి. పిలిస్తే పలుకుతున్నాయి. ఇదంతా ఎలా కృత్రిమ మేధ (ఏఐ) మాయ.అందుకే అన్ని దిగ్గజ సంస్థలు ఏఐ అసిస్టెంట్లను ఆశ్రయిస్తున్నాయి. వీటిలో ప్రధానమైంది గూగుల్ గూట్లో నుంచి పుట్టిన జెమినీ. వాయిస్ అసిస్టెంట్తో ఎప్పటి నుంచో పిలిస్తే పలికే సేవలను అందించిన గూగుల్ ఇప్పుడు అన్నింటికీ ‘జెమినీ.. జెమినీ’ అనేలా అప్డేట్ అవుతోంది. స్మార్ట్ఫోన్స్ ని దాటేసి.. ఇప్పుడు అన్ని ప్లాట్ఫామ్ల్లోకి జెమినీ సేవలను లాంచ్ చేస్తోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఆండ్రాయిడ్తో జట్టుకట్టి ముందుకొస్తున్న జెమినీ ఏఐతో ఇక గూగుల్ యూజర్లకు పండుగే. వాచ్లు మీ పల్స్, హార్ట్ బీట్స్ వినడమే కాదు.. మీ మనసెరిగి పని చేస్తాయి. కార్లు మీ జర్నీ ముచ్చట్లను వింటూ మరింత ఆహ్లాదకరమైన ఇన్స్ పుట్స్ను ఇస్తాయి. ఇందుకు కారణం.. స్మార్ట్ వాచ్లు మొదలుకొని కారు, టీవీ, హెడ్సెట్, కళ్లజోళ్లు.. ఇలా అన్నింటిలోనూ గూగుల్ కంపెనీ ‘జెమినీ ఏఐ’ని ప్రవేశపెట్టడమే.మణికట్టుపై మాయాజాలం!అరచేతిలో ఫోనే కాదు... మణికట్టుపై స్మార్ట్ వాచ్లు కూడా చాలానే చేస్తున్నాయి. వర్కవుట్ చేస్తున్నప్పుడు లేదా వంట చేస్తున్నప్పుడు.. మీ చేతిలో ఫోన్ ఉండకపోయినా.. చేతికి వాచ్ ఉంటే చాలు. పనులను చక్కబెట్టేయొచ్చు. ఎందుకంటే.. ఇకపై ఇలాంటి వాచ్లపై జెమినీ ఏఐ పని చేస్తుంది. మీరు మీ వాచ్తో మాట్లాడొచ్చు. కమాండ్స్ ఇవ్వొచ్చు. మీరు ఏదైనా జిమ్లో పర్సనల్ లాకర్ వాడుతుంటే దాని నంబర్ను గుర్తుపెట్టుకోమని వాచ్కి చెప్పొచ్చు. ఫ్రెండ్ పంపిన ఏదైనా మెయిల్ గురించి అడిగితే వెంటనే వెతికి తెస్తుంది. చిన్న స్క్రీన్ మీద టైప్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడితే చాలు.. టైపింగ్ అయిపోతుంది.డ్రైవింగ్లో తోడుగా..హై ఎండ్ కార్లలో ఎప్పటి నుంచో నిక్షిప్తమై ఉన్న ఆండ్రాయిడ్ ఆటో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంట్లో ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్కి బదులు జెమినీ ఏఐ వస్తోంది. సాధారణంగా మాటలతోనే మీ అవసరాన్ని జెమినీ అర్థం చేసుకుంటుంది. మీ మాటలను వింటూనే మార్గమధ్యంలో ఉన్న పెట్రోల్ బంక్ల గురించి చెబుతుంది. అంతేకాదు.. మీరేదైనా ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటే అందుకు బెస్ట్ రేటింగ్స్తో ఉన్న హోటల్స్ను సూచిస్తుంది.అంతేకాదు.. డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏవైనా బల్క్ మెసేజ్లు వస్తే.. అన్నింటినీ సమ్మరైజ్ చేసి సంక్షిప్తంగా సమాచారంగా చెబుతుంది. మీరేదైనా వాక్యాలను చెప్తే వాటిని కావాల్సిన భాషలోకి అనువదించి వినిపిస్తుంది. వెళ్లే దారిలో అందుబాటులో ఉన్న పార్కింగ్ వివరాలను చెబుతుంది. వెళ్లే రూట్ మ్యాప్ సెట్ చేసి పెడితే చాలు.. ఎక్కడెక్కడ ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి.. రోడ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా.. ఇవన్నీ రియల్ టైమ్లోనే అలర్ట్ చేస్తూ చూపిస్తుంది.టీవీలోనూ ‘జెమినీ’ జోష్ ఓటీటీలు, వివిధ రకాల కంటెంట్ యాప్లు ఇంట్లోని టీవీని.. ఫ్యామిలీ మొత్తానికి ఎంటర్టైన్స్ మెంట్ అడ్డాగా మార్చేశాయి. అందుకే ఎప్పటి నుంచో గూగుల్ చూపు స్మార్ట్ టీవీలపై పడింది. ఇకపై గూగుల్ టీవీల్లో కూడా జెమినీ సపోర్ట్ రానుంది. దీంతో టీవీలను రిమోట్తోనే కాదు.. మాట్లాడుతూ కంటెంట్ను సెలెక్ట్ చేయొచ్చు. మీ పిల్లలకు సరిపోయే కంటెంట్ను సెట్ చేసి ఏఐకి చెప్తే చాలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచుతుంది.వారెలాంటి హద్దులు దాటకుండా కట్టుదిట్టమైన నిఘా పెడుతుంది. ఒకవేళ పెట్టిన లిమిట్స్ క్రాస్ చేస్తే వెంటనే మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. హాలిడేస్లో ఇంట్లో టీవీని పిల్లలకు ట్యూటర్గా మార్చేయొచ్చు. జెమినీకి పిల్లలకు సంబంధించిన క్లాస్, సిలబస్ వంటి వివరాలను అందిస్తే చాలు.. ఎడ్యుకేషన్ కంటెంట్ను జెమినీ రికమెండ్ చేసి ఇస్తుంది. పిల్లలు అడిగే ప్రశ్నలకు జెమినీ సమాధానం కూడా చెబుతుంది. ఇంకా గూగుల్ వీడియో భాండాగారం యూట్యూబ్ నుంచి కూడా కంటెంట్ను సేకరించి చూపిస్తుంది.హెడ్సెట్స్లోనూ నిక్షిప్తం ఏవైనా పర్సనల్గా వినాలనుకుంటే.. హెడ్సెట్ కోసం వెతికే వాళ్లం. వాటిని ఎక్కువసేపు చెవులకు పెట్టుకోవాలన్నా ఇబ్బందే. ఇప్పుడు హెడ్సెట్స్ చెవులకు తగిలించుకునే బడ్స్గా మారిపోయాయి. జెమినీ ఏఐ రాకతో వీటి తీరు ఇంకా మారిపోయింది. సోనీ, శామ్సంగ్తో కలిసి గూగుల్ జెమినీ ఏఐతో నెక్ట్స్ జనరేషన్ ఇయర్ బడ్స్ను సిద్ధం చేస్తోంది. కాగా, ‘ఏఐ పవర్డ్ ఆపరేటింగ్ సిస్టం’తో ఎక్స్ఆర్ హెడ్సెట్లను నెక్స్›్టలెవల్కి తీసుకెళ్తున్నాయి.ఉదాహరణకు మీరేదైనా కొత్త టూరిస్ట్ ప్రాంతానికి వెళ్లాలనుకుంటే.. ఆ ప్రాంతాన్ని ముందే ఎక్స్టెండెడ్ రియాలిటీలో చూసేయొచ్చు. రూట్ మ్యాప్స్, కేఫ్లు, స్థానిక ప్రాంతాలను చూస్తూ ఓ అవగాహనకు రావచ్చు. అంటే.. ఇక గూగుల్ మ్యాప్స్ పాత తరం ట్రెండ్గా మారిపోతాయి అన్నమాట. సో.. మీరు వింటున్నా, చూస్తున్నా, డ్రైవ్ చేస్తున్నా లేదా చేతులు ఖాళీగా లేకున్నా – జెమినీ ఎప్పుడూ మీకు ఉపయోగపడే మిత్రుడిగా మారబోతోంది. అంతేకాదు, భవిష్యత్తులో మన అవసరాన్ని ముందుగానే అర్థం చేసుకునే సహాయకుడు కూడా.కళ్లజోళ్ల మాయాజాలందృష్టి సమస్యలు వస్తేనే కళ్లజోడు పెట్టుకుంటాం. లేదంటే.. కాసేపు స్టైల్ కొట్టేందుకు వాడుతుంటాం. కానీ, భవిష్యత్తులో అలా కాదు. మీకు ఏ సమస్యా లేకపోయినా మీరు బయటికి వెళ్తే తప్పనిసరిగా కళ్లజోడు ధరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే.. కళ్లజోళ్లు స్మార్ట్ అవుతున్నాయి. ఏఐ సపోర్ట్తో మల్టీటాస్కింగ్ చేస్తున్నాయి. అందుకే గూగుల్ కూడా తన జెమినీ ఏఐతో స్మార్ట్ గ్లాసెస్ను అందించేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ కంపెనీలతో స్టైలిష్ లుక్తో వీటిని తీర్చిదిద్దుతోంది. భవిష్యత్తులో ఈ కళ్లజోడును ధరించాక స్మార్ట్గా పనులను చక్కబెట్టొచ్చు. చూస్తున్న ప్రతి అంశాన్ని రికార్డు చేయొచ్చు. వాటి వివరాలను సేకరించొచ్చు. వాటిని వెంటనే మెసేజ్ రూపంలో పంపొచ్చు.ఆయా వివరాల గురించి ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే కళ్లజోడుకు చెప్తే చాలు. కాల్ కలిపేస్తుంది. ఎలాంటి ఇయర్ఫోన్స్ ్స లేదా బడ్స్ లేకుండా గ్లాసెస్ నుంచే ఫోన్ మాట్లాడొచ్చు. అంతేకాదు.. మీరేదైనా డేటాను చూస్తే.. దాన్ని మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మార్చేసుకోవచ్చు. మీరేం మాట్లాడకపోయినా గ్లాసెస్ చూసే ప్రతి విజువల్, ఆడియోను నిత్యం విశ్లేషిస్తూ డేటాను రికార్డు చేస్తుంది. మీరెప్పుడైనా సంబంధిత సమాచారాన్ని కోరితే వెంటనే యాక్సెస్ చేసి చెబుతుంది. బోర్ అనిపిస్తే కళ్లజోడే హెడ్సెట్లా మారిపోతుంది. -
మందలా చేరికలు.. మందకొడి బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో ఇంజనీరింగ్ విద్య నాణ్యతపై ఆడిట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) దృష్టికి తీసుకెళ్లేదుకు సిద్ధమైంది. డీమ్డ్ వర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ఏఐసీటీఈకి వివరించాలని నిర్ణయించింది. ఈ అంశంపై విద్యాశాఖ, సాంకేతిక విద్య శాఖ అధికారులు గురువారం చర్చించారు.ప్రభుత్వ సూచనల మేరకు ఏఐసీటీఈకి లేఖ రాసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. డీమ్డ్ వర్సిటీల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్న తీరు, దీనివల్ల విద్యార్థులకు జరిగే నష్టాన్ని అందులో వివరించాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఎమర్జింగ్ కోర్సుల నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రమాణాలు లేని బోధన జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది.కాలం చెల్లిన కోడింగ్గత ఏడాది డీమ్డ్ వర్సిటీల నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందిన విద్యార్థులు కొన్ని రకాల కోడింగ్ మాత్రమే చేయగలుగుతున్నారు. ఏఐ వచి్చన తర్వాత పాతతరం కోడింగ్, డీకోడింగ్ అవసరమే లేకుండా పోయింది. అడ్వాన్స్డ్ కోడింగ్ను సాఫ్ట్వేర్ కంపెనీలు కోరుకుంటున్నాయి. ఇవేవీ డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో కన్పించడం లేదని సాంకేతిక విద్య అధికారులు అంటున్నారు. డ్రిస్కియేట్ మేథమెటిక్స్, డేటా స్ట్రక్చర్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, డేటా స్ట్రక్చర్ లేబోరేటరీపై బేసిక్స్ తప్ప, ఏఐ సమాంతర బోధనపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని గుర్తించారు. కొన్ని సంస్థల కోసం జరిగే ఇంటర్వ్యూల్లో కీలకమైన బిజినెస్ ఎకనమిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్పై కనీస పరిజ్ఞానం కూడా విద్యార్థుల్లో ఉండటం లేదని టెక్ కంపెనీలు అంటున్నాయి. అడ్డగోలు ప్రవేశాలుతెలంగాణలో మొత్తం పదివరకు డీమ్డ్ వర్సిటీలున్నాయి. వీటిలో కొన్ని ఆఫ్ క్యాంపస్ బ్రాంచీలున్నాయి. డీమ్డ్ హోదా ఉన్న సంస్థలు తెలంగాణలో బ్రాంచీలు పెట్టాయి. భూమి, మౌలిక వసతులు, కొన్నేళ్లుగా సాధించిన ర్యాంకుల ఆధారంగా డీమ్డ్ హోదాను ఏఐసీటీఈ ఇస్తుంది. ఈ హోదా వచి్చన వర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు పొందాల్సిన అవసరం లేదు. అడ్మిషన్లు కూడా వాళ్ల ఇష్టమే.ఇష్టానుసారం అన్ని బ్రాంచీల్లోనూ సీట్లు పెంచుకోవచ్చు. డీమ్డ్ హోదా కోసం సంస్థలు వ్యూహాత్మకంగా జాతీయ ర్యాంకులు వచ్చేలా చూసుకుంటున్నాయి. ర్యాంకులిచ్చే జాతీయ సంస్థలకు ఇవి అనేక ప్రలోభాలకు గురిచేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు అన్స్కిల్డ్ ఉద్యోగాల్లో చేరినా, వాటిని ర్యాంకింగ్ డేటాలో స్కిల్డ్గానే చూపిస్తున్నాయి. ఇలా హోదా తెచ్చుకున్న తర్వాత నియంత్రణ లేకుండా విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఒక్కో యూనివర్సిటీ ఇంజనీరింగ్లో ఏకంగా 3 వేలకుపైగానే విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తోంది.ఇందులో ప్రధానంగా డేటాసైన్స్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ కోర్సులే ఉంటున్నాయి. అయితే, ఇంతమందికి సరిపడా ఫ్యాకల్టీ ఎలా తెస్తున్నారు? బోధించేవాళ్ల నాణ్యత ఎంత? అనే అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతన్నాయి. డీమ్డ్ వర్సిటీల్లో చదివిన విద్యార్థుల ఉపాధి అవకాశాలపై ఇటీవల రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగం డేటా తెప్పించి పరిశీలించింది. కంప్యూటర్ సైన్స్ చదివిన వారిలో కనీసం 32 శాతం కూడా సరైన ఉద్యోగాలకు ఎంపికవ్వడం లేదని గుర్తించారు.పనికి మాలిన ప్రాజెక్టులుప్రతీ కంపెనీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీకి అనుసంధానమయ్యాయి. దానిని నిర్వహించే ఉద్యోగ అర్హతలకు కొన్ని ప్రాజెక్టులు ఇంజనీరింగ్లోనే చేయాలి. అయితే, డేటా అనలిటిక్స్ లేబొరేటరీల్లో సాధారణ ప్రాజెక్టులు మాత్రమే పూర్తి చేస్తున్నారు. ఫీల్డ్ వర్క్లో చేసే ప్రాజెక్టుల్లో ఎక్కడా ఏఐ కోడింగ్, మాడ్యూల్స్పై అధ్యయనం చేసిన దాఖలాలు డీమ్డ్ వర్సిటీ విద్యార్థుల్లో ఉండటం లేదని సాంకేతిక విద్య అధికారి ఒకరు తెలిపారు. సైబర్ సెక్యూరిటీలో ఎథి్నకల్ హ్యాకింగ్, థ్రెట్ ఇంటిలిజెన్స్, ఢిజిటల్ ఫోరెన్సిక్స్ వంటి సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం కన్పించడం లేదని అధికారులు సేకరించిన డేటా స్పష్టం చేస్తోంది. బోధన నాణ్యతమై ఆడిటింగ్ జరిగితే తప్ప డీమ్డ్ వర్సిటీలు చేస్తున్న అన్యాయం వెలుగులోకి రాదని ఒక ఉన్నతాధికారి తెలిపారు. -
పిల్లలూ.. పంచదారతో జాగ్రత్త
ఇటీవలి కాలంలో జంక్ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, మితిమీరిన స్మార్ట్ఫోన్ల వాడకం.. ఇవన్నీ బాల్యాన్ని అనారోగ్యపు కోరల్లోకి నెట్టేస్తున్నాయి. బడి పిల్లల్లో ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి ఆరోగ్యంపై అవగాహన కల్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కొన్ని బడుల్లో మ్యాథ్స్, సైన్స్తోపాటు ఆరోగ్యంపైనా తరగతులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కూడా విద్యార్థులు మధుమేహం బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి పరిష్కారంగా.. తన పరిధిలోని అన్ని బడుల్లో ‘షుగర్ బోర్డులు’ఏర్పాటుచేయాలని ఆదేశించింది.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 (2019–21) ప్రకారం... 5 ఏళ్లలోపు పిల్లల్లో 3.4 శాతం మందిలో ఊబకాయం సమస్య ఉంది. 23 శాతం పురుషులు, 24 శాతం మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ‘ద లాన్సెట్’లో వచి్చన గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్ కొలాబరేషన్స్ విశ్లేషణ ప్రకారం.. 1990లో 0.46 కోట్ల మంది అబ్బాయిల్లో ఊబకాయం ఉంటే, 2021 నాటికి ఆ సంఖ్య 1.3 కోట్లకు పెరిగింది.ఇదే సమయంలో అమ్మాయిల్లో 0.45 కోట్ల నుంచి 1.24 కోట్లకు పెరిగింది. 2050 నాటికి ఇలాంటి అమ్మాయిల సంఖ్య 1.44 కోట్లకు, అబ్బాయిల సంఖ్య 1.6 కోట్లకు పెరుగుతుందని అంచనా వేశారు. భారత జాతీయ సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లు ఉండగా.. ఇది జపాన్లో 84 ఏళ్లుగా ఉంది. ఆరోగ్య జీవన ప్రమాణం (ఎలాంటి రోగాలు లేకుండా జీవించడం) పరంగా చూసినప్పుడు ఈ తారతమ్యం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. జపాన్లో ఎలాంటి రోగాల బారిన పడకుండా 70 ఏళ్ల వరకూ సంతోషంగా జీవిస్తుంటే.. ఇది మన దేశంలో 60 సంవత్సరాలు మాత్రమే!సమగ్ర ఆరోగ్య పాఠ్యప్రణాళిక పెరుగుతున్న అనారోగ్య సమస్యలను నివారించేందుకు చిన్నప్పటి నుంచే పిల్లల్లో అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కొన్ని పాఠశాలలు ‘సమగ్ర ఆరోగ్య పాఠ్యప్రణాళిక’ను అమలు చేస్తున్నాయి. ప్రతివారం ప్రత్యేకంగా ఆరోగ్య విద్యపై తరగతులు నిర్వహిస్తూ, ఆరోగ్యంపై శ్రద్ధ కల్పిస్తున్నాయి. ప్రధానంగా పోషకాహారం, పరిశుభ్రత, వ్యాయామం, మానసిక ఆరోగ్యం, ప్రథమ చికిత్స తదితర అంశాలపై పాఠాలు చెబుతున్నారు. బాల్యం నుంచే ఆరోగ్యంపై అవగాహన ఉన్న విద్యార్థులు మంచి అలవాట్లను పెంచుకుంటారని, వీరు తమ తదనంతర జీవితంలో రోగాల బారిన పడకుండా సంతోషకరమైన జీవనాన్ని గడుపుతారని నిపుణులు చెబుతున్నారు.సెమినార్లు, వర్క్ షాపులుపాఠశాలల్లో షుగర్ బోర్డులను ప్రదర్శించడంతోపాటు.. చక్కెరతో వచ్చే అనర్థాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు సెమినార్లు, వర్క్షాపులు కూడా నిర్వహించాలని సీబీఎస్ఈ పేర్కొంది. దీనికి సంబంధించి తీసుకున్న చర్యలపై సంక్షిప్త నివేదికను జూలై 15వ తేదీ నాటికల్లా సమరి్పంచాలని ఆదేశించింది. ఈ చర్యలు విద్యార్థుల దీర్ఘకాలిక శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయని సీబీఎస్ఈ భావిస్తోంది. ‘5–4–3–2–1–0’మంత్రంపలు స్కూళ్లలో ఉదయమే వందేమాతరం, జనగణమనతో పాటు ‘‘5–4–3–2–1–0’’అంటూ.. ఆరోగ్య మంత్రాన్ని విద్యార్థులు జపిస్తున్నారు. ‘5’అంటే రోజూ ఐదురకాల పండ్లు, కూరగాయలు ఆహారంలో తీసుకోవడం. ‘4’అంటే ప్రతి రోజూ నాలుగుసార్లు చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ‘3’అంటే మూడుసార్లు ప్రొటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం. ‘2’అంటే స్క్రీన్ టైమ్ను (టీవీ, ఫోన్, ల్యాప్ట్యాప్ చూడటం) రెండు గంటలకు పరిమితం చేయడం. ‘1’అంటే రోజూ కనీసం ఒక గంట వ్యాయామం చేయడం!ఈటింగ్ షుగర్ నో పప్పా ఇటీవలి కాలంలో పిల్లల్లో మధుమేహం కేసులు పెరిగాయి. మరీ ముఖ్యంగా గతంలో పెద్దల్లో మాత్రమే కనిపించే టైప్ 2 మధుమేహం.. ఇటీవల పిల్లల్లోనూ కనిపిస్తుండటంతో సీబీఎస్ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో ప్రత్యేక షుగర్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. తద్వారా అతిగా చక్కెర తినడం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్దేశించింది. ఇలా ప్రత్యేక షుగర్ బోర్డుల ఏర్పాటు ద్వారా విద్యార్థులు ఏమేర చక్కెరను తింటున్నారో పర్యవేక్షించేందుకు, వారి చక్కెర వాడకాన్ని తగ్గించేందుకు వీలవుతుందని సీబీఎస్ఈ భావిస్తోంది. జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) సలహా మే రకు సీబీఎస్ఈ ఈ కార్యక్రమం చేపట్టింది. చక్కెరతో అనర్థాలుచక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్లల్లో మధుమేహంతోపాటు ఊబకాయం, దంత సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు వస్తున్నట్లు సీబీఎస్ఈ పేర్కొంది. ఇవన్నీ విద్యార్థులను చదువుల్లో వెనుకబడేలా చే సే ప్రమాదం ఉందని తెలిపింది. బడుల్లో ఏర్పాటు చేసే షుగర్ బోర్డుల్లో.. ప్రతి రోజు పిల్లలు ఎంత మేరకు చక్కెర తీసుకోవాలి.. ఆయా ఆహార పదార్థాల్లో ముఖ్యంగా జంక్çఫుడ్స్, సాఫ్ట్డ్రింక్స్లో ఎంతమేర చక్కెర ఉంటుంది.. అతిగా పంచదార తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు.. తదితర విషయాలను వివరిస్తారు. దీంతోపాటు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను కూడా తెలియజేస్తారు. 3 రెట్లు ఎక్కువగా!‘ప్రస్తుతం 4–10 ఏళ్ల వయసున్న విద్యార్థులు ప్రతిరోజూ చక్కెర నుంచి సగటున 13 శాతం కేలరీలు పొందుతున్నారు. అలాగే 11–15 ఏళ్ల వయసు విద్యార్థులకు చక్కెర నుంచి 15 శాతం కేలరీలు లభిస్తున్నాయి. ఆరోగ్య ప్రమాణాల ప్రకారం వాస్తవానికి ఇది 5 శాతానికి మించి ఉండకూడదు. అంటే నిర్దేశిత పరిమాణం కంటే మూడురెట్లు ఎక్కువగా స్కూల్ విద్యార్థులు షుగర్ను తీసుకుంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి’అని సీబీఎస్ఈ ఆందోళన వ్యక్తం చేసింది. -
రోబోలకు బాబు.. మనిషిలాంటి డాబు హ్యూమనాయిడ్
‘మనసున మనసై.. బ్రతుకున బ్రతుకై...’ – తోడొకరు ఉండటానికేముంది కానీ.. ఇంట్లో వంట పనికి తోడుండగలరా? ఇల్లు తుడవటానికి తోడుండగలరా? గిన్నెలు తోమటానికి, బట్టల్ని నీళ్లలో జాడించటానికీ, దండెం మీద ఆరేయటానికీ తోడుండగలరా? అది కదా నిజంగా తోడుగా ఉండటం అంటే! ఒక్క ఇల్లనే కాదు; ఇంటి పనీ, వంట పనీ అనే కాదు – చేదోడు అవసరమైన ప్రతి చోటా, ప్రతి రంగంలో మనసెరిగి పనులు చక్కబెట్టే మనిషొకరు ఉంటే ప్రపంచం ఎంత సౌఖ్యంగా మారిపోతుంది! నిజమే కానీ, మానవ మాత్రులెవ్వరూ అలా తోడుగా ఉండలేరు. అందుకొక మెషీన్ కావలసిందే. వట్టి మెషీన్ కాదు.. మనిషి లాంటి మెషీన్.. అంటే.. హ్యూమనాయిడ్!!మొన్న మే 21న..టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ ‘కనీ విని ఎరుగని’అంటూ ఒక వీడియో క్లిప్ విడుదల చేశారు. అందులో ‘ఆప్టిమస్’అనే హ్యూమనాయిడ్ ఇంటి పనుల్ని చలాకీగా చక్కబెట్టేస్తోంది. వంగి, చెత్త బ్యాగును తీసి డస్ట్ బిన్లో పడేస్తోంది. ఒక చేత్తో బ్రష్, ఇంకో చేత్తో డస్ట్ ప్యాన్ ఉపయోగించి టేబుల్ని శుభ్రం చేస్తోంది. టిష్యూ పేపర్ రోల్ నుంచి చిన్న ముక్కను లాగి తీసుకుంటోంది. స్టౌ మీద గిన్నెలో కూరగాయల్ని గరిటెతో కలియదిప్పుతోంది. గచ్చును తుడుస్తోంది. ప్రశాంతంగా సూచనలు పాటిస్తూ.. ‘ఇంకేమైనా పనుందా అమ్మగారూ...’అనే మన పాతకాలపు పనిమనిషిలా తర్వాతి ఆదేశాల కోసం చూస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ ‘ఆప్టిమస్’హ్యూమనాయిడ్ రూ.18–25 లక్షల వరకు ఉంటుందట.హ్యూమనాయిడ్, రోబో ఒకటి కాదా..ఈ ప్రశ్నకు సమాధానం... ‘కాదు’, ‘అవును’కూడా. హ్యూమనాయిడ్లన్నీ రోబోలే. కానీ, రోబోలన్నీ హ్యూమనాయిడ్లు కావు. రోబో యంత్రమైతే, హ్యూమనాయిడ్ మానవ యంత్రం. రోబో ఏ ఆకారంలోనైనా ఉండొచ్చు. హ్యూమనాయిడ్ మాత్రం కృత్రిమ మేధస్సుతో ప్రత్యేక మానవ నైపుణ్యాలను, మానవాకృతిని కలిగి ఉంటుంది. ఫ్యాక్టరీలో కారు భాగాలు జోడించే సాధారణ రోబోలు, లేదా నేలను శుభ్రం చేసే వాక్యూమ్ క్లీనర్ రోబోలతో పోలిస్తే ఈ హ్యూమనాయిడ్లు చాలా వైవిధ్యమైనవి. ఇవి కష్టమైన పనులను సైతం చేయగలవు, మనుషులతో మాట్లాడగలవు, కొత్త పరిస్థితులకు అలవాటు పడగలవు. వీటి ప్రత్యేకత ఏమిటంటే.. వీటి రూపం మనుషులకు సౌకర్యంగా అనిపించడం.ఇంత తెలివి ఎలా ?హ్యూమనాయిడ్లు మనుషుల్లా పనిచేయడానికి స్మార్ట్ టెక్నాలజీలను ఉపయోగించుకుంటాయి. ఏఐ మస్తిష్కంతో ఇవి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాయి. వాటిల్లోని సెన్సార్లే.. వాటి పంచేంద్రియాలు. గదిని 3డీలో చూడటానికి, వస్తువులను గుర్తించడానికి 3డీ కెమెరాలు, ‘లైడార్’ సహాయపడతాయి. గైరోస్కోప్లు, యాక్సిలరోమీటర్లు వీటి నడకను బ్యాలెన్స్ చేస్తాయి. ‘ఫోర్స్’సెన్సార్లు వస్తువులను అవి పగలనంత సున్నితంగా పట్టుకోవడానికి తోడ్పడ తాయి.విజన్ సెన్సార్లు ముఖాలను గుర్తించడానికి, దారులను కనుక్కోటానికి ఉపకరిస్తాయి. హ్యూమనాయిడ్లు మైక్రోఫోన్లతో మాటలను విని, అర్థం చేసుకోగలవు. మోటార్లు, యాక్చుయేటర్లు వాటి కండరాలు. శక్తిమంతమైన కంప్యూటర్ల సెన్సార్ల నుండి వచ్చే సమాచారాన్ని వేగంగా ప్రాసెస్ చేస్తాయి. అందువల్ల హ్యూమనాయిడ్లు తక్షణం ఆలోచించి పనిచేయగలదు. బ్యాటరీలతో ఇవి 5 గంటల వరకు పనిచేస్తాయి. కానీ నడిచే హ్యూమనాయిడ్లకు చాలా శక్తి అవసరం. వీటిని ఇంటర్నెట్తో అనుసంధానిస్తారు. ‘అక్యూట్’తో భారత్ అరంగేట్రం!హ్యూమనాయిడ్స్ను మనదేశమూ తయారు చేస్తోంది. తొలిసారిగా బిట్స్ పిలానీ ‘అక్యూట్’అనే హ్యూమనాయిడ్ కి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఇస్రో, డీఆర్డీఓ, రిలయన్స్ వంటివి ఈ రంగంలో విస్తృత ప్రయత్నాలు చేస్తున్నాయి. కృత్రిమ మేధ (ఏఐ), సెన్సార్ల వంటి స్మార్ట్ టెక్నాలజీలు ఈ హ్యూమనాయిడ్ల మెదడుకు మేత. ఈ మేతకు అవసరమైన కీలక ఎలక్ట్రానిక్ విడిభాగాల కోసం చైనా, యూఎస్, జర్మనీలపై ఆధారపడకుండా పూర్తి స్థాయిలో తయారీ చేపడితే అంతర్జాతీయంగా హ్యూమనాయిడ్ రోబోల రంగంలో భారత్ పోటీపడే అవకాశాలు ఉంటాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఐదేళ్లలో 50 వేలు...ప్రపంచ హ్యూమనాయిడ్ రోబో మార్కెట్ 2024లో 3.28 బిలియన్ డాలర్లు. 2032 నాటికి ఇది 66 బిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదికలు చెబుతున్నాయి. భారత హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ విలువ రూ.1,275 కోట్లు. మొత్తం 8,000 రోబోలలో హ్యూమనాయిడ్లు 10 శాతం వరకు ఉంటాయి. ఏటా 25 శాతం రోబోలు తోడవుతున్నాయి. 2030 నాటికి భారత్ 50,000 హ్యూమనాయిడ్లను ఉపయోగించే అవకాశం ఉంది. మన హ్యూమనాయిడ్ రోబోల మార్కెట్ 2035 నాటికి రూ.12,750 కోట్లకు చేరొచ్చని అంచనా.సవాళ్లు – పరిమితులు హ్యూమనాయిడ్ రోబోల తయారీ, వినియోగం ఖరీదైన వ్యవహారం. చైనాకు చెందిన ‘యూనిట్రీ జీ1’ధర రూ.13.6 లక్షలు. భారత రోబోలు.. ఆప్టిమస్ లేదా యూనిట్రీ జీ1 లాగా స్వేచ్ఛగా కదలలేవు, బ్యాటరీ ఎక్కువసేపు ఉండదు. రోబోలకు 5జీ వంటి వేగవంతమైన ఇంటర్నెట్ కావాలి. భారత్లో పూర్తి స్థాయిలో 5జీ విస్తృతం కాలేదు. అయితే మన ‘యాడ్వర్బ్’భారీ ప్రణాళికలు, డీఆర్డీఓ రక్షణ పనులు.. భారత్ సైతం ఈ రంగంలో పోటీపడగలదని నిరూపిస్తున్నాయి. ఖర్చు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఆశాజనకంగా ఉన్న మార్కెట్, ప్రభుత్వ మద్దతు ఉజ్వల భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తున్నాయి.పోటీలో దూసుకుపోతున్న భారత్⇒ హ్యూమనాయిడ్ రోబో రేసులో దేశీయ కంపెనీలు చురుగ్గా ఉన్నాయి. మెక్స్ రోబోటిక్స్, స్వాయ రోబోటిక్స్, ఇన్వెంటో రోబోటిక్స్, సిరెనా టెక్నాలజీస్, విస్టాన్నెక్ట్స్జెన్ తదితర సంస్థలు వీటి తయారీలో ఉన్నాయి. ⇒ షాపులు, ఫ్యాక్టరీలు, కస్టమర్ సేవల కోసం అహ్మదాబాద్కు చెందిన కోడీ టెక్నోలాబ్ తయారు చేసిన ‘స్కంద’2024లో రంగ ప్రవేశం చేసింది. షాపుల్లో స్టాక్ నిర్వహణ వంటి పనులు చేస్తుంది. ⇒ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టిన నోయిడాకు చెందిన యాడ్వర్బ్ టెక్నాలజీస్ ఫ్యాషన్, రిటైల్, ఎనర్జీ రంగాల్లో వాడేందుకు హ్యూమనాయిడ్ను తీసుకొస్తోంది. ఉత్పత్తులను అసెంబుల్ చేయడం, గిడ్డంగుల్లో వస్తువులను తీసుకెళ్లడం వంటి క్లిష్టమైన పనులు ఇది చేస్తుంది. ⇒ ప్రమాదకర మిలటరీ పనుల కోసం డీఆర్డీఓ, స్వాయ రోబోటిక్స్తో కలిసి 2027 నాటికి హ్యూమనాయిడ్ను పరిచయం చేయనుంది. ఇది 24 విధాలుగా కదలగలదు. 3డీలో ప్రాంతాలను మ్యాప్ చేయగలదు. బాంబులను నిరీ్వర్యం చేయగలదు. ప్రమాదకర ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరించగలదు. ⇒ భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ అంతరిక్ష మిషన్లలో సహాయపడేందుకు వ్యోమమిత్ర హ్యూమనాయిడ్ రోబో తయారుచేసింది.కొన్ని హ్యూమనాయిడ్లు..⇒ చైనా కంపెనీ యూబీటెక్ వృద్ధుల సంరక్షణ, బోధన కోసం ప్రత్యేక హ్యూమనాయిడ్లను తయారు చేస్తోంది. యూఎస్ టెక్నాలజీ సంస్థ ఎజిలిటీ రోబోటిక్స్ తయారు చేసిన ‘డిజిట్’లు వస్తువులను తీసుకోవడం, ప్యాక్ చేయడంn చేస్తున్నాయి. స్టాన్ఫోర్డ్ వర్సిటీ రూపొందించిన ‘ఓషన్ వన్’... సముద్రంలో ప్రమాదకర ప్రాంతాల్లో, భూగర్భంలో వెలికితీతలకు చక్కగా ఉపయోగ పడుతోంది. -
బెల్లం రైతుకు 'బేడీలు'
కూటమి ప్రభుత్వం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెల్లం సాగు చేసే రైతుకు బేడీలు వేస్తోంది. సాక్షాత్తు సీఎం ఇలాకాలో బెల్లం సాగు చేసే రైతులు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. వారు దొంగతనం, హత్యలు చేయలేదు. కానీ అలాంటి వారికి వేసే శిక్షలు ఆరుగాలం శ్రమించే అన్నదాతకు పడేలా చేస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. బెల్లం సాగు చేసే రైతులు బెల్లం అమ్మడం నేరమా? బెల్లం తీసుకొని పోయినవారు సారా కాస్తారా.. కాఫీ చేసుకుంటారా రైతుకు ఎలా తెలుస్తుంది? కానీ సారా కాసే వాళ్లను వదిలేసి.. బెల్లం సాగు చేసే రైతులను జైలుపాలు చేస్తుండడంపై అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు అర్బన్ : ఉమ్మడి చిత్తూరుజిల్లా లో రైతులు పండించే ప్రధాన పంటల్లో చెరకు ఒకటి. ఇక్కడి నల్లరేగడి భూముల కారణంగా చాలా వరకు బెల్లం నలుపు రంగులో తయారవుతుంది. కొన్ని రకాల రసాయనాలు, ప్రాసెసింగ్ చేస్తే బెల్లం రంగు మారుతుంది. కానీ గిట్టుబాటు ధర దక్కదు. దీంతో చాలా మంది నల్లబెల్లాన్ని తయారు చేసి మండీలు, అవసరం ఉన్న వాళ్లకు, ట్రేడర్లకు అమ్ముతున్నారు.ఇదే ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. నల్లబెల్లం తయారీ, విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆంక్షలు అతిక్రమిస్తున్న అన్నదాతలను నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి జైలుకు పంపుతోంది. ప్రభుత్వ చర్యలపై రైతులు, రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. నవోదయంలో చీకట్లు నాటుసారా తయారీ, విక్రయాలను అరికట్టడానికి కూటమి ప్రభుత్వం నవోదయం 2.0ను తీసుకొచ్చింది. సుదీర్ఘకాలంగా సారా తయారు చేస్తున్న కుటుంబాలను ఆ ఊబి నుంచి బయటపడేసి, వాళ్ల జీవన ప్రమాణాలు మార్చడానికి రుణాలు, ఇతర ప్రత్యామ్నాయ పనులను కల్పించాల్సిన ప్రభుత్వం రైతులపై పడింది. నాటు సారా తయారీకి నల్లబెల్లం తప్పనిసరిగా వాడతారని, నల్లబెల్లం తయారు చేస్తున్న రైతులపై నిఘా ఉంచాలని, ఎవరెవరికి నల్లబెల్లం విక్రయిస్తున్నారు..? కొనుక్కునే వ్యక్తి ఆధార్ తీసుకున్నారా..? కిలో ఎంతకు అమ్ముతున్నారు..? అయిదు కిలోలకు పైబడి ఎవరికి అమ్ముతున్నారు..? అని వివరాల సేకరిస్తున్నారు.వాస్తవానికి బెల్లం తయారు చేసిన రైతులు దాన్ని మార్కెట్కు తరలించాలంటే తన రవాణాకు కిలో కు రూ.3, మార్కెట్లో కమిషన్ రూ.3 అదనపు సుంకంగా చెల్లించాలి. తీరా బెల్లాన్ని విక్రయించిన తరువాత తన పెట్టుబడి దక్కని పరిస్థితి. దీంతో కొందరు రైతులు బెల్లాన్ని మార్కెఫెడ్లో విక్రయించడంతో పాటు గ్రామాల్లో అమ్ముతుంటారు. రైతు ల నుంచి బెల్లాన్ని కొన్నవాళ్లు దాన్ని ఫ్యాక్టరీలకు వాడతారో.. పశువులకు దాణాగా ఉపయోగిస్తారో అన్నదాతలకు తెలియదు. కానీ ఎవరైనా సారా తయారు చేస్తూ పట్టుబడితే, నిందితులు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని బెల్లం విక్రయించారనే నెపంతో రైతులను అరెస్టు చేయడం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. గిట్టుబాటు ధర ఎక్కడ ? ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 5 వేల హెక్టార్లలో చెరకు పంట సాగువుతోంది. ఇందులో చిత్తూరు నియోజకవర్గంలోని గుడిపాల, రూరల్, నగరి, నిండ్ర, విజయపురం, గంగాధర నెల్లూరు, కార్వేటినగరం, పెనుమూరు, పుంగనూరు, పులిచెర్ల, ఎస్.పురం, వెదురుకుప్పం మండలాల్లో చెరకు పంట ఎక్కువగా పండిస్తున్నారు. వీటిల్లో 4500 హెక్టార్లలో పండే పంటను ఫ్యాక్టరీలకు విక్రయిస్తుండగా మిగిలిన 500 హెక్టార్ల నుంచి బెల్లం తయారీ చేస్తున్నారు. ఒక హెక్టారుకు 70 టన్నుల వరకు బెల్లం తయారు చేస్తున్నారు. ఇందులో దాదాపు 5 వేల టన్నుల వరకు నల్లబెల్లం ఉత్పత్తి అవుతోంది. కిలో నల్లబెల్లాన్ని మార్కెట్లో ట్రేడర్లకు విక్రయిస్తే రూ.24–27 మధ్య ధర వస్తుంది. ఇందులోనే రవాణా చార్జీలు, దళారుల కమీషన్లు పోనూ చేతికి రూ.15 దక్కడం గగనంగా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. మార్కెఫెడ్ ద్వారా బెల్లాన్ని కొనుగోలు చేయిస్తూ రైతులను ఆదుకుంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వానికి దమ్ముంటే పంటను కొనుగోలు చేయాలి వైఎస్.జగన్ సీఎంగా ఉన్నప్పుడు మార్క్ఫెడ్ ద్వారా నల్లబెల్లాన్ని కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచాం. సారాను నివారించడానికి పీడీ యాక్టులు పెట్టాం. కానీ టీడీపీ అధికారంలోకి వస్తేనే బెల్లం రైతులపై పడుతారు. గతంలోనూ అంతే, ఇప్పుడూ అదే కొనసాగుతోంది. మా నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులను అరెస్టు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే జిల్లాలో బెల్లం రైతులకు ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నల్లబెల్లానికి గిట్టుబాటు ధర కల్పించి, పంటను కొనుగోలు చేయాలి. – ఎంసీ.విజయానందరెడ్డి, వైఎస్సార్సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్తసారాకు బెల్లం విక్రయిస్తే అరెస్టు తప్పదు సారా తయారీకి నల్లబెల్లాన్ని విక్రయిస్తే చట్టపరంగా ముందుకు వెళతాం. సారా తయారీ వాళ్లకు బెల్లం అమ్మారని తెలిసాకే అరెస్టు చేశాం. నవోదయంలో భాగంగా నాటు సారా తయారీ అరికట్టడానికి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, బెల్లం వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించాం. ఫ్యాక్టరీలు, పశువుల కోసం నల్లబెల్లం అమ్మితే పర్లేదు. సారా కోసం అమ్మితే మాత్రం అరెస్టు తప్పదు. – శ్రీనివాస్,ఎక్సైజ్ సూపరింటెండెంట్, చిత్తూరు అరెస్టులపై ఉద్యమిస్తాం ఎక్కడైనా సారా తయారు చేసే వాళ్లను అరెస్టు చేస్తారు. కానీ ఇక్కడ బెల్లం తయారు చేసే రైతులను అరెస్టు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం.? నాటుసారా పేరిట రైతులను అరెస్టు చేసి జైలుకు తరలిస్తున్నారు. పొలాన్ని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడుతోంది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రభుత్వం ఇలాంటి చర్యలు ఆపకపోతే ఉద్యమం తప్పదు. – నాగరాజన్, సీపీఐ, చిత్తూరు జిల్లా కార్యదర్శి -
డిగ్రీ.. పదో తరగతి
పీఎం ఇంటర్న్షిప్.. దేశంలోని టాప్ – 500 కంపెనీల్లో యువత శిక్షణ పొంది, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సాధించేందుకు అద్భుతమైన వేదిక. మొదటి రౌండ్ మొత్తం పూర్తయిపోయి, రెండో రౌండ్ కూడా సగం పూర్తయింది. ఈ దశలో టాప్ – 4 రాష్ట్రాలలోనే సుమారు 50 వేల అవకాశాలు ఉన్నాయి. మొత్తం అవకాశాల్లో ఇవి దాదాపు 42 శాతం. అంటే.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినవీ, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అవకాశాలు అందిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణల్లో గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల తరవాత అత్యధిక ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసింది పది పాసైనవారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రాడ్యుయేషన్ తరవాత.. ఐటీఐ వాళ్లు ఎక్కువగా ఉన్నారు. దేశంలోని 21–24 ఏళ్ల మధ్య ఉండే యువత ఉద్యోగ సాధనకు అవసరమయ్యే పూర్తిస్థాయి నైపుణ్యాలను.. అత్యుత్తమ కంపెనీల ద్వారా యువతకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (పీఎంఐఎస్) తీసుకొచి్చంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి చదువులు పూర్తిచేసిన విద్యార్థులకు శిక్షణతోపాటు, నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్ కూడా ఈ పథకం ద్వారా అందిస్తారు. దీంతోపాటు కంపెనీలో చేరేముందు వన్టైమ్ గ్రాంట్ కింద రూ.6,000 కూడా చెల్లిస్తారు. ఏడాదిలో 6 నెలలు క్లాస్ రూమ్లో, 6 నెలలు క్షేత్రస్థాయిలో శిక్షణ ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు దీనికి అర్హులు.మొదటి రౌండ్లో.. ఈ ఏడాది మార్చిలో రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ చెప్పిన సమాధానం ప్రకారం.. 2024 అక్టోబర్లో ప్రారంభమైన పీఎంఐఎస్ పైలట్ ప్రాజెక్ట్ మొదటి రౌండ్లో... చివరికి 28,141 మంది ఆఫర్లు తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు. ఇందులో ఏపీ నుంచి 1,970, తెలంగాణ నుంచి 1,380 మంది ఉన్నారు. యూపీ నుంచి అత్యధికంగా 4,656 మంది, బిహార్ నుంచి 2,418 మంది స్వీకరించారు. మొదటి రౌండ్లో మొత్తం 1.27 లక్షల ఆఫర్లు రాగా.. వాటికోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీలు 82,077 మందిని ఎంపిక చేసుకుని ఇంటర్న్షిప్ ఆఫర్ చేశాయి. గ్రాడ్యుయేషన్... ఐటీఐ ఈసారి ఇంటర్న్షిప్లకు వచి్చన దరఖాస్తుల్లో ప్రధాన రాష్ట్రాల్లో గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఆ తరవాత పదో తరగతి అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలలో ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం గ్రాడ్యుయేషన్ తరవాత ఐటీఐ వాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మే 20 నాటికి 4,710 దరఖాస్తులు వస్తే.. అందులో గ్రాడ్యుయేషన్ చేసినవాళ్లు 1,717 మంది కాగా, ఐటీఐ అభ్యర్థులు 1,040 మంది. అలాగే తెలంగాణలో 5,252 రాగా.. గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు దాదాపు సగం అంటే.. 2,611 మంది ఉండటం విశేషం. రెండో రౌండ్లో.. రెండో రౌండ్లో కంపెనీల సంఖ్య పెరిగింది. మొదటి దశలో 280 వస్తే ఇప్పుడు 327 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇవి సుమారు 1.19 లక్షల ఇంటర్న్షిప్ అవకాశాలు అందిస్తున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాల్లోని 735 జిల్లాల్లో యువతకు.. 25 రంగాల్లో నైపుణ్యం పొందే అవకాశం లభించింది. ఈసారి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని యువత పోటీపడ్డారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక.. ఈ నాలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అత్యధిక ఇంటర్న్షిప్లు ఆఫర్ చేస్తున్న ప్రధాన రంగాలు.. చమురు, సహజవాయువు, ఇంధనం; పర్యాటకం, ఆతిథ్యం; బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. అత్యధిక ఇంటర్న్షిప్లు అందిస్తున్న టాప్ –3 రంగాలు. -
డ్యాన్స్ బేబీ డ్యాన్స్
అద్భుతమా, అసంబద్ధమా? ఏమిటిది! నియంత్రణ లేని కదలికలకు నియమబద్ధమైన కదలికలతో చికిత్సా?! ‘పార్కిన్సన్స్’ డిసీజ్ అంటే నడక అదుపు తప్పటం, చేతులు కదలకపోవటం, కాళ్లు మెదలకపోవటం, తల వణకడం, ఉన్నట్లుండి అదిరి పడటం, నాడీ వ్యవస్థకు, ఇంద్రియాలకు మధ్య సమన్వయం గాడి తప్పటం!! దేహం ఇంత దుర్భరంగా ఉన్నప్పుడు నృత్యం చెయ్యటం ఎంత దుర్లభం! పైగా దుర్లభమే దుర్భరానికి చికిత్స అవటం ఇంకెంత విడ్డూరం! అయితే ఇది విడ్డూరమేమీ కాదు, ప్రయోగాత్మకంగా నిర్థారణ విషయమే అంటోంది ‘ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ (ఐ.ఎ.డి.ఎం.టి).పార్కిన్సన్లో ఏ కదలికా లయబద్ధంగా ఉండదు. డాన్స్లో లయబద్ధంగా లేని ఒక్క కదలికా ఉండదు. కానీ ఐ.ఎ.డి.ఎం.టి. పార్కిన్సన్స్ వ్యాధిని నయం చేయటానికి, వ్యాధిగ్రస్తుల్ని శక్తిమంతం చేయటానికి భారతీయ నృత్య రీతుల్ని ఒక చికిత్సా విధానంగా ఉపయోగిస్తోంది. విశాలమైన ఒక నిశ్శబ్దపు గది, వెనుక నుంచి మంద్రస్థాయిలో వినిపించే తబలా బీట్ వంటి ఒక సంగీత వాద్యం ఈ చికిత్సలో ముఖ్య భాగంగా ఉంటాయి. స్త్రీలు, పురుషులు, ముఖ్యంగా వృద్ధులు అంతా కలిసి ఆ గదిలో ఉంటారు. అందరూ కూడా పార్కిన్సన్స్ బాధితులే. మనసును తాకుతున్న నేపథ్య ధ్వనికి అనుగుణంగా వాళ్ల చేతులు మబ్బుల్లా తేలుతాయి. చేతి వేళ్లు మృదువైన హావభావాలు అవుతాయి. పాదాలు లయకు అనుగుణంగా కదులుతాయి. గొప్ప పారవశ్యంతో మదిలోంచి జనించే ఉద్దేశపూర్వకమైన ఆంగికం (అవయవాల కదలిక)తో వారు ఒక మహా విజయాన్ని సాధిస్తారు. పార్కిన్సన్స్లో ప్రమేయం లేని కదలికలు మాత్రమే ఉంటాయి కనుక ఉద్దేశపూర్వకంగా శరీరాన్ని కదలించటం అన్నది మహా విజయమే.తప్పిన పట్టు తిరిగి వచ్చేస్తోంది‘‘ఇక్కడికి వచ్చిన వారు కొన్ని నెలల క్రితం వరకు కూడా పడిపోతామేమో అనే భయం లేకుండా నడవలేకపోయిన వారే. కానీ వారిని ఈ నృత్య చికిత్స ఎంతగానో మెరుగు పరిచింది’’ అంటారు ఐ.ఎ.డి.ఎం.టి. అధ్యక్షురాలు, ‘డ్రామా థెరపీ ఇండియా’ వ్యవస్థాపకురాలు అన్షుమా క్షేత్రపాల్. పార్కిన్సన్స్లో నాడీ వ్యవస్థ–శరీరావయవాల పరస్పర చర్యల మధ్య సమన్వయం (మోటార్ కంట్రోల్) దెబ్బతింటుంది. మానసికంగానూ పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు పట్టుతప్పుతారు. ఈ స్థితిలో వారికొక ఉనికిని, వ్యక్తీకరణ శక్తిని, మునుపటి ఆనందకరమైన జీవితంలోకి మార్గాన్ని నృత్య చికిత్స ఏర్పరుస్తుందని అన్షుమా చెబుతున్నారు. ఈ సంస్థల శాఖలు ముంబై, పుణే, బెంగళూరులలో ఉన్నాయి. నృత్యం తెచ్చే మార్పేమిటి?పార్కిన్సన్స్ మెదడు క్రియాశీలతను, డోపమైన్ కేంద్రమైన ‘బేసల్ గాంగ్లియా’ను ప్రభావితం చేస్తుంది. దాంతో స్వచ్ఛంద కదలికలు కష్టతరం అవుతాయి. కానీ మెదడు మాత్రం ‘లయ’లకు స్పందిస్తుందని అన్షుమా అంటున్నారు. ‘‘సంగీతాన్ని వింటున్నప్పుడు మెదడులో దెబ్బతినని సర్క్యూట్లు (పార్కిన్సన్స్ వల్ల దెబ్బతిన్నవి కాకుండా) వేర్వేరు నాడీ రహదారుల ద్వారా కదలికలను తెస్తాయి. నాడీ శాస్త్రపరంగా, ఈ నృత్య చికిత్స బలాల్లో ఒకటి రిథమిక్ ఆడిటరీ స్టిమ్యులేషన్ (ఆర్.ఎ.ఎస్.) ఉద్దీపన చెందటం. దీనివల్ల అవయవ సమన్వయం ఏర్పడుతుంది. డోపమైన్, ఎండార్ఫిన్ లు, సెరోటోనిన్ల వంటి న్యూరో ట్రాన్సిమీటర్ హార్మోన్లు పెరుగుతాయి. దాంతో కదలికలు మాత్రమే కాదు, మానసిక స్థితీ మెరుగుపడుతుంది’’ అని ఆమె అంటున్నారు. గర్బా నృత్యంపై తొలి ప్రయోగం గుజరాతీ సంప్రదాయ నృత్యం ‘గర్బా’పై 2024లో ప్రయోగాత్మకంగా జరిగిన అధ్యయనంలో పార్కిన్సన్స్ రోగులపై ఈ డ్యాన్స్ చక్కటి ప్రభావం చూపినట్లు వెల్లడైంది. పార్కిన్సన్స్కు చికిత్సగా నృత్య రీతుల్ని ఆశ్రయించటం 2009లో ముంబైలోని ‘పార్కిన్సన్స్ డిసీ జ్ అండ్ మూవ్మెంట్ డిజార్డర్ సొసైటీ ’ ప్రయత్నాలతో మొదలైంది.అదే సమయంలో ఆర్జెంటీనాలో టాంగో, సల్సా డ్యాన్సులు పార్కిన్సన్స్కు చికిత్స గా ఉపయోగపడతాయా అన్న దానిపై అధ్యయనం జరుగుతోంది. ఆ స్ఫూర్తితో 2010లో మన దగ్గర శా స్త్రీయ నృత్యాల చికిత్సా తరగతులు వారానికి రెండుసార్లు 3 నెలల పాటు ముంబైలో జరిగాయి. ప్రస్తుతం దేశంలోని అనేక కమ్యూనిటీ సెంటర్లు భరతనాట్యం, గర్బా, కూడియట్టంలతో చికిత్స చేస్తున్నాయి. పార్కిన్సన్స్ లక్షణాలు – కారణాలుప్రధానంగా ఇవి శారీరకమైనవి. వణుకు, బిగదీసుకుపోవటం, కదలికలు నెమ్మదించటం, భంగిమలో అస్థిరత వంటివి కనిపిస్తాయి. క్రమంగా ఆందోళన, కుంగుబాటు మొదలౌతుంది. ఎవ్వరితోనూ కలవలేక, ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అపారమైన దుఃఖం మిగులుతుంది. మెదడులో డోపమైన్ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీ కణాలు సక్రమంగా పని చెయ్యకపోవటం లేదా నశించటం పార్కిన్సన్స్కు ప్రధాన కారణం. మనిషి తను కదలాలనుకున్నట్లు కదలటానికి డోపమైన్ అవసరం. డోపమైన్ లోపించటం వల్ల కదలికలు అస్తవ్యస్తం అవుతాయి. మెదడులో డోపమైన్ ఉత్పత్తి తగ్గటానికి గల కారణాలపై పరిశోధకులింకా స్పష్టమైన నిర్ధారణకు రాలేదు. ఒక కారణం మాత్రం వృద్ధాప్యం. అరవై ఏళ్లు పైబడిన వాళ్లలో సుమారు ఒక శాతం మందికి పార్కిన్సన్స్ వచ్చే అవకాశాలున్నాయని అంచనా. డోపమైన్ను భర్తీ చేసే మందులు, మెదడు ఉద్దీపన వంటి వైద్య చికిత్సలలో పురోగతి సాధించినప్పటికీ ఫలితాలైతే అనుకున్నంతగా లేవు. రోగులు తమకు తామే వైద్యులుసాధారణ వైద్యంలా ఈ ‘డ్యాన్స్ మూవ్మెంట్ థెరపీ’ ఎవరో సూచించేది కాదు. ఎవరికి వారుగా అనుసరించేది. ఎలా కదలాలన్నదీ ఎవరూ చెప్పరు. కదిలే మార్గాలను ఎవరికి వారే అన్వేషించేలా మాత్రం ప్రోత్సహిస్తారు. నడక లేదా భంగిమను సరిదిద్దుతారు. శ్వాసపై నియంత్రణ కల్పిస్తారు.ఊహాశక్తిని, వ్యక్తీకరణను లయబద్ధం చేస్తారు. చికిత్సలో పాల్గొనే వారిలో కొంతమంది కూర్చుని నృత్యం చేస్తారు. మరికొందరు స్థిరంగా నిలబడతారు. కొందరు మరింత స్వేచ్ఛగా కదులుతారు. మొత్తానికి వాళ్లంతా రోగుల్లా కాకుండా, దేన్నో సృష్టిస్తున్నట్లుగా ఉంటారు. -
సూర్యుడిపైకి సాగర మేఘాలు
ఇది కూడా యుద్ధం వంటిదే! అయితే దేశాల మధ్య యుద్ధం కాదు. శాస్త్ర పరిశోధకులు సూర్యుడిని మసకబార్చి భూమిని చల్లబరిచేందుకు చేయబోతున్న మహా ప్రయోగ సంగ్రామం! ఈ జాజ్వల్యమాన జల వ్యూహంలో సముద్రతలం నుంచి నౌకలు, గగనతలం నుంచి విమానాలు ఉప్పు నీటి శతఘ్నులను సంధించి, తమ చెయ్యెత్తులో ఉన్న సాగర మేఘాలను చిక్కబరిచి వాటిని దట్టంగా మార్చేస్తాయి. ఆ బాహుబలి మేఘాలు, సూర్యుడి నుంచి వచ్చే తీక్షణమైన కిరణాలను అడ్డుకుని, వాటిని తిరిగి వెనక్కు అంతరిక్షంలోకి పంపిస్తాయి! వేడిమి నుంచి భూమిని కాపాడతాయి. మహోష్ణ గోళంతో మనిషి తలపడనున్న ఈ ఆపరేషనే ‘ఎంసీబీ’. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్! -సాక్షి, స్పెషల్ డెస్క్మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ అనేది ఒక జియో ఇంజనీరింగ్ టెక్నిక్. భూతాపాన్ని అరికట్టే ప్రయత్నంలో, భూ వాతావరణాన్ని ప్రభావితం చేసే పర్యావరణ ప్రక్రియలను పెద్ద ఎత్తున మార్చడమే జియో ఇంజనీరింగ్. ప్రపంచవ్యాప్తంగా, మహా సముద్రాలపై సూర్యరశ్మిని వెనక్కు పంపించేలా వాతావరణంలోకి కృత్రిమ రసాయన వాయు కణాలను చొప్పించటం, భూతాప నియంత్రణకు సముద్రపు నీటిలో కరిగి ఉన్న కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చి పారేయటం వంటి అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టుల వంటి అన్నీ జియో ఇంజినీరింగ్ వ్యూహంలో భాగమే.ఎంసీబీ ప్రయోగాన్ని ఎలా చేస్తారు?వాతావరణంలోకి ఉప్పు నీటిని ‘ఎగచిమ్మటం’ ద్వారా సముద్ర మేఘాలను కృత్రిమంగా అత్యంత ప్రకాశవంతం చేయటమే మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్. దీనివల్ల ఏర్పడే ఉప్పు నీటి వాయు బిందువులు సముద్ర మేఘాల సాంద్రతను పెంచుతాయి. ఆ మేఘాలను ఢీకొని సూర్యరశ్మి వెనక్కు (పైకి) మళ్లుతుంది. దాంతో భూమి సంగ్రహించే ఉష్ణోగ్రత తగ్గి, భూతాప నివారణ జరుగుతుంది. సముద్రపు మేఘాలు సహజంగా మహాసముద్రాలపై ఏర్పడతాయి.అందుకు సముద్రపు ఉప్పు కీలకమైన పదార్థంగా పనిచేస్తుంది. సముద్రపు ఉప్పు కణాలు గాలి ద్వారా కదిలినప్పుడు అవి మేఘ బిందువులకు కేంద్రకాలుగా మారి, నీటి ఆవిరి వాటిపై ఘనీభవిస్తుంది. ఈ మేఘ బిందువుల సంఖ్య, పరిమాణం ఒక మేఘం ఎంత సూర్యరశ్మిని తిప్పి కొడుతుందో నిర్ణయిస్తాయి. ఇదంతా సహజ ప్రక్రియ. మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ విధానంలో సముద్ర మేఘాలకు మరిన్ని సముద్రపు ఉప్పు కణాలను జోడించడం ద్వారా ఈ సహజ ప్రక్రియను అనుకరించడం, మెరుగుపరచడం జరుగుతుంది. మెరైన్ స్నో మెషీన్లను, ప్రత్యేకమైన నాళాల వంటి పరికరాలను ఉపయోగించి సముద్రపు ఉప్పు నీటిని గాలిలోకి చల్లడం ద్వారా ఈ ప్రయోగం చేస్తారు.35 ఏళ్ల ప్రయత్నాలు.. 5ఏళ్లలో ప్రయోగాలు!1990లలో తొలిసారి బ్రిటిష్ భౌతిక శాస్త్రవేత్త జాన్ లాథమ్కు ఈ ‘మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్’ ఆలోచన వచ్చింది. ప్రయోగాలకు అనుకూలమైన సముద్ర ప్రాంతాలపై మేఘాలను ప్రకాశవంతం చేయడం వల్ల భూతాపాన్ని పెరగకుండా చేయవచ్చని ఆయన తలపోశారు. ఎలాగంటే... ప్రత్యేక స్ప్రేయర్లతో వాతావరణంలోకి చిన్నపాటి సముద్రపు నీటి బిందువులను ఎగజిమ్ముతారు. ఇవి ఆవిరైపోయి ఉప్పు కణాలను మిగులుస్తాయి. ఆ కణాలు దట్టమైన, ప్రకాశవంతమైన మేఘాలను సృష్టిస్తాయి. అవి సూర్యరశ్మిని అడ్డుకుని భూమి మీద వాటి తీవ్రతను తగ్గిస్తాయి. ఇదీ జాన్ లాథమ్ ఆలోచన. ఇన్నేళ్లకు ఈ ఆలోచన ప్రయోగ దశకు చేరుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రయోగం ఆచరణలోకి రావచ్చని ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తున్న ‘ఆరియా‘ అనే బ్రిటన్ సంస్థ అంచనా వేస్తోంది.రహస్య పరిశోధనా సంస్థ ‘ఆరియా’భూతాప వేగాన్ని నెమ్మదిపరిచే లక్ష్యంతో అనేకమైన జియో ఇంజనీరింగ్ ప్రాజెక్టు పనులు చేపట్టటానికి ‘అరియా’ అడ్వాన్డ్ రీసెర్చ్ ఇన్వెషన్ ఏజెన్సీ’ ఏర్పాటైంది. ఇందుకోసం ఈ ప్రభుత్వ రహస్య పరిశోధనా సంస్థ ఇంతవరకు ప్రజా పన్నుల నుంచి 800 మిలియన్ పౌండ్లను సమకూర్చుకుంది. ఇందులో ఒక్క మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్టుకే 57 మిలియన్ పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం కేటాయించింది. అనధికారికంగా 2021 ఫిబ్రవరిలో, అధికారికంగా 2023 జనవరిలో ఈ సంస్థ ప్రారంభం అయింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే శాస్త్రీయ, సాంకేతిక పురోగతులను ఆవిష్కరించమే తన ధ్యేయం అని ఈ సంస్థ చెబుతోంది. ‘‘ఎంతో ఊహాజనితమైన, అతి కష్టతరమైన, వేరే చోట జరగటం అసంభవం అయిన పరిశోధనలను కొనసాగించడానికి మేము శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు అధికారం ఇస్తాం’’ అని అరియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలాన్ గుర్ అంటున్నారు.ఎంసీబీ ప్రయోజనాలు⇒ మెరైన్ క్లౌడ్ బ్రైటెనింగ్ భూమి గ్రహించే సూర్యరశ్మి పరిమాణాన్ని తగ్గించి భూతాపాన్ని నివారిస్తుంది. ⇒ భూగోళాన్ని చల్లబరిచి వేడిగాలులు లేకుండా, కరువు కాటకాలు రాకుండా చేయగలదు.⇒సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను తగ్గించి, పగడపు దిబ్బలు క్షీణించకుండా కాపాడుతుంది.ఎంసీబీ దుష్ప్రభావాలు⇒ వాతావరణ సమతౌల్యం, భూమికి నీటిని అందించే ‘అవపాత చక్రం’ (వర్షపు జల్లులు, మంచు, వడగళ్లు కురిసే కుదురైన వ్యవస్థ) దెబ్బతినే ప్రమాదం ఉంది.⇒ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నియంత్రించే ‘ఎల్ నినో’ గతి తప్పవచ్చు.⇒ గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు నిష్ఫలం కావచ్చు. -
బొప్పాయి.. లాభమేనోయి..
దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి సాగుతో లాభాలు సాధిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 326 హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కడియం, అనపర్తి, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. తెగుళ్లను తట్టుకునే రకాల మొక్కలను మహారాష్ట్ర నుంచి తీసుకుని వచ్చి, తోటలు వేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.బొప్పాయిలో అనేక రకాల వంగడాలున్నప్పటికీ ఎక్కువ మంది పింక్, కో–786, తైవాన్ రెడ్ లీడ్, స్వీట్ బరీ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. మొక్క వేసిన 9 నెలల్లో కాపు వస్తోంది. రెండు నుంచి నాలుగేళ్ల పాటు ఎకరాకు 30 నుంచి 40 టన్నుల చొప్పున దిగుబడి వస్తోంది. దిగుబడి బాగుంటే నాలుగేళ్ల వరకూ తోటలు ఉంటాయి. కొంత మంది రెండేళ్లకే తోటలను తొలగిస్తున్నారు. మొదటి రెండేళ్లు దిగుబడి, పండు నాణ్యత, సైజు బాగుంటాయి. ఒక్కో పండు 2 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోందని, పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.70 వేలు అవుతోందని చెబుతున్నారు. ఆరోగ్య ప్రయోజనాలు » బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. » ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. » చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. » బరువు తగ్గడానికి, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడుతుంది. » బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్–సి దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది. » విటమిన్–బి నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది. » కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ప్లేవొనాయిడ్లు, ఫోలేట్లు, పాంథోనిక్ ఆమ్లాల వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. » ఇన్ని విధాల ఆరోగ్యం కలిగించేది కావడంతో బొప్పాయి పండును ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. దిగుబడి బాగుంది నేను నాలుగెకరాల్లో బొప్పాయి పంట వేశాను. రెండు కోతలు జరిగాయి. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను కాయలకు రూ.10 వేలు లభించాయి. ప్రస్తుతం టన్ను కాయలు రూ.5 వేలు పలుకుతున్నాయి. రావులపాలెం, అమలాపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కాయలు కొనుగోలు చేసి, కోల్కతా, భువనేశ్వర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.ధర బాగుంటే మంచి ఆదాయం వస్తుంది. జూలైలో తోట వేయగా, ఫిబ్రవరిలో కాపునకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి మొక్క రూ.23 చొప్పున కొనుగోలు చేసి తెచ్చాను. ఎకరాకు 700 మొక్కలు పడతాయి. కాయ సైజు, నాణ్యత బాగున్నాయి. – కూచిపూడి రాజు, రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం కొవ్వూరు డివిజన్లో అధికం బొప్పాయి సాగు కొవ్వూరు డివిజన్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. రాజమహేంద్రవరం డివిజన్లోని కడియం, అనపర్తి ప్రాంతాల్లో అక్కడక్కడ తోటలు వేశారు. వాతావరణం అనుకూలించి, తెగుళ్లు లేకుండా ఉంటే రైతులకు ఇది లాభదాయకమైన పంట. రైతులు ఇప్పుడిప్పుడే బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. – బి.సుజాత కుమారి, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం కోల్కతా, ఒడిశాకు ఎగుమతి వేసవి అనంతరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు బొప్పాయి తోటలు వేస్తారు. నల్ల నేలలు, ఇసుక, రాతి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. రాతి నేలలు, కొండ ప్రాంతాల్లో ఈ పంట పండదు. ఏటా మార్చి నుంచి జూన్ వరకూ దిగుబడి వస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన బొప్పాయి కాయలు, పండ్లను ఒడిశా, భువనేశ్వర్, కోల్కతా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బొప్పాయి కాయలు కూరగా వండుకొని తింటూంటారు. దీంతో, ఆ ప్రాంతాలకు పచ్చి కాయలు కూడా ఎగుమతి చేస్తున్నారు. వేసవిలో పండ్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. స్థానికంగా ఉన్న పండ్ల వ్యాపారులు తోటల్లోకి వచ్చి పండు కాయలు కొనుగోలు చేస్తారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కిలో రూ.10 పలికింది. ప్రస్తుతం రూ.5 పలుకుతోంది. -
ఉరుముతున్న ఉష్ణోగ్రతలు
శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరిగిపోతుండడం, తద్వారా వాతావరణ మార్పులు సంభవిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారత్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. దేశంలో 57 శాతం జిల్లాలు అధికం నుంచి అత్యధిక హీట్ రిస్క్ కేటగిరీలో ఉన్నట్లు ఢిల్లీకి చెందిన వాతావరణ సంస్థ కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్(సీఈఈడబ్ల్యూ) వెల్లడించింది. దేశంలోని మొత్తం జనాభాలో ఏకంగా 76 శాతం మంది ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతల ముప్పును ఎదుర్కొంటున్నట్లు తేల్చిచెప్పింది.ఈ మేరకు మంగళవారం ఒక నివేదిక విడుదల చేసింది. ఢిల్లీ, మహారాష్ట్ర, గోవా, కేరళ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో హీట్ రిస్క్ అత్యధికంగా ఉన్నట్లు తెలియజేసింది. గత పదేళ్లలో అత్యధిక వేడి కలిగిన పగటి దినాల కంటే అత్యధిక వేడి కలిగిన రాత్రి దినాల సంఖ్య వేగంగా పెరిగినట్లు వివరించింది. ⇒ అధ్యయనంలో భాగంగా సీఈఈడబ్ల్యూ సంస్థ 734 జిల్లాలకు సంబంధించిన హీట్ రిస్క్ ఇండెక్స్(హెచ్ఆర్ఐ)ను అభివృద్ధి చేసింది. ఇందుకోసం 1982 నుంచి 2022 వరకు.. 40 ఏళ్ల వాతావరణ గణాంకాలు, ఉపగ్రహా చిత్రాలు ఉపయోగించుకుంది. ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితులు, జల వనరులు, భూవినియోగం, పచ్చదనం తదితర అంశాలను అధ్యయనం చేసింది. ⇒ జనాభా, భవనాలు, ఆరోగ్య, సామాజిక–ఆర్థిక అంశాలు, పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు, వాతావరణంలో తేమ వంటి అంశాలను సైతం పరిగణనలోకి తీసుకుంది. ⇒ 734 జిల్లాలకు గాను 417 జిల్లాలు హై నుంచి వెరీ హై రిస్క్ కేటగిరీల్లో ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇందులో 151 జిల్లా హై రిస్క్, 266 జిల్లాలు వెరీ హై రిస్క్ విభాగంలో ఉన్నాయి. 201 జిల్లాలు సాధారణ, 166 జిల్లాలు తక్కువ లేదా అతి తక్కువ హీట్ రిస్క్ విభాగాల్లో నిలిచాయి. ⇒ ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా ఉన్నట్లయితే దాని అర్థం వేడి వల్ల ముప్పు లేనట్లు కాదని, సీఈఈడబ్ల్యూ స్పష్టంచేసింది. ఇతర జిల్లాల కంటే కొంత తక్కువగా ఉన్నట్లు మాత్రమే భావించాలని పేర్కొంది. ⇒ దేశంలో అధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు పెరుగుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన రోజులు అంతకంటే ఎక్కువగా పెరుగుతుండడం గమనార్హం. అంటే మనుషులకు ముప్పు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నట్లే లెక్క. ⇒ ఉష్ణోగ్రతలు అత్యధికంగా మనుషులు తట్టుకోలేరు. అది ప్రమాదకరమే. శారీరకంగా, మానసికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. పల్లెలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాలు అధికంగా నమోదవుతున్నాయి. అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్టే ఇందుకు కారణం. ⇒ 10 లక్షలకుపైగా జనాభా ఉన్న జిల్లాలతోపాటు ముంబయి, బెంగళూరు, భోపాల్, జైపూర్, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో అధిక ఉష్ణోగ్రత కలిగిన రాత్రి దినాల సంఖ్య భారీగా పెరిగింది. ⇒ చల్లగా ఉండే హిమాలయా ప్రాంతాల్లోనూ అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య పెరుగుతోంది. సున్నితంగా ఉండే పర్వత ప్రాంత భౌగోళిక స్థితిగతులను ఈ పరిణామం తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ⇒ జమ్మూకశీ్మర్, లద్దాఖ్లో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన పగటి, రాత్రి రోజుల సంఖ్య 15 చొప్పున పెరిగింది. ఈ ప్రతి ఏటా వేసవిలో ఈ పెరుగుదల కనిపిస్తోంది. ⇒ ఉత్తర భారతదేశంలో వేసవి తేమ గత పదేళ్లలో 30–40 శాతం నుంచి 40–50 శాతం పెరిగింది. ⇒ అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా 2030 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాలను కోల్పోతామని, జీడీపీలో 4.5 శాత తగ్గుదల నమోదవుతుందని సీఈఈడబ్ల్యూ అధ్యయనం అంచనా వేసింది. ⇒ ఇండియాలో 2024లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా 45,000కుపైగా గుండెపోటు కేసులు నమోదయ్యాయి. 159 మరణాలు సంభవించాయి. ఇవన్నీ అధికారికంగా నమోదైన గణాంకాలే. నమోదు కానివి ఇంకెన్నో ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అద్భుత శిల్పాల మ్యూజియం
అలంపూర్: అద్భుత శిల్పాల రమణీయం పురాతన శిల్ప సౌందర్యంలోనే కన్పిస్తుంది. పురాతన ఇతిహాసాలు, గాథలు, ప్రకృతి వింతలు, విశేషాలు, రాజరికపు గుర్తులు, సిరి సంపదలు, మనుషుల వేషధారణ, సంప్రదాయం వంటి అనేక అంశాలను శిల్పులు తమ శిల్ప కళ ద్వారా భావితరాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. పురాతన చరిత్ర కలిగిన ప్రాంతాల్లో ఇలాంటి శిల్ప సంపదలు దర్శనమిస్తాయి. పురాతన ఇతిహాసాలకు, శిల్ప సౌందర్య కళకు అలంపూర్ పుట్టినిల్లుగా విరాజిల్లుతోంది. ఇక్కడ వెలసిన పురాతన ఆలయాల్లో శిల్పుల కళానైపుణ్యం పర్యాటకుల మనసులను రంజింపజేస్తాయి. అక్కడక్కడ కనిపించే శిల్పాలే పర్యాటకుల మనసులను ఆహ్లాదపరిస్తే.. అబ్బురపరిచే శిల్ప సమూహం ఒకే చోట కనిపిస్తే శిల్పాకళా ప్రేమికుల ఉల్లాసానికి అవధులుండవు. అలాంటి అద్భుత శిల్పాల సమూహం అలంపూర్ క్షేత్రం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. ఈ ప్రాంతంలో లభించిన పురాతన, అరుదైన శిల్పాలను పురావస్తు శాఖ ఒక చోట భద్రపరిచింది. అదే పురాతన శిల్పాల ప్రదర్శన క్షేత్రం. పురావస్తు మ్యూజియంగా ఏర్పాటుచేసి పర్యాటకుల సందర్శనకు అందుబాటులో ఉంచారు. 1952లో ప్రారంభం.. అలంపూర్లోని పురావస్తు ప్రదర్శనశాలను 1952లో ప్రారంభించారు. ఆలయాల పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో లభించిన శిలా శాసనాలు, విగ్రహాలు అన్నింటినీ సేకరించి సిద్ధుల మఠంగా పిలవబడే మండపంలో మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఇందులో 26 శిలా శాసనాలు, 188 శిలా విగ్రహాలు ఉన్నాయి. క్షేత్రానికి వచ్చే పర్యాటకులు మ్యూజియాన్ని సందర్శించే అవకాశం కల్పించారు. మ్యూజియంలో విశేషం ఇది.. ఉత్తరవాహిణి తుంగభద్ర నదీ తీరాన వెలసిన అలంపూర్ క్షేత్రం ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీజోగుళాంబ అమ్మవారి ఐదవ శక్తి పీఠం ఇక్కడ ఉంది. కోటి లింగాల క్షేత్రంగా అలంపూర్ ప్రసిద్ధిగాంచి.. దక్షిణకాశీగా పిలవబడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగల క్షేత్రంగా ఖ్యాతి దక్కించుకుంది. ఇక్కడ ఉన్న ఆలయాల్లో ప్రాచీన శిల్పకళకు అద్దంపట్టే శిల్పాలు పర్యాటకులను ఉల్లాసపరుస్తాయి. ఈ క్షేత్రంలో మరో అద్భుతమైన ప్రదేశం పురావస్తు ప్రదర్శనశాల. 6వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు రాజుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, వారిచే ఆరాధించబడిన దేవతా మూర్తుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. 6వ శతాబ్దంలోని బాదామి చాళుక్యుల కళాసంస్కృతికి ఇక్కడ వెలసిన శిల్పాలు నిదర్శనంగా ఉన్నాయి. 1500 ఏళ్ల క్రితం అలంకారానికి ఉపయోగించిన ఆభరణాలు, అప్పటి మహిళల వేషధారణ ఇక్కడి విగ్రహాలలో చూడవచ్చు. ఈ ప్రదర్శన శాలలో వీరాంగవీరులు (భర్త, భార్య ఇద్దరూ శత్రువులతో పోరాడి వీరమరణం పొందిన వారు), వీరుగల్లు, వీరశిలా విగ్రహాలు, వారి బల ప్రదర్శనలు నేటికీ స్పష్టంగా కనిపిస్తాయి. సతీ సహగమనానికి సంబంధించిన విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ఖ్యాతి.. అలంపూర్లో లభ్యమై పురావస్తు మ్యూజియంలో భద్రపరిచిన శిల్పాలు దేశ విదేశాల్లో ఖ్యాతిని తెచి్చపెడుతున్నాయి. ఇక్కడ ఏర్పాటుచేసిన శిల్పాలు కేవలం సందర్శనలకే గాక ప్రపంచ పురావస్తు శిల్పాల ప్రదర్శనలకు వెళ్లి అరుదైన గౌరవాలను దక్కించుకున్నాయి. 1977లో ఇక్కడి నటరాజ మూర్తి విగ్రహాన్ని లండన్లో ప్రదర్శించడం జరిగింది. అలాగే 1984లో సూర్య విగ్రహాన్ని జర్మనీలో, 2008లో సూర్య, నాగ, మహిషాసురమర్ధిని విగ్రహాలను బెల్జియంలో ప్రదర్శించగా ఖ్యాతి గడించాయి. మంత్రముగ్ధులను చేసే విగ్రహాలు.. శిల్పాచార్యులు స్థానికంగా లభించే నల్లరాతి శిలతో అందంగా నటరాజ విగ్రహాన్ని చెక్కారు. ఈ విగ్రహంలో కనిపించే శరీర సౌష్టవాలు నాట్యభంగిమలు నాట్యకళాకారులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అదే విధంగా 7–8 శతాబ్దాలకు చెందిన సూర్య విగ్రహం కూడా మెత్తటి ఎర్రఇసుక, రాతిని ఉపయోగించి తయారు చేశారు. ‘సప్తాస్వ రథసమారూఢం’అన్నట్టుగా ఏడు గుర్రాలతో ఒకే చక్రం కలిగిన రథం, ఉషా, ఛాయా సమేతంగా సూర్య విగ్రహాన్ని అందంగా మలిచి ఉన్న ఈ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక 6–7 శతాబ్దాలకు చెందిన నాగబంధ విగ్రహాన్ని పరిశీలిస్తే.. పద్మ బంధంలో ఏడు తలలు కలిగి మానవ ఆకృతిని పోలి ఉన్న నాగబంధ విగ్రహం కళాకారులను మనసు దోచుకుంటుంది. 7–8 శతాబ్దాలకు చెందిన మహిషాసురమర్దిని విగ్రహం కూడా అలనాటి దేవీభాగవతాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తుంది. అసుర సంహారం కోసం మహిషాసురిడిని సంహరించి మహిషి తలపై తాండవం చేస్తున్నట్టు ఆదిపరాశక్తి అభయముద్రలో దర్శనమిస్తుంది. అలాగే అలనాటి వైభవాన్ని చాటి చెప్పే స్తంభాలను నేటి తరాలవారిని అదరహో అనిపిస్తాయి. ఈ స్తంభంపై మలచబడిన శిల్పా ఆకృతులను పరిశీలిస్తే పట్టుచీరలపై ఉన్న బార్డర్ల డిజైన్లు తలపిస్తున్నాయి. నంది వాహనంపై శివపార్వతులు.. పరమశివుడి రూపం ఎక్కడ చూసినా లింగరూపంలోనే దర్శనమిస్తుంది. సతీ సమేతుడై ఉన్న పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనంపై ఆశీనులై దర్శనమివ్వడం అనేది చాలా అరుదు. కానీ అలంపూర్లో మాత్రం దేవతా స్వరూపంలో, అది కూడా శివుడు పార్వతీ సమేతుడై నంది వాహనంపై కూర్చుని ఉండటం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి విగ్రహం చూడాలంటే అలంపూర్ మ్యూజియానికి రావాల్సిందే. శిలాశాసనం ద్వారా తెలిసేదేమిటంటే.. ఆలయాల మనుగడ కోసం ఆనాటి రాజులు ఎన్నో భూములను మాణ్యాలుగా సమర్పించారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఈ మాణ్యాలు ఆలయాలకు చెందాల్సిందేనని.. అలాంటి మాణ్యాలను ఎవరైనా హస్తగతం చేసుకుంటే గోవధ చేసినంత పాపం వస్తుందని తెలియజేస్తూ ఆ శాసనంపై సూర్య, చంద్రులు, లింగం, ఆవు, ఖడ్గం వంటి బొమ్మలతో శిలాశాసనం చేశారు. అది హలగన్నడ లిపిలో కనిపిస్తుంది. -
చదువులకు ‘ప్రేమ్’తో..
మనదేశంలో ఆడపిల్లలు చదువుకోవాలంటే ప్రధాన సమస్య డబ్బు. ప్రాథమిక విద్య పూర్తి కాగానే.. ఆర్థిక స్థోమత లేక, పెళ్లీడు రాగానే పెళ్లిచేసి పంపించేస్తే సరిపోతుందని.. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. ఈ నేపథ్యంలో బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెట్టాయి. అయినా ఇప్పటికీ లక్షల మంది బాలికలు బడికి పోవడం లేదు. అలాంటి అమ్మాయిల ఉన్నత విద్యకు చేయూత ఇచ్చేందుకు అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ (Azim Premji Foundation) ముందుకొచ్చింది. వచ్చే మూడేళ్లలో ఏటా రూ.750 కోట్ల చొప్పున బాలికల కాలేజీ చదువుల కోసం భారీ ఎత్తున రూ.2,250 కోట్లు వెచ్చించనుంది.అజిమ్ ప్రేమ్ జీ..దేశంలోని అపర కుబేరుల్లో ఒకరు. ఆయన స్థాపించిన విప్రో కంపెనీ అంటే విలువలకు పెట్టిందిపేరు. అజిమ్ ప్రేమ్జీ అనగానే దాతృత్వం గుర్తుకొస్తుంది. 2019లో విప్రో కంపెనీలో తన వాటా 7.6 బిలియన్ డాలర్లను తన అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 2023 జనవరి వరకు సేవా కార్యక్రమాల ద్వారా రూ.2,40,000 కోట్లు ఖర్చు చేసినట్లు అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ వెల్లడించింది.కరోనా సమయంలో ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లు, ఇతర సాయం కోసం సుమారు రూ.2,000 కోట్లు ఖర్చు చేశారు. కర్ణాటకలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు 2024 నుంచి.. వారంలో నాలుగు రోజులు ఉచితంగా కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నారు. దీనిద్వారా 55 లక్షల విద్యార్థులకు గుడ్లు అందించేందుకు ఏడాదికి రూ.800 కోట్ల వ్యయం చేస్తున్నారు. చెప్పుకొంటూ పోతే ఈ జాబితా పెద్దదే. ఇంత దొడ్డ మనసున్న ప్రేమ్జీ ఫౌండేషన్ ఇప్పుడు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2.5 లక్షల మందికి.. అజిమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ పథకం ద్వారా ఎంపికైన మొత్తం 2,50,000 మంది అమ్మాయిలకు సంవత్సరానికి రూ.30వేల చొప్పున స్కాలర్షిప్ అందజేస్తారు. అంటే సంవత్సరానికి రూ.750 కోట్లు.. మూడేళ్లకు రూ.2250 కోట్లు మేర బాలికల ఉన్నత విద్య కోసం అజిమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వెచ్చించనుంది. తద్వారా దేశంలో∙లాభాపేక్షలేని సంస్థ ద్వారా అమలవుతున్న భారీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ – డీబీటీ) గా ఇది నిలవనుంది.అజిమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, 12వ తరగతి పూర్తి చేసుకున్న అమ్మాయిలు అజిమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీ లేదా యూనివర్సిటీలో రెగ్యులర్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరిన అమ్మాయిలు కూడా దరఖాస్తుకు అర్హులే. ఇలా ఆయా కోర్సులో చేరి స్కాలర్షిప్నకు ఎంపికైన విద్యార్థినులకు కోర్సు పూర్తయ్యే వరకూ ఏటా రూ.30వేల ఉపకారవేతనం అందుతుంది. ఇలా మూడేళ్ల డిగ్రీ లేదా డిప్లొమా కోర్సు పూర్తి చేసుకునే వరకూ ప్రతి విద్యార్థినికి మొత్తం రూ.90వేల ఉపకార వేతనం లభిస్తుంది. ప్రతి ఏటా సెపె్టంబర్లో ఈ స్కాలర్షిప్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందుకు అవసరమైన పత్రాలు.. పదో తరగతి, 12వ తరగతి మార్కుల పత్రాలు, డిగ్రీ లేదా డిప్లొమా కాలేజీలో అడ్మిషన్ లెటర్/బోనఫైడ్ సర్టీఫికెట్, ఫీజు రిసిఫ్ట్, పాస్పోర్టు ఫొటోలు.ప్రేమ్జీ ఫౌండేషన్విప్రో సంస్థ వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్జీ ఆధ్వర్యంలో 2001లో అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ఏర్పాటైంది. దాతృత్వ కార్యక్రమాల ద్వారా దేశాభివృద్ధిలో పాల్పంచుకోవాలనే ఆశయంతో ఏర్పాటు చేసిన లాభాపేక్షలేని సంస్థ ఇది. ఈ ఫౌండేషన్ ద్వారా విద్య, ఆరోగ్యం, జీవనోపాధి తదితర రంగాల్లో సేవలు అందిస్తున్నారు. ‘బాలికలు ఉన్నత విద్యను పూర్తి చేసుకోవాలనే లక్ష్యంతో అజిమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్లను ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి, ఇంటర్ పూర్తిచేసిన బాలికలు ఈ ఉపకార వేతనం పొందేందుకు అర్హులు. ఉన్నత విద్యను పూర్తిచేసుకోవడంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే బాలికలు అజిమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్ ద్వారా వారు తమ చదువులు కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. ఉన్నత విద్యావంతులైన మహిళలు తమ జీవితంలో సాధికారతను సాధించగలరు’అంటారు అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ సీఈవో అనురాగ్ బెహరా.https://azimpremjifoundation.org/ఉన్నత విద్యలో చేరేది మూడొంతులే..ఆర్థిక సర్వే 2024–25 ప్రకారం దేశంలోని 15 లక్షల పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 25 కోట్ల మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సగం మంది ప్రభుత్వ బడుల్లోనే చదువుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో సగటు చేరికలు (గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో) 93 శాతం ఉంటే.. ఆరో తరగతికి వచ్చేసరికి అది 77.4 శాతానికి డిపోతోంది. కేవలం 56.2 శాతం మంది మాత్రమే 12వ తరగతి పూర్తి చేసుకోగలుగుతున్నారు. అంతేకాకుండా కేవలం మూడోవంతు మంది కాలేజీ విద్యలో చేరుతున్నారు. కాలేజీల్లో చేరే వారిలో బాలురతో పోలిస్తే బాలికల సంఖ్య తక్కువే. దీనికి ప్రధాన కారణం ఆర్థిక వెనుకబాటుతనం. విప్రో సామాజిక బాధ్యత విప్రో కంపెనీ సామాజిక బాధ్యత కింద భారీ ఎత్తున అనేక కార్యక్రమాలు చేపడుతోంది. విప్రో వార్షిక నివేదిక 2023–24 ప్రకారం.. 2023–24లో ఆ సంస్థ సీఎస్ఆర్ కార్యక్రమాల కోసం రూ.17,900 కోట్లకుపైగా వెచ్చించింది. దీనిద్వారా విద్య, వైద్యం, డిజిటల్ స్కిల్లింగ్ వంటి అంశాల్లో 17 దేశాల్లోని 45 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 2020–21 నుంచి 2023–24 వరకు.. మనదేశంలో విద్యా రంగంలో 29 లక్షల మంది లబ్ధి పొందారు. ఇదే సమయంలో.. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ విభాగంలో 38 లక్షల మందికి ప్రయోజనం చేకూరింది. -
గజ రాజులకూ పేర్లుంటాయ్
సాక్షి, అమరావతి: మనం ఒకరినొకరు పేర్లతో పిలుచుకోవడం సహజం. ఇలా పేర్లు పెట్టుకుని సంబోధించుకోవడానికి మాట్లాడటం రావాలి. అందుకు ఓ భాష కూడా కావాలి. అది మనుషులకు మాత్రమే సాధ్యమనే భావన నిన్నమొన్నటి వరకు భావించేవారు. కానీ.. కొన్ని రకాల వన్యప్రాణులు కూడా మాట్లాడుకుంటాయని.. వాటికి కూడా భాష ఉంటుందని వివిధ పరిశోధనల్లో తేలింది. ఇప్పుడు అలా మాట్లాడుకునే వన్య ప్రాణుల్లో ఏనుగులు కూడా ఉన్నాయని తాజాగా గుర్తించారు. అడవుల్లో జీవించే ఏనుగులు పేర్లతో పిలుచుకుంటాయని తేలింది. అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్ మైకేల్ బార్టో నేతృత్వంలోని బృందం కెన్యాలోని ఆఫ్రికన్ ఏనుగులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది.నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ఏనుగులు చేసే రకరకాల శబ్దాలను శాస్త్రవేత్తలు రికార్డు చేసి వాటి ప్రవర్తనను గమనించారు. అవి తమ గుంపులోని ఇతర ఏనుగులను గుర్తించడానికి ప్రత్యేకమైన, తక్కువ ఫ్రీక్వెన్సీ గల శబ్దాలను (ఇన్ఫ్రా సౌండ్) ఉపయోగిస్తాయని కనుగొన్నారు. ఈ శబ్దాలు మనం పేర్లుగా భావించే వాటితో సమానమని తేలింది. ఒక ఏనుగు తన సమూహంలోని మరో ఏనుగును పిలవాలనుకుంటే ఒక నిర్దిష్టమైన శబ్దాన్ని చేస్తుంది. అది ఆ ఏనుగు మాట్లాడాలనుకున్న మరో ఏనుగుకు మాత్రమే సంబంధించిన శబ్దం అని స్పష్టమైంది. ఒక్కో ఏనుగుకు ఒక్కో ప్రత్యేకమైన శబ్దం ఉంది. ఈ శబ్దాలు కామన్గా ఇతర అన్ని జంతువులు ఒకే రకంగా చేసేలా లేకపోవడం ఈ పరిశోధనలో గుర్తించిన కీలకమైన అంశం.ఏఐ టెక్నాలజీతో శబ్దాల విశ్లేషణ శాస్త్రవేత్తలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఏనుగుల శబ్దాలను విశ్లేషించారు. పరిశోధకులు ఒక గుంపులోని ఏనుగులను గుర్తించేందుకు పేర్లు పెట్టారు. అందులో ఒక ఏనుగుకు ’మాంబా’ అని పేరు పెట్టి దాన్ని నిరంతరం గమనించారు. ’మాంబా’ ఒక నది దగ్గర నీళ్లు తాగుతుండగా, గుంపులోని మరో ఏనుగు దాన్ని పిలవడానికి ఒక ప్రత్యేకమైన గుండ్రని శబ్దాన్ని చేసింది. ఆశ్చర్యకరంగా ’మాంబా’ మాత్రమే ఆ శబ్దానికి స్పందించి తల ఎత్తి ఆ దిశగా చూసింది. మిగతా ఏనుగులు ఆ శబ్దాన్ని పట్టించుకోలేదు. దీనిద్వారా ఏనుగులు వ్యక్తిగత పేర్లను ఉపయో గిస్తాయని నిర్థారణ అయింది.అసాధారణ మేధస్సు గజరాజుల సొంతంసాధారణంగా అడవి జంతువులు ఒకే రకమైన అరుపులు, శబ్దాల ద్వారా సంభాషించుకుంటాయి. ఈ శబ్దాలన్నీ కామన్గా ఉంటాయి. ప్రత్యేకంగా ఒక్కో దానికి ఒక్కో రకమైన శబ్దాలు ఉండవు. కానీ.. ఏనుగులు ప్రత్యేకంగా మనుషుల మాదిరిగానే సంభాషించుకునేలా శబ్దాలు చేసుకోవడం కొత్త విషయం. అవి ఒక శబ్దాన్ని చేయడంతోపాటు అది ఎవరు చేశారో, ఎవరి కోసం చేశాయో కూడా గుర్తించగలుగుతున్నాయి. అంటే వాటికి బుద్ధితో ఆలోచించే సామర్థ్యం ఉన్నట్టు స్పష్టమైంది. ఏనుగులు బలమైనవే కాదు.. అసాధారణమైన మేధస్సు కలిగిన సామాజిక జీవులని తాజా అధ్యయనంలో వెల్లడైంది.డాల్ఫిన్లు, చిలుకలకు ప్రత్యేక భాషఇప్పటివరకు డాల్ఫిన్లు, చిలుకలు ఒకదాన్ని ఒకటి గుర్తించడానికి శబ్దాలను చేస్తాయని భావించేవారు. ఒక డాల్ఫిన్ తన సమూహంలోని మరో డాల్ఫిన్ చేసే స్వరాన్ని అనుకరించి దాన్ని పిలుస్తుంది. కానీ.. ఏనుగులు ప్రత్యేకమైన శబ్దాలను ఉపయోగిస్తుండటం.. అవి మనుషుల సంభాషణ పద్ధతికి చాలా దగ్గరగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఏనుగులు తమ సమూహంలో ఉన్న ఇతర ఏనుగులతో బలమైన బంధాలను ఏర్పర్చుకుంటాయి.కలిసి ప్రయాణించడం, కలిసి ఆహారం సేకరించడం, శత్రువుల నుండి ఒకదానిని మరొకటి రక్షించుకోవడం ద్వారా తమ బంధాన్ని మరింత దృఢంగా మార్చుకుంటాయి. అయితే వాటికి ఒక శబ్దాల భాష ఉన్నట్టు తాజాగా బయటపడటంతో అవి మనుషులతో చాలా దగ్గరగా ఉన్నట్టు తేలింది. ‘ఏనుగులు మనం ఊహించిన దానికంటే ఎక్కువ సంక్లిష్టతను కలిగి ఉన్నాయి. వాటి సామాజిక నిర్మాణం, సంభాషణ పద్ధతులు మనుషులతో సమానంగా ఉన్నాయి’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఒక శాస్త్రవేత్త తెలిపారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్లకు కారణాలు ఇవే..
నిర్దేశిత లోడు కంటే ఎక్కువ కరెంట్ను వినియోగించడం.. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన అంతర్గత కేబుళ్లను ఇప్పటికీ మార్చక పోవడం.. కేబుల్ సామర్థ్యానికి మించి ఎలక్ట్రికల్ పరికరాలు వాడటం.. వైర్ల మధ్య జాయింట్లు ఎక్కువగా ఉండటం.. సరఫరాలో హెచ్చుతగ్గుల సమస్య తలెత్తుతుండటం.. ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు, గీజర్లు, వాషింగ్ మెషీన్లు, మిక్సీలు, ఒవెన్లు, ఐరన్ బాక్సులు, కంప్యూటర్లు, టీవీలు, ఫ్యాన్లు, లైట్లు రోజంతా ఆన్లోనే ఉంచడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సంభవించడానికి ఇవే కారణాలు. వీటివల్లనే కేబుళ్లు హీటెక్కి, మీటర్, జాయింట్ల వద్ద నిప్పు రవ్వలు (స్పార్క్లు) చెలరేగుతున్నాయి. ఇలా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ల ఫలితంగా మాల్స్, దుకాణాలు, ఇళ్లలో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్దయెత్తున ఆస్తి నష్టం జరుగుతోంది. కొన్ని ఘటనల్లో అగ్నికీలల్లో చిక్కు కోవడం, పొగతో ఊపిరాడకపోవడం లాంటి కారణాలతో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. హైదరాబాద్లో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు లైన్లు, వైర్లు, ప్లగ్ లు, ఎంసీబీలు, ఎర్త్రాడ్ల పని తీరును పరిశీలించి, దెబ్బతిన్న కేబుళ్లను గుర్తించి, వాటి స్థానంలో కొత్తవి అమర్చుకోవాల్సి ఉన్నా వాణిజ్య, గృహ వినియోగదా రులు పట్టించుకోవడం లేదు. పాతబస్తీలోని పురాతన భవనాల్లోనే కాకుండా, కొత్తగా సీఈఐజీ అనుమతి పొందిన హైరైజ్ భవనాల్లోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు (Short Circuit) జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పాతబస్తీ అయినా.. కొత్త హైరైజ్లైనాపాతబస్తీలో ఏళ్ల క్రితం నిర్మించిన భవనాల్లోనే కాదు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి, మణికొండ, నానక్రాంగూడల్లో కొత్తగా నిర్మించే హైరైజ్ బిల్డింగ్స్లోనూ విద్యుత్ లైన్లు సరిగా ఉండటం లేదు. భవిష్యత్తు అవసరాల మేరకు లోడు ఎంపిక మొదలు..లైన్ల ఏర్పాటు వరకు అన్నీ లోపభూయిష్టంగానే ఉంటున్నాయి. భవన నిర్మాణ సమయంలో ఉన్న ఆలోచనకు, అవసరాలకు భిన్నంగా ఆ తర్వాత ఇంట్లోకి అనేక విద్యుత్ పరికరాలు వచ్చి చేరుతున్నాయి. వాణిజ్య భవనాల్లో తక్కువ సామర్థ్యంతో లైన్లు, కేబుళ్లు వేయడం జరుగుతోంది. నిర్మాణ ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కనీస అనుభవం, అర్హత లేని ప్రైవేటు విద్యుత్ కాంట్రాక్టర్లతో విద్యుత్ పనులు చేయిస్తున్నారు. వీరు భవిష్యత్తు అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలిక అవసరం కోసం లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్లు, ఎంసీబీలు వాడుతున్నారు. కంటికి కన్పించే ప్లగ్లు, స్విచ్ బోర్డులు, లైట్లు మినహా గోడలు, స్లాబులో వాడే వైర్లు నాసిరకంగా ఉంటున్నాయి. సరైన ఎర్తింగ్ ఉండటం లేదు. మరోవైపు ఒకే ప్లగ్/ వైరు నుంచి మల్టిపుల్ కనెక్షన్లు ఇస్తున్నారు. ఒకే సాకెట్ నుంచి ఒకటికి మించిన ఏసీ కనెక్షన్లు ఉంటున్నాయి. ఇలా సామర్థ్యానికి మించి ఏసీలు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు విద్యుత్ ఎక్కువగా వినియోగించడం వల్ల బలహీనంగా ఉన్న కేబుళ్లు తట్టుకోలేకపోతున్నాయి. కేబుళ్ల జాయింట్ల వద్ద స్పార్క్లు చెలరేగుతున్నాయి.పేలుతున్న ఏసీ కంప్రెషర్లుఒకప్పుడు ధనవంతుల ఇళ్లల్లో మాత్రమే కన్పించే ఏసీలు, కూలర్లు, వాషింగ్ మెషీన్లు, గీజర్లు.. ప్రస్తుతం సాధారణ మధ్య తరగతి ప్రజల ఇళ్లలోనూ దర్శనమిస్తున్నాయి. మారుతున్న జీవనశైలి ఇందుకు దోహదపడుతోంది. ప్రతిఒక్కరూ సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు తగినట్టుగా తయారీ కంపెనీలతో పాటు పలు బ్యాంకులు జీరో వడ్డీ రుణాలు ఇస్తున్నాయి. వాయిదా పద్ధతుల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు కూడా విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లోని చాలాచోట్ల 60 నుంచి 100 గజాల స్థలంలోనూ ఐదారు అంతస్తుల్లో భవనాలు నిర్మిస్తున్నారు. కొందరు కింద షాపులను ఏర్పాటు చేసి, పైన నివాసానికి వీలుగా చిన్న చిన్న గదులను నిర్మిస్తున్నారు. నివాసితులు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఏసీలూ వినియోగిస్తున్నారు. ఒక ఇంట్లోనే రెండు, మూడు ఏసీలు ఉంటున్నాయి. అయితే ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు కూడా సరిగా ఉండటం లేదు. వైరింగ్ సరిగా లేకపోవడం, సామర్థ్యానికి మించి కరెంటు వాడటం, మండే ఎండల్లో రోజంతా ఏసీలు ఆన్లో ఉంటుండటం వల్ల కంప్రెషర్లు పేలిపోతున్నాయి.బయటకు రాలేక, మంటల్లో చిక్కుకుని..కిటికీ, డోర్ కర్టెన్లు, పరుపులు, దుస్తువులకు నిప్పు అంటుకుని వేగంగా మంటలు వ్యాపిస్తున్నాయి. ఆ సమయంలో బయటికి వెళ్లేందుకు ఇరుకైన దారి ఉండటం, తలుపులకు తాళాలు వేసి ఉండటం, ఇతరత్రా కారణాలతో బయటకు వెళ్లలేక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. మొన్న అఫ్జల్గంజ్లోని మూడంతస్తుల భవనం, తాజాగా చార్మినార్ (Charminar) సమీపంలోని గుల్జార్హౌస్, మైలార్దేవ్పల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాలకు ఇలాంటి పరిస్థితులే కారణమని స్పష్టమవుతోంది.ఇలా చేస్తే సేఫ్...⇒ బీఐఎస్ ప్రమాణాలతో తయారు చేసిన ఎలక్ట్రిక్ ఉపకరణాలనే భవనాల్లో ఉపయోగించాలి. ⇒ విద్యుత్ మరమ్మతులు క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్తో మాత్రమే చేయించాలి. ⇒ అతుకుల తీగలు, లూజ్ వైరింగ్ ప్రమాదకరం. ⇒ విద్యుత్ ద్వారా నడిచే రిఫ్రిజిరేటర్, ఓవెన్లను గాలి, వెలుతురు బాగా వచ్చే చోట ఉంచాలి. ⇒ అధిక ఓల్టేజీ ఉన్న ఉపకరణాలకు ఎర్తింగ్ ఉన్న 3 పిన్ సాకెట్లను వాడాలి. ⇒ ల్యాప్టాప్, మొబైల్ చార్జింగ్ (Mobile Charging) బెడ్ దగ్గర పెట్టకూడదు. ⇒ విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే నీళ్లతో ఆర్పవద్దు. దీని వల్ల కరెంట్ షాక్ తగిలి ప్రాణాపాయం కలగొచ్చు. ⇒ వెంటనే విద్యుత్ను ఆఫ్చేసి, పొడి ఇసుకతో లేదా కార్బన్ డయాక్సైడ్ ఎక్ట్సింగ్విషర్తో మంటలను ఆర్పాలి.చదవండి: పాతబస్తీ ప్రమాదంలో విస్తుపొయే విషయాలు.. అక్రమ కనెక్షనే కారణమా?⇒ ఎత్తయిన భవన నిర్మాణాలకు స్థానిక అగ్నిమాపకశాఖ అధికారి నుంచి అనుమతి తప్పనిసరి. హైడ్రెంట్లు, ఫైర్ ఎగ్జిట్లు, స్ప్రింక్లర్లు, పంప్ రూమ్ వంటివి ఏర్పాటు చేయాలి. ⇒ ప్రతి అంతస్తులో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, భద్రతపై సైన్ బోర్డులు ప్రదర్శించాలి. స్మోక్ అలారం (Smoke Alarm) ఏర్పాటు చేయడంతోపాటు ఏటా భద్రతా తనిఖీలు నిర్వహించాలి. ⇒ ప్రతి అంతస్తులో ఫైర్ ఎక్ట్సింగ్విషర్లు ఉండాలి. మూడు నెలలకోసారి ఫైర్ డ్రిల్స్ నిర్వహించాలి. ⇒ అగ్నిప్రమాదాలు జరిగితే కంగారుపడకుండా ఫైర్ అలారం మోగించి అప్రమత్తం చేయాలి. లిఫ్టులకు బదులు మెట్ల మార్గాన్ని వినియోగించాలి. ⇒ మంటలు ఎక్కువగా ఉన్న సమయంలో నడవకుండా ముఖానికి గుడ్డ కప్పుకొని, పాకుతూ అక్కడి నుంచి బయటికి రావాలి. ⇒ మంటల్లో చిక్కుకుంటే బిగ్గరగా అరుస్తూ, చేతి రుమాలును కిటికీ లేదా బాల్కనీ నుంచి ఊపుతూ బయట ఉన్న వాళ్లకు సమాచారం ఇవ్వాలి. -
Operation Smiling Buddha: బుద్ధుడు నవ్విన వేళ
51 ఏళ్ల క్రితం. 1974 మే 18. ఆ రోజు థార్ ఎడారిలోని ఇసుక మేటల్లో పుట్టిన ‘భూకంపం’ యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ’ పేరుతో రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ తొలి అణుపరీక్ష నిర్వహించింది. శాస్త్ర సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది. ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాల తర్వాత అణుపరీక్ష చేసిన తొలి దేశంగా అవతరించింది. పోఖ్రాన్–1 న్యూక్లియర్ టెస్ట్గా పిలిచే ఈ ప్రయోగాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలో అత్యంత రహస్యంగా చేపట్టారు.ఏ దేశాలు వ్యతిరేకించాయి? అణుబాంబుల బాధిత దేశమైన జపాన్ మొట్టమొదట ఈ పరీక్షలను తీవ్రంగా ఖండించింది. భారత్పై కఠిన ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. ఆ్రస్టేలియా సైతం ఇదే పాట పాడింది. రెండ్రోజుల తర్వాత జరిగిన ఐరాస నిరాయుదీకరణ సమావేశంలో ఆ్రస్టేలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ‘‘ అణుబాంబురహిత అవని కోసం అంతా ఎదురుచూస్తుంటే పేలుళ్లతో అందరి ముఖం మీద భారత్ చెంప వాచిపోయేలా కొట్టింది’’ అని ఆ్రస్టేలియా ప్రతినిధి జాన్ క్యాంప్బెల్ వ్యాఖ్యానించారు. ద.కొరియా, మలేసియా, న్యూజిలాండ్ సైతం ఇలాగే స్పందించాయి.అమెరికా కన్నుగప్పి...1974 ప్రయోగంలో అణు విచ్చిత్తి సిద్ధాంతంతో తయారైన అణుబాంబును పరీక్షించారు. అత్యధిక పీడనం, ఒత్తిడితో అత్యల్ప పరిమాణంలోకి ఇమిడ్చిన ప్లుటోనియంను పేలేలా చేశారు. కేంద్రక విచ్చిత్తిలో బరువైన ఫ్లుటోనియం అణువులోని కేంద్రకం రెండు చిన్న కేంద్రకాలుగా విడిపోతుంది. ఆ క్రమంలో అత్యధిక ఉష్ణశక్తి వెలువడుతుంది. ఆ క్రమంలో జరిగే భారీ విస్ఫోటం పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా వేసిన అణుబాంబులు ఈ రకానివే. ఈ ప్రయోగం కోసం కోసం ముంబై సమీపంలోని కెనడా ఇండియా రియాక్టర్ యుటిలిటీ సర్వీసెస్ (సిరస్) నుంచి తెప్పించిన ఆరు కిలోల ప్లుటోనియం వాడారు. అది పేలడానికి పొలోనియం–బేరియం పేలుడు పదార్థాన్ని జతచేశారు. దాన్ని పేల్చే వ్యవస్థను చండీగఢ్, పుణెల్లో అభివృద్ధిచేశారు. షట్కోణాకృతిలోని 1,400 కిలో బాంబు అమెరికా నిఘా కంటికి చిక్కకుండా ఇసుకతో కప్పేసి రైలు మార్గాన థార్కు తరలించారు!చాన్నాళ్ల క్రితమే బీజం అణుబాంబు తయారీ కోసం భారత్ 1967 నుంచే విస్తృత పరిశోధనలు మొదలు పెట్టింది. ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త రాజా రామన్న సారథ్యంలో పీకే అయ్యంగార్, రాజగోపాల చిదంబరం వంటి 75 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అణుబాంబు తయారీలో తలమునకలయ్యారు. 1972 సెపె్టంబర్ 7న ప్రధాని ఇందిర బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్)ను సందర్శించారు. అణుపరీక్షపై ముందుకెళ్లాలని శాస్త్రవేత్తల బృందానికి దిశానిర్దేశం చేశారు. ప్రయోగానికి ఒక రోజు ముందు, అంటే 1974 మే 17న రాజా రామన్నకు ఇందిర ఫోన్ చేశారు. ‘‘డాక్టర్ రామన్నా! ఇక మనమేంటో చూపిద్దాం. మనం చేసే పని దేశానికి ఎంతో మేలు చేకూరుస్తుంది’’ అన్నారు. ఆ మర్నాడు జరిగిన అణుపరీక్షకు పోఖ్రాన్ టెస్ట్ రేంజ్లోని ఇండియన్ ఆర్మీ బేస్ వేదికైంది. అణుపరీక్ష అత్యంత శాంతియుతంగా జరిగిందని విదేశాంగ శాఖ ప్రకటించింది. ప్రపంచదేశాలు మాత్రం భారత్ అణ్వస్త్ర వ్యాప్తికి పాల్పడుతోందని కుతకుతలాడాయి. మనపై ఆంక్షల కత్తి దూశాయి.ఆ మీట నొక్కిందెవరు?మే 18 ఉదయం 8.05 గంటలకు శాస్త్రవేత్త ప్రణబ్ రేబతిరంజన్ దస్తీదార్ ఫైరింగ్ బటన్ నొక్కారు. ‘‘బటన్ను నొక్కేందుకు అంతా ఆసక్తి చూపారు. దాంతో ట్రిగ్గర్ తయారీలో కీలకపాత్ర పోషించిన ప్రణబ్కే చాన్సివ్వాలని నిర్ణయించాం’’ అని రాజా రామన్న తన ‘ఇయర్స్ ఆఫ్ పిల్గ్రిమేజ్’ పుస్తకంలో వెల్లడించారు. నాడు బార్క్ గ్రూప్ డైరెక్టర్గా ఉన్న ప్రణబ్ తర్వాత ఐరాస అణుఇంధన సంస్థ డైరెక్టర్గా చేశారు. భారత తొలి దేశీయ అణుఇంధన జలాంతర్గామి తయారీలో కీలకపాత్ర పోషించారు.‘స్మైలింగ్ బుద్ధ’ ఎందుకు? 1974లో బుద్ధ పూరి్ణమ మే 18న వచి్చంది. అందుకే ప్రయోగానికి ఇందిర ఆ పేరు పెట్టారు. ఆ మేరకు సైంటిస్ట్ రాజా రామన్నకు రహస్య సందేశం పంపారు. ప్రయోగం విజయవంతం అయ్యాక ‘ఎట్టకేలకు బుద్ధుడు నవ్వాడు’ అంటూ ఆయన ఇందిరకు మెసేజ్ పంపారు.1998లో పోఖ్రాన్–2 అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో రెండు దశాబ్దాల పాటు భారత్ అణుపరీక్షలకు దూరంగా ఉంది. ఆ సమయంలో పుష్కలంగా కూడగట్టుకున్న అణు సాంకేతికతను జోడించి 1998లో ‘ఆపరేషన్ శక్తి’ పేరిట మళ్లీ అణుపరీక్షలకు దిగింది. దీన్నే పోఖ్రాన్–2 అని కూడా అంటారు. అప్పుడూ మే లోనే ప్రయోగం జరగడం విశేషం. అమెరికా నిఘా సంస్థ సీఐఏ కళ్లుగప్పి మే 11న థార్ ఎడారిలో మరోసారి దిగి్వజయంగా ప్రయోగం నిర్వహించింది. అణు, హైడ్రోజన్ బాంబులను ఏకకాలంలో పేలి్చంది. రెండు రోజులకు మే 13న మరో రెండు అణుబాంబులను పేల్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రగర్భంలో పెను విస్ఫోటం!
అగ్నిపర్వతం బద్దలైనప్పుడు నిప్పులు చిమ్ముతూ లావా నింగిలోకి ఎగసిపడటం, విపరీతంగా ధూళి సమీప గ్రామాలపై దుమ్ము దుప్పటి కప్పేయడం టీవీల్లో చూసే ఉంటారు. వీటికి పూర్తిభిన్నమైన అగ్నిపర్వతం అతి త్వరలో బద్దలుకానుందని ఖగోళ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఆస్టోరియా నగర తీరానికి 300 మైళ్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రం లోపల ఈ అగ్నిపర్వతం దాగి ఉంది. దీని పేరు యాక్సియల్ సీమౌంట్. భూ ఉపరితలం మీద కాకుండా పసిఫిక్ మహాసముద్రం ఉపరితలానికి 1.4 కిలోమీటర్ల లోతులో ఉండటమే ఈ అగ్నిపర్వతం ప్రత్యేకత. ఎందుకంత ప్రత్యేకత? ఈ అగ్నిపర్వతం రెండు భూ పలకలు ఢీకొనే చోట ఏర్పడింది. పసిఫిక్ భూ పలక, జువాన్ డీ ఫ్యూకా భూ పలకలు తరచూ అత్యంత స్వల్పంగా కదులుతుంటాయి. ఈ క్రమంలో ఇవి పరస్పరం తగులుతూ భూమి ఉపరితల పొరల కదలికలకు కారణం అవుతున్నాయి. వీటి సమీపంలో ఉన్న ఈ అగ్నిపర్వతం త్వరలో బద్దలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీలోని హ్యాట్ఫీల్డ్ మెరైన్ సైన్స్ సెంటర్లో పరిశోధకుడైన బిల్ చాడ్విక్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘భూకేంద్రంలో ద్రవరూపంలోని శిలలు అగ్నిపర్వతం ద్వారా బయటకు వస్తాయి. ఈ శిలాద్రవం (మాగ్మా) వెంటనే సముద్ర జలాలకు తగిలి చల్లబడుతుంది. ఈ క్రమంలో అక్కడి సముద్ర జలాలు వేడెక్కుతాయి’’ అని చాడ్విక్ చెప్పారు.వేల కొద్దీ భూకంపాలు! ‘‘అగ్నిపర్వతం ఎత్తు కేవలం 3,300 అడుగులు. కానీ అత్యంత క్రియాశీలంగా తయారైంది. ఇటీవలికాలంలో శిలాద్రవం బయటికొచ్చే అవకాశాలు ఎక్కువయ్యాయి. భూమి కంపిస్తోంది. అగ్నిపర్వతం తాజా స్థితిని తెల్సుకునేందుకు మేం సమీప ప్రాంతం దాకా కేబుల్ వ్యవస్థ ద్వారా భూకంప తీవ్రతలను కనిపెట్టే ఏర్పాట్లుచేశాం’’ అని ఆయన చెప్పారు. ‘‘ అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు భూమి వందల సార్లు కంపిస్తుంది. ఇక అగ్నిపర్వతం బద్దలైన సందర్భాల్లో వేల సార్లు కంపిస్తుంది. 2015 ఏప్రిల్లో చివరిసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు విపరీతంగా శిలాద్రవం బయటకు ఎగజిమ్మింది. అప్పుడు 24 గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో 10,000 చిన్నపాటి భూకంపాలు వచ్చాయి. ఈసారి కూడా అదే స్థాయిలో భూమి కంపించే వీలుంది’’ అని ‘యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ ఓషనోగ్రఫీ’లో మెరైన్ జియోఫిజిసిస్ట్, ప్రొఫెసర్ విలియం విల్కుక్ స్పష్టంచేశారు. జీవవైవిధ్యానికి బాసట అగ్నిపర్వతం బద్దలైనప్పుడు భారీ స్థాయిలో శిలాద్రవం మహాసముద్రజలాల్లో కలిసిపోతుంది. ఈ శిలాద్రవంలో ఎన్నో రకాల మూలకాలు ద్రవరూపంలో ఉంటాయి. ఇవన్నీ సముద్రజలాల్లో సమ్మిళితమై అక్కడి సూక్ష్మజీవులకు ఆహారంగా మారతాయి. ఈ సూక్ష్మజీవులపై ఆధారపడిన చిన్న జలచరాలు, వాటిని ఆహారం తీసుకునే చేపలు.. ఇలా ఆహార చక్రం సదా సవ్యంగా కొనసాగేందుకు అగ్నిపర్వతం పరోక్షంగా సాయపడుతోంది. అత్యంత వేడితో సెగలు కక్కే మాగ్నా సముద్ర ఉపరితలానికి ఎగసిపడగానే అక్కడ జీవులు కొన్ని చనిపోయినా తర్వాత మాత్రం అక్కడ జీవరాశి పెరుగుదలకు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో జీవం మనుగడకు అగ్నిపర్వతాలు సైతం తమ వంతు సాయం చేస్తున్నాయని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో మెరైన్ జియోలజీ, జియోఫిజిక్స్ విభాగ ప్రొఫెసర్ డెబీ కెల్లీ వ్యాఖ్యానించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
హరిత హైడ్రోజన్.. కాలుష్యానికి సొల్యూషన్
వేగంగా జరుగుతున్న పట్టణీకరణ కారణంగా 2050 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు నగరాల్లో నివసిస్తారని అంచనా. పట్టణాలు వృద్ధి చెందడం ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యం వంటి సవాళ్లూ వస్తాయి. ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రస్తుతం విద్యుత్ వాహనాల వినియోగం కనిపిస్తోంది. భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనం తోడవ్వనుంది. ఇది కాలుష్యాన్ని మరింత తగ్గించి, స్వచ్ఛ భారత్ సాధనకు కారకమవుతుందని ఇంధన, వాహన రంగ తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 2050 నాటికి ప్రపంచంలో నడిచే వాహనాల్లో 16 శాతం హైడ్రోజన్తోనే ఉంటాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా వేస్తోంది.ప్రపంచంలో అత్యధిక కాలుష్యం గల టాప్–5 దేశాల్లో ఇండియా ఉంది. మన దేశంలో 2008 నుంచి 2019 వరకూ, గాలిలో ఉండే పీఎం 2.5 కణాలు 10 ప్రధాన నగరాల్లో ఏటా దాదాపు 30 వేల మరణాలకు కారణమయ్యాయి. ఇది మొత్తం మరణాలలో 7.2 శాతమని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో ఏటా ముంబైలో మరణించినవారు 5,100, కోల్కతాలో 4,678, చెన్నైలో 2,870 మంది. తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, పుణే, వారణాసి, సిమ్లా, ఢిల్లీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా విద్యుత్ వాహనాల (ఈవీ)కు డిమాండ్ పెరిగింది.దూసుకొస్తున్న హైడ్రోజన్2023 నాటికి, ప్రపంచ రోడ్లపై 4 కోట్ల ఈవీలు ఉన్నాయి. ఇది 2022లో సంఖ్య కంటే 35 శాతం ఎక్కువ. మనదేశంలో 2024లో ఏకంగా 20.22 లక్షల ఈవీల అమ్మకాలు జరిగాయి. ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా వస్తున్నవే ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వాహనాలు (ఎఫ్సీఈవీ). ఇవి హైడ్రోజన్ సాయంతో నడుస్తాయి. ఐఈఏ గణాంకాల ప్రకారం 2023 నాటికి ప్రపంచంలో హైడ్రోజన్ డిమాండ్ 9.7 కోట్ల టన్నులకు చేరింది. 2022తో పోలిస్తే ఇది 2.5 శాతం ఎక్కువ. నీటిని విద్యుత్ విశ్లేషణ (ఎలక్ట్రాలసిస్) ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టవచ్చు.సౌరశక్తి వంటి పునరుత్పాదక వనరులతో ఉత్పన్నమయ్యే విద్యుచ్ఛక్తితో నీటిని విభజిస్తే గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. అలా కాకుండా బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి వాటితో ఉత్పన్నమయ్యే విద్యుత్తుతో నీటిని విభజిస్తే బ్లూ, గ్రే హైడ్రోజన్లు ఉత్పన్నమవుతాయి. ఈ ప్రక్రియలోనూ కర్బన ఉద్గారాలు వెలువడతాయి. గ్రీన్ హైడ్రోజన్ అలా కాదు, స్వచ్ఛమైన ఇంధనం. ముఖ్యంగా ఎరువులు, చమురు శుద్ధి, ఉక్కు, రవాణా వంటి రంగాల్లో అత్యధిక కర్బన ఉద్గారాలు వెలువడతాయి. ఈ రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్ వాడితే ఆ మేరకు అవి తగ్గుతాయి.అధిక ధర, నిర్వహణ ఖర్చులుహైడ్రోజన్ వాహనాలు తేలిగ్గా ఉంటాయి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించగలవు. కేవలం 5 నుంచి 15 నిమిషాల్లో ఇంధనం నింపుకోగలవు. ముఖ్యంగా దూర ప్రయాణం, వర్షం, తీవ్రమైన చలిలోనూ దూసుకుపోగలవు. అయితే, ప్రస్తుతం ఈ వాహనాలు చాలా తక్కువగా.. ప్రపంచవ్యాప్తంగా 93 వేలే ఉన్నాయి. దీనికి కారణం వాటి అధిక ధర, నిర్వహణ ఖర్చులు. డీజిల్ బస్సులకు కిలోమీటర్కు నిర్వహణ ఖర్చు దాదాపు రూ.23.06 అవుతుంది. ఎలక్ట్రిక్ బస్సులకు రూ.14.52 ఖర్చవుతుంది. విద్యుత్ వాహనాల కొనుగోలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మేరకు నిర్వహణ భారం తగ్గుతుంది. కానీ హైడ్రోజన్ బస్సులు నడపడానికి చాలా ఖర్చవుతుంది. సహజ వాయువు నుంచి ఉత్పత్తి చేసిన బ్లూ హైడ్రోజన్ వాహనానికి కిలోమీటర్కి రూ.71.73 ఖర్చవుతుంది. గ్రీన్ హైడ్రోజన్ అయితే కిలోమీటర్కు రూ.77.69 ఖర్చవుతుంది. సాంకేతికత మెరుగుపడటంతో రెండింటి ధరలు 2030 నాటికి సమానమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.స్టీల్, వాహన రంగాల్లో..స్టీల్ ఉత్పత్తిని గ్రీన్ హైడ్రోజన్తో చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం 7 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. 2029–30 వరకు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా స్టీల్ ఉత్పత్తి చేసేందుకు రూ.455 కోట్లతో పైలట్ ప్రాజెక్టులను కేంద్ర స్టీల్ శాఖ అమలుచేస్తోంది. రవాణా రంగంలో 5 పైలట్ ప్రాజెక్టులు మంజూరు చేశారు.గ్రీన్ హైడ్రోజన్ మిషన్గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వాడకం, ఎగుమతుల్లో మనదేశాన్ని గ్లోబల్ హబ్గా రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ హైడ్రోజన్ మిషన్ (జీహెచ్ఎమ్) అమలు చేస్తోంది. దీని ప్రకారం ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయగలిగితే శిలాజ ఇంధనాల దిగుమతులను భారీగా తగ్గించుకోవచ్చు. ఫలితంగా 2030 నాటికి రూ.లక్ష కోట్లు ఆదా చేయొచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం వల్ల ఏటా 5 కోట్ల టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాలనూ తగ్గించుకోవచ్చు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు కేంద్రం ప్రోత్సాహకాలూ ఇస్తోంది.వైఎస్ జగన్ హయాంలో...ఆంధ్రప్రదేశ్లో తిరుపతి రాక్మ్యాన్ ఇండస్ట్రీస్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏర్పాటుచేసిన మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఈ ఏడాది మార్చిలోనే ఉత్పత్తి ప్రారంభించింది. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో భాగంగా అప్పటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ ఏపీలో హరిత ఇంధన రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనిద్వారా తొలి విడతలో 25 టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తారు. రానున్న కాలంలో 54 టన్నులకు పెంచనున్నారు. దీని ద్వారా ఏడాదికి 206 టన్నుల కార్బన్డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపుతోపాటు వాతావరణంలోకి ఏడాదికి సుమారు 195 టన్నుల ఆక్సిజన్ విడుదల అవుతుంది. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనే.. ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ఎన్టీపీసీతో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. సుమారు రూ.లక్ష కోట్లతో అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తొలి విడత పనులు 2026 నాటికి, మొత్తం 2030 నాటికి పూర్తవుతాయి. అలాగే గత ప్రభుత్వ హయాంలోనే హెచ్పీసీఎల్, ఓఎన్జీసీ వంటి సంస్థలు కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.గ్రీన్ హైడ్రోజన్ రైలుపూర్తి దేశీయ పరిజ్ఞానంతో హైడ్రోజన్తో నడిచే రైలును రైల్వే శాఖ తయారుచేసింది. మిగతా దేశాలు 500 నుంచి 600 హార్స్ పవర్ ఇంజిన్ మాత్రమే రూపొందిస్తే.. మనదేశం ఏకంగా 1,200 హెచ్పీ ఇంజిన్ తయారుచేయగలిగింది. ప్రపంచంలో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా మాత్రమే ఇలాంటి ఇంజిన్లు తయారుచేశాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన (10 కోచ్లు) రైలు ఇదే. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం (2,400 కిలోవాట్లు) ఉన్న రైలు కూడా ఇదే. హరియాణాలోని జింద్ – సోనిపట్ మధ్య ఈ రైలు నడవనుంది.ఉత్పత్తి వ్యయం ఎక్కువే..: ఒక కేజీ బ్లూ లేదా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి గరిష్ఠంగా 2.4 డాలర్ల వరకు ఖర్చవుతుంది. అదే కేజీ గ్రీన్ హైడ్రోజన్ తయారీకి దాదాపు 5.5 డాలర్లు వెచ్చించాలి. గ్రే హైడ్రోజన్ ఉత్పత్తితో పోలిస్తే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి వల్ల.. ప్రతి కేజీకి 10 కిలోల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయి.గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా చేపట్టే ప్రాజెక్టుల ద్వారా రూ.8 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు, 6 లక్షలకుపైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా.తెలంగాణలోనూ..తెలంగాణ కూడా 2029–30 నాటికి 418 కిలోటన్నులు, 2034–35 నాటికి 554 కిలోటన్నుల వార్షిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ – 2025లో వెల్లడించింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలూ ప్రకటించింది. -
మీ పెట్టుబడి బంగారం గాను!
ఒకవైపు ఈక్విటీలు, క్రిప్టోలు అస్థిరతలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్ నీరసించింది. ఇదే కాలంలో బంగారం సైలెంట్గా ర్యాలీ చేయడం చూశాం. ఈక్విటీలు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, అన్ని కాలాల్లోనూ అత్యుత్తమైన పెట్టుబడి సాధనం ఏదంటే..? అది బంగారమే. ఈ అర్థంలోనే దీన్ని ‘గోట్ అసెట్’గా చెబుతారు. గడిచిన రెండేళ్లలోనే కాదు.. గత రెండు దశాబ్దాల్లోనూ ఈక్విటీలకు మించి రాబడులను అందించిన పసిడిని ప్రతీ ఇన్వెస్టర్ తన పోర్ట్ఫోలియోలో చేర్చుకోవడం మంచి నిర్ణయంగా నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడులకు రిస్క్ తగ్గించుకుని, వైవిధ్యం కోసం, రాబడుల స్థిరత్వం కోసం తప్పకుండా పుత్తడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనంటున్నారు.భారతీయుల్లో ఎక్కువ మంది బంగారాన్ని ఆభరణంగా, విలువైన సాధనంగానే చూస్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో పెట్టుబడుల పరంగానూ బంగారానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అస్థిరతల్లో సురక్షిత సాధనంగా పసిడికి గుర్తింపు ఇప్పుడు వచ్చింది కాదు. చారిత్రకంగా ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే సెంట్రల్ బ్యాంక్లు (ఆర్బీఐ, ఇతరత్రా) రిజర్వ్ అసెట్గా బంగారానికి ఈ మధ్యకాలంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎడాపెడా కొనుగోలు చేస్తున్నాయి. దీనికితోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పెరిగిపోవడం.. అంతర్జాతీయ వాణిజ్యం పరంగా రక్షణాత్మక ధోరణులు పెరిగిపోతున్న తరుణంలో పసిడి మరింత బలాన్ని సంతరించుకుంది. కనుక ప్రతి ఒక్కరి పెట్టుబడులకు పుత్తడి వన్నెతెస్తుందనేది నిపుణుల మాట. రాబడుల చరిత్ర.. గత 25 ఏళ్ల కాలంలో పసిడి ఎస్అండ్పీ 500తోపాటు నిఫ్టీ–50ని మించి రాబడులను ఇచ్చినట్టు ఈక్విటాస్ ఇన్వెస్ట్మెంట్స్ చెబుతోంది. 2000 సంవత్సరం నుంచి చూస్తే బంగారం డాలర్ మారకంలో 10 రెట్లు పెరిగింది. ఇదే కాలంలో ఎస్అండ్పీ 500 రాబడులు నాలుగున్నర రెట్లుగా ఉన్నాయి. రూపాయి మారకంలో చూసినా బంగారం గత 25 ఏళ్లలో 20 రెట్లు పెరగ్గా.. సెన్సెక్స్ ఇదే కాలంలో 16 రెట్లు ప్రతిఫలాన్నిచ్చింది. ఇక గత 15 ఏళ్లలో చూస్తే బంగారం ఏటా 12 శాతం రాబడులను సగటున ఇచ్చింది. ఇదే కాలంలో సెన్సెక్స్ రాబడి ఏటా 10–11 శాతం మధ్య ఉందన్నది ఈక్విటాస్ ఇన్వెస్ట్మెంట్స్ విశ్లేషణ. ‘‘2000 నుంచి నిఫ్టీ కంటే బంగారమే అధిక రాబడిని ఇచ్చింది. గోల్డ్ సీఎఫ్డీలు (ఫ్యూచర్ కాంట్రాక్టులు) 2,000 శాతం పెరగ్గా.. నిఫ్టీ–50 సూచీ రాబడి 1470 శాతంగా ఉంది’’ అని జెరోదా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ ఎక్స్ ప్లాట్ఫామ్లో చేసిన పోస్ట్లో వివరించారు. పెట్టుబడిలో పుత్తడికి వాటా పెట్టుబడుల్లో వైవిధ్యం దృష్ట్యా కొంత మొత్తాన్ని పసిడిలోనూ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మెజారిటీ నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 10 నుంచి 15 శాతం వరకు బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చని క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ చిరాగ్ మెహతా సూచించారు. పసిడే కాదు, వెండి కూడా దీర్ఘకాలంలో పెట్టుబడులను వృద్ధి చేస్తుందని స్టాక్స్కార్ట్ (డిస్కౌంట్ బ్రోకర్) సీఈవో ప్రణయ్ అగర్వాల్ అభిప్రాయం. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5–8 శాతం వరకు పసిడి, వెండికి కేటాయించుకోవచ్చని సూచించారు. ‘‘బంగారం ఒక ప్రత్యామ్నాయ సాధనం. కొత్త రిజర్వ్ కరెన్సీ అని, డాలర్లను భర్తీ చేస్తుందని ఎక్కడో చదివాను. అదే జరిగితే రూ.90,000 ధరకు అర్థమే లేదు’’ అని మార్కెట్ నిపుణుడు సునీల్ సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. రిజర్వ్ కరెన్సీగా మారితే అప్పుడు బంగారం ఇంకా పెరగొచ్చన్నది ఆయన ఉద్దేశం. ఆర్బీఐ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటా 2024 సెప్టెంబర్ చివరికి 9.32 శాతంగా ఉంటే, 2025 మార్చి నాటికి 11.70 శాతానికి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కేంద్ర బ్యాంక్లు ఇదే మాదిరి బంగారం నిల్వలు పెంచుకుంటున్నాయి.అన్ని కాలాల్లోనూ అత్యుత్తమం ఎందుకు? సురక్షిత సాధనం: ఆర్థిక సంక్షోభాలు, అనిశి్చతులు, యుద్ధాల వంటి పరిస్థితుల్లో బంగారానికి డిమాండ్ ఏర్పడుతుంది. ఆ సమయంలో ఇందులోకి అధిక పెట్టుబడులు రావడంతో పసిడి మరింత విలువను సంతరించుకుంటుంది. అలాంటి సంక్షోభాల్లో ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అమ్మకాల ఒత్తిడికి గురవుతుంటాయి. తాజా డిమాండ్ వెనక్కి వెళుతుంది. స్టోర్ ఆఫ్ వ్యాల్యూ: పసిడిని బీరువాలో ఉంచినా.. బ్యాంక్ లాకర్లో ఉంచినా కొంత కాలానికి దాని విలువ పెరిగేదే కానీ తరిగేది కాదు. అందుకే దీనికి స్టోర్ ఆఫ్ వ్యాల్యూ గుర్తింపు. అదే మిగిలిన పెట్టుబడులకు ద్రవ్యోల్బణం సెగ ఉంటుంది. పరిమిత సరఫరా: బంగారం ఉత్పత్తి ఏటేటా పెరిగేది కాదు. బంగారం మైనింగ్ అత్యంత సంక్లిష్టమైనది. దీని సరఫరా స్థిరంగానే ఉంటుంది. కానీ, డిమాండ్ మాత్రం ఏటేటా పెరుగుతోంది. ఈ డిమాండ్ పసిడి ధరలకు మద్దతుగా నిలుస్తుంది. వైవిధ్యం: పెట్టుబడులు అన్నీ ఒకే చోట ఉంటే.. ఆ విభాగంలో సమస్యాత్మక పరిస్థితులు ఏర్పడితే.. విలువకు నష్టం కలుగుతుంది. అందుకే పెట్టుబడులకు వైవిధ్యం కూడా అవసరమే. ఈ విషయంలో పుత్తడి ఒక ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనం. చిటికెలో రుణం: బంగారం కాయిన్లపై (బ్యాంకుల్లో కొనుగోలు చేసిన వాటికే ఇవ్వాలన్నది ఆర్బీఐ తాజా ప్రతిపాదన), ఆభరణాలపై 9–10 శాతం మేర వార్షిక వడ్డీపై బ్యాంకుల నుంచి సులభంగా రుణం లభిస్తుంది. పెట్టుబడి సాధనాలు.. బంగారంలో పెట్టుబడి భౌతికం కంటే డిజిటల్గానే సౌకర్యంగా ఉంటుంది. డిజిటల్ సాధనాల్లో గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ను ఇన్వెస్టర్లు పరిశీలించొచ్చు. ఎంఎంటీసీ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఫిన్టెక్ ప్లాట్ఫామ్లు డిజిటల్ గోల్డ్ను రూపాయి నుంచి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్లు ఇవి స్టాక్ ఎక్సే్ఛంజ్ల్లో రోజువారీ ట్రేడ్ అవుతుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలే వీటిని నిర్వహిస్తుంటాయి. షేర్ల మాదిరే ఏ పనిదినంలో అయినా కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. డీమ్యాట్ ఖాతా అవసరం. ఇందులో పెట్టుబడి విలువపై ఫండ్ సంస్థకు ఎక్స్పెన్స్ రేషియో, కొనుగోలుపై బ్రోకర్లకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఒక గోల్డ్ ఈటీఎఫ్ ధర గ్రాము బంగారం మార్కెట్ ధరను ప్రతిఫలిస్తుంది. గోల్డ్ ఈటీఎఫ్లను ఇప్పుడు చాలా సంస్థలు 0.01 గ్రాముల కింద ఆఫర్ చేస్తున్నాయి. కనుక రూ.90 నుంచి వీటిలో ఫ్రాక్షన్ యూనిట్ను కొనుగోలు చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్లను నిర్వహించే సంస్థలు వాటి ఇష్యూ పరిమాణంకు అనుగుణంగా భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసి భద్రపరుచుకోవడం తప్పనిసరి.గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ ఈటీఎఫ్ల్లో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. డీమ్యాట్ ఖాతాలేకపోయినా గోల్డ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలత. బ్రోకర్ల సాయం లేకుండా ఫండ్స్ సంస్థ నుంచే కొనుగోలు చేస్తున్నందున బ్రోకరేజీ చార్జీలు పడవు. కాకపోతే ఇందులోనూ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాలి. గోల్డ్ ఈటీఎఫ్లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణల పరిధిలోకి వస్తాయి. కనుక పెట్టుబడులు సురక్షితం. ఉదాహరణకు ఎస్బీఐ గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్లో గత పదేళ్లలో రాబడి వార్షికంగా 12.66 శాతంగా ఉంది. నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్లు గత పదేళ్లలో 8.5–9.5 శాతం మధ్య రాబడిని ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్లో అయితే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా రూ.500 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పన్ను బాధ్యత → బంగారం కాయిన్లు, బిస్కెట్లు, ఆభరణాలు తదితర భౌతిక రూపంలోని బంగారాన్ని కొనుగోలు చేసి రెండేళ్ల తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన లాభం దీర్ఘకాల మూలధన లాభం అవుతుంది. దీనిపై 12.5% పన్ను చెల్లించాలి. రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభం స్వల్పకాల మూలధన లాభం అవుతుంది. ఈ మొత్తాన్ని వార్షిక ఆదాయానికి కలిపి తమ మొత్తం ఆదాయానికి వర్తించే రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. పాత ఆభరణాన్ని కొత్త ఆభరణంతో మార్చుకుంటే అప్పుడు పాత బంగారాన్ని విక్రయించినట్టుగానే చట్టం పరిగణిస్తుంది. కనుక పాత ఆభరణంపై వచ్చిన లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. → డిజిటల్ గోల్డ్కూ భౌతిక బంగారానికి మాదిరే పన్ను రేట్లు వర్తిస్తాయని ట్యాక్స్మ్యాన్ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ వాధ్వా తెలిపారు → గోల్డ్ మ్యూచువల్ ఫండ్కు సైతం భౌతిక బంగారం నిబంధనలే వర్తిస్తాయి. → గోల్డ్ ఈటీఎఫ్లను ఏడాదిలోపు విక్రయిస్తే వచ్చిన స్వల్పకాల మూలధన లాభం వార్షిక ఆదాయం కింద చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించినట్టయితే వచ్చిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. సమీప కాలంలో ధరలు ఎలా ఉండొచ్చు..? బంగారాన్ని స్వల్పకాల దృష్టితో కొనుగోలు చేయడం సూచనీయం కాదు. తమ అవసరాలు, పెట్టుబడుల కోణంలోనే దీర్ఘకాలానికి నిర్దేశిత పరిమితులకు లోబడి కొనుగోలు చేసుకోవాలి. కానీ, అమెరికా–చైనా మధ్య వాణిజ్య సయోధ్య, ఉక్రెయిన్–రష్యా మధ్య చర్చలకు సానుకూల త నేపథ్యంలో ఆల్టైమ్ గరిష్టాల నుంచి బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఔన్స్కు అంతర్జాతీయంగా 3,510 డాలర్ల వరకు వెళ్లిన బంగారం ధర 3,180 డాలర్లకు తగ్గింది.ఇప్పటికీ దీర్ఘకాలానికి బంగారం పట్ల నిపుణులు బుల్లిష్ ధోరణినే వ్యక్తం చేస్తున్నారు. వచ్చే 30–40 రోజుల్లో ఔన్స్ బంగారం ధర 3,150 డాలర్ల స్థాయికి రావొచ్చన్నది మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ కమోడిటీస్ రీసెర్చ్ హెడ్ నవనీత్ దమాని అంచనా. దేశీయంగా 10 గ్రాములకు (24 క్యారెట్లు) రూ. 90,00–91,000 వరకు దిగిరావొచ్చన్నారు. 2,900–3,000 డాలర్ల స్థాయికి సైతం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో తగ్గొచ్చని, కొంత కాలం స్థిరీకరణ చెందొచ్చన్న విశ్లేషణులు వినిపిస్తన్నాయి.భౌతిక బంగారం కొందరికి డిజిటల్ బంగారంలో పెట్టుబడి నచ్చకపోవచ్చు. భౌతికంగా చూసుకోవడమే ఇష్టం. అలాంటి వారు ఆభరణాలకు బదులు బ్యాంక్లు విక్రయించే కాయిన్లను పరిశీలించొచ్చు. భౌతిక బంగారం అయితే జాగ్రత్త పరుచుకోవడం కొంత రిస్్కతో కూడినది. కనుక మొదటి ప్రాధాన్యం డిజిటల్ బంగారానికే ఇవ్వాలి. కాయిన్లు, ఆభరణాల రూపంలో కొనుగోలు చేస్తే విలువపై 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. అదే ఆభరణాలు అయితే జీఎస్టీకి అదనంగా తయారీ చార్జీల రూపంలో మరో 5–15 శాతం అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. తిరిగి అవే ఆభరణాలను మార్చుకోవాలనుకుంటే, వాటిని గతంలో కొనుగోలు చేసినప్పుడు చెల్లించిన తయారీ చార్జీలు, జీఎస్టీ మేర నష్టపోవాల్సి వస్తుంది. అంతేకాదు పాత ఆభరణాలను కొత్త వాటితో మారి్పడి చేసుకున్నప్పటికీ.. కొత్త ఆభరణం బరువు ప్రకారమే విలువపై జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మార్చుకున్న పాత బంగారం మేర జీఎస్టీకి మినహాయింపు లేదు. డిజిటల్ గోల్డ్ ఫోన్పే, పేటీఎం తదితర సంస్థలు డిజిటల్ గోల్డ్ను ఆఫర్ చేస్తున్నాయి. రూపాయి నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ, మిగిలిన డిజిటల్ బంగారం సాధనాలు మాదిరిగా ఇవి సెబీ నియంత్రణలో పనిచేయవు. పైగా వీటి కొనుగోలు, విక్రయంపై చార్జీల విషయంలో పారదర్శకత లేదు. బంగారాన్ని ఇప్పుడు ఆభరణం కంటే ఎక్కువగా చూస్తున్నారు. సురక్షితమైన లిక్విడ్ అసెట్గా, అత్యవసరాల్లో హెడ్జింగ్గా పరిగణిస్తున్నారు. – పృద్వీ రాజ్ కొథారి, రిద్ధిసిద్ధి బులియన్స్ ఎండీభారతీయ గృహిణి అత్యంత తెలివైన ఫండ్ మేనేజర్ అనడానికి కాలక్రమంలో బంగారంపై రాబడే నిదర్శనం.– ఉదయ్ కోటక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్ – సాక్షి, బిజినెస్డెస్క్ -
పుష్కర సరస్వతికి ప్రణామం
ప్రతి నదికి ఏడాదికి ఒక్కసారి పుష్కరాలు జరుగుతాయి. బృహస్పతిలో ఆయా రాశులు ప్రవేశించడంతో ఆ నదికి పుష్కరాలు జరుగుతాయి. ఈనెల 15న గురువారం బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించడంతో ఉదయం 5.44 గంటలకు సరస్వతినదికి పుష్కరాలు ఆరంభం అయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం...సరస్వతీ నది పుష్కరాలు (Saraswati River Pushkaralu) ఉత్తరాదిలో నాలుగుచోట్ల, దక్షిణాది లో తెలంగాణలోని కాళేశ్వరంలో మాత్రమే జరుగుతున్నాయి. నది పుట్టినచోటుగా గుర్తించిన ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, ఉత్తర్ప్రదేశ్లోని గంగా, యమున, సరస్వతి (అంతర్వాహిని)నదులుగా భావించే ప్రయాగ్రాజ్, గుజరాత్లోని సోమనాథ్, రాజస్థాన్లోని పుష్కర్ వద్ద సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయి. పుష్కర స్నానం..పుణ్యఫలం..పుష్కర స్నానం... ఎంతో పుణ్య ఫలం. నది స్నానాలు చేస్తే మానవ జీవన గమనంలో తెలిసో, తెలియకో చేసిన పాపాలు తొలగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు..తర్పణలు, పిండప్రదానాలు..సాధారణంగా నదీస్నానాల్లో తర్పణం, పిండ ప్రదానం, శ్రాద్ధకర్మ పిండప్రదాన కర్మలు చేసి పితృదేవతలను తృప్తిపరిచి వారి ఆశీస్సులు అందుకోవడం శుభప్రదమని విశ్వసిస్తారు. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం తొమ్మిదోరోజు అన్నశ్రాద్ధం. పన్నెండో రోజు ఆమ శ్రాద్ధం చేయడం మంచిదని పురాణాల్లో పేర్కొన్నారు. పుష్కరకాల స్నానం..నీరు నారాయణ స్వరూపం. అందుకే ఆయన స్పర్శతో పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. తీర్థ, నదీస్నానాలు ఉత్తమం. దానికన్నా పుష్కరస్నానం ఉత్తమోత్తమం. ఆ సమయంలో దేవతలంతా వుష్కరుడితో నదిలో ప్రవేశిస్తారని విశ్వాసం. పుష్కరకాలంలో స్నానమాచరిస్తే 12 సంవత్సరాల కాలం 12 నదుల్లో స్నానాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పురాణాల్లో లిఖించబడింది.నదికి వాయినాలు..సుమంగళిగా జీవితాంతం ఉండాలని కోరుకుంటూ ఆడపడచులు పుష్కరాల సందర్భంగా నదీమతల్లికి వాయనాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విశ్వాసం, చీర, రవిక, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మెట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. ముత్తైదువులకు వాయినాలు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు.12 రోజులు హోమాలు..మే 15 గురువారం శ్రీ దత్తా త్రేయ, శ్రీ కార్తవీర్యార్జున హోమం, 16న శుక్రవారం సంకష్ట హర గణపతి హోమం, 17న శనివారం శ్రీ హయగ్రీవ, శ్రీ స్వయంవర పార్వతి హోమం, 18న ఆదివారం శ్రీ పుత్ర కామేష్టి హోమం జరిగాయి. నేడు మేధా దక్షిణామూర్తి మహా అమృత మృత్యుంజయ హోమం, మంగళవారం కాలభైరవ హోమం, బుధవారం సుదర్శన హోమం, గురువారం శ్రీ సూక్త హోమం, శుక్ర వారం పురుష సూక్త హోమం, శనివారం నవగ్రహ, శ్రీ మత్స్య హోమం, ఆదివారం శ్రీ రుద్రహోమం, 26, సోమవారం చండి హోమాలు నిర్వహించనున్నట్లు ఈఓ పేర్కొన్నారు. 12 రోజులు హారతి..12 రోజులపాటు సరస్వతిఘాట్ వద్ద కాశీకి చెందిన ఏడుగురు పండితులచే తొమ్మిది నవ రత్నమాలిక హారతులను ఇస్తున్నారు. హారతి వీక్షణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. హారతి ఇవ్వడానికి ఏడు గద్దెలు ఏర్పాటు చేసి ఏడు జీవనదులు గంగా, యమున, గోదావరి, నర్మద, సింధు, సరస్వతి, కావేరి పేర్లు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల పుష్కర స్నానాలు..పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తున్నారు. పుష్కర ప్రారంభం మే 15న మొదటి రోజు శ్రీ గురుమద నానంద సరస్వతి పీఠం, రంగంపేట, మెదక్కు చెందిన మాధవానంద సరస్వతి స్వామి పాల్గొని సరస్వతి పుష్కరాలను ప్రారంభించారు. మూడవ రోజు మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యా శంకరభారతీ మహాస్వామి, నేడు నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామివార్లు పుష్కర స్నానం ఆచరిస్తారు.17 అడుగుల ఏకశిల సరస్వతిమాత విగ్రహంసరస్వతి ఘాటులో 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తమిళనాడులోని మహాబలిపురంలో శిల్పులు ప్రత్యేకంగా రూపు దిద్దారు. ఆ విగ్రహం చుట్టూరా నాలుగు వేదమూర్తులయిన రుగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వవేదం విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని సరస్వతినది పుష్కరాల సందర్భంగా 15న సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. – షేక్ వలీ హైదర్, సాక్షి, కాళేశ్వరం (భూపాలపల్లి జిల్లా) -
Sheetal Devi and Ananya Panday: వింటి ‘నారి’
‘రెండు చేతులు లేవు కదా... విల్లు ఎలా పడతావు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు తన విల్పవర్తోనే సమాధానం చెప్పిన శీతల్ దేవి ఆర్చర్గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది. స్కూల్ రోజుల నుంచి వెటకారాలు ఎదుర్కొన్న అనన్య పాండే చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్ బారిన పడింది. ఆ వెటకారాలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పిన అనన్య పాండే ప్రస్తుతం ఆసియాలోని ప్రసిద్ధ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2025’ జాబితాలో చోటు సాధించిన శీతల్దేవి, అనన్య పాండేల గురించి...‘విజేతలు తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచించరు. ఉన్నదాన్ని గురించే ఆలోచిస్తారు. దాంట్లో నుంచే శక్తి పుట్టిస్తారు’ అవును. జమ్ముకశ్మీర్కు చెందిన శీతల్కు ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా రెండు చేతులు లేవు. కిస్తావర్లోని తన గ్రామంలో మేకలు కాసేది. శీతల్కు రెండు చేతులు లేకపోవచ్చు. అయితే అసాధారణమైన చురుకుదనం ఉంది. ఆ చురుకుదనమే భారత సైన్యం నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేలా చేసింది.ఆ ఆటల్లో ఆర్చరీ శీతల్ను బాగా ఆకట్టుకుంది. ‘ఆర్చర్ కావాలనుకుంటున్నాను’ అన్నప్పుడు...‘రెండు చేతులు లేవు కదా...అది ఎలా సాధ్యం?’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లు. తన కాళ్ల వైపు చూసింది. అవును... తన కాళ్లనే చేతులుగా మలుచుకొని చిన్న పల్లె, జిల్లా, రాష్ట్రం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పారాలింపిక్ మెడలిస్ట్గా చరిత్ర సృష్టించింది ఆర్చర్ శీతల్ దేవి.‘ఆర్చరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్చరీకి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఎంతోమందికి నేను తెలుసు. ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వాళ్లను చూస్తే సంతోషంగా ఉంది’ అంటుంది స్టార్ ఆర్చర్ శీతల్దేవి.ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి పొందుతున్న వాళ్లను చూసి సంతోషంగా ఉంది జేమ్స్ ‘బ్రాండ్’‘వెక్కిరింపులు, వెటకారాలకు తల ఒగ్గితే ఎప్పటికీ తల ఎత్తలేవు’ స్కూల్ రోజుల్లో అనన్య పాండేను తోటి పిల్లలు ‘టూత్పిక్ లెగ్స్’ ‘ఫ్లాట్ స్క్రీన్’లాంటి నిక్నేమ్లతో వెక్కిరించేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరు ముందు ‘గ్లామర్ డాల్’ అనే విశేషణం తప్పనిసరిగా ఉండేది. ‘నెపో బేబీ’ అని కూడా అంటుండేవారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరే సరి.నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చేవి. సినిమాలకు ముందు పాండే ఏ ఫిల్మ్ స్కూల్లో చేరలేదు. చిన్నప్పుడు సినిమా సెట్స్కు వెళ్లింది కూడా లేదు. నిర్మాణాత్మక విమర్శలు వినబడిన తరువాత మాత్రం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ‘అనన్య నటన అద్భుతం’ అనే ప్రశంస వినిపించడానికి ఎంతో కాలం పట్టలేదు.వెటకారాలు, విమర్శలకు బాధ పడి ఉంటే....అనన్య పాండే ఎక్కడో ఆగిపోయేది. ‘విమర్శలు, వెటకారాలను సీరియస్గా తీసుకుంటే అది మోయలేనంత భారం అవుతుంది. ఆ భారం మనల్ని ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది’ అంటుంది అనన్య పాండే.‘మొదట్లో తన ప్రత్యేకత కనిపించేది కాదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది చేసిన పాత్రలే అనన్య పాండే చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. తాను మాత్రమే చేయగలిగే పాత్రలు చేస్తోంది’ అంటుంది ఫిలిమ్ క్రిటిక్ అనుపమ చోప్రా ఇప్పుడు ఫేమస్ బ్రాండ్లకు పాండే ఫేవరెట్ స్టార్ అయింది. ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ ‘చానల్’, నెట్ఫ్లిక్స్, మాస్ ఓరియెంటెడ్ ‘స్కెచర్’కు మన దేశం నుంచి తొలి బ్రాండ్ అంబాసిడర్గా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం అనన్య పాండే దక్షిణ ఆసియాలోని ఎన్నో లగ్జరీ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంది. -
భారత్, అఫ్గాన్ స్నేహ గీతం
శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా భారత్, అఫ్గానిస్తాన్ దేశాలు స్నేహగీతం పాడుకుంటున్నాయి. శతాబ్దాల క్రితం అఖండ భారత్లో భాగమైన రెండు దేశాల మధ్య మళ్లీ సంబంధాలు బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తాజాగా అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఖండించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గానిస్తాన్ను మరోసారి ఆక్రమించిన తర్వాత అక్కడి మంత్రితో అధికారికంగా మాట్లాడడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భవిష్యత్తులో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడడం ఖాయమని చెప్పడానికి ఇదొక నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అఫ్గాన్లోని తాలిబన్ ప్రభుత్వం పట్ల భారత్ ఇటీవల సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. ఇది మున్ముందు పూర్తిస్థాయి వ్యూహాత్మక ద్వైపాక్షిక బంధంగా మారిన ఆశ్చర్యం లేదు. 1999లో ఉగ్రవాదులు భారత విమానాన్ని హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్లోని కాందహార్లో దించిన సంగతి తెలిసిందే. ప్రయాణికులను రక్షించడానికి సైనిక ఆపరేషన్ చేపట్టేందుకు భారత్ సిద్ధపడగా, అప్పటి తాలిబన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు చాలావరకు తెగిపోయాయి. తదనంతర పరిణామాల నేపథ్యంలో రెండు దేశాలు మళ్లీ ఒక్కటవుతున్నాయి. తాలిబన్ల రాకతో దెబ్బతిన్న సంబంధాలు శతాబ్దాల పాటు అఖండ భారత్లో అంతర్భాగంగా కొనసాగిన అఫ్గనిస్తాన్ 18వ శతాబ్దంలో ప్రత్యేక దేశంగా విడిపోయిందని చరిత్రకారులు చెబుతుంటారు. అమెరికా, రష్యా మధ్య ఆధిపత్య పోరుకు అఫ్గాన్ ఒక వేదికగా మారింది. చాలా ఏళ్లపాటు ఈ పోరాటం కొనసాగింది. 1973లో అఫ్గాన్ రిపబ్లిక్ దేశంగా అవతరించింది. అఫ్గాన్ను భారత్ అధికారికంగా గుర్తించింది. తమ మిత్రదేశంగా ప్రకటించింది. 1996 దాకా ఇరుదేశాల మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. సాధ్యమైనంత వరకు పరస్పరం సహకరించుకున్నాయి. 1996లో తాలిబన్ల ప్రాబల్యం మొదలైంది. పాకిస్తాన్ అండతో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అఫ్గాన్లో తాలిబన్ సర్కార్ను గుర్తించేందుకు భారత్ నిరాకరించింది. విమానం హైజాక్ ఘటన తర్వాత పరిస్థితి దిగజారింది. భారత్–అఫ్గాన్ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఆ తర్వాత అమెరికాలో ప్రపంచ వాణిజ్య కేంద్రంపై అల్ఖైదా ఉగ్రవాదుల దాడి, అఫ్గాన్పై అమెరికా యుద్ధం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మద్దతుతో అఫ్గాన్లో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. 2021లో అమెరికా తన సేనలను అఫ్గాన్ నుంచి ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు గద్దెనెక్కారు. ఇన్నాళ్లూ రహస్యంగా చర్చలు! మళ్లీ అధికారంలోకి వచి్చన తాలిబన్లతో భారత ప్రభుత్వం తొలుత అంటీముట్టనట్లుగానే వ్యవహరించింది. వేచి చూసే ధోరణి అవలంబించింది. భారత్–అఫ్గాన్ మధ్య సంబంధాలు మానవతా సాయం, సాంస్కృతిక, క్రీడల రంగానికే పరిమితం అయ్యాయి. అఫ్గాన్ క్రికెటర్లు ఇండియాలో పోటీల్లో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య చాలాసార్లు రహస్యంగా చర్చలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. కానీ, భారత్ వాటిని ఖండించింది. మరోవైపు సంబంధాలు మెరుగవుతున్న సూచనలు స్పష్టంగా కనిపించాయి. ఈ ఏడాది జనవరి 8వ తేదీన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రం మిస్రీ అఫ్గాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సైతం అఫ్గాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ప్రాంతీయ ప్రయోజనాల కోణంలో అఫ్గాన్ను సన్నిహిత దేశంగా మార్చుకోవాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్కు ఇక ముసళ్ల పండుగే జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో గత నెల 22వ తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడికి పాకిస్తాన్ నుంచే కుట్ర జరిగినట్లు భారత్ గుర్తించింది. ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను అంతం చేయాలన్న లక్ష్యంతో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలను, వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. ఉగ్రవాదం పీడను శాశ్వతంగా వదిలించుకోవడంతోపాటు దక్షిణాసియాలో తనకు తలనొప్పిగా మారిన పాకిస్తాన్ను ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగానే అఫ్గానిస్తాన్కు స్నేహహస్తం అందిస్తోంది. రాబోయే రోజుల్లో భారత్, అఫ్గాన్ మరింత సన్నిహితంగా మారితే పాకిస్తాన్కు ఇక్కట్లు తప్పవని నిపుణులు అంటున్నారు. ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, అఫ్గాన్ నిర్ణయానికి వచి్చనట్లు తెలుస్తోంది. పాక్–అఫ్గాన్ మధ్య రగులుతున్న విభేదాలు తాలిబన్లకు తండ్రి లాంటి పాకిస్తాన్, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు రగులుతున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవలు ముదురుతున్నాయి. తాలిబన్లు తమ చెప్పుచేతల్లో ఉండకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుండడం పాకిస్తాన్ జీరి్ణంచుకోలేకపోతోంది. ఇస్లామాబాద్, కాబూల్ నడుమ సంబంధాలు వేగంగా పతనమవుతున్నాయి. తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) అనే సంస్థ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూంక్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్ల్లో ఇటీవల దాడులకు పాల్పడింది. టీటీపీకి తాలిబన్ సర్కారు అండదండలు ఉన్నాయని పాక్ ఆరోపిస్తోంది. అఫ్గాన్ గడ్డపైనుంచే టీటీపీ కార్యకలాపాలు సాగిస్తోందని మండిపడుతోంది. టీటీపీ దాడులకు ప్రతీకారంగా గత ఏడాది డిసెంబర్లో పాక్ సైన్యం అఫ్గాన్లోని పాక్తీకా ప్రావిన్స్లో వైమానిక దాడులు నిర్వహించింది. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని పాక్ ప్రకటించింది. ఈ దాడుల పట్ల తాలిబన్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరోవైపు సరిహ ద్దుల్లో కంచె వేసేందుకు పాక్ ప్రయతి్నస్తుండగా, తాలిబన్లు అడ్డుకుంటున్నారు. బ్రిటిష్ పాలకులు నిర్ధారించిన డురాండ్ లైన్ను సరిహద్దు రేఖగా ఇస్లామాబాద్ గుర్తిస్తుండగా, అఫ్గాన్ అందుకు ఒప్పుకోవడం లేదు. మరోవైపు 2023లో వేలాది మంది అఫ్గాన్ శరణార్థులను పాక్ ప్రభుత్వం బలవంతంగా బ యటకు వెళ్లగొట్టింది. ఈ వ్యవహారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. సాక్షి, నేషనల్ డెస్క్ -
సారీ.. నో లారీ!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: ఓవైపు నైరుతి రుతుపవనాలు ముంచుకొస్తున్నాయి. మరోవైపు యాసంగి సీజన్లో వచ్చిన అధిక దిగుబడితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు ధాన్యం రాశులతో నిండిపోయాయి. నెల రోజులుగా కొనుగోళ్లు సాగుతున్నప్పటికీ.. ఇప్పటికీ చాలా జిల్లా ల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు దర్శనమిస్తున్నాయి. 10 నుంచి 20 రోజుల పాటు ఎదురు చూసినా వడ్ల బస్తాలను కాంటా వేయడం లేదని రైతులు వాపోతున్నారు.కొన్న ధాన్యం తరలించేందుకు లారీలు లేవని, రైతులు సొంతంగా ట్రాక్టర్లో తీసుకెళ్తామంటే హమాలీలు లేరని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెబుతుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. ధాన్యం రాశుల వద్ద రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. మరిపెడ మండలంలోని ఓ రైతు 600 బస్తాలకు కాంటా వేయించిన తర్వాత లారీలు లేవనే సాకుతో కేంద్రంలోనే వదిలేశారు. ఇప్పటికే అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచగా.. మరోవైపు ముంచుకొస్తున్న వానాకాలం అన్నదాతలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పడి ఉన్నట్లు అంచనా. ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల కొనుగోలు రాష్ట్రంలో ఈసారి యాసంగి సీజన్లో 60.14 లక్షల ఎకరాల్లో వరి సాగయింది. దాదాపుగా 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, ఇందులో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. కాగా శుక్రవారం వరకు తెరిచిన రాష్ట్రంలోని 8,353 కొనుగోలు కేంద్రాలకు 55.73 ఎల్ఎంటీలధాన్యం వచ్చిందని, 51.39 ఎల్ఎంటీల ధాన్యాన్ని సేకరించామని, 49.87 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లులకు తరలించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆలస్యంగా వరి సాగు చేసిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ మొదలైన జిల్లాల్లో మినహా దాదాపు అన్ని జిల్లాల్లో కోతలు పూర్తి అయినప్పటికీ ఆయా జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదని కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్న రైతుల్ని చూస్తే అర్ధమవుతుంది. ఎందుకు ఆలస్యం? కొన్ని కొనుగోలు కేంద్రాల్లో 20 రోజులుగా రైతులు పడిగాపులు పడుతున్నా వడ్ల బస్తాలకు నిర్వాహకులు కాంటా వేయడం లేదు. ఎందుకంటే.. లారీలు లేవు, హమాలీల కొరత ఉందని నిర్వాహకులు చెపుతున్నారు. లారీలు లేకపోతే ట్రాక్టర్తో రైతులే సొంతంగా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్తామన్నా కూడా హమాలీల కొరత పేరు చెపుతూ కాంటా వేయడం లేదు. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబాబాద్, నాగర్కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, జనగాం తదితర జిల్లాల్లోని అనేక మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఇంకా ధాన్యం కుప్పలు నిండుగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఇంకా సుమారు 20 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది.వాస్తవానికి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభించడానికి ముందే లారీల సరఫరా కాంట్రాక్టును జిల్లా అధికార యంత్రాంగం ఖరారు చేసి, ప్రణాళికాబద్ధంగా కేంద్రాల నుంచి మిల్లులకు వడ్ల బస్తాలను తరలించాల్సి ఉంది. కానీ ఈసారి ప్రణాళిక తప్పిందని అధికారులే అంగీకరిస్తున్నారు. హమాలీల విషయంలోనూ ఇదే జరిగిందనే విమర్శలు ఉన్నాయి. ధాన్యం దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం రావొచ్చనే అంచనాను బట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాలో జాయింట్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారి లారీలు, ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే కొనుగోలు కేంద్రాల్లో పెద్ద మొత్తంలో ధాన్యం నిల్వ ఉండటాన్ని బట్టి చూస్తే లారీల కొరత ఉందనే విషయం స్పష్టమవుతోంది. ఇక హమాలీలు ఎక్కువ కూలీ లభించే మక్కజొన్న, ఇతర పంటల కొనుగోళ్ల వద్దకు వెళ్లడం, ఉపాధి హామీ పనులకు వెళుతుండడం వల్ల ధాన్యం కేంద్రాలకు రావడం లేదని తెలుస్తోంది. కాంటా వేసిన తర్వాత రైతు బాధ్యత ఎలా? ⇒ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తెచ్చిన తర్వాత కాంటా వేసేంత వరకే రైతు బాధ్యత. కాంటా వేసిన తర్వాత రైతుకు ఆ ధాన్యంతో సంబంధం ఉండకూడదు. ప్రభుత్వం కూడా అదే చెబుతుంది. కానీ మిల్లరు ధాన్యం బస్తాలను దించుకునేంత వరకు రైతుదే బాధ్యత అన్నట్టుగా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు. అమాయక రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.భయపెడుతున్న ముందస్తు రుతు పవనాలు ⇒ గత రెండు సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ధాన్యం కొనుగోళ్లు ఎన్నో రెట్లు ఎక్కువని ప్రభుత్వం చెపుతోంది. అదే సమయంలో ఈసారి గతంలో కన్నా కొంత ముందుగా నాట్లు వేయడం, సన్న రకాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో కోతలు ముందే వచ్చాయి. రైతుల అదృష్టం కొద్దీ ఈసారి దిగుబడి కూడా బాగుంది. ఈ పరిస్థితుల్లో కొనుగోళ్లు ముందుగానే ప్రారంభం కావడంతో ఇప్పటివరకు 51.39 ఎల్ఎంటీల ధాన్యం కొనుగోలు చేశారు. కేంద్రాల్లో ఇంకా 4.34 ఎల్ఎంటీల ధాన్యం కాంటా వేయకుండా ఉందని పౌరసరఫరాల శాఖే చెబుతోంది. అలాగే కొనుగోలు చేసిన ధాన్యంలోనూ ఇంకా సుమారు లక్షన్నర మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించ లేదని స్పష్టం చేస్తోంది.అయితే మొత్తంగా సుమారు 10 ఎల్ఎంటీల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఉందని అంచనా. కాగా అకాల వర్షాలు రైతులను ప్రతిరోజూ భయపెడుతున్నాయి. భారీ వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల తడిచిన ధాన్యం ఆరితే కానీ రైతులు అమ్ముకోలేని పరిస్థితి ఉంది. తాజాగా.. రుతు పవనాలు ఈసారి ముందుగానే రాష్ట్రంలో ప్రవేశిస్తాయనే వార్తలతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. లారీలు, హమాలీలను అందుబాటు ఉంచడం ద్వారా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దొడ్డు ధాన్యమే ఎక్కువ..సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో 6,58,486 మంది రైతుల నుంచి కొనుగోలు చేసిన 51.39 ఎల్ఎంటీల ధాన్యంలో దొడ్డు రకం 34.02 ఎల్ఎంటీలు కాగా, సన్నాలు 17.37 ఎల్ఎంటీలు ఉన్నాయి. సన్నాలు 30 ఎల్ఎంటీల వరకు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేయగా, ప్రస్తుత పరిస్థితిని చూస్తే సాధ్యమయ్యే అవకాశం లేదని అధికారులు చెపుతున్నారు. నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కామారెడ్డి, నారాయణపేట , వనపర్తి మొదలైన జిల్లాల్లో పండించిన మేలు రకం సన్న ధాన్యాన్ని రైతులు అధిక ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు సన్నాలు ఆశించిన స్థాయిలో రాలేదు. మరో 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే తప్ప రేషన్ దుకాణాలకు ఇవ్వాల్సిన సన్న బియ్యానికి సరిపోవని అధికారులు చెబుతున్నారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపుల వివరాలు.. యాసంగిలో ధాన్యం సేకరణ అంచనా : 70.13 ఎల్ఎంటీ ఇప్పటివరకు సేకరించిన ధాన్యం : 51.39 ఎల్ఎంటీ ఇందులో దొడ్డు రకం (5,44,543 రైతులు) : 34.02 ఎల్ఎంటీ సన్న రకం (2,25,215 రైతులు) : 17.37 ఎల్ఎంటీ కొనుగోలు చేసిన ధాన్యం విలువ : రూ.11,913.05 కోట్లు రైతులకు చెల్లించిన మొత్తం : రూ.8,511.42 కోట్లు సన్న రకం ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ : రూ.868.61 కోట్లు వర్షం వస్తే ఎట్లా..? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. అయితే లారీలు, హమాలీల కొరత, స్థానిక మిల్లుల ట్యాగింగ్లో జాప్యంతో పలు కేంద్రాల్లో వేలాది క్వింటాళ్ల ధాన్యం కుప్పలుగా పడి ఉంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్కు చెందిన గంగవ్వ నాలుగెకరాల్లో పండిన ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులవుతున్నా వడ్లు కాంటా కాలేదు. వర్షాల భయంతో ధాన్యంపై కవర్లు కప్పి పడిగాపులు పడుతోంది. జైపూర్ మండలం పౌనూరుకు చెందిన జాడి బాపు నాలుగెకరాల్లో పండించిన ధాన్యాన్ని కేంద్రానికి తీసుకొచ్చి పది రోజులు గడుస్తున్నా కాంటా వేయడం లేదు. దీంతో వర్షం వస్తే నష్టపోతానని ఆందోళన చెందుతున్నాడు. మరోవైపు మిల్లర్లు తరుగు పేరుతో 2 నుంచి 5 కిలోలకు పైగా కోత పెడుతున్నారని చెన్నూరు మండలం కిష్టంపేట, ఎల్లక్కపేట తదితర చోట్ల రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తూకం వేసినా.. లారీలు లేక..మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పైతర కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేసినా, లారీలు రాకపోవడంతో వారం రోజులుగా రవాణాకు నోచుకోలేదు. అకాల వర్షాలకు దాదాపు 800 బస్తాల ధాన్యం తడిసింది. దీంతో సంచుల్లోంచి మొలకలు ఇలా బయటకు వచ్చాయి. 20 రోజులైనా కాంటా కాలేదు.. నాకు ఉన్న 3 ఎకరాల్లో వరి పంట సాగు చేశా. కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కాంటా పెట్టలేదు. అదేమంటే లారీల కొరత ఉందని చెబుతున్నారు. రోజూ కేంద్రానికి వచ్చి ఎప్పుడు కాంటా పెడతారా అని ఎదురుచూస్తున్నా. రైతులం చాలా ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం తొందరగా వడ్లు కొనాలి. – కొల్లి తిప్పారెడ్డి, రైతు, జటప్రోలు, పెంట్లవెల్లి మండలం, నాగర్కర్నూల్ జిల్లా -
ఎన్నారైలపై ట్రంప్ మరో పిడుగు
మీరు అమెరికాలో ఉంటున్నారా? భారత్లోని మీ కుటుంబానికి ప్రతి నెలా డబ్బులు పంపుతున్నారా? అయితే ఇకపై మరో పన్ను బాదుడుకు సిద్ధంగా ఉండండి. అలా పంపే ప్రతి లక్ష రూపాయలకూ రూ.5 వేల చొప్పున ట్రంప్ ముక్కు పిండి మరీ వసూలు చేయనున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ భారత అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న అధ్యక్షుడు ఈ మేరకు ప్రతిపాదనను తాజాగా తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం అమెరికాలోని వలసదారులు (Migrants) తమ మాతృదేశాలకు పంపే మొత్తాలపై 5 శాతం పన్ను విధించనున్నారు. అమెరికా పౌరులు కానివారందరికీ ఇది వర్తిస్తుంది. గ్రీన్కార్డుదారులతో పాటు హెచ్–1బీ, ఎఫ్–1 లేదా జే–1 తదితర వీసాలపై అక్కడ ఉంటున్న భారతీయులంతా ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితులవుతారు. ట్రంప్ దీనికి ‘వన్ బిగ్, బ్యూటిఫుల్ బిల్’ అని పేరు పెట్టుకుని మురిసిపోతున్నారు. ఈ బిల్లుకు అధికార రిపబ్లికన్లు మద్దతిస్తుండగా ఎన్నారైల (NRIs) మద్దుతుదారుగా పేరున్న విపక్ష డెమొక్రటిక్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్లు ప్రస్తుతం ప్రతినిధుల సభ పరిశీలనలో ఉంది. అక్కడ, అనంతరం సెనేట్లో ఆమోదముద్ర పడితే జూలై 4 నుంచి అమల్లోకి వస్తుంది. మనోళ్లకు పెద్ద దెబ్బ అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 45 లక్షల పై చిలుకే. వారిలో చాలామంది ఉన్నత స్థాయి ఉద్యోగులు, వ్యాపారవేత్తలు తదితరులే. వాళ్లు భారత్కు ఏటా భారీ మొత్తాలు పంపుతుంటారు. మామూలు ఉద్యోగులు చేసేవాళ్లు కూడా భారత్లోని తమ కుటుంబాల పోషణ, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు తదితరాల నిమిత్తం ప్రతి నెలా టంచనుగా డబ్బులు పంపుతుంటారు. ఇక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడుతుంటారు.రెమిటెన్స్ పన్ను (remittance tax) దెబ్బకు ఇకపై మనవాళ్లు పంపే మొత్తాలు భారీగా తగ్గడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా మన విదేశీ మారకద్రక్య నిల్వలపైనా ప్రతికూల ప్రభావం పడవచ్చంటున్నారు. ‘‘భారత్ తిరిగొచ్చి ఇక్కడే స్థిరపడాలని భావించే అమెరికా ఎన్నారైలు సంపాదించే ప్రతి డాలర్పైనా 5 శాతం కోత పడ్డట్టే లెక్క. భారీ మొత్తాలు పంపే ఆలోచనలో ఉన్నవాళ్లు జూలైకి ముందే ముగించుకోవడం మేలు’’ అని సూచిస్తున్నారు.జీవనాధారంపై దెబ్బ రెమిటెన్సుల పన్ను వర్తింపు విషయమై ప్రతిపాదనలో ఎలాంటి మినహాయింపులూ ప్రతిపాదించలేదు. కనుక ఎంత తక్కువ మొత్తం పంపినా బాదుడు ఖాయమే. దాంతో వాటిపైనే ఆధారపడే ఎన్నో భారత కుటుంబాలను ఇది తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ‘‘పిల్లల్ని అమెరికా పంపిన తల్లిదండ్రుల్లో చాలామంది వారిపైనే ఆధారపడి ఉంటారు. ఇంటి అద్దె, లేదా ఈఎంఐలు మొదలుకుని వైద్య ఖర్చుల దాకా పిల్లలు నెల నెలా పంపే డబ్బులే ఆధారం. రెమిటెన్సులంటే కేవలం ఆర్థిక కార్యకలాపాలు కావు. లక్షలాది మందికి జీవనాధారాలు. దీన్ని ఆ మానవీయ కోణం నుంచి చూడాలి. కానీ ట్రంప్ పక్కా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నారు’’ అంటూ ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నారై రెమిటెన్సులపై బాగా ఆధారపడే మన రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం ఖాయమని చెబుతున్నారు.రెమిటెన్సుల్లో భారతే టాప్ → ప్రపంచం మొత్తంలో విదేశాల నుంచి అత్యధికంగా రెమిటెన్సులు వచ్చేది భారత్కే. → 2024లో వాటి మొత్తం ఏకంగా 130 బిలియన్ డాలర్లు! అంటే దాదాపు రూ.10.7 లక్షల కోట్లు. → అందులో 28 శాతం, అంటే రూ.3 లక్షల కోట్ల (32 బిలియన్ డాలర్ల) మేరకు వాటా భారత అమెరికన్లదే. → ఆ లెక్కన 5 శాతం రెమిటెన్సు పన్ను రూపేణా అమెరికాకు ఏటా ఒక్క ఎన్నారైల మీదే అప్పనంగా రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరనుంది! అక్రమ పన్నే! రెమిటెన్స్ పన్ను విధింపు చట్టారీత్యా చూసినా సరికాదన్నది ఆర్థిక నిపుణుల వాదన. ‘‘ఇది చాలా అన్యాయమైన ప్రతిపాదన. వేలాది మైళ్లు వలస వెళ్లి అనేక కష్టాలకోర్చి తమవారికి అండగా నిలుస్తున్నందుకు, స్వదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నందుకు శిక్షిస్తున్నట్టుగా ఉంది. పైగా అమెరికాకు అన్ని రకాల కేంద్ర, రాష్ట్ర పన్నులు చెల్లించిన మీదట మిగుల్చుకున్న మొత్తంపై దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇది కచ్చితంగా అక్రమమే. ఇందులో రాజకీయ ఉద్దేశాలు కొట్టొచ్చినట్టు కన్పిస్తున్నాయి’’ అని వారంటున్నారు. ఈ ప్రతిపాదనపై డెమొక్రాట్ సభ్యులు కాంగ్రెస్లో తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. వలస సమాజాలను, ముఖ్యంగా అల్పాదాయ కుటుంబాలను ఈ పన్ను అన్యాయంగా పీల్చి పిప్పి చేస్తుందని వాదించారు. మితవాద రిపబ్లికన్లు కూడా వారితో గొంతు కలుపుతున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కంబాలపల్లి C/O ప్రభుత్వోద్యోగులు
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామం.. ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా విలసిల్లుతోంది. గ్రామం నుంచి ఆర్మీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్టిలరీ, బీఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, మద్రాస్ రెజిమెంట్, టీఎస్ఎస్పీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఏఆర్, పోలీసు విభాగాలతో పాటు ఉపాధ్యాయులు 79 మంది వరకు సేవలు అందిస్తున్నారు. కాగా ఇక్కడి నుంచి ఎక్కువగా సైనికులు దేశానికి సేవలందిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య మొట్టమొదటిసారిగా సీఆర్పీఎఫ్ జవాన్గా చేరారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని గ్రామ యువత వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ.. కంబాలపల్లి గ్రామం (Kambalapally Village) ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తున్నారు. సేవలందిస్తున్న 79 మందిలో...కంబాలపల్లి గ్రామం నుంచి 79 మంది ప్రభుత్వ ఉద్యోగాలు (Govt Jobs) చేస్తున్నారు. ఇందులో 38 మంది ఆర్మీలో, 10 మంది కానిస్టేబుళ్లు, 15 మంది ఉపాధ్యాయులు, ఆరుగురు టీఎస్ఎస్పీ, ఇద్దరు నేవీ, ముగ్గురు ఎయిర్ ఫోర్సు, ఐదుగురు గన్మన్లు, ఇద్దరు ఎస్పీఎఫ్ (SPF) విభాగాల్లో పనిచేస్తున్నారు.తొలిసారిగా ఎయిర్ఫోర్స్లో..కంబాలపల్లి గ్రామం నుంచి ఎంపికైన మొట్టమొదటి ఎయిర్ఫోర్స్ (Air Force) ఉద్యోగిగా నూకల నరేందర్ రెడ్డి పేరుపొందారు. ఎయిర్ఫోర్స్ విమాన కమాండర్ (ఆర్మీలో బ్రిగేడియర్ హోదా)గా 36 ఏళ్లపాటు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ పైలట్ విధులు నిర్వర్తిస్తున్నారు. తమ గ్రామం నుంచి దేశ రక్షణ, ఇతర విభాగాల్లో యువకులు పనిచేస్తూ ఆదర్శంగా నిలవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. – నూకల నరేందర్రెడ్డి, మొట్టమొదటి ఎయిర్ఫోర్స్ ఉద్యోగిగ్రేడ్ హవల్దార్గా విధులు..గ్రామానికి చెందిన కొలిశెట్టి సుధాకర్ ఆర్మీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్ హోదాలో కొనసాగుతున్నారు. దేశ సేవ చేయాలనే లక్ష్యంతో 2001లో మొదటి ప్రయత్నంలోనే ఆర్మీలో సిపాయిగా ఉద్యోగంలో చేరారు. తర్వాత లాంచ్ నాయక్, నాయక్, హవల్దార్ హోదాల అనంతరం ప్రస్తుతం గ్రేడ్ హవల్దార్గా పనిచేస్తున్నారు. – కొలిశెట్టి సుధాకర్, ఆర్మీ గ్రేడ్ హవల్దార్ 22 ఏళ్లుగా ఆర్మీలో .. గ్రామానికి చెందిన సంద భాస్కర్ 22 ఏళ్ల క్రితం ఆర్మీలో చేరి విధులు నిర్వర్తిస్తున్నారు. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య ఆర్మీలో చేరిన మొ దటి వ్యక్తి కాగా.. భాస్కర్ రెండోవారు. ఆర్మీలో జూనియర్ కమాండెంట్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు. – సంద భాస్కర్, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్తండ్రిని ఆదర్శంగా తీసుకొని.. గ్రామానికి చెందిన మల్లికంటి కృష్ణయ్య, సైదమ్మ దంపతుల చిన్న కుమారుడు అవినాశ్ తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని ఆర్మీలో చేరాడు. ఆయన ప్రస్తుతం జమ్మూలో ఆర్టిలరీ విభాగంలో ఉద్యోగం చేస్తున్నారు.– మల్లికంటి అవినాశ్, ఆర్మీ ఆర్టిలరీ ఉద్యోగిప్రభుత్వ ఉపాధ్యాయునిగా..గ్రామానికి చెందిన మల్లికంటి రమేశ్ ఆర్మీలో 16 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉద్యోగ విరమణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ రాసి ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గంగారం మండలంలో స్కూల్ అసిస్టెంట్గా కొనసాగుతున్నారు. – మల్లికంటి రమేశ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడుచదవండి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్రెడ్డి -
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేదికగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ వచ్చే నెలలో విశాఖలో పర్యటించనున్నారు. జూన్ 21న విశాఖ వేదికగా ‘యోగా ఫర్ వన్ ఎర్త్.. వన్ హెల్త్’థీమ్తో నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో సుమారు 45 నిమిషాల పాటు జరగనున్న యోగాసనాల కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, యోగా అభ్యాసకులు, ఉద్యోగులు, సాధారణ పౌరులు, డిఫెన్స్ స్టాఫ్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, క్రీడాకారులు, ఇతర సంస్థల కార్యకర్తలు సహా సుమారు 2.5 లక్షల మంది భాగస్వామ్యం కానున్నారు.ఇందుకోసం జిల్లా యంత్రాంగం 24 చదరపు అడుగులకు ఒకరు చొప్పున కూర్చునేలా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి చోటా 3 నుంచి 4 వేల మంది యోగాసనాలు వేసేలా అనువైన మైదానాలను గుర్తిస్తున్నారు. ప్రధానితో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు స్థానిక ఆర్కే బీచ్ రోడ్ లేదా ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాన వేడుకలో భాగస్వామ్యం కానున్నారు. ఈ నెల 29 నుంచి నాలుగు వారాల పాటు యోగా దినోత్సవంపై ప్రచారం చేస్తారు. జూన్ 5 నుంచి వారం రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలోనూ, 17 నుంచి విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరినీ ప్రధాని కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. -
ఏటీఎంలకు డిజిటల్ గ్రహణం!
దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)లకు గండి కొడుతోంది. ఒకపక్క బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ అంతకంతకూ ఎగబాకుతూ ఆల్టైమ్ గరిష్టాల్లో కొనసాగుతోంది. మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరుస్తున్న ఏటీఎంల కంటే మూసేస్తున్నవే ఎక్కువ కావడం విశేషం! కొత్తిమీర కట్ట నుంచి బైకులో పెట్రోలు దాకా దేనికైనా డిజిటల్ చెల్లింపులే నడుస్తున్నాయిప్పుడు! మన దైనందిన ఆరి్థక లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్ అంతలా పెనవేసుకుపోయాయి మరి. దీంతో ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాలు కూడా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే, ఒకప్పుడు మెయిన్ రోడ్లపైనే కాకుండా సందుల్లో కూడా ఎడాపెడా ఏటీఎంలను తెరిచిన బ్యాంకులు.. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వాటికి తాళాలేస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్–ఆపరబిలిటీ, వేరే బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకునేటప్పుడు విధించే ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంల ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉండగా, 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2,14,398కి తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో 5,484 ఏటీఎంలను ఎత్తేశాయన్నమాట! ముఖ్యంగా ఆఫ్సైట్ (బ్యాంకు బ్రాంచ్లలో కాకుండా ఇతర లొకేషన్లలో ఉన్నవి) ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. 2022 సెపె్టంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్సైట్ ఏటీఎంలు ఉండగా.. 2024 డిసెంబర్ నాటికి ఇవి 85,913కి తగ్గిపోవడం గమనార్హం. డిజిటల్ రయ్... బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ ప్రస్తుతం ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో రూ.34.7 లక్షల కోట్లకు పైగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) నుంచి చూస్తే రెట్టింపైంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 12 శాతం కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య పెరక్కపోగా.. అంతకంతకూ తగ్గుతుండటం విశేషం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. కాగా, 2024 పూర్తి ఏడాదికి చూస్తే, 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోలిస్తే (11,760 కోట్లు) 46 శాతం దూసుకెళ్లాయి. మరోపక్క, ఆర్బీఐ అనుమతితో ఈ నెల 1 నుంచి ఏటీఎం చార్జీలను బ్యాంకులు పెంచేశాయి. దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, ప్రతి లావాదేవీకి ఇప్పు డున్న రూ.21 చార్జీ రూ.23కు పెరిగింది. నెలకు సొంత బ్యాంకుల ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయాని కొస్తే మెట్రోల్లో అయితే 3, నాన్ మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. క్యాష్ విత్డ్రాతో పాటు బ్యాలెన్స్ ఎంక్వయిరీ వంటివన్నీ లావాదేవీగానే పరిగణిస్తున్నారు.ఎనీటైమ్ సమస్యలు...! కొన్ని బ్యాంకులు బ్రాంచ్ల వద్ద ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆఫ్సైట్ ఏటీఎంల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు, లేదంటే క్యాష్ లేకపోవడం వంటివి కస్టమర్లకు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్ విత్డ్రా చేసుకోవాలంటే రెండు మూడు ఏటీఎంలకు తిరగాల్సి వస్తోందనేది అధిక శాతం మంది ఖాతాదారుల ఫిర్యాదు. ‘దేశంలో ప్రస్తుత ఏటీఎంల ట్రెండ్ను పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క, బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలపై బ్యాంకులు దృష్టి పెట్టడం కూడా మొత్తంమీద ఏటీఎంలు తగ్గుముఖం పట్టడానికి కారణం’ అని ఆన్లైన్ పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ చైర్మన్ రవి బి. గోయల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో నెట్వర్క్ స్థిరీకరణ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.34.7 లక్షల కోట్లు: బ్యాంకింగ్ వ్యవస్థలో చెలామణీలో ఉన్న నగదు (జీడీపీలో ఇది 12 శాతం).2,14,398: 2024 డిసెంబర్ నాటికి దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఏటీఎంల సంఖ్య (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు సహా). ఇందులో 1,28,485 ఆన్సైట్, 85,913 ఆఫ్సైట్ ఏటీఎంలు ఉన్నాయి.36,000: దేశంలో వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య దాదాపుగా. ప్రస్తుతం ఈపీఎస్, ఇండియా1 పేమెంట్స్, హిటాచి పేమెంట్ సరీ్వసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, వక్రంగీ.. ఈ ఐదు ప్రైవేటు కంపెనీలు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లుగా ఉన్నాయి. 17,200 కోట్లు : 2024లో యూపీఐ లావాదేవీల సంఖ్య (రోజువారీగా సగటు విలువ రూ. 74,990 కోట్లు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మన వేలితో మన కన్నే..!
రెండేళ్ల క్రితం భయానక భూకంపం వేళ తుర్కియేకు అందరికంటే ముందు ఆపన్న హస్తం అందించింది భారతే. ‘ఆపరేషన్ దోస్త్’ పేరిట భారీ సాయం చేసింది. కానీ ఆ దేశం మాత్రం తిన్నింటి వాసాలే లెక్కబెడుతోంది. సాయుధ సంఘర్షణ వేళ దాయాది పాకిస్తాన్కు ఎడాపెడా డ్రోన్లు, ఇతర ఆయుధాలను అందజేసి కృతఘ్నుతకు బ్రాండ్ అంబాసిడర్గా మారింది. విశ్వాస ఘాతుకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. వాటితో పాటు సైనికులను, శిక్షణా సిబ్బందిని కూడా పాక్కు తుర్కియే భారీగా పంపినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. డ్రోన్ల వాడకం తదితరాల్లో వాళ్లు పాక్ జవాన్లకు పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చినట్టు తేలింది. పాక్కు తుర్కిష్ కంపెనీ ఆసిస్గార్డ్ సోంగార్ పంపిన బైరక్తార్ టీబీ2, ఈహా డ్రోన్లు ఆత్మాహుతి తరహావి. లక్ష్యంపై పడి పేలిపోతాయి. ఈ డ్రోన్ల తయారీలో భారత్ ఎగుమతి చేసే కీలకమైన మూలకాలు, ముడి సరుకులే ప్రధాన వనరులు కావడం విశేషం! మనకు వ్యతిరేకింగా ఇలా నిస్సిగ్గుగా బరితెగించిన తుర్కియేకు ఆ కీలక ఎగుమతులను తక్షణం నిలిపేయాలని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు. కంట్రోలర్ల నుంచి రిసీవర్ దాకా... ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఉగ్రశిబిరాలను భారత్ కుప్పకూలి్చన కొద్ది గంటలకే పాక్ దాదాపు 400 డ్రోన్లతో సరిహద్దు ప్రాంతాలపై దాడికి తెగించడం తెలిసిందే. తుర్కియేకు భారత ఎగుమతుల్లో సింహభాగం అల్యూమినియం, అల్యూమినియం సంబంధ ఉపకరణాలు, ఆటో ఉత్పత్తులు, విమానాల విడిభాగాలు, టెలికం ఉపకరణాలు, ఎలక్ట్రిక్ వస్తువులు, పరికరాలు తదితరాలే. వీటిలో చాలావరకు డ్రోన్ల తయారీలో కీలకం. డ్రోన్లలోని కంట్రోలర్, ఫ్రేమ్, మోటార్, ప్రొపెల్లర్, కెమెరా, ఫైట్ కంట్రోల్, రిసీవర్, వీడియో ట్రాన్స్మిటర్, యాంటెన్నా, స్పీడ్ కంట్రోలర్, కంట్రోలర్లను కూడా భారత్ నుంచే తుర్కియే దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ ఎగుమతులు ఎక్కువచయ్యాయి. ఆ విడిభాగాలతో రూపొందించిన డ్రోన్లను పాక్కు అందజేయాలన్నది తుర్కియే అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగన్ నిర్ణయమేనని తెలుస్తోంది. అతనికి అంతులేని భారత విద్వేíÙగా పేరుంది. తమ డ్రోన్లు, ఆయుధాలను భారత్కు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించకూడదనే ఒట్టు పెట్టుకున్నారు! మన విమానాశ్రయాల భద్రతతుర్కియే సంస్థ చేతుల్లో! భారత్లోని పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా అంశాల్లో కూడా తుర్కియే పరోక్షపాత్ర ఉందని వెలుగులోకి వచ్చింది. వాటిలో కార్గో హ్యాండ్లింగ్ వంటి కీలక కాంట్రాక్టులను తుర్కియేకు చెందిన సెలెబీ ఏవియేషన్ కంపెనీ చెందిన అనుబంధ సంస్థ సంపాదించిందని తేలింది. భారత్లో 2008 నుంచి ఈ సంస్థ సేవలందిస్తోంది. ఏటా 58,000 విమానాలు, 5.4 లక్షల టన్నుల సరకు రవాణా బాధ్యతలను చూసుకుంటోంది. అందులో 7,800 మంది సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, గోవా, కొచ్చిన్, కన్నూర్ వంటి కీలక విమానాశ్రయాల్లో హై సెక్యూరిటీ బాధ్యతలు సెలెబీవే! గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో మేనేజ్మెంట్, ఎయిర్సైడ్ ఆపరేషన్స్ విధులను ఈ సంస్థే చూస్తోంది. విమానాలను నిలిపి ఉంచే హై సెక్యూరిటీ జోన్, ఎయిర్సైడ్ జోన్లన్లా సంస్థ సిబ్బందే విధుల్లో ఉంటున్నారు. ప్రయాణికుల బ్యాగులు, కార్గో పనులను చూసుకునేదీ వాళ్లే. అంతర్జాతీయ సర్వీసుల్లో కూడా ఈ బాధ్యతలను వీళ్లకే అప్పగించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దీనిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరు దేశాల్లోని 70 విమానాశ్రయాల్లో కూడా సెలెబీ కాంట్రాక్టులు సంపాదించింది.ముమ్మరంగా ‘బ్యాన్ తుర్కియే’ పాక్కు సైనికసాయం చేస్తున్నందుకు నిరసనగా తుర్కియే ఉత్పత్తులను బహిష్కరించాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ఇకపై తుర్కియే యాపిల్ పండ్లను దిగుమతి చేసుకోవద్దని మహారాష్ట్రలోని కీలకమైన పుణె పండ్ల మార్కెట్ ట్రేడర్లు నిర్ణయించుకున్నారు. ‘‘మన సైన్యానికి మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తుర్కియేకు బదులు ఇక హిమాచల్, ఉత్తరాఖండ్ ఇరాన్ నుంచి ఆపిల్స్ తెప్పిస్తాం’’ అని పుణె వ్యవసాయోత్పత్తుల మార్కెట్ కమిటీ ట్రేడర్ సుయోగ్ జిందే చెప్పారు. పుణెలో తుర్కియే యాపిల్స్ టర్నోవర్ రూ.1,200 కోట్ల పై చిలుకే. దాంతో ఈ నిర్ణయం ఆ దేశానికి పెద్ద దెబ్బే కానుంది. తుర్కియే నుంచి తెల్ల చలువరాయి దిగుమతులనూ నిషేధించాలన్ల డిమాండ్లు విని్పస్తున్నాయి.యాత్రలూ బంద్! తుర్కియేకు మనోళ్ల విహార యాత్రలు కూడా భారీగా తగ్గాయి. ఆ దేశానికి క్యాన్సలేషన్లు భారీగా పెరుగుతున్నాయని ఈజ్మైట్రిప్, ఇగ్జిగో వంటి ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫాంలు తెలిపాయి. తుర్కియే ప్రభుత్వ వార్తా చానల్ ‘టీఆర్టీ’ తాలూకు ‘ఎక్స్’ ఖాతాను కేంద్రం బ్లాక్ చేసింది. టర్కీతో మన వాణిజ్యం కూడా తగ్గుముఖం పడుతోంది. 2024–25 మధ్య తుర్కియేకు మన ఎగుమతులు 5.2 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. భారత్కు వ్యతిరేకంగా పాక్కు బాహాటంగా మద్దతు ప్రకటించిన అజర్బైజాన్కు కూడా ఇదే సెగ తగులుతోంది. దాని రాజధాని బకు ఇటీవలి దాకా భారత పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్లలో ఒకటిగా ఉండేది. ఏటా లక్షలాది మంది అక్కడికి వెళ్లేవారు. బకుకు బుకింగులు కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోతున్నాయి. జేఎన్యూ కటీఫ్ తుర్కియే విద్యాసంస్థలతోనూ తెగదెంపులు చేసుకోవాలనే డిమాండ్ల నేపథ్యంలో ఆ దేశంలోని ఇనోను వర్సిటీతో అవగాహన ఒప్పందాన్ని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ) రద్దు చేసుకుంది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. గత ఫిబ్రవరిలో కుదిరిన ఈ మూడేళ్ల ఒప్పందం ప్రకారం రెండు వర్సిటీల విద్యార్థులు, అధ్యాపకుల మారి్ప డికి అవకాశముండేది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆడనే చంపేస్తున్నారు!
ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి స్త్రీ కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింటి వేధింపుల భయంతోనే కొందరు కడుపులోనే పిండాన్ని నిర్ధా్దక్షిణ్యంగా తొలగించుకుంటున్నారు. ఈ కారణంగా సమాజంలో స్త్రీ, పురుషుల నిష్పత్తిలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. ఆడపిల్లలు లభించక చాలా మంది పురుషులకు వివాహాలు కాని పరిస్థితి నెలకొంది. కర్నూలు(హాస్పిటల్): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. కర్నూలు జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. అధికారికంగా ఉన్న స్కానింగ్ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లలో కొందరు వైద్యులు స్కానింగ్ ద్వారా లింగనిర్ధా్దరణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధా్దక్షిణ్యంగా అబార్షన్(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. ఆర్ఎంపీలకు నజరానాలు జిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్ఆర్ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్ ముట్టజెబుతున్నారు. లింగనిర్ధారణ చేస్తే జైలుకే...కానీ...! భ్రూణహత్యల నివారణకు కేంద్ర ప్రభుత్వం 1994లో పీసీ పీఎన్డీటీ యాక్ట్ను తీసుకొచ్చింది. దీని ప్రకారం లింగనిర్ధారణ చేసినా, గర్భస్రావాలు చేయించినా ఇరువర్గాలను శిక్షించే వీలుంది. మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, రెండోసారి తప్పు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ.50వేల జరిమానా విధిస్తారు. అయితే ఇప్పటి వరకు ఒక్కరిపై కూడా కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఈ చట్టం కింద ఏ ఒక్కరికీ శిక్ష పడదు. ఈ చట్టం ఒకటి ఉందని రోగులకు, గర్భిణిలకు తెలిసేటట్లు ఆయా స్కానింగ్ కేంద్రాల్లో పోస్టర్లు మాత్రం ప్రదర్శించి ఉంటాయి. కానీ కొన్నిచోట్ల అదే ప్రాంతాల్లో లింగనిర్ధారణ జరుగుతుంది. గతంలో 10 ఏళ్ల క్రితం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కర్నూలు, కోడుమూరు, గూడూరు ప్రాంతాల్లో స్కానింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించి స్కానింగ్ మిషన్లను సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన మిషన్ల పక్కనే మరో మిషన్ను తీసుకొచ్చి లింగనిర్ధారణ చేసిన వైద్యశిఖామణులు ఉన్నారు. ఆయా ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులకు రాజకీయ నాయకుల పలుకుబడి ఉండటంతో ఇలా సీజ్ చేస్తే అలా తెరిపించుకునే స్థాయిలో ఉన్నారు.తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్వో, కర్నూలు -
ఇది తినండి.. ఇలా ఉండండి!
ఏం తినాలో వారే చెప్తారు... ఎప్పుడు తినాలో సూచిస్తారు.. దగ్గినా తుమ్మినా పరిగెత్తుకొస్తారు. నలతగా ఉందంటే క్షణాల్లో వాలిపోతారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. 24 గంటల మెడికల్ కేర్, న్యూట్రీషినిస్టుల సేవలు, నెలసరి సమస్యలు చికాకు పెట్టకుండా అందుబాటులో మహిళా సిబ్బంది.. ఇలా మిస్వరల్డ్ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన సుందరీమణుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. – సాక్షి, హైదరాబాద్ఐదారేళ్ల శ్రమ..ప్రపంచ సుందరి కావాలన్న కల చాలామంది యువతుల్లో ఉంటుంది. అందం, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, ఆకట్టుకునే తెలివితేటలు.. కలబోసిన సంపూర్ణ వ్యక్తిత్వం.. ఈ లక్షణాలున్నవారు ప్రపంచ సుందరి కిరీటం కోసం ఆరాటపడటం సహజం. దీనిని సాధించుకునే లక్ష్యంతో చాలామంది కఠోర దీక్షగా సాగుతారు. ఎంతో ఇష్టమైన పదార్థాలున్నా ముట్టకుండా దూరంగా ఉంటారు. నిరంతరం కఠినమైన వ్యాయామం చేస్తారు. బద్ధకానికి అందనంత దూరంగా ఉండేందుకు నిరంతరం చలాకీతనం తొణికిసలాడేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ ఆచరణలో పెట్టేందుకు వారు తీవ్రంగా శ్రమిస్తారు. దాదాపు ఏడెనిమిది ఏళ్లపాటు దీక్షగా ముందుకు సాగుతారు. ఇన్నేళ్ల పట్టుదల, శ్రమ.. పోటీలయ్యేవరకు సడలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వారి సొంత ప్రాంతంలో దీన్ని నిలబెట్టుకున్నా, పోటీల కోసం మరో తరహా వాతావరణం ఉండే ప్రాంతానికి వెళ్లి దాదాపు నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సిన పరిస్థితిలో వారు దాన్ని కొనసాగించటం పెద్ద సవాలే. అక్కడి వాతావరణం, పరిస్థితులు, ఆహారంలో మార్పు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అందుకే పోటీలు జరిగే ప్రాంతంలో దాదాపు రెండు నెలల ముందు నుంచి అక్కడి యంత్రాంగాన్ని మిస్వరల్డ్ లిమిటెడ్ అప్రమత్తం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ విషయంలో మార్చి మొదటి వారంలోనే మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్పర్సన్ జూలియా మోర్లే అప్రమత్తం చేశారు. మొదటిసారి హైదరాబాద్కు వచ్చి ఇక్కడి పరిస్థితులు పరిశీలించి, పోటీకి అనువైన వాతావరణం ఉందని తేల్చుకున్నాక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో ఈ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మెడికల్ టూరిజంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నందున, అక్కడ ప్రపంచ స్థాయి వైద్య వసతులున్నాయని, ఆ విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. టాప్ ఆస్పత్రితో ఒప్పందం..ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ ఆస్పత్రితో మిస్ వరల్డ్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న యువతులు బస చేసిన ట్రైడెంట్ హోట ల్లో ఆ ఆస్పత్రి ఓ ఎమర్జెన్సీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో షిఫ్టుల వారీగా వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది, న్యూట్రిషనిస్టులు సహాయకంగా ఉంటారు.» పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణుల్లో దాదాపు అన్ని ఖండాలకు చెందిన వారున్నారు. వారి శరీరానికి సరిపడే ఆహార పదార్థాలేమిటో తెలిపే జాబితాను మిస్వరల్డ్ ప్రతినిధులు ముందుగానే స్థానిక యంత్రాంగానికి అందజేశారు. ఆయా పదార్థాలు నిత్యం హోటల్లో అందుబాటులో ఉంచాలని సూచించారు.» మంగళవారం చౌమహల్లా ప్యాలెస్లో వెల్కం డిన్నర్లో హైబరాబాద్ బిర్యానీని ప్రత్యేకంగా వడ్డించారు. కానీ, ఈ బిర్యానీని మసాలా తక్కువగా, మధ్య రకంగా, పూర్తిస్థాయి మసాలాతో.. ఇలా మూడు రకాలుగా తయారు చేసి ఉంచారు. యూరప్, అమెరికా తదితర ప్రాంతాలకు చెందిన వారిని తక్కువ మసాలా ఉన్న బిర్యానీ తీసుకోవాల్సిందిగా సూచించటం విశేషం.»చాలా ఆరోగ్య సమస్యలు మంచినీటితోనే వస్తాయి. అందుకే సాధారణ నీళ్లు కాకుండా, ప్రస్తుతం సుందరీమణులకు లీటరు రూ.800 ఖరీదు చేసే ప్రత్యేక బ్రాండ్ మంచినీటిని అందిస్తున్నట్టు తెలిసింది.»ప్రస్తుతం హోటల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లలో దాదాపు 80 రకాల ఇంటర్ కాంటినెంటల్ వంటకాలను బఫేలో ఉంచుతున్నారు. తమకు ఏది సరిపోతుందో ఆ ఆహారా పదార్థాలను సుందరీమణులు ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.» మిస్వరల్డ్ తరపున వచ్చిన న్యూట్రిషనిస్టులు సూచించిన ఆహారాన్నే సుందరీమణులు స్వీకరిస్తున్నారు.»రాష్ట్ర పర్యటనలకు వెళుతున్నప్పుడు కూడా ముందుగానే భోజన వివరాలను తెలిపి, స్టార్ హోటల్లో వండించి మరీ సిద్ధం చేస్తున్నారు.»సుందరీమణులు ఎక్కడకు వెళ్లినా పూర్తి ఎమర్జెన్సీ వైద్య వసతులతో కూడిన అంబులెన్సు ఫాలో అవుతోంది. అందులో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉంటున్నారు -
అందాల నారీమణులతో ‘శారీ’గమలు
సాక్షి, యాదాద్రి: చేనేత వస్త్రాలను ప్రపంచ స్థాయికి పరిచయం చేయడమే ప్రథమ లక్ష్యంగా.. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందగత్తెల ముందు ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే అందగత్తెలు ఈ నెల 15న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లిలోని రూరల్ టూరిజం రిసార్టుకు ప్రపంచ సుందరీమణులు 25 మంది రానున్నారు. వీరి రాక సందర్భంగా ఇక్కడి ఇక్కత్ చీరల ప్రాధాన్యాన్ని వారికి తెలియజేస్తారు.ఇందువల్ల స్థానిక చేనేత కళాకారులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు పొందిన పోచంపల్లిని ప్రపంచ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే ప్రయత్నమిది. ఈ సందర్భంగా యాదగిరిగుట్టకు కూడా సుందరీమణులు రానున్నారు. కొండపైన స్వామి వారి దర్శనం అనంతరం.. కొండ కింద ఫొటో సెషన్ ఉంటుంది.చేనేత కళాకారులతో మాటామంతీమిస్ వరల్డ్ పోటీదారులు (Miss World 2025 contestants) స్థానికంగా చేనేత కళాకారులతో ముచ్చటిస్తారు. చీరల తయారీకి వాడే దారం పుట్టుక నుంచి.. వస్త్రం తయారీ వరకు.. పలు అంచెల్లో వస్త్రాల తయారీని ఎలా రూపొందిస్తారో వారు అడిగి తెలుసుకుంటారు.యాంఫీ థియేటర్లో ప్రదర్శనపోచంపల్లిలోని టూరిజం సెంటర్ యాంఫీ థియే టర్లో విభిన్నమైన చేనేత వస్త్రాల ప్రదర్శన ఉంటుంది. చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాల్.. ఇలా పలు రకాల వస్త్రాల ప్రదర్శన ద్వారా సంప్ర దాయ, ఆధునికత కలిసిన నూతన ప్యాషన్ వస్త్రాలను ప్రదర్శిస్తారు. దీనిద్వారా సంప్రదాయం, ఆధునికత కలిసి నూతన ప్యాషన్ అనే మాటకు చిరునామా కాబోతున్నాయి. ఇందువల్ల దేశ విదేశాల యువతలో చేనేతకు గౌరవం లభిస్తుంది. ప్రముఖులు ఇప్పటికే పొచంపల్లి వస్త్రాలను ధరించడం ప్యాషన్గా మారింది. స్టాళ్లలో ప్రదర్శనలు పూర్తిగా గ్రామీణ వాతావరణం కల్పించేందుకు టూరిజం పార్క్ను సిద్ధం చేశారు. సిద్దిపేట గొల్లభామ చీరలు, నారాయణపేట, గద్వాల చీరలు, పోచంపల్లి, పుట్టపాక, సిరిపురాలలో తయారయ్యే వస్త్రాలను ప్రదర్శిస్తారు. వీటిని స్థానిక మహిళలు ధరిస్తారు. సంప్రదాయంగా వచ్చిన వస్త్రాలను ఆధునిక ప్యాషన్ డిజైనర్లతో కొత్త రకంగా వస్త్రాలను రూపొందించి అందగత్తెల ముందు ప్రదర్శిస్తారు. ఇక్కత్ డిజైన్లతో తయారవుతున్న తేలియా రుమాల్, సిల్క్, కాటన్, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, రజయ్ (క్విల్స్), స్టోల్స్, స్కాప్స్, దుప్పట్టా, డోర్, టేబుల్ కర్టన్స్, పిల్లో కవర్స్ తదితర వెరైటీలను ప్రదర్శించనున్నారు. చదవండి: సరసర్వతి నది పుష్కరాలకు నీళ్లు వచ్చాయి -
విశాఖలో మాయా లోకం
విశాఖ సిటీ: ఊహకందని అద్భుత ప్రపంచం కళ్ల ముందు సాక్షాత్కరించనుంది. కనివినీ ఎరుగని మాయాలోకం అందరినీ మంత్రముగ్ధులను చేయనుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి మిథ్యా ప్రపంచం విశాఖ వాసులకు సరికొత్త అనుభూతిని పంచనుంది. ఇందుకోసం విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది.మధురవాడ ప్రాంతంలో రెండు ఐకానిక్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. వర్చువల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ను అందించడానికి ‘వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాలిటీ ఎరీనా అండ్ త్రీ స్టార్ హోటల్’తో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణకు దరఖాస్తులు ఆహ్వానించింది.రూ.470 కోట్లతో హేబిటేట్ సెంటర్ఆధునిక వాతావరణంలో సంపన్న వర్గాల అభిరుచులకు తగ్గట్టుగా ‘ఈస్ట్ కోస్ట్ హేబిటేట్ సెంటర్’ను నిర్మించాలని వీఎంఆర్డీఏ అధికారులు నిర్ణయించారు. ఐటీ సంస్థలకు సమీపంలో ఎండాడ లా కాలేజీ నుంచి రుషికొండ రోడ్డులో 8.82 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. పీపీపీ విధానంలో రూ.470 కోట్లతో ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇందులో ఐటీ స్పేస్, బిజినెస్ సెంటర్, రిటైల్ స్పేస్, ఆడిటోరియం, సెమినార్ హాల్, పార్టీ ఈవెంట్స్ లాన్లతో పాటు ట్రేడ్ ఫెయిర్లు, ఆర్ట్, కల్చర్ షో, ఎగ్జిబిషన్లకు అనువుగా సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే క్లబ్ హౌస్, అంతర్జాతీయ రుచులతో వంటలు అందించే రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇండోర్ యాంఫీ థియేటర్, 400 మంది పట్టేలా కేఫ్టేరియా, 600 మంది సౌకర్యంగా కూర్చునే ఫైన్ డ్రైన్ రెస్టారెంట్లు ఉండనున్నాయి. 60 రూములు కలిగిన హోటల్, 250 మందికి సరిపడా ఈవెంట్ లాన్, సూపర్ మార్కెట్, మెడికల్, స్పోర్ట్స్ సెంటర్లు కూడా రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ఎఫ్పీలు ఆహ్వానించారు. ఈ నెల 20వ తేదీలోగా ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న సంస్థల అర్హతలు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు. వీలైనంత వేగంగా ఈ ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు.2.82 ఎకరాల్లో వర్చువల్ ఎరీనావిశాఖ వాసులకే కాకుండా ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖలో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించేందుకు వీఎంఆర్డీఏ అధికారులు సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇప్పటి వరకు పార్కులు, మ్యూజియాలు, కన్వెన్షన్ సెంటర్లపైనే దృష్టి పెట్టినవారు.. ఇప్పుడు భవిష్యత్తు తరాలకు ఆసక్తికరమైన, ఆకట్టుకునేలా వైజాగ్ ఎక్స్పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనా అండ్ 3 స్టార్ హోటల్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ఎండాడ లా కాలేజ్ మార్గంలో 2.82 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు.గేమింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికత అంశాలతో తీర్చిదిద్దనున్నారు. ఇందులో వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని పొందేలా 360 డిగ్రీల థియేటర్, మిక్స్డ్ రియాల్టీ ఎస్కేప్ రూమ్, చారిత్రక యుగాల అనుభవంలోకి తీసుకెళ్లేలా వర్చువల్ టైమ్ ట్రావెల్, వీఆర్ గేమింగ్ జోన్, 350 చదరపు మీటర్ల భారీ అక్వేరియం, 20 మల్టీక్యూజన్ రెస్టారెంట్ అవుట్లెట్లు, 10 శాతం కమర్షియల్ అవుట్లెట్లతో పాటు 100 రూమ్లు, 1000 మంది పట్టేలా ఫంక్షన్ హాల్తో త్రీ స్టార్ హోటల్ను నిర్మించనున్నారు.ఆర్థిక, పర్యాటకానికి అనుగుణంగా..పర్యాటకాభివృద్ధి కోసమే కాకుండా ఆర్థిక పరిపుష్టికి అనుగుణంగా రెండు కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నాం. ఐటీ సంస్థలకు సమీపంలో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో వర్చువల్ రియాలిటీ ఎరీనాతో పాటు అర్బన్ హేబిటేట్ సెంటర్ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం ఆర్ఎఫ్పీలు ఆహ్వానించాం. ఇవి ఏర్పాటైతే ప్రపంచ పర్యాటకులకు మంచి అనుభూతిని పంచడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాల నిర్వహణకు వేదికలుగా నిలుస్తాయి. –కె.ఎస్.విశ్వనాథన్, మెట్రోపాలిటన్ కమిషనర్ -
రైలు ప్రయాణం ‘ఉక్క’రబిక్కిరి
సాక్షి, నెట్వర్క్ : వేసవి తాపం దృష్ట్యా ప్రయాణం అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. రైలు ప్రయాణం అంటే మరీ బెంబేలెత్తిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైన నమోదవుతుండడంతో జనరల్ బోగీల్లో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. పేద, అల్పాదాయ వర్గాలు ప్రయాణించే ఈ బోగీలను ఇటీవల కేంద్రం భారీగా తగ్గించడంతో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రయాణికులు ఊపిరి ఆడక నరకం అనుభవిస్తున్నారు. కిటికీల్లో నుంచి వస్తున్న వడగాడ్పులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వృద్ధులు, చిన్నారులు వడదెబ్బకు గురవుతున్నారు. రిజర్వేషన్ బోగీల్లోనూ ఇదే దుస్థితి. దీంతో చార్జీ ఎక్కువగా ఉన్నా.. ఏసీ కోచ్లు, ఎకానమీ ఏసీ కోచ్లలో ప్రయాణానికే అత్యధికులు మొగ్గుచూపుతున్నారు. రద్దీ పెరుగుదలతో ఏసీ కోచ్లు నెల, నెలన్నర ముందే నిండిపోతున్నాయి. ఏ రైలు చూసినా వెయిటింగ్ లిస్టు చూపిస్తున్నాయి. రద్దీ పెరిగిన నేపథ్యంలో ఏసీ కోచ్ల పెంపునకు రైల్వే శాఖ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఏసీ కోచ్లు, ఎకానమీ కోచ్లతోపాటు సాధారణ బోగీలు మరింత పెంచితే ఉపశమనంగా ఉంటుందని చెబుతున్నారు. ఆధ్యాత్మిక యాత్రలలో ఆపసోపాలు పరీక్షలు పూర్తయ్యాయి. వేసవి సెలవులు వచ్చాయి. దీంతో పిల్లలతో చాలామంది ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శనకు వెళ్తుంటారు. బస్సు కంటే రైలు ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి మీదుగా రోజూ 90 నుంచి వంద రైళ్లు నడుస్తుంటాయి. సుమారు రెండు లక్షల మంది ప్రయాణిస్తుంటారని సమాచారం. వీరంతా వేసవి తాపానికి అల్లాడుతున్నారు. జనరల్తోపాటు ఏసీ బోగీలు పెంచాలని కోరుతున్నారు.సీట్లు, బెర్త్లు దొరకడం లేదువేసవి సెలవుల దృష్ట్యా బోగీలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. రిజర్వేషన్ చేసుకుందామన్నా.. సీట్లు, బెర్త్లు దొరకడం లేదు. సాధారణ బోగీల సామర్థ్యం 90 మంది అయితే 200 మంది వరకు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. స్లీపర్ కోచ్ సామర్థ్యం 72. డిమాండ్ పెరగడంతో ఏసీ కోచ్లలోనూ సీట్లు దొరకడం లేదు. చాంతాడంత వెయిటింగ్ లిస్టు చూపిస్తుంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, హౌరా, భువనేశ్వర్ వెళ్లే రైళ్లకు ఏసీ కోచ్లలో కనీసం నెల రోజుల వరకు సీట్లు లేవు. స్లీపర్ కోచ్ల సంగతి ఇక చెప్పక్కర్లేదు. ముఖ్యంగా విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఫలక్నుమా, గరీభ్రథ్, గోదావరి తదితర పలు ఎక్స్ప్రెస్లలో ఏసీ కోచ్లలో ఖాళీలు లేవు. రెండేళ్ల క్రితం నుంచి థర్డ్ ఏసీ ఎకానమీ రైళ్లలో గతంలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్లనుప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్ ఏసీ కోచ్లోని ఓ కూపేలో 8 బెర్త్లుంటే, ఎకానమీ ఏసీ కోచ్లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట. సాధారణ థర్డ్ ఏసీ కోచ్ కంటే ఎకానమీ కోచ్ టికెట్ ధర తక్కువగా ఉంటుంది. అందుకే అల్పాదాయ వర్గాలు ఈ ఎకానమీ ఏసీ కోచ్లలో ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు.ఖర్చయినా ఏసీనే బెటర్ ఉక్కబోత, సౌకర్యాల లేమి, గాలి ఆడని పరిస్థితితో స్లీపర్ క్లాస్ ప్రయాణం నరకంగా మారింది. మా పిల్లలు ఇద్దరూ విశాఖలో ఉంటారు. వారి దగ్గరకు ప్రతినెలా మా భార్యాభర్తల్లో ఎవరో ఒకరం వెళ్లి వస్తుంటాం. ఈ క్రమంలో స్లీపర్ క్లాస్లో ప్రయాణించలేక, ఖర్చు ఎక్కువైనా వందేభారత్, థర్డ్ ఏసీల్లో వెళ్లాల్సి వస్తుంది. – బండి వెంకటేశ్వరరావు, రైల్వే ప్రయాణికుడు, ఏలూరు కిటికీ తెరిస్తే వడగాలి, మూస్తే ఉక్కపోత ఎండలు భయంకరంగా ఉన్నాయి. గద్వాల నుంచి కర్నూలుకు ప్రయాణం చేయాలంటేనే ఇబ్బందిగా ఉంది. కిటికీలు తెరిస్తే వడగాలి, మూస్తే ఉక్కపోత. నరకం చూస్తున్నా. – రామన్న, గద్వాల ఊపిరి ఆడడం లేదునా పేరు విజయ్. నేను చెన్నైలో రైలెక్కాను. బోగీలన్నీ కిక్కిరిశాయి. కిటికీలో నుంచి వేడిగాలులు వస్తున్నాయి. కూర్చుని ప్రయాణించడమే కష్టంగా ఉంది. ఇక నిలుచుని ప్రయాణించేవారి దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఊపిరి ఆడడం లేదు. ఏసీ, జనరల్ బోగీల సంఖ్య పెంచాలి. –విజయ్, కడప ఏసీ బోగీలు పెంచాలివేసవి తాపం దృష్ట్యా సాధారణ, స్లీపర్ బోగీల్లో ప్రయాణించలేని దుస్థితి నెలకొంది. ఊపిరి ఆడడం లేదు. ఏసీ బోగీల్లో సీట్లు దొరకడం లేదు. రైల్వే శాఖ ఎండా కాలం ఏసీ బోగీలు పెంచాలి. – దల్లి మహేశ్వరరెడ్డి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగి, విశాఖపట్నం స్లీపర్ బోగీలో నరకంకసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దర్శనం కోసం ఏడాదిలో కనీసం రెండు, మూడుసార్లు గుంతకల్లుకు రైలులో వస్తుంటాం. స్లీపర్, జనరల్ బోగీల్లో ప్రయాణించాలంటే నరకంగా ఉంది. వేడి సెగలకు తట్టుకోలేకపోతున్నాం. – లక్ష్మీదేవి, హిందూపురం, శ్రీసత్యసాయి జిల్లా చాలా కష్టంగా ఉందితమిళనాడులోని కోయంబత్తూరులో తెల్లవారుజామున డిబ్రుఘర్–కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఎక్కాను. ఎండవేడి బాగా ఉంది. వడగాడ్పులకు ప్రాణం పోయినంత పనవుతోంది. చొక్కా తీసేసి బనీన్ మీద కూర్చున్నా.. ఉండలేకపోతున్నా. – లక్కీజర్, బిహార్ -
దడ పుట్టించే ‘డ్రోణా’స్త్రం
సాక్షి స్పెషల్ డెస్క్,సాక్షి, హైదరాబాద్:రాజుల కాలంలో కత్తులు, బల్లేలతో సైనికులు రణక్షేత్రంలో పోరాడారు. తరవాత.. యుద్ధ భూమిలో తుపాకులు, బాంబుల మోత మోగింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక మానవ రహిత విమానాలు, క్షిపణులతో విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు.. ఏకంగా వేల మైళ్ల దూరం నుంచే శత్రుదేశంపై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్నారు. ఇజ్రాయెల్–హమాస్, రష్యా–ఉక్రెయిన్.. తాజాగా భారత్–పాక్... యుద్ధం ఏదైనా.. డ్రోన్స్ (మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీ)) ఇప్పుడు సైనిక సంపదలో అత్యంత కీలకంగా మారాయి. పెళ్లిళ్ల వంటి వేడుకల్లో ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్స్ మాత్రమే చాలా మందికి సుపరిచితం. కానీ, డ్రోన్స్ అంటే అంతకుమించి. డ్రోన్లు అధునాతన ఆయుధాలు. ఎవ్వరూ ప్రాణాలను పణంగా పెట్టకుండానే కచి్చతమైన దాడులు చేయడం, వేగంగా మోహరించే సామర్థ్యం వీటి సొంతం. క్షిపణులతో పోలిస్తే వీటి అభివృద్ధికి అయ్యే వ్యయమూ తక్కువే. మన దేశంలో డ్రోన్ల వాడకం.. 1999లో కార్గిల్ యుద్ధంలో మన సైన్యం తొలిసారి యూఏవీలను వినియోగించింది. ఆ తర్వాత ఇండియా అధికారికంగా వీటి కొనుగోలు మొదలు పెట్టింది. ప్రస్తుతం మన సైన్యం వద్ద ఇజ్రాయిల్ నుంచి దిగుమతి చేసుకున్న సెర్చర్ ఎంకే–2 టాక్టికల్ డ్రోన్స్, హెరాన్మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (ఎంఏఎల్ఈ), హార్పీ యాంటీ రాడార్ డ్రోన్లు ఉన్నాయి. హార్పీ అనేది ఆత్మాహుతి డ్రోన్(లాహోర్ వైమానిక రక్షణ వ్యవస్థను కూల్చివేసే క్రమంలో దీన్ని వినియోగించారు). వీటితో పాటు హరోప్ లాయిటరింగ్ అటాక్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. రాడార్ సైట్లు, వాహనాలే లక్ష్యంగా మందుగుండుతో ఢీకొట్టి సర్వనాశనం చేయడం దీని స్పెషాలిటీ. దీంతో పాటు అధిక మన్నిక, పేలోడ్ సామర్థ్యం కలిగిన ఇజ్రాయిల్ ఎంఏఎల్ఈ డ్రోన్’హెరాన్టీపీ/మార్క్ 2’కూడా మన దగ్గర ఉంది.మొదటి ప్రపంచ యుద్ధంలో..మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, అమెరికా రెండూ తొలిసారిగా యూఏవీతో ప్రయోగాలు చేశాయి. 1950–60లలో శత్రు భూభాగంపై గూఢచర్యం చేయడానికి యూఎస్ చిన్న రిమోట్ కంట్రోల్డ్ డ్రోన్లు ఉపయోగించింది. వియత్నాం యుద్ధంలో నిఘా యూఏవీలు తొలిసారిగా మోహరించారు. 2000వ సంవత్సరంలో అమెరికా హెల్ఫైర్ క్షిపణులతో కూడిన ప్రిడేటర్ డ్రోన్ను రూపొందించింది. ఇక్కడి నుంచే సైనిక ఆయుధ భాండాగారంలోపెనుమార్పులు వచ్చాయి. మగ తేనెటీగను ఇంగ్లీషులో డ్రోన్ అంటారు. శ్రామిక తేనెటీగలకన్నాఇవి పెద్దగానే ఉంటాయి. కానీ తేనెనూ సంపాదించలేవు. తమను తామూపోషించుకోలేవు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇవి చేసే పని ఏమీ ఉండదు. కానీ, ఆడ తేనెటీగ కోసం వెతుకుతూ ఎగిరి, దాన్ని కలిశాక పడిపోతుంది. డ్రోన్ మాత్రం అలాకాదు.. చూసి రమ్మంటే కాల్చి వస్తుంది.హైదరాబాద్ నుంచి..రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో హైదరాబాద్ ప్రపంచ పటంలో ఇప్పటికే నిలిచింది. డిఫెన్స్ డ్రోన్విభాగంలోనూ ఇదే బాటలో పయనిస్తోంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్.. భారత రక్షణ శాఖ కోసం ఏఎల్ఎస్–250 యూఏవీలను ఉత్పత్తి చేస్తోంది. అదానీ–ఎల్బిట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇండియా.. హెర్మీస్ 900 యూఏవీలను తయారు చేస్తోంది. రక్షణ రంగానికి కావాల్సిన కీలక యంత్ర, పరికరాల తయారీలో ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ సంస్థ ఎస్ఈసీ ఇండస్ట్రీస్కు చెందిన ట్రిన్నోవేట్ సినర్జీ టెక్నాలజీస్ చిన్న యూఏవీలు, హైబ్రిడ్ డ్రోన్స్ సరఫరా చేస్తోంది.ఆయుధాలను మోసే యూఏవీలను ఇండియన్ ఆర్మీకి అందిస్తోంది. జెన్ టెక్నాలజీస్ చిన్న యూఏవీలను భారత రక్షణ విభాగాలకు సరఫరా చేస్తోంది. ఎస్ఈసీ డీఆర్వీఏఎన్ఇన్నోవెన్షన్స్.. మిలిటరీ టెస్టింగ్ కోసం టార్గెట్ డ్రోన్లను; శిక్షణ, మదింపు కోసం శత్రు డ్రోన్లను అనుకరించే యూఏవీలను ఆఫర్ చేస్తోంది. మారుత్ డ్రోన్స్ రక్షణ, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. టీ–హబ్, టీ–వర్క్స్ కేంద్రంగా కొన్ని స్టార్టప్స్ ఈ సెగ్మెంట్లోకి రానున్నాయి. భారత్ ఎలక్ట్రికల్స్ – హిందూస్థాన్ ఏరోనాటిక్స్ తయారీ భాగస్వాములుగా డీఆర్డీఓ రుస్తోమ్ – 2 డ్రోన్స్ అభివృద్ధి చేసింది. దక్ష యూఏవీ, ఐడియా ఫోర్జ్ వంటివి కూడా హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2030 నాటికి రూ.34,860 కోట్లకు..డ్రోన్స్, యూఏవీల తయారీలో 75% వరకు విడి భాగాలు దేశీయంగా ఉత్పత్తి అయినవే. కొన్ని నెలల్లో ఇది 100 శాతానికి చేరడం ఖాయమని పరిశ్రమ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. డిఫెన్స్ డ్రోన్కంపెనీలు పరిశోధన, అభివృద్ధి, తయారీకి ఇప్పటికే రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టాయి. పరిశ్రమకు రూ.1,000 కోట్ల ప్రోత్సాహకాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. భారత సైనిక డ్రోన్ మార్కెట్ 2024లో రూ.13,040 కోట్లు. 2030 నాటికి ఇది రూ.34,860 కోట్లకు చేరుతుందని గ్రాండ్ వ్యూ రిసర్చ్ అంచనా. -
హై ప్రోటీన్ మంత్రం
గతంలో అన్ని పోషకాలూ ఇందులోనే ఉన్నాయి అంటూ పాలల్లో కలుపుకొని తాగే పొడులు, బిస్కట్ల వంటివాటిని కంపెనీలు తీసుకొచ్చేవి. ఇప్పుడు ట్రెండ్ మారింది. కరోనా తరవాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. రాగి ఇడ్లీ మొదలు మొలకలు, ఫ్రూట్ సలాడ్లు, చిరు ధాన్యాల వంటకాలు.. ఇవన్నీ చాలామంది నిత్య జీవితంలో భాగమైపోయాయి. విడివిడిగా పోషకాలు, వాటి అవసరంపై అవగాహనా పెరిగింది.ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని కంపెనీలు ప్రోటీన్ మంత్రాన్ని జపిస్తున్నాయి. మా ఉత్పత్తిలో అత్యధిక ప్రోటీన్ ఉందంటూ ప్రత్యేకంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు మనకు రోజువారీ ఎంత ప్రోటీన్ కావాలి? అది ఎలా లభిస్తుంది? భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్ఆర్), జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ఏం చెబుతున్నాయి? –(సాక్షి, స్పెషల్ డెస్క్)అమూల్ కంపెనీ ఇటీవల ‘ప్రోటీన్ కుల్ఫీ’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని ప్యాక్మీద పెద్దగానే ముద్రించింది. అమూల్ ఇప్పటికే బటర్ మిల్క్, రోజ్ లస్సీ, కూల్ కేసర్, కూల్ కాఫీ, టిన్ పనీర్ వంటి వాటిని ‘హై ప్రోటీన్’ పేరుతో విక్రయిస్తోంది. ఇంకా ఆసక్తికరం ఏంటంటే.. ప్రోటీన్ సమోసా, ప్రోటీన్ వడాపావ్ వంటివి కూడా తీసుకొచ్చింది. అలాగే మిల్కీ మిస్ట్ కంపెనీ ‘స్కైఆర్’– హై ప్రోటీన్ పెరుగు తీసుకొచ్చింది.ఇందులో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. ఐటీసీ కంపెనీ ‘ఆశీర్వాద్’ ఉత్పత్తుల్లో భాగంగా...నమ్మ చక్కీ పేరిట గోధుమ పిండి విక్రయిస్తోంది. ఇందులోనూ ‘హై ఇన్ ప్రోటీన్’ అని ప్యాక్ మీదే ముద్రించి, ప్రతి 100 గ్రాముల్లో 14.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని రాశారు.బ్రిటానియా కంపెనీ ‘బి యు’ పేరిట ప్రోటీన్ బార్లు తెచ్చింది. 45 గ్రాముల ఈ బార్లో 10.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని పేర్కొంది. ఇవేకాదు, ఇంకా చాలా కంపెనీలు.. ఇప్పుడు ప్రోటీన్ మంత్రం జపిస్తున్నాయి. కరోనా తరవాత ప్రజల్లో పెరిగిన ఆరోగ్య స్పృహను దృష్టిలో పెట్టుకుని, వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి.ఐసీఎమ్ఆర్ – ఎన్ఐఎన్ ఏమంటున్నాయి?భారతీయులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో పూర్తి మార్గదర్శకాలతో ఐసీఎమ్ఆర్ – ఎన్ఐఎన్... ‘డైటరీ గైడ్లైన్స్ ఫర్ ఇండియన్స్ 2024’ పుస్తకం వెలువరించాయి. శరీరంలో ఎంజైములు, హార్మోన్లు, హిమోగ్లోబిన్, కణత్వచం భాగాల వంటివాటి తయారీ.. ఇలాంటి ఎన్నో పనులకు ప్రోటీన్లు చాలా అవసరం. విరిగిపోయిన కణజాలాల స్థానే కొత్తవాటి కోసమూ ప్రోటీన్లే కావాలి. ఎదిగే పిల్లల్లో కండరాలు, ఎముకల నిర్మాణానికీ ఇవే అవసరం.ఎంత ప్రోటీన్ అవసరమంటేఐసీఎమ్ఆర్ – ఎన్ఐఎన్ సూచనల ప్రకారం.. ఆరోగ్యంగా ఉండే ఒక వ్యక్తి... తన శరీరంలో ప్రతి కేజీ బరువుకీ రోజుకి 0.83 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అంటే సగటున 25 కేజీల బరువుండే మనిషి రోజుకి సుమారు 21 గ్రాముల ప్రోటీన్, 50 కిలోలుంటే 42 గ్రాములు, 65 కిలోలుంటే 54 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. అలాగని ప్రోటీన్ ఉండే ఆహారం ఒక్కటే తీసుకుంటే.. కండరాల బలం పెరగదు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు కూడా చాలా అవసరం. అంతేకాదు, రోజూ సరిపడా శారీరక వ్యాయామం చేయకపోయినా మనం తీసుకున్న ప్రోటీన్లు కండరాల నిర్మాణానికి తోడ్పడవు. మార్కెట్లోకి కొన్ని కంపెనీలు ప్రోటీన్ పౌడర్లను కూడా విడుదల చేస్తున్నాయి. ఇందులో అదనంగా షుగర్లు, స్వీటెనర్లు, ఇతరత్రా కృత్రిమ పదార్థాలు ఉంటున్నాయి. ప్రోటీన్ సప్లిమెంట్ల రూపంలో అత్యధిక ప్రోటీన్ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని ఐసీఎమ్ఆర్ చెబుతోంది. చాలామంది అథ్లెట్లు సప్లిమెంట్ల అవసరం లేకుండానే.. తమ రోజువారీ ఆహారంలో నుంచే తమ శరీరానికి అవసరమైన ప్రోటీన్ పొందగలుగుతారని స్పష్టం చేస్తోంది.లేబుల్ చదవాలిమార్కెట్లో ఏ వస్తువు కొన్నా లేబుల్ మాత్రం తప్పనిసరిగా చదవాలని ఐసీఎమ్ఆర్ సూచిస్తోంది. ఉదాహరణకు ‘తక్కువ కొవ్వులు (లో ఫ్యాట్)’ అని లేబుల్లో రాస్తారు. కానీ, ఆ ఉత్పత్తి ద్వారా చాలా క్యాలరీలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మిగతా సమాచారాన్ని కూడా చదవాలి. గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, విటమిన్ డి.. వంటివి లేబుల్లో రాసి ఉంటే.. సింగిల్ సెర్వింగ్ ద్వారా 10 నుంచి 19 శాతం ఆ పోషకం మనకు అందే అవకాశం ఉంటుంది.ప్రోటీన్లు అత్యధికంగా ఉండేవి⇒ మాంసం, గుడ్లు, చికెన్, చేపలు⇒ పాలు, పప్పు దినుసులు, సోయా బీన్, కిడ్నీ బీన్స్, బఠానీ, పెసలు, శెనగలు, బాదం, పిస్తా, జీడిపప్పు, అక్రోటు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు, క్వినోవా మొదలైనవి⇒ మాంసాహారులకు వారంలో 700 –900 గ్రాముల చేపలు లేదా చికెన్ తినడం వల్ల వారికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ కొనేస్తున్నారుకేంద్ర గణాంక శాఖ ‘గృహ వినియోగ వ్యయ సర్వే’ ప్రకారం... పానీయాలు, ప్రాసెస్డ్ ఆహారంపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు నెలకు సగటున చేసే ఖర్చు 2022–23తో పోలిస్తే 2023–24లో పెరిగింది. -
కర్నూలులో కాలుష్య కాసారం
ఇదో భయంకర కాలుష్య కథ. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో నిషేధించిన అత్యంత ప్రమాదకర రసాయనాలను ఉత్పత్తి చేసి.. వాటి వ్యర్థాలను తుంగభద్ర, కృష్ణా నదుల్లో కలిపి.. పరీవాహక ప్రాంతాల్లోని గాలి, నీటిని కలుషితం చేసి.. ప్రజలు, జీవుల ఆరోగ్యాలను గుల్లచేయబోతున్న పరిశ్రమ కథ. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవస్థలను ప్రలోభపెట్టి, నిజాలు దాచిపెట్టి.. ప్రజారోగ్యం కంటే వ్యాపార సామ్రాజ్య విస్తరణ ద్వారా డబ్బు సంపాదనే పరమావధిగా పెట్టుకున్న టీజీవీ గ్రూప్ కథ!సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు జిల్లా పంచలింగాల సమీపంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కుటుంబానికి చెందిన ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఉంది. భరత్ తండ్రి, బీజేపీ సీనియర్ నాయకుడు టీజీ వెంకటేశ్ పర్యవేక్షణలో ఇది నడుస్తోంది. ఈ పరిశ్రమలో కాస్టిక్ సోడా ఉత్పత్తితో క్లోరిన్ వెలువడుతుంది. ఇది విష వాయువు. క్లోరిన్ రసాయనాలతో టెఫ్లాన్ (పీటీఎఫ్ఈ), క్లోరో మీథేన్ వంటి ఉత్పత్తుల యూనిట్ను విస్తరించేందుకు టీజీ గ్రూప్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.పీటీఎఫ్ఈ (పారీ టెట్రాక్లోరో ఇథిలిన్) తయారీలో పీఎఫ్వోఏ (ఫర్ఫ్లోరో ఆక్టనాయిక్ యాసిడ్), కార్బన్ టెట్రాక్లోరైడ్ వంటి రసాయనాలు వినియోగిస్తారు. ప్రమాదకరమైన పీఎఫ్వోఏను జర్మనీ, డెన్మార్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వేతో పాటు ఎన్నో దేశాలు నిషేధించాయి. ఆరోగ్యం గుల్లవుతోందని.. ఇలాంటి రసాయనాల వాడకాన్ని శాశ్వతంగా మానేయాలని 2019లో స్టాక్హోమ్ కన్వెన్షన్ వేదికగా 180 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి.అమెరికాలో డార్క్ వాటర్!అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో పీఎఫ్వోఏ, పీఎఫ్ఏఎస్ (ఫర్ అండ్ పాలీ ఆల్కల్ సబ్స్టాన్స్) వాడకంతో ఓ గ్రామంలోని ఆవులు చనిపోయాయి. ఫ్యాక్టరీ సమీప గ్రామాలు, నదిలోని నీరు తాగడంతో అనారోగ్యానికి గురై మనుషులు, జీవరాశులు చనిపోవడంతో అమెరికా ప్రభుత్వం సైన్స్ ప్యానల్ ఏర్పాటు చేసింది. ఎమరీ యూనివర్సిటీ, నోటర్డామ్, లండన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు.. 70 వేలమంది రక్త నమూనాలు సేకరించారు. పీఎఫ్వోఏ, పీఎఫ్ఏఎస్ అత్యంత ప్రమాదకరమని తేల్చారు. ఫ్యాక్టరీని మూసేయడంతో పాటు రసాయనాలను నిషేధించారు. దీనిపై ‘డార్క్ వాటర్’ పేరుతో హాలీవుడ్ సినిమా కూడా తీశారు. ఇప్పుడు అనపర్తి, టీజీ గ్రూప్ ఫ్యాక్టరీలతో మనదగ్గర కూడా అలాంటి ఘోర పరిస్థితి ఉత్పన్నం కానుంది.బుధవారం ప్రజాభిప్రాయ సేకరణఫ్యాక్టరీ ఏర్పాటుపై టీజీ గ్రూప్ ఆల్కలీస్ సమీపంలోని గొందిపర్ల వాసులతో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. కాగా, దీనికి అనుమతులు ఇవ్వొద్దని ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్ రామకృష్ణారెడ్డి, కో కన్వీనర్ శ్రీనివాసరావు, పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అల్లాబక్ష్, సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కో కన్వినర్ జీవీ భాస్కర్రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.అత్యంత విషపూరిత రసాయనం!ఆల్కలీస్ ఫ్యాక్టరీ తుంగభద్ర ఒడ్డునే ఉంది. దీనికోసం నది ఎగువ భాగంలోని నీటిని వినియోగిస్తారు. వ్యర్థాలను నది దిగువ భాగంలో కలుపుతున్నట్లు తెలుస్తోంది. పీటీఎఫ్ఈ తయారీకి పీఎఫ్వోఏ, పీఎఫ్ఏఎస్ రసాయనాలు నీటిలో కలుస్తాయి. ఇవి తుంగభద్ర ద్వారా కృష్ణా నదిలో చేరుతాయి. ⇒ తుంగభద్ర, కృష్ణానీటిని ఏపీ, తెలంగాణకు చెందిన 2 కోట్లమందికి పైగా ప్రజలు తాగుతారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ద్వారా లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. అయితే, రసాయనాలు కలవడంతో ఈ జలాలు విషపూరితం అవుతున్నాయి. క్యాన్సర్, కిడ్నీ, గర్భధారణ ప్రేరిత రక్తపోటు, ఊపిరితిత్తులు, గుండె, రక్త సంబంధిత, పలు ప్రాణాంతక వ్యాధులు వస్తాయని, హైదరాబాద్కు చెందిన సైంటిస్ట్స్ ఫర్ పీపుల్ అనే సంస్థ నుంచి 27 మంది శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ⇒ డాక్టర్ బాబూరావు, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ రాంబాబు, డాక్టర్ అహ్మద్ఖాన్, ప్రొఫెసర్ విజయ్కుమార్లు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ సెక్రటరీ తన్మయ్కుమార్కు ఈ నెల 5న నివేదికను సమర్పించారు. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డాక్టర్ కృష్ణయ్య, కర్నూలు కలెక్టర్ రంజిత్బాషాకు కూడా నివేదిక పంపారు.మొన్న బలభద్రపురం.. నేడు కర్నూలు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి పరిధిలోని బలభద్రపురంలోని గ్రాసిం కంపెనీ కాస్టిక్ సోడా ప్రాజెక్టు విస్తరణకు 2023 ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. అప్పట్లో మానవ హక్కుల వేదిక ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించారు. 2024 ఫిబ్రవరిలో అనుమతులు వచ్చాయి. కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులను ప్రలోభపెట్టి అనుమతులు తెచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టరీ అనుమతులను సాకుగా చూపి టీజీ గ్రూప్ కూడా పావులు కదిపేందుకు సిద్ధమైంది. భరత్ టీడీపీ కూటమి ప్రభుత్వంలో మంత్రి.. టీజీ వెంకటేశ్ బీజేపీ సీనియర్ నాయకుడు కావడం, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో అనుమతులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.నివేదికలో ముప్పును తొక్కిపెట్టి పీటీఎఫ్ఈ ఉత్పత్తికి ఏ రసాయనాలు ముడి పదార్థాలుగా వాడతారు? టెక్నాలజీ ఎవరి నుంచి కొనుగోలు చేస్తారు? ఎలాంటి వ్యర్థాలు వెలువడతాయి..? ప్రమాదకర రసాయనాలను ఏం చేస్తారు? అనే వివరాలను ప్రభుత్వానికి సమర్పించిన ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక)లో టీజీ గ్రూప్ స్పష్టం చేయకపోవడం గమనార్హం.ప్రాణాలు ముఖ్యమా.. ఆదాయం ముఖ్యమా! అత్యంత విషపూరిత రసాయనాలు వెలువడే టీజీ ఫ్యాక్టరీకి అనుమతులివ్వొద్దు. కృష్ణా జలాలు రెండు రాష్ట్రాలకు ప్రాణాధారం. తుంగభద్ర, కృష్ణా జలాలు విషపూరితం అయితే దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులతో జన జీవనం ఛిన్నాభిన్నం అవుతుంది. ప్రజల ప్రాణాల కంటే ఏదీ ప్రభుత్వాలకు ముఖ్యం కాకూడదు. కేవలం ఆదాయం కోసం టీజీ భరత్, టీజీ వెంకటేశ్ కాలుష్యకారక ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. – రామకృష్ణారెడ్డి, ప్రజాస్వామ్య సంఘాల ఐక్య వేదిక కన్వినర్ గ్రామసభను కూడా రద్దు చేయాలి ప్రపంచ దేశాలు నిషేధించిన రసాయనాలు ఇక్కడ తయారు చేయడం దుర్మార్గం ఆర్22, ఆర్23, పీటీఎఫ్ఈ తయారీలో సాంకేతిక, ప్రమాద నిర్వహణ వివరాలు, టీఎఫ్ఈ, పీఎఫ్ఐబీ లాంటి ప్రమాదకర రసాయనాల ప్రభావం ప్రస్తావనే లేదు. గ్రామసభను కూడా రద్దు చేయాలి. – అల్లాబక్ష్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి ప్రపంచంలో నిషేధం.. మనదగ్గర అనుమతా? ప్రజలు, జీవరాశి పాలిట అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ప్రపంచ దేశాలు నిషేదిస్తున్నాయి. కానీ, కర్నూలులో వాస్తవాలు దాచి పెట్టి అనుమతులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జలాలు వినియోగించే ప్రాంతాలతో పాటు గాలి కాలుష్యం ద్వారా ఏపీ, తెలంగాణలో తీవ్ర ప్రభావం ఉంటుంది. గ్రామసభను రద్దు చేయాలి. కంపెనీ ప్రతినిధులతో వాస్తవాలు చెప్పించాలి. నష్టం అంచనా వేసి ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ బాబూరావు, శాస్త్రవేత్త, హైదరాబాద్ -
బాబే సూత్రధారి.. ‘ముఖ్య’నేత సమర్పించు.. మందు ‘పాత్రలు’!
సాక్షి, అమరావతి: మద్యం మాఫియా డాన్గా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెడ్బుక్ కుట్రను రక్తి కట్టించేందుకు సరికొత్త కుతంత్రాలకు పదును పెడుతున్నారు. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేసుకుని ప్రలోభపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకుని అబద్ధపు వాంగ్మూలాలతో రోజుకో భేతాళ కథను తెరపైకి తెస్తున్నారు. కట్టు కథలు అల్లుతూ, బేతాళ కథలను సృష్టిస్తూ వాటిని వారితో పలికిస్తున్నారు. అవే కల్పిత కథలను రిమాండ్ రిపోర్టులో పొందుపరుస్తున్నారు. దానిపై తాము సంతకం చేయలేదని నిందితులే స్వయంగా న్యాయమూర్తుల ఎదుట వెల్లడిస్తున్నారంటే బాబు భేతాళ కథలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వ్యాపార భాగస్వామిగా ఉన్న రాజ్ కేసిరెడ్డిని సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు తీసుకొచ్చారు. తాను అబద్ధాలు చెప్పలేనని, ఇంత దారుణమైన రిమాండ్ రిపోర్టుపై సంతకం చేయలేదని రాజ్ కేసిరెడ్డి స్వయంగా చెప్పారు. అదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వెల్లడించారు. సిట్ అధికారుల వేధింపులు, అబద్ధపు వాంగ్మూలాలపై మూడుసార్లు కోర్టుకు మొర పెట్టుకున్న బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్ చేసి కేంద్ర సర్వీసులకు సాగనంపారు. రెడ్బుక్ అరాచకాలు, బెదిరింపులను డిస్టిలరీల యజమానులు సైతం న్యాయస్థానానికి నివేదించారు. చంద్రబాబు సూత్రధారిగా ఆడిస్తున్న ఈ కపట నాటకంలో బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూష, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్రెడ్డి పావులుగా మారారు. బెదిరించడం.. వెంటాడి వెంటాడి వేధించడం.. అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించడం దాకా అంతా చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి బెయిల్పై ఉన్న చంద్రబాబు.. గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు. గతంలో 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దందాను మించి ఇప్పుడు 2024లో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచబాట వేసుకున్నారు. టీడీపీ సిండికేట్ దోపిడీకి అడ్డుకట్ట వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన దశలవారీ మద్య నియంత్రణ విధానంపై అక్రమ కేసుతో కుయుక్తులకు పదును పెడుతున్న వైనం ఇదిగో ఇలా ఉంది... సిట్ వేధింపులపై మూడుసార్లు కోర్టుకు.. చివరికి తలొగ్గడంతో కేంద్ర సర్వీసులకు చంద్రబాబు రెడ్బుక్ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం ఆయన్ను తీవ్రంగా బెదిరించింది. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి మూడుసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొర పెట్టుకున్నారు. అయినా సరే సిట్ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు. కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన ఆయనను డెప్యుటేషన్ కాలపరిమితి ముగిసినా రిలీవ్ చేయలేదు. చివరికి సిట్ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా.. సిట్ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ కుట్ర నాటకంలో తాను ఇచ్చిన పాత్రకు వాసుదేవరెడ్డి న్యాయం చేశారని చంద్రబాబు సంతృప్తి చెందారు. అంతే.. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయడం... ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఆ ఇద్దరూ.. కీలు బొమ్మలే బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్ అధికారులు భయపెట్టి, బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు.రాజకీయ పాత్రధారి విజయసాయిరెడ్డి అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టారు. అది మరెవరో కాదు.. మాజీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. వైఎస్సార్సీపీ అధినేత ఆయన్ను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు. మరో మూడున్నరేళ్లు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉపఎన్నికలు వస్తే రాజ్యసభ సీటును తిరిగి గెలుచుకునేంత ఎమ్మెల్యేల బలం వైఎస్సార్సీపీకి లేదని తెలిసి కూడా రాజీనామా చేయడం గమనార్హం. అంటే రాజ్యసభలో టీడీపీ కూటమికి ప్రయోజనం కలిగించేందుకే ఆయన రాజీనామా చేశారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై టీడీపీ కూటమి సర్కారు బనాయించిన అక్రమ కేసుకు ఆయన వంతపాడటం అసలు కుట్రను బట్టబయలు చేసింది. కాకినాడ పోర్టులో వాటాల బదిలీపై కేసు విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి బయటకు వచ్చాక మద్యం అక్రమ కేసు గురించి మాట్లాడారంటే దీని వెనుక ఉన్న వ్యూహాన్ని అర్థం చేసుకోవచ్చు. తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్రెడ్డిరెడ్బుక్ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి, వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం. అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబ డిస్టిలరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్సార్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్ కుట్ర పన్నుతుండటం గమనార్హం. విజయవాడ ఎంపీ వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డి ఈ కుట్రలకు మరింత పదును పెడుతూ ఈ కేసులో రాజ్ కేసిరెడ్డిని ఏ 1గా చూపించారు. ఆయన ఎవరో కాదు.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామే! ఇద్దరి కంపెనీల చిరునామా, మెయిల్ ఐడీ కూడా ఒకటే కావడం గమనార్హం. అమెరికా, దుబాయ్ సహా వివిధ దేశాలకు అక్రమ నిధులు తరలించేందుకు వారిద్దరూ భాగస్వాములుగా ఏర్పాటు చేసుకున్న కంపెనీల వివరాలను చిన్ని అన్న, మాజీ ఎంపీ కేశినేని నాని ఇటీవల స్వయంగా వెల్లడించడం తెలిసిందే. ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకిలక్ష్మి, రాజ్ కేసిరెడ్డి ప్రైడ్ ఇన్ఫ్రా ఎల్ఎల్పీతోపాటు ఇతర వ్యాపార సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నట్లు కేశినేని నాని స్వయంగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం తెలిసిందే. ఆ అధికారులకేం సంబంధం..? చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గత ప్రభుత్వ హయాంలో సీఎంవోలో విధులు నిర్వర్తించిన ఉన్నతాధికారులను ఈ అక్రమ కేసులో ఇరికిస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏ.ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట. ధనుంజయ్రెడ్డి సీఎంవోలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలను ఏనాడూ పర్యవేక్షించలేదు. ఇక ఓఎస్డీ కృష్ణ మోహన్రెడ్డికి ఎక్సైజ్ శాఖ, బెవరేజస్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు. అయినా సరే వారిని నిందితులుగా చేర్చడం విడ్డూరంగా ఉంది. సీఐడీ చేతులెత్తేయడంతో.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సీఐడీకి అప్పగించింది. మూడు నెలలపాటు దర్యాప్తు చేసిన సీఐడీ ఎలాంటి అక్రమాలూ లేవని చేతులెత్తేసింది. అయినా సరే ఇది ఎల్లో మీడియాకు పట్టదు. తరువాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. రోజుకో కట్టుకథ అల్లుతూ అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుంది. కమీషన్లు టీడీపీ పెద్దలకే తెలుసు..! మద్యం అమ్మకాలు పెరిగే కొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు పాలనలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగగా... అనంతరం వైఎస్ జగన్ హయాంలో 2019–24 మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి. అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు అందింది టీడీపీ పెద్దలకేనని స్పష్టమవుతోంది.సిట్ వేధింపులపై కోర్టుకు డిస్టిలరీల ప్రతినిధులుదర్యాప్తు పేరిట సిట్ అధికారులు తమను వేధిస్తుండటంపై పలు డిస్టిలరీల ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. సిట్ అధికారులు తమను హింసిస్తున్నారని వాపోయారు. దాంతో డిస్టిలరీల ప్రతినిధులను వారి నివాసాల్లోనే విచారించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ అక్రమ కేసులో ఇరికించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరి తెగిస్తోందో చెప్పేందుకు ఈ ఉదంతమే తార్కాణం. మిథున్రెడ్డి సవాల్పై స్పందించని సర్కారు చంద్రబాబు తాను ప్రవేశపెట్టిన పాత్రధారుల ద్వారా వైఎస్సార్సీపీ కీలక నేతలపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. వాటిని తిప్పికొడుతూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి విసిరిన సవాల్కు మాత్రం స్పందించలేదు. తన నివాసంలో సమావేశమయ్యామని విజయసాయిరెడ్డి పేర్కొనటాన్ని ఎంపీ మిథున్రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. అదే నిజమైతే గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిరూపించాలని మిథున్రెడ్డి సవాల్ చేస్తే కూటమి ప్రభుత్వం నోరు విప్పలేదు.మద్యం దోపిడీ వ్యవస్థీకృతం..రాచబాట పరిచిన టీడీపీ సర్కారు మద్యం విధానం ముసుగులో 2014–19 మధ్య భారీ దోపిడీకి కుట్ర పన్నింది చంద్రబాబు ప్రభుత్వమే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది చంద్రబాబే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నిటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే అనుమతినిచ్చింది. అవన్నీ యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే కావడం గమనార్హం. బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లు కొల్లగొట్టింది. ఊరూపేరూలేని మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టింది స్వయానా చంద్రబాబే. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4,380 మద్యం దుకాణాలన్నీ టీడీపీ సిండికేట్కు అడ్డగోలుగా కట్టబెట్టారు. వాటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్ రూమ్లకు అనుమతినిచ్చారు. అంతేకాదు.. ఏకంగా 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేశారు. ఎంఆర్పీ కంటే బాటిల్పై రూ.15 నుంచి రూ.25 అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ రెండు చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. అంటే మద్యం దోపిడీదారు చంద్రబాబే అన్నది నిగ్గు తేలుతోంది. వైఎస్సార్సీపీ పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై బురద జల్లుతుండటం కేవలం రెడ్బుక్ కుట్రేనన్నది స్పష్టం. మద్యం విధానం ముసుగులో 2014–19లో చేసిన దోపిడీని చంద్రబాబు ఇప్పుడు మరింత భారీ స్థాయిలో కొనసాగిస్తున్నారు. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం.. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలుసు కాబట్టే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధింపులకు తెగబడుతోంది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టి వేళలను కుదించింది. టీడీపీ హయాంలో ఉన్న 4,380 మద్యం దుకాణాలను 2,934కి తగ్గించింది. చంద్రబాబు సర్కారు అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4,380 పర్మిట్ రూమ్లను రద్దు చేసింది. టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43 వేల బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్సు మంజూరు చేయలేదు. ఇలా విప్లవాత్మక చర్యలతో వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమీషన్లకు ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమీషన్లకు ఆస్కారం ఎక్కడుంది? మద్యం అక్రమ కేసులో సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోవడంతో తాను ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అక్రమ కేసు కుట్రలు మరోస్థాయికి..అందుకే బాలాజీ గోవిందప్పను నిందితుడిగా చేర్చిన వైనం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధమే లేదు. వికాట్ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ కంపెనీ. 12 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ. యూరప్లో టాప్ 5 కంపెనీల్లో ఒకటిగా ఉంది. సిమెంట్ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీ సిమెంట్స్. అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు. ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉండరు. బాలాజీ గోవిందప్ప వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్. వికాట్ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన నిరంతరం తలమునకలై ఉంటారు. ఆంధ్రప్రదేశ్తో సంబంధమే లేని ఆయనకు ఐఏఎస్లతోగానీ ఇతర ప్రభుత్వ అధికారులతోగానీ ఎలాంటి సంబంధంగానీ, పరిచయంగానీ లేనే లేవు. ఇక రాజ్ కేసిరెడ్డితో కనీసం పరిచయం ఉండే ఆస్కారమే లేదు. పక్కా కుతంత్రంతోనే బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో నిందితుడిగా చేర్చారు. తద్వారా ఈ అక్రమ కేసు కుట్రను మరో స్థాయికి తీసుకువెళ్లాలన్నదే చంద్రబాబు పన్నాగం. భారతీ సిమెంట్స్ను ఏనాడో టేకోవర్ చేసిన వికాట్.. భారతీ సిమెంట్ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్ కంపెనీకే ఉంది. మైనార్టీ వాటా మాత్రమే వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబానికి ఉంది. కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియచేయడం, కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు వివరించడం, త్రైమాసిక ఫలితాల ముందుగానీ తరువాతగానీ తెలియజేయడం.. భారతీ సిమెంట్స్పై కొనసాగుతున్న సీబీఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతోపాటు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలన్నీ వివరిస్తారు. ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం. రిలయన్స్ లాంటి కంపెనీలు కూడా తమ కంపెనీల్లో ఎక్కువ షేర్లు ఉన్నవారికి సంస్థకు సంబంధించిన పరిణామాలను తరచూ వివరిస్తూ ఉంటాయి. ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే. వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీ సిమెంట్స్ను అప్రతిష్ట పాలు చేయడం, అందులో మైనార్టీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పన్నిన భేతాళ కుట్రే ఇది. బాబు కుట్రలకు ఎల్లో మీడియా భజనచంద్రబాబు కుట్రలకు ఎల్లో మీడియా కోరస్ పాడుతోంది. వైఎస్ జగన్ కుటుంబానికి బాలాజీ గోవిందప్ప ఆర్థిక సలహాలు ఇస్తుంటారని దుష్ప్రచారం చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఫ్లెక్సీ డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులపై వైఎస్ జగన్ కుటుంబం బాలాజీ గోవిందప్ప సలహాలను ఎందుకు తీసుకుంటారు? వైఎస్ జగన్ కుటుంబానికి దశాబ్దాలుగా పవర్ ప్రాజెక్టులు, మీడియా, రియల్ ఎస్టేట్ లాంటి సొంత కంపెనీలున్నాయి. తమకు మెజార్టీ వాటా ఉన్న ఆ కంపెనీల ద్వారా ఏటా దాదాపు రూ.150 కోట్ల లాభం ప్రకటిస్తున్నారు. ఆ కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు, సలహాలు ఇచ్చేందుకు ఎంతోమంది ఆడిటర్లు, ఫైనాన్స్ డైరెక్టర్లు ఉన్నారు. ఆర్థిక సలహాల కోసం వారిని సంప్రదిస్తారు. అంతేగానీ తాను మైనార్టీ వాటాదారుగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ను ఎందుకు సంప్రదిస్తారు? ఈ దుష్ప్రచారం అంతా కేవలం చంద్రబాబు భేతాళ కుట్రే. వాస్తవాలతో నిమిత్తంలేని ఎల్లో మీడియా ఇందులో తరిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లో వైఎస్ జగన్ కుటుంబంపై దుష్ప్రచార కుతంత్రానికి వత్తాసు పలుకుతోంది. -
'పాత'రేయడం మేలు
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఇంధన వనరులు దొరకడం లేదు. ఇప్పుడున్న వనరులు కూడా కొన్నేళ్లకు తరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ఇంధన వనరులతోపాటు స్వచ్ఛమైన వాతావరణాన్ని కూడా అందించడం కోసం ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.పాత వాహనాలను వదిలేసి విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పెంచడం ద్వారా ఆయా దేశాలు, ముఖ్యంగా మన దేశం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 10 లక్షల మంది, అంతకన్నా ఎక్కువ జనాభా గల నగరాలు 44 ఉన్నాయి. ఈ నగరాల్లో పాత వాహనాల స్థానంలో ఈవీలను ఉపయోగించడం వల్ల 2035 నాటికి విదేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్న చమురు ఖర్చులో రూ.9.17 లక్షల కోట్లను తగ్గించవచ్చని టీఈఆర్ఐ నివేదిక స్పష్టం చేసింది.⇒ 49 లక్షలు: దేశంలో 2024 నాటికి 10 లక్షలు జనాభా గల 44 నగరాల్లో ఉన్న పాత వాహనాలు. 2030 నాటికి ఈ సంఖ్య 75లక్షలకు పెరుగుతుంది ⇒37 శాతం: నగరాల్లో వాయు కాలుష్యంలో పాత వాహనాల నుంచి వచ్చే వాటా⇒రూ.9.17 లక్షల కోట్లు: 44 నగరాల్లో పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకొస్తే 2035 నాటికి తగ్గనున్న ఇంధన దిగుమతి ఖర్చు⇒ 3.7 లక్షలు: పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకురావడం వల్ల 2035 నాటికి లభించే కొత్త ఉద్యోగాలు టీఈఆర్ఐ అధ్యయనం ఇంకా ఏం చెప్పిందంటే...⇒ మన దేశంలోని పెద్ద నగరాల్లో వాయు కాలుష్యానికి పాత వాహనాలు ప్రధాన కారణమవుతున్నాయి. నగరాల్లోని వాయు కాలుష్యంలో పాత వాహనాల వాటా 37 శాతం. నగరాల్లో 2035 నాటికి పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకురావడం వల్ల కర్బన ఉద్గారాలు బాగా తగ్గుతాయి. గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. ⇒ కనీసం 10 లక్షల జనాభా గల 44 నగరాల్లో 2024లో పాత వాహనాల సంఖ్య 4.9 మిలియన్ (49 లక్షలు). ఆ సంఖ్య 2030 నాటికి 7.5 మిలియన్ (75 లక్షలు)కు పెరుగుతుంది. ⇒ ఈ నగరాల్లోని పాత వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మారడం వల్ల 2035 నాటికి రోజూ 11.5 టన్నుల (పరి్టక్యులర్ మీటర్ 2.5) వాయు కాలుష్య కణాలను నివారించవచ్చు. 61 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్కు సమానమైన గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు.⇒ 2035 నాటికి 51 బిలియన్ లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. చమురు దిగుమతి ఖర్చు రూ.9.17 లక్షల కోట్లు మిగులుతుంది. ⇒ ముఖ్యంగా పాత డీజిల్ బస్సులు అతిపెద్ద కాలుష్య కారకాలని టీఈఆర్ఐ అధ్యయనం తెలిపింది. పాత బస్సులను నిలిపేస్తే పీఎం 2.5 ఉద్గారాలు 50శాతం, నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 80శాతం తగ్గే అవకాశం ఉంది. ⇒ పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకొచ్చేందుకు 44 నగరాల్లో 45వేల కంటే ఎక్కువ పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు, 130 వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ⇒ పాత వాహనాల్లో సగం సీఎన్జీకి మార్చితే సుమారు 2,655 కొత్త సీఎన్జీ స్టేషన్లు అవసరమవుతాయి.⇒ ఈ విధంగా చేస్తే 2035 నాటికి విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో దాదాపు 3.7 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు. -
నక్షత్రాన్నే నమిలేస్తూ.. మింగేస్తూ
నక్షత్రం అంటేనే అంతులేని ఉష్ణంతో, దేదీప్యమానంగా వెలిగిపోతూ వందల కోట్ల కిలోమీటర్ల దాకా కాంతిని వెదజల్లే శక్తియంత్రం. అలాంటి నక్షత్రాన్ని అరటిపండులా అమాంతం మింగేస్తున్న రాకాసి కృష్ణబిలం జాడను అత్యంత అధునాతన హబుల్ టెలిస్కోప్ కనిపెట్టింది. నక్షత్రం మొత్తాన్ని తనలో కలిపేసుకుంటున్న ఈ బ్లాక్హోల్ మిగతా కృష్ణబిలాల్లా నక్షత్రమండలం(గెలాక్సీ) కేంద్రస్థానంలో కాకుండా కోట్ల కోట్ల కిలోమీటర్ల దూరంగా ఉండటం మరో విశేషం. గెలాక్సీ మధ్యలో కాకుండా చాలా దూరంగా సైతం భారీ కృష్ణబిలాలు మనగల్గుతాయని, వాటి అపారమైన గురుత్వాకర్షణ బలాలు సమీప స్టార్లనూ సమాధి చేస్తాయని తొలిసారిగా వెల్లడైంది. సాధారణంగా నక్షత్రాలను కృష్ణబిలం తనలో కలిపేసుకునే (టైడల్ డిస్ట్రప్షన్ ఈవెంట్–టీడీఈ) దృగ్విషయం గెలాక్సీ మధ్యలో చోటుచేసుకుంటుంది. కానీ ఇలా టీడీఈ అనేది గెలాక్సీ మధ్యలో కాకుండా వేరే చోట సంభవించడాన్ని తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి ‘ఏటీ2024టీవీడీ’అని పేరు పెట్టారు. మింగేస్తున్న ఈ కృష్ణబిలం ద్రవ్యరాశి ఆ అంతర్థానమవుతోన్న నక్షత్రం ద్రవ్యరాశికంటే ఏకంగా 10 కోట్ల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. నక్షత్రమండలం కేంద్రస్థానం చుట్టూ తిరిగే ఏదైనా నక్షత్రం అనుకోకుండా కృష్ణబిలం చెంతకు వచ్చినప్పుడు మాత్రమే అక్కడ బ్లాక్హోల్ ఉందనే విషయం తెలుస్తుంది. బ్లాక్ తాను మింగేసే ఖగోళ వస్తువును ఉన్నది ఉన్నట్లుగాకాకుండా ఆకారాన్ని నూడుల్స్లాగా సాగదీసి సాగదీసి లోపలికి లాగేసుకుంటుంది. ఈ ప్రక్రియనే స్పాగెటిఫికేషన్ అంటారు. తాజాగా నక్షత్రాన్ని మింగేస్తున్న క్రమంలోనే ఈ కృష్ణబిలం ఉనికి వెలుగులోకి వచ్చింది. అమెరికా శాండిగోలోని పాలోమార్ అబ్జర్వేటరీలోని ఆప్టికల్ కెమెరా తొలిసారిగా దీనిని గుర్తించింది. ఈ బ్లాక్హోల్ మన భూమికి ఏకంగా 60 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. హబుల్ టెలిస్కోప్ దీనిపై మరింత పరిశోధన చేసింది. సాధారణంగా కృష్ణబిలంలోకి నక్షత్రం లాగబడే క్రమంలో ఆ నక్షత్రం ఊహించనంత స్థాయిలో అతినీలలోహిత కాంతిని బయటకు వెదజల్లుతుంది. తర్వాత బ్లాక్హోల్ లోపలికి వెళ్లిపోయి ఆ స్టార్ అంతర్థానమవుతుంది. కేంద్రం నుంచి ఎంతో దూరంలో బ్లాక్హోల్ ఈ బ్లాక్హోల్ తనకు ఆశ్రయం ఇచ్చిన నక్షత్రమండలానికి సంబంధించిన కేంద్రస్థానంలో ఉండకుండా ఏకంగా 2,600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీంతో కేంద్రస్థానంలోని బ్లాక్హోల్స్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తుందేమో అని తెల్సుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా రంగంలోకి దిగింది. ఈ కృష్ణబిలంపై ఓ కన్నేశామని చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీ, నేషనల్ రేడియో ఆస్ట్రోనమీ అబ్జర్వేటరీలోని వెరీ లార్జ్ అరే రేడియో టెలిస్కోప్ పరిశోధకుల బృందాలు తెలిపాయి. రెండు గెలాక్సీల విలీనం తర్వాత ఇలాంటి కృష్ణబిలాలు ఇలా సుదూరంగా మిగిలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. లేదంటే రెండు అయస్కాంతాల తరహాలో రెండు కృష్ణబిలాల వ్యతిరేక బలాల వల్ల ఇది సుదూరంగా నెట్టివేయబడి ఉండొచ్చని ఇంకొందరు అధ్యయనకారులు అంచనావేస్తున్నారు. ‘‘కేంద్రస్థానంలో స్థిరంగా ఉండిపోకుండా ఇలా సంచార జీవిలా ఎక్కడో మౌనంగా ఉన్న ఇలాంటి కృష్ణబిలాలు కొత్త తరహా పరిశోధనలకు సాయపడతాయి’’అని బెర్క్లీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాలో సంబంధిత పరిశోధనలో ప్రధాన రచయిత, ఖగోళశాస్త్రంలో పోస్ట్ డాక్టోరల్ యుహాన్ యాఓ చెప్పారు. త్వరలో అందుబాటులోకి రానున్న వెరీ సి.రూబిన్ అబ్జర్వేటరీ సాయంతో ఇలాంటి ఖగోళ వింతలను మరింత పరిశోధన జరగనుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహాద్భుతం.. బుద్ధవనం
రెండు వేల సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జునుడు స్థాపించిన విజయపురి విశ్వవిద్యాలయం, ఇక్కడ విలసిల్లిన బౌద్ధమత ప్రాచుర్యం ఆధారంగా కృష్ణా తీరంలో (నాగార్జునసాగర్ తీరంలో) బుద్ధిస్టు హెరిటేజ్ థీం పార్కును బుద్ధవనం (Buddhavanam) ప్రాజెక్టుగా మహాద్భుతంగా తీర్చిదిద్దారు. అభినవ బుద్ధుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల ఇది. ఆ చరిత్ర ఆధారంగానే సాగర్ తీరంలో 274 ఎకరాల్లో బుద్ధవనం (శ్రీపర్వతారామం), 30 ఎకరాల్లో విపశ్యన కేంద్రం నిర్మించారు. అష్టాంగ విభాగాలుగా దీని నిర్మాణం చేశారు. ఆసియా ఖండంలోనే సిమెంట్తో నిర్మించిన అతిపెద్ద మహాసూ్థపం బుద్ధవనం.ఈ నెల 12వ తేదీన బుద్ధపూర్ణిమ సందర్భంగా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీమణులు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో బయలు దేరి వెల్లంకిలో కొంతసేపు సేద దీరి, నాగార్జునసాగర్కు చేరుకుంటారు. విజయవిహార్ అతిథిగృహంలో వారికి స్వాగత ఏర్పాట్లు చేశారు. విజయవిహార్ ముందు ఏర్పాటు చేసిన ఫొటో సెషన్లో పాల్గొంటారు. అనంతరం విజయవిహార్ వెనుకభాగంలో, సాగర్ తీరాన పచ్చిక బయళ్లలో వారు ప్రత్యేకంగా ఫొటోలు దిగుతారు. ఆ తరువాత బుద్ధవనం చేరుకుంటారు. బుద్ధుని పాదుకల వద్ద 25 మంది బౌద్ధ సన్యాసులు నిర్వహించే బౌలికుప్ప మహాబోధి పూజల్లో పాల్గొంటారు. అక్కడినుంచి మహాసూ్థపం వద్దకు చేరుకొని, వెనుక భాగాన ఉన్న మెట్ల ద్వారా పైకి ఎక్కుతారు. దానికి వంద అడుగుల దూరంలో ఏర్పాటు చేసిన గిరిజన సంప్రదాయ నృత్యాన్ని తిలకిస్తారు. అనంతరం మహాస్థూపం అంతర్భాగంలో అష్టబుద్ధుల వద్దకు చేరుకొని అక్కడ కొవ్వొత్తులు వెలిగించి పూజలు చేస్తారు. ఈ సందర్భంగా బౌద్ధమత గురువు నిర్వహించే 5 నిమిషాల ప్రార్థనలో పాల్గొంటారు. అనంతరం రెండు నిమిషాల పాటు «ధ్యానం చేస్తారు. అక్కడి నుంచి మహాస్థూపం చూట్టూ ఉన్న 2,500 విగ్రహాల గురించి పర్యాటక శాఖ ప్రతినిధి శివనాగిరెడ్డి వివరిస్తారు. అనంతరం జాతకవనంలోకి వెళతారు. అక్కడ వారికి బుద్ధవనం, తెలంగాణలో బౌద్ధ చరిత్ర ప్రాధాన్యత గురించి పర్యాటక శాఖ ప్రతినిధి వివరిస్తారు. బుద్ధుని పుట్టుక నుంచి నిర్యాణం వరకు ప్రత్యేక డ్రామాను ప్రదర్శిస్తారు. – సాక్షి ప్రతినిధి, నల్లగొండబుద్ధుని జీవిత విశేషాలు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2003లో దీనిని ప్రారంభించింది. సిద్ధార్థ గౌతముని జీవితంలోని ప్రధాన ఘట్టాలను వర్ణించే అనేక నేపథ్య విభాగాలతో కూడినదే బుద్ధవనం. ఆయన పూర్వ జన్మ కథలను చిత్రీకరించిన జాతక పార్క్, సూక్ష్మ స్థూపాలతో కూడిన స్థూపపార్క్, మహాసూ్థపం, బౌద్ధ హెరిటేజ్ మ్యూజియం, మహాసూ్థపం గ్రౌండ్ ఫ్లోర్లో ఆచార్య నాగార్జున విగ్రహం, 27 అడుగుల బుద్ధ విగ్రహం ఇందులో ఏర్పాటు చేశారు. ధమ్మ గంటను శ్రీలంక ప్రభుత్వం విరాళంగా ఇచ్చింది. దేశంలోనే ఇది మొదటిది.ప్రవేశ వేదిక ప్రవేశ వేదిక అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నలు, ఐకానిక్ రూపంలో బుద్ధుడు, జంతువులు, పక్షులు, బోధి వృక్షం, మిథునాలు (రసిక జంటలు), బుద్ధపాదాలు వంటివి ఇక్కడ ఉంటాయి. ప్రధాన ఇతివత్తాలు, సిద్ధార్థుని కిరీటం (జుట్టు) మోస్తున్న అగ్ని స్తంభం, నాగముచిలింద, పవిత్ర అవశేషాల ఆరాధన, మధ్యలో అశోక ధర్మ చక్రం స్తంభంతో శక్తివంతమైన విల్లును మోస్తున్న సిద్ధార్థుడు వంటి శిల్పాలు ఉంటాయి. బుద్ధ చరిత్రవనం సిద్ధార్థ గౌతమ జీవితంలో ఐదు ప్రధాన సంఘటనలు ఉన్నాయి. అవి జననం, నాలుగు సమావేశాలు, మహా నిష్క్రమణ, జ్ఞానోదయం. బుద్ధుని మొదటి ఉపన్యాసం, మహాపరినిర్వాణం వంటి అంశాలపై చిత్రాలను కాంస్యంతో చేశారు. పల్నాడు సున్నపు రాయిలో చెక్కబడిన బుద్ధపాద స్లాబ్ అష్టమంగళ (ఎనిమిది శుభ) చిహ్నాలు ఉద్యానవన ప్రవేశ ద్వారం వద్ద ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయి. జాతక వనం (బోధిసత్వ పార్క్) బోధిసత్వుడు బుద్ధుడిగా మారటానికి ముందు పది పరిపూర్ణతలను ఆచరిస్తూ జీవితాన్ని గడుపుతాడు. వాటినే దశపారమిత అంటారు. అవి దాన (ఉదారత), శీల (ధర్మం), శాంతి (సహనం), వీర్య (ధైర్యం), ధ్యాన (ఏకాగ్రత), ప్రజ్ఞ (జ్ఞానం), త్యాగ (త్యజించడం), సత్య (సత్యం), కరుణ (ప్రేమపూర్వక దయ), సమత (సమానత్వం). 547 జాతక కథలలో 40 జాతక కథలు అమరావతి, ఫణిగిరి, నాగర్జునకొండ, గోలి, జగ్గయ్యపేట, చందవరం బౌద్ధ క్షేత్రాలలోని అసలు శిల్పకళా ఫలకాల ఆధారంగా పల్నాడు లైమ్ స్టోన్లో చిత్రీకరించారు. ధ్యానవనం (మెడిటేషన్ పార్క్) 27 అడుగుల అవుకాన బుద్ధను ధ్యానవనంలో ఏర్పా టు చేశారు. దీనిని శ్రీలంక ప్రభుత్వం అందజేసింది. స్తూపవనం (మినియేచర్ స్తూప పార్క్) కర్లా, అజంతా (మహారాష్ట్ర), సాంచి (మధ్యప్రదేశ్), సారనాథ్ (ఉత్తరప్రదేశ్), మంకియాలా, (పంజాబ్– పాకిస్తాన్), అనురాధపుర, శ్రీలంక, కహు–జో–దారో, మిర్పూర్ ఖాస్, పాకిస్తాన్, బౌధానాత్, మహాత్రాస్తాన్, నేపాల్లోని స్థూపాల ప్రతిరూపాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. థాయ్లాండ్, పార్డో కాలింగ్ చోర్టెన్ టిబెట్, శ్వేసాండావ్– మయన్మార్, గ్యాంగ్జు, దక్షిణ కొరియా, భారతదేశం, ఆగ్నేయాసియాలోని బౌద్ధ స్థూప నిర్మాణాల రూపాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మహాస్తూపం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రధాన ఆకర్షణ మహాస్తూపం. అమరావతిలోని అసలు స్థూపం కొలతలు, వాస్తుశిల్పం ప్రకారం దీనిని నిర్మించారు. దాని పైభాగంలో వేదిక (డ్రమ్), గోపురం (అండ), హారి్మక ఉన్నాయి. 42 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల ఎత్తుతో దాని డ్రమ్, గోపురం భాగాలపై బౌద్ధ ఇతివృత్తాల శిల్ప ఫలకాలతో ఏర్పాటు చేశారు. మహాస్తూపం చుట్టూ గోడపై బుద్ధుని జీవితంలోని ముఖ్యమైన రాజులు, ధర్మ పోషకుల దశ్యాలు ఉంటాయి. గోపుర భాగంపై వజ్రాసన, బోధి వక్షం, అగ్ని స్తంభం, జాతక కథలు, బుద్ధుని జీవితంలోని సంఘటనలు వంటి బౌద్ధ చిహ్నలను వర్ణించే శిల్పాలు చెక్కారు. స్థూపం గ్రౌండ్ ఫ్లోర్లో ఆచార్య నాగార్జున విగ్రహం ఉంటుంది. మహాస్థూపం లోపల వర్చువల్ ఆకాశ దృశ్యం మహాసూ్థపం లోపల 25 అడుగుల ఎత్తులో పంచధ్యాన బుద్ధులను ఏర్పాటు చేశారు. మహాస్తూపం పైకప్పు ఆకాశాన్ని తలిపిస్తూ తామరపువ్వు రేకుల ఆకారంలో ఉంటుంది. పైకప్పు లోపలి భాగం చిల్లులు గల ట్రాపెజోయిడల్ ప్యానెల్లతో ఆకాశాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కటి మరొకదానికి భిన్నంగా 2.5 మీటర్ల పరిమాణంలో, కాంతి థర్మోడైనమిక్స్, ప్రత్యేక ప్రకాశాన్ని జోడించేలా ఉంటాయి. ఇందులో లోటస్ రేకులు (960), స్కై ప్యానెల్లు (528) ఉంటాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ఉపయోగించిన జర్మన్ టెక్నాలజీతో వీటిని ఏర్పాటు చేశారు. బుద్ధవనానికి అవార్డులు విశిష్ట ఆకర్షణలతో కూడిన ఈ ప్రాజెక్టుకు అనేక అవార్డులు లభించాయి. పర్యాటకులకు ఉత్తమ పౌర సౌకర్యాలు, మౌలిక సదుపాయాలను అందించినందుకు తెలంగాణ పర్యాటక శాఖ 2022లో అవార్డును అందజేసింది. దీనిపై నిర్మించిన డాక్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అవార్డును అందుకుంది. 2022లో కోల్కతాలో బౌద్ధ టూర్ ఆపరేటర్ల సంఘం ‘భూటాన్ బంగ్లాదేశ్ ఇండియా అండ్ నేపాల్ టూరిజం మిత్ర అవార్డు’ను కూడా అందుకుంది. బౌద్ధ వారసత్వ ప్రాంగణం బుద్ధవనం తెలంగాణలో బౌద్ధమతం ఆగమనం బుద్ధుని జీవితకాలం నాటిది. సుత్తనిపాత పారాయణవగ్గ ప్రకారం ‘కవిట్టవనమిష్టి గోదావరి రివేరిన్’అనే బ్రాహ్మణ ఋషి బుద్ధుని బోధనలను వినడానికి తన 16 మంది శిష్యులను మగధకు పంపాడు. బుద్ధుని అనుచరులుగా మారిన పింగియా.. బుద్ధుని బోధనలను తీసుకువచ్చారు. అప్పటినుంచి నుంచి తెలంగాణలో థేరవాద, మహాయాన, వజ్రయాన బౌద్ధ శాఖలు విస్తరించాయి. అస్సీఘాట్, కోటిలింగాల, కంబాలపల్లి, పాశిగావ్, ధూళికట్ట, ఫణిగిరి, తిరుమలగిరి, వర్ధమానుకోట, గాజులబండ, నేలకొండపల్లి, శ్రీపర్వతం ప్రాంతాల్లో (నాగార్జునసాగర్ ప్రాంతం) బౌద్ధమతం మూడు దశల్లో పరిఢవిల్లింది. -
ప్రకృతి ఆరోగ్యనిధి చింత చిగురు
ప్రకృతి మానవాళికి అందించిన వరాల్లో చింతచెట్టు ఒకటి. ఈ చెట్టు నీడను మాత్రమే కాక ఆరోగ్యాన్ని పంచే కాయలు, చిగురునూ అందిస్తుంది. ఇందులో చింతచిగురు రుచితోనే కాక పోషక విలువలతో ఆరోగ్యాన్ని కాపాడేదిగా నిలుస్తోంది. ప్రకృతి వైద్యంలో చింతచిగురును భాగంగా చేస్తారు. దీంతో చెడు కొవ్వును తగ్గించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడం, జీర్ణక్రియను సులభతరం చేయడం వంటి ప్రయోజనాలు ఉంటాయని చెబుతారు. అంతేకాక చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలోనూ సాయపడుతుందని నమ్ముతారు. కాగా, సంప్రదాయ వైద్యంలో చింతచిగురును ఉపయోగిస్తారు. ఆయుర్వేద వైద్యవిధానంలో శరీరంలోని వేడి తగ్గించే, జీర్ణ సమస్యలను పరిష్కరించే గుణాలు కలిగిన ఆహారంగా పరిగణిస్తారు. దీన్ని కషాయంగా చేసి జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఇస్తారు. అంతేకాక చింతచిగురు శరీరంలోని విష పదార్థాలను తొలగించే డిటాక్స్ ఏజెంట్గా కూడా పనిచేస్తుందని చెబుతారు. – కరకగూడెంచింతచిగురు కోస్తున్న మహిళలు రుచి, ఆరోగ్యంఅద్భుతమైన రుచి కలిగి ఉండే చింతచిగురు ఆరోగ్య సమతుల్యానికి అండగా నిలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా చింతచిగురుతో కూరలు చేయడమే కాక పప్పు, చేపలు, చికెన్, మటన్ వంటి వాటిలోనూ కలిపి వండుతారు. ఇక చట్నీలు, పచ్చళ్లు కూడా పలువురు చేస్తారు. ‘సీ’విటమిన్ లోపంతో బాధపడేవారు టాబ్లెట్లకు బదులుగా చింతచిగురును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సహజంగా విటమిన్ అందుతుందని చెబుతారు. అందుకే ఇది గ్రామీణ జీవనంలో ఒక భాగంగా నిలుస్తోంది. చింతచిగురు మార్కెట్లలో మంచి ధర పలుకుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు ఈ చిగురును సేకరించి విక్రయించడం ద్వారా సీజనల్ ఆదాయాన్ని పొందుతారు.పర్యావరణ పరిరక్షణ చింతచెట్టు కేవలం ఆహారం ఆరోగ్య ప్రయోజనాలకు మాత్రమే కాక పర్యావరణ పరిరక్షణలో కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు తన దట్టమైన ఆకులతో వేసవి తాపాన్ని తగ్గించి నీడను అందిస్తుంది. అంతేకాక చింతచెట్టు వేర్లు నేల కోతను నివారించడంతో ఈ చెట్టు నేల సంý‡క్షణలో సాయపడుతుంది. అలాగే, పక్షులు, కీటకాలు ఆధారంగా నిలుస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి.వంటకాలకు ప్రత్యేక రుచిచింతచిగురు అంటే చాలా ఇష్టం. ఇది వంటకాలకు ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. పప్పు, చేపలు, చికెన్, మటన్ వంటి కూరల్లో ఉపయోగిస్తాం. ప్రత్యేకంగా చింతచిగురు కూర కూడా వండుతాం. చింత చిగురుతో చట్నీలు, పచ్చళ్లూ చేస్తాం. ఆరోగ్యానికి మంచిదని నమ్ముతాం. – పోలేబోయిన విజయలక్ష్మి,వెంకటాపురంచిన్నప్పటి నుంచీ తీసుకుంటున్నా.. నేను చిన్నప్పటి నుంచి చింతచిగురును ఆహారంలో తీసు కుంటున్నా. గతంలో లేత చిగురు కోసం అడవికి వెళ్లేవాళ్లం. చింత చిగు రుతో చేసే కూరలు రుచిగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. అందుకే సీజనల్లో తప్పకుండా చిగురును ఆహారంలో తీసుకోవాలి. – పాయం రామయ్య, మొగిలితోగు చాలారకాల వంటలు చేస్తాం.. మా ఇంట్లో చింత చిగురుతో చాలా రకాల వంటలు చేస్తాం. ప్రధానంగా పప్పుతో కలిపి వండటం ద్వారా మంచి రుచి వస్తుంది. చింత చిగురులో చాలా పోషకాలుంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది. సీజనల్లో పిల్లలు, పెద్దలు చిగురుతో చేసే వంటలను ఇష్టపడతారు. – జాడి నర్సక్క, చొప్పల -
మన భాషలోనే.. ఆటాడుకుందాం
వీడియో గేమ్స్... పిల్లల దగ్గరి నుంచీ యువత వరకూ వీటి క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఆట మొదలుపెట్టారంటే సమయమే తెలీదు. ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది గేమర్స్ ఏకంగా 39,000 కోట్ల గంటలు మొబైల్లో గడిపారంటే అతిశయోక్తి కాదు. మొబైల్ గేమ్స్ క్రేజ్ అంతలా విస్తరించింది. 2024లో ప్రపంచ వ్యాప్తంగా సగటున నిమిషానికి 94,000 డౌన్ లోడ్స్ జరిగాయి. మనదేశం కూడా ఇందుకు ఏమీ తీసిపోలేదు. గత ఏడాది కొత్తగా 821 కోట్ల డౌన్ లోడ్స్ అయ్యాయి. 5,729 కోట్ల గంటలపాటు మొబైల్ గేమ్స్ ఆడారు. యూజర్ల సంఖ్యను పెంచుకోవడానికి డెవలపర్లు హిందీ సహా తెలుగు, తమిళం వంటి స్థానిక భాషల్లో గేమ్స్ను పరిచయం చేస్తుండడం జోష్ను పెంచుతోంది.భారీగా యాడ్స్ మొబైల్ గేమ్స్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 2024లో 5,04,576 కోట్ల యాడ్స్ యూజర్ల స్క్రీన్ పై దర్శనమిచ్చాయి. దీనిని బట్టి.. ఈ గేమ్స్కి ఎంత ఆదరణ ఉందో, వివిధ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా 2023తో పోలిస్తే 2024లో గేమర్స్ 12% అధికంగా 3.5 లక్షల కోట్ల సెషన్స్ పూర్తి చేశారు. గేమ్స్లో మరిన్ని ఫీచర్లు, దశలు, ప్రీమియం కంటెంట్ కోసం యూజర్లు వెచ్చించిన (ఇన్ యాప్ పర్చేజ్) మొత్తం రూ.6,95,360 కోట్లు. ఇలా డెవలపర్లు అందుకున్న ఆదాయం 2024లో 3.8% పెరిగింది.స్థానిక భాషల్లో 70% భారత్లో సుమారు 55 కోట్ల మంది గేమింగ్ యూజర్లు ఉన్నారు. వీరిలో 70% మంది స్థానిక భాషల్లో గేమ్స్ను ఇష్టపడుతున్నారు. కంపెనీలు ఇందుకు తగ్గట్టుగా ప్రాంతీయ భాషల్లో గేమ్స్ను అందుబాటులోకి తెచ్చాయి. 2024లో భారత్లో టాప్–10లో స్థానం సంపాదించిన మొబైల్ గేమ్స్లో చాలావరకు హిందీ సహా దేశీయ భాషల్లో ఆడుకునే సౌలభ్యం ఉంది.⇒ ‘లుడో కింగ్’ గేమ్ని ప్రస్తుతం తెలుగు, హిందీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ, తమిళం, మలయాళంలో ఆడుకునే అవకాశం ఉంది. ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ బెంగాలీ, హిందీ, ఉర్దూలో ఆడేయొచ్చు. క్యాండీ క్రష్ సాగా బెంగాలీ, హిందీ, ఉర్దూలోనూ అందుబాటులో ఉంది.⇒ తెలుగు సహా హిందీ, తమిళం, కన్నడ, ఒడియా, బెంగాలీ వంటి స్థానిక భాషల్లో గేమ్స్ను తేవడం వల్ల యూజర్లు కొనసాగడంతోపాటు, సంతృప్తి చెందుతారన్నది కంపెనీల మాట. దేశీయంగా విజయవంతం కావాలంటే ఈ విధానం తప్పదని చెబుతున్నాయి.సింహభాగం యాపిల్ యూజర్స్మొత్తం డౌన్ లోడ్స్లో ఆండ్రాయిడ్ ఫోన్స్ ద్వారా 4,120 కోట్లు, మిగిలినవి యాపిల్ ఫోన్స్ ద్వారా జరిగాయి. అయితే ఇన్ యాప్ పర్చేజ్ ద్వారా యాపిల్ యూజర్లు అత్యధికంగా రూ.4,51,136 కోట్లు ఖర్చు చేయడం విశేషం. డౌన్ లోడ్స్, డెవలపర్లకు ఆదాయం పరంగా యూఎస్ఏ టాప్లో ఉంది. రూ.8,480 కోట్లకుపైగా ఆదాయం ఆర్జించిన యాప్స్ పదేళ్ల క్రితం 2 ఉంటే.. గత ఏడాది వీటి సంఖ్య 11కు దూసుకెళ్లింది. ఇక భారత్లో డౌన్ లోడ్స్లో సిమ్యులేషన్ , ఆర్కేడ్, పజిల్, టేబుల్ టాప్, యాక్షన్ విభాగాలు టాప్–5లో నిలిచాయి. డౌన్ లోడ్స్లో ఇండియన్ వెహికల్స్ సిమ్యులేటర్ 3డీ, ఇన్ యాప్ పర్చేజ్లో ఫ్రీ ఫైర్ గేమ్ తొలి స్థానంలో ఉన్నాయి.గేమింగ్ హైలైట్స్⇒ భారత్లో సులభంగా ఆడగలిగే వీడియో గేమ్స్ (హైపర్ క్యాజువల్) 2,000 కోట్ల డౌన్ లోడ్స్ నమోదయ్యాయి.⇒ ప్రతి సెకనుకు 1,60,000 యాడ్స్ ప్రత్యక్షమయ్యాయి. గేమ్స్కు వెచ్చించిన సమయం గత ఏడాది 7.9% పెరిగింది. ⇒ 2020లో కరోనా మహమ్మారి కాలంలో ఏకంగా 5,760 కోట్ల డౌన్ లోడ్స్ జరిగాయి.⇒ డెవలపర్లు అత్యధికంగా 2021లో రూ.7,41,152 కోట్లు ఆర్జించారు. -
వావ్.. మైగ్రేట్ ‘వే’
సాక్షి, అమరావతి: గగనతలాన ఎగిరే పక్షులు సుదూర ప్రాంతాలకు వలస పోతుంటాయి. ఇవి వేల కిలోమీటర్లు ప్రయాణించడం ఓ అద్భుతం. అత్యంత కఠిన వాతావరణాల్లోనూ లెక్కలేనన్ని ముప్పులను తప్పించుకుంటూ ఇవి దేశాలు, ఖండాలను ఎలా దాటతాయో అందరికీ ఆశ్చర్యకరమే.. అయితే విమానాలు, వాహనాల పయనానికి నిర్దిష్ట మార్గాలున్నట్టే పక్షులకు వలస దారులు ఉంటాయని మీకు తెలుసా? అవును వాటికీ కచ్చితమైన దారులు ఉంటాయి. వాటిని ఫ్లైవేస్ అంటారు. ఆహారం, ఆశ్రయం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పక్షులు ఈ మార్గాలను నిర్దేశించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వలస పక్షులకు సంబంధించి మూడు సూపర్ ఫ్లైవేస్ ఉన్నాయి. అవి ఏమిటీ? వాటి ప్రత్యేకతలేంటంటే..1.ఆఫ్రికన్–యూరేషియన్ ఫ్లైవేపక్షుల వలసకు ఉన్న ప్రధాన మార్గాల్లో ఆఫ్రికన్–యూరేషియన్ ఫ్లైవే ఒకటి. ప్రపంచంలోనే గొప్ప ఫ్లైవేగా దీన్ని అభివర్ణిస్తారు. ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల్లోని 50కిపైగా దేశాల మీదుగా ఈ ఫ్లైవే ఉంటుంది. ఆర్కిటిక్ నుంచి దక్షిణాఫ్రికా వరకు మూడు ప్రధాన మార్గాలు ఈ ఫ్లైవేకు అనుసంధానమై ఉంటాయి. గగనతలాన అత్యంత కఠిన పరిస్థితుల మధ్య లక్షల సంఖ్యలోని పక్షులు ఈ ఫ్లైవేలో ప్రయాణిస్తాయి. ఈ మార్గంలో ప్రయాణించే పక్షుల్లో పది శాతం అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2.తూర్పు ఆసియా–ఆస్ట్రేలియన్ ఫ్లైవే.. ప్రపంచంలోనే ఎక్కువ సంఖ్యలో పక్షులు తిరిగే దారి ఇది. అలాస్కా నుంచి ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వరకు 37 దేశాల మీదుగా ఈ ఫ్లైవే ఉంటుంది. 600 పక్షి జాతులు ఈ దారిన ప్రయాణిస్తాయి.3.సెంట్రల్ ఆసియా ఫ్లైవే.. ప్రపంచంలోనే అతిచిన్న ఫ్లైవే ఇది. అయినప్పటికీ ఈ మార్గాన్ని 600 కంటే ఎక్కువ వలస పక్షి జాతులు ఉపయోగిస్తున్నాయి. ఇది ఉత్తరాన శీతల సైబీరియా నుంచి ఉష్ణమండల మాల్దీవుల వరకు 30 దేశాల మీదుగా సాగుతుంది. ఈ ఫ్లైవేలో వెళ్ళే కొన్ని పక్షులు తమ జీవితకాలంలో అనేకసార్లు హిమాలయాలను దాటతాయి. ఈ మార్గంలో ప్రయాణించే పక్షి జాతుల్లో 48 శాతం ముప్పును ఎదుర్కొంటున్నాయి. బార్–హెడ్ గూస్ తన జీవితకాలంలో పలుమార్లు హిమాలయాలను (ఎవరెస్ట్ శిఖరంపై సహా) దాటతాయి. రోసీ స్టార్లింగ్స్, అమూర్ ఫాల్కన్స్, ఫ్లెమింగో వంటి పక్షులు సెంట్రల్ ఆసియా ఫ్లైవే ద్వారా శీతాకాలంలో భారతదేశానికి వస్తాయి. ఈ మార్గంలో ఎక్కువగా చిత్తడి నేలలు, సరస్సులు, అడవులు ఉండడంతో వాటికి స్టాప్ఓవర్ పాయింట్ల ఉన్నాయి. అక్కడ ఆగి ఆహార సేకరణ, విశ్రాంతి తీసుకోవడం చేస్తాయి.4.అమెరికాస్ ఫ్లైవే.. ప్రపంచంలో ఎక్కువ పక్షి జాతులు తిరిగే ఫ్లైవే ఇది. 2 వేల కంటె ఎక్కువ విభిన్న పక్షి జాతులు ఈ మార్గంలో ప్రయాణిస్తాయి. దక్షిణ అర్జెంటీనాలోని టియెర్రా డెల్ ఫ్యూగో నుంచి ఉత్తరాన ఆర్కిటిక్ సర్కిల్ వరకు విస్తరించి ఉన్న ఈ ఫ్లైవేలో 35 దేశాలను దాటే మూడు వలస మార్గాలు ఉన్నాయి. ఈ రూటులో 3 అంగుళాల పొడవు ఉంటే రూఫస్ హమ్మింగ్బర్డ్ 3 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.విహంగాలు ఎగిరే మార్గాల్లో ఇంకొన్ని 1. ఆసియన్–ఈస్ట్ ఆఫ్రికన్ ఫ్లైవే: దక్షిణ ఆసియా (ముఖ్యంగా భారత ఉపఖండం) నుంచి తూర్పు ఆఫ్రికా 2. వెస్ట్ పసిఫిక్ ఫ్లైవే : ఉత్తర ఆసియా (సైబీరియా, జపాన్) నుంచి దక్షిణ పసిఫిక్ ద్వీపాలు, ఆస్ట్రేలియా 3. పసిఫిక్ అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా (అలాస్కా, కెనడా) నుంచి దక్షిణ అమెరికా (చిలీ, అర్జెంటీనా) పసిఫిక్ తీరం వెంబడి ఉంది4. సెంట్రల్ అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా (కెనడా, యుఎస్) నుంచి సెంట్రల్ అమెరికా,ఉత్తర దక్షిణ అమెరికా 5.అట్లాంటిక్ అమెరికాస్ ఫ్లైవే : తూర్పు ఉత్తర అమెరికా నుంచి కరేబియన్ దీవులు, దక్షిణ అమెరికా యొక్క అట్లాంటిక్ తీరం వరకు ఉంటుంది6. మిస్సిసిపి అమెరికాస్ ఫ్లైవే : ఉత్తర అమెరికా మధ్య భాగం (మిస్సిసిపి నది లోయ) నుంచి సెంట్రల్, దక్షిణ అమెరికా వరకు మార్గాలున్నాయి. సహజసిద్ధ శక్తిసామర్థ్యాలు ⇒ పక్షులు భూమ్మీదున్న అయస్కాంత క్షేత్రాలను గుర్తించడానికి తమ మెదడులోని ప్రత్యేక కణాలను ఉపయోగిస్తాయి. ఇవి వాటికి ఒక సహజ దిక్సూచిలా పనిచేస్తాయి. పగటి వేళల్లో సూర్యుడి స్థానం ఆధారంగా తమ దిశను నిర్ణయించుకుంటాయి. సూర్యుడి కదలికలను అనుసరిస్తూ మార్గాన్ని నిర్దేశించుకుంటాయి. రాత్రి సమయాల్లో నక్షత్రాల స్థానాలను బట్టి దిశను గుర్తిస్తాయి.⇒ పర్వతాలు, నదులు, తీరప్రాంతాలు వంటి భౌగోళిక లక్షణాలను పక్షులు గుర్తుపెట్టుకుని వాటి ఆధారంగా మార్గాన్ని నిర్ధారించుకుంటాయి. కొన్ని పక్షులు గాలి దిశ, ఉష్ణోగ్రత, వాతావరణ మార్పులను అనుసరించి ఎగురుతాయి. రోసీ స్టార్లింగ్స్ అనే పక్షిజాతి వాతావరణ సూచనలను ఆధారంగా తమ ప్రయాణ సమయాన్ని నిర్ణయించుకుంటుంది.⇒ బార్–హెడెడ్ గూస్ పక్షి జాతి హిమాలయాలను దాటేటప్పుడు 8 వేల మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు చాలా తక్కువ. వాటి శరీరం అంత తీవ్రమైన పరిస్థితులనూ తట్టుకునేందుకు అనువుగా ఉంటుంది.⇒ పక్షులు ప్రయాణ మార్గాలను జన్యుపరంగా లేదా అనుభవం ద్వారా గుర్తుంచుకుంటాయి. అమూర్ ఫాల్కన్స్ పక్షి జాతి సైబీరియా నుంచి ఆఫ్రికాకు 22 వేల నుంచి 30 వేల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించి కచ్చితమైన గమ్యస్థానాలకు చేరుకుంటాయి.⇒ ఆవాసాలు చెదిరిపోవడం, వాతావరణ మార్పులు, కాంతి కాలుష్యం, గాలి టర్బైన్లు, ఎత్తైన భవనాల వల్ల విహంగాలు అప్పుడప్పుడు గందరగోళానికి గురవుతాయి. -
జనరేషన్ జెడ్.. టెక్నాలజీలో అప్డేటెడ్
సాక్షి, స్పెషల్ డెస్క్: సాంకేతికతను వినియోగించడంలో, ఎప్పటికప్పుడు అప్డేట్ కావడంలోనూ జెనరేషన్–జడ్ తరం ముందుంటోంది. 1997–2012 మధ్య జన్మించిన వాళ్లున్న ఈ తరం ప్రపంచ జనాభాలో దాదాపు 30% ఉన్నారు. భారత జనాభాలో వీరి వాటా దాదాపు 27%. మార్కెట్లోకి అడుగుపెట్టిన నూతన సాంకేతికతను 40% జెన్–జడ్ వాళ్లు వేగంగా అందిపుచ్చుకుంటున్నారు. కృత్రిమ మేధ (ఏఐ), జనరేటివ్ ఏఐని వినియోగించేందుకూ ఆసక్తి చూపుతున్నారని సైబర్ మీడియా రీసెర్చ్ (సీఎంఆర్) నివేదిక వెల్లడించింది. దేశంలోని ప్రధాన ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది.ప్రయోగాల్లో ముందు..మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ రావడమే ఆలస్యం.. జెన్–జడ్లోని ప్రతి 10 మందిలో నలుగురు దాన్ని వెంటనే అందిపుచ్చుకుంటున్నారు. వైరల్ ట్రెండ్స్ విషయంలో ప్రయోగాలు చేయడంలో జెన్–జడ్ తరం ముందుంటోంది. జిబ్లీ ఫిల్టర్ను కోట్లాది మంది వినియోగించడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని సీఎంఆర్ నివేదిక తెలిపింది. ‘సాంకేతికతను, ట్రెండ్ను వేగంగా అందిపుచ్చుకునే విధానం.. వినియోగ వ్యవస్థ రూపురేఖలను మారుస్తోంది. జెన్ జడ్లో సగం మంది వినియోగదారులకు ఏఐ గురించి తెలుసు. ముగ్గురిలో ఒకరు దైనందిన జీవితంలో జనరేటివ్–ఏఐని భాగంగా చేసుకున్నారు.చరిత్రలో ఒక గొప్ప మలుపు వద్ద జెన్–జడ్ తరం ఉంది. సాంకేతికతను అందిపుచ్చుకుని ప్రపంచవ్యాప్తంగా అనుసంధానం అయిన మొదటి తరం ఇదే’ అని ఆ నివేదిక వివరించింది. హైదరాబాద్తోపాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, గౌహతి, జైపూర్, ఇండోర్, గ్వాలియర్కు చెందిన జెన్–జడ్, మిలీనియల్స్ (28–44 ఏళ్ల మధ్య వయసు), జెన్ ఆల్ఫా (13 ఏళ్ల లోపు వారు) తరం ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. పనితనం ఉండాల్సిందే..జెన్–జడ్ తరానికి స్మార్ట్ఫోన్స్ కేవలం పరికరాలు మాత్రమే కాదు.. అవి గుర్తింపు వ్యక్తీకరణలు, అన్వేషణకు సాధనాలని నివేదిక వెల్లడించింది. పనితనం, బ్రాండ్ పట్ల నమ్మకం.. స్మార్ట్ఫోన్ల కొనుగోలును నిర్ణయిస్తున్నాయి. గేమింగ్, కంటెంట్ క్రియేషన్.. ఇన్ఫోటైన్మెంట్గా వారు భావించే ఈ వేదికలన్నీ కచ్చితమైన, అధిక పనితీరు కనబరచాల్సిందేనని ఈ తరం కోరుకుంటోంది. శక్తిమంతమైన చిప్సెట్స్ ఉండే స్మార్ట్ఫోన్లను జెన్ జెడ్ వాళ్లు ఎంపిక చేసుకుంటున్నారు. అంతేకాదు, మంచి బ్రాండ్లవీ, అద్భుతంగా పనిచేసేవీ వాళ్ల ప్రధాన ప్రాధామ్యాలుగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా, ఆటంకాలు లేని అనుభూతిని చిప్సెట్స్ అందిస్తున్నాయి. చిప్సెట్స్ పరంగా వినియోగదారుల సంతృప్తిలో మీడియాటెక్, ప్రీమియం బ్రాండ్ ఇమేజ్లో క్వాల్కామ్ ముందంజలో ఉన్నాయి. ఆరు గంటలు గేమింగ్కు..భారత్లో 74% మంది జెన్–జడ్ తరం స్మార్ట్ఫోన్లో గేమ్స్ కోసం వారంలో 6 గంటల సమయం వెచ్చిస్తున్నారు. తమ స్నేహితుల ద్వారా కొత్త గేమ్స్ గురించి తెలుసుకుంటున్న వారు ఎక్కువగా ఉన్నారు. గేమ్స్ ఆడటం అంటే ఏదో మామూలు గేమ్స్ కాదు... ప్రీమియం గేమ్స్ ఆడాలని అనుకుంటున్న వారు 30% మంది ఉండటం విశేషం. ఖర్చు కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాము ఒక్కరమే ఆడటం కాకుండా.. పోటీ ఉండాలని కోరుకుని, ఆన్లైన్ పోటీల్లో (ఈ–స్పోర్ట్స్)లో కూడా పాల్గొంటున్నారు.కొత్త గేమ్స్ గురించి ఎలా తెలుసుకుంటున్నారంటే... (శాతం)⇒ స్నేహితుల ద్వారా 66%⇒ సోషల్ మీడియా ద్వారా 55%⇒ యాప్ స్టోర్స్ ద్వారా 51%⇒ఏ గేమ్స్.. ఎందుకు ఆడుతున్నారు?⇒ వినోదం కోసమే స్మార్ట్ఫోన్లలో గేమ్స్ 72%⇒ మానసిక చురుకుదనం కోసం 52%⇒ ఈృస్పోర్ట్స్ ఆడేవారు 57%⇒ ప్రీమియం గేమ్స్ 30%స్మార్ట్ కార్లుడ్రైవింగ్ అనుభవాన్ని మరింత గొప్పగా చేయాలంటే కార్లను సాంకేతికతతో అనుసంధానించాల్సిందేనని 72 శాతం అభిప్రాయపడ్డారు. స్మార్ట్ కార్లు, రియల్ టైమ్ నేవిగేషన్, విద్యుత్ లేదా పర్యావరణ ప్రియ వాహనాలు.. ఇలాంటివి కావాలని వారు కోరుకుంటున్నారు. కింది అంశాలు ఉండే స్మార్ట్ కార్స్ కావాలంటున్నారు..అంశం శాతంఆధునిక భద్రతా ఫీచర్లు 59%మెరుగైన ఇంధన వినియోగం 56%అధిక బ్యాటరీ లైఫ్ 52% (ఫాస్ట్ ఛార్జింగ్ కోసం) -
మదర్సా విద్యార్థులే రక్షణ కవచాలు!
అతివాద నెట్వర్క్లతో పాక్ సైన్యానిది విడదీయరాని బంధమని మరోసారి రుజువైంది. దాయాది యుద్ధోన్మాదం చివరికి మత శిక్షణ సంస్థలను కూడా వదలడం లేదు. భారత్తో పోరులో సైన్యం చేతులెత్తేసే పరిస్థితి నెలకొనడంతో పాక్ ముసుగులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతు న్నాయి. అవసరమైతే మదర్సా విద్యార్థులను కూడా యుద్ధ రంగంలోకి పంపుతామని బాహాటంగా ప్రకటించేసింది. మతిలేని, వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రసిద్ధుడైన రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ శనివారం సాక్షాత్తూ పాక్ పార్లమెంటులోనే ఈ మేరకు ప్రకటన చేశారు. వారిని ‘సెకండ్ లైన్ ఆఫ్ డిఫెన్స్’గా ఆయన అభివర్ణించారు. అవసరమైనప్పుడు మదర్సా విద్యార్థులను యుద్ధ విధుల్లో 100 శాతం వాడుకుని తీరతామని కుండబద్దలు కొట్టారు. భారత డ్రోన్లన్నింటినీ ఎక్కడికక్కడ అడ్డుకుని కూల్చేశామని ఒకవైపు పాక్ సైన్యం ప్రకటించగా, అ లాంటిదేమీ లేదంటూ ఆసిఫ్ కొట్టిపారేయ డం తెలిసిందే. ‘‘భారత డ్రోన్లను కూల్చ కపోవడానికి కారణముంది. మా సైనిక స్థావరాలకు సంబంధించిన సున్ని తమైన సమాచారం లీక్ కావద్దనే అలా చేశాం’’ అంటూ విచిత్రమైన వివరణ ఇచ్చి ఇంటాబయటా నవ్వులపాలయ్యా రు. భారత ఫైటర్ జెట్లను కూల్చేశామని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో చెప్పుకుని, రుజువులడిగితే, ‘అలాగని భారత సోషల్ మీడియాలోనే వస్తోందిగా’ అని చెప్పి అభాసు పాలయ్యారు. రక్షణ మంత్రి అయ్యుండి సోషల్ మీడియా వార్తల ఆధారంగా ప్రకటనలు చేస్తారా అంటూ సీఎన్ఎన్ విలేకరి ఆండర్సన్ నిలదీయడంతో నీళ్లు నమిలారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ ఫేక్ ప్రచార సారథి... ఓ ఉగ్రవాది కొడుకు
లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి. భారత్పై పాకిస్తాన్ సాగిస్తున్న గోబెల్స్ ప్రచారానికి సారథి. పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్. పహల్గాం ఉగ్ర దాడి నుంచీ భారత్పై పథకం ప్రచారం దాయాది తలపెట్టిన తప్పుడు ప్రచారానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చౌధురే. అతను ఓ ఉగ్రవాది కుమారుడు కావడం విశేషం. ఉగ్రవాదంతో విడదీయలేని రీతిలో పెనవేసుకు పోయిన పాకిస్తాన్ బంధానికి నిలువెత్తు నిదర్శనం. దారితప్పిన సైంటిస్టు చౌధురి తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మెహమూద్. అవడానికి అణు శాస్త్రవేత్త. పాక్ అణ్వాయుధ పిత అబ్దుల్ ఖదీర్ఖాన్తో కలిసి అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించాడు. యురేనియం శుద్ధి తదితరాల్లో చురుగ్గా వ్యవహరించాడు. అందుకోసం గ్యాస్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీని నెదర్లాండ్స్ నుంచి తస్కరించాడు. కానీ నిజానికి అతనో కరడుగట్టిన మతోన్మాది. అంతకుమించి పేరుమోసిన ఉగ్రవాది. నరనరానా భారత విద్వేషాన్ని నింపుకున్న వ్యక్తి. ఐరాస భద్రతా మండలి ప్రకటిత అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. పాక్ అణ్వాయుధ పరిజ్ఞానాన్ని దాదాపుగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్కాయిదా చేతిలో పెట్టిన ధూర్తుడు. అప్పటి అల్కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు అత్యంత సన్నిహితుడు. బషీర్ చేసిన ఈ నిర్వాకం అప్పట్లో పాశ్చాత్య దేశాలకు పెద్ద సంకటంగా మారింది. అలాంటి వ్యక్తి కొడుకైన చౌధురి భారత్తో సైనిక సంఘర్షణ గురించి పాక్ తరఫున నాలుగు రోజులుగా అధికారికంగా బయటి ప్రపంచానికి చెబుతున్నాడు! ఓ అంతర్జాతీయ ఉగ్రవాది కొడుకే పాక్కు అంతర్జాతీయ గొంతుకగా మారాడు. ‘మాది ఉగ్రవాద బాధిత దేశం’అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతేగాక అధికారికంగానూ, ఆన్లైన్లోనూ భారత్పై ఇబ్బడిముబ్బడిగా ఫేక్ న్యూస్ ప్రచారం వ్యాప్తి చేస్తున్నాడు. చౌధురి తీరును పాక్ ప్రజలు కూడా ఛీదరించుకుంటున్నారు. భారత సైన్యం చేతిలో పాక్ రోజూ చావుదెబ్బలు తింటున్నా అతను మాత్రం ఆ వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి లేనిపోని గొప్పలకు పోతున్నాడంటూ మండిపడుతున్నారు. డీఎన్ఏలోనే ఉగ్రవాదం లెఫ్టినెంట్ జనరల్ చౌధురి తండ్రి బషీర్ను 2001లో ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. బిన్లాడెన్ ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దన్నుగా నిలుస్తున్నాడని స్పష్టంగా పేర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడితో మరో దారిలేక అదే ఏడాది పాక్ ఐఎస్ఐ అతన్ని అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ బషీర్ను స్వయంగా విచారించింది. బిన్లాడెన్ను కలిసినట్టు దర్యాప్తులో అతను అంగీకరించాడు. 2009లో ప్రభుత్వ విధుల నుంచి తప్పించింది. ముసుగు తొలగిపోవడంతో బషీర్ మరింత రెచ్చిపోయాడు. ఉమ్మా తమీరీ నౌ (యూటీఎన్) అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఓ ఉగ్ర సంస్థను స్థాపించాడు. రసాయన, జీవాయుధాలతో పాటు ఏకంగా అణ్వాయుధాలను గురించి లాడెన్కు, తాలిబన్లకు కావాల్సిన సమాచారం అందించడం మొదలుపెట్టాడు. తాలిబన్ల నాటి చీఫ్ ముల్లా ఒమర్తో తరచూ భేటీ అయ్యేవాడు. మునీర్.. ఓ మతోన్మాది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్ది కూడా పూర్తిగా జిహాదీ నేపథ్యమే. ఆయన తండ్రి సయ్యర్ సర్వర్ మునీర్ ఓ మదర్సాలో ఇస్లాం బోధకుడు. ఆ ఛాయల్లో పెరిగిన మునీర్ కూడా కరడుగట్టిన మతోన్మాదిగా మారాడు. నరనరానా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు. 2019లో జమ్మూలోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి ఉగ్ర దాడికి మునీరే వ్యూహకర్త. అప్పట్లో పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ చీఫ్గా ఆ దాడిని దగ్గరుండి పర్యవేక్షించాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గాడిలోకి స్టార్టప్స్ ఫండింగ్!
దేశంలోని స్టార్టప్స్లోకి నిధుల రాక తిరిగి గాడిలో పడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిన భారత్లో రెండేళ్ల విరామం తర్వాత గత ఏడాదిలో ఫండింగ్లో వృద్ధి నమోదైంది. దేశీయ అంకుర సంస్థలు 2024లో మొత్తం రూ.1,24,184 కోట్ల ఫండింగ్ అందుకున్నాయి. 2023తో పోలిస్తే ఇది 27.78 శాతం ఎక్కువ. 2025 జనవరి–మార్చిలో నిధులు.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33.57 శాతం పెరిగి రూ.31,820 కోట్లుగా నమోదయ్యాయి.అంకుర సంస్థల్లో పెట్టుబడులు 2017 నుంచి 2020 వరకు తగ్గుతూ వచ్చాయి. కరోనా మహమ్మారి రాకతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార తీరుతెన్నుల్లో అనూహ్యంగా సమూల మార్పులు వచ్చాయి. అన్ని రంగాల్లోనూ కంపెనీలు ఐటీపై భారీగా వెచ్చించాయి. దీంతో 2021లో రికార్డు స్థాయిలో భారత అంకుర సంస్థల్లోకి రూ.3,26,800 కోట్ల నిధులు వెల్లువెత్తాయి. ఏడాదిలో మూడింతలకుపైగా దూసుకెళ్లాయి. భారత స్టార్టప్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అక్కడి నుంచి ఇక తిరుగు ఉండదు అనుకున్నప్పటికీ అందుకు విరుద్ధంగా వరుసగా రెండు సంవత్సరాలు నిధుల రాక తగ్గింది. వడ్డీ రేట్లు పెరగడం; భౌగోళిక, రాజకీయ అనిశ్చితి; ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం, కంపెనీల పనితీరు పట్ల ఆందోళనలు.. ఈ క్షీణతకు కారణమయ్యాయి.‘ఈ–కామర్స్’ జోష్⇒ 2024లో ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ కంపెనీలు ఏకంగా రూ.27,778 కోట్ల నిధులను ఆకర్షించడం గమనార్హం. 2024లో అధిక మొత్తం ఫండింగ్ ఈ–కామర్స్ కంపెనీల్లోకి వెళ్లింది. 2023లో దేశీయ అంకుర సంస్థలు రూ.97,180 కోట్ల నిధులు సమీకరించాయి. ⇒ 2024లో టాప్ – 5 రంగాల వారీగా డీల్స్ చూసుకుంటే... ఈ కామర్స్లో 222 డీల్స్ జరిగాయి. ఫిన్టెక్లో 211, హెల్త్ టెక్లో 120, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ 112 డీల్స్ జరిగాయి. ఏఐకి సంబంధించి మాత్రం కేవలం 59 డీల్స్ జరగడం గమనార్హం.ఈ మార్చి త్రైమాసికంలో ఇలా..2025 జనవరి–మార్చిలో నిధులు.. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 33.57 శాతం పెరిగి రూ.31,820 కోట్లుగా నమోదయ్యాయి. ఈ త్రైమాసికంలో 319 డీల్స్ జరిగాయి. నాలుగు సంస్థలు మూతపడ్డాయి. అయిదు స్టార్టప్స్ 1,300 పైచిలుకు ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. 2023లో 24,000 మందికి, 2022లో 20,000 మందికి స్టార్టప్ కంపెనీలు ఉద్వాసన పలికాయి. ఉద్యోగుల తీసివేతలు గత ఏడాది అతి తక్కువగా (సుమారు 4,700) నమోదయ్యాయి. -
పాక్ రెక్కలు కత్తిరించాం
యుద్ధ విరమణకు కొద్ది గంటల ముందు దాయాదికి మన సైన్యం ఘనంగా లాస్ట్ పంచ్ ఇచ్చింది. ఏకంగా ఆరు కీలక పాకిస్తానీ వైమానిక స్థావరాలను నేలమట్టం చేసింది. వాటితో పాటు మరో రెండుచోట్ల రాడార్ వ్యవస్థలను కూడా ధ్వంసం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వాటిపై అత్యంత కచ్చితత్వంతో కూడిన వైమానిక దాడులతో పాక్కు కోలుకోలేని నష్టం మిగిల్చింది. అత్యాధునిక వైమానిక స్థావరాలతో సహా పాక్లో ఏ ప్రాంతమూ సురక్షితం కాదని మరోసారి రుజువు చేసింది. ఎనిమిది కీలక సైనిక స్థావరాలపై జరిగిన దాడుల్లో ఏ ఒక్కదాన్నీ పాక్ సైన్యం కనీస స్థాయిలో కూడా అడ్డుకోలేకపోయింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తమ దేశ భద్రత అక్షరాలా గాల్లో దీపమేనని మరోసారి తేలిపోయిందని పాక్ పౌరులు కూడా వాపోతున్నారు. సామాన్యులను వేధించడానికే తప్ప యుద్ధానికి తమ సైన్యం పనికిరాదంటూ అక్కడి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సైన్యం కదలికలను అడ్డుకునేందుకే?పాక్కు చెందిన కీలక వైమానిక స్థావరాలపై భారత్ భారీ స్థాయిలో దాడికి వెనక ప్రబల కారణాలే ఉన్నట్టు చెబుతున్నారు. శనివారం ఉదయం నుంచే తన సైన్యాన్ని వీలైనంతగా భారత సరిహద్దులకు తరలించేందుకు పాక్ సిద్ధమైందని నిఘా వర్గాలు కేంద్రానికి సమాచారమిచ్చాయి. దాంతో ఉద్రిక్తతలను మరింత పెంచేందుకే పాక్ నిర్ణయించుకుందని స్పష్టమైపోయింది. దాంతో సైనిక తరలింపులను అడ్డుకోవడమే లక్ష్యంగా అప్పటికప్పుడు వైమానిక స్థావరాలను మన బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు వాటిని గురి తప్పకుండా ఢీకొట్టి శిథిలాల దిబ్బలుగా మార్చేశాయి. తద్వారా పదాతి దళానికి అతి కీలకమైన వైమానిక దన్ను అందకుండా చేశాయి. అంతేగాక పాక్ యుద్ధ సన్నద్ధతపైనే చావుదెబ్బ కొట్టాయి. ‘‘ఈ పరిణామం వల్లే మరో గత్యంతరం లేక పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. సాయంత్రానికల్లా కాల్పుల విరమణకు ఒప్పుకుంది’’ అని రక్షణ నిపుణులు చెబుతున్నారు.వైమానిక స్థావరాలుచకాలానూర్ ఖాన్ ఎయిర్బేస్గా పిలుస్తారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో రావల్పిండిలో ఆ దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉంటుంది. ఆ దేశానికి అత్యంత కీలకమైన వైమానిక స్థావరమిది. వాయుసేన కార్యకలాపాలతో పాటు వీఐపీల రవాణా తదితరాలు కూడా ఇక్కడినుంచే కొనసాగుతాయి. ప్రధాని తదితర అత్యున్నత స్థాయి రాజకీయ నాయకులు, అత్యున్నత సైనికాధికారుల ప్రయాణాలకు ఉపయోగించే ఆధునిక విమానాలకు ఇది విడిది కేంద్రం. సీ–130, ఐఎల్–78 విమానాలకు స్థావరం. పాక్ ఎయిర్ మొబిలిటీ కమాండ్కు ప్రధాన కేంద్రం కూడా. భారత్తో 1965, 1971 యుద్ధాల్లో ఈ బేస్ అత్యంత కీలక పాత్ర పోషించింది. భారత్పై జరిపిన డ్రోన్ దాడులను ఇక్కడినుంచే పర్యవేక్షించారు. సైనిక విమానాల ఏరియల్ రీ ఫ్యూయలింగ్, రవాణా తదితర కార్యకలాపాలకు ఇది ప్రధాన బేస్. పాక్ వైమానిక దళానికి చెందిన ఆరు అత్యాధునిక ట్రాన్స్పోర్ట్ స్క్వాడ్రన్లకు అడ్డా. అంతేగాక ఎయిర్ఫోర్స్లో చేరేవారికి పూర్తిస్థాయి శిక్షణ ఇచ్చే పాక్ వైమానిక దళ (పీఏఎఫ్) కాలేజీ కూడా ఇక్కడే ఉంది. అంతేగాక పాక్ వైమానిక దళానికి అతి కీలకమైన ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ (ఏఈడబ్ల్యూఈ) ‘సాబ్ ఎరీఐ’ వ్యవస్థకు కేంద్రం. కనుక చకాలా బేస్ అత్యాధునిక రక్షణ వలయం నడుమ ఉంటుంది. అంత కీలకమైన ఎయిర్బేస్పైనే మన వైమానిక దళం భారీ ఎత్తున దాడి చేసి ధ్వంసం చేసింది. తద్వారా పాక్లో ఏ సైనిక స్థావరం కూడా సురక్షితం కాదని దాయాదికి స్పష్టమైన సందేశమిచ్చింది.రఫీకీపంజాబ్ ప్రావిన్స్లో జాంగ్ జిల్లాలోని షోర్కోట్లో ఇస్లామాబాద్కు 330 కి.మీ. దూరంలో ఉంటుంది. తొలుత షోర్కోట్ బేస్గా పిలిచేవారు. తర్వాత 1965 యుద్ధంలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ సర్ఫరాజ్ అహ్మద్ రఫీకీ పేరు పెట్టారు. చైనా నుంచి పాక్ కొనుగోలు చేసిన జేఎఫ్–17, మిరాజ్ వంటి అత్యాధునిక ఫైటర్ జెట్లు ఉండేదిక్కడే. వీటితోపాటు రవాణా తదితర అవసరాలకు వాడే సైనిక హెలికాప్టర్లకు కూడా రఫీకీ ఎయిర్బేస్ ప్రధాన కేంద్రం. ఇది సెంట్రల్ పంజాబ్లో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. 10 వేల అడుగుల పొడవైన రన్వే, దానికి సమాంతరంగా ట్యాక్సీవే దీని ప్రత్యేకతలు. దాంతో ఇక్కడి యుద్ధ విమానాలు భారత సరిహద్దులపై దాడులకు అతి తక్కువ సమయంలో సన్నద్ధం కాగలవు. పాకిస్తాన్ రక్షణ నెట్వర్క్లో అతి కీలకమైన భాగమిది.మురీద్చక్వాల్ జిల్లాలో ఉన్న వైమానిక స్థావరం. పలు వైమానిక స్క్వాడ్రన్లకు కూడా నిలయం. దేశీయ షాపర్–1, తుర్కియే నుంచి తెచ్చుకున్న బైరక్తర్ టీబీ2, అకిన్సీ డ్రోన్లతో పాటు మానవ రహిత విమానాలు/యుద్ధ విమానాలు (యూఏవీ/యూసీఏవీ) తదితరాలకు కూడా ఇదే కేంద్రం. మూడు రోజులుగా భారత్పై జరిగిన దాడుల్లో కీలక పాత్ర పోషించింది. మనపైకి దూసుకొచ్చిన డ్రోన్లను ఇక్కడినుంచే ప్రయోగించారు. పాక్ డ్రోన్ వార్ఫేర్కు చక్వాల్ ప్రధాన కేంద్రంగా మారింది. డ్రోన్ల పర్యవేక్షణ, నిఘా సమాచార సేకరణతో పాటు దాడుల వంటివాటికి కూడా బేస్ ఇదే. డ్రోన్ల వాడకంలో సైనిక శిక్షణ కూడా ఇక్కడే ఇస్తుంటారు. మనపై డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా మురీద్ ఎయిర్ బేస్ను సైన్యం లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. మతిలేని దాడులకు గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది.రహీం యార్ఖాన్దక్షిణ పంజాబ్లో రహీం యార్ఖాన్ నగరంలోని వైమానిక స్థావరం. రాజస్తాన్ సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. తూర్పు పాకిస్తాన్ మీదుగా మన సరిహద్దులపై దాడులకు అత్యంత అనువుగా ఉంటుంది. రాజస్తాన్లోని శ్రీగంగానగర్, జైసల్మేర్ వంటి పట్టణాలపై వైమానిక దాడులు ఇక్కడినుంచే జరిగాయి. ఇక్కడినుంచి పౌర విమానాల రాకపోకలు కూడా జరుగుతుంటాయి. మన వైమానిక దాడులతో ఈ బేస్తో పాటు ఇక్కడి రన్వే కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది.సుక్కుర్భొలారీ ఎయిర్బేస్గా పిలుస్తారు. సింధ్ ప్రావిన్స్లో కరాచీ, హైదరాబాద్ నడుమ జంషోరో జిల్లాలో ఉంటుంది. పాక్కు జీవనాడి వంటి కరాచీ నగర రక్షణను కట్టుదిట్టం చేసే లక్ష్యంతో 2017లో ఈ ఎయిర్బేస్ను ఏర్పాటు చేశారు. సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలోకి వస్తుంది. ఆపరేషనల్ కన్వర్షన్ యూనిట్ తాలూకు 19 స్క్వాడ్రన్కు కేంద్రం. ఎఫ్–15ఏ, ఎఫ్–16, కొన్ని జేఎఫ్–17లతో పాటు ఏడీఎఫ్ యుద్ధ విమానాలకు విడిది కేంద్రం. పాక్ సైన్యం ఉపరితల ఆపరేషన్లకు అత్యవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ తదితరాల్లో దీనిది కీలకపాత్ర. పాక్ వైమానిక స్థావరాలన్నింట్లోనూ అత్యాధునికమైనదిగా దీనికి పేరు. ఇక్కడ ఎస్ఏఏబీ 2000 ఎయిర్బార్న్ అర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం (ఏఈడబ్ల్యూసీఎస్) ఉంది.రాడార్ కేంద్రాలుసియాల్కోట్పంజాబ్లోని సియాల్కోట్ వైమానిక కేంద్రంలో ఉంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ విమా నాశ్రయం, మరో సైనిక విమానాశ్రయం ఉన్నాయి. ఇక్కడి రాడార్ కేంద్రం వైమానికంగా పాక్కు అతి కీలకమైనది. దాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇక్కడి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పౌర విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.పస్రూర్ఇది కూడా పంజాబ్లోనే సియాల్కోట్ జిల్లాలో ఉంది. ఇక్కడి రాడార్ కేంద్రాన్ని కూడా మన వైమానిక దళం నేలమట్టం చేసింది.చునియన్పంజాబ్ ప్రావిన్స్లో లాహోర్కు 70 కి.మీ. దూరంలో చునియన్ వద్ద ఉంటుంది. పాక్లోని ప్రాథమిక వైమానిక స్థావరాల్లో ఒకటి.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వీరమాతకు వందనం
యుద్ధంలో బిడ్డను కోల్పోయిన దుఃఖం ఒకవైపు. ‘దేశమాత కోసం నా బిడ్డప్రాణత్యాగం చేశాడు’... అనే గర్వం ఒకవైపు... ఎంతోమంది వీరమాతలు... అందరికీ వందనం...యుద్ధ చరిత్రలోకి ఒకసారి...గర్వంగా అనిపించింది...కొన్ని సంవత్సరాల క్రితం... ఉగ్రవాదులతో జరిగిన పోరులో నలుగురిని చంపేశాడు లెఫ్టినెంట్ నవదీప్సింగ్. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడుతూనే నేలకొరిగాడు 26 సంవత్సరాల ఆ యువకుడు. ‘నేనంటే నవదీప్కు ఎంత ఇష్టమో చెప్పడానికి మాటలు చాలవు. ఫ్రెండులా ఎన్నో కబుర్లు చెబుతుండేవాడు. నవదీప్ లేడు అనే వాస్తవం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఇప్పటికీ కలలో ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాడు. అమ్మా...నేను వస్తున్నాను అనే మాట వినబడితే సంతోషంగా అనిపించేది. లెఫ్టినెంట్ నవదీప్సింగ్ తల్లి కౌర్ ఇక ఆ మాట ఎప్పుడూ వినిపించదు. ఉగ్రవాదులను నవదీప్ దీటుగా ఎదుర్కోకపోతే ఎంతో నష్టం జరిగి ఉండేది... అని పై అధికారులు చెప్పినప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. నవదీప్ నా బిడ్డ. అతడు చనిపోయినప్పుడు నేనే కాదు.. ఎంతోమంది తల్లులు సొంత బిడ్డను కోల్పోయినట్లు ఏడ్చారు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. దేశం కోసం పోరాడే వీరసైనికుడికి ఒక్కరే అమ్మ ఉండదు. దేశంలోని ప్రతి అమ్మ తన అమ్మే’ అంటుంది పంజాబ్లోని గురుదాస్పూర్కు చెందిన నవదీప్సింగ్ తల్లి కౌర్.ఇంటికి ఎప్పుడొస్తావు బిడ్డ?ఆంధ్రప్రదేశ్లోని పెనుగొండ నియోజక వర్గం కల్లితండాకు చెందిన ఆర్మీ జవాన్ మురళీనాయక్ పాక్తో జరిగిన యుద్ధంలో చనిపోయాడు. ఆ తల్లి దుఃఖ భాషను అర్థం చేసుకోగలమా? కుమారుడు మురళీనాయక్ మరణం గురించి అడిగినప్పుడు ‘ఏమని చెప్పాలి సామీ’ అని ఆ తల్లి భోరున విలపించింది. మురళీనాయక్ పార్థివదేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు తరలి వచ్చారు. వారు తనలాగే ఏడ్చారు. అమ్మా... నీ కొడుకు ఎంత గొప్ప వీరుడో చూశావా! ‘ఆర్మీ జవాన్ మురళీ నాయక్ తల్లి’ అని తనను పరిచయం చేస్తున్న సమయంలో ఆ తల్లి హృదయం గర్వంతో పొంగిపోతుంది. మాతృదినోత్సవం సందర్భంగా ఆ వీరమాతలందరికీ వందనం.కవాతు శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి!జమ్మూ కశ్మీర్ దోడాలో జరిగిన ఎన్కౌంటర్లో కెప్టెన్ బ్రిజేష్ థాప వీరమరణం పొందాడు. ‘బ్రిజేష్ ఇక లేడు అనే వార్త విని కుప్పకూలిపోయాను. మా అబ్బాయి అని చెప్పడం కాదుగానీ చాలా క్రమశిక్షణ ఉన్న కుర్రాడు. ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే నేను సైన్యంలో చేరుతాను అనేవాడు. సైన్యంలో పనిచేయడం చాలా కష్టం అని చెబుతుండేదాన్ని. ఎంత కష్టమైనా సైన్యంలోకి వెళతాను అనేవాడు. బ్రిజేష్ లేడనే వాస్తవం కష్టంగా ఉన్నా సరే... దేశం కోసం నా కుమారుడుప్రాణాలు అర్పించాడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది’ అంటారు నీలిమ థాప. సైనిక దుస్తుల్లో కుమారుడిని చూసిన తొలి క్షణం నీలిమ భావోద్వేగానికి గురయ్యారు.ఎప్పటి కల అది! నాన్న యూనిఫామ్ వేసుకొని చిన్నారి బ్రిజేష్ మార్చ్ చేస్తుండేవాడు (బ్రిజేష్ తండ్రి మిలిటరీలో పనిచేశారు) కుమారుడిని చూసి ‘మేజర్ సాబ్ వచ్చేశారు’ అని నవ్వేది.ఇప్పుడిక ఆమెకు నవ్వే అవకాశమే లేకపోవచ్చు. కన్నీటి సముద్రంలో దిక్కుతోచకుండా ఉన్నట్లుగానే ఉండవచ్చు. అయితే... కుమారుడి ధైర్యసాహసాల గురించి విన్నప్పుడు ఆ తల్లి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. ‘కెప్టెన్ బ్రిజేష్ థాప’ అని కుమారుడి పేరు విన్నప్పుడల్లా... ఆర్మీ అధికారుల కవాతు శబ్దాలు ఆమెకు వినిపిస్తూనే ఉంటాయి.ఆ తల్లి ఎలా తట్టుకుందో!‘పిల్లల పెంపకంలో తల్లి పాత్ర కీలకం’ అంటుంది తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన మంజుల. ఇండియా–చైనా యుద్ధంలో ఆమె కుమారుడు కల్నల్ సంతోష్బాబు కన్నుమూశాడు. చదువులోనే కాదు ఆటల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో ముందుండే కొడుకును చూసి మంజుల గర్వించేది. ఆరోజు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సంతోష్ మరణం గురించి మంజులకు తెలియజేశారు. ఆ తల్లి గుండె ఎలా తట్టుకుందో తెలియదు. కల్నల్ సంతోష్ బాబు, తల్లి మంజులకుమారుడి బాల్యవిశేషాలు, క్రమశిక్షణ గురించి కళ్లకు కట్టినట్లు చెప్పే మంజుల కుమారుడి మరణం గురించి.. ‘మన దేశం కోసం మా అబ్బాయి వీరమరణం పొందాడు’ అని గర్వంతో చెబుతుంది. ‘ఒక్కడే బాబు నాకు...’ అంటున్న ఆ తల్లి కంఠానికి కన్నీళ్లు అడ్డుపడి మాటలు రావు. ఆమె మనసులో కనిపించని దుఃఖసముద్రాలు ఉండవచ్చుగాక... కానీ ఆమె పదే పదే చెబుతుంది...‘నా బిడ్డ మన దేశం కోసం చనిపోయాడు’.ఎక్కడ ఉన్నా అమ్మ గురించే‘కెప్టెన్ సౌరభ్ కాలియ బయట ఎలా ఉంటాడో తెలియదుగానీ ఇంట్లో మాత్రం చిలిపి’ అంటుంది అతడి తల్లి విజయ కాలియ. ‘మేరా పాస్ మా హై’ అని తల్లి గురించి సరదాగానే సినిమా డైలాగు చెబుతుండేవాడుగానీ... నిజంగా తల్లి సౌరభ్ ధైర్యం. సైన్యం. ‘ఒకరోజు సౌరభ్ వంటగదిలోకి వచ్చి సైన్ చేసిన బ్లాంక్ చెక్ ఇచ్చాడు. ఎందుకు? అని అడిగితే ‘నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు మనీ విత్డ్రా చేసుకోవడానికి’ అన్నాడు. తాను ఎక్కడ ఉన్నా నా గురించే ఆలోచించేవాడు’ అంటుంది విజయ.ఇప్పుడు ‘కాలియ హోమ్’లో ఆ బ్లాంక్ చెక్ కనిపిస్తూనే ఉంటుంది. ఆ చెక్ను చూసినప్పుడల్లా కుమారుడిని చూసినట్లుగానే ఉంటుంది. ‘డబ్బును డ్రా చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఈ కాగితంపై నా బిడ్డ చేసిన సంతకం ఉంది. అది నాకోసం చేసింది. ఇది ఎప్పటికీ తీయటి జ్ఞాపకంగా ఉండిపోతుంది’ అంటుంది విజయ. చివరిసారిగా తమ్ముడి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి ఫోన్ చేశాడు సౌరభ్.‘నా పుట్టిన రోజుకు తప్పకుండా ఇంటికి వస్తాను అన్నాడు. ఆ రోజు ఇప్పటికీ రాలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అవుతుంది విజయ. 23 ఏళ్లు నిండకుండానే కార్గిల్ యుద్ధంలో సౌరభ్ చనిపోయాడు. హిమాచల్ద్రేశ్లోని పలంపూర్ ఇంట్లో ఒక గది మొత్తాన్ని సౌరభ్ మ్యూజియంగా మార్చారు. ‘ఈ మ్యూజియంలోకి వస్తే మా అబ్బాయి దగ్గరకి వచ్చినట్లే ఉంటుంది’ అంటుంది విజయ.నా కుమారుడు... వీరుడుఆ అమ్మ పేరు త్రిప్తా థాపర్... ఆమె కళ్లలో ఒకవైపు అంతులేని దుఃఖం, మరోవైపు గర్వం కనిపిస్తాయి. కార్గిల్ యుద్ధంలో థాపర్ తన కుమారుడిని కోల్పోయింది. మధ్యప్రదేశ్లో మహు పట్టణంలోని మిలిటరీ కంటోన్మెంట్ మ్యూజియంలో కార్గిల్ యుద్ధ దృశ్యాలను, కుమారుడి ఫోటోను చూస్తున్నప్పుడు ఆమెకు దుఃఖం ఆగలేదు.ఇరవై రెండు సంవత్సరాల వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన విజయంత్ థాపర్ కార్గిల్ వార్ హీరో. తన దళంతో శత్రువుల బంకర్ ను చుట్టుముట్టే క్రమంలో విజయంత్ థాపర్ మరణించాడు.వీర్చక్ర విజయంత్ థాపర్ ,తల్లి త్రిప్తా థాపర్ ‘వీర్చక్ర విజయంత్ థాపర్ అమ్మగారు అని నన్ను పరిచయం చేస్తుంటారు. వీర్చక్ర అతడి పేరులో శాశ్వతంగా కలిసిపోయింది’ అని విజయంత్ గురించి గర్వంగా చెబుతుంది త్రిప్తా థాపర్. ఆమె దృష్టిలో అది మ్యూజియం కాదు. పవిత్ర స్థలం. ‘ఈ మ్యూజియంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి ఫోటో ఎన్నో జ్ఞాపకాలను కళ్ల ముందు ఆవిష్కరిస్తుంది. దేశం కోసం చిన్న వయసులోనే జీవితాన్ని త్యాగం చేసిన వీరులను పదే పదే తలుచుకునేలా చేస్తుంది’ అంటుంది థాపర్. తన సన్నిహిత మిత్రురాలు పూనమ్ సైనీతో కలిసి తరచు ఈ మ్యూజియమ్కు వస్తుంటుంది త్రిప్తా థాపర్.ఎప్పుడు వచ్చినా కుమారుడి దగ్గరికి వచ్చినట్లే ఉంటుంది ఆ తల్లికి. బ్యాగులు సర్దుకొని ఇల్లు వదిలే ముందు... ‘అమ్మా... ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పేవాడు. గంభీరంగా కనిపించే అతడి కళ్లలో అమ్మను విడిచి వెళ్లే ముందు సన్నని కన్నీటి పొర కనిపించేది. అయితే అమ్మకు ఆ కన్నీటి ఆనవాలు కనిపించకుండా తన చిరునవ్వు చాటున దాచేవాడు. ‘అమ్మా, కొడుకుల అనుబంధం గురించి చెప్పడానికి మాటలు చాలవు’ అని కన్నీళ్లు తుడుచుకుంటుంది త్రిప్తా థాపర్ స్నేహితురాలు పూనమ్. -
భారతీయుల రూటే.. సపరేటు
సాక్షి, అమరావతి : ఋగ్వేదంలోనే యోగా గురించి ప్రస్తావించాం. సింధు లోయ నాగరికతలోనే టాయిలెట్లను వినియోగించాం. గూస్బెర్రీ వంటి మొక్కల సారాన్ని వినియోగించి షాంపూలు తయారు చేశాం.. ‘సున్నా’కు విలువ కనిపెట్టి ప్రపంచానికి అందించాం. ఇలా విశ్వజగతికి భారతీయులు ఆది నుంచి నాయకులుగానే పరిచయమయ్యారు. నేటికీ అదే విధంగా ఉండేందుకు, గ్లోబల్ లీడర్లుగా పిలిపించుకునేందుకు భారతీయులు ఇష్టపడుతున్నారు. అందుకోసమే కష్టాన్నీ సంతోషంగా స్వీకరిస్తున్నారు. ప్రపంచ ప్రముఖ కార్యనిర్వాహక పరిశోధన సంస్థ అయిన అమ్రోప్ నిర్వహించిన అధ్యయనంలో భారత్ ప్రజల తాజా మనోగతం ఆవిష్కృతమైంది. గ్లోబల్ సౌత్ దేశాలైన భారత్, చైనా, బ్రెజిల్తోపాటు పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్లో పని వైఖరిపై అమ్రోప్ తాజాగా అధ్యయనం జరిపింది. కష్టించి పనిచేయడం వల్లనే గుర్తింపు లభిస్తుందని, జీవితం సంతృప్తికరంగా ఉంటుందని, ఆశయం నెరవేరుతుందని భారతీయులు నమ్ముతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ సర్వేలో 20 ఏళ్లు నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల బ్యాచిలర్ డిగ్రీ, అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్న 8 వేల మంది నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతి దేశం నుంచి వెయ్యి మంది సర్వేలో పాల్గొన్నారు. అధ్యయనంలోని ముఖ్యాంశాలు:» భారతీయుల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. 92 శాతం మంది పని చేయడంలోనే సంతోషం ఉందని అంటున్నారు. » 73% మంది మంచి ఉద్యోగం, జీవితం ఉండాలని కోరుకుంటున్నారు. »75% మంది కష్టపడి పనిచేయడం సాధారణంగా మనిషి ధర్మమని నమ్ముతున్నారు.» 42% మంది వారానికి 40 గంటలకు మించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఫ్రాన్స్లో 16 శాతంగా ఉంది.» 76 శాతం మంది భారతీయ నిపుణులు ఒక కంపెనీని నడిపించాలని లేదా తామే సొంతంగా ఒక సంస్థను నిర్వహించాలని కోరుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారు 36% కాగా, అమెరికాలో 49% మంది ఉన్నారు. » తామేంటో నిరూపించుకునేలా పనిచేయాలని 73% మంది భారతీయులు అనుకుంటున్నారు. జర్మనీలో ఇలాంటి వారి సంఖ్య 41 శాతం మాత్రమే ఉంది. »మన దేశంలో 84 శాతం మందికి చదువు, వ్యాపారం, ఉద్యోగం వంటి మంచి కెరీర్ ముఖ్యంగా భావిస్తున్నారు. »పాశ్చాత్య దేశాల్లో మాత్రం 62% మంది తాము కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తామని పేర్కొనడం గమనార్హం. » రాజకీయ నాయకుడిగా ఉండేందుకు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం మంది ఇష్టపడటం లేదు. -
తుర్కియే సోంగర్లు
భారత త్రివిధ దళాల ముప్పేట దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్.. కొత్త కుయుక్తులతో యుద్ధానికి దిగుతోంది. సంప్రదాయ ఆయుధాలకు బదులుగా అత్యాధునిక డ్రోన్లతో భారత్పై దాడులు చేసేందుకు ప్రయత్నిస్తోంది. వీటిలో పాక్ మిత్రదేశం తుర్కియే తయారుచేసిన అత్యంత ప్రమాదకరమైన అసిస్గార్డ్ సోంగర్ సాయుధ యూఏవీలు ఉండటం కాస్త కలవరపెడుతోంది. ఎందుకంటే ఆధునిక యుద్ధ పద్ధతుల్లో సోంగర్ డ్రోన్లు సమర్థవంతమైనవిగా నిరూపించుకున్నాయి. వీటిని బహుళ ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు. గురువారం రాత్రి భారత్లోని 36 మిలిటరీ, పౌర లక్ష్యాలపై సోంగర్ డ్రోన్లతోనే పాక్ దాడిచేసినట్లు మన రక్షణ శాఖ ప్రకటించింది. వాటిని సమర్థంగా కూల్చేసినట్లు శుక్రవారం మీడియా సమావేశంలో కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు. సోంగర్ డ్రోన్లను సమర్థంగా అడ్డుకోగల గగనతల రక్షణ వ్యవస్థలు మనకు ఉన్నప్పటికీ.. వాటిని తక్కువగా అంచనా వేయకూడదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సోంగర్ డ్రోన్ల ప్రత్యేకతలు ఇవీ.. → సోంగర్ డ్రోన్లను తుర్కియేలోని అంకారా కేంద్రంగా పనిచేస్తున్న అసిస్గార్డ్ సంస్థ తయారుచేసింది. వీటిని 2019 నుంచి వినియోగిస్తున్నారు. → ఈ డ్రోన్లు స్వయంచాలితంగా ప్రయాణించి లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్కు చేరుకోగలవు. రిమోట్ కంట్రోల్తో కూడా నియంత్రించవచ్చు. ఆధునిక యుద్ధ తంత్రంలో ఇవి కీలకంగా పనిచేయగలవు. సరిహద్దులు దాటి దాడులు చేయటంలో వీటికి మంచి రికార్డు ఉంది. ప్రమాదకర సాయుధ డ్రోన్సోంగర్ డ్రోన్కు ఒక అత్యాధునిక ఆటోమేటిక్ మెషీన్ గన్ అమర్చబడి ఉంటుంది. చిన్నపాటి క్షిపణులను కూడా ఇది ప్రయోగించగలదు. 81 ఎంఎం మోరా్టర్ రౌండ్స్ను పేల్చగలదు. వ్యక్తులు, వాహనాలు, ఎంపికచేసిన చిన్నపాటి లక్ష్యాలపై సమర్థంగా దాడి చేయగలదు. ఫ్లైట్ పెర్ఫార్మెన్స్సోంగర్ డ్రోన్లు 45 కిలోల బరువును మోసుకెళ్లగలవు. పేలోడ్ లేకుండా ఏకబిగిన 25 నుంచి 30 నిమిషాల వరకు గగనతలంలో ఎగరగలవు. గ్రౌండ్ కంట్రోల్ స్టేషననుంచి 3–5 కిలోమీటర్ల దూరం వరకు ఇవి దాడులు చేయగలవు. సముద్రమట్టం నుంచి 2,800 మీటర్లు, భూ మట్టం నుంచి 400 మీటర్ల ఎత్తువరకు ఇవి ఎగరగలవు. రియల్టైమ్ ఇంటెలిజెన్స్లక్ష్యాలపై నిఘా పెట్టడంలో కూడా సోంగర్ డ్రోన్లది అందెవేసిన చెయ్యి. ఇవి గగనతలంలో ఎగురుతూ గ్రౌండ్ స్టేషన్కు రియల్టైమ్ (ప్రత్యక్షంగా)లో వీడియోలు, చిత్రాలను పంపగలవు. దాడుల తర్వాత జరిగిన నష్టాన్ని కూడా విశ్లేషించి వెంటనే గ్రౌండ్ స్టేషన్కు పంపుతాయి. రాత్రి– పగలు అన్న తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలో అయినా ఈ డ్రోన్లు నిఘా పెట్టగలవు. రాత్రిపూట వీడియోలు, చిత్రాలు తీసేందుకు వీటిలో ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి. స్వయంచాలితం ఈ డ్రోన్లను గ్రౌండ్ స్టేషన్ నుంచి రిమోట్ కంట్రోల్తో నియంత్రించవచ్చు. అవసరమైతే వాటికవే స్వయంగా ఎగురుతూ నిర్దేశిత లక్ష్యాలపై దాడులు చేయగలవు. గ్రౌండ్ స్టేషన్తో సంబంధాలు తెగిపోయినా వాటికవే తిరిగి స్టేషన్ను వెతుక్కుంటూ తిరిగి రాగలవు. బ్యాటరీలో చార్జింగ్ తగ్గిపోయినా వెంటనే గ్రౌండ్ స్టేషన్కు వచ్చేస్తాయి. దీంతో వీటిని నియంత్రించేవారికి పని సులువు అవుతుంది. గుంపుగా దాడిచేయగల సామర్థ్యం సోంగర్ డ్రోన్లు ఒక్కొక్కటిగా నిర్దేశించిన లక్ష్యాలతోపాటు దాడులు చేయటంతోపాటు గుంపులుగా కూడా వెళ్లి దాడులు చేయగలవు. పదుల సంఖ్యలో ఒకేసారి ఆకాశంలోకి ఎగిరినప్పుడు స్వయంగా సమన్వయం చేసుకుంటూ లక్ష్యంపై నలు దిక్కుల నుంచి దాడి చేస్తాయి. శత్రువు రక్షణ వ్యవస్థను గందరగోళపర్చి సమర్థంగా దాడులు చేయగల సత్తా వీటికి ఉంది. గురువారం భారత్లోని పలు లక్ష్యాలపై ఇలాగే దాడులు చేసినట్లు గుర్తించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పాక్ చెయ్యి వదిలేసిన అమెరికా
గిల్లి కయ్యం పెట్టుకోవటం.. గట్టిగా నాలుగు దెబ్బలు తగిలేసరికి అమెరికా కాళ్లపై పడి కాపాడాలని వేడుకోవటం.. ఆ దేశం వెంటనే రంగంలోకి దిగి భారత్కు నచ్చజెప్పి వెనక్కు తగ్గేలా చేయటం.. 1971 నుంచీ పాకిస్తాన్ తీరు ఇదే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాకిస్తాన్ దుష్టబుద్ధి అమెరికా పాలకులకు కూడా తెలిసి వచ్చింది. పొరుగుదేశంతో నువ్వు గొడవ పెట్టుకుంటే నిన్ను నేనెందుకు కాపాడాలని అమెరికా నిలదీస్తోంది. ‘భారత్–పాక్ సైనిక ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కాదు’అని అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ విస్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో దాయాది దేశానికి దిక్కు తోచటం లేదు. కాపాడుతూ వచ్చిన అమెరికా 1971 యుద్ధం, 1999 కార్గిల్ యుద్ధం, 2001లో ఘర్షణ, 2016 సర్జికల్ స్ట్రైక్స్, 2019 బాలాకోట్ వైమానిక దాడులు.. ఇలా భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న ప్రతిసారీ పాకిస్తాన్ పాలకులు రాత్రికి రాత్రి అమెరికాలో వాలిపోయి కాపాడాలని ఆ దేశ పెద్దలకు మొరపెట్టుకున్నారు. నాడు పాకిస్తాన్ పక్షపాతిగా ఉన్న అమెరికా అడిగిందే తడవుగా రంగంలోకి దిగి భారత్తో చర్చలు జరిపి శాంతించేలా చేసేది. 1971 యుద్ధ సమయంలో పాక్కు మద్దతుగా ఏకంగా అణ్వాయుధాలు గల విమాన వాహక నౌక యూఎస్ఎస్ఆర్ ఎంటర్ప్రైజ్ నాయకత్వంలో 7వ ఫ్లీట్ను బంగాళాఖాతంలో మోహరించింది. 1999లో జమ్మూకశ్మీర్లోని కార్గిల్ను ఉగ్రమూకల ముసుగులో పాక్ సైన్యం ఆక్రమించింది. ఆలస్యంగా గుర్తించిన భారత సైన్యం.. భీకర దాడులతో వారిని తరిమికొట్టింది. అంతటితో వదలకూడదని పాక్పై సైనిక చర్యకు ప్రణాళిక వేసింది. భారీగా యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను సరిహద్దులకు తరలించింది. తన గూఢచారి ఉపగ్రహాల ద్వారా ఈ విషయాన్ని అమెరికా పసిగట్టి పాక్కు ఉప్పందించింది. దీంతో భయపడిన నాటి పాక్ ప్రధాని నవాజ్షరీఫ్.. అమెరికాకు పరుగు పెట్టి అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బిల్ క్లింటన్తో సమావేశమయ్యాడు. మొదట కార్గిల్ను తాము ఆక్రమించలేదని బుకాయించిన నవాజ్షరీఫ్.. క్లింటన్తో సమావేశం తర్వాత 1999, జూలై 12న కార్గిల్ నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు ప్రకటించటం గమనార్హం. 2001లో పాక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేయటంతో రెండు దేశాలు మరోసారి యుద్ధం ముందు నిలిచాయి. ఆ సమయంలో కూడా పాక్ను కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకుంది. తన రాయబారిని ఢిల్లీకి పంపి భారత్ను శాంతింపజేసింది. ఇలా దౌత్యంతోపాటు ఎప్పటికప్పుడు ఆయుధాలు, అత్యాధునిక యుద్ధ విమానాలు కూడా సరఫరా చేస్తూ పాకిస్తాన్ను అగ్రరాజ్యం కాపాడుతూ వచ్చింది. ఎఫ్–16 సూపర్సోనిక్ యుద్ధ విమానాలను కూడా పాక్కు అందించింది. కాలం మారింది.. కథ అడ్డం తిరిగింది చాలాకాలంపాటు ఆత్మరక్షణ విధానాన్నే అవలంబించిన భారత్.. కొంతకాలంగా దూకుడుగా వెళ్తోంది. అంతర్జాతీయ సమాజంలో పేరుప్రతిష్టలు పెంచుకోవటంతోపాటు తెలివైన దౌత్య విధానాలతో కొత్త మిత్రులను సంపాదిస్తోంది. ఈ క్రమంలో భారత్ పట్ల అమెరికా వైఖరిలోనూ స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. జేడీ వాన్స్ ప్రకటనే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణపై ఇటీవల ఆయన ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పష్టమైన ప్రకటన చేశారు. ‘చూడండి.. ఆయుధాలు వదిలేయాలని భారత్కుగానీ, పాకిస్తాన్కు గానీ మేము చెప్పలేము. ఈ ఘర్షణలో జోక్యం చేసుకోవటం మా పని కూడా కాదు. దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మేము మొదటి నుంచీ చెబుతున్నాం. ఈ ఘర్షణ తీవ్రస్థాయి యుద్ధంగా, అణు యుద్ధంగా మారబోదనే నమ్ముతున్నాం’అని వాన్స్ పేర్కొన్నారు. వాన్స్ ప్రకటనతో దిక్కుతోచని స్థితిలో పడిన పాక్పై.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు మద్దతుదారైన నిక్కీ హేలీ మరో బాంబు వేశారు. పహల్గాంలో సామాన్యులను చంపిన ఉగ్రవాదులను శిక్షించే హక్కు, అధికారం భారత్కు ఉన్నాయని ఆమె ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. బాధితురాలిగా నటించొద్దని పాక్కు చురకలంటించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇది మన.. నారీ శక్తి
కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. ఇప్పుడు యావత్ భారతదేశం మారుమోగుతున్న పేర్లు. ఆపరేషన్ సిందూర్ వివరాలు తెలిపేందుకు ఏర్పాటుచేసిన అధికారిక విలేకరుల సమావేశానికి ఇద్దరు మహిళా అధికారులు నాయకత్వం వహించడం ఒక చరిత్ర. వీరిద్దరూ దేశంలో మన నారీ శక్తికి ప్రతిబింబాలు. అంతేకాదు, సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి ప్రతీక. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ... మన మహిళా శక్తిపై పడింది. అసలు మన దేశంలో త్రివిధ దళాల్లో ఎంతమంది సివంగులు ఉన్నారు.. రక్షణ పరిశోధన రంగంలో ఎందరు మహిళా మేధావులు మన కీర్తి పతాకను అంతర్జాతీయ యవనికపై రెపరెపలాడేలా చేస్తున్నారు... పోలీసు విభాగంలో రాణిస్తున్న అతివలు ఎందరు... ఇవిగో ఆ ఆసక్తికర వివరాలు..రక్షణ దళాల్లో రుద్రమలుమనదేశంలోని త్రివిధ దళాల్లో అత్యధిక శాతం మహిళలు ఉన్నది ఇండియన్ ఎయిర్ఫోర్స్లో. అందులో 2024 నాటికి 13.40 శాతం అతివలే. ఆ తరువాత.. ఇండియన్ నేవీలో అత్యధిక శాతం మహిళలు ఉన్నారు. 2020లో 5.53 శాతం నారీ శక్తి ఉంటే.. 2024 నాటికి అది 6.81 శాతానికి పెరిగింది. ఇక, ఆర్మీలో 2020లో 3.84 శాతం వీరనారీమణులు ఉంటే.. 2024కి అది 4.12 శాతానికి పెరిగింది.రక్షణ పరిశోధన రంగంలోనూ...రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ.. డీఆర్డీఓలో మహిళా ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా ఉంది. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని అయిన జే.మంజుల.. డీఆర్డీఓలో శాస్త్రవేత్తగా అడుగుపెట్టి అంచెలంచెలుగా ఏకంగా ఆ సంస్థ డైరెక్టర్ పదవినే చేపట్టారు. ఇలా శాస్త్రవేత్తలుగా, వివిధ విభాగాల్లో రాణిస్తున్న మహిళలు డీఆర్డీఓలో అత్యధిక శాతంలో ఉన్నారు. 2020 నుంచి చూస్తే సగటున 3,000 మంది.. అంటే మొత్తం ఉద్యోగుల్లో సగటున 15 శాతానికిపైగా మహిళలే ఉన్నారు.పోలీసు బలగం దేశంలో 2023 జనవరి 1 నాటికి 31,50,331 మంది పోలీసు సిబ్బంది ఉంటే.. అందులో మహిళలు 3,06,748. అంటే మొత్తం సిబ్బందిలో 9.74 శాతం. ఇందులో కూడా సివిల్ పోలీస్ విభాగంలో అత్యధికంగా 14.97 శాతం ఉన్నారు. డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ (డీఏఆర్పీ) విభాగంలో 11.31 శాతం, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)లో 9.22 శాతం, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళంలో (సీఐఎస్ఎఫ్) 7.04 శాతం అతివలే. -
ఇండియా పవర్ఫుల్ వెపన్స్.. శత్రువులకు సింహస్వప్నం!
పాక్ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్–400, ఆకాశ్ ఎన్జీ, ఎంఆర్ఎస్ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి. ఇది సోవియట్ కాలంనాటి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ (ఎస్ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. → పెచోరాలో రాడార్ ఆధారిత మిసైల్ లాంచర్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి. → ఐదు హై ఇంటర్సెప్టివ్ యాంటెన్నాలతో కూడిన 4ఆర్90 యత్నాగన్ రాడార్ దీని ప్రత్యేకత → ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. → రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. → ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. → ఎలక్ట్రానిక్ జామింగ్ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. → గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. → కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్ కేపబిలిటీ (హెచ్కేకే) వ్యవస్థగా పిలుస్తారు. → ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. → వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్ను నేలకూలుస్తాయి.కౌంటర్ అన్మ్యాన్డ్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ (సీఏయూఎస్). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. → ప్రత్యేకతలు: ఇతర ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్కోట్పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్ గ్రిడ్ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. → లేయర్డ్ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్ డిటెక్షన్, సాఫ్ట్/హార్డ్ కిల్ సామర్థ్యం దీని సొంతం. → రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్ (ఎలక్ట్రో–ఆప్టికల్/ఇన్ఫ్రారెడ్) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. → ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్ కిల్ (డ్రోన్ల కమ్యూనికేషన్ సిగ్నల్స్ జామింగ్), హార్డ్ కిల్ (నేలకూల్చడం) చేస్తుంది.సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్ (సమర్). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం. → వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్ కమాండ్ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. → స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. → డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్జెట్లు నేలకూలినట్టే లెక్క. → సమర్–1 వ్యవస్థ ఆర్–73ఈ, సమర్–2 ఆర్–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. → ఆర్–73ఈ మిసైళ్ల రేంజ్ 8 కి.మీ. ఆర్–27లది 30 కి.మీ. → ముప్పును బట్టి ఒకే ప్లాట్ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.→ ఎల్–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్. తొలుత స్వీడిష్ కంపెనీ బోఫోర్స్ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్లోనే తయారవుతున్నాయి. → రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్ సిస్టమ్స్ వంటివాటి ద్వారా ఎల్–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. → ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. → ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. → షిల్కా: జెడ్ఎస్యూ–24–4 గన్స్. షిల్కా అనేది వీటి రష్యన్ నిక్నేమ్. → ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్ ప్రొపెల్డ్ వ్యవస్థలు. → నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అదిగదిగో అలనాటి జీవన స్వర్గం!
అనగనగా ఓ కాలంలో.. సెల్ కోడి కూయకుండానే నిద్ర లేచేవారు. కరెంటు, రెంటు, ఎక్స్ట్రా.. వంటి కష్టాలు లేకుండా ప్రకృతితో మమేకమయ్యేవారు. ఉదయాస్తమయాల మధ్య కాలాన్ని అత్యంత సహజంగా గడిపేవారు. పున్నమి వెలుగు, అమావాస్య చీకటి, వాసంతపు వేకువ, శరత్ కాలపు రాత్రుళ్ల కాలాన్ని ఆస్వాదించేవారు. ఆధునికత వచ్చింది. యంత్రాలను తెచ్చింది. బతుకుల్లో సహజత్వం మాయమైపోయింది. కూర్మ గ్రామం మళ్లీ ఆ సహజత్వానికి దగ్గరగా బతుకుతోంది. వందల ఏళ్ల కిందటి జీవన విధానాన్ని అనుసరిస్తోంది. ఆ బతుకుల్లో తీపిని రుచి చూపేందుకు వేసవిలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు.హిరమండలం: కరెంటు లేని నివాసాలు.. రసాయనాలు లేని పంటలు, ఆధునికత అంటని బతుకులు.. వెరసి కూర్మ గ్రామం. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండల పరిధిలోని అంతకాపల్లి అడవుల్లో కనిపిస్తుందీ గ్రామం. కృష్ణ చైతన్య సమాజం పేరుతో 2018లో గ్రామం ఏర్పాటైంది. భక్తి వేదాంతస్వామి ప్రభుపాదుల ఆదేశాల మేరకు భక్తి వికాస్స్వామి ఆధ్వర్యంలో ఈ పల్లె ఏర్పడింది. ఏడాది పొడవునా ఇక్కడకు వేలాది మంది భక్తులకు తరలివస్తుంటారు. కాగా ప్రస్తుతం కూర్మ గ్రామంలో యువతకు నెల రోజుల పాటు వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. అన్నీ సొంతంగానే.. కూర్మ గ్రామంలో 80 మంది వరకూ నివాసముంటున్నారు. 20 వరకూ గృహస్తు జీవన కుటుంబాలు ఉన్నాయి. ఓ 20 మంది వరకూ విద్యార్థులు ఉన్నారు. ఆరుగురు బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. సరళ జీవనం, ఉన్నత చింతన వీరి విధానం. మనిషికి నిత్యావసరాలుగా భావించే కూడు, గూడు, గుడ్డ ప్రకృతి నుంచే పొందవచ్చని నిరూపిస్తున్నారు. ప్రకృతి సేద్యంతోనే వీటిని సంపాదించుకుంటున్నారు. ఏడాదిలో వీరికి అవసరమైన వందలాది బస్తాల ధాన్యాన్ని పండిస్తుంటారు. టన్నుల కొద్దీ కూరగాయలను సాగు చేస్తున్నారు. అక్కడ గృహస్తులతో పాటు విద్యార్థులు, ఏడాది పొడవునా ఇక్కడకు వచ్చే భక్తులకు వాటితోనే ఆహారం తయారుచేసి అందిస్తుంటారు. దంపుడు బియ్యాన్ని మాత్రమే వండుకుంటారు. వారి దుస్తులను వారే తయారుచేసుకుంటారు. ఇళ్లకు వారే మేస్త్రీలు, కూలీలు. ఇసుక, సున్నం, బెల్లం, మెంతులు, కరక్కాయలు, మినుములు మిశ్రమంగా చేసి గానుగ ఆడిస్తారు. గుగ్గిలం మరగబెట్టిన మిశ్రమంతో కలిపి ఇళ్లు కట్టుకున్నారు. కుంకుడు కాయ రసంతోనే దుస్తులను ఉతుక్కుంటారు. వర్ణాశ్రమ విద్య.. ఇక్కడ విద్యార్థులు వర్ణాశ్రమ విద్యను అభ్యసిస్తుంటారు. పూర్వపు గురుకులాలతరహాలో ఇక్కడ వాతా వరణం ఉంటుంది. విద్యార్థులు సంస్కృతం, ఇంగ్లిష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. వయసు, ఆసక్తిని బట్టి చేతివృత్తులపై శిక్షణ ఇస్తారు. మనిíÙని సనాతన మార్గం వైపు నడిపించాలన్నదే కృష్ణచైతన్య సమాజం కూర్మ గ్రామం ఏకైక లక్ష్యం. అందుకే ఒక ఇంటితో ప్రారంభమైన ఈ శ్రీకారం ఇప్పుడు దాదాపు 80 ఇళ్ల వరకూ చేరుకుంది. ఏటా యువతకు శిక్షణప్రకృతి సమాజాన్ని విస్తరించాలని.. సనాతన ధర్మం వైపు ఈ సమాజం అడుగులు వేయాలని ఏటా యువతకు ఇక్కడ వేసవి శిబిరాలు ఏర్పాటుచేస్తున్నారు. నెలరోజుల పాటు చేతివృత్తులు, పురాతన జీవన విధానం, సనాతన ధర్మం వంటి వాటిపై అవగాహన కల్పిస్తారు. అందులో భాగంగానే ఈ నెల 1 నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభమయ్యాయి. వర్ణాశ్రమ కళాశాలలో ఈ శిబిరాలు నెల రోజుల పాటు కొనసాగుతాయి. చేనేత మగ్గం, మట్టికుండల తయారీ, వడ్రంగి, కర్రసాము, నూనెగానుగ, సున్నం గానుగ, వైదిక గృహ నిర్మాణం, ప్రకృతి వ్యవసాయం, గో సంరక్షణ, ఆయుర్వేదం వంటి వాటిపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల శిక్షణ కూడా ఉంటుంది. మంత్రధ్యానం, శ్రవణం, కీర్తనం, వైదిక జీవన ప్రాముఖ్యత, రసాయనాలు లేని ఆహారం, మనస్సుకు, శరీరానికి అనుకూలమైన జీవన విధానం, గృహస్థ జీవన శిక్షణ, బ్రహ్మచారి శిక్షణ, సంస్కృత సంభాషణ అభ్యాసనం, మృదంగం, కరతాళ వాదనం శిక్షణ వంటి అంశాలపై నెలరోజుల పాటు ఈ శిక్షణ కొనసాగనుంది. జీవిత లక్ష్యంపై అవగాహన మనిషి జీవిత లక్ష్యంపై అవగాహన కల్పించడమే కృష్ణచైతన్యం. వర్ణాశ్రమ కళాశాలలో బతుకు తెరువు, వృత్తి కళలపై శిక్షణ ఇస్తున్నాం. నెల రోజుల పాటు వేసవి శిబిరాలు కొనసాగుతాయి. గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడులో కూర్మ లాంటి గ్రామా లను నెలకొల్పాం. హంగేరిలో అయితే 800 ఎక రాల విస్తీర్ణంలో గ్రామం విస్తరిస్తోంది. చెక్ రిపబ్లిక్లోనూ ఒక పల్లె ఉంది. – నటేకర్ నరోత్తమదాస్, వర్ణాశ్రమ బోధకుడు, కూర్మ గ్రామం -
లోకలే బెట'రొయ్య'
సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో కుదేలవుతున్న ఆక్వా రంగాన్ని కాపాడుకునే దిశగా రొయ్యల రైతులు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా లోకల్ మార్కెట్ను పెంచుకునే పనిలో పడ్డారు. ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ‘రెడీ టు కుక్’ పేరిట రైతులే రొయ్యల అమ్మకాలు చేపడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని భీమవరం, వీరవాసరం, నరసాపురంలో అమ్మకాలు మొదలుకాగా ఇతర జిల్లాలకూ విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ‘పశ్చిమ’లోనే 3 లక్షల టన్నుల ఉత్పత్తి రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా (రొయ్యలు, చేపల) చెరువులు ఉండగా.. అత్యధికంగా ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాలోనే 2.63 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇందులో 60 శాతం విస్తీర్ణంలో ఏటా సుమారు 3 లక్షల టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎక్స్పోర్టర్స్ ఏకమై రొయ్య ధరలను ఇష్టానుసారం తగ్గించడం, మేత ధరలను పెంచడంపై ఆక్వా రైతులు మండిపడుతున్నారు. వారి దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు జై భారత్ క్షీరారామ ఆక్వారైతు సంఘం పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు సాగు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే పలువురు రైతులు సాగు సమ్మెకు శ్రీకారం చుట్టి చెరువులను ఎండగట్టేశారు. స్థానిక వినియోగం పెంచేందుకు.. రొయ్యలు ఎక్కువగా తినే దేశాల్లో ఏడాదికి తలసరి 10 నుంచి 12 కిలోల సగటు వినియోగంతో చైనా ముందుంటే.. 8–10 కిలోలతో అమెరికా రెండో స్థానంలో, 8 కిలోల సగటు వినియోగంతో యూరోపియన్ దేశాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ దేశాలకు రొయ్యలు ఎగుమతి చేస్తున్న మన రాష్ట్రంలో మాత్రం రొయ్యల సగటు వినియోగం కేవలం 1.5 కిలోలు మాత్రమే. స్థానిక వినియోగం పెరిగేలా డొమెస్టిక్ సేల్స్ చేపట్టడం ద్వారా సిండికేట్ దోపిడీకి కళ్లెం వేయాలన్న యోచనలో రొయ్య రైతులు ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా వివిధ కౌంట్లలోని రొయ్యలను ప్రాసెసింగ్ చేసి 150 గ్రాముల నుంచి 300, 500 గ్రాములు, కిలో వరకు వివిధ పరిమాణాల్లో ప్యాకింగ్ చేసి అమ్మకాలు చేస్తున్నారు. భీమవరానికి చెందిన ఆక్వా రైతు గాదిరాజు వెంకట సుబ్బరాజు రైతు బజార్లో రొయ్యల రిటైల్ అమ్మకాలను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా రొయ్య రైతుల ఆధ్వర్యంలో ప్రాన్స్ పర్చేజింగ్ డొమెస్టిక్ యూనిట్ పేరిట వీరవాసరంలో ఔట్లెట్ ఏర్పాటుచేశారు. రొయ్యల్లో ఉండే పోషకాలు, ఆరోగ్యానికి అవి చేసే మేలుపై కరపత్రాలు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఇతర జిల్లాలకూ ఔట్లెట్లను విస్తరించే ఆలోచన చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డోర్ డెలివరీ నరసాపురానికి చెందిన ఆక్వా రైతు కర్రి రామకృష్ణ “టేస్టీ ప్రాన్స్’ పేరిట 4 నెలలుగా ప్రాసెసింగ్ చేసిన రొయ్య పప్పును ఆర్డరుపై ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ సగటున రోజుకు 200 కిలోల రొయ్య పప్పు విక్రయిస్తున్నారు. పాలకొల్లులో కొందరు రైతులు ఏకమై సుమారు రూ.30 లక్షలతో డొమెస్టిక్ సేల్స్ కోసం ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిని త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. లాభాపేక్షతో కాకుండా రొయ్యల స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ చేస్తున్నట్టు ఆక్వా రైతులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలోనే.. ఎక్స్పోర్ట్ క్వాలిటీ రొయ్యలను స్థానిక వినియోగదారులకు డోర్ డెలివరీకి గతంలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్యాచరణ చేసింది. దీనికి ఏపీ రొయ్య రైతుల ఫెడరేషన్ అప్పట్లో ముందుకు వచ్చింది. ఎక్స్పోర్టు తరహాలో ప్రాసెస్ చేసిన రొయ్య పప్పు కిలోకు కౌంట్ను బట్టి రూ.600 నుంచి రూ.850 వరకు ధర నిర్ణయించారు. తొలుత ప్రయోగాత్మకంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో అమలుచేసి తర్వాత రాష్ట్రవ్యాప్తం చేయాలని భావించారు. అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేయగా.. ఎన్నికల హడావుడి మొదలవడంతో కార్యరూపం దాల్చలేదు. సీ ఫుడ్ డొమెస్టిక్ వినియోగం పెంచేందుకు అప్పట్లోనే ఫిష్ ఆంధ్రా పేరిట సబ్సిడీపై రూ.లక్ష నుంచి రూ.3 లక్షల విలువైన 250కు పైగా ఔట్లెట్లు ఏర్పాటు చేశారు. ఫోర్, టూ వీలర్స్ను అందించారు.తెలుగు రాష్ట్రాల నుంచి ఆర్డర్స్ నాలుగు ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నాను. కొద్ది నెలల క్రితం సొంతంగా రొయ్యలు ప్రాసెసింగ్ చేసి డోర్ డెలివరీ చేయడం ప్రారంభించాం. తక్కువ ధరకే క్వాలిటీ రొయ్యపప్పు ఇవ్వడంతో లోకల్ సేల్స్తో పాటు ఏపీ, తెలంగాణ నుంచి ఆర్డర్లు బాగా వస్తున్నాయి. – కర్రి రామకృష్ణ, ఆక్వా రైతు, నరసాపురంలాభాలు ఆర్జించాలని కాదు లాభాపేక్షతో కాకుండా అందరికీ అందుబాటు ధరల్లో నాణ్యమైన రొయ్యలు అందించడమే మా ఉద్దేశం. స్థానిక వినియోగం పెరిగితే సిండికేట్ ఆగడాలకు కళ్లెం పడుతుంది. పాలకొల్లులో కొందరు రైతులు కలిసి యూనిట్ ఏర్పాటు చేస్తున్నాం. పనులు దాదాపు పూర్తికావచ్చాయి. – బోణం చినబాబు, ఆక్వా రైతు, పాలకొల్లు -
గాల్లో దీపం పాక్ గగనతలం
పాకిస్తాన్పై ప్రళయ భీకరంగా భారత వైమానిక బలగాలు దాడి చేస్తుంటే ఆ దేశ రక్షణ వ్యవస్థ చేష్టలుడిగి చూసిందన్న వార్త నేపథ్యంలో అసలు ఈ ధూర్తదేశ గగనతలానికి రక్షణ ఉందా? ఉంటే ఎలాంటి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పాకిస్తాన్ మోహరించిందనే సందేహాలు సర్వత్రా వ్యక్తమ వుతున్నాయి. శతఘ్నులు, యుద్ధ విమానాలు మొదలు జలాంతర్గాములదాకా చాలా రకాల ఆ యుధాలపై పాకిస్తాన్ చైనా మీదనే ఆధారపడు తోంది. గగనతల రక్షణ వ్యవస్థలను సైతం చైనా నుంచే కొనుగోలు చేసింది. పాకిస్తాన్ మోహరించిన హెచ్క్యూ–9పీ, హెచ్క్యూ–16 గగనతల రక్షణ వ్యవస్థలను భారత్ నాశనంచేసింది. ము ఖ్యంగా లాహోర్, సియాల్కోట్లలో మోహరించిన హెచ్క్యూ–9పీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత వైమానిక దళాలు ధ్వంసంచేశాయి. చైనా తన కోసం తయారుచేసుకున్న హెచ్క్యూ–9 రకం వ్యవస్థను పాకిస్తాన్ కోసం కాస్త మార్పులు చేర్పులుచేసి ఆ దేశానికి అమ్మేసింది. ‘‘రష్యా తయారుచేసిన ఎస్–300 మిస్సైల్ వ్యవస్థను చైనా తయారీ హెచ్క్యూ–9 క్షిపణి వ్యవస్థ పోలి ఉంటుంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్సుపై భారత క్షిపణులు విరుచుకుపడుతున్నా పాకిస్తాన్ గగనతల రక్షణవ్యవస్థలు ఏమాత్రం పసిగట్టలేక పోయాయి. ఇది పూర్తిగా ఎయిర్డిఫెన్స్ వ్యవస్థ వైఫల్యాన్ని అద్దంపడుతోంది’’ అని యుద్ధరంగ నిపుణుడు సందీప్ ఉన్నిథాన్ చెప్పారు. ‘‘ దూసుకొస్తున్న శత్రుదేశాల క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను ముందుగా కనిపెట్టాల్సిన గురుతర, కీలక బాధ్యత ఈ ఎయిర్డిఫెన్స్ వ్యవస్థలదే. రక్షణ, వైమానిక స్థావరాల రక్షణకు ఇదే ప్రాణం. అలాంటి వ్యవస్థలే విఫలమైన నేపథ్యంలో త్వరలో భారత్ జరపబోయే దాడులను అడ్డుకునే వ్యవస్థ ఇక లాహోర్, సియాల్కోట్ వంటి చోట్ల లేదనే చెప్పాలి’’ అని ఉన్నిథాన్ వ్యాఖ్యానించారు. అంతా మేకపోతు గాంభీర్యంభారత్ దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ గతంలోనే ప్రకటించింది. తమ వైమానిక, క్షిపణి విధ్వంసక వ్యవస్థలను వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరించామని, ఎలాంటి దాడినైనా ఎదుర్కొనే సత్తా తమకు ఉందని ఇన్నాళ్లూ పాకిస్తాన్ చేసిన భీష్మ ప్రతిజ్ఞలన్నీ కేవలం మేకపోతు గాంభీర్యమని బుధవారం నాటి భారతదాడితో తేలిపోయింది. అరగంటలోపు రెండు డజన్లకుపైగా క్షిపణులతో భారత్ విరుచుకుపడుతుంటే వాటిని పాక్ గగనతల వ్యవస్థలు అడ్డుకోలేకపోయాయి. మూడేళ్ల క్రితం అత్యాధునిక బ్రహ్మోస్కు సంబంధించిన డమ్మీ క్షిపణి పొరపాటున పాకిస్తాన్ గగనతలంలోకి దూసుకెళ్లినప్పుడు కూడా పాక్ ఎయిర్డిఫెన్స్ వ్యవస్థ దానిని కూల్చలేకపోయాయి. అటుగా మన క్షిపణి వెళ్లిన విషయాన్ని మొదట స్వయంగా భారతే ప్రకటించింది. ఇప్పుడు లాహోర్, సియాల్కోట్లోనూ ఇదే వైఫల్యం పునరావృతమైంది. 2019లో భారత వైమానిక దాడులు చేసిన బాలాకోట్లో ముష్కరుల స్థావరాలను నేలమట్టంచేసింది. ఆరోజు సైతం భారత గగనతల సంచారాన్ని పాక్ గగనతల వ్యవస్థలు ఏమాత్రం కనిపెట్టలేకపోయాయి. వేధిస్తున్న సాంకేతిక సమస్యలుచైనా తయారీ రక్షణ వ్యవస్థలు తరచూ మొరాయి స్తుండటం, రిపేర్లమయం కావడం పాకిస్తాన్కు పెద్ద సమస్యగా తయారైంది. పాకిస్తాన్ తన రక్షణవ్యవ స్థలకు భారీగా నిధులను కేటాయించలేకపో వడమూ ఇందుకు ప్రధాన కారణం. ఉన్న ఆయు« దాలతోనే ఎలాగోలా పాక్ సాయుధబలగాలు నెట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. గగనతల రక్షణ వ్యవ స్థలను వాస్తవానికి ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవాలి. ఇప్పటికే పేదరికం, ద్రవ్యోల్బణం, అప్పులతో కుదేలైన పాకిస్తాన్కు ఎప్పటికప్పుడు కొత్త వ్యవస్థను కొనే ఆర్థిక దమ్ము లేదు. ఇవన్నీ కలిసి ఇప్పుడు దాని గగనతల రక్షణ వ్యవస్థను మరింత నిర్వీర్యం చేస్తున్నాయి.పాకిస్తాన్ వద్ద ఉన్న వ్యవస్థలేంటి?హెచ్క్యూ–9పీ, హెచ్క్యూ–9బీఈ, ఎఫ్ డీ– 2000, హెచ్క్యూ–16ఎఫ్ఈ గగనతల రక్షణ వ్యవస్థలపై పాక్ ఆధా రపడుతోంది. వీటితోపాటే పాతతరం ఎల్వై–80, ఎఫ్ఎం–90 రకాలూ ఎంతోకొంత పాక్కు సాయపడుతున్నాయి. 40 కిలోమీటర్ల స్థాయిలో లక్ష్యాలను ఛేదించడానికి ఎల్వై–80ను పాక్ వాడుతోంది. మే 7వ తేదీ అర్థరాత్రి దాటాక భారత్ చేసిన దాడిలో హెచ్క్యూ–16 వ్యవస్థ నాశనమైంది. చైనా నుంచి 2021లో హెచ్క్యూ–9పీ దీర్ఘశ్రేణి గగనతల రక్షణ వ్యవస్థను దిగుమతి చేసుకుంది. తమ గగనతలంలోకి వచ్చిన శత్రు క్షిపణులను 125 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి నేలమట్టంచేయగలదు. యుద్ధ విమానాలనూ అడ్డుకోగలదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Operation Sindoor: సుదర్శన చక్రమే రక్ష
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముష్కరమూకల శిబిరాలు, స్థావరాలను భారత సాయుధబలగాలు నేలమట్టం చేయడంతో వెర్రెక్కిపోయి పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లను మన గగనతల రక్షణ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంది. రక్షణ చట్రంగా యావత్ భారతగగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేసింది. పాక్ మిస్సైళ్లను క్షణాల్లో పేల్చేసి దాని వైమానిక బలగాలను అయోమయానికి గురిచేసిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ‘సుదర్శన చక్ర’ గురించే ఇప్పుడు అంతటా చర్చ మొదలైంది. విభిన్నమైన రాడార్లు, క్షిపణుల సమన్వయంతో పనిచేసి ప్రత్యర్థుల ఫైటర్ జెట్స్, రాకెట్లు, మానవ రహిత విమానాలను కూల్చేసే వ్యవస్థగా ప్రపంచంలోనే గొప్ప ఆయుధ వ్యవస్థగా పేరొందింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే వివిధ రకాల ఆయుధాలను సమ్మిళితం చేసిన సమస్టి ఆయుధ వ్యవస్థ ఇది. శత్రు క్షిపణులు కనీసం నేలనైనా తాకకుండా మార్గమధ్యంలోనే ముక్కలుచెక్కలు చేసేస్తున్న ఈ సుదర్శన చక్ర విశేషాలు ఓసారి చూద్దాం... ఏమిటీ చక్ర? రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్కు భారత బలగాలు ‘సుదర్శన చక్ర’ అని నామకరణం చేశాయి. పురాణాలు, ఇతిహాసాల ప్రకారం విష్ణుమూర్తి సుదర్శన చక్రం మహాశక్తివంతం. ఒకసారి ప్రయోగిస్తే శత్రుసంహారం జరగాల్సిందే. సుదర్శన చక్రం అమేయ శక్తికి, విజయానికి, అసాధారణ వేగానికి, శత్రు వినాశకానికి మారుపేరు. అందుకే ఎస్–400 గగనతల రక్షణ వ్యవస్థకు ఈ పేరు పెట్టారు. శత్రుసైన్యం నుంచి దూసుకొస్తున్న క్షిపణులను ‘సుదర్శన చక్ర’లోని క్షిపణులు విజయవంతంగా అడ్డుకుంటాయి. మార్గమధ్యంలోనే పేల్చేస్తాయి. ఒకేసారి వేర్వేరు ప్రాంతాలపై రక్షణచట్రంగా నిఘా పెట్టడం ‘సుదర్శన చక్ర’ ప్రత్యేకత. వాయుసేనతో అనుసంధానం ఇండియన్ ఎయిర్ఫోర్స్ వారి కమాండ్ అండ్ కంట్రోల్ నెట్వర్క్తో ఈ వ్యవస్థ అనుసంధానమై ఉంటుంది. ఒక చోట నిలిపి ఉంచిన ఈ వ్యవస్థలో రెండు ఆయుధసహిత వాహనాలు(బ్యాటరీలు) ఉంటాయి. ఒక్కో దాంట్లో ఆరు లాంఛర్లు ఉంటాయి. వీటితోపాటు అధునాతన రాడార్ వ్యవస్థ, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఒక్కో వాహనం నుంచి గరిష్టంగా 128 క్షిపణులను ప్రయోగించవచ్చు. ఇలాంటి పెద్ద వ్యవస్థలను ఐదింటిని ఇప్పటికే రష్యా నుంచి కొనుగోలు చేసి సరిహద్దుల వెంట అత్యంత వ్యూహాత్మక ప్రదేశాల్లో భారత్ సంస్ధించేసింది. ఈ వ్యవస్థలే బుధవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ నుంచి దూసుకొచ్చిన పలు రకాల క్షిపణులు, డ్రోన్లను నేలకూల్చాయి. సుదర్శన చక్ర లాంఛర్ వాహనాలను ఎప్పటికప్పుడు అవసరమైన చోటుకు సులభంగా తరలించవచ్చు. వీటి జాడను శత్రు దేశాల రాడార్లు అస్సలు కనిపెట్టలేవు. అన్ని రకాలుగా రక్షణ శత్రు దేశాల స్టెల్త్ విమానాలు, యుద్ధ విమానాలు, ఆత్మాహుతి డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణుల రాకను గగనతలంలో ఉండగానే ఈ సుదర్శన చక్ర వ్యవస్థ పసిగడుతుంది. ఆ క్షిపణులు, డ్రోన్లు ఏ మార్గంలో వస్తున్నాయి? ఎంత వేగంతో వస్తున్నాయి? ఒకేసారి ఎన్ని వస్తున్నాయి? ఏఏ ప్రాంతాలపై పడొచ్చు? అనే వివరాలను కొన్ని సెకన్ల వ్యవధిలోనే ఇవి అత్యంత ఖచ్చితత్వంతో అంచనావేయగలవు. వెంటనే వాయుసేన అధికారులు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా లాంఛర్ల నుంచి క్షిపణులను ఈ వ్యవస్థ ప్రయోగిస్తుంది. ఈ క్షిపణులు శత్రు ఆయుధాలను గాల్లోనే తుత్తునియలు చేస్తాయి. ఒకే దిశ నుంచి వచ్చే శత్రు క్షిపణులను మాత్రమే కాదు వేర్వేరు దిశల నుంచి దూసుకొచ్చే క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ ఒకేసారి పసిగట్టి ఒకేసారి వాటిని నిలువరించేందుకు ఎక్కువ సంఖ్యలో క్షిపణులను భిన్న దిశల్లో ప్రయోగించగలదు. ఎక్కడ మోహరించారు? పాక్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో ఈ ఆయుధ వ్యవస్థను భారత్ మోహరించింది. నాలుగు ‘సుదర్శన చక్ర’ వ్యవస్థలను భారత్ మోహరించింది. వందల కిలోమీటర్ల విస్తీర్ణంపై కేవలం ఒక్క స్వాడ్రాన్ నిఘా పెట్టగలదు. జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల గగనతల నిఘాపై ఒకటి, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలపై మరోటి మోహరించినట్లు తెలుస్తోంది. చైనా సైతం తరచూ కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లోనూ సుదర్శన చక్రను సిద్ధంగా ఉంచినట్లు రక్షణ రంగ వర్గాలు వెల్లడించాయి. ఏకంగా 600 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే శత్రు క్షిపణులను ఇది ముందే పసిగట్టగలదు. వెంటనే ప్రయాణం మొదలెట్టి గరిష్టంగా 450 కిలోమీటర్ల దూరంలోనే వాటిని నేలకూల్చగలదు. ఒకేసారి భిన్న లక్ష్యాలను నిర్దేశించుకుని అత్యంత వేగంగా, చాకచక్యంగా పని పూర్తిచేయగలదు. తికమకపెట్టే శత్రుదేశాల ‘ఏమార్చే’ వ్యవస్థలు ఈ సుదర్శన చక్రను మభ్యపెట్టలేవు. గగనతలంపై 360 డిగ్రీల కోణంలో ఇది నిఘా పెట్టగలదు. తన కనుసన్నల్లోకి ఏ చిన్నపాటి వస్తువు ఆకాశంలోకి ప్రవేశించినా దాని పరిమాణం, పథాన్ని పసిగట్టి వెంటనే క్షిపణిని ప్రయోగించి ధ్వంసంచేయగలదు. ప్రపంచంలోని అత్యంత అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఇదీ ఒకటి. సుదూరాలు సురక్షితం జామింగ్ వంటి వ్యతిరేక వ్యూహాలను తట్టుకోగలదు. ఒకేసారి బహళ లక్ష్యాలను ఎంచుకుని పనిచేస్తుంది. అత్యంత సుదూరాలు, సువిశాల ప్రాంతాలకు రక్షణగా నిలుస్తుంది. గగనతల లక్ష్యాలను కేవలం భూతలం మీద నుంచే గురిపెట్టి చేధించగలదు. ముఖ్యంగా దీర్ఘశ్రేణి అస్ట్రాలను నిర్వీర్యంచేయగలదు. రష్యా నుంచి కొనుగోలు తర్వాత వీటి రాకతో భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమైంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉప్పుటేరు.. ఊపిరి పోసేదెవరు?
ఉప్పుటేరు ..కొల్లేరుకు ప్రధాన డ్రెయిన్. కానీ దీని నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పర్యవసానం.. ఆక్రమణలు, పూడిక పేరుకుపోవడం. నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. ఈ ఏడాదైనా ఉప్పుటేరు ప్రక్షాళన జరుగుతుందనుకుంటే క్లోజర్ పనుల్లో దాని ఊసే విస్మరించారు. జిల్లాలోని డ్రెయిన్లలో పూడిక తీత, గుర్రపు డెక్క తొలగింపునకు రూ.14 కోట్లతో ప్రతిపాదనలు పంపగా, వాటిలో ఉప్పుటేరు ప్రస్తావనే లేదు. దీంతో ఉప్పుటేరుకు ఊపిరిపోసే ప్రక్షాళన ఎప్పుడు జరుగుతుందో అని కర్షకులు కలత చెందుతున్నారు. – సాక్షి, భీమవరంవ్యర్థాల మేటకు చిరునామా.. ఉప్పుటేరుఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉప్పుటేరు మేజర్ డ్రెయిన్. కొల్లేరు నుంచి మొదలై పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, కాళ్ల, భీమవరం మండలాల మీదుగా 62 కిలోమీటర్లు ప్రవహించి కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని గొల్లపాలెం వద్ద సముద్రంలో కలుస్తుంది. కొల్లేరుతో పాటు రెండు జిల్లాల పరిధిలోని మొగదిండి, న్యూ యనమదుర్రు, బొండాడ, పొలిమేర తిప్ప, పాత యనమదుర్రు మొదలైన ప్రాంతాల్లో 120 వరకు మేజర్, మైనర్ డ్రెయిన్లు, పంట కాలువలు ఉప్పుటేరులో కలుస్తాయి. వీటి ద్వారా గుర్రపు డెక్క, తూడు, వ్యర్థాలు ఉప్పుటేరులోకి చేరి పూడికతో నిండిపోతోంది. ఆకివీడు, లోసరి, దొంగపిండి, పాతపాడు, మాలవానితిప్ప, మోరి గ్రామాల్లో డ్రెయిన్ పూడుకుపోయి మేటలు వేసింది. వైఎస్సార్ హయాంలో శ్రీకారంఉప్పుటేరును అభివృద్ధి చేయాలన్న రైతుల విజ్ఞప్తికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చొరవ చూపారు. పూడిక తొలగింపునకు ఆకివీడు వద్ద డ్రెడ్జింగ్ పనులు చేపట్టారు. జువ్వ కనుమ నుంచి ఆర్అండ్బీ వంతెన సమీపం వరకు కొంతమేర పనులు పూర్తి చేశారు. అనంతరం పనులు వాయిదా పడ్డాయి.జగన్ హయాంలో రూ.412 కోట్ల కేటాయింపులుస్వచ్ఛ కొల్లేరు దిశగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. అందులో భాగంగా ఆకివీడు మండలం దుంపగడప, మొగల్తూరు మండలం పడతడిక, మోళ్లపర్రు వద్ద మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.412 కోట్ల కేటాయించారు. నిర్మాణ పనుల కోసం టెండర్లు పిలిచారు. అయితే ప్రభుత్వం మారాక ఆ పనులు నెమ్మదించాయి.బాబు హామీ ఇచ్చారు.. అమలులో విస్మరించారుగతేడాది కొల్లేరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.దీంతో ఈ ఏడాది క్లోజర్ పనుల్లో ఉప్పుటేరు ప్రక్షాళన మొదలవుతుందని ఆశించారు. మేజర్, మైనర్, మీడియం డ్రెయిన్లలో గుర్రపుడెక్క, పూడిక తొలగింపునకు రూ.14 కోట్ల విలువైన 275 పనులకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. కాగా ఉప్పుటేరు ముంపు సమస్యను పరిష్కరించే విషయాన్ని విస్మరించారు. క్లోజర్ పనుల్లో ఉప్పుటేరు లేదు క్లోజర్ పనులకు పంపిన ప్రతిపాదనల్లో ఉప్పుటేరు లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ఉప్పుటేరును అభివృద్ధి చేసేందుకు డిటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేయాలని ఉన్నత స్థాయి నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు డీపీఆర్ను సిద్ధం చేసి పంపాల్సి ఉంది. – సత్యనారాయణ, డ్రెయిన్ల శాఖ ఈఈ, భీమవరంఆక్వా మాఫియా ఆక్రమణలుడ్రెయిన్ గట్టును ఆక్వా మాఫియా ఆక్రమించి చెరువులుగా మార్చేయడంతో కుంచించుకు పోయింది. 80 వేలకు పైగా ఎకరాల్లో ఆక్వా చెరువులు సాగవుతుండగా, వీటిలో మూడు వేల ఎకరాలు ఆక్రమణలుంటాయని అంచనా.ఉప్పుటేరు వాస్తవ లోతు - ఆరు మీటర్లు. కానీ ఇప్పుడున్న లోతు ఒకటి నుంచిృరెండుమీటర్లు. వాస్తవ సామర్థ్యం: 25 వేల క్యూసెక్కులు ప్రస్తుత సామర్థ్యం: 12 వేల క్యూసెక్కులు -
నాడు గడి.. నేడు బడి
ఒకప్పుడు తెలంగాణలో సంస్థానాదీశులు, దొరలు విశాలమైన గడీల నుంచి పరిపాలన సాగించారు. ఆ గడీలను అధికార కేంద్రంగా చేసుకుని ప్రజల సమస్యలు విని పరిష్కారం చూపేవారు. తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు.. గ్రామాల్లో తమ గడీలను కేంద్రంగా చేసుకుని పాలించారు. –మరిపెడ రూరల్200 ఏళ్లపాటు గడీల పాలన.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని గడి కేంద్రంగా సుమారు 200 ఏళ్లపాటు పరిపాలన కొనసాగింది. ఐదెకరాల విశాలమైన స్థలంలో గడిని నిర్మించారు. చుట్టూ 20 అడుగుల ఎత్తు గోడ నిర్మించారు. ఈ గడి కేంద్రంగా మాజీ ఎంపీ ఆర్.సురేందర్రెడ్డి కుటుంబ సభ్యులు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేవారు. వందలాది మంది అనుచరులు, గుమాస్తాల ద్వారా పాలన నడిపించేవారు. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో గడీల పాలనకు తెరపడింది. 1995 నుంచి ఖాళీగా.. దొరల పాలన ప్రాబల్యం తగ్గిన తర్వాత.. 1995లో మరిపెడ గడిలోని దొరలు పట్టణ కేంద్రాలకు తరలి వెళ్లారు. కొంతకాలంగా కుడితి లక్ష్మారెడ్డి అనే గుమాస్తా.. మరిపెడ గడిని, ఆస్తులను కాపాడుకుంటూ వచ్చారు. కొంతకాలం గడిలో సరస్వతి శిశు మందిర్ పాఠశాలను నడిపించారు. 1997లో మరిపెడకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది. భవనం లేకపోవడంతో మరిపెడ దామోదర్రెడ్డి హైసూ్కల్లోని ఒక భవనంలో జూనియర్ కళాశాల కొనసాగిస్తూ వచ్చారు. కళాశాలకు ధారాదత్తం.. సొంత భవనం లేక ఇరుగ్గా ఉన్న స్కూల్ గదుల్లో కళాశాల కొనసాగుతున్న నేపథ్యంలో.. విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడ్డారు. కాగా గడి ఖాళీగా ఉందని.. దానిని కళాశాలకు దత్తత ఇస్తే బాగుంటుందని అప్పటి ప్రిన్సిపాల్ విజయ భాస్కర్ గ్రామ పెద్దల దృష్టికి తెచ్చారు. అప్పుడు గడిని రక్షిస్తున్న గ్రామ పెద్ద ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీ ఆర్.సురేందర్రెడ్డి ఈ అంశంపై చర్చించారు. వెంటనే దాత సురేందర్రెడ్డి.. గడిని ఈ ప్రాంత పేద విద్యార్థుల ప్రయోజనం కోసం కళాశాలకు ధారాదత్తం చేస్తున్నట్లు ప్రకటించారు. చదువుల ఒడిగా..గడి ఆవరణలోని భవనంలో కొంతకాలంగా జూనియర్ కళాశాల నిర్వహణ కొనసాగింది. అనంతరం అప్పటి మంత్రి డీఎస్ రెడ్యానాయక్ కృషి ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం మంజూరైంది. 2008లో నూతన కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంత విద్యార్థులకు మరిపెడ గడి చదువుల ఒడిగా కొనసాగుతోంది. ఆహ్లాదకరంగా కళాశాల ఐదెకరాల విస్తీర్ణంలోని గడీలో నిర్మించిన భవనం వృక్ష సంపద మధ్య ఆహ్లాదకరంగా ఉంది. విశాలమైన గదులు, అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులతో ప్రైవేటు కళాశాలలకు దీటుగా కొనసాగుతోంది. రూ.కోట్ల విలువైన గడిని పేద విద్యార్థుల శ్రేయస్సు కోసం దానం చేయడం దాత సురేందర్రెడ్డి గొప్పతనం. – వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాలఆహ్లాదకరంగా కళాశాల ఐదెకరాల విస్తీర్ణంలోని గడీలో నిర్మించిన భవనం వృక్ష సంపద మధ్య ఆహ్లాదకరంగా ఉంది. విశాలమైన గదులు, అన్ని సబ్జెక్టులకు అధ్యాపకులతో ప్రైవేటు కళాశాలలకు దీటుగా కొనసాగుతోంది. రూ.కోట్ల విలువైన గడిని పేద విద్యార్థుల శ్రేయస్సు కోసం దానం చేయడం దాత సురేందర్రెడ్డి గొప్పతనం. – వి.శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్, మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాల -
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది. ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి జయించే మహిళాశక్తి కనిపించింది. ఆపరేషన్కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం. ఐక్యత, మత సామరస్యానికి సంబంధించిన శక్తిమంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే. ప్రపంచ ఆసక్తి ఇప్పుడు రెండు పేర్లపై కేంద్రీకృతమైంది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్...భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ‘పహల్గామ్లో ఇరవై ఆరుమందిప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాద బాధితులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం’ అన్నారు సోఫియా ఖరేషీ. పాక్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడి చేసినట్లు ఆమె తెలియజేశారు. సంక్షోభ పరిస్థితుల్లో సైన్యం, ప్రజల మధ్య కమ్యూనికేషన్ను కొనసాగించడంలో ప్రొఫెషనల్ ఆఫీసర్స్ పాత్రను వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ వివరించారు.ఆ ఇల్లు సైనిక శిబిరంఅది ఇల్లు అనడం కంటే... చిన్నపాటి సైనిక శిబిరం అంటే బాగుంటుంది! కొట్ట వచ్చినట్లు కనిపించే మిలిటరీ క్రమశిక్షణ ఒకవైపు...‘ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?’‘ఒక వీర సైనికుడి గురించి చెబుతాను విను..’ ఇలాంటి విశేషాలు మరోవైపు. గుజరాత్లోని వడోదరాకు చెందిన ఖురేషిది సైనిక కుటుంబ నేపథ్యం. తాత, తండ్రీ సైన్యంలో పనిచేయడమే తాను సైన్యంలో పనిచేయాలనుకోవడానికి కారణం. బలం. ‘మహారాజా షాయాజీరావు యూనివర్శిటీ’లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఖురేషి 1999 లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరారు.చరిత్ర సృష్టించి...పుణెలో జరిగిన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పద్ధెనిమిది దేశాల సైనికులు పాల్గొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషీ. అంతేకాదు.. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్.గర్వించదగిన కాలంఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో భాగంగా కాంగోలో ఆరేళ్లు పనిచేశారు ఖురేషీ. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించారు. ఒకవైపు శాంతిపునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు సేవాకార్యమ్రాలకుప్రాధాన్యత ఇచ్చేవారు.‘ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు నాకు గర్వకారణం’ అంటారు ఖురేషీ.ఖురేషీలోని నాయకత్వ లక్షణాలు, చొరవ, ధైర్యసాహసాలను అప్పటి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ గుర్తించారు. ‘సైన్యంలో పురుష, మహిళా అధికారులు అనే తేడా లేదు. జెండర్ప్రాతిపదికన కాకుండా బాధ్యతను భుజాన వేసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఎంపిక జరిగింది’ అన్నారు రావత్. భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ పరాక్రమ్’లో ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖురేషీకి సైన్యంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఇచ్చింది. విద్యానేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టిని ఇచ్చింది. సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృష్టిని అందించింది. ఆకాశ పుత్రికఆకాశంలో కనిపించే విమానాలను చూస్తూ అందరు పిల్లల్లాగే చప్పట్లు కొడుతూ తెగ సంతోషించేది వ్యోమికా సింగ్. ఆ సంతోషానికి లక్ష్యం కూడా తోడైంది. ఆకాశంలో దూసుకు పోవాల్సిందే!‘నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే పైలట్ కావాలనుకున్నాను. ఆకాశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. మా పేర్ల అర్థాల గురించి క్లాసులో మాట్లాడుకుంటున్నప్పుడు వ్యోమిక... నీ పేరుకు అర్థం ఆకాశ పుత్రిక అని అరిచారో ఎవరో. దీంతో పైలట్ కావాలనే కోరిక మరింత బలపడింది’ అని ఒక టీవీ షోలో బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు వ్యోమికా సింగ్.ఎన్సీసీ పునాదిపై...ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చేరిన వ్యోమికాకు సైనిక క్రమశిక్షణ అలవడింది. భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా తన కలను నిజం చేసుకున్న వ్యోమిక 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తిగా వ్యోమిక గుర్తింపు పొందారు.జమ్మూకశ్మీర్, ఈశాన్యప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతాలాంటి హెలికాప్టర్లు 2,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆమెకు ఉంది. 2021లో 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరంగ్ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. కమాండర్ వ్యోమికా సాహసాన్ని, అంకితభావాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్తో సహా సీనియర్ డిఫెన్స్ అధికారులు గుర్తించారు. 2020లో అరుణాచల్ప్రదేశ్లో కీలక రెస్క్యూ ఆపరేషన్కు నేతృత్వం వహించి, విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా చెరగని చిరునవ్వు ఆమె సొంతం. ప్రకృతి కల్లోలాలకు వెరవకుండా బాధితులకు అండగా ఉండడం ఆమె నైజం. ఆ ఇద్దరు... ది స్ట్రెంత్ ఆఫ్ ఇండియాకల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ పార్టీల నేతలు వీరిని అభినందించారు. ‘ఇది కేవలం బ్రీఫింగ్ మాత్రమే కాదు. సాహసోపేతమైన ప్రకటన. ప్రతి యుద్ధంలో, ప్రతి మిషన్లోనూ మహిళలు ముందుండి నడిపిస్తారు’ అని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ‘విలేకరుల సమావేశంలో ఎవరు ఉన్నారో గుర్తుంచుకోండి. వారు... ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భుజం భుజం కలిపి ఒకే జెండాను మోస్తున్నారు. ఇది భారతదేశం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఐక్యత, శాంతి ముందు విద్వేషానికి మాటలు ఉండవు’ అని యాక్టివిస్ట్, రైటర్ గుర్మెహర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
భారత్లో హాలీవుడ్ ఫ్లాప్..
సాక్షి, స్పెషల్ డెస్క్: ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలంటే... మన దేశంలో రూ.వేలకోట్ల కలెక్షన్లు కురిపించేవి. టైటానిక్, అవతార్ వంటివి భారతీయులనూ ఉర్రూతలూగించాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆర్మాక్స్ బాక్సాఫీస్ రిపోర్టు 2024 ప్రకారం.. హాలీవుడ్ సినిమాల ద్వారా బాక్సాఫీస్కు సమకూరిన ఆదాయం అయిదేళ్లలో ఏకంగా 41% తగ్గింది. మన ప్రాంతీయ భాషల సినిమాలతో పెరుగుతున్న పోటీ, మారుతున్న వీక్షకుల ఆసక్తులు, సూపర్హీరోల చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోవడం, ఓటీటీల దూకుడు.. వెరసి బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాలకు ఆదరణ తగ్గుతోందని పరిశ్రమ చెబుతోంది.⇒ దేశంలో బాక్సాఫీస్ ఆదాయం 2024లో రూ.11,833 కోట్లకు చేరింది. బాక్సాఫీస్లో హాలీవుడ్ వాటా భారత్లో 2019లో 15%. 2024 నాటికి దాదాపు సగం తగ్గి ఏకంగా 8 శాతానికి పడిపోయింది. గత అయిదేళ్లుగా వాటా క్రమంగా తగ్గుతోంది. హాలీవుడ్ సినిమాల ద్వారా సమకూరిన ఆదాయం 2019లో రూ.1,595 కోట్ల నుంచి 2024లో రూ.941 కోట్లకు వచ్చి చేరింది.200 కోట్ల క్లబ్ లోనూ లేవు.. హాలీవుడ్ మూవీస్ను చూసేందుకు థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య 2019లో 9.8 కోట్లు. గత ఏడాది ఈ సంఖ్య కేవలం 3.8 కోట్లకు పరిమితమైంది. కరోనా కాలాన్ని మినహాయిస్తే 12 ఏళ్లలో ఇదే తక్కువ. గత రెండేళ్లలో రూ.200 కోట్ల క్లబ్లో ఒక్క సినిమా కూడా చేరకపోవడం గమనార్హం. మూడు సినిమాలే రూ.100 కోట్లకుపైగా ఆదాయాన్ని సమకూర్చాయి. వీటిలో ముఫాసా: ద లయన్ కింగ్ రూ.178 కోట్లు, డెడ్పూల్ అండ్ వుల్వరీన్రూ.160 కోట్లు, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ద న్యూ ఎంపైర్ రూ.133 కోట్లు సంపాదించాయి. బాక్సా ఫీస్ వద్ద హాలీవుడ్ సినిమాల ఆదాయంలో సూపర్హీరోస్ మూవీస్ వాటా ఒకప్పుడు 50% ఉండేది. 2024లో ఇది 27 శాతానికి పడిపోయింది.దక్షిణాది సినిమాలే..భారత బాక్సాఫీస్ వద్ద 2024లో పుష్ప–2 టాప్లో నిలిచి రూ.1,403 కోట్ల గ్రాస్ కలెక్షన్తో చరిత్ర సృష్టించింది. కల్కి 2898 ఏడీ రూ.776 కోట్లు, స్త్రీ–2 రూ.698 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. గత ఏడాది హిందీ సినిమా మొత్తం రూ.4,679 కోట్ల కలెక్షన్లతో ముందంజలో ఉంది. హిందీ సినిమాల కలెక్షన్లలో దక్షిణ భారత చిత్రాల డబ్బింగ్ వెర్షన్ల నుండి 31% సమకూరడం విశేషం. ఇక టాలీవుడ్ పరిశ్రమ 2022 నుంచి ఏటా రూ.2,000 కోట్లకుపైగా ఆర్జిస్తోంది. రెవెన్యూ పరంగా అయిదేళ్లలో మలయాళ పరిశ్రమ 93%, తెలుగు చిత్రసీమ 67%, తమిళ పరిశ్రమ 25% వృద్ధి సాధించాయి. హిందీ, కన్నడల్లో మాత్రం తగ్గుదల నమోదైంది. ఇక గత ఏడాది దేశవ్యాప్తంగా 88.3 కోట్ల మంది థియేటర్లకు వచ్చి సినిమాలను ఆస్వాదించారు.ట్రంప్ స్క్రిప్ట్ తో తెర⇒ హాలీవుడ్కి మనదేశంలో క్రేజ్ తగ్గి.. మన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోంది అని సంతోíÙంచేలోపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిడుగులాంటి వార్త చెప్పారు. జాతీయ భద్రత, ఆర్థిక సమస్యలను పేర్కొంటూ అమెరికాలోకి వచ్చే అన్ని విదేశీ చిత్రాలపై 100% సుంకాన్ని ప్రకటించారు. యూఎస్ బాక్సాఫీస్ వద్ద భారతీయ చిత్రాలు ఏటా సుమారు రూ.850 కోట్లు ఆర్జిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం కారణంగా యూఎస్లో విడుదలయ్యే సినిమాల సంఖ్య తగ్గుతుందని పరిశ్రమ భావిస్తోంది. టారిఫ్ అమలులోకి వస్తే ఎగ్జిబిటర్లు టికెట్ ధరలను పెంచాల్సి వస్తుందని, ఫలితంగా ఖరీదు ఎక్కువై ప్రేక్షకుల రాక తగ్గుతుందని విశ్లేషకులు అంటున్నారు.హాలీవుడ్ క్రేజ్ తగ్గడానికి అనేక కారణాలు.. ⇒ ఓటీటీల దూకుడు.. వెబ్ సిరీస్లకు పెరుగుతున్న ఆదరణ ⇒ ప్రాంతీయ భాషా చిత్రాలు, వాటి డబ్బింగ్ వెర్షన్ల ప్రభావం.. ⇒ కొరియన్, ఇతర భాషా చిత్రాల ప్రభావం.. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులు -
నాటు కోళ్లు, గుడ్లు ఇంటికే వస్తాయి
కోడి కూరతో రాగి సంగటి కలిపి ఆరగించి ఆనందించే వాళ్లు కొందరైతే.. బ్రేక్ఫాస్ట్లో కోడి కూరతో ఇడ్లీ ఆస్వాదించేవారు మరికొందరు. అది గ్రామమైనా, నగరమైనా.. నాటుకోడి కూర, బ్రౌన్ కోడి గుడ్లకు ఉన్న ఆదరణే వేరు. అలాంటి నాటు కోడి పిల్లలు, గుడ్లు మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే.. అవి మీ ఇంటికే వస్తే.. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) అనుబంధ సంస్థ అయిన హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని ‘కోళ్ల పరిశోధన సంచలనాలయం’ (ఐసీఎఆర్–డిపీఆర్).. ఇప్పుడు ఈ పని చేస్తోంది.ప్రజలకు పౌష్టికాహారాన్ని అందుబాటులోకి తేవటంతో పాటు, ఉపాధి అవకాశాలను సైతం అందించేది దేశీ ఉత్తమ జాతి కోళ్ల పెంపకం. ఈ కోళ్ల స్వచ్ఛతను కాపాడుతూనే, వాటిని మరింత మెరుగుపరచి దేశవ్యాప్తంగా రైతులకు అందుబాటులోకి తెస్తోంది హైదరాబాద్ (రాజేంద్రనగర్)లోని ‘కోళ్ల పరిశోధన సంచలనాలయం’ (ఐసీఎఆర్–డీపీఆర్). డీపీఆర్ శాస్త్రవేత్తల కృషితో.. మెరుగైన ఫలితాలనిచ్చే 11 రకాల నాణ్యమైన దేశీ ఉత్తమ కోళ్ల జాతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోళ్లకు చెందిన నాణ్యమైన కోడి పిల్లలను డీపీఆర్ రైతులకు విక్రయిస్తోంది. పొదిగే గుడ్లను కూడా అమ్ముతున్నారు. వీటిని కొనుక్కొని పిల్లలు పొదిగించుకొని, పెంచుకోవచ్చు.యాంటీబయాటిక్స్ వాడకుండా.. ఈ సంస్థ అభివృద్ధి చేసిన వనరాజా, గ్రామప్రియ వంటి దేశీ జాతుల కోళ్లు దేశవ్యాప్తంగా ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందాయి. యాంటీబయాటిక్స్ వాడకుండా సమతుల్యమైన దాణాలు, మునగ ఆకు వంటివి మేపి చక్కని ఫలితాలు సాధించారు. వీరు రైతులకు అందుబాటులోకి తెస్తున్న ఉత్తమ కోళ్ల రకాల్లో ముఖ్యమైనవి.. శ్రీనిధి, జనప్రియ, కృషిలేయర్, కృషిబ్రో, వనశ్రీ, అసీల్, కడక్నాథ్, ఘాగస్, నికోబారీ.మాంసం, గుడ్ల కోసం..⇒ వనరాజా, శ్రీనిధి, జనప్రియ కోళ్లను మాంసం, గోధుమ రంగు గుడ్ల కోసం పెరట్లో పెంచుకోవచ్చు. ఔషధ విలువలున్న నల్ల కోడి కడక్నా«థ్ను నల్ల గుడ్లు, మాంసం కోసం పెంచుకోవచ్చు.⇒ కృషిబ్రో మాంసం కోసం పెంచుకోదగిన కోళ్ల జాతి. గుడ్ల కోసం.. గ్రామప్రియ, వనశ్రీ, అసీల్ కోళ్లను పెరట్లో పెంచుకోవచ్చు. కృషి లేయర్ను గుడ్ల కోసం వాణిజ్యపరంగా పెంచుకోవచ్చు.వనరాజా, గ్రామప్రియలకు క్రేజ్వనరాజా, గ్రామప్రియ దేశీయ కోళ్ల జాతులు దేశవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందాయి. వనరాజా రోగనిరోధక శక్తి కలిగిన జాతి. ఆరు నెలల్లో 2 కిలోల వరకు బరువు పెరుగుతుంది. ఏడాదికి 110 గుడ్లు పెడుతుంది. జత పెంచుకుంటే రూ.500 ఆదాయం వస్తుంది. ఇక గ్రామప్రియ జత కోళ్లు పెంచుకుంటే రూ.వెయ్యి ఆదాయం వస్తుంది. మా వద్ద నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతులు బుక్ చేసుకుంటారు.ఇంటికే పార్సిల్జాతిని బట్టి గుడ్డు ధర రూ. 9–23 మధ్య, పిల్ల ధర రూ. 22–120 వరకు ఉంటుంది. ముందుగా బుక్ చేసుకొని, నగదు చెల్లించిన వారికి ఏ రాష్ట్రానికైనా సరే, నేరుగా స్వస్థలాలకు పార్శిల్ పంపుతారు. బుకింగ్స్ రద్దీని బట్టి, బుక్ చేసుకున్న తర్వాత 1 నుంచి 3 నెలల్లో సరఫరా చేస్తున్నారు. -
కొత్త పోప్ ఎవరో!
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్ ఎవరనే ఉత్కంఠ తీవ్రమైంది. దీనికి తెరదించడంలో భాగంగా కార్డినల్స్ బుధవారం వాటికన్ సిటీలో రహస్య ఓటింగ్కు సిద్ధమయ్యారు. అత్యధిక మెజారిటీ సాధించిన కార్డినల్కు పోప్ పదవి దక్కనుంది. 70 దేశాలకు చెందిన 133 మంది కార్డినళ్లు సిస్టిన్ ఛాపెల్లోకి వెళ్లి రహస్య ఓటింగ్లో పాల్గొనబోతున్నారు.మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చిన వారే నూతన పోప్ అవుతారు. సిస్టిన్ ఛాపెల్లో ఏ కార్డినల్ ఎవరికి ఓటేశారనే విషయం పొరపాటున కూడా బయటకు పొక్కకుండా ఉండేందుకు వాటికన్ సిటీవ్యాప్తంగా అన్ని మొబైల్ఫోన్ల స్నిగల్స్ను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఆపేయనున్నారు. నాలుగున్నర గంటలకు కార్డినళ్లు అందరూ ఛాపెల్లోకి వెళ్లనున్నారు. వీళ్ల ఫోన్లు, అన్నిరకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికారులు తీసుకుని కొత్త పోప్ ఎన్నిక తర్వాతే తిరిగి అప్పగిస్తారు. అప్పటిదాకా కార్డినళ్లను ఛాపెల్ ప్రాంగణం బయటకు కూడా అనుమతించబోరు. కొత్త పోప్ ఎన్నికల వార్త వినేందుకు ప్రజలు, మీడియా ప్రతినిధులు వేచి ఉండే ‘సెయింట్ పీటర్ స్క్వేర్’ వద్ద మాత్రం మొబైల్ నెట్వర్క్ పనిచేయనుంది. రహస్య ప్రక్రియలో ఎవరు పోప్గా పోటీపడుతున్నారనే అంశంపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రధానంగా ఐదారుగురి పేర్లు మాత్రమే వినవస్తున్నాయి. వాళ్ల గురించి క్లుప్తంగా...పియట్రో పరోలిన్70 ఏళ్ల ఇటలీ కార్డినల్ అయిన పియట్రో పరోలిన్ మిగతా వాళ్లతో పోలిస్తే పోటీలో ముందంజలో ఉన్నారు. గత పోప్ ఫ్రాన్సిస్ హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్కు ప్రధాన సలహాదారుగా ఉంటూ ఇప్పటికే ఈయన డిప్యూటీ పోప్గా అందరికీ చిరపరిచితులు. క్యాథలిక్ల పాత సిద్ధాంతాల పరిరక్షణకంటే దౌత్యం, ప్రపంచవ్యాప్తంగా పోప్ ప్రతిష్టను ఇనుమడింపజేయడం మీదనే ఈయన ప్రధానంగా దృష్టిపెడతారనే వాదన ఉంది. గత 266 మంది పోప్లలో 213 మంది ఇటలీ దేశస్తులే. గత 40 ఏళ్లుగా ఇటలీవ్యక్తి పోప్ పదవిని అధిరోహించలేదు. ఈ లెక్కన ఈసారి ఇటలీ వర్గం ఈయనకు అత్యధిక మద్దతిచ్చే అవకాశముంది.లూయిస్ ఆంటోనియోగోకెమ్ ట్యాగిల్67 ఏళ్ల ట్యాగిల్ ఫిలిప్పీన్స్ దేశస్తుడు. మిగతా వాళ్లతో పోలిస్తే ఈయన చాలా సంవత్సరాలుగా పాస్టర్గా కొనసాగి కార్డినల్ అయ్యారు. వాటికన్ తరఫున దౌత్యవేత్తగా, చర్చి చట్టాలను కఠినంగా అమలుచేసే కార్డినళ్లతో పోలిస్తే ఈయన భిన్నమైన వ్యక్తి. ఈయన స్వదేశం ఫిలిప్పీన్స్లో 80 శాతం జనాభా క్యాథలిక్లే. పైగా కార్డినళ్లలో ఐదుగురు ఫిలిప్పీన్ దేశస్తులున్నారు. దీంతో ఈయనకు సైతం మద్దతు పలికే లాబీ బలంగా ఉందని వార్తలొస్తున్నాయి.రాబర్ట్ ప్రివోస్ట్69 ఏళ్ల ప్రివోస్ట్ స్వస్థలం అమెరికాలోని షికాగో. రెండేళ్ల క్రితం తదుపరి బిషప్ల ఎన్నికల బాధ్యతలను ఇటీవల మార్క్ ఆలెట్ను పక్కనబెట్టిమరీ ప్రివోస్ట్కు పోప్ ఫ్రాన్సిస్ కట్టబెట్టారు. ఇలా ఫ్రాన్సిస్ నుంచి మన్ననలు పొందారు. పోప్గా ఎన్నికైతే ఆ పీఠాన్ని అధిరోహించిన తొలి అమెరికన్ కార్డినల్గా చరిత్రకెక్కుతారు.పీటర్ కోడ్వో టర్క్సన్76 ఏళ్ల టర్క్సన్ ఘనా దేశానికి చెందిన కార్డినల్. 22 ఏళ్ల క్రితం ఘనా నుంచి కార్డినల్ అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. గత 1,500 ఏళ్లలో ఆఫ్రికా ఖండం నుంచి ఎవరూ పోప్ బాధ్యతలు చేపట్టలేదు. ఈసారి ఈయనకు సైతం గెలుపు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. స్వలింగ సంబంధాలను నేరంగా చూడకూడదని ఆయన వాదించేవారు. యూరప్లో ఇస్లాం మతవ్యాప్తి పెరగొచ్చని గతంలో ఆందోళన వ్యక్తం చేశారు.మారియో గ్రెక్68 ఏళ్ల మారియో మాల్టా దేశానికి చెందిన వ్యక్తి. క్యాథలిక్లలో అందరితో కలుపుకొని పోయే కార్డినల్కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మొట్టమొదట వినిపించేది ఈయన పేరే. పోప్కు సలహాలు, సూచనలు ఇచ్చే సంఘమైన బిషప్ సైనోడ్కు ఆరేళ్ల క్రితమే ఈయన ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అందరి సమ్మతితో నిర్ణయాలు తీసుకోవాలనేది ఈయన ఆలోచన.ఫ్రిడోలిన్ ఆంబోంగో బెసుంగీ65 ఏళ్ల ఫ్రిడోలిన్ ఆఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన వ్యక్తి. ఆఫ్రికా నుంచి ఏటా లక్షల సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారుతున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఫ్రిడోలిన్కు సైతం మెండుగా ఉన్నట్లు సమాచారం. ఏడేళ్లు కిన్షారా ఆర్చ్బిషప్గా ఉన్న ఈయనను పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్గా ఎంపికచేశారు. పాత సాంప్రదాయాలకు ఈయన పట్టంకడతారు. స్వలింగ వివాహాలకు ఈయన బద్ద వ్యతిరేకి. ‘‘ క్రైస్తవుల్లో ప్రొటెస్టాంట్లను ప్రొటెస్టెంట్లుగానే ఉండనిద్దాం. ఇక ముస్లింను ముస్లింగానే బతకనిద్దాం’’ అని గతంలో వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు క్రైస్తవాన్ని బోధించే మతప్రచారకులకు ఇబ్బందికరంగా మారాయి.పీటర్ ఎర్డో72 ఏళ్ల ఎర్డో హంగేరీ దేశానికి చెందిన కార్డినల్. గత 21 ఏళ్లుగా కార్డినల్గా కొనసాగుతూ యూరప్లో చర్చి వర్గాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 2006 నుంచి పదేళ్లపాటు యూరోపియన్ బిషప్ల మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహించారు. తొలుత బుడాపెస్ట్ ఆర్చ్బిషప్గా పనిచేశారు. అటు ఆఫ్రికన్ కార్డినళ్లతో, ఇటు యూరప్ కార్డినళ్లతో సత్సంబంధాలున్నాయి. పోప్ పదవికి గట్టి పోటీ ఇచ్చే వీలుంది. – సాక్షి, నేషనల్ డెస్క్పోప్ ఫ్రాన్సిస్, ఆయనకు ముందు పోప్గా ఉన్న బెనెడిక్ట్–16లను పోప్ పదవికి ఎన్నుకోవడానికి కార్డినళ్లకు కేవలం రెండు రోజుల సమయం పట్టింది. అయితే 1268 సంవత్సరంలో ఈ ప్రక్రియ ఎంతకీ తెమల్లేదు. దీంతో ఏకంగా 1,006 రోజులపాటు ఓటింగ్ జరిగి ఎట్టకేలకు 1271 సంవత్సరంలో పోప్ను ఎన్నుకున్నారు. చరిత్రలో అత్యంత సుదీర్ఘకాల ఎన్నిక ప్రక్రియ ఇదే. -
అల్కట్రాజ్.. అమెరికా కాలాపానీ!
అమెరికాలో అత్యంత కఠినమైన జైలు అల్కట్రాజ్ను తెరవాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. శాన్ఫ్రాన్సిస్కో సముద్ర జలాల్లో ఉన్న ఈ జైలు ఒకప్పుడు తీవ్ర అపఖ్యాతి పాలైంది. ది రాక్గా ప్రసిద్ధికెక్కిన జైలు 60 ఏళ్ల కింద మూతపడింది. దశాబ్దాల క్రితం పర్యాటక ప్రాంతంగా మారింది. ఏటా లక్షలాది మంది సందర్శిస్తున్నారు. అలాంటి జైలును మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. శిథిలావస్థలో ఒకప్పటి ప్రమాదకర జైలును పునరుద్ధరించడం సరికాదని నిపుణులు అంటున్నా పట్టించుకోవడం లేదు. అల్కట్రాజ్ గురించి ట్రంప్ ఈ ద్వీప జైలును తెరవడమే గాక విస్తరించాలని ఆదేశించినట్లు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా హాండిల్ ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. దుర్మార్గులు, హింసాత్మక, ప్రమాదకర నేరస్తులతో అమెరికా చాలాకాలంగా ఇబ్బందులు పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. అల్కట్రాజ్ తన దృష్టిలో శాంతిభద్రతలను కాపాడగల అతి బలమైన, శక్తివంతమైన ప్రదేశమని అనంతరం మీడియాతో కూడా చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుతం శాంతిభద్రతలు చాలా అవసరం గనుక దాన్ని మళ్లీ తెరవబోతున్నట్టు చెప్పారు. జైలు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నప్పటికీ దాన్ని తెరిచే ఆలోచన బాగుందన్నారు. అమెరికా పౌరులు, జాతీయ భద్రత కోసం ఇప్పుడా జైలు అత్యంత అవసరమని సరిహద్దు అధికారి టామ్ హోమన్ కూడా అన్నారు. షార్క్ల కాపలా... అల్కట్రాజ్. ఒక్కమాటలో చెప్పాలంటే అండమాన్లోని కరడుగట్టిన కాలాపానీ వంటి జైలు. శాన్ఫ్రాన్సిస్కోకు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక చిన్న ద్వీపంలో ఉంది. దీన్ని మొదట నావికా రక్షణ కోటగా నిర్మించారు. 20వ శతాబ్ద ప్రారంభంలో సైనిక జైలుగా మార్చారు. 1934లో అధికారికంగా ఫెడరల్ జైలుగా మార్చేశారు. దీని భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది. తప్పించుకోజూడటమంటే ప్రాణాలు పణంగా పెట్టడమే. ఎందుకంటే ద్వీపం చుట్టూ సముద్రంలో షార్కులుంటాయి. జైలు నుంచి ఎలాగోలా తప్పించుకున్నా వాటికి ఆహారంగా మారతారు. అమెరికాలోని అత్యంత క్రూరమైన నేరస్తులను ఇక్కడ ఉంచేవారు.బలమైన సముద్ర అలలతో పాటు అతి శీతల పసిఫిక్ జలాలతో కూడిన అల్కాట్రాజ్ ఖైదీలకు అక్షరాలా నరకప్రాయం. ఈ జైలులో గ్యాంగ్స్టర్ అల్ కాపోన్, జార్జ్ మెషీన్ గన్ కెల్లీ వంటి కరడుగట్టిన నేరస్తులను ఉంచారు. దీనిపై అనేక సినిమాలు వచ్చాయి. నిర్వహణ అత్య ంత ఖరీదుగా మారడంతో 1963లో అటార్నీ జనరల్ రాబర్ట్ కెన్నెడీ దీని మూసివేయించారు. ఈ జైలు, ద్వీపం ఇప్పుడు నేషనల్ పార్క్ సరీ్వస్ నిర్వహణలో ఉన్నాయి. ఏటా 14 లక్షల మంది దీన్ని సందర్శిస్తున్నారు. గతంలోనూ ప్రయత్నాలు ఈ కేంద్రాన్ని డిటెన్షన్ సెంటర్గా తెరవాలని గతంలోనూ పలువురు నేతలు విఫలయత్నం చేశారు. 1981లో ‘మారియల్ బోట్ లిఫ్ట్’లో క్యూబా నుంచి ఫ్లోరిడాకు వచి్చన 20,000 మంది శరణార్థులను ఉంచడానికి నాటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన 14 ప్రాంతాల్లో ఇదీ ఉకటి. చారిత్రక పర్యాటక ప్రదేశం కావడం, అంతమందికి సౌకర్యాలు లేకపోవడంతో వెనక్కు తగ్గారు.నిర్వహణ అసాధ్యమంటున్న నిపుణులు..అల్కట్రాజ్ను తిరిగి తెరవడంపై జైలు నిపుణులు, చరిత్రకారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట ఈ విషయం వినగానే జోక్ అనుకున్నట్టు బీఓపీ తాత్కాలిక డైరెక్టర్గా చేసిన హ్యూ హుర్విట్జ్ చెప్పారు. ‘‘దాన్ని మరమ్మతు చేయాలనుకోవడం హాస్యస్పదం. ఆరడుగుల వ్యక్తి నిటారుగా నిలబడలేని గదులతో కూడిన భవనాలవి. పైగా కూలిపోతున్నాయి. సరైన భద్రత, ఫెన్సింగ్, కెమెరాలు కూడా లేవు. ఆ జైలును ఇప్పుడు నడపడం అసాధ్యమన్నారు. ‘‘1963లో జైలును మూసినప్పుడు ఖైదీల తలసరి నిర్వహణ ఖర్చు 13 డాలర్ల దాకా ఉండేది. ఇతర ఫెడరల్ జైళ్లలో అది ఐదు డాలర్లలోపే. ఇప్పుడు ఇతర జైళ్లలోనే 120 డాలర్లకు పెరిగింది. ఆ లెక్కన అల్కట్రాజ్లో కనీసం 500 డాలర్లు కావాలి. అంతంత వెచి్చ ంచి దోషులను అక్కడుంచడం చాలా ఖరీదైన వ్యవహారం’’అని చరిత్రకారుడు జాన్ మార్టిని తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ అమెరికాలో అత్యంత కఠినమైన జైలు అల్కట్రాజ్ను తెరవాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు. శాన్ఫ్రాన్సిస్కో సముద్ర జలాల్లో ఉన్న ఈ జైలు ఒకప్పుడు తీవ్ర అపఖ్యాతి పాలైంది. ది రాక్గా ప్రసిద్ధికెక్కిన జైలు 60 ఏళ్ల కింద మూతపడింది. దశాబ్దాల క్రితం పర్యాటక ప్రాంతంగా మారింది. ఏటా లక్షలాది మంది సందర్శిస్తున్నారు. అలాంటి జైలును మళ్లీ ఉపయోగంలోకి తెచ్చేందుకు ట్రంప్ ప్రయతి్నస్తున్నారు. శిథిలావస్థలో ఒకప్పటి ప్రమాదకర జైలును పునరుద్ధరించడం సరికాదని నిపుణులు అంటున్నా పట్టించుకోవడం లేదు. -
పురుషులకు సరోగసి హక్కు ఉండద్దా !
పేరెంట్హుడ్ని ఆస్వాదించని వారెవరు? అమ్మా.. నాన్నా.. అని పిలిపించుకోవాలని ఉవ్విళ్లూరని వాళ్లెవరు? కానీ మన దేశంలోని సరోగసీ యాక్ట్ –2021 అందరికీ ఆ ఆవకాశాన్నివ్వట్లేదు. విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్పీపుల్కి సరోగసీ ద్వారా పేరెంట్ అయ్యే చాన్స్కి నో అంటోంది! దీన్నే సవాలు చేస్తూ కర్ణాటకకు చెందిన 45 ఏళ్ల డెంటల్ సర్జన్.. సరోగసీ ద్వారా ఒంటరి పురుషులకూ తండ్రి అయ్యే భాగ్యం కల్పించమంటూ సుప్రీంకోర్ట్లో దావా వేశాడు. ఇప్పుడది చర్చగా మారింది.. అడ్వకేట్లు, జెండర్ రైట్స్ కోసం పనిచేస్తున్న యాక్టివిస్ట్లూ దీనిమీద తమ అభిప్రాయాలను చెబుతున్నారు.సరోగసీ.. గర్భంలో బిడ్డను మోసే ఆరోగ్యపరిస్థితులు లేని వాళ్లకు ఆధునిక వైద్యశాస్త్రం అందించిన వరం! ఇది ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్కీ పేరెంట్ అయ్యే అదృష్టాన్ని కలిగిస్తోంది. అలా బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే కవల పిల్లలకు తండ్రి అయ్యాడు. అలాగే నటుడు తుషార్ కపూర్ కూడా ఓ బిడ్డను కన్నాడు. అయితే అది 2021కి ముందు. ఈ చట్టం వచ్చాక పురుషులకు ఆ వెసులుబాటును తీసేసింది. ఒంటరి మహిళలు (విడాకులు పొందిన వారు, అలాగే వితంతువులు), స్త్రీ పురుషులు మాత్రమే పెళ్లి చేసుకున్న జంటలకూ మాత్రమే ఈ చట్టం పేరెంట్స్ అయ్యే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనిమీద సమాజంలోని పురుషులు సహా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలోనూ అసంతృప్తి ఉంది. విడాకులు పొందిన స్త్రీకి సరోగసీ ద్వారా తల్లి అయ్యే హక్కు ఉన్నప్పుడు, విడాకులు పొందిన పురుషుడికి ఎందుకు ఉండకూడదు? ఇది చట్టం చూపిస్తున్న వివక్ష తప్ప ఇంకోటి కాదని కర్ణాటక డెంటల్ సర్జన్ వాదన. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ స్త్రీకెప్పుడూ ఇవ్వని ఈ సమాజంలో.. ఒంటరి పురుషులు, ట్రాన్స్ పీపుల్ని అనుమతించడం లేదు సరికదా... పురుషుడు సంపాదించాలి, స్త్రీ ఇంటిని చూసుకోవాలనే లింగవివక్షను ప్రేరేపించే మూస ధోరణిని ప్రోత్సహిస్తోందని జెండర్ యాక్టివిస్ట్ల అభి్ప్రాయం. కారా (సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ) నివేదికలను బట్టి ఒంటరి పురుషులకు దత్తత తీసుకునేందుకు అనుమతించినవీ, అలాగే.. మగవాళ్లు కూడా పిల్లల్ని పెంచగలరని నిరూపించిన ఉదాహరణలున్నాయి. కాబట్టి డెంటల్ సర్జన్ పిటిషన్లో న్యాయం ఉందని అంటున్నారు యాక్టివిస్ట్లు. అంతేకాదు అతని ఈ ΄ోరాటం ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి ఒక ఊతమవుతుందని.. లింగ అసమానతలను రూపుమాపే ప్రయత్నానికీ ఒక అడుగు పడుతుందనే ఆశనూ వ్యక్తం చేస్తున్నారు. – సరస్వతి రమవివక్ష చూపిస్తోందిడైవర్స్ తీసుకున్న మగవారికి, ఒంటరి పురుషులకు, స్వలింగ సంపర్కులకు, ట్రాన్స్ జెండర్స్కి సరోగసి పద్ధతిలో పిల్లలని కనడాన్ని సరోగసీ చట్టం నిషేధించింది. ఈ చట్టంలోని సెక్షన్ ంలు ఈ నిబంధన విధించాయి. ఈ చట్టం ప్రకారం కేవలం విడాకులు పొందిన లేదా వితంతువులకు, హెటిరో సెక్సువల్ దంపతులకు మాత్రమే సరోగసీ ద్వారా పిల్లలని కనే హక్కు ఉంది. ఒంటరి పురుషుడికి ఆడపిల్లను దత్తత తీసుకునే వీలు లేనప్పటికీ, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 57, హిందూ అడాప్షన్ – మెయింటెనెన్స్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఒంటరి/విడాకులు తీసుకున్న పురుషుడికి కూడా పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్నది. సరోగసీ చట్టం ఇందుకు భిన్నంగా ఉండటం రాజ్యాంగం కల్పించిన సమానత్వం, జీవించే స్వేచ్ఛ హక్కుల స్ఫూర్తికి వ్యతిరేకమే! ఇతర దేశాలు చాలామటుకు స్త్రీ పురుషుల మధ్య సరోగసీ పద్ధతిలో పిల్లల్ని కనటం పై సమాన హక్కులే కల్పించాయి. –శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాదిఆ అవకాశం, వాతావరణం ఉన్నాయా? ప్రతి ఒక్కరికీ పేరెంట్హుడ్ను ఆస్వాదించే హక్కు ఉంది. ఆ హక్కు కోసం కర్ణాటక డెంటల్ సర్జన్ న్యాయ ΄ోరాటంలో తప్పులేదు. స΄ోర్ట్ కూడా చేస్తాను. అయితే వ్యక్తిగతంగా మాత్రం అందులో నాకు భిన్నమైన అభి్ప్రాయం ఉంది. అడుగడుగునా అసమానతలు, వివక్ష, అభద్రతలున్న ఈ సమాజంలో పుట్టబోయే పిల్లలను భద్రంగా కాపాడుకోగలమా? మనముందున్న సెక్సువల్ ఐడెంటిటీలనే గుర్తించి, గౌరవించడానికి సిద్ధంగా లేము. ఈ నేపథ్యంలో పుట్టబోయే పిల్లల భవిష్యత్ ఏంటీ? వాళ్లు చక్కగా పెరిగే అవకాశం, వాతావరణం ఉన్నాయా అనే విషయంలోనే నా భయం, ఆందోళన అంతా! – బోయపాటి విష్ణు తేజ, చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్స్టీరియోటైప్స్ని బలపరుస్తోంది.. పేరెంట్హుడ్ అనేది ఒక జెండర్కి మాత్రమే పరిమితమైనది కాదు. పేరెంట్ అవ్వాలని ఆశపడేవాళ్లందరూ ఆ హక్కును వినియోగించుకునే అవకాశం ఉండాలి. కొంతమంది మగవాళ్లు పేరెంట్ కావాలనుకున్నా ఇలాంటి చట్టాల వల్ల పేరెంట్హుడ్ చాయిస్ని కోల్పోతున్నారు. స్టీరియోటైప్స్ కొన్నిటిని ఈ చట్టం బలపరుస్తోంది. సింగిల్గా ఉన్న ఆడవాళ్లకు, హెటరో సెక్సువల్ ఫ్యామిలీస్కి మాత్రమే వెసులుబాటు కల్పిస్తూ! సింగిల్ ఉమెన్కి ఎందుకిచ్చిందంటే కేర్ గివింగ్ అనే లక్షణం సహజంగానే వాళ్లకుంటుంది కాబట్టి అనే. అంటే ఈ రెండు స్టీరియోటైప్స్ని ఆ చట్టం బలపరుస్తున్నట్టే కదా! వివక్షే కాకుండా స్టీరియోటైప్స్నీ బలపరుస్తున్నట్టున్న ఈ చట్టాన్ని చాలెంజ్ చేయడం మంచిదే! పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ ఇల్లు చూసుకుంటుంది లాంటి జెండర్ రోల్స్ను ఈ చట్టం బలపరుస్తోంది. ఈ చట్టం వల్ల ఎల్జిబీటీక్యూ కమ్యూనిటీస్కీ నష్టమే! ఏమైనా ఈ చట్టంలో మార్పులు రావాలి. ఎక్స్΄్లాయిటేషన్ను ఆపేలా చట్టాలుండాలి కానీ.. పేరెంట్హుడ్ కావాలనుకునే వారిని నిరుత్సాహపరచేలా కాదు.– దీప్తి సిర్ల, దళిత్ అండ్ జెండర్ యాక్టివిస్ట్ -
ఆనకట్టల కట్టడి
సింధూ, దాని పరీవాహక నదుల నుంచి పాకిస్తాన్కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్న భారత్, ఆ దిశగా పూర్తిస్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగింది. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక తదితరాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని అధికారులకు సూచించింది. జమ్మూ కశ్మీర్లో చినాబ్ నదిపై ఉన్న కీలక బాగ్లిహార్, సలాల్ జల విద్యుత్కేంద్రాల్లో ఆ దిశగా గురువారం లాంఛనంగా మొదలైన పూడికతీత పనులు సోమవారం పూర్తిస్థాయికి చేరాయి. పనుల్లో భాగంగా రెండు డ్యాముల్లో అవసరమైన గేట్లను గురువారం నుంచి శనివారం దాకా పాక్షికంగా ఎత్తడంతో పాక్లోని సరిహద్దు ప్రాంతాలు నీటమునిగాయి. సింధూ జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ విషయమై పాక్కు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. 1960ల్లో ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. ఒప్పందాన్ని బూచిగా చూపుతూ పూడిక పనులను పాక్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడిక ఆ ప్రాజెక్టుల్లోని పూడిక మొత్తాన్నీ తొలగించి పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. అప్పటిదాకా చినాబ్ నదీజలాలు పాక్కు పూర్తిగా నిలిచిపోయినట్టే!. సింధూ ఒప్పందం ప్రకారం చినాబ్ జలాలు పాక్కే చెందుతాయి. వాటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవడానికి వీల్లేదు.మూడింటి నుంచి నీళ్లు బంద్జమ్మూ కశ్మీర్లో సింధూ, దాని పరీవాహక నదులపై ఆరుకు పైగా జలాశయాల్లో పూడికతీతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రభుత్వరంగ ఎన్హెచ్పీసీ లిమిటెడ్ సారథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బాగ్లిహార్, సలాల్తో పాటు జీలం నది మీది కిషన్గంగ జలాశయాల నుంచి పాక్కు నీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపేశారు. దాంతో పాక్లోని పంజాబ్ తదితర ప్రాంతాలకు సాగునీరు నిలిచిపోయింది. సలాల్ ప్రాజెక్టును 1987లో, బాగ్లిహార్ను 2008లో నిర్మించారు. అప్పటినుంచీ వాటిలో పూడికతీత చేపట్టడం ఇదే తొలిసారి. సలాల్ 690 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. బాగ్లీహార్ సామర్థ్యం 900 మెగావాట్లు. పూడిక నేపథ్యంలో వాటిలో విద్యుదుత్పాదన చాలాకాలంగా సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతూ వస్తోంది.10 వేల మెగావాట్ల విద్యుత్జమ్మూ కశ్మీర్లో సింధూ, ఉప నదులపై మొదలు పెట్టిన ఆరు ప్రాజెక్టులు పాక్ అభ్యంతరాల నేపథ్యంలో చాన్నాళ్లుగా నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటి నిర్మాణాన్ని తక్షణం పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. సవాల్కోట్ (1,856 మెగావాట్లు), కిర్తాయ్ 1, 2 (1,320 ఎంవీ), పాకాల్దుల్ (1,000 ఎంవీ)తో పాటు 2,224 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన మరో ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ఏకంగా 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్తో పాటు సాగు, తాగునీటి అవసరాలకు మరిన్ని జలవనరులు అందుబాటులోకి వస్తాయి. సింధూ ఒప్పందం కింద ఇలాంటి పనులకు పాక్కు ఆర్నెల్ల నోటీసు ఇవ్వాల్సి ఉండేది. దాన్ని నిలిపివేసిన నేపథ్యంలో భారత్ తాజా చర్యలను అడ్డుకునేందుకు పాక్కు పెద్దగా మార్గాలేమీ లేవు. మధ్యవర్తి అయిన ప్రపంచబ్యాంకు కూడా పెద్దగా చేసేదేమీ లేదు. ఇరు దేశాలనూ చర్చలకు ప్రోత్సహించడం తప్ప ఒప్పందం అమలుకు ఆదేశించడం వంటి అధికారాలేవీ దానికి లేవు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రైలు బండి... ఇక పొగ రాదండీ
తెలుగు రాష్ట్రాల్లో పొగబండిని ఇక పొగరాని బండి అని పిలవాలి. ఎందుకంటే.. దేశంలో డీజిల్ రైలింజిన్లకు స్వస్తి చెబుతూ కేవలం కరెంటు ఇంజిన్లతోనే రైళ్లు నడపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే విజయవంతంగా ఆచరణలోకి తెచ్చిం ది. 2025 మార్చి నాటికి 100% లైన్లను విద్యుదీకరించాలన్న లక్ష్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 97% సాధించగా, దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా సాధించి చూపింది. మరోపక్క వాల్తేర్ డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల్లోనూ ఇప్పటికే విద్యుదీకరణ పూర్తయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలక్ట్రిక్ ఇంజిన్లతోనే రైళ్లను నడిపే పరిస్థితి ఏర్పడింది. దీన్ని రైల్వేలో భారీ విజయంగా భావిస్తున్నారు. డీజిల్ ఇంజిన్ల వల్ల రైల్వే శాఖకు భారీగా చేతి‘చమురు’వదులుతోంది. లైన్ల విద్యుదీకరణ ద్వారా, డీజిల్ భారాన్ని తగ్గించుకుని ఆ మొత్తాన్ని రైల్వేల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఖర్చు చేస్తోంది. దేశవ్యాప్తంగా 97% విద్యుదీకరణ సాధించగా, దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా సాధించి చూపింది. కర్ణాటక (96%), తమిళనాడు (96%), రాజస్తాన్ (98%) వంటి రాష్ట్రాల్లో ఇంకా పూర్తి కాలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు విద్యుదీకరణ పూర్తయిన రైల్వే ట్రాక్ నిడివి 68,730 కిలోమీటర్లు. ఇందులో గత పదేళ్లలో పూర్తయింది 46,928 కిలోమీటర్లు. – సాక్షి, హైదరాబాద్జోన్పరిధిలో ఇలా..దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 రూట్ కి.మీ. మేర రైలు మార్గాలున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం పరిధిలో 2,015 రూట్ కి.మీ.ల ట్రాక్ ఉంది. వాల్తేర్ డివిజన్ పరిధిలో సుమారు 1,075 రూట్ కి.మీ. మేర ఉంటే.. ఇందులో ఏపీ పరిధిలో దాదాపు 545 కి.మీ.ల ట్రాక్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో అక్కన్నపేట–మెదక్ మధ్య 17 కి.మీ. మేర పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. వాటిని వేగంగా నిర్వహించి విద్యుత్తు రైళ్లు నడపడం ప్రారంభించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే యావత్ దక్షిణ మధ్య రైల్వేలో విద్యుదీకరణ పూర్తయినట్టు తేల్చారు.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,280 విద్యుత్తు లోకోమోటివ్లు వినియోగిస్తున్నారు. వీటిలో 291 ఇంజిన్లను ప్రయాణికుల రైళ్లకు వాడుతుండగా, మిగతావాటిని సరుకు రవాణా రైళ్లకు వినియోగిస్తున్నారు. ఇక జోన్పరిధిలోనే ఉన్నప్పటికీ, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్–గుల్బర్గా పరిధిలోకి వచ్చే ఖానాపూర్–కమలాపూర్–నందగావ్ మార్గంలో కొంతమేర పని మిగిలి ఉంది. అయితే, దాన్ని నిర్వహించే బాధ్యత దక్షిణ మధ్య రైల్వే సరిహద్దుతో ఉన్న సెంట్రల్ రైల్వేది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే రికార్డు సమయంలో లక్ష్యాన్ని సాధించినట్టయింది. ఇంకా డీజిల్ ఇంజిన్లు.. ఎందుకంటే?వంద శాతం విద్యుదీకరణ జరిగినప్పటికీ, దక్షిణ మధ్య రైల్వే జోన్పరిధిలో ఇప్పటికీ 395 డీజిల్ ఇంజిన్లను నిర్వహిస్తున్నారు. వీటిలో 245 ఇంజిన్లను సరుకు రవాణా రైళ్లకు వాడుతున్నారు. అలాగే వాల్తేర్ డివిజన్లో మొత్తం 387 ఇంజిన్లు ఉంటే అందులో డీజిల్ ఇంజిన్లు 162. భవిష్యత్తులో రైళ్లు ఢీకొనటం, వరదలు లాంటి విపత్తులతో విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతిని కరెంటు ఇంజిన్లు వాడలేని పరిస్థితి ఎదురైతే, అత్యవసర సేవల కోసం ఈ డీజిల్ ఇంజిన్లతో రైళ్లు నడుపుతారు. ఆ సమయంలో డీజిల్ ఇంజిన్లు ఫిట్గా ఉండాలంటే వాటిని నిరంతరం వాడాలి.ఇక మిగిలిందదే..తెలంగాణ పరిధిలో ప్రస్తుతం ఒకే ఒక్క కొత్త రైలు మార్గం పనులు జరుగుతున్నాయి. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ నుంచి మొదలై కరీంనగర్ శివారులో కొత్తపల్లి వరకు సాగే లైను. ఇందులో సిద్దిపేట వరకు ట్రాక్ ఏర్పాటు పూర్తి కావటంతో రైలు సేవలు కూడా మొదలయ్యాయి. సిద్దిపేట నుంచి సిరిసిల్ల మీదుగా పైకి కొనసాగాల్సి ఉంది. ఈ పనులు 2026 నాటికి పూర్తవుతాయి. ఇంతకాలం కొత్త లైన్ల నిర్మాణాన్ని ముందు చేపట్టి, భవిష్యత్తులో కుదిరినప్పుడు మార్గాన్ని విద్యుదీకరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి, కొత్త లైన్ల పనులు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా విద్యుదీకరణ పనులూ నిర్వహిస్తున్నారు.ఈమేరకు మనోహరాబాద్–కొత్తపల్లి మార్గాన్ని కూడా విద్యుదీకరించాలని నిర్ణయించింది. 2026 జూన్నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పనులు జరుగుతున్న ప్రాజెక్టు కావడంతో దీన్ని విద్యుదీకరణ జాబితాలో చేర్చలేదు. అసంపూర్తి ప్రాజెక్టు కావటంతో దీన్ని విద్యుదీకరణ జరగని ప్రాజెక్టుగా తేల్చలేదు. ఫలితంగా వంద శాతం విద్యుదీకరణ సాధించిన జోన్గా దక్షిణ మధ్య రైల్వే జోన్ను రైల్వే శాఖ ప్రకటించింది. డీజిల్తో రూ.400 కరెంటుతో రూ.130 మాత్రమేడీజిల్ ఇంజిన్నడపడం వల్ల రైల్వేకు ఒక కి.మీ.కు అయ్యే వ్యయం సగటున రూ.400. అదే కరెంటు ఇంజిన్కి.మీ.కు 20 యూనిట్ల కరెంటును ఖర్చు చేస్తుంది. ఈ రూపంలో అయ్యే వ్యయం సగటున రూ.130 మాత్రమే. సరుకు రవాణా రైలు నిర్వహణలో డీజిల్తో పోలిస్తే కరెంటు ఇంజిన్కు మూడో వంతు వ్యయం, ప్రయాణికుల రైలుకు నాలుగో వంతు వ్యయం అవుతుందని అంచనా.రైల్వే శాఖ లెక్కల ప్రకారం.. 2018–19లో రైల్వే శాఖ డీజిల్ రూపంలో చేసిన ఖర్చు రూ.18,587 కోట్లు. విద్యుదీకరణతో ఏటా రూ.1,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఆదా చేస్తోంది. గత పదేళ్లలో విద్యుదీకరణ వల్ల దాదాపు 640 కోట్ల లీటర్ల డీజిల్ను ఆదా చేసిందని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల 400 కోట్ల కేజీల కర్బన ఉద్గారాల విడుదలను నివారించగలిగాం. -
డాల్ఫిన్లు ఏమంటున్నాయి?
డాల్ఫిన్లు వివిధ రకాలైన వింత శబ్దాలను చేస్తాయి. జంతువుల్లా అరుస్తాయి. పక్షుల్లా కూస్తాయి. మనుషుల్లా మూలుగుతాయి. ఈలలు వేస్తాయి. కిచకిచమంటాయి. పకపకమంటాయి. పెద్ద బుడగ పగిలినట్లుగా ధడేల్మంటాయి. అవి ఉన్న పరిస్థితిని బట్టి, తమ ప్రవృత్తిని, ప్రకోపాన్ని అనుసరించి విభిన్నమైన ధ్వనులతో తమలో తాము సంభాషించుకుంటాయి! ఆ సంభాషణలకు, లేదా వాటి ధ్వనులకు అర్థం ఏమై ఉంటుంది? అది తెలుసుకోటానికే... ‘డాల్ఫిన్ జెమ్మా’ అనే డాల్ఫిన్ ఏఐ మోడల్ను (సాఫ్ట్వేర్ను) భుజాన వేసుకుని ‘గూగుల్’ సముద్ర పరిశోధనలు చేస్తోంది! డాల్ఫిన్లతో మాటలు కలపటానికి వాటి అరుపులను అనుకరిస్తోంది. ఆ అరుపుల అర్థాలను డీకోడ్ చేయవచ్చని భావిస్తోంది. అయితే, ఏఐ సహాయంతో మనిషి ఏనాటికైనా మానవేతర జీవుల మనసును పసిగట్టగలడా? కృత్రిమ మేధ, మానవ అంతర్దృష్టిని దాటి లోలోపలికి చూడగలదా అన్నదే పెద్ద ప్రశ్న. -సాక్షి, స్పెషల్ డెస్క్ఏమిటీ ‘డాల్ఫిన్ ఏఐ మోడల్’డాల్ఫిన్లు కూడా మనుషుల్లాగే సామాజిక నైపుణ్యం కలిగినవి. చెప్పాలంటే తెలివైనవి, చురుకైనవి కూడా. మచ్చికైన మనుషులతో భావోద్వేగాలను కూడా పంచుకుంటాయి! అలాగే ఇతర జంతువులు కూడా. బ్రిటిష్ మహిళా ఎథాలజిస్ట్ (మానవేతర జంతు ప్రవర్తనల అధ్యయన శాస్త్రవేత్త) జేన్ గుడాల్ అడవి చింపాంజీల సామాజిక కుటుంబ పరస్పర పరిశోధనలను చేసిన విధంగానే, ప్రముఖ మహిళా పరిశోధకురాలు డెనిస్ హెర్జింగ్ 1985 నుండే డాల్ఫిన్ కమ్యూనికేషన్ మీద అధ్యయనం చేస్తున్నారు.‘ది వైల్డ్ డాల్ఫిన్ ప్రాజెక్ట్’ (డబ్లు్య.డి.పి.) అనే ప్రతిష్టాత్మకమైన భారీ సముద్ర గర్భ ప్రాజెక్టులో తలమునకలై ఉన్నారు. గూగుల్ ఇప్పుడు ఆ డబ్లు్య.డి.పి. ప్రాజెక్టుతో, జార్జియా టెక్ యూనివర్సిటీతో కలిసి డాల్ఫిన్ల స్వర నమూనాలను విశ్లేషించడానికి, వాటి నిర్మాణాన్ని గుర్తించడానికి తొలిసారి ‘డాల్ఫిన్ ఏఐ మోడల్’తో ప్రయోగాలు తలపెట్టింది.ఇది ఎలా పని చేస్తుందంటే..డాల్ఫిన్లు భిన్న సామాజిక, పరిసర పరిస్థితులకు భిన్న శబ్దాలను చేస్తాయి. ముఖ్యంగా తల్లులు, పిల్లల మధ్య వ్యక్తిగత గుర్తింపు కోసం ఈలలు వేస్తాయి. ఘర్షణ పడుతున్నప్పుడు ‘క్కే క్కే’ మంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు / సహజీవనం చేస్తున్నప్పుడు చేగోడీలు కొరికితే వచ్చే చప్పుడును చేస్తాయి. ఈ శబ్దాలను విని ఫీడ్ చేసుకునేందుకు, ప్రతిస్పందన శబ్దాలు చేసేందుకు పిక్సెల్ 6 స్మార్ట్ఫోన్ లపై పనిచేసే ‘డాల్ఫిన్ జెమ్మా’ను గూగుల్.. బహమాస్ ద్వీపంలో కలియ తిప్పుతోంది. డబ్లు్య.డి.పి. నుంచి వచ్చిన డేటాతో ఆడియో సాంకేతికతను మిళితం చేయటం ద్వారా గూగుల్ డాల్ఫిన్ ఏఐ మోడల్.. జల గర్భంలోని డాల్ఫిన్ల శబ్దాలను డీకోడ్ చేస్తుంది. ఏప్రిల్ 14న ‘జాతీయ డాల్ఫిన్ దినోత్సవం’ నాడు, గూగుల్ తన డాల్ఫిన్ ఏఐ నమూనా పురోగతిని ప్రదర్శించింది. ఫలితం ఏంటంటే – అది ఎంతో చక్కగా డాల్ఫిన్ స్వర నమూనాలను విశ్లేషిస్తోంది. నిజమైన డాల్ఫిన్ లాంటి శబ్దాలను సైతం తనే ఉత్పత్తి చేస్తోంది.ఏఐ ప్రయోగం.. ఏమిటి ప్రయోజనం?అంతరించిపోతున్న జీవ జాతులను పర్యవేక్షించడం ద్వారా వాటి పరిరక్షణకు ఏఐ మోడల్ సహాయపడుతుంది. ఇక డీకోడింగ్ కమ్యూనికేషన్ అన్నది జీవజాతుల పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని వెల్లడిస్తుంది. కాలుష్యం, వాతావరణ మార్పుల గురించి మానవుల్ని హెచ్చరిస్తుంది. ఏఐ మానవులు – మూగ జీవుల మధ్య పరస్పర సాహచర్యాన్ని పెంచుతుంది, సహానుభూతిని పెంపొందిస్తుంది.అన్ని జంతువులపైనా ఏఐ పరిశోధనలు చిలుకలు, కాకులు, తోడేళ్లు, తిమింగలాలు, చింపాంజీలు, ఆక్టోపస్లు ఎలా సంభాషిస్తాయో గుర్తించడానికి కూడా ఇప్పుడు ఏఐ ఉపయోగపడుతోంది. ‘నేచురల్ ఎల్.ఎం. ఆడియో’ అనేది జంతువుల శబ్దాల కోసం నిర్మించిన మొట్టమొదటి ఆడియో–భాషా నమూనా. దీని ద్వారా ఇంతవరకు కనిపించని జాతుల శబ్దాలను సైతం విశ్లేషించవచ్చు. మరికొన్ని ప్రాజెక్టుల ద్వారా స్పెర్మ్ వేల్ వెలువరించే ధ్వనుల అర్థాలను కనిపెట్టటానికి ఏఐని, రోబోటిక్స్ను ఉపయోగిస్తున్నారు. అలాగే జంతువుల లైంగిక ప్రవర్తనలను అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఉపగ్రహ చిత్రాలు, కెమెరా ట్రాప్లు, బయో అకౌస్టిక్ల అనుసంధానం కలిగి ఉన్న ఏఐను పక్షుల సంరక్షణకు, పర్యవేక్షణకు, అమెజాన్ ప్రాంత రక్షణకు ఉపయోగిస్తున్నారు. కొలంబియాలోని యూనివర్సిడాడ్ డి లాస్ ఆండీస్, ఇన్ స్టిట్యూటో సించి, ఇన్ స్టిట్యూటో హంబోల్ట్, ప్లానెట్ ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్ ఏఐ ఫర్ గుడ్ ల్యాబ్ల సహకారంతో ఈ ప్రాజెక్టు నడుస్తోంది.కృత్రిమ మేధకూ పరిమితులుకృత్రిమ మేధ జంతువుల ధ్వని నమూనాలను గుర్తించగలదు, కానీ అనూహ్యంగా జరిగే జంతువుల అకాల సంభోగం, వేళకాని వేళ అవి ఆహారం తీసుకోవటం లేదా ఏదైనా ప్రమాదంలో అవి చేసే ధ్వనులను గుర్తించటంలో కృత్రిమ మేధకు పరిమితులు ఉంటాయి. జంతువులు మానవుల మాదిరిగానే ‘మాట్లాడుకుంటాయి’ అనేది పొరపాటు భావన అయినప్పుడు, క్షేత్రస్థాయి వివరాలు చిక్కుముడిగా లభ్యం అవుతున్నప్పుడు కూడా జీవజాతుల–నిర్దిష్ట ప్రవర్తనల విశ్లేషణ ఏఐకి క్లిష్టతరం అవుతుంది. చాలాసార్లు మానవ అంతర్దృష్టి జోడింపు అవసరం కావచ్చు. పైగా ఇలాంటి అధ్యయనాలకు తరచుగా కస్టమ్ మోడళ్లు, విస్తృతమైన వనరులు అవసరమవుతాయి. దాంతో జంతువుల కమ్యూనికేషన్ అన్నది డీకోడింగ్ను సంక్లిష్టమైన ప్రయత్నంగా మారుస్తుంది. -
మూడింట ఒక వంతు రుణమే
ఫిన్టెక్ రంగంలో ఆవిష్కరణలు, అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలు, ప్రభుత్వ చొరవ.. వెరసి భారత్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా మారుతోంది. డిజిటల్ పేమెంట్స్లో క్రెడిట్ (రుణ) ఆధారిత చెల్లింపుల వాటా దాదాపు మూడింట ఒకవంతుకు చేరడం విశేషం. ఒకేసారి చెల్లింపులు చేయడం కంటే రుణాలను సులభ వాయిదాల్లో చెల్లించడానికే కస్టమర్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.క్రెడిట్ కార్డులు లేదా వడ్డీతో కూడిన ఈఎంఐల ద్వారా పేమెంట్స్ కానిచ్చేస్తున్నారని ఫిన్టెక్ కంపెనీ ‘ఫి’కామర్స్ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 20,000 మందికిపైగా వ్యాపారుల నుంచి విశ్లేషించిన లావాదేవీల సమాచారం ఆధారంగా భారత్లో 2024లో జరిగిన చెల్లింపుల తీరుతెన్నులపై ఈ నివేదిక రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. -సాక్షి, స్పెషల్ డెస్క్అధిక విలువకు క్రెడిట్..చిన్న, మధ్యస్థ విలువ కలిగిన లావాదేవీలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధిపత్యం చెలాయిస్తుండగా.. అధిక విలువ కలిగిన కొనుగోళ్లు ఎక్కువగా క్రెడిట్ కార్డులు, ఈఎంఐల (నెలవారీ సులభ వాయిదాలు) ద్వారా జరుగుతున్నాయి.అంటే అధికంగా ఖర్చు చేయాల్సిన సందర్భాల్లో వినియోగదారులు స్వల్పకాలిక రుణాలపై ఆధారపడుతున్నారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, వాహనాలు, వాహన అనుబంధ రంగాలు డిజిటల్ క్రెడిట్ స్వీకరణలో బలమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయి. పండుగ షాపింగ్, పాఠశాల అడ్మిషన్లు, కాలానుగుణ పోకడలు క్రెడిట్ వినియోగంలో పెరుగుదలకు కారణమవుతున్నాయి. ఇక దేశవ్యాప్తంగా 2024లో జరిగిన రోజువారీ మొత్తం చెల్లింపులలో లావాదేవీల సంఖ్య పరంగా యూపీఐ 65 శాతం వాటాతో తన హవాను ప్రదర్శిస్తోంది. ఈఎంఐలు 20%, క్రెడిట్ కార్డ్స్10%, నెట్ బ్యాంకింగ్ 3%, నేరుగా బదిలీ 2% నమోదయ్యాయి. -
కాస్మిక్ బోన్కు పగుళ్లు
భూగోళంతో పాటు ఇతర గ్రహాలు, సూర్యుడు, అసంఖ్యాకమైన నక్షత్రాలున్న మన పాలపుంతలో అంతరిక్ష ఎముకలు (కాస్మిక్ బోన్సు) కూడా ఉంటాయని మీకు తెలుసా? నిలువుగా, సన్నగా ఉండే వీటిని ఆకారం వల్ల ఎముకలుగా పిలుస్తుంటారు. వ్యోమగాములకు అంతరిక్షం నుంచి ఇవి సర్పాకృతిలో కనిపిస్తుంటాయి. ఇవీ ఒకరకంగా నక్షత్రాల్లాంటివే. వీటి నుంచి రేడియో తరంగాలు వెలువడుతాయి. భూమి నుంచి 26 వేల కాంతి సంవత్సరాల దూరంలో పాలపుంత మధ్యభాగానికి సమీపంలో ఉన్న జీ359.13 అనే ఇలాంటి కాస్మిక్ బోన్కు పగుళ్లు వచ్చినట్లు సైంటిస్టులు తాజాగా గుర్తించారు.ఇది మన పాలపుంతలో అత్యంత పొడవైన, ప్రకాశవంతమైన ఎముకల్లో ఒకటి. పల్సర్ అనే న్యూట్రాన్ స్టార్ గంటకు ఏకంగా 20 లక్షల మైళ్ల వేగంతో ఢీకొట్టడం వల్లే ఈ పగుళ్లు ఏర్పడినట్లు చంద్ర ఎక్స్–రే అబ్జర్వేటరీతో పాటు ఇతర రేడియో టెలిస్కోప్ల ద్వారా కనిపెట్టారు. ఈ చిత్రాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. భారీ నక్షత్రాలు పేలిపోవడం వల్ల న్యూట్రాన్ నక్షత్రాలు ఏర్పడుతుంటాయి. అవి అత్యధిక ఆయస్కాంత శక్తిని కలిగి ఉండి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ను వెలువరిస్తాయి. సెకనుకు కొన్ని వందలసార్లు తమ చుట్టూ తాము తిరుగుతూ అంతరిక్షంలోకి వేగంగా దూసుకెళ్తాయి. దారికి అడ్డొచ్చివాటిని అడ్డంగా ఢీకొంటాయి.– సాక్షి, నేషనల్ డెస్క్