breaking news
Sakshi Special
-
దోమలు.. ఐస్ల్యాండ్కు అరుదెంచిన వేళ..
న్యూఢిల్లీ: మశకం. దీనికి దోమ అని మరో పేరు కూడా ఉంది. భారత్లో ఏ వీధిలో ఏ మూలన చూసినా వేలాదిగా కనిపించి కసితీరా కాటువేసే ఈ దోమలు ఇప్పటిదాకా ఐస్ల్యాండ్లో లేవు. ఐస్ల్యాండ్ దేశ చరిత్రలో తొలిసారిగా దోమలను చూశామని గతవారం ఓ వ్యక్తి వెల్లడించడంతో దేశంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఇప్పటిదాకా ఐస్లాండ్ వాసుల దరిచేరలేదు. ఇకపై తమ దేశంలోనూ దోమలు తిష్టవేస్తే వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఉరవడి తప్పదని స్థానికులు భయపడిపోతున్నారు. సాధారణంగా యూరప్ ఉత్తర ప్రాంతాల దాకా ఈ దోమలు ఉంటాయిగానీ ఐస్ల్యాండ్లో లేవు. దోమలను తమ ఇంట్లో గుర్తించామని గత వారం ఒక వ్యక్తి ప్రకటించారు. సంబంధిత దోమల ఫొటో లను తీసి స్థానిక పారిశుద్ధ్య విభాగ అధి కారులకు పంపించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాటిని క్యూలిసెటా యాన్వలాలా జాతి దోమలుగా గుర్తించారు. ఎక్కడి నుంచి వచ్చాయి?ఈ అంశంపై నేషనల్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐస్ల్యాండ్లో కీటక విభాగ నిపుణుడు డాక్టర్ మ్యాథియస్ ఆల్ఫ్రెడ్సన్ మాట్లాడారు. ‘‘ విదేశాల నుంచి వచ్చిన సరకు రవాణా లేదా వాణిజ్య నౌకలు లేదా షిప్పింగ్ కంటైనర్ల కారణంగా ఈ దోమలు ఐస్ల్యాండ్లోకి వచ్చి ఉంటాయి. క్యూలిసెటా దోమలు కాస్తంత చల్లని ప్రాంతాల్లోనూ మనగలవు. వాతావరణ మార్పులు, భూతాపోన్నతి వంటి దారుణ పరిస్థితులు కారణంగా ఐస్ల్యాండ్ సైతం వేడెక్కుతుంది. దీంతో ఇక్కడ తిష్టవేసిన వేడి వాతావరణమే, వాతావరణంలో అధిక తేమ, ఆర్థ్రత, వర్షభావ పరిస్థితులు సైతం కొత్తగా దోమ ఈ దేశంలో మనుగడ సాగించడానికి కారణం అయి ఉండొచ్చు’’ అని ఆయన విశ్లేషించారు.ఎవరు కనిపెట్టారు?ఐస్ల్యాండ్లోని కిడాఫెల్ అనే గ్రామంలో ద్రాక్షతోట పండించే బిజోర్న్ హజాల్ట్సన్కు కొత్తతరహా కీటకాలను పరిశీలించడమంటే ఎంతో ఇష్టం. గత ఆరేళ్లుగా తన తోటలో అధికమైన చిమ్మట పురుగులను త్వరగా పట్టుకునేందుకు ఒక వస్త్రానికి తీపి, రెడ్వైన్ల మిశ్రమాన్ని పూసి ఆ వస్త్రంలో చిక్కుకుపోయే పురుగులను గమనించడం ఓ వ్యాపకంగా పెట్టుకున్నాడు. అక్టోబర్ 16వ తేదీన కొత్త రకం కీటకం కనిపించడంతో అది ఖచ్చితంగా దోమ అని భావించి వాటిని వెంటనే కీటక నిపుణుడు మ్యాథియస్కు పంపించారు. విషయం తెల్సి ఆశ్చర్యానికి గురైన ఆయన వెంటనే బిజోర్న్ ఇంటికి చేరుకుని అక్కడ దోమల జాడను గుర్తించారు. కొన్నింటిని తీసుకెళ్లి అధ్యయనం చేసి వాటిని క్యూలిసెటా యాన్వలాలా రకం దోమలుగా గుర్తించారు. ఆడ, మగ దోమలనూ విస్తరిస్తున్నట్లు నిర్ధారించారు. ఈసారి ఐస్ల్యాండ్లో వసంతకాలంలో విపరీతంగా ఎండ కాయడంతో దోమల సంతతి పెరిగిందని ఆయన విశ్లేషించారు. -
సోషల్ మీడియా..వాడకం తగ్గిందయా!
సాక్షి, స్పెషల్ డెస్క్: ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్, వాట్సాప్.. ఈ సామాజిక మాధ్యమాలను ఉపయోగించని ఇంటర్నెట్ యూజర్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతలా సోషల్ మీడియా జనంలో చొచ్చుకుపోయింది. సామాజిక మాధ్యమాల్లో విహరించడం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇంటర్నెట్ యూజర్లకు దినచర్యగా మారిపోయింది. ఆన్లైన్ కంటెంట్ వినియోగంలోనూ సమూల మార్పులు వస్తున్నాయి. అయితే ఈ వేదికలను ఉపయోగించే విషయంలో యూజర్లలో ఒకనాటి దూకుడు ప్రస్తుతం లేదని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడుతున్న వారు సుమారు 604 కోట్లు కాగా.. సోషల్ మీడియా (ఎస్ఎం) యూజర్లు 560 కోట్లకు పైగా ఉన్నట్టు అంచనా. అంటే ప్రపంచ జనాభాలో 65 శాతానికిపైగా అన్నమాట. ప్రతిరోజూ 4.10 లక్షల మంది కొత్తగా వీరికి తోడవుతున్నారు. మనదేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నవారి సంఖ్య సుమారు 70 కోట్లని అంచనా. అంతర్జాతీయంగా 2025 నాటికి ఎస్ఎం రోజువారీ వినియోగం స్థిరంగా ఉండగా.. వార్షిక వృద్ధి రేట్లు మాత్రం తగ్గుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల సంఖ్య ఊహించని రీతిలో కొత్త శిఖరాలకు చేరుకోవడంతో మార్కెట్ సంతృప్త స్థాయికి (సాచురేషన్) చేరుకుందని గణాంకాలు సూచిస్తున్నాయి. » భారత్లో సోషల్ మీడియా వాడకం » రోజువారీ సగటు వినియోగం.. 2 గంటల 40 నిమిషాలు» ఆన్లైన్ సమయంలో ఎస్ఎం వాటా 34» యూట్యూబ్ బ్రాడ్కాస్ట్ 2025 నివేదిక ప్రకారం.. మనదేశంలో 18 ఏళ్లకు పైబడినవారు సగటున రోజుకు 72 నిమిషాలు యూట్యూబ్ వీడియోల కోసం వెచ్చిస్తున్నారు. జూన్ 2025 నాటికి దేశంలో యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్న వీక్షకులు 65 కోట్లు. వ్యసనంగా మారిపోయిందిసోషల్ మీడియా వాడకంతో టీనేజర్లలో మానసిక ప్రభావంవ్యసనం 30% మందికిఒంటరితనం 20% మందినిద్ర సమస్యలు 17% మందికిషార్ట్ వీడియోలు, రీల్స్కే!యూజర్ల తీరు, కంటెంట్ ప్రాధాన్యతషార్ట్ వీడియోలు, రీల్స్కు అత్యధిక సమయం వెచ్చిస్తున్నవారు 80%వీడియో కంటెంట్ కోసం ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నవారు 90%అప్డేట్స్ కోసం ఎఫ్బీ వాడుతున్నవారు 17%స్టోరీస్ కోసం ఇన్స్టాగ్రామ్ వినియోగిస్తున్నవారు 7% » యూజర్లు వారానికి సగటున 18 గంటల 36 నిమిషాలు ఎస్ఎంకి కేటాయిస్తున్నట్టు అంచనా. » ముఖ్యంగా 18 ఏళ్లకు పైబడిన ప్రపంచ జనాభాలో 92 శాతానికిపైగా ఎస్ఎం వినియోగిస్తున్నారట. » మొత్తం సోషల్ మీడియా యూజర్లలో పురుషులు 54 శాతానికిపైగా ఉన్నారు. అంటే మహిళలు సగానికంటే తక్కువే ఉన్నారన్నమాట.పెరిగి.. తగ్గింది!ప్రపంచవ్యాప్తంగా ఎస్ఎం వేదికలపై యూజర్లు వెచ్చించిన సగటు సమయం-ఆధారం: గ్లోబల్ వెబ్ ఇండెక్స్, స్టాటిస్టా, డేటా రిపోర్టల్ -
మన మెదడే.. కంప్యూటర్ చిప్!?
కంప్యూటర్ చిప్ల స్థానంలో మానవ మస్తిష్కంలోని కణ సముదాయాలను (మినీ బ్రెయిన్స్) ఉంటే.. మన జీవశక్తితో కంప్యూటర్లు పనిచేయడం మొదలుపెడితే.. అసాధ్యం అనిపిస్తోంది కదూ! కానీ, ఇది సాధ్యం కావచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇదే జరిగితే జీవశక్తితో కంప్యూటర్లు నడుస్తాయి. దీన్నే ‘బయోకంప్యూటింగ్’ లేదా ‘వెట్వేర్’ అంటున్నారు. స్విట్జర్లాండ్, వెవీలోని ‘ఫైనల్స్పార్క్’ స్టార్టప్ ప్రయోగశాల శాస్త్రవేత్తలు.. మినీ బ్రెయిన్స్ సజీవంగా ఉంచటానికి అవసరమైన పోషకాలతో కూడిన ద్రవాన్ని తయారు చేయటంతో ఈ పరిశోధనలో మరొక ముందడుగు పడింది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవమున్న ‘మినీ బ్రెయిన్స్’ను ప్రాథమిక కంప్యూటర్ ప్రాసెసర్లుగా ఉపయోగించటానికి అవి ‘బతికి’ ఉండటం ఎంతో అవసరం. మినీ బ్రెయిన్స్ నిర్జీవం అయిపోతే ల్యాప్టాప్లోని ప్రాసెసర్ల మాదిరిగా వాటిని రీబూట్ చేయలేం. అయితే వీటిని ల్యాబ్లో అనంతంగా పునరుత్పత్తి చేయగల అవకాశం ఉండటం ‘వెట్వేర్’పై పనిచేస్తున్న శాస్త్రవేత్తల్లో ఆశలు రేకెత్తిస్తోంది. వెట్వేర్ను ఎలా సృష్టిస్తారు? అజ్ఞాత మానవ దాతల చర్మం నుంచి మూల కణాలు కొనుగోలు చేసి న్యూరాన్లుగా మారుస్తారు. చర్మ కణాలను మిల్లీ మీటరు వెడల్పులో ‘బ్రెయిన్ ఆర్గానాయిడ్లు’ అనే సమూహాలుగా సేకరిస్తారు. అవి ‘పండు ఈగ’ లార్వా మెదడు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటాయి. ప్రయోగశాలలో ఈ ఆర్గానాయిడ్లకు ఎలక్ట్రోడ్లు (విద్యుత్ వాహకాలు) జత చేస్తారు. ఇవి ఆర్గనాయిడ్ల పనితీరును అధ్యయనం చేస్తాయి. ఆర్గనాయిడ్లను కొద్దిపాటి విద్యుత్తుతో ప్రేరేపిస్తారు. అవి స్పందిస్తే సంప్రదాయ కంప్యూటింగ్ విధానమైన ‘1’,గానూ, స్పందించకపోతే ‘0’గానూ గుర్తిస్తారు. అంటే కంప్యూటర్లకు జీవం వచి్చనట్లే! ‘ఫైనల్ స్పార్క్’ చెబుతున్న ప్రకారం ఆర్గానాయిడ్లు ఆరు నెలల వరకు జీవిస్తాయి. ‘ఏఐ’కి ఏనుగు బలం! చాట్జీపీటీ వంటి భారీ ఏఐ ఇంజిన్లను నడిపిస్తున్న సూపర్ కంప్యూటర్లు.. మానవ మెదడులోని కణాలను, నాడీ వ్యవస్థను పోలిన సిలికాన్ సెమీ కండక్టర్లను ఉపయోగించటం తెలిసిందే. అయితే మెదడు కణాలను లేదా ‘మినీ బ్రెయిన్స్’ను ఉపయోగించి తయారు చేసే ప్రాసెసర్లు ఏదో ఒక రోజు, ప్రస్తుతం కృత్రిమ మేధ విజృంభణకు శక్తిని ఇస్తున్న చిప్ల స్థానాన్ని ఆక్రమిస్తాయని ఫైనల్స్పార్క్ ల్యాబ్ సహ–వ్యవస్థాపకులు ఫ్రెడ్ జోర్డాన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. ఏఐ వల్ల పర్యావరణ కాలుష్యమూ తగ్గిపోతుంది. ‘వెట్వేర్’ సాధ్యమేనా! ఆర్గానాయిడ్లతో ప్రాసెసర్ను సృష్టించటం అసంభవమని కొందరు శాస్త్రవేత్తలు వాది స్తున్నారు. ‘మానవ మెదడులోని 10,000 కోట్ల న్యూరాన్లతో పోలిస్తే ఆర్గానాయిడ్లో ఉండేవి పది వేల న్యూరాన్లే. పైగా వీటిల్లో ‘నొప్పి గ్రాహకాలు’ ఉండవు. అలాగే మాన వ మెదడు.. ‘స్పృహ’ను ఎలా కలిగిస్తోందనే విషయం, ఇంకా మెదడు పనితీరుకు సంబంధించిన అనేక అంశాలు నేటికీ మిస్టరీగానే ఉన్నాయి’ అనేది వారి వాదన.ప్రపంచ వ్యాప్తంగా.. ఫైనల్స్పార్క్ సృష్టించిన ఆర్గానాయిడ్స్తో ప్రపంచ వ్యాప్తంగా 10 వర్సిటీలు పరిశోధనలు చేస్తున్నాయి. ఇంగ్లండ్లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్లోని పరిశోధకులు.. ఒక ఆర్గానాయిడ్ను రోబో మెదడుగా ఉపయోగించి బ్రెయిలీ అక్షరాల మధ్య తేడాను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆటిజం, అల్జీమర్స్ వంటి సమస్యలతో బాధపడేవారి మెదడు పనితీరును తెలుసుకునేందుకు, తద్వారా వాటికి కొత్త ట్రీట్మెంట్లు కనుక్కునేందుకు ఫైనల్స్పార్క్ ఆర్గానాయిడ్స్నే ఉపయోగించారు.హార్డ్వేర్కంప్యూటర్లలో: లోహ భాగాలు, చిప్స్ మానవులలో: మెదడు కణాలు, నాడీ వ్యవస్థసాఫ్ట్వేర్ కంప్యూటర్లలో : ప్రోగ్రామ్లు, యాప్లు మానవులలో: ఆలోచనలు,జ్ఞాపకాలు, అభ్యాసంవెట్వేర్ కంప్యూటర్లలో : ఇంకా తయారు కాలేదు. మానవులలో : సేంద్రియ, జీవమున్నహార్డ్వేర్వెట్వేర్ ప్రయోజనాలు రోగ నిర్ధారణ : శరీరంలో నిర్దిష్ట రకాల కణాల గుర్తింపు. ప్రోస్థెటిక్స్: కృత్రిమ అవయవాల సృష్టిలో తోడ్పాటు డేటా నిల్వ: డీఎన్ఏ దీర్ఘకాలిక డేటా నిల్వకు స్థిరమైన ఏర్పాటు. హైబ్రిడ్ బయో ఎలక్ట్రానిక్ పరికరాలు: ఎలక్ట్రానిక్ హార్డ్వేర్తో కలపటం ద్వారా కొత్త బయో పరికరాల సృష్టి -
ఐదింట నాలుగు యూపీఐ!
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ రూపురేఖలను యూపీఐ అని పిలిచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మార్చేసింది. జాతి, మతం, కులం, ప్రాంతంతో సంబంధం లేకుండా యూపీఐ విస్తరించింది. 2022 జనవరి నాటికి యునిక్ యూపీఐ వినియోగదారుల సంఖ్య కేవలం 26.9 కోట్లు. ఈ ఆగస్టు నాటికి ఈ సంఖ్య 50.4 కోట్లకి చేరింది. రిజర్వు బ్యాంకు గణాంకాల ప్రకారం.. 2022–23లో రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 74 శాతం కాగా.. 2024–25 నాటికి ఏకంగా 84 శాతానికి పెరిగింది. – సాక్షి, స్పెషల్ డెస్క్దేశంలో సెప్టెంబరులో 1963 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.24.90 లక్షల కోట్లు. 2024 సెప్టెంబరులో లావాదేవీల సంఖ్య 1504 కోట్లు కాగా, వాటి విలువ రూ.20.63 లక్షల కోట్లు. యూపీఐ లావాదేవీలు ఏ స్థాయిలో పెరిగాయో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐదే అగ్రస్థానం. రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో ప్రతి ఐదింటిలో నాలుగు యూపీఐవేనంటే అది ప్రజలకు ఎంత సౌకర్యవంతంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.‘కానీ’–అమెజాన్పే సర్వేమేనేజ్మెంట్ కన్సల్టింగ్ సంస్థ ‘కానీ’, అమెజాన్ పే కలిసి సంయుక్తంగా దేశంలోని 120 పట్టణాల్లో.. డిజిటల్ చెల్లింపులపై అధ్యయనం చేశాయి. మొత్తం 6,000 మందిని సర్వే చేశారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలు సహా చిన్నచిన్న పట్టణాలు కూడా ఇందులో ఉన్నాయి. ఆన్లైన్ కొనుగోళ్లలో యూపీఐది సింహభాగం కాగా.. ఆఫ్లైన్లో మాత్రం ఇప్పటికీ నగదుదే అగ్రస్థానం.రికార్డు స్థాయిలో..2022–23 నుంచి 2024–25 మధ్య రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు జరిగాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో.. రాష్ట్ర జీడీపీలో సుమారు 8 శాతం విలువైన యూపీఐ లావాదేవీలు జరగడం విశేషం. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. టాప్ రాష్ట్రాలు..‘ఆన్లైన్’ బాటలో...మొత్తం సర్వే చేసిన వారిలో 90% మంది.. ఆన్లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులనే ఎంచుకుంటున్నట్టు తెలిపారు. ఆఫ్లైన్ కొనుగోళ్లలోనూ (దుకాణాల వంటి చోట్లకు వెళ్లి చేసేవాటిలోనూ).. 56% మంది డిజిటల్ చెల్లింపులే చేశారట. కరెంటు, గ్యాస్ బిల్లు వంటి (యుటిలిటీ) ముఖ్యమైన చెల్లింపులు కూడా 87% మంది డిజిటల్లోనే చేస్తున్నట్టు తెలిపారు. డిజిటల్ వాలెట్ల వాడకమూ పెరిగింది. యుటిలిటీ, సబ్స్క్రిప్షన్ల కోసం డిజిటల్ వాలెట్లు వాడుతున్నట్టు 13% మంది చెప్పారు.మహిళలూ ముందంజలో..పురుషులతో పోలిస్తే స్త్రీలే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులకు ఇష్టపడుతుండటం గమనార్హం. ఆన్లైన్ కొనుగోళ్ల విషయంలో 88 శాతం మగవాళ్లు డిజిటల్ చెల్లింపులు చేస్తున్నామంటే.. ఇలా చేస్తామన్న మహిళలు 89 శాతం కావడం విశేషం. మెట్రో నగరాల్లో ఇలాంటి మహిళల శాతం 63 శాతం కాగా, చిన్న పట్టణాల్లో ఇది 47 శాతం.ఎందుకు ‘డిజిటల్’ వైపు?ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఇష్టపడటానికి రెండు ప్రధాన కారణాలు చెప్పారు. అన్ని చోట్లా వాటిని అంగీకరిస్తున్నందున చేస్తున్నామని 57 శాతం, సౌకర్యవంతంగా ఉండటం వల్ల వాటిని వదల్లేకపోతున్నామని 61% మంది చెప్పారు.టాప్ –4 విభాగాలుఎన్పీసీఐ గణాంకాల ప్రకారం.. 2022–23 నుంచి 2024–25 మధ్య యూపీఐ లావాదేవీలు అత్యధికంగా జరిగిన టాప్ విభాగాలు..⇒ కిరాణా, సూపర్ మార్కెట్లు⇒ ఫాస్ట్ఫుడ్ రెస్టారెంట్లు⇒ ఈటింగ్ ప్లేసెస్, రెస్టారెంట్లు⇒ టెలికమ్యూనికేషన్ సేవలు -
సెకండ్ హ్యాండ్ ఐనా.. ఐఫోనే!
సాక్షి, స్పెషల్ డెస్క్ : ఐఫోన్.. ఇది చాలామందికి స్టేటస్ సింబల్. బ్రాండ్ న్యూ ఫోన్కే కాదు.. పాతదైనా సరే ఐఫోన్కు ఏమ్రాతం క్రేజ్ తగ్గలేదు. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఐఫోన్ హవా నడుస్తోంది. అమ్మకాల సంఖ్య పరంగా సామ్సంగ్ మనదేశంలో నెంబర్వన్గా ఉన్నప్పటికీ.. వృద్ధి రేటులో మాత్రం ఆపిల్ నంబర్వన్గా నిలిచింది. మనదేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్లో సామ్సంగ్, యాపిల్ తరవాత వన్ ప్లస్, షియోమి వంటివి ఉన్నాయి.యాపిల్ తయారీ ఐఫోన్–16 విడుదలై, అందుబాటులోకి వచ్చిన తొలి 10 రోజుల్లో అమ్మకాలతో పోలిస్తే.. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్–17 మోడల్ విక్రయాలు చైనా, యూఎస్లో 14% అధికంగా నమోదయ్యాయి. భారత్లోనూ పరిస్థితి దాదాపు ఇలాగే ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. కేవలం కొత్త ఐఫోన్లకే గిరాకీ ఉందనుకుంటే పొరపాటే.. మార్కెట్ను బట్టి ప్రపంచవ్యాప్తంగా పాత ఐఫోన్ల కోసమూ కస్టమర్లు ఎగబడుతున్నారు. భారత్లో చేతులు మారుతున్న (సెకండ్ హ్యాండ్) పాత ఫోన్లలో అయిదింట మూడు ఐఫోన్లేనని రీసేల్ ప్లాట్ఫామ్ ‘క్యాషిఫై’ చెబుతోంది. ప్రీమియం మోడళ్ల పట్ల పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. ఆ సంస్థ సర్వే ప్రకారం కొనుగోలుదారుల్లో దాదాపు మూడోవంతు మంది.. రూ.21,000 నుంచి రూ.35,000 వరకు సెకెండ్ హ్యాండ్ ఫోన్ల కోసం వెచ్చిస్తున్నారంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.పెరుగుతున్నఆకాంక్షఇప్పటికే మొబైల్ ఫోన్ల విస్తృతి పెరగడం, కస్టమర్లు ఎక్కువ కాలంపాటు మొబైల్స్ వినియోగిస్తున్న కారణంగా యూరప్, యూఎస్ఏ, జపాన్ వంటి మార్కెట్లలో 2025 జనవరి–జూన్ మధ్య ప్రీ–ఓన్డ్ స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో పెరుగుదల నమోదైంది. ఆఫ్రికా, భారత్, ఆగ్నేయాసియా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలోనూ అమ్మకాలు పెరగడం విశేషం. ప్రీమియం మోడళ్ల వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండడం ప్రీ–ఓన్డ్ అమ్మకాలకు కారణమవుతోంది. ప్రజల్లో అత్యధికులకు యాపిల్ ఫోన్లను కలిగి ఉండాలన్న ఆకాంక్ష పెరుగుతోంది. కానీ తలసరి ఆదాయం ఆ స్థాయిలో లేదు. అందుకే కొత్త ఫోన్ కొనలేకపోయినా.. కనీసం సెకండ్ హ్యాండ్ ఫోన్ అయినా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.భారత్లో 5 శాతంజనవరి–జూన్ కాలంలో 2024తో పోలిస్తే 2025లో పాత స్మార్ట్ ఫోన్ల మార్కెట్ ఆఫ్రికాలో 6 శాతం, భారత్, ఆగ్నేయాసియా దేశాల్లో చెరి 5 శాతం దూసుకెళ్లింది. యూఎస్ఏ, చైనా, లాటిన్ అమెరికా, జపాన్ దేశాలు చెరి 3 శాతం, యూరప్లలో ఒక శాతం వృద్ధి నమోదైందని మార్కెట్ పరిశోధన సంస్థ ‘కౌంటర్పాయింట్’ వెల్లడించింది. అయితే అన్ని మార్కెట్లలోనూ రీఫర్బిష్డ్ విభాగంలో యాపిల్ ఐఫోన్ల హవా నడుస్తుండడం విశేషం. 19 శాతం పెరిగి..భారత్లో రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తొలి స్థానంలో ఉన్న సామ్సంగ్ విక్రయాలుఈ ఏడాది జనవరి–జూన్ కాలంలో 1 శాతం తగ్గాయి. గెలాక్సీ ఎస్22, ఎస్21 అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో ఉన్నాయి.ఐఫోన్ 13, 14 సిరీస్ లను వినియోగదారులు ఇష్టపడు తుండటంతో యాపిల్ అమ్మకాలు ఏకంగా 19 శాతం పెరిగి, రెండో స్థానంలో నిలిచిందని కౌంటర్ పాయింట్ వెల్లడించింది.ఐఫోన్ ముచ్చట్లు» ప్రపంచవ్యాప్తంగాఐఫోన్ కస్టమర్లు..156 కోట్లకుపైమాటే» 2024లోఅంతర్జాతీయంగా ఐఫోన్ అమ్మకాలు.. 23 కోట్లకుపైనే» గతఏడాది భారత్లో అమ్ముడైన ఐఫోన్స్.. 1.2 కోట్లు» భారత్లో 2024–25లో కంపెనీ ఆదాయం 13 శాతం వృద్ధితో 900 కోట్ల డాలర్లు» 2025లో వాడేసిన, రిఫర్బిష్డ్ ఫోన్లప్రపంచ మార్కెట్ విలువ 6500 కోట్ల డాలర్లకుపైనేఉంటుందని అంచనా. -
దంతాలు దొరికాయి.. రాకాసి ఏనుగు ఎక్కడో.?
స్టెగొడాన్..ఒకప్పుడు భూమిపై సంచరించిన రాకాసి ఏనుగుల జాతి ఇది. ఇవి దాదాపు ఆరు వేల ఏళ్ల క్రితం అంతరించాయి. నాలుగేళ్ల క్రితం మన రాష్ట్రంలో 8 అడుగుల పొడవైన ఈ ఏనుగు దంతాల శిలాజాలను కనుగొన్నారు. దంతాలు దొరికిన చోట అన్వేషిస్తే ఏనుగు శిలాజం కూడా దొరకవచ్చు కదా అనే ఆసక్తితో పురావస్తు శాఖ తవ్వకాలకు సిద్ధమవుతోంది. స్టెగొడాన్ ఏనుగులు ఇప్పుడున్న ఏనుగులతో పోలిస్తే చాలా పెద్దగా ఉండేవి. దాదాపు 13 అడుగుల ఎత్తు, 13 టన్నులకుపైగా బరువు ఉండే భారీ జీవిలివి. 11 మిలియన్ సంవత్సరాల నుంచి 6 వేల ఏళ్ల క్రితం వరకు భూమిపై ఇవి మనుగడ సాగించాయి. వాతావరణ మార్పుల ప్రభావంతో క్రమంగా అంతరించిపోయాయి. ఆసియా ఖండంలోని కొన్ని ప్రాంతాల్లో చివరకు 6 వేల ఏళ్ల క్రితం జీవించి ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. ప్రస్తుత రామగుండం పరిసర ప్రాంతాలు కూడా ఒకప్పుడు వాటి ఆవాసాలే. ఈ ప్రాంతంలో అవి విస్తారంగా తిరిగినట్టు నాలుగేళ్ల క్రితం జాడలు వెలుగు చూశాయి. అప్పట్లో రామగుండం భూ ఉపరితల గనుల్లో మేడిపల్లి ప్రాంతంలో బొగ్గు తవ్వకాలు జరుపుతుండగా కొన్ని శిలాజాల (ఫాసిల్స్)ను గుర్తించారు. వాటిని నిపుణుల దృష్టికి తీసుకెళ్లగా... అవి స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలుగా తేల్చారు. ఆ ముక్కలు రెండు ఏనుగులకు చెందిన రెండు జతల దంతాలుగా గుర్తించి వాటిని సేకరించారు. వాటిల్లో రెండు దంతాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ సాయంతో అతికించి పూర్తిస్థాయి దంతాల రూపు కల్పించారు. ఆ జాతి ఏనుగుల దంతాలు 12 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. ఇక్కడ గుర్తించిన దంతాల పొడవు దాదాపు 8 అడుగులు ఉంది. ఏనుగు కోసం అన్వేషణ.. జీపీ బిర్లా ఆర్కియోలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయరెడ్డి బృందం సింగరేణి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ రెండు దంతాలను తెచ్చి బిర్లా సైన్స్ సెంటర్లోని డైనోసార్ శిలాజం ఉన్న మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మరో రెండు దంతాల ముక్కలను సింగరేణి అధికారులు హైదరాబాద్లోని జూపార్కుకు అందజేశారు. ఈ విషయం తెలిసి తెలంగాణ వారసత్వ (పురావస్తు శాఖ) శాఖ డైరెక్టర్ అర్జునరావు కొద్ది రోజుల క్రితం సింగరేణి సీఎండీ బలరామ్ను కలిసి వాటిని తమకే అప్పగించాలని కోరారు. ఆ ప్రాంతంలో తాము శిలాజాలను అన్వేషించేందుకు సహకరించాలని కోరగా, బలరామ్ అంగీకరించారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్లోని యామనపల్లి ప్రాంతంలో డైనోసార్ శిలాజాలు లభించాయి. మరిన్నిశిలాజాలను సేకరిస్తాంకొత్తగా బిర్లా సైన్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలను సగటున రోజుకు మూడున్నర వేల మంది వీక్షిస్తున్నారు. వీటికి మంచిఆదరణ వస్తోంది. దీంతో మరిన్ని శిలాజాలను సేకరించి ప్రదర్శనకుఉంచాలని నిర్ణయించాం. సింగరేణి సంస్థతోసంప్రదింపులుజరుపుతున్నాం. ఇతరుల వద్ద శిలాజాలు ఉన్నాసేకరించి ప్రదర్శనకుఉంచుతాం. -డా.మృత్యుంజయరెడ్డిజీపీ బిర్లా ఆర్కియోలాజికల్ ఆస్ట్రోనామికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్.శిలాజాలను గుర్తించి జనం ముందుకు తెస్తాం వేలు, లక్షల ఏళ్ల నాడు అంతరించిన జంతువులు భూగర్భంలో శిలాజాలుగా మారి అనవాళ్లుగా ఉన్నాయి. వాటిని వెలికి తీసి ప్రజల ముందుకు తేవాలన్నది మా ప్రయత్నం. గతంలో సింగరేణి సంస్థకు స్టెగొడాన్ జాతి ఏనుగు దంతాలు లభించిన చోట అన్వేషిస్తే ఆ ఏనుగుల అవశేష శిలాజాలు దొరికే వీలుంది. వాటితోపాటు ఇతర అరుదైన జీవజాతుల శిలాజాలను కూడా వెలుగులోకి తెస్తాం. మరో రెండు రోజుల్లో మా ఇద్దరు అధికారులు రామగుండంలోని మేడిపల్లికి వెళ్లి సింగరేణి నిపుణులతో కలిసి రూట్మ్యాప్ సిద్ధం చేస్తారు. ఆ తర్వాత తవ్వకాలు జరిపి అన్వేషిస్తాం. -అర్జునరావు తెలంగాణ వారసత్వ శాఖ డైరెక్టర్శిలాజాలు విస్తారంగా దొరుకుతున్నాయిఉమ్మడి ఆదిలాబాద్లో విస్తారంగా జీవజాతుల శిలాజాలు వెలుగుచూస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం మేంగుర్తించిన స్టెగొడాన్ జాతి ఏనుగుదంత శిలాజాలను బీఎం బిర్లా సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. మాకు లభించే శిలాజాలను జనంఎక్కువ మంది చూడగలిగే చోటఉంచేందుకు అందజేస్తాం. త్వరలోకొన్ని శిలాజాలను అటు పురావస్తు శాఖకు, బిర్లా సైన్స్ సెంటర్కుఇవ్వనున్నాం. -శ్రీనివాసరావు సింగరేణి ఎక్స్ప్లోరేషన్ జీఎం-సాక్షి, హైదరాబాద్ -
షోలే జైలర్
50 ఏళ్ల పాటు వెండితెరపై నవ్వులు పూయించిన ప్రసిద్ధ హాస్యనటుడు అస్రానీ (Asrani) దీపావళి రోజున తారాజువ్వలా ఎగిసి తారల్లో కలిసిపోయారు. ‘గుడ్డీ’, ‘బావర్చీ’, ‘అభిమాన్ ’, ‘ఛోటీసీ బాత్’, ‘చుప్కే చుప్కే’... ఇలా అనేక సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులకు ప్రియమైనవి. ఇక ‘షోలే’లో వేసిన బ్రిటిష్ జమానేకే జైలర్ పాత్ర కోట్ల మందిని అలరిస్తూనే ఉంది. అస్రానీపై నివాళి కథనం.అస్రానీ జైపూర్లో పుట్టాడు. హిట్లర్ జర్మనీలో పుట్టాడు. ఇద్దరికీ లంకె ఉంది. ఒకసారి అస్రానీకి రచయిత జావేద్ అఖ్తర్ నుంచి పిలుపు వచ్చింది. ‘మంచి రోల్ ఉంది. చేయాలి. దానికి ముందు ఈ ఫొటోలు చూడు’ అని ఫొటోలు చూపించాడాయన.ఆ ఫొటోలు హిట్లర్వి. ఆ తర్వాత హిట్లర్ ఉపన్యాసాలు ఎక్కడి నుంచో తెప్పించి ‘వాటిని విను’ అని ఇచ్చాడు. అస్రానీ హిట్లర్ ఉపన్యాసాలు విన్నాడు. ‘ఈ ఉపన్యాసాలతో హిట్లర్ నరరూప రాక్షసుడు కాగలిగాడు. నువ్వు నవ్వుల రాజు కావాలి. హిట్లర్లా కనిపించి, తెలివైన మూర్ఖుడిలా వ్యహరిస్తూ కామెడీ పండించాలి. చేస్తావా’ అన్నాడు జావేద్ అఖ్తర్. ‘చేస్తాను’ అన్నారు అస్రానీ.ఆ వేషం జైలర్. ఆ సినిమా ‘షోలే’. ‘హమ్ బ్రిటిష్ జమానేకే జైలర్ హై’ (నేను బ్రిటిష్ కాలం నాటి జైలర్ను )... అనే ఈ డైలాగ్ 1975లో సినిమా రిలీజ్ అయితే 2025 వరకూ అస్రానీని బతికిస్తూనే ఉంది. ఆ రోల్ అంత హిట్. హిట్లర్లా కనిపిస్తూ, నిరంకుశుడైన జైలర్గా ఖైదీలను బెదిరిస్తూ, తానే పిరికిగా వణికిపోయే పాత్రలో అస్రానీ అద్భుతంగా జనానికి గుర్తుండిపోయాడు. నియంతలు పైకి భయానకంగా కనిపించే పిరికివారు.అస్రానీ ఆ పిరికితనాన్ని, మేకపోతు గాంభీర్యాన్ని అద్భుతంగా పలికించగలిగాడు. జైలులో ఇతను ప్రతిదీ అనుమానించడం, దానికి విరుగుడుగా ధర్మేంద్ర, అమితాబ్ ఇతణ్ణి ఆటపట్టించడం, ఇతనికి గూఢచారిగా పని చేసే బార్బర్ కెస్టో ముఖర్జీ... ‘మైనే కహా అటెన్షన్’, ‘ఆధే ఉధర్ జావో.. ఆధే ఇధర్ జావో’.. అని అస్రానీ చెప్పే డైలాగులు సినిమాలో రిలీఫ్ ఇస్తూ జనాన్ని భారీగా ఎంటర్టైన్ చేశాయి. అస్రానీ డైలాగులు క్యాసెట్లుగా, రికార్డులుగా కూడా హిట్ అయ్యాయి.⇒ అస్రానీ అసలు పేరు గోవర్థన్ అస్రానీ (Govardhan Asrani). వాళ్లు సింధీలు. స్వస్థలం కరాచీ అయినా దేశవిభజన సమయంలో తండ్రి జైపూర్కు వచ్చి కార్పెట్ల కార్ఖానాలో పని చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అస్రానీ అక్కడే పుట్టి పెరిగాడు. కాని చదువు అబ్బలేదు. సినిమాల మీద ధ్యాస ఉండేది. ఆ పిచ్చితో మెట్రిక్ తర్వాత చదువు మానేసి జైపూర్ ఆల్ ఇండియా రేడియోలో తాత్కాలికంగా పని చేయడం మొదలుపెట్టాడు. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మొదటి బ్యాచ్ విద్యార్థిగా 1964–66 మధ్య నటన నేర్చుకున్నాడు. ఆ సర్టిఫికెట్ పట్టుకుని ముంబై చేరి వేషాలు అడిగితే ‘సర్టిఫికెట్ చూపితే వేషాలు వస్తాయా’ అని అందరూ నవ్వేవారు.బతుకు చాలా కష్టమైంది అస్రానీకి. కొన్నాళ్లు జైపూర్ వెళ్లిపోయాడు. కొన్నాళ్లు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చదువుకున్నాడో ఆ ఇన్స్టిట్యూట్లోనే పార్ట్టైమ్ టీచర్గా పని చేశాడు. అతని కింద జయభాదురి, శతృఘ్నసిన్హా, నవీన్ నిశ్చల్, డానీ... వీరంతా పాఠాలు నేర్చుకున్నవారే. ‘గుడ్డీ’ సినిమాలో హీరోయిన్ వేషానికి జయభాదురిని సెలెక్ట్ చేసేందుకు పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కు వచ్చిన హృషికేశ్ ముఖర్జీని అస్రానీ గట్టిగా పట్టుకున్నాడు. అలా ‘గుడ్డీ’లో వేషం దొరికింది. రిలీజయ్యాక అస్రానీ దశ తిరిగింది.⇒ 1970లు వచ్చేసరికి సీనియర్ కమెడియన్లు జానీ వాకర్, మహమూద్ మెల్లగా రిటైర్మెంట్కు చేరుకుంటున్నారు. కొత్త కమెడియన్లు కావాలి. ఆ సమయంలో అస్రానీ అందుకున్నాడు. అయితే వెకిలి హాస్యం, స్లాప్స్టిక్ కామెడీ చేయలేదు. తన గొంతు, ఎక్స్ప్రెషన్తోనే హాస్యం పండించగలిగాడు. హృషికేశ్ సినిమాల్లో అస్రానీ వేషాలు గట్టిగా పండాయి. ‘అభిమాన్’లో అమితాబ్ సెక్రట్రీగా పని చేస్తాడు అస్రానీ. ఒక దశలో గాయకుడైన అమితాబ్కు చాలా డబ్బు వచ్చేసరికి లెక్క చెబుతున్న అస్రానీకి ఒక కట్ట డబ్బు ఇచ్చి ‘నువ్వు ఉంచుకో’ అంటాడు అమితాబ్. అస్రానీకి ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ‘అభిమానంతో నీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. బిచ్చగాణ్ణి కాను’ అంటాడు. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ సన్నివేశం.‘చుప్కేచుప్కే’లో ధర్మంద్ర ఫ్రెండ్గా నటిస్తాడు అస్రానీ. తన బావగారిని ఆటపట్టించడానికి డ్రైవర్ వేషంలో వచ్చిన ధర్మేంద్రకు తనూ తోడు నిలిచి అల్లరి సృష్టిస్తాడు. చుప్కేచుప్కే సినిమాలో అస్రానీ పాత్రకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. బాసూ చటర్జీ తీసిన ‘ఛోటిసీ బాత్’ లో అస్రానీ పాత్ర అందరికీ గుర్తే. తన చొరవతో, తెలివితో హీరోయిన్ విద్యా సిన్హాను ఎగరేసుకుపోదామనుకుంటాడు. కాని అమాయకమైన హృదయమున్న అమోల్ పాలేకర్ వైపే విద్య మొగ్గుతుంది. ఆమె లాంటి యువతిని పొందాలంటే తనలో రావలసిన మార్పు పొందేందుకు ట్రయినింగ్ కోసం అశోక్ కుమార్ దగ్గరకు అస్రానీ బయలుదేరడంతో ఆ సినిమా గిలిగింతలు పెడుతూ ముగుస్తుంది.⇒ అస్రానీ నటుడే కాదు రచయిత, దర్శకుడు కూడా. గుజరాతీలో, హిందీలో ఆయన అరడజనుకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఎప్పుడూ తనను తాను లైమ్లైట్లో ఉంచుకుంటూ నటిస్తూ వెళ్లాడాయన. కాంట్రవర్శీలకు దూరంగా ఉన్నాడు. మరణించే వరకూ నటించాలని కోరుకుని అలాగే వీడ్కోలు తీసుకున్నాడు. పెద్ద పెద్ద హీరోలకు స్నేహితుడిగా మసలిన అస్రానీ జనాన్ని 50 ఏళ్ల పాటు వారి నిత్య గొడవల నుంచి తప్పిస్తూ నవ్విస్తూ వచ్చాడు.ఇలాంటి నటుడు చనిపోతే పోయినందుకు బాధ పడాలో ఆ హాస్య సన్నివేశాలు గుర్తుకు తెచ్చుకోవాలో తెలియని సందిగ్ధత ప్రేక్షకులది. హాస్యనటులకు మాత్రమే సాధ్యమైన ఇరకాటం ఇది.నిజమైన వికట నటులకు ఇదే కలికితురాయి.తెలుగు అనుబంధంఅస్రానీ 1980–90ల మధ్య కొంత స్ట్రగుల్ అయ్యాడు. యాక్షన్ సినిమాల రోజుల్లో అలాంటి నటులకు తగిన పాత్రలు దొరకలేదు. ఆ సమయంలోనే మన దాసరి, రాఘవేంద్రరావు, తాతినేని రామారావుల సినిమాల్లో నటించా డాయన. మహేశ్బాబు హీరోగా తొలి సినిమా ‘రాజకుమారుడు’లో బ్రహ్మానందంతో పాటు కనిపిస్తాడు. ‘సిరిసిరిమువ్వ’ హిందీ రీమేక్ ‘సర్గమ్’లో, ‘మరో చరిత్ర’ రీమేక్ ‘ఏక్ దూజే కే లియే’లో, ‘ఊరికి మొనగాడు’ రీమేక్ ‘హిమ్మత్వాలా’లో ఇంకా చాలా సినిమాల్లో నటించాడు. అల్లు రామలింగయ్యకు అచ్చొచ్చిన చిత్రగుప్తుడి వేషాన్ని ‘యమలీల’ రీమేక్ ‘తక్దీర్వాలా’ లో ఆయన పోషించాడు. యముడిగా ఖాదర్ ఖాన్ నటించాడు. ఆ తర్వాత ప్రియదర్శన్ కామెడీలు హిందీలో మొదలయ్యాక అస్రానీ మరోమారు విజృభించారు. ‘అచ్ఛా హువా మై అంధా హూ’ అని ఆయన చెప్పే డైలాగ్ మీమ్స్లో కనిపిస్తూనే ఉంటుంది. -
మోనాలిసాతో మొదలై.. ప్రపంచంలోనే భారీ చోరీ ఏదో తెలుసా?
మిస్టరీతో కూడిన చిరునవ్వు మోనాలిసా.. లియోనార్డో డా విన్సీ చిత్రించిన 16వ శతాబ్దం నాటి అపురూపమైన పెయింటింగ్. అలాంటి దానిని వందల మంది కాపాలా కాసే చోటు నుంచి దానిని దొంగలించడం సాధ్యమేనా?.. తాజాగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన లూవ్ర్ మ్యూజియంలో జరిగిన చోరీని చూస్తే.. ‘అదేం పెద్ద విషయం కాకపోవచ్చు’ అనే సందేశాన్ని ఇస్తోంది.లూవ్ర్ మ్యూజియం.. 12వ శతాబ్దంలో ఇదొక కోట. తర్వాతి కాలంలో.. ఫ్రాన్స్ రాజులు దీనిని రాజభవనంగా మార్చేశారు. అయితే.. లూయీ XIV తన రాజభవనాన్ని వెర్సైల్లెస్కు మార్చారు. అప్పటి నుంచి కళాత్మక ప్రదర్శనలు ఉంచే చోటుగా మారిపోయింది. 1793లో ఫ్రెంచ్ విప్లవం అనంతరం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. Musée du Louvre అనే పేరుతో 18వ శతాబ్దం నుంచి దీనికి అధికారిక మ్యూజియం గుర్తింపు దక్కింది. ప్రస్తుతం Louvre museum ప్రపంచంలోనే అతిపెద్ద, సుప్రసిద్ధ కళా మ్యూజియం. మెసపటోమియా, ఈజిప్టు.. అనేక నాగరికతలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ కనిపిస్తాయి. గ్రీకు, రోమన్, ఫ్రెంచ్ రాజ్యాలకు చెందిన ప్రతీకలు ఇక్కడ కొలువు దీరాయి. మోనాలిసా, వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్ వంటి కళాఖండాలు లూవ్ర్కు ప్రత్యేక ఆకర్షణ. గాజు పిరమిడ్ షేపులో ఉండే మ్యూజియం ఎంట్రెన్స్ అదనపు ఆకర్షణ. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఏఐ పై డిజైన్ చేసిన ఈ ద్వారం 1989లో నిర్మించబడింది. పారిస్ నగరానికి ఆధునికతను చేర్చే చిహ్నంగా.. పిరమిడ్ 21.6 మీటర్ల ఎత్తు, 673 గాజు పలకలతో రూపొందించారు. అరోజుకు సగటున 30,000 మంది సందర్శకులు.. ఏటా దాదాపు కోటి మంది దీనిని సందర్శిస్తుంటారు. అందుకే భద్రతా కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ.. 2025 అక్టోబర్ 19న లూవ్ర్ మ్యూజియంలో భారీ దోపిడీ జరిగింది. ఫ్రెంచ్ క్రౌన్ జ్యువెల్స్ విభాగం అపోలో గ్యాలరీలో నెపోలియన్ చక్రవర్తి కాలంనాటి విలువైన ఆభరణాలను నలుగురు దుండగులు దొంగలించారు. మోటార్ స్కూటర్లపై వచ్చిన దొంగలు.. నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో మ్యూజియం లోపలికి వెనకభాగం నుంచి చొరబడి(సీన్ నది వైపు).. సరుకు రవాణా ఎలివేటర్ ద్వారా గ్యాలరీలోకి ప్రవేశించారు. కట్టర్లు ఉపయోగించి రెండు డిస్ప్లే కేసులను ధ్వంసం చేశారు. అద్దాలను పగలగొట్టి తొమ్మిది విలువైన వస్తువులను అపహరించారు. కేవలం నాలుగు నుంచి ఏడు నిమిషాల వ్యవధిలోనే ఈ హైప్రొఫైల్ చోరీ జరిగింది. 🇫🇷 - BFMTV shares the first video of the criminal who is in the process of stealing the Napolean Era jewels in the Louvre museum. https://t.co/u0aXSP6yUv pic.twitter.com/DEuYEq39R7— EuroWatcher - News for you (@EuroWatcherEUW) October 20, 2025ఫ్రాన్స్ కల్చర్ మినిస్టర్ రాచిడా దాతి ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. చోరీకి గురైన 9 వస్తువుల్లో నెపోలియన్ చక్రవర్తికి చెందిన తలపాగా.. ముత్యాల హారంతో పాటు ఫ్రాన్స్ చివరి మహారాణి యూజెనీ(నెపోలియన్-3 సతీమణి) ముత్యాల హారం కూడా ఉందని ప్రకటించారామె. అయితే.. తొమ్మిది నగల్లో.. ఒకటి అక్కడే పడిపోయిందని, దానిని తిరిగి భద్రపరిచినట్లు చెప్పారు. వీటి విలువ వెలకట్టలేనిదని తెలుస్తోంది. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. చోరీ నేపథ్యంలో మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశారు. అలాగని వరల్డ్ ఫేమస్ అయిన లూవ్ర్ చరిత్రలో ఇదే మొదటి దోపిడేం కాదు. 1911లో సుప్రిసిద్ధ మోనా లిసా చిత్రాన్ని మ్యూజియంలో పని చేసిన విన్సెంజో పెరుగ్గియా అనే ఇటాలియన్ కార్మికుడు దొంగలించాడు. అతని అరెస్ట్తో రెండు సంవత్సరాల తర్వాత అది తిరిగి లభించింది. 1976లో గుస్తావ్ కుర్బెట్ ‘ది వేవ్’ చోరీకి గురైనా.. ఇప్పటికీ దొరకలేదు. 1983లో రెండు పురాతన కవచాలను దొంగలించగా.. 40 ఏళ్ల తర్వాత తర్వాత అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. చివరగా.. 1998లో Le Chemin de Sèvres అనే పెయింటింగ్ చోరికి గురై ఆ ఆచూకీ ఇప్పటిదాకా లభ్యం కాలేదు. లె చెమిన్ చోరీ తర్వాత లూవ్ర్ మ్యూజియంలో భద్రతను భారీగా పెంచారు. అయినా కూడా ఇలా జరగడం తీవ్ర చర్చనీయాంగా మారింది. అక్కడ చోరీ జరిగితే అది అసలు దొరకదని, దొరికినా అసంపూర్తిగా ఉంటుందనే మచ్చ ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో తాజా చోరీ కేసులో అయినా పురోగతి ఉంటుందేమో చూడాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన చోరీ ఏదో తెలుసా?.. అమెరికా బోస్టన్ ఇసబెల్లా స్టువర్ట్ గార్డ్నర్ మ్యూజియంలో (Isabella Stewart Gardner Museum Heist) జరిగిన చోరీ.. చరిత్రలోనే అత్యంత విలువైన కళా దొంగతనంగా గుర్తించబడింది. అప్పటి అంచనా ప్రకారం చోరీకి గురైన కళాకృతుల విలువ రూ.500 మిలియన్ డాలర్లు. ఆనాడు ఏం జరిగిందంటే.. 1990 మార్చి 18వ తేదీన ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో మ్యూజియంకు వచ్చారు. డిస్టర్బెన్స్ కాల్ ఉందని చెబుతూ లోపలికి వెళ్లి.. భద్రతా సిబ్బందిని గంటపాటు బంధించి తమ పని కానిచ్చారు. మొత్తం 13 కళా వస్తువులను దొంగిలించగా.. అందులో రెంబ్రాంట్, వెర్మీర్, డెగా.. లాంటి పాపులర్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఎఫ్బీఐ, ఇంటర్పోల్ రంగంలోకి దిగినా.. దొంగల ఆచూకీని కనిపెట్టలేకపోయాయి. ఈ కేసుకు సంబంధించి 10 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ మ్యూజియంలో అవి దొరకకపోతాయా? అనే ఆశతో ఖాళీ ఫ్రేమ్లను వేలాడదీయడం చూడొచ్చు. అలాగే.. అంట్వెర్ప్ డైమండ్ హైస్ట్ (2003, బెల్జియం)లో.. సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన వజ్రాలు, బంగారం దొంగిలించారు. అందుకే దీనిని ఈ శతాబ్దపు భారీ చోరీ "Heist of the Century" అని పిలుస్తారు. హ్యారీ విన్స్టన్ జువెల్ రాబరీ (2008, పారిస్).. 108 మిలియన్ డాలర్ల విలువైన ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఈ చోరీలో దొంగలు మహిళల వేషంలో వచ్చారు. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ హైస్ట్ (2003).. సద్దాం హుస్సేన్ పాలనలో 1 బిలియన్ డాలర్ల నగదు కొట్టేసినట్లు ఒక అంచనా. ఇలా.. లూవ్ర్ చోరీ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత విలువైన దొంగతనాలు ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.ఇదీ చదవండి: స్కాండల్స్తో రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ -
'నాడి' పట్టుకోవాలి
అల్జీమర్స్, స్ట్రోక్, మూర్ఛ.. ఇలాంటి నాడీ సంబంధ సమస్యలు ప్రపంచంలో 40 శాతానికిపైగా జనాభాను కుంగదీస్తున్నాయి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు పెనుభారంగా పరిణమిస్తున్నాయని వెల్లడించింది. సంస్థ చరిత్రలో తొలిసారి ఈ వ్యాధులపై ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ పేరిట నివేదికను విడుదల చేసింది. మొత్తం సభ్య దేశాల్లో కేవలం 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయని, ఇందులో భారత్ కూడాఉందని నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచంలోని మూడో వంతు దేశాల్లో కూడా.. పెరుగుతున్న నాడీ సంబంధ సమస్యలపై ఇప్పటికీ నిర్దిష్ట జాతీయ విధానం అంటూ ఒకటి లేదు. 2021 నాటికి ప్రపంచ జనాభాలో సుమారు 42 శాతం మంది (దాదాపు 340 కోట్లకుపైగా) ప్రజలు నాడీ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారు. వీటివల్ల ఏటా 1.1 కోట్ల మంది మరణిస్తున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ‘గ్లోబల్ స్టేటస్ రిపోర్ట్ ఆన్ న్యూరాలజీ’ వెల్లడించింది.జాతీయ విధానం 32%దేశాల్లోనే..ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఉన్న మొత్తం 194 సభ్య దేశాల్లో 102 మాత్రమే ఈ సర్వేలో పాల్గొన్నాయి. ఈ జాబితాలో భారతదేశం కూడా ఉంది. ప్రపంచ జనాభాలో 71 శాతం ఈ దేశాల్లోనే ఉంది. మొత్తం సభ్య దేశాల్లో 32 శాతం (63 దేశాలు) మాత్రమే.. నాడీ సంబంధ సమస్యల నివారణకు జాతీయ విధానం ప్రకటించాయి. కేవలం 34 దేశాలే.. ఇందుకోసం నిధులు కేటాయించాయట. 49 దేశాలు (25 శాతం) మాత్రమే.. ఆయా దేశాల్లోని సార్వత్రిక ఆరోగ్య పథకాల్లో నాడీ సంబంధ సమస్యలను చేర్చాయి.ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల రాబడినాడీ సంబంధ సమస్యలు.. ముఖ్యంగా మెదడు ఆరోగ్యంపై అన్ని దేశాలూ విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. నాడీ సంబంధ వ్యాధుల నివారణకు చేపట్టే చర్యలు దీర్ఘకాలంలో ఆర్థికంగా ప్రయోజనకరమైనవేనని తెలిపింది. ‘ఉదాహరణకు స్ట్రోక్, హృద్రోగాలపై పెట్టే ఒక డాలర్ ఖర్చు.. 10 డాలర్ల కంటే ఎక్కువ రాబడి ఇస్తుంది. ఇలా ఆలోచిస్తే ఈ సమస్యలన్నింటిపైనా చేసే ఖర్చును వ్యయంలా భావించలేం. అవి భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలను సుసంపన్నం చేసే పెట్టుబడులే’ అని పేర్కొంది.నివేదికలో మనదేశ ప్రస్తావనప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నివేదికలో మనదేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. కర్ణాటక రాష్ట్రం ‘కర్ణాటక బ్రెయిన్ హెల్త్ ఇనీషియేటివ్ (కభీ)’ పేరిట ఆ రాష్ట్రంలో నాడీ సంబంధ రుగ్మతల నివారణకు సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి 2023లో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసింది. ఇందులో భాగంగా 32 క్లినిక్లు ఏర్పాటుచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రోక్, డిమెన్షియా వంటి రుగ్మతలతో బాధపడేవారి వివరాలను డిజిటైజ్ చేసింది. అనేక రూపాల్లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భారత ప్రభుత్వం 2024లో మెదడు ఆరోగ్యంపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసింది.2021లో మరణాలు లేదా అంగ వైకల్యానికి కారణమైన ప్రధాన నాడీ సమస్యలు..స్ట్రోక్, అప్పుడే పుట్టిన పిల్లల్లో మెదడులో సమస్యలు, మైగ్రెయిన్, అల్జీమర్స్, మతిభ్రమణం, డయాబెటిక్ న్యూరోపతి, మెనింజైటిస్ (మెదడు, వెన్నుపాము చుట్టూ ఉండే పొరల వాపు), నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లోని నాడీ సంబంధ సమస్యలు, ఆటిజం సంబంధిత సమస్యలు, నాడీ సంబంధ కేన్సర్లు.2021 గణాంకాల ప్రకారం చూస్తే.. మైగ్రెయిన్, మల్టిపుల్ స్కె›్లరోసిస్ (కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే దీర్ఘకాలిక వ్యాధి) మహిళల్లో ఎక్కువగా ఉంటే.. పార్కిన్సన్స్, స్ట్రోక్ పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 2021లో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య 5.17 కోట్లు. -
ఏఐ వాణిజ్యం ఇంతింతై!
కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తులు.. 2025 మొదటి ఆరు నెలల్లో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించాయని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) తన తాజా నివేదికలో పేర్కొంది. సెమీకండక్టర్లు, ప్రాసెసర్లు, సర్వర్లు, టెలికమ్యూనికేషన్ పరికరాలు.. ఇలా ఏఐలో అభివృద్ధి, ఉత్పత్తికి అవసరమయ్యే పరికరాలకు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరుగుతోంది. మనదేశం నుంచి ఏఐ సంబంధిత ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నా.. ఇప్పటికీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం.2024 మొదటి ఆరు నెలల్లో కృత్రిమ మేధ (ఏఐ) సంబంధిత ఉత్పత్తుల వాణిజ్యం విలువ 1.61 లక్షల కోట్ల డాలర్లు కాగా.. 2025లో ఇదే సమయంలో 1.92 లక్షల కోట్ల డాలర్లకు పెరిగింది. అంటే 20 శాతం వృద్ధి అన్నమాట. మనదేశంలో 2023–24తో పోలిస్తే 2024–25లో ఏఐ సంబంధిత దిగుమతులు 13.1 శాతం పెరిగాయి. వీటి మొత్తం విలువ 66.8 బిలియన్ డాలర్లు.ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అత్యాధునిక కంప్యూటింగ్ హార్డ్వేర్ కోసం మనం ఇప్పటికీ అమెరికాపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. మనదేశ మొత్తం దిగుమతుల్లో.. అమెరికా నుంచి వచ్చే 5 ఉత్పత్తులదే ఏకంగా 50 శాతం వాటా ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశం నుంచి బోర్డులు, ప్యానెళ్లు వంటి వాటి ఎగుమతులు 2023–24తో పోలిస్తే అత్యధికంగా 58.5 శాతం పెరిగాయి.ప్రపంచ దేశాల్లో ఏఐకి సంబంధించి విధానపరమైన చర్యలు చేపట్టిన దేశాలు ఇప్పటికీ తక్కువే ఉన్నాయని డబ్ల్యూటీవో నివేదిక చెబుతోంది. అధిక ఆదాయ దేశాల్లో 68 శాతం దేశాలు ఈ చర్యలు చేపడితే.. ఎగువ మధ్య ఆదాయ దేశాల్లో కేవలం 30 శాతమే ఈ జాబితాలో ఉన్నాయి. -
గోరంత దీపం జగమంత వెలుగు
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తిని పాతాళ లోకానికి అణగ దొక్కి సుతల రాజ్యాధిపతిని చేసినందుకుగాను ఈ అమావాస్యను దీపావళిగా జరుపుకుంటారనీ, శ్రీరామచంద్రుడు రావణాసురుడిని వధించి శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయాదులతో అయోధ్యకేతెంచి, పట్టాభిషిక్తుడైనదీవేళే కనుక ఈ రోజును దీపావళిగా జరుపుకుంటారని, శ్రీ కృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని వధించిన సందర్భంగా ప్రజలు దీపావళి జరుపుకుంటున్నారని, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాలకు సంబంధించిన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇంకా, పంచపాండవులు వనవాస, అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకుని విజయవంతులై తిరిగి వచ్చినందుకు ఆనందంతో ప్రజలు దీపావళి జరుపుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. ఆదిపరాశక్తి శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించినందుకు ఆనందంతో వెలిగించిన జ్యోతులే దీపావళి అని కూడా ప్రచారంలో ఉంది. ఇవేకాక, క్షీరసాగర సమద్భూత అయిన శ్రీ మహాలక్ష్మి శ్రీమన్నారాయణుడిని వరించినందుకు దేవతలు, మానవులు, అందరూ ఆనందోత్సాహాలతో దీపావళిని జరుపుకుంటున్నారు అని కూడా చెప్తారు. భారతీయులందరూ అత్యంత ఆనందోత్సాహాలతో జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దీపావళి. మన మహర్షులు ఏర్పరచిన పండుగలన్నీ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలు కలిగి, ఆచార వ్యవహారాలతో కలిసి ఉంటాయి. ఈ పండుగల వెనుక అపారమైన శాస్త్రీయత, సమాజానికి హితకరమైన అంశాలు అనేకం దాగి ఉంటాయి. కాలంలో వచ్చే మార్పులతోపాటు, ఖగోళంలో వచ్చే మార్పులను కూడా ఆధారంగా చేసుకుని మన మహర్షులు మనకు ప్రతి నెలలోనూ పండుగలను నిర్దేశించారు. అలా మన సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికతకు, మానవతా విలువలకు ప్రతీకగా మారింది దీపావళి పండుగ. నేటి కాలంలో ప్రపంచ దేశాలలో ఎందరో దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. అమెరికాలో వైట్హౌస్లో కూడా దీపావళి నాడు దీపాలు వెలిగిస్తున్నారు. ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలి పాడ్యమి, భగినీ హస్త భోజనం అని, తరువాత నాగుల చవితి, నాగ పంచమి అని – ఇన్ని రోజులు పండుగ చేసుకుంటాము.దీపావళి పండుగనాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానమాచరించి, పితృ తర్పణాలివ్వటం, దానం చెయ్యటం, వత్తులు వేసి, నూనె దీపాలను వెలిగించటం, ఆకాశదీపం పెట్టటం చేస్తాం. ఆకాశదీపం పెట్టడం వల్ల దూర్రపాంతాల వారికి కూడా ఈ దీప దర్శనమవుతుంది. దాని వెలుగు మార్గ దర్శనం చేస్తుంది.మనం ప్రతిరోజు ఉభయ సంధ్యలలోను మన ఇంట్లో దీపం వెలిగిస్తాము. దీపాన్ని, దీపజ్యోతిని ఆరాధిస్తాం. ఏ శుభకార్యాలు చేసినా, ఏ వేడుకలు జరిగేటప్పుడు అయినా ముందుగా దీప ప్రజ్జ్వలన చేసి, అప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము. వివాహాలు కూడా అగ్నిసాక్షిగా చేసుకుంటాం, అంటే దీపం, దీపంలో ఉన్న దేవతలు మన ప్రతి కర్మకు సాక్షిభూతులుగా ఉంటారన్నమాట. వారు మనల్ని అనుగ్రహిస్తారు. కనుక దీపం వెలిగించటం అన్నది అత్యంత ప్రధానమైనదని అందరికీ తెలియజేయటానికి, అందరూ దీపాలు వెలిగించేలా చేయడానికి దీపావళి పండగను మన మహర్షులు ఏర్పాటు చేశారు. దీపం సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపం ఆశ్వయుజ బహుళ అమావాస్యకు ముందు మూడు రోజుల నుంచి ఇంటి ముందు దీపాలు పెట్టటం ప్రారంభిస్తాం. అలా వెలిగించడం ప్రారంభించిన ఈ దీపాలను కార్తీక మాసమంతా వెలిగిస్తాందీపాల కథపూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు దేవతలను, ధర్మాత్ములైన మానవులను హింసిస్తూ, యావద్భూమండలాన్ని క్షోభిల్లజేస్తుంటే, శ్రీమన్నారాయణడు వరాçహావతారంలో వచ్చి హిరణ్యాక్షుడిని సంహరించాడు, భూమాతను రక్షించాడు. ఆ సమయంలో భూదేవి తనకొక కుమారుడిని ప్రసాదించమని స్వామిని ప్రార్థిస్తుంది. వారి సంతానమే నరకాసురుడు. స్వామి రాక్షస సంహారం కోసం అవతరించిన తరుణంలో భూమాతకి కలిగిన పుత్రుడు కనుక, నరకుడు తమోగుణ భరితుడై రాక్షసుడయ్యాడు. అతడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి, మరణం లేకుండా వరం కోరాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యం కాదని అంటే, ‘కన్నతల్లి బిడ్డలను పొరపాటున కూడా చంపదు కదా’ అని ఆలోచించి, ‘నాకు మా అమ్మ చేతిలో తప్ప మరణం లేకుండా వరం ఇవ్వండి‘ అని కోరాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. ఇంక తనకు చావే లేదనే భ్రమతో నరకుడు లోకకంటకుడై వేద సంస్కృతిని వ్యతిరేకిస్తూ, యజ్ఞయాగాదులు జరగకుండా అడ్డుకుంటూ, బ్రాహ్మణులను బాధిస్తూ రావణాసురుని వలె పరస్త్రీ వ్యామోహంతో 16 వేల మంది స్త్రీలను బంధించాడు. దుష్ట శిక్షణ కోసం పరమాత్మ శ్రీ కృష్ణునిగా అవతరించాడు. భూదేవి సత్యభామగా అవతరించింది. తన తల్లి అయిన సత్యభామ వదిలిన బాణాహతితో నరకుడు మృతి చెందాడు. శ్రీకృష్ణ పరమాత్మ నరకుని స్మృతిగా ఆ అమావాస్య నాడు దీపాలను వెలిగించి పండుగ చేసుకోవాలని నిర్దేశించాడు. నరకుని చెరలో ఉన్న 16,000 మంది స్త్రీలను విడిపించటమే కాక, నరకుని హస్తగతమైన ధనలక్ష్మిని విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సాగర జలాలతో ధనలక్ష్మికి ఈ రోజునే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కనుకనే దీపావళి రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేయాలి అని శాస్త్రం చెప్తోంది. నరకుడు చనిపోయిన రోజును నరక చతుర్దశిగాను, ఆ మరునాడు అమావాస్యను దీపావళి గాను పండుగ చేసుకుంటున్నాము. నరకాసురుడి పీడ వదలగానే ప్రజలందరూ మంగళ వాద్యాలు మోగించి సత్యభామా శ్రీ కృష్ణులకు స్వాగతం చె΄్పారు. ఆ మంగళ ధ్వనులే నేటికీ బాణసంచా రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి.కొన్ని ప్రాంతాలలో బాణసంచా కాల్చి ఇంట్లోకి వచ్చాక, ఆడవాళ్ళందరూ కలిసి చేటలు, పళ్ళాలు వాయిస్తారు. అది దరిద్ర దేవతను తరిమి వేయటమన్నమాట. దీనిని ‘అలక్ష్మీ నిస్సరణము’ అంటారు. ఎలా జరుపు కోవాలంటే..?దీపావళి నాడు పితృదేవతలు సాయం సంధ్యా సమయాన ఆకాశంలో దక్షిణ దిక్కుగా వచ్చి, తమ సంతానాల గృహాలను సందర్శిస్తారట. వారికి దారి కనిపించటం కోసమే దివ్వెలు కొట్టే సంప్రదాయం ఏర్పడింది. ఇంట్లోని పెద్దవారు పిల్లలతో ఈ దివిటీను కొట్టిస్తారు. పొడుగాటి గోగు కాడలకు నూనెతో తడిపిన బట్ట వత్తులు కట్టి, వాటిని పిల్లల చేతులకిచ్చి, వారిని వీధి గుమ్మం ముందు నిలబెట్టి దివిటీలను వెలిగించి, ఆకాశంలో దక్షిణం వైపుకి చూపిస్తూ గుండ్రంగా మూడుసార్లు తిప్పి, నేలకు వేసి కొట్టిస్తూ, ‘దుబ్బు దుబ్బు దీపావళి, మళ్ళీ వచ్చే నాగుల చవితి‘ అని అనిపిస్తారు. ఆ తరువాత ఆ కాడలను ఒకపక్కగా పడేస్తారు. పిల్లల కాళ్లూ చేతులు కడిగి, కళ్ళు తడిచేతితో తుడిచి, నోరు పుక్కిలించి శుభ్రం చేసుకోమని, తరువాత ఆ పిల్లలచేత మిఠాయిలు తినిపిస్తారు. తరువాత ఇంటిల్లిపాది టపాకాయలు కాల్చడం ప్రారంభిస్తారు. బాణసంచా కాల్చటం లాంటి సంబరాలు పూర్తయ్యాక, అర్ధరాత్రి దాటాక, ఇళ్ళు వాకిళ్ళను తుడిపించుకోవాలని ధర్మశాస్త్రం చెప్తోంది.ఈసారి రికార్డ్ బ్రేక్ కావాల్సిందే!గత సంవత్సరం అక్టోబర్లో అయోధ్యలో 25.12 లక్షల దీపాలను వెలిగించి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సెట్ చేసింది. తాజాగా...28 లక్షల దీపాలను వెలిగించి తన రికార్డ్ను తానే బ్రేక్ చేయాలనుకుంటోంది.వారణాసిలో దేవతల దీపావళిదీపావళి తరువాత పదిహేను రోజులకు వారణాసిలో దేవ దీపావళిని జరుపుకుంటారు. కార్తిక పూర్ణిమ రాత్రి గంగానది వెంబడి ఉన్న ఘాట్లు లక్షలాది దీపాలతో వెలుగుతాయి. ఆ వెలుగుల ప్రతిబింబాలు నదిలో అందమైన చిత్రాలను ఆవిష్కరిస్తాయి. గంగానదిలో స్నానం చేయడానికి దేవతలు భూమి మీదికి దిగి వచ్చిన రోజుగా ఈ రోజును జరుపుకుంటారు.దీపావళి పూట...శివాజీ కోట!దీపావళి సీజన్లో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో శివాజీ పాలించిన కోటకు ప్రతిరూపంగా మట్టికోటలను తయారుచేయడం అనేది ఆచారం. ఈ కోటను నిర్మించే క్రమంలో బురదలో విత్తనాలు నాటుతారు. కోట చుట్టూ పచ్చదనం ఉండేలా చేస్తారు. రాత్రివేళల్లో ఈ మట్టి కోటపై చిన్న చిన్న దీపాలను వెలిగిస్తారు.దేవతలకు స్వాగతంజార్ఖండ్లో దీపావళి పండగ సందర్భంగా సోహ్రై వేడుకను జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా దేవతలను స్వాగతించడానికి ఘరోండాలు (మట్టి బొమ్మల ఇళ్ళు) తయారుచేస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి అగరువత్తులు కాల్చుతారు. సోహ్రై వేడుకలలో పశువులకు స్నానం చేయించి పూజ లు చేస్తారు.పేడ పూసుకుని వేడుక చేసుకుంటారు!కర్నాటక, తమిళనాడు సరిహద్దులలోని గుమతాపుర గ్రామంలో దీపావళి ముగింపును పురస్కరించుకొని ‘గోరెహబ్బ’ వేడుక జరుపుకుంటారు. ఈ వేడుకలో భాగంగా మగవాళ్లు ఆవు పేడను ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఆడవాళ్లు ఒంటికి రాసుకుంటారు. ఆవుపేడలో ఔషధగుణాలు ఉన్నాయనే నమ్మకంతో ఏర్పడిన శతాబ్దాల నాటి సంప్రదాయం ఇది.– డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి. విశ్రాంత సంస్కృతాచార్య -
మీ ఆలోచనలే.. దుష్ట చతుష్టయం
అసమాన నాయకత్వ ప్రతిభ కనబరిచే టీమ్ లీడర్లు బయటి నుంచి ఎదురయ్యే సవాళ్ల వల్ల కాకుండా.. తమ అపరిమితమైన ఆత్మవిశ్వాసం వల్ల విఫలమవుతుంటారని ‘హార్వర్డ్ బిజినెస్ రివ్యూ’ (హెచ్.బీ.ఆర్.) తాజా సంచికలోని ఒక వ్యాసం విశ్లేషించింది. ఇందులో ముఖ్యంగా కొన్ని లక్షణాలు.. ఇటు నాయకులు / లీడర్లు / బాస్లకే కాదు.. ఇంటిని నడిపే ఇంటి యజమానులకూ వర్తిస్తాయి అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.‘ఇనుమును ఏదీ నాశనం చేయలేదు.. దాని తుప్పు తప్ప. అలాగే ఒక మనిషి పురోగతిని ఆపేసేది తన మనస్తత్వమే తప్ప బయటి వ్యక్తులో, అంశాలో కాదు’– రతన్ టాటాప్రతి పనిలో నేనుండాలితమ ముద్ర కనిపించాలి అనే తాపత్రయంతో ప్రతి పనిలో ‘నేనుండాలి’ అని అనుకుంటారు చాలామంది.దుష్ఫలితం: అలసట, నిస్సత్తువ పెరుగుతాయి. టీమ్లో చొరవ లోపిస్తుంది. ‘అన్నీ ఆయన చూసుకుంటాడులే’ అనే ధోరణి కిందివారిలో పెరిగిపోతుంది. సృజనాత్మకంగా ఆలోచించడం మానేస్తారు. పిల్లలు పెద్దయ్యాక కూడా చాలామంది తల్లిదండ్రులు వాళ్లను స్వతంత్రంగా పనిచేయనివ్వరు.ఇలా మార్చుకొని చూడండి: ‘నేను ఏదైనా చేయగలను. కానీ ప్రతి పనీ నేనే చేయాల్సిన అవసరం లేదు’ అనే ధోరణి మంచిది. అప్పుడు అందరికీ పనిచేసే అవకాశం వస్తుంది. వినూత్నంగా ఆలోచిస్తారు. నాయకుడు అంటే నడిపించాలి కానీ ప్రతి స్థాయిలో ప్రతి పనీ తానే చేయాల్సిన అవసరం లేదు.సంస్థల్లోని నాయకులు లేదా ఇంటికి యజమానిలో అజ్ఞాతంగా ఉండే ఆధిపత్య భావనలు వారి పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసి, వారి అభివృద్ధికి ఆటంకంగా మారతాయి. మొదట బలాలుగా కనిపించిన ఈ భావనలు క్రమేణా బలహీనతలుగా మారతాయి. బాహ్య అడ్డంకుల్లా ఇవి పైకి కనిపించవు. ఎవరికి వారు వీటిని గుర్తించి, సానుకూలంగా మలుచుకుంటే వైఫల్యాలను నివారించవచ్చు. ఎందుకంటే.. నిజమైన నాయకత్వ పురోగతి అంతర్గతంగా ప్రారంభమవుతుంది. ఏమిటీ భావనలు.. వీటి దుష్ఫలితాలేంటి.. వీటిని ఎలా అధిగమించాలి?వెంటనే పని పూర్తి చేసేయాలిప్రాధాన్యతలతో సంబంధం లేకుండా.. ప్రతి పనినీ తక్షణమే పూర్తి చేయాలి, వెంటనే ఫలితాలు కనిపించాలి అనే ధోరణితో చాలామంది ఉంటారు.దుష్ఫలితం: పిల్లలకు అన్ని అంశాల్లోనూ ఇలాగే చెప్పడం వల్ల వారికి ప్రాధాన్యతలు తెలియవు. బృందం విషయానికొస్తే.. ప్రతి పనిలోనూ ‘ఎమర్జెన్సీ’ పరిస్థితి ఏర్పడి తప్పులు జరగొచ్చు.ఇలా మార్చుకొని చూడండి: ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి’ అన్నట్టు అవసరమైన పనిపై ముందు దృష్టి పెడతాను అనుకోవాలి. ప్రాధాన్యతలు గుర్తించడమే సగం విజయం. పిల్లలు కూడా రోజువారీ చేసే పనుల్లో ఎక్కువ ఫలితం ఇచ్చే పనికి అధిక ప్రాధాన్యత.. తక్కువ ఫలితం ఇచ్చే దానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకుంటారు. దానికి తగ్గట్టుగా సమయం, ఆలోచనలు, శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారు.నేను తప్పులు చెయ్యకూడదుపనిలో కచ్చితత్వం కోసం తపన పడుతూ ఇలా ఆలోచిస్తుంటారు. దుష్ఫలితం: వినూత్న విధానాలను ప్రయత్నించే ధైర్యం చేయలేకపోవడం, అతి జాగ్రత్త, ఎప్పుడూ ఫలితంపైనే అధిక శ్రద్ధ.ఇలా మార్చుకొని చూడండి: ‘తప్పులు జరగకుండా చూడటం కాదు, సరిగ్గా పని జరిగేటట్లు చూడాలి’ అనే ధోరణి ఏర్పరచుకోవాలి. ఇది కింది వాళ్లను మూస ధోరణిలో కాకుండా కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు ఫలితంపై శ్రద్ధ కాకుండా.. పనిని సరిగ్గా చేయడం అలవాటవుతుంది.అందరూ నాలాగే పని చెయ్యాలిఇంట్లో లేదా ఆఫీసులో అందరూ తమలాగే ఆలోచించాలని, పనిచేయాలని.. ఆలోచిస్తారు, ఆశిస్తారు.దుష్ఫలితం: వ్యక్తిగత సామర్థ్యాలలోని వ్యత్యాసాలు గుర్తించరు. ఎవరి సామర్థ్యానికి, పనిచేసే ఒడుపునకు తగ్గట్టు వారిని స్వేచ్ఛగా పనిచేయనివ్వరు. ముఖ్యంగా పిల్లల విషయంలో వారి వయసును కూడా ఒక్కోసారి మర్చిపోయి వారిపై ఒత్తిడి పెంచుతుంటారు.ఇలా మార్చుకొని చూడండి: ‘నాలా అందరూ ఆలోచించలేకపోవచ్చు, పనిచేయలేకపోవచ్చు’ అనే వాస్తవాన్ని గుర్తించండి. వారి వారి సామర్థ్యాలు, తెలివితేటలకు అనుగుణంగా పనిచేసే వాతావరణం కల్పించండి. ముఖ్యంగా ఇది పిల్లల మానసిక వికాసానికి దోహదపడుతుంది. -
48 ఏళ్ల తర్వాత చిక్కిన ప్రేమ పావురం
ఏదో చిన్నచితకా కేసు కాదు.. ఏకంగా తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించిన కేసు! మన హీరో చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్.. ఈ సాహసం చేసింది 1977లో. అప్పుడు ఆయ న వయసు కేవలం 23 ఏళ్లే. రక్తంలో ప్రేమ, అపనమ్మకం, యవ్వనం.. అన్నీ ఉప్పొంగుతున్న సమయం. ఈ లవర్ బాయ్కి.. తన లవర్ క్యారెక్టర్పై తెగ అనుమానం వచ్చేసింది. అంతే.. కోపంతో ఊగిపోయాడు.. ముంబైలోని కొలాబాలో ప్రియురాలిపై కత్తి దూశాడు. పాపం ఆ రోజుల్లోనే ఇంత కసితో ప్రేమించిన మొనగాడున్నాడంటే.. మామూ లు విషయం కాదు!. కుర్రాడిని ఎలాగోలా పోలీసులు పట్టేసుకున్నారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతే! ఆ బెయిల్ పత్రాన్ని అందుకున్నారో లేదో, మన కాలేకర్ గారు ‘ట్రయల్ బై ఎస్కేప్’ అనే కొత్త రూల్ కనిపెట్టి, మాయమైపోయారు. దాదాపు ఐదు దశాబ్దాలు (48 ఏళ్లు) ఎక్కడా కనిపించకుండా, దొరక్కుండా, సన్యాసిలా జీవితం గడిపారు! కోర్టు విచారణ లేకుండా 48 ఏళ్లు బతికారంటే.. తన జీవితంపై ఆయనకు ఎంత నమ్మకమో కదా!. ముంబై పోలీసులు పాపం చాలా వెతికారు. అడ్రస్ మారడం, ఆ నివసించిన భవనం కూల్చేయడం... ఇలా సకల కారణాల వల్ల అతన్ని పట్టుకోలేకపోయారు. కోర్టు నాన్ – బెయిలబుల్ వారెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. ఇక కేసు మూలనపడింది అనుకుంటున్న టైమ్లో.. మిరాకిల్!దొరికిపోయాడోచ్.. తాజాగా దర్యాప్తు మొదలుపెట్టిన కొలాబా పోలీసులు, ఈ పాత కేసు ఫైల్ని దుమ్ము దులుపుతుండగా.. ఓ చిన్న క్లూ దొరికింది. అదేంటంటే.. 2015లో రత్నగిరి జిల్లాలోని దాపోలి పోలీస్ స్టేషన్లో ఓ ప్రమాదం కేసులో కాలేకర్ పేరు నమోదైంది! అంటే, పారిపోయి ప్రశాంతంగా ఉన్నా, ప్రమాదం రూపంలో కర్మ ఆయనను వెతుక్కుంటూ వచ్చింది! ఆ దెబ్బతో, పోలీసులు వెతికి పట్టుకున్నారు. పోలీసు అంకుల్స్కి హ్యాట్సాఫ్!.48 ఏళ్ల క్రితం 23 ఏళ్ల యువకుడిని.. ఇప్పుడు గుర్తు పట్టడం అంటే మాటలా? అంతా సవాలే. కానీ పాత ఫొటోలు చూసి, ఇంటరాగేషన్ చేయగా.. మన 81 ఏళ్ల తాతగారు తప్పనిసరి పరిస్థితుల్లో తన తప్పును ఒప్పుకున్నారు! ఇంతకాలం గుర్తు పెట్టుకుని ఉండాలంటే.. ఎంత ఘోరమైన అటాక్ అయి ఉంటుందో!.ఇప్పటికింకా ఈయన వయసు నిండా 81 ఏళ్లే..కోర్టులో అడ్వకేట్ సునీల్ పాండే ఆయన తరపున వాదించారు. ‘సార్! నా క్లయింట్ వయసు 81 ఏళ్లు, బోలెడన్ని వ్యాధులు ఉన్నాయి. అసలు చార్జిషీట్ ఫైల్ చేశాక నోటీస్ ఇవ్వలేదు! 2010లో ఆయన గుడిసె పడిపోయింది, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరారు.. అందుకే కోర్టుకు రాలేకపో యారు’.. అంటూ 48 ఏళ్ల తప్పిదానికి సరదాగా కవర్ డ్రైవ్ ఇచ్చారు!జాలి పడ్డ జడ్జి గారు!ప్రభుత్వ తరపు న్యాయవాది ఆనంద్ సుఖదేవే గారు మాత్రం ‘అయ్యో! ఇదో పెద్ద నేరం, 48 ఏళ్లు ట్రయల్ని ఆలస్యం చేసింది ఈయనే! మళ్లీ పారిపోవచ్చు!’ అని గట్టిగా అభ్యంతరం చెప్పారు. కానీ, న్యాయమూర్తి అవినాష్ పి.కులకర్ణి గారు.. మన తాతగారి వయసు, ఆయన ‘కచ్చితంగా కోర్టుకు వస్తాను’ అని ఇచ్చిన హామీని చూసి జాలి పడ్డారు. చివరికి, బెయిల్ మంజూరు చేసేశారు! తాతగారు హ్యాపీస్..ప్రేమించి, పొడిచి, పారిపో యి... వయసు మీరి పట్టుబడిన చంద్రశేఖర్ మధుకర్ కాలేకర్ గారు, ఇప్పుడు బెయిల్పై దర్జాగా ఉన్నారు. 48 ఏళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు ఇప్పుడు ఆయనపై విచారణ మొదలవుతుంది! ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఆ రోజుల నాటి పోలీసులు, సాక్షులు ఎవరైనా బతికి ఉన్నారో లేదో?, అసలు ఆ ప్రేయసి ఏమైందో.. దేవుడికే తెలియాలి! ఇంతకాలం ఈ కేసును ఫైల్లోంచి తీయకుండా ఉంచిన ఆ న్యాయస్థానం సిబ్బందికి మాత్రం భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మంచి స్థానం దక్కుతుంది! మరి, ఈ ట్రయల్ ఇంకో 48 ఏళ్లు సాగకుండా ఉంటుందా? మీరేమంటారు?– సాక్షి, నేషనల్ డెస్క్ -
కృష్ణుడిగా సత్యభామ
‘ఒక మహిళ పురుషుడి పాత్రలో మెప్పించడం చాలా కష్టం’ అంటారు సురభి కళాకారిణి 60 ఏళ్ల పద్మజా వర్మ. ఇప్పటి వరకు కృష్ణుడి పాత్రలో వేదికలపైన 3000కు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన పద్మజా వర్మ సత్యభామగానూ మెప్పించారు. ప్రత్యేక పురస్కారాలనూ అందుకున్నారు. నేడు నరకచతుర్దశి సందర్భంగా కృష్ణుడి పాత్రలో జీవించిన పద్మజా వర్మ సాక్షి ఫ్యామిలీతో పంచుకున్న విశేషాలు ...సురభి పద్మజ వర్మకు దాదాపు 60 ఏళ్ల నాటక రంగ అనుభవం ఉంది. కృష్ణుడి పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తూ, కుటుంబ పోషణలో భాగమయ్యింది. గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా, కోడలిగా కుటుంబ జీవనంలోని సర్దుబాట్లను, తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న విధానాన్ని మన ముందుంచారు. మగవారి మధ్యలో ఒక్కదాన్నే మహిళను ‘‘మగవేషాలంటే చాలా ఠీవిగా నిలబడాలి. హుందాగా కనిపించాలి. కిరీటం పెట్టుకొని వేసే వేషం ఏదైనా కష్టమే. అందులోనూ మహిళ పురుషుడి వేషం వేయడం పెద్ద సవాల్. ఆ సమయంలో స్టేజీపైన చుట్టూతా మగవారే. కృష్ణుడి వేషంలో నేనొక్కదాన్నే మహిళను. నటనలో ఎటువంటి జంకు కనిపించకూడదు. గొంతులో తత్తరపాటు ఉండకూడదు. కిరీటం పక్కకు జరగకూడదు, ఫ్లూట్ పట్టుకోవడంలో నేర్పు ఉండాలి. అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ రెండున్నర గంటల పాటు సీనును రక్తికట్టించాలి. అదో పెద్ద టాస్క్.బాల్యం నుంచీ... మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మానాన్నలు నన్ను వేదికమీదకు తీసుకెళ్లారు. శ్రీకృష్ణ లీలల్లో భాగంగా బాల కృష్ణుడి పాత్రలను ప్రదర్శించాను. మాకు చదువు అయినా, నటన అయినా కళారంగమే. పన్నెండేళ్ల తర్వాత మాయాబజార్లో శశిరేఖగా వేషాలు వేశాను. శశిరేఖగా ప్రదర్శనలో పాల్గొన్నప్పడు నా పాత్ర పూర్తయ్యాక ఒక వైపు కూర్చొని ఆ నాటక ప్రదర్శన మొత్తం చూసేదాన్ని. శశిరేఖ పాత్ర టీనేజ్ వరకే. ఆ వయసు దాటితే ఆ పాత్ర మరొకరికి ఇచ్చేస్తారు. నాకూ కొంత వయసు వచ్చాక శశిరేఖ బదులు రుక్మిణి, సత్యభామ.. ఇలా మహిళా ప్రాధాన్యత గల వేషాలే ఇచ్చారు.సత్యభామ.. మీరజాలగలరా..!కృష్ణుడి పాత్రకు దీటుగా ఉండేది సత్యభామ పాత్రే. సత్యభామ గా నటించేటప్పుడు ఆ పాత్రకు ఉన్న హావభావాలన్నీ ముఖంలో పలికించాలి. ‘మీర జాల గలడా నా యానతి... ’ అనే పాటలో నవరసాలు ఒలికించాలి. స్త్రీ పాత్రల్లోనూ మెప్పిస్తూ .. ఒక్కో దశ దాటుతున్న కొద్దీ మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు మారిపోతుండటం గమనించాను.సందేహాలను జయిస్తూ... కృష్ణుడిగా మెప్పిస్తూ!ఇలాగే ఉంటే కళారంగంలో నా ప్రాధాన్యత ఏముంటుంది అని నన్ను నేనే ప్రశ్నించుకునేదాన్ని. ‘పురుష పాత్రలు అయితేనే మార్పు లేకుండా ఎప్పటికీ వేయచ్చు, ఎలాగా...’ అని ఆలోచించేదాన్ని. పెళ్లయ్యాక మా మామగారి సొంత నాటక కంపెనీలోనే రకరకాల మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు వేశాను. ఒకరోజు కృష్ణ వేషధారి ఆరోగ్యం బాగోలేక రాలేదు. ప్రదర్శన ఉంది. ఎలా అని ఆందోళన పడుతున్న సమయంలో ‘నేను కృష్ణుడిగా వేస్తాను’ అని మా మామగారికి ధైర్యం చెప్పాను. అలా మాయాబజార్లో కృష్ణుడిగా నటించాను. అయితే, పురుషుడిలా డ్రెస్ అవ్వడం.. మామూలు విషయం కాదని ఆ రోజే తెలిసింది. కంస వధ నాటకంలో మాత్రం కొంత టెన్షన్ పడ్డాను. ఎందుకంటే, కంస పాత్రధారి మా మామగారే. కంసుని వధించేటప్పుడు బాహాబాహి తలపడటం, గుండెల మీద కొట్టడం.. వంటివి ఉంటాయి. కానీ, నటనలో రిలేషన్ కాదు ప్రతిభనే చూపాలనుకున్నాను. అక్కణ్ణుంచి ఇక నేనే కృష్ణుడిని. అలా నేటివరకు 3000కు పైగా కృష్ణుడి పాత్రలు వేసిన ఘనత నాకు దక్కింది. నాటకాన్ని చూసిన ప్రేక్షకులు స్వయంగా కలిసి, వారి అభిమానాన్ని తెలుపుతూ ఉంటారు. సాధారణ చీరలో నన్ను చూసినవారు ‘మీరేనా కృష్ణుడు’ అని ఆశ్చర్యపోతుంటారు. ఎందుకంటే, అలంకరణలో వేదికపైన కృష్ణుడిలా మరో కొత్త జన్మ ఎత్తినట్టుగా ఉంటుంది. అప్పట్లో భయపడి కృష్ణుడి పాత్రను వదిలేసి ఉంటే.. నాటకరంగంలో నా ప్రత్యేకత అంటూ ఏమీ ఉండేది కాదు. నాకు ఈ యేడాది 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం వల్ల మా పిల్లలిద్దరూ జీవితాల్లో బాగానే స్థిరపడ్డారు. ఇక నాకు బాధ్యతలేం లేవు కాబట్టి నా చివరిశ్వాస వరకు కృష్ణుడిలా నాటకరంగంలో మెప్పిస్తూనే ఉంటాను’’ అని వివరించారు కృష్ణ పాత్ర ధారి పద్మజావర్మ.– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆరోగ్యానందాలు
ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే మంచి పోషకాహారం, ధ్యానం వంటి వాటితోపాటు కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టాలి. వీటి ‘సైడ్ ఎఫెక్ట్స్’ జీవితాన్ని మార్చేస్తాయి అంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా చేసిన అనేక పరిశోధనలు, అధ్యయనాలు. ‘చిన్నగా మొదలుపెట్టి.. వాటిని కొనసాగించడం’.. ఇదే ఆరోగ్యవంతమైన జీవితానికి కొత్త సూత్రం అంటున్నారు వైద్యులు, మానసిక నిపుణులు.రాత్రి నిద్రకు అలారంసాధారణంగా అందరూ ఉదయం లేవడానికి అలారం పెట్టుకుంటారు. కానీ, రాత్రి ఎప్పుడు పడుకుంటాం అనే దానికి ప్రాధాన్యత ఇవ్వరు. స్మార్ట్ఫోన్లు, ఓటీటీ వేదికలు, స్నేహితులు లేదా బంధువులతో పిచ్చాపాటీ.. ఇవన్నీ ప్రాధాన్యతలుగా మారిపోయి నిద్రా సమయం వెనక్కిపోతోంది. అందుకే, ఎన్ని గంటలకు నిద్ర పోవాలనుకుంటున్నారో అలారం పెట్టుకోవాలి. అలారం మోగగానే.. ఏ పనిచేస్తున్నా ఆపేసి నిద్రకు ఉపక్రమించాలి. అలా అలారం పెట్టుకుని పడుకున్నవాళ్లకు ప్రశాంతమైన నిద్ర పట్టడమే కాకుండా.. మర్నాడు రోజంతా చురుగ్గా ఉన్నారని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యయనం వెల్లడించింది.ప్రకృతిని పలకరించండిప్రతిరోజూ కనీసం 10–20 నిమిషాలు ప్రకృతిని ఆస్వాదించండి. దగ్గరలోని పార్కుకు వెళ్లండి. అలా రోడ్డుమీదకు వెళ్లి చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు, పక్షులను చూడండి. దగ్గరిలోని చెరువుకు లేదా నదికి వెళ్లండి. మేడమీదకు వెళ్లి పరిసరాలు, మేఘాలు అన్నింటినీ ప్రశాంతంగా చూడండి. 2019లో యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ నిర్వహించిన అధ్యయనం.. ప్రకృతిని మాత్రగా (నేచర్ పిల్) అభివర్ణించింది.స్నాక్టివిటీ.. వర్కవుట్ స్నాక్స్!ఆరోగ్యం కోసం రోజూ జిమ్లో కఠినమైన వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. రోజులో వీలు చిక్కినప్పుడల్లా శరీరానికి ‘వర్కవుట్ స్నాక్స్’ ఇవ్వండి. చిన్న చిన్న వ్యాయామాలుగా పిలిచే ఈ ‘స్నాక్టివిటీ’ చేస్తే చాలు. మీకు తెలియకుండానే వారానికి ‘150 నిమిషాల వ్యాయామం’ కింద పోగుపడతాయి. ఎక్సర్సైజ్ స్నాక్స్ అనే పదాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్కి చెందిన కార్డియాలజిస్టు డాక్టర్ హోవర్డ్ హార్ట్లీ మొట్టమొదట ఉపయోగించారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చుని కాకుండా.. అలా నడుస్తూ మాట్లాడండి. అన్ని సార్లూ లిఫ్ట్లో వెళ్లకుండా రోజులో రెండు మూడుసార్లు.. మీరుండే ఫ్లోరును బట్టి మెట్లు ఎక్కి, దిగండి. మీకు నచ్చిన పాట చూస్తూ 5–10 నిమిషాలు మామూలుగా డ్యాన్స్ చేయండి. రోజువారీ జీవితంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇలాంటివి ఎవరికి వారే వెతుక్కోవాలి.భోజనం చేశాక నడవండిభోజనం పూర్తయిన కాసేపటి వరకు కూర్చుంటే ఫర్వాలేదు గానీ.. ఎక్కువ సమయం కూర్చోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తిన్న కాసేపటి తర్వాత కనీసం ఓ 10 నిమిషాల పాటు అలా నెమ్మదిగా నడిస్తే మంచిదట. రాత్రుళ్లు టీవీల ముందు కూర్చుని భోజనం చేసే సంస్కృతి పెరిగాక భోజనం అయిపోయినా కుర్చీలోంచి లేవడం లేదు.. చూస్తున్న కార్యక్రమం అయ్యాకే లేస్తున్నారు. ఇది మంచిది కాదు.నైట్ టైమ్.. నో ఫోన్రాత్రిపూట బెడ్రూముల్లో టీవీలు చూస్తూ లేదా స్మార్ట్ఫోన్లు చూస్తూ పడుకోవడం పెరిగిపోయింది. ఇది కంటికి మంచిది కాదనీ, వీటివల్ల ‘నాణ్యమైన నిద్ర’ ఉండటం లేదని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. 2024లో అమెరికాలో జరిగిన ఒక అధ్యయనంలో స్మార్ట్ఫోన్లు, టీవీలు చూడకుండా పడుకున్నవారు రాత్రుళ్లు వేగంగా నిద్రపోవడమే కాదు, ఉదయాన కూడా త్వరగా లేస్తున్నారని తేలింది. చాలామందికి అర్ధరాత్రి నీళ్లు తాగడానికో బాత్రూముకో వెళ్తారు. అలా లేవగానే స్మార్ట్ఫోన్నే చూస్తుంటారు. అక్కడితో వదిలేయరు. లేచిన పని పూర్తయ్యాక మళ్లీ ఫోన్ అందుకుంటారు. ఇది కూడా కంటికి, నిద్రకు మంచిది కాదు.బ్రష్ చేసే చేతిని మార్చండిమనం రోజూ చేసే పనుల్లో కొన్నింటిని.. నెలకో రెండు నెలలకో ఒకసారి వినూత్నంగా చేయడం మన మెదడును మరింత చురుగ్గా పనిచేసేలా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరానికి వ్యాయామాలు ఎలా అవసరమో.. మెదడుకూ అలాగే అవసరం. అలాంటి వాటిలో ఒకటి.. బ్రష్ చేసే చేతిని మార్చడం. మీరు ఇప్పటివరకూ చేస్తున్న చేతితో కాకుండా.. రేపటి నుంచి రెండో చేతితో చేయడం ప్రాక్టీస్ చేయండి. -
వాహ్..'తాజ్'
సాక్షి, అమరావతి: తాజ్మహల్ అనగానే ప్రేమకు చిహ్నమైన అపురూప కట్టడం మదిలో మెదులుతుంది. ఈ చారిత్రక అద్భుతాన్ని చూసి అబ్బురపడని మనసు ఉండదంటే అతిశయోక్తి కాదు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల మనసు దోచింది తాజ్ మహల్. కేంద్ర పర్యాటక శాఖ 2024–25 సంవత్సరాలకు విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఆ ఏడాది స్వదేశీ, విదేశీ పర్యాటకుల ఆకర్షణలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో ఆగ్రా పోర్టు రెండో స్థానంలో నిలవగా స్వదేశీ పర్యాటకులను ఆకర్షించడంలో కోణార్క్ సూర్య దేవాలయం రెండో స్థానంలో నిలిచింది. 2024–25లో తాజ్మహల్ను 6.45 లక్షల విదేశీ పర్యాటకులు సందర్శించగా స్వదేశీ పర్యాటకులు 62.64 లక్షల మంది సందర్శించారు. కోణార్క్ సూర్య దేవాలయాన్ని 35.71 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు సందర్శించారు. ఆగ్రా కోటను 2.24 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2024–25లో దేశానికి మొత్తం 95,51,722 మంది విదేశీ పర్యాటకులు వచ్చినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా టాప్ 15 దేశాల నుంచే 76.70 లక్షల మంది విదేశీ పర్యాటకులు దేశానికి వచ్చినట్లు పేర్కొంది. అత్యధికంగా అమెరికా నుంచి తరువాత బంగ్లాదేశ్ నుంచి విదేశీ పర్యాటకులు వచ్చినట్లు గణాంకాలు తెలిపాయి. అంతకు ముందు ఆరి్థక ఏడాదితో పోలిస్తే 2024–25లో విదేశీ పర్యాటకుల సంఖ్య 4.30 లక్షలు పెరిగారు. 2024–25లో భారత దేశానికి 99.51 లక్షల విదేశీ పర్యాటకులు రాకతో రోజూ సగటున 27,000 కంటే ఎక్కువ మంది దేశానికి వచ్చారు.6.45 లక్షలు 2024-25లో తాజ్ మహల్ను సందర్శించిన విదేశీ పర్యాటకులు 62.64 లక్షలు 2024 -25లో సందర్శించిన స్వదేశీ పర్యాటకులు2.24 లక్షలు 2024-25లో ఆగ్రాకోటను తిలకించిన విదేశీ పర్యాటకులు 35.71 లక్షలు 2024-25లో కోణార్క్ సూర్య దేవాలయానికి వచ్చిన స్వదేశీ పర్యాటకులు -
చెడును నరికేసి... మంచిని వెలిగించి!
ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద పండగ చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందుకంతగా సంతోషప్రదమయిందంటే.... నరకుడు అజ్ఞానానికి, పీడనకు, హింసకు ప్రతీక. నరకం అంటే దుర్గతి. అది కలవాడు నరకుడు. అంటే చెడు నడత కలవాడు. ఆ చెడు తన కుమారునిలో ఉందన్న కారణంగానే అతడి సంహారానికి కారణమయింది తల్లి సత్యభామ. తనలా మరే తల్లీ ఎవరి గర్భశోకానికీ కారణం కాకూడదన్న కోరికతో తన కుమారుడి పేరు శాశ్వతంగా నిలిచి పోయేలా వరం కోరుకుంది. అందుకే శ్రీకృష్ణుడు అతడి పేరు మీదుగానే భవిష్యతులో అందరూ ‘నరక చతుర్దశి’ జరుపుకుంటారని వరమిచ్చాడు.హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వల్ల భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు. నరకుడు ప్రాగ్జోతిషపురం రాజధానిగా కామరూప రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరంగానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. ఎందుకంటే స్వయానా తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను చేసిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. నరకుడు విష్ణుద్వేషియై దేవతలను హింసించసాగాడు.దేవమాత అదితి కుండలాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీ కృష్ణుడు ఇతనిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు. మరొకప్పుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూవారనే విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం వాడికో వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగలేదు. చివరకు ఇంద్రునిపైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ రాక్షసాధముని దురంతం పరాకాష్టనందుకుంది. ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీ కృష్ణుని శరణు వేడగా గోపాలుడు నరకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపుబాణానికి శ్రీ కృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి నరకుణ్ణి నిలువరించింది. ఆ తర్వాత కృష్ణుడు తేరుకుని సుదర్శన చక్రం ప్రయోగించి అతడిని సంహరించాడు. అలా ఆశ్వీయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసురుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి వల్లనే సంభవించింది.తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదించాడు శ్రీ కృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారు వేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధర్మం సుప్రతిష్టమైంది.ఈ రోజు ఏం చేయాలి?ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణ చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభిముఖంగా ‘యమాయః తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారం. యముని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం.నరక చతుర్దశినాడు దీపదానం చేస్తే పితృదేవతలందరికీ స్వర్గనివాసం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇదేరోజున సాయం సమయంలో నూనెతో తడిపిన, రసాయన ద్రవ్యాలతో తయారు చేసిన కాగడాలను చేతబట్టుకొని తిరిగినట్లయితే పితృదేవతలకు దారి చూపినట్లవుతుందనీ పెద్దలు నమ్ముతారు. నరకచతుర్దశి మరునాడే దీపావళి. రావణుడు... మా ఊరి అల్లుడు!దీపావళి అంటేనే సంబరాలు అంబరాన్ని అంటుతాయి. అయితే రాజస్థాన్లోని జోద్పూర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మండోల్లో దీపావళి రోజు దీపాలు వెలిగించడం, బాణసంచ కాల్చడం ఉండదు. నిశ్శబ్దాన్ని పాటిస్తారు. కారణం ఏమిటి? అనే విషయానికి వస్తే స్థానిక పురాణం తెలుసుకోవాల్సిందే. దీని ప్రకారం... రావణుడి భార్య మండోదరి జన్మస్థలం మండేరే. రావణుడు మండోదరిని ఈ గ్రామంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మండేరేకి చెందిన మౌద్గిల్ బ్రాహ్మణులు తమను తాము మండోదరి కుటుంబ వారసులుగా భావిస్తారు. అందువల్ల వారు రావణుడిని రాక్షస రాజుగా కాకుండా గౌరవనీయమైన బంధువుగా చూస్తారు!చీకటి దీపావళి!దీపావళి వేడుకల తర్వాత హిమాచల్ప్రదేశ్లో బుద్ది దీపావళి(చీకటి దీపావళి లేదా పాత దీపావళి) జరుపుకుంటారు. దీపావళి తర్వాత మొదటి అమావాస్య రోజు బుద్ది దీపావళి వేడుకలు మొదలవుతాయి. రాముడి రాక వార్త ఒక నెల తర్వాత మాత్రమే హిమాచల్ప్రదేశ్కు చేరిందట. అందుకే ఆలస్యంగా పండగ జరుపుకునే సంప్రదాయం మొదలైంది అంటారు.దేవరి రాత్రిఛత్తీస్ఘడ్లోని గోండు తెగలు దీపావళిని ‘దేవరి’గా జరుపుకుంటాయి. దేవరి రాత్రి గ్రామంలోని మహిళలు తలలపై ఒక కుండలో నూనె దీపాన్ని వెలిగించి శ్రావ్యంగా పాటలు పాడుతూ, ప్రతి ఇంటి తలుపు తడుతూ తమతో చేరాలని ఆ ఇంటి మహిళలను అభ్యర్థిస్తారు. బియ్యపు పిండితో చేసిన దీపాలను ప్రతి ఇంటి ముందు ఉంచుతారు.ఆవులను తమపై నడిపించి...మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని బిదావాద్ గ్రామంలో ఒక వింత ఆచారం ఉంది. దీపావళి రోజు తరువాత నేలపై పడుకొని ఆవులను తమపై నడిపించుకుంటారు. 33 కోట్ల దేవుళ్లు, దేవతలు ఆవులో కొలువై ఉన్నారని, వాటిని తమపై నడిపించుకోవడం ద్వారా దేవతల ఆశీర్వాదం దొరుకుతుందనేది భక్తుల నమ్మకం.భర్త కోసం రాత్రంతా దీపాలు...మహారాష్ట్రలో దీపావళి వేడుకలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన జానపద కథ ప్రచారంలో ఉంది. వివాహం జరిగిన నాలుగు రోజుల తరువాత చనిపోతాడని యువ రాజుకు శాపం. విషయం తెలిసిన వధువు తన భర్త ప్రాణాలు రక్షించుకోవడం కోసం రాత్రంతా అవిశ్రాంతంగా దీపాలు వెలిగిస్తూనే ఉంటుంది. ఆమె ప్రయత్నాల వల్ల భర్త బతుకుతాడు.శ్రీవిష్ణువు భూలోకానికి...గుజరాత్లో దీపావళి రోజు కొత్త వ్యాపారాలు ప్రారంభించడం అనేది తరతరాలుగా వస్తోంది. మహాలక్ష్మీదేవి భర్త విష్ణువు భూలోకానికి వచ్చిన గుర్తుగా మధ్యప్రదేశ్లో దీపావళి జరుపుకుంటారు. కోల్కత్తాలో దీపావళికి కాళీపూజ చేస్తారు.సోదర, సోదరీమణులు...మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో దీపావళి అనేది సోదర, సోదరీమణుల అనుబంధానికి ముడి పడి ఉన్న పండగగా జరుపుకుంటారు. దీపావళి తర్వాత రోజు జరుపుకునే ఈ పండగను ‘యమ–ద్విత్య’ అని పిలుస్తారు. యమున తన సోదరుడు, మృత్యుదేవుడు యముడికి ఆతిథ్యం ఇచ్చిన రోజు ఇదే అని పురాణ కథలు చెబుతాయి.లక్ష దీపాల ఆగ్రా కోటఅక్బర్ చక్రవర్తి పాలనలో దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. ఈ సంప్రదాయాన్ని ‘జష్నే చిరాఘన్’ అని పిలిచేవారు. లక్షలాది దీపాలతో ఆగ్రా కోట వెలిగిపోయేది. కోట ముందు ఉన్న మైదానంలో బాణసంచా కాల్చేవారు. – డి.వి.ఆర్. -
‘సిక్’ లీవ్ అని చెప్పేద్దామా?
సాక్షి, హైదరాబాద్: భారతీయుల్లో వర్క్–లైఫ్ బ్యాలెన్స్ సమస్యలు అధికంగా బయటపడుతున్నాయి. దాదాపు 75 శాతం మంది వృత్తి నిపుణులు మానసిక ఆరోగ్యం సరిచేసుకునే విషయంలో వెనుకబడుతున్నారు. ఇటీవల నిర్వహించిన నౌక్రీ పల్స్ 2025 సర్వేలో పాల్గొన్నవారిలో నలుగురు ఇండియన్లలో ముగ్గురు సెలవుకు మానసిక ఆరోగ్య కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని తేలింది. పనిలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాల్లో... పేలవమైన పని–జీవిత సమతుల్యతలో 39%తో భారత్ వృత్తి నిపుణులు ముందువరసల్లో నిలుస్తున్నారు. దాదాపు 80 పరిశ్రమలలో 19,650 మంది వృత్తి నిపుణులపై ఈ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగంలో... 30 శాతం కంటే ఎక్కువ మంది నిపుణులు మానసిక ఆరోగ్య కారణాల వల్ల సెలవు తీసుకోవడానికి సంసిద్ధంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజైన్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఇది అధికంగానే ఉన్నట్టుగా తెలిసింది. ఈ విషయంలో ఫ్రెషర్లు, కెరీర్ ప్రారంభంలో ఉన్న నిపుణులు (0–5 సంవత్సరాల పని అనుభవం) ఎక్కువగా సంకోచిస్తారు.ఉద్యోగులు వెనుకాడడానికి కారణాలు... » మానసిక ఆరోగ్యం సరిగాలేని కారణంగా సెలవు తీసుకుంటే తమను అసమర్థులుగా చూస్తారని 31 శాతం మంది ఉద్యోగులు భయపడుతున్నారు » తమ విషయంలో సహోద్యోగులు ఏమని ఆలోచిస్తారోననే ఆందోళనతో 27% మంది ఉన్నారు » సెలవు తీసుకునేందుకు తాము సాకులు వెతుకుతున్నామని 21% మంది ఆందోళన చెందుతున్నారు » ఇది కెరీర్ వృద్ధిని ప్రభావితం చేస్తుందని 21% మంది నమ్ముతున్నారు వాస్తవాలకు బదులు సెలవుకు చెబుతున్న కారణాలు... » తమ మానసిక ఆందోళనలతో తలెత్తిన పరిస్థితిని 45% జనరల్ సిక్ లీవ్గా పరిగణన» 28% ఇతర కారణాలు » 19% సెలవులకు దూరం» 9% ఇతర కారణాలు చూపుతున్నారు... -
అడవి విడిచిన ఆయుధం…
మావోయిస్టు పార్టీలో శిఖర సమానులైన ఇద్దరు కేంద్రకమిటీ సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. తమ బలగంతో సహా ముఖ్యమంత్రుల ఎదుట సరెండర్ అయ్యారు. ఆయుధం వదిలి రాజ్యాంగ ప్రతిని చేతబట్టారు. తుపాకీ వదిలి ప్రజాస్వామ్య ప్రతిన బూనారు. రెండు రోజుల్లో దాదాపు 300లకు పైగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. భారత దేశ సాయుధ పోరాట చరిత్రలో ఇదో కీలక మైలురాయి. అర్థ శతాబ్దపు నక్సల్బరీ పోరాట చరిత్రలో అతిపెద్ద కుదుపు. ఇది సైద్ధాంతిక భావాజాలనికి ఎండ్ పాయింట్ అని కొందరంటుంటే… పోరాట పంథాలో మార్పు మాత్రమే అని మరికొందరంటున్నారు. కాలమాన పరిస్థితులను ఎదుర్కొన్న మావోయిస్టు సిద్దాంతాన్ని… మరో రూపంలో రాబోయే తరానికి అందించడానికే… అన్నలు అస్త్రసన్యాసం చేస్తున్నారనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఒకరు సిద్ధాంత కర్త… మరొకరు గెరిల్లా వీరుడుమావోయిస్టు పార్టీలో ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత ఘర్షణ ఉంది.ముఖ్యంగా ఆయుధం వదలాలనే వర్గం ఇప్పటికే మూటా ముల్లే సర్దుకుని… అడవీని వీడుతున్నారు. దాదాపు 300మంది మావోలు అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్ఘడ్ సర్కార్ల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ సర్వోన్నత నిర్ణాయక మండలి అయిన పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్, మరో కేంద్రకమటీ సభ్యుడు ఆశన్న ఉన్నారు. వీరిద్దరు దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో కీలక భూమిక పోషించారు. ముఖ్యంగా మల్లోజుల వేణుగోపాల్ మావోయిస్టు పార్టీ సైద్ధాంతిక రూపకల్పన, సాహిత్య రచనా విభాగంలో ఎంతో పనిచేశారు. మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో ఆమోదించిన ఎన్నో సైద్ధాంతిక పత్రాలకు రూపకల్పన చేసింది కూడా మల్లోజుల వేణుగోపాల్ రావే. సాధన పేరుతో ఎన్నో పుస్తకాలు రాసిన చరిత్ర మల్లోజుల వేణుగోపాల్ది. మావోయిస్టు పార్టీ మేధావి వర్గంలో ఎలాంటి శశభిషలు లేకుండా అత్యున్నతుడు అనే పేరు తెచ్చుకుంది కూడా మల్లోజుల వేణుగోపాలే. సల్వాజుడుం వల్లే మావోయిస్టు పార్టీ బలోపేతం అయింది అంటూ థాంక్స్ టు సల్వాజుడుం పేరుతో పేరుతో మల్లోజుల వేణుగోపాల్ పుస్తకం రాశారు. ఒక దశలో గణపతి తరువాత బాధ్యతలు మల్లోజుల వేణుగోపాల్కు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఇక ఆశన్న అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు మావోయిస్టు పార్టీ మిలటరీ విభాగంలో ఆరితేరిన యుద్ధవీరుడు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కారు కింద క్లైమోర్మెన్లు పెట్టింది కూడా ఆశన్నే. దండకారుణ్యంలో ఎన్నో అంబుష్లకు నేతృత్వం వహించిన ఆశన్న మావోయిస్టు పార్టీలోనే నెంబర్-1 ఆర్మీ కమాండర్గా ఎదిగాడు. మావోయిస్టు పార్టీ అబూజ్మఢ్లో నిర్వహించిన చాలా ఆంబుష్లకు నేతృత్వం వహించింది కూడా ఆశన్ననే. 2013లో ఛత్తీస్ఘడ్లోని ఝీరమ్ ఘాటి దాడిలో మహేంద్రకర్మతో పాటు పదిమందిని హత్యచేసిన సంఘటనలోనూ ఆశన్న ప్లానింగ్ ఉందని చెబుతారు. ఇక 2011లో మావోయిస్టు పార్టీ సుక్మా జిల్లాలో 75మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేసిన సంఘటన ప్లానింగ్ కూడా ఆశన్నదే అని చెప్తారు. అందుకే మావోయిస్టు పార్టీలో సైద్ధాంతికంగా అత్యంత బలమైన మల్లోజుల… యుద్ధవిద్యలో ఆరితేరిన గెరిల్లా ఆశన్నలు ఆయుధాలు వదిలివేయడం ఇప్పుడు ఓ సంచలనం. లేఖలతో యుద్ధం… మావోయిస్టు పార్టీకి చెందిన సాయుధ క్యాడర్ వందల సంఖ్యలో ఆయుధాలతో లొంగిపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మావోయిస్టు పార్టీని విభేదించి బయటకు వచ్చిన మల్లోజుల, ఆశన్నలది ద్రోహం అని కొందరు మావోయిస్టు సానుభూతిపరులు చెబుతున్నారు. పార్టీకి ద్రోహం చేసి వీరంతా బయటకు వచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది ఇప్పటికైనా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావడం మంచి పరిణామం అంటూ వీరికి మద్దతునిస్తున్నారు. ప్రాణాలు కాపాడుకోవడమే పోరాటంగా మారినప్పుడు లొంగిపోవడంలో తప్పులేదని చెబుతున్నారు. తెలుగు ప్రజల్లో మావోయిస్టుల సరెండర్పై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇక చాలాకాలం నుంచి మావోయిస్టులను అరాచకశక్తులు అని తిట్టిపోసే… ఛత్తీస్ఘడ్ మీడియా మాత్రం లొంగిపోయిన మావోలను హీరోలుగా కీర్తిస్తోంది. మొత్తానికి మావోయిస్టు పార్టీలో అంతర్గతంగా ఉన్నట్లుగానే బయట కూడా లొంగుబాటుపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. దాదాపు రెండు నెలలుగా మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే… ఈ లొంగుబాటుకు కారణాలు అర్ధమవుతాయి. గత నెలలో మావోయిస్టు పార్టీ ఆయుధాలు వదిలి బయటకు వచ్చే విషయంపైనా పెద్ద ఎత్తున లేఖల పర్వం కొనసాగింది. ముఖ్యంగా అభయ్ పేరుతో మల్లోజుల రాసిన లేఖలు పార్టీలో ప్రకంపణలు సృష్టించారు. మావోయిస్టు పార్టీ సైద్ధాంతికంగా తప్పులు చేసిందని.. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అందువల్లే ఇంతటి నిర్బంధం ఎదుర్కోవాల్సి వస్తుందని మల్లోజుల 21పేజీల లేఖను విడుదల చేశాడు. దీనికి రూపేష్ పేరుతో దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటి హెడ్ ఆశన్న మద్దతు పలికాడు. అయితే మల్లోజుల రాసిన లేఖపై మావోయిస్టు పార్టీలోని మరో వర్గం తీవ్రంగా స్పందించింది. ఇటీవలే ఎన్కౌంటర్లో చనిపోయిన ఇద్దరు కేంద్రకమటీ సభ్యులు కట్ట రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డిలు సైతం దీనిని ఖండిస్తూ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణా విభాగం సైతం దీనిని వ్యతిరేకించింది. పైగా మల్లోజుల పార్టీకి ద్రోహం చేస్తున్నాడని… అతను తన ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పజెప్పాలని లేదంటే బలవంతంగా లాక్కుంటామని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. దీంతో మావోయిస్టు పార్టీలో చీలిక తప్పదని తేలిపోయింది. దీనికి అనుగుణంగానే మావోయిస్టు పార్టీలో మల్లోజుల వర్గం వరుస లొంగుబాట్లకు తెరతీసింది. తెలుగు మావోయిస్టుల్లో విభేదాలుమావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టు పార్టీలోని తెలుగు నక్సలైట్లలో వచ్చి విభేదాలే ఈ లొంగుబాటుకు కారణం అనే చర్చ వేగం పుంజుకుంది. ముఖ్యంగా ఈ ఏడాది మే నెలలో మావోయస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందిన తరువాత పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభం అయ్యాయని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ చీఫ్గా మల్లోజుల వేణుగోపాల్కు పగ్గాలు ఇవ్వకపోవడం పట్ల ఆయన వర్గం పార్టీతో విభేదించింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ముప్పాళ్ల లక్ష్మణరావు తరువాత పార్టీ పగ్గాలు మల్లోజులకు ఇస్తారనే చర్చ జరిగింది. అయితే అప్పుడు నంబాళ కేశవరావు వైపే కేంద్రకమిటీ మొగ్గుచూపింది. ఇక నంబాళ అలియాస్ బసవరాజు తరువాతనైనా మల్లోజులను చీఫ్గా ఎన్నుకుంటారని భావించారు. అకస్మాత్తుగా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మల్లోజుల వర్గం పూర్తిగా పార్టీ కేంద్రకమిటీలోని ఇతర నాయకత్వంతో విభేదాలు పెంచుకుందనే చర్చ జరుగుతోంది. దీనివల్లే మల్లోజుల వర్గం ఆయుధాలు వీడాలనే నిర్ణయానికి వచ్చిందని పార్టీలోని ఓ వర్గం చెబుతోంది. ఇటీవలే పోలీసుల ముందు లొంగిపోయిన తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న సైతం మావోయిస్టు పార్టీకి ప్రస్తుతం ఎవరు ప్రధాన కార్యదర్శి లేరని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. అసలు కేంద్రకమిటీ సమావేశమే జరగలేదని ఆశన్న స్పష్టం చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తిప్పరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా మల్లోజుల వర్గం అంగీకరించడం లేదని స్పష్టమవుతోంది. అయితే మల్లోజుల వేణుగోపాల్ను వ్యతిరేకించే వారిలో కేంద్రకమిటీకి చెందిన మల్లా రాజిరెడ్డి, తిప్పరి తిరుపతి, పాక హనుమంతుతో పాటు గోండి మావోయిస్టు నాయకుడు హిడ్మా పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణా మావోయిస్టు పార్టీ చీఫ్గా ఉన్న దామోదర్ అలియాస్ జగన్ దీనిపై ఎలాంటి స్టాండ్ తీసుకున్నారనే విషయం ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే మల్లోజుల లేఖను వ్యతిరేకించిన వారిలో దామోదర్ కూడా ఉండటంతో… మల్లోజులను సపోర్ట్ చేసే నాయకత్వం పెద్దగా మావోయిస్టు పార్టీలో మిగల్లేదని అర్ధమవుతోంది. లొంగుబాటలో మరికొంతమందిభారతదేశ చరిత్రలోనే అతిపెద్ద నక్సలైట్ లొంగుబాటుగా భద్రతా బలగాలు కీర్తిస్తున్న ఈ సరెండర్స్ ప్రభావం ఎలా ఉండబోతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత నాలుగు రోజుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన దాదాపు 310మంది మావోయిస్టులు లొంగిపోయారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. లొంగిపోయిన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న పాటు చాలామంది దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్లు ఉన్నారు. వీరిలో డీకేఎస్జెడ్సీ మెంబర్ భాస్కర్, టెక్నికల్ టీమ్లో పనిచేసిన సరోజ మరికొంత మంది కమాండర్లు ఉన్నారు. దాదాపు 20 వరకు ఏకే-47 తుపాకులు, 40వరకు ఆటోమెటిక్ వెపన్స్ మొత్తానికి 200 ఆయుధాలను మావోయిస్టులు లొంగుబాటు సమయంలో పోలీసులకు అప్పగించారు. అయితే మొత్తం మావోయిస్టు పార్టీ కేడర్లో ఇది ఎంత భాగం అనేది ఇప్పుడ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. కేంద్ర నిఘా వర్గాల లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టుల సంఖ్య వేయిలోపే ఉందని తెలుస్తోంది. అయితే వివిధ వర్గాల ద్వారా వస్తున్న సమాచారంతో పాటు లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీకి 2500మంది సాయుధ సైన్యం ఉన్నట్లు అంచనా. గణాంకాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం లొంగిపోయిన వారి సంఖ్య మొత్తం సాయుధ మావోయిస్టులలో దాదాపు 15శాతంగా చెప్పుకోవచ్చు. దీంతో మిగిలిన మావోయిస్టుల సంగతేంటనే చర్చ జరుగుతోంది. ఒకవేళ మిగిలిన వారు కూడా ఇదే బాట పడితే దాదాపు వేయి మంది వరకు లొంగపోవచ్చని పోలీసులు అంచనా వేస్తన్నారు. వచ్చే వారంరోజుల్లో లొంగుబాట్లకు సంబంధించి స్పష్టమైన ముఖచిత్రం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దండకారుణ్యం స్పెషల్ జోనల్ కమిటీ దారిలోనే మావోయిస్టు పార్టీకి చెందిన ఉదంతి ఏరియా కమిటీ కూడా లొంగుబాటు వైపు మొగ్గు చూపింది. దీనికి అనుగుణంగా తమ మావోయిస్టు కామ్రెడ్లకు ఉదంతి ఏరియా కమిటి కార్యదర్శి సునీల్ లేఖ రాశారు. ఈ నెల 20వ తేదీన మద్యాహ్నం 12గంటల ముప్పై నిమిషాలకు ఎక్కడ కలువాలో కూడా తన లేఖలో సునీల్ స్పష్టం చేశారు. దీంతో పాటు తాము ఎక్కడ కలవాలో కూడా లేఖలో స్పష్టంగా మావోయిస్టులు పేర్కొన్నారు. దీనిని బట్టి ఒక విధంగా ప్రభుత్వం ఛత్తీస్ఘడ్లో కూంబింగ్ ఆపేసినట్లు సంకేతాలు వస్తున్నాయి. మావోయిస్టులు స్వేచ్ఛగా అడవి నుంచి లొంగుబాటు కోసం బయటకు వచ్చే విధంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టుల కోసం ప్రభుత్వం నది దాటేందుకు వీలుగా బోట్లు కూడా ఏర్పాటు చేసింది. మొత్తానికి ప్రభుత్వం ఇచ్చిన ఈ కాలపరిమితిలో మావోయిస్టులు లొంగిపోతారా… లేక మరో ఎత్తుగడతో వస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివాసీలు ఎటువైపు…మావోయిస్టు పార్టీకి ఇది సంధికాలం. ఓ వైపు లొంగుబాట్లు పెరుగుతుంటే ఆ పార్టీలో ఉన్న మిగిలిన నాయకత్వం మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయడం లేదు. లొంగిపోతున్న వారిది తప్పని కాని… ఎవరూ ఈ ట్రాప్లో పడొద్దు అనే మాట కూడా మావోయిస్టు పార్టీ నాయకత్వం నుంచి రావడం లేదు. చాలామందిలో అసలు మావోయిస్టు పార్టీకి ఇంకా నాయకత్వం మిగిలి ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు పార్టీ కార్యదర్శి తిప్పరి తిరుపతి పేరుతో ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు లొంగుబాటు అవుతున్న వారు స్వేఛ్చగా అడవి నుంచి వస్తున్న క్రమంలో మిగిలిన వారి పరిస్థితిపై ఆశన్న చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తిగా ఉన్నాయి. తమతో పాటు రావడానికి కొంతమంది నిరాకరించారని… వారికి కావాల్సిన సామాగ్రి ఇచ్చి జాగ్రత్తలు చెప్పి మరీ వారిని ఇతర దళాల కాంటాక్ట్లోకి పంపించామని ఆయన చెప్పారు. పార్టీ ఫండ్తో పాటు మిగిలిన ఆయుధాలను డంప్లను సాయుధ పోరాటం చేస్తున్న వారికే అప్పజెప్పామని ఆశన్న చత్తీస్ఘడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అంటే ఓ వర్గం ఇంకా దీనిని వ్యతిరేకిస్తోందననేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వర్గం ఎంత బలంగా ఉందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఓ అంచనా ప్రకారం మావోయిస్టు పార్టీ గత రెండున్న దశాబ్దాలుగా బస్తర్లో జనతన సర్కార్ను నిర్వహిస్తోంది. అంటే ప్రభుత్వానికి సమాతంరంగా మరో ప్రభుత్వం లాంటింది అన్న మాట. ఒక తరం మొత్తం మావోయిస్టు పార్టీ పాలనలో ఎదిగిందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దాదాపు 10లక్షల మంది జనాభా మావోయిస్టు పార్టీ పాలన కింద ఉందనేది ఆ పార్టీ ప్రకటనల ద్వారా అర్ధమవుతున్న మాట. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇది 5లక్షల వరకు ఉండవచ్చనేది అంచనా. ఇందులో దాదాపు 25వేల మంది మిలిషియా సభ్యులుగా ఉన్నట్లు ఛత్తీస్ఘడ్ పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో ఎంతమంది ఇప్పుడు లొంగుబాటు వైపు నిలుస్తారు. మావోయిస్టు పార్టీ ఏకమొత్తంగా నిర్ణయం తీసుకుంటే తప్ప వీరు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించే అవకాశం లేదు. రాబోయే కాలంలో వీరు ఏవిధంగా ప్రభుత్వ పాలన కిందికి వస్తారు. ఎంత వరకు కొత్త ప్రభుత్వంతో వీరికి సయోధ్య కుదురుతుంది. పాత కొత్తల ఘర్షణ వల్ల ఎలాంటి కొత్త సామాజిక ఆర్ధిక పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అనే అనుమానాలు ఉన్నాయి. మేధావుల మౌనం…మావోయిస్టు పార్టీ నిజంగానే తన పంథా మార్చుకుని జనజీవనంలోకి రావాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ తరువాత పిట్టల్లా రాలిపోతున్న మావోయిస్టులపై జనాల్లో సానుభూతి పెరుగుతోంది. ఎందుకు ఈ పోరాటం… ఎవరి కోసం ఈ ఆరాటం అనే భావన మావోయిస్టుల్లోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా కేవలం తాము తయారు చేసుకున్న జనతన సర్కార్ తప్ప బయట ఎక్కడా తమ అవసరం లేదనే వాస్తవం వారికి అర్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ప్రజల ఆలోచన సామాజిక, ఆర్ధిక పరిస్థితులు మారిని విషయాన్ని మావోయిస్టులు విస్మరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మేధావి వర్గం కూడా మావోయిస్టులు లొంగిపోతే తప్పులేదని చెబుతోంది. చాలా వరకు మావోయిస్టులను సపోర్ట్ చేసిన తెలుగు మేధావులు అందుకే ఇప్పుడ మౌనం వహిస్తున్నారు. ఇక మావోయిస్టులు అడవిలోనే ఉండాలనే వారి సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పుడు జరుగుతున్న లొంగుబాట్లపై కొందరు విమర్శలు చేస్తున్నా… 40ఏళ్లు పోరాటం చేసిన వారిని విమర్శించే నైతికత ఎంతమందికి ఉంటుంది. అడవిలో ఆదివాసీల కోసం పోరాడిన మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, భాస్కర్లాంటి వారి కంటే ఎక్కువ సామాజిక స్పృహ ఎవరికి ఉంది. నమ్ముకున్న ఆదివాసీలను వదిలేసి రావడం ద్రోహం అనే వారు… ఎవరిని ప్రశ్నిస్తున్నారో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలని లొంగిపోయిన మావోయిస్టులు చెబుతున్నారు. గట్టుపై కూర్చోని సిద్ధాంతాలు చెప్పేవారు… అడవిలో గంజి తాగి పోరాటం చేసిన వారిపై రాళ్లు వేయడం ఎంత వరకు కరెక్టు అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే మావోయిస్టు పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పుడు అధికారికంగా మాట్లాడటానికి… మేధావులు సైతం వెనుకంజ వేస్తున్నారు. మొత్తానికి ఇది మావోయిస్టులు తేల్చుకోవాల్సిన వివాదం. ఆయుధాలు వదిలివేయాలా లేక సాయుధ పోరాటంలో కొనసాగాలా అనే విషయంలో లోకస్ స్టాండి కేవలం సాయుధ మావోయిస్టులకు మాత్రమే ఉంది. అంతమా… మరో ఆరంభమా…మావోయిస్టుల లొంగుబాటు పూర్తయితే ఇక దేశంలో నక్సలిజం పూర్తిగా మాయమవుతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మావోయిస్టు పార్టీ పుట్టినిల్లు అయిన తెలంగాణా చరిత్రను కాస్త వెతికితే దీనికి సమాధానం దొరికే అవకాశం ఉంది. తెలంగాణా సాయుధ పోరాటం అందించిన నాయకత్వం… సైద్ధాంతిక భావజాలమే తరువాతి క్రమంలో తెలంగాణాలో నక్సల్ ఉద్యమానికి ఊపిరిలూదింది. తొలి తెలంగాణా ఉద్యమంతో పాటు మలి దశ పోరాటానికి అదే పోరాట స్ఫూర్తిగా నిలిచింది. ఇప్పుడు లొంగిపోతున్న మావోయిస్టులు… తమ వెంట ఎన్నో సైద్ధాంతిక సూత్రీకరణలు, సామాజిక అనుభవాలతో అడవిని వీడి జనారణ్యంలోకి తీసుకువస్తారు. ఈ డిజిటల్ యుగంలో వారి అనుభవాలు, ఆలోచనలు అన్నీ ఇంటర్వ్యూల రూపంలో, పుస్తకాల మార్గంలో మళ్లీ ప్రజలను తాకే అవకాశం లేకపోలేదు. ఈ మొత్తం భావజాలాన్ని ఎవరు కంస్యూమ్ చేస్తారు. వందల వేల యూట్యూబ్ చానెల్స్లో వీరి ఇంటర్వ్యూలు.. రానున్నాయి. ఇందులో మంచి ఎంత చెడు ఎంత అని ఆలోచించే కన్నా… ఇదంతా తరువాతి తరాలకు ట్రాన్స్ఫర్ అవుతుందనేది సుస్పష్టం. సాయుధ పోరాట భావజాలం మరో రూపంలో… మరో తరానికి బదిలీ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితం లొంగిపోయిన మావోయిస్టు నేత భాస్కర్ తన ఇంటర్వ్యూలో మా అనుభవాలు, పోరాటాలు రాబోయే తరాలకు చెప్పాలన్నా మేము బతకాలి కదా అని అన్నారు. మావోయిస్టు పార్టీ గత నాలుగు దశాబ్దాల్లో చేసిన పోరాటం ఇప్పటికే చాలా వరకు పుస్తకాల్లో రికార్డు అయింది. అయితే ఛత్తీస్ఘడ్ పోరాటాలు మాత్రం అడవిని వదలి వస్తున్న మల్లోజుల, ఆశన్న, బాస్కర్, సరోజలాంటి వారు చెబితేనే తెలుస్తాయి. అందుకే ఇప్పుడు వీరంతా ఏంచేస్తారు. ప్రజా పోరాటాలను నిర్మిస్తారా. రాజకీయాల్లోకి వస్తారా. లేక పుస్తకాలు రాస్తారా అనే చర్చ జరుగుతోంది. వీరు చేయబోయే పనులే … మావోయిస్టు పార్టీ భావజాలం ఎలా ఉండబోతుందనే విషయాన్ని నిర్దేశించబోతోంది. అయితే ఇదంతా భవిష్యత్తు… దీనిని ఎవరూ నిర్దేశించలేరు. చివరి మాట… లొంగుబాటు విషయంలో ఎవరెన్ని మాటలన్నా… మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రకటన వస్తేనే దీనిపై క్లారిటీ రానుంది. అయితే మావోయిస్టు పార్టీ గురించి ప్రతీ ఒక్కరు ఆతృతగా చూస్తున్న మరో అంశం మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి ఎక్కడున్నారు అనేది. గణపతి బతికే ఉన్నారా ఉంటే ఆయనెందుకు స్పందించడం లేదు. ఆయనకు అల్జీమర్స్ వచ్చిందనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ గణపతి బతికి ఉంటే… ఆయన ప్రకటన చేస్తే ఈ కన్ఫ్యూజన్ పూర్తిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మావోయిస్టులు అడవిని వీడుతున్నారు. మేము లొంగిపోవడం లేదు కేవలం ఆయుధాలను ప్రజల ముందు ప్రభుత్వాల ముందు వదిలేస్తున్నాం అని చెబుతున్నారు. ఏది ఏమైనా ఆయుధం ఇప్పుడు అడవిని వీడింది. ఈ ప్రయాణం చీకటి దారుల్లోకా లేక వెలుగు రేఖల వైపా అనేది కాలమే నిర్ణయిస్తుంది. - ఇస్మాయిల్, సాక్షి టీవీ -
భారతీయులకు థాయ్ వెలుగుల ఆహ్వానం
భారత పర్యాటకులను భారీగా ఆకర్షించడం, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్దఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా థాయిలాండ్ వ్యూహరచన చేసింది. ఇందుకు వెలుగుల పండుగ దీపావళిని వేదికగా చేసుకుంది. ‘గ్రాండ్ దివాళిృ2025’ వేడుకలను భారీగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ నెల 16 నుంచి 31 వరకు ప్రతిష్టాత్మకంగా థాయ్ - భారత్ సాంస్కృతిక మేళవింపులతో వెలుగుల పండుగకు ఏర్పాట్లు చేస్తోంది. అద్భుత లైటింగ్ ప్రదర్శనలకు తోడు సాంస్కృతిక కార్యక్రమాల్లో లీనమయ్యే ప్రత్యేక అనుభవాలను పర్యాటకులకు అందించేలా షెడ్యూల్ను ప్రకటించింది. భారతదేశం వెలుపల అతిపెద్ద దీపావళి వేడుకను ‘ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’గా పిలుస్తోంది. ఈ ఘట్టానికి ‘ఐకానిక్ ఓంగ్ ఆంగ్ కెనాల్, ఫహురత్ ప్రాంతాలను కేంద్ర బిందువులుగా మారుస్తోంది. - సాక్షి, అమరావతిఈ నెల 16 నుంచి 31 వరకు థాయిలాండ్లో గ్రాండ్ దివాళి వేడుక భారత పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రణాళిక తద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ఆదాయం వచ్చేలా వ్యూహ రచన లైట్ షోలు, స్థానికృభారతీయ మేళవింపుతో సాంస్కృతిక ప్రదర్శనలు విమానాశ్రయాల నుంచే పర్యాటక సేవలపై రాయితీల జల్లు కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలతో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు దీపావళి వెలుగుల వేడుక ఇలా.. మధురానుభూతి మిగిలిపోయేలా.. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫహురత్, ఓంగ్ ఆంగ్ కెనాల్ ప్రాంతాల్లో వేడుకలు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్ అండ్ లైటింగ్ షోలు. కమ్యూనిటీ ఈవెంట్లు రాత్రిళ్లు ఆకర్షణీయమైన సౌండ్ అండ్ లైటింగ్ షోలు. కమ్యూనిటీ ఈవెంట్లు ప్రధాన ఆకర్షణగా థాయ్-ఇండియన్ రామాయణ ప్రదర్శన లాంతర్ నృత్యాలు, భరత నాట్యం, అసోం నుంచి బిహు జానపద నృత్యం, బాలీవుడ్ నృత్యం, భారత సమకాలీన నృత్య ప్రదర్శనలుసహా రెండు దేశాల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు గోరింట (మెహందీ), లాంతరు పెయింటింగ్, పూసలుృబుట్ట నేయడం వంటి ఆటవిడుపు వర్క్షాపుల నిర్వహణ ప్రాన్ బిర్యానీ, మసాలా దోస, పానీపూరిసహా నోరూరించే ఇతర భారతీయ వంటకాలు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించే లక్ష్మీదేవి, గణేశుడి ఆరాధన కార్యక్రమాలు ఓంగ్ ఆంగ్ కెనాల్ తీరంలో రంగోలి, నీటిపై తేలియాడేనూనె దీపాల ప్రదర్శనలు లక్ష మంది హాజరు! ‘అమేజింగ్ థాయిలాండ్ గ్రాండ్ దీపావళి ఫెస్టివల్’కు లక్ష మందికిపైగా హాజరవుతారని థాయ్ టూరిజం అథారిటీ ప్రకటించింది. ఈ ఒక్క వేడుక ద్వారానే ఆ దేశానికి 650 మిలియన్ బాట్ల (దాదాపు 20 మిలియన్ డాలర్లు) రెవెన్యూ వస్తుందని అంచనా వేసింది. దీనికి తోడు పర్యాటకులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. డాన్ ముయాంగ్, సువర్ణభూమి విమానాశ్రయాల నుంచి వేడుక నిర్వహించే వేదికల వరకూ కీలక ప్రదేశాల్లో పర్యాటక సేవల వ్యయాలపై రాయితీలు కురిపిస్తోంది. భద్రతను దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ కెమెరాలు, వాహనాలను వినియోగించనుంది. ఒక్క ఈ నెలలోనే భారతీయ సందర్శకుల సంఖ్య 30 శాతం పెరుగుతుందనే ధీమా వ్యక్తం చేస్తోంది. 60 రోజుల పాటు వీసా మినహాయింపు కల్పిం చింది. వ్యక్తికి రూ.90 వేల వరకు వ్యయం! ప్రతి ఏటా థాయిలాండ్ను సందర్శిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్లో ఇప్పటి వరకు థాయిలాండ్లో దాదాపు 18 లక్షల మంది భారతీయులు పర్యటించారు. థాయ్కు అత్యధికంగా వచ్చే సందర్శకుల సంఖ్యలో మొదటి మూడు దేశాల్లో భారత్ ఒకటి. బ్యాంకాక్, ఫుకెట్, క్రాబీ, కో స్మామ్యూయ్ వంటి థాయ్ గమ్యస్థానాలు భారతీయ పర్యాటకుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. దీనిని మరింత విస్తృతం చేసుకోవడం ద్వారా ఈ ఏడాది నాటికి 25 లక్షల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా థాయ్ ప్రణాళికలు రూపొందిస్తోంది. థాయ్కి వచ్చే భారతీయ సందర్శకులు సాధారణంగా సగటున ఒక వ్యక్తికి రూ.90 వేల వరకు ఖర్చు చేస్తారని, దాదాపు 6–7 రాత్రులు బస చేస్తారని తేలింది. -
ఒక ఫైటర్ జెట్ 3.5 కోట్ల పూసలు
దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారుడు రాల్ఫ్ జిమాన్ అయిదేళ్లపాటు 3.5 కోట్ల పూసలు ఉపయోగించి ఒక పాత సోవియట్ మిగ్–21 ఫైటర్ జెట్కు కొత్త రూపాన్ని ఇచ్చాడు. యుద్ధ చిహా్నలను కళాఖండాలుగా మార్చే అతని ‘వెపన్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్’ శ్రేణిలో ఇది చివరిది, అత్యంత ప్రతిష్టాత్మకమైనది. రాల్ఫ్ జిమాన్కు చిన్నప్పటి నుంచే ఆయుధాలతో భయంకరమైన అనుభవాలున్నాయి. 1970లలో, జోహన్నెస్బర్గ్లో 13 లేదా 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అతన్ని ఓ వ్యక్తి .45 మాగ్నమ్ తుపాకీతో బెదిరించాడు. కానీ తనకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు 15 నుంచి 20 సార్లు తుపాకీ గురి పెట్టినట్లు జిమాన్ గుర్తు చేసుకున్నాడు. ఈ భయంకరమైన అనుభవాల వల్లే ఆయన ‘తుపాకుల వ్యతిరేకి’గా మారారు. ప్రస్తుతం లాస్ ఏంజిలెస్లో ఉంటున్న జిమాన్, వృత్తిరీత్యా కమర్షియల్ ఫొటోగ్రాఫర్, ఫిల్మ్మేకర్. దశాబ్ద కాలంగా యుద్ధ కళాఖండాలను లక్షలాది చేతితో అల్లిన పూసలు ఉపయోగించి కళాత్మక వస్తువులుగా మార్చ డమే తన పనిగా పెట్టుకున్నాడు. జిమాన్ తన కళాఖండాల ద్వారా దక్షిణాఫ్రికా చరిత్రలో హింసపై ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం 2019లో అత్యంత పెద్ద సవాలుగా మిగ్–21 విమానాన్ని ఎంచుకున్నాడు. అయిదేళ్ల కష్టం.. మిగ్–21 కళాఖండం మొదట, జిమాన్ ఫ్లోరిడాలోని ఒక సైనిక కాంట్రాక్టర్ నుండి మిగ్–21 జెట్ను కొనుగోలు చేశాడు. అది ముక్కలుగా, మంచి స్థితిలో లేకపోయినా, కళాఖండంగా మార్చడానికి కచ్చితంగా సరిపోతుందని ఆయన భావించాడు. తొలు త ఆయన బృందం మిగ్ ఇంజన్ను తొలగించి విమానాన్ని లాస్ ఏంజిలెస్లోని స్టూడియోకు తరలించింది. జిమాన్ అల్యూమినియం ప్యానెల్లపై డిజైన్లను రూపొందించి, ఆ పేపర్ షీట్లను దక్షిణాఫ్రికాకు పంపాడు. జోహన్నెస్బర్గ్, క్వాజులు–నటల్, మ్పుమలంగా ప్రావిన్సుల నుండి వచ్చిన జింబాబ్వేయన్, న్డెబెలె కమ్యూనిటీలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు ఈ ప్యానెళ్లను పూసలతో తయారు చేయడం ప్రారంభించారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. 51 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు ఉన్న ఈ విమానంపై సుమారు 3.5 కోట్ల పూసలు అమర్చినట్లు అంచనా.విద్యకు నిధి మిగ్–21 ప్రాజెక్టుకు మద్దతు ఇచి్చన డీటీగ్రుయిల్లె చారిటీ సంస్థ ద్వారా ఈ కళాకారుల పిల్లలు, ఇతర యువత 25 మంది విద్యకు స్పాన్సర్íÙప్ లభిస్తోంది. వీరు వైద్యం, నర్సింగ్, ఫ్యాషన్ డిజైన్ వంటి కోర్సులు చదువుతున్నారు. ఈ అద్భుతమైన మిగ్–21 విమాన కళాఖండాన్ని అమెరికాలో ప్రదర్శన తర్వాత అమ్మకానికి ఉంచుతారు. దీనిద్వారా వచ్చే నిధులు విద్యా కార్యక్రమాలకు, ఉక్రెయిన్లో యుద్ధ బాధితులైన పిల్లలకు ఆర్ట్ థెరపీ అందించడానికి వినియోగిస్తారు. యుద్ధ చిహ్నాలను ఆకర్షణీయమైన కళాఖండాలుగా మార్చడం ద్వారా రాల్ఫ్ జిమాన్ కళతో శాంతి, ఆశ సందేశాన్ని ప్రపంచానికి బలంగా తెలియజేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అమ్మ... నాన్న... నాలుగో సింహం
అణువంత ప్రోత్సాహంతో అంతులేనన్ని విజయాలు సాధిస్తామని నిరూపించారు. అపజయాలెన్ని ఎదురైనా వెరవకుండా లక్ష్యాన్ని సాధించి చూ పారు. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహం.. భరోసాతో దేశంలోనే అత్యున్నత సర్వీస్లలో ఒకటైన ఇండియన్ పోలీస్ సర్వీసెస్కు ఎంపికై శభాష్ అనిపించుకున్నారు. ఓ కూతురు కండక్టర్ అయిన తన తండ్రి కల నెరవేర్చితే... మరో కూతురు తన తండ్రి నుంచి పొందిన స్ఫూర్తితో సమాజ సేవకు సిద్ధమైంది.అమ్మ అండతో సాటి మహిళలకు భరోసాగా నిలిచే పోలీస్ అధికారి అవుతానని మరొకరు నిరూపించారు. నేషనల్ పోలీస్ అకాడమీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 174 మందిలో 77 ఆర్ఆర్ (రెగ్యులర్ రిక్రూటీస్) బ్యాచ్ ఐపీఎస్ అధికారులు నేడు నిర్వహించనున్న పాసింగ్ ఔట్పరేడ్తో (passing out parade) బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బ్యాచ్లోని ముగ్గురు మహిళా ఐపీఎస్ల మనోగతం.. వారి మాటల్లోనే...అమ్మ ఇచ్చిన భరోసాతోనే ముందుకు వెళ్లా!నేను ఐపీఎస్ అధికారి అయ్యానంటే అందుకు వందశాతం మా అమ్మే కారణం. నేను ఓటమి పాలైన ప్రతిసారి నాలో ధైర్యాన్ని నింపింది అమ్మ. ఒత్తిడిలో కూరుకుపోయిన ప్రతిసారీ నాకు భరోసా ఇచ్చి నన్ను ఇక్కడివరకు నడిపింది మా అమ్మ నీతూశర్మే. నా పేరు జయశర్మ. నా స్వస్థలం హర్యానాలోని హిస్సార్. మా నాన్న ప్రమోద్ కుమార్ శర్మ. నాన్న డిస్ట్రిక్ట్ ఫుడ్ సప్లై కంట్రోలర్గా పనిచేస్తున్నారు. అమ్మ గృహిణి. నేను ఢిల్లీ యూనివర్సిటీలో బీఎస్సీ మ్యాథ్స్ ఆనర్స్, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశాను. నాకు ఐపీఎస్ కావాలని చిన్ననాటి నుంచే కల. అమ్మ ప్రోత్సాహం, నాన్న అండతో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్పై దృష్టి పెట్టా. ఇది ఎంతో కష్టమైన పని. కొన్నిసార్లు మనపై మనం నమ్మకాన్ని కోల్పోతాం. ఇది మన వల్ల కాదనిపిస్తుంది. అలాంటప్పుడు మనల్ని ప్రోత్సహించేవాళ్లు, భరోసా ఇచ్చేవాళ్లు ఎంతో అవసరం. నేను కూడా మూడుసార్లు సివిల్స్కి ఎంపిక కాకపోయినా నిరుత్సాహ పడలేదు. తప్పులు సరిచేసుకుంటూ ముందు వెళ్లా. ఐపీఎస్ ఎలాగైనా సాధించాలన్న నా పట్టుదలకు తోడు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. నాల్గో ప్రయత్నంలో నేను అనుకున్నట్టుగానే ఐపీఎస్కి ఎంపికయ్యాను. నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్పీఏ)లో శిక్షణ పూర్తిగా భిన్నమైంది. నేను ఎన్ పీఏలోకి రాకముందు కనీసం వంద మీటర్లు కూడా పరిగెత్తినట్టు గుర్తు లేదు. కానీ ఇక్కడ శిక్షణతో ఇప్పుడు ఒంటిపై బరువు, చేతిలో రైపిల్తో 40 కిలోమీటర్లు కూడా రన్నింగ్ చేసేంత స్థై్థర్యం వచ్చింది. మహిళా ఐపీఎస్ అధికారిగా మహిళా భద్రత, సైబర్ భద్రతపై ప్రత్యేక దృష్టి పెడతాను. – జయశర్మనాలుగుసార్లు ఓడినా.. నాన్న ప్రోత్సాహం తగ్గలేదుమా స్వస్థలం తమిళనాడులోని కన్యాకుమారి. నాన్న బస్ కండక్టర్గా పనిచేసి ఈ ఏడాది రిటైర్ అయ్యారు. అమ్మ గృహిణి. మా అక్క ప్రైవేటు ఉద్యోగిని. మేం ఇద్దరమూ అమ్మాయిలమే అయినా.. నాన్న మమ్మల్ని అన్నింటిలో ప్రోత్సహించేవారు. నేను అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఇంజినీరింగ్ (Engineering) పూర్తి చేశాను. ప్రభుత్వ అధికారిగా ఉంటేనే సమాజానికి దగ్గరగా పనిచేయవచ్చని నాకు మొదటి నుంచి ఉండేది. అందుకే ఇంజినీరింగ్ తర్వాత ప్రైవేటు ఉద్యోగాలవైపు వెళ్లలేదు. తమిళనాడులో స్టేట్ జీఎస్టీ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశాను. కానీ.. నన్ను ఐపీఎస్ ఆఫీసర్ను చేయాలన్నది నాన్న కల. అయితే సివిల్స్ కు ఎంపిక కావడం అంత సులువేం కాదు. ఐదో ప్రయత్నంలో ఐపీఎస్ సాధించానంటే నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. ఎప్పటికప్పుడు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ, వ్యక్తిగతంగా నోట్స్ తయారు చేసుకుంటూ నా ప్రయత్నాన్ని కొనసాగించాను. చివరికి విజయం దక్కింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకునే అవకాశంతో పాటు మనలో ఉన్న సామర్థ్యాన్ని మనకు తెలియజేస్తుంది నేషనల్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్. ఈ శిక్షణ తర్వాత నేను ఎంతో భరోసాగా చెప్పగలను – పోలీస్ ఉద్యోగం మహిళలు కూడా ఎంతో బాగా చేయగలరని! మా బ్యాచ్లో కూడా 65 మంది మహిళా ఐపీఎస్లు ఉండడమే అందుకు ఉదాహరణ. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్లకి నా సలహా ఒక్కటే..సివిల్స్ సాధించడం అనేది మీ లక్ష్యం అయితే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మధ్యలో వదలొద్దని ముందే నిర్ణయించుకోవాలి. ఒత్తిడి లేకుండా ప్రణాళిక ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడు విజయం మనదే.– అశ్విని.ఎస్నాకు స్ఫూర్తి మా నాన్నేనాన్న ఎయిర్మెన్ గా ఇండియన్ ఎయిర్ఫోర్స్లో పని చేసి రిటైర్ అయ్యారు. ఇంట్లో ఎంతో క్రమశిక్షణ ఉండేది. నా చిన్నప్పటి నుంచి నాన్నను అలా యూనిఫాంలో చూస్తూ పెరగడంతో నాకు కూడా యూనిఫాం సర్వీసెస్ అంటే ఎంతో గౌరవం ఏర్పడింది. ఆయనే నాకు ఎప్పటికీ స్ఫూర్తి. స్కూలింగ్ పూర్తయి, కాలేజీకి వచ్చాక నాకు స్పష్టత వచ్చింది ఐపీఎస్ అధికారి అయితే ప్రజలకు నేరుగా సేవ చేసే అవకాశం ఉంటుందని. అందుకే ఎప్పటికైనా ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్లా. గ్జేవియర్స్ కాలేజ్ కోల్కతా నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తయి తర్వాత నేను మొదటి ప్రయత్నంలో సీఐఎస్ఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా ఎంపికయ్యాను. 2020 లో ట్రైనింగ్ చేస్తూనే సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించాను. చదవండి: అంబానీ వంటింట్లో పెత్తనం పెద్ద కోడలిదా? చిన్నకోడలిదా?ఆ తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కు ఎంపికయ్యాను. అయినా, ఐపీఎస్ కలను వదల్లేదు. నాల్గో ప్రయత్నంలో నాకు ఐపీఎస్ (IPS) వచ్చింది. నాన్న ఎయిర్ఫోర్స్లో పనిచేయడం.. మొదటి నుంచి ఎంతో క్రమశిక్షణతో పెరగడంతో ఇక్కడి ట్రైనింగ్ కష్టంగా అనిపించలేదు. సులువుగానే శిక్షణ పూర్తి చేశా. ఇక్కడ నేర్చుకున్న విషయాలు వృత్తిగతంగానే కాకుండా వ్యక్తిగతంగా నన్ను ఎంతో మార్చాయి. నాకు తెలంగాణ పోలీసులో మహేశ్ భగవత్ ఇన్స్పిరేషన్. ఐపీఎస్ అధికారిగా నేను మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. నేను హర్యానాలో పుట్టిపెరిగాను. అక్కడి పరిస్థితులు చూశాక.. మహిళా భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.– కీర్తియాదవ్ -
ఏఐ టాయిలెట్!
సాక్షి, సాగుబడి: కృత్రిమ మేధ.. ఇప్పుడు టాయిలెట్ని కూడా అత్యా ధునిక స్మార్ట్ లేబొరేటరీగా మార్చేసింది! మనకు మున్ముందు రాగల జబ్బుల్ని ముందుగానే పసిగట్టే ఆధారపడదగిన గట్ హెల్త్ డేటాను.. చిటికెలో మొబైల్ యాప్లోకే అప్లోడ్ చేసేస్తాయట ఈ సూపర్ స్మార్ట్ ఏఐ టాయిలెట్లు!అన్ని రంగాల మాదిరిగానే రోజువారీ వ్యక్తిగత ఆరోగ్య సమాచార సేకరణ వ్యవస్థ కూడా అత్యాధునికతను సంతరించుకుంటోంది. పొద్దున్నే నిద్ర లేవగానే చిటికెలో ఆనాటి తాజా వ్యక్తిగత ఆరోగ్య గణాంకాలను అందించే మొబైల్ యాప్లు, డిజిటల్ ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సరికొత్త కొనసాగింపుగా వచ్చిందే స్మార్ట్ మరుగుదొడ్డి!కూర్చుని లేచేలోపే..మలమూత్ర విసర్జన చేస్తున్నంతటి సేపట్లోనే సెన్సార్లు, కృత్రిమ మేధ విశ్లేషణ పరికరాలు.. మల మూత్రాల రంగు, రూపు, నాణ్యతలను బట్టి ఆరోగ్య స్థితిగతుల్ని ఇట్టే పసిగట్టేస్తాయి. కడుపులో సూక్ష్మజీవరాశి ఎంత ఆరోగ్యంగా ఉందో, ఏదైనా తేడా ఉంటే దాని వల్ల ఏయే వ్యాధులు ముసురుకునే ప్రమాదం పొంచి ఉందో కూడా తేల్చి చెప్పేస్తాయి. కమోడ్ మీద కూర్చొని, లేచే సమయానికే ఈ సమస్త సమాచారం మొబైల్ యాప్లో అప్లోడ్ చేసేస్తాయి ఈ ఏఐ టాయిలెట్లు! ప్రత్యక్ష పరీక్షల మాదిరిగా నూటికి నూరు శాతం కచ్చితత్వంతో ఈ పరీక్షల ఫలితాలు ఉంటాయని అనుకోలేం. కానీ, కొలరెక్టల్ కేన్సర్ వంటి అనేక జబ్బుల్ని అత్యంత తొలి దశలోనే గుర్తించటంలో సూపర్ స్మార్ట్ టాయిలెట్ల పాత్రను తోసిపుచ్చలేమని నిపుణులు చెబుతున్నారు. జపాన్లో తయారీస్మార్ట్ టాయిలెట్ల తయారీలో జపాన్కు చెందిన టోటో టాయిలెట్స్ సంస్థ ఒక ముందడుగు వేసింది. మరుగుదొడ్డి కమోడ్కు అమర్చిన సెన్సార్.. మలం రంగు, ఆకారం, పరిమాణం వంటి వివరాలను అందిస్తుంది. బార్కోడ్ స్కానర్ మాదిరిగా క్షణాల్లో రిపోర్టు ఇస్తుంది. మనిషి కూర్చోగానే సెన్సార్ యాక్టివేట్ అవుతుంది. ఎల్ఈడీ లైటు వెలుతురులో మలాన్ని సెన్సార్ పరీక్షిస్తుంది. సేకరించిన సమాచారాన్ని అప్పటికప్పుడే స్మార్ట్ఫోన్ యాప్కు పంపిస్తుంది. మల విసర్జన చేసిన ప్రతిసారీ సేకరించిన సమాచారంతో కూడిన స్టూల్ కేలండర్ను ఈ యాప్ భద్రపరుస్తుంది. ట్రెండ్ ఎలా ఉంది.. ఏమైనా తేడాలున్నాయా.. ఉంటే, వాటిని సరిదిద్దుకోవటానికి జీవన శైలిని ఎలా మార్చుకోవాలో కూడా సూచనలిస్తుంది. సుఖ మల విసర్జనకు అనుసరించాల్సిన పద్ధతులను సూచిస్తుంది కూడా.ప్రత్యేక స్టార్టప్లుకృత్రిమ మేధతో కూడిన బాత్రూమ్ టెక్నాల జీలను అందించే స్టార్టప్లు అందుబాటులోకి వచ్చాయి. అమెరికాలోని ఆస్టిన్ నగరంలోని త్రోన్ అనే స్టార్టప్ మల మూత్రాల బాగోగులను విశ్లేషించేందుకు ఏఐ టాయిలెట్ కెమెరాను రూపొందించింది. టాయిలెట్ను ఉపయోగించే వ్యక్తి జీర్ణవ్యవస్థ పనితీరు, మూత్ర విసర్జన తీరు ఎలా ఉంది? ఆ వ్యక్తి సరిపడా నీరు తాగుతు న్నారా లేదా?.. వంటి రియల్ టైమ్ డేటాను కూడా మొబైల్ యాప్కు పంపుతుంది. ఎక్కువ మంది వాడే టాయిలెట్లలో కూడా ప్రతి యూజర్ గట్ ప్రొఫైల్ను త్రోన్ ఏఐ వ్యవస్థ సిద్ధం చేస్తుంది. టాయిలెట్ను వాడుతున్న వ్యక్తి ఎవరో బ్లూటూత్ ద్వారా గుర్తించి కచ్చితమైన వివరాలను ఎవరివి వాళ్లకు అందిస్తుంది. రోజువారీ బాత్రూమ్ అలవాట్ల ఆధారంగా వ్యక్తుల ఆరోగ్య సమాచార వ్యవస్థను సంపన్నం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. -
పేరాయణం!
ఈ పెద్దమనిషి పేరు చెప్పాలంటే 20 నిమిషాలు కావాలి. అంటే, ఓ సినిమా ఇంటర్వెల్ అయ్యేంత సేపు! అదండీ విషయం! మామూలుగా అయితే ఎవరినైనా పరిచయం చేసుకుంటే ‘హాయ్, నా పేరు ఫలానా’ అని సెకన్లలో చెప్పేస్తాం. కానీ, లారెన్స్ వాట్కిన్స్ అనే న్యూజిలాండ్ మాజీ సెక్యూరిటీ గార్డ్కి మాత్రం ఆ విధానం అస్సలు నచ్చలేదు! పేరు కాదది.. అష్టాదశ పురాణం!ఆయన పేరంటే పేరు కాదు, అదొక అష్టాదశ పురాణం! మొత్తం 2,253 పదాలు ఉంటాయిట! గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ‘ప్రపంచంలోనే అతి పొడవైన వ్యక్తిగత పేరు’.. అని అధికారికంగా ప్రకటించింది. అంటే.. ఆయన తన పూర్తి పేరు చెప్పడం మొదలుపెడితే.. మీరు ఒక కాఫీ తాగి రావచ్చు. ఓ రెండు చిన్న కవితలు రాసి ముగించవచ్చు. పక్కన ఉన్న స్నేహితుడితో ఓ దేశ రాజకీయాల గురించి చర్చ మొదలెట్టి ముగించవచ్చు కూడాను.. మీరు టిఫిన్ చేయడం పూర్తయ్యేలోపు కూడా ఆయన పేరు సగం కూడా పూర్తి కాదు మరి! పెళ్లి మండపంలోనూ అదే హంగామా!1991లో లారెన్స్ వాట్కిన్స్ మొదటి పెళ్లప్పుడు జరిగింది మరింత కామెడీ. ఆ పెళ్లి తంతు జరిపించే వ్యక్తి తెలివైన వాడు. రిస్క్ తీసుకోకుండా, లారెన్స్ గారి ఆ 2,253 పేర్ల లిస్ట్ను ముందుగానే రికార్డ్ చేశాడట!. మండపంలో మంగళవాయిద్యాల బదులు ఆ రికార్డింగ్ అర్ధగంట పాటు మోగుతూనే ఉందట!. అక్కడికి వచ్చిన అతిథులు షాంపైన్ తాగుతూ, ఆ అనంతమైన నామస్మరణను వింటూ హాయిగా తిరిగారట!. ఎట్టకేలకు 20 నిమిషాల తర్వాత, నామకరణ ఘట్టం ముగిశాక, ‘ఐ డూ’ అనే ముఖ్యమైన మాట చెప్పడానికి లారెన్స్ గారికి అవకాశం దొరికింది! ఆయన చిన్నప్పుడు ’రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ షో చూసి, గిన్నిస్ రికార్డ్స్ పుస్తకాలు చదివి, ‘నాలాంటి సాధారణ మనిషికి ఏ ప్రత్యేక ప్రతిభ లేదు’ అని బాధపడిపోయాడట. అప్పుడు, తనకున్న ఏకైక అవకాశం.. ప్రపంచంలోనే అతి పొడవైన పేరు పెట్టుకోవడమే అని డిసైడ్ అయ్యారు!సంతకం సంగతేంటి?రోజువారీ అవసరాల కోసం, ఆయన తన పేరును కేవలం ’లారెన్స్ అలోన్ అలోయ్ వాట్కిన్స్’ అని కుదించుకుని, సంతకాన్ని వాట్కిన్స్–5 (అయిదో తరం) అని పెడతారట. ఆయన పూర్తి పేరుతో ఉన్న పాత పాస్పోర్ట్కి ఏకంగా ఆరు అదనపు పేజీలు అవసరమయ్యాయట! ఇదే లారెన్స్ గారి పూర్తి పేరులారెన్స్ అలోన్ అలాయిస్ అలోయిసియస్ ఆల్ఫెజ్ అలున్ అలురెడ్ ఆల్విన్ అల్యాసాండిర్ ఆంబీ ఆంబ్రోస్ ఆంబ్రోసియస్ అమియాస్ అమియోట్ అమియాస్ అండర్స్ ఆండ్రీ ఆండ్రియా ఆండ్రియాస్ ఆండ్రూ ఆండీ అనైరిన్ ఆంగ్విష్ ఆన్లెయిఫర్ ఆంథిన్... (ఓస్.. ఇంతేనా అనుకున్నారు కదూ.. అయిపో లేదు.. ఇంకా ఉంది..)– సాక్షి, నేషనల్ డెస్క్ -
మందులు నాసి..ప్రాణాలు తీసి!
విషపూరిత దగ్గు మందు సేవించి మధ్యప్రదేశ్, రాజస్తాన్లలో పిల్లల మరణాలు సంభవించిన ఘటనతో నాణ్యత లేని మందుల గురించి దేశవ్యాప్తంగా చర్చ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఈ ఏడాది జనవరి – ఆగస్టు మధ్య నిర్వహించిన నాన్–స్టాండర్డ్ క్వాలిటీ డ్రగ్స్ (ఎన్ఎస్క్యూడీ) పరీక్షల్లో 1,184 మందులు నాణ్యత లేనివిగా తేలింది. వీటిలో ట్యాబ్లెట్స్ 51%, ఇంజెక్షన్లు 18%, సిరప్స్ 11% ఉన్నాయి. నియంత్రణ సంస్థలు నిర్దేశించినట్టుగా నాణ్య త, భద్రత, సామర్థ్య ప్రమాణాలు లేని ఔషధాలను ఎన్ఎస్క్యూడీగా పరిగణిస్తారు. 2019తో పోలిస్తే ఎన్ఎస్క్యూడీ పరీక్షల్లో నాసిరకమైనవని తేలిన ఔషధాల సంఖ్య దాదాపు మూడింతలు కావడం ఆందోళన కలిగించే అంశం. మనదేశంలో తయారైన దగ్గు సిరప్స్ 2023లో గాంబియాలో డజన్ల కొద్దీ పిల్లల మరణాలకు కారణమై వివాదానికి దారితీసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్కేంద్ర ప్రభుత్వం ఈ ఆగస్టులో లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 5 ఏళ్లలో నాణ్యత లేని ఔషధాల సంఖ్య పెరుగుతోంది. 2024–25లో మొత్తం 1.16 లక్షలకుపైగా ఔషధాల శాంపిళ్లు పరీక్షించగా.. 3,104 నాణ్యత లేనివిగా తేలాయి. నకిలీ / కల్తీగా గుర్తించినవి 245. కల్తీ మందులపై పెడుతున్న కేసులు కూడా ఏటా పెరుగుతున్నాయి. నకిలీ మందులను అరికట్టడానికి.. కేంద్ర ప్రభుత్వం బార్ కోడ్ / క్యూఆర్ కోడ్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఔషధాల లేబుళ్లు లేదా వీలున్న చోట బార్ కోడ్ ద్వారా.. ఆ ఔషధానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలి. పశ్చిమ బెంగాల్లో ఎక్కువకేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో నాణ్యత లేని మందులకు సంబంధించి కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రం పశ్చిమబెంగాల్. అత్యధిక కేసులు (శాతాల్లో) నమోదైన రాష్ట్రాలు.. -
ఆ దివ్య తోటలోనికి ఆమె తరలి వెళ్లింది
‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము’ అని గానం చేసి తెలుగువారి అపురూప గాయనిగా నిలిచిన రావు బాలసరస్వతి దివిలోని దివ్య పాటల లోగిలికి తరలి వెళ్లారు.‘మల్లెపూలు మొల్లపూలు కల్వపూలు కావాలా’... అని సుమగీతాలనిచ్చిన రావు బాలసరస్వతి వాడని పూలుండే లోకానికి బయలుదేరారు. గాయనిగా సవాళ్లు ఎదుర్కొన్నా గొంతు ఖైదు చేయబడినా నిలిచిన నాలుగు నిక్కమైన నీలాలతోనే నేటికీ మిలమిలలాడిన ఆమె వజ్రాల నదులు పారే అంబరాల బాట పట్టారు. ఆమెకు తెలుగువారి నివాళి. లలిత సంగీత ప్రపంచపు సురాగమయ జోహారు.ఈ వేళ పొద్దున్నే ఫేస్బుక్లో, ఇతర గ్రూపుల్లో రావు బాలసరస్వతి గారి ఫొటో చూడగానే మనసు కీడు శంకించింది. చాలా రోజులు నుంచి ఆమె ఆరోగ్యం బాగా లేదని తెలుసు. అయినా వున్నారనే ఆలోచన తృప్తినిస్తుంది. ఇంక ఈ రోజు తో ఆ ఆశ లేదు. ఆమె తెలుగువారి తొలి నేపథ్యగాయని అవునో కాదో ఆ చర్చ వేరేగాని తొలి ప్రముఖ నేపథ్య గాయని అనడంలో ఎటువంటి సందేహం లేదు. సి.ఆర్.సుబ్బరామన్, ఎస్.రాజేశ్వరరావుల సంగీతంలో ఎన్ని గొప్ప పాటలు. ‘దేవదాసు’లో ఆమె పాడిన ‘తానే మారెనా... గుణమ్మే మారెనా’ పాట ఎంతమందికో ఇష్టం. ఆమె పాడిన ’ఆ తోటలో నొకటి ఆరాధనాలయము’ విని ‘అందులో ఆమె అందగాడెవరే అని గొంతెత్తి పాడుతూ వుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది’ అన్నారు మహా రచయిత చలం. అంత మధురమైన స్వరం బాలసరస్వతిది. చాలా ఏళ్ల క్రితం గుంటూరులో ప్రోగ్రాం. కారణం ‘అజో విభో అవార్డు’ ఆమెను వరించింది. ఆ సభకు హాలులో జనం పోటెత్తారు. ఎన్ని రోజులు అయింది! ఆమెని చూడాలి. ఆమె పాట వినాలి. అప్పటికే భర్త ఆంక్షలతో ఆంధ్రదేశం ఆమె పాటకి దూరమై దాదాపు అర్ధ శతాబ్దం అయింది. అందుకే అదో అపురూప అవకాశం అని విజయవాడ నుంచి మేమూ వెళ్ళాం. ఎప్పటిలా నేను పాడనని నిర్వాహకులకి చె΄్పారుట. అవార్డు ఇచ్చాక ‘అమ్మా... ఒక ముక్క పాడండి’ అని ప్రేక్షకులు ఒక్క గొంతుతో అడిగితే సరేనని –చలి గాలి వీచింది – తెరవారబోతోందిఇకనైన ఇలు చేరవా – ఓ ప్రియా ఇకనైన ఇలు చేరవా...పాట వింటూ అందరూ చప్పట్లు కొట్టారు. ఆ ఉద్వేగాన్ని మర్చిపోలేను. అందరి కళ్లలో నీళ్ళు! లేచి నిల్చుని చప్పట్లు. మారుమోగిన హాలు. ఆ తర్వాత ఆమెతో చనువు ఏర్పడ్డాక అడిగాను ’ఎందుకలా పాడనంటారు’ అని . ‘చాలా రోజులుగా పాడలేదు గదా... అప్పటి పాటలా రాకపోతే నాకు బాగుండదు’ అన్నారు. ’ఎవరన్నారు మీ పాట అప్పటి పాటలా లేదని.? వయసుతో మరింత అందం వచ్చింది’ అన్నాను. నిజమే! ఆ గొంతులో మధురిమ ఏ మాత్రం తగ్గలేదు. ‘బెజవాడ వచ్చి నాలుగు రోజులు మీ ఇంట్లో వుంటా, నన్ను పాడమని అడగద్దు’ అన్నారొకసారి. అలాగేనని తీసుకుని వచ్చాను. మహీధర రామ్మోహనరావు గారు, నండూరి రామ్మోహనరావు గారు... ఇలా అందరూ వచ్చారు ఆమెను చూడటానికి. ఆమెకీ వారందరంటే అభిమానమే. అందరూ ఇంట్లో కూర్చుని కబుర్లు మొదలు పెట్టాక పాట ఎలా ఆగుతుంది? రామ్మోహనరావు గారి కోరిక పై ‘ఆ తోటలో నొకటి ఆరాధనాలయం’ పాడారు. ‘రెల్లు పూల పానుపు పైన ఎవరో వెన్నెల జల్లినారమ్మా!’ అని ఆమె పాడుతూ ఉంటే నిజంగానే వెన్నెల మా అందరి మనసుల్లో. ఆ స్వరం జల్లుజల్లుగా కురిపించింది. అంత మంది పండితులు, కవులు మధ్య కూర్చునే సరికి ఆ కోయిల అలా నాలుగు గంటలసేపు పాడింది! ఎంత భాగ్యం కదా!అదే మొదలు. ఎప్పుడు రావాలి అని అనిపిస్తే అపుడు విజయవాడ రావడం నాలుగు రోజులు వుండడం. మా ఇంట్లో కుదరని పరిస్థితి వచ్చినప్పుడు హేమ పరిమిగారిని అడిగాను. ఆమె ఎంతో సంతోషించి వారి పొదరింట్లో రెండు మూడుసార్లు ఆతిథ్యం యిచ్చారు. బాలసరస్వతి గారి పాట ఎంత మధురమో మనసు అంత సున్నితం. ఒకసారి స్నేహం చేస్తే మర్చిపోరు. ఆత్మీయతను పదిసార్లు గుర్తు తెచ్చుకుంటారు. మనకి ఆమె చిన్నప్పటి నుంచి తెలిసిన చుట్టం అవుతారు. రాగానే ముందు పాత పరిచయాలు గుర్తుకు తెచ్చుకుని వారిని ఒకసారి కలవాలి అని అనుకుంటారు. ‘అమ్మాయి’ అంటూ స్వంత కూతురులా చూసుకుంటారు. అలా వారి పెద్దబ్బాయి, చిన్నబ్బాయి మా వారిని అన్నయ్య అని, నన్ను వదినా అని కలిపేసుకున్నారు. మామయ్య గారి (బాలాంత్రపు రజనీకాంతరావు) పై అభిమానం. వి.ఏ.కే రంగారావు గారి దృష్టిలో ఆమె పాడిన అన్ని పాటలలోకి గొప్పది రజనీ గారు స్వరపరిచిన ‘తన పంతమే తా విడువడు’. ఆమెకు లలితమైన సంగీతం మాత్రమే యిష్టం. సుబ్బరామన్ సంగీతం ఆమెకు యిష్టం. హాయిగా పాడుకోవచ్చు అంటారు. తన గొంతుకు సరిపోయే పాట, సంగీతం అయితేనే పాడతారు. పాట పాడితే అది పదికాలాలు వుండాలి అంటారు. ‘పాట నాకు నచ్చకపోతే ఎంత పెద్దవాళ్ళైనా లేచి వెళ్లి పోతాను’ అంటారామె. అందుకే సంగీత దర్శకులు ‘బాలమ్మా సరేనా?’అని అడిగి ట్యూన్ చేసేవారట. మీరా భజనలు ఎంత గొప్పగా పాడేవారని. వసంతదేశాయి దగ్గర వాటిని నేర్చుకున్నారు. ‘మీరా భజన్ కర్ణాటక పద్ధతిలో పాడితే బాగుండదు’ అని ఆమె స్ధిర అభిప్రాయం. అందుకే హిందీ మాటలు పలికే పద్ధతిని నేర్చుకుని అదే విధంగా పాడేవారు. హిందీ చిత్ర పరిశ్రమలోకి వెళ్ళ లేకపోవడం ఆమెకు కొంచెం అసంతృప్తి. మనసులో కొంచెం ఆ బాధ మిగిలిపోయింది. హిందీ సినీ సంగీతం గురించి ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆమె ఇంట్లో ఉన్నప్పుడు ఈల వినపడితే ఎవరా అని ఇటు అటు చూస్తే ‘నేనే’ అని చిలిపిగా నవ్వేవారు. ‘అమ్మకి అల్లరి ఎక్కువ’ అని ఆమె పిల్లలు కూడా గారాబం చేసేవారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెకు ‘వైఎస్ఆర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డ్’ యిస్తే వచ్చేందుకు ఆరోగ్యం సహకరించలేదు. ఆ పురస్కారంతో పొటో దిగి పంపారు. ఇక మళ్ళీ ఆమెను చూడలేము. కాని పాట వున్నంత వరకూ ఆమె చిరస్థాయిగా వుండి పోతారు.– ప్రసూన బాలాంత్రపు -
జననాలు 2.52 కోట్లు..మరణాలు 86.6 లక్షలు
దేశవ్యాప్తంగా 2023లో 2.52 కోట్ల జననాలు నమోదయ్యాయి. 2022తో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు 2.32 లక్షలు తక్కువ. 2023లో 86.6 లక్షల మరణాలు నమోదయ్యాయి. మొత్తం జననాల్లో దాదాపు 75 శాతం ఆసుపత్రుల్లోనే జరగడం గమనార్హం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్ట్రార్ జనరల్, జన గణన కమిషనర్ కార్యాలయం 2023 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను ‘వైటల్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా’ పేరిట విడుదల చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కోవిడ్–19 డ్యాష్బోర్డ్లో 2025 మే 5 నాటికి మహమ్మారి వల్ల సంభవించిన మరణాల సంఖ్య 5,33,665గా ఉంది. 2022, 2023లో మరణాలలో పెద్దగా పెరుగుదల లేదని నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే 2021లో 21 లక్షలకు పైగా అధిక మరణాలు సంభవించాయి. 2020లో 81.2 లక్షలు, 2021లో 1.02 కోట్ల మంది కన్నుమూశారు. కొన్ని రాష్ట్రాలే..: నిర్ణీత కాలపరిమితి అయిన 21 రోజుల్లోపు 90% కంటే ఎక్కువ జననాల నమోదును 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే సాధించాయి. వీటిలో గుజరాత్, తమిళనాడు, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, గోవా, పంజాబ్ వంటివి ఉన్నాయి. ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు 80–90% జననాల నమోదు చేశాయి. ఢిల్లీ, మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, బిహార్, రాజస్తాన్ వంటి రాష్ట్రాలలో 50–80% జననాలు మాత్రమే నిర్ణీత కాలపరిమితి లోపు నమోదయ్యాయి.మగపిల్లలే ఎక్కువ2023 నమోదిత జనన గణాంకాలుజననాల్లో మగపిల్లలు 52.4%, ఆడపిల్లలు 47.6%పట్టణాల్లో 58.3%, గ్రామీణ ప్రాంతాల్లో 41.7% మంది పుట్టారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జననాల నమోదు ప్రక్రియను 100% పూర్తి చేశాయి.మరణాల్లో పురుషులే అధికంమరణాల్లో 60.6% పురుషులు, 39.4% స్త్రీలు ఉన్నారు.మరణాల్లో గ్రామీణులు 57.7%, పట్టణవాసులు 42.3% ఉన్నారు.ఆసుపత్రుల్లో మృతి చెందినవారు (సిక్కిం మినహా) 24%శిశువుల మరణాల్లో పట్టణాల వాటా 85.7%, గ్రామీణ ప్రాంతాల వాటా 14.3%. విదేశాల్లో జననాలు, మరణాలుప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఉంటున్న భారతీయులకు 2023లో మొత్తం 62,182 మంది జన్మించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, యూకే, ఖతార్లలోనే పుట్టడం విశేషం. విదేశాల్లోని భారతీయుల్లో 10,531 మంది మరణించారు. ఇందులో సగానికిపైగా యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్లలోనే సంభవించాయి.అత్యధిక శిశు మరణాలు..: 2023లో అత్యధిక శిశు మరణాలు సంభవించిన రాష్ట్రాలు.. మహారాష్ట్ర (17,436), గుజరాత్ (13,676), హరియాణా (11,622). ఏపీలో 6,852, తెలంగాణలో 3,956 సంభవించాయి. -
ఏఐ వచ్చినా..మన ఉద్యోగాలు సేఫ్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉపాధి కోల్పోతాం అన్న భావన చాలామందిలో ఉంది. ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో ఈ ఆందోళన నెలకొంది. ఈ విషయంలో మనం సేఫ్! భారత్లో కేవలం 6.4 శాతం ఉద్యోగాలకు మాత్రమే ఏఐ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. అంటే కృత్రిమ మేధ రాకతో భారతీయులపై ప్రతికూల ప్రభావం అతి తక్కువే అన్నమాట. పైగా ఈ నూతన సాంకేతికత వల్ల 15 శాతానికిపైగా ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయని వివరించింది. ఏఐ నియామకాల్లో దేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ పోటీపడుతుండడం విశేషం. ఇక ఏఐ పరివర్తనలో దక్షిణ ఆసియాలో భారత్ ముందంజలో దూసుకెళుతోంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ఉద్యోగ ప్రకటనల్లో ఏఐ వాటా దక్షిణాసియాలో ఇలా..శ్రీలంక 7.3భారత్ 5.8నేపాల్: 3.4బంగ్లాదేశ్: 1.4» ఏఐ రాకతో భారత్లో 15.6 శాతం ఉద్యోగాలు మరింత మెరుగుపడతాయి.» 6.4 శాతం జాబ్స్ను మాత్రమే ఏఐ కైవసం చేసుకుంటుంది.» సాంకేతిక సేవలకు పేరొందిన బెంగళూరు, హైదరాబాద్లలో ఏఐ సంబంధ ఉద్యోగాలు కేంద్రీకృతమయ్యాయి.» మొత్తం జాబ్ పోస్టింగ్స్లో ఏఐ సంబంధ ఉద్యోగాల వాటా మన దేశంలో 5.8 శాతం.» ఏఐ జాబ్స్లో జాతీయ సగటును మించి నాలుగు నగరాలు ముందంజలో ఉన్నాయి. దేశాల వారీగా ఏఐ రాకతో వివిధ రంగాల్లో మెరుగుపడే ఉద్యోగాలు, ప్రభావితం అయ్యే జాబ్స్, ఏమాత్రం ప్రభావం లేని విభాగాల శాతం -
ఓ మై గోల్డ్!
కాకినాడకు చెందిన శ్రీనివాస్ వచ్చే ఏడాది తన కుమార్తె పెళ్లి కోసం అప్పోసప్పో చేసి బంగారం కొందామనుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో రేటు దాదాపు రూ.78,000 స్థాయిలో ఉండగా గోల్డ్ షాప్నకు వెళ్లి కూడా కాస్త తగ్గితే కొందామనుకొని వెనక్కి వచ్చేశాడు. అంతే అక్కడి నుంచి కనకం పూనకం వచ్చినట్లు పెరుగుతూనే ఉంది. దీంతో చేసేదేమీ లేక ఈమధ్యే రూ.1,20,000 రేటుతో మూడు తులాలు కొన్నాడు. విచిత్రమేంటంటే ఆర్నెల్ల క్రితం అదే సొమ్ముకు అయిదు తులాలు వచ్చేది! అరెరే ఎంత తప్పు చేశానే.. అంటూ ఇప్పుడు ఆవేదన చెందుతున్నాడు.ఇక హైదరాబాద్వాసి నగేష్ కష్టాలు వేరు. వచ్చే నెలలో బాగా దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది. రెండేళ్ల క్రితం కుమారుడి పెళ్లిలో వారు తులం గోల్డ్ చైన్ చదివించారు. అప్పుడు రేటు 60,000. ఇప్పుడు పెళ్లిలో వాళ్లు పెట్టినంతైనా తిరిగి చదివించాలి.. లేదంటే పరువు పోతుంది. కొనాలంటే రూ.1.3 లక్షల పైమాటే. దీంతో రేటు తగ్గుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు. పుత్తడి మాత్రం తగ్గేదేలే అంటూ పరుగులు తీస్తుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. సాక్షి, బిజినెస్డెస్క్: సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో బంగారం ఇప్పుడు పెద్ద గుదిబండగా మారిందనేందుకు ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. నాన్స్టాప్ ర్యాలీతో పసిడి ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏడాది క్రితం రూ.78,000 స్థాయిలో ఉన్న 10 గ్రాముల (తులం) బంగారం రేటు తాజాగా రూ.1.3 లక్షలకు చేరి ‘నగ’ధగలాడిపోతోంది. రోజుకో కొత్త శిఖరాలకు దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లకు ఇది కనకవర్షం కురిపిస్తున్నప్పటికీ... తులమో పలమో కొందామనుకునే సామాన్యులకు మాత్రం దిక్కుతోచని పరిస్థితి. ఈ ఏడాది ఇప్పటిదాకా దేశీయంగా పసిడి ధర (Gold rate) 67 శాతం ఎగబాకింది. బంగారం రేటు రెండేళ్లలో రెట్టింపైతే... వెండి ఏడాదిలోపే డ‘బుల్‘ర్యాలీ చేయడం గమనార్హం. ఈ ఏడాది ఆరంభంలో కేజీ వెండి ధర రూ.89,000 కాగా, ఇప్పుడు ఏకంగా రూ.1.85 లక్షలకు చేరింది. అంటే ఏకంగా 107 శాతం ఎగబాకిందన్న మాట! ఇదిలా ఉంటే, మరో మూడు నెలల పాటు పెళ్లిళ్ల బాజా మోగనుండటం... కొనుగోలుదారుల్లో గుబులు పుట్టిస్తోంది. ధరాభారంతో వివాహాలు, ఇతర శుభకార్యాల ఖర్చుల తడిసిమోపెడవుతాయంటూ ఆందోళన చెందుతున్నారు. ‘మధ్యతరగతి కుటుంబాలకు బంగారం అందని ద్రాక్షలా మారింది. ఈ ఏడాది పసిడి రేటు అమాంతం లక్ష రూపాయలను దాటేయడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. కూతురు పెళ్లి కోసం నాలుగు తులాల బంగారం పెడదామనుకుంటే ఇప్పుడున్న రేటుతో తులంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది’అని కాజీపేటకు చెందిన మనమ్మ తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికే బస్సు మిస్సయ్యామన్న ఆత్రుత... ఇంకెంత పెరిగిపోతుందోనన్న ఆందోళన ఇప్పుడు సర్వత్రా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పెట్టుపోతలు... గుదిబండ గృహ ప్రవేశాలు, వోణీ పంక్షన్లు, బారసాలలు ఇలా ఏ శుభకార్యమైన ఎంతో కొంత బంగారం, వెండి గిఫ్టుల వంటి పెట్టుపోతలు కామన్. గోల్డ్, సిల్వర్ జోడు గుర్రాల్లా దూసుకుపోతుండటంతో చాలా వరకు పంక్షన్లలో ఇప్పుడు వీటి ఊసే ఎత్తలేని పరిస్థితి. పావు తులం కొనాలన్నా కనీసం రూ. 35 వేలకు తక్కువ అవ్వడం లేదు. దీంతో చాలా మంది ఐదు.. పది.. పాతిక వేలు చదివించి ‘మమ‘అనిపించుకుంటున్నారు. గతంలో తమ బంధువులు పెట్టినంతగా చదివించకపోతే నలుగురిలో మాట వస్తుందన్న భయం ఒకపక్క,.. పోనీ పెడదామంటే ఆర్థికంగా ఇబ్బంది మరోపక్క మధ్యతరగతి కుటుంబాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ‘మా పెద్ద అమ్మాయికి దగ్గరి బంధువులు బంగారం, వెండి వస్తువులను చదివించారు. ఇప్పుడు వారి ఇళ్లలో ఫంక్షన్ అయితే అంతే బంగారం, వెండి ఆభరణాలను చేయించలేకపోతున్నాం. అందుకే వారు పెట్టిన వస్తువులకు ఖరీదు చేసి నగదును కట్నంగా చదివిస్తున్నాం‘అని హనుమకొండకు చెందిన కత్తుల కవిత వాపోయారు. ఇదిలా ఉంటే, చిన్నాచితకా బంగారం షాపులపైగా రేటు ప్రభావం తీవ్రంగా ఉంది. ధర అమాంతం పెరిగిపోవడంతో కొనుగోళ్లు పడిపోయాయని, బిజినెస్ అంతగా నడవడం లేదని గోల్డ్ షాపుల వాళ్లు గగ్గోలు పెడుతున్నారు. గోల్డెన్ ర్యాలీ ఎందుకంటే... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలుపెట్టిన టారిఫ్ వార్తో ప్రంపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి మరింత పెరిగిపోయింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి తోడు పశ్చిమాసియాలో భగ్గుమన్న ఉద్రిక్తతలతో అప్పటికే ఎగబాకిన రేట్లకు వాణిజ్య యుద్ధం మరింత ఆజ్యం పోసింది. దీంతో సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు అందరూ పరుగులు తీస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయంగా ఔన్స్ 2,600 డాలర్లు ఉండగా.. అంతకంతకూ పెరుగుతూ తాజాగా 4,190 డాలర్ల ఆల్టైమ్ గరిష్టాన్ని తాకింది. అంటే 10 నెలల్లో 61 శాతం జంప్ చేసింది. తాజాగా అమెరికా–చైనా మధ్య టారిఫ్ యుద్ధం మరింత తీవ్రం కావడంతో బంగారం భగభగలాడిపోతోంది. మరోపక్క, గత కొన్నేళ్లుగా పసిడి ఉత్పత్తి మందగించి.. భూగర్భ నిల్వలు అడుగంటుతున్నాయి. ఆభరణాల డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నాయి. ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంది. ఆర్థిక అనిశ్చితి, యుద్ధ భయాలతో పాటు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు సగటున ఏటా 800 టన్నులు కొనడం గమనార్హం. మన ఆర్బీఐ వద్ద కూడా పసిడి నిల్వలు 880 టన్నులకు ఎగబాకాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడమే గోల్డెన్ రన్కు ప్రధాన కారణం. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. సెపె్టంబర్ చివరి నాటికి ప్రపంచ గోల్డ్ ఈటీఎఫ్ల విలువ 472 బిలియన్ డాలర్లకు ఎగబాకడం పెట్టుబడుల జోరుకు నిదర్శనం. మరోపక్క, వడ్డీరేట్లను తగ్గించాలంటూ ట్రంప్ పోరు పెడుతుండటంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోతకు సై అంది. ఏడాది కాలంలో ఫెడ్ రేటును 1 శాతం పైగా తగ్గించే అవకాశం ఉండటం కూడా బంగార ధరలకు మరింత బూస్ట్ ఇస్తోంది. రూపాయి వాత! అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు మోతమోగిస్తుండటే.. దేశీయంగా అంతకుమించి రూపాయి వాత పెడుతోంది. డాలరుతో రూపాయి విలువ అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరను దేశీయంగా మరింత ఎగదోస్తోంది. మూడేళ్ల క్రితం డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండగా... ఇప్పుడు ఏకంగా 88.82 ఆల్టైమ్ కనిష్టాలకు జారిపోయింది. అంటే రూపాయి పతనం దెబ్బకు మనం మరో రూ.10,000 అధనంగా చెల్లించుకోవాల్సి వస్తోందన్నమాట! ఈ పరుగు ఎందాకా..? ట్రంప్ అధికారంలో ఉన్నంత కాలం ఆర్థిక అనిశ్చితులకు తెరపడే సూచనలు కనిపించడం లేదు. టారిఫ్ వార్కు తోడు ఏ రోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న భయాలు అటు మార్కెట్లతో పాటు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోతను కొనసాగిస్తే.. డాలరు మరింత బలహీన పడే అవకాశాలున్నాయని, ఇది బంగారం మరింత పెరిగేందుకు దోహదం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. గోల్డ్మన్ శాక్స్ వచ్చే ఏడాది చివరికి గోల్డ్ అంచనాలను ఇప్పుడున్న 4,300 డాలర్ల నుంచి ఏకంగా 4,900 డాలర్లకు పెంచింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా 2026 అంచనా 5,000 డాలర్లు. దీని ప్రకారం చూస్తే, మన దగ్గర రేటు రూ.1.75 లక్షలను తాకొచ్చు. ఇక జెఫరీస్ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ ఉడ్ సైతం బంగారం ధరలు ఇక్కడి నుంచి మరింత పెరగొచ్చని అభిప్రాయపడ్డారు. రానున్న కాలంలో ఔన్స్ 6,600 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు అంటే మన దగ్గర అక్షరాలా రూ.2–2.5 లక్షలకు దూసుకుపోయే అవకాశం ఉంది. రూపాయి గనుక ఇంకా బక్కచిక్కితే పసిడి ధర మరింత కాంతులీనడం ఖాయమంటున్నారు విశ్లేషకులు! వస్తువులకు బదులు నగదు ఇస్తున్నాం.. నాలుగేళ్ల క్రితం పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. పది తులాల బంగారం, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి రూ.30 లక్షల వరకు అయ్యాయి. నాలుగు రోజుల క్రితం చిన్న అమ్మాయి పెళ్ళి చేశాం. పెద్ద అమ్మాయికి పెట్టినట్లుగా నగలు చేయించలేకపోయాం. నాలుగేళ్ల క్రితం 10 గ్రాముల బంగారం రూ.50 వేలు. ఇప్పుడు రూ.1.20 లక్షలు అయ్యింది. మా ఆదాయం మాత్రం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంది. వెండి కూడా అలాగే పెరిగింది. పెద్ద అమ్మాయికి దగ్గరి బంధువులు బంగారం, వెండి వస్తువులను చదివించారు. ఇప్పుడు వారి ఇళ్లలో ఫంక్షన్ అయితే అంతే బంగారం, వెండి ఆభరణాలను చేయించలేకపోతున్నాం. అందుకే వారు పెట్టిన వస్తువులకు ఖరీదు చేసి నగదును కట్నంగా చదివిస్తున్నాం. – కత్తుల కవిత, హనుమకొండ ఇమిటేషన్ జ్యువెలరీ వాడాల్సి వస్తోంది.. మధ్యతరగతి కుటుంబాలకు అందని ద్రాక్షలాగా బంగారం మారిపోయింది. ఈ ఏడాది పసిడి రేటు అమాంతం లక్ష రూపాయలను దాటేయడంతో సామాన్యులం బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది. కూతురు పెళ్లి కోసం నాలుగు తులాల బంగారం పెడదామనుకుంటే ఇప్పుడున్న బంగారం రేటుతో తులంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రూ. 50–60 వేల మధ్యలో బంగారం రేటు ఉంటే పెళ్లిళ్లకు కొనగలుగుతాం. వెండిదీ అదే పరిస్థితి కావడంతో, ఇమిటేషన్ జ్యువెలరీపై ఆధారపడాల్సి వస్తోంది. – మనమ్మ,, కాజీపేట ధరాభారంతో ఆందోళన... బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో ఆందోళనగా ఉంది. నాలుగేళ్ల క్రితం మా ఇంట్లో ఫంక్షన్ చేసినప్పుడు మా దగ్గరి బంధువులు బంగారు, వెండి ఆభరణాలు పెట్టారు. ప్రస్తుతం మా బంధువులకు చెందిన వివాహ శుభకార్యాలు ఉన్నాయి. మా ఫంక్షన్కు వారు పెట్టిన విధంగా మేము పెట్టాలంటే ప్రస్తుతం వెండి, బంగారం ధర రెట్టింపు అయింది. మధ్యతరగతి కుటుంబమైన మేము పెట్టుపోతల విషయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. మాకు వారు పెట్టినంతగా మేము ఇవ్వకుంటే నలుగురిలో మాట వస్తుంది. పెడదామంటే ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది. – కొలిపాక సునీత, స్టేషన్ఘన్పూర్, జనగామ జిల్లా సామాన్యులు కొనలేని పరిస్థితి... ఈ మధ్య కాలంలో బంగారం రేటు పెరుగుదల అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగితే సామాన్యులకు ఇక అందని ద్రాక్షే. త్వరలో కూతురు వివాహం చేయాలనుకుంటున్నాము. రేట్లు ఇంకా పెరుగుతాయనే ఆలోచనతో ఇప్పుడే నగలు కొనేస్తున్నాము. – నంద్యాల సరిత, నల్లగొండ రేట్లు బెంబేలెత్తిస్తున్నాయి పసిడి ధరలు చూస్తుంటే బెంబెలెత్తుతోంది త్వరలో చెల్లి వివాహం ఉంది. వివాహంలో అధిక ఖర్చు బంగారానిదే. రేటు భారీగా పెరిగిపోవడం వల్ల కాస్తోకూస్తో కొని సరిపెట్టుకుంటున్నాం. భవిష్యత్లో ధరలు తగ్గితే అప్పుడు మళ్లీ కొంటాం. మధ్య తరగతి కుటుంబాలు ప్రత్యామ్నాయ ఆభరణాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. – అనిల్ రెడ్డి, అన్నెపర్తి, నల్లగొండ నగల వర్తకుల కామెంట్స్ బిజినెస్ పడిపోయింది.. గత కొంత కాలంగా బంగారం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 2022లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల రేటు రూ.52 వేల స్థాయిలో ఉండగా.. ఇప్పుడది రూ.1.3 లక్షల పైకి ఎగసింది. దీంతో పుత్తడి కొనాలంటే ప్రజల్లో ఆందోళన నెలకొంది. వెండి కూడా రికార్డు స్థాయిలో కేజీ రూ.1.8 లక్షలకు చేరింది. దీంతో బంగారం కొనే వారి సంఖ్య తగ్గిపోతోంది. షాపుల్లో గిరాకీ సరిగ్గా ఉండడం లేదు. – చొక్కారపు వెంకన్న, గోల్డ్ షాపు యజమాని, నల్లగొండ రేటెంతైనా కొనేస్తున్నారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావంతో పసిడి పరుగులు తీస్తోంది. దీంతో ఇప్పుడంతా ఇన్వెస్టింగ్ కోణంలోకి మళ్లారు. పెళ్లిళ్లు, పండుగ సీజన్తో సంబంధం లేకుండా చేతిలో డబ్బు ఉంటే రేటు ఎంతైనా సరే కొనేస్తున్నారు. స్టాక్ ఎంత తెచ్చినా అమ్ముడైపోతోంది. 2028 నాటికి పసిడి రూ. 2.5 లక్షలు, వెండి కేజీ ధర రూ. 5 లక్షలకు చేరొచ్చని అంచనాలున్నాయి. కానీ ఈ పరుగులు చూస్తుంటే అంతకన్నా ముందే ఈ లక్ష్యాన్ని చేరొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం భారీగా పెరిగినందున కాస్త విరామం తీసుకోవచ్చు. అయితే ఒకవేళ తగ్గినా అది 15 శాతం వరకే పరిమితం కావొచ్చు. అంతకు మించి పడదని భావిస్తున్నాం. – ముకేశ్ సురానా, డైరెక్టర్, ఆదిత్యనాథ్ జ్యువెలర్స్ -
ఐదేళ్లు.. 3.63 లక్షల కిడ్నీ కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కిడ్నీ, కేన్సర్, గుండె జబ్బులకు సంబంధించిన కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లాలలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఈ వ్యాధులకు సంబంధించిన నమోదైన కేసులు, జరిగిన చికిత్సలు, అయిన ఖర్చు చూసి ఆరోగ్యశాఖ కూడా ఆందోళన చెందుతోంది. 13 వ్యాధులకు సంబంధించి ఐదేళ్లలో ఆరోగ్య శ్రీ కింద నమోదైన కేసులు ఏకంగా 12.59 లక్షలు ఉన్నట్లు తేలింది. ఈ వ్యాధులకు సగటున ప్రభుత్వం నెలకు ఆస్పత్రులకు చెల్లించిన మొత్తం రూ.50 కోట్లు. అంటే ఐదేళ్లలో ఏకంగా రూ.3,000 కోట్లు ఈ వ్యాధుల చికిత్సలకు మాత్రమే ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కింద చెల్లించినట్లు లెక్క తేల్చారు. ఇందులో కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. 25 కి.మీ.పరిధిలో ఓ డయాలసిస్ కేంద్రంరాష్ట్రంలో 2020 నుంచి 2025 ఆర్థిక సంవత్సరం వరకు ఆరోగ్యశ్రీ కింద 12 వ్యాధులకు సంబంధించి 12.59లక్షల కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా మూత్రపిండాలకు సంబంధించి 3,63,197 కేసులు నమోదయ్యాయి. వీటిలో 80% డయాలసిస్ కేసులే కావడం గమనార్హం. రాష్ట్రంలో 102 ప్రభుత్వ డయాలసిస్ సెంటర్లు ఉండగా, పెరుగుతున్న రోగులకు ఈ కేంద్రాలు సరిపోవడం లేదు. దీంతో జిల్లా కేంద్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లోని డయాలసిస్ సెంటర్లను రోగులు ఆశ్రయిస్తున్నారు.ఈ పరిస్థితిని సమీక్షించిన మంత్రి దామోదర రాజనర్సింహ జిల్లాల్లో డయాలసిస్ సెంటర్ల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించారు. ఎక్కడి నుంచైనా 25 కిలోమీటర్ల పరిధిలో ఓ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రైవేటు ఆస్పత్రులకు రోగుల తాకిడిని నిరోధించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. కిడ్నీ వ్యాధిగ్రస్తుల తరువాత అత్యంత ఆందోళన కలిగించే వ్యాధిగా కేన్సర్ను గుర్తించారు. గత ఐదేళ్లలో కేన్సర్ సంబంధ వ్యాధులతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారి సంఖ్య 3,06,702గా గుర్తించారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎంజీఎం ప్రభుత్వ కేన్సర్ ఆస్పత్రి ఒక్కటే ఉంది.ఉస్మానియా, గాం«దీ, ఇతర జిల్లా ఆస్పత్రుల్లో కేన్సర్కు మందులు తప్ప పూర్తిస్థాయి చికిత్స అందించే సౌకర్యాలు లేవు. నిమ్స్తోపాటు ప్రైవేటు రంగంలో కేన్సర్ చికిత్స అత్యంత ఖరీదైనదిగా మారింది. ఆరోగ్యశ్రీ కింద కేన్సర్ వ్యాధికి చికిత్స లభిస్తుండటంతో జిల్లాల్లోని ఆస్పత్రులలో వైద్యం పొందుతున్నారు. ప్రైవేటు బోధనాస్పత్రులు కేన్సర్కు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తూ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. అంకాలజీ విభాగాన్ని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై నివేదిక అందజేయాలని మంత్రి దామోదర అధికారులను ఆదేశించారు. గుండె, ఆర్థోపెడిక్ కూడా⇒ కిడ్నీ, కేన్సర్ తరువాత అధికంగా నమోదవుతున్న కేసుల్లో ఆర్థోపెడిక్ మూడో స్థానంలో ఉంది. ప్రమాదాలు సంభవించినప్పుడు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయేవారు కొందరైతే.. కాళ్లు, చేతులు విరిగి అంగ వికలులుగా మారేవారు మరికొందరు. ఈ ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ కింద నమోదైన ఆర్థోపెడిక్ కేసులు 1,91,852. ఈ నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 లోపే ట్రామా కేర్ సెంటర్లు ఉండగా, మరో 74 ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.త్వరలోనే వీటిని ఏర్పాటుచేసేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపారు. అలాగే గుండె సంబంధ వ్యాధుల కేసులు కూడా 1,45,814 నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్డియాలజీ విభాగాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. 2డీ ఈకో, ఆంజియోగ్రామ్, స్టెంట్స్ వేసే సౌకర్యాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇవి కాకుండా ఐదేళ్లలో జనరల్ మెడిసిన్లో 73,697 కేసులు, ఆప్తల్మాలజీలో 57,639 కేసులు, న్యూరోలో 40,667 కేసులు, జనరల్ సర్జరీలో 31,214 కేసులు, పీడియాట్రిక్స్లో 28,924, గైనకాలజీలో 9,517 కేసులు, ఈఎన్టీలో 7,251 కేసులు, గ్రాస్ట్రో ఎంటరాలజీ కింద 1,636, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్లో 1,272 కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధులకు వైద్య సౌకర్యాలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ ‘సాక్షి’కి తెలిపారు. -
పర్యాటక హరివిల్లు..'పొల్లూరు'
ప్రకృతిసిద్ధ అందాలకు నెలవు అల్లూరి జిల్లాలోని పొల్లూరు. ఈ ప్రాంతం జలవిద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా పర్యాటకంగాను గుర్తింపు ఉంది. ఇక్కడి ప్రకృతి అందాలు మంత్రముగ్ధులను చేస్తుండగా.. పొల్లూరు జలపాతం.. సీలేరు నది ఉరకలేస్తూ పర్యాటకుల్లో ఉత్సాహం నింపుతోంది. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం, ఏవీపీ డ్యామ్, ఫోర్బే డ్యామ్ ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న కట్టడాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.మోతుగూడెం: సీజన్తో సంబంధం లేకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు. ప్రముఖ పర్యాటక కేంద్రం మారేడుమిల్లి వచ్చిన వారంతా ఈ ప్రాంత సందర్శనకు వస్తుంటారు. » ఇక్కడి జలవిద్యుత్ కేంద్రం రాష్ట్రంలోనే గుర్తింపు పొందింది. ఇక్కడ 460 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా అదనంగా మరో 230 మెగావాట్ల ఉత్పత్తికి 5,6 యూనిట్లు నిర్మిస్తున్నారు. » పొల్లూరు జలపాతం..అలసిపోయిన మనసుకు ఈ ప్రాంతం ఎంతో హాయినిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఉరకలేస్తోంది. చూడచక్కని ప్రకృతిలో కొండలమధ్య ప్రవహిస్తూ సందర్శకుల మదిని దోచేస్తోంది. డొంకరాయి ఏవీపీ డ్యామ్ అదనపు నీరు, కొండవాగుల ప్రవాహం ఈ జలపాతంలో చేరుతుంది. » ఫోర్బే డ్యామ్ ప్రత్యేక కట్టడంగా గుర్తింపు పొందింది. పవర్ కెనాల్ నుంచి వచ్చే నీటిలో సుమారు 0.5 టీఎంసీలు ఐదు కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ డ్యామ్లో నిల్వ ఉంటుంది. ఇక్కడి నుంచి అండర్గ్రౌండ్ టన్నల్ ద్వారా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి వెళ్తుంది. దీనిని పూర్తిగా మట్టితో నిర్మించారు. కొండలు, పచ్చదనంతో పరిసరాలు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు » సీలేరు నది.. పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం విడుదలైన నీరు పొల్లూరు నుంచి ప్రారంభమై చింతూరు వద్ద శబరినదిలో కలుస్తుంది. నది పొడవునా దట్టమైన వనాలతో ఆహ్లాదక వాతావరణం ఉంటుంది. నది వడివడిగా ప్రవహించడం వల్ల దిగేందుకు పర్యాటకులు సాహసించరు.సరిహద్దు పండగ.. మన్యంకొండ జాతర ఇక్కడికి సమీపంలోని ఒడిశాకు చెందిన మన్యం కొండ గ్రామం ఆధ్యాత్మికంగా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో మూడేళ్లకోసారి జరిగే మన్యంకొండ జాతర ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. కొండ గుహలో పోతురాజు, బాలరాజు, కన్నమరాజు దేవతామూర్తులు కొలువుదీరారు. మూడేళ్లకోసారి వీరి ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకువచ్చి జాతర నిర్వహిస్తారు. మన్యంకొండనుంచి భారీ ఊరేగింపుతో సీలేరు నదిని దోనెపై దాటించి పొల్లూరు జలపాతం వద్దకు తీసుకువెళ్లి మంగళస్నానం చేయిస్తారు. ఈ సమయంలో దర్శనమిచ్చే బంగారు చేపకు నమస్కరించుకుంటారు. గిరిజన సంప్రదాయ ప్రకారం నవంబర్, డిసెంబర్ నెలల్లో తేదీ నిర్ణయించి పండగ జరిపిస్తారు. మల్కన్గిరి కలెక్టర్ ఆధ్వర్యంలో జాతర జరుగుతుంది. ఇరు రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలివచ్చి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మౌలిక వసతులపై అటవీశాఖ దృష్టి » జాతీయ రహదారి నుంచి జలపాతం వద్దకు వెళ్లే మార్గాన్ని గ్రావెల్తో నిర్మించింది. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సౌకర్యం కల్పించింది. » పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, తాత్కాలిక షెడ్లు నిర్మించింది. జలపాతంలోకి పూర్తిగా వెళ్లకుండా సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేసింది. వీటికి రూ.13 లక్షలు వెచ్చించినట్టు అటవీశాఖ రేంజర్ నానాజి తెలిపారు.ఫోర్బే డ్యామ్, పుష్ప బ్రిడ్జి, సీలేరు నది ప్రాంతాల్లో సందర్శకుల సౌకర్యార్థం వసతులు కల్పిస్తున్నామన్నారు. పర్యాటకులకు ప్రదేశాన్ని చూపించేందుకు నియమించిన ఐదుగురు యువకులు ఉపాధి పొందుతున్నారన్నారు. రూ.45 లక్షల మంజూరు పొల్లూరు జలపాతంతోపాటు ఇతర ప్రదేశాల్లో పర్యాటకులకు సదుపాయాలు కల్పించేందుకు రూ.45 లక్షలు ఏపీ జెన్కో నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అటవీశాఖ ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటోంది. అద్భుతం జలపాతం విజయవాడ నుంచి సుమారు 15 మంది మిత్రులతో కలిసి పొల్లూరు, మోతుగూడెం పరిసర ప్రాంతాలు తిలకించేందుకు వచ్చాం. పొల్లూరు జలపాతం అద్భుతంగా ఉంది. ఈ ప్రాంతంలో ప్రకృతి అందాలు మైమరిపించాయి. – సతీష్, జియాలజిస్ట్, విజయవాడచాలా సరదాగా గడిపాం పొల్లూరు జలపాతం, సీలేరు నది అందాలు చాలా ఆకట్టుకున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదాన్ని పొందాం. సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా గడిపాం. మరిచిపోలేనంతగా అనుభూతి పొందాం. – కె.రూప, భద్రాచలం -
అసాంక్రమిక వ్యాధులతో ముప్పే
అసాంక్రమిక వ్యాధులు మానవాళి బతుకును భారంగా మారుస్తున్నాయి. జీవన నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. అకాల మరణాలపాలు చేస్తున్నాయి. మనుషులను రోగ పీడితులుగా, విగత జీవులుగా మార్చటంలో అసాంక్రమిక వ్యాధుల (ఎన్సీడీలు) పాత్ర మూడింట రెండు వంతులని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) తాజా అధ్యయనం వెల్లడించింది.1990లలో ప్రపంచ ప్రజల మధ్యస్థ ఆయుర్దాయం (మీన్ ఏజ్) 46.8 ఏళ్లు. 2023 నాటికి అది 63.4 ఏళ్లకు పెరిగింది. ఇది మానవ జాతి సాధించిన గొప్ప విజయాల్లో అత్యంత ప్రధానమైనది. అయినప్పటికీ హార్ట్ స్ట్రోక్, టైప్ 2 మధుమేహం, ఐహెచ్డీ (గుండెకు తగినంత రక్తం అందకపోవటాన్ని ఇస్కీమిక్ గుండె వ్యాధి అంటారు) వంటి అసాంక్రమిక వ్యాధుల బారిన పడిన మనుషుల్లో మూడింట రెండొంతుల మంది చనిపోవటమో, తీవ్రంగా జబ్బుపడి జీవన నాణ్యతను కోల్పోవటమో జరుగుతోంది. అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ తాజా సంచికలో ప్రచురితమైన గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనం రోగగ్రస్త జీవన నష్టాల తీవ్రతను తెలిపే ఆసక్తికరమైన వివరాలను వెల్లడించింది.వాటిలో మార్పు తేగలిగితే..: పురుషుల మధ్యస్థ ఆయుర్దాయం 45.4 ఏళ్ల నుంచి 61.2 ఏళ్లకు, మహిళల ఆయుర్దాయం 48.5 నుంచి 65.9 ఏళ్లకు పెరిగింది. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, అధిక బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) వంటి కొన్ని ప్రధాన ఆరోగ్య సూచికల్లో మార్పు తేగలిగితే సగానికి సగం అకాల మరణాలు, రోగగ్రస్త జీవనం నుంచి మనుషులను రక్షించవచ్చని పరిశోధకుల అంచనా. భారీగా తగ్గిన జీవన నష్టం..: అకాల మరణం వల్ల కోల్పోయిన సంవత్సరాలను ‘జీవిత నష్ట సంవత్సరాలు (ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్–వైఎల్ఎల్)’ పేరిట గణాంక శాస్త్రవేత్తలు లెక్కిస్తారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, టీబీ, పౌష్టికాహార లోపాలు, ఇతర సాంక్రమిక వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలు గత 30 ఏళ్లలో గణనీయంగా తగ్గాయని పరిశోధకులు తెలిపారు.5 ఏళ్లలోపు పిల్లలే!2023లో ప్రపంచవ్యాప్తంగా 6.01 కోట్ల మంది మృత్యువాతపడ్డారు. అందులో 46.7 లక్షల మంది ఐదేళ్ల లోపు పిల్లలు! 1950 తర్వాత జనాభా సంఖ్య, వృద్ధుల శాతం పెరుగుతున్న నేపథ్యంలో 1950–2023 మధ్య కాలంలో ప్రపంచ సగటు మరణాల సంఖ్య 35.2% పెరిగింది. అయితే, ఇదే కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలు, వయసుల వ్యత్యాసాలను ప్రామాణీకరించి శాస్త్రీయంగా విశ్లేషించి చూస్తే.. మరణాల రేటు 66.6% తగ్గటం శుభపరిణామమని ఈ అధ్యయనం వెల్లడించింది.12.6% తగ్గిన వ్యాధుల భారంప్రపంచవ్యాప్తంగా 204 దేశాల్లో ప్రజలను వయసు, లింగం, సకల వ్యాధి కారక మరణాలు, ఆయుర్దాయం తదితర అంశాలను పరిశీలిస్తే గతంలో కన్నా ఆరోగ్యస్థితి మెరుగ్గానే ఉందని ఈ అధ్యయనం పేర్కొంది. వయసు– ప్రామాణిక వైకల్యం సర్దుబాటు చేసిన జీవిత సంవత్సరం (డిజŒ అబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్–డాలీ) రేటు అనేది యావత్ జనాభాపై ఉన్న వ్యాధి భారాన్ని లెక్కించడానికి ఉపయోగపడే ఒక కొలబద్ద. వేర్వేరు దేశాలు, ప్రాంతాల్లో భిన్న వయస్కులతో కూడిన జనాభా ఉంటారు. వారి అందరిపై గల వ్యాధుల భారాన్ని సముచితంగా పోల్చి విశ్లేషించే క్రమంలో ఎదురయ్యే వ్యత్యాసాలను గణాంకపరంగా సర్దుబాటు చేయటానికి ఉపయోగపడే సంవత్సరాల సంఖ్యను ‘డాలీ’లలో లెక్కిస్తారు. 2010–2023 మధ్యలో వ్యాధుల భారం 12.6% డాలీల మేరకు తగ్గాయని అధ్యయనం పేర్కొంది.పెరిగిన మానసిక రుగ్మతలుమానసిక రుగ్మతలు ముఖ్యంగా మనో వ్యాకులత, కుంగుబాటు వంటివి 2010 తర్వాత భారీగా పెరిగాయని ఈ అధ్యయనం తెలిపింది. వ్యాధుల భారాన్ని పెంచుతున్న 26 అంశాల్లో సిర్రోరిస్, క్రానిక్ లివర్ డిసీజ్, అల్జీమర్స్ (మతిమరుపు) వంటివి ఉన్నాయి. 2023లో గుర్తించిన అత్యధిక హెల్త్ రిస్క్ ఫ్యాక్టర్లలో ఉన్న కొన్ని ప్రధానాంశాలు.. అధిక రక్తపోటు, గాలిలో అధికంగా ఉండే సూక్ష్మ కణాలు, అధిక గ్లూకోజ్, ధూమపానం, అధిక బీఎంఐ, తక్కువ బరువు ఉండే శిశు జననాలు, నెలలు నిండకముందు జన్మించే పిల్లల సంఖ్య.నివారించదగిన జబ్బులపై దృష్టియూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రేతో పాటు మరో 16,500 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. పెరుగుతున్న వయోవృద్ధుల సంఖ్య, పుట్టుకొస్తున్న కొత్త సమస్యలు ప్రపంచ ఆరోగ్య సవాళ్లుగా మారుతున్నాయని ముర్రే వ్యాఖ్యానించారు. ప్రపంచ జనాభాపై జబ్బుల భారం గురించి తాజా అధ్యయనం వెల్లడించిన వాస్తవ గణాంకాలు పాలకులకు మేలైన ప్రజారోగ్య విధానాల రూపకల్పనకు మేలుకొలుపు కావాలన్నారు. -
రోజూ 113 ఆర్థిక నేరాలు
భారత్లో పెద్ద నగరాల్లో ఆర్థిక నేరాలు పెరుగుతున్నాయి. 2023లో పెద్ద నగరాల్లో సగటున రోజుకు 113 ఆర్థిక నేరాలు నమోదుకాగా.. 2018లో ఈ సంఖ్య 86గా ఉంది. దాదాపు 20% ఆర్థిక నేరాలు నగరాల నుంచే నమోదవుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2023లో ఈ నేరాలు దాదాపు 31 శాతం అధికం అయ్యాయి. వీటిలో రూ.1–10 లక్షల విలువ చేసే ఆర్థిక నష్టాల కేసులే ఎక్కువ.కోట్ల విలువైన మోసాలూ జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. దేశవ్యాప్తంగా 2018లో పెద్ద నగరాల్లో 31,501 ఆర్థిక నేర సంబంధ కేసులు నమోదవగా, 2023లో ఈ సంఖ్య 41,220కి చేరింది. ఆ ఏడాది నగరాల్లో నేరాల రేటు లక్ష జనాభాకు 36.1గా ఉంది. దాదాపు 10లో 9 కేసులు ఫోర్జరీ, మోసానికి సంబంధించినవి. ఇటీవలి సంవత్సరాల్లో కేసుల సంఖ్య పెరిగినప్పటికీ.. కోర్టుల్లో పెండింగ్ కేసుల్లో తగ్గుదల నమోదైంది. -
పదపద.. ప్రపంచాన్ని చుట్టొద్దాం..!
ప్రజల ఆదాయాలు పెరుగుతుండటంతో జీవితంలో ఆనందాలు అనుభవించేందుకు అందులో కొంత ఖర్చు చేసేందుకు వెనుకాడటంలేదు. ముఖ్యంగా విహార యాత్రలపై భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పుడెప్పుడు ప్రత్యక్షంగా చూద్దామా అన్న ఆసక్తిని రేకెత్తించేలా సామాజిక మాధ్యమాల్లో విదేశీ నగరాలు, సందర్శనీయ స్థలాలు ఊరిస్తుండటంతో విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి. విదేశాలను చుట్టివస్తున్న భారతీయుల సంఖ్య అయిదేళ్లుగా పెరుగుతోంది. భారతీయుల విదేశీ ప్రయాణాల్లో 2020లో 31.9 శాతంగా ఉన్న విహార యాత్రికుల వాటా, 2024లో 42.5 శాతానికి చేరిందంటే ప్రజల్లో ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు.కేంద్ర పర్యాటక శాఖ ఇటీవల విడుదల చేసిన ఇండియా టూరిజం గణాంకాల ప్రకారం భారత్ నుంచి 2020లో మొత్తం 72.9 లక్షల మంది వివిధ దేశాల్లో పర్యటించారు. ఈ సంఖ్య 2024లో 3.08 కోట్లకు పెరిగింది. విహార యాత్రల్లో భారతీయుల తొలి డెస్టినేషన్గా థాయ్లాండ్ నిలిచింది. గత ఏడాది ఈ దేశానికి వెళ్లిన వారిలో ఏకంగా 92.93 శాతం మంది విహార యాత్రలకే వెళ్లారు. 2022తో పోలిస్తే థాయ్లాండ్ వెళ్లిన విహార యాత్రికుల సంఖ్య రెండింతలు పెరిగి గత ఏడాది 19.1 లక్షలకు చేరింది. -
అప్పుతో ఐపీవో ఆట!
ప్రైమరీ మార్కెట్లో ఐపీవోల (పబ్లిక్ ఆఫర్) సందడి నెలకొంది. పేరొందిన కంపెనీలకే కాదు, చిన్నా చితకా పబ్లిక్ ఆఫర్లకు సైతం స్పందన అదిరిపోతోంది. పట్టణాల్లో ఇంటి వద్దకే పలు రకాల సేవలను ఆఫర్ చేసే ‘అర్బన్ కంపెనీ’ గత నెలలోనే విజయవంతంగా ఐపీవోని ముగించుకుంది. రూ.1,900 కోట్ల సమీకరణకు రాగా.. రూ.1.95 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చిపడ్డాయి. 103 రెట్ల స్పందన వచ్చింది. లిస్టింగ్లోనే ఇన్వెస్టర్లకు 56 శాతానికి పైగా లాభాన్నిచ్చింది. ఇదొక్క ఉదాహరణే. కొన్ని ఐపీవోలు లిస్టింగ్తోనే అదరగొడుతుండడంతో రిటైల్ ఇన్వెస్టర్లు, హెచ్ఎన్ఐల్లో (హై నెట్వర్త్ ఇన్వెస్టర్లు) లాభాల కాంక్ష ఉరకలెత్తుతోంది. రుణం తీసుకుని మరీ ఎక్కువ షేర్ల కోసం బిడ్లు వేస్తున్నారు. ఫలితంగా ఐపీవో ఫండింగ్ మార్కెట్ విస్తరిస్తోంది. ఇది గమనించిన ఆర్బీఐ ఒక వ్యక్తికి ఐపీవో రుణ పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్టు ఇటీవలి పాలసీ సమీక్షలో ప్రకటించింది. రుణంతో ఐపీవోలో పాల్గొనడం వల్ల లాభాలే కాదు, తేడా వస్తే నష్టాలనూ భరించాల్సి వస్తుంది. ఇందులో ఉండే రిస్క్ లను తెలుసుకోకుండా దూకుడు ప్రదర్శించడం ఎంత మాత్రం మంచిది కాదు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 16 బ్యాంకులు సంయుక్త్తంగా మంజూరు చేసిన ఐపీవో రుణాల మొత్తం రూ.7,748 కోట్లు. ఇందులో ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంకే రూ.5,030 కోట్ల రుణ వితరణ చేసింది. కొన్ని బ్యాంక్లు వాటి సబ్సిడరీల రూపంలోనూ ఐపీవో ఫండింగ్ను అందిస్తున్నాయి. బ్యాంకింగేతర ఆరి్థక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు), బ్రోకరేజీ సంస్థలు ఈ విభాగంలో ఇంతకంటే పెద్ద మొత్తంలోనే ఫండింగ్ను సమకూరుస్తున్నాయి. అర్బన్ కంపెనీ ఐపీవోలో నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (ఎన్ఐఐ) విభాగంలో 78 రెట్లు అధికంగా బిడ్లు రాగా, రిటైల్ విభాగంలోనూ 41 రెట్ల అధిక స్పందన వచ్చింది. ముఖ్యంగా ఎన్ఐఐ విభాగంలో ఎక్కువ మంది రుణంతోనే బిడ్లు వేస్తుంటారు. 2022లో ఎల్ఐసీ ఐపీవో సందర్భంగా ఎల్ఐసీ ఉద్యోగులకు ఎస్బీఐ రుణాన్ని ఆఫర్ చేసింది. ఒక్కొక్కరికీ రూ.20 లక్షల రుణాన్ని 7.10 శాతం వడ్డీపై, 60 నెలల కాల వ్యవధితో ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగి, పాలసీదారుడు, రిటైల్ ఇలా మూడు విభాగాల్లోనూ షేర్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండడంతో అధిక మొత్తంలో రుణాన్ని ఆఫర్ చేసింది. రుణ షరతులు, నియమాలు బ్యాంక్లు 3–6 రోజుల కాల వ్యవధికి ఐపీవో ఫండింగ్ను అందిస్తున్నాయి. వీటిపై వడ్డీ రేటు 9–15 శాతం వరకు ఉంటుంది. అదే ఎన్బీఎఫ్సీల్లో అయితే ఇంతకు రెట్టింపులో ఉంటోంది. మార్కెట్లో నగదు లభ్యత, ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్ తదితర అంశాలు రుణంపై వడ్డీని ప్రభావితం చేస్తుంటాయి. పైగా రుణ విలువపై ఒక శాతం వరకు ప్రాసెసింగ్ చార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఐపీవోలో వేస్తున్న బిడ్ విలువకు సరిపడా రుణాన్ని పొందలేరు. ఇన్వెస్టర్ తన వంతుగా కొంత సమకూర్చుకోవాలి. ఇది ఎంతన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏ కంపెనీ ఐపీవోకు దరఖాస్తు చేస్తున్నారు? దరఖాస్తుదారుడి గత రుణ చెల్లింపుల చరిత్ర, మార్కెట్ పరిస్థితులను బ్యాంక్లు/ఎన్బీఎఫ్సీలు పరిగణనలోకి తీసుకుంటాయి. సాధారణంగా 10–25 శాతం వరకు ఇన్వెస్టర్ తన వంతు వాటా కింద సిద్ధం చేసుకోవాలి. అప్పుడే మిగిలిన మొత్తానికి రుణం లభిస్తుంది. ‘‘రుణాన్ని 3–4 రోజుల్లో క్లియర్ చేసినప్పటికీ.. 7 రోజుల కాలానికి వడ్డీ చెల్లించాల్సిందే. లిస్టింగ్ రోజునే షేర్లను విక్రయించాలి. ఆ తర్వాత కూడా షేర్లను కొనసాగించుకోవాలంటే సొంత నిధులతోనే సాధ్యపడుతుంది. లిస్టింగ్ రోజునే ప్రిన్సిపల్ (అసలు) మొత్తాన్ని చెల్లించాలని బ్యాంక్లు కోరుతుంటాయి’’ అని జెరోదా వైస్ ప్రెసిడెంట్ మోహిత్ మెహ్రా తెలిపారు. కొన్ని బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు లిస్టింగ్ తర్వాత కూడా ఆ షేర్లను కొనసాగించుకునేందుకు అనుమతిస్తున్నాయి. ఒకవేళ ఐపీవోలో కేటాయించిన ధర కంటే తక్కువకు లిస్ట్ అయి, నష్టాల్లో కొనసాగుతుంటే, వ్యత్యాసం మేర అదనపు నిధులు సమకూర్చాలని ఇన్వెస్టర్లను కోరతాయి. ఆ మేరకు సర్దుబాటు చేస్తే, షేర్లను వెంటనే విక్రయించనక్కర్లేదు. ఎంత రుణం?ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక పాన్ నంబర్పై బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి ఇప్పుడు రూ. 25 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగానే ఉండగా ఆర్బీఐ తాజాగా పెంచింది. ఎన్బీఎఫ్సీ అనుబంధ సంస్థలున్న బ్రోకరేజీ సంస్థలు కూడా ఐపీఓ ఫండింగ్ విషయంలో ఇన్వెస్టర్లను ప్రోత్సహిస్తున్నాయి.రిస్క్ లు.. ఐపీవో ధర కంటే ఎక్కువలో లిస్టింగ్ అయితే మంచి లాభాలు కళ్లజూడొచ్చు. దీంతో తీసుకున్న రుణంపై బ్యాంక్లకు/ఎన్బీఎఫ్సీలకు అసలుతోపాటు వడ్డీని సులభంగా చెల్లించేయొచ్చు. తన వంతు ఎంతో కొంత లాభాన్ని మిగుల్చుకోవచ్చు. ఒకవేళ కేటాయించిన ధర కంటే తక్కువలో లిస్ట్ అయితే పరిస్థితి ఏంటి?. రుణం ఇచ్చిన బ్యాంక్ లేదా సంస్థ వడ్డీతోపాటు రాబట్టుకునేందుకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. ఇన్వెస్టర్ లాభ, నష్టాలతో వాటికి అవసరం లేదు. కొన్ని సంస్థలు 90 రోజుల వరకు అనుమతిస్తున్నాయి కదా అని చెప్పి.. వడ్డీ చెల్లించుకుంటూ అంత కాలం పాటు ఆ షేర్లను కొనసాగించడం కూడా తెలివైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అన్ని రోజులు ఆగినప్పటికీ లాభాలు వస్తాయన్న గ్యారంటీ ఉండదు కదా?! కనుక లాభం వచ్చినా, నష్టం వచ్చినా లిస్టింగ్ రోజునాడు విక్రయించడమే సరైన విధానం అవుతుంది. ఒకవేళ షేర్లపై నష్టం బుక్ చేసుకుంటే, రుణంపై వడ్డీ రూపంలోనూ మరికొంత నష్టపోవాల్సి వస్తుంది. ఇక పెద్ద మొత్తంలో రుణం తీసుకుని ఐపీవోలో బిడ్ వేసినప్పటికీ.. షేర్లు దక్కుతాయన్న హామీ ఉండదు. 50–100 రెట్లకు పైగా స్పందన వచ్చిన ఐపీవోల్లో కేటాయింపు అవకాశాలు చాలా తక్కువ. షేర్లు దక్కకపోతే అప్పుడు ఐపీవో కోసం తీసుకున్న రుణంపై వడ్డీని సొంత జేబు నుంచి చెల్లించుకోవాల్సి ఉంటుందని ఏంజెల్వన్ అడ్వైజరీ చీఫ్ అమర్దియో సింగ్ పేర్కొన్నారు. సాధారణంగా అధిక స్పందన ఉన్న ఐపీవోల్లో అలాట్మెంట్ అవకాశాలు చాలా తక్కువ. పరిమిత స్పందన ఉన్న వాటిల్లోనే కేటాయింపు అవకాశాలు ఎక్కువ. పరిమిత స్పందన వచ్చిన ఐపీవోలు లిస్టింగ్లో మంచి లాభాలు పంచడం తక్కువ కేసుల్లోనే కనిపిస్తోంది. జొమాటో, అర్బన్ కంపెనీ తదితర ఐపీవోలు లిస్టింగ్తోనే లాభాలు పంచగా, పేటీఎం, కల్యాణ్ జ్యువెలర్స్, కార్ట్రేడ్ టెక్, ఎస్బీఐ కార్డ్ కేటాయించిన ధర కంటే తక్కువకే లిస్ట్ కావడం గమనించాలి. హ్యుందాయ్ మోటార్స్ లిస్టింగ్లో లాభాలను ఇవ్వకపోగా, కేటాయించిన ధర కంటే కిందకు పడిపోయి చాలా కాలం స్థిరీకరణకు నోచుకుంది. ఆ తర్వాత కొత్త గరిష్టాలను చూసింది. సెబీ అధ్యయనం ప్రకారం ఐపీవోల్లో హెచ్ఎన్ఐ విభాగంలో 60–75 శాతం మధ్య దరఖాస్తులకు కేటాయింపులు లభించడం లేదు. రూ.75 లక్షల నుంచి రూ.కోటి మొత్తంతో బిడ్ వేసినా ఒక్క షేరు కూడా రాని సందర్భాలు కూడా ఉంటాయి. పెద్ద మొత్తంతో బిడ్ వేసినప్పటికీ.. చివరికి కొన్ని షేర్లే అలాట్ అయిన సందర్భాల్లోనూ వచ్చే లాభం వడ్డీ చెల్లించడానికి సరిపోకపోవచ్చు. లిస్టింగ్ నాటికి మార్కెట్లలో భారీ కరెక్షన్ చోటుచేసుకుంటే, అప్పుడు కూడా నష్టాల రిస్క్ ఉంటుంది. కనుక ఇన్వెస్టర్లు రుణంపై ఐపీవోలో దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఈ పరిస్థితులను సమగ్రంగా విశ్లేíÙంచుకోవాలి. తన రిస్క్ సామర్థ్యం, ఎంత మేరకు నష్టాలను భరించగలమో అర్థం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. చెల్లించడంలో విఫలమైతే.. రుణం మంజూరుకు ముందుగా బ్యాంక్లు, ఎన్బీఎఫ్సీలు ఒప్పందంపై సంతకాలు చేయించుకుంటాయి. ఐపీవోలో కేటాయించే షేర్లను విక్రయించేందుకు పవర్ ఆఫ్ అటార్నీ (పీవోఏ) తీసుకుంటాయి. ఇన్వెస్టర్ నిరీ్ణత గడువులోపు షేర్లను విక్రయించి, అసలు.. వడ్డీ చెల్లించడంలో విఫలమైతే రుణం ఇచ్చిన సంస్థలు బ్రోకరేజీల ద్వారా వాటిని విక్రయించేస్తాయి. ఇన్వెస్టర్ సమకూర్చిన మార్జిన్ మనీకి మించి నష్టాలు వస్తే.. అప్పుడు మిగిలిన బకాయి రాబట్టుకోవడానికి బ్యాంకులు/ఎన్బీఎఫ్సీలు చట్టపరమైన చర్యలు చేపడతాయి.షేర్లు, ఫండ్స్పై రుణం రిటైల్ ఇన్వెస్టర్లు తమ షేర్లు, ఫండ్స్పై రుణం తీసుకుని కూడా ఐపీవోలో పాల్గొనొచ్చు. ఇందుకు బ్రోకరేజీలు, ఎన్బీఎఫ్సీలు, బ్యాంకులు సైతం అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్ల తనఖా విలువపై 50–75% వరకు రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటుంది. ఒక్కో ఇన్వెస్టర్ గరిష్టంగా రూ.కోటి వరకు రుణం పొందేందుకు ఆర్బీఐ ఇటీవలే అనుమతించింది. హెచ్ఎన్ఐ విభాగంలో దరఖాస్తులు.. రిటైల్ ఇన్వెస్టర్లు రిటైల్ కోటాలో గరిష్ఠంగా రూ.2 లక్షల విలువైన షేర్లకు మాత్రమే బిడ్ వేయగలరు. అదే నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ (ఎన్ఐఐ) విభాగంలో రూ.2 లక్షలకు మించి, ఎంత మొత్తానికి అయినా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. ఐపీవోల్లో సాధారణంగా రిటైల్ ఇన్వెస్టర్లకు 10–35 శాతం మధ్య, ఎన్ఐఐలకు 15–35 శాతం మధ్య కోటా ఉంటుంది. ఎన్ఐఐలోనూ రెండు విభాగాలు ఉంటాయి. రూ.2–10 లక్షల వరకు బిడ్లను స్మాల్ ఎన్ఐఐ కింద పరిగణిస్తారు. మొత్తం ఎన్ఐఐ కోటాలో వీరికి మూడింట ఒక వంతు షేర్ల కోటా ఉంటుంది. మిగిలినది రూ.10 లక్షలకు మించిన బిడ్లకు రిజర్వ్ చేస్తుంటారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మనిషి లక్షణాలు
ఒక వ్యక్తి గురించి తెలియటానికి వారి గురించిన పరిచయ పత్రమో, నివేదికో చదివిన దానికన్న, వారిని ప్రత్యక్షంగా చూస్తే బాగా తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అన్నదాన్ని చాణక్యుడు చక్కగా తెలియ చేశాడు. ఆచారం కులాన్ని తెలియచేస్తుంది అన్నాడు. ‘‘కుల’’మంటే ఈనాడు మనమనుకునేది కాదు. ఒక వృత్తిని అవలంబించే వారి సముదాయం లేక సంఘం. ఆచారమంటే తరతరాలుగా వస్తున్న అలవాట్లు, పద్ధతులు, సంప్రదాయాలు మొదలైనవి. ఇవి ఒక కుటుంబానికి మరొక కుటుంబానికే మారిపోతూ ఉంటాయి. అటువంటిది వృత్తులని బట్టి మారటం సహజమే కదా! ఉదాహరణకి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి సమయపాలన, క్రమశిక్షణ తప్పులు లేకుండా ఎదుటివారికి అర్థమయ్యే విధంగా మాట్లాడటం మొదలైనవి అలవాటవుతాయి.అందుకే ఎవరైనా తాను నిక్కచ్చిగా ఉండి, ఎదుటివారిని కూడా అట్లా ఉండమంటే ‘‘మరీ క్లాసు టీచర్ లాగా వెంట పడుతున్నాడు’’ అనటం వింటూ ఉంటాం. పనిచేసే తీరుని బట్టి కూడా ఉపాధ్యాయవృత్తిలో ఉన్నవాళ్లని చెప్పవచ్చు. అన్ని వృత్తులు కూడా అంతే! కుల శబ్దానికి శీలమనే అర్థం కూడా చెప్పారు. శీలమైనా వ్యక్తమయ్యేది అలవాట్లలోను, పని చేసే తీరులోనే కదా! మాట తీరు ఆవ్యక్తి ఏ్రపాంతానికి చెందినవాడో తెలియచేస్తుంది. తెలుగు మాట్లాడేవాళ్ళే అయినా వాళ్ళు మాట్లాడే తెలుగు స్వస్థలం ఏదో చెప్పకనే చెపుతుంది. ‘‘ఈ పోరగాడు’’ అనగానే ఎక్కడివారో చెప్పనక్కర లేదు. ‘‘ఈ పిలగాడు’’ అని ఎవరంటారో అందరికి తెలుసు. ‘‘ఈ గుంటడు’’ అంటే ఉత్తరాంధ్ర నుండి వచ్చిన వారని చెప్పనవసరం లేదు. మాటలే కాదు మాటాడే తీరు, అంటే యాస వాళ్లెక్కడి వాళ్ళో పట్టిస్తుంది. అందుకే పండితులైన వాళ్ళు శిష్టవ్యవహారికం రాయటమే కాదు, మాట లో కూడా ప్రాంతీయత తొంగిచూడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంటే యాసలో మాట్లాడటం తప్పో, తక్కువో అని కాదు. సమతని పాటించటం కోసం అంతే! అదే పరాయిభాష అయితే మరీ తేలికగా తెలిసి పోతుంది. ఉత్తరదేశీయుల ఇంగ్లీషుకి, తెలుగువారి ఇంగ్లీషుకి, తమిళుల ఇంగ్లీషుకి, బెంగాలీల ఇంగ్లీషుకి తేడా స్పష్టంగానే కనిపిస్తుంది. విదేశీయులది సరే సరి. మాట వినగానే ఎక్కడివాళ్ళో వెంటనే తెలిసిపోతుంది. ఇక శరీరం తిన్న ఆహారాన్ని ప్రకటిస్తుంది. ఎటువంటి ఆహారం ఎంత తింటారు అన్నది ఆకారాన్ని చూసి చెప్పవచ్చు. మితాహారుల శరీరం చూడ ముచ్చటగా ఉంటుంది. అన్నీ నోటితో చెప్పనక్కర లేదు. చూడగానే తెలిసిపోతాయి. మన గురించి మంచి అభిప్రాయం ఎదుటి వారికి కలగాలంటే ప్రవర్తనని, భాషని, ఆహారపుటలవాట్లని సరిచేసుకుంటే సరి. ఆచారః కుల మాఖ్యాతిదేశ మాఖ్యాతి భాషణంసంభ్రమః స్నేహ మాఖ్యాతివపురాఖ్యాతి భోజనం’’ నడవడిక కులాన్ని (శీలాన్ని), మాటతీరు ప్రాంతాన్ని, సంభ్రమం (మర్యాదచూపే తీరు) ప్రేమను, శరీరం ఆహారపు అలవాట్లను తెలుపుతాయి.సంభ్రమం అంటే మర్యాద చేయటానికి పడే హడావుడి, కంగారు. ఈ సంభ్రమం ఎంతప్రేమ ఉన్నదో తెలియచేస్తుంది. ఇష్టమైనవాళ్ళు వస్తున్నారంటే కాళ్ళుచేతులు ఆడవు. వాళ్ళకి నచ్చినట్టు చేయాలనే తాపత్రయంలో ఒకదానికి ఒకటి చెయ్యటం కూడా కద్దు. ఆ విధంగా పొరబడటం అవకతవకగా చెయ్యటం ప్రేమకి చిహ్నమే కాని, చేతకానితనం కాదు. కృష్ణుడు తన ఇంటికి వచ్చాడన్న ఆనందంలో విదురుడు అరటిపండ్లు ఒలిచి ప్రేమగా పెడదామనుకుని, తొక్కలు కృష్ణుడి చేతిలో పెట్టి, పండు బయట పడేశాడుట! కృష్ణుడు ఆప్యాయంగా ఆ తొక్కలని తిన్నాడు ఆ సంభ్రమం వెనక ఉన్న ప్రేమని గుర్తించాడు కనుక. అదే ఇష్టంలేని వాళ్ళు వస్తే ఉన్నచోటు నుండి కదలబుద్ధి అవదు. తప్పనిసరి అయి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వవలసి వస్తే చేయవలసిన మర్యాదలన్నీ ఎక్కువగానే చేసినా మనసుపెట్టి చేసినట్టుగా ఉండదు. యాంత్రికంగా అనిపిస్తుంది.– డాక్టర్ ఎన్. అనంతలక్ష్మి -
కోడికి పందెం పాఠాలు
పుంజులకు పందెం పాఠాలేంటీ అనుకుంటున్నారా? సంక్రాంతి కోడిపందేలకు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎంత ఫేమస్సో తెలిసిందే. రూ.కోట్లలో చేతులు మారడం ఒకెత్తయితే.. తమ కోడి.. పందెం కొట్టడం ప్రతిష్టాత్మకంగా భావించడం మరో ఎత్తు. పుంజులను పందేలకు సిద్ధం చేసేందుకు మూడు నెలల ముందు నుంచి పెద్ద కసరత్తే జరుగుతుంది. రానున్న సంక్రాంతి కోసం దసరా నుంచే పందెంరాయుళ్లు తమ పుంజులకు శిక్షణ ప్రారంభించారు. సంక్రాంతి పండుగ రోజుల్లో భీమవరం, కోనసీమ ప్రాంతాల్లో రూ.కోట్లు వెచ్చించి ప్రత్యేకంగా బరులు ఏర్పాటుచేసి కోడిపందేలు నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో తరలివస్తుంటారు. అందుకు తగ్గట్టే పుంజుల పెంపకంలో పందేలరాయుళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అధిక శాతం మంది తమ ఇళ్లు, మకాంల వద్ద పుంజులను పెంచితే.. పండుగలకు దేశ విదేశాల నుంచి వచ్చేవారు తెలిసిన ట్రైనర్లతో శిక్షణ ఇప్పిస్తుంటారు. -సాక్షి, భీమవరంమెనూ ప్రత్యేకమే..పుంజులో శక్తి, సామర్థ్యం పెంచేందుకు, శరీరంలో కొవ్వు చేరకుండా తేలిగ్గా ఎగురుతూ ప్రత్యరి్థపై విరుచుకుపడేందుకు మూడు నెలలు ప్రత్యేక మేత అందిస్తారు. పుంజు బరువును బట్టి ఉదయం పూట 20 నుంచి 40 గ్రాముల వరకు ఉడకబెట్టిన మటన్, మూడు నుంచి ఐదు వరకు బాదం, రెండు వెల్లుల్లి, ఒక ఎండు ఖర్జూరం, కోడిగుడ్డు ముక్కలు చేసి పెడతారు. తిరిగి సాయంత్రం ఎప్పటిమాదిరి రాగులు, గంటులు, అరికలు మొదలైన వాటిని అందిస్తారు. పుంజు అనారోగ్యం, వైరస్ల బారిన పడకుండా తరచూ పశువైద్యుడిని తీసుకువచ్చి పరీక్షలు చేయించి మందులు వేయించడం, మరెన్నో సంప్రదాయ ఆయుర్వేద పద్ధతులు అవలంబించడం చేస్తుంటారు. అంతా గోప్యమే కాకి, నెమలి, అబ్రాస్, డేగ, పచ్చకాకి, కేతువ తదితర జాతుల నుంచి రెండేళ్ల వయస్సు కలిగిన పుంజులను పందేలకు వినియోగిస్తుంటారు. పుంజుకు పోరాట పటిమ, శరీర పటుత్వం, శక్తిని పెంచేందుకు మూడు నెలల ముందు నుంచి ఎవరికి వారు ఎన్నో సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తుంటారు. వాటికిచ్చే ఆహారం, మందుల నుంచి శిక్షణ వరకు ప్రతి విషయంలోనూ గోప్యత పాటిస్తారు. శిక్షణ మొదలవుతుందిలా.. ఉదయాన్నే పుంజును బయటకు తెచ్చి కొద్దిగా వేడి నీటిని పట్టిస్తారు. కాళ్లలో పటుత్వం, ఆయాసం రాకుండా, అనారోగ్య సమస్యలుంటే గుర్తించేందుకు నెలరోజుల పాటు రోజు విడిచి రోజు చెరువులు, నీటి తొట్టెల్లో ఈత కొట్టిస్తారు. ‘వి’ (ఇంగ్లిష్ లెటర్) ఆకారంలో నెట్లు కట్టి పుంజు అందులోనే తిరిగే విధంగా బేటా (నిర్ణీత పద్ధతిలో వాకింగ్) చేయిస్తారు. మరికొందరు ఖాళీ జాగాలో వాటి వెనుకే ఉండి తరుముతూ పరుగులు పెట్టిస్తారు. కోడి నోటి నుంచి వచ్చే కఫాన్ని తొలగించి శుభ్రం చేస్తారు. మేత పెట్టి 11 గంటల సమయం వరకు ఎండలో కట్టేసిన తర్వాత మకాంలోకి మార్చేస్తుంటారు. పండుగలు దగ్గరపడే కొద్దీ పుంజు శరీరం గట్టిపడేందుకు, నొప్పులు తగ్గడానికి ప్రత్యేక ట్రైనర్లతో వేప, జామాయిల్, కుంకుడు తదితర ఆకులు, తుమ్మ బెరడు, తోక మిరియాలు, పసుపు కొమ్ములు తదితర 20 రకాలతో గంటల కొద్దీ మరిగించిన ద్రావణాన్ని కోడి తట్టుకునే వేడి వరకు చల్లార్చి పుంజును అందులో ఉంచి పైనుంచి ద్రావణం పోస్తారు. వారంలో ఒకటి రెండు సార్లు ఇలా చేస్తారు. చివరిగా పొయ్యిపై మూకుడు వేడిచేస్తూ అందులో చీప్ లిక్కర్ చిమ్మినప్పుడు వచ్చిన ఆవిరిని మెత్తటి గుడ్డకు పట్టించి దానిని కోడి శరీరం అంతా అద్దుతూ శాఖల చేయిస్తారు. పందేలకు ముందు అలసిపోకుండా నాలుగైదు రోజుల ముందు నుంచి పుంజుకు పూర్తి విశ్రాంతినిచ్చి మకాంలో కట్టేసి ఉంచుతారు. ఈ ప్రక్రియలన్నిటినీ నిర్ణీత పద్ధతుల్లో చేయిస్తుంటారు. కోట్లలో వ్యాపారం.. మకాంల వద్ద పనిచేసే వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు జీతాలుంటాయి. వీరు ఒక్కొక్కరు 12 నుంచి 15 పుంజులను మాత్రమే పర్యవేక్షిస్తారు. నీళ్ల పోతలు, శాఖల కోసం వచ్చే ట్రైనర్లకు సిట్టింగ్కు కొంత మొత్తం మాట్లాడుకుంటారు. ఇవికాకుండా కోడికి అందించే ప్రత్యేక మేత, మందులతో ఒక్కో పందెం పుంజుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుందంటున్నారు. వీటి జాతి, రంగు, ఎత్తును బట్టి రూ.50 వేల నుంచి లక్షల్లో అమ్ముతుంటారు. మామూలుగా ఇళ్ల వద్ద పెంచిన పుంజులు రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు అమ్మకాలు చేస్తుంటారు. పండుగల కోసం నాలుగు వేలకు పైగా పందెం కోళ్ల అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా రూ.10 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. పుంజులకు ఉన్న డిమాండ్తో జిల్లాలోని భీమవరం, ఉండి, ఆకివీడు, పాలకోడేరు, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో 200కు పైగా నాటుకోళ్ల పెంపకం కేంద్రాలు ఉన్నాయి. కొందరు స్థలాలను లీజుకు తీసుకుని వీటి పెంపకం సాగిస్తుంటారు. సామర్థ్యాన్ని బట్టి ఒక్కోచోట వంద నుంచి 250 వరకు వివిధ రకాల జాతుల పుంజులు, కోళ్లను పెంచుతుంటారు. -
మీ బీ12 బాగుందా?
హైదరాబాద్లోని ఓ ఐటీ సంస్థలో పనిచేసే 33 ఏళ్ల యువకుడు దాదాపు నాలుగేళ్లుగా మతిమరుపు, చిరాకు, కాళ్లు, చేతుల తిమ్మిర్లతో బాధపడుతున్నాడు. ఇటీవల సమస్య తీవ్రత పెరగడంతో ఓ న్యూరాలజిస్ట్ను సంప్రదించాడు. అతని ఆహార అలవాట్ల గురించి డాక్టర్ అడగ్గా పూర్తి శాకాహారినని చెప్పాడు. దీంతో డాక్టర్ వెంటనే రోగి రక్తంలో విటమిన్ బీ12 స్థాయి ఎంత ఉందో పరీక్షించగా సాధారణంతో పోలిస్తే అతితక్కువగా ఉన్నట్లు తేలింది. వెంటనే విటమిన్ బీ12 ఇంజెక్షన్లతో చికిత్స ప్రారంభించడంతో పాటు పాల ఉత్పత్తులతో కూడిన ఆహారాలను అధికంగా తీసుకోవాలని సూచించడంతో కొన్ని వారాల్లోనే ఆ యువకుడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగుపడింది. తిమ్మిర్ల సమస్య సైతం దూరమైంది.సాక్షి, హైదరాబాద్: చాలాసార్లు సాధారణ ఆరోగ్య సమస్యలుగా కనిపించేవే తీవ్ర అనారోగ్య లక్షణాలకు సూచికలుగా మారొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. తరచూ మతిమరుపు, విసుగు, తిమ్మిర్ల వంటివి ఇబ్బంది పెడుతుంటే వాటిని పని ఒత్తిళ్ల వల్ల ఎదురవుతున్న సమస్యలుగా భావించొద్దని.. అవి శరీరంలో విటమిన్ బీ12 లోపానికి సంకేతం కావొచ్చని అంటున్నారు. ఈ తరహా లక్షణాలపట్ల అవగాహన పెంచుకొని అందుకు తగ్గట్లుగా వ్యవహరించాలని సూచిస్తున్నట్లు ముఖ్యంగా శాకాహారులు ఇలాంటి లక్షణాలతో సతమతమవుతుంటే తప్పనిసరిగా రక్తంలో విటమిన్ బీ12 స్థాయిలు తెలుసుకోవాలని చెబుతున్నారు. లక్షణాలను బట్టి వెంటనే మందులు వాడటం ద్వారా మెదడు, నరాలకు శాశ్వత నష్టం జరగకుండా నివారించవచ్చని పేర్కొంటున్నారు. ఇలాంటి స్థితిని అధిగమించేందుకు విటమిన్ బీ12 సమృద్ధిగా ఉండే లేదా బీ12ను జోడించిన ఆహారాలను తరచూ తీసుకోవడం లేదా వైద్యులు సూచించే సప్లిమెంట్లు తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.ఏమిటీ బీ12?విటమిన్ బీ12 అనేది శరీరం తయారు చేసుకోలేని ఓ పోషకం. ఇది ప్రధానంగా మాంసాహారం, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి వాటి నుంచి లేదా వైద్యపరంగా సప్లిమెంట్ల రూపంలో లభిస్తుంది. మెదడు, నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేసేలా చేయడంతోపాటు రక్త కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో బీ12 కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని కాలేయం ఐదేళ్ల వరకు నిల్వ చేసుకోగలదు. కానీ శరీరంలో తగినంత బీ12 నిల్వలు లేకపోతే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ విటమిన్లో కోబాల్ట్ అనే ఖనిజం ఉంటుంది కాబట్టి దీన్ని కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. రక్త పరీక్ష ద్వారా బీ12 స్థాయిలు సాధారణంగా ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. రక్తంలో విటమిన్ బీ12 స్థాయి 70 పీఎంవోఎల్/ఎల్ (పికోమోల్స్ పర్ లీటర్)గా ఉంటే సాధారణం కింద లెక్క.బీ12 లోపం వల్ల తలెత్తే లక్షణాలు...» జ్ఞాపకశక్తి తగ్గుదల, అయోమయ భావన» ఏకాగ్రత లోపం, స్పష్టమైన ఆలోచన కొరవడటం» కుంగుబాటు భావన, చికాకు, అలసట, బడలిక, బలహీనంగా ఉన్న అనుభూతి కలగడం» చేతులు, కాళ్లు మొద్దుబారినట్లు, తిమ్మిరిగా, దురదగా ఉండటం» కంటి నుంచి మెదడుకు దృశ్య సమాచారాన్ని ప్రసారం చేసే ఆప్టిక్ నాడి దెబ్బతినడం.బీ 12 ప్రయోజనాలు...» డీఎన్ఏ, ఎర్ర రక్త కణాల తయారీలో దోహదం.» జుట్టు, గోర్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.» కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు, వెన్నెముక) అభివృద్ధికి కీలకం.» ఆరోగ్యకరమైన ఎర్ర, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల తయారీకి బీ 12 అవసరం» కొత్త ఎర్రరక్త కణాల పెరుగుదల, అభివృద్ధికి అవసరం. -
శాంతి సమరం ఇంటి పాఠమే!
‘ఇంటి నుంచే మొదలు కావాలి’ అని నైతిక విలువలకు సంబంధించి చెప్పే మాట. నైతిక విలువల నుంచి సామాజిక నిబద్ధత, సాహస ప్రవృత్తి వరకు ఇంట్లో నుంచే నేర్చుకుంది నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మరియా కొరినా. కుటుంబ వారసత్వం, కుటుంబ బంధాలు, ఉద్యమ బంధాల గురించి ఐరన్ లేడి మరియా మాటల్లోనే..నాన్న అడుగు జాడల్లో నడవాలనుకున్నాను కానీ...రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నాన్న గొప్ప ఇంజినీర్, వ్యాపారవేత్త. దార్శనికుడు. ఎన్నో కంపెనీలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు.నాన్న ఎప్పుడూ ఒక మాట చెబుతుండేవారు...‘దేశభవిష్యత్, దాని శ్రేయస్సు ఒక సంస్థ అభివృద్ధి, లాభాల కంటే ఎక్కువ. కంపెనీని ఎవరైనా స్థాపించవచ్చు. డబ్బులు సంపాదించడం కూడా సులభం. అయితే నైతిక ప్రమాణాలు ముఖ్యం’ కుటుంబ వారసత్వం అనేది నా బలం. నా పూర్వీకులు, అనేక తరాల వాళ్లు తమ మాతృదేశం కోసం ప్రతీది చేశారు. జైలు జీవితం అనుభవించారు. తరతరాల సందేశం ఒక్కటే... దేశాన్ని ప్రేమించు, బాధ్యతతో ప్రవర్తించు.దేశ చరిత్రను మా ఇల్లు చెప్పేది!నా చిన్నప్పుడు మా ఇల్లు వెనెజువెలా చరిత్రను చెప్పే ఉపాధ్యాయురాలిగా అనిపించేది. ఆ ఇల్లు దేశచరిత్రలో ఎన్నో కీలక ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. ఒక విధంగా చె΄్పాలంటే వెనెజువెలా చరిత్రతో కలిసి పెరిగాను! మా అమ్మమ్మ ప్రఖ్యాత పుస్తకం ‘వెనెజువెలా హీరోయిక’ రచయిత ఎడ్వర్డో బ్లాంకో మనవరాలు, వెనెజువెలా మొదటి అధ్యక్షుడు జోస్ ఆంటోనియో పేజ్ సహాయకురాలు. చిన్నప్పుడు నేను విద్యార్థి నాయకుడు అరామండో జులోగా బ్లాంకో వీరాభిమానిని. విసెంటే గోమేజ్ నియంతృత్వంలో 24 సంవత్సరాల వయసులో బ్లాంకో హత్యకు గురయ్యాడు.నన్ను టెర్రరిస్ట్ అన్నారు!నేను గెలుస్తానని మొదట్లో చాలామంది నమ్మలేదు. ‘మీరు మహిళ కదా!’ ‘మీరు ఇంజినీర్ కదా! ‘మీది బాగా డబ్బున్న కుటుంబం కదా!’....ఇలాంటి మాటలే వినిపించేవి. లాటిన్ అమెరికాలోని పితృస్వామ్య భావజాల ప్రభావం వారి మాటల్లో కనిపించేది. ఒకానొక సమయంలో నన్ను టెర్రరిస్ట్గా ముద్ర వేస్తూ బెదిరింపు మెసేజ్లు అదేపనిగా రావడం మొదలయింది. నన్ను నేను రక్షించుకోవడానికి జాగ్రత్త పడడం తప్పనిసరి అనిపించింది. ఏ వ్యక్తీ అజ్ఞాతవాసంలో ఉండాలని నేను కోరుకోను. అయితే మరో కోణంలో చూస్తే మనల్ని మనం మరింతగా తెలుసుకోవడానికి, సవాళ్లను అధిగమించే శక్తిని సమకూర్చుకోవడానికి అజ్ఞాతవాసం అనేది ఒక అవకాశం.మాటలు మాత్రమే చాలవురాజకీయాలు, రాజకీయ నాయకులను అదేపనిగా విమర్శించడం ఒక్కటే సరిపోదు. మనవంతు కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. ప్రజాస్వామ్యం, న్యాయం, స్వాతంత్య్రం కోసం పోరాడే సాహసికులు ఒక ప్రాంతం, దేశం అని కాదు ప్రపంచం నలుమూలలా ఉన్న ప్రజలకు తరగని స్ఫూర్తిని ఇస్తారు. భయం చుట్టుముట్టిన సమయంఒక సభలో ప్రభుత్వ అవినీతి గురించి మాట్లాడుతున్నాను. హఠాత్తుగా నా కుమార్తె గుర్తుకు వచ్చింది. మాటలు ఆగిపోయాయి. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాను. నా కుమార్తె ఎక్కడ ఉంది? క్షేమంగా ఉందా? నేను సభల్లో ప్రభుత్వ అవినీతిపై గొంతెత్తడం వల్ల నా బిడ్డకు హాని జరుగుతుందా?... ఇలా ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. ఇంటికి వెళ్లి నా కుమార్తెను చూసుకునే వరకు నా మనసు మనసులో లేదు. ‘కుటుంబ బాధ్యతలు, ఉద్యమం అనే రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాను. ఇలా చేస్తే రెండిటికీ న్యాయం చేయలేను’ అనిపించింది.అమ్మ మాట‘నాకు దేవుడు ఎన్నో అద్భుత అవకాశాలు ఇచ్చాడు. నాకు ఎలాంటి లోటూ లేదు. నాకు ఎంతో మంది మద్దతు ఉంది... అనుకునేవాళ్లు తమ వంతుగా ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అని చిన్నప్పుడు అమ్మ చెబుతుండేది. అమ్మానాన్నల మాటల సారాంశం ఒక్కటే... మనం వ్యక్తిగతంగా ఏ స్థాయిలో ఉన్నా సమాజ హితాన్ని మరవకూడదు. -
పాలిటిక్స్లో పాట కచేరి
ప్రతిభ, పాపులారిటీ.. పాలిటిక్స్కి మోస్ట్వాంటెడ్ థింగ్స్! ఈ రెండూ ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో పార్టీ టికెట్స్ వలచి వరిస్తాయి! ఆ కోవలో గ్లామర్ స్టార్స్, కళాకారులకైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది! అందులో అమ్మాౖయెతే.. మహిళా ప్రాతినిధ్యానికి ఒక ఓటు పెరిగినట్టే.. ఓ ఆశ చిగురించినట్టే! ఇప్పుడీ ప్రస్తావనకు ప్రాసంగికత బిహార్ ఎన్నికలు..అలా టాలెంట్ అండ్ ఫాలోయింగ్ గల అభ్యర్థి.. గాయని మైథిలీ ఠాకుర్. ఆమె పరిచయం..గాయనిగా మైథిలీ ఠాకుర్ (Maithili Thakur) దేశమంతటా సుపరిచితం. ఆమె మైథిలీ, భోజ్పురి, హిందీ భాషల్లో జానపద సంగీతంతోపాటు శాస్త్రీయ సంగీతంలోనూ ఘనాపాటి. సంగీత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన మైథిలీ జన్మస్థలం బిహార్, మధుబని జిల్లాలోని బేనీపట్టీ. తండ్రి రమేశ్ ఠాకుర్ సంగీతం మాస్టారు. మైథిలీ తన ఇద్దరు సోదరులతోపాటు తండ్రి, తాత దగ్గరే శాస్త్రీయ, జానపద సంగీతం నేర్చుకున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ భక్తి, జానపద సంగీత కచేరీలు ఇస్తున్నారు. జానపద సంగీతంలో ఆమె చేస్తున్న కృషిని గుర్తించిన సంగీత నాటక అకాడమీ ఆమెను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది. మైథిలీకి సంగీత కళ మీద ఆరాధనే కాదు. సామాజిక స్పృహ కూడా బాగా ఉంది. ఓటర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని ఓటర్లకు అవగాహన పెంచడంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే ఎలక్షన్ కమిషన్ ఆమెను బిహార్ స్టేట్ ఐకాన్ను (Bihar State Icon) చేసింది. ఇవన్నీ కూడా ఆమెను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో పడేట్టు చేశాయి. ఆయోధ్య రామాలయ (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంలో శబరి మీద ఆమె పాట పాడారు. ఆ గాన మాధుర్యాన్ని ప్రధాని అభినందించారు. ఇవన్నీ ఆమె రాజకీయ ప్రవేశాన్ని సునాయాసం చేయనున్నాయి. బిహార్ ఎన్నికల్లో మధుబని లేదా అలీనగర్ ఈ రెండిట్లో ఏదో ఒక నియోజక వర్గానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేట్టు కనిపిస్తున్నాయి. మధుబని, దర్భంగా (అలీనగర్ ఈ జిల్లాలోనిదే).. ఈ రెండూ కూడా మిథిలా ప్రాంతం కిందకు వస్తాయి. మైథిలీ ఆ సంస్కృతీ సంప్రదాయంలోనే పుట్టి పెరిగిన వనిత. పైగా కళాకారిణి. ఈ రెండూ ఆమెను ఇటు సంప్రదాయవాదులకు, అటు సంప్రదాయవాదులు కాని వాళ్లకూ కూడా కావల్సిన వ్యక్తిగా ఆమెను ప్రజలకు దగ్గర చేస్తున్నాయి. సరిగ్గా బీజేపీ ఈ అంశాన్నే పరిగణనలోకి తీసుకుని ఆ రెండు నియోజకవర్గాల్లో ఒక స్థానం నుంచి ఆమెను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల మాట. అంతేకాదు ఆమె యంగ్ లేడీ కావడంతో ఇటు యూత్నూ ఆకట్టుకోవచ్చని బీజేపీ ఆలోచిస్తోందని చెబుతున్నారు. అయితే గెలుపు మాత్రం అంత అనాయాసంగా ఉండక పోవచ్చని మైథిలికి మద్దతిస్తున్న వారి అభిప్రాయం. ఆమె ముందు చాలా సవాళ్లే ఉన్నాయి. ఓటరు అవగాహనా కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే సరిపోదు రాజకీయ ప్రవేశానికి. ఎంతో కొంత క్షేత్రస్థాయి అనుభవం, వ్యూహాలు, సంస్థాగత తోడ్పాటు, పార్టీ అంచనాలకనుగుణంగా పని చేయడం వంటివి మైథిలి ముందున్న సవాళ్లని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏదేమైనా యువత.. అందులో అమ్మాయిలు రాజకీయాల్లోకి రావడం మాత్రం శుభపరిణామమే! -
ఖర్చు ఎక్కువైనా మంచి వైద్యం అందాల్సిందే..
ఆరోగ్య సమస్య తలెత్తితే ఎక్కడ వైద్యం చేయించుకోవాలి అన్నది దాదాపు ప్రతి ఇంటా ఓ సవాలే. సమస్యకు సత్వర పరిష్కారంతో పాటు ఖర్చులు భారం కాకుండా నమ్మకమైన చికిత్స కోసం ఏ హాస్పిటల్ని, ఏ వైద్యుడిని సంప్రదించాలో సన్నిహితులు, స్నేహితుల సలహా తీసుకోవడమూ సహజమే. అయితే మన దేశంలో అత్యధికులు ఆరోగ్య సంరక్షణలో మరింత పారదర్శకతను కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆరోగ్య సేవలు నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలకు (సర్టిఫైడ్) అనుగుణంగా లభిస్తే ప్రీమియం చెల్లించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని ఓ నివేదిక చెబుతోంది. అధిక నాణ్యతకే ప్రాధాన్యంఫిక్కీ, ఈవై–పార్థనాన్ తాజా నివేదిక ప్రకారం.. మన దేశంలో వైద్యానికి సంబంధించిన సరైన సమాచారం మూడింట ఒక వంతు మందికి మాత్రమే సులభంగా లభిస్తోంది. బ్రాండ్ లేదా వైద్యుడికి ఉన్న పేరు ప్రఖ్యాతులపై 60%, నోటి మాటపై 79% మంది ఆధారపడుతున్నారు. 83% మంది రోగులు.. చికిత్స కోసం వెళ్లాల్సిన ఆసుపత్రి, ఎంచుకోవాల్సిన వైద్యుల ఎంపిక విషయంలో మార్గనిర్దేశం చేయడానికి నిష్పాక్షికమైన, అందుబాటులో ఉన్న సమాచారాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి సమాచారం కోరిన వారిలో దాదాపు 90% మంది సర్టిఫైడ్, అధిక–నాణ్యత గల ఆసుపత్రిలో వైద్యం కోసం ఎక్కువ చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు.మహమ్మారి తర్వాత మారిపోయింది..వైద్య సేవలు ఎక్కడ మెరుగ్గా ఉంటాయో తెలుసుకోవడానికి భారతీయులు.. బంధువులు, సన్నిహితులపై ఆధారపడుతున్నారు. దశాబ్దాలుగా దాదాపు ప్రతి ఇంటా ఈ తంతు సహజంగా జరుగుతోంది. అయితే కోవిడ్–19 మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని నివేదిక చెబుతోంది. ‘నిజంగా మంచి నాణ్యతతో వైద్యం లభిస్తుందా? ఏ ప్రాతిపదికన చెబుతున్నారు. నేను ఎలా గుర్తించాలి?’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని నివేదిక పేర్కొంది. సేవల్లో పారదర్శకత కోసమే ఈ డిమాండ్ వస్తోందని తెలిపింది.వార్షిక వినియోగాన్ని మించి వ్యయం!అందుబాటు ధరలో వైద్యం అన్నది ఒక ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయిందని నివేదిక తెలిపింది. ప్రై వేట్ ఆసుపత్రిలో చేరితే సగటు ఖర్చు రూ.58 వేలు అవుతోంది. ఇది దాదాపు సగం భారతీయ కుటుంబాలు, 70 శాతం గ్రామీణ కుటుంబాల వార్షిక వినియోగ వ్యయాన్ని మించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోగులు తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆందోళన చెందుతుండడంతో ఇది సున్నితమైన అంశంగా పరిణమించింది. కాగా, 10% కంటే తక్కువ ప్రైవేట్ ఆసుపత్రులు, 2%లోపు డయాగ్నోస్టిక్ ల్యాబ్లు ఎన్ఏబీఎల్ గుర్తింపును కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది.పటిష్ట కార్యాచరణ అమలు చేయాలివైద్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సమన్వయంతో కూడిన బహుముఖ ప్రయత్నం అవసరమని నివేదిక వెల్లడించింది. మెరుగైన వైద్య సేవలు, వ్యయాలను దృష్టిలో పెట్టుకోవడం, వినియోగదారుల సాధికారతను నొక్కి చెబుతూ పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని సూచించింది. మెడికల్ రీయింబర్స్మెంట్, కనెక్టెడ్ ఎకోసిస్టమ్ అమలు చేయాలని స్పష్టం చేసింది. సర్వేలో పాలుపంచుకున్న 90% మంది వైద్యులు నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.ఎవరెవరు పాల్గొన్నారంటే..సర్వేలో భారత్కు చెందిన 40 నగరాల్లోని 250 ఆసుప త్రులు పాలుపంచుకు న్నాయి. వీటి మొత్తం పడకల సామర్థ్యం 75 వేల పైచిలుకు ఉంది. 1,000 మందికిపైగా రోగులు, 100 మందికిపైగా వైద్యులు, 70 మందికి పైగా సీఈవోలు, సీనియర్ వైద్యులు, నిర్వాహకులు, పెట్టుబడిదారుల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా నివేదిక రూపొందించారు. -
కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్దే హవా
మొబైల్ ఫోన్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్, ఏసీ.. ఇలా ఏదో ఒకటి లేని ఇల్లు అంటూ ఉండదు. ఇవి మన జీవితంలో అంతలా భాగమయ్యాయి. దేశంలో ఉపకరణాలు, ఎల్రక్టానిక్స్ రంగంలో బిజినెస్ టు కన్జ్యూమర్ (బీ2సీ) విభాగం వాటా 90 శాతానికి పైగా ఉంది. విలువ రూ.5.9 లక్షల కోట్లు. 2029 నాటికి బీ2సీ విభాగం రూ.10 లక్షల కోట్లకు చేరుతుందని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా అంచనా వేస్తోంది.ఉపకరణాల రంగంలో గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్గా రెండు ప్రధాన విభాగాలున్నాయి. కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ మార్కెట్లో మొబైల్ ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎయిర్ కండిషనర్స్ సెగ్మెంట్ రాబోయే నాలుగేళ్లలో రెండు రెట్లు అధికమై 17 శాతం వృద్ధి చెందుతుందని ఎల్జీ భావిస్తోంది. ఐపీఓ పత్రాల్లో కంపెనీ భారత మార్కెట్ గురించి ఆసక్తికర అంశాలు వెల్లడించింది. -
ఉన్నత విద్యలోనూ ఏఐ
సాక్షి, స్పెషల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లోనూ విస్తరిస్తున్న కృత్రిమ మేధ∙(ఏఐ) తాజాగా విద్యార్థుల చదువుల్లోనూ భాగమైంది. దేశంలోని 60 శాతంపైగా ఉన్నత విద్యాసంస్థలు ఏఐ సాధనాలను ఉపయోగించడానికి విద్యా ర్థులకు అనుమతిస్తున్నట్లు ఈవై–పార్థనాన్–ఫిక్కీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం లెర్నింగ్ మెటీరి యల్స్ను (బోధనాంశాలు) అభివృద్ధి చేయడానికి జనరేటివ్ ఏఐని ఇప్పటికే 53 శాతం విద్యాసంస్థలు ఉపయోగించడం ప్రారంభించాయి.దేశవ్యాప్తంగా 30 ఉన్నత విద్యాసంస్థలపై చేపట్టిన సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. ఇందులో విశ్వవిద్యాలయాలు, కళాశాలలు బోధన, పరిపా లనలో ఏఐను ఎలా స్వీకరిస్తున్నాయో వివరించింది. 40 శాతం ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత ట్యూటరింగ్ సిస్టమ్స్, చాట్బాట్స్ను ఉపయోగిస్తుండగా 39 శాతం సంస్థలు అడాప్టివ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ను వినియోగిస్తున్నాయి. అలాగే 38 శాతం కాలేజీలు ఆటోమేటెడ్ గ్రేడింగ్ కోసం ఏఐని ఉపయోగిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. అయితే ప్రభుత్వాల విధివిధానాల మార్గనిర్దేశంలో ఏఐ వినియోగం జరగాలని నివేదిక సూచించింది.అన్ని విభాగాలలో ఏఐ..ఉన్నత విద్యారంగంలోని అన్ని రకాల కోర్సుల్లో ఏఐ అక్షరాస్యతను పెంపొందించాలని నివేదిక ప్రతిపాదించింది. విద్యార్థులంతా ఏఐ భావనలు, నీతి, అప్లికేషన్స్పై ప్రాథ మిక అవగాహనను అలవర్చు కోవాలని సూచించింది. ఇందులో డిజిటల్ నైపుణ్యాలు, విమర్శనాత్మక ఆలోచన, డేటా వినియోగం తదితర అంశాలపై నైతిక అవగాహన కల్పించాలని నివేదిక వివరించింది.సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) ప్రోగ్రామ్స్లో మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, రోబోటిక్స్ వంటి అధునా తన కంటెంట్ను ప్రధాన పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టడం ముఖ్యమని నివేదిక అభిప్రాయపడింది. భారతీయ గ్రాడ్యుయేట్లను కేవలం ఏఐ వినియోగదారులుగానే కాకుండా ఏఐ సృష్టికర్తలు, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నివేదిక సూచించింది. శిక్షణ, మౌలిక వసతులకు..విద్యార్థుల్లో ఏఐపట్ల ఉత్సాహం అధికంగా ఉన్న ప్పటికీ ఏఐ బోధకులు ఆ స్థాయిలో లేకపోవడం సవా ల్గా మారిందని నివేదిక పేర్కొంది. అధ్యాపకులను సన్నద్ధం చేయడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం తక్షణ అవసరాలని పేర్కొంది. ఏఐ స్వీకరణను సమర్థంగా తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి విద్యాసంస్థలు అధ్యాపకులకు శిక్షణ, మౌలికవసతుల మెరుగుదల కోసం పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేసింది. ఈ అంశాలు కార్యరూపం దాలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత విజ్ఞానం, ఆవిష్కరణల్లో భారత్ ముందంజలో ఉంటుందని నివేదిక వివరించింది. ఉన్నత విద్యాసంస్థలు ఏఐ–ఆధారిత కార్యకలాపాల వైపు ముందుకు సాగుతున్నప్పటికీ ఆవిష్కరణలు, సమగ్రత మధ్య సమతూకం పాటించడం సవాలేనని అధ్యయన నివేదిక అభిప్రాయపడింది. -
మనసు మాట విందాం!
మన సమాజంలో దగ్గు, జలుబు, జ్వరం, షుగర్, బీపీ అంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తారు. కానీ డిప్రెషన్, ఆందోళన, పానిక్ అటాక్, డీ–పర్సనలైజేషన్ లాంటి వాటిని బలహీనతలు లేదా అలసత్వంగా చూస్తారు. అవేవో బాధితులు కావాలని తెచ్చిపెట్టుకున్నట్టు భావిస్తారు. కానీ నిజానికి మానసిక ఆరోగ్యం కూడా శారీరక ఆరోగ్యంతో సమానమే. ఇవి రెండూ పరస్పర ఆధారితాలు. తలనొప్పి, తల తిరుగుడు, వాంతులు, జీర్ణ సంబంధ ఇబ్బందులు, గుండె అత్యంత వేగంగా కొట్టుకోవడం, ముఖ కండరాలు అదరడం, చర్మం పాలిపోవడం లాంటి శారీరక లక్షణాల ద్వారా మానసిక వ్యాధులు వ్యక్తం అవుతాయి. అంటే, మనసు తాను అనుభవించే హింసను గుర్తించమని, త్వరగా ఈ బాధను తగ్గించే ఉపాయం చూడమని శరీరం ద్వారా వేడుకుంటుంది! కానీ పట్టించుకోం మనం. ఎందుకంటే, బాధితులు ఆ వ్యాధులకు సంబంధించిన మందులు తీసుకుంటే వాటికి బానిసలవుతారని, ఈ వ్యాధులు పూర్తిగా నయం కావనీ. నిజానికి ఇవన్నీ తప్పుడు భావనలు. మానసిక వ్యాధులు కూడా శారీరక వ్యాధుల్లానే అనేక కారణాల వల్ల రావచ్చు. మెదడు రసాయనాల అసమతుల్యత, వంశపారంపర్యం, ఒత్తిడి, పరిసరాలు వంటి అంశాలు దీనికి కారణం అవుతాయి. కనుగొనదగిన కారణాలు ఏమీ లేకుండా కూడా మానసిక వ్యాధులు రావచ్చు. తొలిదశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స చేస్తే, బాధితులు సాధారణ జీవితం గడపవచ్చు. పిల్లలు, యువకులు, పెద్దలు ఎవరికి అయినా మానసిక సమస్యలు రావచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, 2021లో ప్రపంచంలో సుమారు 1.1 బిలియన్ మంది మానసిక వ్యాధుల బారినపడ్డారు (ప్రతి ఎనిమిది మందిలో ఒకరు) అసలు మీరు పని చేసేచోట, సంచరించే చోట మీకు తెలియకుండా ఇప్పటికే ఒకరిద్దరు డిప్రెషన్ తోనో, ఏంగ్జయిటీతోనో వుండి ఉండొచ్చు. రోజువారీ జీవితంలో అవరోధం కలగనంతవరకూ పరవాలేదు. సమస్య వస్తే మాత్రం, దాచుకోవడం కంటే కుటుంబ సభ్యుల, స్నేహితుల, సహకారం తీసుకోవడం, వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి, మానసిక ఆరోగ్య సమస్యలు ‘‘నిజమైనవి’’ అనే విషయాన్ని గ్రహించడం, అంగీకరించడం. జ్వరం వస్తే విశ్రాంతి తీసుకుంటాం కదా! అలాగే, మనసు అలసిపోయినప్పుడు, అది బాధపడినప్పుడు కూడా సహాయం కోరడం సిగ్గుపడాల్సిన విషయం కాదు. ధైర్యం, అవగాహన అవసరమయ్యే విషయం. మనసుని ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలు పెట్టుకోవాలి. గ్రౌండింగ్ టెక్నిక్స్, బ్రీతింగ్ వ్యాయామాలు నేర్చుకోవాలి.. సర్వమానవ సహోదరత్వం, సౌభ్రాతృత్వం గురించి ఉపన్యాసాలు దంచేస్తాం. మనలో అది నిజంగా వుందని నిరూపించుకునే చిన్న అవకాశం ఒకటి ఏమిటంటే, మానసిక వ్యాధులతో బాధపడేవారిని చూసి ఎగతాళిగా నవ్వకుండా, తప్పుగా మాట్లాడకుండా ఉండటం, వాళ్లకి చేతనైన సహాయం చెయ్యడం. ఆమాత్రం చేయలేమా?ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తుల్లో అబ్రహాం లింకన్, ఐజాక్ న్యూటన్, విన్సెంట్ వ్యాన్గో, చార్లెస్ డికెన్స్ నుంచీ మన దీపికా పదుకొనే వరకూ ఎందరో గొప్ప వ్యక్తులు, సెలబ్రిటీలు మానసిక వ్యాధులతో పోరాడి, సాధారణ స్థాయిని మించి ఉన్నతంగా బతకడమే కాకుండా, తమ ప్రతిభతో లోకానికి ప్రేరణగా నిలిచారు. మానసిక రోగులు చాలావరకు ప్రమాదకారులు కాదు; మందులు వైద్యుని సూచన మేరకు తీసుకుంటే అడిక్షన్ రాదు.వైష్ణవి గద్దె, వైద్య విద్యార్థిని -
పల్లెల్లో పులి పంజా
దట్టమైన అడవుల్లో సంచరించే పెద్దపులులు, చిరుతలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆహారం, నీటి కోసం అటవీ సమీప గ్రామాల్లో, కొండ కింద శివారు గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం అధికమైంది. నల్లమల అటవీ ప్రాంతంతో పాటు, వెలిగొండ రిజర్వ్ ఫారెస్టు సమీప గ్రామాల్లో చిరుతలు, పెద్దపులులు తరచూ స్థానికుల కంటపడుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. పొలాల్లో పనులకు వెళ్లేందుకు రైతులు, పశువులను మేపేందుకు అడవిలోకి వెళ్లేందుకు పశుపోషకులు జంకుతున్నారు.కనిగిరిరూరల్/పెద్దదోర్నాల: నల్లమలలో కొన్ని రోజులుగా వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల జరిగిన పులుల గణనలో పులుల సంతతి పెరిగిన విషయం తేలింది. ప్రసుతం నల్లమల అభయారణ్యంలో 85 వరకు పెద్దపులులు, లెక్కకు మించిన చిరుత పులులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వర్షాకాలం ఆరంభమైన నాటి నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురవకపోవటంతో నల్లమలలో కొంత మేర నీటికి ఇబ్బందులతో పాటు పులుల ఆహార సమస్యలను తీర్చే సాంబార్, కణుతుల వంటి భారీ వన్యప్రాణుల సంచారం లేకపోవటంతో పులులకు ఆహార కొరత ఏర్పడింది. నీరు, ఆహారాన్ని వెతుక్కుంటూ పులులు అటవీ సమీప గ్రామాలకు వస్తుండటంతో స్థానికుల కంటపడుతున్నాయి. కొన్నిసార్లు పశువులపై దాడి చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో సుమారు 48,500 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. 7 సెక్షన్లు, 16 బీట్లు ఉన్నాయి. ప్రధానంగా భైరవకోన, వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ప్రాంతాల్లో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్లోని నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్ల పరిధిలోని కొండ కింద శివారు గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తోంది. వారం రోజుల క్రితం మరపగుంట్లలో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పాదముద్రలు సేకరించి 3, 4 ఇంచుల పొడవు ఉన్నట్లు తెలిపారు. పాద ముద్రలను బట్టి అది పెద్దపులి కాదని నిర్ధారించారు. పెద్దపులి పాద ముద్రలు 7, 8 ఇంచుల పొడవు ఉంటాయన్నారు. అక్కడ ఉన్న పాదముద్రల నమూనాలను బట్టి చిరుత పులి, లేదా జంగు పిల్లి అయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. తాజాగా గత శనివారం రాత్రి ఇమ్మడిచెరువు, రాళ్లపల్లి మధ్య ప్రాంత పొలాల్లో, గ్రామ శివార్లలో బైక్పై వెళ్తున్న ఒకరు పులిని చూసినట్లు చెప్పాడు. దీంతో ఆదివారం ఫారెస్ట్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పాదముద్రల నమూనాలను సేకరించారు. ఆ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల తుంగోడు, చెన్నపునాయినిపల్లి, మైలుచర్ల బొంతవారిపల్లి, పిల్లిపల్లి బీట్లలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో వన్య ప్రాణులతో పాటు చిరుత పులులు కనిపించినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. యర్రగొండపాలెం రేంజ్ పరిధిలోనూ.. యర్రగొండపాలెం రేంజి పరిధిలోని కొలుకుల బీట్లో పెద్దపులి కనబడటంతో రైతులు భయంలో వణికిపోతున్నారు. గత ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్తున్న రైతులకు పెద్దపులి కనిపించింది. దీంతో పొలాలకు వెళ్తున్న రైతులతో పాటు రైతు కూలీలు సైతం భయాందోళనతో వణికిపోతున్నారు. కొలుకుల బీటులోని అటవీ ప్రాంతంలో పెద్దదోర్నాల మండల పరిదిలోని పెద్ద»ొమ్మలాపురం రైతులకు చెందిన వ్యవసాయ భూములు ఎక్కువగా ఉండటంతో తరచూ వన్యప్రాణులతో సమస్యలు ఎదురవుతున్నాయి. పెద్దపులి సంచారం ఉన్న దేవలూడు ప్రాంతంలో గతంలోనే అటవీశాఖ బేస్ క్యాంపును ఏర్పాటు చేసింది. పులులకు ఆహారం దొరక్క పశువుల మందలు ఉన్న పెద్దదోర్నాల మండలం గండిచెరువు సమీప ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ఎక్కువగా ఉందని పశువుల కాపరులు పేర్కొంటున్నారు. దీనికి తోడు దేవలూడు ప్రాంతంలో నీటి నిల్వలు అధికంగా ఉండటం కూడా పులుల సంచారానికి మరో కారణమని పలువురు పేర్కొంటున్నారు. గతంలో పాలుట్లలో తన పొలానికి వెళ్లి తిరిగి వస్తున్న రైతు బాలునాయక్పై పెద్దపులి దాడి చేసి గాయపర్చగా, బొమ్మలాపురానికి చెందిన ఓ రైతు ఎద్దును సైతం పులి హతమార్చింది. గ్రామానికి చెందిన దేవలూడు, గండి చెరువు ప్రాంతాల్లోనే ఎక్కువ వ్యవసాయ భూములు ఉండటంతో బొమ్మలాపురం వాసులు ఆందోళన చెందుతున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోనూ.. అర్థవీడు మండలంలోని కొత్తూరు, దొనకొండ, వెలగలపాయ, బొల్లుపల్లి, అచ్చంపేట, మాగుటూరు, మోహిద్దీన్పురం గ్రామాల పరిధిలో తరచూ పులి సంచరిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెలగలపాయ, దొనకొండ, మాగుటూరు సమీపంలోని అటవీ ప్రాంతాల్లో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసి చంపేసిన ఘటనలు ఉన్నాయి. మొహిద్దీన్పురం వద్ద కారులో వెళ్తున్న కొందరికి పులి రోడ్డు దాటుతూ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. కంభం మండలంలోని దర్గా కొండ సమీపంలో నెల రోజుల క్రితం పులి అడుగులు కనిపించడంతో ఫారెస్టు అధికారులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మండలంలోని సూరేపల్లి సమీపంలో కొండవద్ద పులి అడుగులు ఉన్నాయని స్థానికులు చెప్పగా ఫారెస్టు అధికారులు ట్రాప్ కెమెరాలు బిగించి పరిశీలించారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి రాకుండా అటవీ శాఖాధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని, అటవీ ప్రాంతాల్లో నీటివనరులు ఏర్పాటు చేయాలని అటవీ సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.పులి సంచారంపై వివరాలు సేకరించాం పులి సంచారానికి సంబంధించిన వివరాలను సేకరించాం. ఆ ప్రాంతంలో పులి కాలి గుర్తులు లభించాయి. దేవలూడు అటవీ ప్రాంతం కాబట్టి పులుల సంచారం ఉంది. పెద్దబొమ్మలాపురంలో పులి సంచారంపై ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టాం. రైతులు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. – హరి, ఫారెస్టు రేంజి అధికారి, పెద్దదోర్నాల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం కనిగిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పెద్ద పులులు లేవు. భైరవకోన, వెలిగొండ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సుమారు 15 నుంచి 20 వరకు చిరుత పులులు ఉన్నాయి. వారం రోజుల నుంచి నాగిరెడ్డిపల్లి, వెదుళ్లచెరువు, గుడిపాటిపల్లి బీట్ పరిధిలోని గ్రామాల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆయా ప్రాంతాల్లో కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతంలో పెద్ద పులులు లేవు. అయినా కొండ కింద గ్రామాల ప్రజలు ఆరుబయట రాత్రి వేళ నిద్రించవద్దు. పొలాలకు వెళ్లే రైతులు, మేతకు అడవుల్లోకి వెళ్లే వారు ఒంటరిగా పోవద్దు. గ్రామ మొదట్లోనే పశువులను మేపుకోండి. నీటి కోసం, ఆహారం కోసం రాత్రిపూట వన్య ప్రాణులు అడవి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. – తుమ్మా ఉమా మహేశ్వరరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి, కనిగిరి -
‘పొగ తాగడం’ తగ్గింది
ప్రపంచవ్యాప్తంగా ధూమపానం తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసేవారి సంఖ్య 2000 సంవత్సరంలో 138 కోట్లు. 2024 వచ్చేసరికిఈ సంఖ్య 120 కోట్లకు పడిపోయింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడినవారిలో ప్రతి ఐదుగురులో ఒకరు పొగతాగుతున్నారు.నివారించగల ముప్పు అయినప్పటికీ ధూమపానం ఏటా కోట్లాది మంది ప్రాణాలు తీస్తోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.అంతర్జాతీయంగా 2000–2024 మధ్య.. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభాలో ధూమపానం చేసేవారు, అలాగే 2030 నాటికి దీని వినియోగం ఎలా ఉండబోతోంది అన్న అంచనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక రూపొందించింది. మొదటిసారిగా డబ్ల్యూహెచ్ఓ ప్రపంచవ్యాప్తంగా ఈ–సిగరెట్ వినియోగాన్ని అంచనా వేసింది. ఈ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ముప్పుగా ఈ–సిగరెట్స్ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికిపైగా ప్రజలు వేపింగ్ చేస్తున్నారు. ఈ–సిగరెట్స్, వేప్ పెన్స్, మోడ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఏరోసోల్ (ఆవిరి) పీల్చడాన్ని వేపింగ్ అంటారు. వేపింగ్ ప్రక్రియలో పొగాకుకు బదులు నికోటిన్, ఫ్లేవర్లు, ఇతర రసాయనాలు కలిగి ఉన్న ద్రవం (ఈ–లిక్విడ్) వాడతారు. క్యాన్సర్ కారకాలతో సహా హానికర రసాయనాలు ఏరోసోల్లో ఉంటాయి. వేపింగ్తో శ్వాస సమస్యలు, అవయవ నష్టం వంటి తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి. భారత్లో ఈ–సిగరెట్ తయారీ, వాడకం నిషేధం. నికోటిన్ వ్యసనంగా మారడానికి ఈ–సిగరెట్లు కారణమని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. పిల్లలు నికోటిన్ కు బానిసలవుతున్నారని, ఇవి దశాబ్దాల పురోగతిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలే ముందంజలో..2000–24 మధ్యకాలంలో అన్ని వయసుల వారిలో ధూమపానంలో స్థిరమైన తగ్గుదల ఉన్నప్పటికీ.. పురుషులతో పోలిస్తే మహిళలు ముందంజలో ఉన్నారు. 2025 సంవత్సరానికిగాను నిర్దేశించుకున్న ప్రపంచ తగ్గింపు లక్ష్యాన్ని ఐదేళ్లకు ముందే మహిళలు చేరుకున్నారని నివేదిక తెలిపింది. పురుషులు ఈ లక్ష్యాన్ని 2031 వరకు చేరుకోలేరని డబ్ల్యూహెచ్ఓ అంచనా. మహిళల్లో ధూమపానం వ్యాప్తి 2010లో 11% నుంచి 2024లో 6.6%కి తగ్గింది. పొగతాగే మహిళల సంఖ్య 2010లో 27.7 కోట్లు ఉండగా.. 2024లో 20.6 కోట్లకు తగ్గిపోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పొగతాగేవారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి పైగా పురుషులే. మగవారిలో ధూమపానం చేసేవారి సంఖ్య 2010లో 41.4% నుంచి 2024లో 32.5%కి తగ్గినప్పటికీ మార్పు వేగం చాలా నెమ్మదిగా ఉందని డబ్ల్యూహెచ్ఓ వివరించింది.భారత్లో ఇలా..15 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో పొగ తాగుతున్నవారు 24.35 కోట్లుపురుషులు 19.4కోట్లుస్త్రీలు 4.93కోట్లు2025లో ప్రపంచ జనాభాలో ధూమపానం వ్యాప్తి అంచనా 21.9%2000లో వ్యాప్తి అంచనా 49.8%2030 నాటికి పొగ తాగేవారి వ్యాప్తి అంచనా 18.8%ప్రపంచవ్యాప్తంగా ఈ–సిగరెట్స్ వాడుతున్నవారు 10 కోట్లు13–15 ఏళ్ల వయసున్న ఈ–సిగరెట్ వినియోగదారులు 1.5 కోట్లుప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు ఆపై వయసువారిలో పొగ తాగుతున్నవారు.. సంవత్సరం స్త్రీలు పురుషులు 2010 11% 41.4% 2024 6.6% 32.5%ప్రాంతాలవారీగా ధూమపాన ప్రియుల శాతంయూరప్ 24.1ఆగ్నేయాసియా 23.4పశ్చిమ పసిఫిక్ దేశాలు 22.9అమెరికా 14ఆఫ్రికా 9.5 -
చిన్న నగరాలకూ.. రెక్కలొచ్చాయి!
పెరుగుతున్న మధ్యతరగతి ఆదాయం, విశ్రాంతి, వ్యాపార ప్రయాణాలకు పెరిగిన డిమాండ్.. ఇవన్నీ దేశీయ విమానయానాన్ని నూతన శిఖరాలకు తీసుకువెళ్తున్నాయి. చిన్న నగరాలను అనుసంధానించడానికి ఉడాన్ పథకం వంటి ప్రభుత్వ కార్యక్రమాలు, తక్కువ–ధర క్యారియర్ల పోటీ, పాత విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్పోర్టుల రాక, మౌలిక సదుపాయాల కల్పన.. వెరసి భారత్లో విమాన ప్రయాణికుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మెట్రోయేతర పట్టణాల నుంచి ప్యాసింజర్లు పెరుగుతుండడం ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్1995–96 నాటి మాట.. అప్పట్లో దేశీయంగా 2.56 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. అలాగే 1.14 కోట్ల మంది వివిధ దేశాలకు రాకపోకలు సాగించారు. మూడు దశాబ్దాలలో విమానయాన రంగం తీరుతెన్నులు మారిపోయాయి. » దేశీయ ప్రయాణికుల సంఖ్య 13 రెట్లు, అంతర్జాతీయ ప్యాసింజర్ల సంఖ్య 7 రెట్లు దూసుకెళ్లింది. 2005–06 నుంచి 2024–25 మధ్య దేశీయంగా ప్రయాణికులు 5.1 కోట్ల నుంచి 33.5 కోట్లకు, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు 2.2 కోట్ల నుంచి 7.7 కోట్లకు చేరారు. » సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక ప్రకారం.. భారత విమానయాన రంగ వృద్ధిలో అధిక భాగం అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి కాకుండా దేశీయ ప్రయాణికుల నుంచి సమకూరడం విశేషం. కరోనా సమయంలో మాత్రమే పరిశ్రమ తిరోగమనం చెందింది. ఆధిపత్యం తగ్గుతోంది ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలు ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. కానీ వీటి ఆధిపత్యం క్రమంగా తగ్గుతోంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. 2006–07లో భారతీయ విమానాశ్రయాలు సేవలందిస్తున్న మొత్తం ప్రయాణికుల్లో నాలుగింట మూడొంతులకుపైగా వాటా (75 శాతానికిపైగా) ఈ మెట్రో నగరాలదే. అయితే 2024–25 వచ్చేసరికి ఈ వా టా మూడింట రెండొంతులకు (సుమారు 67 శాతం) పడిపోయింది. మొత్తంగా మెట్రోయేతర నగరాల్లోని విమానాశ్రయాల వాటా 55.87% వృద్ధి చెందడం విశేషం. ప్రయాణికుల రద్దీలో ప్రథమ శ్రేణి నగరాల వాటా 2006–07లో 78.46% నుంచి 2024–25లో 66.44%కి వచ్చి చేరింది. ద్వితీయ శ్రేణి నగరాల విషయానికి వస్తే వీటి వాటా 15 నుంచి 24.6%కి దూసుకెళ్లింది. తృతీయ శ్రేణిలో 9% మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. పదిలో నలుగురు..దేశీయ విమానయానంలో మెట్రో, మెట్రోయేతర నగరాల మధ్య అంతరం తగ్గుతోంది. 2006–07లో మొత్తం దేశీయ ప్రయాణికులలో దాదాపు 73% మంది మెట్రో నగరాల్లోని విమానాశ్రయాల ద్వారా ప్రయాణించారు. 2024–25 నాటికి ప్రథమ శ్రేణి నగరాల వాటా దాదాపు 58%కి పడిపోయింది. ప్రతి పది మంది దేశీయ ప్రయాణికులలో నాన్–మెట్రో విమానాశ్రయాలు నలుగురికి సేవలు అందించాయి. ఇక అంతర్జాతీయ ప్రయాణం మెట్రో–కేంద్రీకృతంగా ఉంది. 2006–07లో అంతర్జాతీయ ప్రయాణికులలో వీటి వాటా 78 శాతానికిపైనే ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇది దాదాపు 73%కి వచ్చి చేరింది. చిన్నవే.. కానీ! భారత్లో 2015–16తో పోలిస్తే 2024–25 నాటికి చిన్న నగరాలు విమానయాన జోరుకు కారణమయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల్లోని విమానాశ్రయాలలో ప్రయాణికుల రద్దీ దశాబ్దంలో సగటున 84.4% పెరిగింది. కానీ ద్వితీయ శ్రేణి ఎయిర్పోర్టుల్లో 132%, తృతీయ శ్రేణిల్లో 159% పెరగడం విశేషం. ద్వితీయ శ్రేణి నగరాల విభాగంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ విమానాశ్రయం (చకేరి) ఏకంగా 1,63,479%, తృతీయ శ్రేణి నగరాల పరిధిలోకి వచ్చే కర్ణాటకలోని మైసూర్ విమానాశ్రయం 7,874% వృద్ధిని నమోదు చేశాయి. రెండు విమానాశ్రయాలు చాలాకాలం క్రితమే నిర్మించినప్పటికీ.. 2015 వరకు నామమాత్రంగా కార్యకలాపాలు సాగాయి. ఉడాన్ పథకం కింద వీటిని అభివృద్ధి చేశారు. 2015–16లో కాన్పూర్ విమానాశ్రయం నుంచి కేవలం 197 మంది, మైసూర్ నుంచి 1,190 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. గత ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సంఖ్య వరుసగా 3,22,252 మరియు 94,891కి పెరిగింది. -
బాల్యం ‘కిడ్నాప్’ అవుతోంది
దేశంలో చిన్నారులపై నేరాలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉన్నాయిగానీ తగ్గడం లేదు. 2021లో 1.49 లక్షల నుంచి 2022లో 1.62 లక్షలకు, 2023లో 1,77,335కి పెరిగాయి. 2023లో మొత్తం బాధితుల సంఖ్య 1,86,521. 28 రాష్ట్రాల్లో.. 10వేలకుపైగా బాధితులు ఉన్న రాష్ట్రాలు 6 ఉండటం గమనా ర్హం. మొత్తం కేసుల్లో కిడ్నాపులు / అపహరణలే అత్యధికం కావడం ఆందోళనకరం. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 2022తో పోలిస్తే కేసులు పెరగ్గా, ఆంధ్రప్రదేశ్లో తగ్గాయి. అత్యధిక నేరాలు జరిగిన టాప్ –15 రాష్ట్రాల జాబితాలో కూడా ఏపీ లేకపోవడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
మల్లమ్మ మాట.. పల్లె పదాల మూట
తెలంగాణలో గంగవ్వ ఎలాగో కర్నాటకలో మల్లమ్మ అలాగ. కన్నడ భాషలోని పల్లె పలుకుబడిలో వర్తమాన విషయాలపై మల్లమ్మ చేసే వ్యంగ్య వ్యాఖ్యానానికి చాలామంది ఫాలోయెర్స్ ఉన్నారు. ఆమె ‘మల్లమ్మ టాక్స్’ యూట్యూబ్ చానల్కు 50 వేల మంది సబ్స్క్రయిబర్స్. అందుకే ఆమెకు కన్నడ బిగ్బాస్లో పిలుపు వచ్చింది. మారుమూల పల్లెల్లో ఉన్నామని చిన్నబుచ్చుకోక గంగవ్వలా, మల్లమ్మలా ఎవరైనా వెలగొచ్చు.కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తోన్న ‘కన్నడ బిగ్బాస్ 12’వ సీజన్ప్రారంభమైంది. అన్ని బిగ్బాస్ షోలకు ఉన్నట్టే అక్కడా దానికి ఒక క్రేజ్ ఉంది. ప్రతిసారీ హౌస్లోకి వచ్చేవారు ఎవరా అనే కుతూహలం ఉంటుంది. ఈసారి హౌస్లోని అభ్యర్థుల్లో పాపులర్ వ్యక్తులు చాలా మందే ఉన్నారు. అయితే వారందరిని మించి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. ఆమే మల్లమ్మ అలియాస్ ‘మటిన మల్లి’ (మాటల రాణి– ఆమెను అభిమానంగా పిలుచుకునే పేరు). బిగ్బాస్లో అందరికంటే ఎక్కువ వయసు మల్లమ్మదే. 70 ఏళ్లు. మల్లమ్మ సరళమైన జీవనశైలి, హాస్యం, గ్రామీణ జీవితంపై ఆమె చేసే కంటెంట్ సోషల్ మీడియాలో ఆమెను వైరల్గా మార్చాయి. ఇక్కడ బిగ్బాస్లో ఎలాగైతే తెలంగాణ గంగవ్వకు చోటు లభించిందో ఆమెకు అలా అక్కడ చోటు లభించింది. బిగ్బాస్లో పాల్గొన్న గంగవ్వ ఆ షో పుణ్యమా అని సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోగలిగింది. మరి మల్లమ్మకు ఏం ప్రయోజనం కలుగుతుందో చూడాలి.కథలు చెప్పే మల్లమ్మఉత్తర కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా సురపుర గ్రామానికి చెందిన మల్లమ్మ మంచి మాటకారి. సోషల్మీడియా కంటెంట్ క్రియేటర్. ఆమె వీడియోలకు లక్షల్లో వీక్షకులున్నారు. ఆమె సోషల్ మీడియా ప్రయాణం విచిత్రంగా మొదలైంది. ఆమె గతంలో బెంగళూరులోని ఓ ఫ్యాషన్ డిజైన్ కంపెనీలో పని చేసింది. ఆమె మంచి టైలర్. ఆ సమయంలో స్టోర్ యజమానులను ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోలను అప్లోడ్ చేసింది. అవి పాపులర్ కావడంతో ఇతర అంశాలపైనా దృష్టి సారించి, మరిన్ని వీడియోలు చేసింది.పల్లెటూరి పనులు, వంటలు, షాపుల్లో పల్లెజనం బేరసారాలు చేసే తీరు, జాతరలు ఇవన్నీ యథాతథంగా ఎలా ఉంటాయో ఆమె చూపడం వల్ల ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్కు 1.83 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మల్లమ్మ అప్పుడప్పుడూ సరదా కథల్ని కూడా తన వీడియోల్లో పంచుకుంటోంది. ఇంత పాపులారిటీ ఉండటం వల్ల సహజంగానే బిగ్బాస్ షోకు ఆహ్వానం అందింది. హోస్ట్ సుదీప్తో ఆమె మాట్లాడుతూ బిగ్బాస్ హౌస్ నియమాల గురించి తనకేమీ తెలియదని అన్నారు. ‘మల్లమ్మ ఎప్పుడూ తనంతట తానుగా జీవితాన్ని గడిపే వ్యక్తి’ అని సుదీప్ అన్నారు. మల్లమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు.ప్రశంసలతోపాటు వివాదాలుమల్లమ్మ చేసిన వీడియోలకు అనేక ప్రశంసలు వచ్చాయి. ఒక్క వీడియో మాత్రం తీవ్రమైన విమర్శలు మూటగట్టుకుంది. ఒక తెలుగు సినిమాలోని పాట గురించి ఆమె మాట్లాడిన మాటలతో అనేకమంది తీవ్ర విమర్శలు చేశారు. దీంతో తన అకౌంట్ను మూసివేయాలని అనుకున్నట్లు ప్రకటించింది. అయితే అలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఆమె అభిమానులు ఆమెను ఒప్పించారు. అలా ఆమె వీడియోల్లో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. విక్కీ కౌశల్ ‘తౌబా తౌబా’ డ్యాన్స్, ఉర్ఫీ జావేద్ డ్రెస్సింగ్ స్టైల్, ఉత్తర భారతదేశ వంటలు, వైరల్ రీల్స్.. ఇలా అన్నింటి గురించి ఆమె వీడియోలు చేసింది. అయితే ప్రస్తుతం కన్నడ బిగ్బాస్ షో తాత్కాలిక కష్టాల్లో పడింది. పర్యావరణ అనుమతులు లేవని ΄ోలీసులు బిగ్బాస్ హౌస్ను మంగళవారం సాయంత్రం సీజ్ చేసి కంటెస్టెంట్లను ఒక రిసార్ట్కు తరలించారు. బిగ్బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చే మురుగు నీరు, వ్యర్థ పదార్థాల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేదని నిర్వాహకుల మీద అధికారులు చర్యలు చేపట్టారు. ఎంతో సంతోషంగా హౌస్లో అడుగు పెట్టిన మల్లమ్మ ప్రస్తుతం రిసార్ట్కు చేరింది. అయితే సమస్య అతి త్వరలో సద్దుమణిగి షో కొనసాగుతుందనే అభిమానులు ఆశిస్తున్నారు. -
అయ్యే.. ఇన్ని కేసులు మూసేశారా?
కేసు.. నో క్లూస్.. అందుకే క్లోజ్.. ఇదీ చాలా కేసుల పరిస్థితి. నేరం జరిగిందనే విషయం బాధితులతోపాటు పోలీసులకూ స్పష్టంగా తెలుస్తోంది. అయితే నిందితులను పట్టుకోవడానికి, వారిపై న్యాయస్థానంలో నేరం నిరూపించడానికి పక్కా ఆధారాలు మాత్రం లభించలేదు. ఈ కారణంగా కేసును మూసివేసినట్లు పోలీసుల ద్వారా బాధితుడికి సమాచారం వెళ్తుంది. అప్పుడు బాధితుడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించడం... సరిగ్గా ఇలాంటి ఫీలింగ్నే 2023లో నగరానికి చెందిన 34.98 శాతం మంది బాధితులు అనుభవించారు. - సాక్షి, సిటీబ్యూరోనేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) 2023కు సంబంధించిన ‘క్రైమ్ ఇన్ ఇండియా’గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్/అన్ ట్రేస్డ్/నో క్లూ’అంటూ కేసును మూసేస్తున్నట్లు పేర్కొంటారు. ఆర్థిక నేరాల్లోనే అత్యధికం... హైదరాబాద్ నగర పోలీసు (Hyderabad Police) విభాగం 2023లో దర్యాప్తు చేసిన కేసుల్లో కొన్ని పాత కేసులూ ఉంటాయి. సరాసరిన చూస్తే 2023లో ఐపీసీ, లోకల్ యాక్ట్స్, ఐటీ చట్టాల కింద మొత్తం 30,604 కేసులు నమోదు కాగా.. వీటిలో 10,706 కేసుల్ని పైన చెప్పిన ‘నో క్లూ’కారణాలతో మూతపడ్డాయి. ఇలా మూతపడిన కేసుల్లో అత్యధికం ఐపీసీ చట్టాల కింద నమోదైన నేరాలకు సంబంధించినవే ఉన్నాయి. కేసులు ఇలా మూతపడటంలో బాధితుల పాత్ర సైతం ఉంటోందని పోలీసులు చెప్తున్నారు. బాధితులుగా మారిన వెంటనే పోలీసుల్ని ఆశ్రయించి కేసు నమోదు చేయిస్తుంటారని, ఆ తర్వాత కొన్నాళ్ళకు నిందితులు రాజీకి వస్తే అంగీకరిస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కేసు దర్యాప్తు, విచారణ వంటివి జాప్యాలుగా భావిస్తున్న బాధితులు తక్షణం నష్టం పూడుతోందనే ఉద్దేశంలో ఇలా చేస్తుంటారని వివరిస్తున్నారు. ఫలితంగా దర్యాప్తునకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులకు పూర్తిస్థాయిలో అందించరు. దీంతో ఈ తరహా కేసుల్ని ‘ట్రూ బట్ ఇన్సఫీషియంట్ ఎవిడెన్స్’ తదితర కారణాల కింద మూసేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. సాక్ష్యాధారాలు ఉండాల్సిందే... ఏదైనా నేరానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసి, నిందితుల్ని అరెస్టు చేయడానికి ప్రాథమిక ఆధారాలు ఉంటే సరిపోతుంది. అయితే దర్యాప్తు పూర్తియిన తర్వాత పోలీసులు కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు కేసు విచారణను న్యాయస్థానం చేపడుతుంది. దీనికి పక్కా సాక్ష్యాధారాలు ఉండాల్సిందే. అలా లేని పక్షంలో కోర్టు నుంచి పోలీసులకు అక్షింతలు తప్పవు. అవకతవకలకు, వేధింపులకు ఆస్కారం లేకుండా, బెదిరింపులు, ప్రలోభాలకు తావు లేకుండా ఉండటంతోపాటు నిరపరాధులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి కేసులోనూ సరైన సాక్ష్యాధారాలు సేకరించడానికి పోలీసులు ప్రయత్నిస్తుంటారు. పక్కా ఆధారాలు లేనప్పుడు పోలీసులు న్యాయనిపుణుల సలహా మేరకు ‘ట్రూ బట్ ఇన్సఫీషియంట్ ఎవిడెన్స్’లేదా ‘అన్ ట్రేస్డ్’లేదా ‘నో క్లూ’కారణంగా కేసుల్ని మూసేస్తుంటారు. మరికొన్ని కారణాలతోనూ... దర్యాప్తు చేస్తున్న కేసుల్ని మరికొన్ని కారణాలతోనూ పోలీసులు మూసేస్తున్నట్లు ఎన్సీఆర్బీ (NCRB) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఏడాది నగర పోలీసు విభాగానికి వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని తప్పుడు ఫిర్యాదులుగా తేలుతున్నాయి. వ్యక్తిగత, ఆర్థిక కారణాలు, ఈర్షా్యద్వేషాలు, అహం కారణంగా ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడానికి అకారణంగా ఆరోపణలు చేస్తూ పోలీసుల వద్దకు తీసుకువస్తున్నారని స్పష్టమవుతోంది. దర్యాప్తులో అవి తప్పుడు ఫిర్యాదులని తేలడంతో ‘పాల్స్’ అనే కారణంగా కేసులు మూతపడుతున్నాయి. ‘ఆ తరహా నేరం కాని’కేసులూ మూతపడుతున్నాయి. కేసు నమోదు సందర్భంలో ఆ నేరం ఫలానా తరహాకు చెందినది భావిస్తున్నారు. చివరకు దర్యాప్తు పూర్తయ్యే సరికి దాని స్వరూప స్వభావాలు మారిపోవడంతోపాటు బాధితుల నుంచి సహకారం లేకపోవడంతో కేసు మూసేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. నగదు లావాదేవీలతో ఇబ్బంది... ఏటా నమోదవుతున్న ఆర్థిక నేరాల్లో నగదు లావాదేవీలకు సంబంధించినవి అనేకం ఉంటున్నాయి. రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో లావాదేవీలు చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ రూ.లక్షలు, రూ.కోట్లలో ఈ లావాదేవీలు జరుగుతుంటాయి. పెట్టుబడులు, చిట్టీలు, భాగస్వామ్యం కోసం వెచ్చింపు, రుణాలు ఇప్పిస్తానంటూ కమీషన్లు... ఇలా అనేక చోట్ల నగదు లావాదేవీలే నడుస్తున్నాయి. చదవండి: నీ చొక్కా చాలా బాగుంది.. నాకు ఇవ్వన్నా..ఆద్యంతం ఇవన్నీ సజావుగా జరిగిపోతే అవి రికార్డుల్లోకి ఎక్కవు. ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు బాధితులుగా మారిన వాళ్లు పోలీసుల వద్దకు వస్తున్నారు. ఆన్లైన్ లేదా చెక్కుల రూపంలో జరిగిన వాటికి పక్కా ఆధారాలు ఉంటాయి. నగదు రూపంలో చేసిన లావాదేవీలను నిరూపించడం చాలా అరుదు. ఈ కారణంగానూ కొన్ని కేసులు ‘ట్రూ బట్...’ అంటూ మూసేయాల్సి వస్తోందని పోలీసులు చెప్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం అరుదు.. ఠాణాల్లో నమోదైన కేసులు ‘ట్రూ బట్ ఇన్ సఫీషియంట్ ఎవిడెన్స్’కింద మూతపడటానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఈ అంశంలో పోలీసుల నిర్లక్ష్యం అనేది అత్యంత అరుదు. బాధితులు ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేయడం ఓ ప్రధాన కారణం. దీనికితోడు అనుమానితులు, నిందితులపై వివరాలు చెప్పకపోవడం, సరైన ఆధారాలు అందించకపోవడంతో కేసులు మూతపడుతున్నాయి. సైబర్ నేరాల విషయంలో కేటుగాళ్లు వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, వనరుల లేమి కారణంగా ఆధారాలు లభించట్లేదు. – నగర పోలీసు ఉన్నతాధికారి -
ఏఐతో..గుత్తాధిపత్యం
సాక్షి, న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ) సాంకేతికత వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోంది. అదేసమయంలో పెను ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) హెచ్చరించింది. ఏఐ, దాని ప్రభావంపై మార్కెట్ అధ్యయనం నిర్వహించిన సీసీఐ, గత నెలలో ఇందుకు సంబంధించి నివేదికను విడుదల చేసింది. ఏఐ మార్కెట్లో కొన్ని బడా టెక్నాలజీ సంస్థల ఆధిపత్యం పెరుగుతోందని, ఇది భవిష్యత్తులో గుత్తాధిపత్యానికి దారితీసి, ఆరోగ్యకరమైన పోటీని దెబ్బ తీస్తుందని ఈ నివేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అల్గారిథమ్ల ద్వారా రహస్య కుమ్మక్కు, ధరల వివక్ష, స్టార్టప్లకు అడ్డంకులు వంటి అనేక సవాళ్లను ఈ నివేదిక వెలుగులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మార్కెట్ 2020లో 93.24 బిలియన్ డాలర్ల నుంచి 2024 నాటికి 186.43 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారతదేశంలో ఏఐ మార్కెట్ పరిమాణం 2020లో 3.20 బిలియన్ డాలర్లుండగా 2024 నాటికి 6.05 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2031 నాటికి ఇది 31.94 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఈ గణాంకాలు ఏఐ ప్రాముఖ్యతను స్పష్టం చేస్తున్నాయి.బడా కంపెనీలదే పెత్తనం సీసీఐ నివేదిక ప్రకారం, ఏఐ పర్యావరణ వ్యవస్థను (ఏఐ ఎకో సిస్టం) కొన్ని పొరలుగా (ఏఐ స్టాక్) విభజించారు. ఇందులో డేటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ (క్లౌడ్ కంప్యూటింగ్, చిప్స్), డెవలప్మెంట్ (అల్గారిథమ్స్, ఫౌండేషన్ మోడల్స్) వంటి కీలకమైన ప్రాథమిక (అప్స్ట్రీమ్) పొరలు ఉన్నాయి. ఈ కీలకమైన రంగాల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్), గూగుల్, మైక్రోసాఫ్ట్ అజూర్, ఎన్విడియా వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలదే పూర్తి ఆధిపత్యం. మనదేశంలోని దాదాపు 67% స్టార్టప్లు కేవలం ఏఐ అప్లికేషన్లను అభివృద్ధి చేసే (డౌన్స్ట్రీమ్) స్థాయిలోనే పనిచేస్తున్నాయి. ఇవి తమ కార్యకలాపాల కోసం పూర్తిగా ఈ బడా సంస్థల క్లౌడ్ సేవలు, టెక్నాలజీలపైనే ఆధారపడి ఉన్నాయి. ఇది మార్కెట్లో తీవ్ర అసమానతలకు దారితీస్తోందని నివేదిక పేర్కొంది. మార్కెట్ను శాసించే అల్గారిథమ్స్ ఏఐ రాకతో మార్కెట్లో పోటీతత్వం స్వరూపమే మారిపోతోంది. ముఖ్యంగా, ధరలను నిర్ణయించే అల్గారిథమ్ల వాడకం పెరగడం పెను సవాలుగా మారింది. సీసీఐ నివేదిక ప్రకారం, అల్గారిథమ్ల ద్వారా కంపెనీలు రహస్యంగా కుమ్మక్కయ్యే (అల్గారిథమ్ కొల్యూషన్) ప్రమాదం పొంచి ఉంది. మనుషుల ప్రమేయం లేకుండానే, అల్గారిథమ్లు ఒకదానికొకటి సంకేతాలు పంపుకుంటూ ధరలను కృత్రిమంగా పెంచే అవకాశం ఉంది. ఈ నివేదిక కోసం సర్వే చేసిన స్టార్టప్లలో 37% మంది అల్గారిథమిక్ కుమ్మక్కుపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో ‘టాప్కిన్స్’కేసు, యూకేలో ‘ట్రాడ్/జీబీ ఐ’కేసు వంటివి ఇందుకు నిదర్శనాలని నివేదిక ఉదహరించింది. అంతేకాకుండా, వినియోగదారుడి కొనుగోలు శక్తి, ప్రవర్తనను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో ధరను చూపే ‘ధరల వివక్ష’కూడా పెరిగిపోతోందని, దీనిపై 32% స్టార్టప్లు ఆందోళన చెందాయని సర్వేలో తేలింది.ప్రవేశానికి అడ్డంకులు.. స్టార్టప్లకు సవాళ్లుఏఐ రంగంలోకి కొత్తగా ప్రవేశించాలనుకునే స్టార్టప్లకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని సీసీఐ అధ్యయనంలో వెల్లడైంది. స్టార్టప్లు ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకుల్లో 68% మంది డేటా లభ్యత అతిపెద్ద అడ్డంకిగా పేర్కొన్నారు. అత్యుత్తమ ఏఐ మోడల్స్ అభివృద్ధికి భారీ మొత్తంలో నాణ్యమైన డేటా అవసరం, కానీ అది బడా సంస్థల వద్దే పోగుపడి ఉంది. 61% మంది క్లౌడ్ సేవలు అత్యంత ఖరీదైనవిగా మారాయని తెలపడం ఇందుకు ఉదాహరణ. 61% మంది నైపుణ్యం కలిగిన ఉద్యోగులు దొరకడం కష్టంగా ఉందని చెప్పారు. 66% మంది నిపుణులు సులభంగా అందుబాటులో లేరని అభిప్రాయపడ్డారు. 59% మంది కంప్యూటింగ్ సౌకర్యాల ఖర్చు అడ్డంకిగా భావించారు. 56% మంది స్టార్టప్లు నిధులు సమీకరించడం పెద్ద సవాలుగా ఉందని తెలిపారు. సర్వే ప్రకారం, 83% స్టార్టప్లు సొంత నిధులతోనే నడుస్తున్నాయి. తదుపరి దశ నిధులు పొందడం చాలా కష్టంగా ఉందని 50% మంది పేర్కొన్నారు. ఈ అడ్డంకుల వల్ల ఆవిష్కరణలు తగ్గి, మార్కెట్లో పోటీతత్వం నీరుగారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొని, ఏఐ రంగంలో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించేందుకు సీసీఐ తన నివేదికలో పలు కీలక సూచనలతో ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రతిపాదించింది. అందులోని అంశాలివీ... స్వీయ–తనిఖీ : ఏఐ వ్యవస్థలను వినియోగించే సంస్థలు, తమ అల్గారిథమ్లు పోటీ చట్టాలకు విరుద్ధంగా పనిచేయకుండా చూసేందుకు స్వీయ–తనిఖీ విధానాన్ని పాటించాలి. ఇందుకు ఒక మార్గదర్శక పత్రాన్ని సీసీఐ జతచేసింది. పారదర్శకత: ఏఐ ఆధారిత నిర్ణయాల విషయంలో కంపెనీలు పారదర్శకతను పాటించాలి. ఏఐని ఏ ఉద్దేశంతోవాడుతున్నారో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాలి. అవగాహన కార్యక్రమాలు: ఏఐ, పోటీ చట్టాలపై వాటాదారులందరికీ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు, వర్క్షాపులు నిర్వహిస్తుంది. అడ్డంకుల తొలగింపు: స్టార్టప్లకు అవసరమైన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలు, నాణ్యమైన డేటా అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. నియంత్రణ సంస్థల మధ్య సమన్వయం: ఏఐకి సంబంధించిన అంశాలు బహుళ నియంత్రణ సంస్థల పరిధిలోకి వస్తున్నందున, వాటి మధ్య సమన్వయం కోసం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని సీసీఐ భావిస్తోంది. అంతర్జాతీయ సహకారం: ప్రపంచవ్యాప్తంగా ఉన్నకాంపిటీషన్ ఏజెన్సీలతో కలిసి పనిచేయడం ద్వారాఅంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మొత్తమ్మీద ఏఐ సాంకేతికతను ప్రోత్సహిస్తూనే, మార్కెట్లో గుత్తాధిపత్య ధోరణులను అరికట్టి, చిన్న సంస్థలు, స్టార్టప్లు కూడా రాణించేందుకు సమాన అవకాశాలు కల్పించేలా పటిష్టమైన నియంత్రణ యంత్రాంగాన్ని రూపొందించాల్సిన అవసరముందని సీసీఐ స్పష్టం చేసింది. -
సౌర తుపానుతో..మన ఆరోగ్యానికీ ముప్పే!
‘శక్తిమంతమైన సౌర తుపాను భూమిని తాకింది.. ఫలితంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు ఏర్పడ్డాయి. దీనివల్ల శాటి లైట్లు, పవర్గ్రిడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ప్రభా వితం అయ్యే అవకాశం ఉంది’ ఇలాంటి వార్తలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వింటున్నాం.ఔను, నిజమే. సూర్యుడి నుంచి ఉత్పన్న మయ్యే సౌర తుపాన్లు అంత ప్రభావవంతమైనవే, ప్రమాదకరమైనవే. అది ఆయా వ్యవస్థలనేకాదు.. మానవుల ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. సౌర తుపాన్ల వంటి వాటివల్ల ప్రభావితమయ్యే భూ అయస్కాంత క్షేత్రం.. మనుషుల్లో గుండెపోటుకు కారణమవుతోందట.బ్రెజిల్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఐఎన్పీఈ), యూనివ ర్సిటీ ఆఫ్ సావో పాలో సంయుక్తంగా ఒక అధ్యయనం నిర్వ హించాయి. గుండెపోటు సమస్య ఉన్న 1,340 మంది.. ఇందులో 871 మంది పురుషులు, 469 మంది స్త్రీల ఆసుపత్రి వివరాలను పరిశీలించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రతను... సాధారణం, ఒక మోస్తరు, తీవ్రస్థాయి అనే 3 రకాలుగా విభజించారు. పేషంట్లను కూడా వయసుల వారీగా.. 30 అంతకంటే తక్కువ వయసున్నవారు, 31–60 ఏళ్లవారు, 60 ఏళ్లకు పైబడినవారు.. ఇలా మూడు వర్గాలుగా విభజించారు. మూడు రెట్లు ఎక్కువ.. సౌర తుపాను వల్ల భూ అయస్కాంత క్షేత్రంలో వచ్చిన మార్పులు గుండెపోటును ప్రభావితం చేశాయని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా సౌర తుపాను సమయంలో గుండెపోటు అవకాశాలు మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. భూ అయస్కాంత క్షేత్రం తీవ్రత ‘సాధారణం’తో పోలిస్తే ‘తీవ్రస్థాయి’లో ఉన్నప్పుడు గుండెపోట్లు మూడు రెట్లు ఎక్కువగా వచ్చాయట. రక్తపోటు పెరుగుతోంది..: పరిశోధనలో భాగంగా మధ్యస్థాయి అయస్కాంతావరణం ఉండే చైనాలోని రెండు నగరాలను ఎంచుకున్నారు. అక్కడి 5 లక్షలకుపైగా ప్రజల రక్తపోటు స్థాయిల రికార్డులను సౌరతుపాన్ల కాలంతో పోల్చిచూశారు. జీఎంఏలో మార్పులకు తగ్గట్లు అక్కడి ప్రజల బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు కనుగొన్నారు. ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా బీపీలో హెచ్చుతగ్గులు నమోదయ్యాయట. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి సౌర తుపాను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఊపిరితిత్తులు.. నాడీ వ్యవస్థ..: 2022లో సైన్స్ డైరెక్ట్లో ప్రచురితమైన మరో అధ్యయనంలో.. సౌర తుపాన్ల వల్ల భూ అయస్కాంత ఆవరణలో వచ్చే మార్పులు ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తాయని తేలింది. ఆ సమయంలో ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అలాగే ఆ సమయంలో నాడీ వ్యవస్థ పనితీరు కూడా ప్రభావితమైందట.సూర్య – ఏఐ..: సౌర తుపాన్లను, వాటి తీవ్రతను అంచనా వేయ డానికి అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా, ఐబీఎమ్ కంపెనీ సహకారంతో సూర్య అనే ఏఐ వ్యవస్థను రూపొందించింది. శాటిలైట్లు, పవర్గ్రిడ్లు, కమ్యూ నికేషన్ వ్యవస్థలకు ప్రమాదకరమైన సౌర తుపాన్లు వచ్చినప్పుడు ఇది అప్రమత్తం చేస్తుంది.5 లక్షల మందిపై..సౌరతుపాన్ల కారణంగా భూమి మీదకు దూసుకొచ్చే వేడి గాలులు భూ అయస్కాంత ఆవరణాన్ని ప్రభావితం చేసి.. మన రక్తపోటు పెంచుతాయని చైనాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఆరు సంవత్సరాలపాటు చైనాలోని 5,00,000 మంది ప్రజల రక్తపోటు స్థాయిలను పర్యవేక్షించి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. సౌరతుపాన్ల వల్ల భూ అయాస్కాంతావరణంలో (జీఎంఏ) సంభవించే మార్పులు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయనే దానిపై అధ్యయనం సాగింది. –సాక్షి, స్పెషల్ డెస్క్ -
డాల్ఫిన్ పేరెంటింగ్..పిల్లల పెంపకంలో'కింగ్'!
తమ పిల్లలకు కష్టం తెలియకూడదని పెంచే తల్లిదండ్రులు కొందరు...తమ పిల్లలు క్రమశిక్షణతో ఉండాలని కఠినంగా ఉండే పేరెంట్స్ ఇంకొందరు..ఏదైనా మాట అంటే వెంటనే భయపడిపోతారని కోప్పడటానికే భయపడిపోయే తల్లిదండ్రులు ఇంకొందరు.తమ మాటే శాసనంగా పిల్లలు భావించాలనుకునేవారు.. పిల్లల విషయాల్లో అతిగా జోక్యం చేసుకునేవాళ్లు..పిల్లలు చదువులో రాణించాలని వారిపై తమ ఇష్టాయిష్టాలు రుద్దేవారు..ఇలా రకరకాల పేరెంట్స్. ఎవరు చేసేది వారికి కరెక్టుగానే అనిపిస్తుంది. మరి, వీరిలో ఎవరు బెస్ట్ పేరెంట్? ఏది బెస్ట్ పేరెంటింగ్?ఈ రోజుల్లో పేరెంటింగ్.. అత్యంత కష్టమైన పని. కృత్రిమ మేధనైనా సృష్టించవచ్చు, నియంత్రించవచ్చుగానీ పిల్లల పెంపకం మాత్రం సులభంగా చేయలేం.– ఈ రోజుల్లో తల్లిదండ్రులు చెబుతున్న మాటలివి. నిజమే. ఒకప్పటిలా ఇప్పటి రోజులు లేవు. ఇన్ని ప్రభావాలూ లేవు.తల్లిదండ్రుల ఆలోచనా విధానం కూడా ఒకప్పటిలా లేదు. రకరకాల తల్లిదండ్రులు మనకు సమాజంలో కనిపిస్తున్నారు. మూడు ప్రధానమైన పేరెంటింగ్ విధానాల్లో ‘డాల్ఫిన్ పేరెంటింగ్’ మంచిదని సైకాలజిస్టులు చెబుతున్నారు.హెలికాప్టర్ పేరెంటింగ్..: చెప్పాలంటే బొమ్మరిల్లులోని ప్రకాష్ రాజ్ లాంటి తండ్రి లేదా తల్లి. తమ పిల్లలు కాలు కింద పెట్టకుండా.. ఎండ కన్నెరుగకుండా.. వారికి ఏమాత్రం కష్టం కలగకుండా చూసుకునేవారు. వారి గురించి అతిగా ఆలోచిస్తూ.. నిరంతరం వారిని పర్యవేక్షిస్తూ.. వారికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునేవాళ్లు. ఈ విషయాన్ని తమ బంధుమిత్రులకు గొప్పగా చెప్పుకోడానికి కూడా ఇష్టపడతారు. పిల్లలపై ప్రభావం..: ఇలాంటి పేరెంట్స్ ఉన్న పిల్లలు స్వతంత్రంగా ఆలోచించలేరు, నిర్ణయాలు తీసుకోలేరు, సమస్యలను పరిష్కరించలేరు, భావోద్వేగాల నియంత్రణ ఉండదు. ఇది పిల్లలను స్వతంత్రంగా ఎదగనివ్వదు. ఇలాంటి తల్లిదండ్రులంటే పిల్లలకు భయం ఉండదు కానీ.. వారిని తప్పించుకు తిరగాలన్న మనస్తత్వం ఉంటుంది. టైగర్ పేరెంటింగ్వీళ్లు చండశాసనులు. చాలా స్ట్రిక్టుగా ఉంటారు. తమ పిల్లలు చదువులోనూ, సంగీతం వంటి ఇతర అంశాల్లోనూ కచ్చితంగా రాణించాలని, పేరు ప్రతిష్ఠలు (తమకూ వస్తాయన్న స్వార్థం కూడా అంతర్లీనంగా ఉంటుంది) సంపాదించాలని వారిపై ఒత్తిడి తెస్తుంటారు. క్రమశిక్షణ, కఠోర శ్రమ, లక్ష్యాల పేరిట పిల్లలను నిత్యం పర్యవేక్షిస్తుంటారు. పిల్లలను ఆధిపత్య ధోరణితో పెంచుతారు. వారిలో తమ పట్ల భయం ఉందన్న విషయాన్ని తమ చుట్టుపక్కల వారికి తెలియాలని అనుకుంటారు. పిల్లలపై ప్రభావంఇలాంటి పేరెంట్స్ అంటే పిల్లలు భయపడతారు.. వీలైనంతవరకు తప్పించుకు తిరగాలని చూస్తారు. పిల్లలపై నిత్యం ఒత్తిడి ఉంటుంది. ఎక్కడ విఫలమవుతామోనన్న భయం వెంటాడుతుంటుంది. తమ తల్లిదండ్రులు ఉన్నంత వరకు క్రమశిక్షణతో ఉన్నట్టు కనపడే ఈ పిల్లలు.. వాళ్లు లేరని లేదా తమ గమనించడం లేదని తెలిస్తే మాత్రం కట్టుబాట్లన్నీ పక్కనపెట్టేస్తారు. డాల్ఫిన్ పేరెంటింగ్వీళ్లు పిల్లలతో ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటారు. పిల్లలతో మరీ కఠినంగానూ ఉండరు, అలాగని పూర్తిగా వదిలేయరు. అన్ని విషయాల్లోనూ సమతూకం పాటిస్తారు. అతిగా షరతులు పెట్టరు. అలాగని క్రమశిక్షణకూ విలువిస్తారు. పిల్లలను స్వతంత్రంగా ఆలోచించనిస్తారు. వారికి మరీ కష్టంగా ఉన్నప్పుడు లేదా ఇక వారికి సాధ్యం కాదు అనుకున్నప్పుడు చేయూతనిస్తారు. వారితో ఆత్మవిశ్వాసం నింపుతారు. దీన్ని స్మార్ట్ గ్యాడ్జెట్లు, సోషల్ మీడియా మాటల్లో చెప్పాలంటే.. కొన్ని విషయాల్లో స్పష్టమైన నిబంధనలు పెడతారు. ఉదాహరణకు.. రాత్రిపూట పడుకునేముందు ఫోన్లు ఉండకూడదు. ఒక వయసు వచ్చే వరకూ సోషల్ మీడియాను ఎంకరేజ్ చేయరు. ప్రతిరోజూ స్క్రీన్ టైమ్ విషయంలో కచ్చితంగా ఉంటారు. అయితే ఈ విషయాలను ఆధిపత్య ధోరణితో కాకుండా.. వారికి అర్థమయ్యేలా చెప్తారు. హార్వర్డ్లో శిక్షణ పొందిన కెనడాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ షిమి కాంగ్ దీనిపై ‘ద డాల్ఫిన్ పేరెంట్ ః ఎ గైడ్ టు రెయిజింగ్ హెల్తీ, హ్యాపీ అండ్ సెల్ఫ్ మోటివేటెడ్ కిడ్స్’ పుస్తకం కూడా రచించారు.పిల్లలపై ప్రభావంపిల్లలకు తమ హద్దులేంటో తెలుస్తాయి. అందువల్ల అలాంటి విషయాల్లో తల్లిదండ్రులు కఠినంగా ఉన్నా దాన్ని శిక్షలా కాకుండా.. తమ మంచి కోసమే అని అర్థం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా తమ తల్లిదండ్రులతో సత్సంబంధాలు ఉంటారు. వాళ్లంటే భయపడకుండా.. వారితో ప్రతి విషయాన్నీ షేర్ చేసుకుంటారు. -
రిపోర్టింగ్... ఓ వార్!
అల్లికల నుంచి అంతరిక్షం దాకా అన్నిట్లో ఆడవాళ్ల జాడలు కనిపిస్తున్నా ఇదింకా పురుష ప్రపంచమే! అసలు ఆ జాడలు కూడా లేని కాలం ఎలా ఉండిందో! అలాంటి కాలంలో పురుషాధిపత్య రంగాల్లోకి స్త్రీలు ధైర్యంగా అడుగుపెట్టడమే ఓ సమరం! పెట్టాక బాధ్యతల కోసం ఒక పోరాటం! అలా పోరాడి.. పురుషులు సాధించలేని టాస్క్లను ఛేదించి.. తర్వాత తరాల అమ్మాయిలకు ఓ పాత్ను క్రియేట్ చేశారు కొందరు వనితలు! ఆషీరోస్ను పరిచయం చేసే శీర్షికే ‘ పాత్ మేకర్’. ఆక్రమంలో ఈ వారం.. దేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్ గురించి...బిల్లా, రంగా పేరు వినే ఉంటారు. గీతా, సంజయ్ చోప్రా అనే ఇద్దరు స్కూల్ పిల్లలను ఎత్తుకెళ్లిపోయి, వాళ్లను హత్యచేసిన హంతకులు. మరణ శిక్షతో జైల్లో ఉన్న ఆ బిల్లా, రంగాలను ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ .. జైల్ అధికారుల అనుమతి కోరారు. ‘నో’ అన్నారు అఫీషియల్స్. ఆ ‘నో’ను సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లి, ఇంటర్వ్యూకు పర్మిషన్ తెచ్చుకుని.. ఆ ఇద్దరి మరణ శిక్ష అమలుకు ముందు వాళ్లను ఇంటర్వ్యూ చేశారు ఆ జర్నలిస్ట్. జైన్ శుద్ధ్ వనస్పతి లిమిటెడ్.. పేరు కూడా వినే ఉంటారు. ఈ సంస్థ అమ్మే నేతిలో పందికొవ్వు కలుస్తోందనే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ చేశారు ఆ జర్నలిస్ట్. అంతేకాదు ఎయిమ్స్లోని మెడికల్ స్కామ్నూ బయటకు తీశారు. ఆ జర్నలిస్ట్ పేరే ప్రభాదత్! 1965లో జరిగిన ఇండియా– పాకిస్తాన్ యుద్ధాన్ని వార్ ఫీల్డ్లోంచి రిపోర్ట్ చేసిన వీరనారి! దేశపు ఫస్ట్ ఉమన్ వార్ కరెస్పాండెంట్గా చరిత్ర సృష్టించారు. బక్కపల్చటి దేహం.. కాటన్ చీర.. తలకు హెల్మెట్తో యుద్ధ ట్యాంక్ల వెనుక నుంచి యుద్ధాన్ని కలంతో కవర్ చేసిన ఆమె ఇమేజ్ తర్వాత తరాల జర్నలిస్ట్లు ఎందరికో ప్రేరణనిచ్చింది. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది. ప్రభాదత్ ఏం చేసినా సెన్సేషనే! ఆమె (మగాళ్ల రాజ్యం) జర్నలిజంలోకి అడుగుపెట్టడమే మహా సంచలనం! జర్నలిజం.. వార్ రిపోర్టింగ్ప్రభాదత్ ఇరవైల్లోనే జర్నలిజంలోకి వచ్చారు. ఇంటర్వ్యూలో ఫ్లవర్ ఎగ్జిబిషన్ను కవర్ చేసే డ్యూటీని సూచించాడట ఎడిటర్. అంతకన్నా గొప్ప విషయాలనే మహిళలు రిపోర్ట్ చేయగలరు అని అతనితో వాదించి.. మెప్పించి ఫ్లవర్ ఎగ్జిబిషన్ రిపోర్టింగ్ను తిరస్కరించి.. కీలకమైన అసైన్మెంట్స్కే ‘యెస్’ అనిపించుకున్నారు. అలాంటి ధీర ఇండియా– పాకిస్తాన్ వార్ రిపోర్టింగ్ను వదులుకుంటారా? అప్పుడు ఆమె హిందుస్థాన్ టైమ్స్కి పని చేస్తున్నారు. తనకు వార్ అసైన్మెంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేయలేదు. డిమాండ్ చేశారు. ఎడిటర్ దగ్గర్నుంచి ‘నో’ అనే జవాబే వచ్చింది. అప్పుడు ఆమె స్మార్ట్ స్టెప్ తీసుకున్నారు. పంజాబ్లో ఉన్న తన పేరెంట్స్ను చూడ్డానికి వెళ్తున్నానని సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారు. వెంటనే మంజూరైంది. పెట్టే బేడా సర్దుకుని నేరుగా ఖేమ్ – కరన్కి బయలుదేరారు ప్రభా. యుద్ధ రంగంలో నిలబడి ఏ రోజుకారోజు యుద్ధ విషయాల రిపోర్ట్ను పత్రికా ఆఫీస్కు పంపసాగారు. పట్టుదలకు పోయి మొదట్లో ఆ రిపోర్ట్ను పక్కన పెట్టినా.. తర్వాత తర్వాత ఆమె రిపోర్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాళ్లు పత్రికా ఆఫీస్లో. ప్రభాదత్ కన్విక్షన్, పర్ఫెక్షన్ అలాంటిది మరి. రేడియోల ముందూ చెవులు రిక్కించుకుని మరీ కూర్చునేవారట శ్రోతలు.. ఆమె రిపోర్టింగ్ విషయాలను వినడానికి. మిడిమిడి జ్ఞానం ఆమె డిక్షనరీలోనే లేదు. సంపూర్ణ అవగాహన, స్పష్టతతోనే వెళ్లేవారు ఎక్కడికైనా. పనితోనే గానీ వ్యక్తిగత చరిష్మాకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. తన జీవితమే రిస్క్లో పడేంత ప్రమాదకరమైన రిపోర్టింగ్ చేశారు. బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభాదత్ వెనుకడుగు వేయలేదు. తను నమ్మినదానిపట్ల దృఢచిత్తంతో సాగిన ఆమె బ్రెయిన్ హ్యామరేజ్తో హఠన్మరణానికి గురయ్యారు. జర్నలిజంలో ఆమె చూపిన తెగువ, ధైర్యం మహిళా జర్నలిస్ట్లకే కాదు పురుషులకూ స్ఫూర్తే! ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాదత్ ఆమె కూతురే. -
ఓటీటీ వీక్షకులు @ 60 కోట్లు
సకుటుంబ సపరివార సమేతంగా... టీవీ ముందు కూర్చుంటున్నారు. అది కేబుల్ కనెక్షన్ టీవీ కాదు.. ‘కనెక్టెడ్ టీవీ’. అందులో తమకు నచ్చిన సినిమా లేదా వెబ్ సిరీస్ లేదా షో చూస్తున్నారు. సంప్రదాయ టీవీ చానళ్లలో కాదు.. ఓటీటీ వేదికల్లో. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఇది కరోనా తరవాత రికార్డు స్థాయిలో దేశమంతా పాకేసింది. దేశంలో ఓటీటీ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య రికార్డు స్థాయిలో 60 కోట్లకు ఎగబాకిందన్న అంచనాలే ఇందుకు నిదర్శనం. అంటే దేశ జనాభాలో 40 శాతానికిపైగా ఓటీటీలకు అలవాటుపడ్డారన్నమాట.టీవీ కొనాలంటే.. వందసార్లు ఆలోచించడం లేదు. హాల్లోకి సరిపోయే పెద్ద సైజు టీవీని.. అది కూడా స్మార్ట్ టీవీనే కొనేస్తున్నారు. ‘మార్డోర్ ఇంటెలిజెన్స్’ అంచనా ప్రకారం 2025లో దేశీయ స్మార్ట్ టీవీ మార్కెట్ విలువ 22.39 బిలియన్ డాలర్లు. 2023లో ఇది సుమారు 11 బిలియన్ డాలర్లే. స్మార్ట్ టీవీల కొనుగోళ్లు ఎంతలా పెరిగాయో చెప్పడానికి ఈ అంకెలే నిదర్శనం. అంత ఖరీదైన టీవీ కొన్నాక.. సాధారణ కేబుల్ టీవీ ఒక్కటే ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, ఏదో ఒకటి లేదా అంతకుమించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసేసుకుంటున్నారు. అంతే, ఎంచక్కా ఇక సకుటుంబ సపరివార సమేతంగా సినిమాలు, వెబ్ సిరీస్లు, షోలు చూస్తున్నారు. దేశంలో ఇటీవలి కాలంలో ఈ ధోరణి పెరిగింది.కనెక్టెడ్ టీవీలో..: ఒకప్పుడు కేబుల్ టీవీ ప్రతి ఇంటా సర్వసాధారణంగా ఉండేది. ఇప్పుడు దాని స్థానాన్ని కనెక్టెడ్ టీవీ ఆక్రమిస్తోంది. కనెక్టెడ్ టీవీ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే టీవీ. ఇది మధ్య తరగతి, ఆపై స్థాయి కుటుంబాల్లో సర్వసాధారణం అయిపోయింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఆర్మాక్స్ మీడియా ‘ఓటీటీ ఆడియన్స్ రిపోర్ట్ 2025’ ప్రకారం.. కనెక్టెడ్ టీవీ వీక్షకుల సంఖ్య 2024లో 6.97 కోట్లు మాత్రమే ఉండేది. 2025లో అది ఏకంగా 12.92 కోట్లకు పెరిగింది. అంటే.. దాదాపు రెట్టింపు అయిందన్నమాట.ఆకట్టుకునే కంటెంట్అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో విభిన్నమైన కంటెంట్తో వెబ్సిరీస్లు, సినిమాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కంటెంట్కు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఆర్మాక్స్ అంచనా ప్రకారం.. దేశంలో ఓటీటీ వీక్షకుల (నెలలో కనీసం ఒక్కసారైనా ఓటీటీ వీడియో చూసినవారు) సంఖ్య 60 కోట్లకుపైనే. 2024తో పోలిస్తే ఇది దాదాపు 10 శాతం ఎక్కువ. దేశ జనాభాలో ఇది 40 శాతానికిపైనే. వీక్షకులు పెరగడంతో ఓటీటీల్లో దేశీయ భాషల్లో వచ్చే వెబ్సిరీస్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఓటీటీల్లోనే విడుదల చేసే సినిమాలూ పెరుగుతున్నాయి. సెలవు రోజుల్లోనూ... రాత్రుళ్లు భోజన సమయాల్లోనూ కుటుంబ సభ్యులతో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా, జీ5, సోనీ లివ్.. ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో నచ్చిన సినిమా లేదా రియాలిటీ షో లేదా వెబ్సిరీస్ చూడటం సర్వసాధారణం అయిపోయింది.దేశంలో ఓటీటీ చందాదారుల సంఖ్య (సుమారుగా)⇒ జియో హాట్స్టార్ 30 కోట్లు⇒ అమెజాన్ ప్రైమ్ 2.8 కోట్లు⇒ నెట్ఫ్లిక్స్ 1.23 కోట్లుఆర్మాక్స్ మీడియా నివేదిక ప్రకారం.. 2025 జనవరి–జూన్ మధ్య ప్రసారమైన ఒరిజినల్స్లో వీక్షకులు అత్యధికంగా చూసినవి వెబ్ సిరీస్లే. వీక్షకుల పరంగా టాప్–50 ఒరిజినల్స్లో 80 శాతం వాటా వెబ్ సిరీస్లు కైవసం చేసుకోవడం విశేషం. ఆ తరవాతి స్థానంలో సినిమాలు, రియాలిటీ షోలు ఉన్నాయి. -
సంపన్న దేశాల.. ఆహార విధ్వంసం
ప్రపంచంలోని సంపన్న దేశాల ఆహారపుటలవాట్లు మారితే.. చాలావరకు కాలుష్యం తగ్గిపోతుంది! చెప్పాలంటే 30 శాతం సంపన్నుల వల్ల.. 70 శాతం ఆహార సంబంధ పర్యావరణ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి!! ప్రపంచ ప్రసిద్ధ ‘ఈఏటీ – లాన్సెట్ కమిషన్’ వెల్లడించిన వాస్తవమిది. ఇటీవలి కాలంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ ఆహార తయారీలో వాడుతున్న రసాయనాలు, ప్లాస్టిక్స్, పురుగుమందులు.. ఇవన్నీ పెనుముప్పును తెచ్చిపెట్టనున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహార వ్యవస్థలు మారకపోతే భవిష్యత్తులో మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారం కలగా మారిపోతుందని హెచ్చరించింది.ఈఏటీ – లాన్సెట్ కమిషన్లో.. 6 ఖండాల్లో ఉన్న అనేక దేశాల్లోని పోషకాహార, వాతావరణ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక శాస్త్రాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు సభ్యులు. ‘ఆహార ఉత్పత్తి, వినియోగం ద్వారా ఉత్పన్నమయ్యే ఉద్గారాలు.. శిలాజ ఇంధనాల కంటే ప్రమాదకరమైనవి’ – వీళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట ఇది. ఇప్పటికిప్పుడు శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా ఆపేసినా.. ప్రస్తుత ఆహార వ్యవస్థలు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్కు పెంచగలవని వీరు హెచ్చరిస్తున్నారు. ఆహార వ్యవస్థల వల్ల ఏటా 16 – 17.7 గిగా టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదల అవుతోంది. ఇవి మొత్తం భౌగోళిక ఉద్గారాల్లో 30 శాతం!5 లక్షల కోట్ల డాలర్లు!ఇప్పుడున్న ఆహార వ్యవస్థలు ఇలాగే కొనసాగితే.. ఏటా 15 లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని.. అనేక దేశాల శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉన్న ‘ఫుడ్ సిస్టమ్ ఎకనామిక్స్ కమిషన్’ అంచనా వేసింది. అదే, ఈ ఆహార వ్యవస్థలకు కొత్త రూపు ఇస్తే ఆరోగ్యకరమైన సమాజం, పర్యావరణ వ్యవస్థల పునరుజ్జీవం వంటి పరిణామాల వల్ల ఏటా 5 లక్షల కోట్ల డాలర్లు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయని చెబుతోంది. ఈ మార్పులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా రెడ్ మీట్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, పంపిణీ వంటివి 33 శాతం తగ్గాలని తెలిపింది. పండ్లు, కూరగాయలు, గింజల ఉత్పత్తి 63 శాతానికి పెరగాలని సూచించింది. ఇందుకోసం కమిషన్ మరో 8 పరిష్కార మార్గాలనూ ప్రపంచ దేశాల ముందు ఉంచింది. ఇవన్నీ అమలు జరిగితేనే.. 2050 నాటికి క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ భూమిపై ఉండే 960 కోట్ల జనాభాకూ ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని తెలిపింది.అష్ట పరిష్కారాలు⇒ ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో ఉంచడం⇒ సంప్రదాయ వంటకాలు / ఆహారాలను పరిరక్షించడం⇒ సుస్థిర ఉత్పత్తి పద్ధతులు అమలు చేయడం⇒అడవుల వంటి చెక్కుచెదరని పర్యావరణ వ్యవస్థలను కాపాడటం⇒ ఆహార వృథాను అరికట్టడం⇒ గౌరవప్రదమైన వృత్తి లేదా పని, తద్వారా గౌరవప్రదమైన సంపాదన⇒ అణగారిన వర్గాలపై వివక్ష చూపకుండా ఉండటం⇒ అణగారిన వర్గాల వారికి అన్ని అవకాశాలూ కల్పించడంపీహెచ్డీ ఆహారంప్రపంచ ప్రజల ఆరోగ్య సమస్యలకు, వాతావరణ సమస్యలకు పరిష్కారంగా ‘ప్లానెటరీ హెల్త్ డైట్ (పీహెచ్డీ)’ ఆహారాన్ని ఈఏటీ – లాన్సెట్ కమిషన్ సూచించింది. ఇందులో మొక్కల నుంచి వచ్చే ఆహారం పాళ్లు ఎక్కువగా, జంతువుల నుంచి వచ్చే ఆహారం చాలా తక్కువగా ఉంటుంది. చక్కెరలు, సంతృప్త కొవ్వులు, ఉప్పు చాలా మితంగా ఉంటాయి. పీహెచ్డీ ఆహారం వల్ల టైప్ 2 మధుమేహం, హృద్రోగాలు, కేన్సర్ల వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది ఆరోగ్యానికీ, పర్యావరణానికీ మంచిదని రుజువైంది. ఆహార వ్యవస్థల వల్ల వచ్చే ఉద్గారాలు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయంటే..⇒ మూడో వంతు వ్యవసాయం నుంచి⇒ మూడో వంతు భూ వినియోగ మార్పిడి ద్వారా⇒ మూడో వంతు ప్రాసెసింగ్, రవాణా, రిటైల్ వంటి సరఫరా వ్యవస్థల వల్ల -
అతివేగంతోనే.. అత్యధిక ప్రమాదాలు!
దేశంలో 2023లో జరిగిన ప్రమాదాల్లో 4.44 లక్షల మంది మరణించారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాల వంటి ‘ట్రాఫిక్ ప్రమాదాల్లో’ 1.98 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం.. అతివేగమే. ఇలా మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే జరిగాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల 2023లో 6,444 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో అత్యధికంగా 69,809 మంది ప్రమాదాల్లో మరణించగా, ఆ తరువాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (43,320), ఉత్తరప్రదేశ్ (43,207) ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 19,949 ప్రమాదాల్లో 17,039 మరణించగా, తెలంగాణలో 22,903 ప్రమాదాల్లో 13,374 మంది ప్రాణాలు కోల్పోయారు.ట్రాఫిక్ మరణాలు..: రోడ్డు ప్రమాదాలు, రైల్వే ప్రమాదాలు, రైల్వే క్రాసింగ్ ప్రమాదాలు.. వీటిలో ప్రాణాలు కోల్పోయిన వారిని ‘ట్రాఫిక్ మరణాల’ కింద పరిగణించారు. 2019లో ఇలా 1.81 లక్షల మంది మరణిస్తే.. 2023 నాటికి ఈ సంఖ్య 1.98 లక్షలకు పెరిగింది. తెలంగాణలో 23,673 ట్రాఫిక్ ప్రమాదాల్లో 8,345 మంది మరణించగా.. ఏపీలో 21,078 కేసుల్లో 9,284 మంది ప్రాణాలు కోల్పోయారు.టూ వీలర్లే అత్యధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో 45.8 శాతం ద్విచక్ర వాహనాల వల్లే జరిగాయి. కారు, జీపు, ఎస్యూవీల వల్ల 14.3 శాతం జరగ్గా.. ఆటోల వంటి త్రీవీలర్ల వల్ల 4.1 శాతం సంభవించాయి.అతివేగం అనర్థదాయకంరోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం పరిమితికి మించిన వేగంతో వెళ్లడమే. ఇలా 58.6 శాతం ప్రమాదాలు జరిగాయి. మొత్తం 2.81 యాక్సిడెంట్లలో 1.02 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్, ఓవర్ టేకింగ్ వంటి వాటివల్ల 23.6 శాతం యాక్సిడెంట్లు సంభవించాయి. మాదక ద్రవ్యాలు, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల 2.1 శాతం ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 60.2 శాతం (2.80 లక్షల కేసులు) గ్రామీణ ప్రాంతాల్లో నమోదు కాగా.. 39.8 శాతం (1.84 లక్షలు) పట్టణాల్లో జరిగాయి.రాత్రిపూటే అధికంమొత్తం రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా 20.7 శాతం (95,984) సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల్లోపే సంభవించాయి. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల్లోపు 17.3 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల్లోపు 15 శాతం సంభవించాయి. -
మనకు నచ్చకపోతే వినేదే లేదు
మనకు ఇష్టమైనదే వింటాం. ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా, ప్రతికూలంగా ఉన్నా ఆ సమాచారాన్ని వినడానికి కూడా ఇష్టపడం. కనీసం అటువైపు కూడా చూడం. తెలియనిది తమకు హాని కలిగించదని చాలామంది అనుకుంటారు. ఇది పెద్దవారిలో ఒక సాధారణ ప్రవర్తన అని మనస్తత్వ శాస్త్రవేత్తలు అంటున్నారు. దీన్ని ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ టారు. షికాగో విశ్వవిద్యాలయం చేపట్టిన కొత్త అధ్యయనం ప్రకారం యుక్త వయసుకు రాకముందే ఈ ధోరణి అభివృద్ధి చెందుతోందట.చాలామందికి ఆసుపత్రికి వెళ్లాలంటే భయం. అక్కడ ఏ టెస్టు చేస్తే ఏ సమస్య బయటపడుతుందో అని లోపల ఒక తెలియని ఆందోళన. అందుకే, ‘నువ్వు, ఈ మధ్య టెస్టులు చేయించుకున్నావా’ అని ఎవరైనా అడిగితే.. సంభాషణను వేరే విషయాలవైపు మళ్లిస్తుంటారు. కొన్ని కంపెనీలు లేదా సంస్థలు.. ఉచిత వైద్య శిబిరాలు పెట్టినప్పుడు కొందరు కనీసం అటువైపు కూడా చూడంది అందుకే. ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా పిలిచే ఈ ధోరణి పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఉంటోందట.చిన్న పిల్లల్లోనూ..షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన రాధిక సంతాన గోపాలన్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం.. పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ కొత్త సమాచారాన్ని స్వీకరించని మనస్తత్వ ధోరణి పెరుగుతున్నట్టు గుర్తించింది. ముఖ్యంగా ఇది 7–10 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా ఉందట. అసలు చాలామంది.. కొత్త విషయాన్ని లేదా జ్ఞానాన్ని నేర్చుకునే విషయంలో ఎందుకు విముఖత చూపుతారో 5 కారణాలను ఈ బృందం గుర్తించింది.తప్పించుకునే ధోరణిఐదారేళ్ల పిల్లలు మరింత జ్ఞానం సంపాదించాలని ఉత్సాహంగా ఉన్నారు. 7 నుంచి 10 ఏళ్ల చిన్నారుల్లో కొందరు మాత్రం ఇందుకు కాస్త భిన్నంగా ఉన్నారు. వీళ్లు సమాచారం నుంచి తప్పించుకునే ధోరణులను ప్రదర్శించడం ప్రారంభిస్తున్నారు. ‘ఉదాహరణకు, ప్రతి ఒక్కరినీ తమకు ఇష్టమైన, తక్కువ ఇష్టమైన క్యాండీ ఏంటో చెప్పండని అడిగాం. ఆ క్యాండీ వారి దంతాలకు ఎందుకు చెడ్డదో వివరించే వీడియో చూడాలని అనుకుంటున్నారా అని అడిగాం. ఆసక్తికరంగా.. వారికి నచ్చే దాని గురించి వారు ‘అది ఎందుకు చెడ్డదో’ తెలుసుకోడానికి ఇష్టపడలేదు. కానీ తక్కువ ఇష్టమైన క్యాండీ ఎందుకు చెడ్డదో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు’ అని వివరించారు రాధిక.అన్ని వేళలా మంచిది కాదు‘కొన్ని సందర్భాల్లో సమాచారం నుంచి తప్పించుకోవడం మంచిదే. అతి సర్వత్రవర్జయేత్ అన్నారు కదా! అయితే ప్రతిసారీ వద్దనుకునే ధోరణి మంచిది కాదు. అప్పటికి మనకు నచ్చనిది లేదా మనసుకు ఇబ్బందిగా అనిపించేది తరవాత విలువైనదని తేలవచ్చు. మనుషులకు అనిశ్చితిని లేదా ఒక సమస్యను పరిష్కరించుకోవాలనే కోరిక ఉంటుంది. కానీ పరిష్కారం, సమాచారం తమకు ఇబ్బందికరంగా లేదా ముప్పుగా ఉన్నప్పుడు తప్పించుకోవడానికే మొగ్గు చూపుతారు. కాస్త చొరవ, ధైర్యం చూపెడితే చాలు.. దీన్నుంచి సులభంగా బయటపడవచ్చు’ అంటారు రాధిక.ఏమిటీ ఆస్ట్రిచ్ ఎఫెక్ట్?యూనివర్సిటీ ఆఫ్ జెరూసలేంలోని ఇద్దరు ప్రొఫెసర్లు డాన్ గలాయ్, ఓర్లీ సేడ్.. మొట్టమొదట ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’ అనే పద బంధాన్ని ప్రయోగించారు. ఇజ్రాయెల్లోని క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడిదారులు.. ఎప్పటికప్పుడు నష్ట సమాచారాన్ని వెల్లడించే మార్గాల కంటే.. తమకు నష్టం వచ్చినా ఫర్వాలేదని ఆ విషయం బయటకు చెప్పని మార్గాల్లోనే పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నట్టు గుర్తించారు.ఈ ధోరణిని ఆస్ట్రిచ్ ఎఫెక్ట్గా అభివర్ణించారు. ఆస్ట్రిచ్ పక్షి తనకు ఏదైనా ప్రమాదం వస్తుందనిపిస్తే.. వెంటనే తన తలను ఇసుకలో దాచేస్తుందని దీని అర్థం. నిజానికి ఆస్ట్రిచ్ అలా చేయదు. కానీ, ఇది మాత్రం మానసిక వైద్య శాస్త్రంలో ‘ఆస్ట్రిచ్ ఎఫెక్ట్’గా స్థిరపడిపోయింది.ఎందుకు తప్పించుకుంటారు?⇒ ఆందోళన లేదా నిరాశ వంటి ప్రతికూల భావోద్వేగాలను నివారించడం⇒ ఇతరులు మన ఇష్టాయిష్టాలను, సామర్థ్యాలను ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆందోళన, భయం⇒ మన నమ్మకాలను సవాలు చేసే ఆలోచనలు, వాస్తవాల నుంచి తప్పించుకునేందుకు⇒ మన ప్రాధాన్యతలకు ఇబ్బంది కలగకుండా చూసుకునేందుకు⇒ స్వార్థం లేదని నిరూపించుకునే క్రమంలో.. వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం -
లైవ్లో అమ్మేస్తున్నారు!
వ్యాపారం చేయాలంటే ఓ భారీ స్థాయి మాల్ కాకపోయినా.. చిన్న దుకాణం అయినా పెట్టుకోవాలి. లేదా రోడ్డుపై తోపుడు బండి అయినా నిర్వహించాలి. అదీ కాదంటే వాహనం ఆసరాగా చేసుకుని విక్రయాలు సాగించాలి. ఇదంతా సంప్రదాయ పోకడ. ఆన్ లైన్ రాకతో ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ మోడల్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా కాస్తా ‘సోషల్ కామర్స్’ అయిపోయింది. అంటే ప్రత్యక్షంగా దుకాణాలు పెట్టాల్సిన అవసరం లేకుండానే సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వ్యాపారాలు పుట్టుకొస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. కోట్ల మందికి ఇప్పుడీ ప్లాట్ఫామ్స్ బిజినెస్ అడ్డాలుగా అవతరించాయి.ఆన్ లైన్ లో ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు షేర్ చేయడం.. ఓ ఫోన్ నంబర్ ద్వారా వ్యాపారం చేయడం సాధారణం. ఈ–కామర్స్లో ఇప్పుడు లైవ్ స్ట్రీమింగ్ కొత్త ట్రెండ్. విక్రేతలు యూట్యూబ్ లైవ్, ఫేస్బుక్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా రియల్ టైమ్లో ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు. వీక్షకులు తమ కామెంట్స్ ద్వారా హోస్ట్తో సంభాషించవచ్చు. లైవ్ పోల్స్ నిర్వహించేందుకు హోస్ట్కు వీలవుతుంది.తెలివైన విక్రేతలు తాము తదుపరి వారం/తేదీన పరిచయం చేయబోయే ఉత్పత్తి గురించి ముందుగానే కొన్ని వివరాలను టీజర్ రూపంలో వెల్లడించి వీక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నారు. అంతేగాక 24 గంటల కౌంట్డౌన్ నిర్వహించి తమ ఫాలోవర్లలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తద్వారా ఎక్కువ మంది వీక్షకులను చేరుకుంటున్నారు. సోషల్ కామర్స్ భారత్లో 2025లో సుమారు రూ.1,80,000 కోట్ల వ్యాపారం చేస్తుందని అంచనాలు ఉన్నాయి. దేశంలో 90 కోట్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. వీరిలో 25 శాతానికిపైగా ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు.స్మార్ట్ఫోన్ ఉంటే చాలు.. వర్ధిల్లు వ్యాపారాలుతాము సొంతంగా తయారు చేసిన ఉత్పత్తులు, పిండి వంటలు, కళాఖండాలు, అల్లికలు, పెయింటింగ్స్.. ఒకటేమిటి, వ్యాపారానికి ఏదీ అనర్హం కాదు. వ్యాపారం చేయాలంటే ఈ రోజుల్లో ఓ స్మార్ట్ఫోన్ ఉంటే చాలు. ఔత్సాహికులు తక్కువ పెట్టుబడితో తమ కాళ్లమీద తాము నిలబడవచ్చు. చేతిలోని సెల్ఫోన్ తో వీడియోలు, ఫొటోలే కాదు.. లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించి తాము విక్రయించే ఉత్పాదనను ప్రపంచానికి పరిచయం చేయవచ్చు. లైవ్ వీడియో చేయాలంటే పెద్దగా సాంకేతికంగా అవగాహన కూడా అవసరం లేదు. ఎడిటింగ్ భారం అసలే లేదు.దశాబ్దాల నుంచి..వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీడియోలు ఉపయోగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు, షార్ట్స్ చూడటం పెరిగింది. ముఖ్యంగా ఉత్పత్తులు, సేవల గురించి తెలుసుకోవడానికి వీడియోలను చూసే ధోరణి ఊపందుకుంది. ఈ నేపథ్యంలో లైవ్ స్ట్రీమింగ్ ప్రాధాన్యత సంతరించుకుంది. లైవ్ స్ట్రీమింగ్తో షాపింగ్ ఎక్స్పీరియెన్స్ మారుతుందని ఈ–కామర్స్ దిగ్గజం అలీ ఎక్స్ప్రెస్ చెబుతోంది.వాయిదాలకు ఫుల్స్టాప్ఈ–కామర్స్ వెబ్సైట్లలో చాలామంది కస్టమర్లు తాము చూసిన ఉత్పాదనను తరువాత కొనొచ్చులే అని కార్ట్లో నిక్షిప్తం చేస్తారు. చాలా సందర్భాల్లో అవి కార్ట్కే పరిమితం అవుతాయి. అదే లైవ్లో అయితే.. నచ్చగానే ఆర్డర్ పెట్టేయొచ్చు. హోస్ట్ మీద, ఉత్పత్తి మీద నమ్మకం ఏర్పడితే.. వెంటనే ఆర్డర్ చేసేలా మనస్సు కూడా వీక్షకులను ప్రేరేపిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. తరచూ వాయిదాలు వేసే కస్టమర్ల విషయంలో విక్రేతలకు లైవ్ స్ట్రీమింగ్ కలిసి వస్తుందని వారు చెబుతున్నారు.ప్రత్యక్షంగా వీక్షించి..ఆన్ లైన్ వ్యాపారంలో భాగంగా విక్రేతలు ఉత్పత్తుల తాలూకు వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడం సర్వసాధారణం. అయితే ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించే వ్యక్తి (హోస్ట్) లైవ్ వీడియోలో ఉత్పత్తి గురించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు వీలవుతుంది. లైవ్లో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా లక్షలాది మంది ఫాలోవర్లకు ప్రత్యక్షంగా అవి చేరతాయి. సందేహాలు ఉంటే నివృత్తి అవుతాయి. హోస్ట్ ఇచ్చే ప్రెజెంటేషన్ ఇక్కడ కీలకం. ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటే ఉత్పత్తి పట్ల కస్టమర్లలో సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. ఉత్పత్తి ఎలా పనిచేస్తుంది, ప్రత్యేకతలు, వారంటీ, గ్యారంటీ, ధర, మార్కెట్లో లభించే ఇతర ఉత్పత్తులతో పోలిస్తే తాము విక్రయించే ప్రొడక్ట్ విశేషాలను కస్టమర్లతో నేరుగా పంచుకోవచ్చు. -
ఉత్తమ లక్షణాలతో.. దీర్ఘాయుష్మాన్భవ!
మంచి వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు మంచివారు అనిపించుకోవడమే కాదు.. దీర్ఘాయుష్మంతులు అని పిలిపించుకునే అదృష్టం కూడా దక్కుతుందట. చురుగ్గా ఉండటం, నలుగురికీ సాయపడే మనస్తత్వం, సమయపాలన, ఏ పనినైనా ఒక పద్ధతి ప్రకారం చేయడం, కష్టపడే వ్యక్తిత్వం, మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకునేవారు..ఈ లక్షణాలు లేనివారితో పోలిస్తే ఎక్కువ కాలం బతుకుతారని జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్లో ప్రచురించిన ఓ పరిశోధన వెల్లడించింది. తరచుగా ఒత్తిడికి గురికావడం, ఆందోళన చెందడం, అసంతృప్తిగా ఉండటం వల్ల జీవితకాలం తగ్గిపోతుందట.ఆరోగ్యం అనగానే మనకు గుర్తుకొచ్చేవి..మంచి పోషకాహారం, వ్యాయామాలే. ఇవే దీర్ఘాయుష్షుకు చిట్కాలు అనుకుంటాం. కానీ, కొన్ని విశిష్ట వ్యక్తిత్వ లక్షణాలు కూడా మనం సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా బతికేలా చేస్తాయని, మరణ భయాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. చెరపకురా చెడేవు.మంచి లక్షణాలతో..సాధారణంగా రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి వాటి ఆధారంగా వ్యాధులు లేదా రోగాలను అంచనా వేస్తారు. వ్యక్తుల ఆలోచనల తీరు, అనుభూతి చెందుతున్న విధానం, వారి ప్రవ ర్తన వంటివి.. భవిష్యత్తులో రాబోయే రోగా లు లేదా వ్యాధులను అంచనా వేయడానికి వైద్యులు సాధనాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని ప్రముఖ మనస్తత్వవేత్త రెనే మోటస్ తెలిపారు. మనుషులు తమ వ్యక్తిత్వ లక్షణాలను మార్చుకోవడం ద్వారా మరింత ఎక్కువ కాలం బతికేందుకు అవకా శం ఉందని అధ్యయన ఫలితాలు సూచిస్తు న్నాయని ఆయన అన్నారు. ఈ నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలకు, మరణానికి సంబంధం ఉందని వెల్లడించారు. ‘ఆందోళన, నిరాశ, కోపం వంటి ప్రతికూల భావోద్వేగాలను తరచుగా, తీవ్రంగా అనుభవించే ధోరణిని కలిగి ఉండడ మే న్యూరోటిసిజం. ఈ లక్షణాలను మార్చడం కష్టం. దీనికంటే వ్యక్తిత్వ లక్షణాలు మార్చడం సులభం. తద్వారా న్యూరోటిసిజం కూడా నయమవుతుంది’ అని ఆయన అన్నారు.అవి వద్దు.. ఇవి ముద్దుఆందోళనకర మానసిక స్థితి, ప్రశాంతత లేనివారి ఆయుష్షు రోజురోజుకీ క్షీణి స్తుంటుంది. అలాగే అధిక కొవ్వుతో బాధపడుతున్నవారు, ధూమపానం చేసేవా రికి సైతం ముప్పు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీరితో పోలిస్తే మనస్సాక్షి ని నమ్మి, దానికి అనుగుణంగా పనిచేసేవారిలో.. మెరుగైన ఆరోగ్య నిర్వహణ, అధిక స్వీయ–క్రమశిక్షణ, బాధ్యత, ఉల్లాసభరితమైన జీవితం వంటి ఆరోగ్యకర మైన అలవాట్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది. విశాల దృక్పథం, స్నేహపూర్వకంగా ఉండే మనస్తత్వం, ఎప్పుడూ ఉల్లాసంగా, చురుగ్గా ఉండటం వంటి లక్షణాలు జీవితకాలాన్ని పెంచుతాయని పేర్కొంది.వ్యక్తిత్వమూ కీలకమే‘ఆయుష్షు విషయంలో వ్యక్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని మా పరిశోధనలో తేలింది. కానీ వైద్యరంగం, ప్రపంచం.. ఆరోగ్యం విషయంలో దీనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు’ అని ఐర్లాండ్లోని లిమెరిక్ విశ్వవిద్యాలయంలో మన స్తత్వశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్, నివేదిక సహ రచయిత పారిక్ ఓ సూలివా¯Œ వ్యాఖ్యానించారు. ‘సమయపాలన పాటించేవారు, ఏ పనినైనా పద్ధతిగా చేసేవారు జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకుంటారు. వీరికి క్రమశిక్షణతో కూడిన దినచర్య ఉంటుంది. సమయాన్ని అనవసర విషయాలకు వ్యర్థం చేయడం వీరికి నచ్చదు. అందువల్ల ఆరోగ్య సంబంధ విషయాల్లోనూ వీరు మిగతావారితో పోలిస్తే మరింత జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా వీరు మిగతావారికంటే ఎక్కువ కాలం జీవించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’ అని అన్నారు.28 ఏళ్లపాటు అధ్యయనం⇒ పరిశోధనలో 22,000 మంది పాలుపంచుకున్నారు. 6 నుంచి 28 ఏళ్లపాటు వీరిపై అధ్యయనం చేశారు. వ్యక్తిత్వ లక్షణాలను మరణానికి అనుసంధానించిన ఈ అధ్యయనంలో.. పరిశోధకులు ప్రధాన వ్యక్తిత్వ లక్షణాలను పరిశీలించి వీరి మరణ కాలాలను అంచనా వేశారు.⇒ మనస్సాక్షికి విలువ ఇచ్చి, అందుకు అనుగుణమైన విశి ష్ట వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నవారు.. ఈ లక్షణాలు లేనివారి తో పోలిస్తే వేగంగా చనిపోయే అవకాశాలు 15శాతం తక్కువ.⇒ సమయపాలన పాటిస్తూ, ఏ పనినైనా ఒక పద్ధతిగా చేసే లక్షణాలున్న వారు.. తొందరగా మరణించే అవకాశం 14 శాతం తక్కువ.⇒ బాధ్యతాయుతంగా ఉండే వ్యక్తులూ ఎక్కువ కాలం బతుకుతారు. బాధ్యతారాహిత్యంతో ఉండేవారితో పోలిస్తే వీరు వేగంగా మరణించే అవకాశాలు 12 శాతం తక్కువ.⇒ కష్టపడి పనిచేసే మనస్తత్వం లేదా లక్షణాలు ఉన్నవారిలో మరణ అవకాశాలు 15 శాతం తక్కువ. -
కోచింగ్ సెంటర్ల వ్యాపారం చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, మెడికల్, సివిల్స్, గ్రూప్స్, టోఫెల్.. ఇలా రంగం ఏదైనా, ఎలాంటి పోటీ పరీక్షకైనా శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా వెలిసిన కోచింగ్ సెంటర్లు ఏటా రూ. వేల కోట్ల వ్యాపారం సాగిస్తున్నట్లు ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇన్ఫీనియం తాజా నివేదికలో పేర్కొంది. 2022 నాటికి దేశవ్యాప్తంగా రూ. 58 వేల కోట్లుగా ఉన్న కోచింగ్ సెంటర్ల వ్యాపారం.. ఈ ఏడాది నాటికి ఏకంగా రూ. 70 వేల కోట్లకు చేరిందని వెల్లడించింది. అలాగే 2028 నాటికి రూ. 1.38 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది.కోవిడ్ తర్వాత ఆన్లైన్, డిజిటల్ కోచింగ్ (Digital Coaching) విధానం బాగా పెరగడం వల్ల కోచింగ్ కేంద్రాల వ్యాపారం పెరుగుదలకు దోహదపడుతోందని తెలిపింది. వ్యాపార మార్కెట్ను మరింత పెంచుకోవడానికి వీలుగా ప్రచారంపై ఏటా రూ. 150 కోట్లకుపైనే కోచింగ్ సెంటర్లు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే దేశంలోని 78 శాతం కోచింగ్ కేంద్రాల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు లేవని కేంద్ర విద్యాశాఖ గుర్తించింది. ఆయా కేంద్రాల్లో నిపుణులైన అధ్యాపకులు ఉండట్లేదని.. సూక్ష్మ బోధన విధానం తప్ప సబ్జెక్టుపై దృష్టి పెట్టడం లేదని కనుగొంది. ఫలితంగా జేఈఈ, నీట్లో వివిధ రూపాల్లో ప్రశ్నలు వస్తే విద్యార్థులు సమాధానం ఇవ్వలేకపోతున్నారని అభిప్రాయపడింది. విద్యార్థులపై ఒత్తిడి.. దేశవ్యాప్తంగా ఏటా జేఈఈ మెయిన్కు (JEE Main) సుమారు 13 లక్షల మంది, నీట్కు 22 లక్షల మంది పోటీ పడుతుండటంతో కోచింగ్ సెంటర్లు రూ. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు మొత్తం విద్యార్థుల్లో మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తూ మిగతా వారికి పెద్దగా నాణ్యత లేని ఫ్యాకల్టీతో కోచింగ్ ఇస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో పోటీ పరీక్షల్లో ర్యాంకులు రాని విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ లెక్కల ప్రకారం 2013లో 8,423 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా 2022 నాటికి ఈ సంఖ్య 13,044కు పెరిగింది. 2025 చివరి నాటికి ఈ సంఖ్య 13 శాతం పెరగొచ్చని అంచనా వేసింది. ర్యాంకుల కోసం కోచింగ్ కేంద్రాలు, తల్లిదండ్రుల ఒత్తిడి, విద్యార్థుల్లో పెరిగిన ఆందోళన, ఒంటరితనం ఆత్మహత్యలకు కారణమని ఎన్సీఆర్బీ తెలిపింది. కట్టడికి కార్యాచరణ మొదలైనా.. కోచింగ్ సెంటర్ల ఒత్తిడి వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని నివారించాలని నిర్ణయించిన కేంద్ర విద్యాశాఖ.. ఇందుకోసం ఈ ఏడాది మొదట్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి వినీత్ జోషి చైర్మన్గా ఉన్న ఈ కమిటీలో సీబీఎస్ఈ చైర్మన్, పాఠశాల ఉన్నత విద్య విభాగాల సంయుక్త కార్యదర్శులు, ఐఐటీ మద్రాస్, తిరుచ్చి, కాన్పూర్ ఎన్ఐటీ, ఐఐటీ, ఎన్సీఈఆర్టీ (NCERT) ప్రతినిధులు సహా మరికొందరిని ఇందులో సభ్యులుగా చేర్చింది.కోచింగ్తో పనిలేకుండా విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలనే కోణంలో పరిశీలించి నివేదిక ఇవ్వడంతోపాటు ప్రైవేటు కోచింగ్ సెంటర్ల ప్రచార, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని ఈ కమిటీని కేంద్రం ఆదేశించింది. పాఠశాల విద్యలో లోపాలు, క్రిటికల్ థింకింగ్ విధానాలు, పాఠశాల విద్య నుంచే పోటీ పరీక్షల సన్నద్ధత, కాలేజీల్లో కెరీర్ గైడెన్స్, ఒత్తిడి లేని సిలబస్ తీసుకురావడంపై కమిటీ అధ్యయనం చేయాలని సూచించింది. అయితే ఈ కమిటీ ఇప్పటివరకు సరైన మార్గదర్శకాలను సూచించలేదు. ఉన్నత విద్యామండలి సిఫార్సులివి.. కోచింగ్ కేంద్రాల వల్ల జరిగే నష్టాన్ని కట్టడి చేయడానికి చట్టబద్ధ నియంత్రణ అవసరమని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి ప్రభుత్వానికి ఇటీవల నివేదించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా అందిన ఈ నివేదికలోని పలు సిఫార్సులు ఇవి.. ⇒ కోచింగ్ సెంటర్లపై బలమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి. ⇒ శిక్షణా కేంద్రాలకు గుర్తింపును తప్పనిసరి చేయాలి. ⇒ డేటా ప్రైవసీ చట్టాల పరిధిలోకి వాటిని తేవాలి. ⇒ ఆయా సెంటర్లపై ఫీజుల నియంత్రణ ఉండాలి. విదేశీ విద్యా కన్సల్టెంట్లు, ఆన్లైన్ విద్యా వేదికలు, సాఫ్ట్వేర్, టెక్నాలజీ ప్రొవైడర్లు నియంత్రణ పరిధిలో ఉండాలి. ⇒ ఉన్నత విద్యా మండలి వద్ద కోచింగ్ కేంద్రాలు అనుమతి పొందేలా ఉండాలి. ఆయా కేంద్రాలను పర్యవేక్షించి ఏటా నాణ్యతను అధికారికంగా నిర్ణయించాలి. ⇒ ఉన్నత విద్యలో తృతీయ పక్షం జోక్యం వల్ల నాణ్యత దెబ్బతింటోంది. ⇒ ఆన్లైన్ వేదికలు, సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్న కోచింగ్ పారదర్శకంగా ఉండట్లేదు. గుర్తింపు లేని కోర్సులు, అర్హతలేని బోధకులు, పాత సిలబస్ వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. కోచింగ్ కేంద్రాలు లాభాలే తప్ప నాణ్యత పట్టించుకోవడం లేదు. అకడమిక్ పాఠాలతో ఒత్తిడి లేకుండానే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లిదండ్రులూ కారణమే ర్యాంకులే తప్ప విద్యార్థుల సామర్థ్యాన్ని తల్లిదండ్రులు అంచనా వేయడం లేదు. అత్యున్నత నాణ్యతా ప్రమాణాల ప్రకారమే బోధించాలని పట్టుబడుతున్నారు. దీనివల్ల సగటు విద్యార్థులు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దితే కోచింగ్తో పనే లేదు. – ఎంఎన్ రావు (జేఈఈ కోచింగ్ నిపుణుడు) చట్టం తేవాల్సిందే కోచింగ్ కేంద్రాల నియంత్రణకు పకడ్బందీ చట్టం తేవాలి. నాణ్యత లేని, నిపుణులు లేని కేంద్రాలపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై ఒత్తిడి పెంచి ర్యాంకులతో ప్రచారం చేసుకొనే కోచింగ్ కేంద్రాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. ఈ అంశాన్ని శాసనమండలిలో లేవనెత్తుతా. చట్టం తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా. – పింగిలి శ్రీపాల్రెడ్డి (ఉపాధ్యాయ ఎమ్మెల్సీ) -
ఒక్కో మెట్టు.. ఆరోగ్యం సూపర్ హిట్టు
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆరోగ్యంగా ఉండాలంటే శ్రమతో కూడిన పనులో, వ్యాయామమో చేయాలి. ఈ విషయం తెలిసి కూడా చాలామంది విస్మరిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితం, గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చునే ఉద్యోగాలు, మరోవైపు కుటుంబ బాధ్యతలు.. ఇలా ఎన్నో కారణాలు. మరి దీనికి పరిష్కారం? సింపుల్... వ్యాయామం చేయడం వీలు కాకపోతే, మెట్లు ఎక్కి, దిగండి! సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాల్లో ఇది ఒకటని అధ్యయనాలుచెబుతున్నాయి.క్రమంతప్పకుండా రోజుకు మూడు అంతస్తులు.. అలా ఆడుతూ పాడుతూ ఎక్కి దిగేస్తుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! దీంతో శారీరక స్థిరత్వం పెరుగుతుంది. హృద్రోగాల ప్రమాదం తగ్గుతుంది. యూఎస్లోని టూలేన్ విశ్వవిద్యాలయం 2023లో జరిపిన ఒక అధ్యయనంలో ప్రతిరోజూ కనీసం 50 అడుగులు మెట్లు ఎక్కడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తేలింది. ‘కండరాలకు ఆక్సిజన్ ను అందించే సామర్థ్యం పెరుగుతుంది. చెడుకొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), ట్రైగ్లిజరైడ్స్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్)పెరిగేందుకు దోహదం చేస్తుంది’ అని ఈ అధ్యయనం వివరించింది.నడకను మించిన కేలరీలు మెట్లు ఎక్కి, దిగడం వల్ల జాగింగ్, బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పటికంటే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నివేదిక ప్రకారం 70 కిలోల బరువున్న వ్యక్తి 30 నిమిషాల పాటు మెట్లుఎక్కడం వల్ల దాదాపు 223 కేలరీలు బర్న్ అవుతాయి.కాళ్లు పటిష్టంగా.. కాళ్ళు బలంగా మారతాయి. ప్రతి అడుగులో కాళ్ళుగురుత్వాకర్షణకు వ్యతిరేకంగాశరీరాన్ని ఎత్తుతాయి. దీంతో కాళ్ళు, పిరుదులు, ఉదరకండరాలపై ప్రభావం పడుతుంది. వాటి ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.మానసిక ఆరోగ్యం.. వ్యాయామం శరీరాన్ని ఫిట్గా ఉంచడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్నీ పెంచుతుంది. ఏ రకమైన వ్యాయామం అయినా ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక శ్రమతో ఎండార్ఫిన్ విడుదలై మానసిక స్థితి మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల ఆరోగ్యం: మెట్లు ఎక్కడం వంటి వ్యాయామాలు ఎముకల ఆరోగ్యానికిఅద్భుతమైనవి. ఎముక బలంగా పెరుగుతుంది. బోలు ఎముకలవ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. ఇప్పటికే కాళ్ల సమస్యలు ఉన్నవారు, వృద్ధులు వైద్యులనుసంప్రదించి తగు వ్యాయామాలు చేయాలి.ఆ ప్రమాదం తక్కువ.. యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ ఇటీవలిసమావేశంలో సమర్పించిన విశ్లేషణ ప్రకారం.. మెట్లు ఎక్కని వారితో పోలిస్తే మెట్లు ఎక్కేవారు గుండె జబ్బుల వల్ల మరణించే అవకాశం 39% తక్కువగా ఉంది. వారిలో గుండెపోటు, స్ట్రోక్ల ప్రమాదం కూడా తక్కువగా ఉందట.సులభ వ్యాయామం జిమ్ వంటి దినచర్యల మాదిరిగా కాకుండా మెట్ల నడకకు ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఖర్చూ ఉండదు. తీరిక లేనివారికి ఇది సులభమైన వ్యాయామం.రక్తంలో చక్కెర నియంత్రణ..చిన్న మొత్తంలో చేసే శారీరక శ్రమ సైతం ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయులను నియంత్రిస్తుంది. మెట్లు ఎక్కడం.. సమతల నేలపై నడవడంతో పోలిస్తే రక్తంలో చక్కెరను మరింత సమర్థవంతంగా తగ్గించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఎన్ని మెట్లు ఎక్కాలి?రోజుకు 3 అంతస్తులు ఎక్కి, దిగడం ద్వారా రోజువారీ దినచర్యలకు సరిపోయే స్థిరమైన ఫిట్నెస్ అందుకోవచ్చు. వ్యక్తుల ఫిట్నెస్ స్థాయినిబట్టి మెట్ల సంఖ్యను పెంచుకోవచ్చు. » బిగినర్ అయితే 1–2 అంతస్తులు.. అంటే 20–40 మెట్లతో ప్రారంభించండి. ∙సీనియర్ అయితే ఫిట్నెస్ను బట్టి 5–10 అంతస్తులు లక్ష్యంగా పెట్టుకోవచ్చు.వైద్యుల సలహాతోనే..మెట్లు ఎక్కడం చాలా మందికి సురక్షితం. కానీ ఈ కింది జాబితాలో ఉన్నవారు, ఇవి కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాతో వ్యాయామం చేయాలి.1. ఊబకాయం 2. కీళ్ల వ్యాధి 3. తూలిపడే సమస్య ఉన్నవారు4. వృద్ధులు, బలహీనమైన వ్యక్తులు 5. గుండె, ఊపిరితిత్తుల వ్యాధి6. ఇటీవలి కాలంలో శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు. -
పండుగ వేళా.. పంచాయతీ సిబ్బందికి పస్తులేనా?
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఇ–పంచాయతీ ఆపరేటర్గా పనిచేసే సోమిరెడ్డి రెండు నెలల కిందటడిప్యుటేషన్పై సూర్యాపేట డీపీవో కార్యాలయానికి వెళ్లాడు. ఇద్దరు కూతుళ్లు, భార్యతో కలిసి నల్లగొండలో ఉంటున్న ఆయన నిత్యం సూర్యాపేటకు వచ్చి పోయేవారు. భార్యాపిల్లలను పోషించుకునేందుకు వచ్చే జీతమే తక్కువకాగా,అదీ రెండు మూడు నెలలపాటురాకపోవడంతో తీవ్ర ఆందోళనకుగురయ్యాడు. దీనికి ఆరు నెలలకిందట జరిగిన ప్రమాదం తర్వాతమరింత కుంగిపోయాడు. ఈ క్రమంలోనే తన బాధను ప్రకటిస్తూ, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక పోతున్నాననిపేర్కొంటూ తన స్నేహితుల గ్రూపులో మెసేజ్ పెట్టి రైలు కింద పడిఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పనిచేసే సిబ్బంది వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 55వేల మంది వేతనాల కోసం విజ్ఞప్తులు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు. మండల పరిషత్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే 1,579 మంది ఇ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు జూలై నుంచి వేతనాలు లేక ఇబ్బందులు పడుతుండగా, 1,093 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్), 52,473 మంది గ్రామాల్లో పనిచేసే మల్టీ పర్పస్ వర్కర్స్కు (ఎంపీడబ్ల్యూ) జూలై నుంచి వేతనాలు అందకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. పండుగ పూట కూడా పస్తులు ఉండాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు రాక అప్పుల పాలు ప్రతి నెలా వేతనాలు అందకపోవడంతో గ్రామ పంచాయతీల పరిధిలో పనిచేసే సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంట్లో అవసరాలు, ఏదైనా కొనాలన్నా చేతిలో డబ్బుల్లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రతిసారి అప్పులు చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని, చివరకు అప్పు కూడా లభించక, కుటుంబపోషణ భారంగా మారి తీవ్ర మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఉద్యోగ భద్రత లేక..గ్రీన్ చానల్లో వేతనాలు అందక.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరి«ధిలో పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఎలాగూ లేదని వాపోతున్నారు. 10 ఏళ్ల కిందటి నుంచే తాము పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత కల్పించడం లేదని చెబుతున్నారు. గ్రామంలో, మండలంలో ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సర్వే చేసినా, ఏ అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన వివరాలనైనా ఇ–పంచాయతీ ఆపరేటర్లే ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. తమ ఉద్యోగానికి ఫలానా సమయమంటూ లేదని, ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు పనిచేస్తున్నా తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఓపీఎస్లు, ఎంపీడబ్ల్యూలు కూడా తాము ఎంత పనిచేసినా ఉద్యోగ భద్రత లేక మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు గ్రీన్ చానల్లో వేతనాలను ప్రతి నెలా ఇస్తామని మంత్రి సీతక్కతో సహా ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినా కనీసం దానిని అమలు చేయడం లేదని వాపోతున్నారు. పండుగ వచ్చి నా పస్తులే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని, ఇంట్లో పిల్లలకు కనీసం కొత్త బట్టలు కొనలేని దుస్థితిలో మనుగడ సాగించాల్సి వస్తో్తందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ వేతనాలను విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
సందేహం వస్తే.. బ్లాక్ చేయండి
సాక్షి, స్పెషల్ డెస్క్: ఆన్ లైన్ ఆర్థిక మోసాలు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. వీటికి సంబంధించిన వార్తలు పేపర్లు, టీవీలు, సామాజిక మాధ్యమాల్లో నిత్యం కళ్లముందు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసు శాఖ, బ్యాంకులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు చిక్కుకుంటూనే ఉన్నారు. బాధితుల్లో ఉన్నత విద్యనభ్యసించినవారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నవారూ ఉండడం గమనార్హం. ఒకటి కాదు, రెండు కాదు.. కోట్ల రూపాయల కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఆన్ లైన్ ఆర్థిక మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పలు సూచనలు చేసింది.» మోసపూరిత లావాదేవీ గుర్తిస్తే.. ఆధార్, పాన్ కార్డు వంటి గుర్తింపు కార్డులతో అనుసంధానమైన అన్ని బ్యాంక్ ఖాతాలను (మ్యూల్) స్తంభింపజేయాలని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రతిపాదించింది. అలాగే ఐడీ కార్డులను బ్లాక్ లిస్టులో ఉంచాలని, దీంతో మోసగాళ్లు మరో ఖాతా తెరవడానికి వీలు కాదని.. ఆగస్ట్లో పార్లమెంట్కు సమర్పించిన నివేదికలో కమిటీ సూచించింది. తద్వారా సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మును ఇతర ఖాతాలను మళ్లించే దారులు మూసుకుపోతాయని అభిప్రాయపడింది. అధీకృత వ్యక్తులే డిపాజిట్ చేస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ వంటి డిజిటల్ గుర్తింపు తనిఖీలను చేపట్టాలని, తద్వారా నేరస్థులు దోపిడీ చేసే అవకాశాలను పరిమితం చేయవచ్చని కమిటీ తెలిపింది. ఈ ప్రతిపాదనలు కీలక ముందడుగు అని నిపు ణులు చెబుతుంటే... అమలు అంత సులువు కాదని బ్యాంకులు వాదిస్తున్నాయి.ఆర్థిక నేరాలు మూడింతలుడిజిటల్ అరెస్ట్ పేరుతో ఆర్థిక నేరగాళ్లు చేస్తున్న దందా మన దేశంలో కొన్ని నెలలుగా ముప్పుగా పరిణమించింది. ఆన్ లైన్ ఆర్థిక నేరాలు గత ఏడాది మూడింతలు అయ్యాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ సీఆర్పీ) ప్రకారం 2024లో ఆన్ లైన్ ఆర్థిక నేరాల్లో సామాన్యులు రూ.21,181 కోట్లు పోగొట్టుకున్నారు. 2023తో పోలిస్తే ఈ మొత్తం దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. 2024లో పోగొట్టుకున్న దాంట్లో సుమారు 12% మాత్రమే.. అంటే రూ.2,530 కోట్లు స్తంభింపజేయడం లేదా రికవరీ జరిగింది. ఆన్ లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కు సంబంధించి గత ఏడాది ఎన్ సీఆర్పీ ఏకంగా 20 లక్షల పైచిలుకు ఫిర్యా దులు స్వీకరించడం.. మోసాల తీవ్రతకు అద్దం పడుతోంది.వెంటనే నివేదిస్తే బహుమతి!నో యువర్ కస్టమర్ (కేవైసీ) నియమాలు అమలవుతున్న ప్పటికీ మ్యూల్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు తెరుస్తూనే ఉన్నారు. టైపింగ్ వేగం, మౌస్ కదలికల తీరును విశ్లేషించేందుకు బయోమెట్రిక్ వ్యవస్థను బ్యాంకులు అమలు చేయాలని కమిటీ సూచించింది. మోసాన్ని వెంటనే నివేదించే వినియోగదారులకు బహుమతులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని ఆర్బీఐకి సూచించింది.» అసాధారణ కార్యకలాపాలను గుర్తించి, అనుమానిత డిపాజిట్లను తాత్కాలికంగా నిరోధించాలని (బ్లాక్) తెలిపింది. మోసగాడి బారిన పడటం వల్ల కలిగే పరిణామాలు, కస్టమర్ బాధ్యత అనే అంశాన్ని పునఃపరిశీలించాలని కమిటీ సిఫార్సు చేసింది. » ప్రజలకు కూడా భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఉంటుందని.. ఈ విషయంలో వారికి మరింత అవగాహన కల్పించాలని సూచించింది.నియంత్రణ యంత్రాంగంబ్యాంకులు, సంస్థలు, వినియోగదారులు, ఇతర భాగస్వామ్య పక్షాలు అనుసరించాల్సిన చట్ట పరమైన విధానాలను నిర్దేశించే ఒకే నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు ప్రతిపాదనతో సహా.. జాతీయ భద్రతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమిటీ ప్రతిపాదనలను ఎలా అమలు చేయాలన్న అంశంపై మంత్రిత్వ స్థాయిలో వివిధ దశల్లో చర్చలు జరుగుతున్నాయని డేటా సెక్యూ రిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్యానెల్ సిఫార్సుల అమలును ఇండియన్ సైబర్ ఎమర్జెన్సీ రెస్పాన్ ్స టీమ్, ఇండియన్ సైబర్ క్రై మ్ కో–ఆర్డి నేషన్ సెంటర్ పర్యవేక్షించనున్నాయి. పలు బ్యాంకులు ఈ చర్చల్లో పాల్గొన్నట్టు సమాచారం. -
లోకల్ బ్రాండ్స్కు సై!
ఒక్కో ప్రాంతం, తరం, స్త్రీ, పురుషులను బట్టి కొనుగోలు తీరుతెన్నులు మారుతున్నాయి. మహిళల నేతృత్వంలోని బ్రాండ్స్కు ఉత్తర భారతంలో ఆదరణ ఎక్కువ. దక్షిణాది కస్టమర్లు సంప్రదాయానికి పెద్దపీట వేస్తున్నారు. అంతేకాదు ఆఫ్లైన్ షాపింగ్కు మొగ్గుచూపుతున్నారు. భారతీయ వినియోగదారుల కొనుగోలు తీరును, ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి.. అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ ‘యూగోవ్’ సహకారంతో 18 రాష్ట్రాల్లోని 5,000 మంది వినియోగదారులతో వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘రుకమ్ క్యాపిటల్’ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రాంతం బట్టి ప్రాధాన్యతలుపశ్చిమ భారతం: స్వదేశీ బ్రాండ్స్ అంటే మక్కువ. పండుగ సమయంలో కార్డ్ ఆధారిత చెల్లింపులు అధికం. ఏఐ/వర్చువల్ ట్రై–ఆన్ ్స ప్రయత్నించడం అంటే విపరీతమైన ఆసక్తి. సంస్కృతి, స్థానిక ఉత్పత్తులు, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను ఇష్టపడుతున్నారు.తూర్పు భారతం: పర్యావరణ అనుకూల, మన్నికగల ఉత్పత్తులకు మొగ్గు చూపుతారు. కూపన్ ్స, సేల్ డేస్, బహుమతులను కోరుకునే కస్టమర్లు. సాంస్కృతిక విలువలు, ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులను ఇష్టపడతారు.ఉత్తర భారతం: మహిళల నేతృత్వంలోని బ్రాండ్స్కు ఆదరణ ఎక్కువ. కంపెనీలతో భావోద్వేగ బంధం ఉంది.. ఇన్ ఫ్లుయెన్సర్ల ప్రభావం అధికం. ప్రకటనలను ఇట్టే గ్రహిస్తారు.దక్షిణ భారతం: సంప్రదాయానికి పెద్దపీట వేస్తారు. దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉత్పత్తులపట్ల వ్యామోహంతోనే కొనుగోళ్లు అధికం. సెలబ్రిటీలు చేశారు కదా అని ఆ ప్రకటనల ఆధారంగా కొనుగోళ్లు చేయడం తక్కువ. అత్యధిక శాతం మంది పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు.ఆరోగ్యమే మహాభాగ్యం» ఆరోగ్యం, సంరక్షణ విభాగంలో పూర్తిగా సహజ పదార్థాలతో తయారు చేసిన ఉత్పత్తులను అందించే బ్రాండ్స్నే ఇష్టపడతామని 100% మంది చెప్పడం విశేషం. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకే ప్రాధాన్యత అని 76% మంది స్పష్టం చేశారు.» 50% కంటే ఎక్కువ మంది.. పండుగల సమయంలో ఆరోగ్యకరమైన స్నాక్స్ కొనాలని భావిస్తున్నారు. 40% మంది చక్కెర రహిత ప్రత్యామ్నాయాలను ఎంచుకున్నారు. » ప్రథమ శ్రేణి నగరాల్లోని వినియోగదారుల్లో 57% మంది ఆరోగ్యకరమైన స్నాక్స్, 41% మంది చక్కెర రహిత స్వీట్లను ఎంచుకున్నారు. తృతీయ శ్రేణి నగరవాసుల్లో 65% మంది సంప్రదాయ స్వీట్లను తింటామని తెలిపారు.మహిళలను ప్రోత్సహించేలా..» 58% మంది స్థానిక/స్వదేశీ బ్రాండ్స్ను ఇష్టపడుతున్నారు. » కార్పొరేట్ సామాజిక బాధ్యత పట్ల నిబద్ధత ఉండే, అధిక వ్యయం చేసే కంపెనీల ఉత్పత్తులు కొనేందుకు 56% మంది ఆసక్తి చూపారు.» కొత్త స్టార్టప్స్ను ప్రోత్సహించేందుకు చాలామంది ముందుకు వచ్చారు. వారి నుంచి ఉత్పత్తులు కొనేందుకు తాము సిద్ధమని 43% మంది వెల్లడించారు. » మహిళలు నడిపే వ్యాపారాల నుంచి మాత్రమే షాపింగ్ చేస్తామని 68% మంది మిలీనియల్స్, జెన్–జీ తరం వాళ్లు చెప్పడం విశేషం.» 14% మంది 20–30% అధిక ధర చెల్లించడానికి సిద్ధం. » పండుగ షాపింగ్ విషయానికి వస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో స్వదేశీ బ్రాండ్స్ వైపు 61% మొగ్గు చూపుతున్నారు. » స్థానిక బ్రాండ్లు రోజువారీ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందిస్తున్నాయి. నిజాయితీగా ఈ కంపెనీలిచ్చే ప్రామాణిక సమాచారాన్ని అభినందిస్తున్నట్లు 76% మంది తెలిపారు.» ఇతర దేశాల్లో లేదా సంస్కృతిలో ప్రసిద్ధి చెందిన ఉత్పత్తులను విక్రయించే బ్రాండ్స్ నుంచి కొనుగోలు చేసినట్టు 59% మంది చెప్పారు.వీటి ఆధారంగా.. బ్రాండ్ ఎంపిక, కొనుగోలును ఏయే అంశాలు ప్రభావితం చేస్తున్నాయంటే..48% ఈ–కామర్స్ పోర్టల్స్లో సేల్ డేస్47% ఫెస్టివ్ సేల్ / ఎండ్ ఆఫ్ సీజన్ సేల్47% ఆఫర్లు, డిస్కౌంట్లకు గూగు ల్/ఆన్ లైన్ లో సెర్చ్42% బ్రాండ్ వెబ్సైట్లలో ఆఫర్లుఅందుకే కొనడంలేదుబ్రాండ్ ఉత్పాదన కొనుగోలుకు నిరోధకాలుకాలక్రమేణా ఉత్పత్తి నాణ్యత మారుతోంది 29%తక్కువ ధరకు ఇలాంటి ఉత్పత్తి దొరికింది 28%కస్టమర్ కేర్ నుంచి కరువైన ప్రతిస్పందన 26%షిప్పింగ్ ఆలస్యం / అధిక చార్జీలు 25%ఈ బ్రాండ్ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచివి కావు 25% -
మహిళల్లోనే మహాశక్తి
‘‘మనందరిలో ఓ దుర్గా మాత ఉంది. ఆ శక్తిని మనం గ్రహించగలిగితే మనం ఏదైనా సాధించగలం. స్త్రీలు అనుకుంటే ఎలాంటి సవాల్ని అయినా అద్భుతంగా ఎదుర్కొంటారని నా నమ్మకం’’ అంటున్నారు పూజా హెగ్డే(Pooja Hegde). సౌత్–నార్త్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళుతున్న ఆమె ‘దసరా’ సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలు...ఈ నవరాత్రి రోజుల్లో మా కుటుంబం మొత్తం శాకాహారులుగా మారిపోతాం. ఈ పండగ అప్పుడు కుదిరితే గుడికి వెళతాను. లేకపోయినా నాకు తరచూ గుడికి వెళ్లడం అలవాటు. మన ఎనర్జీ లెవల్స్ బాగుండటానికి మనం గుడికి వెళ్లడం మంచిది అని నా అభిప్రాయం. గుడిలో కాలు పెట్టగానే తెలియకుండా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. మనం క్షేమంగా ఉండటానికి ఆ ఎనర్జీ పనికొస్తుంది. అందుకే గుడికి వెళ్లడాన్ని నేను బాగా నమ్ముతాను. → నవరాత్రి టైమ్లో ఉపవాసం ఉండను కానీ నాకు ఫాస్టింగ్ అంటే నమ్మకం. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు దేవుడికి దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. నా చిన్నప్పుడు మా నాన్నగారు ఉపవాసం ఉండేవారు. తొమ్మిది రోజులు కేవలం నీరు మాత్రమే తీసుకునేవారు. అంత కఠినమైన ఉపవాసం ఆచరించేవారు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. నేను ఏడాదికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను. ‘అంగారిక సంకష్ట చతుర్ది’ నాడు, మహా శివరాత్రికి తప్పకుండా ఫాస్టింగ్ చేస్తాను. → చాలా సంవత్సరాలుగా నేను దాండియా ఆడలేదు. ఓ పదేళ్ల క్రితం నా స్నేహితులతో కలిసి దాండియా ఆడటానికి వెళ్లాను. గర్బా డ్యాన్స్ పోటీ జరుగుతోందని అక్కడికి వెళ్లాక తెలిసింది. ఈ కాంపిటీషన్ కోసం కొన్నిగ్రూప్స్ సభ్యులు ఏళ్ల తరబడి ప్రాక్టీస్ చేసి మరీ పాల్గొంటారని తెలిసి, ఆశ్చర్యపోయాను. వాళ్ల డ్యాన్స్ నిజంగా అద్భుతం. నేను కూడా ఒక గ్రూపులోకి వెళ్లి, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాను. కానీ అది అంత తేలికైన విషయం కాదని అర్థమైంది. → ప్రతి మహిళలోనూ ఓ శక్తి ఉంది. మనలో ఆ శక్తి స్వరూపిణి దుర్గా మాత ఉందని గ్రహించాలి. నవరాత్రి అంటే మనలో ఉన్న ఆ దేవిలోని పలు షేడ్స్ని సెలబ్రేట్ చేయడమే. మన లోపల ఉన్న దైవిక స్త్రీత్వాన్ని గుర్తించడమే. అయితే నేనిప్పటివరకూ గమనించినంతవరకూ స్త్రీలకు ఏదైనా సవాల్ ఎదురైతే అద్భుతంగా అధిగమించే నేర్పు వారికి ఉందని తెలుసుకున్నాను. కానీ మనకు మనంగా పరిష్కరించుకోగలుగుతాం అనే విషయం మనకు అర్థం కావాలి. లోపల దాగి ఉన్న ఆ శక్తిని గుర్తించి ముందుకెళితే మన వల్ల కానిది ఏదీ లేదు.→ నవరాత్రి సమయంలో నాకు బాగా నచ్చినది ‘హవన్’ (హోమం). హవన్లో బియ్యం, నువ్వులు, ధాన్యాలు, నెయ్యి వంటివి సమర్పించి, ఆ దుర్గా మాత ఆశీర్వాదాన్ని కోరతాం. హవన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. అది చాలా బాగుంటుంది. చాలా పవిత్రంగా అనిపిస్తుంది. మామూలుగా నవరాత్రి అప్పుడు బంధువులు ఇంటికి వస్తుంటారు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా ‘హవన్’కి మాత్రం అందరూ హాజరవుతారు. అలాగే పసుపు ఆకు తింటాం. ఆ ఆకు నుంచి వచ్చే సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. నా చిన్నప్పటి తీపి గుర్తుల్లో ఇదొకటి.→ మా ఇంట్లో తొమ్మిది రోజులు పండగను చాలా శ్రద్ధగా చేస్తాం. ఇందాక నవరాత్రి సమయంలో ఆచరించేవాటిలో నాకు ‘హవన్’ ఇష్టం అని చె΄్పాను కదా. అష్టమి రోజున అది చేస్తాం. మేం లక్ష్మీ పూజ కూడా బాగా చేస్తాం. అలాగే ‘మాంజో లిరెట్టా గట్టి’ అని వంటకం చేస్తాం. కొబ్బరి తురుము, బెల్లం కలిపి ముద్దలా కలిపి, పసుపు ఆకులో పెట్టి ఉడికిస్తాం. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓ పట్టు పడుతుంటాను. → దసరా అనగానే మనకు చెడుపై మంచి గెలుపు అనేది గుర్తొస్తుంది. నా వరకూ నా చుట్టూ ఉన్న చెడు గురించి, చెడు చేసేవాళ్ల గురించి అస్సలు పట్టించుకోను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయడంపైనే దృష్టి పెడతాను. వందకు వంద శాతం పని చేయడం... మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లడం... ఈ రెంటినీ ఫాలో అవుతాను. అప్పుడు ఎన్నో రెట్లు రూపంలో మంచి మన వద్దకు వస్తుందని నమ్ముతాను. ఇక చెడు చేసిన వారి గురించి ఆలోచించకుండా... మానవులకు అతీతమైన ‘ఉన్నత శక్తి’కి వదిలేస్తాను.నవరాత్రి సమయంలో మా ఇంట్లో బాగా భజనలు చేస్తాం. నా చిన్నప్పట్నుంచి ఇప్పటివరకూ ఒకే పద్ధతిలోనే పండగ జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచంలో ఏదైనా మారొచ్చు. కానీ మన ఆచారాలను మనం ఎప్పుడూ ఒకేలా పాటించాలి. ఇప్పుడు వర్క్ షెడ్యూల్స్ వల్ల నేను చాలా పండగలను మిస్సవుతున్నాను. అయితే ఏ మాత్రం వీలు కుదిరినా పండగలప్పుడు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నిస్తాను.– డి.జి. భవాని -
అన్నీ అమ్మ ఆకృతులే
‘అమ్మవారి తొమ్మిది అలంకారాలు, కృతులు స్త్రీ శక్తి గురించి తెలియజేసేవే. మనలోని శక్తిని ఎలా జాగృతం చేస్తామో అదే మనం’ అంటూ నవరాత్రుల సందర్భంగా చేస్తున్న సాధన, అమ్మవారి కృపతో మొదలైన తన ప్రయాణం గురించి తెలియజేశారు గాయని భమిడి పాటి శ్రీలలిత (Bhamidipati Srilalitha). విజయవాడ వాసి, గాయని, అమ్మవారి పాటలకు ప్రత్యేకంగా నిలిచిన శ్రీలలిత చెప్పిన విశేషాలు నవశక్తిలో.‘‘నవరాత్రి సిరీస్ ఆరేళ్లుగా చేస్తున్నాను. బెజవాడ కనకదుర్గమ్మ అలంకరణ ఎలా ఉంటుందో అలాంటి అలంకరణల సెట్ వేసి, షూట్ చేసి, వీడియో ద్వారా చూపించాం. ఈ నవరాత్రుల్లో కనకదుర్గమ్మను నేరుగా దర్శించుకోలేనివారు సోషల్ మీడియాలో తొమ్మిది పాటలుగా విడుదల చేసిన వీడియోలు చూడవచ్చు. అమ్మవారి ప్రతి అలంకరణకు తగ్గట్టుగా పాట ఎంపిక, విజువల్స్ డిజైన్ చేశాం. ప్రతియేటా కొత్తదనం ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాం. అమ్మవారి కృతులు అందరిళ్లలో పాడుకునే విధంగా ఆడియోను తీసుకువచ్చాం. పరంపరంగా వచ్చిన కృతులనే తీసుకున్నాం. ఈసారి మాత్రం రెండు భజనలు కూడా వీడియోలో ఉండేలా ప్లాన్ చేశాం. ఈ నవరాత్రి వీడియోకు నెల రోజుల టైమ్ పట్టింది. రోజుకు మూడు అలంకారాల చొప్పున షూట్ చేశాం.కృతులను నేర్చుకుంటూ ..చిన్నప్పటి నుంచి ఇంట్లో భక్తి గీతాలు వింటూ ఉండేదాన్ని. మా ఇంట్లో అందరూ అమ్మవారి ఆరాధకులే. అమ్మవారి దీక్ష చేసేవారు. ఇంట్లో అందరూ ఆమె కృతులను పాడుతుంటారు. ఆ విధంగా అమ్మవారి కృతులు వినడం, నేర్చుకోవడం ప్రారంభించాను. మా అత్తింట్లోనూ అమ్మవారి ఆరాధకులే. మా మామగారు నలభై ఏళ్లుగా దుర్గమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నారు. దీంతో నేనూ ఆ ఉత్సవాల్లో పాల్గొంటూ, ప్రదర్శన ఇస్తూ వస్తున్నాను. అన్ని పుణ్యక్షేత్రాలూ దర్శించి, అక్కడ ప్రదర్శనలో పాడే అవకాశమూ లభించింది.చదవండి: సెంటర్స్టోన్ డైమండ్రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా? పరీక్షలను తట్టుకుంటూ...అమ్మవారి ఉత్సవాలు, గ్రామదేవతా ఉత్సవాలు, మొన్న జరిగిన తిరుపతి బ్రహ్మోత్సవాల్లోనూ పాల్గొన్నాను. పాట ఎంపిక నుంచి అమ్మవారే ఈ కార్యక్రమం నా చేత చేయిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కృతులు పాడుతున్నా, వింటున్నా ఒక ఆధ్యాత్మిక భావనకు లోనవుతుంటాను. ఉదాహరణకు.. ఒక కృతిలో 13 చరణాలు ఉంటే.. 9 లేదా 11 చరణాలు పాడుదాం, అంత సమయం ఉండడదు కదా అని ముందు అనుకుంటాను. కానీ, ప్రదర్శనలో నాకు తెలియకుండానే 13 చరణాలనూ పూర్తి చేస్తాను. ఇటువంటి అనుభూతులెన్నో.సినిమాలోనూ...ఇటీవలే ఒక సినిమాకు పాటలు పాడాను. ఆరేళ్ల వయసు నుంచి 20 వరకు రియాలిటీ షోలలో పాల్గొన్నాను. బయట మూడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. మన దేశంలోనే కాకుండా విదేశాలలోనూ ప్రదర్శనలు ఇవ్వడం నిజంగా అదృష్టం. సంగీత కళానిధులైన బాలసుబ్రహ్మమణ్యం, చిత్ర, కోటి, ఉషా ఉతుప్.. వంటి పెద్దవారిని కలిశాను. వారితో కలిసి పాడుతూ, ప్రయాణించాను. ఒకసారి రియాలిటీ షో ఫైనల్స్లో పాడుతున్నప్పుడు బాలు గారు ‘నీ వెనక ఏదో దైవశక్తి ఉంది...’ అన్నారు. అదంతా అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తుంటాను.వదలని సాధన...ఈ సీరీస్లో నాకు చాలా ఇష్టమైనది మహాకవి కాళిదాసు ‘దేవీ అశ్వధాటి’ స్తోత్రం. ప్రవాహంలా సాగే ఆ స్తోత్రాన్ని అమ్మవారి మీద రాశారు. అశ్వధాటి అంటే.. ఒక గుర్రం పరుగెడుతూ ఉంటే ఆ వేగం, శబ్దం ఎలా ఉంటుందో .. ఆ స్తోత్రం కూడా అలాగే ఉంటుంది. 13 చరణాలు ఉండే ఆ స్తోత్రం పాడటం చాలా కష్టం. కానీ, నాకు అది చాలా ఇష్టమైనది. ఏదైనా స్తోత్రం మొదలుపెట్టినప్పుడు దోషాలు లేకుండా జాగ్రత్త పడుతూ, ప్రజల ముందుకు తీసుకువస్తాను. కరెక్ట్గా వచ్చేంతవరకు సాధన చేస్తూ ఉంటాను. ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!మహిళలు జన్మతః శక్తిమంతుఉ కాబటి వారు ఎక్కడినుంచో స్ఫూర్తి పొందడం ఏమీ ఉండదు. మనలోని శక్తి ఏ రూపంలో ఉందో దానిని వెలికి తీసి, ప్రయత్నించడమే. నా కార్యక్రమాలన్నింటా మా అమ్మానాన్నలు, అన్నయ్య, అత్తమామలు, మా వారు.. ఇలా అందరి సపోర్ట్ ఉంది. ఆడియో, వీడియో టీమ్ సంగతి సరే సరి! ’ అంటూ వివరించారు ఈ శాస్త్రీయ సంగీతకారిణి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రభుత్వానికి మెట్రో బదిలీ ఈజీ కాదు
మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న నేపథ్యంలో కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. అసలు ప్రభుత్వ అధీనంలోకి వెళ్తే నిర్వహణ ఎలా ఉంటుంది..? సౌకర్యాలు ఎలా ఉంటాయనే చర్చ మొదలైంది. అలాగే మెట్రో మొదటి దశ ప్రాజెక్టు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీచేసే ప్రక్రియ కూడా అంత ఈజీ కాదు. వివిధ అంశాలపైన స్పష్టమైన అవగాహన, ఒప్పందం ఏర్పడిన తరువాత మాత్రమే ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ కానుంది. ఇందుకోసం ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో వివిధ అంశాలపైన సమావేశాలు నిర్వహించి ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైదరాబాద్ (Hyderabad) మహానగరంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మించి నిర్వహిస్తోన్న 69.2 కి.మీల మెట్రో మొదటిదశ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎల్అండ్టీ సంస్థకు ఏకమొత్తంగా రూ.2000 కోట్లు చెల్లించి ప్రభుత్వం ప్రాజెక్టును స్వాదీనం చేసుకోనుంది. అలాగే రూ.13000 కోట్ల రుణాలను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ ఆర్థిక అంశాలపైన ఒప్పందాన్ని ఏర్పాటు చేసుకోవడంతోపాటు నిర్వహణపరమైన అంశాలపైన కూడా ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ ఒప్పందాలు జరగాల్సివుంది. ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏడాది కంటే ఎక్కువ కాలమే పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.కేంద్రం అనుమతి తప్పనిసరి పీపీపీ పద్ధతిలో చేపట్టిన మొదటి దశ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా ఒక భాగస్వామ్య సంస్థగానే ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్టీ వైదొలగాలన్నా, ఆర్థిక లావాదేవాలపైన ఎలాంటి ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవాలనుకున్నాకేంద్ర ప్రభుత్వం కూడా తప్పనిసరిగా అనుమతించవలసి ఉంటుంది. ఎల్అండ్టీకి, ప్రభుత్వానికి మధ్య కుదిరే ప్రతి ఒప్పందం వివరాలను కేంద్రానికి అందజేయాలి. అలాగే బ్యాంకు రుణాలను (Bank Loan) రాష్ట్రం భరించనున్న దృష్ట్యా అందుకు కూడా కేంద్రం నుంచి అనుమతి లభించవలసి ఉంటుంది. రెండోదశ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఎలా ముఖ్యమో, మొదటి దశ బదిలీకి కూడా అంతే ముఖ్యం అని అధికారులు తెలిపారు. కేంద్ర రాష్ట్రాలతో పాటు ఎల్అండ్టీ (L&T) సంయుక్త ప్రాజెక్టుగా 2011లో మెట్రో మొదటిదశ చేపట్టిన సంగతి తెలిసిందే. 2017 నవంబర్ నుంచి మొదటి దశ రైళ్లు అందుబాటులోకి వచ్చా యి. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ల మధ్య ప్రతి రోజు సుమారు 1000 ట్రిప్పులకు పైగా తిరుగుతున్నాయి. రోజుకు 4.8 లక్షల మందికి పైగా పయనిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఎల్అండ్టీ తన వాటాను రాష్ట్రానికి విక్రయించనున్న దృష్ట్యా నిర్వహణపరమైన సాంకేతిక అంశాలపై న కూడా ఒప్పందాలు తప్పనిసరి.కియోలిస్కు ఇంకా గడువు ఉంది ఫ్రాన్స్కు చెందిన కియోలిస్ (Keolis) సంస్థ హైదరాబాద్లో మెట్రో రైళ్లను నడుపుతోంది. సీబీటీసీ (కమ్యూనికేషన్ బేస్డ్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్) సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రైళ్లు నడుస్తున్నాయి. కియోలిస్ సంస్థ హైదరాబాద్తో పాటు దుబాయ్, లండన్, పూణే నగరాల్లో కూడా మెట్రోలను నడుపుతోంది. నగరంలో ఈ సంస్థతో 2026 నవంబర్ వరకు ఒప్పందం ఉంది. ఈ మేరకు ఈ ఒప్పందాన్ని ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకొని పునరుద్ధరించవలసి ఉంది. ఒకవేళ కియోలిస్ను కాకుండా మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నా 2026 నవంబర్ వరకు ఆగాల్సిందే. కానీ హైదరాబాద్తో మెట్రో రైళ్ల నిర్వహణలో కియోలిస్కు ఉన్న అనుభవం దృష్ట్యా ప్రభుత్వం మరో సంస్థను సంప్రదించకపోవచ్చునని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కియోలిస్తోనే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవలసి ఉంటుంది.ఆస్తులు–అప్పలు తేలాల్సిందే.. మెట్రో రైళ్లను నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 270 ఎకరాల భూములను ఎల్అండ్టీకి లీజుకు ఇచ్చింది. ఈ స్థలాల్లో మాల్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకొనేందుకు అనుమతినిచ్చారు. కానీ ఎల్అండ్టీకి ఇచ్చిన మొత్తం 18.5 లక్షల చదరపు అడుగుల్లో ఇప్పటి వరకు కేవలం 6.5 లక్షల చదరపు అడుగుల స్థలాలను మాత్రమే ఆ సంస్థ వినియోగించుకుంది. ఇందులో కొంత భూమిని సబ్లీజ్కు ఇచ్చారు. ప్రస్తుతం ఈ భూములన్నింటినీ ప్రభుత్వం తిరిగి తీసుకోవలసి ఉంది. ఇందుకోసం కొంతసమయం పట్టే అవకాశం ఉంది.చదవండి: ప్రైవేటు వెంచర్కు ప్రభుత్వ భూమిలో రోడ్డుఅలాగే సబ్లీజుకు సంబంధించిన అంశాల్లో కూడా స్పష్టత రావలసి ఉంది. మరోవైపు రూ.13000 కోట్ల బ్యాంకు రుణాలు ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వానికి బదలాయించాలి. ఎస్బీఐ (SBI) నేతృత్వంలో 12 బ్యాంకులు ఈ రుణాలను అందజేశాయి. ప్రస్తుతం ఈ 12 బ్యాంకుల నుంచి రుణాలను ప్రభుత్వానికి బదిలీ అయ్యేందుకు కూడా కొంత గడువు అవసరం. ఇలా అనేక అంశాలతో ముడిపడి ఉన్న మెట్రో మొదటి దశ ప్రాజెక్టు యాజమాన్య బదిలీకి ఏడాది కంటే ఎక్కువ సమయమే పట్టవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. -
బ్రిటిషర్లను భయపెట్టిన...చెడీ తాలింఖానా
సాక్షి, అమలాపురం/అమలాపురం టౌన్: కోనసీమ అనగానే ప్రకృతి అందాలు, పర్యాటక కేంద్రాలకే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలకు.. ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తే పల్లె ముస్తాబవుతుంది. నింగిలోని ఇంద్ర ధనస్సులు ‘ప్రభ’లుగా మారి నేలన నడయాడతాయి. తీర్థాలతో ఈ ప్రాంతం హోరెత్తుతుంది. ఇక దసరా వస్తే చెడీ తాలింఖానా ప్రదర్శన.. అమ్మవార్ల వాహనాల ఊరేగింపులతో జనజాతరగా మారిపోతుంది. ఒకప్పుడు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేర్చుకున్న ఈ చెడీ తాలింఖానా వీర విద్య రానురానూ ప్రజల సంప్రదాయ కళలలో ఒక భాగమైంది. శతాబ్దాల చరిత్ర అజ్ఞాతం ముగిసిన తరువాత జమ్మి చెట్టు మీద ఉన్న పాండవుల ఆయుధాలు చేతులకు వచ్చినట్టుగా ఇక్కడ దసరాకు ముందు దాచి ఉంచిన కత్తులు కొత్తగా పదునెక్కుతాయి. బరిసెలు బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో అగ్గిబరాటాలు నిప్పులు కక్కుతాయి. లేడి కొమ్ములు, పొడవాటి కర్రలు కళాత్మకంగా తిరుగుతుంటాయి. ఆపై అమ్మవారి ఊరేగింపులతో కోనసీమలో దసరా కొత్త పుంతలు తొక్కుతుంది.దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరు తరువాత కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంచుమించు రెండు శతాబ్దాల నుంచి జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ప్రాచీన యుద్ధాలను తలపించే చెడీ తాలింఖానా వీరత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాలింఖానాకు నేటికీ ఆదరణ చెక్కు చెదరలేదు. కర్రలు, కత్తులు, లేడి కొమ్ములతో వారు చేసే ప్రదర్శన ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేస్తాయి. యువకుల నుంచి వృద్ధుల వరకూ వయోభేదం మరచి చేసే తాలింఖానా విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అన్ని వీధులు ఈ ప్రదర్శనలతో నిండిపోతాయి. ఇంచుమించు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రదర్శనకు అవసరమైన శిక్షణ పొందుతారు. కొత్త తరం కూడా ఈ విద్యా ప్రదర్శనకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం.మంత్రముగ్ధులను చేసేలా..దసరా ఉత్సవాలలో భాగంగా పురవీధుల్లో చెడీతాలింఖానా ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ రాత్రి అంతా ఈ కార్యక్రమం జరుగనుంది. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీ తాలింఖానా విద్య ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి మీద, కంఠం, నుదిటిపై, పొత్తి కడుపుల మీద కొబ్బరి కాయలు, కూరగాయలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులు వేగంగా.. చురుగ్గా కదుపుతూ యువకులు చేసే విన్యాసాలు రాచరిక యుద్ధ సన్నాహాలను తలపిస్తాయి. ఈ ప్రదర్శనలో ఏమాత్రం ఏమరు పాటు జరిగినా ప్రాణాలకు ప్రమాదం. అయినా కూడా అత్యంత ధైర్య సాహసాలతో శిక్షణ పొందిన ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు చేసే ప్రదర్శన మంత్రముగ్ధులను చేస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులైనా, ఎన్ఆర్ఐలైనా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు.అమలాపురంలో చెడీ తాలింఖానా విద్య ప్రదర్శన వెనుక స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఉందని స్థానికులు చెబుతుంటారు. బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఈ విద్య స్థానికంగా 1835 కొంకాపల్లిలో మొదలైంది. అయితే దసరా వేడుకలలో 1856లో మహిపాల వీధిలో రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. ఇది ఇక్కడ ప్రారంభమై 190 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతోంది. వీటితో పాటు గండువీధి మైనర్స్ పార్టీ, నల్లా వీధి, శ్రీరామపురం మైనర్స్ పార్టీ, రవణం మల్లయ్య వీధి తాలింఖానా ప్రదర్శనలకు దశాబ్దాల చరిత్ర ఉంది. చెడీ తాలింఖానా ప్రదర్శనతో పాటు పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్ దీపాలంకరణలతో వాహనాలు ముందుకు సాగుతాయి.కొంకాపల్లి ఏనుగు అంబారీ వాహనం, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మవారు వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలు పురవీధుల్లో ఊరేగింపుగా వెళతాయి. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణా ప్రాంతం నుంచి కూడా ఈ ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురానికి తరలివస్తారు. తరతరాలుగా నిర్వహిస్తున్నాం దశాబ్దాల కాలం నుంచి అమలాపురంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. మా తాతలు మాకు వారసత్వంగా అందించారు. మేము మా వారసులకు ఈ విద్యను అందిస్తాం. ఈ ప్రాచీన విద్యను ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది. – పనస బుజ్జి, నిర్వహకుడు, కొంకాపల్లి, అమలాపురం రోజుకు ఎనిమిది గంటల శిక్షణదసరాకు ముందు ఆయుధ పూజ చేసిన తరువాత సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు శిక్షణ ఇస్తాం. రోజుకు 150 నుంచి 250 మంది వరకు గురువుల వద్ద శిక్షణ పొందుతారు. ఎక్కువగా చిన్నారులు, యువత రావడం వల్ల భవిష్యత్లో కూడా ఈ ప్రదర్శన నిరి్వఘ్నంగా సాగుతుందనే ఆశ మాకుంది. – అబ్బిరెడ్డి మల్లేష్, నిర్వాహకుడు, మహిపాల వీధి, ఎన్ఆర్ఐ (అమెరికా) -
ఐసీయూలో భూమి!
భూమికి బాగా సుస్తీ చేసింది. అవనికి ఆధారంగా నిలుస్తున్న 9 పర్యావరణ వ్యవస్థల్లో ఏడింటి ఆరోగ్యం క్షీణించింది. శాస్త్రవేత్తల పరిభాషలో వీటిని ‘ప్లానెటరీ బౌండరీస్’ అంటారు. తాజాగా.. భూగ్రహంపై 70% భూభాగాన్ని ఆక్రమించటమే కాకుండా జీవావరణాన్ని కంటికి రెప్పలా కాపాడే సముద్రం కూడా అనారోగ్యం పాలైంది. సముద్ర జలాల ఆమ్లీకరణ హద్దుమీరి ప్రమాద ఘంటికలు మోగించటం ఇదే మొదటిసారి! అయినప్పటికీ, ఇంకా ఆశ మిగిలి ఉందని, ఇప్పటికైనా మానవాళి మేలుకోవాలని ‘ప్లానెటరీ హెల్త్ చెక్ 2025’ తాజా నివేదిక హెచ్చరిస్తోంది. – సాక్షి, సాగుబడిభూమి ఒక రోగి అయితే, అది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడి ఉండేదని పోట్స్డ్యామ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ (పీఐకే) వెలువరించిన ‘ప్లానెట్ హెల్త్ చెక్ 2025’ నివేదిక చెబుతోంది. జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. భూ ఆరోగ్య స్థితిగతులపై అధ్యయనంలో చురుగ్గా పనిచేస్తోంది. పరిశోధకులు గుర్తించిన తొమ్మిది పర్యావరణ సరిహద్దుల్లో మూడు ప్రమాదకర హద్దును దాటాయని 2009లో తొలుత గుర్తించారు. వీటి సంఖ్య 2023 నాటికి ఆరుకు, ప్రస్తుతం 9కి పెరిగింది. శాస్త్రవేత్తలు భూమి ఆరోగ్యాన్ని.. దాని ఉత్పాదకత, మానవులు వాడుకున్న తర్వాత మిగిలిన శక్తి అనే 2 సూచికలను ఉపయోగించి కొలుస్తారు.1 వాతావరణ మార్పువాతావరణంలో కార్బన్డయాక్సైడ్ (సీఓ2) 350 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) స్థాయిలో ఉంటే మంచిది. కానీ ఇది 423కి పెరిగింది. 450కి చేరితే మరింత ప్రమాదకరం. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి, విపత్తులు తీవ్రమవుతున్నాయి.2 జీవావరణ సమగ్రతలో మార్పుమనం చేసే పనులు జీవావరణ సమగ్రతపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతిలో ఉన్న శక్తిలో 10 శాతాన్ని మనుషులు వాడుకుంటే ప్రకృతి తిరిగి దాన్ని పూడ్చుకొని తెప్పరిల్లుతుంది. కానీ, మనం 30% వాడేసుకుంటున్నాం. వ్యవసాయం, పశువుల పెంపకం, నగరీకరణ, పరిశ్రమల కోసం భూమి సహజ స్థితిని విపరీతంగా మార్చటం వల్ల.. జీవవైవిధ్యం ప్రమాదకర స్థాయిలో అంతరిస్తోంది.3 భూ వ్యవస్థ మార్పుఅడవులు భూగోళంపై వాతావరణాన్ని స్థిరంగా ఉంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. అసాధారణంగా అడవులు నరికివేసి భూమిని చిన్నాభిన్నం చేస్తున్నాం. వ్యవసాయం, నగరీకరణ, పశుపోషణ కోసం తీవ్రస్థాయిలో భూ వినియోగ సహజ స్థితిని మార్చటం సమస్యగా మారింది. 2000–2018 మధ్యలో 90% అడవుల నరికివేత వ్యవసాయం (52%), పశుపోషణ (38%) కోసమే జరిగింది. ప్రపంచ భూభాగంలో అడవులు 75% ఉంటే మేలు. అయితే, ఇప్పుడు 59 శాతానికి తగ్గిపోయాయి. 4 మంచినీటి మార్పుపరిమితి దాటిని మంచి నీటి వినియోగం జల చక్రాన్ని దెబ్బతీస్తోంది. నదుల్లో పారే నీటిని 12.9% వాడుకుంటే పర్వాలేదు. కానీ, ఇప్పుడు 22.6% వాడుతున్నాం. భూగర్భ జలాలను 12.4% వాడుకుంటే పర్వాలేదు.మనం 22% వినియోగిస్తున్నాం.5 జీవ భౌతిక రసాయన మార్పులురసాయనిక ఎరువులను పంటలు ఉపయోగించుకునేది తక్కువ.. నీటిని, భూమిని కలుషితం చేసేదే ఎక్కువ. ఇవి చివరికి సముద్ర జలాల్లోకీ చేరి పర్యావరణ వ్యవస్థలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నాయి. భాస్వరం ఎరువులను ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 62 లక్షల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 11 కోట్ల టన్నులు వాడుతున్నాం. నత్రజని ఎరువును ఏటా 6.2 కోట్ల టన్నులు వాడితే పర్వాలేదు. కానీ, 8.2 కోట్ల టన్నులు వాడుతున్నాం. ఇతర ఆరు రకాల సరిహద్దులను కూడా ఈ ఎరువులు ప్రభావితం చేస్తున్నాయి. 6 సముద్రాల ఆమ్లీకరణవాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్డయాక్సైడ్లో చాలా వరకు సముద్రాలే పీల్చుకుంటాయి. దీనివల్ల సముద్ర జలాల్లో ఆమ్లగుణం పెరిగిపోతుంది. ఇది ఒక స్థాయికి మించితే సముద్ర జీవ వ్యవస్థలకు ప్రమాదం. ఫలితంగా సీఓ2ను పీల్చుకునే శక్తి సముద్రాలకు తగ్గిపోతుంది. దీంతో భూగోళం మరింత వేడెక్కుతుంది. 7 వాయు కాలుష్యంగత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు చర్యలు తీసుకోవటం వల్ల ఈ కాలుష్యం తగ్గుముఖం పట్టింది. 9 సరిహద్దుల్లో సురక్షిత స్థాయిలో ఉన్న రెండింటిలో ఇదొకటి.8 ఓజోన్ పొరసౌర వ్యవస్థ నుంచి అతినీలలోహిత కిరణాలను భూమిపైకి రాకుండా వడకట్టేది ఆకాశంలోని ఓజోన్ పొర. గతంలో ఇది క్షీణించడంతో ప్రపంచ దేశాలు చర్యలు తీసుకున్నాయి. దీంతో ఓజోన్ పొర మందం ఇటీవల పెరుగుతోంది. తొమ్మిదింటిలో సురక్షిత స్థాయిలో ఉన్న రెండోది ఇదే.9 నావల్ ఎంటిటీస్మనుషులు తయారుచేసిన రసాయనాలు, ప్లాస్టిక్లు.. వీటి కిందికి వస్తాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు సముద్ర జంతువుల్లోకి, మన దేహాల్లోకి చేరి చేటు చేస్తున్నాయి. అయితే, వీటి ముప్పు ఎంత అనేది అంచనా వేయాల్సి ఉంది. -
శతాబ్దాల చరిత్ర.. పాన్గల్ ఖిల్లా
వనపర్తి: శతాబ్దాల చరిత్ర, ఎన్నో వీరగాథల ఘనతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన పాన్గల్ ఖిల్లాలో వెలుగులోకి రాని ఎన్నో రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయి. సుమారు 11వ శతాబ్దానికి ముందే కల్యాణి చాళుక్యుల కాలంలో ఈ దుర్గం నిర్మించినట్లు ఖిల్లాపై ఉన్న శాసనాలతో చరిత్రకారులు వెల్లడిస్తున్నారు. వనపర్తి జిల్లాకేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలోని పాన్గల్ ఖిల్లా ప్రస్తుత నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఉంది. శత్రువుల దాడుల నుంచి కాపాడుకునేందుకు నాటి రాజులు సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తయిన గుట్టపై కోట నిర్మించారు. గుర్రపునాడా ఆకారంలో తూర్పున ప్రధాన ముఖద్వారంతో చుట్టూ శుత్రుదుర్భేద్యమైన రాతికట్టడం, బురుజులతో దుర్గం నిర్మించారు. ప్రస్తుతం చాలా వరకు శిథిలావస్థకు చేరినా.. ఏటా తొలి ఏకాదశినాడు ప్రజలు గుట్టపైకి చేరుకొని అక్కడి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు. శిల్పకళా సంపద.. పాన్గల్ ఖిల్లా శిఖరాగ్రానికి, కోట ప్రాంతానికి వెళ్లేందుకు తూర్పు దిక్కున ప్రస్తుతం ఉన్న బాలపీర్ల సమీపంలో దారి ఉంది. గుట్టపైకి ఎక్కుతున్న సమయంలో ఏడు ప్రధాన ముఖద్వారాలను దాటాల్సి ఉంటుంది. ప్రతి ముఖద్వారం భారీ ఆకారంలో రాతి కట్టడంతో దర్శనమిస్తుంది. కట్టడంపై సింహాలను వేటాడుతున్న శిల్పాలు, ఎత్తయిన జంతువుల శిల్పాలను చూడవచ్చు. శిథిలావస్థలో మసీదు, ఆలయ నిర్మాణాలు.. ఎంతో ఎత్తయిన పాన్గల్ ఖిల్లాపై పురాతన గణపతి, అమ్మవారి ఆలయాలతోపాటు మినార్లతో కనిపించే మసీదు నిర్మాణాలు శిథిలావస్థలో కనిపిస్తాయి. కల్యాణి చాళుక్యుల తర్వాత మసునూరి నాయకులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్షాహీలు, బరాద్ షాహీలు, మొఘలులు, అసఫ్ జహీల్ ఈ దుర్గాన్ని యుద్ధంలో సొంతం చేసుకుని పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. 1600 అడుగుల ఎత్తులో.. సముద్రమట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులోని పాన్గల్ గుట్టపై రామగుండం బావిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. గత 30, 40 ఏళ్ల క్రితం ఏటా తొలి ఏకాదశినాడు గుట్టపైకి వెళ్లే భక్తులు ఈ గుండంలో ఈత కొడుతూ.. స్నానాలు ఆచరించేవారు. ఇది ప్రస్తుతం ఉపయోగంలో లేదు. దేవిగుట్ట అనే ప్రాంతంలో కొలువైన అమ్మవారి పురాతన శిలా విగ్రహానికి భక్తులు నేటికీ ఏటా ఒకసారి గుట్టపైకి వెళ్లి పూజలు చేస్తారు. చెక్కుచెదరని యుద్ధ ఫిరంగులు శతాబ్దాల నాటి యుద్ధ ఫిరంగులు పాన్గల్ ఖిల్లాపై ఇప్పటికీ చెక్కు చెదరకుండా, కనీసం తుప్పు కూడా పట్టకుండా ఉన్నాయి. ఖిల్లాలో ఎత్తయిన ప్రాంతంలో ఒకటి, తూర్పు ద్వారం వైపు మరో ఫిరంగి ఉన్నాయి. పాన్గల్ గుట్టపై ముక్తరామేశ్వర ఆలయం ఉన్నట్లు శాసనాలు ఉన్నాయి. కుతుబ్షాల కాలంలో నిర్మించిన బావిని ఇటీవల కాలం వరకు పాన్గల్ గ్రామంలో కుమ్మరి వీధి ప్రాంత ప్రజలు ఉపయోగించిట్లు స్థానికులు చెబుతారు. పులివేట వీరగల్లు ప్రతిమలు వీరగల్లులో పులివేట, పందివేట శిల్పాలు ప్రసిద్ధం. పులు లు, అడవి పందుల నుంచి ప్రజలను రక్షించడానికి గ్రామా ల్లోని వీరులు పోరాడి, అమరులైనప్పుడు.. ప్రజలు వీరుల జ్ఞాపకంగా వీరశిలలను పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ఈ శిల్పాలను చూసినవారు ఆ ఊరివీరుల శౌర్యాన్ని గుర్తు చేసుకొని కీర్తించేవారు. కోటలో అనేక కట్టడాలు, ఫిరంగులతోపాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలున్నాయి. కోటలోకి వెళ్తుంటే ముళ్లగవిని అనే ప్రదేశం దగ్గర దాదాపు నాలుగు అడుగులున్న పులివేట వీరగల్లును కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కనుగొన్నారు. కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపిస్తున్న వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతిపలక మీద ఉల్బణ శిల్పంగా చెక్కి ఉంది. ఈ వీరగల్లును క్రీ.శ.13, 14వ శతాబ్దాల నాటి శైలిలో చెక్కారు. అరుదుగా కనిపించే, ప్రతిష్టించే ఈ పులివేట వీరగల్లు ప్రతిమ ఇదే మండలం బుసిరెడ్డిపల్లిలో కూడా ఉంది. ఇది అరుదైన వీరగల్లు అని.. ఇలాంటివి తెలంగాణలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాల్లోనూ ఉన్నట్లు గుర్తించారు. ఈ శిల్పాలను భద్రపరచడమో.. లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వినర్ రామోజు హరగోపాల్, సభ్యులు బైరోజు చంద్రశేఖర్, శ్యాంసుందర్, స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, అధికారులు కృషి చేయాలి. కోటపై ఉన్న అనేక చారిత్రక కట్టడాలు ధ్వంసం అవుతున్నాయి. వనపర్తి జిల్లాకు తలమానికంగా నిలిచే కోటను భావితరాల వారికి తెలిసేందుకు పర్యాటక కేంద్రంగా మారిస్తే.. ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుంది. – కుమ్మరి చంద్రయ్య, పాన్గల్ అభివృద్ధి చేస్తాం ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న పాన్గల్ ఖిల్లాను మంత్రి జూపల్లి సహకారంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఇప్పటికే ఖిల్లాకు సంబంధించిన నివేదికలను పంపించాం. పర్యాటక శాఖ అధికారులు ఖిల్లాను సందర్శించి వివరాలను సేకరించారు. మరోమారు ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చారిత్రక కట్టడాలు కనుమరుగవకుండా కాపాడుతూ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. – హైమావతి, మాజీ ఎంపీటీసీ, పాన్గల్ -
కారులో టచ్ స్క్రీన్.. కాకూడదు పరేషాన్!
బ్రాండ్, కారు పనితీరు, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మాత్రమే కాదు.. కారు లోపల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ కూడా కారు కొనుగోలు సమయంలో కీలక పాత్ర పోషిస్తోంది. కొత్త మోడళ్లు హైటెక్, ఫ్యూచరిస్టిక్ స్క్రీన్ తో వస్తున్నాయి. ఖుషీఖుషీగా కారులో ప్రయాణిస్తూ.. ఈ టచ్ స్క్రీన్ల వాడకంలో కొందరు బిజీ అయిపోతున్నారు. అదిగో, అదే మంచిది కాదు, అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఒక్క మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ‘టచ్స్క్రీన్’ చర్చనీయాంశంగా మారింది.ఫోన్ కాల్స్, ఏసీ, నావిగేషన్, సంగీతం, 360 డిగ్రీ వ్యూ.. ఇలా ఎన్నో ఫీచర్లను డ్రైవర్ ముందున్న టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ నియంత్రిస్తోంది. ఫ్యాక్టరీ ఫిట్టింగ్ లేనప్పటికీ కొందరు తమ కార్లలో వీడియోలు ప్లే అయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ వాడటం ప్రమాదకరం. అలాగే, కారులో కూడా టచ్ స్క్రీన్ వాడకం.. డ్రైవింగ్ మీద దృష్టిని మరల్చే పెద్ద సమస్యగా పరిణమిస్తోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. సులభమేమీ కాదుసాధారణంగా డ్రైవర్లు.. దృష్టి మరల్చకుండానే స్టీరింగ్కు, డ్రైవింగ్ సీటుకు సమీపంలో ఉన్న బటన్లను సులభంగా ఉపయోగిస్తారు. ఇటీవలి కాలంలో ముఖ్యమైన బటన్లను కంపెనీలు స్టీరింగ్ వీల్పై అమర్చుతున్నాయి. కానీ, టచ్స్క్రీన్ ఉపయోగించడం అంత సులభం కాదు. ఒక నిర్దిష్ట సెట్టింగ్ను కనుక్కోవాలంటే ఒక విండో నుంచి మరొక విండోకు వెళ్లాల్సి ఉంటుంది. ఏ ఫీచర్ను వినియోగించాలన్నా సమయం తీసుకుంటుంది. ‘వీ బుల్గరీ’ అధ్యయనంలో..2022లో స్వీడిష్ మోటరింగ్ మ్యాగజైన్ ‘వీ బుల్గరీ’ ఓ అధ్యయనం చేపట్టింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేడియో స్టేషన్ మార్చడం, ఉష్ణోగ్రతను అడ్జస్ట్ చేయడం వంటి పనులకు డ్రైవర్లకు ఎంత సమయం పట్టిందో పరిశీలించారు. ఇందులో వినియోగించిన 12 కార్లలో 11 కార్లకు టచ్స్క్రీన్స్ ఉన్నాయి. బటన్లతో కూడిన ఒకే ఒక పాత కారు ఉపయోగించారు. పాత కారులో డ్రైవర్లు నిర్దేశించిన పనులను 10 సెకన్లలోపు చేయగలిగారు. కానీ ఆధునిక మోడళ్లలో అవే పనులకు సుమారు 45 సెకన్లు పట్టింది. డ్రైవర్ల దృష్టిని టచ్స్క్రీన్లు ఎంతలా మరల్చుతున్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరో రెండు అధ్యయనాల్లో..ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్పై వేర్వేరు పనులు చేస్తున్నప్పుడు డ్రైవర్లు ఎంతసేపు పరధ్యానంగా ఉన్నారో తెలుసుకోవడానికి నార్వేకు చెందిన కాంట్రాక్ట్ పరిశోధన సంస్థ ‘సింటెఫ్’ 2024లో ఓ అధ్యయనం నిర్వహించింది. ఇందుకోసం కంటి చూపును పసిగట్టే ట్రాకింగ్ కెమెరాలను ఉపయోగించారు. రోడ్డు వైపు చూడకుండా ఉష్ణోగ్రతను మార్చడానికి డ్రైవర్లకు సగటున మూడున్నర సెకన్లు పట్టింది. రేడియో స్టేషన్ మార్చడానికి 11 సెకన్లు, నావిగేషన్ టూల్లో కొత్త చిరునామాను చేర్చడానికి 16 సెకన్ల సమయం తీసుకున్నారు. 2020లో బ్రిటిష్ సంస్థ ‘ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ ల్యాబొరేటరీ’ ప్రచురించిన ఒక విశ్లేషణ ప్రకారం.. పరిమితికి మించి ఆల్కహాల్ సేవించి నడిపే డ్రైవర్లలో డ్రైవింగ్ కంటే టచ్ స్క్రీన్లే రియాక్షన్ టైమ్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి. దేనికైనా స్పందించే రేటు.. డ్రైవింగ్ వల్ల కంటే టచ్స్క్రీన్ ఆపరేట్ చేయడం వల్లే తక్కువగా ఉంటోందన్నమాట.స్విచ్ల ద్వారా..‘యూరో ఎన్ సీఏపీ’,, యూరప్లో కార్లకు భద్రతా రేటింగ్స్ ఇచ్చే సంస్థ. నిజానికి ఇది చట్టబద్ధమైన సంస్థ కాదుగానీ, ఇది ఇచ్చే రేటింగ్స్ని కార్ల కంపెనీల ప్రామాణికంగా భావిస్తాయి. వచ్చే జనవరి నుండి విక్రయించే కార్లకు ఈ సంస్థ కొత్త నియమాలు నిర్దేశించింది. దీని ప్రకారం విండ్స్క్రీన్ వైపర్ల వంటి ముఖ్యమైన ఫంక్షన్లు టచ్స్క్రీన్ల ద్వారా కాకుండా ఫిజికల్ స్విచ్ల ద్వారా నియంత్రించేలా ఏర్పాటు చేయకపోతే ఏ కారుకూ ఫైవ్ స్టార్ స్కోర్ ఇవ్వరు. మన దేశంలో కార్లను విక్రయించే కంపెనీలు స్టీరింగ్పై అనువుగా కొన్ని బటన్స్ను పొందుపరుస్తున్నాయి. ఎందుకంటే.. టచ్స్క్రీన్లతో పోలిస్తే ఫిజికల్ బటన్లు వాడటమే డ్రైవర్లకు సులభంగా ఉంటుంది. అయితే ఈ బటన్లు కూడా వాడటం కష్టమనుకునే వారికోసం చాలా వాహన తయారీ సంస్థలు వాయిస్ కంట్రోల్తో పనిచేసేలా ఫీచర్లను జోడిస్తున్నాయి. ఎంత గొప్ప కారు అయినా.. ముందు భద్రత ప్రధానం.. తరవాతే ఎన్ని హంగులైనా!ఇలా చేయండి..» డ్రైవ్ చేసే ముందు లేదా సురక్షితమైన స్థలంలో వాహనం ఆపి రేడియో, జీపీఎస్, ఏసీ వంటి సర్దుబాట్లు చేసుకోండి.» ఇన్ కమింగ్ కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దృష్టి మరలుతుంది. కాబట్టి మీ ఫోన్ ను వాహనం బ్లూటూత్కు అనుసంధానించవద్దు.» వాహనంలో ప్రత్యామ్నాయ బటన్లు ఉంటే వాటిని ఉపయోగించండి.» మీ పక్క సీటులో ఎవరైనా ఉంటే.. వారికి టచ్స్క్రీన్ బాధ్యతలు అప్పగించండి.– సాక్షి, స్పెషల్ డెస్క్ -
లేటు వయసులో.. పెళ్లి, పిల్లలా?
‘నాకు పిల్లలు కావాలని అనిపిస్తోంది. దత్తత తీసుకునే ఆలోచన లేదు. కచ్చితంగా ఒక బిడ్డ అయితే ఉంటుంది. అది ఎప్పుడైనా జరగొచ్చు. నాకు పిల్లలు పుడితే వారి ఆలనాపాలనా చూసుకునేందుకు నా కుటుంబం ఉంది’ అని 59 ఏళ్ల బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సరే, పిల్లలు ఎప్పుడు పుట్టినా సల్మాన్కు వచ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ, సామాన్యుల విషయంలో అలా కాదు. పిల్లలు తప్పనిసరిగా కావాలనుకున్నవాళ్లకి మాత్రం.. ఒక వయసు దాటాక పిల్లలు పుడితే వాళ్ల పెంపకం, భవిష్యత్తు పెద్ద సమస్యగా మారతాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని పెద్దలు అంటుంటారు. చదవాల్సిన వయసులో చదవకపోతే.. ఉద్యోగం రావాల్సిన వయసులో రాదు. ఉద్యోగం రానంతవరకు.. జరగాల్సిన వయసులో ఆ మూడు ముళ్ల తంతు కూడా కాదు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టేస్తారన్న గ్యారంటీ ఈ రోజుల్లో లేదు.ఒకప్పుడు అలా..: ఓ రెండు దశాబ్దాల కిందటి వరకూ.. అబ్బాయిలకు 25–26 ఏళ్లు వచ్చేటప్పటికి.. పెళ్లిళ్లు అయిపోయేవి. 30 ఏళ్లలోపు.. పిల్లలు పుట్టేసేవారు. పిల్లల కోసం, తమకోసం ఆర్థిక ప్రణాళికలు కూడా వేసుకునే అవకాశం ఉండేది. 50 ఏళ్లలోపే.. పుట్టిన పిల్లలకు ఉద్యోగాలు రావడం, పెళ్లిళ్లు కూడా అయిపోయేవి. అక్కడి నుంచి ఒక రకంగా ఫ్రీబర్డ్లా ఉండేవారు. రిటైర్మెంట్ కూడా సాఫీగా జరిగిపోయేది. కానీ, అదే పెళ్లి ఏ 30 ఏళ్లకో, 35 ఏళ్లకో జరిగితే ఏంటి పరిస్థితి? పిల్లలు పుడతారో పుట్టరో!సాధారణంగా మహిళల్లో 30 ఏళ్లు దాటాక.. పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతుంటాయి. ప్రస్తుత జీవనశైలి సమస్యలు, ఒత్తిడి, పర్యావరణ కాలుష్యం ఇవన్నీ.. అగ్నికి ఆజ్యం పోసినట్టు పిల్లలు పుట్టే అవకాశాలను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. అందువల్ల మూడు పదుల దాటాక మూడుముళ్లు వేస్తే.. వాళ్ల మధ్యలోకి ముచ్చటగా మూడోవ్యక్తి రావడం అంత సులభం కాదు. ఒకవేళ పుట్టినా.. తరవాత అనేక సమస్యలు సిద్ధంగా ఉంటాయి.పిల్లల పెంపకం30–35 ఏళ్ల తరవాత పిల్లలు పుడితే.. 45 దాటిన తరవాత నుంచీ వాళ్ల చదువు కోసం టెన్షన్ మొదలవుతుంది. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు పిల్లలను చూసుకోవడం కాస్త ఇబ్బందవుతుంది. ఇద్దరూ ఉద్యోగులైతే.. ఇక చెప్పనక్కర్లేదు. 25–30లలో ఉండే ఓపిక, సహనం.. 40లలో ఉండవు. ప్రతి చిన్న విషయానికీ చిర్రుబుర్రులాడుతుంటే ఆ చిన్నారుల మనసుల మీద ప్రభావం పడుతుంది.ఆలోచనల్లో అంతరాలులేటు వయసులో పుట్టే పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య ఆలోచనల్లో చాలా అంతరం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల స్పీడును వీళ్లు అందుకోలేరు.శారీరక, మానసిక ఆరోగ్యం35 దాటాక.. అనేక శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఒకవైపు వీటితో సతమతమవుతూనే పిల్లల పెంపకమూ చూడటం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియన్ జర్నల్ ఆఫ్ హెల్త్ ప్రొఫెషనల్లో ఇటీవల ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. 35 ఏళ్ల వరకు పెళ్లికాని వాళ్లలో హైపర్టెన్షన్, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ ఉందట. సినిమాల్లో వ్యంగ్యంగా చెప్పినట్టు.. పెళ్లయ్యాక ఇవి రావడం కాదు, వీటితోనే పెళ్లి మండపం మీదకు అడుగుపెట్టాల్సి రావచ్చన్నమాట.వాళ్ల సెటిల్మెంట్.. మీ రిటైర్మెంట్పిల్లలు ఒక ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిర పడేసరికి తండ్రి వయసు 55 దాటిపోతుంది. దాదాపు రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తారు లేదా రిటైరయ్యాక వాళ్లు స్థిరపడవచ్చు. మీరు రిటైరైపోయిన తరవాత కూడా పిల్లలు సెటిల్ కాకపోతే అదో పెద్ద సమస్య. శారీరక, మానసిక ఆరోగ్యాలు సహకరించకపోయినా అయిష్టంగా, అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది. ఈ మధ్యలో ‘మీవాడు ఇంకా సెటిల్ కాలేదా?’ అంటూ బంధుమిత్రుల విచారణలు మరింత చికాకు తెప్పిస్తాయి.వైవాహిక జీవితంలోనూ..ఆలస్యంగా పెళ్లి చేసుకునే సందర్భంలో.. భార్యాభర్తల మధ్య వయసు అంతరం ఎక్కువ ఉంటే భాగస్వామి మనసును అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వారి ఆశలు, ఆకాంక్షలు ఒకలా ఉంటాయి.. వీరి ఆలోచనలూ, నిర్ణయాలూ మరోలా ఉంటాయి. ఇది దీర్ఘకాలంలో ఇద్దరి మధ్యా అగాథాన్ని పెద్దది చేస్తుంది. కలసి ఉంటున్నా భాగస్వామిలో అశాంతి రాజ్యమేలుతుంటుంది. ఆర్థిక సమస్యలుపిల్లల భవిష్యత్తు, సొంతిల్లు కొనుగోలు.. ఇలాంటి ప్రణాళికలపైనా ప్రభావం పడుతుంది. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల ఖర్చులు పెరిగిపోతుంటాయి. భవిష్యత్ ప్రణాళికల వ్యయమూ తడిసిమోపెడవుతుంది. ఆ సంపాదన కోసం అదనంగా కష్టపడాల్సి వస్తుంది.పెళ్లికాని ప్రసాదులు 39 శాతంజాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–2021) ప్రకారం.. మనదేశంలో 45–49 ఏళ్లున్న స్త్రీలలో ఒక శాతం.. పురుషుల్లో 3 శాతం పెళ్లికాకుండా ఉన్నారు.15–49 ఏళ్ల పురుషుల్లో పెళ్లయిన వారు 60 శాతం మందే. మహిళల విషయంలో ఇది 72 శాతం. మహిళల్లో పెళ్లికాని వారు 24 శాతం కాగా.. పురుషుల్లో ఇది 39 శాతం. -
అమెరికాకు వెళ్లాలా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక.. ‘డాలర్ డ్రీమ్స్’కి బ్రేకులు పడటం మొదలయ్యాయి. కొత్తగా పెట్టిన హెచ్–1బీ వీసా ‘లక్ష డాలర్ల’ నిబంధన.. పెద్ద స్పీడ్ బ్రేకర్ అంటున్నారు నిపుణులు. ఇప్పటికే అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య ఈ ఏడాది గణనీయంగా తగ్గింది. 2024 మొదటి 8 నెలలతో పోలిస్తే.. 2025లో ఆగస్టు వరకు అమెరికా వెళ్లిన వారి సంఖ్య 4.3 శాతం తగ్గింది. ప్రత్యేకించి ఆగస్టులో ఇది ఏకంగా 14.8 శాతం తగ్గింది. గతంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది.అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం (యూఎస్ ఐటీఏ) గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది మొదటి 8 నెలల్లో... విద్యార్థి వీసాపై అమెరికా వెళ్లిన భారతీయులు 1,77,435. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 26.1 శాతం తక్కువ. ఇక పర్యాటక వీసాల మీద వెళ్లినవారు 9.98 లక్షలు. గతేడాది మొదటి 8 నెలలతో పోలిస్తే ఇది 2.7 శాతం తక్కువ.ఏయే వీసా మీద ఎంతమంది?ప్రత్యేకించి విద్యార్థి వీసా మీద అమెరికా వెళ్లే వారి సంఖ్య.. 2024 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 44.5 శాతం తగ్గిపోయింది. పర్యాటక, విద్యార్థి వీసాలపై వెళ్లినవాళ్లు తగ్గడంతో మొత్తం సంఖ్యలోనూ భారీ తగ్గుదల నమోదయింది. యూకే తరవాత మనమేయూఎస్ ఐటీఏ గణాంకాల ప్రకారం.. గత రెండేళ్లలో ఆగస్టు నెలలో అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఈ ఏడాది ఆగస్టులో వీరి సంఖ్య భారీగా తగ్గిపోయింది. 2025లో ఆగస్టు వరకు చూస్తే.. యూకే తరవాత అమెరికాను అత్యధికంగా సందర్శించింది భారతీయులే. ఈ ఏడాది మొదటి 8 నెలల్లోమొత్తం 14.87 లక్షల మంది అమెరికాకు వెళ్లారు. 2024 జనవరి – ఆగస్టుతో పోలిస్తే ఇది 4.3 శాతం తక్కువ.ఈ ఏడాది తగ్గుతుందా?భారత ప్రభుత్వ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ గణాంకాల ప్రకారం.. అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2022 నుంచి భారీగా పెరుగుతోంది. కానీ, ఈ ఏడాది గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం అక్టోబరు 1న ప్రారంభమై సెప్టెంబరు 30న ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల్లో యూఎస్ వెళ్లిన మొత్తం భారతీయులు సుమారు 19.4 లక్షలు. గతేడాది సెప్టెంబర్లో 1.81 లక్షల మంది వెళ్లారు. ఈసారి సెప్టెంబరులో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం సంఖ్య 21 లక్షలు దాటకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నాటి మెరుపులే తప్ప..కొత్త వెలుగులేవీ..?
సాక్షి, విశాఖపట్నం: ‘పర్యాటక రాజధానిగా’ విశాఖను మారుస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా టూరిజం రంగాన్ని గాలికొదిలేసింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులు పూర్తయి పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయే తప్ప, కూటమి వచ్చాక ఒక్క కొత్త టూరిజం ప్రాజెక్టు అయినా పట్టాలెక్కకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్త మెరుపులు లేకుండానే మరో పర్యాటక దినోత్సవం ముగిసిపోయిందని పర్యాటక ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీఐఎస్–2023 సదస్సులో రూ. 8,806 కోట్ల విలువైన 66 టూరిజం ప్రాజెక్టులకు సంబంధించిన ఎంవోయూలను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. సింగపూర్, టర్కీ, ఫ్రాన్స్ వంటి దేశాలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ఈ ప్రాజెక్టులు పడకేయడంతో విశాఖకు ప్రపంచ పర్యాటక పటంలో లభించాల్సిన స్థానం చేజారిపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కూటమి నాయకులు ఉన్న భూములను కొల్లగొట్టేందుకు పీపీపీ పేరుతో స్కెచ్లు వేస్తున్నారే తప్ప, కొత్తగా అభివృద్ధి చేయడం లేదన్న విమర్శలున్నాయి. 2024 ఏప్రిల్లోనే గ్లాస్ బ్రిడ్జికి ఎల్వోఏ కైలాసగిరిపై నిర్మాణం పూర్తయిన గ్లాస్ బ్రిడ్జ్ ప్రాజెక్టు తమ ఘనతేనని కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా, వాస్తవానికి ఈ ప్రతిపాదన 2022లో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చిందే. 2024 జనవరిలో పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టుకు ఎల్వోఏ ఇచ్చారని, ఇప్పుడు పనులు పూర్తవడంతో ఆ క్రెడిట్ కూటమి తన ఖాతాలో వేసుకుంటోంది. రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అవకాశాలున్నా.. ఆలోచన సున్నా.! మాటల్లోనే విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని చెబుతున్నారే తప్ప.. వాస్తవ రూపం దాల్చేలా ఒక్క అడుగు కూడా కూటమి ప్రభుత్వం వెయ్యడం లేదు. గత ప్రభుత్వం హయాంలో ఒప్పందం ప్రకారం అన్నవరంలో ఒబెరాయ్, మై ఫెయిర్ హోటల్స్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ తరహా ఒప్పందం ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చెయ్యలేదు. విశాఖ నగరంలో పర్యాటక వనరులు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా.. పీపీపీ పద్ధతిలో భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తుందే తప్ప.. కొత్త ఆలోచనల్ని అమలు చెయ్యడంలో పూర్తిగా విఫలమయ్యింది. రూ. వేల కోట్ల భూములపై నేతల కన్ను మరోవైపు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలు చేయకుండా, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని రూ. వేల కోట్ల విలువైన పర్యాటక భూములను తమ అనుచరులకు కట్టబెట్టేందుకు కూటమి నాయకులు వ్యూహరచన చేస్తున్నారు. యాత్రినివాస్ వంటి భవనాలను ఇప్పటికే పీపీపీ పేరుతో ప్రైవేట్కు అప్పగించింది. తమ నియోజకవర్గాల పరిధిలోని విలువైన పర్యాటక భూములను అనుచరులకు కట్టబెట్టడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లాలో 176.15 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలో 22.67 ఎకరాలు, అల్లూరి జిల్లాలో 43.10 ఎకరాలు చొప్పున మొత్తం 241.92 ఎకరాల్ని కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. త్వరలోనే కూటమి నేతల అనుచరులకు టూరిజం ప్రాజెక్టుల పేరుతో భూపందేరం జరగనుంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే మార్గా లను అన్వేషించకుండా.. ఉన్న భూములను కూటమి నాయకులకు ధారాదత్తం చేసేందుకు.. ప్రభుత్వ పెద్దలు ఎవరికి చెబితే.. వారికి భూ కేటాయింపులు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కుదిరిన రూ. వేల కోట్ల ఒప్పందాలను పక్కన పెట్టి, భూములను కూటమి నేతల అనుచరులకు ధారాదత్తం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. త్వరలో మరో హిప్హాప్ బస్సు ఉమ్మడి విశాఖలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే బీచ్రోడ్డులో రూ.5 కోట్లతో రెండు హిప్హాప్ బస్సులు నడుపుతున్నాం. త్వరలోనే మరో హిప్హాప్ బస్సు పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నాం. రుషికొండ, జోడుగుళ్ల పాలెం, భీమిలి బ్యాక్ వాటర్లో వాటర్స్పోర్ట్స్, కయాకింగ్, స్కూబాడైవింగ్ మొదలైనవి అందుబాటులోకి రాబోతున్నాయి. విశాఖ, అరకు క్యారవాన్స్ తీసుకొస్తున్నాం. టూరిజం హోటల్స్కు టెండర్లు వేశాం. త్వరలోనే వైజాగ్లో 2 వేల రూమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ టూరిజం, ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ప్రణాళికలు తయారు చేస్తున్నాం. – జీవీబీ జగదీష్, ఏపీటీడీసీ డీవీఎంప్రపంచ స్థాయి హోటల్స్తో పర్యాటకుల తాకిడి ఈ ఏడాది టూరిజం డేని పర్యాటకంలో స్థిరమైన, సమగ్రాభివృద్ధి అనే థీమ్తో నిర్వహిస్తున్నాం. పర్యాటక రంగంలో హాస్పిటాలిటీ ప్రధాన పాత్రపోషిస్తోంది. ప్రపంచస్థాయి హోటల్స్ రాబోతుండటంతో.. విశాఖకు సందర్శకుల తాకిడి రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకుల సంఖ్య ప్రస్తుతం కోటికి పైగా ఉంది. ఇది రెట్టింపు చేసుకునే అవకాశాలు బోలెడు ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. భవిష్యత్తులో విశాఖకు విమానాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరిగితే మెడికల్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం అభివృద్ధి చెందనున్నాయి. – పవన్ కార్తీక్, ఏపీ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
గూగుల్కి అసలు అర్థమేంటో తెలుసా?
ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా?.. దాని ఫాంట్ వేరే రకంగా కనిస్తోందా?.. అదేదో అప్డేట్ అనుకుని కంగారుపడేరు. ఇవాళ గూగుల్ 27వ పుట్టినరోజు. అందుకే డూడుల్ అలా దానికి విషెష్ తెలిపిందంతే. అయితే గూగుల్ ప్రారంభమైంది సెప్టెంబర్ 4వ తేదీన. అలాంటప్పుడు ఇవాళ బర్త్డే జరుపడానికి ఓ ప్రత్యేక కారణం ఉందని మీకు తెలుసా?.. అసలు గూగుల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా??..గూగుల్ను లారీ పేజ్(Larry Page), సెర్గీ బ్రిన్(Sergey Brin) ప్రారంభించారు. 1998లో సెప్టెంబర్ 4న అధికారిక కంపెనీ గుర్తింపు దక్కించుకుంది. అయితే.. 2003 నుంచి గూగుల్ బర్త్డే మారిపోయింది. 2003లో సెప్టెంబర్ 8న, 2004లో సెప్టెంబర్ 7న, 2005లో సెప్టెంబర్ 26 నిర్వహించుకుంది. అయితే 2006 నుంచి సెప్టెంబర్ 27ను క్రమం తప్పకుండా తన పుట్టినరోజుగా మార్చేసుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు!.సెప్టెంబర్ 27, 2006లో గూగుల్ అరుదైన మైలురాయి దాటింది. అత్యధిక వెబ్పేజీలను ఇండెక్స్ చేసిన ఘనత గూగుల్ సొంతం చేసుకుంది. అంటే.. ఒక నిర్దిష్ట సమయంలో తన సెర్చ్ ఇంజిన్ ద్వారా అప్పటిదాకా ఎవరూ సాధించని ఫీట్ సాధించింది. అలా.. ఆ అరుదైన ఘనత సాధించిన సందర్భాన్ని బర్త్డేగా మార్చుకుంది. అప్పటి నుంచి మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే తన పుట్టినరోజున డూడుల్స్, ప్రమోషన్స్, తన ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటిస్తుంటుంది. ఇంతకీ గూగుల్ అర్థమేంటంటే.. Google అనే పదానికి అర్థం ఏ డిక్షనరీలోనూ కనిపించదు. అసలు ఆ పదానికి ఓ అర్థమంటూ లేదు కూడా. వాస్తవానికి.. గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ 1997లో తాము రూపొందించిన ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్కు గూగోల్(Googol) అనే పేరు పెట్టాలనుకున్నారు. గూగోల్ అంటే.. 1 పక్కన 100 సున్నాలు ఉండే సంఖ్య. అపారమైన సమాచారాన్ని అందిస్తుంది అనే అర్థం వచ్చేలా ఆ పదం అనుకున్నారు. అయితే.. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో వీళ్లద్దరి సహచరి విద్యార్థి సీన్ అండర్సన్.. Googol.com అనే డొమెయిన్కు బదులు Google.com అని టైప్ చేశాడు. అయితే లారీ పేజ్ ఆ పేరు నచ్చి.. అప్పటికప్పుడు ఆ డొమెయిన్ను ఫిక్స్ చేశారు. అలా ఆ తప్పిదమే చివరికి ఇప్పుడు ప్రపంచమంతా వెతుక్కునే ప్రముఖ బ్రాండ్గా మారింది.ఇది తెలుసా?.. గూగుల్ ప్రధాన కార్యాలయం గూగుల్ఫ్లెక్స్(Googleplex) అమెరికా కాలిఫోర్నియా స్టేట్ మౌంటెన్ వ్యూలో ఉంది. ఈ హెడ్ ఆఫీస్లో స్టాన్(Stan) అనే డైనోసార్ బొమ్మ ఉంటుంది. గూగుల్ అనేది ఎంత పెద్ద సెర్చ్ ఇంజిన్ అయినా సరే.. డైనోసార్లా అంతం అయిపోకుండా, కొత్త ఆలోచనలో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారట. అంతేకాదు.. 2010లో తమ ఆవరణలో ఉన్న గడ్డిని కత్తిరించేందుకు మెషీన్లు, పరికరాల సాయంతో కాకుండా అద్దెకు గొర్రెలను తెచ్చి ఇకోఫ్రెండ్లీ ఐడియాతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా. ఇంకో ఆసక్తికరమైన ముచ్చట ఏంటంటే.. గూగుల్కు నెట్ ఆగిపోతే వచ్చే డైనోసార్ గేమ్ తెలుసు కదా. 2014లో ఈ ఆఫ్లైన్ గేమ్(T-Rex Runner-Chrome Dino) ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ఇంటర్నెట్ లేకపోతే మనం డైనోసార్ యుగంలో ఉన్నాం అనే ఫన్తో యూజర్ల దృష్టి మరలకుండా ఉండేందుకే ఈ గేమ్ను క్రియేట్ చేశారట!. -
విదేశీ గడ్డపై అడ్డంకులు
హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును భారీగా పెంచుతూ అమెరికా తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా భారతీయులను షాక్కు గురి చేసింది. ఒక్క యూఎస్ మాత్రమే కాదు.. భారతీయులు సంప్రదాయకంగా ఉద్యోగాల కోసం తరలివెళ్లే అనేక పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి అవరోధాలు ఉన్నాయి. ఈ దేశాలు చరిత్రాత్మకంగా నిపుణుల కొరతను పూడ్చుకోవడానికి, ఆర్థిక వృద్ధిని నడిపించడానికి భారత్, చైనా వంటి దేశాలపై ఆధారపడి ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఆయా పాశ్చాత్య దేశాల్లోని ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చింది. విదేశీ కార్మికుల కంటే సొంత పౌరులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నైపుణ్యం కల విదేశీ కార్మికులను ప్రోత్సహించకుండా ఉండటానికి తమ వలస విధానాలకు అనుగుణంగా ఆయా దేశాలు మార్పులు చేసుకుంటున్నాయి. అదే సమయంలో అక్రమ, తక్కువ నైపుణ్యమున్న కార్మికులను నిలువరిస్తున్నాయి.మనవాళ్ల ఆదాయం ఎక్కువకొన్ని ప్రధాన దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ఆదాయం స్థానికుల ఆదాయం కంటే అధికంగా ఉంటోంది. తమ దేశంలో ఉంటూ తమ కంటే ఎక్కువ ఆర్జించడం ఆయా దేశాల స్థానికులకు, ముఖ్యంగా యువతకు మింగుడు పడడం లేదన్నది నిపుణుల మాట. యూఎస్ సిటిజన్స్ తో పోలిస్తే.. అక్కడ ఉంటున్న భారతీయుల ఆదాయం రెండింతలకుపైగా ఉంది. ఆస్ట్రేలియా, జర్మనీల విషయంలో ఇది సుమారు 50 శాతం ఎక్కువ. భారతీయుల వల్ల తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయనే కోపం ఒకవైపు.. తమకంటే ఎక్కువ సంపాదిస్తున్నారన్న అసూయ మరోవైపు.. వెరసి ఆస్ట్రేలియా, యూకే వంటి అనేక దేశాల్లో స్థానిక యువత అక్కడున్న భారతీయులపై దాడులు చేస్తున్నారు. ‘గో బ్యాక్ టు ఇండియా’ అంటూ బహిరంగంగానే మనవాళ్లను హెచ్చరిస్తున్న సంఘటనలు సైతం పెరుగుతూనే ఉన్నాయి.వలసలు తగ్గించాలని..గడిచిన రెండు సంవత్సరాలలో వలసలను తగ్గించేందుకు పాశ్చాత్య దేశాలు అనేక నిర్ణయాలు తీసుకున్నాయి.యూఎస్: కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తుకు 1,00,000 డాలర్ల వన్–టైమ్ ఫీజు అమలులోకి తెచ్చింది.యూకే: వర్క్ పర్మిట్ కోసం కనీస వేతన పరిమితిని 38,700 పౌండ్స్ నుంచి 2025 జూలైలో 41,700 పౌండ్స్కు పెంచింది.స్వీడన్: వర్క్ పర్మిట్ కోసం కనీస జీతం పరిమితి 2023 అక్టోబర్ నుంచి రెండింతలకుపైగా అధికమై 29,680 క్రోనర్లకు (ఆ దేశ కరెన్సీ. ఒక క్రోనా సుమారు రూ.9.37) చేరింది.కెనడా: 2025లో విద్యార్థులు, కార్మికుల దరఖాస్తుల అనుమతిని 10–16% తగ్గించాలన్నది ప్రణాళిక.ఆస్ట్రేలియా: 2025 నాటికి నికర వలసలను సగానికి తగ్గించే ప్రయత్నంలో భాగంగా 2023–24లో విద్యార్థి వీసాల జారీని 34% తగ్గించారు. -
విలాస గృహాలు
ఇల్లే కదా స్వర్గసీమ. అందుకే ఇంటి కోసం ఎంతైనా ఖర్చు చేసేవారు పెరుగుతున్నారు మనదేశంలో. దీంతో లగ్జరీ రియల్ ఎస్టేట్ దూసుకెళుతోంది. ఇల్లు ఒక్కటే కొంటే సరిపోదు.. అందుకు తగ్గట్టుగా ప్రీమియం బ్రాండ్స్ నుంచి కిచెన్వేర్, బాత్ ఫిట్టింగ్స్, టైల్స్, ఫర్నీచర్, ఇంటీరియర్స్నూ కొనేస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ ‘అనరాక్’ గణాంకాల ప్రకారం భారత్లో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు 2021 నుండి పెరుగుతున్నాయి. ఈ విభాగంలో 2021లో 22,054 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2024 వచ్చేసరికి విక్రయాలు అయిదురెట్లు దాటి 1,17,000 యూనిట్లకు చేరుకున్నాయి. మెట్రోల నుండి మాత్రమే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచీ ఖరీదైన గృహాలకు డిమాండ్ పెరుగుతోంది. లగ్జరీ హౌసింగ్ పెరుగుదలతో ప్రీమియం ఫర్నీచర్కు కూడా డిమాండ్ అధికమైంది. సొంత ఇంటి కోసం రూ.3 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టే కస్టమర్లు వారి జీవనశైలికి సరిపోయే ఫర్నీచర్ను కూడా కోరుకుంటున్నారు. కొత్త రికార్డులుఏటా విదేశీ టూర్లకు వెళ్లే సంపన్నులు.. కోవిడ్ సమయంలో మాత్రం దేశంలోనే ఉండిపోయారనీ, టూర్ల కోసం దాచుకున్న మొత్తంతో ఈ కుటుంబాలు ఖరీదైన కార్లు, ఇళ్లు కొనుగోలు చేశారనీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగుతోందని, ఇందుకు ఈ ఇళ్ల అమ్మకాల తీరే నిదర్శనమని అంటున్నారు. 2021తో పోలిస్తే 2022లో ఈ విక్రయాలు దాదాపు రెండున్నర రెట్లు దూసుకెళ్లాయి. 2023 నుంచి ఏకంగా 1,00,000 యూనిట్ల మార్కును దాటిపోయాయి. ప్రస్తుత సంవత్సరం తొలి అర్ధ భాగంలో నమోదైన అమ్మకాలను బట్టి చూస్తుంటే ఈ ఏడాది సైతం మార్కెట్ జోరు కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. రీసేల్ వాల్యూ జంప్‘మ్యాజిక్బ్రిక్స్’ నివేదిక ప్రకారం లగ్జరీ గృహాల్లో వినియోగిస్తున్న ఇంటీరియర్ మార్కెట్ విలువ 12.33 బిలియన్ డాలర్లు. ఏటా 12 శాతం వార్షిక వృద్ధిరేటుతో ఈ విభాగం 2030 నాటికి రెండింతలై 24.52 బిలియన్ డాలర్లను తాకుతుందని అంచనా. అద్భుతంగా రూపొందించిన ఇంటీరియర్ కారణంగా ఇంటి రీసేల్ వాల్యూ 70 శాతం వరకు పెంచుతుంది. అలాగే అద్దె 45 శాతం వరకు అధికంగా పొందవచ్చని నివేదిక పేర్కొంది.ఫర్నిచర్పై మోజుఇటీవలి కాలంలో.. ఆదాయాలు పెరుగుతున్నాయి. మరోవైపు పట్టణీకరణ వేగంగా జరుగుతోంది. తమకు నచ్చిన ఇంటిని కొనుక్కోవాలని.. అందులోని ఇంటీరియర్ను తమకు నచ్చినట్టు మలుచుకోవాలన్న అభిరుచులు కూడా పెరుగుతున్నాయి. దీంతో సులభంగా వినియోగించగలిగే మల్టీ ఫంక్షనల్ ఫర్నీచర్ కోరుకుంటున్నారు. అంతేకాదు, ఖరీదైనా సరే, విదేశీ ఫర్నీచర్కు కూడా సై అంటున్నారు. భారత్లో ఇంటి యజమానులు ఇంటీరియర్స్ను వ్యూహాత్మక పెట్టుబడిగా చూస్తున్నారని ‘మ్యాజిక్బ్రిక్స్’ చెబుతోంది.101 బిలియన్ డాలర్లకు..దేశంలో గత ఏడాది 38 బిలియన్ డాలర్ల విలువైన లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. 2029 నాటికి ఇది 101 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. లగ్జరీ హౌసింగ్ మార్కెట్లో డిమాండ్ ప్రధానంగా 2, 3 బెడ్రూమ్, హాల్, కిచెన్ (బీహెచ్కే) విభాగంలో కేంద్రీకృతమై ఉంది. మొత్తం మార్కెట్లో వీటి వాటా ఏకంగా 95 శాతం. 750 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే రూ.2–5 కోట్లు పలికే మిడ్ సైజ్ ఇళ్లకు కూడా మార్కెట్ డిమాండ్లో 49 శాతం వాటా ఉంది. రూ.1.5 కోట్లకుపైగానే..2025 మొదటి ఆరు నెలల్లో దేశంలోని 14 ప్రధాన నగరాల్లో నిర్వహించిన ‘అనరాక్ గృహ కొనుగోలుదారుల సెంటిమెంట్ సర్వే ప్రకారం’.. రూ.1.5 కోట్లకుపైగా విలువైన ఇంటిని కొనాలనుకుంటున్నవారు 22 శాతం. 2024 మొదటి 6 నెలల్లో ఇది 17 శాతమే. ముఖ్యంగా రూ.2.5 కోట్లకుపైగా బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమైనవారు 10 శాతం. రూ.90 లక్షలు – రూ.1.5 కోట్ల విలువైన ఇల్లు కొనాలనుకున్నవారు ఏకంగా 36 శాతం ఉన్నారు.దేశ వ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో.. దాదాపు 45 శాతం మంది 3 బెడ్రూమ్ హౌస్ల మీద ఆసక్తి చూపుతుంటే.. హైదరాబాద్లో ఇది 55 శాతం కావడం విశేషం. అహ్మదాబాద్ (60) తరవాత ఇదే అత్యధికం. -
అమ్మ స్ఫూర్తి..
‘మనలో శక్తి ఎంత ఉందో నడిచి వచ్చిన మన మార్గమే చూపుతుంది’ అంటారు డాక్టర్ సాయిలత. కర్ణాటకలోని హోస్పేట్లో డాక్టర్గా పని చేస్తున్న సాయిలత కర్నూలు వాసి. ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకుంటూ, ఆర్థిక స్థోమత లేక పోయినా పెద్ద కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో పట్టుదలతో కృషి చేసి డాక్టర్గా ఎదిగారు. సేవామార్గాన్నీ వదలకుండా అమ్మాయిల ఆరోగ్య జీవన విధానానికి, విద్యార్థులకు చెప్పాల్సిన విషయాల్లో బోధకురాలిగా తన జీవన ప్రయాణాన్ని మెరుగ్గా మలుచుకున్నారు. ఆ వివరాలు సాయిలత మాటల్లోనే...‘‘ఈ రోజు గైనకాలజిస్ట్గా సేవలందించే స్థాయికి రావడం అంత సులువుగా కాలేదు. నేను పుట్టి పెరిగింది కర్నూలులో. సింగిల్ మదర్గా మా అమ్మ నన్నూ చెల్లెలిని పోషించడానికి చాలా కష్టపడేది. రిసెప్షనిస్ట్గా, గోడౌన్ ఇన్చార్జిగా.... చిన్న చిన్న ప్రైవేట్ జాబులు చేస్తూ ఉండేది. అమ్మ కష్టం చూస్తుంటే చాలా బాధ అనిపించేది. కానీ, నాకేమో డాక్టర్ అవాలని కల. అమ్మ నా ఆలోచనను నిరుత్సాహపరచలేదు. ‘అభయం’తో...టెన్త్లో మంచి మార్కులు వచ్చాయి. మేం పెద్దవుతుంటే ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. కాలేజీ ఫీజులు కట్టే స్థోమత లేదు. ఇప్పుడెలా... అనుకుంటున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ‘అభయ’ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసింది. వాళ్లను కలిస్తే, ఫీజులకు సాయం చేశారు. ఆ తర్వాత ఎమ్సెట్ రాస్తే వచ్చిన ర్యాంకుకు రిజర్వేషన్లు లేక పోవడం వల్ల సీటు రాలేదు. దాంతో లాంగ్టర్మ్ కోచింగ్కి సాయం కోసం వెతుకుతుండగా ఈ విషయం తెలిసి, అభయ ఫౌండేషన్ వాళ్లే పిలిపించి మరీ లాంగ్ టర్మ్ కోచింగ్కు సాయం చేశారు. ఆ యేడాది మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. అనంతపూర్ మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఆ తర్వాత పీజీ కోర్సుకు ఏడాది కోచింగ్ తీసుకున్నాను. ఆలిండియా నీట్లో ర్యాంకు వచ్చింది. మహారాష్ట్ర అకోలా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశాను. స్కాలర్షిప్స్ వచ్చాయి. సంస్థ నుంచి సాయం అందింది. నా క్లాస్మేట్, పీడియాట్రిషియన్ డాక్టర్ తిరుమలేశ్తో నా పెళ్లి జరిగింది. మా అత్తగారిది కర్ణాటకలోని హోస్పేట్. దాంతో మేమిద్దరం కలిసి, అక్కడే క్లినిక్ నడుపుతున్నాం. పండక్కి హైదరాబాద్లో ఉంటున్న అమ్మ లక్ష్మి, చెల్లెలు ధరణిల వద్దకు వచ్చాను. మాకోసం ఎంతో కష్టపడిన అమ్మకు విశ్రాంతి కల్పించాను.సేవా మార్గం...ఉంటున్న చోటనే డాక్టర్గా వృత్తిని కొనసాగిస్తూ, గర్ల్ సేఫ్టీ గురించి అవగాహనా తరగతులు తీసుకుంటున్నాను. నెలసరి సమయంలో ఎలా ఉండాలి, రక్తహీనత, థైరాయిడ్, అధికబరువు, గర్భధారణ.. ఇలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు మహిళల్లో ఉండే ఆరోగ్య సమస్యలు, వాటి పైన సెషన్స్ చెబుతూనే ఆన్లైన్ ద్వారా స్టూడెంట్స్కు ఆరోగ్యం, పరిశుభ్రత, ఆహారం మొదలైన విషయాలపైనా గైడెన్స్ ఇస్తుంటాను. ప్రైమరీ, ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి, అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వివరిస్తుంటాను. ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంచుకోవాలి, అమ్మాయిల రక్షణకు సంబంధించిన విషయాలు నృత్య, నాటకాల ద్వారా చెబుతుంటాను ‘అభయ’ వల్ల నా జీవితానికి మార్గం ఏర్పడింది. అందుకు నా వంతుగా తిరిగి ఆ సంస్థకు ఉన్న 30 సెంటర్లలోని టీచర్లకు గైడెన్స్ ఇస్తుంటాను. హెల్త్ క్యాంపుల్లో ఉచిత సేవలు అందిస్తుంటాను.నాలుగు గోడల మధ్య ఏమీ తెలియని ప్రపంచం నుంచి బయల్దేరిన నాకు ఈ రోజు కొన్ని వందలమందికి అవగాహన కలిగించే స్థాయి లభించింది. ఈ ప్రయాణంలో అమ్మ కష్టం, అభయ అందించిన సాయం నన్ను నిలబెట్టాయి. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడంతో పాటు, వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలన్నది నా జీవన ప్రయాణం నేర్పిన పాఠం. శక్తి మనలో ఉందని గుర్తిస్తే ఎదగడానికి మద్దతు కూడా లభిస్తుంది. ప్రయాణంలో మనకు శక్తిగా నిలిచినవారికి తిరిగి మన శక్తిని అందించినప్పడు ఆ ఆనందం గొప్పగా ఉంటుంది’’ అని వివరించారు ఈ డాక్టర్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఆమె దాండియాకి ఇండియా నర్తిస్తుంది
దసరా నవరాత్రులు వస్తే దేశం తలిచే పేరు ఫాల్గుణి పాఠక్. ‘దాండియా క్వీన్ ఆఫ్ ఇండియా’గా పేరు గడించిన ఈ 56 సంవత్సరాల గాయని తన పాటలతో, నృత్యాలతో పండగ శోభను తీసుకువస్తుంది. 25 రూ పాయల పారితోషికంతో జీవితాన్ని ప్రారంభించి నేడు కోట్ల రూ పాయలను డిమాండ్ చేయగల స్థితికి చేరిన ఫాల్గుణి స్ఫూర్తి పై పండుగ కథనం.దేశంలో దసరా నవరాత్రులు జరుపుకుంటారు. కాని అమెరికాలో, దుబాయ్లో, గుజరాతీలు ఉండే అనేక దేశాల్లో వీలును బట్టి ప్రీ దసరా, పోస్ట్ దసరా వేడుకలు కూడా జరుపుకుంటారు. ఫాల్గుణి పాఠక్ వీలును బట్టి ఇవి ప్లాన్ అవుతాయి. ఆమె దసరా నవరాత్రుల్లో ఇండియాలో ఉంటే దసరా అయ్యాక కొన్ని దేశాల్లో దాండియా డాన్స్షోలు నిర్వహిస్తారు. లేదా దసరాకు ముందే కొన్ని దేశాల్లో డాన్స్ షోలు నిర్వహిస్తారు. ఆమె దసరాకు ముందు వచ్చినా, తర్వాత వచ్చినా కూడా ప్రేక్షకులకు ఇష్టమే. ఆమె పాటకు పాదం కలపడం కోసం అలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి డిమాంట్ ఉన్న గాయని ఫాల్గుణి పాఠక్ మాత్రమే.తండ్రిని ఎదిరించి...ఫాల్గుణి పాఠక్ది తన రెక్కలు తాను సాచగల ధైర్యం. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ కూతురుగా ముంబైలోని ఒక గుజరాతి కుటుంబంలో జన్మించింది ఫాల్గుణి. నలుగురు కూతుళ్ల తర్వాత ఐదవ సంతానమైనా అబ్బాయి పుడతాడని భావిస్తే ఫాల్గుణి పుట్టింది. అందుకే తల్లి, నలుగురు అక్కలు ఆమెకు ΄్యాంటు, షర్టు తొడిగి అబ్బాయిలా భావించి ముచ్చటపడేవారు. రాను రాను ఆ బట్టలే ఆమెకు కంఫర్ట్గా మారాయి. వయసు వచ్చే సమయంలో తల్లి హితవు చెప్పి, అమ్మాయిలా ఉండమని చెప్పినా ఫాల్గుణి మారలేదు. ఆ ఆహార్యం ఒక తిరుగుబాటైతే పాట కోసం తండ్రిని ఎదిరించడం మరో తిరుగుబాటు. తల్లి దగ్గరా, రేడియో వింటూ పాట నేర్చుకున్న ఫాల్గుణి పాఠక్ స్కూల్లో పాడుతూ ఎనిమిదో తరగతిలో ఉండగా మ్యూజిక్ టీచర్తో కలిసి ముంబైలోని వాయుసేన వేడుకలో పాడింది. ఆమె పాడిన పాట ‘ఖుర్బానీ’ సినిమాలోని ‘లైలా ఓ లైలా’. అది అందరినీ అలరించిందిగానీ ఇంటికి వచ్చాక తండ్రి చావబాదాడు.. పాటలేంటి అని. కాని అప్పటికే పాటలో ఉండే మజా ఆమె తలకు ఎక్కింది. ఆ తర్వాత తరచూ ప్రదర్శనలు ఇవ్వడం ఇంటికి వచ్చి తండ్రి చేత దెబ్బలు తినడం... చివరకు విసిగి తండ్రి వదిలేశాడుగాని ఫాల్గుణి మాత్రం పాట మానలేదు.త–థయ్యా బ్యాండ్తన ప్రదర్శనలతో పాపులర్ అయ్యాక సొంత బ్యాండ్ స్థాపించింది ఫాల్గుణి. దాని పేరు ‘త–థయ్యా’. ఆ బ్యాండ్తో దేశంలోని అన్నిచోట్లా నవరాత్రి షోస్ మొదలెట్టింది. నవరాత్రి ఉత్సవాల్లో దాండియా, గర్భా డాన్స్ చేసే ఆనవాయితీ ఉత్తరాదిలో ఉంది. ఫాల్గుణికి ముందు ప్రదర్శనలిచ్చేవారు కేవలం ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ను మాత్రమే వినిపిస్తూ డాన్స్ చేసేవారు. ఫాల్గుణి తనే దాండియా, గర్భా నృత్యాలకు వీలైన పాటలు పాడుతూ ప్రదర్శనకు హుషారు తేసాగింది. దాండియా సమయంలో ఎలాంటి పాటలు పాడాలో, జనంలో ఎలా జోష్ నింపాలో ఆమెకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకే ఆమె షోస్ అంటే జనం విరగబడేవారు. 2010లో మొదటిసారి నవరాత్రి సమయాల్లో ఆమె గుజరాత్ టూర్ చేసినప్పుడు ప్రతిరోజూ 60 వేల మంది గుజరాత్ నలుమూలల నుంచి ఆమె షోస్కు హాజరయ్యేవారు.ప్రయివేట్ ఆల్బమ్స్స్టేజ్ షోలతో పాపులర్ అయిన ఫాల్గుణి తొలిసారి 1998లో తెచ్చి ‘యాద్ పియాకీ ఆనె లగీ’... పేరుతో విడుదల చేసిన ప్రయివేట్ ఆల్బమ్ సంచలనం సృష్టించింది. ఊరు, వాడ ‘యాద్ పియాకీ ఆనె లగీ’ పాట మార్మోగి పోయింది. యువతరం హాట్ ఫేవరెట్గా మారింది. 1999లో విడుదల చేసిన ‘మైనె పాయల్ హై ఛన్కాయ్’... కూడా పెద్ద హిట్. ఈ అల్బమ్స్లో పాటలు కూడా ఆమె తన నవరాత్రుల షోస్లో పాడటం వల్ల ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది.రోజుకు 70 లక్షలు2013 సమయానికి ఫాల్గుణి పాఠక్ నవరాత్రి డిమాండ్ ఎంత పెరిగిందంటే రోజుకు 70 లక్షలు ఆఫర్ చేసే వరకూ వెళ్లింది. నవరాత్రుల మొత్తానికి 2కోట్ల ఆఫర్ కూడా ఇవ్వసాగారు. ఆశ్చర్యం ఏమిటంటే నవరాత్రుల్లో అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా, గర్భా నృత్యాలు చేస్తారు. కాని ఫాల్గుణి ఆ దుస్తులు ఏవీ ధరించదు. ΄్యాంట్ షర్ట్ మీదే ప్రదర్శనలు ఇస్తుంది. ‘ఒకసారి ఘాగ్రా చోళీ వేసుకొని షో చేశాను. జనం కింద నుంచి ఇలా వద్దు నీలాగే బాగుంటావు అని కేకలు వేశారు. ఇక మానేశాను’ అంటుందామె.వెలుగులు చిమ్మాలిఫాల్గుణి ప్రదర్శన అంటే స్టేజ్ మాత్రమే కాదు గ్రౌండ్ అంతా వెలుగులు చిమ్మాలి. గ్రౌండ్లోని ఆఖరు వ్యక్తి కూడా వెలుతురులో పరవశించి ఆడాలని భావిస్తుంది ఫాల్గుణి. ప్రతి నవరాత్రి ప్రదర్శన సమయంలో నిష్ఠను పాటించి పాడుతుందామె. ‘నేను ఇందుకోసమే పుట్టాను. నాకు ఇది మాత్రమే వచ్చు’ అంటుంది. ఆమెకు విమాన ప్రయాణం అంటే చాలా భయం. ‘విమానం ఎక్కినప్పటి నుంచి హనుమాన్ చాలీసా చదువుతూ కూచుంటాను. అస్సలు నిద్ర పోను’ అంటుందామె. హనుమాన్ చాలీసా ఇచ్చే ధైర్యంతో ప్రపంచంలోని అన్ని మూలలకు ఆమె ఎగురుతూ భారతీయ గాన, నృత్యాలకు ప్రచారం కల్పిస్తోంది. తండ్రితోనేఏ తండ్రైతే ఆమెను పాడవద్దన్నాడో ఆ తండ్రికి తనే ఆధారమైంది ఫాల్గుణి. ఆమెకు 15 ఏళ్ల వయసులోనే తల్లి హార్ట్ ఎటాక్తో మరణించడంతో కుటుంబ భారం తనే మోసి ఇద్దరు అక్కల పెళ్లిళ్లు తనే చేసింది. తండ్రిని చూసుకుంది. వివాహం చేసుకోవడానికి ఇష్టపడని ఫాల్గుణి ‘నేను నాలాగే హాయిగా ఉన్నాను’ అంటుంది. గత 25 ఏళ్లుగా 30 మంది సభ్యుల బృందం స్థిరంగా ఆమె వెంట ఉంది. ప్రతి ప్రదర్శనలో వీరు ఉంటారు. వీరే నా కుటుంబం అంటుందామె. -
హైడ్రా అద్భుతం.. 6 చెరువులకు విముక్తి!
ఆక్రమణలు, పూడికలతో కుంచించుకుపోయిన చెరువులకు పునరై్వభవం వస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) అధికారులు వాటిని రక్షించి పునరుజ్జీవం పోస్తున్నారు. దీంతో చెరువుల విస్తీర్ణం పెరిగింది. చెర వీడిన చెరువులు కళకళలాడుతున్నాయి. తొలిదశలో వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆరింటిని కబ్జాల బారి నుంచి రక్షించి అభివృద్ధి చేస్తున్నారు. జనావాసాలను మినహాయిస్తూ వీటిలోని మిగతా ఆక్రమణలు తొలగించగా విస్తీర్ణం ఏకంగా 75 ఎకరాల మేర పెరిగింది. ఇదే పంథాలో నగరంలో ఉన్న అన్ని చెరువులకు విముక్తి కల్పిస్తే వందల ఎకరాల జలవనరులుగా విస్తరిస్తాయని హైడ్రా అధికారులు చెప్తున్నారు. పునరుజ్జీవంతో అభివృద్ధి చేసిన బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి (Revanth Reddy) శుక్రవారం ప్రారంభించనున్నారు. – సాక్షి, సిటీబ్యూరోహైడ్రా (Hydraa) ఏర్పాటైన తర్వాత మాదాపూర్లోని తమ్మిడికుంటతోనే జలవనరుల పరిరక్షణ ప్రారంభమైంది. చుట్టూ ఉన్న అనేక నిర్మాణాలను కూల్చేసిన అధికారులు దాని పరిధిని పూర్వస్థితికి తేవడంపై దృష్టి పెట్టారు. ఇలా ఇప్పటి వరకు హైడ్రా అధికారులు వివిధ చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలో ఉన్న దాదాపు 233 ఎకరాల్లోని ఆక్రమణల్ని తొలగించారు. తొలినాళ్లల్లో కేవలం కూల్చివేతలపైనే దృష్టి పెట్టిన అధికారులు ‘హైడ్రా 2.0’విధానాలతో చెరువులకు పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఫైనల్ నోటిఫికేషన్ పూర్తి అయిన 130 చెరువుల్లోని ఆక్రమణల కూల్చివేతలతో సరిపెట్టకుండా వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్తి పర్యావరణ హితంగా అభివృద్ధి...ఈ చెరువుల్ని అభివృద్ధి చేసే విషయంలో హైడ్రా ఆద్యంతం పర్యావరణహిత విధానం అమలు చేయాలని విమోస్ సంస్థకు స్పష్టం చేసింది. దీంతో ఆ సంస్థ తొలుత ఆ చెరువుల నుంచి గరిష్టంగా మూడు మీటర్ల మేర పూడిక తొలగిస్తోంది. ఇందులో ప్లాస్టిక్ సహా అనేక వ్యర్థాలు ఉన్నాయి. చెరువు అడుగుభాగం అలుగు వైపునకు ఏటవాలుగా ఉండేలా చేస్తున్నారు. చెరువు చుట్టూ ఫుట్పాత్తోపాటు పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. చెరువులోకి మురుగునీరు ప్రవేశించకుండా నీటి వనరును మూడు భాగాలుగా విభజిస్తున్నారు. వరదతో కలిసి మురుగు తొలుత మొదటి భాగంలోకి చేరుతుంది. అక్కడ ఆ నీటిని వడగట్టే గడ్డి, మొక్కలు ఉంటాయి. ఇలా రెండు చోట్ల వడపోత తర్వాత మూడో కుంటలోకి చేరుతుంది. ప్రతి చెరువుకు ప్రత్యేక ఇన్లెట్, ఔట్లెట్ ఏర్పాటు చేస్తున్నారు.తొలిదశలోఆరు చెరువుల ఎంపిక... హైడ్రా తొలిదశలో ఆరు చెరువుల్ని ఎంపిక చేసుకుంది. తమ్మిడికుంటతోపాటు అంబర్పేటలోని బతుకమ్మకుంట, (Bathukamma Kunta) సున్నం చెరువు, ఉప్పల్ నల్లచెరువు, కూకట్పల్లి నల్లచెరువు, బమ్రుఖ్ నుద్దౌలా చెరువులపై దృష్టి పెట్టింది. వీటి అభివృద్ధికి ప్రభుత్వం రూ.58.4 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఒక్కో చెరువు కోసం దాదాపు రూ.10 కోట్ల చొప్పున వెచ్చిస్తున్న హైడ్రా బెంగళూరు నమూనాతో ముందుకు వెళ్తోంది. ఈ చెరువుల్లో పునరుజ్జీవం కల్పించే బాధ్యతల్ని ఆ నగరానికే చెందిన విమోస్ టెక్నాలజీస్ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ అక్కడ దాదాపు 130 చెరువులను అభివృద్ధి చేసింది. అక్కడ పర్యటించి వచ్చిన హైడ్రా అధికారులు వాటి పనితీరుపై పూర్తి సంతృప్తి చెందారు.ఎన్నారెస్సీ డేటా సాయంతో నిర్ధారణలు... హైడ్రా పరిధి ఔటర్ రింగ్ రోడ్(ఓఆర్ఆర్) వరకు విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీ విస్తరించి ఉన్న 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో 185 చెరువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 7,257 చదరపు కిలోమీటర్ల పరిధిలోని హెచ్ఎండీఏలో మొత్తం 58 వేల ఎకరాల్లో 2,912 చెరువులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ చెరువులు ఏడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఓ చెరువుకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను గుర్తించడానికి వివిధ మ్యాపులతోపాటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్నారెస్సీ) నుంచి తీసుకున్న డేటాను వినియోగిస్తున్నారు. ఏదైనా ఓ చెరువులోని ఆక్రమణలు తొలగించాలంటే దాని పరిధికి సంబంధించి ప్రిలిమినరీ, ఫైనల్ నోటిఫికేషన్లు జారీ కావాలి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి ఫైనల్ నోటిఫికేషన్లు పూర్తి కానున్నాయి. ఇప్పటికీ హెచ్ఎండీఏ (HMDA) పరిధిలో 962, జీహెచ్ఎంసీలో 130 చెరువులకు మాత్రమే తుది నోటిఫికేషన్ వెలువడింది. రెండో దశలో 14 చెరువులు.. తొలిదశలో ఆరు చెరువుల్ని ఎంపిక చేసుకున్నాం. వీటిలో బతుకమ్మకుంటను శుక్రవారం ముఖ్యమంత్రి ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ ఆరు చెరువుల విస్తీర్ణం తొలుత 105 ఎకరాల్లో ఉండగా అభివృద్ధి చేసిన తర్వాత అది 180 ఎకరాలకు చేరింది. మిగిలిన చెరువుల అభివృద్ధి, పునరుజ్జీవం డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రెండోదశలో మరో 14 చెరువులను అభివృద్ధి చేయనున్నాం. ఈ మేరకు ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపించాం. ఈ ఏడాది అక్టోబర్ నుంచి చెరువులకు సంబంధించిన ఫైనల్ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. – ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్సర్వాంగ సుందరంగా బతుకమ్మకుంట ఫొటోలు.. ఇక్కడ క్లిక్ చేయండి -
అమ్మాయిల ఆశలపై 'నీళ్లు'
కొత్త హెచ్–1బీ వీసా దరఖాస్తులపై ఒకేసారి లక్ష డాలర్ల రుసుము విధిస్తున్న అమెరికా ప్రభుత్వ తాజా నిర్ణయం భారతీయ యువ మహిళా ఔత్సాహికుల ను దెబ్బతీసే అవకాశం ఉంది. నిజానికి హెచ్–1బీ వీసా అందుకుంటున్న భారతీయుల్లో అత్యధికులు పురుషులే. 2023–24లో తమ ఉద్యోగాలను కొనసాగించడానికి (రెన్యువల్) ఆమోదం పొందిన నిపుణుల్లో 74% మంది పురుషులు, 26% మంది మహిళలు ఉన్నారు. హెచ్–1బీ కొత్త దరఖాస్తులకు (ప్రారంభ ఉపాధికి) ఆమోదం లభించిన నిపుణుల్లో మహిళల వాటా 37%. కొత్త ‘వన్ టైమ్ రుసుము’ ప్రభావంతో నూతన దరఖాస్తుదారులు.. ముఖ్యంగా, పురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు ఉండే మహిళల అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఉద్యోగుల లేదా కార్మికుల వార్షిక జీతంలో అధిక భాగం లేదా అంతకు మించి కొత్త హెచ్–1 బీ వీసా ఫీజు ఉంది. అందువల్ల, ప్రారంభ ఉపాధి లబ్ధిదారులను స్పాన్సర్ చేయడం కంపెనీలకు ఆర్థికంగా లాభదాయకం కాకపోవచ్చు.ఈ అంశం హెచ్–1బీ వీసాలు ఆశిస్తున్న ఔత్సాహికుల భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఉదాహరణకు ఒక కంపెనీ కొత్త లబ్ధిదారునికి నూతన వీసా ఫీజు ప్రకారం స్పాన్సర్ చేస్తే.. మొదటి సంవత్సరంలో మొత్తం ఖర్చు.. రెన్యువల్ కోరుకునే అనుభవజ్ఞుడైన ఉద్యోగికి అయ్యే వ్యయం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రభావం ముఖ్యంగా మహిళా లబ్ధిదారులపై ఉంటుందన్నది నిపుణుల మాట. ఎందుకంటే వారు సాధారణంగా హెచ్–1బీ హోల్డర్లలో పురుషుల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. – సాక్షి, స్పెషల్ డెస్క్విద్యార్హతలు ఉన్నప్పటికీ..అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల విభాగం గణాంకాల ప్రకారం.. 2023–24లో హెచ్–1బీ ద్వారా కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 35 సంవత్సరాల కంటే తక్కువ వయసు గలవారు 75% మంది ఉన్నారు. పురుషుల విషయంలో ఇది 65%గా ఉంది. దీని అర్థం.. కెరీర్ను ప్రారంభించే వయసులో ఉన్న మహిళల్లో ఎక్కువ మందిని హెచ్–1బీ వీసా కొత్త ఫీజు ప్రభావితం చేయనుందని పరిశీలకులు అంటున్నారు. 2023–24లో కొత్త ఉద్యోగాలకు ఆమోదం పొందిన మహిళల్లో 44% మంది మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. పురుషుల విషయంలో ఇది కేవలం 39% మాత్రమే. డాక్టరేట్, ప్రొఫెషనల్ డిగ్రీ స్థాయిల్లో సైతం మహిళలదే ఆధిపత్యం. కొత్త రుసుము నూతన దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి పురుషులతో పోలిస్తే ఉన్నత విద్యార్హతలు ఉన్నప్పటికీ ఇది మహిళలపై ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.2023-24లో హెచ్-1బీ దరఖాస్తుల ఆమోదంప్రారంభ ఉపాధి దరఖాస్తుపురుషులు 63%మహిళలు 37%రెన్యువల్ దరఖాస్తుపురుషులు 74%మహిళలు 26% -
స్టాక్ మార్కెట్లే ఇప్పుడు దిక్కు
అమెరికా నుంచి ప్రతికూలతలు ఎదురవుతున్నా... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నా... భారత మార్కెట్లు అంతకంతకూ పెరుగుతుండటానికి కారణం దేశీ ఇన్వెస్టర్లకు మార్కెట్లపై ఉన్న నమ్మకమేనని, కొన్నేళ్లుగా వారు కళ్లజూస్తున్న లాభాలే వారిని ఇన్వెస్ట్మెంట్కు ప్రేరేపిస్తున్నాయని ఎడిల్వీజ్ ఏఎంసీ ఎండీ– సీఈఓ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు. వినూత్న ఉత్పత్తులతో ఎడిల్వీజ్ను దేశవ్యాప్తంగా విస్తరించి... దేశంలోని అగ్రశ్రేణి మ్యూచువల్ఫండ్ కంపెనీల్లో ఒకటిగా మార్చిన రాధికా గుప్తా... నిరంజన్ అవస్థితో కలిసి ‘మ్యాంగో మిలియనీర్’ అనే పర్సనల్ ఫైనాన్స్ పుస్తకాన్ని రాశారు. దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటూ ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడారు. వచ్చే ఐదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ 200 లక్షల కోట్లకు చేరుతుందంటున్న రాధికాతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ ఇది...(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) → అంతర్జాతీయంగా ఇబ్బందులెదురవుతున్నా భారత మార్కెట్లు కొత్త శిఖరాలను చేరుకోవటానికి కారణం? యువత ఆకాంక్షలు పెరుగుతున్నాయి. మరోవంక ఇన్వెస్ట్మెంట్కు మరీ ఎక్కువ ప్రత్యామ్నాయాలేవీ లేవు. ఎందుకంటే బ్యాంకు డిపాజిట్లు చేశారనుకుందాం. పన్నులు పోతే మిగిలేది తక్కువే. పెరుగుతున్న జీవన ప్రమాణాలకిది సరిపోదు. అందుకని సహజంగానే జనం ఈక్విటీ మార్కెట్ల వైపు చూస్తున్నారు. నేను ఎంఎఫ్ పరిశ్రమలో అడుగుపెట్టినపుడు ‘సిప్’ ద్వారా వచ్చే మొత్తం 4 వేల కోట్లుగా ఉండేది. ఇపుడది 28వేల కోట్లకు చేరింది. ఇందులో అత్యధిక భాగం దీర్ఘకాలికం. అదే ఇక్కడ కీలకం. ప్రత్యేకించి గడిచిన రెండేళ్లుగా మార్కెట్లోకి వస్తున్న కొత్త ఇన్వెస్టర్లకు మంచి లాభాలొస్తున్నాయి. → అయితే ఈ ర్యాలీ చల్లారిపోయేది కాదని, బుడగలేవీ లేవని అంటున్నారా? స్మాల్క్యాప్ కంపెనీలు... కొన్ని థీమ్స్..., కొన్ని కంపెనీల రూపంలో ఈ బబుల్స్ ఉండొచ్చు. పాలపై నురుగు ఓ 20 శాతం తప్పదు. ఏ బుల్ ర్యాలీకైనా ఇది వర్తిస్తుంది. దానర్థం మొత్తం మార్కెట్ ఇలానే ఉందని కాదుకదా? పునాదులు గట్టిగా ఉన్నాయన్నదే నా పాయింట్. → మరి ఇలాంటి సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లకు మీరేం చెబుతారు? అన్నిటికన్నా ముఖ్యం... అతిగా ఆశించకపోవటం. నా పుస్తకంలో కూడా అదే చెప్పాను. చాలామంది ఇన్వెస్టర్లు గత సంవత్సరాన్ని బేరీజు వేసుకుంటూ 30–40 శాతం రాబడి వస్తుందనే అంచనాలతో ఉన్నారు. అది సరికాదు. రెండోది... హైబ్రిడ్ ఫండ్లు, మల్టీ అసెట్ ఫండ్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ల వంటి మధ్యస్త ఆదాయాన్నిచ్చే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇవి మరీ సంప్రదాయకంగా కాకుండా... మరీ దూకుడుగా కాకుండా మధ్యస్తంగా ఇన్వెస్ట్చేస్తాయి. స్థిరంగా నిలకడైన రాబడులనిస్తాయి. సంపద సృష్టించాలంటే అలానే సాధ్యం. → డిఫెన్స్ థీమ్, ప్రభుత్వ బ్యాంకుల థీమ్ అంటూ రకరకాల స్టోరీలను ఈ మధ్య చూస్తున్నాం. చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు వీటిని నమ్ముతున్నారు కదా? నిజమే!. రిటైలర్లు ఇలాంటి స్టోరీల వెంటనే పరిగెడతారు. చివరకు దురదృష్టకరంగా ఎగ్జిట్ అవుతారు. నేనైతే ఈ థీమ్లను నమ్మను. ఏ ఒక్క రంగం వల్లనో దేశం ముందుకెళ్లదు. హోటల్స్, హాస్పిటల్స్, డేటా సెంటర్స్, క్యాపిటల్ మార్కెట్స్, టెక్నాలజీ.. ఇలాంటి రంగాలన్నీ దేశాభివృద్ధితో ముడిపడి ముందుకెళతాయి. → మార్కెట్లో ఏ ఒక్క రంగమైనా మరీ అతిగా పెరిగినట్లు భావిస్తున్నారా? అలాగని చెప్పలేం. అయితే కొన్ని అన్లిస్టెడ్ కంపెనీలు, ఎస్ఎంఈ ఐపీవోల విషయంలో మాత్రం ఆందోళన ఉంది. లిస్టింగ్లోనే లాభాలొస్తాయి కదా అని చాలామంది రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీ పూర్వాపరాలేవీ పట్టించుకోకుండా అన్లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పేరు చెప్పలేను కానీ... ఈ మధ్య ఒక ఐపీవోలో దెబ్బతిన్నారు. కొన్ని ఎస్ఎంఈ కంపెనీలూ అంతే. వీటిలో పెద్ద లిక్విడిటీ ఉండదు. పరిస్థితులు అనుకూలించకపోతే ఇరుక్కుపోయే ప్రమాదమే ఎక్కువ. అందుకే నేనెప్పుడూ రిటైల్ ఇన్వెస్టర్లను ఇండెక్స్ ఫండ్లలో గానీ, ఏవైనా ఇతర మ్యూచువల్ ఫండ్లలో గానీ పెట్టుబడి పెట్టమని చెబుతాను. → కానీ కొన్ని కంపెనీలు ఏడాదిలో 50 శాతం... రెండుమూడు రెట్లు పెరగటం చూస్తున్నారు కదా? ఇవి రిటైలర్లను ఆకర్షిస్తాయి కదా? ఇలా పెరిగిన రెండుమూడు గురించే అంతా చెబుతారు. కానీ కుదేలైన షేర్ల గురించి చెప్పరు. స్టాక్ మార్కెట్లో లాభాలు ఆర్జించిన వారిని తప్ప నష్టపోయిన వారి స్టోరీలు బయటకు రావు. ఇలా ఒక షేర్లో పెట్టి లాభపడ్డ వారు కూడా మిగిలిన షేర్లలో రాబడి గురించి చెప్పరు. ఆ షేర్ను ఎంచుకోవటం వెనక వారి శ్రమ, సమయం కూడా ఉంటాయి కదా? ఏడాదికి 10–12 శాతం రాబడినిచ్చే మ్యూచువల్ ఫండ్లు బోరింగ్గా అనిపించవచ్చు. కానీ ఆ రాబడి స్థిరంగా ఉంటుంది. సురక్షితం కూడా. → చిన్న పట్టణాల్లో ఇన్వెస్ట్మెంట్ సంస్కృతి పెరుగుతోందా? చాలా. ఎడిల్వీజ్ను 5 నగరాల్లో ఆరంభించాం. ఇపుడు 60 పట్టణాల్లో ఉన్నాం. త్వరలో 200 పట్టణాలకు విస్తరిస్తాం. స్థానిక భాషల్లో ఆర్థిక పాఠాల లభ్యత.. వారికి సలహాదారులు, డిస్ట్రిబ్యూటర్లు అందుబాటులో ఉండటమన్నదే ప్రధానం. → పాసివ్ (ఇండెక్స్) ఫండ్లకు ఆదరణ పెరుగుతోంది కదా.. మరి యాక్టివ్ ఫండ్లకు వీటితో పోటీ ఉంటుందా? అలాంటిదేమీ లేదు. చాలామంది ఇన్వెస్టర్లు రెండింట్లోనూ పెట్టుబడి పెడుతున్నారు. బాగా రాబడులనిచి్చన యాక్టివ్ ఫండ్లలోకి పెట్టుబడులొస్తాయి. లేదంటే పాసివ్ ఫండ్లలోకి వెళతాయి. రెండూ పెరుగుతున్నాయనేది మనం గమనించాలి. → ఇపుడు చాలామంది ఇన్వెస్టర్లు అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎడిల్వీజ్ ప్రణాళికలేంటి? టెక్నాలజీ, చైనా సహా కొన్ని గ్లోబల్ ఫండ్లను మేం నడిపిస్తున్నాం. కాకుంటే వీటికి ఆర్బీఐ పరిమితులున్నాయి. వీటిని గిఫ్ట్ సిటీ ద్వారా అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే గిఫ్ట్సిటీలో కార్యాలయాన్ని ఆరంభించాం. → ఐదు పదేళ్లలో ఎంఎఫ్ పరిశ్రమ ఎలా ఉండొచ్చు? 2030 నాటికి ఇది 200 లక్షల కోట్లకు చేరుతుందన్నది నా అంచనా. దీన్లో 130–140 లక్షల కోట్లు ఈక్విటీలోనే ఉంటాయి. సిప్ పెట్టుబడులు నెలకు రూ. లక్ష కోట్లను చేరుతాయి. దేశంలో 30–40 శాతం మంది మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటమే వికసిత భారత్కు అర్థమన్నది నా భావన.→ యువత చాలామంది ఎఫ్ అండ్ ఓ ట్రేడింగ్ చేస్తున్నారు. మీరేమంటారు? అదో దుర్మార్గం. ఎఫ్ అండ్ ఓ అనేది సంస్థలు రిస్్కను తగ్గించుకోవటానికి ఉపయోగించుకోవాల్సిన సాధనం. అంతేతప్ప అప్పులు తెచ్చి ట్రేడింగ్ చేసే యువత కోసం కాదు. విద్యార్థులు, చిన్నచిన్న వర్కర్లు, డ్రైవర్లు రుణాలు తీసుకుని ట్రేడింగ్ చేస్తున్న వ్యవహారాన్ని నేనూ విన్నా. ఇది గ్యాంబ్లింగ్. ప్రమాదకరం. రిటైల్ ఇన్వెస్టర్లు సిప్, మ్యూచువల్ ఫండ్ల ద్వారా తేలిగ్గా సంపద సృష్టించుకోవచ్చు. గ్యాంబ్లింగ్ అవసరం లేదు. → భారత్ బాండ్ ఫండ్ మాదిరి ఎడిల్వీజ్ నుంచి కొత్త ఉత్పత్తులేమైనా వస్తున్నాయా? అక్టోబర్ 1న మేం దేశంలో మొట్టమొదటి హైబ్రిడ్ స్పెషల్ ఇన్వెస్ట్మెండ్ ఫండ్ను (ఎస్ఐఎఫ్) ఆరంభించబోతున్నాం. సెబీ ఇటీవలే దీనికి అనుమతిచి్చంది. దీన్లో కనీస పెట్టుబడి సైజు రూ.10 లక్షలు. దీన్లో రిస్క్ తక్కువ ఉంటుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. -
వస్త్రం.. వ్యర్థం కారాదు
మనదేశంలో దుస్తుల వినియోగంతోపాటు.. వ్యర్థాలూ పెరిగిపోయాయి. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్టీఈపీ) నివేదిక ప్రకారం.. ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషిస్తున్న వస్త్ర పరిశ్రమ కాలుష్యకారక పరిశ్రమల్లోనూ ఒకటిగానూ ఎదిగింది! ఏటా ప్రపంచ వ్యాప్తంగా 9.2 కోట్ల టన్నుల టెక్స్టైల్ వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వీటిలో కేవలం 12–15 శాతం మాత్రమే రీసైక్లింగ్కు వెళ్తున్నాయి. వాటిలో కూడా ఒక శాతమే కొత్త దుస్తులుగా రీసైకిల్ అవుతున్నాయి. మనదేశంలోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.ఓ 15–20 ఏళ్ల కిందటి మాట...ఒక కుటుంబం సంక్రాంతి లేదా దసరాకి కొత్త బట్టలు కొనేవారు లేదా కుట్టించుకునేవారు. మళ్లీ కొత్త బట్టలు అంటే పుట్టినరోజుకే. వాటిని కూడా ఎంతో అపురూపంగా వాడేవారు. కానీ ఇప్పుడు...ప్రతి పండుగకూ షాపింగ్. వారాంతాల్లో షాపింగ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి బిగ్ సేల్ పెడితే షాపింగ్. బోరు కొడితే షాపింగ్. ఫాస్ట్ ఫ్యాషన్, అల్ట్రా ఫాస్ట్ ఫ్యాషన్ వంటి ధోరణుల వల్ల.. తక్కువ ధరలో లేటెస్ట్ ఫ్యాషన్లు, వాటి నకళ్లు ఉన్న దుస్తులు మార్కెట్లోకి వెల్లువెత్తుతున్నాయి. సహజంగానే ఇవి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. సమస్య కొనడంతోకాదు.. ఎక్కువగా కొనడం, ఎక్కువ కాలం వాటిని వాడకపోవడం వల్ల వస్తోంది!వస్త్ర వ్యర్థాలుసెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ పాలసీ (సీఎస్టీఈపీ) అధ్యయనం ప్రకారం.. దేశంలో పొడి మునిసిపల్ ఘన వ్యర్థాల్లో ప్లాస్టిక్, నిర్మాణ వ్యర్థాల తరవాత మూడో స్థానాన్ని ఆక్రమించింది టెక్స్టైల్ రంగమే. ఏటా దీని ద్వారా ఉత్పత్తవుతున్న వ్యర్థాలు సుమారు 7,800 కిలో టన్నులు.⇒ ప్రపంచ కర్బన ఉద్గారాల్లో ఫ్యాషన్ ఉత్పత్తుల వాటా దాదాపు 10 శాతం. యూరోపియన్ యూనియన్ మొత్తం ఉద్గారాల కంటే ఇది ఎక్కువ.⇒ మనదేశంలో సగటున ఒక వ్యక్తి వల్ల ఏటా 5 కిలోల వస్త్ర వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి.కాటన్ టీషర్టు.. జీన్స్ ప్యాంటుఒక కాటన్ టీ షర్ట్ మన ఒంటిమీదకు రావాలంటే.. సుమారు 2,700 లీటర్ల నీరు ఖర్చవుతుంది. అంటే సగటు మనిషి సుమారు 90 సార్లు స్నానం చేయొచ్చన్నమాట. ఒక జీన్స్ ప్యాంట్ తయారీకి 7,600 లీటర్ల నీళ్లు కావాలి.4.5 కోట్ల మందిదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నవారు సుమారు 4.5 కోట్లమంది. పరోక్షంగా మరో 10 కోట్లకు పైగా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. జీడీపీలో ఈ రంగ వాటా 2.3 శాతం.వినిమయం తర్వాతే ఎక్కువఫ్యాషన్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు పనిచేసే ‘ఫ్యాషన్ ఫర్ గుడ్’ 2022 నివేదిక ప్రకారం.. టెక్స్టైల్ వ్యర్థాలు 3 రకాలు.⇒ తయారీ సమయంలో వచ్చేది 42%⇒ వినిమయం తరవాత వచ్చేది 51%⇒ దిగుమతులు7%రీసైక్లింగ్ తక్కువేప్రస్తుతం మనదేశంలోని టెక్స్టైల్ వ్యర్థాల్లో 59 శాతం పునర్వినియోగం, రీసైక్లింగ్ వంటి ప్రక్రియల ద్వారా మళ్లీ పరిశ్రమకు చేరుతున్నాయి. ఇందులో 34 శాతాన్ని మరమ్మతులు చేసి, కొత్త ఉత్పత్తులుగా మారుస్తున్నారు. కేవలం 25 శాతమే దారాలుగా రీసైకిల్ అవుతోంది. మిగతా 41 శాతంలో.. 5 శాతాన్ని ఇటుక బట్టీలు, బాయిలర్లలో కాల్చేందుకు వినియోగిస్తున్నారు. 17 శాతం వ్యర్థాల్లో చేరుతోంది. 19 శాతం.. తక్కువ విలువ, నాణ్యత గల వస్తువులుగా రూపాంతరం చెందుతోంది.‘మ్యాన్ మేడ్’ ప్రమాదకరంటెక్స్టైల్ ఫైబర్లు రెండు రకాలు. ఒకటి.. సిల్కు, కాటన్ వంటి సహజ ఫైబర్లు, రెండోది పాలిస్టర్, నైలాన్ వంటి మ్యాన్ మేడ్ ఫైబర్లు (ఎమ్ఎమ్ఎఫ్). ఇంటర్నేషనల్ కాటన్ అడ్వైజరీ కమిటీ (ఐసీఏసీ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100లో 72 పాళ్లు ఎమ్ఎమ్ఎఫ్లే. వీటి ఉత్పత్తిలో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మన్నిక; మరకలు, ముడతలు పడకుండా ఉండటం, తయారీ వేగంగా, తక్కువ ధరతో చేయడం వంటి కారణాల వల్ల సింథటిక్ ఫైబర్ల వాడకం పెరుగుతోంది. కానీ ఇవి పర్యావరణానికి మంచివి కావు. మైక్రోప్లాస్టిక్స్ను విడుదల చేస్తాయి. దుస్తుల తయారీలో డైయింగ్ ప్రక్రియ, రంగురంగుల దుస్తుల నుంచి వచ్చే రసాయనాలు.. కాలుష్యానికి కారణమవుతాయి.ఏం చేయొచ్చు⇒ దుస్తులు కొనేటప్పుడు.. ముఖ్యంగా పండుగ సీజన్లో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఎక్కువ కొనేసి తక్కువసార్లు వాడేసి పారేయకండి.⇒ పాతవీ, చిరిగిపోయిన దుస్తులతో పాత సామాన్లు కొనొచ్చు. లేదంటే ఇంట్లోని పనివాళ్లకు లేదా చుట్టుపక్కల పేదలకు లేదా వాటిని సేకరించే ఎన్జీఓలకు ఇవ్వొచ్చు.⇒ వాడేసిన, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు, టీషర్టులతో ఇంట్లోకి బొమ్మల్లాంటి రకరకాల అలంకరణ వస్తువులు తయారుచేయవచ్చు.⇒ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఇలాంటి విభిన్న డిజైన్లకు సంబంధించి బోలెడన్ని వీడియోలు ఉంటాయి. వాటిని చూసి సరికొత్త వస్తువులు రూపొందించవచ్చు.⇒ చెప్పాలంటే.. ఇలా విభిన్నంగా వాడకాన్ని చెప్పేవి కూడా సరికొత్త వ్యాపార ఆలోచనలే. వీటితోనూ డబ్బు సంపాదించవచ్చు. -
వీక్షణల కోసం.. వేలంవెర్రి
రీల్స్ చేస్తున్నవాళ్లు, రీల్స్ చూస్తున్నవాళ్లు.. సమాజంలో ఉన్నది ఇప్పుడు ఈ రెండే వర్గాలు అన్నంతగా సోషల్ మీడియా మార్చేసింది. ఉన్నవారు–లేనివారు.. స్త్రీలు–పురుషులు.. రాత్రి–పగలు.. ఇంట–బయట.. ఇవేవీలేవు, ప్రతి ఒక్కరూ రీల్స్కి అతుక్కుపోతున్నారు. వాళ్లు అలా అతుక్కుపోయేలా కంటెంట్ క్రియేటర్లు రీల్స్ చేసి సోషల్ మీడియాలోకి వదిలిపెడుతున్నారు. అయితే ఎంతోమందికి ఆనందాన్నిస్తున్న రీల్సే.. ఆ రీల్స్ చేస్తున్న వ్యక్తులు ముఖ్యంగా మహిళల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. పరువు కోసం కుటుంబ సభ్యులే వారి ఉసురు తీసేందుకు ప్రేరేపిస్తున్నాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్నిక్కీ భాటీ.. గ్రేటర్ నోయిడాకు చెందిన 26 ఏళ్ల ఈమెను ఇటీవల ఆమె భర్త, అత్తమామలు చిత్రహింసలు పెట్టి నిప్పంటించటంతో మరణించింది. మొదట దీన్ని వరకట్న హత్య అని పోలీసులు భావించారు. అయితే నిక్కీ రీల్స్ చేయటంపై అభ్యంతరం తెలిపిన ఆమె మెట్టినింటివారు.. ఆమె తమ మాట వినకపోవటంతో ఆమెపై తీవ్రంగా దాడి చేసి, నిప్పంటించారని తర్వాత వెల్లడించారు!వద్దని చెప్పినందుకు.. నిక్కీ మరణానికి కొన్ని నెలల ముందు ఇలాంటి ఘటనే హరియాణాని గురుగావ్లో జరిగింది. 25 ఏళ్ల రాధిక యాదవ్ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక సోషల్ మీడియా రీల్స్ చేయడంపై ఆయన తీవ్రంగా కలత చెందారని, ఆ మనోవ్యథ ఆగ్రహంగా మారి కూతుర్ని చంపేశాడని వార్తలు వచ్చాయి. ఇక ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఒక మహిళ తను రీల్స్ చేయటానికి అడ్డు చెప్పినందుకు భర్తపై కత్తితో దాడి చేసింది. ఆ రీల్స్ రెచ్చగొట్టేలా ఉంటున్నాయని ఆ భర్త మనో వేదన. దేశమంతా ఇదే గొడవదేశంలోని చాలాచోట్ల కొందరు చేస్తున్న రీల్స్, షార్ట్స్ కుటుంబాలలో అశాంతికి, ఆవేదనకు, ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. లైక్లు, కామెంట్లు, వాటి ద్వారా వచ్చే పేరు, డబ్బు కోసం కొందరు అశ్లీలత, అసభ్యత నిండిన కంటెంట్తో వీక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఎలా ఉన్నా, భారతీయ సమాజం మాత్రం ఈ రీళ్ల సుడిగాలిని తట్టుకోలేక సతమతం అవుతోంది. పల్లెల నుంచి మహా నగరాలకు వలస వచ్చిన వారు అక్కడి వెలుగు జిలుగుల నవ నాగరికతలకు ఎలాగైతే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతారో.. కంటెంట్ క్రియేటర్ల జీవితాల్లోకి రీల్స్, షార్ట్స్ అంతటి థ్రిల్ తెచ్చిపెట్టాయి. వీక్షకులు చూస్తున్నకొద్దీ వారు ఇంకా ఇంకా చూసేలా కంటెంట్ మోతాదును పెంచుకుంటూ పోతున్నారు.‘మిస్టేకెన్ మోడర్నిటీ’?!తాత్కాలికమైన ఆనందంతో చురుకు పుట్టించే ‘డోపమైన్–బూస్టింగ్’ కంటెంట్ను ఆస్వాదించటంలో వీక్షకులు, అలాంటి కంటెంట్ను సృష్టించటంలో కంటెంట్ క్రియేటర్లు.. అదే లోకంగా ఉండటంతో సమాజంలో ప్రమాదకరమైన ఘర్షణలకు ఆజ్యం పోసినట్లవుతోంది! కంటెంట్ క్రియేటర్లలో కనిపించే ఈ దూకుడును ‘మిస్టేకెన్ మోడర్నిటీ’ (ఆధునికతను వేరేలా అర్థం చేసుకోవటం) అని సామాజిక నిపుణులు అంటున్నారుఉపయోగపడేవీ ఉన్నాయిరీల్స్, షార్ట్స్.. అసభ్యత లేనంతవరకూ ఎవరికీ ఇబ్బంది కావు. అశ్లీలత కానంతవరకూ ఎవరికీ హాని చేయవు. ఒక వర్గాన్ని, మతాన్ని, ఒకరి శరీరాన్ని, వైకల్యాన్ని వెక్కిరిస్తూ, వెకిలిచేష్టలతో చేసే వీడియోలు సమాజానికి ప్రమాదకరం. యువతను పెడదారిపట్టించే కంటెంట్ ఉన్న షార్ట్స్.. ఏ జనరేషన్కీ మంచివికావు. మరి, ఉపయోగపడే రీల్స్, షార్ట్స్ లేవా అంటే ఎందుకు లేవూ, చాలా ఉన్నాయి. సరదాగా, నవ్వించేవి.. విజ్ఞానాన్ని పంచేవి.. సరికొత్త విషయాలు తెలియజేసేవి.. వంటలవీ, ఆధ్యాత్మికతవీ.. ఇలాంటి ఎన్నో సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి.వీక్షకులే తిరస్కరించాలిలైకుల కోసం, ఆర్థిక ప్రయోజనం కోసం కంటెంట్ క్రియేటర్లు అశ్లీలమైన, అసభ్యకరమైన రీల్స్కి అడ్డుకట్ట వేసేదెలా? చాలా సింపుల్ అంటున్నారు మానసిక నిపుణులు. ‘అలాంటి కంటెంట్ను ఆదరించకపోవటం లేదా వారిని బ్లాక్ చేయడం ద్వారా వారికి అడ్డుకట్ట వేయవచ్చు. ఇలాంటి వీడియోలు చేయడం ఒక మానసిక సమస్య కూడా కావచ్చు’ అంటున్నారు మానసిక నిపుణులు.రీల్సే లోకం!» ఫేస్బుక్ మాతృసంస్థ ‘మెటా’, గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఇప్సోస్’ సంయుక్తంగా దేశవ్యాప్తంగా 33 పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.» షార్ట్స్, రీల్స్ భారతీయుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి.» ముఖ్యంగా దేశంలో అత్యధికులు చూసే షార్ట్ ఫామ్ వీడియో ఫార్మాట్గా రీల్స్ అవతరించాయి.» 97 శాతం మంది రోజులో కనీసం ఒక్కసారైనా తక్కువ నిడివిగల వీడియోలు చూస్తున్నారు. ఇందులో సింహభాగం రీల్సే.» ఈ ట్రెండ్ జెన్ జెడ్ యూజర్లలో ఎక్కువగా ఉంది.వీటిని చూడటం ఎంటర్టైన్మెంట్ స్థాయిని దాటి.. దైనందిన కార్యకలాపంలా మారిపోయింది. -
మీరు ఆట్రోవర్టా?
అంతర్ముఖత్వం.. బహిర్ముఖత్వం.. ఈ రెండూ ఉండే ఉభయముఖత్వం.. మొత్తం ఈ మూడింటి గురించీ, ఈ తరహా వ్యక్తుల గురించీ అందరూ వినే ఉంటారు. సమాజంలో ఉండే వాళ్లంతా ఈ మూడు కేటగిరీల్లో ఏదో ఒక దాన్లో ఉంటారు అని అందరూ అనుకుంటారు. కానీ, కాదట. కొత్త తరహా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారట. ఈ వ్యక్తులకు ‘ఆట్రోవర్ట్’ అనే పేరును ఖరారు చేశారు అమెరికాకు చెందిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ వంటి మేధావులు ఈ కోవకు చెందుతారట. – సాక్షి, స్పెషల్ డెస్క్లండన్కు చెందిన ప్రసిద్ధ సైన్స్ మ్యాగజైన్ ‘న్యూ సైంటిస్ట్’లో ప్రముఖ సైకియాట్రిస్ట్ రామి కమిన్స్కి ‘ఆట్రోవర్ట్’ గురించి ప్రస్తావించారు. అంతేకాదు, దీనిపై ఏకంగా ‘ద గిఫ్ట్ ఆఫ్ నాట్ బిలాంగింగ్’ అనే పుస్తకమే రాశారు. ‘మనలో కొంతమంది అంతర్ముఖులు ఉంటే, మరికొందరు బహిర్ముఖత్వంతో ఉంటారు. ఈ రెండు వ్యక్తిత్వ లక్షణాలూ ఉన్నవాళ్లూ ఉంటారు. కానీ, ఆట్రోవర్ట్లు అలా కాదు, వీరు చాలా ప్రత్యేకం’ అంటారు కమిన్స్కి.భావోద్వేగాల నియంత్రణఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరుల మీద ఆధారపడరు. తమ సమస్యను నలుగురిలో పెట్టరు. అలాగని ఒక్కళ్లూ కూర్చుని మథనమూ చేయరు. వ్యక్తిగతంగా తాము నమ్మినవాళ్లతో లోతుగా చర్చించి విశ్లేషణ చేయడానికి, సమస్య పరిష్కారానికి ఎక్కువగా ఆలోచిస్తుంటారు.ఈ మూడూ తెలిసినవేఇంట్రావర్టులు లేదా అంతర్ముఖులు.. నలుగురితో కలవడానికి ఇష్టపడరు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలాసేపు ఆలోచిస్తారు. బయటి వ్యక్తుల నుంచి ప్రేరణ పొందరు. తమకు తామే ప్రేరణ. ఎక్స్ట్రావర్టులు లేదా బహిర్ముఖులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. నలుగురితో కలివిడిగా ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారు. త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. యాంబివర్ట్ లేదా ఉభయముఖత్వం ఉన్నవాళ్లు. ఈ రెండు లక్షణాలూ కలిసి ఉంటాయి. కొన్నిసార్లు ఒంటరితనాన్ని, మరికొన్నిసార్లు నలుగురితో కలవడాన్ని ఇష్టపడతారు.భిన్నమైన ఆలోచనా విధానం‘నలుగురికీ నచ్చినది.. నాకసలే ఇక నచ్చదులే’ అనే టైపు ఈ ఆట్రోవర్ట్లు. వీరు నలుగురూ ఆలోచించే పద్ధతికి భిన్నంగా, స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఏంటి తేడా?యాంబివర్ట్కీ ఆట్రోవర్ట్కీ ఏంటి తేడా అని చాలామందికి అనిపించవచ్చు. చాలా తేడా ఉంది. సమయం, సందర్భాన్ని బట్టి యాంబివర్ట్లు అంతర్ముఖులుగానో, బహిర్ముఖులుగానో ప్రవర్తిస్తుంటారు. కొన్నిసార్లు నలుగురితో కలిసినప్పుడు చురుగ్గా ఉంటే.. కొన్నిసార్లు ఎవ్వరూ లేకపోయినా ఉత్సాహంగా పనిచేసుకుపోతారు. కానీ ఆట్రోవర్ట్లు అలాకాదు. సమయం, సందర్భం బట్టి మారిపోయే వ్యక్తిత్వం కాదు వీళ్లది.సామాజిక సంబంధాలువీళ్లు పార్టీల వంటి వేడుకలకు హాజరవుతారు. కానీ, అందరి దగ్గరకూ వెళ్లిపోరు. వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అంత వేగంగా కలిసిపోరు. వ్యక్తులను అంచనావేసి, కొద్దిమందితోనే మాట్లాడతారు.» ఏదో ఒక సమూహానికి చెందిన వ్యక్తులుగా ముద్ర వేయించుకోవడానికంటే వ్యక్తిగత సంబంధాలు, పనితీరును ఇష్టపడతారు.» వ్యక్తులతో సంభాషణల్లో పాలుపంచుకోవడానికంటే వాటిని పరిశీలించడానికి ఆసక్తి చూపుతారు.» సమూహంలో ఉంటేనే మెదడు యాక్టివ్గా పనిచేయడం, శక్తిని పొందడం ఉండదు.నాయకత్వ లక్షణాలుస్థిరత్వం, ధైర్యానికి వీరు ప్రతీకలు. ఎలాంటి దెబ్బ తగిలినా లేదా సమస్య వచ్చి కిందపడినా తమంతట తామే తొందరగా పైకి లేవగలరు.» వీళ్ల దృష్టిలో నాయకత్వం అంటే అజమాయిషీ కాదు. ఎదుటివాళ్లు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఎదుటివారి పరిస్థితినీ అర్థం చేసుకుంటారు.బలమైన,నమ్మకమైన బంధాలుప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్, రచయిత్రి వర్జీనియా ఉల్ఫ్ వంటి వాళ్లు ఈ ఆట్రోవర్ట్ వ్యక్తిత్వం ఉన్నవాళ్లు. వీళ్లు స్వతంత్ర భావాలతో ఉంటారు. సృజనాత్మకత వీరి సొంతం. సంప్రదాయ ధోరణిలో పోరు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలరు. నా దగ్గరకు వచ్చే వారిలో ఇంట్రావర్ట్లు, ఎక్స్ట్రావర్ట్లు, యాంబివర్ట్లు.. ఈ మూడు రకాల వ్యక్తిత్వాలూ కానివారిని నేను గమనించాను. వీళ్ల దృష్టిలో ఎక్కువమందితో సంబంధాలు ముఖ్యం కాదు. ఉన్నవి కొన్నయినా.. అవి బలంగా, నమ్మకంగా ఉండేలా చూసుకుంటారు. సామాజిక సంబంధాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఎలాంటి పరిస్థితులనైనా ఇట్టే ఆకళింపు చేసుకుంటారు. తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడమే కాదు, ఎదుటివారి భావోద్వేగాలనూ అర్థం చేసుకోవడం వీరి ప్రత్యేకత. – రామి కమిన్స్కి, సైకియాట్రిస్ట్ -
వంద పూలై విరిసే జ్ఞాపకాలు!
జ్ఞాపకాలు గతం ఇనప్పెట్టెలో భద్రంగా ఉంటాయి. దాని మూత తీయాలని అనుకున్నప్పటి నుండి మానసిక వైబ్రేషన్కు గురవుతాం. చిన్ననాటి స్మృతులు ముసురుకుంటాయి. సాధారణంగా పదేళ్ళ వరకు బాల్యదశ ఉంటుంది. ఈ స్లాట్ మనిషికి స్వర్ణయుగం. ప్రతిక్షణం కుటుంబంలో, సమాజంలో, వీధిలో, ఊరిలో, బడిలో, పక్కింట్లో ప్రతిచోట ప్రతి అనుభవం గుండె గోడలమీద బొమ్మ కడుతుంది. నలుపు తెలుపు రంగుల్లో సినిమా రీల్లాగా గర్గర్ మని ఒక్కో సంఘటన మనసు తెర మీద కదలాడుతుంది.ఒక పండగని జ్ఞాపకం అయితే మరింత సంబరం. పూలదొంతర అల్లాలంటే ఒళ్ళంతా పులకరింతే. గత పరిమళాల జల్లుల్లో తడిసి ముద్దవడమే. బతుకమ్మ పండుగ రంగుల హరివిల్లుల్ని తెంపి వెన్నెల్లో ఆరేసి, వర్షంలో తడిసిన మట్టి సుగంధాలలో నానబెట్టి, కొత్త రంగురంగుల కాంతి తరంగాలని వాటికి పట్టించి నూటొక్క మొగ్గల్ని, పూలని, ఆకుల్ని తొడిగిన పూగుత్తుల్ని పేర్చాలంటే అంత సులభం కాదు. ఇలాంటప్పుడే గత అవిస్మృత ఖజానా విలువ తెలుస్తుంది. పూలను పరిరక్షించే ఇనప్పెట్టె తయారు కానందుకు బాధ. పుప్పొడిలా రాలిన కనబడని కన్నీటి తుంపరల్ని ఎలా, ఎక్కడని దాచగలం.మాది ఊరు కాని ఊరు. పట్టణంలో ఒదిగి ఉన్న ఊరు. వరంగల్ జిల్లాలోని హనుమకొండ. మా ఇంటి చుట్టూరా అనేకానేక చిన్నా పెద్దా ప్రాచీన గుళ్ళు, చారిత్రక ప్రదేశాలు. ఇంటికి కాస్త దూరంలో మూడు పెద్ద గుట్టల మధ్య పద్మాక్షి గుడి. గుడి కింద నీటి గుండం. అందులో బంగారు జింక ఆకర్షణలా తామరాకులు, పూలు! గుట్టల మీద సీతా ఫలాలే కాదు, ఎన్నో రకాల పూలు, గునుగు పూలు, తంగేడు, గన్నేరు పూలు... ఎన్నెన్నో.మా ఇంట్లో నాకన్నా చిన్నది చెల్లెలు. ఇంటిపక్కన పాటకుల ఇంట్లో ఓ చిట్టెమ్మ. ఇంటి పక్కల చుట్టాలు, పరిచయస్తుల ఇళ్ళల్లో ఆడపిల్లలు. వీళ్లు బొడ్డెమ్మ ఆడేవాళ్లు.భాద్రపదం ప్రకృతి పచ్చదనానికి గర్భ శిశువు. ఈ మాసం ప్రకృతి పరవశించే నిండు చూలాలు. బొడ్డెమ్మ వస్తుందంటేనే పూలవేట షురువయ్యేది. ఆడపిల్లల్ని బొడ్డి అంటారు. బొడ్డి అంటే చిన్నది అని అర్థం. ఈ ఆడపిల్లలు ఆడే బొడ్డెమ్మ ఒక ప్రత్యేక పండగ. ఎవరి ఇంట్లోనూ పదిమంది ఆడే ఆట స్థలం ఉండేది కాదు. గుడిలోనో, ఏదో ఓక బహిరంగ ప్రదేశంలోనో వాళ్ళు వెదురుతో చేసిన చిన్న చిన్న సిబ్బుల్లో పూలు పట్టుకుని అక్కడికి చేరేవారు. అక్కడ కుమ్మరాయన మట్టితో బొడ్డెమ్మ గద్దె తయారు చేసేవాడు. కిందివైపు పెద్దగా పైవైపు చిన్న ఆకారంతో మట్టితో చతురస్రాకారంతో గద్దె కట్టేవాడు. దానికి నాలుగు దిక్కులా ప్రమిదలు పెట్టేవాడు. దానిలో రోజుకొక్కరు 9 రోజులు 9 ఇళ్ళలోంచి నూనె తెచ్చేవారు. దాని చుట్టూ రోజూ కొత్తగా ముగ్గులు వేసేవారు.ఈ పనంతా బాలికలే చేసేవారు. ఊరి వడ్రంగి కర్రతో బొడ్డెమ్మ గద్దె చేసి ఇచ్చేవాడు. దానికి పసుపు, తెలుపు రంగులు వేసేవారు. దానిమీద కూడా ప్రమిదలు ఉండేవి. మధ్యలో పిల్ల బతుకమ్మని చెక్కేవాడు. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని డెబ్బై ఐదేళ్ల తర్వాత అలాంటి కర్ర బొడ్డెమ్మ వస్తువుని ఆద్యకళ మ్యూజియం కోసం సేకరించాను. మగపిల్లల టీం మహాలయ అమావాస్య నాడు ప్రారంభమయ్యే బతుకమ్మ కోసం సంచులు పట్టుకుని పూలవేటకు వెళ్ళేవారం. గునుగు పూలు తెచ్చి రకరకాల రంగులద్దేవాళ్ళం. తంగేడు పూలు, ఆకులు, కొమ్మలతో తెంపేవాళ్ళం. ఇంటికి వచ్చి పూలను వేరు చేసేవాళ్ళం. జలాశయాల్లోంచి తెచ్చిన తామర ఆకుల్ని సిబ్బుల కింద ఉంచేవాళ్ళు. కొంతమంది ఎర్రని తామరపూవుని పైన అలంకరించేవాళ్ళు. పై భాగాన పసుపు ముద్ద పెట్టి గౌరమ్మ తల్లిగా సంభావించేవారు. మరికొందరు గుమ్మడి ఆకుల్ని సిబ్బులో పరిచి బతుకమ్మ పైన గుమ్మడిపూవుని ఉంచేవారు. పూవు మధ్య భాగం కేసరాలు ఉండేచోట పసుపు రంగు ఉండేది. దాన్నే గౌరమ్మగా భావించేవారు. మేం ఇంత కష్టపడితే మాకు దక్కేది ఆట పాటల తర్వాత అక్కలు, అమ్మలు పెట్టే ప్రసాదం. రోజుకో తీరొక్క ప్రసాదం. ఇంటికోరకం ప్రసాదం తెచ్చి అన్నీ ఒక్కో గంపలో వేసి వాళ్లు తిని మాకు పెట్టేవారు. ఆ రుచే వేరు. తలుచుకుంటేనే నోరూరుతుంది. బొడ్డెమ్మ, బతుకమ్మలను తలకెక్కించుకునే సందర్భంలో ఆకులతో చేసిన పీకలు ఊదేవాళ్ళం. మరికొందరి దగ్గర కర్రతో చేసిన గొట్టం ఉండేది. ఎండిన గింజల్నో, కాగితం తుంచి దాన్ని నమిలి చేసిన ముద్దనో కర్ర బర్మారులో పెట్టి బాగా ఊదేవాళ్లం. అది పిస్తోలు పేల్చినట్లు శబ్దం అయ్యేది. ఎవరి శబ్దం పెద్దగా ఉంటే వారిపై ప్రశంసల పూల జల్లు పడేది. అలా తొమ్మిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగేది. ఆరో రోజు అరెం. అంటే ఆరోజు బతుకమ్మ పేర్చరు. సెలవుదినం. ఆట ఉండదు. మాకు కూడా కాస్త తీరిక దొరికేది. కాకపోతే బతుకమ్మ ప్రసాదం దొరికేది కాదు. పండుగ తొమ్మిది రోజులు చాలా ఇండ్లల్లో శాకాహారమే ఉండేది. కొత్త ధాన్యంతో, పప్పులతో తయారు చేసిన రుచి ఈనాటికీ గుర్తు చేసుకుంటే నోరూరుతుంది. బతుకమ్మ తొమ్మిది రోజులు ఆట పాటలతో గడిచేది. అక్కలు, చెల్లెల్లు, కోడళ్ళు, మరదళ్లతో సందడిగా గడిపిన క్షణాలు ఈ తరాలకు దక్కని మహోత్కృష్ట గడియలు.బతుకమ్మలనే కాదు ఇంటిని, ఇంటి పరిసరాల్ని శుభ్రపరిచి అలంకరించేవారు. ఇళ్ళు ముందు భాగం ముగ్గులు రంగులతో మెరిసిపోయేవి. వివిధ రకాల పూలు ఒక్కచోట ఉంచడం వల్ల చక్కని సువాసనలతో ఆ ప్రదేశం ఎంతో బాగుండేది. బతుకమ్మలపై కొందరు అగరుబత్తీలు పెట్టేవారు. చాలా కాలం దాచిపెట్టి పండుగ రోజున కట్టుకునే పీతాంబరం, పాత చీరల ప్రత్యేక వాసన ఇంకా పీల్చుతున్నట్లే ఉంటుంది. రోజూ అలికిన తాజా వాసన సైతం పండగ ప్రత్యేకతని చెప్పకనే చెప్పేది.బాలికల గుంపు చిన్న మగపిల్లగాళ్ల గుంపు, యువతుల గుంపు, తల్లుల గుంపు, అమ్మమ్మ నానమ్మల గుంపు ఇలా ఎవరి గుంపు వారిదే. ఎవరి స్నేహితులతో వారు కలిసిమెలసి ఉండేవారు. హాస్యం వందపూలై పూసేది. సామెతలతో సంభాషణ నవరసాలతో ఆకట్టుకునేది. వరసలను బట్టి హాస్యం, చతురోక్తులు ఉండేవి. ఇది పండుగ సంబరాన్ని మరింత పెంచేది. ఊరు ఊరంతా గాన ప్రవాహంలో ఈదేది. చెరువు గట్టో, నీటి గుండాల పక్కనో వాళ్ల నృత్యంతో భూమి పులకరించేది. సంధ్యాసమయంలో ప్రకృతిని చూసి మా ఒడలు పులకరించేది. నాడు బతుకమ్మ ప్రకృతి పండుగ. నా జ్ఞాపకాలలో ఆనాటి ప్రాకృతిక సౌందర్యం చూడడం కోసం ఊరూ, వాడా, అడవీ, పల్లె తిరుగుతూనే ఉన్నాను. ఏదో తెలియని శూన్యం. నా జీవితకాలం అంతా పద్మాక్షి గుట్ట కింద నీటి గుండంలోని తామర పూవుల సువాసన ఇంకా వెన్నాడుతోంది. కొండమీది గోగుపూలు రమ్మని చేతులు చాస్తున్నాయి. పండిన సీతాఫలాల సువాసన, రుచి, బతుకమ్మ ప్రసాదాలు తిన్నాక చాలా గంటల వరకు చేతికంటిన కమ్మని సువాసన కోసం మళ్లీ బతుకమ్మ పండుగ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపు! స్త్రీలు పాడే పాటలు చెవుల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. బతుకమ్మ పేర్పులోని నేర్పు ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ళ కళాత్మక భావనల్నిచూసి వారిపై ఎనలేని ప్రేమ, గౌరవం కలిగేది. ఊరు ఊరంతా ఒక్కటై చేసుకునే పండుగ పట్ల గౌరవం ఇనుమడించేది. పండుగ కాలంలో స్త్రీలు మిగతా వాళ్ళని గౌరవంగా చూసేవాళ్ళు. అందరూ సమానమే. ఎందుకంటే అందరూ సుమంగళులే. అంటే గర్భం ధరించి పిల్లల్ని కనగలిగే అర్హత ఉన్నవాళ్ళే. వాళ్లే బతుకమ్మ ఆడాలి. వాయనాలు పెట్టుకోవాలి.– జయధీర్ తిరుమలరావు -
టూర్కు ముందే.. ఓ టూర్ వేయండి!
ఆ ప్రదేశం గురించి లోతుగా తెలుసుకోండిఆచార వ్యవహారాలపై అవగాహన తప్పనిసరి తీర్థయాత్రలు, అడ్వెంచర్ టూరిజంలో కీలకంప్రయాణం తీపి జ్ఞాపకాలు అందించేలా జాగ్రత్తలున్యూయార్క్ సిటీ, ప్యారిస్, కశ్మీర్, ఆగ్రా.. ప్లేస్ ఏదైనా ట్రిప్కు వెళ్లే ముందు ఆ ప్రదేశంలోని వింతలు, విశేషాల గురించి తెలుసుకుంటాం. వీడియోలు చూస్తాం. అక్కడి భద్రత, సంస్కృతి, రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయో కూడా కచ్చితంగా అవగాహన తెచ్చుకోవాలి. ఇందుకోసం వెబ్సైట్లలో వీడియోలు చూడటం.. కావాల్సిన వారితో ఫోన్లో మాట్లాడటం ద్వారా ‘టూర్కి ముందే ఓ టూర్’ వేయాల్సిందే. తద్వారా టూర్ని పక్కాగా ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఫలితంగా జీవితాంతం గుర్తుండిపోయే ఒక టూర్.. మీ జ్ఞాపకాల బీరువాలో చేరుతుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్సెలవులు వస్తున్నాయంటే చాలు.. టూర్లు ప్లాన్ చేస్తుంటాం. మనం ఏ ప్రదేశానికి టూర్కి వెళ్లాలి అనుకుంటున్నామో అక్కడి ప్రసిద్ధ ఆకర్షణలు, చారిత్రక ప్రదేశాలు, సహజ అద్భుతాల గురించి నెట్లోనూ, అక్కడికి అప్పటికే వెళ్లి వచ్చిన వారి దగ్గరా ఆరాలు తీస్తాం. అయితే మనం వెళ్లాల్సిన చోట భద్రతా పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటిని మాత్రం తెలుసుకోం. సముద్రం, నదులు, జలపాతాలు, లోయలు, కొండ ప్రాంతాలకు వెళ్లడానికి యువత ఆసక్తి చూపుతారు. కానీ, అక్కడ పొంచి ఉండే ప్రమాదాల గురించి మాత్రం ఆరా తీయరు.ఆచారాలు తెలిస్తే..పర్యాటక ప్రాంత స్థానిక సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు, కళలు, ఆహారపుటలవాట్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. తద్వారా వాటికి విభిన్నంగా లేదా వ్యతిరేకంగా మనం నడుచుకోకుండా.. అక్కడి ప్రజలను గౌరవించి, వారి మన్ననలు పొందవచ్చు. సామాజిక మర్యాదలు, దుస్తుల నియమావళి, మతపరమైన లేదా సాంస్కృతిక ప్రదేశాలలో ఎలా ప్రవర్తించాలో ముందే అవగాహన పెంచుకోవాలి. ఉదాహరణకు కొన్ని ఆలయాల్లోకి ప్రవేశించే ముందు.. కొన్ని రకాల దుస్తులు ధరించాలి. అలాగే, అక్కడ గుడిలో సమర్పించే ప్రసాదాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. తీర్థయాత్రలుతీర్థయాత్రలకు ‘టూర్కి ముందే టూర్’ అత్యంత కీలకం. ఉదాహరణకు శ్రీశైలం వెళ్లేవారు ముందుగా, తప్పనిసరిగా సాక్షి గణపతి దర్శనం చేసుకోవాలి. ఇది మనందరికీ తెలిసిందే. కానీ, ఇతర రాష్ట్రాల్లోనూ, నేపాల్ వంటి దేశాల్లోనూ ఇలాంటి నిబంధనలు చాలా ఉంటాయి. వాటిని ముందుగా తెలుసుకుంటే.. ‘అయ్యో, ముందు తెలుసుకోలేకపోయామే’ అని బాధపడాల్సిన అవసరం ఉండదు. అలాగే చార్ధామ్ యాత్ర వంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఆక్సిజన్ స్థాయులు తక్కువగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా మనం సంసిద్ధం ఎలా కావాలో ముందే చూసి, తెలుసుకోవాలి. వైల్డ్ లైఫ్, ఎకో టూరిజంప్రకృతి సంపదకు నిలయమైన ప్రాంతాలకు; అడవులు, జాతీయ పార్కులకు వెళ్లేటప్పుడు అక్కడి వాతావరణాన్ని మనం పాడుచేయకుండా ఉండటం చాలా ప్రధానం. మనవల్ల పర్యావరణ కాలుష్యం, అక్కడి సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతినకుండా నడుచుకోవాలంటే.. ‘టూర్కి ముందే టూర్’ చాలా అవసరం. అడ్వెంచర్ టూరిజంట్రెక్కింగ్, స్కీయింగ్, వైట్వాటర్ రాఫ్టింగ్ వంటివి చేసేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందే తెలుసుకోవాలి. అవి ఎలా చేస్తారో, అందులో వాడే వస్తువుల గురించీ కూడా ముందే చూసి తెలుసుకోవాలి. పర్యటనకు ముందు నుంచే మానసికంగా, శారీరంగా దృఢంగా ఉండటం అవసరం. దుస్తుల నుంచి అవసరమైన మందుల వరకు ప్రతి విషయంలోనూ పూర్తి సంసిద్ధంగా ఉండాలి. అదనపు జాగ్రత్తలువ్యాపారులు, స్థానికుల నుంచి తలెత్తే మోసాలు, గమ్యస్థానానికి సంబంధించిన ఏవైనా నిర్దిష్ట భద్రతా సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఉదాహరణకు అధిక నేరాల రేటు ఉన్న ప్రదేశానికి ప్రయాణిస్తుంటే.. రాత్రిపూట సంబంధిత ప్రాంతాలకు వెళ్లకపోవడం, విలువైన వస్తువుల గురించి మరింత అప్రమత్తంగా ఉండటం వంటి అదనపు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇందుకోసం ట్రావెల్ బ్లాగ్స్, టూరిజం, ప్రభుత్వ వెబ్సైట్లను పరిశీలించాలి. స్నేహితులు, బంధువుల నుంచీ సమాచారాన్ని సేకరించాలి. వీటిలో ముఖ్యం» తీర్థయాత్రలు » అడ్వెంచర్ టూరిజం » ఎకో టూరిజం » క్రూయిజ్ టూరిజం » వైల్డ్లైఫ్ టూరిజం » రూరల్ టూరిజం -
స్టూడెంట్స్ మీకోసం 'ఏఐ టూల్స్'!
కృత్రిమ మేధ (ఏఐ).. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే సాంకేతికత. ఇది ఉద్యోగులకే కాదు.. అన్ని తరగతుల విద్యార్థులకు కూడా గొప్ప ఆయుధంగా అవతరించింది. వివిధ అంశాలను నేర్చుకునే విషయంలో సౌలభ్యమేకాదు.. క్రమశిక్షణా అలవాట్లను ఏర్పరచుకోవడం, సమయ పాలనా నిర్వహణ, సృజనాత్మకతను పెంపొందించుకోవడం వంటి ఎన్నో అంశాల్లో ఏఐ సాధనాలు విద్యార్థులకు దోహదపడుతున్నాయి. చాట్జీపీటీ, జెమినైతోపాటు అత్యంత ఉపయోగకరమైన ఏఐ టూల్స్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్సమయ పాలనరీక్లెయిమ్.ఏఐ: క్యాలెండర్ను ఆటోమేటిక్గా నిర్వహించే షెడ్యూలింగ్ సాధనం. అసైన్మెంట్స్ను ఎప్పుడు సవరించాలి, రాయాలో మాన్యువల్గా ప్లాన్ చేయడానికి బదులుగా.. విద్యార్థి ప్రస్తుత తరగతులు, క్రీడలు, అభిరుచులు, వ్యక్తిగత కార్యక్రమాలను స్కాన్ చేసి, అందుబాటులో ఉన్న ఖాళీ సమయంలో అధ్యయన సెషన్్సను నిర్ణయిస్తుంది. నోషన్ ఏఐ: నోట్స్, టాస్క్లు, ప్రాజెక్ట్లు, విజ్ఞానాన్ని ఒకే చోటకు తీసుకొస్తుంది. డాక్యుమెంట్లలో ఉన్న సమాచారాన్ని క్యాప్చర్ చేయడానికి, వాటిని సారాంశాలుగా మార్చడానికి, అసైన్మెంట్స్ను ట్రాక్ చేయడానికి, సమాచారాన్ని శోధించడానికి , నవీకరణకు సులభంగా అర్థమయ్యేలా స్టడీ డాష్బోర్డ్ను ఉంచడంలో సహాయపడుతుంది. పరిశోధన, రచనలుపర్ప్లెక్సిటీ.ఏఐ: విశ్వసనీయమైన వేదికలు (సోర్సులు), సంక్షిప్త సూచనలతో.. మన ప్రశ్నలకు సమాధానమిచ్చే పరిశోధన ఇంజిన్. గూగుల్లో స్క్రోల్ చేయడానికి బదులుగా వ్యాసాలు, నివేదికలు, ప్రాజెక్ట్లలో ఉదహరించగల ప్రత్యక్ష, విశ్వసనీయ విషయాలను నేరుగా పొందవచ్చు. నోట్బుక్ ఎల్ఎమ్ (గూగుల్): క్లాస్ నోట్స్, పాఠ్యపుస్తకాలు, పీడీఎఫ్లను అప్లోడ్ చేసి ఈ మెటీరియల్కు సంబంధించిన ప్రశ్నలను అడగవచ్చు. విద్యార్థులు ఇచ్చే సిలబస్ను ఆధారం చేసుకుని శిక్షణ పొందిన ట్యూటర్ పాత్రనూ పోషిస్తుంది. అధ్యయనం– అభ్యాసంక్విజ్లెట్: నోట్స్ను సంక్షిప్త సమాచార ఫ్లాష్కార్డ్స్, ప్రాక్టీస్ పరీక్షలు, స్టడీ గేమ్స్గా మారుస్తుంది. విద్యార్థులు మెటీరియల్ను ఎంత బాగా గుర్తుంచుకుంటున్నారో దానికి అనుగుణంగా తనను తాను మార్చుకుంటుంది. తద్వారా పాఠాలు తిరిగి చదవడం ఒక పనిలాగా, ఆసక్తి లేని విషయంగా కాకుండా ఆసక్తికరంగా మారుతుంది.వూల్ఫ్రమ్ ఆల్ఫా: ఇది కేవలం కాలిక్యులేటర్ మాత్రమే కాదు.. సమాధానాలను గణిస్తుంది. ఫంక్షన్్సను గ్రాఫ్ చేస్తుంది. దశలవారీ గణిత, సైన్్స పరిష్కారాల ద్వారా ముందుకు నడిపిస్తుంది. చేసిన పనిని ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, భావనలను మరింత లోతుగా అన్వేషించడానికి ఉపయోగపడుతుంది.ఆటర్.ఏఐ (ఓటీటీఈఆర్): ఆడియో, వీడియోల కంటెంట్ను టెక్ట్స్గా మార్చే ట్రాన్స్క్రిప్షన్ సాధనం. ఉపన్యాసాలు, సమావేశాలు, గ్రూప్ డిస్కషన్్సను రికార్డ్ చేసి వాటిని సర్చ్ చేయదగిన టెక్ట్స్గా మారుస్తుంది. నోట్స్ రాసే వ్యక్తిగత సహాయకుడిగా ఉంటుంది.కంటెంట్ సృష్టి – ప్రజెంటేషన్కాన్వా: డ్రాగ్–అండ్–డ్రాప్ టెంప్లేట్స్తో పోస్టర్లు, స్లైడ్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, వీడియోలను సులభంగా రూపొందించవచ్చు. ఇతర ఏఐ సాధనాలు కేవలం టెక్ట్స్ వివరణ నుంచి ప్రారంభ స్థాయి డిజైన్్సను మాత్రమే రూపొందించగలవు. కానీ ఇది లే–అవుట్, స్టైలింగ్ను వేగవంతం చేస్తుంది. కిండర్గార్టెన్ నుంచి ఇంటర్ వరకు అందరి విద్యార్థులకూ ఉపయోగపడుతుంది.గామా.యాప్: ప్రాంప్ట్ల నుంచి పూర్తి స్లైడ్ డెక్లు, సులభంగా అర్థమయ్యేలా ఒక పేజీలో డాక్యుమెంట్, సాధారణ సైట్స్ను కూడా రూపొందిస్తుంది. వాటికి తుదిమెరుగులు దిద్ది పీపీటీ, గూగుల్ స్లైడ్స్, పీడీఎఫ్లోకి మార్చడానికి వీలు కల్పిస్తుంది. కస్టమైజబుల్ ఏఐ సాధనాలుజెమినై జెమ్స్: సొంత, తేలికైన ఏఐ సాధనాలను సృష్టించడానికి అనుమతిస్తుంది. కథనాలను సంక్షిప్తంగా రూపొందించడం, కేస్ స్టడీస్ విశ్లేషణ, అధ్యయన అంశాలను తయారు చేయడం వంటి నిర్దిష్ట పనులు చేసిపెడుతుంది.చాట్జీపీటీ స్టడీ మోడ్: చాట్జీపీటీ కేవలం ప్రశ్నోత్తరాలకే పరిమితమైన సాధనం కాదు. స్టడీ మోడ్ సాయంతో ప్రాజెక్ట్స్, వ్యక్తిగత, ప్రత్యేక జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్్డ ట్రాన్్సఫార్మర్స్తో (జీపీటీ) విద్యార్థులకు నిర్మాణాత్మక అధ్యయన సహాయకుడిగా కూడా సాయపడుతుంది. -
పానీపూరీ కోసం మన జెన్ జెడ్ ఆందోళనలు!
జెన్ జెడ్.. నేపాల్ ఉద్యమం తర్వాత ఎక్కువగా వార్తల్లో కనిపించిన పదం. ఇదొక తరం. 1997 నుంచి 2012 మధ్య జన్మించినవాళ్లు ఈ తరం కిందకు వస్తారు. జెడ్ జనరేషన్వాళ్లను జూమర్లు (Zoomers), డిజిటల్ నేటివ్స్(Digital Natives) అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్, సోషల్ మీడియా వంటి డిజిటల్ టెక్నాలజీతో పెరిగిన మొదటి తరం ఇదే. అయితే.. టెక్నాలజీతో మమేకమైన ఈ తరం.. సామాజిక చైతన్యం, సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం.. వ్యక్తిత్వం విషయంలో ఎంతో మెరుగ్గానే ఉండేదే. కానీ, రాను రాను పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. సోషల్ మీడియాకు బానిసలవ్వడం, మానసిక ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించకపోవడంతో భారత్లో జెడ్ జెనరేషన్ పరిస్థితి దారుణంగా తయారవుతోందట. ఎంతలా అంటే.. గుజరాత్ వడోదరలో తాజాగా ఓ యువతి పానీపూరీ కోసం సత్యాగ్రహం చేపట్టింది. రూ.20 చెల్లించిన ఆమె ప్లేట్కు 6 పానీపూరీలు రావాల్సి ఉండగా.. ఆ పానీపూరి భయ్యా 4 ఇవ్వడంతో హర్టయ్యింది. నా రెండు పానీ పూరీలు నా కావాల్సిందేనని రోడ్డుపై బైఠాయించింది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పోలీసులు బతిమాలి చివరకు ఆమెతో ధర్నా విరమింపజేశారు. ఈ క్రమంలో.. ఈ ఘటనపై సోషల్ మీడియాలో జోకులు పేలాయి. పానీపూరీ ప్రొటెస్టర్ అంటూ అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. ‘‘జెన్ జెడ్ తరం.. చిన్న విషయాన్ని కూడా పెద్ద ఉద్యమంగా మార్చగలదు. చుట్టు పక్కల దేశాల్లో అది వేరే పోరాటం.. మన దేశంలో పానీపూరీ కోసం ఆరాటం. ఆమెది న్యాయమైన డీల్!’’ అంటూ వెటకారమూ ప్రదర్శించారు. కానీ, పానీపూరి కోసం వెక్కి వెక్కి ఏడ్చిన ఆమె మానసిక ఆరోగ్యం గురించి చర్చించేవాళ్లే కరువయ్యారు. న్యాయం కోసం పోరాటం చిన్నదైనా పెద్దదైనా ముఖ్యం అని అనేవాళ్లు కనిపించలేదు.A woman went to have panipuri but was served 4 instead of 6 for ₹20.She objected, sat down on the road in protest, and even broke into tears.The twist? Kudos to Vadodara Police for stepping in and resolving this pani-filled crisis swiftly!pic.twitter.com/37DYZAOMkd— Kumar Manish (@kumarmanish9) September 19, 2025ఆమె జెన్ జెడ్ తరానికి చెందినదే. తీవ్ర మానసిక ఒత్తిళ్లకు గురైందని కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులు చెప్పినట్లుగా అక్కడి లోకల్ మీడియా కథనాలు ఇచ్చింది. ఆ మానసిక స్థితిని ఆధారంగా చేసుకుని ఆమె కొట్టిందంటూ ఆ పానీపూరీ బండివాడు పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశాడు కూడా. కానీ, ఆమె ఈ స్థితికి కారణం.. తీవ్ర పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్తో నిద్రకు దూరం కావడం!. భారత్లో జెన్జీ ఆందోళనలు చేయడం మాట అటుండి.. జెన్జీ గురించే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ తాజాగా ఓ సర్వే వివరాలను వెల్లడించింది. సెప్టెంబర్ 2025 ఎడిషన్లో జెన్ జీ గురించి ఓ ఆందోళనకరమైన అంశాలను పంచుకుంది. ఈ తరం ఇప్పుడు నిద్రలేమితో తీవ్రంగా బాధపడుతోందట. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడి, సోషల్ మీడియా వినియోగం, డూమ్ స్క్రోలింగ్ (Doomscrolling) లాంటి అలవాట్లు నిద్రను దూరం చేస్తున్నాయట. డూమ్ స్క్రోలింగ్ అంటే.. నిరంతరంగా నెగటివ్ వార్తలు, భయానక సమాచారం, ఆందోళన కలిగించే కంటెంట్ను ఆన్లైన్లో చదవడం, ఆపకుండా రీల్స్, పోస్టుల రూపంలో ఫోన్లో స్క్రోల్ చేసి చూడడం అన్నమాట. ఇప్పుడున్న జెడ్ జనరేషన్లో 70 శాతం.. ఉద్యోగం గురించి, ఇళ్ల అద్దెల లాంటి ఆర్థిక అంశాలను తీవ్రంగా ఆలోచిస్తూ మానసిక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. అయితే ఆర్థిక ప్రణాళిక గురించి కాకుండా బెడ్ రాటింగ్ (బెడ్లో గంటల తరబడి ఉండటం), టీవీ చూడటం, సోషల్ మీడియా స్క్రోలింగ్ ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందుతున్నారు. దీని ప్రభావం.. బ్రెయిన్ హెల్త్, మానసిక స్థితి, శారీరక శక్తి మీద తీవ్రంగా పడుతోంది. ఇది నిద్ర రిథమ్ను పూర్తిగా దెబ్బతీస్తోంది. రాత్రిళ్లు మధ్యలో మెలకువ రావడం వంటి సమస్యలూ పెరుగుతున్నాయి. ఇకోసోషియోస్పేర్ కథనం ప్రకారం.. Gen Z తరానికి చెందిన 100 మందిలో 93 మంది తమ నిద్ర సమయాన్ని సోషల్ మీడియా వల్ల కోల్పోతున్నారని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ చెబుతోంది. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ల వల్ల నిద్రకు అవసరమైన మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుందన్నది అసలు ముచ్చట. ఫోమో (Fear of Missing Out) వల్ల Gen Z ఆన్లైన్లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అంటే ఏదైనా మంచి విషయం, అనుభవం, లేదంటే అవకాశాన్ని కోల్పోతున్నానేమో అనే భయం. ఉదాహరణకు.. మీ ఫ్రెండ్స్ ట్రిప్కు వెళ్లి ఫోటోలు పోస్ట్ చేస్తే, మీరు వెళ్లలేకపోయినందుకు బాధపడటం. ఎవరో కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే, మీ ఫోన్ పాతదిగా అనిపించడం. ట్రెండింగ్ వీడియోలు, ఫ్యాషన్, ఈవెంట్స్.. అన్నింటిని మిస్ అవుతున్నానేమో అనే భావన ఇలాగన్నమాట. ఇది నిద్రలేమి, ఆత్మవిశ్వాస లోపం, మూడ్ స్వింగ్స్ వంటి సమస్యలకు దారి తీస్తోందివీటి నుంచి బయటపడాలంటే.. వరీ విండో అనే పద్ధతిని పాటించాలని మానసిక ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంటే.. రాత్రి దాకా కాకుండా రోజు మధ్యలోనే ఆ ఆందోళనలపై ఆలోచించేందుకు సమయం కేటాయించాలంటున్నారు. తద్వారా నిద్ర చెడిపోదని చెబుతున్నారు. అలాగే.. డిజిటల్ డిటాక్స్, స్క్రీన్-ఫ్రీ బెడ్రూమ్, మెడిటేషన్ వంటి అలవాట్లు నిద్రను మెరుగుపరుస్తాయి కూడా.::వెబ్డెస్క్ ప్రత్యేకం -
సరదా ఈత.. కాకూడదు గుండె కోత
విశాఖపట్నం నాయుడుతోట సమీపంలోని మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లో ఇటీవల ఇద్దరు యువకులు నీట మునిగి మృతి చెందారు. పెందుర్తికి చెందిన బల్లంకి శేఖర్(18), ఇతని సోదరుడు వాసు, చినముషిడివాడకు చెందిన యాడాడ లక్ష్మణ్కుమార్ (18) సరదాగా రిజర్వాయర్ ఒడ్డున కూర్చొని ఉండగా శేఖర్ చెప్పు నీటిలో పడిపోయింది. రిజర్వాయర్ అంచు పట్టుకుని దానిని బయటకు తీసే క్రమంలో నాచు కారణంగా నీటిలో పడిపోయాడు. పైకి, కిందికి మునకలేస్తుండగా ఒడ్డు నుంచి లక్ష్మణ్ కుమార్ చేయి అందించబోయాడు. అయితే శేఖర్ అమాంతం.. లక్ష్మణ్ చేయిని లాగేయడంతో ఇద్దరూ నీట మునిగి పోయారు. వీరిద్దరికీ ఈత రాదు. ఒడ్డునే ఉన్న వాసు (ఇతనికి ఈత వచ్చు) నీటిలోకి దూకి వారిని రక్షించబోగా.. ఇతన్ని గట్టిగా పట్టేసుకున్నారు. దీంతో ముగ్గురూ నీటిలో మునిగి పోతుండగా ఒడ్డున ఉన్న మరో వ్యక్తి గమనించి నీటిలోకి దూకి.. ఒక్క వాసును మాత్రమే కాపాడగలిగాడు. మొన్నామధ్య అన్నమయ్య జిల్లా రాజంపేటలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు, మచిలీపట్నం సమీపంలో నలుగురు విద్యార్థులు ఇలానే మృత్యువాత పడ్డారు. ఇలాంటి సంఘటనలు ప్రతి రోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది విద్యార్థులు ఈత రాక, మరికొందరు ఈత వచ్చినా కూడా ఇలాంటి ఘటనల్లో మృతి చెందుతున్నారు. చాలా మందికి ఈత వచ్చినా ‘రెస్క్యూ’ (కాపాడటం) ఎలా చేయాలో తెలియక పోవడం విచారకరం.» చాలా దేశాల్లో స్విమ్మింగ్, సైక్లింగ్, కుకింగ్.. అనేవి విద్యార్థి దశలోనే మాండటరీ. ప్రతి వ్యక్తికి ఏదో ఒక దశలో ఇవి చాలా ముఖ్యం. ఇవి వస్తేనే ఉన్నత విద్యలో ప్రవేశం ఉంటుంది. మన దేశంలో మాత్రం అంత ముఖ్యం కాదు. ఇవన్నీ ఐచ్ఛికం. కుకింగ్ (వంట చేయడం) ఎంత ఇంపార్టెంటో మొన్న కరోనాలో మనకు బాగా తెలిసొచ్చింది. ఈత అనేది ఎంత ఉపయోగకరమో పైన చెప్పుకున్న ఘటనల్లాంటివి మనకు తారస పడినప్పుడు తెలుస్తుంది. » చాలా మందికి.. ప్రత్యేకించి యువతకు నీటి గురించి అవగాహన ఉండదు. ఆ.. ఏమవుతుంది అనుకుని నీటిలో దిగేస్తుంటారు. ఫ్రెండ్స్తో కలిసి బీచ్లకు, నది ఒడ్డుకు పిక్నిక్లకు వెళ్లినప్పుడు లోతు గమనించకుండానే ముందుకెళుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు. మరికొంత మంది స్విమ్మింగ్ పూల్లో పట్టుమని 10 మీటర్లు కూడా ఈదలేని విధంగా ఉదరాబదరా ఈత నేర్చుకుని ‘మాకూ ఈత బాగా వచ్చు’ అని భ్రమ పడుతుంటారు. » పై ఈత (ఫ్రీ స్టైల్), లో ఈత (అండర్ వాటర్), వెనకీత (బ్యాక్ స్ట్రోక్), పక్కీత (సైడ్ స్ట్రోక్), నిలువీత (స్టాండింగ్ పొజిషన్), ఏటీత (బటర్ఫ్లై స్ట్రోక్), కప్పీత (బ్రెస్ట్ స్ట్రోక్) అని ఈతలో చాలా రకాలున్నాయి. చాలా మంది ఇవన్నీ నేర్చుకున్నప్పటికీ ఎప్పుడు ఏ ఈత అవసరమో తెలుసుకోరు. నేర్పించే వారు కూడా చెప్పరు. భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉన్న చోట వెనకీత (బ్యాక్ స్ట్రోక్), కొద్దిపాటి ప్రవాహాలకు ఎదురీదాల్సి వచ్చినప్పుడు, సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు ఏటీత (బటర్ఫ్లై స్ట్రోక్), చిన్నపాటి కాలువలు దాటాల్సి వచ్చినప్పుడు పై ఈత (ఫ్రీ స్టైల్), నీటిపైన చెత్తా చెదారాలు, పరిశ్రమల వ్యర్థాలు తేలుతున్నప్పుడు అండర్ వాటర్ ఈత అవసరం. అన్నింటికంటే బ్యాక్ స్ట్రోక్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువగా అలుపు రాదు. మధ్య మధ్యలో నీటిపై తేలియాడుతూ రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత దూరమైనా ఇలా నెమ్మదిగా వెనక్కు వెళ్లిపోవచ్చు. » చాలా మంది యువతకు కొద్దో గొప్పో ఈత వచ్చి కూడా చనిపోవడం చూస్తున్నాం. ఇలాంటి చాలా ఘటనల్లో బయటకు చెప్పలేని నిజం ఏమిటంటే వారు మద్యం మత్తులో ఉండటం. సరదాగా స్నేహితులతో కలిసి పిక్నిక్లకు వెళ్లినప్పుడు మందు (లిక్కర్) తాగుతుంటారు. అలా మద్యం మత్తులో నీటిలోకి దిగినప్పుడు ఎంత దూరం లోపలికి పోతున్నారో గమనించరు. తిరిగి వెనక్కు వచ్చే క్రమంలో ఆయాసం ఎక్కువై.. బాడీ బ్యాలెన్స్ చేసుకోలేక.. ఆలోచించే కెపాసిటీ కోల్పోయి నీట మునిగి చనిపోతున్నారు. అందువల్ల మద్యం తీసుకున్నప్పుడు పొరపాటున కూడా ఈతకు దిగరాదని యువతకు గట్టిగా చెప్పాలి. మన పిల్లలకు మనం నీరంటే భయమన్నా నేర్పాలి. లేదా ఈత అయినా నేర్పించాలి. – సాక్షి స్పెషల్ డెస్క్ రెస్క్యూ చాలా కీలకం ఇకపోతే చాలా మందికి ఈత బాగా వచ్చినప్పటికీ రెస్క్యూ చేయడం తెలియదు. ఆపదలో ఉన్న వారిని కాపాడబోయి వీరూ మృత్యువాత పడుతుంటారు. ఎందుకంటే నీట మునిగి పోతున్న వారి దగ్గరకు మనం వెళ్లగానే వారు మనల్ని గట్టిగా పట్టేసుకుని ముంచేస్తారు. అందువల్ల ఎవరినైనా కాపాడాలనుకుంటే నేరుగా వారి ముందుకు వెళ్లకూడదు. ఒకవేళ వారు పట్టుకోజూసినా గట్టిగా తోసేసి విదిలించుకోవాలి. వారి వెనక్కు వెళ్లి సంకల కింద ఒక చేయి వేసి పట్టుకోవాలి. అంటే వారి తలను మన భుజం వద్ద పెట్టుకోవాలి. అప్పుడు వారికి శ్వాస తీసుకోవడానికి వీలవ్వడంతో మనకు సహకరిస్తారు. మరో చేత్తో నెమ్మదిగా రివర్స్ స్ట్రోక్లో ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకోవాలి. అనంతరం ప్రథమ చికిత్స చేయాలి. ఈతలో మరింత ప్రొఫెషనల్గా తయారవ్వడం కోసం రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీ శిక్షణ ఇస్తోంది. మరిన్ని వివరాలకు ‘లైఫ్ సేవింగ్ ఇండియా డాట్ ఆర్గ్’ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. కొత్త ప్రాంతాల్లో జాగ్రత్తలు తప్పనిసరిచాలా మందికి అంతో ఇంతో ఈత వచ్చినా కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రమాదాలబారిన పడుతుంటారు. ప్రధానంగా పరిసరాలు, లోతు గమనించకుండా డైవ్ చేస్తుంటారు. ఇది సరికాదు. తొలుత నీటిలోకి దూకే ముందు ఎంత లోతులో ఉందో అంచనా వేయాలి. సుడిగుండాలున్నాయేమో గమనించాలి. కింద బురద మట్టి, పదునైన రాళ్లు ఏమైనా ఉన్నాయా అని కూడా పరిశీలించాలి. ఇవన్నీ తెలుసుకోకుండా అమాంతం దూకేయడం సరికాదు. స్విమ్మింగ్ పూల్లో ఈదినట్లు అన్నిచోట్లా సాధ్యం కాదు. ఇంకో విషయం.. ‘నాకు ఈత బాగా వచ్చు.. మీకు ఏమీ కాదు.. నేనున్నాగా.. మీరు దిగండి..’ అంటూ కొంత మంది పిక్నిక్లకు వెళ్లినప్పుడు స్నేహితులను బలవంతం చేస్తుంటారు. తీరా లోపలకు దిగి.. కొంత దూరం వెళ్లాక బురదలో కాళ్లు ఇరుక్కుపోతే.. లేక కింద గుంత లోతుగా ఉంటే రెస్క్యూ చేయడం చాలా కష్టం. అందుకే అన్నీ గమనించాలి. ఈత గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరికీ చాలా అవసరం. ప్రత్యేకించి ఎన్నో అనారోగ్యాలకు చక్కటి మందు. ఒత్తిడిని సహజంగా తగ్గిస్తుంది. భారీ వర్క్ అవుట్స్ చేయలేని, జాగింగ్, వాకింగ్కు వెళ్లలేని వారికి అత్యద్భుతమైన ఎక్సర్సైజ్ స్విమ్మింగ్. – కీర్తన సుందరమూర్తి, స్విమ్మింగ్ కోచ్, విజయవాడ -
మిలియనీర్ కుటుంబాలు 8,71,700
దేశంలో మిలియనీర్ కుటుంబాల (ఒక మిలియన్ డాలర్లు లేదా రూ.8.5 కోట్ల నికర విలువ ఉన్నవి) సంఖ్య కేవలం 4 ఏళ్లలో 90 శాతం పెరిగింది. 2021లో వీటి సంఖ్య 4,58,000 లక్షల నుంచి 2025లో ఏకంగా 8,71,700కు ఎగబాకింది. 2017– 2025 మధ్య మిలియనీర్ కుటుంబాల సంఖ్య ఏకంగా 445 శాతం పెరగడం విశేషం. దేశంలోని మొత్తం కుటుంబాల్లో.. ఇవి 0.31 శాతం. రాష్ట్రాల్లో మహారాష్ట్ర అత్యధిక మిలియనీర్ కుటుంబాలతో నంబర్ వన్ స్థానంలో ఉంటే.. నగరాల్లో ముంబై టాప్లో నిలిచింది. ఇలాంటి ఆసక్తికర విషయాలు ‘మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025’లో వెల్లడయ్యాయి.- సాక్షి, స్పెషల్ డెస్క్ప్రధాన కారణాలుపట్టణ ఆర్థిక వృద్ధి, వ్యాపార ఆలోచనలు పెరగడం, బలమైన ఈక్విటీ మార్కెట్లు, టెక్నాలజీ, వివిధ రకాల పెట్టుబడి మార్గాలు వంటి అనేక కారణాలు మిలియనీర్ కుటుంబాలు పెరగడానికి దోహదం చేశాయి.మరింత ధనికులుగా..2017 నాటి మిలియనీర్లలో 2025 నాటికి రూ.100 కోట్ల క్లబ్లోకి చేరినవారు 5 శాతం అంటే 66,800 కుటుంబాలు. రూ.200 కోట్ల క్లబ్లోకి చేరింది 1.3 శాతం. రూ.1,000 కోట్ల క్లబ్లోకి చేరింది 0.07 శాతం. రూ.8,500 కోట్ల క్లబ్ అంటే బిలియనీర్ల జాబితాలోకి చేరింది 0.01 శాతం.. అంటే 360 కుటుంబాలు.ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ..మిలియనీర్ కుటుంబాలు అంటే గతంలో ముంబై, ఢిల్లీ వంటి ప్రథమ శ్రేణి నగరాల్లోనే ఉండేవి. కానీ, ఇప్పుడు అహ్మదాబాద్, సూరత్, విశాఖపట్నం, జైపూర్, లక్నో వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఈ సంఖ్య పెరుగుతోంది.ఆర్థిక స్వేచ్ఛ‘మెర్సిడెజ్ బెంజ్ హురున్ ఇండియా లగ్జరీ కంజ్యూమర్ సర్వే’ ప్రకారం.. ఏటా పర్యటనలు, చదువు, వినోదం కోసం 60 శాతం మిలియనీర్ కుటుంబాలు రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నాయి.⇒ ‘ఎంత సంపద ఉంటే ఆర్థిక స్వేచ్ఛ’ ఉన్నట్టు భావిస్తారు అని అడిగితే.. 27 శాతం మంది రూ.50 కోట్లు చాలు అని చెప్పారు. రూ.200 కోట్లు ఉండాల్సిందే అని 20 శాతం మంది స్పష్టం చేశారు.⇒ 40 శాతం మంది ఒక కారును 6 ఏళ్లకుపైనే వాడుతున్నారు.⇒ 27 శాతం మంది.. యోగా తమకు ఇష్టమైన ఫిట్నెస్ కార్యక్రమం అని చెప్పారు.⇒ విదేశాల్లో చదువుల విషయానికొస్తే.. అమెరికా (19 శాతం మంది), యూకే (14 శాతం) మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.⇒ ఆసక్తికరంగా 42 శాతం మంది తమ పిల్లలను భారతదేశంలోనే చదివిస్తామని వెల్లడించారు. -
బీహార్లో నువ్వా-నేనా?? పీపుల్ పల్స్ ఏమో ఇలా..
జాతీయ స్థాయిలో బీహార్ రాష్ట్ర రాజకీయాలకు ప్రత్యేకత ఉంటుంది. దశాబ్దాలుగా సంకీర్ణ ప్రభుత్వాలకు కేంద్రంగా ఉన్న బీహార్ రాష్ట్రంలో ఏయే పార్టీలు ఎప్పుడు ఏ కూటమిలో ఉంటాయో..? ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో అంచనా వేయడం తేలిక కాదు. నిత్యం అనిశ్చిత రాజకీయాలకు కేరాఫ్గా ఉండే బీహార్లో త్వరలో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే, ‘ఇండియా’ కూటముల మధ్య తీవ్ర పోటాపోటీ నెలకొని ఉందని క్షేత్రస్థాయిలో పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. 2025 అక్టోబర్/నవంబర్లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 41 నుండి 44 శాతం, ‘ఇండియా’ కూటమికి 40 నుండి 42.5 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయని మూడ్ సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 30 నుండి 31 శాతం ఓట్లతో, బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో ఆధిపత్యం కనబరుస్తూ వారి కూటముల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ఉండబోతున్న బీహార్ ఎన్నికల్లో.. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) 6 నుండి 8 శాతం ఓట్లతో నిర్ణయాత్మక పాత్ర పోషించనుంది. ఇతరులు 7.5 నుండి 9 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నాయి. ఈ గణాంకాల్లో 3 శాతం ప్లస్/మైనస్ ఉండే అవకాశాలున్నాయి. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్లో స్థానిక సమస్యలు, సంక్షేమ హామీలు, పార్టీలలో అసంతృప్తులు ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ-సౌత్ ఫస్ట్ మీడియా సంస్థ సంయుక్తంగా బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం కోసం మూడ్ సర్వే నిర్వహించగా ప్రస్తుతం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార ఎన్డీయే ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిపై స్వలంగా కేవలం ఒక్క శాతం ఓట్ల ఆధిపత్యం కనబరుస్తుందని వెల్లడయ్యింది. ఎన్నికల సమయానికి ఫలితం ఎటైనా మారవచ్చు.బీహార్లో 2020 శాసనసభ ఎన్నికల్లోనూ ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు పోటాపోటీగా తలపడి చెరో 37 శాతం ఓట్లు సాధించాయి. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కూటముల మధ్య ఓట్ల వ్యత్యాసం సుమారు 11 వేలు మాత్రమే. ఆర్జేడీ 75 స్థానాలతో మొదటి స్థానంలో నిలవగా, బీజేపీ 74 స్థానాలతో ఒక్క సీటు తేడాతో రెండో స్థానంలో నిలిచింది. సంక్లిష్ట రాజకీయాలకు నెలవైన బీహార్ లో గతంలో వలే మరోసారి ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటముల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ, జేడీ (యూ), హెచ్ఏఎమ్, ఎల్జేపి (ఆర్వీ), ఆర్ఎల్ఎమ్ పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే కూటమి రాష్ట్రంలోని అగ్రవర్ణాలు, ఈబీసీ, దళిత వర్గాల ఓట్లపై భారీ ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిగా చెలామణి అవుతూ బీహార్లో మహాఘట్ బంధన్ పేరుతో ప్రతిపక్షాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు, వికశీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) పార్టీలతో కూడిన ‘ఇండియా’ (మహాఘట్ బంధన్) కూటమి రాష్ట్రంలోని యాదవ, ముస్లిం సామాజిక వర్గాల్లో పటిష్టంగా ఉంది. వీరితో పాటు ఓబీసీ వర్గాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. గతంలో ‘మార్పు’ (2005), ‘సుశాసన్’ (2010),ఉద్యోగాలు (2020) నినాదాలతో రాష్ట్రంలో ఎన్నికలు జరగ్గా, ఈ సారి ఎలాంటి ప్రత్యేక నినాదం లేకుండా ప్రభుత్వ వ్యతిరేకత, సంక్షేమ పథకాలు, కుల సమీకరణాలతో పాటు నూతన పార్టీ జేఎస్పీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో ధరల పెరుగుదల, వలసలు, నిరుద్యోగం అంశాలపై ఉన్న వ్యతిరేకతను సంక్షేమం, అభివృద్ధి అంశాలు తగ్గించడం ఎన్డీయేకు కలిసివస్తోంది. ‘జీవికా’ పథకంలో భాగస్వాములైన మహిళలు మద్యనిషేధం, విడో పింఛన్లు, సబ్సీడీలతో నితీశ్ కుమార్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఆశించిన ఉద్యోగాలు రాలేదని యువత విమర్శిస్తున్నా గత ‘జంగిల్ రాజ్’ కంటే నితీశ్ ప్రభుత్వంలో స్థిరత్వం ఉందని అంగీకరిస్తున్నారు. రైతులు కులాల ఆధారంగా చీలిపోయారు. ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) వంటి జాతీయ అంశాల కన్నా స్థానిక అంశాలే ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయని మూడ్ సర్వేలో వెల్లడైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక అంశాలకే పెద్దపీట దక్కనుంది. తమ ఎమ్మెల్యేల పనితీరుతో పాటు స్థానిక సమస్యల ఆధారంగానే ఓటు వేస్తామని చాలా మంది మూడ్ సర్వేలో చెప్పారు. బీహార్ ఎన్నికల్లో ఎప్పటిలా ఈ సారి కూడా సామాజిక కులాలే కీలకం కానున్నాయి. రెండు ప్రధాన కూటముల్లో పార్టీల మధ్య సీట్ల కేటాయింపులు, పార్టీల అభ్యర్థుల ఎంపికలో సామాజిక అంశాలకే ప్రాధాన్యత ఉండనుంది. అభ్యర్థుల ఎంపిక తర్వాతే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయిస్తామని ఓటర్లు చెప్పారు. ఎన్డీయేకు మద్దతుగా ఉన్న ఈబీసీ ఓటర్లు తమ సామాజిక వర్గం వారికి మహాఘట్ బంధన్ టికెట్లిస్తే వారికి ఓటు వేయడానికి వెనుకాడమని చెప్పారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో అఖిలేశ్ యాదవ్ పీడీఏ (పిచ్చడ్, దళిత్, అల్పసంఖ్యాక్) వ్యూహం విజయవంతమైనా, బీహార్లో తేజస్వీ యాదవ్ ఎమ్-వై (ముస్లిం, యాదవ్) వ్యూహం విఫలమైంది. టికెట్ల కేటాయింపులో కీలకమైన సామాజిక సమీకరణలను విజయవంతంగా నిర్వహించలేకపోతే పార్టీల్లో అసంతృప్తి పెరిగే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్ లో చేపట్టిన ‘ఓట్ అధికార్ యాత్ర’ ప్రజాకర్షణగా నిలిచింది. అయితే ఈ యాత్ర ద్వారా రాష్ట్రంలో రెండు కూటములకు మద్దతిచ్చే సామాజిక సమీకరణాల్లో పెద్ద మార్పు కనిపించలేదు. సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 15.5 శాతం ఉన్న అగ్రవర్ణాల్లో 3 శాతం బ్రాహ్మణులు, 3.4 శాతం రాజ్పుత్లు, 2.8 శాతం భూమిహార్లు, 0.6 శాతం కాయస్తులు బీజేపీకి మద్దతిస్తున్నారు. బీహార్ లో 14.2 శాతం ఉన్న యాదవ్లు ఆర్జేడీ వెంట ఉన్నా మతం ఆధారంగా మిథిలా, సీమంచల్ లో బీజేపీకి కొంత యాదవ్ల మద్దతు లభిస్తోంది. 2.8 శాతం ఉన్న కుర్మీలు, 4.2 శాతం ఉన్న కుష్వాహాలు దక్షిణాన నితీశ్ వెంట ఉన్నా, ఉత్తరాదిన చీలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో కీలకమైన 36 శాతం ఉన్న ఈబీసీలు జేడీ(యూ), బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. వీరిలో నిశాద్ సామాజికవర్గం ఉప కులాలు ప్రాంతాలవారీగా ఎన్డీయే, వీఐపీ వైపు ఉన్నారు. 19.65 శాతం ఉన్న షెడ్యుల్ కులాలు, 5 శాతం ఉన్న చమార్లు ఆర్జేడీ,కాంగ్రెస్,వామపక్షాల వైపు, 5 శాతమున్న పాశ్వాన్ లు ఎల్జీపీ (ఆర్వీ) వైపు ఉండగా 3 శాతం ఉన్న ముషార్లు ప్రాంతాల వారీగా చీలిపోయారు. 1.68 శాతం ఉన్న షెడ్యూల్ తెగల ఓట్లు రెండు కూటముల మధ్య చీలిపోతున్నాయి. బీహార్ లో 17.7 శాతం ఉన్న ముస్లింలు మహాఘట్ బంధన్ కు పటిష్టమైన ఓటు బ్యాంకుగా నిలుస్తున్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. సీమాంచల్ ప్రాంతంలో ఏఐఎంఐఎం పార్టీకి కొంత ముస్లింల మద్దతు లభిస్తోంది. బీహార్లో ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆరు స్థానాల్లో గెలిచినా కిషన్గంజ్ లోక్ సభ నియోజవర్గంతో పాటు సమీపంలో ఉన్న అరారియాకే పరిమితమైంది. గెలిచిన ఆరుగురు ఎమ్మెల్యేలలో ఐదుగురు ఆర్జేడీలో చేరడంతో ఏఐఎంఐఎం బలహీనపడింది. అయితే వక్ఫ్ సవరణ బిల్లుపై ఆ పార్టీ ఉద్యమంతో ఆ పార్టీ కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించింది. వక్ఫ్ చట్టంపై ఓవైసీ పోరాడుతున్నారనే అభిప్రాయం సీమంచల్ లో ముస్లిం యువత భావిస్తోంది. అయితే రాహుల్ గాంధీ యాత్రతో ఏఐఎంఐఎంకు ముస్లింలలో మద్దతు తగ్గుతోందని సర్వేలో తేలింది. ‘ఇండియా’ గ్రూపులో చేర్చుకోవాలని ఏఐఎంఐఎం కోరుతున్నా కాంగ్రెస్, ఆర్జేడీ నుండి ఆశించన స్పందన రాలేదు. కిషన్గంజ్తో పాటు పూర్ణియా, అరారియా వంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో మద్దతు లభిస్తుండడంతో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసినా ఏఐఎంఐఎం 1 నుండి 3 స్థానాల్లో గెలవవచ్చని మూడ్ సర్వేలో తేలింది.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కీలకంగా మారి ప్రభుత్వ వ్యతిరేకత బయటపడకుండా చేస్తున్నాయి. ఎన్డీయే, మహాఘట్ బంధన్ కూటములు బీహార్లో పోటాపోటీగా హామీలిస్తున్నాయి. నితీశ్ ప్రభుత్వం 1.67 కోట్ల కుటుంబాలకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో గ్రామీణ ప్రాతాల్లో ఒక్కో కుటుంబానికి నెలకు రూ.200 నుండి 300 మేర విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. మహిళల కోసం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన’ పథకం కింద రూ.10 వేలు ఉపాధి ప్రోత్సాహకం, మహిళా స్వయం సహాయక సంఘాలకు తక్కువ వడ్డీకి రూ.2 లక్షల రుణాలిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో 12 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ఎన్డీయే మరో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో ట్రైబెల్స్ కు భూమి హక్కులు కల్పిస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. ఎన్డీయే హామీలకు పోటీగా మహాఘట్ బంధన్ కూటమి కూడా బీహార్ ప్రజలకు భారీ హామీలిచ్చింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రాష్ట్రంలో వలసల నివారణకు స్థానికులకు 100 శాతం ఉద్యోగాలు, ప్రతి పంచాయతీలో ఐటీఐ ఏర్పాటు చేస్తామని ఆర్జేడీ హామీలిచ్చింది. అన్ని రంగాల్లో మహిళా కోటా కల్పించి, వారికి భద్రత ఇస్తామని మహాఘట్ బంధన్ హామీ ఇచ్చింది. ఈ రెండు కూటములకు పోటీగా జేఎస్పీ పంచాయత్ స్కూల్స్, యువతకు ఉద్యోగాలు, వృద్ధులకు రూ.2000 పింఛన్, మహిళలకు రుణాలు హామీలిస్తూ, రాష్ట్రంలో అవినీతి నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతోంది. శాంతి భద్రతల అంశానికి సంబంధించి బీహార్ లో ఆర్జేడీ గెలిస్తే రాష్ట్రంలో మళ్లీ ‘జంగిల్ రాజ్’ వస్తుందని ఎన్డీయే మద్దతుదారులు ప్రచారం చేస్తుండగా, నితీశ్ పాలనలో రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగిపోయాయని మహాఘట్ బంధన్ మద్దతుదారులు విమర్శిస్తున్నారు. చిన్నపార్టీలైన హెచ్ ఏఎమ్, ఆర్ ఎల్ ఎమ్ ఎన్డీయే కూటమిలో, వీఐపీ, వామపక్షాలు మహాఘట్ బంధన్ కూటమిలో కీలకపాత్ర పోషించనున్నాయి.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇమేజ్, క్షేత్రస్థాయిలో సంస్థగతంగా బలంగా ఉండడం, డిజిటల్ రంగంలో దూసుకుపోవడం అంశాలతో రాష్ట్రంలో బీజేపీ 28 నుండి 29 శాతం ఓట్లతో పటిష్టంగా కనిపిస్తున్నా, ఆ పార్టీ నుండి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిపేరు వినిపించకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తుందని క్షేత్రస్థాయిలో పర్యటించిన పీపుల్స్ పల్స్ బృందం పరిశీలనలో తేలింది. 30 నుండి 31 శాతం ఓట్లతో బలంగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పలు హామీలతో ముందుకెళ్తున్నా అగ్రవర్ణాల్లో ఆ పార్టీపై వ్యతిరేకత ఉండడం వారికి అడ్డుగా మారుతోంది. కాంగ్రెస్ యాత్రలతో బలపడుతున్నట్టు కనిపిస్తున్నా, ఆ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జేడీ (యు) ఈబీసీ సామాజికవర్గంలో బలంగా ఉండి, మహిళల మద్దతు పొందుతోంది. అయితే 74 ఏండ్ల వయస్సు గల ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జేపీ(ఆర్వీ) నేత చిరాగ్ పాశ్వాన్ కు దళిత సామాజిక వర్గంలో మంచి చరిష్మా ఉన్నా, ఎన్డీయేలో చీలిక భయాలున్నాయి. జేఎస్పీ పాదయాత్రలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు హామీలతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నా ఆ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ లేకపోవడం బలహీనత.బహుముఖ పోటీలో కూటముల మధ్య సీట్ల కేటాయింపులు, ఓటర్లను ఆకర్షించడం, చివరి నిమిషం వరకు చేసే ప్రచారంపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈబీసీలకు సరైన ప్రాధాన్యతిస్తూ టికెట్లు కేటాయిస్తే ప్రయోజనం ఉండే అవకాశాలున్నాయి. ఎన్డీయేలో బీజేపీ, నితీశ్, చిరాగ్ మధ్య విభేదాలొస్తే ఫలితంపై ప్రభావం చూపిస్తాయి. జేఎస్పీ ఎన్నికల్లో కింగ్మేకర్ పాత్ర పోషించనుంది. మొత్తం మీద బీహార్ ప్రజలు ఓటేస్తుంది కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసమే కాదు. పార్టీలు హామీలిస్తున్న సంక్షేమాలు కుల రాజకీయాలను దాటగలవా? యువత ఆశలు విధేయతలను అధిగమించగలదా? ప్రశ్నలకు సమాధానం పోటా పోటీ ఎన్నికల ఫలితాలే తేలుస్తాయి. మరోవైపు ఎన్నికల వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరుగాంచిన ప్రశాంత కిశోర్ సొంత రాష్ట్రంలో ఎలాంటి ప్రభావం చూపిస్తారో అని దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. బీహార్ అసెంబీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆసక్తి రేపుతున్నాయి. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించకపోవడంతో ఇతర పార్టీలపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న ఇతర పార్టీల్లో బీహార్ కు చెందిన జేడీ (యు), ఎల్జేపీ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. బీహార్ లో ఎన్డీయే మెజార్టీ సాధిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకవపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ కూటమికి మెజార్టీ రాకపోయినా లేదా ఏ కూటమిలోనైనా ముఖ్యమంత్రి పీఠంపై చిక్కుముడి పడినా జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. :::ఆర్.దిలీప్ రెడ్డి, డైరెక్టర్, పీపుల్స్ పల్స్ -
సెమీకండక్టర్.. ‘డబుల్’ జోరు!
భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ ప్రస్తుత సంవత్సరంలో 54.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చని.. 2030 నాటికి 13.8 శాతం వార్షిక వృద్ధి రేటుతో 103.5 బిలియన్ డాలర్లకు చేరుతుందని స్టాఫింగ్ కంపెనీ ‘క్వెస్ కార్ప్’ నివేదిక తెలిపింది. ‘ది చిప్ క్యాటలిస్ట్: ఇండియాస్ ఎమర్జింగ్ సెమీకండక్టర్ ఎకోసిస్టమ్’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం.. భారీ స్థాయిలో వినియోగ మార్కెట్గా ఉన్న భారత్, ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అవతరిస్తోంది.అయితే ఈ రంగం నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సెమీకండక్టర్ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 80 శాతం మందికి.. 10 సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉంది. మధ్య స్థాయి, సీనియర్ రోల్స్లో నిపుణుల కొరత ఉంది. 55కుపైగా ఉన్న సెమీకండక్టర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో (జీసీసీ) 60 వేల పైచిలుకు ఇంజనీర్లు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలో 2030 నాటికి నిపుణుల సంఖ్య 4,00,000లకు చేరనుంది. తద్వారా నిపుణుల సంఖ్య విషయంలో ప్రపంచంలో యూఎస్ తర్వాత భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించనుంది. – సాక్షి, స్పెషల్ డెస్క్ -
బిగ్ రిలీఫ్
దసరా, దీపావళి పండగ ఆనందాలు రెట్టింపు కానున్నాయి. ఇటీవల కేంద్రం సవరించిన వస్తు సేవల పన్ను(జీఎస్టీ) శ్లాబులు ఈ నెల 22వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. గృహోపకరణాలు, ఆటో మొబైల్స్, ఎలక్ట్రానిక్ వంటి చాలా వరకు ఉత్పత్తుల ధరలు 10 శాతం మేర తగ్గనున్నాయి. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం కలగనుంది. దీంతో వాహనాలు, కార్లు, టీవీలు, సెల్ఫోన్లు వంటి ఉత్పత్తుల కొనుగోలుదారులు ఈనెల22 వరకు వాయిదా వేసుకుంటున్నారు. ఈ కామర్స్ సంస్థలు సైతం ఈనెల 22 తర్వాతే ఆఫర్లు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లు, ఆన్లైన్ సంస్థల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. – విశాఖ సిటీతగ్గనున్న నిత్యావసర ధరలు ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఉప్పు నుంచి పప్పు వరకు రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జీఎస్టీ సవరణలతో మరో వారం రోజుల్లో ఈ ధరలు దిగిరానున్నాయి. సాధారణ ప్రజలు నిత్యం వినియోగించే వస్తువులపై కేవలం 5 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. దీంతో పేస్ట్ నుంచి డ్రై ఫ్రూట్స్ వరకు ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు పన్నీర్, బ్రెడ్, వెన్న, నెయ్యి, పాస్తా, నూడుల్స్, కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, కేకులు, స్వీట్లు వంటి ప్యాకేజ్డ్ ఆహార పదార్థాల ధరలు అందుబాటులోకి రానున్నాయి. ఖరీదైన బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం వంటి వాటిపై కూడా జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గనుంది. ఇది సాధారణ ప్రజలకు భారీ ఉపశమనాన్ని అందించనుంది. వాహనాలపై 28 నుంచి 18 శాతానికి.. వాహనాల ధరలపై జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్రం కుదించింది. దీంతో వీటి ధరలు తగ్గనున్నాయి. సాధారణంగా దసరా, దీపావళి పండగ సీజన్లలో వాహనాలను కొనుగోలు చేయడం సెంటిమెంట్గా భావిస్తుంటారు. ఈ నెల 22వ తేదీ నుంచి బైక్లు, కార్లపై 10 శాతం వరకు ధరలు తగ్గే అవకాశాలు ఉండడంతో భారీగా వాహనకొనుగోళ్లు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బైక్, కార్ల కంపెనీలు తగ్గించిన ధరలను ప్రకటించాయి. బైక్లపై రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు, మధ్యస్థాయి కారుపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ఉండనుంది. దీంతో కొనుగోలుదారులు ఈనెల 22 తర్వాతే వాహనాలను కొనుగోలు చేసేందుకు వాయిదా వేస్తున్నారు. అయితే కొన్ని షోరూమ్లు ప్రీ బుకింగ్లకు కూడా డిస్కౌంట్ ధరలు ప్రకటించాయి. లగ్జరీ కార్లపై 40శాతం జీఎస్టీ విధించారు. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్లు, ఇతర లగ్జరీ వస్తువులపై ప్రత్యేక, అధిక స్లాబ్ వడ్డించారు. గృహ నిర్మాణ భారం నుంచి ఉపశమనం జీఎస్టీ సంస్కరణలతో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి రోజులు కనిపిస్తున్నాయి. బిల్డర్లతో పాటు సొంతింటి నిర్మాణాలు చేపట్టే ప్రజలకు నిర్మాణ వ్యయం భారీగా తగ్గనుంది. దీంతో ఫ్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గనున్నాయి. నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్, ఇసుక, ఇటుకలు, గ్రానైట్, మార్బుల్స్, టైల్స్, రంగుల ధరలపై కేంద్రం జీఎస్టీని తగ్గించింది. సాధారణంగా ఇంటి నిర్మాణంలో అయ్యే ఖర్చులో 40–45 శాతం వ్యయం నిర్మాణ సామగ్రిదే ఉంటుంది. తాజా జీఎస్టీ సవరణతో నిర్మాణ సామగ్రిపై అయ్యే ఖర్చులో డెవలపర్కు 10–15 శాతం వరకు ఆదా అవుతుంది. ఫలితంగా మొత్తం ఇంటి నిర్మాణ వ్యయం 4–6 శాతం వరకు ఖర్చు తగ్గుతుంది. ఈ–కామర్స్లో ఆఫర్ల వెల్లువ ఈ–కామర్స్ సంస్థల్లో కూడా డిస్కౌంట్ల సందడి మొదలైంది. ఈ నెల 22వ తేదీ నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ పేర్లతో భారీ సేల్కు సిద్ధమవుతున్నాయి. ఇక మింత్రా, మీషో, షాపి వంటివి ప్రత్యేక ఆఫర్లు ప్రకటించాయి. జీఎస్టీ సవరణలతో ఈ నెల 22వ తేదీ నుంచి అన్ని రకాల వస్తువులపై డిస్కౌంట్ల వర్షం కురిపించనున్నాయి. ఎల్రక్టానిక్ వస్తువుల ధరలు సైతం.. జీఎస్టీ సవరణతో ఎల్రక్టానిక్ ఉపకరణాలు ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి. ఇప్పటి కంటే 10 నుంచి 13 శాతం మేర ధరలు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయి. టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు ఇలా అన్ని రకాల ఎల్రక్టానిక్ వస్తువుల ధరల్లో వ్యత్యాసం భారీగా ఉండే అవకాశం ఉంది. వీటితో పాటు సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కూడా అందుబాటు ధరల్లోకి రానున్నాయి. టీవీలపై రూ.5 వేలు నుంచి రూ.15 వేలు వరకు, మొబైల్ ఫోన్లపై రూ.2 వేలు నుంచి రూ.5 వేలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్లపై రూ.7 వేలు నుంచి రూ.10 వేలు వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. సాధారణంగా దసరా, దీపావళి సమయాల్లో ఎల్రక్టానిక్, వస్తువులపై వ్యాపారులు ప్రత్యేక డిస్కౌంట్లు, బహుమతులు ఇస్తుంటారు. ఈ ఏడాది మాత్రం వ్యాపారుల ఆఫర్లతో పాటు కేంద్రం జీఎస్టీ రూపంలో కొనుగోలుదారులకు శుభవార్త చెప్పింది. దీంతో ప్రజలు ఈ నెల 22వ తేదీ తర్వాతే గృహోపకరణాలు, మొబైల్స్ను కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. -
సరికొత్త ఆయుధం ఐరన్బీమ్
సైన్స్ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే సాధ్యమయ్యే కొత్తశకం ఆయుధాలను ఇజ్రాయెల్ ఈ తరంలోనే తీసుకొచ్చి మరోసారి ప్రపంచ రక్షణరంగాన్ని ఔరా అనిపించింది. శత్రు దేశాల యుద్ధ విమానాలపై క్షిపణులను ప్రయోగించకుండా నేరుగా లేజర్ కాంతిపుంజాన్ని ప్రయోగించి విమానాలను నేలకూల్చే వ్యవస్థను ఇజ్రాయెల్ రంగంలోకి దింపింది. అత్యంత ప్రభావవంతంగా ఇది పనిచేస్తోందని, సమరక్షేత్రంలోనూ దీని సత్తాను పరీక్షించామని ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. దీనిని ఐరన్బీమ్ అని పేరు పెట్టింది. శత్రుసేనల డ్రోన్ల దండును ఒకేసారి వందలాది చిన్నపాటి క్షిపణులతో నేలమట్టంచేసే ఐరన్డోమ్ గగనతల రక్షణ వ్యవస్థతో ఇజ్రాయెల్ ఇప్పటికే ఆధునిక తరం ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ల మోహరింపులో తన పైచేయి సాధించింది. వందలాది హమాస్ రాకెట్లను గాల్లోనే తుత్తునియలు చేసి ఈ ఐరమ్డోమ్ ఇప్పటికే తన సత్తా చాటింది. దీనికి తోడుగా ఇప్పుడు లేజర్కాంతిపుంజ సహిత ఐరన్బీమ్ వ్యవస్థను సంసిద్ధం చేశామని ఇజ్రాయెల్ రక్షణవర్గాలు ప్రకటించాయి. ఎప్పటికప్పుడు కొత్త రకం ఆయుధాలతో దేశ సైనికరక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ పటిష్టంచేసుకుంటూ దూసుకుపోతోంది. ఈ ఐరన్బీమ్ ను రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ తయారుచేసింది. కేవలం రెండు డాలర్లతో మటాష్విధ్వంసం సృష్టించేందుకు నేలమీదకు దూసుకొచ్చే శత్రువుల డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లు, మానవరహిత విహంగాలు, మోర్టార్లను గాల్లోనే అడ్డుకునేందుకు ఉపయోగించే సంప్రదాయక క్షిపణి నిరోధక వ్యవస్థను ఒక సందర్భంలో ఉపయోగిస్తే ఏకంగా 60,000 డాలర్లు అంటే రూ.53 లక్షలు ఖర్చవుతుంది. శత్రువుల రాకెట్లను అడ్డుకునేందుకు చిన్నపాటి రాకెట్లు, ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించాల్సి రావడం వల్లే ఇంతటి ఖర్చు అవుతుంది. కానీ కొత్తగా రణరంగంలోకి దిగిన ఈ ఐరన్బీమ్ను ఒకసారి ఉపయోగిస్తే కేవలం 2 డాలర్లు మాత్రమే ఖర్చవుతుంది. మెరుపువేగంతో అమితమైన విద్యుత్ను ఉపయోగించుకుని కొత్త కాంతిపుంజాన్ని వదులుతుంది. అందుకే అత్యల్ప ఖర్చుతోనే అత్యధిక ప్రయోజనాన్ని పొందొచ్చు. సంప్రదాయక గగనతల రక్షణవ్యవస్థలో ప్రయోగించే కొన్ని చిన్నపాటి రాకెట్లు గురితప్పొచ్చు. వృథా ఖాయం. కానీ ఐరన్బీమ్ కాంతిపుంజాన్ని గురిచూసి ప్రయోగిస్తారు. కాంతిమాదిరిగా అత్యంత కచ్చితత్వంతో సరళరేఖ మాదిరి ఈ కాంతిపుంజం దూసుకుపోతుంది. దీంతో దిశ మారే అవకాశమే లేదు. ఏ పాయింట్ వద్ద కొడతామో అక్కడే విమానం, డ్రోన్, క్షిపణి ముక్కలుచెక్కలుకావడం ఖాయం. బీమ్ ప్రయోగానికి అది లక్ష్యాన్ని ఛేదించడానికి మధ్య సెకన్ల వ్యవధి కూడా పెద్దగాఉండదని ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నాఫ్తాలీ బెన్నెట్ చెప్పారు. ఉన్న వాటితో కలుపుకుని పోతూ..ఐరన్బీమ్ను అందుబాటులోకి తెచ్చినంత మాత్రాన ఐరన్డోమ్, డేవిడ్ స్లింగ్, యారో సిస్టమ్ వంటి ఇతర గగనతల రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ పక్కనబెట్టబోదు. యుద్ధ రీతి, అవసరానికి అనుగుణంగా వీటినీ మోహరిస్తుంది. అవసరమైతే ఐరన్డోమ్కు తోడుగా ఐరన్బీమ్ కదనరంగంలో రణానికి సిద్ధంకానున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖలోని పరిశోధనా భివృద్ధి విభాగం, ఇజ్రాయెల్ వాయుసేన, రఫేల్, ఎల్బిట్ సిస్టమ్స్ సంయుక్తంగా నెలల తరబడి కష్టపడి ఐరన్బీమ్ను సాకారంచేశాయి. దీనిని ఇప్పటికే దక్షిణ ఇజ్రాయెల్లో పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. రఫేల్ అడ్వాన్స్డ్ సంస్థలోని అడాప్టివ్ ఆప్టిక్స్ సాంకేతికతను సైతం ఐరన్బీమ్కు జోడించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
గతి తప్పిన జలచక్రం!
ప్రపంచ జలచక్రం గతి తప్పింది. 2024లో ఇది మరింత అస్తవ్యస్తమైంది. గత 175 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 1.55 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరగటంతో వాతావరణంలో అసమతుల్యత పెరిగిపోయింది. ఇటు కుంభవృష్టి, అటు కరువులు విరుచుకుపడటంతో మూడింట రెండొంతుల నదులు చుక్క నీరు లేకుండా ఎండిపోయాయి లేదా విపరీతమైన వరదలతో సతమతమయ్యాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల వల్ల ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా 2024లో తీవ్రస్థాయిలో కష్టాలపాలయ్యారని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదికలో వెల్లడించింది. – సాక్షి, సాగుబడిఅసాధారణ నీటి కష్టాల వల్ల.. ఆహార కొరత, ధరల పెరుగుదల, సంఘర్షణలు, వలసలు పెరిగాయని 41 దేశాల సమాచారాన్ని క్రోడీకరించిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా నివేదిక వివరించింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధ సంస్థ అయిన డబ్ల్యూఎంఓ ఏటా ప్రపంచ జల వనరులపై నివేదికను వెలువరిస్తుంటుంది. నీటి వనరులపై ప్రజలు, పాలకులు, శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేస్తుంది.కరువు కరాళ నృత్యంఅతి తీవ్రమైన నీటి సమస్యలతో ప్రపంచ జల చక్రం పూర్తిగా గతి తప్పింది. నదులు, రిజర్వాయర్లు, సరస్సులు, భూగర్భ జలాలు, హిమానీ నదాలన్నిటిలోనూ ఈ అసాధారణ స్థితిగతులు కనిపించాయి. ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాల్లో వరదలు పొటెత్తగా.. దక్షిణ అమెరికా, ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో తీవ్ర కరువు కరాళ నృత్యం చేసింది. హిమానీ నదాల్లో మంచు నిల్వలు 450 గిగా టన్నుల (ఒక గిగా టన్ను అంటే లక్ష కోట్ల కిలోలు) మేరకు అత్యధికంగా కరగటం వరుసగా ఇది మూడో సంవత్సరం. ఆకస్మిక వరదలతో పాటు దీర్ఘకాలిక నీటి అభద్రతకు ఇది దారితీస్తుంది. ఈ నీటితో 1.2 మిల్లీమీటర్ల మేరకు సముద్రాల నీటి మట్టాలు పెరిగాయి. వరుసగా ఆరో ఏడాదినీటి చక్రం అస్తవ్యస్తం కావటం ఇదే మొదటిసారి కాదు. ఇలా జరగడం వరుసగా ఆరో ఏడాది. ప్రకృతి వైపరీత్యాల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, ప్రభుత్వాలకు వేల కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగింది. పంట దిగుబడులు నష్టపోయారు. ధరలు పెరిగిపోయాయి. ఆహార కొరత పెరిగింది. ఉద్రిక్తతలు పెరిగాయి. పొట్ట కూటికోసం వలస పోవాల్సిన దుస్థితి మరింతగా పెరిగింది. గత ఏడాది 40 శాతం నదుల్లో మాత్రమే.. నీటి లభ్యత ఉండాల్సినంత సాధారణంగా ఉంది. మిగతా 60 శాతం నదుల్లో అతి కరువు లేదా అతి వరద పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ రెండు తీవ్ర పరిస్థితులు నెలకొన్న విచిత్ర స్థితి ఏర్పడింది. మనదేశంలోనూ..ఉత్తర భారతంలో అతివృష్టి కారణంగా భూగర్భ జలాల్లో 2023తో పోల్చితే వృద్ధి కనిపించింది. అయితే, వాయవ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల మాత్రం కరువు నెలకొంది. భారత్, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో రిజర్వాయర్లలోకి చాలా ఎక్కువ నీరు చేరింది. గంగ, గోదావరి, కృష్ణా తదితర నదులు సాధారణం కన్నా ఎక్కువగా ఉప్పొంగాయి. జూలై 30న కేరళలో ఆకస్మిక వరదలు విరుచుకుపడ్డాయి. ఇందులో 385 మంది భారతీయులు చనిపోయారు. 40 లక్షల మంది నిరాశ్రయులుఅమెజాన్ నదీ పరివాహక ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. దక్షిణ అమెరికాలో, ముఖ్యంగా అమెజాన్ బేసిన్లలో మట్టిలో తేమ బాగా తగ్గింది. సెంట్రల్ యూరప్లో అందుకు భిన్నంగా నేలలు అతి తేమగా మారాయి.» సెంట్రల్ యూరప్, రష్యా, పాకిస్తాన్లలో పెను వరదలు ముంచెత్తాయి. » ఆఫ్రికా ట్రాపికల్ జోన్లో వరదలకు 2,500 మంది చనిపోగా, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. » దుబాయ్లో 75 ఏళ్లలో ఎన్నడూ ఎరుగనంత వర్షపాతం నమోదైంది. అస్తవ్యస్తం జలచక్రం నీరే జీవకోటికి ప్రాణాధారం. ఆర్థిక వ్యవస్థలకు నీరే ఇంధనం. పర్యావరణానికీ నీరే ప్రాణం. అయితే, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ జలచక్రం అస్తవ్యస్తమైంది. జలవనరులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఒత్తిడికి గురై విపత్తులకు కారణమవుతున్నాయి. ప్రాణాధారమైన ఆ నీరే ఉపద్రవాలకు కారణమై ప్రజల ప్రాణాలను, ఆస్తులను, జీవనోపాధులను కబళిస్తోంది. ఇది మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఇంధనం, ఆరోగ్యం, ఆర్థిక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. జలచక్రం ఎంత అస్తవ్యస్తంగా మారిపోయిందో 2024 నివేదిక మనకు తెలియజñ ప్తోంది. దీనిపై మరింత శ్రద్ధగా గణాంకాలు సేకరించాలి. జరుగుతున్నదేమిటో సరిగ్గా అంచనా వెయ్యలేకపోతే దాన్ని మార్చలేం కదా! – సెలెస్టె సాలో, ప్రధాన కార్యదర్శి, ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) -
నో ఆల్కహాల్ ప్లీజ్!
అసలే యూత్.. ఆపై ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత. ఇంకేముంది భారతీయ మిలీనియల్స్ (29–44 సంవత్సరాల వయసు), జెన్–జీ తరం (13–28 ఏళ్లు) ఆల్కహాల్ లేని లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ ధోరణి ముఖ్యంగా మెట్రో నగరాల్లో బాగా కనిపిస్తోంది. సరదాగా గడిపేందుకు ఆల్కహాల్ మాత్రమే పరిష్కారం కాదన్నది యువతరం మాట.సోషల్ డ్రింకింగ్ కల్చర్ భారత్లో క్రమంగా మారుతోంది. నీల్సన్ఐక్యూ తాజా అధ్యయనం ప్రకారం.. సర్వేలో పాలుపంచుకున్న భారతీయ వినియోగదారుల్లో 24% మంది ఆల్కహాల్ రహిత లేదా తక్కువ ఆల్కహాల్ ప్రత్యామ్నాయాలను ఆస్వాదిస్తున్నారు. ఈ విషయంలో ప్రపంచ సగటు 17% ఉంది. ఆల్కహాల్ రహిత లేదా తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలను తీసుకుంటున్నవారిలో సగానికి పైగా జెన్–జీ, మిలీనియల్స్ ఉన్నారు. ఫిలిప్పీన్్స తర్వాత ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో ఇలాంటి మాక్టెయిల్స్కు (ఆల్కహాల్ రహిత పానీయాలు) భారత్ రెండో అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. మనదేశంలో ఉత్తరాదిలో దాదాపు 54% మంది, తూర్పు భారతంలో 50%, పశ్చిమాన 43%, దక్షిణాన 37% మంది ఆల్కహాల్ పానీయాలను ఇష్టపడుతున్నారని నివేదిక తెలిపింది.ట్రెండ్గా మారుతోందిసాంస్కృతిక, సామాజిక వైఖరుల్లో వస్తున్న మార్పులు దేశంలో మద్యపాన రహిత జీవనశైలికి మార్గం సుగమం చేస్తు న్నాయి. మద్యపానానికి దూరంగా ఉండటం అనేది గతంలో మతపరమైన లేదా ఆరోగ్య కారణాలతో ముడిపడి ఉండేది. ప్రస్తుతం ట్రెండ్గా మారుతోంది. ఏం తీసుకుంటు న్నాం, వాటి ప్రభావం ఏమిటో తెలుసుకుని మరీ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మిలీనియల్స్, నిపుణులు, పట్టణ వినియోగదారుల నుంచి ఆల్కహాల్ రహిత పానీయాలకు డిమాండ్ పెరుగుతోంది. సంప్రదాయ బీర్ అనుభవాన్ని రాజీ పడకుండా మెట్రోలలో ఈ డిమాండ్ను తీర్చడానికి కంపెనీలు కూడా నూతన ఆవిష్కరణలు చేస్తున్నాయి.జీబ్రా స్ట్రిప్పింగ్ ట్రెండ్జెన్–జీ అంటేనే సరికొత్త కోరికలు, ఆవి ష్కరణలకు పెట్టింది పేరు. వారు ఇటీవలి కాలంలో జీబ్రా స్ట్రిప్పింగ్ ట్రెండ్ను ఎక్కువ గా అనుసరిస్తున్నారు. అంటే ప్రతి ఆల్కహా లిక్ డ్రింక్ తర్వాత ఆల్కహాల్ రహిత పానీ యాలను తీసుకుంటున్నారు. యూత్ ఎక్కు వగా కాక్టెయిల్స్, ప్రీమియం డ్రింక్స్ తాగు తున్నారు. విలువ పరంగా చూస్తే వీటి విలు వ ఎక్కువే కావడం గమనార్హం. అందుకే, కొన్ని కంపెనీలు ఆల్కహాల్ లేని పానీయా ల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నాయి.ఆల్కహాల్ రహితంవైపు..నీల్సన్ఐక్యూ అధ్యయనం ప్రకారం భారతదేశంలో 53% మంది పూర్తిగా తాగనివారు లేదా చాలా తక్కువ తాగేవారు.. చట్టబద్ధంగా తాగే వయస్సు కలిగి ఉన్నారు. అంటే.. వీళ్లంతా 18–34 ఏళ్ల లోపు వారన్నమాట. ఇక, ఈ కేటగిరీలో ఉన్న 35–54 ఏళ్లవారు 35 శాతం కాగా, 55 ఏళ్లకుపైబడిన వారు 13 శాతం. ఆల్కహాల్ రహిత పానీయాల వైపు యువత ఆకర్షితులవుతుండటంతో ఈ మార్కెట్ దేశంలో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది.ప్రధానంగా ఈ ట్రెండ్ మెట్రోల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నాన్ ఆల్కహాలిక్ స్పిరిట్స్ లభ్యత గతంలో చాలా పరిమితంగా ఉండేది. ప్రస్తుతం ఇవి విరివిగా లభిస్తుండడం సైతం డిమాండ్కు ఆజ్యం పోస్తోంది. పైగా క్విక్ కామర్స్ కంపెనీలు వీటిని నేరుగా కస్టమర్లకు 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. హైదరాబాద్, గోవా, బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్లోని బార్లు సరికొత్త మాక్టెయిల్స్ను తమ కస్టమర్లకు అందిస్తున్నాయి. కోలా పానీయాలు, తాజా లైమ్ సోడా, మొహిటో వంటి ఆల్కహాల్ రహిత పానీ యాలు మెనూలో వెనుక భాగంలో ఉండే రోజులు పోయాయన్నది మార్కెట్ వర్గాల మాట. -
గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్.. ఇదే ప్రధాన లక్ష్యం
మహిషి సంహారం కోసం ఈ లోకంలో ఉద్భవించిన హరిహర పుత్రుడు అయ్యప్పకు కేరళ సర్కారు ప్రపంచ వ్యాప్త పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. గల్ఫ్లోని అబుధాబి సహా.. వేర్వేరు దేశాల్లో ఇప్పటికే అయ్యప్ప స్వామి ఆలయాలున్నా.. అమెరికా నుంచి ఆచంట వరకు అయ్యప్ప భక్తులు ఏటా శబరిగిరీశుడిని దర్శించుకుంటున్నా.. కేరళలోని శబరి కొండపై కొలువుదీరిన అయ్యప్పను విశ్వవ్యాప్తం చేయాలని ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ)తో కలిసి సంకల్పించింది. ప్రభుత్వాలు శబరిమలను ఓ ఆదాయ వనరుగా మాత్రమే చూస్తున్నారంటూ ఇంతకాలం కొనసాగుతున్న అపవాదులను తుడిచిపెట్టేందుకు కేరళ సర్కారు ప్రపంచ అయ్యప్ప భక్తులను ఏకం చేస్తోంది. ఏటా మండల, మకరవిళక్కు సీజన్లలో శబరిమలకు వచ్చే భక్తుల సాధకబాధకాలను వినేందుకు తొలిసారి ‘గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్’ (global ayyappa conclave) పేరుతో భారీ సభను ఏర్పాటు చేస్తోంది. దేవుడు అంటే నమ్మకం లేని, కరడుగట్టిన కమ్యూనిస్టుగా పేరున్న కేరళ సీఎం పినరయి విజయన్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడపడం గమనార్హం..!ఎన్నారైలు మొదలు.. సామాన్యులకూ ఆహ్వానం3 వేల మంది అయ్యప్ప భక్తులకు సరిపడేలా పంపానది తీరంలో టీడీబీ, కేరళ సర్కారు భారీ కాన్క్లేవ్కు ఏర్పాట్లు చేశాయి. భారతీయులు స్థిరపడ్డ దాదాపు అన్ని దేశాలకు చెందిన అయ్యప్ప భక్తులను ఈ వేడుకకు ఆహ్వానించాయి. ఇక సామాన్య భక్తులకు కూడా చాలా సులభంగా అవకాశం కల్పించి, పాసులను జారీ చేశాయి. శబరిమల వర్చువల్ క్యూ వెబ్సైట్ ద్వారా ఏటా ఏదో ఒక సీజన్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకైతే.. సెల్ఫోన్లకు సందేశాలు పంపి మరీ ఆహ్వానించాయి. ఆన్లైన్లో సులభంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించి, ఐడీకార్డులను జారీ చేశాయి. అలా ఐడీకార్డులు డౌన్లోడ్ చేసుకున్న వారికి పేరుపేరునా ఫోన్ చేసి.. ‘‘మీరు తప్పకుండా వస్తున్నారు కదా? సెప్టెంబరు 20వ తేదీన మీరు ఉండాల్సిందే.. ఉదయం 8 గంటలకే రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మరిచిపోవొద్దు’’ అని కాన్క్లేవ్ తేదీని గుర్తుచేస్తున్నాయి. అయ్యప్ప ముందు అందరూ సమానమే అన్నట్లుగా.. సామాన్య భక్తులకు కూడా సభాస్థలి వద్ద ముందు వరసలో చోటు కల్పించాయి.ఇప్పుడే ఎందుకు?ఇప్పుడే ప్రభుత్వం, టీడీబీ ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి? అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయ్యప్ప భక్తులను కేటగిరీలుగా విభజించి, ఆదాయమార్గంగా మలచుకోవాలనేదే పినరయి సర్కారు ప్లాన్ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే.. ప్రభుత్వం మాత్రం.. ‘‘ఇది ఆరంభమే. సెక్యూలరిజాన్ని మీరే అర్థం చేసుకోవాలి. మాకు అంతా సమానమే. త్వరలో మైనారిటీలకూ గ్లోబల్ కాన్క్లేవ్ ఏర్పాటు చేస్తాం’’ అని చెబుతోంది.ఇదే ప్రధాన లక్ష్యంశబరిమల అయ్యప్ప స్వామి కీర్తిని ప్రపంచానికి చాటడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు టీడీబీ, ప్రభుత్వం చెబుతున్నాయి. అదే సమయంలో ఏటా మాసపూజలు, ఓనం, మండల, మకరవిళక్కు(మకరజ్యోతి) సీజన్లో అయ్యప్ప కొండకు వచ్చే భక్తుల సమస్యలను తెలుసుకుని, వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే ధ్యేయమని వివరిస్తున్నాయి. అయ్యప్ప భక్త సంఘాల ప్రతినిధులు చెప్పే సమస్యలను శ్రద్ధగా విని, రాబోయే సీజన్ నుంచే వాటిని పరిష్కరించనున్నట్లు పేర్కొంటున్నాయి. శబరిమల అభివృద్ధికి ఇటీవలి బడ్జెట్లో రూ.1,300 కోట్ల కేటాయింపు మొదలు.. కేంద్రం ఆమోదించిన రోప్వే ప్రాజెక్టు, పథనంతిట్టలో కొత్త విమానాశ్రయానికి, రైల్వే మార్గానికి చేస్తున్న ఏర్పాట్లు, త్వరలో పరిచయం చేయనున్న హెలిట్యాక్సీలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు వివరించనున్నట్లు కేరళ పర్యాటక శాఖ చెబుతోంది.స్వాగతం ఇలా..ఈ కార్యక్రమానికి వచ్చే అయ్యప్ప భక్తులకు పథనంతిట్ట జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం స్వాగతం పలుకుతుంది. శబరిమలకు దారితీసే మార్గాలు- సీతాథోడ్, పెరునాడ్, పంపా ప్రాంతాల్లో స్వాగత వేదికలను ఏర్పాటు చేసింది. కేఎస్ఆర్టీసీ ద్వారా ప్రత్యేక బస్సులను, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో భక్తులకు వసతి సదుపాయాలను సిద్ధం చేసింది. ఆహూతులందరికీ సెప్టెంబరు 20, 21 తేదీల్లో ప్రత్యేకంగా అయ్యప్ప దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. వ్యక్తిగత వాహనాల్లో వచ్చేవారికి హిల్ టాప్ వద్ద పార్కింగ్ సదుపాయం ఉంటుంది. పంపా వద్ద ప్రత్యేక ఆస్పత్రిని ప్రారంభించింది. ఇక పారిశుద్ధ్యం మొదలు.. తాగునీటి సదుపాయం, భోజనాలు వంటి ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు భారీ బందోబస్తును సిద్ధం చేసింది.బాలారిష్టాలెన్నెన్నో..గ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్ అనే భావన తెరపైకి వచ్చినప్పటి నుంచి ఈ కార్యక్రమానికి బాలారిష్టాలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు. అయితే.. ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ కార్యక్రమం రాజకీయాలకు దూరంగా ఉంటుందని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సుకుమారన్ నాయర్ స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో పలువురు ఈ కార్యక్రమాన్ని నిర్వహించకూడదంటూ కోర్టు మెట్లెక్కారు. దీని వల్ల రాణి ఫారెస్ట్, పెరియార్ రిజర్వ్ ఫారెస్ట్లలో పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలతో కేరళ హైకోర్టు ఏకీభవించడంతో.. ఓ దశలో కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. కేరళ సర్కారు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం సానుకూలంగా స్పందించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది.చదవండి: రూ.కోటి వ్యయంతో అతి పురాతన వైష్ణవాలయానికి పూర్వవైభవంపందళ రాజకుటుంబం దూరంగ్లోబల్ అయ్యప్ప కాన్క్లేవ్కు తాము దూరంగా ఉంటున్నట్లు పందళం రాజకుటుంబం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబరులో పందళ రాజమాత మృతి చెందిన నేపథ్యంలో.. ఈ నెల 27 వరకు తాము దైవదర్శనానికి రాకూడదని పందళం ప్యాలెస్ మేనేజ్మెంట్ కమిటీ వెల్లడించింది. తాము కార్యక్రమాన్ని వారం రోజులు వాయిదా వేయాలని కోరినా, ప్రభుత్వం పట్టించుకోలేదని వివరించింది. దీంతో.. నీలక్కల్ను దాటి తాము పంపావైపు రాలేమని తెలిపింది.శబరిమల అభివృద్ధికి దోహదం: ఎస్.శ్రీజిత్, అదనపు డీజీపీ''గ్లోబల్ కాన్క్లేవ్ ద్వారా శబరిమల అభివృద్ధికి కీలక ముందడుగు పడుతుంది. ఇది భవిష్యత్ని ఉద్దేశించి చేపట్టిన ఓ ప్రాజెక్టు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సమగ్రంగా చర్చిస్తాం. మున్ముందు అయ్యప్ప కీర్తిని ప్రపంచానికి చాటేలా కృషి చేస్తున్నాం.''అయ్యప్ప అందరివాడు: నాగ మల్లారెడ్డి, గురుస్వామి''అయ్యప్ప ముందు అందరూ సమానమే. స్వామి దగ్గర తరతమబేధభావాలుండవు. ఆయన అందరివాడు. ఇప్పుడు ప్రపంచ దేశాలవాడు అవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.''స్వామి మహిమలెన్నెన్నో: వైవి సుబ్బారెడ్డి, గురుస్వామి(కడప)''అయ్యప్ప మహిమలు ఎన్నో.. ఎన్నెన్నో..! నమ్మినవారి కొంగు బంగారం ఆ మణికంఠుడు. ఉదాహరణకు ఎరుమేలి నుంచి పంపాకు పెద్దపాదం మార్గం(45 కిలోమీటర్లు) ఎత్తైన కొండల మీదుగా ఉంటుంది. కఠిన దీక్షలు చేసి, భక్తిప్రపత్తులతో వస్తున్న వారికి ఈ దూరం ఒక లెక్కే కాదు. అలాంటి వారు ఏ మాత్రం అలసట లేకుండా వనయాత్రను పూర్తిచేసుకుంటారు. భక్తితో కాకుండా.. బలముందనే అహంకారంతో వచ్చేవారు 2 కిలోమీటర్లు నడిచినా.. 15 కిలోమీటర్ల దూరం నడిచామా? అనే భావన కలుగుతుంది. భక్తులకు కరిమల కొండ కఠిన పరీక్షలు పెడుతుంది. వాటిని అధిగమించి, స్వామిని చేరేవారి జన్మ ధన్యం.'' -
'ఏఐ' ముద్ర..పడాల్సిందే
డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలు ప్రపంచాన్ని కలవర పెడుతున్న అతిపెద్ద సమస్య. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఉపయోగించి రూపొందించే ఈ కంటెంట్ విషయంలో మన దేశం కఠిన నియమాలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే లక్ష్యంతో పార్లమెంటరీ కమిటీ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీడియోలను రూపొందించే కంటెంట్ క్రియేటర్లకు లైసెన్స్ తోపాటు.. వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వెల్లడించే లేబులింగ్ వంటి అంశాలు వీటిలో ఉన్నాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్కమ్యూనికేషన్లు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి.. లోక్సభ సభ్యుడు నిషికాంత్ దూబే నేతృత్వంలో ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవలే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఒక ముసాయిదా నివేదికను సమర్పించింది. నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ఏఐని ఉపయోగించే వ్యక్తులు లేదా కంపెనీలను గుర్తించి, విచారించడానికి కఠినమైన సాంకేతిక, చట్టపరమైన నియ మాలను అమలు చేయాలని కమిటీ తన నివేదికలో వెల్లడించింది. ఈ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తే.. భారత్లో కంటెంట్ క్రియేటర్స్ ఏఐని ఉపయోగించే విధా నం పెద్ద ఎత్తున మారుతుందని, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుందన్నది నిపుణుల మాట.బాధ్యులను పట్టుకోవచ్చుఏఐతో రూపొందిన తప్పుడు సమాచారం విషయంలో శిక్షా నిబంధనలను సవరించాలని, జరిమానాలను పెంచాలని కమిటీ తన నివేదికలో కోరింది. ‘ఏఐతో అభివృద్ధి చేసినట్టు తెలిపే సమాచారంతో వీడియోలు, చిత్రాలు, ఇతర అంశాలను ప్రజలు సులభంగా గుర్తించగలుగుతారు. అంతేకాకుండా నకిలీ వార్తలను వ్యాప్తి చేసిన బాధ్యులను సులభంగా పట్టుకోవచ్చు’ అని కమిటీ తెలిపింది. మీడియాకు విన్నపంనకిలీ వార్తలను కట్టడి చేసేందుకు బలమైన అంతర్గత రక్షణ చర్యలను చేపట్టాలని మీడియా సంస్థలను కూడా పార్లమెంటరీ కమిటీ కోరింది. సమాచారం నిజమేనా కాదా అన్నది తెలుసుకునే కఠిన తనిఖీ వ్యవస్థ, వార్తా ప్రసారంలో నాణ్యత, కచ్చితత్వం ప్రమాణాలను కాపాడే అంబుడ్స్మన్ ను నియమించాలని సూచించింది. మోసపూరిత కంటెంట్ సులభంగా వైరల్ అయ్యే యుగంలో ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడానికి ఇలాంటి చర్యలు చాలా అవసరమని అభిప్రాయపడింది.ఇప్పటికే కొన్ని..డీప్ఫేక్ సంబంధిత సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. నకిలీ ప్రసంగాలను అడ్డుకోగల; డీప్ఫేక్ వీడియోలు, చిత్రాలను గుర్తించగల సాధనాలను అభివృద్ధి చేయడానికి రెండు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నమ్మదగినవిగా మారతాయికంటెంట్ అభివృద్ధి విషయానికొస్తే ప్రతిపాదిత నిబంధనలు.. క్రియేటర్లను అడ్డుకునే ప్రయత్నం ఎంత మాత్రమూ కాదనీ, వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది నిపుణుల మాట. క్రియేటర్లు చేయాల్సిందల్లా తమ వీడియోలు, చిత్రాలను ఏఐతో రూపొందించినట్టు వీక్షకులకు కనిపించేలా వెల్లడించాలి. ఏఐతో రూపొందిన కంటెంట్తో నకిలీ వార్తలను వ్యాప్తి చేసే, పెట్టుబడి పెట్టే సృష్టికర్తలు, కంపెనీలను అడ్డుకోవడమే ఈ నిబంధనల లక్ష్యం. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు అందరికీ మరింత పారదర్శకంగా, నమ్మదగినవిగా మారతాయి. 10 కోట్లకు పైగా చానళ్లుభారత్లో 10 కోట్లకు పైచిలుకు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్టు సమాచారం. అయితే ఇందులో 7 లక్షల మంది క్రియేటర్లు మాత్రమే ఆదాయార్జన చేస్తున్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. ఈ సామాజిక మాధ్యమాలను వేదికలుగా చేసుకుని కోట్లాది మంది కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. రోజూ కోట్లాది వీడియోలు, చిత్రాలు పోస్ట్ చేస్తుంటారు. ఇంతటి విశాలమైన సామాజిక మాధ్యమాల ప్రపంచంలో తప్పుడు సమాచారం కట్టడి ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ పార్లమెంటరీ కమిటీ నిబంధనలు కఠినంగా అమలైతే కొంతైనా మార్పు రావడం ఖాయం అన్నది నిపుణుల మాట. భారత్లో కట్టడి చేస్తాం సరే.. అంతర్జాతీయంగా వచ్చి పడే కంటెంట్ను ఎలా నియంత్రిస్తారన్నది ముందున్న సవాల్. » సాధారణంగా సినిమా ప్రారంభంలో ‘చిత్ర నిర్మాణంలో జంతువులకు, పక్షులకు ఎలాంటి హానీ చేయలేదని, గ్రాఫిక్స్ ఉపయోగించాం’ అని ఓ ప్రకటన ఇస్తారు. అదే తరహాలో ఇప్పుడు.. కంటెంట్ ఏఐతో సృష్టించినట్టు వెల్లడించాల్సి ఉంటుంది. » ఏఐతో కంటెంట్ సృష్టించినట్టుగా వెల్లడించాలన్న తప్పనిసరి నిబంధన చైనాలో ఉంది.» యూరోపియన్ యూనియన్ గతేడాది ఏఐ యాక్ట్ను అందుబాటులోకి తెచ్చి దశలవారీగా అమలు చేస్తోంది. -
అసంతృప్త యువతరం
యువతరం అనగానే ఉరిమే ఉత్సాహం, నిత్య చైతన్యం నిండిన ముఖాలే గుర్తుకొస్తాయి. సాధారణంగా జీవితంలో అసంతృప్తి దశ అంటే మధ్య వయసు అని ఎన్నాళ్లుగానో ఒక నమ్మకం బలపడిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తాజా అధ్యయనంలో తేలింది. మధ్య వయస్కులకంటే జనరేషన్–జెడ్ (1996–2010 మధ్య పుట్టిన వారు)గా పిలుస్తున్న యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెల్లడైంది. భవిష్యత్తుపై అనిశ్చితి, సోషల్ మీడియా ప్రభావం, కోవిడ్–19 తర్వాత వచ్చిన మార్పులు తదితర పరిణామాలతో యువతలో అసంతృప్తి అధికంగా ఉందని 44 దేశాల్లో దీర్ఘకాలంపాటు నిర్వహించిన గ్లోబల్ సర్వేలో తేలింది. డేవిడ్ జి.బ్లాంచ్ఫ్లవర్, అలెక్స్ బ్రైసన్, జియావోయ్ జు అనే శాస్త్రవేత్తల బృందం ఈ అధ్యయన నిర్వహించింది. 2024 వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ వంటి పరిశోధనలను బట్టి చూస్తే మధ్య వయస్కులలోనే అసంతృప్తి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కానీ, ఈ సంప్రదాయ సూత్రీకరణ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పు అని ఈ శాస్త్రవేత్తులు చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) నిర్వహించిన సర్వేలోనూ దాదాపు ఇవే ఫలితాలు వచ్చాయి. దశాబ్దాలుగా పరిశోధకులు ‘మిడ్ లైఫ్ అన్హ్యాపినెస్ హంప్’ను ప్రామాణికంగా తీసుకుంటూ వచ్చారు. కానీ, ఇప్పుడు యువతలో.. అదీ కూడా 15 నుంచి 28 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో ఈ ధోరణి అధికంగా ఉందని గుర్తించారు. ఇందుకు సోషల్ మీడియా, ఆర్థిక అస్థిరత, కోవిడ్–19 దీర్ఘకాలిక ప్రభావాలు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిర పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటివి కారణమని తేల్చారు. స్కీ స్లోప్లోకిజెన్ జెడ్అధిక ఆదాయ దేశాల్లోని (హై ఇన్కమ్ కంట్రీస్)యువతలో అసంతృప్తి స్థాయి అధికంగా ఉంది. విభిన్న నేపథ్యాలున్న దేశాల్లోనూ ఈ పరిస్థితి పెరుగుతోంది.జెన్– జెడ్ అసంతృప్తిలో ‘స్కీ స్లోప్’ను అంటే.. పల్లంలోకి జారుకునే స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇతర అధ్యయనాల్లోని డేటా కూడా ఈ ధోరణిని సమరి్థస్తోంది. మానసికఆందోళన, ఒత్తిళ్లు, కుంగుబాటు అనేవి 16–19 ఏళ్ల మధ్యనున్న టీనేజర్లు, 20–24 ఏళ్ల మధ్య వయసులోని యువతలో అధికంగా ఉన్నట్టు తేలింది. గత పదేళ్లుగా యువతరం మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఈ బృందం ప్రచురించిన అధ్యయనంలో పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సీడీసీ నివేదికలోని అంశాలు..» యువకుల్లో మానసిక ఆరోగ్య సమస్యలు 1993లో 2.5% ఉండగా, 2024లో 6.6%కి పెరిగాయి. » యువతుల్లో ఇదే కాలంలో 3.2% నుంచి 9.3%కి చేరింది. » 2023 గ్యాలప్ సర్వేలో జెన్ జెడ్లో 15% మంది తమ మానసిక ఆరోగ్యం బాగా ఉందని తెలిపారు. » 1981–1996ల మధ్య జని్మంచిన 52% మిలీనియల్స్ (మధ్య వయసువారు) మానసిక ఆరోగ్యం మాత్రం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.సమస్యలకు కారణాలు.. » సోషల్ మీడియా అధిక వినియోగంతో అవాస్తవిక సామాజిక పోలికలు ఏర్పడి ఆందోళన, అసంతప్తి పెరుగుతోంది. జెన్ జెడ్ ఎక్కువగా ఆర్థిక ఆందోళన, అస్థిరతను ఎదుర్కొంటున్నారు. » కోవిడ్–19 వల్ల సామాజిక, విద్యా జీవితానికి ఏర్పడిన అంతరాయాలు యువత మానసిక ఆరోగ్యంపై శాశ్వత ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. » రాజకీయ అనిశ్చితి, వాతావరణ మార్పులపై అవగాహన పెరగడం యువతలో నిరాశ, భవిష్యత్తుపై అనిశ్చితి భావాలకు దారితీస్తోంది.పరిష్కారాలు..» యువతలో సంతోషాలు నింపేందుకు వ్యక్తిగత, సామాజిక జీవితాన్ని మెరుగుపర్చాలి. పాఠశాలల్లో ఫోన్ వాడకాన్ని నిషేధించాలి. » మెంటల్ హెల్త్ సర్వీసెస్ను పెంచాలి. » కౌమార దశ నుంచి వయోజనులుగా మారుతున్న క్రమంలో యువతకు సంబంధించి స్కూళ్ల విధానాలను నవీకరించడంతోపాటు డిజిటల్–సేఫ్టీ చర్యలు చేపట్టాలి. » సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి, చుట్టూ ఉన్నవారితో ప్రత్యక్ష సంబంధాలను ప్రోత్సహించాలి. » స్నేహితులతో అధిక సమయం గడపడం ద్వారా యువతలో ఆనందాన్ని మెరుగుపర్చవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు.- సాక్షి, హైదరాబాద్ -
మార్పు అవసరమే..అసాధ్యమేమీ కాదు..
దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు అవసరమని భారతీయులు భావిస్తున్నట్లు ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ తాజాగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే.. ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. ప్రజలు రాజకీయ వ్యవస్థలో ప్రక్షాళనను కోరుకుంటున్నారని, అయితే ప్రక్షాళన జరగటంపై సందేహాలు వ్యక్తం చేశారని ‘ప్యూ’ తెలిపింది. – సాక్షి, స్పెషల్ డెస్క్ప్రపంచ వ్యాప్తంగా భారత్, అమెరికా, కెనడా, గ్రీస్, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్ వంటి 25 దేశాలలో ‘ప్యూ’ నిర్వహించిన ఈ సర్వేలో 50 శాతానికిపైగా ప్రజలు తమ దేశ రాజకీయ వ్యవస్థలో మార్పులు లేదా పూర్తి సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 70 శాతానికిపైగా వ్యక్తం చేశారు. 2025 జనవరి 8 – ఏప్రిల్ 26 మధ్య ‘ప్యూ’ ఈ సర్వేను నిర్వహించింది. సర్వే కోసం 28,333 మంది అభిప్రాయాలు సేకరించింది.మార్పుపై మనవాళ్లుభారీ మార్పు అవసరం అన్న భారతీయులు 37 శాతం మంది కాగా, మొత్తం అంతా మారిపోవాలి అన్నవాళ్లు 34 శాతం మంది. అసలు మార్పే అవసరం లేదన్నవారు 9 శాతం మంది, చిన్నచిన్న మార్పులు అవసరం అన్నవారు 16 శాతం మంది. రాజకీయ వ్యవస్థ మారుతుందని 59 శాతం మంది భారతీయులు నమ్ముతుండగా, 10 శాతం మంది తమకు అలాంటి నమ్మకం లేదని తెలిపారు. 25 శాతం మంది కొద్దిపాటి మార్పులు చేస్తే బాగుంటుందని / అసలు మార్పులే అవసరం లేదని అన్నారు.కొన్ని దేశాల్లో పెదవి విరుపు రాజకీయ వ్యవస్థలో మార్పులు జరిగే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు వివిధ దేశాల ప్రజలు వేర్వేరుగా సమాధానాలు ఇచ్చారు. ఉదాహరణకు, దక్షిణ కొరియా వాసుల్లో 87 శాతం మంది రాజకీయ సంస్కరణలు అవసరమని చెప్పినప్పటికీ, అవి జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని అన్నారు. మొత్తం 25 దేశాల్లో ఒక్క భారతీయులు మాత్రమే రాజకీయ వ్యవస్థలో మార్పును కోరుకుంటూనే, ఆ మార్పులు జరుగుతాయన్న నమ్మకాన్ని కూడా ప్రబలంగా వ్యక్తం చేశారు. నాయకులపై సానుకూలతప్రపంచ దేశాలన్నిటిలోనూ నాయకులపై సానుకూల భావనే కనిపించింది. భారతీయులు కూడా – తమ దేశ రాజకీయాల్లో వ్యవస్థాగత మార్పులు అవసరం అంటూనే, తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వాల పట్ల ఎక్కువగా సదభిప్రాయాలనే వ్యక్తం చేశారు. ఎంపిక చేసిన ఐదు రకాల గుణగణాలు (నిజాయితీ, ప్రజావసరాలను అర్థం చేసుకోవటం, సమస్యలపై దృష్టి పెట్టటం, నైతిక ప్రవర్తన, యోగ్యతలు).. తమ నాయకులలో అవి ఉన్నదీ లేనిదీ గుర్తించమని ‘ప్యూ’ సర్వే అడిగినప్పుడు ఎక్కువమంది సానుకూలంగా స్పందించారు. భారతీయులదీ అదే తీరుభారతీయులు తాము ఎన్నుకున్న నాయకుల వ్యక్తిత్వంపై పూర్తి వ్యతిరేకంగా లేరు. 33 శాతం మంది తమ నాయకులు నిజాయితీకి, 31 శాతం మంది ప్రజావసరాలను అర్థం చేసుకునే నైజానికి, 27 శాతం మంది ప్రజా సమస్యలపై పెడుతున్న దృష్టికి, 27 శాతం మంది నైతికతకు, 23 శాతం మంది యోగ్యతలకు పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. మనకు నమ్మకం ఎక్కువేరాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని చెప్పిన దేశాల్లో నైజీరియా మొదటి స్థానంలో (51 శాతం)లో ఉండగా, దక్షిణ కొరియా రెండో స్థానంలో (43 శాతం), ఇండియా మూడో స్థానంలో (34) ఉన్నాయి. 7 శాతంతో స్వీడన్ చివరి స్థానంలో ఉంది. ఎప్పటికైనా మార్పులు జరుగుతాయన్న నమ్మకం ఉన్న దేశాల్లో ఇండియా, కెన్యా రెండూ సమానంగా (59 శాతం) ప్రథమ స్థానంలో ఉండగా; మార్పులు జరుగుతాయన్న నమ్మకం లేని దేశాల్లో ఇండియా (10 శాతం) ఆఖర్న, గ్రీసు మొదట (68 శాతం) ఉన్నాయి. ఇక నేతల వ్యక్తిత్వాలు, సామర్థ్యాలపై నమ్మకం ఉన్న ఆసియా–పసిఫిక్ దేశాలలో 28 సగటు శాతంతో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. మొదటి మూడు స్థానాల్లో వరుసగా ఆస్ట్రేలియా (41 శాతం), దక్షిణ కొరియా (34 శాతం), ఇండోనేషియా (31 శాతం) ఉన్నాయి. -
రేటే 'బంగార'మాయెనే..
సాక్షి, విశాఖపట్నం : పసిడితో భారతీయులకు ఉన్న అనుబంధం మరే దేశంలోనూ కనిపించదు. చేతిలో కొద్దిగా డబ్బులు కనిపిస్తే.. వెంటనే కొనుగోలు చేసేది బంగారాన్నే. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా.. పుత్తడి కొంటే.. శుభసూచకమని అంటుంటారు. అందుకే స్వర్ణం.. సమస్తమయమైపోయింది. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, డిమాండ్ నేపథ్యంలో రోజురోజుకీ పసిడి ధర పైపైకి ఎగబాకుతూ.. ఆల్టైమ్ హై రేట్ని నమోదు చేస్తోంది. ఒకప్పుడు 10 గ్రాముల ధరతో ఇప్పుడు గ్రాము కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి. వారం రోజులుగా ఎగబాకుతున్న బంగారాన్ని చూసి.. వెండి కూడా అదే బాటలో దూసుకుపోతోంది. లక్ష రూపాయల కంటే దిగువకు బంగారం ధర దిగే రోజులు ఇప్పట్లో కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తగ్గేదేలే అంటున్న పుత్తడి గత వారం రోజులుగా బంగారం ధర తగ్గేదేలే అన్నట్లుగా దూసుకుపోతోంది. ఈ నెల 8వ తేదీన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08, 380 ఉండగా.. 9వ తేదీన రూ.1,10,290కి చేరుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.1.10 లక్షలకు తక్కువ కాలేదు. వెండి కూడా ధగధగ మెరిసిపోతోంది. ఈ నెల 8న కిలో వెండి ధర రూ.1.37 లక్షలు ఉండగా.. 15వ తేదీ నాటికి రూ.6 వేలు పెరిగి రూ.1.43 లక్షలకు చేరుకుంది. అంటే రోజుకు దాదాపు రూ.1000 చొప్పున పెరుగుతూ వస్తోంది. పెట్టుబడి విషయంలోనూ బంగారమే..! రోజు రోజుకీ ధర పెరుగుతూ వస్తున్నా బంగారం కొనుగోలు విషయంలో మాత్రం ప్రజలు అస్సలు తగ్గేదే..లే అంటున్నారు. ఎందుకంటే ఇంట్లో పసిడి ఎంత ఉంటే అంత ఎక్కువ సొమ్ము ఉన్నట్లుగా భావిస్తారు. వాస్తవానికి బంగారం నిరర్థక ఆస్తి. ఎంతో కష్టించి సంపాదించిన సొమ్ము బంగారంగా మార్చితే బీరువాల్లోనూ, బ్యాంకు లాకర్లలోనూ భద్రంగా ఉంచడం తప్ప... మరో ప్రయోజనం ఏంటి..? భవిష్యత్తులో ధర పెరిగి, పెరిగిన ధరకు దాన్ని విక్రయిస్తేనే లాభం. మనకు తెలిసినంత వరకూ బంగారం కొనడమే కానీ.. విక్రయించడమన్నది అరుదు. దీని బదులు వాటిని ఉత్పత్తి కార్యకలాపాలకు వెచ్చిస్తే సంపద సృష్టి జరుగుతుంది. మన దేశంలో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయడంలో బంగారం మూడో స్థానాన్ని ఆక్రమించింది. ముడిచమురు, క్యాపిటల్ గూడ్స్ తర్వాత అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న సరకు బంగారమేనన్నది విస్మయపరిచే అంశం. ఇటీవల కాలంలో మనదేశంలో బంగారం కొనుగోళ్లు అధికమై.. నగదు పొదుపు మొత్తాలు తగ్గిపోతున్నాయి. గృహస్తులు ఇతర వాటిపై ఒక్క శాతం పెట్టుబడులు పెడుతుండగా బంగారంపై మాత్రం ఆరున్నర రెట్లు ఎక్కువ మొగ్గు చూపుతుండటం విశేషం. బంగారానికి ఇంత వన్నె ఎందుకో..? పుత్తడి ఎంత ఉన్నా సగటు వ్యక్తికి మోజు తీరడం లేదు. తన శక్తి మేరకు బంగారాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అసలు బంగారానికి ఇంత వన్నె ఉండటానికి కారణం అంతర్జాతీయ కరెన్సీకి ప్రత్యామ్నాయం కావడమే. ఒక దేశం జారీ చేసిన నోట్లు చెల్లకపోవడం. వాటి విలువ క్షీణించడం ఉంటుంది. కానీ బంగారానికి అలాంటి బేధాలేమీ లేవు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎంతో కొంత ధరకు చెలామణి అవుతుంది. అందుకే స్వర్ణానికి అంత కళ. ధర తగ్గినా పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ప్రపంచ స్వర్ణమండలి(డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం ప్రస్తుతం దేశంలోని సంస్థలు, గృహస్తులు, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద 25 వేల టన్నుల బంగారం ఉంది. భారత్లో మొత్తం ఇళ్లల్లోనూ, ఇతర అవసరాలకు ఈ బంగారం వివిధ రూపాల్లో నిల్వ ఉంది. ఇందులో విశాఖ నగర జనాభా ప్రకారం 80 నుంచి 100 టన్నుల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం సగటున విశాఖ నగరంలో ప్రతి ఇంటిలోనూ 15 నుంచి 25 గ్రాములు వరకూ బంగారం ఉంటుదని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోళ్లు తగ్గినా.. మార్కెట్ దూసుకుపోతోంది టెక్స్టైల్స్ మార్కెట్ 15 నుంచి 20 శాతం పడిపోయింది. బంగారం మార్కెట్ కూడా 15 నుంచి 20 శాతం పడిపోయింది. మార్కెట్ విలువ మాత్రం బంగారం విషయంలో ఏమాత్రం తగ్గలేదు. చైనా, భారత్ వంటి దేశాలు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నాయి. గతంలో పసిడి ధర మూడు నాలుగు రోజులకోసారి మారేది. ఇప్పుడు ఒక పూట ఉన్న రేటు మరో పూటకు ఉండటం లేదు. బులియన్ మార్కెట్ కూడా అంచనా వేయలేకపోతోంది. పెట్టుబడుల విషయంలోనూ బంగారానికి మంచి డిమాండ్ ఉంది. బంగారంతో వెండి పోటీ పడుతోంది. బ్యాటరీ కార్లలో వెండి వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ధరల పెరుగుదలకు ఓ కారణమని చెప్పవచ్చు. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ పాస్ట్ ప్రెసిడెంట్ -
అతివకు.. 'పాష్ప'తాస్త్రం!
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్లో టాప్–30 సంస్థలలో.. గతేడాది లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మహిళా ఉద్యోగులు తమ సమస్యల గురించి గొంతు విప్పేందుకు ధైర్యంగా ముందుకు వస్తున్నారనడానికి ఇది సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క సంస్థలు కూడా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తున్నాయి. 2023–24లో వచ్చిన ఫిర్యాదుల్లో 88 శాతం పరిష్కారం కావడమే ఇందుకు నిదర్శనం. – సాక్షి, స్పెషల్ డెస్క్బీఎస్ఈలోని టాప్–30 కంపెనీలకు.. తమ మహిళా ఉద్యోగుల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో లైంగిక వేధింపులకు సంబంధించి మొత్తం 958 ఫిర్యాదులు అందాయి. 2023–24లో వీటి సంఖ్య 902. అంటే ఏడాదిలో ఫిర్యాదుల సంఖ్య 6.2 శాతం పెరిగింది. ఫిర్యాదుల్లో పెరుగుదలకు ‘పాష్’ చట్టమే ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.ఏమిటీ పాష్ చట్టం?ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ (పాష్) యాక్ట్ను అధికారికంగా ‘పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013’ అని పిలుస్తారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకారానికి వ్యవస్థలను ఏర్పాటుచేసి కంపెనీలు ఊరుకోవడం లేదు. ఫిర్యాదుల పట్ల కూడా సీరియస్గానే వ్యవహరిస్తున్నాయి. వాటి పరిష్కారం కోసమూ చర్యలు చేపడుతున్నాయి. 2023–24లో టాప్–30 బీఎస్ఈ కంపెనీలలో పాష్ కింద నమోదైన 902 కేసుల్లో 88% పరిష్కారం అయ్యాయని లైంగిక వేధింపుల నివారణపై కంపెనీలకు సలహాలు ఇస్తున్న ‘కంప్లైకరో’ అనే సంస్థ తెలిపింది. ‘ఇది గొప్ప మార్పునకు సూచిక’ అని మహిళా ఉద్యోగులు చెబుతున్నారు.ప్రభుత్వ పర్యవేక్షణభారత ప్రభుత్వ షీ–బాక్స్ పోర్టల్లో అన్ని కంపెనీలు (పెద్దవి లేదా చిన్నవి) తమ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను నమోదు చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. అలాగే నిబంధనల అమలును పర్యవేక్షించడానికి ప్రతి జిల్లాలో కార్మిక కమిషనర్లు సర్వేలు చేయాలని ఆదేశించింది. అన్ని కంపెనీలు ఒకేచోట నమోదు కావడంతో షీ–బాక్స్ పోర్టల్లో బాధితులు తమ పాష్ ఫిర్యాదును దాఖలు చేయడం సులభతరమైంది. విచారణ ప్రక్రియను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందనే విషయం ఉద్యోగికి మరింత ధైర్యం, ఊరటనిస్తుందని నిపుణులు అంటున్నారు. పాష్ ఫిర్యాదులు, నిబంధనల అమలులో ప్రస్తుత సంవత్సరం ఒక విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని విశ్వసిస్తున్నట్టు కంప్లైకరో వెల్లడించింది. పాష్ చట్టాన్ని పాటించడానికి పెద్ద కంపెనీలే కాదు, ఎంఎస్ఎంఈలు కూడా ముందుకు వచ్చాయి. ఈ కంపెనీల నుంచి రోజుకు సగటున 7–8 ఫిర్యాదులు వస్తున్నాయని వివరించింది.అవగాహన పెరిగిందిపాష్ ఫిర్యాదులు పెరగడం అంటే.. పని ప్రదేశాల్లో సమస్యల పట్ల బాధితులు తమ గొంతు వినిపించడానికి ధైర్యంగా ముందుకు రావడమేనని హెచ్ఆర్ నిపుణులు అంటున్నారు. ‘సంవత్సరాలుగా బాధితులు నిశ్శబ్దంగానే ఉన్నారు. పాష్ పట్ల మహిళల్లో అవగాహన పెరిగింది. తాము ఎదుర్కొంటున్న వేధింపులకు పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం పెరుగుతోంది. అందుకే ధైర్యంగా ఎక్కువ మంది ఈ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు’ అని వారు చెబుతున్నారు. బ్యాంకుల నుంచే ఎక్కువఆసక్తికర విషయం ఏమంటే బీఎస్ఈ టాప్–30 కంపెనీల్లో గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఫిర్యాదులలో బ్యాంకు ఉద్యోగుల నుంచి 34% ఫిర్యాదులు వస్తే, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న సిబ్బంది నుంచి 31.5% వచ్చాయి. మూడింట రెండు వంతులు లేదా 627 ఫిర్యాదులు ఈ రెండు రంగాల నుంచే అందాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గరిష్టంగా 125 ఫిర్యాదులను అందుకుంది. 2023–24లో ఈ సంస్థలో 110 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ 117 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఫిర్యాదుల పరంగా ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
నిజాం రాజు.. తలొగ్గిన రోజు
సాక్షి, హైదరాబాద్ : అదిగో సుశిక్షితులైన సైనికుల కవాతు.. వినీలాకాశంలో సమున్నతంగా రెపరెపలాడిన త్రివర్ణ పతాక దృశ్యం అదిగో.. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించిన భారత సైనికులకు నీరాజనాలు పలుకుతున్న జనుల జయజయ ధ్వానాలవిగో.. 1948 సెప్టెంబరు 17న భాగ్యనగరంలో కనువిందు చేసిన దృశ్యం ఇది. నిజాం నిరంకుశ, రాచరిక పాలనకు చరమగీతం పాడిన రోజు ఇది. రజాకారుల అకృత్యాలతో నలిగిపోయిన ప్రజలు ఈ రో జు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. ఆనందోత్సాహాలతో వేడుకలు చేసుకున్నారు. భారత యూనియన్ బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతమై నిజాం నిరంకుశ పాలన అంతమైన ఆ రోజుపై భిన్నాభిప్రాయాలు, విభిన్న దృక్పథాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ సంస్థానం సువిశాలమైన భారత యూనియన్లో భాగమైంది. ఒక నవ శకం ప్రారంభమైంది. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిణామాలు వేగంగా జరిగాయి. భారత సైన్యం అన్ని వైపుల నుంచి నగరానికి చేరువైంది. హైదరాబాద్ ప్రధాని లియాఖత్ ఉదయమే తన పదవికి రాజీనామా చేశారు. ఓటమి అనివార్యమని నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్కు తెలిసిపోయింది. కేఎం మున్షీని కింగ్కోఠికి పిలిపించాడు. ‘పోలీసు చర్యను ఆహ్వానిస్తూ భద్రతా సమితికి ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని’ మున్షీ సూచించారు. ఈ మేరకు రేడియోలో ప్రసంగించాలని కోరారు. అందుకు నిజాం అంగీకరించాడు. కానీ.. అప్పటి వరకు రేడియోలో ప్రసంగించిన అనుభవం లేని నిజాం నవాబు దక్కన్ రేడియో స్టేషన్కు వెళ్లి తన లొంగుబాటును ప్రకటించాడు. అదే రోజు నిజాం సైన్యాధ్యక్షుడు ఇద్రూస్, భారత సైనిక బలగాల కమాండర్ జేఎన్ చౌధురి ఒక నిర్ణీత ప్రదేశంలో కలుసుకున్నారు. ‘బేషరతుగా లొంగిపోతున్నట్లు’ ఇద్రూస్ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. చౌధురి జట్కా బండి నగరంలోకి పరుగులు తీసింది. జనం జేజేలు.. నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ఉదయం నుంచే వార్తలు వెలువడ్డాయి. అప్పటి వరకు ఏ క్షణంలో ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందో తెలియని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో గడిపిన నగరవాసులు.. నెమ్మదిగా వీధుల్లోకి వచ్చారు. సికింద్రాబాద్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లోని రహదారులన్నీ జనంతో నిండిపోయాయి. భారత సైనికులకు స్వాగతం పలుకుతూ జేజేలు పలికారు. వేలాదిగా తరలి వచ్చిన జనంతో పరేడ్ గ్రౌండ్స్ జనసంద్రమైంది. త్రివర్ణ పతాకలు రెపరెపలాడాయి. ‘మహాత్మా గాందీకి జై’, పండిట్ నెహ్రూ జిందాబాద్, సర్దార్ పటేల్ జిందాబాద్, భారత్మాతాకీ జై’ అంటూ జనం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘రజాకార్ ముర్దాబాద్’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. బొల్లారం నుంచి భారత సైనిక బలగాలు పరేడ్ గ్రౌండ్స్కు చేరుకున్నాయి. మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాచరిక పాలన 1948 సెప్టెంబరు 17వ తేదీతో అంతమైంది. ఐదు రోజుల పోలీసుచర్య... హైదరాబాద్ సంస్థానంపై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య సెప్టెంబరు 13వ తేదీ సోమవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. లెఫ్ట్నెంట్ జనరల్ మేజర్ రాజేంద్రసింగ్ నేతత్వంలో మేజర్ జనల్ జె.ఎన్.చౌధురి దీనికి సారథ్యం వహించారు. భారత సైన్యం నలు వైపుల నుంచి హైదరాబాద్ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. షోలాపూర్ నుంచి బయలుదేరిన సైన్యం నల్దుర్గ్ కోటను స్వాదీనం చేసుకొని తల్ముడి, తుల్జాపూర్ మీదుగా హైదరాబాద్ వైపునకు వచ్చింది. మేజర్ జనరల్ డీఎస్ బ్రార్ ముంబై నుంచి, ఆపరేషన్ కమాండర్ మేజర్ జనరల్ ఎ.ఎ. రుద్ర విజయవాడ వైపు నుంచి బ్రిగేడియర్ శివదత్త బేరార్ నుంచి బయలుదేరారు. అన్ని వైపుల నుంచి భారత సైన్యం హైదరాబాద్ను ముట్టడించింది. భారత వైమానిక ఎయిర్ మార్షల్ ముఖర్జీ సైతం తన సేవలను అందజేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో నిజాం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. 1948 సెప్టెంబరు 14న దౌలతాబాద్, జల్నా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్, నిర్మల్, సూర్యాపేట్, వరంగల్, ఖమ్మం ప్రాంతాలను సైన్యం తన స్వాదీనంలోకి తీసుకుంది. లాతూర్, జహీరాబాద్ ప్రాంతాల్లో నిజాం సైనికులపై భారత సేనలు బాంబుల వర్షం కురిపించాయి. సెప్టెంబరు 16న రాంసింగ్ నేతృత్వంలోని సైనికులు జహీరాబాద్ను ఆక్రమించుకున్నారు. షోలాపూర్ నుంచి హైదరాబాద్ వరకు యూనియన్ సైనికుల పాదాక్రాంతమైంది. నిజాం సైనికులు బీబీనగర్, పటాన్చెరు, గచ్చిబౌలి, లింగంపల్లి, మల్కాపూర్ తదితర ప్రాంతాల్లో మందుపాతరలు పేల్చి సైన్యాన్ని అడ్డుకొనేందుకు విఫలయత్నం చేశారు. సైన్యం మరింత ముందుకు చొచ్చుకొని వచ్చింది. నిజాం సైన్యాధికారి ఎల్ ఇద్రూస్ చేతులెత్తేశారు. సెప్టెంబరు 17 సాయంత్రం 5 గంటలకు భారత సైనికులు హైదరాబాద్లోకి ప్రవేశించారు. ఇదీ హైదరాబాద్ సంస్థానం..» ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంతో పాటు, మహారాష్ట్ర, కర్ణాటకలోని హైదరాబాద్ సంస్థానం విస్తీర్ణం సుమారు 1,41,133 చదరపు కిలోమీటర్లు. » చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఆయన కింద 975 మంది జాగీర్దార్లు ఉండేవారు. వీరి అ«దీనంలో సాగుకు అనుకూలమైన 53,106 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది. » 1921 నవంబర్లో ఆంధ్ర మహాసభ ఏర్పాటైంది. రాజకీయ సంబంధమైన ఒక సంస్థ నిజాం సంస్థానంలో ఏర్పడడం ఇదే మొదటిసారి. 1923లో ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ ఏర్పాటు చేశారు. » గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం 1937లో అనేక ప్రావిన్స్లలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ప్రభావం హైదరాబాద్ సంస్థానంపై పడింది. ‘బాధ్యతాయుతమైన ప్రభుత్వం కావాలని’ ఆంధ్ర మహాసభ మొదటిసారిగా రాజకీయ డిమాండ్ను బాహాటంగా ప్రకటించింది. ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో కన్నడ పరిషత్, మహారాష్ట్ర పరిషత్ కూడా ఏర్పడ్డాయి. హైదరాబాద్ సంస్థానంలో కాంగ్రెస్ ప్రారంభమైంది. -
ఒకటి కాదు.. మల్టిపుల్ రిటైర్మెంట్స్ కావాలి
ఉద్యోగ విరమణ అనేది సాధారణంగా రిటైర్మెంట్ వయసు వచ్చినపుడు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, రిటైర్మెంట్ అనేది ఉద్యోగ, వృత్తిగత జీవితానికి ముగింపు కాదని ఓ విరామం మాత్రమేనని నవ యువతరం బలంగా వినిపిస్తోంది. ఇప్పుడు వివిధ రకాల ఉద్యోగాల్లో, పని ప్రదేశాల్లో, ఇతరత్రా పరిస్థితులు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారతీయులు మల్టీ రిటైర్మెంట్లకు మొగ్గుచూపుతున్న ధోరణి క్రమంగా పెరుగుతోంది. – సాక్షి, హైదరాబాద్బహుళ–పదవీ విరమణలు తీసుకోవాలనే ధోరణి వివిధ తరాలకు చెందిన వారిలో పెరుగుతుండగా.. యువ, మధ్య వయసు్కల్లో అధికంగా ఉంటోంది. హెచ్ఎస్బీసీ సంస్థ తాజాగా నిర్వహించిన ‘క్వాలిటీ ఆఫ్ లైఫ్–అఫ్లూయెన్స్ ఇన్వెస్టర్ స్నాప్షాట్–2025’అధ్యయనంలో ఇలాంటి ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. భారత్ సహా 12 దేశాల్లో 10 వేల మందికి పైగా సంపన్న వయోజనుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించారు. ఇందులో జెన్జెడ్–మిల్లీనియల్స్ తరానికి చెందిన వారు రిటైర్మెంట్ను ఉద్యోగ అంతం లేదా విరమణగా చూడకుండా... విరామాలతో మళ్లీ కొనసాగించే పనిగా సూత్రీకరిస్తుండటం గమనార్హం. ఇలా తీసుకునే రిటైర్మెంట్లు మూడునెలల నుంచి ఏడాది దాకా ఉంటున్నాయి. ముందు వరుసలో భారతీయులుప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ ధోరణిలో భారతీయులు ముందువరుసలో ఉండటం విశేషం. అయితే సంపన్న వర్గాల వారే మల్టీ–రిటైర్మెంట్స్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా పని చేసేవారు 55–60 ఏళ్ల వయసు వచ్చే దాకా ఆగకుండా నలభైల్లోనే ఈ రిటైర్మెంట్లు తీసుకుంటున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ కల్చర్కే జెన్–జెడ్ (1997–2012 మధ్య జన్మించిన వారు), మిల్లీనియల్స్ (1981–96 మధ్య పుట్టిన వారు) ఓటు వేస్తున్నారు. డిజిటల్ మాధ్యమాల ప్రభావాల మధ్య పుట్టి పెరిగిన వారు కాబట్టి జెన్–జెడ్ను డిజిటల్ నేటివ్స్గానూ పరిగణిస్తున్నారు. జీవనశైలి, అభిరుచులు, అలవాట్లకు తగ్గట్టుగా మూడు నెలల నుంచి ఏడాది దాకా మినీ రిటైర్మెంట్ తీసుకుంటున్న వారే అధికంగా ఉంటున్నారు. ఇలా కెరీర్లో బ్రేక్ తీసుకోవడం ద్వారా తమ జీవనశైలిని మెరుగుపరుచుకునేలా రీచార్జ్ కావడంతోపాటు తమ అభిరుచులను మరింత గాఢంగా ఆస్వాదించేందుకు అవకాశం దొరుకుతుందని వీరు భావిస్తున్నారు. ఇలాంటి బ్రేక్ల వల్ల తమ వృత్తిగత జీవితం, కెరీర్, లైఫ్స్టైల్ మరింత మెరుగవుతుందనే భావనలో వారున్నారు. వర్క్–రిటైర్మెంట్–వర్క్ అంటే... మొదట కొన్నేళ్లపాటు ఉద్యోగం, వ్యాపారం ఇతర వ్యాపకాలు చేసి 40–45 ఏళ్ల మధ్యవయసులో రిటైర్మెంట్ తీసుకుంటారు. విరామం అనేది అది కొన్ని నెలల నుంచి సంవత్సరం దాకా ఉండొచ్చు. తర్వాత మళ్లీ తిరిగి మరేదైనా ఉద్యోగం, వ్యాపారం వంటి దాన్ని ఎంచుకుంటారు. కొత్త బాటలో.. బహుళ పదవీ విరమణలను జీవనశైలి మెరుగు కోసం తీసుకుంటున్న వాటిగానే భావించాలి తప్ప సంప్రదాయ కెరీర్ విరామంగా కాదు. బహుళ–పదవీ విరమణలతో కొంతమంది తమ సంపదను కూడబెట్టుకునేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నారు. తమ కుటుంబాల అవసరాలకు అనుగుణంగా కొత్త దిశలను ఎంచుకుంటున్నారు. –హెచ్ఎస్బీసీ అధ్యయనకర్తలు సర్వేలోని ముఖ్యాంశాలు..» సగటున 44 ఏళ్ల వయసులో తొలి మినీ రిటైర్మెంట్ తీసుకోవాలనే భావనలో భారతీయులు ఉంటే.. ప్రపంచస్థాయి సగటు 47 ఏళ్లుగా ఉంది. » తమ జీవిత కాలంలో ఇలాంటి రిటైర్మెంట్ కనీసం ఒకటి తీసుకోవాలని భావిస్తున్న సంపన్న భారతీయులు 48శాతం. » ఇలాంటి విరామాలు 2, 3 తీసుకోవాలనే ఆలోచనతో ఉన్న భారతీయులు 44 శాతం. వీరిలో కొందరు ఆరేళ్లకోసారి బ్రేక్ తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. » మొత్తంగా 85 శాతం మంది మల్టీ రిటైర్మెంట్లకు సై అంటున్నారు. మల్టీ రిటైర్మెంట్తో తమ జీవనశైలిలో మంచి మార్పును గమనించినట్టు చెబుతున్నారు.» కనీసం ఒక చిన్న పదవీ విరమణ తీసుకున్న వారిలో 87% మంది తమ జీవితాన్ని సానుకూలంగా ప్రభావితం చేసిందన్నారు. » పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కూడిన కుటుంబసభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి 34 శాతం ఈ పద్ధతిని ఎంచుకుంటున్నారు. » బహుళ రిటైర్మెంట్లతో శారీరక, మానసిక, భావోద్వేగ పరమైన అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నవారు 31 శాతం. నిర్దేశిత సెలవుల పరిమితులు లేకుండా ప్రయాణించడం, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేíÙంచేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటామన్న వారు 30 శాతం. » ఇది తమ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు, వ్యక్తిగత అభివృద్ధికి దోహదం చేస్తుందన్న వారు 28 శాతం. » కెరీర్ లక్ష్యాలను తిరిగి అంచనా వేయడానికి పని నుంచి విరామం తీసుకోవడం కొత్త అవకాశాలకు దారితీస్తుందని అంచనా వేస్తున్న వారు 25 శాతం. -
గోడు వింటున్నారు.. పరిష్కారం చూపుతున్నారు
మోర్తాడ్ (బాల్కొండ): కరీంనగర్కు చెందిన రాహుల్రావు ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. దురదృష్టవశాత్తు అతను అక్కడ బ్లడ్ కేన్సర్కు గురయ్యాడు. అతనికి బోన్మ్యారో చికిత్స చేయాల్సి ఉంది. అతని రక్తం పంచుకుని పుట్టిన వారే తమ వారి శరీరంలో నుంచి ఎముకను ఇస్తేనే రాహుల్ బతికి బట్టకట్టగలడని వైద్యులు స్పష్టం చేశారు. రాహుల్ సోదరుడు రుతిక్రావు అందుకు సిద్ధం కావడంతో అతను లండన్ వెళ్లడానికి, వైద్య ఖర్చుల కోసం ప్రవాసీ ప్రజావాణిలో రాహుల్ తల్లి మంగ అభ్యర్థన పత్రం అందించింది. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్రావు సోదరుడు లండన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించడంతో పాటు ఖర్చు కోసం రూ.10 లక్షలను మంజూరు చేసింది. ప్రవాసీ ప్రజావాణి వినతికి స్పందించిన జిల్లా కలెక్టర్ కూడా తన విచక్షణాధికారాలను ఉపయోగించి రూ.లక్ష సాయం మంజూరు చేశారు. ప్రవాసీ ప్రజావాణి (Pravasi Prajavani) ద్వారానే తమ కుటుంబానికి రూ.11 లక్షల సాయం అందిందని రాహుల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.గంగయ్యకూ విముక్తి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం కొడిచెర్లకు చెందిన కంచు గంగయ్య 18 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉండిపోయాడు. అతను ఇంటికి రావడానికి పాస్పోర్టు లేకపోవడం, పరాయి దేశంలో సాయం చేసేవారు లేకపోవడంతో గంగయ్య భార్య లక్ష్మి ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విదేశాంగ శాఖతో, బహ్రెయిన్లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడటంతో గంగయ్య ఇటీవల ఇంటికి చేరుకున్నాడు. తాము చూస్తామో చూడమో అనుకున్న వ్యక్తి 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఇంటికి చేరడానికి ప్రవాసీ ప్రజావాణి మార్గం చూపిందని గంగయ్య కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రాహుల్, గంగయ్యలకే కాదు గల్ఫ్ దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ వాసులు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపే దిశగా అడుగులు వేస్తోంది.2024, సెప్టెంబర్ 16న హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్లో ప్రారంభించిన ప్రవాసీ ప్రజావాణితో ప్రవాసులైన తెలంగాణ వాసులకు వరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ప్రవాసీ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని ఏ మూలన ఉన్న వారైనా తమవారు విదేశాల్లో ఏమైనా ఇబ్బంది పడితే వారి సమస్యను ప్రవాసీ ప్రజావాణి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుండటం విశేషం. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ ప్రవాసీ ప్రజావాణిని పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు ఎన్నారై అడ్వైజరీ బోర్డు చైర్మన్ బీఎం వినోద్కుమార్, వైస్చైర్మన్ మంద భీంరెడ్డి, ఇతర సభ్యులు ప్రవాసీ ప్రజావాణిలో పాల్గొంటూ వలస కార్మికుల కుటుంబ సభ్యులు ఇచ్చే వినతులను స్వీకరిస్తున్నారు.ఇప్పటి వరకు వందకు పైగా కుటుంబాల వినతులకు ప్రవాసీ ప్రజావాణి పరిష్కారం చూపడం ఎంతో ఊరటనిచ్చే విషయం. గతంలో గల్ఫ్ దేశాల్లో ఎవరైనా మరణిస్తే వారి మృతదేహాలు ఇంటికి చేరడానికి నెలల సమయం పట్టేది. ప్రవాసీ ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తే అధికార యంత్రాంగం స్పందించి వారం, పది రోజుల వ్యవధిలోనే కడసారి చూపు దక్కేలా చేస్తోంది. ఆర్థిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథంతో ప్రజావాసీ ప్రజావాణిని కొనసాగిస్తుండటం వలసదారుల కుటుంబాలకు ఎంతో ధీమా ఇచ్చే కార్యక్రమం అని భీంరెడ్డి ఈ సందర్భంగా ‘సాక్షి’తో చెప్పారు. వలసదారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందని చెప్పడానికి ప్రవాసీ ప్రజావాణి గొప్ప నిదర్శనమని తెలిపారు. వలసదారుల జీవితాల్లో వెలుగులు వలసదారుల జీవితాల్లో ప్రవాసీ ప్రజావాణి వెలుగులు నింపుతోంది. ప్రతి వారంలో రెండు రోజుల పాటు ప్రవాసీ ప్రజావాణిని నిర్వహించి వినతులను స్వీకరిస్తుండటం ఎంతో గొప్ప విషయం. వలస కార్మికులకు మేమున్నాం అనే ధీమాను ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. – రంగు సుధాకర్గౌడ్, ఎన్నారై, లండన్ -
కిమ్.. ‘క్రీమ్’.. బంద్
సంచలనాలకు నెలవైన ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఐస్ క్రీం అనేది ఇక ఆ దేశంలో వినిపించకూడదని నిర్ణయించారు. ఈ తరహా నిర్ణయాలు కిమ్ గతంలోనూ తీసుకున్నాడని చదివే ఉంటారు. వాటిని ఉల్లంఘిస్తే ఎంతటి భయంకరమైన శిక్షలు ఉంటాయో కూడా తెలిసే ఉండొచ్చు. మరి ఐస్ క్రీంపై కిమ్కు ఎందుకు కోపమొచ్చింది? ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచవ్యాప్తంగా ఐస్క్రీం అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా వినిపించే పదమే. కానీ, ఇప్పుడది కొరియా రాజకీయాల్లో కీలకంగా మారింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్కు ఆ పదం కోపం తెప్పించింది. దీంతో ఆ పదమే ఇక దేశంలో ఏమూల కూడా వినిపించకూడదని ఆయన నిర్ణయించారు. బదులుగా.. ఎసుకిమో లేదంటే ఒరుంబోసూంగీ అని పిలవాలని ఆదేశాలు జారీ చేశారు. నార్త్ కొరియన్ భాషలో ఈ పదాలకు అర్థం మంచు లాలీపాప్ లేదంటే మంచు ఐస్ బార్.డెయిలీ నార్త్ కొరియా కథనం ప్రకారం.. ఉత్తర కొరియాలో.. మరీ ముఖ్యంగా పర్యాటక రంగంలో పాశ్చాత్య (Western) పదాల వాడకం ఎక్కువగా ఉంటోంది. వాటిని కట్టడి చేసే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా దక్షిణ కొరియాలా.. తమ దేశమూ కట్టుదాటి ఆ తరహా భాషకు బానిస అవ్వకూడదనే కిమ్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు టూర్ గైడ్లకు స్థానిక పదాలను ఉపయోగించేలా శిక్షణ ఇస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. సాధారణంగా.. ఏ దేశంలో అయినా టూర్ గైడ్లు పర్యాటకులకు దగ్గరయ్యేందుకు ‘భాష’ను ఉపయోగిస్తుంటారు. అయితే కిమ్ నిర్ణయాలను బహిరంగంగా విమర్శిస్తే ఏం జరుగుతుందో అక్కడి ప్రజలకు తెలుసు. అందుకే ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూనే.. టూర్ గైడ్లు శిక్షణ పొందుతున్నారు. మూడు నెలల కాలపరిమితో కొనసాగే ఈ ట్రైనింగ్ ప్రొగ్రాం ఆగస్టు 21వ తేదీనే ప్రారంభమైంది. అయితే ఈ విధంగా భాషను నియంత్రించడం ద్వారా తన ప్రజలను, పర్యాటకులను విదేశీ ప్రభావాల నుండి దూరంగా కిమ్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.అయితే ఈ నిర్ణయం కేవలం ఐస్ క్రీమ్కు మాత్రమే పరిమితం కాలేదు. హ్యామ్బర్గ్ ఇలా మరికొన్ని పదాలను కూడా లోకల్ భాషలోనే పిలవాలనే హుకుం జారీ అయ్యింది. పూర్తిగా ఉత్తర కొరియా సంస్కృతితో కొనసాగుతూ.. విదేశీ పదాలను, మరీ ముఖ్యంగా దక్షిణ కొరియా కల్చర్ ప్రభావం ఇక్కడి పర్యాటకంలో ఉండకూడదనే కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారని అక్కడి పర్యాటక కంపెనీలు చెబుతున్నాయి. ఉల్లంఘిస్తే.. ఉత్తర కొరియాలో పాశ్చాత్య.. దక్షిణ కొరియా పదజాలాలంపై నిషేధం కొనసాగుతోంది. ఒకవేళ దీనిని గనుక ఉల్లంఘిస్తే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మూడు నుంచి ఐదేళ్లపాటు నిర్బంధ కూలీగా కిమ్ ప్రభుత్వం కోసం పని చేయాలనే శిక్ష విధిస్తారు. ఆ సమయంలో సరైన భోజనం, వైద్య వసతులు అందవు. లేదంటే కుటుంబాలను వెలివేస్తారు. భారీగా జరిమానాలతో పాటు ఆస్తులనూ జప్తు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది కేవలం భాష ఉల్లంఘన మాత్రమే కాదు.. ఆన్టీ-సోషలిస్టు చర్యగా పరిగణించే అవకాశం లేకపోలేదు. అలాంటి సందర్భాల్లో.. మరణశిక్ష కూడా విధించొచ్చు. కొసమెరుపు..ఎస్కిమోలు.. ఈ పదం ఎక్కడైనా విన్నట్లు ఉందా?.. అలస్కా, కెనడా, గ్రీన్లాండ్, సైబీరియా.. అర్కిటిక్ రీజియన్లోని మంచు ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజలు. అయితే.. ఇప్పుడా పదం అవుట్డేటెడ్ అయ్యింది. కొన్ని తెగలు ఆ పదాన్ని అభ్యంతరకరంగా కూడా భావిస్తున్నాయి. అందుకే ఈ పదం పెద్దగా వినియోగంలో కనిపించడం లేదు. అలాంటిది ఈ పదం ఇప్పుడు నార్త్ కొరియాలో ప్రముఖంగా వినిపిస్తుండడం ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. ఇంగ్లీష్ నుంచి నేరుగా పదాన్ని తీసుకోవద్దనే ప్రయత్నంగా కనిపిస్తోంది. కిమ్.. కొన్ని సంచలన నిర్ణయాలువిదేశీ వినోదం.. మీడియాపై నిషేధం: ఉత్తర కొరియాలో విదేశీ సినిమాలు, సంగీతం, టీవీ షోలు చూడటం నేరంగా ప్రకటించారు. దీన్ని "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించి కఠిన శిక్షలు విధించారు.మొబైల్ ఫోన్లపై నియంత్రణ: విదేశీ నెట్వర్క్లను ఉపయోగించే మొబైల్ ఫోన్లు కలిగి ఉండటం నేరం. ప్రజలు గోప్యంగా మాట్లాడటం, సమాచారం పంచుకోవడం నిషేధంహాట్డాగ్లపై నిషేధం: పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే హాట్డాగ్ వంటి ఆహారాలను తినడం, తయారు చేయడం నిషేధించారు. ఇది "దేశద్రోహం"గా పరిగణించబడుతోంది.బుదాయ్-జిగే (Korean-American fusion dish) నిషేధం: దక్షిణ కొరియా నుండి వచ్చిన మాంసం, బీన్స్, సాసేజ్లతో తయారయ్యే ఈ వంటకం మార్కెట్లలో అమ్మకాన్ని నిలిపివేశారు.వివాహ విభజనపై శిక్షలు: విడాకులు తీసుకునే దంపతులను కారాగార శిక్షలకు గురిచేశారు. ఇది "ఆన్టీ-సోషలిస్టు" చర్యగా పరిగణించబడుతోంది.ఆధ్యాత్మిక స్వేచ్ఛపై.. మత స్వేచ్ఛ, కార్యక్రమాలు, సంఘాలు ఏర్పరచడం వంటి పౌర హక్కులను పూర్తిగా నిషేధించారు.జూలై 8, డిసెంబర్ 17 తేదీల్లో పుట్టినరోజులపై నిషేధం: ఈ తేదీలు కిమ్ గత పాలకులు కిమ్ ఇల్-సంగ్ , కిమ్ జోంగ్-ఇల్ చనిపోయిన తేదీలు. దీంతో.. ఆరోజుల్లో ఉ.కొ. పౌరులు పుట్టినరోజు చేసుకోకూడదుహెయిర్స్టైల్, లెదర్జాకెట్లపై నిషేధం: కిమ్ ప్రభుత్వానికి నచ్చని హెయిర్స్టైల్లు వేసుకోవడం నేరంగా మారింది. ప్రత్యేకంగా నిర్దేశించిన స్టైల్లే అనుమతించబడ్డాయి. అలాగే కిమ్ వేసుకునే జాకెట్లు, డ్రెస్సింగ్ స్టయిల్ను ఫాలో అయినా సరే అది నేరమే. అలాగే.. యువత ఆలోచనా స్వేచ్ఛను కట్టడి చేసేందుకు, విదేశీ సమాచారం పొందకుండా ఉండేందుకు ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. పైనే చెప్పుకున్న నేరాలన్నీ శిక్షార్హమైన నేరాలే. వీటికి పాల్పడినవారిని శ్రమ శిబిరాలకు పంపించడం సాధారణంగా మారింది. అక్కడ వారు జీతం లేకుండా, భద్రత లేకుండా పనిచేయాల్సి ఉంటుంది.ఒకవేళ అదే నేరాన్ని కిమ్ తీవ్రంగా భావిస్తే మాత్రం.. అక్కడి ప్రజలు ప్రాణాలు వదులుకోవాల్సిందే!. -
విదేశీ విద్య: కొత్త కోర్సులు.. సరికొత్త దేశాలు
విదేశాల్లో చదువుకోవాలని ఎవరికి ఉండదు? అక్కడే చదువుకుని, స్థిరపడాలన్నదీ కోట్లాదిమంది భారతీయుల కల. యూఎస్, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలోని పేరొందిన యూనివర్సిటీలకు వెళ్లడం అనేది గతం. ఇప్పుడు ట్రెండ్ క్రమంగా మారుతోంది. సంప్రదాయ దేశాలకు బదులుగా భారతీయ విద్యార్థులు నూతన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు.ఎంబీబీఎస్ విద్య కోసం మధ్య ఆసియాలోని కిర్గిస్తాన్ ఇంజనీరింగ్ కోసం కంబోడియా, సప్లై చైన్ మేనేజ్మెంట్ చదివేందుకు మాల్టా, సాంస్కృతిక అధ్యయనాల కోసం ఉత్తర కొరియాకు చలో అంటున్నారు మన విద్యార్థులు. దేశీయంగా తీవ్రమైన పోటీ, అమెరికాలో రోజుకో రకంగా మారుతున్న విధానాలు; ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో వలసలపై పెరుగుతున్న వ్యతిరేకత, వీసాల లభ్యత కఠినతరం కావడం; పలు ఇతర దేశాల్లో విద్యా వ్యయాలు పెరుగుతుండడం.. వీటన్నింటి కారణంగా నూతన కోర్సుల కోసం కొత్త దేశాల బాట పడుతున్నారు.సరికొత్త గమ్యస్థానాలుమాల్టా, పోలాండ్, లాత్వియా, సైప్రస్ వంటిచిన్న యూరోపియన్ దేశాలు వివిధ ప్రోగ్రామ్స్లో భారతీయులు సహా విదేశీయులకు సులభంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. అలా అక్కడ చదివిన గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు, అధునాతన డిగ్రీల కోసం ఫ్రాన్ ్స, జర్మనీ, యూకే, మధ్యప్రాచ్యాలకు వెళ్తున్నారు. రొమేనియా, బల్గేరియా, హంగేరీలలోని భారతీయ ఇంజనీరింగ్ విద్యార్థులు చౌకైన స్థానిక ప్రోగ్రామ్స్లో చేరుతున్నారు. కానీ చాలామంది అధిక జీతాలు, అంతర్జాతీయ ఎక్స్పోజర్ కోసం జర్మనీ, నెదర్లాండ్స్, స్కాండినేవియాకు మారుతున్నారు. అలాగే బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్లలో ఎంబీబీఎస్ చేసినవాళ్లు.. ఎక్కువ జీతాల కోసం మధ్య ప్రాచ్యదేశాలకు మరలుతున్నారు.లైటింగ్, లైట్ డిజైన్ఆర్కిటెక్చరల్, వేడుకల కోసం వేదికలు, నగరాల్లోని భవంతుల్లో లైటింగ్ కోసం కళాత్మకతను సాంకేతికతతో జోడించేలా శిక్షణ పొందడం. కేంద్రాలు: మిలాన్ (ఇటలీ), బిల్బావ్ (స్పెయిన్ ), స్టాక్హోం (స్వీడన్ ).మ్యూజిక్ థెరపీ భావోద్వేగ,ఆలోచన, శారీరక స్వస్థత కోసంసంగీతాన్ని వైద్యసాధనంగాఉపయోగించడం.కేంద్రాలు: లిమెరిక్(ఐర్లాండ్), నెదర్లాండ్స్.క్రూజ్ లైన్ నిర్వహణ ప్రపంచ క్రూజ్ పరిశ్రమ కోసం రూపొందించినప్రత్యేక ఆతిథ్య, కార్యకలాపాలకు సంబంధించిన విద్యా కార్యక్రమాలు. కేంద్రాలు: స్పెయిన్,స్విట్జర్లాండ్మాలిక్యులర్ గ్యాస్ట్రోనమీ నురగ (ఫోమ్), జెల్స్తదితరాలతో రుచులు, భోజన అనుభవాలను మార్చడానికి శాస్త్రాన్ని ఉపయోగించడం.కేంద్రాలు:స్పెయిన్, జపాన్,నెదర్లాండ్స్గేమ్ డిజైనింగ్గ్రీన్ సప్లై చైన్ పర్యావరణ అనుకూల, సమర్థవంతమైన, తక్కువ కర్బన ఉద్గారాలున్న రవాణా వ్యవస్థల రూపకల్పనకేంద్రాలు: స్వీడన్,డెన్మార్క్, నెదర్లాండ్స్వీడియో గేమ్స్ను సృష్టించడం, అభివృద్ధి, తయారీ; కేంద్రాలు: ఫిన్లాండ్హ్యుమానిటేరియన్ లాజిస్టిక్స్ విపత్తుల నుంచి ఉపశమనం, సహాయం, పంపిణీ, సంక్షోభ సమయంలో ప్రతిస్పందన కోసం సరఫరా వ్యవస్థల నిర్వహణకేంద్రాలు: ఫిన్లాండ్, బెల్జియం,స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికాసరఫరాను మించిన డిమాండ్ఈ ఏడాది 22 లక్షలకు పైగా నీట్ అభ్యర్థులు.. భారత్లో కేవలం 1.18 లక్షల ఎంబీబీఎస్ సీట్ల కోసం పోటీ పడ్డారు. అంటే అంతరం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే విద్యార్థులు సంప్రదాయేతర దేశాలవైపు చూస్తున్నారు.చౌకైన ఎంపికభారత్లోని ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ‘చాలా తక్కువ ఖర్చు’తో.. ఎంబీబీఎస్విద్యార్థులను తూర్పు యూరప్, మధ్య ఆసియా దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఉజ్బెకిస్తాన్ ఒక్కటే 6వేలకుపైగా విద్యార్థులకు ఆతిథ్యం ఇస్తోంది. విజయవాడ, వరంగల్, తిరుపతి వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతోందని ఏజెన్సీలు చెబుతున్నాయి.ఖర్చు ఎంతంటే?భారత్ (ప్రైవేట్లో ఎంబీబీఎస్):పూర్తి డిగ్రీకి రూ.1 కోటికిపైగాఉజ్బెకిస్తాన్/రష్యా/ఫిలిప్పీన్పూర్తి ఎంబీబీఎస్కు రూ.15–35 లక్షలుపోలండ్/చెక్ రిపబ్లిక్: ఏడాదికి రూ.9.5–17.5 లక్షలు (ట్యూషన్+జీవన వ్యయం)జర్మనీ (ప్రభుత్వ విశ్వవిద్యాలయం):సంవత్సరానికి రూ.30,000-సాక్షి, స్పెషల్ డెస్క్ -
నలుగురిలో ఒకరు ట్యూషన్కు!
పాఠశాల విద్యార్థుల్లో దాదాపు నలుగురిలో ఒకరు ఇప్పుడు ట్యూషన్లు లేదా ప్రైవేట్ కోచింగ్ మీద ఆధారపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ ధోరణి మరింత ఎక్కువగా ఉంది. ట్యూషన్ల కోసం ఏటా ప్రతి విద్యార్థిపై చేస్తున్న సగటు వ్యయం గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండింతలు అధికంగా ఉండడం గమనార్హం. – సాక్షి, స్పెషల్ డెస్క్జాతీయ నమూనా సర్వే (ఎన్స్ ఎస్ఎస్) 80వ రౌండ్ కింద కేంద్ర ప్రభుత్వం 2025 ఏప్రిల్–జూన్ మధ్య విద్యపై సమగ్ర సర్వే చేపట్టింది. అడ్మిషన్ల విషయంలో గ్రామీణ భారతంలో ప్రభుత్వ పాఠశాలలదే పైచేయిగా ఉందని సర్వే తేల్చింది. పట్టణ ప్రాంత కుటుంబాలు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చేర్పించేందుకే మొగ్గు చూపుతున్నాయి అంతేకాదు మార్కుల వేటలో భాగంగా తమ పిల్లలను ట్యూషన్లకూ పంపిస్తున్నాయి.ట్యూషన్ల కోసం వ్యయంప్రస్తుత విద్యా సంవత్సరంలో దేశంలో 27 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ కోచింగ్ తీసుకుంటున్నారు. ప్రాంతాలవారీగా చూస్తే పట్టణాల్లో 30.7%, గ్రామీణ భారత్లో 25.5% మంది ప్రైవేట్ కోచింగ్పై ఆధారపడ్డారు. దేశంలో సగటున ఒక్కో విద్యార్థి ట్యూషన్స్ కోసం రూ.2,409 వెచ్చిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కోచింగ్ కోసం సగటు ఖర్చు రూ.1,793 కాగా, పట్టణాల్లో రూ.3,988 అవుతున్నట్టు అంచనా. ఇంటర్ స్థాయిలో పట్టణ కుటుంబాలు కోచింగ్ కోసం ఒక్కో విద్యార్థికి రూ.9,950 ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.4,548.పట్టణాల్లో ప్రైవేట్ విద్యకు..గ్రామీణ ప్రాంతాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. 33.9% మంది ప్రైవేట్, ఇతర సంస్థలలో చదువుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో కేవలం 30.1% మంది విద్యార్థులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. దాదాపు 70% మంది ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు. మొత్తంగా దేశ సగటు చూ స్తే.. అడ్మిషన్లలో 55.9% వాటా ప్రభుత్వ పాఠశాలలదేనని సర్వే పేర్కొంది.పట్టణ ప్రాంతాల్లో అధికంప్రభుత్వ పాఠశాలల్లో ఫీజులు ఉండవు. కానీ, ట్యూషన్లు, ర వాణా, స్టేషనరీ, ఇతర ఖర్చులు పెరిగాయి. ప్రైవేటులో అయితే వీటికి ఫీజు, యూనిఫాం వంటివి అదనంగా చేరతాయి. దీంతో ప్రతి విద్యా ర్థికి అవుతున్న వార్షిక వ్యయం రూ.23,470గా సర్వే అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.8,382గా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే.. పట్టణ ప్రాంత విద్యార్థికి రూ.4,128, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,639 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వేతర పాఠశాలల విషయంలో ఇది.. పట్టణప్రాంతాల్లో రూ.31,782, గ్రామీణ ప్రాంతాల్లో 19,554గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఫీజుల కోసం చేస్తున్న సగటు వార్షిక వ్యయం రూ.15,143 కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది రూ.3,979.⇒ ఇంటర్మీడియెట్ చదువుతున్న విద్యార్థుల విషయంలో దేశంలో 37% మంది ప్రైవేట్ కోచింగ్కు సై అంటున్నారు. పట్టణాల్లోని ఇంటర్ స్టూడెంట్స్లో 44.6 మంది ట్యూషన్లకు వెళ్తున్నారు.⇒ ప్రైవేట్ ట్యూషన్స్ కోసం దేశంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులు సగటున ఏటా రూ.6,384 ఖర్చు పెడుతున్నారు. ⇒ కోచింగ్ సంస్థలు చెల్లించిన వస్తు, సేవల పన్ను 2019–20లో రూ.2,240 కోట్లు. 2023–24కి వచ్చేసరికి ఇది రూ.5,517 కోట్లకు చేరింది.⇒ కోచింగ్ కోసం అమ్మాయిల కంటే అబ్బాయిలు కొంచెం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. సగటున ఏటా అమ్మాయిలు రూ.2,227, అబ్బాయిలు రూ.2,572 వ్యయం చేస్తున్నట్టు సర్వే పేర్కొంది. -
హారన్ మోగించరు.. గీత దాటరు
ఆ ప్రాంతం పేరు జొకోసంగ్.. నగరంలోని అతి ప్రధాన రోడ్డు.. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉండటంతో సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒకవైపు వెళ్లే ట్రాఫిక్ అధికంగా ఉంది.. ఆ వైపు వాహనాలు నిలిచి పెద్ద వరస ఏర్పడింది.. మరోవైపు మాత్రం రోడ్డు ఖాళీగా ఉంది.. కానీ రోడ్డు మధ్యలో డివైడర్ లేకున్నా.. ఒక్క వాహనం కూడా గీత దాటలేదు. ఆ నగర పర్యటనకు వచ్చిన ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ఈ దృశ్యాన్ని చూసి అశ్చర్యపోయింది. ప్రజల్లో ఆ పరిణతికి అభినందనలు అంటూ నగర మేయర్కు లేఖ రాసింది. ఆ సిటీని చూసి నేర్చుకోండి అంటూ ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులకు సచిత్ర లేఖ పంపింది. ఆ నగరమే ఈశాన్య రాష్ట్రమైన మిజోరం రాజధానిఐజోల్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐజోల్ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు.. కానీ, కూడళ్లలో వాహనాలు అదుపు తప్పవు. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేనప్పటికీ వాహనాలు నియంత్రణ కోల్పోవు. రోడ్డు మీద వందల సంఖ్యలో వాహనాలు ముందుకు సాగుతున్నా.. ఎక్కడా హారన్లు వినపడవు, వాహనాలు ఒకదాని వెనక ఒకటి వరస కట్టి వెళ్తాయే తప్ప ఓవర్టేక్ చేయవు.. డ్రైవర్లు పరస్పరం అరుచుకోవటం, తిట్టుకోవటం మచ్చుకు కూడా కనిపించవు.. పాదచారులు ఫుట్పాత్ల మీదుగా మాత్రమే నడుస్తారు, అర్ధరాత్రి వేళ రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు కూడా రోడ్లమీదుగా నడవరు. ఇవన్నీ నమ్మశక్యం కాని నిజాలు. ఐజోల్ నగరంలో ఏ మూలకెళ్లినా ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. ప్రకృతి ఒడిలో కొలువై.. కొండలు, లోయలు, దట్టమైన అడవులు, నదులు, వాగులు వంకలు.. స్వచ్ఛమైన ప్రకృతిలో కొలువైన ఆ నగరంలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. దాదాపు 2.20 లక్షల వాహనాలున్నప్పటికీ హారన్ల మోతలు లేకపోవటంతో శబ్ద కాలుష్యం ఉండదు. ఇది స్థానికుల క్రమశిక్షణ ఫలితం. అందుకే ఐజోల్ నగరాన్ని ‘ది సైలెంట్ సిటీ ఆఫ్ ఇండియా’అంటారు. ఇక్కడి ప్రజల్లో స్వీయ క్రమశిక్షణ పుట్టుకతో వస్తుందని అంటున్నారు. 4.21 లక్షల జనాభా ఉన్న నగరంలో నేరాలు అతి తక్కువ. మద్య నిషేధం కట్టుదిట్టంగా అమలవుతుండటంతో ప్రశాంతత రాజ్యమేలుతోంది. ప్రభుత్వ నిబంధనలు తు.చ.తప్పకుండా పాటిస్తున్న ప్రజలు, ఎలాంటి ఉల్లంఘనలకు ఆసక్తి చూపరు. దీంతో ఆ నగరంలో ప్రజల క్రమశిక్షణపై అధ్యయనానికి దేశంలోని చాలా నగరాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇంతకాలం విమానయానంతోనే.. ఐజోల్కు వెళ్లాలంటే ఇంతకాలం విమానయానమే అవకాశంగా ఉంది. అది ఖర్చుతో కూడుకున్నది కావటంతో చాలామంది అక్కడికి వెళ్లలేకపోయారు. ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో శనివారం నుంచి రైల్వే అనుసంధానం అందుబాటులోకి రావడంతో అధ్యయనాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కొండలతో కూడుకున్న ప్రాంతం కావటంతో విశాలమైన రోడ్ల నిర్మాణానికి వీలులేదు. కొండ అంచుల్లో వెనకవైపు లోయల్లోకి పిల్లర్లు ఏర్పాటు చేసి వాటి ఆధారంగా ఇళ్లను నిర్మిస్తుంటారు. ఉన్న కాస్త స్థలంలో 30 అడుగుల వెడల్పు రోడ్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రజలు ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా క్రమశిక్షణతో రోడ్లను వాడుకుంటున్నారు. రోడ్లపై డివైడర్లు ఉండవు, కేవలం ట్రాఫిక్ లైన్స్మాత్రమే గీసి ఉంటాయి. అయినా.. ఓ వైపు ఉన్న వాహనం ఎట్టి పరిస్థితిలో గీత దాటి మరోవైపు వెళ్లదు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు మాన్యువల్గా మాత్రమే ట్రాఫిక్ నియంత్రిస్తుంటారు. వారు చేయి ఎత్తగానే ఠక్కున వాహనాలు నిలిచిపోతాయి. ముందు వాహనాలు మందగమనంతో సాగినా వెనక వాహనదారులు పొరపాటున కూడా హారన్ మోగించరు. సారీ చెప్పి ఓవర్టేకింగ్..» ఎవరైనా అత్యవసరంగా ముందుకు సాగాల్సి ఉంటే, వాహనాలను ఓవర్టేక్ చేసి పక్క వాహనదారుకు సారీ చెప్పి మరీ వెళ్లటం అక్కడి ప్రత్యేకత. రాత్రి వేళ ట్రాఫిక్ పోలీసులు లేని సమయంలో కూడా కూడళ్లలో వాహనదారులు నియంత్రణ కోల్పోరు. » ఘాట్ రోడ్లు కావటంతో అన్నీ మలుపులు తిరిగిన రోడ్లే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా హారన్ల మోత వినిపించదు. మరీ షార్ప్ కర్వ్ ఉండి, భారీ వాహనాలు వచ్చే రోడ్డయితే స్వల్పంగా ఒకసారి హారన్ మోగిస్తారు.» తక్కువ వెడల్పు రోడ్లే అయినా, అన్ని చోట్లా ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. పాదచారులు కచి్చతంగా ఫుట్పాత్పైనే నడుస్తారు. అర్ధరాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉన్నా.. ఫుట్పాత్ల గుండానే ముందుకు సాగుతారు.» టాక్సీలకు రోడ్ల మీదే పార్కింగ్ కల్పించారు. వాటికి 20 శాతం స్థలం ఉంటుంది. అవి వరసగా ఆగి ఉన్నా.. పక్కనుంచి మిగతా వాహనాలు ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంటాయి. » ఫుట్పాత్ల వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు, పార్కింగ్, హారన్లు మోగించకపోవటం, అక్రమ నిర్మాణాలు రాకుండా నియంత్రించటం.. తదితర అంశాలపై పాఠశాలల స్థాయిలోనే విద్యార్థులకు అవగాహన కల్పించటం అక్కడి ప్రభుత్వాలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. -
దక్షిణాదిన తొలి ‘హంటర్హుడ్’ ఫెస్టివల్!
డుగ్గు డుగ్గు బండిపై ‘బుల్లెట్’లా దూసుకెళ్తున్న కుర్రకారు స్ట్రీట్ కల్చర్లోనూ దుమ్మురేపుతున్నారు. అందుకే, బుల్లెట్ బండి అంటే ఠక్కున గుర్తొచ్చే రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ఈ లోకల్ ఆర్టిస్టులకు దన్నుగా నిలుస్తోంది. అర్బన్ రైడర్ల కోసం ప్రత్యేకంగా మలిచిన ‘హంటర్ 350’ బైక్ స్ఫూర్తితో ‘హంటర్హుడ్’ వేడుకలకు తెరతీసింది. దక్షిణాదిన ఈ తొలి ఫెస్టివల్ను తాజాగా చెన్నైలో నిర్వహించింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ డీజే బెంకీ బేకు... క్రేజీ రీమిక్స్లతో ఈవెంట్ను ఆరంభించారు. స్ట్రీట్ ఆర్టిస్ట్లు వేసిన బైకింగ్ పెయింటింగ్లు అబ్బురపరిచాయి. మరోపక్క, స్కేట్బోర్డింగ్ మ్యూజిక్ కలగలిపి సాగిన ఈవెంట్ మరో హైలైట్. స్థానిక తీన్మార్ డప్పుల దరువుకు సింగర్లు పాడిన లోకల్ పాటలు వేరే లెవెల్. లోకల్ హిప్హాప్ సింగర్స్ ఇక్కీ బెర్రీ, అసల్ కోలార్, ఆరీవు తదితరుల తమిళం, ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్స్తో ఇక్కడి ఐలాండ్ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లింది. ఇక డ్యాన్సర్లు కూడా బీట్కు అనుగుణంగా క్రేజీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విభిన్న ఆర్టిస్టులు ఈవెంట్ ఆసాంతం స్ట్రీట్ కల్చర్ వైబ్తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఏప్రిల్లో తొలిసారి... ఈ ఏడాది ఏప్రిల్లో తొలిసారిగా రాయల్ ఎన్ఫీల్డ్ ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ను ఒకేసారి ఢిల్లీ, ముంబై నగరాల్లో నిర్వహించింది. ఈ సందర్బంగా ‘హంటర్ 350’ 2025 ఎడిషన్ను రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ తదితర రంగుల వేరియంట్లలో ఆవిష్కరించింది. ఆధునిక రెట్రో లైఫ్స్టయిల్ కోరుకునే నవతరం యువతను ఆకట్టుకునేలా స్టయిల్, వినోదం, దూకుడును కలగలిపి హంటర్ 350 బైక్ను మలిచామని రాయల్డ్ ఎన్ఫీల్డ్ చెబుతోంది. మరోపక్క, హిప్హాప్, ర్యాప్, స్ట్రీట్ డ్యాన్స్, స్కేట్బోర్డింగ్లలో లోకల్ టాలెంట్ను ప్రోత్సహిస్తూ... స్ట్రీట్ కల్చర్కు దన్నుగా నిలవడమే ‘హంటర్హుడ్’ ఫెస్టివల్ ప్రధాన లక్ష్యంగా పేర్కొంది. క్రమంగా మరిన్ని నగరాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించే ప్రణాళికల్లో కంపెనీ ఉంది.గ్రాఫైట్ గ్రే.. సూపర్బ్ హంటర్ 350లో కొత్తగా ప్రవేశపెట్టిన గ్రాఫైట్ గ్రే వేరియంట్ను చెన్నై హంటర్హుడ్ ఫెస్టివల్లో ఎన్ఫీల్డ్ ప్రత్యేకంగా ప్రదర్శించింది. ఇప్పటికే యూత్కు బాగా కనెక్ట్ అవుతున్న హంటర్ బైక్.. ఈ సరికొత్త షేడ్తో మరింత ఆకట్టుకుంటోంది. బైకింగ్ యాక్సెసరీలు, లైఫ్స్టయిల్ గేర్తో పాటు ట్రెండింగ్లో ఉన్న స్ట్రీట్ వేర్ ఉత్పత్తులను కూడా ఈ సందర్భంగా వివిధ బ్రాండ్లు తమ స్టాల్స్లో ప్రదర్శించాయి. కాగా, 350సీసీ లోపు బైక్లపై జీఎస్టీ రేటును ఇప్పుడున్న 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన నేపథ్యంలో (ఈ నెల 22 నుంచి అమలు) ఎన్ఫీల్డ్ హంటర్పై గరిష్టంగా రూ.22,000 తగ్గింపును ప్రకటించిన సంగతి తెలిసిందే.శివరామకృష్ణ మిర్తిపాటి (చెన్నై నుంచి సాక్షి బిజినెస్ ప్రతినిధి) -
60 తర్వాత.. ఆచితూచి..!
మనలో చాలా మంది పదవీ విరమణ ప్రణాళిక గురించి పెద్దగా పట్టించుకోరు. ఎప్పుడో వృద్ధాప్యంలో పలకరించే రిటైర్మెంట్ గురించి యవ్వనంలో ఉన్నప్పుడు చర్చించడం వారికి నచ్చదు! మధ్య వయసు వచ్చే వరకు అభిరుచులు, ఆకాంక్షలు, కోరికల చుట్టూ సాగిపోతుంటారు. దీంతో రిటైర్మెంట్కు ప్రాధాన్యం పక్కకు వెళ్లిపోతుంది. తీరా రిటైర్మెంట్ పలకరించిన తర్వాత, అప్పటి వరకు తాము వెనకేసింది అవసరాలకు ఎంత మాత్రం సరిపోదని తెలుసుకుని ఆందోళన చెందాల్సి వస్తుంది. అనారోగ్యంతో ఒక్కసారి ఆస్పత్రిపాలైతే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి రావచ్చు. లిక్విడిటీ తగినంత లేని సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల.. క్లిష్ట సమయాల్లో రోజువారీ ఖర్చులకు సైతం కటకట ఎదుర్కోవాల్సి రావచ్చు. మెరుగైన రాబడి లేని సాధనాలను నమ్ముకోవడం వల్ల రిటైర్మెంట్ ఫండ్ దీర్ఘకాలం పాటు అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందుకే పదవీ విరమణ తర్వాత.. ముఖ్యంగా 60 ఏళ్ల తర్వాత వేసే ప్రతి అడుగు ఆర్థికంగా ఆచితూచి ఉండాలి. ఉద్యోగంలో మాదిరే పదవీ విరమణ తర్వాత కూడా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే ప్రణాళిక ఉండాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పటి వరకు సమకూర్చుకున్న ఫండ్ (పొదుపు నిధి)ను వివిధ సాధనాల్లో పెట్టుబడి పెట్టి.. ప్రతి నెలా నిర్ణిత మొత్తాన్ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేసుకోవాలి. ‘‘పెట్టుబడి నుంచి మొదటి ఏడాది 3–4 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. రెండో ఏడాది నుంచి ద్రవ్యోల్బణం సూచీ స్థాయిలో ఉపసంహరణకు పరిమితం కావాలి’’ అని నెర్డిబర్డ్ వెల్త్ అడ్వైజరీ ప్రిన్సిపల్ ఆఫీసర్ శిల్పా భాస్కర్ గోలే సూచించారు. ఉపసంహరణలో చిన్న తేడా వచ్చినా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం పాటు కాపాడుకోలేరు. ఉదాహరణకు రూ.2 కోట్ల నిధి ఉందనుకోండి. ఏటా 8 శాతం వృద్ధి చెందుతూ, ప్రతి నెలా రూ.లక్ష ఉపసంహరించుకుంటే తమవద్దనున్న నిధి 6 శాతం ద్రవ్యల్బోణం అంచనా ఆధారంగా 21 ఏళ్ల అవసరాలకు సరిపోతుంది. అలా కాకుండా ప్రతి నెలా రూ.1.5 లక్షల చొప్పున ఉపసంహరించుకుంటూ వెళితే అదే నిధి 13 ఏళ్ల అవసరాలనే తీర్చగలదు. ఎంత ఉపసంహరించుకోవాలన్న స్పష్టత కొరవడితే, తొలినాళ్లలో అధికంగా ఖర్చు చేయొచ్చు. ఖర్చులకు అనుగుణంగా ఉపసంహరణలు కొనసాగితే, తర్వాతి సంవత్సరాలకు పెద్దగా మిగిలి ఉండదని 5నాన్స్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు దినేష్ రోహిరా హెచ్చరించారు. పేరుకే రిటైర్మెంట్. కానీ, నేడు చాలా మంది ఆ తర్వాత కూడా ఏదో ఒక పని చేస్తున్నారు. అలాంటి మార్గాలను గుర్తించాలి. దీనివల్ల రిటైర్మెంట్ ఫండ్ నుంచి తక్కువ ఉపసంహరణకు పరిమితం కావొచ్చు. ఫలితంగా రిటైర్మెంట్ నిధిని ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.ఈక్విటీ పెట్టుబడులపై అప్రమత్తత... పదవీ విరమణ తర్వాత ఈక్విటీ పెట్టుబడులకు పూర్తిగా దూరం కావాల్సిన అవసరం లేదు. ఫిక్స్డ్ ఇన్కమ్/డెట్ సెక్యూరిటీల రాబడిపై ద్రవ్యోల్బణం క్షీణత ప్రభావాన్ని చాలా మంది అర్థం చేసుకోరు. పదవీ విరమణ తర్వాత పెట్టుబడుల్లో వృద్ధి భాగం లేకపోతే, పొదుపు నిధి విలువ వేగంగా తగ్గిపోతుంది. కనుక 70 ఏళ్లు దాటిన వారు సైతం తమ మొత్తం పెట్టుబడుల్లో 10–15 శాతాన్ని అధిక నాణ్యతతో కూడిన డివిడెండ్ ఇచ్చే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలని దినేష్ రోహిరా సూచించారు. దీనివల్ల పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఈక్విటీలపై ఎక్కువగా ఆధారపడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్ ఆరంభంలో ఎక్కువ మొత్తం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే.. సరిగ్గా అప్పుడే ఈక్విటీల్లో బేర్ దశ (పతనకాలం) ఆరంభమై కొన్నేళ్ల పాటు కొనసాగితే.. అవసరాల కోసం ఈలోపు చేసే ఉపసంహరణలతో పెట్టుబడి విలువ గణనీయంగా పడిపోతుంది. కనుక 5–7 ఏళ్ల అవసరాలకు సరిపడా మొత్తాన్ని సురక్షిత డెట్ సాధనాల్లో తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల అంతకాలం పాటు ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉంటే ఆ మొత్తం మెరుగ్గా వృద్ధి చెందేందుకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.యాన్యుటీ ప్లాన్లు యాన్యుటీ ప్లాన్లు.. హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. కానీ, రిటైర్మెంట్ నిధి మొత్తాన్ని యాన్యుటీ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం అనిపించుకోదు. ఒక్కసారి యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసిన తర్వాత చివరి వరకు ఒకే విధమైన రాబడికి లాక్ అయినట్టే. వ్యయాలు, వైద్య అత్యవసరాలు లేదా పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా రాబడి పెరగదు. యాన్యుటీలకు పన్ను ప్రయోజనాలు కూడా లేవు. కనుక కొంత వరకు యాన్యుటీకి కేటాయించుకుని, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, డెట్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కొంత చొప్పున ఇన్వెస్ట్ చేసుకోవాలి. సిస్టమ్యాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ (ఎస్డబ్ల్యూపీ) రూపంలో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.వైద్యపరంగా సన్నద్ధత.. వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు సర్వ సాధారణం. వైద్యపరమైన ద్రవ్యోల్బణం 12–14%గా ఉంటోంది. కనుక ఈ సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలి. ఇది లేకపోతే పొదుపు నిధిపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్థిక కోణం నుంచి చూస్తే ఇది పెద్ద తప్పిదం అవుతుంది. రిటైర్మెంట్ ఫండ్ అన్నది జీవితాంతం అవసరాలను తీర్చడం కోసం. వైద్యం కోసం దాన్ని వాడటం మొదలు పెడితే తక్కువ కాలంలోనే ఖాళీ అయిపోతుంది. కనుక రిటైర్మెంట్ తర్వాత ప్రీమియం భారమైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ను కొనసాగించాలి. ప్రీమియం భారమనిపిస్తే రూ.5 లక్షలకు బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్తో రూ.50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవచ్చు. ఉద్యోగ సమయంలో కంపెనీ గ్రూప్ హెల్త్ పాలసీ ఉందని, వ్యక్తిగత హెల్త్ పాలసీ లేదా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ను చాలా మంది తీసుకోరు. ఉద్యోగ విరమణ తర్వాత తీసుకుంటే అప్పుడు భారీ ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. కనుక గ్రూప్ హెల్త్ ప్లాన్పై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలి.ఎస్టేట్ ప్లానింగ్ 60 తర్వాత తప్పకుండా పట్టించుకోవాల్సిన అంశం ఎస్టేట్ ప్లానింగ్. స్థిర, చరాస్తులు, ఆర్థిక ఆస్తులను ఎలా నిర్వహించాలి? ఎలా పంపిణీ చేయాలన్నది ఇది నిర్దేశిస్తుంది. కేవలం ధనవంతుల కోసమే ఇదని భావిస్తుంటారు. కానీ, ఆస్తులున్న ప్రతి కుటుంబానికి అవసరమే. కనీసం వీలునామా రూపంలో అయినా ఎవరికి ఏ మేరకు పంపిణీ చేయాలో సూచించాలి. తద్వారా భవిష్యత్తులో వారసుల మధ్య వివాదాలు లేకుండా జాగ్రత్తపడొచ్చు. ఇక్కడ వీలునామా అన్నది తమ మరణానంతరం తమ వారసులకు ఏవేవి, ఎలా చెందాలో సూచించే పత్రం. అదే ఎస్టేట్ ప్లానింగ్ అయితే జీవించి ఉన్న సమయంలోనూ ఆయా ఆస్తుల రక్షణ, వాటిని తమ అభీష్టం మేరకు నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఒకవేళ ఏదైనా అనారోగ్యం కారణంగా కుటుంబ యజమాని అశక్తుడిగా మారిన సందర్భంలో అప్పటికే ఎస్టేట్ ప్లానింగ్ ఉంటే, అందులో పేర్కొన్న విధంగా ఆస్తుల నిర్వహణను కుటుంబ సభ్యులు లేదా ట్రస్టీలు చూసుకుంటారు. ఎస్టేట్ ప్లానింగ్ లేదా వీలునామా ఉన్నప్పటికీ.. పెట్టుబడులకు నామినీని నమోదు చేయడం కూడా అవసరమే. దీనివల్ల వీటి క్లెయిమ్ సులభతరం అవుతుంది. పన్ను ప్రయోజనం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు) పన్ను పరంగా మెరుగైన సాధనాలు కావు. వీటి రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. తమకు వర్తించే శ్లాబు రేటు ప్రకారమే ఎఫ్డీ రాబడిపైనా పన్ను చెల్లించాల్సి వస్తుంది. గతంలో మాదిరి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో స్వల్పకాల/దీర్ఘకాల పెట్టుబడుల ప్రయోజనాలు ఇప్పుడు లేవు. ఎప్పుడు విక్రయించినా ఎఫ్డీల మాదిరే ఆదాయం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సిందే. వీటికి బదులు పన్ను ఆదా కోసం అయితే ఆర్బిట్రేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిలో రాబడికి ఈక్విటీ పెట్టుబడులకు మాదిరే స్వల్ప, దీర్ఘకాల మూలధన పన్ను నిబంధనలు అమలవుతాయి. రిస్క్ దాదాపు ఉండదు. లిక్విడ్ ఆస్తులకు చోటు ఉండాలి కొంత మంది రిటైర్మెంట్ తర్వాతి అవసరాల కోసం ప్రాపర్టీని (ఇల్లు/ఫ్లాట్) సమకూర్చుకుంటుంటారు. స్థిరాస్తి రూపంలో ఉండడం వల్ల లిక్విడిటీ (నగదు లభ్యత) సమస్య ఎదురుకావొచ్చు. అవసరమైనప్పుడు ప్రాపర్టీని వెంటనే నగదుగా మార్చుకోవడం సాధ్యపడదు. ఇక నిర్వహణ వ్యయాలు, పన్నులు, న్యాయ వివాదాల రిస్్కలు ఎలానూ ఉంటాయ్. రిటైర్మెంట్ కోసమని ప్రాపర్టీలను సమకూర్చుకున్నప్పటికీ.. పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయానికి ప్రణాళిక ఉండాలి. ఇందుకు ప్రాపర్టీని విక్రయించడం లేదంటే రివర్స్ మార్ట్గేజ్కు వెళ్లడం మంచి ఆప్షన్ అవుతుంది. రివర్స్ మార్ట్గేజ్లో ప్రాపర్టీని బ్యాంక్ తనఖా పెట్టుకుని, నెలవారీ కోరుకున్నంత ఆదాయాన్ని నిర్ణిత కాలం పాటు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించనక్కర్లేదు. అదే ఇంట్లో నివాసం ఉండొచ్చు. మీ తదనంతరం వారసులు అప్పటి వరకు ఉన్న బకాయిని చెల్లించి అదే ఇంటిని స్వా«దీనం చేసుకోవచ్చు. లేదంటే బ్యాంక్ వేలం వేసి, బకాయి పోను మిగిలినది వారసులకు చెల్లిస్తుంది. ఇంటి కోసం రుణం తీసుకుని మనం ఎలా అయితే నిర్ణిత కాలం పాటు ఈఎంఐ చెల్లిస్తామో.. రివర్స్ మార్ట్గేజ్లో బ్యాంక్ అలా మనకు చెల్లిస్తుంది. ఏకమొత్తంలో చెల్లింపులకూ కొన్ని బ్యాంక్లు అవకాశం కల్పిస్తున్నాయి. రుణ భారం రిటైర్మెంట్ నాటికి ఎలాంటి రుణం మిగిలి ఉండకూడదు. వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, గృహ రుణాలు ఏవైనా సరే గుడ్బై చెప్పేయాలి. లేదంటే రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన పొదుపు నిధిని రుణ చెల్లింపుల కోసం వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థిక స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
జాలీగా ‘జోలోఫ్ రైస్’
గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించాలంటే అద్వితీయ, అసాధారణ ఫీట్ చేయాల్సిందే. అతిభారీ వంటకంతో గిన్నిస్ పుస్తకంలోకి నేరుగా ఎక్కేయాలని నైజీరియా పాకశాస్త్ర ప్రవీణురాలు హిల్దా బకీ సిద్ధమయ్యారు. అనుకున్నదే తడవుగా జోలోఫ్ రైస్వంటకానికి కావాల్సి దినుసులన్నీ సమకూర్చుకుని అతి భారీ వంటకాన్ని తయారుచేశారు. ఇప్పటికే నమోదైన రికార్డ్తో పోలిస్తే ఇది పెద్దది కావడంతో అనధికారికంగా ఈ రికార్డ్ను బద్దలుకొట్టినట్టేలెక్క. ఇక ఈ రికార్డ్ను గిన్నిస్ పుస్తకం ప్రతినిధులు అధికారికంగా ధృవీకరించడమే తరువాయి. ఈ రికార్డ్ ఫీట్కు నైజీరియాలోని విక్టోరియా ద్వీపంలోని ఎకో హోటల్స్ అండ్ సూట్స్ వేదికైంది. ఈ భారీ వంటకాన్ని కళ్లారా చూసేందుకు, నోరారా రుచి చూసేందుకు వందలాది మంది భోజనప్రియులు బారులుతీరారు. శుక్రవారం ఈ కార్యక్రమం జరిగింది. సమన్వయంతో.. సమపాళ్లలో.. హిల్దా బకీ గతంలోనే ఏకధాటిగా 93 గంటలకుపైగా వంటచేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించారు. కానీ అవన్నీ వేర్వేరు చిన్నపాటి వంటకాలు. కానీ ఇది వేలకేజీల ఒకే వంటకం. అదికూడా నైజీరియా దేశ సంప్రదాయ ‘జోలోఫ్ రైస్’వంటకం. మేకమాంసం, బియ్యం, టమాటా పేస్ట్తో చేసే స్థానిక వంటకం. ఫుడ్ ఇన్ఫ్లూయెన్సర్గా, సెలబ్రిటీగా హిల్దా ఇప్పటికే మహా క్రేజ్ సంపాదించుకున్నారు. దీంతో ఈమె చేసే వంటకంపై స్థానికంగా అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఆమె ఏకంగా 300 మంది సహాయకులు పేద్ద బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు. కనీసం ఏడాది క్రితమే ఈ భారీ వంటకం కోసం ప్రణాళికలు సిద్ధంచేశారు. కనీసం రెండు నెలలుగా ఈమె బృందం అహరి్నశలు కష్టపడి అన్ని రకాల మేలుజాతి సరకులను తెప్పించి వంటకోసం సిద్ధంచేసుకుంది. 4,000 కేజీల బియ్యం, 1,200 కేజీల టమాట పేస్ట్, 600 కేజీల ఉల్లిగడ్డలు, 6,000 లీటర్ల మంచినీరు, 168 కేజీల మేకమాంసం, 700 కేజీల వంటనూనెలతో వంటకాన్ని సిద్ధంచేశారు. ఇంతపెద్ద వంట వండేందకు అదే స్థాయి అతిపెద్ద స్టీల్ పాత్ర అవసరం. అందుకే 23,000 లీటర్ల సామర్థ్యముండే స్టీల్ పాత్రనూ ప్రత్యేకంగా తయారుచేయించారు. ‘‘వంటకోసం అన్ని సిద్ధమైనా అంతటి దినుసులు, బియ్యాన్ని తిప్పే గరిటెలు లేవు. అందుకే భారీ దుంగలను గరిటెల్లాగా తయారుచేశాం’’అని పాకశాస్త్ర ప్రవీణురాలు హిల్దా బకీ చెప్పారు. ‘‘నాలుగేళ్ల క్రితం ఒక వంటల పోటీలో ఇదే జోలోఫ్ రైస్ వంటకం అద్భుతంగా వండి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నా. ఆ తర్వాత 2023 ఏడాదిలో ఏకబిగిన 93 గంటల 11 నిమిషాలు ఆగకుండా పలురకాల వంటటుచేసి గిన్నిస్ ప్రపంచ రికార్డ్ బద్దలుకొట్టా’’అని ఆమె చెప్పారు. ‘‘ఎకో హోటల్స్ అండ్ సూట్స్లో వంటకం వండట్లేరు. రికార్డ్ను వండుతున్నారు. చూసొద్దాం. కుదిరితే మన ఫేవరెట్ జోలోఫ్ రైస్ తినొద్దాం’’అంటూ పలువురు నెటిజన్లు ఈమెకు ఆన్లైన్లో తెగ మద్దతు ప్రకటించారు. అన్ని దినుసులు సిద్ధంచేసుకుని వంట మొదలెట్టాక కేవలం 9 గంటల్లోనే వంట పూర్తిచేయడం విశేషమని పలువురు పొగిడారు. ‘‘ఈమె క్రమశిక్షణ, సృజనాత్మకత నుంచి యువత ఎంతో నేర్చుకోవాలి. దేశ సంప్రదాయ వంటకానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెస్తున్న ఈమెకు నా ఆశీస్సులు’’అని నైజీరియా సమాచార శాఖ మంత్రి మొహమ్మెద్ ఇద్రీస్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చదువుకొనాల్సిందే!
స్కూల్ ఫీజు అనగానే సగటు జీవి బెంబేలెత్తిపోతున్నాడు. ప్రభుత్వ పాఠశాలలు అయితే పెద్దగా భారం అనిపించదు. సమస్యల్లా ప్రైవేటు స్కూళ్లతోనే. ఎందుకంటే అక్కడ చదువు‘కొనాల్సిందే’. ఇది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి ఏటా అవుతున్న సగటు ఖర్చుల్లో తేడా ఎన్నో రెట్లు ఉంటోంది. పట్టణాలే కాదు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. దేశంలో కిండర్గార్టెన్ (కేజీ) విద్య.. అంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువుకు ఏటా అయ్యే ఖర్చు ప్రైవేటు పాఠశాలల్లో అధికంగా ఉంది. ప్రీ–ప్రైమరీ స్థాయిలో ప్రభుత్వ బడులతో పోలిస్తే ప్రైవేటు స్కూళ్లలో ఒక్కో విద్యార్థికి ఏటా అయ్యే వ్యయం.. గ్రామీణ ప్రాంతాల్లో 21.8 రెట్లు, పట్టణ ప్రాంతాల్లో 16.1 రెట్లు అధికంగా ఉంది. 9, 10వ తరగతులు (సెకండరీ), 11, 12 తరగతుల (హయ్యర్ సెకండరీ) విషయంలో ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది.కేంద్ర గణాంక శాఖ 2025 ఏప్రిల్–జూన్ మధ్య చేపట్టిన సర్వే ఆధారంగా రూపొందించిన ‘కాంప్రహెన్సివ్ మాడ్యులర్ సర్వే: ఎడ్యుకేషన్ 2025’ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వ్యయం అంటే.. స్కూల్లో అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పరీక్ష ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, ఇతరత్రా కార్యక్రమాలకోసం చేసే ఖర్చు; రవాణా, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, స్టేషనరీ.. ఇలా విద్యార్థి చదువు కోసం చేసిన మొత్తం ఖర్చు. -
డిజిటల్ 'డోపీ'లు
ఎంతగా అంటే.. తాము సోషల్ మీడియాలో పెట్టే పోస్టుకు లైకులు, కామెంట్లు రావటానికి ఒక్క సెకను ఆలస్యమైనా పిచ్చిగా ప్రవర్తించేంతగా. ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలను అధికంగా వినియోగించే యువత సమయాన్ని వృథా చేసుకోవటంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకుంటోంది. అందులో తాజాగా ‘డిజిటల్ డోపమిన్’వచ్చి చేరింది. – సాక్షి, హైదరాబాద్ఏమిటీ డోపమిన్? డోపమిన్ అనేది మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక హార్మోన్. దీనిని ‘సంతోష హార్మోన్’అని పిలుస్తారు. ఇది మన మెదడు బహుమతి వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది. రుచికరమైన ఆహారం తినడం, ప్రశంసలు స్వీకరించడం, లక్ష్యాన్ని సాధించడం వంటి ఆహ్లాదకరమైన అనుభూతిని పొందినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. ఈ న్యూరోట్రాన్స్మీటర్ మెదడుకు కార్యాచరణ ఫలవంతమైందని సంకేతమిస్తుంది. మరింత ఉత్సాహంతో పనిచేసేలా ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు సమస్య ఏంటి? మనసుకు సంతోషాన్ని కలిగించే పనులు చేసినప్పుడు విడుదలై మనల్ని మరింత ప్రోత్సహించే ఈ డోపమిన్ హార్మోనే ఇప్పుడు సోషల్ మీడియాను నడిపిస్తోందని మానసిక శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం సోషల్ మీడియాలో పెట్టే పోస్టు లు, వీడియోలకు లైకులు, షేర్లు వచ్చినప్పుడు సంతోషం కలుగుతుంది. అప్పుడు మన మెదడులో ఈ డోపమిన్ హార్మో న్ విడుదలవుతుంది. అయితే, అది ఇప్పుడు శ్రుతిమించింది. మనం పెట్టే ప్రతి పోస్టుకు లైకులు, షేర్ల కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూసేలా ఈ హార్మోన్ ప్రేరేపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల యువత నిత్యం సోషల్మీడియా యాప్లను అంటిపెట్టుకొని ఉంటున్నారని అంటున్నారు. అలా మన మెదడు ఈ తక్షణ బహుమతులను కోరుకునేలా కండిషన్కు గురవుతుంది. ఇది స్వల్పకాలిక ఆనందం ఇచ్చినా.. తరువాత దీర్ఘకాలిక అసంతృప్తికి దారితీస్తుందని పేర్కొంటున్నారు. డిజిటల్ డోపమిన్ సంకేతాలు» సామాజిక మాధ్యమాల్లో నిరంతరం నోటిఫికేషన్లను తనిఖీ చేయడం » సోషల్ ప్లాట్ఫామ్లలో యాక్టివ్గా లేనప్పుడు ఆందోళన చెందడం» సమయం తెలియకుండా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ ఉండిపోవటం» ఒకరి జీవితాన్ని ఇతరుల హైలైట్ రీల్స్తో పోల్చడం » ప్రతికూల కంటెంట్తో మానసిక స్థితిలో మార్పులు రావడం డోపమిన్ విరమణ (క్రాష్) తర్వాత భావోద్వేగ ప్రతిస్పందనలు.. » డోపమిన్ హార్మోన్ ప్రభావం తొలగిపోయి మెదడు సాధారణ స్థితికి రావటాన్ని డోపమిన్ క్రాష్ అంటారు. » ఈ స్థితిలో విసుగు, అశాంతి కలుగుతాయి. » చిరాకు, నిరాశ, ౖఅపరాధ భావన, సిగ్గు, నిస్పృహ ఆవరించడం, ఆందోళనకు గురవుతారు. »ఉదాహరణకు ఓటీటీలో ఒక వెబ్సిరీస్ను గంటల తరబడి చూసిన తర్వాత సమయం అంతా వృథా అయ్యిందని బాధపడటం. » డోపమిన్ వ్యసనానికి అతిపెద్ద కారణాలలో సోషల్ మీడియా ఒకటి. ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, ఫేస్బుక్ వంటి వాటిని వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించారు. ప్రతి లైక్, కామెంట్, షేర్ చిన్నస్థాయిలో డోపమిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఏదో సాధించామనే భావనను కలిగిస్తాయి. ఈ వర్చువల్ బహుమతులను ఎంత ఎక్కువగా వెంబడిస్తే, నిజ జీవిత అనుభవాలతో మనం అంతగా అసంతృప్తి చెందాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. » ఇది మన జీవితంలోని ఇతర అంశాలైన అతిగా తినడం, ఇంపల్స్ షాపింగ్, మితిమీరిన గేమింగ్ వంటి వాటికి కూడా విస్తరించింది. » డిజిటల్ డోపమిన్ సమస్య ఇప్పటికే అమెరికన్లలో తీవ్రంగా ఉంది. భారత్లోని సోషల్, డిజిటల్ మీడి యా వినియోగదారులు సైతం దీనికి ఎక్కువగానే ప్రభావితమవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.‘డిజిటల్’ వాడకం తగ్గించుకోవటమే మార్గం డ్రగ్స్, ఆల్కహాల్ వంటివి తీసుకున్నపుడు వచ్చే ప్రభావం మాదిరిగా ‘డిజిటల్ డోపమిన్’ప్రభావితం చేస్తోంది. మెదడు రివార్డ్స్ సిస్టమ్లో భాగంగా క్విక్ గ్రాటిఫికేషన్ను కోరుకుంటోంది. మెదడులోని సహజ రివార్డ్ సర్క్యూట్ను సోషల్మీడియా అధిక వినియోగం హైజాక్ చేసి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. పుస్తకాలు చదివే అభిరుచి, రోజువారీ వ్యాయామం వంటివాటికి దూరం చేస్తోంది. స్వీయ నియంత్రణ తగ్గిపోవడం, ఏ అంశంపైనా దృష్టి నిలపలేకపోవటం, చేయాల్సిన పనులను వాయిదా వేయడం నిత్యకృత్యమవుతున్నాయి. దీనిని అధిగమించాలంటే మొబైల్స్, ఇతర డిజిటల్ సాధనాల వినియోగ సమయాన్ని కచ్చితంగా తగ్గించుకోవాలి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టింగ్ సైకియాట్రిస్ట్.సామాజిక మాధ్యమాలు నిత్యావసరాలు కాకపోయినా.. అవే సర్వస్వం, అవి లేకపోతే అంతా శూన్యం అన్నట్టుగా యువత ప్రవరిస్తుండడం ఆందోళనకరం. వ్యాయామ విద్య, క్రీడలు, కళలు వంటి వాటిని పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా సామాజిక మాధ్యమాల అతి వినియోగాన్ని అదుపుచేసే చర్యలు తీసుకోకపోతే దేశం అనేక దుర్గుణాలకు, మానసిక అనారోగ్యాలకు కేంద్రంగా మారుతుంది. వ్యాయామం, శారీరక శ్రమ తగ్గిపోయి ఇప్పటికే డయాబెటిస్, ఒబేసిటీ వంటివి తీవ్రస్థాయికి చేరుకున్నాయి. డిజిటల్ డోపమిన్ మనిషి ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
గుర్తుంచుకోండి
సుప్రసిద్ధ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్స్టీన్ తరచూ ఫోన్ నంబర్లు మర్చిపోతూ ఉండేవారు. ఈ విషయంపై ఆయన ఒకసారి.. ‘టెలిఫోన్ డైరెక్టరీ చూస్తే తెలుస్తుందిగా’ అని కూల్గా అన్నారట! అలాంటి జ్ఞానులు సాధారణ సమాచారాన్ని గుర్తుపెట్టుకోవాలని ఏమీలేదని దీని సారాంశం. అయితే, మామూలు వ్యక్తులు మతిమరుపును అలా తీసేయడానికి వీల్లేదు. దానికి కారణాలేంటో గమనించి.. ఏ వయసులో ఎలాంటి సమస్యలు రావచ్చు.. వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చో తెలుసుకోవాలి.20లలో..25 ఏళ్లు వచ్చేసరికి మెదడు పూర్తిగా వికసిస్తుంది. నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవటం, గుర్తుతెచ్చుకోవడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది. వయసు పెరిగేకొద్దీ మెదడు సామర్థ్యం కొద్దిగా తగ్గుతుంది. ఈ తగ్గుదల దశాబ్దానికి స్వల్పంగా 5% వరకు ఉంటుందని మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధన వెల్లడించింది. 30లలో..మెదడు కణాల మధ్య సంకేతాలను ప్రసారం చేసే న్యూరో ట్రాన్స్మీటర్లు ముప్పైలలో తగ్గటం ప్రారంభిస్తాయి. జ్ఞాపకాల నిక్షిప్తానికి సాయపడే రసాయనమైన డోపమైన్.. వయసు పెరిగే కొద్దీ దశాబ్దానికి 10% మేర తగ్గుతుంది. చేతి రాతే జ్ఞాపక మంత్రం!ఎక్కువ కాలం గుర్తుండాలంటే టైప్ చేయడానికి బదులుగా చేతితో రాయండి. దీనివల్ల మెదడులో జ్ఞాపకశక్తికి, అవగాహనకు అనుసంధానమై ఉండే భాగాలు బాగా పనిచేస్తాయని ‘సైకలాజికల్ సైన్స్ జర్నల్’లో ప్రచురితమైన పరిశోధన వెల్లడించింది.40లలో..మధ్య వయసు నుంచి జ్ఞాపకశక్తి క్షీణించడం ప్రారంభమవుతుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ (2012)లో ప్రచురితమైన అధ్యయనంలో తేలింది. అధిక ఒత్తిడి సమయాల్లో అధికంగా విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ మెదడులో కొత్త జ్ఞాపకాలను నిక్షిప్తం చేసే భాగాలను, ప్రక్రియను దెబ్బతీస్తుంది. ప్రాసెస్డ్ మీట్ వద్దు40 ఏళ్ల వయసులో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం ఉత్పత్తులను అతిగా తీసుకుంటే భవిష్యత్తులో జ్ఞాపకశక్తి తగ్గుతోందని ‘న్యూరాలజీ జర్నల్’లో ప్రచురితమైన ఓ పరిశోధన సూచిస్తోంది. శాకాహారం ఎక్కువగా, మాంసాహారం తక్కువగా తీసుకునే వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతల స్కోర్ ఎక్కువగా ఉందట. మాంసానికి బదులు నట్స్, బీన్స్ తీసుకుంటే ఈ ప్రమాదాన్ని 19% వరకు తగ్గించుకోవచ్చట.50లలో..మీరు ఎప్పుడైనా ఒక గదిలోకి వెళ్లి, మీరు దేనికోసం వెతుకుతున్నదీ మర్చిపోయారా? 50 ఏళ్లు దాటిన వారిలో ఇది సర్వసాధారణమే. ఇందుకు కారణం మెదడులోని ‘రిఫ్రంటల్ కార్టెక్స్’ కుంచించుకుపోవడమే. సాధారణ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సామర్థ్యం 45–55 ఏళ్ల మధ్య గరిష్ట స్థాయికి చేరుతుంది. మెనోపాజ్ కారణంగా ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు ప్రభావితమవుతాయి. ఈ దశకు ‘బ్రెయిన్ ఫాగ్’ అని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘క్రాకింగ్ ది మెనోపాజ్’ పుస్తక రచయిత్రి ఆలిస్ స్మెల్లీ పేరుపెట్టారు.సానుకూల భావనతాళాలను ఎప్పుడూ ఒకే చోట పెట్టడం, ఫోన్ లో రిమైండర్లు పెట్టుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోండి. సానుకూల భావనతో ఉండే వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అధ్యయనాల సారాంశం. మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు.. పౌష్టికాహారం తీసుకుంటూ, ఒత్తిడికి దూరంగా ఉంటే జ్ఞాపకశక్తి బాగుంటుంది.60లలో..ఈ వయసులో తరచుగా.. వ్యక్తుల పేర్లు, పదాలు గుర్తుకురాక సతమతమవుతుంటారు. అంతమాత్రాన వీరు బాధపడాల్సిన పనిలేదు. ఎందుకంటే, కిక్కిరిసిన గ్రంథాలయంలో ఒక పుస్తకాన్ని దొరకపుచ్చుకోవటానికి సమయం పడుతుంది కదా.. అలాగే ఇదీనూ! శారీరక శ్రమక్రమం తప్పకుండా బ్రిస్క్ వాకింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్సైజులు చేయాలి. వారంలో మూడు రోజులు ఇలా చేసే వృద్ధుల మెదడులోని జ్ఞాపకశక్తికి కేంద్రమైన హిప్పోక్యాంపస్ సైజు ఏడాదికి 2% పెరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా (2011) అధ్యయనంలో వెల్లడైంది. 70లలో..కొన్ని పేర్ల జాబితా చదివిన కొద్ది నిమిషాల తర్వాత ఆ పేర్లు గుర్తుచేసుకునే సామర్థ్యం 20 ఏళ్ల వారితో పోల్చితే 70 ఏళ్ల వారిలో సగానికి తగ్గుతుంది. చిన్ననాటి సంఘటనలను జ్ఞాపకం చేసుకోగలిగే వీరు.. నిన్న రాత్రి ఏం తిన్నారో మర్చిపోవచ్చు. దీనికి కారణం మెదడులో భావోద్వేగాల కేంద్రమైన ‘అమిగ్డలా’. యుక్తవయసు నాటి అనుభవాలు ఉద్వేగంతో కూడి ఉంటాయి కాబట్టి అమిగ్డలా సాయంతో వాటిని గుర్తు తెచ్చుకోగలుగుతారు. కొత్త పనులు చేయండి‘ద జర్నల్స్ ఆఫ్ జెరంటాలజీ’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ ఒకే రకం కాకుండా, కొత్త పనులు ప్రయత్నించే, ఉత్సాహంగా ఉండే వృద్ధుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి ఇనుమడించాయి.80లలో..జ్ఞాపకశక్తి వేగంగా తగ్గుతుంది. మెదడుకు రక్తాన్ని అందించే ధమనుల సామర్థ్యం తగ్గిపోవటం వల్ల మెదడుకు రక్తప్రవాహం, ప్రాణవాయువు సరఫరా మందగించటమే ఇందుకు కారణం. వినికిడి సమస్య వల్ల కూడా జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఇతరులు చెప్పేది వినటానికి అధిక శక్తిని మెదడు వినియోగించాల్సి రావటంతో, ఆ విషయాలను గుర్తుపెట్టుకోలేరు. ఒంటరితనం, కుంగుబాటు కూడా జ్ఞాపకశక్తిని క్షీణింపజేస్తాయి.నలుగురితో కలవండిఇతరులతో ఎక్కువగా కలుస్తూ, కలివిడిగా ఉంటే యాక్టివ్గా ఉంటారు. బలమైన సాంఘిక సంబంధాలుండే వృద్ధుల జ్ఞాపకశక్తి అమోఘంగా ఉందని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యయనం (2015). వినికిడి పరికరాలు వాడని వృద్ధులతో పోలిస్తే, వాడే వారిలో జ్ఞాపకశక్తి 50%కి పైగా మెరుగ్గా ఉందని ‘లాన్సెట్’ అధ్యయనం (2023). -
చంద్రుడిపైకి మీ పేరు!
చందమామ రావే.. జాబిల్లి రావే అని పాడుతుంటాం. జాబిల్లి ఎలాగూ మన దగ్గరకు రాదు. పోనీ చంద్రమండలం మీద అడుగుపెడదామన్నా అందరికీ సాధ్యం కాదు. భూమిని వదిలి వెళ్ళకుండానే చంద్రుని చుట్టూ ప్రయాణించాలనుకుంటున్నారా? అంతరిక్ష పరిశోధనలో తదుపరి పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా.. సామాన్యులనూ భాగస్వాములను చేసేందుకు మరోసారి ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. 2026 ఏప్రిల్లోగా ప్రారంభం కానున్న ఆర్టెమిస్–2 మిషన్ లో భాగంగా ఓరియన్ అంతరిక్ష పరిశోధన నౌకలో వ్యోమగాములు రీడ్ వైజ్మన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సెన్ చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేయనున్నారు. వారితోపాటు ఓ మెమరీ కార్డు సైతం జాబిల్లిని చుట్టి రానుంది. ఈ మెమరీ కార్డ్లో చేర్చడానికి తమ పేర్లను సమర్పించాల్సిందిగా ప్రజలను నాసా ఆహ్వానిస్తోంది. చంద్రుడికో నూలుపోగు మాదిరిగా చంద్రుడి మీదకో ‘పేరు’ అన్నమాట. చరిత్రలో భాగం కావడానికి ఇది ఒక గొప్ప అవకాశం. – సాక్షి, స్పెషల్ డెస్క్డిజిటల్ బోర్డింగ్ పాస్ఆసక్తిగలవారు ఉచితంగా తమ పేరును జోడించి తక్షణమే డిజిటల్ ‘బోర్డింగ్ పాస్’ పొందగలిగేలా నాసా ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసింది. సేకరించిన పేర్లన్నీ ఓరియన్ లోపల ఇన్ స్టాల్ చేసే ఎస్డీ కార్డ్లో నిక్షిప్తం చేస్తారు. మొదటిసారిగా సిబ్బందితో కూడిన ఆర్టెమిస్ మిషన్ లో వ్యోమగాములతోపాటు మీ పేరూ జాబిల్లిని చుట్టి వస్తుందన్నమాట. సో, సరదాగా గుర్తిండిపోయేలా మీ పేరుతో డిజిటల్ బోర్డింగ్ పాస్ చేజిక్కించుకునేందుకు మీరూ దరఖాస్తు చేసుకోండి. చివరి తేదీ 2026 జనవరి 21. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినప్పుడు సామాన్యులనూ భాగస్వాములను చేయడం నాసా ప్రత్యేకత.కీలకమైన అడుగు10 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో నాసా కొత్త స్పేస్ లాంచ్ సిస్టమ్, ఓరియన్ అంతరిక్ష నౌక పనితీరును అధ్యయనం చేస్తారు. వ్యోమగాములు భూమి నుండి 2,30,000 మైళ్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి.. తిరుగు ప్రయాణంలో చంద్రుని అవతలి వైపు చుట్టూ తిరుగుతారు. ఈ దశాబ్దం చివర్లో చంద్రుని ఉపరితలంపై వ్యోమగాములను దింపడం, అలాగే మానవులను అంగారక గ్రహానికి పంపాలన్న నాసా ప్రయత్నంలో ఇది ఒక కీలకమైన అడుగు. -
2-3 నిమిషాల్లో విరిగిన ఎముకలు అతికితే!!
ఈ గమ్మును మీ విరిగిన ఎముకల మధ్య రాస్తే.. అవి రెండు నుంచి మూడు నిమిషాల్లో అతుక్కుంటాయి అంటూ ఓ వీడియో గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలో ఈ గ్లూ మీద జరిగిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయని.. ఇది మార్కెట్లోకి రావడమే ఆలస్యమని.. ఇది గనుక అందుబాటులోకి వస్తే వైద్యరంగంలోనే విప్లవాత్మక మార్పునకు కారణమవుతుందని ఊదరగొడుతున్నారు. ఇంతకీ ఈ ప్రచారంలో నిజమెంత?.. ఓసారి పరిశీలిస్తే.. విరిగిన ఎముకలు అంత ఈజీగా అతుకుతాయా? గంటల తరబడి ఆపరేషన్లు చేస్తే.. నెలలు, సంవత్సరాల తరబడి అవి అతుక్కుంటున్నాయి. అలాంటిది కేవలం సెకన్ల వ్యవధిలో ఓ సూది ద్వారా అతుక్కనేలా చేయొచ్చా?. చైనా పరిశోధకులు కనిపెట్టిన బోన్ గ్లూకు అసలు శాస్త్రీయత ఉందా?.. ఆ ప్రచారంలో ఉన్నట్లు విరిగిన ఎముకలను గంటల పాటు శస్త్రచికిత్స చేసి, స్టీల్ ప్లేట్లు అమర్చే సంప్రదాయ వైద్యం ఇక చరిత్ర అవ్వబోతోందా?.. షెజాంగ్ స్థానిక మీడియా ప్రకారం.. తూర్పు చైనా(China)లోని షెజాంగ్ ప్రావిన్స్లో ‘బోన్ 02’ అనే బోన్ గ్లూ(bone glue)ను పరిశోధకులు ఆవిష్కరించారు. దీంతో విరిగిన ఎముకలను మూడు నిమిషాల్లోనే అతికించవచ్చని ఆ కథనం సారాంశం. సర్ రన్ రన్ షా ఆస్పత్రిలో అసోసియేట్ చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ లిన్ షాన్ఫింగ్ నేతృత్వంలోని బృందం దీనిని డెవలప్ చేసింది. కొత్తగా అభివృద్ధి చేసిన జిగురు కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ఎముకను బాగుచేస్తుందని అంటున్నారాయన. రక్త ప్రవాహం అధికంగా ఉండే వాతావరణంలోనూ దీని పనితీరు మెరుగ్గా ఉందని వెల్లడించారు. సంప్రదాయ వైద్యంలో ఎముకలు అతికించాలంటే శరీరానికి పెద్ద కోతలు వేసి, స్టీల్ ప్లేట్లను అమర్చుతారు. కానీ ఈ ఇంజెక్షన్తో అలాంటి అవసరం రాదని అంటున్నారాయన. పైగా బోన్ 02 శరరీంలో ఈజీగా కలిసిపోతుందని, కాబట్టి మరో సర్జరీ అనే అవసరం లేకుండా చేస్తుందని చెబుతున్నారాయన. ఆపరేషన్ల సక్సెస్ రేటు తక్కువగా ఉంటుండడమే.. తనకు దీనిని రూపొందించాలనే ఆలోచన కలగజేసిందని అంటున్నారాయన.ఇంతకీ ఈ గ్లూను అభివృద్ధికి ప్రేరణ ఏంటో తెలుసా?. నీటి అడుగున వంతెనలకు గట్టిగా అతుక్కునే ఆల్చిప్పలు. వాటి జీవశైలిని పరిశీలించిన లిన్ షాన్ఫింగ్ ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టారు.ట్రయల్స్.. సక్సెస్.. ‘బోన్ 02’(Bone-02)ని లాబోరేటరీలో కూడా పరీక్షించారు. అందులో తేలింది ఏంటంటే.. ఇది 400 పౌండ్ల బలాన్ని తట్టుకోగలదు (అంటే చాలా బలంగా అంటుకుంటుంది). 0.5 MPa కోత బలం (shear strength) అంటే పక్కదిశలో ఒత్తిడిని తట్టుకునే శక్తి ప్రదర్శించింది. అలాగే.. 10 MPa సంపీడన బలం (compressive strength) అంటే నేరుగా ఒత్తిడిని తట్టుకునే శక్తి చూపించింది. ఈ లక్షణాలన్నీ సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లను భర్తీ చేయగల సామర్థ్యం దీనికి ఉందని సూచిస్తున్నాయి. అలాగే.. దీని వినియోగంతో ఫారిన్ బాడీ రియాక్షన్లు, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గుముఖం పట్టనున్నాయి. స్టీల్ ప్లేట్లు, స్క్రూలు అవసరం లేకుండా.. ఎముక గాయం నయం కాగానే శరీరంలో కలిసిపోవడం ఈ ‘బోన్ 02’లోని మరో విశిష్ట లక్షణం ఉండనే ఉంది. మొత్తం 150 మంది పేషెంట్లపై క్లినికల్ ట్రయల్స్లో ఇది విజయవంతంగా పని చేసింది. దీంతో.. సెప్టెంబర్ 10వ తేదీన దీనిని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే.. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ (NMPA) నుంచి పూర్తి మార్కెట్ అనుమతి పొందిందా? అనేదానిపై సష్టత కొరవడింది. వైద్య చరిత్రలో మైలురాయే!ఎముకలను అతికించేందుకు ఈ తరహా ప్రయోగాలు గతంలోనూ జరిగాయి. 1940 కాలంలో.. ఎముకలను అతికించే పదార్థాలు అభివృద్ధి చేయాలన్న ఆలోచన మొదలైంది. 1950 నుంచి ముప్పై ఏళ్లపాటు నాన్స్టాప్గా ఈ తరహా పరిశోధనలు జరిగాయి. ఇందుకోసం జంతు మూలాల నుంచి తీసిన ప్రోటీన్ పదార్థం, బలమైన అంటుకునే లక్షణాలున్న ఎపాక్సీ రెసిన్లు (Epoxy Resins) రసాయనాలు, వేగంగా గట్టిపడే ప్లాస్టిక్ తరహా అక్రిలేట్లు (Acrylates)సైనోఎక్రిలేట్లు (super glue తరహా) పదార్థాలు ఉపయోగించారు. అయితే.. ఇవి ఎముకలను అతికించే సామర్థ్యం ప్రదర్శించినా.. బాడీకి పనికి రాకుండా పోయాయి. వీటి వల్ల బయోకంపాటబిలిటీ సమస్యలు ఎదురయ్యేవి. అంటే.. ఇన్ఫెక్షన్, అలర్జీలు వచ్చేవి. పైగా శరీర కణజాలాన్ని దెబ్బ తీశాయి. వాటిని తొలగించేందుకు రెండో సర్జరీ అవసరం అయ్యేవి. ఈ కారణాల వల్ల, వాటిని వైద్యంగా విరమించాల్సి వచ్చింది. సైనోఎక్రిలేట్లు (super glue తరహా) వంటి పదార్థాలతో ప్రయోగాలు జరిగాయి.1990–2010 మధ్యకాలంలో.. బయోకంపాటబుల్ పాలిమర్లు, కోలాజెన్, కెరటిన్, కైటోసన్ వంటి పదార్థాలపై దృష్టి పెట్టారు. ఇవి శరీరంలో కరిగిపోవడం, తక్కువ రిస్క్ ఉండడం వంటి లక్షణాలు కలిగి ఉన్నా, అంత బలంగా అంటుకునే సామర్థ్యం ప్రదర్శించలేకపోయాయి. 2010 తర్వాత.. బయోమిమిటిక్ దిశగా ప్రయోగాలు జరిగాయి. అంటే.. ఆల్చిప్పలు, గవ్వలు, గోరింటాకు వంటి జీవుల నుంచి స్ఫూర్తి పొందిన బయోమిమిటిక్ గ్లూలు అభివృద్ధి చేయడం మొదలైంది. ఇవి నీటి లోపల కూడా బలంగా అంటుకునే లక్షణాలను కలిగి ఉండటంతో, శరీరంలోని రక్త ప్రవాహంలో కూడా పనిచేయడం లాంటి ఫలితాలను ఇచ్చాయి. అలా కొన్ని గ్లూలు మాత్రమే క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నా.. అక్కడ సరైన రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. ఇలాంటి టైంలో.. చైనా బోన్ 02 గ్లూలు వాస్తవిక ప్రయోగ దశకు చేరుకోవడం గమనార్హం. సాధారణంగా, ఇలాంటి వైద్య పరికరాలను Class III medical deviceగా పరిగణిస్తారు. కాబట్టి వీటికి క్లినికల్ ట్రయల్స్, టెక్నికల్ సమీక్ష, రెగ్యులేటరీ అనుమతులు అవసరం. ఆ తర్వాతే వాణిజ్య వినియోగానికి అందుబాటులోకి వస్తాయి. అంటే ఇది మార్కెట్లోకి రావడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. సో.. వైరల్ అవుతున్న ఆ వీడియో.. ఆ కథనం రెండూ నిజమే. ‘బోన్ 02’ అనే గ్లూ ఎముకలు అతికించడంలో వేగంగా, బలంగా, సురక్షితంగా పనిచేస్తోందని రుజువైంది. ఇది సంప్రదాయ చికిత్సకు మంచి ప్రత్యామ్నాయం అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
నేపాల్ అగ్నిగుండాన్ని చల్లార్చిన యాప్!
కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం(గత) 26 సోషల్ మీడియా యాప్లపై విధించిన నిషేధం.. ఆ దేశంలో అలజడిని సృష్టించింది. జెడ్ జనరేషన్ యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టడం.. వాటిని అదుపు చేసే క్రమంలో హింస చెలరేగి 51 మంది మరణించడం.. యాప్ బ్యాన్ ఎత్తివేత.. అయినా శాంతించని యువత.. ప్రధాని రాజీనామా.. ఆపై ఆందోళనకారుల ఛాయిస్ ప్రకారం తాత్కాలిక ప్రధాని ఎంపిక.. ఇదంతా పదిరోజుల వ్యవధిలోనే చకచకా జరిగిపోయింది. అయితే సో.మీ. బ్యాన్ నేపథ్యంలో ఆందోళనకారులు డిస్కార్డ్ Discord అనే చాట్ ప్లాట్ఫారమ్ను భలేగా ఉపయోగించారు. ఒకవేళ ఈ యాప్ గనుక లేకుండా ఉంటే.. నేపాల్ ఇంకా అగ్నిగుండంగా రగిలిపోతూ ఉండేదేమో అనే చర్చా నడుస్తోందక్కడ.పాలన పేరిట ఇన్నేళ్లుగా కొనసాగిన అవినీతికి నేపాల్ యువత ఎలాగైనా చెక్ పెట్టాలనుకుంది. ఆందోళనలను ఉధృతంగా జరిపి ప్రభుత్వం మెడలు వచ్చింది. అయితే ఈ ఆందోళనలను సమన్వయపర్చుకోవడానికి డిస్కార్డ్ యాప్నే Gen Z నిరసనకారులు ఉపయోగించుకున్నారు. అంతేకాదు.. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత.. తమ ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుడ్ని ఎన్నుకునే క్రమంలోనూ ఈ వేదికనే ఉపయోగించుకున్నారు. Discord అనే యాప్ గురించి మిలెనియల్స్కు పెద్దగా పరిచయం లేకపోయినా.. Gen Z యువత మాత్రం సౌకర్యవంతమైన, విశ్వసనీయమైన వేదికగా భావిస్తోంది. డిస్కార్డ్(Discord) అనేది 2015లో ప్రారంభమైన డిజిటల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారమ్. ఇది గేమర్ల కోసం ఆటల మధ్యలోనే స్నేహితులతో చాట్ చేయడానికి రూపొందించబడిన ఒక యాప్. అయితే.. 2020లో మహమ్మారి సమయంలో Gen Z యువతలో ఇది విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. Discord ద్వారా వినియోగదారులు సర్వర్లు అనే కమ్యూనిటీలు ఏర్పాటు చేసి.. టెక్స్ట్, ఆడియో, వీడియో చానెల్స్ ద్వారా చర్చలు జరపడం ప్రారంభించారు. స్క్రీన్ షేరింగ్, స్ట్రీమింగ్, మోడరేషన్ టూల్స్ వంటి ఫీచర్లు కూడా వీటిలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో సర్వర్లో గరిష్టంగా 5 లక్షల మంది చేరవచ్చు, కానీ ఒకేసారి 2.5 లక్షల మంది మాత్రమే యాక్టివ్గా ఉండగలరు. అందుకే నేపాల్ యువత ఉద్యమానికి దీన్నొక వేదికగా మల్చుకుంది. వీపీఎన్ సాయంతో.. సాధారణంగా వీపీఎన్లను ఎందుకు ఉపయోగిస్తారు?.. మిగతా వాళ్ల సంగతి ఏమోగానీ.. నేపాల్ యువత మాత్రం ఈమధ్య దీనిని తాజాగా నిరసనలకే ఉపయోగించింది(నేపాల్లో VPNల వినియోగం 3 రోజుల్లోనే 6,000% పెరిగింది.. అలాగే 5వ రోజుకొచ్చేసరికి 8,000% పెరిగింది.). నేపాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై నిషేధం కొనసాగుతున్న వేళ.. విస్తృత యాప్గా పేరున్న డిస్కార్డ్(Discord) వీపీఎన్ సాయంతో అందుబాటులోకి తెచ్చుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో ఉన్నట్లు ఎండ్లెస్ ఫీడ్లు లేకుండా.. వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్లతో Discord ఉండడం వల్లే దీనిని రైట్ఛాయిస్గా అక్కడి యువత భావించింది. అలా.. "Youth Against Corruption" అనే Discord సర్వర్లో 145,000 మందికి పైగా సభ్యులుగా చేరారు. ఈ సర్వర్లో చర్చలు, అనౌన్స్మెంట్స్, ఫ్యాక్ట్ చెక్, హెల్ప్లైన్లు వంటివి కొనసాగించింది. వారు ఏర్పాటు చేసిన Discord సర్వర్లలో ఇన్ఫర్మేషన్ సులభంగా పాసయ్యింది. పెద్ద సంఖ్యలో సభ్యులు చర్చలు జరిపేందుకు ఇదొ కీలక వేదికగా నిలిచింది. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు.ఓటింగ్ కూడా.. నేపాల్ తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని డిస్కార్డే తొలగించింది!. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ, నేపాల్ పవర్ హౌజ్గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, రాపర్ బాలేంద్ర షా(బాలెన్), ఇలా పలువురి పేర్లతో ఓ డైలామా ఏర్పడగా.. డిస్కార్డ్ జరిగింది ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారానే ప్రతిపక్షాన్ని కూడా సమన్వయపర్చుకుని.. రాజకీయ అనిశ్చితిని తొలగించింది. ఈ ఓటింగ్ను పర్యవేక్షించిన శశ్వత్ లామిచ్ఛానే కూడా ఈ విషయాల్ని ధృవీకరించారు. ఇక డిస్కార్డ్లో ఓటింగ్ బుదవారం పూర్తైంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. 50 శాతం ఓట్లు సుశీల్ కార్కీకే పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీచీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్ను కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వీడింది. అయితే.. ఇండియా టుడే ఓఎస్ఐఎన్టీ(Open-Source Intelligence) సర్వే ప్రకారం ఈ ఓటింగ్లో పాల్గొన్నవాళ్లంతా నేపాల్ పౌరులేనా? అనే అనుమానాలు వ్యక్తం చేసింది. భారత్లోనూ డిస్కార్డ్Discord ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. అమెరికాలో దాదాపు 25 కోట్లు, బ్రెజిల్లో ఐదున్నర కోట్ల యూజర్లు ఉన్నారు. ఆ తర్వాత భారత్లోనూ ఐదు కోట్ల మంది ఈ యాప్ను ఉపయోగిస్తునన్నారు. ఈ లిస్ట్లో కెనడా, ఫిలిప్పీన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ప్లాట్ఫారమ్ విండోస్, మాక్ఓఎస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్, లైనక్స్ వెబ్ బ్రౌజర్లలో కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి 30కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది, అందులో తెలుగు మాత్రం లేదు. డిస్కార్డులో గేమింగ్ మాత్రమే కాదు.. పౌర ఉద్యమాలు, రాజకీయ చర్చలు నడుస్తున్నాయి. సొంత సర్వర్తో క్రియేటివ్ కమ్యూనిటీలు నిర్మించుకునేందుకు వీలుగా ఉండడంతోనే ఇది సాధ్యమవుతోంది. అంత నిషేధంలోనూ Gen Z యువతకు డిస్కార్డ్ యాప్ ఒక గళం ఇచ్చింది. ఒకవేళ ఈ యాప్ను జెన్ జెడ్ యువత గనుక సమర్థవంతంగా ఉపయోగించుకుని గనుక ఉండి ఉంటే.. నేపాల్ ఉద్యమం అసంఘటితంగా, అస్పష్టంగా, మరింత హింసాత్మకంగా మారిపోయే అవకాశం ఉండేదేమో!. -
భలే మంచి చౌక బేరము
అమాడెయా.. ఓ భారీ విలాసవంతమైన పడవ. దీనిని అమెరికా ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. వాస్తవ ధర సుమారు రూ.3 వేల కోట్లు కాగా, అనేక కారణాలతో దీనిని సుమారు రూ.వెయ్యి కోట్లకే ఇవ్వాలనుకుంటోంది. రష్యాకు చెందిన చమురు వ్యాపారి, అపర కుబేరుడు సులేమాన్ కెరిమోవ్ మోజుపడి తయారు చేయించుకున్న పడవ ఇది. 2017లో నిర్మించిన ఈ పడవలో 6 డెక్కులున్నాయి. ఆధునిక వసతులతో కూడిన ఎనిమిది భారీ గదులు, జిమ్, సినిమా థియేటర్, లాబ్స్టర్ ట్యాంక్, పియానో రూం, స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక మసాజ్ సెంటర్తోపాటు హెలిప్యాడ్ కూడా అమాడెయాలో ఉంది. ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర మొదలుపెట్టిన వేళ ఆ దేశంపై అమెరికా మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. తమ దేశాల్లోని రష్యా ప్రభుత్వ, బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ప్రముఖుల వ్యక్తిగత ఆస్తులను స్వాధీనం చేసుకుంటోంది. ఇలా స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని అమ్మేసి, ఆ డబ్బును ఉక్రెయిన్కు అందజేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే అమెరికా ప్రభుత్వం క్లెప్టోక్యాప్చర్ టాస్క్ఫోర్స్ను 2022లో ఏర్పాటు చేసింది. ఈ విషయం తెలిసిన రష్యా చమురు వ్యాపారి సులేమాన్ కెరిమోవ్ తన అమాడెయా అనే భారీ పడవను సుదూరంగా ఉన్న ఫిజీలోని మారుమూల దీవిలో దాచి ఉంచాడు. అమెరికా నిఘా సంస్థలు, క్లెప్టో క్యాప్చర్ టాస్క్ఫోర్స్ దీని జాడను కనిపెట్టాయి. ఫిజీ నుంచి దీనిని అమెరికాకు తీసుకువచ్చాయి. ఇది సుమారు మూడేళ్ల క్రితం ఘటన. అప్పటి నుంచి అమాడెయా శాన్డియాగో తీరంలో ఉంది. ఫిజీ నుంచి తరలింపు, నిర్వహణ తదితరాలకే అమెరికా ప్రభుత్వం దీనిపై 3.2 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టింది. స్వాధీనం చేసుకున్న సమయంలో దీని విలువను సుమారు రూ.2,000 కోట్లుగా నిర్థారించారు. అయితే, ప్రస్తుత విలువ రూ.700 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల వరకు ఉన్నట్లు నిపుణులు మదింపు చేశారు. ప్రపంచంలోని 50 మంది నుంచి 100 మంది వరకు ఉన్న అత్యంత ధనవంతులకే ఇలాంటి బోట్ను కొనగలిగే సత్తా ఉందని అంచనా వేశారు.న్యాయ వివాదం..అమాడెయా వాస్తవ యజమాని ఎవరనే విషయమై మూడేళ్లుగా న్యాయపోరాటం సాగుతోంది. ఇది తమదేనంటూ అసలు యజమాని, రష్యా బిలియనీర్ అయిన సులేమాన్ కెరిమోవ్తోపాటు రష్యా ఇంధన సంస్థ రోస్నెఫ్ట్ మాజీ అధికారి ఎడ్వర్డ్ ఖుదైనటోవ్, మిల్లిమారిన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ న్యూయార్క్ కోర్టులో పిటిషన్లు వేశాయి. అయితే, కెరిమోవ్ అమెరికా ఆంక్షలను ఉల్లంఘించినందుకు ఈ పడవ యాజమాన్య హక్కులు అమెరికాకే ఉంటాయని 2023 మార్చిలో న్యూయార్క్ సర్క్యుట్ కోర్టు జడ్జి డేల్ హో ప్రకటించారు. దీంతో, అమెరికా ప్రభుత్వం ఇటీవల దీనిని వేలానికి పెట్టింది. వేలం పాటలో పాల్గొనే వారు కోటి డాలర్లను డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, క్లెప్టోక్యాప్చర్ టాస్క్ ఫోర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్న అమాడెయా వంటి అనేక పడవలు, విమానాలు, విలాసవంతమైన ఆస్తుల్లో చాలావరకు ప్రస్తుతం న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎడ్వర్డ్ ఖుదైనటోవ్ మాత్రం అమెరికా అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. న్యూయార్క్ సర్క్యూట్ కోర్టు తీర్పుపై అప్పీల్ చేశామని, నవంబర్లో తీర్పు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తీర్పు తమకు అనుకూలమైతే అమాడెయా పూర్తి విలువను అమెరికా ప్రభుత్వం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
రామాయపట్నంపై నిర్దయ
చెప్పేదొకటి.. చేసేదొకటి అనే రీతిలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తలపెట్టిన నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణ తీరే దీనికి చక్కటి ఉదాహరణ. నాడు చకచకా పనులు సాగి, గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పూర్తి కావాల్సిన ఈ నౌకాశ్రయం సర్కార్ నిర్లక్ష్య ధోరణి కారణంగా అతీగతీ లేకుండాపోతోంది. దీనిపై ఏ మాత్రం దృష్టి సారించకుండా.. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకో పోర్టును ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. 70 శాతం పూర్తయిన దీనిపైనే శ్రద్ధ చూపని పాలకులు.. మిగిలిన వాటిని ఎలా నిర్మిస్తారు.. ఇదంతా బూటకమనే విషయం వారి చేష్టలతోనే స్పష్టమవుతోంది. కందుకూరు: రామాయపట్నం పోర్టును కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో దీని నిర్మాణ పనులు చకచకా సాగినా, ప్రస్తుతం అడుగు ముందుకు పడటంలేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరాక.. అప్పటికే పనులు చేస్తున్న ఏజెన్సీని తొలగించడంతో ఆర్నెల్ల పాటు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత చేపట్టినా, పనుల్లో వేగం నేటికీ పుంజుకోలేదు. గతంలో చేసిన వర్కుల మినహా ప్రస్తుతం ఏ మాత్రం పురోగతి లేదు. అసలెప్పటికి పూర్తవుతుందో..? వాస్తవానికి డిసెంబర్, 2023 నాటికే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని నాటి సీఎం జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. తదనుగుణంగా అన్ని చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని చూస్తుంటే మరో నాలుగేళ్లకైనా నిర్మాణం పూర్తవుతుందాననే అనుమానం తలెత్తుతోంది. ప్రస్తుతం.. గ్రహణం గతేడాది జూన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతోనే పోర్టు నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. అధికారం చేజిక్కించుకున్న వెంటనే కాంట్రాక్ట్ సంస్థ అరబిందోను తొలగించింది. తదనంతరం దాదాపు ఆర్నెల్ల పాటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆపై నవయుగ కంపెనీకి నిర్మాణ బాధ్యతను అప్పగించారు. అయితే అప్పటికే పాత సిబ్బందిని తొలగించడం.. కార్మికులు, భారీ యంత్రాలను సమకూర్చడంలో చోటుచేసుకున్న జాప్యంతో పనులు మరింత ఆలస్యమయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్నా, అవి నామమాత్రమే. గతంలో చేపట్టిన బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణ పనులను అరకొరగా జరుపుతున్నారు. కీలకమైన డ్రెడ్జింగ్, బెర్తుల నిర్మాణం ఇంకా ప్రారంభమే కాలేదు.మొదటి దశ ఎప్పుడో..?రామాయపట్నం పోర్టు మొదటి దశలో భాగంగా 34.04 ఎమ్మెమ్టీపీఏ (మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ ఆనమ్) కార్గో సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించాల్సి ఉంది. వీటిలో రెండు జనరల్, ఒకటి కోల్, మరొకటి మల్టీ పర్పస్కు సంబంధించనవి. సముద్రంలో వచ్చే ఆటుపోట్లు, తుఫాన్లను తట్టుకునేలా సౌత్, నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ల నిర్మాణాన్ని చేపట్టారు. వీటిని నీటి ఉపరితలం నుంచి మూడు మీటర్ల ఎత్తు, 100 మీటర్ల వెడల్పుతో పెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఇందులో సౌత్ బ్రేక్ వాటర్ ఫీడర్ 3.7.. నార్త్ బ్రేక్ వాటర్ ఫీడర్ 1.73 కిలోమీటర్ల మేర పనులను పూర్తి చేశారు. వీటి మధ్యలోనే బెర్తులనూ నిర్మిస్తున్నారు. లక్ష టన్నుల సామర్థ్యం గల భారీ నౌకలు నిలిచేందుకు వీలుగా సముద్ర లోతును 16 మీటర్ల వరకు గతంలోనే డ్రెడ్జింగ్ చేశారు. బల్క్ బెర్తును నిర్మించి, 2023 డిసెంబర్ నాటికే మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో పనులు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికే మొదటి దశలో కీలకమైనవన్నీ పూర్తయ్యాయి. ఆపై సర్కార్ నిర్లిప్త ధోరణితో ఏ మాత్రం పురోగతి కనిపించడంలేదు. ఉన్నతాశయంతో..తీర ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఉలవపాడు మండలంలోని రామాయపట్నం వద్ద రూ.3736 కోట్ల అంచనాతో పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వంలో పునాది రాయి పడింది. 850.79 ఎకరాల్లో పనులకు 2022, జూలై 20న నాటి సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణ పనులను అరబిందో సంస్థ వాయువేగంతో 70 శాతం మేర చేసింది. 18 నెలల్లోనే వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు సాగాయి. డిసెంబర్, 2023 నాటికి మొదటి వాణిజ్య నౌకను నిలపాలనే లక్ష్యంతో సర్కార్ అడుగులేసింది. అయితే ఆపై 2024 సాధారణ ఎన్నికల హడావుడి, కోడ్ అమల్లోకి రావడంతో అది సాధ్యపడలేదు. ప్రస్తుత పరిస్థితి.. ఒక బెర్తు నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన మూడు బెర్తులతో పాటు, సముద్ర లోతును పెంచే డ్రెడ్జింగ్ పనులు జరగాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్ నాటికి మొదటి దశ పనులను పూర్తి చేసి అందుబాటులో తీసుకురావాలని నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంకల్పించినా, ప్రస్తుత సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా రామాయపట్నం పోర్టు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. -
నమ్మకంతో నక్షత్రాలై!
‘స్థిరమైన ఉద్యోగం ఉంటే చాలు’ అనుకునే మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా డిక్షనరీలో ‘ఇక చాలు’ అనే మాట ఎప్పుడూ లేదు. సక్సెస్ఫుల్ కన్సల్టెంట్ నుంచి సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మారింది. మొదట 73 మంది ఇన్వెస్టర్ల నుంచి ఆమెకు తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు. ఆ నమ్మకమే గొప్ప విజయం అయింది.పేషెంట్లు, హాస్పిటల్స్ మధ్య దూరం ఉందని గ్రహించిన గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగు పెట్టింది. మొదట్లో ఆమె మాటలను పెద్దగా ఎవరూ విశ్వసించలేదు. అయినా ఆమె ప్రయాణం ఆపలేదు. విశ్వసనీయతే జీవనాడిగా ప్రయాణం ప్రారంభించిన ప్రిస్టీన్కేర్ హెల్త్కేర్ రంగంలో సరికొత్త సంచలనం అయింది.‘సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్’గా పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఒక స్టార్టప్తో ప్రయాణం మొదలుపెట్టిన వినీతా సింగ్కు అపజయాలు హాయ్ చెప్పాయి. ఎంటర్ప్రెన్యూర్గా రాణించాలంటే ఉత్సాహం ఒక్కటే సరిపోదని వ్యూహం కూడా కావాలని గ్రహించి మేకప్ బ్రాండ్ ‘షుగర్ కాస్మోటిక్స్’తో తిరుగులేని విజయాన్ని సాధించింది.దేశీయ యూనికార్న్ క్లబ్లో కొన్ని స్టార్టప్లు యూనికార్న్ హోదాను కోల్పోయాయి. కొన్ని మాత్రం ఆ హోదాను స్థిరంగా నిలుపుకుంటూనే, ఔత్సాహికులకు స్ఫూర్తినిస్తున్నాయి.‘వైవిధ్యమైన రంగాలలో మహిళా వ్యాపారవేత్తలు అద్భుత విజయాలు సాధించారు’ అంటూ గరిమ సానే (ప్రిస్టీన్ కేర్), రుచి కల్రా (ఆఫ్ బిజినెస్), వినీతా సింగ్ (షుగర్ కాస్మోటిక్స్) పేర్లను ప్రస్తావించింది ఏఎస్కె ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్–2025 నివేదిక.ఈ ముగ్గురు ఎవర్గ్రీన్ యూనికార్న్ స్టార్ల సక్సెస్ మంత్రా గురించి...పరాజయాల తరువాత ఘన విజయంలక్నోకు చెందిన వినీతాసింగ్ చదువులో ఎప్పుడూ ముందుండేది. స్కూల్, కాలేజి రోజుల్లో బంగారు పతకాలు అందుకుంది. ఐఐటీ, మద్రాస్లో చదువుకున్న వినీత బ్యాడ్మింటన్లో సత్తా చాటేది. ఎన్నో టోర్నమెంట్స్లో విజయం సాధించింది. పరుగు పందేలలో కూడా దూసుకుపోయేది. ఒక్కమాటలో చెప్పాలంటే చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్లా ఉండేది.ఇన్వెస్టింగ్ బ్యాంకింగ్లో విలువైన అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వదులుకొని ‘క్వెజాల్’ వెంచర్ మొదలు పెట్టింది. ఆ స్టార్టప్ విజయం సాధించలేదు. ఆ తరువాత ప్రారంభించిన ‘ఫ్యాబ్–బాగ్’ అంతంతమాత్రమే అనిపించింది. అయిన్పటికీ ‘ఇక చాలు’ అనుకోలేదు. గట్టి విజయం కోసం తపన పోలేదు. ‘షుగర్ కాస్మోటిక్స్’ స్టార్టప్తోతో అసలు సిసలు విజయాన్ని అందుకుంది. ‘రకరకాల స్కిన్ టోన్లను దృష్టిలో పెట్టుకొని అధిక నాణ్యతతో కూడిన, అందుబాటు ధరల్లో ఉండే ప్రాడక్ట్స్ను తీసుకువచ్చాం’ అంటుంది వినీతాసింగ్.‘షుగర్ కాస్మోటిక్స్’లో పనిచేస్తున్న 75 శాతం మంది ఉద్యోగులు మహిళలే కావడం విశేషం. రియాలిటీ షో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ కార్యక్రమంలో జడ్జీ, ఇన్వెస్టర్గా రెండు బాధ్యతలు నిర్వహిస్తోంది వినీత. ఈ కార్యక్రమం ద్వారా ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకునే ప్రతిభావంతులకు విలువైన సలహాలు ఇస్తోంది. వారి కలలు సాకారం చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది. యూనికార్న్ స్టార్గా వినీతాసింగ్ విజయం ఎన్నో విషయాలను చెప్పకనే చెబుతుంది. అందులో ఒకటి.... ‘కష్టపడితే... కాలంతో పాటు నడిస్తే ఏదీ అసాధ్యం కాదు’డెబ్బైమూడు మంది తిరస్కరించారు!పంజాబ్లోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రుచి కల్రా కెమికల్ ఇంజినీరింగ్ చదువుకుంది. అయినప్పటికీ ఆర్థికవిషయాలపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తితోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఎంబీఎ చేసింది. చదువు పూర్తయిన తరువాత మెకెన్జీ అండ్ కంపెనీలో తొమ్మిది సంవత్సరాల పాటు పనిచేసింది. ఆ కంపెనీలో పనిచేసిన అనుభవం తనలోని నైపుణ్యాలను మెరుగు దిద్దుకునేలా చేసింది. ఆ నైపుణ్య బలమే వ్యాపారవేత్తగా తన ప్రయాణానికి ఇంధనం అయింది. మెటల్స్, కెమికల్స్, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన బి2బి కామర్స్ ΄్లాట్ఫామ్ ‘ఆఫ్బిజినెస్’కు శ్రీకారం చుట్టింది. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలకు ముడి సరుకును అందించే కంపెనీ ఇది. మొదట్లో 73 మంది ఇన్వెస్టర్ల నుంచి తిరస్కారం ఎదురైంది. ఒకే ఒక్క ఇన్వెస్టర్ నమ్మాడు.‘ఆఫ్బిజినెస్’ను సక్సెస్ఫుల్ వెంచర్గా తీర్చిదిద్దిన రుచి కల్రా ఆ తరువాత ఈ కంపెనీకి అనుబంధంగా ‘ఆక్సీజో’ పేరుతో ఫైనాన్షియల్ సర్సీసెస్ మొదలుపెట్టింది.బలమైన నాయకత్వ సామర్థ్యానికి అంకితభావం తోడైతే ఎంత విజయం సాధించవచ్చో నిరూపించింది రుచి. ‘ఆఫ్బిజినెస్’ విజయంతో ఎంతోమంది ఔత్సాహికులు, వ్యాపార రంగంలోకి రావాలని కలలనే కనే యువతరానికి స్ఫూర్తిగా నిలిచింది.మొదట్లో ఎవరూ విశ్వసించలేదు!గైనకాలజిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్న డా. గరిమ సానే ‘ప్రిస్టీన్ కేర్’తో ఎంటర్ప్రెన్యూర్గా మారింది. తన వైద్యవృత్తి ద్వారాఎన్నోరకాల నైపుణ్యాలను సొంతం చేసుకున్న గరిమకు ఓపిక ఎక్కువ. తొందరపాటు లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. అధిక పనిభారం, తక్కువమంది సిబ్బంది, పేషెంట్లపై సరిౖయెన శ్రద్ధ చూపకపోవడం... కొన్ని హాస్పిటల్స్లో ఈ పరిస్థితిని చూసిన గరిమ ‘ప్రిస్టీన్ కేర్’తో హెల్త్కేర్ రంగంలోకి అడుగుపెట్టింది. హాస్పిటల్స్కు, పేషెంట్లకు మధ్య ఉన్న దూరాన్ని తగ్గించాలి, పేషెంట్లు కోరుకునే క్వాలిటీ సర్జికల్ కేర్ను అందించాలి అనే లక్ష్యంతో ప్రయాణం మొదలు పెట్టింది.వైద్యుల ఎంపిక, క్లినిక్లో అపాయింట్మెంట్, డయాగ్నోస్టిక్ కేంద్రాలలో టెస్ట్లు బుకింగ్ చేయడం, ఇన్సూరెన్స్ పేపర్ వర్క్, హాస్పిటల్ ఆడ్మిషన్–డిశ్చార్జీ ప్రాసెస్, సర్జరీ తరువాత ఫాలో–అప్ కన్సల్టేషన్, రకరకాల డిపార్ట్మెంట్లతో సమన్వయం... మొదలైన పనులు ప్రిస్టీన్ కేర్ జాబితాలో ఉన్నాయి. అందుకే పేషెంట్ల సర్జరీని సులభతరం చేసే అత్యాధునిక హెల్త్కేర్ కంపెనీగా ‘ప్రిస్టీన్ కేర్’ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రిస్టీన్ కేర్ 150కి పైగా క్లినిక్స్, 800కి పైగా పార్ట్నర్ హాస్పిటల్స్, 400కి పైగా సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లను ఆపరేట్ చేస్తుంది.మొదట్లో చాలామంది వైద్యులు, హాస్పిటల్స్ గరిమ చెప్పే మాటలను పెద్దగా విశ్వసించలేదు. ఆ తరువాత వారికి ప్రిస్టీన్ కేర్ అంకితభావం, కష్టం అర్థమయ్యాయి.‘హెల్త్కేర్ అనేది కేవలం సైన్స్ మాత్రమే కాదు నమ్మకం, భావోద్వేగాలు కూడా అందులో మిళితమై ఉన్నాయి’ అంటున్న గరిమ మార్కెటింగ్ వ్యూహాలను బాగా అర్థం చేసుకుంది. ఆ వ్యూహాలతో కంపెనీని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. ‘సర్జరీ సింప్లిఫైడ్’ అనేది పిస్ట్రీన్ కేర్ ట్యాగ్లైన్. -
కనుమరుగు కానున్న ఈశాన్య రుతుపవనాలు?!
అనూహ్యం.. అసాధారణం.. ఆశ్చర్యం.. నైరుతి రుతుపవనాలు ‘సంప్రదాయ’ గతి తప్పాయి. వాతావరణ మార్పు, భూతాపం నేపథ్యంలో అవి దారి తప్పి ఆధునిక ‘పోకడ’ పోతున్నాయి. ప్రస్తుతం నైరుతి రుతుపవనాల నడక కొద్దిగా మారింది. భవిష్యత్తులో ఇదే నడత కొనసాగితే మన దేశానికి ముప్పు తప్పదు!!. ఈ నెల తొలి వారంలో భారత వాతావరణ విభాగానికి చెందిన ఓ ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం రుతుపవన గమనంపై వాతావరణ నిపుణుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. హిమాలయ పర్వత శ్రేణుల వరకు వెళ్లి.. గోడకు కొట్టిన బంతిలా వెనక్కు రావాల్సిన రుతుపవనాలు కొంత కట్టు తప్పి టిబెట్ పీఠభూమి ప్రాంతంలోకి ప్రవేశించాయి. హిమాలయాలకు ఆవల ఉండే టిబెట్ పీఠభూమిలో అవపాతం తక్కువ. అందుకే ఈ ప్రదేశం ఎప్పుడూ పొడిగా కనిపిస్తుంది. శీతాకాలంలో హిమపాతం, వసంత రుతువులో పశ్చిమ అలజడుల వల్ల కొద్దిపాటి వర్షపాతం మాత్రమే అక్కడ నమోదవుతాయి. అలాంటి శుష్క టిబెట్ ప్రాంతంలో నైరుతి తేమ గాలులు తాజాగా వానలు కురిపించాయి. నైరుతి రుతుపవనాల తేమగాలులు హిమాలయాల హద్దును దాటేసి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లద్దాఖ్ మీదుగా టిబెట్ ప్రాంతంలోకి ప్రవేశించినట్టు ఉపగ్రహ చిత్రం స్పష్టంగా చూపుతోందని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన గ్లేసియాలజిస్ట్ మనీష్ మెహతా చెప్పారు. ఇండియాకు ప్రత్యేక వరం.. రుతుపవనాలు! వేసవిలో సముద్ర జలాలు వేడెక్కి నీరు ఆవిరై బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచి బయలుదేరే తేమగాలులు నైరుతి రుతుపవనాల రూపంలో భారతదేశమంతటా విస్తరించి జూన్-సెప్టెంబరు నెలల్లో వర్షాలు కురిపిస్తాయి. వాటి ప్రయాణం ఉత్తరానికి వచ్చేటప్పటికి ఎదురుగా హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తుగా, పెట్టని కోటలా అడ్డు నిలుస్తాయి. ఎత్తైన హిమాలయాలను దాటుకుని ముందుకు వెళ్లలేక నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తాయి. తమలో మిగిలివుండే తేమతో హిమాలయ పర్వత శ్రేణుల నుంచి అవి వెనక్కు మరలుతాయి. తిరుగుపయనంలో ఈశాన్య రుతుపవనాల పేరిట అక్టోబరు, నవంబరు నెలల్లో వర్షిస్తూ మళ్లీ సముద్రం బాట పడతాయి. ప్రయాణంలో వర్షిస్తూ తేమను కోల్పోతూ ఉంటాయి కనుక... నైరుతితో పోలిస్తే మనకు ఈశాన్య రుతుపవనాల వర్షపాతం తక్కువ. రుతుపవన ప్రక్రియ భారతదేశానికి ప్రత్యేకం. దేశంలో సాగునీరు, తాగునీటికి రుతుపవనాలే ఆధారం. భూతాపం, వాతావరణ మార్పు, పశ్చిమ అలజడులు/కల్లోలాలుగా పిలిచే వాతావరణ ప్రక్రియల వల్ల నైరుతి రుతుపవనాలు టిబెట్ వైపు వెళ్లి ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో ఎత్తు తక్కువ ఉండే దారుల గుండా నైరుతి తేమ గాలులు టిబెట్లోకి ప్రవేశించి ఉండొచ్చని అంటున్నారు. అయితే.. నైరుతి రుతుపవనాలు మున్ముందు ఇలాగే టిబెట్ చేరుతూ అక్కడ తరచూ వర్షాలు కురిపించడం ఆరంభిస్తే... హిమనీనదాల (గ్లేసియర్స్)లోని మంచు కరుగుదలలో, నదీ ప్రవాహాల తీరుతెన్నుల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. నైరుతి కాస్తా తుర్రుమని టిబెట్ పారిపోతే మనకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో వర్షపాతం తగ్గుతుంది. వ్యవసాయం, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. తాగునీటికి కటకట తప్పదు. రుతుపవనాలనే నమ్ముకుని బతుకుతున్న దేశం మనది. ఏదో ఒక సీజన్లో రుతుపవనాలు ముఖం చాటేసినా తర్వాత సంవత్సరంలోనైనా మంచి వానలు పడకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తారు రైతన్నలు. నైరుతి రుతుపవనాలు భౌగోళికంగా ‘హిమాలయ కంచె’ దూకి ప్రతి సీజన్లోనూ ఆవలి టిబెట్ వైపునకు పూర్తిగా మరలిపోయేట్టయితే... అవి ఇక తిరిగి వెనక్కు రావు! అప్పుడిక ఈశాన్య రుతుపవనాలు అనేవే ఉండవు!! ఒకవేళ కొంత భాగం తిరిగొచ్చినా ఆ తేమలేని, బలహీన పవనాలతో కురిసే వర్షాలు, కలిగే ప్రయోజనం నామమాత్రమే. భయపెట్టాలని కాదు గానీ... ఆ దుస్థితి రాకూడదనే ఆశిద్దాం. వాతావరణ మార్పు ప్రభావంతో ఎన్నో వింతలు చూస్తున్నాం. నిరుడు కురిసిన వర్షాలకు సహారా ఎడారి ఇసుక తిన్నెలు సరస్సులను తలపించిన సంగతి మరచిపోతే ఎలా?!(Source: Zee News)::జమ్ముల శ్రీకాంత్ -
ఆకాశ వీధిలో ఆర్భాటం చేసి.. పాతాళంలో వదిలేసి!
శ్రీశైలంటెంపుల్: ‘దట్టమైన నల్లమల అటవీ మధ్యలో ప్రవహించే కృష్ణమ్మ పరవళ్లపై ప్లేన్లో ప్రయాణించి మధురానుభూతి పొందే అవకాశం కల్పిస్తున్నాం. ఇందులో భాగంగా విజయవాడ నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా విజయవాడ నుంచి శ్రీశైలానికి తక్కువ సమయంలో వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఏపీని టూరిజం హబ్గా మారుస్తాం’ అంటూ స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శ్రీశైలంలో సీ ప్లేన్ ట్రయరల్ రన్ వేళ అన్న మాటలు. ఇక సీన్ కట్ చేస్తే.. సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టి ఇప్పటికి పది నెలలు గడుస్తోంది. ఇంకా సర్వేలు, సమీక్షలకే అధికారులు పరిమితమయ్యారు. ఇప్పటికీ డీపీఆర్ సిద్ధం కాకపోవడంతో సీప్లేన్ ప్రయాణం మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది. సీఎం ప్రచార ఆర్భాటానికే సీప్లేన్ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చి ట్రయల్రన్ చేసి వదిలేశారని, ఆచరణ చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మల్లన్న భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం టూరిజం అభివృద్ధిలో భాగంగా శ్రీశైలానికి గతేడాది నవంబరు 9న సీప్లేన్ ట్రయల్రన్ చేపట్టారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె.రామ్మోహన్నాయుడు, టూరిజం శాఖ మంత్రి దుర్గేశ్ తదితరులు విజయవాడ పున్నమి ఘాట్ నుంచి సీప్లేన్లో శ్రీశైలం పాతాళగంగకు చేరుకున్నారు. సీప్లేన్ ప్రారంభమైతే విజయవాడ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగ ళూర్ తదితర రాష్ట్రాల నుంచి సైతం సీప్లేన్ నడిపేందుకు అవకాశం ఉందని అప్పట్లో పాలకులు, పర్యాటక అధికారులు ప్రకటించారు. భక్తులు, పర్యాటకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వారాంతపు సెలవులు ఉంటే ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు తమ సమయాన్ని వృథా చేసుకోకుండా సీప్లేన్ ద్వారా త్వరగా వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని త్వరగా వెళ్లే అవకాశం ఉండేదని భావించారు. అయితే పది నెలలుగా గడుస్తున్నా ట్రయల్ రన్కు పరిమితం కావడంతో కూటమి ప్రభుత్వానికి ప్రారంభంలో హడావుడి చేయడం, ఆ తర్వాత వదిలేయడం సర్వ సాధారణమేనని పలువురు విమర్శిస్తున్నారు. ఇరిగేషన్, అటవీశాఖ అనుమతులు లభించేనా..?సీప్లేన్ నిర్వహించే ప్రదేశంలో శ్రీశైలం పూర్తిగా నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంది. ఇది పూర్తిగా వన్యప్రాణులు, చిరుతలు, పెద్దపులులు అవాసానికి అనువైన ప్రదేశం. ఇక్కడ సీప్లేన్ సేవలు నిర్వహించాలంటే అటవీశాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. అలాగే సీప్లేన్ టేక్ ఆఫ్, ల్యాండింగ్కు డ్యామ్ పరిధిలో ఉండటంతో ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతి కూడా తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. అలాగే ఏవియేషన్, ఇతర శాఖల అనుమతులు తప్పనిసరి. కూటమి ప్రభుత్వం విజయవాడ టూ శ్రీశైలం సీ ప్లేన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించి త్వరితగతిన అనుమతులు అన్ని తీసుకుని సేవలను అందుబాటులోకి తేవాలని పలువురు పర్యాటకులు కోరుతున్నారు. సర్వేలు, సమీక్షలకే పరిమితంవిజయవాడ నుంచి శ్రీశైలానికి వచ్చే సీప్లేన్ ప్రయాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఐడీసీ) అధికారులు డిటేల్డ్ ప్రాజెక్టు రిపొర్టు తయారు చేస్తున్నారు. శ్రీశైలంతో పాటు అరకు, లంబసింగి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, గండికోట, నర్సాపూర్, తిరుపతి, ప్రకాశం బ్యారేజ్ మొత్తం 10 ప్రదేశాలలో టూరిజం పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం డీపీఆర్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ ప్రాజెక్టు రిపోర్టు తయారీకి నాలుగు నెలల క్రితం ఓ ప్రైవేట్ కన్పల్టెన్సీకి నియమించారు. వారు మే నెల నుంచి డీపీఆర్ తయారు చేసేందుకు పనులు ప్రారంభించారు. ఏపీఐడీసీ అధికారులు వారానికి ఒకసారి సర్వేలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. డీపీఆర్లో సీప్లేన్ ల్యాండ్ అయ్యే ప్రదేశం, సీప్లేన్ టేక్ఆఫ్, టేక్ ఆన్కు నీటిలో సుమారు 1.16 కిలోమీటర్ల పోడవు, 120 మీటర్ల వెడల్పు ఉండే ప్రదేశం, పర్యాటకులు సీప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీల ఏర్పాటు, టికెట్టు ధరలు, ఎన్ని ప్లేన్ సర్వీసులను తిప్పాలి, రోజుకు ఎన్ని ట్రిప్పులు, సీప్లేన్ ల్యాండింగ్ వద్ద పర్యాటకులకు విశ్రాంతి తీసుకునేందుకు గదులు, టికెట్టు కౌంటర్, సిబ్బంది తదితర పూర్తి వివరాలను డీపీఆర్లో పొందుపరుచనున్నారు. వచ్చే జనవరి నాటికి డీపీఆర్ పూర్తి చేయాలని కన్సల్టెన్సీకి ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. -
పండ్లు, పూలు.. ఫైను.. జైలు!
డిక్లరేషన్స్ ఇవ్వకుండా.. కొప్పులో మల్లెపూలు పెట్టుకున్నందుకు మెల్బోర్న్ విమానాశ్రయ ఇమిగ్రేషన్స్ అధికారులు నవ్య నాయర్ అనే మలయాళ నటికి రూ.1.14 లక్షల జరిమానా విధించారు. ఈమెకు ఎదురైన చేదు అనుభవం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవును, విదేశాల్లో ఇలాంటి చిత్రవిచిత్రమైన నిషేధాలు చాలా ఉన్నాయి.ప్రయాణం అంటేనే వెంట తీసుకెళ్లే వస్తువులతో బ్యాగులు నిండాల్సిందే. మౌత్ ఫ్రెషనర్, పెర్ఫ్యూమ్ వంటి రోజూ వాడే వస్తువులు అయినా.. బంధువులు, స్నేహితులకు ఇచ్చే పిండివంటలు, బహుమతులైనా.. బాధ్యత, ప్రేమతో సూట్కేస్ బరువెక్కాల్సిందే. మనతోని అట్లుంటది మరి. మన దేశంలో అయితే ఫర్వాలేదు. పరాయి దేశం వెళితేనే సమస్య. ఎందుకంటే మనదగ్గరిలా ఏదిపడితే అది విదేశాలకు తీసుకెళతామంటే అక్కడి నిబంధనలు ఒప్పుకోవు. ఆస్ట్రేలియాలో ఇటీవలే జరిగిన నటి నవ్య నాయర్ ఘటనే ఇందుకు ఉదాహరణ. న్యూజిలాండ్లోని ఆక్లాండ్ విమానాశ్రయంలో 2002లో జరిగిన సంఘటన సైతం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, హర్భజన్స్ సింగ్ చెరి 200 న్యూజిలాండ్ డాలర్ల జరిమానా కట్టాల్సి వచ్చింది. వాళ్లు బ్యాగుల్లో తీసుకొచ్చిన బూట్లకు మట్టి, గడ్డి ఉండడమే ఇందుకు కారణం. వేడి చేయని పాలను కెనడా, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్లకూడదు. గ్రీసులోని ప్రాచీన పర్యాటక ప్రదేశాలకు హైహీల్స్తో వెళ్లడం నిషిద్ధం. ఇలాంటివి మరికొన్ని..ఆస్ట్రేలియా: బయో సెక్యూరిటీ, కస్టమ్ చట్టాల ప్రకారం తాజా పూలు, పండ్లు, కూరగాయలు, మట్టిని తీసుకెళ్లడానికి వీల్లేదు. ఎందుకంటే ఇబ్బడిముబ్బడిగా వీటిని నాటితే అక్కడి పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుందన్నది వారి వాదన. సోన్పాపిడి, మైసూర్ పాక్ వంటి స్వీట్లు, మసాలా దినుసులు, పాల ఉత్పత్తులు కూడా నిషేధమే. ఈ జాబితాలో ఇంకా చాలా ఉన్నాయి.ఆగ్నేయాసియా: ఘాటైన వాసన వచ్చే డ్యూరియన్స్ (పనసలాంటి) పండును ప్రయాణంలో తీసుకెళ్లడాన్ని చాలా విమానయాన సంస్థలు నిషేధించాయి. ముఖ్యంగా కోసిన పండును తీసుకెళ్లరాదు. దీన్ని భారత్కు తీసుకురావాలంటే సరైన పద్ధతిలో ప్యాక్ చేయాలి. సింగపూర్లో చూయింగ్ గమ్ అమ్మకం, దిగుమతి నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో గమ్స్ను ఉమ్మితే భారీ జరిమానా విధిస్తారు. మెడికల్ గమ్స్ను మాత్రమే అనుమతిస్తారు.దక్షిణ కొరియా: అమెరికాకు చెందిన ట్రేడర్ జో కంపెనీ తయారీ ‘ఎవిరీథింగ్ బట్ ది బేగల్ సీజనింగ్’ బ్రాండ్ మసాలాలను విమాన ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఈ మసాలాల్లో గసగసాలు ఉండడమే ఇందుకు కారణం. ఆ దేశం గసగసాలను మాదక ద్రవ్యాలుగా పరిగణిస్తుందట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, సింగపూర్లలోనూ గసగసాలపై బ్యాన్ ఉంది. కరేబియన్స్ దీవులు: సైనికులు ధరించే దుస్తుల (క్యామఫ్లాజ్) వంటివి సాధారణ పౌరులు వేసుకోవడం చట్టవిరుద్ధం. సైన్యం మాత్రమే ధరించాలి. సైనికులుగా పొరపడే ప్రమాదం ఉంది కాబట్టి సాధారణ వ్యక్తులు ఈ దుస్తులతో విమానాశ్రయాల్లో కూడా కనిపించకూడదు. అలా చేస్తే జరిమానా వేస్తారు లేదా జైలుకు పంపుతారు. యూఎస్: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు అమితంగా ఇష్టపడే కిండర్ సర్ప్రైజ్ ఎగ్స్ (కిండర్జాయ్)ను విమానంలో తీసుకురావడం నిషేధం. గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంది కాబట్టి పిల్లలకు సంబంధించిన ఆహార ఉత్పత్తుల్లో తినడానికి వీలుకాని వస్తువులను ఉంచకూడదు.న్యూజిలాండ్: పచ్చళ్లు, మాంసం, విత్తనాలు, విదేశీ మట్టి నిషేధం. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా సరిహద్దు నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఇటలీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లిప్–ఫ్లాప్స్ లేదా శబ్దం వచ్చే బూట్లు వేసుకోకూడదన్న నిబంధన ఉంది. శబ్దం వస్తే స్థానికులకు చికాకు కలుగుతుందట.కెనడా: ఈ దేశంలో బేబీ వాకర్ నిషేధం. పిల్లలకు ఇందులో గాయాలవుతున్నాయని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కెనడా వీటిని తమ దేశంలో నిషేధించింది.ఉత్తర కొరియా : ఎంతో ఇష్టమని ఈ దేశానికి బ్లూజీన్స్తో వెళ్లేరు.. ఫైన్ కట్టాలి లేదా జైలుకు కూడా వెళ్లాల్సి రావొచ్చు. పాశ్చాత్య సంస్కృతికి ఇవి చిహ్నమని, ఇవి తమ సంస్కృతిని పాడుచేస్తాయని వీటిపై బ్యాన్ విధించారట. -
బాల్యమూ.. భారమే!
పిల్లల్లో ఊబకాయ సమస్య ప్రపంచానికి పెద్ద ఆరోగ్య సంక్షోభంలా పరిణమించబోతోందని యునిసెఫ్ తాజా నివేదిక హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా బాలల్లో 10 శాతం మంది ఊబకాయంతో ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రతి పది మంది పిల్లల్లో ఒకరికి ఊబకాయం ఉంటోందని పేర్కొంది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడటమే ఇందుకు కారణం అని చెబుతూ, ఈ అలవాట్లు పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్యాలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.‘తగినంత ఆహారం లేక గతంలో పిల్లలు తరచూ బరువు తక్కువగా ఉండేవారు. అది వారి శారీరక పెరుగుదలను కుంగదీయడమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకూ దారితీసింది. అయితే, తాజా పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. జంక్ఫుడ్ను తినకుండా ఉండలేక పిల్లలు బరువెక్కుతున్నారు’ అని యునిసెఫ్ తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఇదీ పోషకాహార లోపమే!నేటి పిల్లల్లో ఊబకాయం అన్నది, మునుపటి దశాబ్దాల నాటి పోషకాహార లోపం కంటే వేగంగా పెరుగుతోందని, ఊబకాయం ఉన్న పిల్లల సంఖ్య.. బరువు తక్కువగా ఉన్నవారిని మించిపోయిందని నివేదిక తెలిపింది. బాల్యంలోని ఈ ఊబకాయం ఇప్పుడు పోషకాహార ‘లోపానికి’ వేరొక రూపంగా భావించవచ్చని పేర్కొంది.యునిసెఫ్, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 5 నుంచి 19 సంవత్సరాల వయసు గల పిల్లల్లో 18 కోట్ల 80 లక్షల మంది పిల్లలు ఊబకాయుల కేటగిరీలో ఉన్నారు! ఈ వయసులో బరువు తక్కువగా ఉన్న పిల్లల శాతం 2000లో 13 నుంచి నేడు 9.2 శాతానికి తగ్గింది. అదే సమయంలో ఊబకాయం 3 శాతం నుంచి 9.4 శాతానికి పెరిగింది.ఎక్కడ ఎక్కువగా ఉన్నారు?యునిసెఫ్ నివేదిక ప్రకారం పసిఫిక్ దీవులలోని పిల్లల్లో ఊబకాయం ఎక్కువగా ఉంది. దీవి దేశాలైన నియులో 38 శాతం, కుక్ దీవులలో 37 శాతం, నౌరు దీవులలో 33 శాతం బాల ఊబకాయులు ఉన్నారు. ప్రపంచంలో మొత్తం బాల్య, కౌమార దశల్లో ఉన్న వారిలో 42.7 కోట్ల మంది అధిక బరువు సమస్యతో ఉంటే వారిలో.. దాదాపు సగం మంది తూర్పు ఆసియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, కరీబియన్, దక్షిణాసియాలలోనే ఉన్నారు.అలవాటుగా అధిక ఆహారంప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో కనిపిస్తున్న ఈ ఊబకాయానికి ప్రధాన కారణం.. చవకైన, మితిమీరి ప్రాసెస్ చేసిన, దిగుమతి చేసుకుంటున్న అధిక కేలరీల ఆహార పదార్థాల వినియోగం పెరగడమేనని నివేదిక గుర్తించింది. సాంప్రదాయ ఆహారాలు, ఇతర పోషక పదార్థాలకు బదులుగా పిల్లలు అధిక కేలరీలున్న, ప్రాసెస్డ్ ఫుడ్కు అలవాటు పడుతున్నారని తెలిపింది. అల్ట్రా–ప్రాసెస్డ్ ఆహారంలో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వంటివి చిన్నారుల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయని పేర్కొంది.పేద దేశాల్లోనూ ఊబకాయంసాధారణంగా అధిక ఆదాయ దేశాలలో పిల్లలు ఊబకాయంతో ఉంటారని ఒకప్పుడు భావించేవారు. అయితే, యునిసెఫ్ తాజా నివేదిక ఈ భావనను పటాపంచలు చేసింది. పాఠశాలకు వెళ్లే పిల్లల్లో చిలీలో 27 శాతం మంది, యూఎస్ఏ, యూఏఈలలో 21 శాతం మంది ఊబకాయంతో ఉండటాన్ని బట్టి పిల్లల్లోని ఈ ఊబకాయం దిగువ, మధ్య ఆదాయ దేశాలకే పరిమితం కాలేదని నివేదిక గుర్తించింది.ప్రకటనలు ప్రేరేపిస్తున్నాయిపిల్లల్లో ఊబకాయం పెరగడంలో వ్యాపార ప్రకటనలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నివేదిక తెలిపింది. తాజా సర్వేలో, గతవారం 13 నుంచి 24 సంవత్సరాల వయసు గల 75 శాతం మంది పిల్లలు, యువకులు జంక్ ఫుడ్ ప్రకటనలను చూసినట్లు వెల్లడైంది. వారిలో 60 శాతం మంది ఈ ప్రకటనలు చూశాక తమలో వాటిని తినాలన్న కోరిక కలిగిందని తెలిపారు. ఘర్షణలు, యుద్ధ వాతావరణం ఉండే ప్రాంతాల్లోనూ 68 శాతం యువత ఇప్పటికీ అలాంటి మార్కెటింగ్ వ్యూహాలకు ప్రభావితం అవుతున్నట్లు నివేదిక పేర్కొంది.ఆర్థిక ముప్పు!ఈ ఊబకాయం ముప్పును తప్పించటానికి తక్షణ చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యునిసెఫ్ హెచ్చరించింది. 2035 నాటికి, ఊబకాయం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే భారం రూ.353 లక్షల కోట్లకు చేరుతుందని యునిసెఫ్ అంచనా వేసింది. పర్యవసానంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, ఉత్పాదక రంగం అన్నీ దెబ్బతింటాయని హెచ్చరించింది. -
వెరవని వ్యక్తిత్వం
సంక్షుభిత సమయంలో ఒక జాతి తమను నడిపే నేతగా ఒక స్త్రీ వైపు చూడటం అరుదు. నేపాల్లో ఇప్పుడు అక్కడి యువత అలాంటి ఒక స్త్రీ వైపు చూస్తోంది. అక్కడ ఏర్పడబోతున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి ఉంటే బాగుంటుందని ఆశిస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ను కలిశారు కూడా! భారతదేశంలో చదువుకుని, టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి వరకూ ఎదిగిన సుశీలా కర్కీది వెరవని వ్యక్తిత్వం. ఆమె రచయిత కూడా. వివరాలు...‘ఇండియా– నేపాల్ దేశాల మధ్య అనుబంధం ఈనాటిది కాదు. దశాబ్దాలది. ప్రభుత్వాలు వాటి వాటి విధానాల వల్ల పని చేస్తుండొచ్చు. కాని ఇరుదేశాల ప్రజలు ఏనాటి నుంచో స్నేహంగా ఉన్నారు. ప్రధాని మోదీపై నాకు మంచి అభి్రపాయం ఉంది. మా స్నేహితులు, బంధువులు ఎందరో ఇండియాలో ఉన్నారు. మావారు ఎక్కువ కాలం ఇండియాలోనే గడిపారు. భారతీయులు నేపాలీలను ఆదరిస్తూనే ఉన్నారు’ అన్నారు సుశీలా కర్కి.73 ఏళ్ల ఈ మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేపాల్లో ఏర్పడనున్న ఆపద్ధర్మ ప్రభుత్వానికి ప్రధాని అయ్యే అవకాశాలు ఖరారయ్యాయి. నేపాల్లో ఉద్యమం కొనసాగిస్తున్న జెన్ జి విద్యార్థుల బృందం తాజా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సుశీలా కర్కి మా ఎంపిక అని తేల్చి చెప్పింది. సుశీలా కర్కి తన సోషల్ మీడియా అకౌంట్లో ‘దేశ పరిస్థితుల రీత్యా నాకు అప్పజెప్పే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని తెలియచేశారు.‘నేను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసే దాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవారం. ఉదయాన్నే గంగను చూసేవారం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు చెప్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు’ అన్నారామె. ‘మా ఊరు విరాట్నగర్ నుంచి భారత్ సరిహద్దు 25 మైళ్లు ఉంటుంది. మేము తరచూ బోర్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు’ అని తెలిపారామె.ప్రభుత్వంలో అవినీతి, మంత్రుల పట్ల వ్యతిరేకత, నయా సంపన్నుల వైఖరి, సోషల్ మీడియాపై నిర్బంధం... వీటన్నింటి దరిమిలా నేపాల్లో యువతరం తెచ్చిన తిరుగుబాటు వల్ల నాయకత్వ మార్పు స్పష్టమైంది. సుశీలా కర్కి ఆపద్ధర్మ ప్రధాని అయితే త్వరలో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వ ఏర్పాటు చేయించి తప్పుకోవడమే ఆమె ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతకు ఆమె సమర్థురాలని యువత భావిస్తోంది.టీచర్గా మొదలైసుశీలా కర్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. జూన్ 7, 1952న నేపాల్లోని శంకర్పూర్కు చెందిన ఓ కుటుంబంలో పుట్టిన కర్కి ఏడుగురు పిల్లలలో మొదటి సంతానం. 1972లో బిరాట్నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుండి బీఏ డిగ్రీ చేసి మన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గా ప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వారిద్దరూ వివాహం చేసుకున్నారు. 1979లో కార్కి బిరాట్నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1985లో ధరణ్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేట్గా 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్–హాక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుండి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.రచయితగా...కర్కి 2018లో ‘న్యాయ’ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో ‘కారా’ అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన ‘పంచాయత్’ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పడం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం తన తొలి ప్రాధాన్యం అని ఆమె అన్నారు.సుశీలా కర్కిది వెరవని వ్యక్తిత్వం అని అందరూ అంటారు. ఆమె న్యాయనిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయని చర్చ సాగుతోంది. ఆ పేరు బయటకు వచ్చాక నేపాల్లో ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుందనడానికి ఉదాహరణ.గమనిక: ఈ కథనం రాసే సమయానికి సుశీలా కర్కితోపాటు మరికొన్ని పేర్లు కూడా ఆపద్ధర్మ ప్రధాని పదవికి పరిశీలనలోకి వచ్చాయి. -
రోజుకు 54,794 పిడుగులు!
వర్షం పడుతోందంటే మెరుపులు, పిడుగులు పడడం సహజం. పిడుగు శబ్దం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కిలోమీటర్ల దూరంలో పడ్డా మన పక్కనే పడినట్టు ఉంటుంది. 2024–25లో ఇలా మనదేశంలో ఎన్ని పిడుగులు పడ్డాయో తెలుసా? 2 కోట్లకుపైగానే! అంటే రోజుకు సగటున 54,794! 2025–26లో జూలై 30 నాటికి దేశ వ్యాప్తంగా పిడుగుల వల్ల 1,626 మంది మనుషులు, 52,367 మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి.ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే తేమ 7 శాతం పెరుగుతుంది. ఫలితంగా పిడుగులు 10–12 శాతం పెరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో వేసవికాలంలో భానుడి ప్రతాపం, అలాగే అరేబియా సముద్రం, బంగాళాఖాతం వేడెక్కడం వంటివి కూడా పిడుగులకు అనువైన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. బంగాళాఖాతం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగిందని, తూర్పు రాష్ట్రాల్లో తుపాన్లకు కారణమయ్యే తేమకు ఆజ్యం పోస్తున్నాయని క్లైమేట్ రెసీలియెంట్ అబ్జర్వింగ్ సిస్టమ్స్ ప్రమోషన్ కౌన్సిల్ (సీఆర్ఓపీసీ) వ్యవస్థాపకులు సంజయ్ శ్రీవాస్తవ వెల్లడించారు. పర్యావరణ విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఇది.46 శాతం పిడుగుపాటు మరణాలే!ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య వర్షాలు, పిడుగుల కారణంగా దేశవ్యాప్తంగా 1,626 మంది మరణించారని కేంద్ర హోంశాఖ ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. 1967 నుంచి 2020 వరకు పిడుగుపాటుతో భారత్లో 1,01,000 మంది మరణించారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీఆర్బీ) డేటా చెబుతోంది. 2002–24 మధ్య దేశంలో వాతావరణ సంబంధ మరణాలలో దాదాపు 46 శాతం పిడుగుల వల్ల సంభవించాయని ఎన్సీఆర్బీ తెలిపింది. ఐఎండీ, సీఆర్ఓపీసీ ప్రకారం 2019–20లో 51.7 లక్షల పిడుగుపాటు సంఘటనలు నమోదయ్యాయి. 2024–25లో ఈ సంఖ్య 2 కోట్లకుపైగా పెరిగింది.ముందస్తు హెచ్చరికలుఐఎండీ ప్రస్తుతం 86 శాతం కచ్చితత్వంతో పిడుగులను అంచనా వేస్తోంది. పిడుగులు పడే అవకాశం ఉందని అయిదు రోజుల ముందే హెచ్చరిస్తోంది. జిల్లాల పేర్లను రెండు రోజుల ముందుగా వెల్లడిస్తోంది. ప్రమాదం సంభవించే అవకాశం ఉన్నరోజున ప్రభావిత ప్రాంతాల వివరాలతో ప్రతి మూడు గంటలకు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఐఎండీ, ఐఐటీ మద్రాస్ భాగస్వామ్యంతో పిడుగులు అధికంగా పడే ప్రాంతాలను సీఆర్ఓపీసీ గుర్తించింది. ముప్పు నివారణ ప్రణాళికలో భాగంగా దామినీ యాప్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా పంచాయతీ నియమించిన భద్రతా సమన్వయకర్తలకు రియల్–టైమ్ హెచ్చరికలను పంపుతున్నారు. జాతీయ పిడుగుపాటు నష్టనివారణ కార్యక్రమం కింద హెచ్చరికల కోసం మైక్రోఫోన్స్, సీసీటీవీ కెమెరాలు, లౌడ్స్పీకర్లతో కూడిన స్మార్ట్ స్తంభాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. తాటి చెట్లను నాటడం మొదలు అనేక అవగాహన ప్రచారాలు కూడా చేపట్టారు. పట్టణ ప్రాంతాల్లోనూ..నగరవాసులు కమ్యూనికేషన్ సిస్టమ్స్ వంటి విద్యుదయస్కాంత మౌలిక సదుపాయాలను ఎక్కువగా వాడుతున్నారని ఇది పిడుగు ప్రమాదాన్ని పెంచుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహపాత్ర చెబుతున్నారు. కాంక్రీట్, తారు, గాజు వంటివి వేడిని గ్రహించి, ప్రసరింపజేయడం వల్ల కలిగే ఉష్ణ ప్రభావం నగరాలను గ్రామీణ ప్రాంతాల కంటే వేడిగా మారుస్తోందట. ఈ పరిస్థితులు పిడుగుపాట్లకు దారితీస్తున్నాయట.విమానయాన సంస్థలకు..వర్షాకాలంలో పిడుగుపాట్ల వల్ల ఏటా దాదాపు 2,000 విమానాలను దారి మళ్లిస్తున్నారు. దీనివల్ల విమానయాన సంస్థలకు ఏటా సుమారు రూ.300 కోట్ల నష్టం వాటిల్లుతోందట. -
యూత్ కు 'రెస్ట్' రూమ్
సాక్షి, స్పెషల్ డెస్క్: ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు జీవితంలో ప్రతి ఒక్కరికీ వారివారి స్థాయిలను బట్టి ఒత్తిడి అనేది అనివార్యం అయిపోయింది. సాధారణంగా ఒత్తిడిని జయించేందుకు యోగా, క్రీడలు, సంగీతం, నలుగురితో ముచ్చటించడం, షాపింగ్ థెరపీ వంటివి చేస్తుంటారు. కానీ జెన్ –జీ.. అంటే 13–28 ఏళ్ల వయసున్న యువతలో మాత్రం చాలామంది వీటన్నిటికీ భిన్నంగా ‘బాత్రూమ్ క్యాంపింగ్’ని ఆశ్రయిస్తున్నారు.టెంట్, చలి మంటలు, నక్షత్రాలతో మెరిసే ఆకాశం, షాపింగ్.. ఇవేవీ కావు. జస్ట్ తెల్లటి టైల్స్ పరిచిన నాలుగు గోడల మధ్య ‘రెస్ట్రూమ్స్’లో జెన్ –జీ సేదతీరుతోంది. శారీరక అవసరాల కోసం కాకుండా మానసిక ప్రశాంతతకు బాత్రూమ్లో ఎక్కువసేపు గడుపుతున్నారు. శబ్దాలు, జనంతో కిటకిటలాడే ప్రదేశాలకు దూరంగా ప్రశాంతంగా ఉండటానికి, సంగీతం వినడానికి మూసి ఉంచిన కమోడ్పై కూర్చుని మనసుని తేలికపర్చుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, బాధ, ఓటమి సమయంలోనే కాదు.. సమస్యల నుంచి బయటపడే మార్గాల అన్వేషణ, కొత్త ఆలోచనల కోసమూ అటువైపే అడుగులు పడుతున్నాయి. ఇల్లు, ఆఫీస్ లేదా ఏదైనా పార్టీలో ఉన్నా.. ఒత్తిడికి గురైనప్పుడు, మనసు బాధగా ఉన్నప్పుడు బాత్రూమ్ను ఆశ్రయిస్తున్నారు. దీన్నే ఇప్పుడు ‘బాత్రూమ్ క్యాంపింగ్’ అంటున్నారు.ప్రపంచానికి దూరంగా..‘నా బాధ, ఒత్తిడి నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు. అవి వారికి అక్కరలేదు.అందరికీ కనపడేలా కూర్చుని బాధపడుతుంటే ఈ సమాజం వేలెత్తి చూపుతుంది. అలా కాకుండా బాత్రూమ్లో అయితే ఎవ్వరికీ తెలీదు. ఏకాంతం, నిశ్శబ్దంతో కూడిన ప్రశాంత వాతావరణమూ ఉంటుంది. మనల్ని జడ్జ్ చేసే అవకాశంఇంకొకరికి ఉండదు’అంటోంది జెన్ జీ.బాత్రూమ్ క్యాంపింగ్ ఎందుకంటే?ఒత్తిడిఆందోళనకోపంబాధఓటమిసమస్యకు పరిష్కారంకొత్త ఆలోచనలువీటిని ట్రై చేయండిఒత్తిడి నుంచి ఉపశమనానికి బాత్రూమ్ను ఒక సౌలభ్యమైన స్థలంగాఈ తరం వాళ్లు భావిస్తూ ఉండవచ్చు. కానీ బాత్రూమ్ అంటే రోగకారక క్రిములకు అడ్డా అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆందోళనను నియంత్రించడానికి ఇతర ఆరోగ్యకరమార్గాలూ ఉన్నాయని వారు సూచిస్తున్నారు.ప్రాణాయామం: శ్వాస ఆధారిత ప్రాణాయామ ప్రక్రియలను నిపుణుల ద్వారా తెలుసుకుని రోజూ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, మెదడు చురుగ్గా పనిచేస్తుందనిప్రపంచ వ్యాప్తంగా అనేకఅధ్యయనాలు చెబుతున్నాయి. ప్రకృతి ఒడిలో: ప్రకృతిని మించిన వైద్యుడు లేడు. పార్కులు, మైదానాల్లో గడ్డిని తాకడం, గడ్డిపై పడుకోవడం, సుందర ప్రకృతిదృశ్యాలను ఆస్వాదించడం.. ఇవన్నీ మనసును ఆహ్లాదపరిచేవే. సంగీతం,పజిల్స్: నచ్చిన సంగీతాన్ని వినొచ్చు. మెదడుకు పని కల్పించే పజిల్స్ చేయొచ్చు. ఆఫీసుల్లో: గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చోకుండా.. ప్రతీ అరగంట లేదా గంటకు చిన్న విరామం తీసుకోవాలి. ఒత్తిడి అనిపిస్తే.. తేలికపాటి ప్రాణాయామాలు చేయాలి. మీ డెస్క్ వద్ద సరైనభంగిమలో కూర్చునేలా చూసుకోండి.నో సెల్ఫోన్: అలసిపోయినట్టు అనిపించినా.. పని ఎక్కువైనట్టు అనుకున్నా వెంటనే చేతులు ఫోన్ మీదకు వెళ్లిపోతుంటాయి. అలా వెళ్లి.. ఎన్ని ఫేస్బుక్ పోస్టులు చూస్తామో / పెడతారో, ఎన్ని రీల్స్ చూస్తారో తెలీదు. అన్నీ మనకు నచ్చినవే ఉండాలని లేదుగా. నచ్చనివి కనిపిస్తే మరింత కోపం, ఒత్తిడి. అందువల్ల ఆందోళన ఉండే సమయాల్లో సెల్ఫోన్ను (మ్యూజిక్ వినేటప్పుడు తప్ప) పక్కన పెట్టేయండి.సమయానికి తిండి, నిద్ర» సమయానికి ఆహారం తీసుకోవాలి. ఎంత పనిలో ఉన్నా, ఒత్తిడి ఉన్నా.. తినే టైమ్ను మాత్రం వాయిదా వేయొద్దు. అది మరింత ఒత్తిడి,ఆందోళనకు దారితీస్తుంది.» తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలూఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పోషకాహార నిపుణులు సూచించే.. ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు తీసుకోవాలి.» రాత్రుళ్లు సమయానికి, వేగంగా నిద్రపోవడం.. తెల్లవారుజామున లేవడం దినచర్యగా పెట్టుకోండి. రాత్రిపూట ఫోన్ లేదా టీవీల్లో సినిమాలు చూడటం సరదాగానేఉంటుంది గానీ.. దాని ప్రభావం మరుసటి రోజంతా పడుతుంది.పని.. ఒత్తిడి కాదు!జెన్–జీలో చాలామంది పనిని ఒత్తిడిగా భావిస్తుంటారు. ఆ మానసిక స్వభావాన్ని ముందు పూర్తిగా మార్చుకోవాలి. కెరీర్లో ఎదగాలన్న మనస్తత్వాన్ని పెంపొందించుకుంటే పనిపట్ల ప్రేమ, నిబద్ధత వాటంతట అవే పెరుగుతాయి. పనిలో లేదా కెరీర్లో వచ్చే సవాళ్లను భవిష్యత్తుకు మెట్లుగా చూడాలి తప్ప.. వాటిని ఒత్తిడిగా భావించినంత కాలం ఎదుగుదల ఉండదు అని గ్రహించాలి. -
కొనసాగుతున్న యూరియా కష్టాలు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక్క బస్తా యూరియా దొరికినా మహాభాగ్యం అనుకుంటూ రాత్రి, పగలు క్యూలైన్లలో అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. కొన్నిచోట్ల ఓపిక నశించి ఆందోళనలకు దిగుతున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలోని రైతు వేదిక ఎదుట బుధవారం యూరియా టోకెన్ల కోసం రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు రైతు వేదికలోకి చొచ్చుకెళ్లి ఫరి్నచర్ ధ్వంసం చేశారు.హనుమకొండ జిల్లా పరకాలలో టోకెన్లు ఇచ్చి యూరియా పంపిణీ చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ ఎదుట ఆందోళన చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె)లో రైతులు బుధవారం యూరియా కోసం భిక్షాటన చేస్తూ ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బుధవారం సాయంత్రం రైతు సాయిల్ల రాజమల్లు యూరియా బస్తా కోసం లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు వెంటనే రాజమల్లును ఆసుపత్రికి తరలించారు. కాగా, మంచిర్యాల జిల్లా దండేపల్లి నెల్కి వెంకటాపూర్ పీఏసీఎస్ వద్ద రైతులకు కుర్చీలు వేసి కూర్చోబెట్టి యూరియా పంపిణీ చేశారు. రెండో విడతలో పంటకు యూరియా ఎంత మోతాదులో వేయాలనే దానిపై అధికారులు అవగాహన కూడా కల్పించారు.యూరియా బారులు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సుమారు 400 ఫీట్ల వరకు రైతులు పట్టాదారు పాస్పుస్తకాలు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులు లైన్లో ఉంచి నిరీక్షించారు. ఈ కేంద్రానికి 666 బస్తాల యూరియా రాగా ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. – సాక్షి స్టాఫ్ ఫొటో గ్రాఫర్ సూర్యాపేట -
దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది!
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది. ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!అయితే ఏంటి?2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.- గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
స్వచ్ఛత పెర'గాలి'
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ ర్యాంకులు–2025’లో తెలుగు రాష్ట్రాలకు చెందిన నగరాలు మిశ్రమ ఫలితాలను సాధించాయి. దేశవ్యాప్తంగా గాలి నాణ్యత ఆధారంగా ప్రకటించిన ఈ ర్యాంకుల్లో, 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ 13వ ర్యాంకు, విశాఖపట్నం 17వ ర్యాంకు సాధించాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఎప్పటిలాగే మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం దేశంలోనే అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో ఏపీలోని గుంటూరు నగరం జాతీయ స్థాయిలో 6వ ర్యాంకు సాధించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ ర్యాంకులను ప్రకటించారు. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్సీఏపీ) కింద దేశంలోని 130 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు చేపట్టిన చర్యల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. – సాక్షి, న్యూఢిల్లీకేటగిరీల వారీగా తెలుగు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల స్థానాలు ఇవీ.. కేటగిరీ–1 (10 లక్షలకు పైగా జనాభా): ఈ విభాగంలో విజయవాడ 13వ ర్యాంకును, విశాఖపట్నం 17వ ర్యాంకును సాధించాయి. తెలంగాణ నుంచి హైదరాబాద్ నగరం 22వ స్థానంలో నిలిచింది.కేటగిరీ–2 (3 నుంచి 10 లక్షల జనాభా): ఈ కేటగిరీలో గుంటూరు 6వ ర్యాంకుతో మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రాజమండ్రి 12, నెల్లూరు 18, కడప 23, కర్నూలు 29, అనంతపురం 35 ర్యాంకులు పొందాయి.కేటగిరీ–3 (3 లక్షల లోపు జనాభా): ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం 8, శ్రీకాకుళం 16, ఒంగోలు 21, చిత్తూరు 29, ఏలూరు 31 ర్యాంకులు సాధించాయి. తెలంగాణ నుంచి నల్గొండ 13వ ర్యాంకులో, సంగారెడ్డి 17వ ర్యాంకులో నిలిచాయి.జాతీయ స్థాయిలో విజేతలు 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా, జబల్పూర్ రెండో ర్యాంకు సాధించింది. ఆ తర్వాత ఆగ్రా, సూరత్ మూడోస్థానంలో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో అమరావతి (మహారాష్ట్ర) మొదటి ర్యాంకు సాధించగా, 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో దేవాస్ (మధ్యప్రదేశ్) అగ్రస్థానంలో నిలిచింది. గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఈ నగరాలు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. -
అంకుర సంస్థలు.. అప్పుడే మూసేస్తున్నారు
ఎన్నో ఆశలతో పెడుతున్న అంకుర కంపెనీలు.. ఇటీవలి కాలంలో మూతపడుతున్నాయి. కృత్రిమ మేధ సృష్టించిన అలజడి.. పోటీ.. నిధుల రాక తగ్గిపోవడం.. ఖర్చులు పెరిగిపోవడం.. ఇలా అనేక కారణాలు. ప్రధానంగా కంటెంట్పైనే ఆధారపడ్డ స్టార్టప్స్పై ఏఐ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎడ్టెక్, స్టోరీటెల్లింగ్ ప్లాట్ఫామ్స్, మార్కెటింగ్ వంటి రంగాలలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్లను నడిపించేందుకు, విస్తరించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపడం లేదు. ఇంకేముంది 2023, 2024లో ఏకంగా 28,000 పైచిలుకు స్టార్టప్స్ మూతపడ్డాయి. – సాక్షి, స్పెషల్ డెస్క్వెర్సే ఇన్నోవేషన్.. జోష్, డెయిలీహంట్ సంస్థల మాతృసంస్థ.. ఈ ఏడాది మేలో 350 మంది ఉద్యోగులను తొలగించింది. ప్రధానంగా ఏఐలో పెట్టుబడులు పెడుతున్నట్టు, ఆటోమేషన్ వైపు అడుగులు వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. కోడ్ ప్యారట్, సటల్.ఏఐ, వూరి, లొకేల్.ఏఐ, అస్త్ర.. ఇలాంటి ఏఐ స్టార్టప్లు ఇటీవలికాలంలో చాలా మూతపడ్డాయి. ఇందుకు.. ఏఐలో వేగంగా వస్తున్న మార్పులు, మారిపోతున్న సాంకేతికత, అధికమవుతున్న పోటీ, నిధుల సమస్య పెరుగుతున్న వ్యయాలు.. ఇలాంటి అనేక కారణాలు. రూ.21,000 కోట్ల నష్టంచాట్జీపీటీ ఎంట్రీ ఇచ్చిన తర్వాతి సంవత్సరం అంటే 2023లో భారత్లో ఏకంగా 15,921 టెక్ స్టార్టప్లు మూతపడ్డాయి. అంతకు ముందు ఏడాదిలో ఈ సంఖ్య 2,101 మాత్రమే. 2024లో 12,717 స్టార్టప్స్ కనుమరుగైపోయాయి. షట్టర్లు దించేసిన కంపెనీల సంఖ్య 2022 వరకు నాలుగు అంకెలకే పరిమితం అయింది. గత రెండేళ్లలో అనూహ్యంగా అయిదు అంకెల స్థాయికి చేరడం ఆందోళన కలిగించే అంశం. కరోనా తదనంతర పరిస్థితులు కూడా కొంతవరకు కారణమయ్యాయి. ముఖ్యంగా ఏఐ వల్ల.. అగ్రిటెక్, ఫిన్టెక్, ఎడ్టెక్, హెల్త్టెక్ రంగాల్లోని స్టార్టప్లు అధికంగా ప్రభావితమయ్యాయి. ‘ఐఎన్సీ42’ వెబ్సైట్ ‘ఇండియన్ స్టార్టప్ లేఆఫ్ ట్రాకర్ 2025’ ప్రకారం.. 2025 సెప్టెంబర్ వరకు స్టార్టప్స్ 5,600లకుపైగా ఉద్యోగులను తొలగించాయి. 2023–24లో 67 స్టార్టప్స్ రూ.21,472 కోట్ల నష్టాన్ని ప్రకటించాయి. ఏఐ కంపెనీల దూకుడుఏఐ రాకతో కంటెంట్ రూపకల్పనలో వ్యయం తగ్గుతోంది. ఈ రంగంలో ప్రవేశానికి అడ్డంకులను తొలగించింది. ఏఐ ఎంట్రీతో టెక్ స్టూడియోల అవసరం తీరిపోయింది. అంతేకాదు ఖరీదైన స్టార్టప్స్ ఏర్పాటు చేయాల్సిన పనికూడా లేదు. కంటెంట్ సులువుగా, చవకగా దొరుకుతోంది. జనానికీ అందుబాటులో ఉంటోంది. ఆదాయం విషయంలో నిర్దిష్ట టర్నోవర్కు చేరుకోవడానికి కంపెనీలకు సంవత్సరాలు పట్టేది. ఇప్పుడు నెలల్లోనే ఏఐ స్టార్టప్స్ అది సాధ్యం చేస్తున్నాయి. ఏర్పాటైన 12–18 నెలల్లోనే 10 మిలియన్ డాలర్ల వార్షికాదాయం స్థాయికి చేరుతున్నాయంటే ఏఐ కంపెనీల ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.సగానికి తగ్గాయిఏఐ దూకుడు.. ఒకప్పుడు ఆశాజనకంగా కనిపించిన స్టార్టప్లను సైతం తుడిచిపెట్టేస్తోంది. పెట్టుబడిదారులు ఇప్పుడు ఏఐ మార్పులను తట్టుకొని దీర్ఘకాలంలో లాభాలను అందించే వ్యాపార విధానాలపై దృష్టిపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. స్టార్టప్స్లోకి రావాల్సిన నిధులూ తగ్గుముఖం పట్టాయి. భారతీయ స్టార్టప్స్ 2021, 2022లో ఏటా 7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఫండింగ్ అందుకోగా.. గత రెండేళ్లలో ఈ మొత్తం దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. 2024లో భారత్కు చెందిన అంకుర సంస్థలు 3.7 బిలియన్ డాలర్ల నిధులను దక్కించుకున్నాయి. 2025 ఆగస్ట్ నాటికి ఈ మొత్తం కేవలం 2 బిలియన్ డాలర్లు మాత్రమే. -
వామ్మో.. పాము!
వాతావరణ మార్పులతో విషపూరిత పాముల హాట్స్పాట్లు కూడా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడున్న పాముల హాట్స్పాట్లు త్వరలో ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపించే అవకాశాలు పెరుగుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ప్రస్తుతం ఏపీ, ఉత్తరప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర పాముకాటు మరణాలకు హాట్స్పాట్లుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పాముకాట్ల తీవ్రత చాలా ఎక్కువ. దేశంలో పాముకాటు వల్ల ఏటా 60 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఇప్పుడు వాతావరణ మార్పులతో ఈ ముప్పు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు వ్యాపిస్తోందని పీఎల్ఓస్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. – సాక్షి, అమరావతిసాధారణంగా వానాకాలంలో పాముకాటు మరణాలు ఎక్కువగా నమోదవుతుంటాయి. వర్షాకాలం అయిపోగానే ఇలాంటి కేసులు తగ్గిపోతాయి. అయితే, రానున్న కాలంలో వాతావరణ మార్పుల కారణంగా భారత్లో పాముకాటు మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య భారతాన్ని పాముల బెడద వణికించనుందని ‘పీఎల్ఓ’స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం హెచ్చరిస్తోంది.భూమి వేడెక్కుతుండటంతో.. వేడెక్కుతున్న భూమి, అస్థిర వర్షాలు, వాతావరణ మార్పులతో భూమి మరింతగా వేడెక్కుతోంది. వర్షాలు అస్థిరంగా కురుస్తున్నాయి. దీంతో పాముల జీవన విధానం గందరగోళంగా మారుతోంది. పాములు చల్లని లేదా వెచ్చని ప్రాంతాల్లో జీవించడానికి ఇష్టపడతాయి. భూమి వేడెక్కడంతో ఇప్పటివరకు చల్లగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ తదితర ప్రాంతాలు పాములకు కొత్త ఆవాసాలుగా మారుతున్నాయి. వర్షాలు ఎక్కువైనా, తక్కువైనా పాములు తమకు ఆహారంగా దొరికే ఎలుకలు, చిన్న జంతువులు ఉన్న చోటికి వెళ్తాయి. అస్థిర వర్షాల వల్ల పొలాలు, అడవులు, నీటి వనరులు మారిపోయి అవి గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. అడవులు నరికివేత, నగరాలు విస్తరించడం, భూమి ఉపయోగంలో మార్పుల వల్ల పాములు తమ సహజ ఆవాసాలను వదిలి మనుషులు ఉండే ప్రాంతాలకు వస్తున్నాయి. దీనివల్ల పాముకాట్ల బెడద పెరుగుతోంది.‘బిగ్ ఫోర్’ స్నేక్స్తోనే బెడదదేశంలో నాలుగు విషపూరిత పాముల వల్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని ‘బిగ్ ఫోర్’ స్నేక్స్గా పిలిచే ఇండియన్ కోబ్రా (నాగుపాము), కామన్ క్రైట్ (కట్లపాము), రస్సెల్స్ వైపర్ (రక్త పింజరి), సా–స్కేల్డ్ వైపర్ (చిన్న పింజరి) వల్లే మన దేశంలో అత్యధిక పాముకాటు మరణాలు సంభవిస్తున్నాయి. వీటి కాటువల్ల విషం వేగంగా శరీరంలో వ్యాపిస్తుంది. సకాలంలో చికిత్స అందకపోతే మరణానికి దారితీస్తుంది. మన రాష్ట్రంలోని కోస్తా ప్రాంతాల్లోని పొలాల్లో నాగు పాములు, రక్త పింజరి, కట్ల పాములు ఎక్కువ. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కింగ్ కోబ్రాలు కనిపిస్తాయి. అయితే.. కోస్తా జిల్లాల్లోనే పాముకాట్ల బెడద తీవ్రంగా ఉంటోంది. కొత్త ఆవాసాలకు పాములు వాతావరణం మార్పులతో పాముల ఆవాసాలు చెదిరిపోయి అవి ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే 50 ఏళ్లలో ఈ పాములు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలకు మరింతగా విస్తరించే అవకాశాలున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. వేడెక్కుతున్న అక్కడి వాతావరణం ఆ ప్రాంతాలను పాములకు అనుకూలంగా మారుస్తోంది. వాతావరణ మార్పులతో పొలాలు, నీటి వనరులు మారుతుండటంతో అక్కడ ఉండే ఎలుకలు, చిన్న పాములను ఆహారంగా తీసుకునేందుకు విషపూరిత పాములు ఇళ్లు, పొలాల సమీపంలోకి వస్తున్నాయి. అందువల్లే పాముకాట్లు పెరుగుతున్నాయి. ఫలితంగా వ్యవసాయ భూముల వద్ద రైతులు, కూలీలు, పిల్లలు పాముకాట్ల బారినపడుతున్నారు. ఆస్పత్రులపై ఒత్తిడి పాముకాటు చికిత్సకు అవసరమైన యాంటీ వీనం ఔషధాలు గ్రామీణ ఆస్పత్రుల్లో తక్కువగా ఉంటున్నాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చినా పాముకాటుకు గురైన వారు చనిపోతున్నారు. గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీ వీనం ఇంజెక్షన్లు, శిక్షణ పొందిన వైద్యుల అవసరం ఎక్కువవుతోంది. పాముకాటు గురించి గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందని పీఎల్ఓస్ అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
సమాజంలో ఏకాకిగా..
నిత్యం బంధువులు, స్నేహితుల నుంచి వాట్సాప్ను ముంచెత్తుతూ గుడ్మారి్నంగ్ సందేశాలు.. ఆఫీసుకెళ్లగానే హాయ్, హలో పలకరింపులు.. వారాంతాల్లో స్నేహితులతో పారీ్టలు.. ఏడాదంతా పండుగలు, పబ్బాలు, కుటుంబ వేడుకలు.. ఇలా సంఘజీవులుగా దైనందిక జీవితాన్ని గడుపుతున్నప్పటికీ మనోళ్లనుఒంటరితనం వేధిస్తోంది! ప్రపంచంలోకెల్లా అత్యధిక జనాభాగల దేశంగానే కాకుండా.. సాంఘిక, సామాజిక స్థాయిల్లో వివిధ బంధాలతో పెనవేసుకు పోయిన భారతీయుల్లో ఈ సమస్య రోజురోజుకూ పెరుగుతుండటం దేనికి సంకేతం?సాక్షి, హైదరాబాద్: దేశంలోని పట్టణవాసుల్లో ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరితనంతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. వేగవంతమైన సామాజిక–ఆర్థిక మార్పులు, పాతుకుపోయిన సాంస్కృతిక అంశాల సంక్లిష్ట మిశ్రమం కారణంగా పట్టణ ప్రాంతాల వారు ఎక్కువగా ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపింది. ఉపాధి లేక గ్రామాల నుంచి వలసల పెరుగుదల, పట్టణాల్లో అధికమవుతున్న వృత్తిపరమైన పోటీతత్వం, సుదీర్ఘ పనిగంటలు, సుదూర ప్రయాణాల వంటి అంశాలు ప్రజల్లో భావోద్వేగ అలసటకు దారితీస్తున్నట్లు పేర్కొంది.సంబంధాలన్నీ పైపైనే..ప్రముఖ గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్, పబ్లిక్ ఒపీనియన్ స్పెషలిస్ట్ కంపెనీ ‘ఇప్సోస్’ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం పట్టణవాసులు పరస్పరం సత్సంబంధాలు కలిగి ఉన్నట్లు పైకి కనిపిస్తున్నా భావోద్వేగపరంగా ఒకరికొకరు కలవలేకపోతున్నారు. స్త్రీ, పురుష తేడాలు, పేద, ధనిక అంతరాలు, ప్రాంతాలు, పట్టణీకరణ వంటివి ఈ భావోద్వేగాలను ప్రభావితం చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియా ఈ భావాలను కప్పిపుచ్చేందుకు.. బాధ, ఇబ్బందులను పక్కకునెట్టేందుకు దోహదపడుతున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమలోని భయాలను కప్పిపుచ్చుకోవడంతోపాటు వాటిని బయటకు వెల్లడిస్తే ఇతరుల దృష్టిలో చులకన అవుతామనే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ (ఫోమో) భావన కూడా దీనికి తోడ్పడుతోంది.సర్వేలోని ముఖ్యాంశాలు..⇒ పట్టణ ప్రాంతాల్లోని 43% మంది భారతీయులు ఎక్కువ సమయం ఒంటరితనం ఫీలవుతున్నారు. పెద్ద నగరాల్లో ఇది 45 శాతంగా ఉంటోంది.⇒ ప్రతి ఆరుగురిలో ఒకరు తరచూ ఒంటరిననే భావనతో కాలం నెట్టుకొస్తున్నారు.⇒ 45 ఏళ్లకు పైబడిన వారిలో 20 శాతం ఓ మోస్తరుగా,13 శాతం తీవ్రమైన ఏకాకి జీవితాన్ని అనుభవిస్తున్నారు.⇒ పురుషుల్లో ఒంటరితనమనే భావన క్రమక్రమంగా పెరుగుతోంది.⇒ ప్రతి నలుగురు టీనేజర్లలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నారు.⇒ పెద్ద వయసు వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు సామాజికంగా దూరంగా ఉన్నామనే భావనతో ఉన్నారు.శారీరక, మానసిక సమస్యలుదీర్ఘకాలిక ఒంటరితనం తీవ్ర శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీన పడటం, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. కేన్సర్ వంటి వ్యాధులకు గురయ్యే చాన్స్ ఎక్కువగా ఉంటుందన్నారు. మానసిక సమస్యలను ఎదుర్కొనే విషయంలో భారత్లో తగినంత మంది మానసిక ఆరోగ్య నిపుణులు లేకపోవడం అడ్డంకిగా మారుతోందని అభిప్రాయ పడుతున్నారు.పరిష్కారం ఏమిటి? ⇒ కుంగుబాటుకు గురైనప్పుడు బాధితులు ఫోన్, చాట్ లేదా యాప్ల రూపంలో ‘లిజనింగ్ సరీ్వసెస్’ద్వారా సాంత్వన పొందొచ్చు. కష్టాలను విని నిపుణులు తగిన మద్దతు అందిస్తారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ కిరణ్ హెల్ప్లైన్ (1800–599–0019) 13 భాషల్లో 24/7 మానసిక ఆరోగ్య మద్దతు అందిస్తోంది. ⇒ అభిరుచిగల సమూహాలు, క్లబ్లు లేదా ఆన్లైన్ ఫోరమ్లలో చేరడం ద్వారా స్వచ్ఛంద సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఒంటరితనంతో ముడిపడిన ప్రవర్తనలను అధిగమించడంలో దోహదపడుతుంది. ⇒ ధ్యానం, యోగా, మైండ్ఫుల్నెస్ వంటి అభ్యాసాలు బాధితులను ప్రశాంతపరిచి ఆందోళనలు తగ్గిస్తాయి. ఈ అభ్యాసాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడంలో సహాయపడతాయి. కారి్టసాల్ వంటి ఒత్తిడి హార్మోన్ల విడుదలను తగ్గిస్తాయి. -
గుండె జబ్బులే.. 'ప్రాణాంతకం'
మనదేశంలో 2021–23 మధ్య సంభవించిన మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణమని.. ఆ తర్వాతి స్థానంలో శ్వాసకోశ సమస్యలు ఉన్నట్లు ‘రిజిస్ట్రార్ జనరల్ అండ్ సైన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. మొత్తం మరణించిన వారిలో 40 శాతానికిపైగా.. 70 ఏళ్లకుపైబడిన వారే. భారతదేశ ప్రజారోగ్య వ్యూహాలను రూపొందించటానికి, పెరుగుతున్న అసాంక్రమిక వ్యాధుల భారాన్ని ఎదుర్కొనే ప్రణాళికల రూపకల్పనకు ఈ పరిశోధన ఫలితాలు కీలకమైనవని నివేదిక పేర్కొంది.‘మరణ కారణాలు: 2021–2023’ పేరిట రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) సెప్టెంబర్ 3న విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే తాజా నివేదిక ప్రకారం దేశంలోని అనారోగ్య సంబంధ మరణాలకు దాదాపు 31 శాతం వరకు గుండె జబ్బులే ప్రధాన కారణం. మొత్తం మరణాల్లో 56.7 శాతం వరకు అసాంక్రమిక వ్యాధులు (గుండె జబ్బులతో సహా) ఉన్నట్లు నివేదిక తెలిపింది. గుండెజబ్బుల తర్వాత శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ప్రసూతికి సంబంధించిన మరణాలు, పౌష్టికాహార లోపాల మరణాలు 23.4 శాతం వరకు ఉన్నాయి. గుండెపై జీవనశైలి ఒత్తిళ్లు..అన్ని రకాల హృద్రోగాలు కలిపి మరణాలకు ప్రధాన కారణంగా నిలిచాయని, దాదాపు 31 శాతం మంది ప్రాణాలను అవి బలిగొన్నాయని నివేదిక తెలిపింది. యువతలో జీవనశైలి వల్ల తలెత్తుతున్న గుండె జబ్బుల తర్వాత, ఆత్మహత్యలు వారి మరణానికి రెండో ప్రధానం కారణంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. 30 ఏళ్లు దాటిన వారిలో మరణాలకు గుండె జబ్బులు ప్రధాన కారణంగా ఉంటుండగా, 15–29 ఏళ్ల యువత పాలిట ఆత్మహత్యలు మరణ శాసనాలుగా మారుతున్నాయి.ప్రాంతాల వారీగా సర్వేఉత్తర, ఈశాన్య, తూర్పు, మధ్య, పశ్చిమ, దక్షిణ.. ఇలా ప్రాంతాల వారీగా రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా ‘మరణ కారణాలు: 2021–2023’ సర్వేను నిర్వహించింది. » దక్షిణాదిన హృద్రోగ మరణాల శాతం 32.8 శాతం ఉండగా, ఉత్తరాదిన 34.5 శాతంగా ఉంది. » శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వల్ల మరణాలు పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా 12.7 శాతం ఉన్నాయి. తరవాతి స్థానంలో (12.3 శాతం) మధ్య భారతం ఉంది. ఇవి అత్యల్పంగా (7.1 శాతం) సంభవించింది ఉత్తరాదిలో.» మధుమేహం వల్ల అత్యధికంగా 4.6 శాతం మరణాలతో దక్షిణాది అగ్రస్థానంలో నిలిచింది. తరువాతి స్థానంలో (4.1 శాతం) ఉత్తరాది ఉంది. -
ఫోన్ వద్దు.. చదువే ముద్దు!
స్మార్ట్ఫోన్ ఎంతగా మన దైనందిన జీవితంలో మమేకం అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర లేదు. కర్ణుడి కవచ కుండలాల్లా.. అది నిరంతరం మనతో ఉండాల్సిందే. కాలేజీ విద్యార్థులకుతోడు బడి ఈడు పిల్లల్లోనూ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగింది. ఈ అలవాటే వారిని క్లాస్ రూముల్లోకి ఫోన్ తీసుకెళ్లేలా చేస్తోంది. తరగతి గదిలోకి ఫోన్ లేకుండా వెళ్లిన విద్యార్థులు విద్యాపరంగా మెరుగ్గా రాణించినట్టు తాజా అధ్యయనంలో తేలింది.భారీ అధ్యయనంపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్ఫ్ సుంగు తన సహచరులతో కలిసి ఇటీవల భారత్లో ఓ వినూత్న అధ్యయనం చేపట్టారు. 10 ఉన్నత విద్యా సంస్థలలో చదువుతున్న 16,955 మంది విద్యార్థులను స్మార్ట్ ఫోన్ ఎలా ప్రభావితం చేసిందన్నదే ఆ అధ్యయన సారాంశం. తరగతి గదిలోకి ఫోన్ తీసుకుపోని విద్యార్థులు చదువుల్లో బాగా రాణించినట్టు ఆ అధ్యయనంలో తేలింది.తక్కువ పనితీరు కనబరుస్తున్న, అలాగే సైన్స్, గణితం కాకుండా ఇతర సబ్జెక్టులను చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులు కూడా ఫోన్ వాడకపోవడం వల్ల ఎక్కువ ప్రతిభ చూపినట్టు డాక్టర్ సుంగు తెలిపారు. ఫోన్ నిషేధించడం వల్ల తరగతి గది ఫలితాలు మెరుగుపడతాయనడానికి బలమైన ఆధారాలను నివేదిక అందిస్తుందని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలో కౌమార నిపుణులు అన్నే మాహెక్స్ చెప్పారు.20 నిమిషాల సమయం!యునెస్కో చేపట్టిన ‘2023 గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్’ నివేదిక ప్రకారం.. ‘కొన్ని సాంకేతిక పరిజ్ఞానాలు కొన్ని సందర్భాల్లో కొంతవరకు మాత్రమే అభ్యాసానికి తోడ్పడతాయి. తరగతి గదిలో స్మార్ట్ఫోన్ వల్ల చదువుకు అంతరాయం కలుగుతోంది. 14 దేశాల్లో ప్రీ–ప్రైమరీ నుండి ఉన్నత విద్య వరకు చదువుతున్న విద్యార్థులపై జరిపిన ఓ అధ్యయనంలో.. ఫోన్ చేతిలో ఉంటే విద్యార్థుల దృష్టి నేర్చుకోవడం నుండి మరలుతోందని తేలింది.మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్స్ వస్తుంటే విద్యార్థులు తమ ఏకాగ్రతను కోల్పోతున్నారట. ఆ తరువాత.. విద్యార్థులు వారు నేర్చుకుంటున్న దానిపై తిరిగి దృష్టి పెట్టడానికి 20 నిమిషాల వరకు సమయం పడుతోందని మరో అధ్యయనంలో తేలింది. బెల్జియం, స్పెయిన్, యూకేలోని బడుల్లో స్మార్ట్ఫోన్లపై నిషేధం కారణంగా అభ్యాస సామర్థ్యాలు, ఫలితాలు మెరుగుపడినట్టు వెల్లడైంది’.‘వాంఛనీయం కాదు’పాఠశాలల్లో స్మార్ట్ఫోన్లను పూర్తిగా నిషేధించడం ఆచరణాత్మకం, వాంఛనీయం కాదని స్పష్టం చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మార్చిలో మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యా ప్రయోజనాలు, తలెత్తే నష్టాలను దృష్టిలో పెట్టుకుని నియంత్రణ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ నేపథ్యంలో.. స్కూల్ సమయంలో విద్యార్థులు స్మార్ట్ఫోన్ వాడకంపై స్పష్టమైన విధానాలను రూపొందించాలని ఢిల్లీ విద్యా శాఖ తన పరిధిలోని అన్ని పాఠశాలలను ఏప్రిల్లో ఆదేశించింది. విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్న ఏకైక లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా కనీసం 40% జాతీయ విద్యా వ్యవస్థలలో తరగతి గదుల్లో సెల్ఫోన్లపై నిషేధాలు అమలవుతున్నాయి. మనదేశంలో మాత్రం స్మార్ట్ఫోన్ వినియోగానికి సంబంధించి ప్రస్తుతం స్పష్టమైన చట్టం/విధానం లేదు.నో ఫోన్స్.. ఓన్లీ బుక్స్అమెరికా ఫోన్లు నిషేధిస్తున్న రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2025 ఆగస్ట్ నాటికి 18 రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేస్తుండగా.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 17 రాష్ట్రాలు వచ్చి చేరాయి. చైనా: ప్రైమరీ, సెకండరీ స్కూల్స్లో 2025 మార్చి నుంచి నిషేధం విధించారు. బోధనా కారణాల వల్ల ఫోన్ అవసరమైతే తల్లిదండ్రులు రాతపూర్వకంగా విద్యా మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేయాలి. తజికిస్తాన్: 2009 నుంచి ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యా సంస్థలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది మొబైల్ ఫోన్ వాడకూడదు. గీత దాటితే జరిమానా తప్పదు.బంగ్లాదేశ్: దేశవ్యాప్తంగా నిషేధాలు మొదట 2011లో అమలయ్యాయి. 2017లో బలోపేతం చేశారు.రువాండా2018 జూన్ నుంచే ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్స్ వాడకానికి అడ్డుకట్ట వేసింది. ఫ్రాన్స్: 15 ఏళ్లలోపు విద్యార్థులు బడుల్లో ఫోన్ వాడకూడదు. 2018–2019 విద్యా సంవత్సరం నుండి నిబంధన అమలు.బ్రెజిల్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు స్మార్ట్ఫోన్ వాడకూడదని 2025 జనవరిలో జాతీయ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఉపాధ్యాయుల అనుమతితో విద్యా ప్రయోజనాల కోసం లేదా అత్యవసర పరిస్థితులు ఉంటే ఉపయోగించవచ్చు.ఇటలీ: ప్రైమరీ స్కూల్ విద్యార్థుల మొబైల్ ఫోన్ వాడకంపై నిషేధం ఉంది. 2025 కొత్త విద్యా సంవత్సరం నుండి హైస్కూల్ విద్యార్థులకూ వర్తింపజేశారు.నెదర్లాండ్స్: ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, టాబ్లెట్ పీసీలపై దేశవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ నుండి నిషేధం. న్యూజిలాండ్: పాఠశాల సమయంలో సెల్ఫోన్ వాడకూడదన్న నిబంధన దేశవ్యాప్తంగా 2024 ఏప్రిల్ నుంచి అమలైంది. -
మరణాన్ని ఓదార్పు అడగకు
బతుకులో జ్వాలలు ఉన్నాయని శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇవ్వడం పరిష్కారం ఎలా అవుతుంది అంటారు విజ్ఞులు. ‘అన్ని కష్టాలకు విముక్తి చావే’ అనే మాటకు మించిన అవివేకం లేదంటారు కౌన్సెలర్లు. బలవన్మరణం ఆ వ్యక్తిని చనిపోయాక కూడా వెంటాడుతుంది. ఒక అపప్రథగా... కుటుంబాన్ని కష్టాల పాలు చేస్తుంది. మనిషి లేని లోటు ఏం చేసినా తిరిగి రాదు. అటువంటి సమయంలో మరణం ఎందుకు? నిరాశ, నిస్పృహ పరిస్థితులు, సవాళ్లు ఎవరికీ కొత్త కాదు. బతకడమే చేయవలసింది. నిపుణుల సలహాలతో కథనం.అంకెలు దుర్మార్గమైనవి. అవి నిజమైన నష్టాన్ని చూపించవు. కావాలంటే ఈ అంకె– 1,80,000 చూడండి. దీనిని చూస్తే ఏమీ అనిపించదు. కాని మన దేశంలో ప్రతి ఏటా ఇంతమంది ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారు. వీరందరి ఫొటోలను సముద్రతీరం వెంబడి ప్రదర్శిస్తే ఎన్ని కిలోమీటర్ల తీరం కావాలి? అలా ప్రదర్శిస్తే తెలుస్తుంది తీవ్రత,,, ఇంత మంది చనిపోతున్నారా అని. వీరిలో కనీసం 1,20,000 మంది పురుషులు. ఇప్పుడు ఆలోచించండి. పితృస్వామ్య ఆధారితమైన మన సమాజంలో పురుషుడు చనిపోతే ఆ ఇంట్లోని ఎంతమంది సభ్యులు దిక్కులేనివారు అవుతారు. జీవితాలు తల్లకిందులు చేసుకుంటారు. మరెన్నో కష్టాల్లో కూరుకుపోతారు. కరోనా అనో మరోటనో మహమ్మారులను చూసి భయపడటం కాదు. ఈ భూగ్రహాన్ని పీడిస్తున్న అతి పెద్ద మహమ్మారి ఆత్మహత్యే. ప్రతి ఏటా అన్ని దేశాలలో కలిపి 8 లక్షల మంది ఆత్మహత్యల ద్వారా మరణిస్తున్నారు. ఇది ఒక రకంగా కాకిలెక్కే. అసలు లెక్క తెలియక పోవడమే మంచిది. మరో విషయం తెలుసా? ప్రతి మరణానికీ ఒకరు చనిపోవడమే కనిపిస్తుంది... కాని ఆ సమయానికి మరో ఇరవై మంది ఆత్మహత్యాయత్నం చేసి బతికి బయటపడ్డ వాళ్లు ఉంటారు.ఆరుకు ఒకరుప్రస్తుతం మన దేశంలో 15 నుంచి 29 మధ్య వయసు లో ఉన్న పురుషులు ఎక్కువ సంఖ్యలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అంటే దేశంలోని ప్రతి ఆరు ఆత్మహత్యల్లో ఒకటి ఈ ఏజ్ గ్రూప్ నుంచే ఉంది. బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన వయసులో ఆత్మహత్యల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం–∙చదువు ఒత్తిడి ∙పని చోట పీడన∙బంధాలలో దగా ∙ఆర్థిక సమస్యలు ∙అన్ని జీవన పార్శా్వలలో బెస్ట్గా ఉండమని కోరే సాంఘిక నియమంఇదొక జబ్బుఆత్మహత్యను జబ్బుగా ఎవరూ చూడరు. కాని ఇదొక జబ్బు. పట్టలేని ఉద్వేగం వల్ల, క్షణికావేశం వల్ల, నేను చస్తే అవతలివాళ్లు పశ్చాత్తాపంతో బాధ పడాలి అన్నట్టుగా, సమస్యలకు పరిష్కారమే ఉండదన్న నెగెటివ్ స్వభావం వల్ల, పరువు ప్రతిష్టలకు ఎక్కువ విలువివ్వాలనే భావన వల్ల, నోరు తెరిచి సమస్యను బయటపడేయని స్వభావం వల్ల ఆత్మహత్యలు జరుగుతుంటాయి. తరచి చూస్తే ఇవన్నీ మెదడు చేసే విన్యాసాలే. కెమికల్ రియాక్షన్సే. ఉద్వేగాలను, ఆవేశాలను దాటి వస్తే, మనం పోయి మరొకరిని సాధించడమనే భావన ఎంతటి హాస్యాస్పదమో ఎరుకలోకి వస్తే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందనే నమ్మకం కలిగి ఉంటే, పరువు ప్రతిష్టలు తర్వాత ముందు ప్రాణం ముఖ్యం అనుకుంటే, ఆత్మాభిమానం కంటే సమస్య నుంచి బయటపడటం ముఖ్యం అనుకుంటే ఆత్మహత్యలు జరగవు. మరో విషయం ఏమిటంటే ఒకరికి ప్రపంచ సమస్యగా ఉండేది ఎదుటివారికి అసలు సమస్యే కాకపోవచ్చు. ‘ఇంత చిన్న విషయానికి చనిపోయాడా?’ అని ఆశ్చర్యపోతారు తప్ప జాలి కూడా చూపరు. మరి ఆత్మహత్య చేసుకోవడం ఎందుకు? ఆత్మహత్య ఆలోచనలు వస్తే జ్వరానికి మాత్ర మింగినట్టు ఆ ఆలోచనలు పోయే కౌన్సిలింగ్ తీసుకోవాలి. మిత్రుల సహకారం తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల సలహాతో మందులు వాడాలి. అంతే చేయవలసింది. చనిపోవడం కాదు.భళ్లున తెల్లారుతుందిఈ చీకటి రాత్రి విషమ పరీక్షలు ఎన్ని పెట్టినా ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఉంటే మరునాడు భళ్లున తెల్లారుతుంది. ఆ వెలుతురు దారి చూపిస్తుంది. కొత్త ఊపిరి వస్తుంది. కాని రాత్రే శాశ్వతం అన్నట్టు ప్రాణాలు తీసుకుంటారు కొంత మంది. గత రాత్రి వ్యక్తి చనిపోయినా మరుసటి రోజు లోకం స్తంభించదు. అందరూ ఎవరి పనుల్లో వారుంటారు. సినిమా లు ఆడుతుంటాయి. కెఫేలు బిజీగా ఉంటాయి. బ్యాంకు లావాదేవీలు జరుగుతుంటాయి. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి నిర్జీవం కావడం తప్ప అంతా మామూలుగా ఉంటుంది. ఆ అంతా మామూలుగా ఉండే జగత్తులో ఉంటూ జీవితాన్ని మిస్ కాకుండా ఉండాలనే భావన కలిగించుకుంటూ ఉండాలి. అందరూ కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారని ఎవరిని కదిపినా తెలుస్తుంది. మరి వారంతా చనిపోనప్పుడు మనం ఎందుకు చనిపోవాలి అనుకోవడంలోనే ఉంది విజ్ఞత. ఈ కమ్యూనికేషన్ రోజుల్లో 24 గంటలు ఎన్నో కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాల్ చేస్తే సాయం చేస్తారు. ఆ సాయం పొందాలి. వ్యక్తులు బలహీనంగా ఉన్నప్పుడు కుటుంబ బలాన్ని, బంధుబలాన్ని, స్నేహబలాన్ని, సమాజ బలాన్ని తోడు తీసుకోవాలి. సోషల్ మీడియాలో సమస్యను పంచుకుని బయటపడినవారు ఉన్నారు. పోలీసులు, న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ, ప్రజాప్రతినిధులు వీరంతా పౌరులకు ఏదో ఒక మార్గం చూపాల్సినవారే. వారి సాయం పొందాలి. అన్నింటికి మించి జీవితాన్ని సరళంగా, సులభం గా నిర్మించుకుంటే, ఆరోగ్యకరమైన జీవన విధానాలు, అలవాట్లు, క్రమశిక్షణ, ఆహారం, స్నేహితులు.. తోడు చేసుకుంటే జీవించడంలో ఆనందం తెలుస్తుంది.చెప్పుకునే మనిషీ కోరుకునే అండమనిషి తనకొచ్చే కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోడు. ఆ కష్టాలను వినే మనిషి లేకపోవడం వల్ల, నేనున్నాననే భరోసా దొరకకపోవడం వల్ల, నిస్సహాయత ఫీలయ్యి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడం ఒక నిమిషపు నిర్ణయం కాదు చాలామంది విషయంలో. కొందరు రోజుల తరబడి దీని గురించి ఆలోచిస్తారు. ఆలోచిస్తూ ఉంటారు. చివరకు ప్రయత్నిస్తారు. అందుకు సంబంధించిన మార్పులు వ్యక్తులలో, కుటుంబ సభ్యులలో గుర్తించడం చాలామటుకు సాధ్యం. సమస్య ఏమిటో తెలుసుకుంటే, వారిని కదిలించి రాబట్టగలిగితే వారు ప్రమాదపు అంచుకు వెళ్లరు. దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యులే ఒకరిని మరొకరు గమనించలేనంతగా బిజీగా ఉంటూ అంతా అయ్యాక కళ్లు తెరుస్తున్నారు. -
మూరెడు మల్లెపూలే కాదు.. వీటితోనూ తంటాలే!
మల్లెపూలు తీసుకెళ్లినందుకు.. మలయాళ నటి నవ్య నాయర్కి ఆస్ట్రేలియాలో రూ.1.14 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మూరెడు మల్లెపూలు.. అదీ బ్యాగులో ఉన్నందుకే ఆమెకు ఆ ఫైన్ పడింది. ఈ చేదు అనుభవంపై ఆమె సైటైర్లు వేసుకుంటోంది కూడా. అయితే.. ఆస్ట్రేలియా మెల్బోర్న్ ఎయిర్పోర్టుకు ప్రపంచంలోని అత్యంత కఠినమైన బయోసెక్యూరిటీ చట్టాలు ఉన్న విమానాశ్రయాంగా పేరుంది. కేవలం మల్లపూలే కాదు.. మరికొన్ని వస్తువులను కూడా అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరని మీకు తెలుసా?.. ఓనం ఈవెంట్కు హాజరయ్యేందుకు వెళ్లిన మల్లూ బ్యూటీ నవ్య నాయర్కు చేదు అనుభవం ఎదురైంది. తన తండ్రి తచ్చిన మల్లెపూల మూరను ఆమె బ్యాగులో ఉంచుకుని ఎయిర్పోర్టులో దిగారు. అయితే.. మెల్బోర్న్ ఎయిర్పోర్టులో వాటిని గుర్తించిన సిబ్బంది అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి అధికారులు ఆమెకు రూ.1.14లక్షల జరిమానా వేశారు. 28 రోజుల్లో ఆ జరిమానా కట్టాలని ఆమెకు స్పష్టం చేశారు. మల్లెపూల తరహాలో మూరెడున్న వంద కేటగిరీల వస్తువులపై అక్కడ నిషేధం అమల్లో ఉంది. అందులో.. తాజా, ఎండిన పూలు, తాజా పండ్లు, కూరగాయలు, మూలికలు, మసాలా దినుసులు, గింజలు, పాల సంబంధిత ఉత్పత్తులు, బర్ఫీ.. రసగుల్లా, రసమలై, గులాజ్జామూన్, మైసూర్ పాక్, సోన్పాపిడి ఇలా.. స్వీట్లు, బియ్యం, టీ, ఇంటి భోజనం, తేనే, పెంపుడు జంతువుల ఆహారం.. ఈకలు, ఎముకలు, చర్మం (సంబంధిత వస్తువులు కూడా!), చెట్లు.. జంతువుల నుంచి తయారు చేసిన మందులు, చివరకు.. విమాన, నౌకల ప్రయాణాల నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని కూడా అనుమతించరంతే. ప్రయాణికులు వీటిని తీసుకెళ్లడం అక్కడ నిషిద్ధం. వాటివల్ల ప్రయాణికులకు వివిధ రకాల వ్యాధులు, తెగుళ్లు సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. పైగా వాటి వల్ల పర్యావరణానికి హాని అని భావిస్తున్నారు. చివరకు.. మన పండుగలు పబ్బాలు ఉన్నాయని విజ్ఞప్తులు చేసుకున్నా కూడా వాళ్లు వినరు. అయితే మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్కు మాత్రం ఎందుకనో అనుమతిస్తారు!. నవ్య మెల్బోర్న్ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం అక్కడి కస్టమ్స్ అధికారులు ఆమె బ్యాగ్లో మల్లెపూలును తీసుకువచ్చినందుకు జరిమానా విధించారు. అనంతరం మెల్బోర్న్లో జరిగిన ఓనం కార్యక్రమంలో మాట్లాడుతూ.. నటి నవ్య తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తాను తీసుకువచ్చిన పూలు లక్ష రూపాయలు ఖరీదైనవని జరిమానా విధించేవరకు తనకు తెలియదని చమత్కరించింది. కానీ, ఆస్ట్రేలియా సరిహద్దుల్లో నిషేధిత వస్తువులపై కఠిన నియమాలు అమలవుతున్నాయి. ఆస్ట్రేలియా బయోసెక్యూరిటీ చట్టాల ప్రకారం.. నిషేధిత/ప్రకటించని వస్తువులు (ఆహారం, మొక్కలు, జంతు ఉత్పత్తులు, ఔషధాలు) సరిహద్దులో పట్టుబడితే.. వెంటనే వాటిని ధ్వంసం చేస్తారు. ప్రయాణికులకు తక్షణ జరిమానాలు విధిస్తారు. విషయం తీవ్రమైందిగా భావిస్తే.. వీసా రద్దు చేస్తారు. మరింత తీవ్రమైందిగా అనుకుంటే.. తీవ్ర ఉల్లంఘనల కింద పరిగణించి జైలు శిక్ష కూడా విధించవచ్చు. అందుకే ప్యాసింజర్ కార్డులో వాటి గురించి తప్పనిసరిగా పేర్కొనాలి. అప్పుడు.. అనుమతించని వస్తువులు తీసేసినా జరిమానా ఉండదు. లేకుంటే.. నవ్య నాయర్లా 15 సెం.మీ. మల్లెపూలకు లక్ష రూపాయల జరిమానా చెల్లించాల్సి వస్తుంది. నవ్యా నాయర్(ధన్య వీణ) 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుశా జిల్లాలో జన్మించారు. 2001లో ఇష్టం అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు, ప్రధానంగా మలయాళ సినిమాల్లో.. ఆడపా దడపా తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్తో జంటగా నటించిన నందనం అనే సినిమాలో నటనకు కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డు లభించింది. ఆమె క్లాసికల్ డాన్స్లో శిక్షణ పొందిన నర్తకి, పలు స్టేజ్ షోలు కూడా చేశారు. 2010లో వ్యాపారవేత్త సంతోష్ మెనన్ను వివాహం చేసుకున్నారు.. ఈ జంటకు ఓ కుమారుడు. యాక్టింగ్తో పాటు టీవీ షోలు, రచనల ద్వారా కూడా ప్రేక్షకులను ఆమె ఆకట్టుకుంటున్నారు. -
టెక్.. టాక్!
చాట్బాట్లు చెప్పేవన్నీ నిజాలు కావట.. కొన్ని వాటికవే ఊహించేసుకుని మనకు చెప్పేస్తాయట.. నిజం.. ఎందుకంటే.. దీన్ని చెప్పింది మేం కాదు.. ప్రఖ్యాత చాట్బాట్ సంస్థ చాట్ జీపీటీ నిర్వహణ సంస్థ అయిన ఓపెన్ ఏఐలోని పరిశోధనా బృందం. చాట్జీపీటీ వంటి చాట్బాట్లను లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం) అంటారు. ‘‘c?’’ అనే అంశంపై ఓపెన్ ఏఐ పరిశోధకులు ఆడమ్ టౌమన్ కలాయ్, ఓఫెర్ నచూమ్, ఎడ్విన్ ఝాంగ్ సహా జార్జియా టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ సంతోష్ ఎం.వెంపాల సంయుక్తంగా ఒక నివేదికను రూపొందించి ఇటీవల విడుదల చేశారు. అందులో చెప్పిందే ఈ విషయం. వాళ్లేమంటారంటే.. ‘‘ఉదాహరణకు పాఠశాలల్లో పిల్లాడిని ఉపాధ్యాయుడు ఏదైనా ప్రశ్న అడిగితే.. సమాధానం కింద ఇచ్చే నాలుగు సమాధానాల్లో ఏదో ఒకటి చెబుతాడు. అయితే కరెక్ట్ అవుతుంది లేదంటే తప్పు. నాకు తెలీదు అని కూర్చుంటే ఉన్న ఒక్క మార్కు కూడా పోతుంది. అచ్చం అలాంటి పిల్లల్లాగే కృత్రిమ మేధ చాట్బాట్లు కూడా ప్రవర్తిస్తాయి. గతంలో తమ యూజర్లు ప్రాంమ్ట్ మాదిరిగా అందించిన సమాచారంలో ఈ కొత్త ప్రశ్న తాలూకు సమాచారం లేకపోతే చాట్బాట్ సొంతంగా ఒక తప్పుడు సమాచారాన్ని సృష్టించి యూజర్కు అందజేస్తుంది. ఆ సమాధానంతో యూజర్ సంతృప్తి చెందితే తాను చెప్పిన అంశం వాస్తవానికి దగ్గరగా ఉందని చాట్బాట్ గుర్తుంచుకుంటుంది. లేదంటే మరోసారి మరో సమాధానం ఇస్తుంది. ఇలా చాట్బాట్లు ఎప్పటికప్పుడు కొత్త అంశాలపై సమీక్ష జరుపుకుంటూ తమను తాము మెరుగుపర్చుకుంటాయి. తప్పులను మనం ఆపలేం కానీ ఆ తప్పుల నుంచి పాఠాలను నేర్చుకోగలం అనే సిద్ధాంతంతో చాట్బాట్లు పనిచేస్తాయి’’ అది బ్రో.. చాట్బాట్ నిజం వెనకున్న అసలైన నిజం.. గంటకు రూ.5,000 ఇంతకీ దేనికి?ఇంక దేనికి.. హిందీ చాట్బాట్ను సృష్టించేందుకు.. చాట్బాట్లను మనం తెగ వాడతాం. ఈ విషయం మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్కు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు హిందీ చాట్బాట్ కోసం క్రియేటర్లు, కాంట్రాక్టర్లను నియమించుకుంటున్నారు. ఇందుకోసం గంటకు దాదాపు రూ.5,000 చెల్లిస్తున్నారు. క్రిస్టల్ ఈక్వేషన్, ఆక్వెంట్ టాలెంట్ సంస్థల ద్వారా కొత్త ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. హిందీ, ఇండోనేషియన్, స్పానిష్, పోర్చుగీస్ భాషలు అనర్గళంగా మాట్లాడే వాళ్లకు తొలి ప్రాధాన్యం కలి్పస్తారు. కథలు చెప్పడం, పాత్రల సృష్టి, కృత్రిమమేధ కంటెంట్ తయారీ వంటి సృజనాత్మక రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇన్స్ట్రాగామ్, మెసెంజర్, వాట్సాప్ యాప్లలో హిందీ భాషలో చాట్బాట్ను సృష్టించడం ఈ ఉద్యోగుల ప్రధాన విధి. కోడింగ్ మాత్రమే కాదు ఈ మూడు యాప్లలో ఏఐ పాత్రలను సృష్టించే నిపుణులకు కూడా అవకాశాలు మెండుగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. టాలెంట్ ఉందా.. మరి బీ రెడీ. కంటెంట్ ఈజ్ కింగ్.. కంటెంట్ క్రియేటర్లకు మార్కెట్లో డిమాండ్ ఉంది. కృత్రిమమేధ(ఏఐ) బ్రాండ్లు మార్కెట్లో మనుగడలో ఉండాలంటే కంటెంట్ క్రియేటర్లపై ఆధారపడక తప్పని పరిస్థితి. అందుకే కంటెంట్ స్ట్రాటజీ ఉద్యోగికి దాదాపు రూ.3.46 కోట్ల వార్షిక వేతనం ఇస్తామని తాజాగా ఓపెన్ఏఐ ప్రకటించింది. కంటెంట్ స్ట్రాటజీ, కాపీ రైటింగ్, గ్రోత్ మార్కెటింగ్ విభాగాల్లో ఆరేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులని తెలిపింది. అక్షరాలు, ఆలోచనలకు వాస్తవరూపమిచ్చి కోట్లాది వినియోగదారుల మనసుల్ని చూరగొనే ఉద్యోగులే మాకు కావాలని చెప్పింది. ఇంతకీ జాబ్ ఎక్కడంటే.. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరంలో.. అందుకే కటౌట్ కాదు.. మన దగ్గరున్న కంటెంట్ ముఖ్యం అనేది.. ఏంటి భయ్యా ఇదీ..మీరీ విషయం విన్నారా? తక్కువ వృత్తి నైపుణ్యాలున్న, కిందిస్థాయి(ఎంట్రీలెవల్) ఉద్యోగాలను కృత్రిమమేధ తుడిచిపెట్టేస్తుందని కృత్రిమమేధ భద్రతా, పరిశోధనా సంస్థ ‘ఆంథ్రోపిక్’ సీఈఓ డేరియో ఆమోడీ చెప్పారు. కన్సల్టింగ్, న్యాయసేవలు, ఫైనాన్స్, అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఎంట్రీలెవల్ ఉద్యోగులు ఒకటి నుంచి ఐదేళ్లలోపు కొలువుల్ని కోల్పోవడం ఖాయమని చెప్పారు. బీబీసీ పాడ్కాస్ట్ అయిన ‘‘బీబీసీ ర్యాడికల్ విత్ అమోల్ రాజన్’ ఆడియో ఇంటర్వ్యూలో డేరియో పలు అంశాలపై మాట్లాడారు. ‘‘న్యాయసేవలు అందించే సంస్థలు మొదలు ఫైనాన్స్, అడ్మిని్రస్టేషన్ విభాగాల దాకా కొన్ని సంస్థల్లో డాక్యుమెంట్ల తనిఖీ అనేది మూస పద్ధతిలో సాగుతుంది. ఇలాంటి వైట్కాలర్ ఉద్యోగుల పనిని కృత్రిమమేధ సులభంగా చేయగలదు.అందుకే ఇలాంటి ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు త్వరలో మాయం అవుతాయి. కిందిస్థాయి ఉద్యోగుల్ని ఏఐతో భర్తీచేయాలని ఎన్నో కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. క్లరికల్ పనిని ఏఐతో చేయించాలని చూస్తున్నారు. ఎలాంటి సాఫ్ట్వేర్ కోడింగ్ను అయినా ఏఐ అనేది మూడు నుంచి ఆరు నెలల్లోపు నేర్చేసుకుంటుంది. దీంతో అత్యున్నతస్థాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మినహా కిందిస్థాయి ఉద్యోగాలు డేంజర్లో పడనున్నాయి’’ అని ఆయన హెచ్చరించారు. -
ఆమెకు అభద్రత!
దేశంలోని ప్రతి 10 మంది మహిళల్లో నలుగురు.. తాము ఏమంత సురక్షితంగా లేరని భావిస్తున్నారట. యువతుల్లో భయాందోళనలు గత ఏడాది కంటే పెరిగాయి. ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందట. పని చేసే చోట భద్రత గురించి మాత్రం.. సురక్షితమైన వాతావరణం ఉందని అత్యధికులు చెప్పారు. దేశంలోని మహిళల భద్రతా స్థితిగతులపై జాతీయ మహిళా కమిషన్.. ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ పేరిట విడుదుల చేసిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్వీధి లైట్లు.. ప్రజా రవాణా!⇒ ‘ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్’ గురించి విన్నవారిలో చాలా మంది, ఆఫీసులలో అలాంటి యంత్రాంగం ఒకటి ఉంటుందన్న అవగాహన మహిళలకు భద్రత కల్పిస్తుందని అభిప్రాయపడ్డారు. ⇒ మహిళల భద్రత అంటే కేవలం వారికి భౌతిక రక్షణను మాత్రమే ఇవ్వటం కాదని; వారి మానసిక, ఆర్థిక, డిజిటల్ భద్రతలను కూడా కల్పించాలని నివేదిక సూచించింది. ⇒ స్థలాన్ని, సమయాన్ని బట్టి కూడా భద్రత అర్థం మారుతుందనీ, పగటిపూట సురక్షితమైన వాతావరణాన్ని నైట్ షిఫ్టులలో ఆశించలేమని మహిళలు అన్నారు.⇒ వీధి లైట్లు లేకపోవటం, సరిగా లేని ప్రజా రవాణా వ్యవస్థ కూడా రాత్రివేళ మహిళలకు భద్రత లేకపోవటానికి కారణమని వారు తెలిపారు.దేశంలోని 31 నగరాల్లో 12,770 మంది మహిళల అభిప్రాయాలు సేకరించి జాతీయ మహిళా కమిషన్ ‘నారీ 2025 వార్షిక నివేదిక, భద్రతా సూచిక’ రూపొందించింది. సర్వేలో దాదాపు 60 శాతం మంది మహిళలు తమ నగరాల్లో తాము సురక్షితంగా ఉన్నట్లు చెప్పగా, 40 శాతం మంది అంత సురక్షితంగా లేమని లేదా సురక్షితంగా అస్సలు లేమని భావిస్తున్నట్లు తెలిపారు.యువతులలోని భయాందోళనలు గత ఏడాది కంటే పెరగటాన్ని కూడా నివేదిక గుర్తించింది. 2024లో సర్వేలో పాల్గొన్న మహిళల్లో 7 శాతం మంది బహిరంగ వేధింపులను గురయ్యామని చెప్పగా, 24 ఏళ్లలోపు యువతుల్లో ఇలా చెప్పిన వారి సంఖ్య గరిష్ఠంగా 14 శాతంగా ఉంది. ముఖ్యంగా చదువుకునే అమ్మాయిలు, ఉద్యోగినులైన యువ నిపుణులు, సామాజిక వేడుకల్లో పాలుపంచుకున్న మహిళలు వేధింపులకు గురైనట్లు సర్వే పేర్కొంది.ముగ్గురిలో ఒక్కరే ఫిర్యాదు!ఫిర్యాదు ఇస్తే న్యాయం జరుగుతుందన్న ఆశ బాధిత మహిళల్లో చాలా తక్కువగా ఉందని నివేదిక తెలిపింది. సర్వే ప్రకారం, వేధింపులకు గురైన ముగ్గురిలో ఒకరు మా త్రమే ఫిర్యాదు చేశారు. 75 శాతం మహిళలు.. తమ ఫిర్యాదులను అధికారులు పరిష్కరిస్తారని నమ్మటం లేదు. వేధింపులు, ఇతర ఘటనల్లో 22 శాతం వరకే కేసులు నమోదు కాగా, వాటిల్లో పరిష్కారం అయినవి కేవలం 16 శాతం మాత్రమే. వ్యవస్థపై అపనమ్మకం, బాధితుల మౌనం ఏ స్థాయిలో ఉన్నాయో ఈ లెక్కలు చెబుతున్నాయి. వేధింపు ఘటనల్లో 32 శాతం.. తెలిసిన ప్రాంతాలలో జరుగుతుండగా, 29 శాతం ప్రయాణ సమయాలలో సంభవిస్తున్నాయని నివేదిక తెలిపింది.కోహిమాలో సురక్షితంనగరాల వారీ భద్రతా అసమానతలను కూడా నివేదిక పొందుపరిచింది. కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్.. భద్రతా సూచికలో అగ్రస్థానంలో ఉన్నాయి, తరువాత ఐజ్వాల్, గ్యాంగ్టక్, ఇటానగర్ ముంబై ఉన్నాయి. ఇందుకు భిన్నంగా పట్నా, జైపుర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కోల్కతా, శ్రీనగర్, రాంచీ మరీ దిగువ స్థానాల్లో ఉన్నాయి. రాంచీ అంత సురక్షితమైనది కాదని 44 శాతం మంది మహిళలు భావిస్తుండగా, ఢిల్లీ ఫరీదాబాద్లలో ఈ శాతం దాదాపు 42గా ఉంది. దేశంలోని మహిళల భద్రతను పట్టణ పరిస్థితులు, అక్కడి పాలనా యంత్రాంగం పనితీరు ప్రభావితం చేస్తున్నట్లు ‘నారీ 2025’ తేల్చి చెప్పింది. పనిచేసే చోట భద్రమేపని చేసే చోట భద్రత గురించి 91 శాతం మంది మహిళలు.. కార్యాలయంలోని వాతావరణం సురక్షితంగా ఉందని తెలిపారు. అయితే వారిలో దాదాపు సగం మంది, తమ సంస్థ తప్పనిసరి ‘లైంగిక వేధింపుల నివారణ’ (పి.ఓ.ఎస్.హెచ్. – ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్) యంత్రాంగాన్ని అమలు చేస్తోందో లేదో తమకు తెలియదని చెప్పారు.వేధింపులు⇒ బహిరంగ వేధింపులకు గురయ్యామని చెప్పిన మహిళలు 7 శాతం. 24 ఏళ్లలోపు యువతుల్లో ఇది 14 శాతం.⇒ వేధింపు ఘటనల్లో 32 శాతం తెలిసిన ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ⇒ ముఖ్యంగా 38% ఇరుగు పొరుగు వారి వల్లే జరుగుతున్నాయి.⇒ 29 శాతం ప్రయాణాల సమయాలలో సంభవిస్తున్నాయి.⇒ వేధింపుల్లో మాటలతో అత్యధికంగా 58 శాతం చోటు చేసుకుంటున్నాయి.⇒ వేధింపులకు గురైనవారిలో ప్రతి ముగ్గురిలో కేవలం ఒక్కరే ఫిర్యాదు చేస్తున్నారు. -
మహిళా పాఠకులు చదవాల్సిన 20 పుస్తకాలు
స్త్రీలు రాసిన పుస్తకాలు, స్త్రీల గురించిన పుస్తకాలు చదవడం అంటే కొత్త మైదానాల్లోకి అడుగు వేయడమే. సాహిత్యం వికాసాన్ని, వివేచనను ఇస్తుంది. ఇంటిలోని మహిళ పుస్తక పఠనం మొదలెడితే ఇంటిల్లిపాది పాఠకులు అవుతారు. ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ కనీసం చదివి ఉండాల్సిన 20 పుస్తకాలు ఇక్కడ ఇస్తున్నాం. ఇలా ఎంపిక చేయదగ్గవి తెలుగు నుంచి మరో వందైనా ఉన్నాయి. ఈ ఎంపికలో నచ్చినవి తీసుకొని చదవండి.1. సచ్చరిత్ర– బండారు అచ్చమాంబతొలి తెలుగు కథకురాలు బండారు అచ్చమాంబ జీవిత్రచరిత్ర ఇది. గురజాడ అ΄్పారావు కన్నా ముందే ‘ధనత్రయోదశి’ కథ రాసి తెలుగు కథకు బాటలు వేశారు. ‘సచ్చరిత్ర’ తప్పక చదవదగ్గది.2. మావూరి ముచ్చట్లు– పాకాల యశోదారెడ్డితెలంగాణ ప్రాంతం నుంచి మాండలిక సౌందర్యంతో కథలు రాసిన రచయిత్రి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.3. నా ఇంగ్లండు యాత్ర– పోతం జానకమ్మజానకమ్మ అనే తెలుగింటి ఆడపడుచు 1873లో ఓడలో చేసిన ఇంగ్లండు ప్రయాణ విశేషాలను, ఆనాటి సామాజిక పరిస్థితులను పుస్తక రూపంలో రాశారు. 1876లో ఈ పుస్తకం వెలువడింది.4. శారద లేఖలు– కనుపర్తి వరలక్ష్మమ్మ సాహితీవేత్తగా ప్రసిద్ధి చెందిన వరలక్ష్మమ్మ 1929 నుంచి 1934 వరకు ‘గృహలక్ష్మి’ మాసపత్రికలో రాసిన శారద లేఖలు ప్రసిద్ధి పొందాయి. దురాచారాలను ఖండిస్తూ, స్త్రీల అభ్యున్నతి కాంక్షించేలా నడిచే ఈ లేఖలు అనేక అంశాల గురించి చర్చిస్తాయి.5. స్త్రీ(నవల)– గుడిపాటి వెంకటాచలంస్త్రీవాదాన్ని బలపరుస్తూ ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 1925లో రాసిన నవల. స్త్రీలు ఏ అడ్డూ లేకుండా స్వేచ్ఛగా జీవించాలన్న తృష్ణకు ఈ నవల నేపథ్యం.6. జానకి విముక్తి (నవల)– రంగనాయకమ్మ స్త్రీలలో రావాల్సిన మార్పులను, వారు సాధించాల్సిన అభ్యున్నతిని కాంక్షిస్తూ రాసిన నవల ఇది. ‘జానకి’ అనే పాత్ర జీవితంలో జరిగిన అనుభవాలను వివరంగా తెలుపుతుంది ఈ పుస్తకం.7. కాలాతీత వ్యక్తులు (నవల) – పి.శ్రీదేవితెలుగు సాహిత్యంలో పేరెన్నికగన్న నవల. పురుషాధిక్యతను నిరసిస్తూ, స్త్రీలు స్వతంత్రంగా ఎదగాలన్న కాంక్షను కనబరుస్తూ సాగే పాత్రలు ఇందులో కనిపిస్తాయి.8. నాలో నేను (ఆత్మకథ) – భానుమతీ నటి, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీతకారిణి అయిన భానుమతీ రామకృష్ణ ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆమె, అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఈ పుస్తకంలో చదవొచ్చు.9. గోరాతో నా జీవితం– సరస్వతి గోరాప్రముఖ హేతువాద ఉద్యమకారుడు గోరా సతీమణి సరస్వతి రాసిన ఆత్మకథ ఈ పుస్తకం. సామాన్య గృహిణిగా ఉన్న ఆమె గోరా సాహచర్యంతో హేతువాదిగా ఎదిగిన క్రమాన్ని ఇందులో పొందుపరిచారు.10. రాజకీయ కథలు– ఓల్గాస్త్రీల జీవితాల్లోని విభిన్న పార్శా్వలను, వాటి చుట్టూ అల్లుకున్న రాజకీయాలను పొందుపరిచిన కథలివి. స్త్రీ వాదానికి బలమైన దన్నుగా నిలిచిన కథలు.11. ఇల్లాలి ముచ్చట్లు– పురాణం సుబ్రహ్మణ్య శర్మవారపత్రికలో ప్రచురితమైన ఈ ఇల్లాలి ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానాన్ని పొందాయి. రోజువారీ సంఘటనలు మొదలుకొని, అంతర్జాతీయ అంశాల దాకా అన్నింటి పట్ల సగటు ఇల్లాలి స్పందన ఇది. హాస్యం, వ్యంగ్యం, సామాజిక అవగాహన కలగలిసిన ముచ్చట్లు.12. రాయక్క మాన్యం (కథలు)– తెలంగాణలోని దళిత జీవన నేపథ్యాన్ని, స్థితిగతులను యథాతథంగా చిత్రించిన కథలివి. దళిత స్త్రీల జీవనపోరాటాన్ని ఈ కథల్లో చూడొచ్చు.13. నల్లపొద్దు– సంపాదకురాలు: దళిత స్త్రీలు రచించిన సాహిత్యాన్ని తొలిసారిగా పుస్తక రూపంలోకి తీసుకొచ్చి అందించిన పుస్తకం. ఈ రచనల్లో అస్తిత్వ ఘర్షణ, నిరంతర పోరాట స్ఫూర్తి కన్పిస్తాయి. 14. నీలి మేఘాలు (స్త్రీవాద కవిత్వం)తెలుగు స్త్రీవాద సాహిత్యంలో కీలకమైన కవిత్వ సంపుటి. స్త్రీల సమస్యలు, వారి అంతరంగాలు, అభ్యంతరాలకు బలమైన వ్యక్తీకరణతో కవిత్వరూపం ఇక్కడ కనిపిస్తుంది.15. నిర్జనవారధి (ఆత్మకథ)– కొండపల్లి కోటేశ్వరమ్మ కమ్యూనిస్టు ఉద్యమకారిణి కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ. 92 ఏళ్ల వయసులో ఆమె రాసిన ఈ పుస్తకం తెలుగు రాష్ట్రాల్లోని అనేక పరిణామాలను వివరిస్తుంది.16. ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు: ఫాతిమా షేక్భారతదేశ తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు, సామాజిక సంస్కర్త, జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల సహోద్యోగి ఫాతిమా షేక్. ఆమె జీవిత చరిత్ర తప్పక తెలుసుకోవాల్సినది. రచన: నసీర్ అహ్మద్.17. చదువు తీర్చిన జీవితం (ఆత్మకథ)– కాళ్లకూరి శేషమ్మమెట్టు మెట్టు ఎక్కిన ఒక సామాన్య మహిళ ఆత్మకథ ఈ పుస్తకం. క్రమశిక్షణ, సంయమనంతో తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్న కాళ్లకూరి శేషమ్మ ఏడు దశాబ్దాల అనుభవసారం స్ఫూర్తిదాయకమైనది.18. నా మాటే తుపాకీ తూటా (ఆత్మకథ)తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని, ఆపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్టు నేత మల్లు స్వరాజ్యం జీవితాన్ని గ్రంథస్తం చేసిన పుస్తకం ఇది. 19. కుప్పిలి పద్మ కథలుఆధునిక స్త్రీల జీవనంలో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలను ఒడిసిపట్టిన కథలివి. కథలను కవితాత్మకంగా చిత్రించటం కుప్పిలి పద్మ రచనల ప్రత్యేకత.20. ఎదారి బతుకులు(కథలు)– ఎండపల్లి భారతిబడుగుజీవుల జీవన క్రమాన్ని, వారి సంతోషాలను, సరదాలను, బాధలనూ ఒకచోట చేర్చిన కథలివి. పల్లెవాసుల జీవనాన్ని యథాతథంగా చిత్రించి అందించారు రచయిత్రి ఎండపల్లి భారతి. -
వర్కింగ్ మదర్.. ఎంతో ప్రెజర్!
ఒక భానుతేజ...‘మెటర్నిటీ లీవ్ తర్వాత పాలు తాగే పాపను ఇంట్లో వదిలి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫీస్కి వెళ్తుంటే అనుభవించిన బాధ ఎవరికీ అర్థంకాదు. లిఫ్ట్దాకా పాపను ఎత్తుకుని లిఫ్ట్ లోకి ఎక్కుతున్న ప్పుడు పాపను అత్తయ్య తీసుకుంటుంటే అది నా చున్నీ పట్టుకుని వెళ్లకుండా మొండికేస్తుంటే ఏడుపొ చ్చేది. బలవంతంగా పాపను అత్తయ్య చేతిలో పెట్టి వచ్చేసేదాన్ని’ అంటూ గుర్తుచేసుకుంది భానుతేజ. ఆమె ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇప్పుడు ఆమె కూతురికి మూడేళ్లు. ఆ పాపను డే కేర్ సెంటర్లో చేర్చింది. అయినా భానుతేజ బాధ, భయం పోలేదు. ఉదయం తొమ్మిదింటికి తాను ఆఫీస్కి వెళ్లేప్పుడు పాపను డే కేర్లో దింపితే.. సాయంత్రం ఏడింటికి తాను ఇంటికి వస్తూ పాపను తీసుకెళ్తుంది. పాపకు కావల్సిన పాలు, భోజనం, స్నాక్స్, డైపర్స్ అన్నీ ఇస్తుంది. అయినా ఏదో తెలియని ఆందోళన. ఆఫీసులో ఉన్నా పాప గురించే ఆలోచన!ఏ ఉద్యోగికైనా నిర్దిష్టమైన పనిగంటలు ఉంటాయి. అలాంటి వెసులుబాటు లేని అలుపెరుగని సేవ అమ్మది! ఆమె ఉద్యోగి కూడా అయితే.. ఆకష్టం మామూలుది కాదు! ఇల్లు, పిల్లలు, కెరీర్.. వీటన్నింటితో వర్కింగ్ మదర్స్ నలిగిపోతుంటారు. మరి, అలాంటి మహిళలకు పరిష్కారం ఏమిటి? కుటుంబం.. ముఖ్యంగా భర్తలు లేదా ఇంట్లోని మగవాళ్లు వాళ్లకు చేదోడుగా ఎలా ఉండొచ్చు?ఎన్నో ఆశలు.. ఆశయాలతో చదువులు చదివి, ఉద్యోగాలు చేసే అతివలు కొందరు. తమకు నచ్చిన లేదా ప్రావీణ్యం ఉన్న పనిని చేయాలన్న లక్ష్యంతో కెరీర్ ఎంచుకునే మహిళామణులు మరికొందరు. రోజురోజుకీ ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. వేణ్నీళ్లకు చన్నీల్లలా ఇంటి బండి నడవడానికి సాయపడదామని ఏదో ఒక పనిచేసే పడతులు ఇంకొందరు. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, బ్యాంకు ఉద్యోగులు, టీచర్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు.. ఇలా విభిన్న రంగాల్లో ఇంటా బయటా రెండు అవతారాలు ఎత్తి పనిచేసే మహిళలు ఎందరో.శత సహస్రావధానంఅమ్మాయిల చదువు, ఉద్యోగాల విషయంలో ఇంటి నుంచి ఎంత ప్రోత్సాహం దొరుకుతున్నా.. పిల్లలు పుట్టగానే ‘పిల్లలా.. కెరీరా?’ అనే డైలమా. రెండిట్లో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి. మొండిగా రెండిటినీ ఎంచుకుంటే.. ఇంటా బయటా చాలా సందర్భాల్లో మద్దతు లేమి లాంటి ఒత్తిళ్లు! ‘కానీ, మగవాళ్ల విషయంలో అలా కాదు. భార్య ఉద్యోగం ఎంత గొప్పదైనా.. ఆమె తనకన్నా రెట్టింపు జీతం తీసుకుంటున్నా సరే.. పిల్లల కోసం కొలువుకి సంబంధించి నో కాంప్రమైజ్. వర్కింగ్ మదర్కి మాత్రం సర్దుబాట్లు తప్పవు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలు. ఇలా ఇల్లు, పిల్లలు, ఉద్యోగం మధ్య సమన్వయ మనే అష్టావధానం.. కాదు కాదు, శత సహస్రావధానం, ఒక్క భానుతేజదే కాదు.. కడుపులో చల్ల కదలకుండా చేసుకునే టీచర్ ఉద్యోగం నుంచి 24/7 ఆన్టాస్క్ ఉండే ఆంత్రొ ప్రెన్యూర్ వరకు వర్కింగ్ మదర్స్ అందరిదీ!పోనీ పిల్లల్ని వాయిదా వేసుకుంటే..ఇదివరకటిలా పిల్లల కోసం ఇప్పుడు బయ లాజికల్ క్లాక్ను ఫాలో కావాల్సిన అవసరం లేదు. ఎగ్ ఫ్రీజింగ్, ఆంబ్రియో ఫ్రీజింగ్, సరోగసీ లాంటి.. సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ సహాయంతో కెరీర్లోనే కాదు.. ఆర్థికంగానే స్థిరపడ్డాకే పిల్లల్ని కనే వెసులుబాటు ఉంది. కానీ ఆ ప్రక్రియల్లో సక్సెస్ రేట్ లెక్కేసుకోవాలి. అంతవరకు, జీవనశైలి జబ్బులు రాకుండా జాగ్రత్త పడాలి. ‘ఆ తలనొప్పి కంటే.. వయసులో పిల్లలను కనడమే బెటర్’ అంటున్నారు చాలామంది వర్కింగ్ ఉమన్.మరి పరిష్కారం?వర్కింగ్ మదర్స్కి ఇటు ఉద్యోగం.. అటు పిల్లల పెంపకం మధ్య నలగకుండా.. అపరాధ భావానికి గురవకుండా రెండిటినీ వీలయినంత వరకు సమన్వ యం చేసుకోగల సహకారం కావాలి. ⇒ నెలల వయసు నుంచి స్కూల్ ఈడు వచ్చేవరకు పిల్లల సంరక్షణ కోసం అన్ని సంస్థలు క్రషెస్, డే కేర్ సెంటర్స్ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల వర్కింగ్ మదర్స్కు మాన సిక ప్రశాంతత, రిలీఫ్ ఉండటమే కాక పిల్లల కోసం సెలవులు, ముందస్తు అనుమ తులు లాంటి పనివేళల వృథా తగ్గుతుంది అంటున్నారు భిన్నరంగాల్లోని వర్కింగ్ మదర్స్. ⇒ చాలా సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇలాంటి కన్వీనియెన్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు సహా మిగిలిన అన్ని రంగాల్లోనూ ఏర్పాటైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.‘మగాళ్లూ.. కాస్త ఆలోచించండి’⇒ ‘ఉద్యోగం పురుష లక్షణమే. కానీ, మారుతున్న పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న మమ్మల్ని కూడా గుర్తించండి, గౌరవించండి’ అని కోరుతున్నారు మహిళలు.⇒ ‘చిన్నచూపు చూడటం, సూటిపోటి మాటలు లేకపోతే మా పని మేం హాయిగా చేసుకుంటాం. కుటుంబంలోనూ సంతోషం వెల్లివిరుస్తుంది’ అంటున్నారు.⇒ ‘పిల్లల చదువులు, ఇంటి పనులు, తమపై ఆధారపడినవారు ఉంటే వారి కష్టసుఖాలు, సింగిల్ మదర్ అయితే అదనపు బాధ్యతలు.. ఇలా పది చేతులున్నా సరిపోనన్ని పనులు. మీరు ఇవన్నీ అర్థం చేసుకుంటే మాకు పదివేలు’ అని కోరుతున్నారు. -
సివిల్స్పై సర్వే తప్పనిసరి!
(మహేశ్వర్ పెరి, ఫౌండర్ చైర్మన్ కెరీర్స్ 360) : దేశంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ పరీక్షలను ‘మదర్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్’గా భావిస్తారు. సివిల్ సర్వీస్ పరీక్షల ద్వారానే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), తదితర సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు. దేశంలోనే అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లక్ష్యంగా ఏటా లక్షలాది మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఏటా దాదాపు వెయ్యి ఖాళీలు మాత్రమే అందుబాటులో ఉంటున్నా సుమారు 11 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అంతటి పోటీపరీక్షలో నెగ్గాలంటే పట్టుదల, అకుంఠిత దీక్ష, కఠోర శ్రమ, జనరల్ స్టడీస్, సంబంధిత సబ్జెక్టులపైన పట్టు తప్పనిసరి. చాలా తక్కువ సక్సెస్ రేటు మాత్రమే ఉన్న ఈ పరీక్షల్లో విజయం కోసం ఏళ్ల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. మొదటి ప్రయత్నంలోనే ఏదో ఒక సర్వీసును దక్కించుకుంటున్నవారు కేవలం 7 శాతం మాత్రమే ఉంటున్నారు. మిగతా 93 శాతం మందికి ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు అవసరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుదీర్ఘ కాలం కొనసాగే ఈ పరీక్షల ప్రిపరేషన్ యువతపై అధిక భారాన్ని మోపుతూ వారు నేర్చుకునే సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ‘యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది యువత కృషి, సమయం వృథా అవుతోంది. వారిపై ఒత్తిడి, వ్యయప్రయాసలు పెరుగుతున్నాయి. ఏళ్ల తరబడి సుదీర్ఘ ప్రిపరేషన్ యువత నేర్చుకునే సామర్థ్యాన్ని, వారి విమర్శనాత్మక ఆలోచనను హరించివేసే ప్రమాదముంది. దరఖాస్తులు పెరుగుతున్నప్పటికీ ఆ మేర పెరగని ఖాళీలు యూపీఎస్సీని ప్రెషర్ కుక్కర్గా మార్చాయి. అంతిమంగా ఈ స్థితి కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు లాభం చేకూర్చుతోంది. యూపీఎస్సీ పరీక్ష విధానంపై దేశవ్యాప్తంగా తప్పనిసరిగా చర్చ జరగాలి. దేశంలో యువతతోపాటు అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలి. దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి’ అని నిపుణులు, విద్యావేత్తలు కోరుతున్నారు.ఖాళీలు కొన్నే.. అభ్యర్థులు లక్షల్లో..ఐఏఎస్, ఐపీఎస్ తదితర సర్వీసుల్లో చేరి ప్రజాసేవ చేయాలనుకునే అభ్యర్థులు సివిల్స్ను ఒకప్పుడు కఠినమైన పరీక్షగా భావించేవారు. కానీ ఇప్పుడు ఈ పరీక్షలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. కేవలం కొన్ని ఖాళీల కోసం ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 2000 సంవత్సరంలో ఒక్కో ఖాళీకి 365 మంది పోటీపడేవారు. ఇటీవల ఈ పోటీ మరింత అధికమైంది. 2020–23 మధ్య ఏటా దాదాపు 11.3 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీలు మాత్రం ఏటా దాదాపు వెయ్యి మాత్రమే ఉన్నాయి. చాలా తక్కువ విజయశాతం అత్యంత కఠినమైన పరీక్ష అయిన యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు విజయం కోసం కొన్నేళ్లపాటు వేచిఉండాల్సి వస్తోంది. 2013కు ముందు ప్రతి 365 మంది అభ్యర్థులకు ఒకరిగా ఉన్న సక్సెస్ రేటు ఆ తర్వాత ప్రతి 1,215 మంది అభ్యర్థులకు ఒకరికి పడిపోయింది. అంటే.. సివిల్స్ సర్వీస్ పరీక్షల్లో విజయ శాతం 0.1%, వైఫల్య శాతం 99.9%. ఇదంతా ఒక దశాబ్దంలో జరిగింది. సుదీర్ఘ ప్రిపరేషన్..సివిల్స్ పరీక్షల్లో ప్రయత్నాల పెంపు అభ్యర్థులకు మేలు చేయడానికి బదులుగా వారిని సుదీర్ఘ కాలం పాటు పరీక్షల ప్రిపరేషన్కే పరిమితమయ్యేలా చేసింది. 2014కు ముందు చాలామంది 2 లేదా 3వ ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేవారు. ప్రయత్నాల సంఖ్య పెంచాక ఈ సగటు 3–4కు పెరిగింది. సివిల్స్లో విజయం సాధించడానికి 93% మంది విద్యార్థులు ఒకటి కంటే ఎక్కువ ప్రయత్నాలు తీసుకుంటుండటం గమనార్హం. తొలి ప్రయత్నంలో విజయం సాధించేవారు 7 శాతమే ఉంటున్నారు. అభ్యర్థులు తమ తొలి ప్రయత్నానికి ముందు రెండేళ్ల ప్రిపరేషన్ కాలాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ఆరేళ్లకు పైగా తమ విలువైన సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. దీంతో సివిల్స్ ప్రతిభ పరీక్షగా కంటే ఓర్పు పరీక్షగా మారిందని చెప్పొచ్చు. అభ్యర్థులు ఎంత ఎక్కువ సమయం, డబ్బు, మానసిక బలాన్ని పెట్టుబడిగా పెట్టగలిగితేనే పరీక్షలో అంతగా అవకాశాలు మెరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. టాప్ ర్యాంకర్లు సైతం..సివిల్స్లో టాప్ ర్యాంకర్లు సైతం 3 నుంచి 5 ప్రయత్నాల్లోనే విజయాన్ని అందుకుంటున్నారు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనేది చాలామందికి కలగానే మిగులుతోంది. 2024లో టాపర్గా నిలిచిన శక్తి దూబే మొదటి మూడు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ను కూడా దాటలేకపోయింది. నాలుగో ప్రయత్నంలో మెయిన్స్ దాటినా ఇంటర్వూ్యలో విఫలమైంది. 5వ ప్రయత్నంలో ఆమె టాపర్గా నిలిచి సత్తా చాటింది. ఆమె 2018 నుంచి సివిల్స్కు సిద్ధమైతే 2025లో ఐఏఎస్ అధికారిణి అయ్యారు. అంటే.. శక్తి దూబేకు ఐఏఎస్ అధికారిణి కావడానికి ఏకంగా ఏడేళ్లు పట్టింది. అలాగే 2024లో రెండో ర్యాంకు సాధించిన హర్షిత గోయల్ 3 ప్రయత్నాల్లో, మూడో ర్యాంకు సాధించిన డోంగ్రే అర్చిత్ పరాగ్ 2, నాలుగో ర్యాంకు సాధించిన షా మార్గి చిరాగ్ 5, ఐదో ర్యాంకు సాధించిన ఆకాశ్ గార్గ్ 2, ఆరో ర్యాంకు సాధించిన కోమల్ పునియా 3, ఏడో ర్యాంకు సాధించిన ఆయుషి బన్సాల్ 3, ఎనిమిదో ర్యాంకు సాధించిన రాజ్ కృష్ణ ఝా 5, తొమ్మిదో ర్యాంకు సాధించిన ఆదిత్య విక్రమ్ అగర్వాల్ 5, పదో ర్యాంకు సాధించిన మయాంక్ త్రిపాఠి 3 ప్రయత్నాల్లో విజయం సాధించారు. అంటే.. టాప్ పది మందిలో 8 మంది సివిల్స్ సాధించడానికి 3–5 ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. మొత్తం మీద దాదాపు 93% మంది విజయవంతమైన అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువసార్లు సివిల్స్ కోసం ప్రయత్నించారు. తొలిసారి పరీక్షలకు హాజరైనవారిలో దాదాపు 7% మంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? ఏమీ నేర్చుకోకుండా పరీక్షకు సిద్ధమవుతున్న వారి ప్రాథమిక సంవత్సరాలను వృథా చేసుకోకుండా ఉండటానికి సివిల్స్ ప్రయత్నాల సంఖ్య, గరిష్ట వయసును పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందా? 6వ ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థి మొదటి ప్రయత్నంలోనే ఫెయిలైన అభ్యర్థి కంటే మెరుగైనవాడా? మనం మెరిట్ను ఎలా అంచనా వేస్తాం? ప్రయత్నాలు, తీసుకున్న సంవత్సరాల ఆధారంగా విజయానికి వెయిటేజ్ ఇవ్వబడిందా?.. వీటిపైన దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాలి. పరీక్ష విధానం మార్పుతో మలుపుయూపీఎస్సీ చరిత్రలో 2013 ఒక ప్రధాన మలుపుగా నిలిచింది. ఆ ఏడాది పరీక్షకు కొన్ని నెలల ముందు యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్ష విధానాన్ని మార్చింది. జనరల్ స్టడీస్ పేపర్లను పెంచి వెయిటేజీలో మార్పులు తెచ్చింది. దీంతో ఏళ్ల తరబడి పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళనలు చేశారు. అదనపు ప్రయత్నాలు, వయోపరిమితి సడలింపు రూపంలో ఉపశమనం కోరుతూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో ప్రభుత్వం 2014 నుంచి పరీక్షలకు సన్నద్ధమయ్యేవారికి మరో రెండు అటెంప్ట్స్ అదనంగా అవకాశం కల్పించింది. -
యంత్రుడి చేతుల్లోకి మనిషి! డెడ్ ఇంటర్నెట్ థియరీ నిజమే!!
‘‘ఓ మర మనిషి మా లోకి రా..’’ అంటూ పిలిచిన మనిషి.. ఇప్పుడు పూర్తిగా దాని చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాడా? ఇంటర్నెట్ అనేది మనిషి చేజారి పోయిందా?.. ఇప్పుడది పూర్తిగా బాట్ల నియంత్రణలో నడుస్తోందా?.. ఈ అర్థం వచ్చేలా ఓపెన్ఏఐ సీఈవో ఆల్ట్మన్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కలకలం రేగింది. తద్వారా Dead Internet Theory కి బలమైన మద్దతు చేకూరినట్లైంది. ఇంతకీ ఈ థియరీ ఏంటి?.. చాట్జీపీటీ లాంటి ఏఐ చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి ఇలా మాట్లాడడం వెనుక ఆంతర్యం ఏంటి? పరిశీలిస్తే.. ఇంటర్నెట్లో మనం చూస్తోంది నిజంగా మనుషులనేనా?.. కొన్ని పోస్టులు చేసేది.. ఇతరుల పోస్ట్లకు కామెంటలు చేసేది.. లైకులు, షేర్లు ఇదంతా మనుషులు చేస్తున్నదేనా?.. లేదంటే అప్పుడెప్పుడో చర్చ జరిగినట్లు.. కృత్రిమ మేధస్సు చేస్తోందా?. ఇప్పటివరకు ఇది కేవలం ఊహగా కనిపించినా.. తాజాగా OpenAI CEO సామ్ ఆల్ట్మన్ చేసిన వ్యాఖ్యలతో ‘Dead Internet Theory’ అనే సిద్ధాంతం వాస్తవానికి దగ్గరగా ఉందేమో అనే అనుమానాలు బలపడ్డాయి. ChatGPT వంటి శక్తివంతమైన AI చాట్బాట్ను రూపొందించిన వ్యక్తి.. సామ్ ఆల్ట్మన్. అలాంటి వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో ఓ ఆసక్తికరమై పోస్ట్ చేశారు.. డెడ్ ఇంటర్నెట్ థియరీని ఇంతకాలం నేను అంతగా నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎక్స్(పూర్వపు ట్విటర్)ను చూస్తుంటే చాలా LLM-run అకౌంట్లు ఉన్నట్లు అనిపిస్తోంది అని అన్నారు.i never took the dead internet theory that seriously but it seems like there are really a lot of LLM-run twitter accounts now— Sam Altman (@sama) September 3, 2025ఈ వ్యాఖ్య వైరల్ కావడంతో, పలువురు వినియోగదారులు ఆల్ట్మన్ను వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఆ విషయం తమకు ఎప్పుడో తెలుసని ఒకరు.. డెడ్ఇంటర్నెట్కు పునాది వేసింది మీరే కదా? అని మరొకొరు కామెంట్ చేశారు. బ్రేకింగ్.. LLMల సృష్టికర్త, ఇప్పుడు ఎక్స్లో అన్నీ LLMలే అని బాధపడుతున్నాడు ఇంకొకరు సెటైరిక్గా స్పందించారు. మరొకరైతే ఎలాన్ మస్క్తో ఉన్న వైరంతోనే ఇలా మాట్లాడుతున్నారంటూ కామెంట్ చేశారు.. ఇలా ఆల్ట్మన్ను తమకు తోచిన తెగ ఆడేసుకుంటున్నారు.డెడ్ ఇంటర్నెట్ థియరీ అంటే ఏమిటి?డెడ్ ఇంటర్నెట్ థియరీ అనేది ఒక వివాదాస్పదమైన సిద్ధాంతం, ఇది 2021లో "Dead Internet Theory: Most of the Internet is Fake" అనే బ్లాగ్ ద్వారా ప్రజల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ఇంటర్నెట్లో ఎక్కువ భాగం నిజమైన మనుషుల ద్వారా కాకుండా.. AI బాట్స్, ఆటోమేటెడ్ స్క్రిప్ట్స్, మరియు LLM-run అకౌంట్ల ద్వారా నడుస్తోందని అంటోంది. అంటే.. Large Language Model (LLM) ఆధారంగా నడిచే సోషల్ మీడియా లేదంటే ఆన్లైన్ అకౌంట్లు. ఇవి నిజమైన వ్యక్తులు నిర్వహించకపోవచ్చు. అర్టిషీషియల్ ఇంటెలిజెన్సీ(AI) మోడల్స్ ద్వారా ఆటోమేటెడ్గా స్పందించేవి, పోస్టులు చేసేవి.. లేదంటే చాట్ చేసేవి అయి ఉండొచ్చు. ఇంటర్నెట్లో మనం చూస్తున్న చాలా అకౌంట్లు, పోస్టులు, కామెంట్లు.. అన్నీ మనుషులు చేసినవి కాదని.. ఏఐ చాట్బాట్లు చేసినవి అర్థం. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) మోడల్స్, యాంత్రిక వ్యవస్థలు ఇంటర్నెట్ను పూర్తిగా ఆక్రమించేశాయని.. తద్వారా మనం నిజమైన మనుషులతో కాకుండా, యంత్రాలతో సంభాషిస్తున్నాం అనే ఈ థియరీ చెప్పింది. ఒకరకంగా.. The Matrix సినిమా లాంటి వాస్తవికతను మాయగా చూపించే సిద్ధాంతమన్నమాట. దీనికి ఓ ప్రత్యక్ష ఉదాహరణ పరిశీలిస్తే.. సోషల్ఏఐ SocialAI అనేది డెడ్ ఇంటర్నెట్ థియరీకి ఒక ప్రాక్టికల్ ఉదాహరణ. ఇదొక సోషల్ నెట్వర్క్ యాప్. మైఖేల్ సైమన్ అనే టెక్ ప్రాడిజీ దీనిని రూపొందించాడు. ఈ యాప్లో యూజర్లు చాట్ చేస్తారు.. పోస్టులు పెడతారు.. కామెంట్లు చేస్తారు. కానీ twist ఏంటంటే.. అవతల ఉండేది నిజమైన మనిషి కాకపోవచ్చు. SocialAI లో AI బాట్స్ అచ్చం మనుషుల్లాగే స్పందిస్తాయి. చాలా పోస్టులకు వచ్చిన కామెంట్లు, లైక్స్ అన్నీ కృత్రిమంగా రూపొందించబడినవే. అంటే.. అక్కడ ఉండేది మనిషా? బాట్? అనేదానిపై స్పష్టత లేకుండా పోతుంది.అందుకే అంత రీచ్..సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసం జరిగే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రమంలో.. 2016 తర్వాత ఇంటర్నెట్లో నిజమైన యూజర్ యాక్టివిటీ తగ్గిపోయిందన్నది Dead Internet Theory థియరీ చెప్పేది. ఎక్కువ కంటెంట్ బాట్స్, AI, ఆటోమేటెడ్ సిస్టమ్లు తయారు చేస్తున్నాయని, ఫోరమ్లు, సోషల్ మీడియా, కామెంట్స్ అన్నీ నిజమైన మనుషుల నుంచి రావడం తగ్గిపోయిందని చెబుతుందీ సిద్ధాంతం. సపోజ్.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులను గమనించండి. ఆ యూజర్కు పెద్ద ఫాలోయింగ్ ఉండడు. కానీ ఉన్నట్లుండి అతను చేసే ఓ పోస్టుకు విపరీతంగా లైకులు, షేర్లు వస్తాయి. అలాగని అందులోవన్నీ జెన్యూన్గా వచ్చినవి అనుకుంటే పొరపాటే. అదంతా యంత్రుడి మాయాజాలం. యూజర్లు వ్యక్తపర్చాల్సిన అభిప్రాయాలు, ఆన్లైన్ అనుభవాలు.. క్రమంగా కృత్రిమంగా ప్రభావితం అవుతూ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఎలాన్ మస్క్ ట్విటర్ను చేజిక్కించుకున్నాక.. కంటెంట్ క్రియేటర్లకు డబ్బు ఇచ్చే విధానం ప్రారంభమైంది. దీంతో AI బాట్ల వినియోగం విపరీతంగా పెరిగింది. ఏఐ ఆధారిత ఇమేజ్లు, పోస్టులు పెరిగిపోయాయి. తద్వారా ఇష్టానుసారం చేస్తున్న పోస్టులతో రీచ్ దక్కుతోంది. నష్టాలేంటంటే.. నిన్నటి దాకా ఇది ఒక conspiracy theory. కానీ, ఇప్పుడది నిజమై ఉంటుందని ఆల్ట్మన్ పోస్ట్తో స్పష్టమవుతోంది. అయితే ఏఐ బాట్లతో ముప్పు ఉందనే సైబర్ విశ్లేషకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తూ వస్తున్నారు. వాటి మీద ఆధారపడడం వల్ల మనిషి బుర్రకు పదును పెట్టకపోవడంతో.. స్కిల్స్ మరుగున పడిపోతుంది. మానవ సంబంధాల ప్రామాణికత తగ్గిపోతుంది. ఒక్కోసారి వినియోగదారుల మానసిక స్థితిపై ప్రభావం చూపొచ్చు. అంతేకాదు.. నిజమైన సమాచారాన్ని గుర్తించడం కష్టంగా ఉంటోంది. వెరసి సామాజిక మాధ్యమాలు ఒక యాంత్రిక మాయాజాలంగా మారుతున్నాయి.నిన్ను నీవే మర్చిపోయిన వేళ.. నియంత్రణ నీ చేతుల్లో లేదు. సృష్టి నీదే అయినా, ఆట మాత్రం ఇంకెవరో ఆడుతున్నారు.కొసమెరుపు.. ఏఐ బాట్లు, డీప్ఫేక్లు పెరిగిపోయిన కాలంలో.. నిజమైన వాటిని గుర్తించడం కష్టంగా మారుతోంది. అందుకే ఆన్లైన్లో మనుషులు తమను నిరూపించుకోవడానికి ఒక సాంకేతిక పరిష్కారం అవసరమని సామ్ ఆల్ట్మన్ భావించారు. అలా 2023 జులై 24న పుట్టిందే Worldcoin ప్రాజెక్టు(2019లోనే బీజం పడింది). దీని ద్వారా మనిషి ఐరిస్ ఆధారంగా ఇంటర్నెట్ వినియోగం కోసం ఓ యూనిక్ ఐడీ(Proof of Personhood) ఇస్తారు. అప్పుడు అవతల ఉంది మనిషా? లేకుంటే ఏఐ చాట్బాట్ అనేదానిపై స్పష్టత వస్తుంది. ఇందులో మనుషుల గుర్తింపును రక్షించేందుకు బ్లాక్చెయిన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్ వంటివి ఉపయోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన కోటి 20 లక్షల మంది ఈ ప్రాజెక్టులో భాగం అయ్యారు. ఈ యాప్ ద్వారా 26 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. అయితే ఏఐ కాలంలో.. నిజమైన మనిషిని గుర్తించడానికి ఇది ఒక వినూత్న పరిష్కారమే అయినప్పటికీ సవాళ్లు మాత్రం తప్పడం లేదు. అలా వరల్డ్నెట్వర్క్ ప్రాజెక్టు నత్తనడకన ముందుకు సాగుతోంది.:::వెబ్డెస్క్ ప్రత్యేకం -
మీ ఫోన్లో వైరస్ ఉందా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్తో అనుసంధామైన స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే అరచేతిలో ప్రపంచం ఉన్నట్టే.. అలాగే మన స్మార్ట్ఫోన్లోకి రహస్య నిఘా (హిడెన్ స్పై) యాప్లు ప్రవేశిస్తే మన కదలికలను ఒక వేగు వెంటాడుతున్నట్టే.. అందుకే ‘మీ ఫోన్లో వైరస్ ఉందా..!’అని చెక్ చేసుకోమని చెబుతున్నారు సైబర్ భద్రత నిపుణులు.స్పైవేర్ యాప్ మీ ఫోన్లోకి చొరబడితే అది మీ పూర్తి డేటాను రహస్యంగా సేకరించి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. స్పైవేర్ యాప్లను గుర్తించడం కూడా కష్టమేనని అంటున్నారు. అవి చూడడానికి సాధారణ గేమింగ్ యాప్ల మాదిరిగా ఐకాన్తో కొన్ని ఉంటాయని, మరికొన్ని మనకు కనిపించకుండానే తెరవెనుక రన్ అవుతుంటాయని చెబుతున్నారు. ప్రధాన అనర్థాలు ఇవీడేటా ట్రాన్స్మిషన్: మీ ఫోన్లోని కీలక సమాచారాన్ని మీ అనుమతి లేకుండా థర్డ్పార్టీకి (హ్యాకర్లు, ప్రకటనదారులు, హానికరమైన సంస్థలకు) ఎప్పటికప్పుడు పంపుతాయి.ఫోన్ పనితీరులోనూ సమస్యలు: స్పైవేర్ చేరిన తర్వాత అది మీ ఫోన్ వేగాన్ని తగ్గించవచ్చు. తరచూ ఫోన్ వేడెక్కడం.. బ్యాటరీ త్వరగా డిశ్చార్జి అవడం జరుగుతుంది. ప్రైవసీ పోతుంది: ఫోన్లోకి వైరస్ చేరితే ఫొటోలు, కాంటాక్ట్ నంబర్లు, ఇతర ఆర్థిక వివరాలు వంటి వ్యక్తిగత డేటా దొంగిలించబడే ప్రమాదం ఉంది. మన వ్యక్తిగత సమాచారం, వీడియోలు.. ఫొటోలతో ఐడెంటిటీ థెఫ్ట్తోపాటు ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల సమాచారం తెలిస్తే ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. అనధికార యాక్సెస్: స్పైవేర్ మీ ఫోన్ను అనధికారికంగా యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. మరిన్ని మాల్వేర్లను ఇన్స్టాల్ చేయడానికి, మీ ఫోన్ కెమెరా, మైక్ను యాక్సెస్ చేయడానికి లేదా యాప్లను మార్చటానికి సైబర్నేరగాళ్లకు వీలు కల్పిస్తుంది.ఫోన్ మన కంట్రోల్ తప్పుతుంది: ఫోన్లో యాప్లు వాటంతట అవే తెరవడం లేదా మూసివేయబడడం. మనకు తెలియకుండానే ఇతర నంబర్లకు టెక్స్ట్ మెసేజ్లు పంపడం. వింత పాప్–అప్లు వస్తుండడం మీరు గమనించవచ్చు. ఫోన్లోకి స్పైవేర్, వైరస్లు ఎలా వస్తాయి? అవగాహన లేకుండా చేసే పనులతో మనమే మన ఫోన్లోకి వైరస్లను ఆహ్వానిస్తున్నామని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు మనం అనధికారిక మూలాల నుంచి (థర్డ్పార్టీ లింక్ల నుంచి) అనుమానాస్పద యాప్లను డౌన్లోడ్ చేసుకోవడంతో వైరస్ చేరవచ్చు. ఈ– మెయిల్లు, టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లలోని అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం ద్వారా కూడా హిడెన్ యాప్లు మన ఫోన్లలోకి వచ్చే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. కొన్నిసార్లు సోషల్ మీడియాలోని హానికరమైన లింకులను క్లిక్ చేసినా వైరస్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.ఫోన్ వైరస్ బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి?» గుర్తింపు పొందిన యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకుని ఫోన్ను స్కాన్ చేసుకోవాలి.» ఫోన్ను ఎప్పటికప్పడు అప్డేట్ చేయడంతో సెక్యూరిటీ ప్యాచ్అప్లు, నూతన సెక్యూరిటీ అప్డేట్లు వస్తాయి. దీని వల్ల వైరస్లను అడ్డుకోవచ్చు. » మీరు ఉపయోగించని, అనుమానాస్పద యాప్లను వెంటనే అన్ ఇన్స్టాల్ చేయండి» ఏవైనా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ వంటి నమ్మదగిన స్టోర్స్ నుంచే యాప్లు డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ రేటింగ్, రివ్యూలు తప్పక పరిశీలించాలి. » టు ఫ్యాక్టర్ అథెంటికేషన్ను వినియోగించాలి. -
పొదుపు.. చేసి చూపించండి!
ఈ తరం పిల్లలు.. చాలా స్పీడు. వాళ్ల జోరుకు తగ్గట్టు తల్లిదండ్రులు వారికి మంచీ చెడూ చెప్పాలి. చెప్పడం కాదు.. తల్లిదండ్రులు స్వయంగా అలా నడుచుకోవాలి. ఎందుకంటే పిల్లలు ముందు అనుసరించేదీ, అనుకరించేదీ పేరెంట్స్నే. డబ్బుల విషయంలో మరీనూ! అందుకే, తల్లిదండ్రులు ముందు ఆర్థిక పాఠాలు నేర్చుకోవాలి.. ఆచరించాలి..వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి! ఇంతకీ వాటిని ఎలా చెప్పాలి?మాటలకు.. చేతలకు..విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదని మీ పిల్లలకు చెప్పి.. మీరు మాత్రం డిస్కౌంట్ సేల్ ఉందని కొనుగోలు చేశారా? ఆర్థిక అత్యవసర సమయంలో ఇంట్లో ఎవరికీ తెలియకుండా ఏ లోన్ యాప్లోనో లేదా స్నేహితుల దగ్గరో అప్పు చేసేశారా? మీ ఆదాయం ఎంతో పిల్లలకు తెలిసినప్పుడు.. మీరు చేస్తున్న ఖర్చు ఎక్కువన్న విషయాన్ని మీ పిల్లలు గమనించడం లేదనుకుంటే ఎలా?నిత్యం ‘డబ్బు’ గొడవలుభార్యాభర్తలిద్దరూ సంపాదించే వారైతే.. డబ్బు గురించి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాభర్తల్లో ఒకరు ఎక్కువగా ఖర్చు చేస్తూ మరొకరు పొదుపుగా ఉండే కుటుంబాలు కూడా ఎన్నో. ఇలాంటి కారణాల వల్ల ప్రతి ఆర్థిక నిర్ణయం గురించి వాదించుకుంటూ, ఇద్దరూ తరచుగా తగాదాలకు దిగుతుంటారు.ఆర్థిక విషయాల దాటవేతచాలామంది భారతీయులు పిల్లలతో డబ్బు గురించి మాట్లాడటం సరికాదని భావిస్తారు. మరీ ముఖ్యంగా ఆర్థిక సమస్యలను పిల్లలకు చెప్పకుండా దాచేస్తారు.పాకెట్ మనీచాలామంది తల్లిదండ్రులు.. ఒక వయసు దాటాక కూడా పిల్లల ప్రతి ఆర్థిక నిర్ణయంలో తలదూరుస్తుంటారు. వారిపై నమ్మకం ఉంచరు. పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఒకవేళ ఇచ్చినా.. దాని గురించి సవాలక్ష ప్రశ్నలు, ఎలా ఖర్చు చేశారంటూ విచారణలు!మీ తరం.. ఈ తరం..మీ తల్లిదండ్రుల తరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ భిన్నంగా ఉంది. తరాలు మారుతున్నా.. ఆర్థిక వ్యవస్థ మారుతున్నా.. అది గుర్తించకుండా ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు పాత పాఠాలే చెప్తుంటారు.పిల్లలపై ప్రభావం ?మీ మాటలకు, చేతలకు పొంతన లేకపోతే ఆర్థిక విషయాల్లో పిల్లలకు గందరగోళం ఏర్పడుతుంది. మీరు ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసి, ప్రతినెలా వాటికే మీ జీతంలో ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని వారికి తెలిస్తే వారిలో ఆర్థిక క్రమశిక్షణ తప్పిపోతుంది. మీరు చెప్పే మాటలను పిల్లలు నమ్మకపోవచ్చు.⇒ తల్లిదండ్రుల గొడవల వల్ల పిల్లల్లో డబ్బు గురించి ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. ఆర్థిక విషయాలంటే పిల్లల దృష్టిలో.. గొడవలకు దారితీసేవిగా మారిపోవచ్చు. దీంతో డబ్బు గురించి చర్చ అంటేనే భయపడవచ్చు.⇒ దీనివల్ల పిల్లలకు డబ్బు గురించి అవగాహన లేకుండా పోతుంది. డబ్బు గురించి ఏమీ తెలియకపోవడం వల్ల.. దాని గురించి మాట్లాడాలంటేనే సిగ్గు, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆర్థిక లావాదేవీలు చేయాలన్న ఆలోచనలు పెరుగుతాయి.⇒ ఇది మంచి–చెడు గురించి నేర్చుకోకుండా చేయడమే కాకుండా భవిష్యత్తులో వారు తల్లిదండ్రులపై ఆర్థికంగా ఆధారపడేలా చేస్తుంది. ఆ అసంతృప్తి.. తెలిసీ తెలియని వయసులోనే ‘అప్పుల’వైపు వారి మనసును మళ్లేలా చేయవచ్చు.⇒ పాతకాలం నాటి సిద్ధాంతాలతో మీ ఎంపికలను గుడ్డిగా అమలు చేయడం వల్ల పిల్లలు కొత్త ఆర్థిక పాఠాలు నేర్చుకోలేరు. అదే సమయంలో వారి స్నేహితుల్లో కొందరు ఆర్థిక విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తుండటం వీరి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలను మీకు చెప్పాలన్నా సంకోచిస్తారు.ఎలా నివారించాలి ?మీ పిల్లలు తెలివిగా ఖర్చు చేయాలనుకుంటే మీరు బడ్జెట్ను ఎలా తయారు చేస్తారో వారికి ప్రత్యక్షంగా చూపించండి. ముందుగా అత్యవసరమైన వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వండి. ఖర్చు చేయదగ్గ డబ్బులు మిగిలితే తక్కువ అవసరం ఉన్న వస్తువులను ఎంచుకోండి. ప్రతినెలా పొదుపు చేయడమూ నేర్పించండి.⇒ ఆర్థిక విషయాల గురించి భార్యాభర్తలు కూర్చుని మాట్లాడుకోవాలి. కుటుంబ సాధారణ లక్ష్యాలు, పిల్లల చదువుకు పొదుపు చేయడం, ఇంటికి కావాల్సిన ముఖ్యమైన వస్తువులు ప్రాధాన్యతగా ఉండాలి. ఇదే విషయాన్ని పిల్లలకు చెప్పడం అవసరం.⇒ పిల్లల వయసుకు తగ్గట్టుగా వారితో ఆర్థిక విషయాలు చర్చించాలి. ఇంట్లో ప్రతినెలా ఎంత ఆదాయం వస్తోంది, ఏయే విషయాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు.. ఇవన్నీ చర్చించాలి. డబ్బు జీవితంలో ఎంత ముఖ్యమైనదో వారికి అర్థమైతే.. ఆర్థిక క్రమశిక్షణ దానంతట అదే వస్తుంది.⇒ పాకెట్ మనీ పిల్లలకు కొద్దిగా ఇవ్వండి. దీనిని వారు ఎలా ఖర్చు చేస్తున్నారో.. ఏదో ఇంటరాగేషన్ చేస్తున్నట్టు కాకుండా, సరదా సంభాషణల్లో తెలుసుకోవాలి. దీనివల్ల వారిలో ఆత్మవిశ్వాసం,మీపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. స్వతంత్ర ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ డబ్బును బాధ్యతగా ఖర్చు చేస్తారు.⇒ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడున్న ఆర్థిక సాధనాల గురించి ముందుగా మీరు కొంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వారిని అనుమతించండి. చిన్న చిన్న ఆర్థిక వ్యవహారాల్లో వాళ్లు తప్పులు చేసినా ఫర్వాలేదు. వాటి నుంచి నేర్చుకుంటారు. -
సముద్రాలకు మనుషులే ముప్పు!
భూగోళంపై అన్ని రకాల జీవుల మనుగడకు సముద్రాలు అత్యంత కీలకం. జీవులకు అవసరమైన ప్రాణవాయువును సముద్రాలే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. కోట్లాది మంది జీవనోపాధి కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ప్రపంచ 90 శాతం వాణిజ్యం సముద్ర మార్గాల ద్వారానే జరుగుతోంది. అయితే, ఆధునిక కాలంలో మానవ కార్యకలాపాల వల్ల అవి పెనుముప్పును ఎదుర్కొంటున్నాయి. మనుషుల వల్ల నానాటికీ పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు శాపంగా మారుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రాలపై మనుషుల దుష్ప్రభాభావం రెండు రెట్లు పెరుగుతుందని యూరప్లో తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ వివరాలను ‘సైన్స్’ పత్రికలో ప్రచురించారు. కాలుష్యం, తద్వారా అధిక ఉష్ణోగ్రతల వల్ల సముద్రాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. వాటిలోని జీవజాలం నశించిపోతోంది. మరోవైపు సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఆమ్ల ప్రభావంతో సముద్ర జలాలు మరింత ఉప్పుగా మారుతున్నాయి. మొత్తానికి సముద్ర జీవావరణ వ్యవస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆహ్లాదం పంచే సముద్రాలు ప్రమాదం ముంగిట ఉన్నట్లు అధ్యయనకర్త బెన్ హల్పెర్న్ వెల్లడించారు. భూమిపై మనుషుల కార్యకలాపాల వల్ల సముద్రాలకు ఇప్పటికే చాలా నష్టం జరిగిందని, ఇప్పటికైనా మేల్కొనకపోతే 2050 నాటికి ఈ నష్టం రెండింతలు అవుతుందని తేల్చిచెప్పారు. ఇది నిజంగా ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. సముద్రాలపై ప్రతికూల ప్రభావాలు వేగంగా పెరుగుతుండడమే అసలు సమస్య అని వివరించారు. కోలుకోలేని దశకు జీవావరణ వ్యవస్థ సముద్రాలపై వాతావరణ ప్రభావాలే తప్ప మనుషుల ప్రభావం అంతగా ఉండదని ఇన్నాళ్లూ భావించారు. భూమిపై జనవాసాల కంటే సముద్రాల విస్తీర్ణం ఎన్నో రెట్లు ఎక్కువ కాబట్టి ఇలాంటి అంచనాకొచ్చారు. కానీ, మనుషుల ప్రభావం గణనీయంగా ఉంటున్నట్లు తేలింది. ఉష్ణోగ్రతల పెరుగుదలతో సముద్రాలు వేడెక్కుతుండడం ఒక అంశమైతే.. నియంత్రణ లేని చేపల వేట, సముద్ర వాణిజ్యం వంటివి సమస్య తీవ్రతను మరింత పెంచుతున్నట్లు వెల్లడయ్యింది. మానవుల చర్యల వల్ల సముద్రాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఉష్ణమండల ప్రాంతాలతోపాటు ధ్రువ ప్రాంతాల్లో జీవావరణ వ్యవస్థ ఇప్పటికే కోలుకోలేని దశకు చేరుకుంది. పగడపు దిబ్బలు, మడ అడవులు ధ్వంసం ఆధునిక కాలంలో సముద్ర తీర ప్రాంతాలు సైతం సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. మడ అడవులు ధ్వంసమవుతున్నాయి. కాలుష్యం కారణంగా సముద్ర జీవుల వృద్ధికి అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. సముద్రాల్లోకి స్వచ్ఛమైన జలం కాకుండా మురికి నీరు చేరుతోంది. స్వచ్ఛమైన జలం, సముద్ర జలం మధ్య సమతూకంలో ప్రతికూల మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ సముద్రాలకు నష్టం చేకూర్చడంతోపాటు స్థానికంగా జీవనోపాధి అవకాశాలు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా ఆహారం, ఉపాధి కోసం సముద్రాలపై ఆధారపడే దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ ముప్పు మరింత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని నిపుణులు తేల్చిచెబుతున్నారు. ముప్పు తప్పించుకోవాలంటే వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదలను నియంత్రించాలని, సముద్రాల్లో చేపల వేట నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, సముద్ర వాణిజ్యంలోనూ నియంత్రణ అవసరమని అంటున్నారు. భవిష్యత్తు వైపు దృష్టిసారిస్తే ఇప్పుడు మనమేం చేయాలో తెలుస్తుందని బెన్ హల్పెర్న్ హితవు పలికారు. భవిష్యత్తును నాశనం చేసుకోవాలా? లేక కాపాడుకోవాలా? అనేది మన చేతుల్లోనే ఉందన్నారు. ముక్కలైన మంచు కొండ ప్రపంచంలోనే అతిపెద్ద మంచు కొండగా రికార్డుకెక్కిన ఏ23ఏ ఐస్బర్గ్ విచ్ఛిన్నమైపోయింది. తన రికార్డును కోల్పోయింది. ఈ ఐస్బర్గ్ ముక్కలుగా విడిపోయింది. మరికొన్ని వారాల్లోనే పూర్తిగా చెదిరిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు చెప్పారు. ఏ23ఏ ఐస్బర్గ్ అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్టేట్ విస్తీర్ణంతో సమానంగా ఉండేది. దీని బరువు లక్ష కోట్ల టన్నుల పైమాటే. అంటార్కిటికాలో 1986లో ఏర్పడింది. దక్షిణ అట్లాంటిక్ సముద్రంలోని సౌత్ జార్జియా దీవి వైపు ప్రయాణిస్తూ ముక్కలైంది. ప్రస్తుతం ఇది హూస్టన్స్టేట్ విస్తీర్ణానికి తగ్గిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద మంచు కొండగా డీ15ఏ ఐస్బర్గ్ రికార్డుకెక్కింది. ఏ23ఏ నుంచి విడిపోయిన మంచు ముక్కలకు ఏ23డీ, ఏ23ఈ, ఏ23ఎఫ్ అనే పేర్లు పెట్టారు. కాలుష్యం, వాతావరణ మార్పుల కారణంగా సముద్రం వేడెక్కడం వల్ల ఏ23ఏ ఐస్బర్గ్ విచి్ఛన్నమైనట్లు సైంటిస్టులు స్పష్టంచేశారు. ఇలా మంచు కొండలు ముక్కలై కరిగిపోతే సముద్ర మట్టాలు పెరిగే ప్రమాదం ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఏసీ, నాన్ ఏసీ కోచ్లలో సదుపాయాల కొరత
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిరోజూ సికింద్రాబాద్ నుంచి పాట్నాకు వెళ్లే దానాపూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12791) ట్రైన్లో సాధారణ ప్రయాణికులతో పాటు కాశీ, ప్రయాగ తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వందలాది మంది భక్తులు సైతం బయలుదేరి వెళ్తారు. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎక్కువ.. పరిశుభ్రత తక్కువ.. బోగీలు, మరుగుదొడ్లు సకాలంలో శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన వ్యాపిస్తోందని ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ బోగీలు కిక్కిరిసిపోవడంతో కొంతమంది రిజర్వేషన్ బోగీల్లోకి అక్రమంగా ప్రవేశిస్తారు. దీంతో బోగీలపై ఒత్తిడి పెరుగుతోంది.మరోవైపు ఆన్బోర్డు సిబ్బంది ఎప్పటికప్పుడు బోగీలను శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసన ప్రయాణికులను ఠారెత్తిస్తోంది. ఒక్క దానాపూర్ ఎక్స్ప్రెస్ మాత్రమే కాదు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని దూరప్రాంతాల రైళ్లలో అరకొర సదుపాయాల కారణంగా 40 శాతానికి పైగా ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ‘తిరుగు ప్రయాణంలో పాట్నా నుంచి రాత్రి 9.30గంటల సమయంలో సికింద్రాబాద్కు చేరుకొనే సమయానికి దానాపూర్ ఎక్స్ప్రెస్(12792) మరింత దారుణంగా మారుతుంది. మరుగుదొడ్లు, వాష్బేసిన్లు కంపు కొడతాయి. బోగీల్లోకి బొద్దింకలు వస్తాయి’ అని రామంతాపూర్కు చెందిన ఆనంద్ విస్మయం వ్యక్తం చేశారు.నీటి కొరతే కారణమా..? హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ సుమారు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. వాటిలో 85 ఎక్స్ప్రెస్, సూపర్ఫాస్ట్ రైళ్లు దూర ప్రాంతాలకు బయలుదేరుతాయి. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే సమయంలో రైళ్లను శుభ్రం చేస్తారు. ఆన్బోర్డ్ సదుపాయాలు కూడా అందజేస్తారు. కానీ రైళ్లు బయలుదేరిన కొన్ని గంటల తర్వాత ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న కొద్దీ సదుపాయాలు లోపిస్తున్నాయి. నీటి లభ్యత లేకపోవడం వల్ల కొన్ని చోట్ల రైళ్లలో నీటిని నింపడం లేదు. బోగీలను శుభ్రం చేయడం లేదు. దీంతో మరుగుదొడ్లు, వాష్బేసిన్లు చెత్తకుప్పలుగా మారుతున్నట్లు ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రయాణికుల సదుపాయాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.దక్షిణ మధ్య రైల్వేలోని పలు ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరే దూరప్రాంతాల రైళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మరే క్రమంలో ఈ నీటి కొరత సవాల్గా మారుతుంది. సికింద్రాబాద్–విజయవాడ, రేణిగుంట, గుంతకల్, సికింద్రాబాద్–గుంటూరు, సికింద్రాబాద్–బల్లార్ష, నాందేడ్–సికింద్రాబాద్ తదితర మార్గాల్లో రాకపోకలు సాగించే దూరప్రాంత రైళ్లలో పరిశుభ్రత లోపిస్తున్నట్లు వెల్లడించింది. సికింద్రాబాద్ డివిజన్ నుంచి బీహార్, పశ్చిమ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలోనూ శుభ్రత ఒక సవాల్గా మారింది.అరకొరగా ఆన్బోర్డు సేవలు.. సాధారణంగా ఏసీ, స్లీపర్ బోగీలను ఎప్పటి కప్పుడు శుభ్రం చేసేందుకు ఆన్బోర్డ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. కానీ చాలా రైళ్లలో ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఐదారు బోగీలకు కేవలం ఒకరిద్దరు మాత్రమే పనిచేస్తారు. ఆన్బోర్డు సర్వీసులను అందజేసే ప్రైవేట్ సంస్థలు తగినంత మంది సిబ్బందిని నియమించకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. చర్లపల్లి–గోరక్పూర్ తదితర రైళ్లలో ఆన్బోర్డు సర్వీసులు అధ్వాన్నంగా ఉన్నాయని చేవెళ్లకు చెందిన ఫణిరాజ్ తెలిపారు. ‘బళ్లార్షాలో నీళ్లు నింపకుండానే కొన్ని రైళ్లు బయలుదేరుతాయి. ఆ తర్వాత మళ్లీ నాగపూర్లోనే నీళ్లు నింపేందుకు అవకాశం ఉంటుంది. దీంతో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది’ అని చెప్పారు.మరోవైపు ఆన్బోర్డు సేవలను అందజేయడంలో విఫలమైన సంస్థలపైన రైల్వే అధికారులు భారీ ఎత్తున పెనాల్టీలు కూడా విధిస్తున్నారు. ఇలాంటి కాంట్రాక్టర్లు, సంస్థలపై సుమారు రూ.22.5 లక్షల పెనాల్టీ విధించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుల నుంచి వచ్చిన 2,265 ఫిర్యాదుల ఆధారంగానే రూ.16.7 లక్షల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోని చర్లపల్లి, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో వాటరింగ్ సదుపాయం ఉంది. త్వరలో కాచిగూడలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు.ఆన్బోర్డ్ సేవలను బలోపేతం చేయాలి సరైన సర్వీసులు అందజేయని సంస్థలు, కాంట్రాక్టర్లపై జరిమానాలు విధించడం ఒక్కటే పరిష్కారం కాదు. అలాంటి వారిని తొలగించి సమర్థవంతమైన సేవలు చేసే వారికి బాధ్యతలను అప్పగించాలి. ఆన్బోర్డ్ సేవల వ్యవస్థను బలోపేతం చేయాలి. – శ్రీనివాస్, ప్రయాణికుడు


